Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US Firm Fined Rs 210 Crore Over WFH Denial Death1
వర్క్ ఫ్రమ్ హోమ్ రిజెక్ట్.. కంపెనీకి రూ.210 కోట్లు ఫైన్!

మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో.. దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ అమెరికాలోని టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థ.. తమ ఉద్యోగి గర్భంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించలేదు. ఆ తరువాత ఏకంగా రూ.210 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలోని హామిల్టన్ కౌంటీలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థపై భారీ నష్టపరిహారం విధించారు.చెల్సియా వాల్ష్ అనే మహిళ.. గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. 2021 ఫిబ్రవరిలో, ముందస్తుగా ప్రసవం జరగకుండా ఉండేందుకు ఆమె ఒక వైద్య చికిత్స చేయించుకుంది. డాక్టర్లు ఆమెకు ఎక్కువగా కదలకుండా ఉండాలని, బెడ్ రెస్ట్‌ తీసుకోవాలని.. ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.డాక్టర్ల సలహాను అనుసరించి.. చెల్సియా తన కంపెనీని సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కోరింది. కానీ కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రావాలని లేదా జీతం లేకుండా సెలవు తీసుకోవాలని చెప్పింది. ఇది ఆమెకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని సృష్టించింది.కంపెనీ తన అభ్యర్థనను తిరస్కరించడంతో.. చెల్సియా తన ఆరోగ్యానికి విరుద్ధంగా మూడు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఫిబ్రవరి 24న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిచ్చింది. అయితే అదే రోజు ఆమెకు ముందస్తు ప్రసవం జరిగింది.ఆమె కుమార్తె 'మాగ్నోలియా' కేవలం 21 వారాల గర్భధారణలోనే జన్మించింది. పుట్టినప్పుడు ఆ శిశువు శ్వాస తీసుకుంటూ, గుండె కొట్టుకుంటూ ఉండింది. కానీ ఎంతో బాధాకరంగా, కేవలం ఒక గంటా ముప్పై నిమిషాల్లోనే ఆమె తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ ఘటనపై కోర్టులో కేసు పెట్టగా, జ్యూరీ సభ్యులు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తేల్చారు. మొదట 25 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధించినా, 90% బాధ్యత కంపెనీదిగా నిర్ణయించి చివరికి 22.5 మిలియన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

Indias first LPG ATM opened gas cylinder will be available in just minutes2
ఎల్‌పీజీ ఏటీఎం వచ్చేసింది.. ఇక ఎనీ టైమ్‌ గ్యాస్‌!

