Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Auto Sector Embraces Historic Shift Flexible CAFE 3 Norms update1
కాలుష్యంపై ఉక్కుపాదం

భారత ఆటోమొబైల్ రంగం ఒక చారిత్రాత్మక పరివర్తన దిశగా అడుగులు వేస్తోంది. 2027-32 కాలానికి సంబంధించి సవరించిన ‘కార్పొరేట్ యావరేజ్‌ ఫ్యుయెల్‌ ఎఫిషియెన్సీ’ (కేఫ్‌-3) నిబంధనలపై ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల మధ్య ఒక సానుకూల ఏకాభిప్రాయం కుదరడం శుభ పరిణామం. గతంలో ప్రతిపాదించిన కఠిన నిబంధనలు వాహన తయారీదారులలో కొంత ఆందోళన కలిగించాయి. అయితే, తాజా ముసాయిదాలో ప్రభుత్వం వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించింది.గతంలో ప్రతిపాదన ప్రకారం.. ఐదేళ్ల పాటు స్థిరంగా 0.002 స్లోప్ కోఎఫీషియంట్(ఇది వాహనం బరువు, అది వినియోగించాల్సిన ఇంధన పరిమితి మధ్య ఉండే సంబంధాన్ని నిర్ణయిస్తుంది) గుణకాన్ని కొనసాగించాలని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం.. దీన్ని 2027-28కి 0.00158కి, 2031-32 నాటికి 0.00131కి తగ్గించారు. దీనివల్ల తయారీదారులకు ఇంధన సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడంలో సౌలభ్యం లభిస్తుంది. ముఖ్యంగా సబ్-4 మీటర్ల వాహన(4 మీటర్ల కంటే తక్కువ పొడువు) విభాగంలో తయారీదారులకు ఇది కలిసొచ్చే అంశం.ప్రభుత్వం కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మీదనే భారం వేయకుండా బహుళ సాంకేతిక మార్గాలను పరిగణలోకి తీసుకుంది. హైబ్రిడ్‌, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, బయో-ఫ్యూయల్స్ వాడకాన్ని ఈ ముసాయిదా స్పష్టంగా ప్రోత్సహిస్తోంది. స్టార్ట్-స్టాప్ సిస్టమ్స్, థర్మల్ మేనేజ్మెంట్ వంటి చిన్న మార్పుల ద్వారా వచ్చే సామర్థ్య లాభాలను కూడా లెక్కలోకి తీసుకోవడం విశేషం. దీనివల్ల ఐసీఈ ఇంజిన్లను ఆప్టిమైజ్ చేస్తూనే కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టే వీలు తయారీదారులకు కలుగుతుంది.క్రెడిట్-డెబిట్ విధానంపరిశ్రమలో అత్యంత సానుకూల స్పందన లభించిన అంశం 'పాస్ బుక్ సిస్టమ్'. లక్ష్యానికి మించి ఇంధన సామర్థ్యాన్ని సాధించే కంపెనీలు క్రెడిట్లను పొందుతాయి. వీటిని భవిష్యత్తులో లోటు ఏర్పడినప్పుడు సర్దుబాటు చేసుకోవచ్చు. బ్లాక్ పీరియడ్స్ (మొదట 3 ఏళ్లు, తర్వాత 2 ఏళ్లు)గా విభజించడం వల్ల సరఫరా గొలుసులో వచ్చే ఆకస్మిక అంతరాయాల నుంచి కంపెనీలకు రక్షణ లభిస్తుంది.అమలులోనే అసలు పరీక్షప్రభుత్వం రోడ్ మ్యాప్ ఇచ్చింది. సౌలభ్యాలను కల్పించింది. ఇక ఆటోమొబైల్ సంస్థల తీరు కీలకం కానుంది. కేవలం నిబంధనల కోసం కాకుండా ఈ కేఫ్‌-3 నిబంధనలను ఒక వ్యూహాత్మక మార్పుగా స్వీకరించాలి. అప్పుడే భారత్‌ గ్లోబల్ ఆటో హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలదు.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

