Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BYD Atto 1 EV Launched at 2026 Bangkok International Motor Show1
మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే?

చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ అట్టో కంటే భిన్నంగా ఉంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, రెట్రో-స్టైల్ డోర్ హ్యాండిల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కుడి వైపు ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్‌పై ఛార్జింగ్ ఫ్లాప్, కనెక్టెడ్ టెయిల్ లైట్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, నాలుగు డిస్క్ బ్రేకులు, మూడు రాడార్లతో కూడిన రియర్-వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు 38.88kWh బ్లేడ్ LFP బ్యాటరీ ప్యాక్‌తో 380 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 74 Bhp పవర్, 135 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భద్రతా ఫీచర్లలో EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఉన్నాయి.

Gold and Silver Price Update in India 2
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!

బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో సగం సెలవులే!

List of Bank Holidays in April 20263
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో సగం సెలవులే!

మార్చి నెల దాదాపు ముగిసింది. ఇక రానున్నది ఏప్రిల్. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితాను ఈ కథనంలో చూసేద్దాం.ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా.. అగర్తలా, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 5: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 11: రెండవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 12: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, ఇటానగర్, కోహిమా, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సర దినం (నబబర్ష)/బోహాగ్ బిహు/విషు/హిమాచల్ దినం కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 19: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 20: బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలా బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 25: నాల్గవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 26: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)అందుబాటులో ఆన్‌లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

New Income Tax Act 2025 Your Salary Tax And Job Exit Rules Change From 1 April4
ఏప్రిల్ 1 నుంచి.. జీతంలో మార్పులు ఉంటాయా?

కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది.. ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా అమల్లోకి రానుంది. ఈ తరుణంలో ఉద్యోగులలో జీతభత్యాలు సంబంధించి ఆందోళన, ఆసక్తి పెరిగిపోయింది.2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025లో పన్ను నిబంధనలకు సంబంధించిన మార్పులు ఉండదు. అయినప్పటికీ.. జీతం నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీటీసీ యథాతథంగా ఉన్నప్పటికీ.. జీతంలో భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటి వరకు పన్నురహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు, ఇతర ప్రయోజనాలు అన్నీ కూడా కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను పరిధిలోకి రానున్నాయి. ఇదే జరిగితే.. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు.కార్మిక చట్టాల ప్రకారం.. బేసిక్ జీతం, మొత్తంలో సీటీసీలో 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ కొంత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతుంది. కంపెనీ అందించే వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వెహికల్, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే.. పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.ఏప్రిల్ 1 నుంచి.. ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025భారతదేశంలో గత 65 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్, 1961.. త్వరలో (2026 ఏప్రిల్ 1 నుంచి) రద్దు అవుతుంది. దీని స్థానంలో కొత్తగా రూపొందించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్, 2025 అమల్లోకి వస్తుంది. పాత చట్టం అనేక సవరణలతో చాలా క్లిష్టంగా మారి, 800కి పైగా సెక్షన్లు కలిగి ఉండేది.కొత్త చట్టం ముఖ్య ఉద్దేశ్యం పన్ను విధానాన్ని సులభతరం చేయడం. ఇందులో పన్ను రేట్లు లేదా ఎక్కువగా డిడక్షన్లలో పెద్ద మార్పులు లేవు. అయితే చట్టాన్ని సులభమైన భాషలో రాసి, సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కి తగ్గించారు. అలాగే చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా మారుతుంది.మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం ప్రకారం పన్ను విధింపు ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 తరువాత వచ్చిన ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుంది. పాత చట్టం కింద ఉన్న కేసులు, అప్పీలు మొదలైనవి పూర్తయ్యే వరకు అదే చట్టం ప్రకారం కొనసాగుతాయి.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!

Russia sells gold bars for the first time in 25 years to fund budget deficit5
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!

ఉక్రెయిన్‌తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న యుద్ధ వ్యయం, విస్తరిస్తున్న బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తన సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని (Physical Gold) విక్రయించడం ప్రారంభించింది. 'బిఎన్ఈ ఇంటెల్లిన్యూస్' (bne IntelliNews) నివేదిక ఈ సంచలన విషయాలను వెల్లడించింది.నివేదికలోని ముఖ్యాంశాలుభారీగా విక్రయాలు: 2022 నుంచి 2025 మధ్య కాలంలో రష్యా సుమారు 150 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని విక్రయించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే మరో 35 బిలియన్‌ డాలర్ల విలువైన నిల్వలను వదులుకుంది.రికార్డు స్థాయి విక్రయం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. 2002 తర్వాత రెండు నెలల కాలంలో జరిగిన అతిపెద్ద విక్రయం ఇదే కావడం గమనార్హం.లోటు బడ్జెట్ సెగ: 2025 నాటికి రష్యా బడ్జెట్ లోటు జీడీపీలో 2.6 శాతానికి చేరింది. వాస్తవానికి ఇది 0.5% మాత్రమే ఉంటుందని అంచనా వేసినా, యుద్ధ పరిస్థితుల వల్ల అంచనాలు తలకిందులయ్యాయి.వ్యూహం మారింది..గతంలో రష్యా తన బంగారు నిల్వలపై కేవలం ఆర్థిక లావాదేవీలు (Speculative transfers) మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు నేరుగా భౌతిక బంగారాన్ని (Physical Bullion) మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనివల్ల రష్యా బంగారం నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అత్యల్ప స్థాయి.తగ్గిన చమరు ఆదాయం అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో రష్యా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు రష్యా మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ వాటా సగభాగం ఉండగా, ఇప్పుడది 20 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటడంతో, ఆ గరిష్ట ధరల వద్ద బంగారాన్ని అమ్మి నగదు సమీకరించుకోవాలని రష్యా భావిస్తోంది.ప్రపంచంలో ఐదో స్థానంవరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, రష్యా వద్ద ఇప్పటికీ 2,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో కొనసాగుతోంది. 2014 (క్రిమియా ఆక్రమణ) నుంచి డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది.ఆర్థిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంయుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా ప్రభుత్వం వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తోంది. వాటిలో.. నేషనల్ వెల్ఫేర్ ఫండ్: ఇందులో ఉన్న నిధులను యుద్ధ అవసరాలకు వాడుకుంటోంది.పన్నుల పెంపు: వ్యాట్ (VAT) రేట్లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.బాండ్ల జారీ: దేశీయంగా బాండ్లను జారీ చేసి నిధులను సేకరిస్తోంది.ఉక్రెయిన్‌తో యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, రష్యా తన అత్యంత విలువైన 'బంగారు' నిల్వలను విక్రయించడం ప్రారంభించడం ఆ దేశ ఆర్థిక స్థితిపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Shubman Gill Buys Luxury Apartment Worth Rs 20 Crore in Mumbai6
శుభ్‌మన్ గిల్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌.. ధర తెలిస్తే షాకవుతారు!

ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్‌మన్ గిల్' కూడా చేరారు.శుభ్‌మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్‌ను పూజా లీజర్ అండ్ లైఫ్‌స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.శుభ్‌మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్‌మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్‌మెంట్స్ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు.👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement