Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PhonePe Surpasses 700 Million Registered Users1
70 కోట్లు దాటిన ఫోన్‌పే యూజర్లు!

ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే యూజర్లు గణనీయంగా పెరుగుతున్నారు. 2026 ఏప్రిల్‌ 29 నాటికి తమ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్‌ చేసుకున్న వారి సంఖ్య 70 కోట్లు దాటినట్లు సంస్థ తెలిపింది. తొలి 10 లక్షల మంది యూజర్ల స్థాయిని చేరడానికి 136 రోజులు పట్టగా, ప్రస్తుతం ప్రతి 6 రోజులకు ఈ మైలురాయిని దాటేస్తున్నామని పేర్కొంది. 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో యూజర్ల సంఖ్య వార్షికంగా 56.25 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ నిగమ్‌ తెలిపారు. మరిన్ని ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.700 Million 💜A number this big only happens because of the trust you place in us every single day.To our users, merchants and partners across every corner of India thank you for making us 700 Mn strong! 🙏Read More: https://t.co/e9vyvz9uI4#PhonePeFamily #Milestone… pic.twitter.com/mcgjBlEzzR— PhonePe (@PhonePe) April 29, 2026

Fired by Elon Musk, Now Boss for a Rs 19000 Crore Company2
నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!

మాజీ ట్విట్టర్‌ సీఈఓ పరాగ్ అగర్వాల్.. టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ట్విటర్ (ఎక్స్)లో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. ఆయన స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్‌ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోంది. తాజా నిధుల సమీకరణ తర్వాత 2 బిలియన్ డాలర్ల (రూ. 19,020 కోట్లు) విలువను చేరుకుంది.సీక్వోయా క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన సిరీస్ బీ రౌండ్‌లో.. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ 100 మిలియన్ డాలర్లు (రూ. 951 కోట్లు) సమీకరించింది. ఈ రౌండ్‌లో క్లైనర్ పెర్కిన్స్, ఇండెక్స్ వెంచర్స్, ఖోస్లా వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, స్పార్క్ క్యాపిటల్, టెర్రైన్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.ఐదు నెలల క్రితం, ఈ స్టార్టప్ 740 మిలియన్ డాలర్ల (రూ.7,037 కోట్లు) వాల్యుయేషన్‌తో సిరీస్ ఎ ఫండింగ్‌లో 100 మిలియన్ డాలర్ల (రూ.951 కోట్లు) నిధులను సమీకరించింది. కాగా తాజా పెట్టుబడితో, కంపెనీ సమీకరించిన మొత్తం నిధులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు (రూ.2,187 కోట్లు) చేరాయి.ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది AI ఏజెంట్ల కోసం రూపొందించిన సాధనాలను నిర్మిస్తుంది, ఆటోమేటెడ్ సిస్టమ్‌లకు అనుగుణంగా వెబ్ సెర్చ్‌, రీసెర్చ్‌ APIలను అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే నోషన్, ఓపెన్‌డోర్, క్లే, హార్వే వంటి ప్రముఖ క్లయింట్లను ఆకర్షించింది. ఇది బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లకు కూడా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే నిర్దిష్ట పేర్లను వెల్లడించలేదు.తమ ప్లాట్‌ఫామ్‌ను లక్షకు పైగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో.. ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ2022లో ట్విటర్ (ఎక్స్) సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత.. పరాగ్ అగర్వాల్ తన సీఈఓ పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనతో పాటు ఇతర మాజీ అధికారులు 128 మిలియన్‌ డాలర్ల పరిహారం కోసం కేసు వేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇది గోప్యంగా పరిష్కారమైంది. కాగా.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీతో పరాగ్ దూసుకెళ్తున్నారు.

SEBI Clears IPO Plans of Hindustan Laboratories and RK Steel Manufacturing for Market Debut3
రెండు ఐపీవోలకు సెబీ అనుమతి