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ వంటిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, సరఫరా గొలుసులో అప్పుడప్పుడు అంతరాయాలు కలుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని, డెలివరీ బాయ్ కోసం గంటల తరబడి వేచి చూడటం వినియోగదారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ పెట్రోలియం (BPCL) వినూత్నమైన 'స్మార్ట్ ఎల్‌పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది.ఎక్కడంటే..దేశంలోనే మొట్టమొదటి ఎల్‌పీజీ ఏటీఎం ఇప్పుడు గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. గురుగ్రామ్‌లోని సోహ్నా, సెక్టార్ 33లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో బీపీసీఎల్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 'భారత్ గ్యాస్ ఇన్‌స్టా ఎల్‌పీజీ' పేరుతో పిలిచే ఈ ఏటీఎం, సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే 24 గంటల పాటు సేవలు అందిస్తుంది. ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్‌లతో పనిలేకుండా కేవలం 2-3 నిమిషాల్లోనే నిండు సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఏటీఎంలో సిలిండర్ ఎలా పొందాలంటే..ఈ మెషిన్ ద్వారా గ్యాస్ పొందడం అత్యంత సులభం. దీని పనితీరు ఇలా ఉంటుంది..మొబైల్ నంబర్: మెషిన్ స్క్రీన్‌పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.ఓటీపీ వెరిఫికేషన్: మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి.క్యూఆర్ కోడ్ స్కాన్: మీ ఖాళీ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా బార్‌కోడ్‌ను మెషిన్ స్కానర్ ముందు ఉంచాలి. అది చెల్లుబాటు అవుతుందో లేదో మెషిన్ తనిఖీ చేస్తుంది.ఖాళీ సిలిండర్ డిపాజిట్: ధ్రువీకరణ పూర్తయ్యాక, విండో తెరుచుకుంటుంది. అందులో మీ ఖాళీ సిలిండర్‌ను ఉంచాలి. మెషిన్ దాని స్వచ్ఛతను, బరువును స్వయంచాలకంగా తనిఖీ చేసి లోపలికి తీసుకుంటుంది.చెల్లింపు: స్క్రీన్‌పై కనిపించే గ్యాస్ ధరను UPI ద్వారా స్కాన్ చేసి చెల్లించాలి.నిండు సిలిండర్: పేమెంట్ సక్సెస్ అవ్వగానే, పక్కనే ఉన్న డెలివరీ విండో నుండి సీల్ చేసిన నిండు సిలిండర్ బయటకు వస్తుంది.ఏంటీ ఏటీఎం ప్రత్యేకతలు?లైట్ వెయిట్ సిలిండర్లు: ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇవి పాత ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికగా ఉంటాయి.స్మార్ట్ అలర్ట్ సిస్టమ్: మెషిన్‌లో ఒకేసారి 10 సిలిండర్లను లోడ్ చేయవచ్చు. స్టాక్ తగ్గిపోయి, కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, మెషిన్ స్వయంచాలకంగా సమీప గ్యాస్ ఏజెన్సీకి రీఫిల్ కోసం అలర్ట్ పంపిస్తుంది.గ్యాస్ సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పెంచడానికి మరియు వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ 'ఎనీ టైమ్ గ్యాస్' విధానం ఎంతగానో దోహదపడనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Infrastructure Growth Slows to Three Month Low3
ఇన్‌ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి

న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్‌ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్‌–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్‌ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు.

Gold Logs Sharpest Weekly Fall Since 1983 Gold and Silver rates today4
పసిడి పతనం.. 1983 నాటి సీన్‌ రిపీట్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్‌ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్‌కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్‌కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.పతనానికి ప్రధాన కారణాలుసాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.బలమైన డాలర్: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది.ద్రవ్యోల్బణం & చమురు: పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి.ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Pull-back) మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.1983లో ఏం జరిగిందంటే.. 1979-80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో 850 డాలర్లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15-20 శాతం పతనమై 375-400 డాలర్లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్‌ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో, పసిడి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది.నేటి బంగారం, వెండి ధరలు నేడు (మార్చి 22, 2026) దేశీయంగా ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌కు సెలవు కావడంతో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు 22 క్యారెట్స్ 10 గ్రాములకు రూ.1,33,800 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.1,45,970 వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.

TCS Partners with Pearson for AI Driven Workforce Training5
ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్‌.. పియర్సన్‌తో టీసీఎస్‌ జట్టు

ముంబై: గ్లోబల్‌ లెర్నింగ్‌ సర్వీసుల సంస్థ పియర్సన్‌తో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) జట్టు కట్టింది. కృత్రిమ మేథతో సిబ్బందికి శిక్షణనిచ్చి, వారిని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఏఐ ఆధారిత లెర్నింగ్‌ ప్రోడక్టులు, సర్వీసులను రూపొందిస్తాయి.నియామకాల్లో, సిబ్బంది అభివృద్ధి ప్రోగ్రాంలలో అభ్యర్ధుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో పియర్సన్‌కి చెందిన వెర్సాంట్‌ ఇంగ్లీష్‌ ప్రొఫీషియెన్సీ విధానాన్ని టీసీఎస్‌ ఉపయోగించనుంది. మరోవైపు అంతర్జాతీయ ట్రావెల్‌ సర్వీసులను డిజిటలీకరించే దిశగా ప్రముఖ ట్రావెల్‌ టెక్నాలజీ సంస్థ అమెడ్యూస్‌తో టీసీఎస్‌ చేతులు కలిపింది.మరోవైపు, ఐటీ ఇన్‌ఫ్రా, డేటా సెంటర్లు, ఇతరత్రా టెక్నాలజీల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆటోమేషన్‌ దిగ్గజం ఏబీబీ, టీసీఎస్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

