Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Inside Tesla India Strategy Jobs Signal a Much Bigger Play1
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్‌ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్‌మెంట్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

Apple CEO Transition Tim Cook Steps Down, John Ternus To Lead2
ప్రపంచంలోనే టాప్‌ కంపెనీకి కొత్త బాస్‌

ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా టిమ్ కుక్సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్‌లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.హార్డ్‌వేర్‌ చీఫ్‌గా జానీ స్రూజీయాపిల్ చిప్‌ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్‌వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలుసిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్‌ల అభివృద్ధి.డిస్‌ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.సెల్యులార్ మోడెమ్‌ల తయారీ, ఇంటిగ్రేషన్.

gold and silver rates on 21 April 2026 in Telugu states3
ఉలుకు పలుకు లేని ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Life Is Short, Don't Live Someone Else Dream: Steve Jobs Timeless Lesson4
ఇతరుల ఆకాంక్షలకు బందీ కావొద్దు!

‘మీ సమయం పరిమితం. కాబట్టి వేరొకరి జీవితం కోసం దాన్ని వృథా చేయవద్దు’ అని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మరింత ఎక్కువగా వినిపిస్తోంది. సమాజం నిర్ణయించిన బాటలోనే నడవాలా? లేక మనకంటూ ఒక కొత్త పంథాను నిర్మించుకోవాలా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టీవ్‌జాబ్స్ తత్వాన్ని విశ్లేషిస్తూ ప్రత్యేక కథనం.పరిమిత సమయం.. అపరిమిత లక్ష్యాలుజీవితం అనేది ఒకసారి మాత్రమే లభించే అవకాశం. స్టీవ్ జాబ్స్ తన కోట్‌లో ‘సమయం పరిమితం’ అని నొక్కి చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే.. మరణం అనేది తథ్యం, కాబట్టి ఉన్న కొద్ది కాలంలోనే మనం ఎంచుకున్న రంగంలో ప్రత్యేకంగా నిలవాలి. కెరీర్ ఎంపికల నుంచి వ్యక్తిగత నిర్ణయాల వరకు మనకు నచ్చని పనులను కేవలం ఇతరుల కోసం చేస్తూ పోతే మన అంతరాత్మను చంపుకున్నట్లే.మన దేశంలో ముఖ్యంగా విద్య, వృత్తి పరమైన విషయాల్లో కుటుంబం, సమాజం ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఫలానా చదువే చదవాలి, ఫలానా ఉద్యోగమే చేయాలి అనే నిబంధనల మధ్య వ్యక్తిత్వం మరుగున పడిపోతోంది. స్టీవ్ జాబ్స్ ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఇతరుల సలహాలను వినడం తప్పు కాదు, కానీ వాటిని విమర్శనాత్మకంగా అంచనా వేయాలి. సమాజం నిర్ణయించిన విజయ సూత్రాలను ప్రశ్నించినప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి’ అన్నారు.స్వీయ అవగాహన.. విజయానికి తొలిమెట్టుమన బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? మనకు అసలు ఏం కావాలి? అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇతరుల అభిప్రాయాలే మన నిర్ణయాలను శాసిస్తాయి. స్వీయ అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే బాహ్య ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలడు. సోషల్ మీడియా యుగంలో తోటివారిని పోల్చుకొని బతుకుతున్న నేటి యువతకు తమను తాము తెలుసుకోవడం అత్యంత అవసరం.స్టీవ్ జాబ్స్ జీవితం ఆచరణాత్మక పాఠంజాబ్స్ జీవితమే ఆయన సిద్ధాంతానికి నిదర్శనం. రీడ్ కాలేజీ నుంచి డ్రాపౌట్ అయినప్పటికీ కాలిగ్రఫీ వంటి కోర్సులను నేర్చుకోవడం ద్వారా డిజైనింగ్‌లో కొత్త ఒరవడిని సృష్టించారు. యాపిల్ సంస్థ నుంచి బహిష్కరణకు గురైనా నీరసించకుండా ‘నెక్స్ట్’, ‘పిక్సర్’ వంటి సంస్థలను స్థాపించి మళ్లీ శిఖరాగ్రానికి చేరారు.నిర్ణయాధికారానికి కావాల్సిన నైపుణ్యాలుభావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవాలను విశ్లేషించడం.పరిస్థితులు మారినప్పుడు మనల్ని మనం మలచుకోవడం.వైఫల్యాలు ఎదురైనప్పుడు విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం.‘డిజైన్ అంటే కేవలం అది ఎలా కనిపిస్తుంది అనేదే కాదు, అది ఎలా పనిచేస్తుంది అనేదే ముఖ్యం’ అని జాబ్స్ అన్నట్లుగా.. మన జీవితం కూడా బయటకు ఎలా కనిపిస్తుందనే దానికంటే, లోపల మనమెంత తృప్తిగా ఉన్నామనేదే ముఖ్యం. నిరంతరం నేర్చుకుంటూ, మనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడమే స్టీవ్ జాబ్స్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