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న రెండు కీలక సంస్థలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జెనెరిక్‌ ఔషధాల తయారీ సంస్థ హిందుస్థాన్‌ లాబొరేటరీస్‌, స్టీల్‌ పైపుల ఉత్పత్తిదారు ఆర్‌కే స్టీల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ప్రాథమిక పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి పొందాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ సంస్థలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను పరిశీలించిన సెబీ, ఏప్రిల్‌ 27న తుది అనుమతులు (అబ్జర్వేషన్స్‌) మంజూరు చేసింది.హిందుస్థాన్‌ లాబొరేటరీస్‌: ఫార్మా రంగంలో సేవలందిస్తున్న హిందుస్థాన్‌ లా»ొరేటరీస్‌ ఐపీఓలో భాగంగా 50 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు మరో 91 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీఓ ద్వారా లభించే నిధులను కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, ఇతర సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ స్థాయిలో జెనెరిక్‌ మందులను సరఫరా చేసే (బీ2బీ) వ్యాపారంలో కొనసాగుతోంది.ఆర్‌కే స్టీల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌: స్టీల్‌ ట్యూబ్‌లు, పైపుల తయారీలో ఉన్న ఆర్‌కే స్టీల్‌ సుమారు 2 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను పబ్లిక్‌ ఇష్యూ ద్వారా విక్రయించనుంది. ఈ ఐపీఓలో ప్రమోటర్ల వాటా విక్రయం (ఓఎఫ్‌ఎస్‌) ఏమీ లేదు. సేకరించిన నిధులను ప్రధానంగా సంస్థకున్న రుణాల చెల్లింపులకు, మూలధన నిర్వహణ, వ్యాపార విస్తరణ అవసరాలకు కేటాయించనుంది. పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ రెండు కంపెనీల షేర్లు బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ల్లో లిస్ట్‌ కానున్నాయి.

Global Air Travel Faces Turbulence ATF Price Surge Hit International Airlines4
విమాన ప్రయాణాలు మరింత ప్రియం?

విదేశీ ప్రయాణికులకు చేదు వార్త. అంతర్జాతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలపై భారం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రభావంతో విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ఏటీఎఫ్) ధరలను శుక్రవారం మరో 5 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా ధరలు పెరగడం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.ఢిల్లీలో కొత్త ధరలుదేశంలో ఏటీఎఫ్ ధరలకు బెంచ్‌మార్క్‌గా నిలిచే ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ధర కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనితో కొత్త ధర కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు చేరింది.దేశీయ సంస్థలకు ఊరటప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ క్యారియర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విమానయాన రంగంపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దేశీయ సంస్థల ధరలను నియంత్రిత పద్ధతిలో ఉంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఎందుకు ఈ పెంపు?ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం ఏటీఎఫ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పూర్తి భారాన్ని ఒకేసారి వినియోగదారులపై పడకుండా చమురు సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఆపరేటర్లకు మార్కెట్ లింక్డ్ రేట్లు వర్తింపజేస్తున్నారు. ఏటీఎఫ్ ధరలు ఒక ఎయిర్‌లైన్ నిర్వహణ వ్యయంలో అధిక ప్రభావం చూపుతాయి. ఈ పెంపుతో భారతీయ మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల ఖర్చులు భారీగా పెరగనున్నాయి.దాదాపు రెండు దశాబ్దాల క్రితమే భారతదేశంలో ఏటీఎఫ్ ధరల నియంత్రణను తొలగించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఎయిర్‌లైన్స్, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా ధరలను సవరిస్తున్నారు. ఏప్రిల్ 1న దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధరలను 25 శాతం పెంచి రూ.1,04,927.18కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ గమనంపై అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

US Judge Blocks Trump Era Immigration Ban Discriminatory Policy Ruled Illegal5
‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ తీసుకువచ్చిన వివాదాస్పద నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నిర్దిష్ట దేశాలకు చెందిన వారి గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న చర్యలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తేల్చిచెప్పారు.కేసు నేపథ్యంఇరాన్, హైతీ, వెనిజులా, సిరియా సహా సుమారు 20 దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు తమ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేతను సవాలు చేస్తూ బోస్టన్ కోర్టులో దావా వేశారు. నవంబర్ 2025లో యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) అవలంబించిన విధానాన్ని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధానం ప్రకారం, ప్రయాణ నిషేధం ఉన్న 39 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాతీయతను, వారి అప్లికేషన్లను తిరస్కరించడానికి ‘ముఖ్యమైన ప్రతికూల కారకం’ (significant negative factor)గా పరిగణించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆదేశించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఈ ఏజెన్సీ దరఖాస్తులను ప్రాసెస్ చేయకుండా నిలిపివేసింది.న్యాయమూర్తి తీర్పులోని ముఖ్యాంశాలుఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జూలియా కోబిక్ కీలక తీర్పును వెలువరించారు. జాతీయత ఆధారంగా వివక్ష చూపడం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌కు విరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆశ్రయ(అకామిడేషన్‌) దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏజెన్సీ వాటిని నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పిటిషన్‌దారులు తీవ్రంగా నష్టపోయారని భావించిన న్యాయమూర్తి వారి దరఖాస్తులపై యూఎస్‌సీఐఎస్‌ నిబంధనలను నిలిపేయాలని చెప్పారు.న్యాయ నిపుణుల స్పందనఈ తీర్పును పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది జిమ్ హ్యాకింగ్ స్వాగతించారు. ‘యూఎస్‌సీఐఎస్‌ కేవలం ఫలానా దేశం నుంచి వచ్చారన్న కారణంతో ఎవరికీ ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు దక్కకుండా చేయాలని చూస్తోంది. కానీ దీనికి కాంగ్రెస్ ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ తీర్పు ప్రధానంగా 22 మంది వాదులకు వర్తిస్తుండగా మిగిలిన 200 మందికి కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేసే అంశంపై చర్చించాలని ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచించారు.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