RBI Governor Malhotra Stresses Wait and Watch Policy Global Tensions2
అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చిత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న వేచి చూసే ధోరణి అత్యంత కీలకమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానంలో చురుకైన మార్పులు చేయడం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రసంగ సారాంశాన్ని తాజాగా ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో అధికారికంగా అందుబాటులో ఉంచింది.తటస్థ వైఖరితోనే వెసులుబాటుఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ద్రవ్య విధాన సమీక్షల్లో ఆర్‌బీఐ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి గమనానికి అనుగుణంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్‌కు అవసరమైన సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా విధానం పూర్తిగా డేటా ఆధారితంగా ఉంటుంది. ప్రమాదాల సమతుల్యతను మేము నిరంతరం అంచనా వేస్తున్నాం. అందుకే ప్రస్తుతానికి వేచి చూడటం అనే పంథాను ఎంచుకున్నాం’ అని ఆయన తెలిపారు.అంతర్జాతీయ సవాళ్లుపశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లపై స్పందిస్తూ సరఫరా వ్యవస్థలో తలెత్తే అంతరాయాలు ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్హోత్రా హెచ్చరించారు. సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగి అవి ఇతర రంగాలకు వ్యాపించి ద్రవ్యోల్బణ అంచనాలను పెంచితే అది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సమయంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సూచించారు.ప్రపంచ వృద్ధిలో అగ్రగామిగా భారత్గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధిని వివరిస్తూ చైనా వంటి అగ్ర దేశాల కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని మల్హోత్రా ప్రకటించారు.భారత సగటు వార్షిక వృద్ధి: 6.1%చైనా: 5.6%ఇండోనేషియా: 4.2%ప్రపంచ ఆర్థిక వృద్ధి: 3.2%భారతదేశ వృద్ధికి అవసరమైన సులభతర పర్యావరణ వ్యవస్థను అందించడంలో రిజర్వ్ బ్యాంక్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ స్థిరత్వమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని గవర్నర్ తెలిపారు.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

India core sector dips in March due to West Asia crisis3
నిదానించిన మౌలిక రంగం 

న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల పనితీరు మార్చి నెలలో నిదానించింది. ఎనిమిది రంగాల్లో ఉత్పత్తి క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 0.4 శాతం తగ్గింది. ఐదు నెలల్లో మౌలిక రంగం ఉత్పత్తి తగ్గడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా బొగ్గు, ముడి చమురు, ఎరువులు, విద్యుదుత్పత్తి క్షీణించడం మొత్తం మీద పనితీరును పరిమితం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8 మౌలిక రంగాల పనితీరు నికరంగా 2.8% పెరగడం గమనార్హం. 2025–26 మొత్తం మీద ఈ రంగాలు 2.6% వృద్ధిని నమోదు చేశాయి. 2024–25లో వృద్ధి 4.5%తో పోల్చితే చెప్పుకోతగ్గ స్థాయిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. రిఫైనరీ ఉత్పత్తుల తయారీ 0.1%, స్టీల్‌ ఉత్పత్తి 2.2%, సిమెంట్‌ ఉత్పత్తి 4% చొప్పున మార్చి నెలలో తగ్గాయి. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం పెరిగింది. 4 రంగాల ఉత్పత్తి క్షీణించడంతో, ఐదు నెలల్లో తొలిసారి కీలక మౌలిక రంగాల పనితీరు తగ్గినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి సరుకుల సరఫరా తగ్గడం ఎరువుల ఉత్పత్తిని ప్రభావితం చేసినట్టు చెప్పారు. దీంతో మార్చి నెలలో పారిశ్రామిక రంగం (ఐఐపీ) వృద్ధి 1–2%కి తగ్గిపోవచ్చని నాయర్‌ అంచనా వేశారు. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 5.2%గా ఉంది.

Vedanta is set to split into five separately listed companies4
5 కంపెనీలుగా వేదాంతా!