stock market updates on 21 April 20265
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు పెరిగి 24,462 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 351 పాయింట్లు ఎగబాకి 78,872 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.13బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 95.06 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.24 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 21-04-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Rising Prices Stagnant Wages Silent Struggle of India Middle Class6
టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వేతన జీవి పోరాటం అంతా ఆ నాలుగు మెతుకుల కోసమే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. అంతర్జాతీయంగా ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మన కర్రీ పాయింట్లలో కరీ ప్యాకెట్ ధర పెరుగుతుంది. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకితే రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ ధర మారుతుంది. ధరలు పెరిగిన ప్రతిసారీ సర్దుకుపోవడం సామాన్యుడికి అలవాటైపోయింది. కానీ ఆ సర్దుబాటు ఇప్పుడు అతని ఆకలిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది.వ్యాపారులకు ఖర్చులు పెరిగాయన్నది నిజమే కావచ్చు, కానీ పరిస్థితులు చక్కబడ్డాక పెంచిన రేట్లను తగ్గించే మనసు మాత్రం ఏ వ్యాపారికీ రాదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఒక పక్క కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సాకులు చెబుతూ ఉద్యోగి జీతంలో వందల రూపాయల పెంపునకు కూడా వెనకాడుతుంటే.. అదే కంపెనీల యజమానులు మాత్రం కుబేరుల జాబితాలో పోటీ పడుతున్నారు. ఈ అంతరం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక అశాంతికి పునాది.ఆకాశమే హద్దుగా ధరలుఒకప్పుడు రూ.20 ఉన్న కర్రీ ప్యాకెట్ నేడు రూ.30కి(కొన్ని ప్రదేశాల్లో మారుతుంటుంది) చేరింది. అంటే ఒక్కసారిగా 50 శాతం పెరుగుదల. కేవలం కర్రీ పాయింట్లే కాదు, టిఫిన్ సెంటర్లలో రూ.30 ఉండే ప్లేట్ ఇడ్లీ నేడు రూ.45కి చేరింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో ఈ ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు, వంట నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ అటు బడా హోటళ్లు, ఇటు వీధి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి, ముడి చమురు లేదా గ్యాస్ ధరలు తగ్గినా.. పెంచిన ఈ ధరలను మళ్లీ తగ్గించడం అనేది మన మార్కెట్ సంస్కృతిలో దాదాపు అసాధ్యం.పెరగని జీతాలు.. కార్పొరేట్ లాభాలువస్తువుల తయారీ ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని సాకు చూపుతున్న కంపెనీలు ధరల భారమంతా వినియోగదారుడిపైనే మోపుతున్నాయి. కానీ, అదే నిష్పత్తిలో తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతున్నాయా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. వార్షికంగా ధరల పెరుగుదల 30-50 శాతం ఉంటే సగటు వేతన జీవి జీతాల పెరుగుదల మాత్రం 5 నుంచి 8 శాతం లోపే ఉంటోంది. మరోవైపు, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని వాపోతున్న కంపెనీల యజమానులు మాత్రం ఫోర్బ్స్ వంటి ప్రపంచ ధనవంతుల జాబితాలో తమ ర్యాంకులను మెరుగుపరుచుకుంటున్నారు.సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై అధిక శాతం ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతుంటే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది.పరిష్కార మార్గాలుప్రభుత్వాలు చేయాల్సినవి..ధరల నియంత్రణ కమిటీలు: నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గినా ధరలు తగ్గించని సిండికేట్లపై చర్యలు తీసుకోవాలి.వేతన సవరణ చట్టం: కేవలం కనిష్ట వేతనం మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రైవేటు రంగంలోనూ కనీస వార్షిక ఇంక్రిమెంట్లు ఉండేలా నిబంధనలు తీసుకురావాలి.ప్రజా రవాణా పటిష్ఠం: సామాన్యుడి జేబుకు చిల్లు పడే మరో ప్రధానాంశం రవాణా. ప్రజారవాణాను చౌకగా అందుబాటులోకి తెస్తే కొంత ఊరట లభిస్తుంది.ప్రజలు చేయాల్సినవి..ఆర్థిక క్రమశిక్షణ: అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ సంస్కృతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.నైపుణ్యాభివృద్ధి: మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం జీతంపైనే ఆధారపడకుండా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి.వినియోగదారుల హక్కులు: అన్యాయంగా ధరలు పెంచే వ్యాపార సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండి వినియోగదారుల ఫోరమ్ ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి.అభివృద్ధి అంటే కేవలం జీడీపీ అంకెలు పెరగడం కాదు.. సగటు సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగడం. సంపద పంపిణీలో సమతుల్యత లేకపోతే అది దేశ పురోగతికి ఆటంకమవుతుంది. ఇప్పటికైనా పాలకులు, పారిశ్రామికవేత్తలు సామాన్యుడి బతుకు బండిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

Advertisement
Advertisement
Advertisement