What Google CEO Sundar Pichai Lifestyle Teaches Discipline Simplicity Habits6
పిచాయ్‌ విజయ రహస్యం ఇదే..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన టెక్ దిగ్గజాల్లో ఒకరైన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సుమారు రూ.12,600 కోట్ల (సుమారు 1.5 బిలియన్ డాలర్లు) సంపదకు అధిపతి అయినప్పటికీ ఆయన అనుసరించే సరళమైన జీవనశైలి, క్రమశిక్షణ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తులు తమ రోజును ఎలా ప్లాన్ చేసుకుంటారు? వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ కోణంలో సుందర్ పిచాయ్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం.ఉదయాన్నే స్పష్టమైన ఆలోచనలుచాలామంది మేల్కోగానే స్మార్ట్‌ఫోన్‌ల్లో నోటిఫికేషన్లను తనిఖీ చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. కానీ, పిచాయ్ శైలే వేరు. ఆయన రోజూ ఉదయం 6:30 గంటల నుంచి 7:00 గంటల మధ్య నిద్రలేస్తారు. ఉదయాన్నే హడావుడి లేకుండా ఉండడం ఆయనకు ఇష్టం. మేల్కొన్న వెంటనే ఆయన చేసే మొదటి పని వార్తాపత్రికలు చదవడం. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా తన మేధస్సును పదును పెడుతుంటారు. ఈ అలవాటే ఆయనకు సమాచార విశ్లేషణలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు.పోషకాహారంసుందర్ శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ, తన రోజువారీ అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఉదయం పూట తీసుకునే ప్రోటీన్ మెదడుకు, శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుందని ఆయన నమ్ముతారు. ఆయన ఉదయం అల్పాహారంలో సాధారణంగా ఒక కప్పు టీ, ఆమ్లెట్, టోస్ట్ ఉంటాయి. ఇందులో ఆమ్లెట్ ప్రోటీన్ కోసం, టోస్ట్ కార్బోహైడ్రేట్ల కోసం దోహదపడతాయి. ఇది చాలా సాధారణంగా అనిపించినా పోషక విలువల పరంగా ఇది ఒక పరిపూర్ణమైన బ్రేక్‌ఫాస్ట్. భారతీయ మూలాలున్న పిచాయ్‌కు టీ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఉదయాన్నే వేడివేడి టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి కొత్త ఉత్సాహంతో డే ప్రారంభించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడతారు.విజయానికి అసలైన సూత్రంసుందర్ పిచాయ్ జీవితం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే.. విజయం అంటే సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కాదు, ఉన్న చిన్న అలవాట్లను క్రమశిక్షణతో ఆచరించడం.ఉదయాన్నే ప్రశాంతంగా రోజును ప్రారంభించడం.వార్తాపత్రికలు చదువుతూ లోకజ్ఞానాన్ని పెంచుకోవడం.సరళమైన, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం.రూ.12,600 కోట్ల ఆస్తులున్న ఒక వ్యక్తి తన దినచర్య పరంగా ఎంతో సాధారణంగా కనిపిస్తూనే ఆ క్రమశిక్షణను ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకోవడం యువతకు ఒక పాఠం. భవిష్యత్తుపై స్పష్టత, సమకాలీన అంశాలపై పట్టు ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సుందర్ పిచాయ్ జీవనశైలి నిరూపిస్తోంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Advertisement
Advertisement
Advertisement