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా మే 1 నుంచి 5 కంపెనీలుగా విడిపోనుంది. దీంతో అల్యూమినియం, మర్చంట్‌ పవర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ముడిఇనుము విభాగాలు ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీలుగా విడిపోనున్నాయి. వెరసి స్వతంత్ర కంపెనీలుగా వేదాంతా అల్యూమినియం మెటల్‌ (వీఏఎంఎల్‌), తల్వాండి సాబో పవర్‌ (టీఎస్‌పీఎల్‌), మాల్కో ఎనర్జీ(ఎంఈఎల్‌), వేదాంతా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ (వీఐఎస్‌ఎల్‌) ఏర్పాటు కానున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత వేదాంతా (మాతృ సంస్థ) లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగనుంది. విడదీత (డీమెర్జర్‌) మే 1నుంచి అమల్లోకి వచ్చేందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వేదాంతా వెల్లడించింది. విడదీయనున్న బిజినెస్‌లతో సంప్రదించాక రికార్డ్‌ డేట్‌ను నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ పథకం ప్రకారం అర్హులైన వేదాంతా వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఇతర కంపెనీల షేర్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలియజేసింది. స్వతంత్ర బిజినెస్‌లుగా ఏర్పాటుకావడం ద్వారా సంబంధిత రంగాలపైనే దృష్టి సారించేందుకు వీలుంటుందని వేదాంతా పేర్కొంది. దీంతో వెల్త్‌ ఫండ్స్‌ తదితర గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, రిటైలర్లు, వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు ప్రత్యేకించిన రంగాలలో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని వివరించింది. ఇతర వివరాలివీ...అల్యూమినియం సంబంధిత మారి్పడిరహిత డిబెంచర్లను(ఎన్‌సీడీలు) వీఏఎంఎల్‌కు బదిలీ చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. వీటితోపాటు భారత్‌ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో వాటాలు సైతం బదిలీ చేయనుంది. అంతేకాకుండా తల్వాండీ సాబో పవర్‌ను వేదాంతా పవర్‌(వీపీఎల్‌)గా, మాల్కో ఎనర్జీని వేదాంతా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(వీఓజీఎల్‌)గా మార్పు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది.

Banks For Car Loans At Low Interest Rates5
తక్కువ వడ్డీతో కారు లోన్ ఇచ్చే బ్యాంకులు

ఈ రోజుల్లో కార్ల వినియోగం సర్వ సాధారణం అయిపోయింది. కేవలం విలాసానికి మాత్రమే కాకుండా.. ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయింది. అయితే కారు కొనేవారిలో చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. కానీ కారు లోన్‌లకు ఉత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి బహుశా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.➤యూనియన్ బ్యాంక్: 7.40 శాతం నుంచి 9.45 శాతం వరకు➤పంజాబ్ నేషనల్ బ్యాంక్: 7.60 శాతం నుంచి 10.70 శాతం వరకు➤బ్యాంక్ ఆఫ్ బరోడా: 7.60 శాతం నుంచి 11.35 శాతం వరకు➤కెనరా బ్యాంక్: 7.45 శాతం నుంచి 11.45 శాతం వరకు➤బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.60 శాతం నుంచి 12.55 శాతం వరకు➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.70 శాతం నుంచి 9.85 శాతం వరకు➤ఇండియన్ బ్యాంక్: 7.50 శాతం నుంచి 9.65 శాతం వరకు➤ఐసీఐసీఐ బ్యాంక్: 8.50 శాతం నుంచి ప్రారంభం➤HDFC బ్యాంక్: 8.50 శాతం నుంచి ప్రారంభంకారు లోన్ తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లోన్ ఇచ్చే బ్యాంకులు కొంతవరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కాకుండా ఇతర ఫీజులను కూడా వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.

Why Gold Prices Fell Today and Strong Dollar and Global Tensions at Play6
అందుకే.. గోల్డ్ రేటు తగ్గింది!

గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.భారతదేశంలో ఇలా..భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.ద్రవ్యోల్బణ భయం!అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

Advertisement
Advertisement
Advertisement