War Shadows over Real Estate Why Your Dream Home Might Cost More House construction tips6
ఇల్లు కొనేవాళ్లకు ఇదే మంచి ఛాన్స్‌!

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరుకు రవాణాలో అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి సొంతింటి కలపై కూడా నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, సరఫరా గొలుసులో జాప్యం కలవరపెడుతున్నాయి.ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇల్లు కొనడం లేదా నిర్మాణం చేపట్టడం సరైనదేనా అనే అంశంపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో చూద్దాం..ఆకాశాన్ని తాకుతున్న నిర్మాణ ఖర్చులుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, ఎర్ర సముద్రం మీదుగా రవాణా నిలిచిపోవడం వంటి కారణాలు నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి.స్టీల్, సిమెంట్ ధరల మోత: అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడంతో స్టీల్ తయారీ ఖర్చు 20% వరకు పెరిగింది. ప్రస్తుతం టన్ను స్టీల్ ధర సుమారు రూ.72,000కు చేరింది. సిమెంట్ ధరలు కూడా బస్తాకు రూ.20 - రూ.40 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.రవాణా ఛార్జీల భారం: అంతర్జాతీయ కంటైనర్ రవాణా ధరలు పెరగడంతో ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లంబింగ్ సామగ్రి, విదేశీ టైల్స్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో కంటైనర్‌పై సుమారు రూ.1.5 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.అల్యూమినియం, పీవీసీ: యుద్ధ ప్రభావంతో అల్యూమినియం ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోగా, పీవీసీ పైపుల ధరలు 20-33% వరకు పెరిగాయి.హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి.. ఇల్లు కొనాలా? వద్దా?ప్రస్తుత సంక్షోభం ఉన్నప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర నగరాల కంటే స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడే కొనడం ఎందుకు మంచిదంటే.. పెరగనున్న ధరలు: నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల ధరలను పెంచక తప్పదు. వచ్చే 3-6 నెలల్లో అపార్ట్‌మెంట్ల ధరలు 10-15% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పాత ధరలకు అందుబాటులో ఉన్న రెడీ-టు-మూవ్ ఇళ్లను తీసుకోవడం లాభదాయకం.తక్కువ వడ్డీ రేట్లు: ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు 5.5% నుండి 6.0% మధ్య ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.డిమాండ్&సరఫరా: హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా రంగాల విస్తరణ వల్ల ఇళ్లకు డిమాండ్ తగ్గడం లేదు. కొకాపేట, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.మీరు సొంత అవసరానికి ఇల్లు కొనాలనుకుంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలే మేలనిపిస్తుంది. అయితే, పెట్టుబడి దృష్ట్యా ఆలోచించే వారు మాత్రం భౌగోళిక రాజకీయ పరిస్థితులు కుదుటపడే వరకు కొంత సమయం వేచి చూడటం లేదా 'ఓపెన్ ప్లాట్ల'పై దృష్టి పెట్టడం సురక్షితం.నిర్మాణం చేపట్టే వారు జాగ్రత్త!మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తే, బడ్జెట్‌లో 15-20% అదనపు నిధులు కేటాయించుకోవడం అవసరం. ధరల పెరుగుదల వల్ల అనుకున్న బడ్జెట్ దాటిపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు స్థానిక సామగ్రిని వాడటం ద్వారా ఖర్చును నియంత్రించవచ్చు.

Advertisement
Advertisement
Advertisement