ప్రధాన వార్తలు
వర్క్ ఫ్రమ్ హోమ్ రిజెక్ట్.. కంపెనీకి రూ.210 కోట్లు ఫైన్!
మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో.. దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ అమెరికాలోని టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థ.. తమ ఉద్యోగి గర్భంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించలేదు. ఆ తరువాత ఏకంగా రూ.210 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలోని హామిల్టన్ కౌంటీలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థపై భారీ నష్టపరిహారం విధించారు.చెల్సియా వాల్ష్ అనే మహిళ.. గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. 2021 ఫిబ్రవరిలో, ముందస్తుగా ప్రసవం జరగకుండా ఉండేందుకు ఆమె ఒక వైద్య చికిత్స చేయించుకుంది. డాక్టర్లు ఆమెకు ఎక్కువగా కదలకుండా ఉండాలని, బెడ్ రెస్ట్ తీసుకోవాలని.. ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.డాక్టర్ల సలహాను అనుసరించి.. చెల్సియా తన కంపెనీని సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కోరింది. కానీ కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రావాలని లేదా జీతం లేకుండా సెలవు తీసుకోవాలని చెప్పింది. ఇది ఆమెకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని సృష్టించింది.కంపెనీ తన అభ్యర్థనను తిరస్కరించడంతో.. చెల్సియా తన ఆరోగ్యానికి విరుద్ధంగా మూడు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఫిబ్రవరి 24న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిచ్చింది. అయితే అదే రోజు ఆమెకు ముందస్తు ప్రసవం జరిగింది.ఆమె కుమార్తె 'మాగ్నోలియా' కేవలం 21 వారాల గర్భధారణలోనే జన్మించింది. పుట్టినప్పుడు ఆ శిశువు శ్వాస తీసుకుంటూ, గుండె కొట్టుకుంటూ ఉండింది. కానీ ఎంతో బాధాకరంగా, కేవలం ఒక గంటా ముప్పై నిమిషాల్లోనే ఆమె తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ ఘటనపై కోర్టులో కేసు పెట్టగా, జ్యూరీ సభ్యులు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తేల్చారు. మొదట 25 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధించినా, 90% బాధ్యత కంపెనీదిగా నిర్ణయించి చివరికి 22.5 మిలియన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
ఎల్పీజీ ఏటీఎం వచ్చేసింది.. ఇక ఎనీ టైమ్ గ్యాస్!
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ వంటిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, సరఫరా గొలుసులో అప్పుడప్పుడు అంతరాయాలు కలుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని, డెలివరీ బాయ్ కోసం గంటల తరబడి వేచి చూడటం వినియోగదారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ పెట్రోలియం (BPCL) వినూత్నమైన 'స్మార్ట్ ఎల్పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది.ఎక్కడంటే..దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం ఇప్పుడు గురుగ్రామ్లో ప్రారంభమైంది. గురుగ్రామ్లోని సోహ్నా, సెక్టార్ 33లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో బీపీసీఎల్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 'భారత్ గ్యాస్ ఇన్స్టా ఎల్పీజీ' పేరుతో పిలిచే ఈ ఏటీఎం, సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే 24 గంటల పాటు సేవలు అందిస్తుంది. ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్లతో పనిలేకుండా కేవలం 2-3 నిమిషాల్లోనే నిండు సిలిండర్ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఏటీఎంలో సిలిండర్ ఎలా పొందాలంటే..ఈ మెషిన్ ద్వారా గ్యాస్ పొందడం అత్యంత సులభం. దీని పనితీరు ఇలా ఉంటుంది..మొబైల్ నంబర్: మెషిన్ స్క్రీన్పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.ఓటీపీ వెరిఫికేషన్: మీ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి.క్యూఆర్ కోడ్ స్కాన్: మీ ఖాళీ సిలిండర్పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా బార్కోడ్ను మెషిన్ స్కానర్ ముందు ఉంచాలి. అది చెల్లుబాటు అవుతుందో లేదో మెషిన్ తనిఖీ చేస్తుంది.ఖాళీ సిలిండర్ డిపాజిట్: ధ్రువీకరణ పూర్తయ్యాక, విండో తెరుచుకుంటుంది. అందులో మీ ఖాళీ సిలిండర్ను ఉంచాలి. మెషిన్ దాని స్వచ్ఛతను, బరువును స్వయంచాలకంగా తనిఖీ చేసి లోపలికి తీసుకుంటుంది.చెల్లింపు: స్క్రీన్పై కనిపించే గ్యాస్ ధరను UPI ద్వారా స్కాన్ చేసి చెల్లించాలి.నిండు సిలిండర్: పేమెంట్ సక్సెస్ అవ్వగానే, పక్కనే ఉన్న డెలివరీ విండో నుండి సీల్ చేసిన నిండు సిలిండర్ బయటకు వస్తుంది.ఏంటీ ఏటీఎం ప్రత్యేకతలు?లైట్ వెయిట్ సిలిండర్లు: ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇవి పాత ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికగా ఉంటాయి.స్మార్ట్ అలర్ట్ సిస్టమ్: మెషిన్లో ఒకేసారి 10 సిలిండర్లను లోడ్ చేయవచ్చు. స్టాక్ తగ్గిపోయి, కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, మెషిన్ స్వయంచాలకంగా సమీప గ్యాస్ ఏజెన్సీకి రీఫిల్ కోసం అలర్ట్ పంపిస్తుంది.గ్యాస్ సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పెంచడానికి మరియు వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ 'ఎనీ టైమ్ గ్యాస్' విధానం ఎంతగానో దోహదపడనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు.
పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.పతనానికి ప్రధాన కారణాలుసాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.బలమైన డాలర్: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది.ద్రవ్యోల్బణం & చమురు: పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్ను తగ్గిస్తున్నాయి.ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Pull-back) మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.1983లో ఏం జరిగిందంటే.. 1979-80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో 850 డాలర్లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15-20 శాతం పతనమై 375-400 డాలర్లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో, పసిడి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది.నేటి బంగారం, వెండి ధరలు నేడు (మార్చి 22, 2026) దేశీయంగా ఎంసీఎక్స్ (MCX) మార్కెట్కు సెలవు కావడంతో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు 22 క్యారెట్స్ 10 గ్రాములకు రూ.1,33,800 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.1,45,970 వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్.. పియర్సన్తో టీసీఎస్ జట్టు
ముంబై: గ్లోబల్ లెర్నింగ్ సర్వీసుల సంస్థ పియర్సన్తో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) జట్టు కట్టింది. కృత్రిమ మేథతో సిబ్బందికి శిక్షణనిచ్చి, వారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఏఐ ఆధారిత లెర్నింగ్ ప్రోడక్టులు, సర్వీసులను రూపొందిస్తాయి.నియామకాల్లో, సిబ్బంది అభివృద్ధి ప్రోగ్రాంలలో అభ్యర్ధుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో పియర్సన్కి చెందిన వెర్సాంట్ ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ విధానాన్ని టీసీఎస్ ఉపయోగించనుంది. మరోవైపు అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసులను డిజిటలీకరించే దిశగా ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ అమెడ్యూస్తో టీసీఎస్ చేతులు కలిపింది.మరోవైపు, ఐటీ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు, ఇతరత్రా టెక్నాలజీల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ, టీసీఎస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇల్లు కొనేవాళ్లకు ఇదే మంచి ఛాన్స్!
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరుకు రవాణాలో అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి సొంతింటి కలపై కూడా నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, సరఫరా గొలుసులో జాప్యం కలవరపెడుతున్నాయి.ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇల్లు కొనడం లేదా నిర్మాణం చేపట్టడం సరైనదేనా అనే అంశంపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో చూద్దాం..ఆకాశాన్ని తాకుతున్న నిర్మాణ ఖర్చులుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, ఎర్ర సముద్రం మీదుగా రవాణా నిలిచిపోవడం వంటి కారణాలు నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి.స్టీల్, సిమెంట్ ధరల మోత: అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో స్టీల్ తయారీ ఖర్చు 20% వరకు పెరిగింది. ప్రస్తుతం టన్ను స్టీల్ ధర సుమారు రూ.72,000కు చేరింది. సిమెంట్ ధరలు కూడా బస్తాకు రూ.20 - రూ.40 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.రవాణా ఛార్జీల భారం: అంతర్జాతీయ కంటైనర్ రవాణా ధరలు పెరగడంతో ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లంబింగ్ సామగ్రి, విదేశీ టైల్స్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో కంటైనర్పై సుమారు రూ.1.5 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.అల్యూమినియం, పీవీసీ: యుద్ధ ప్రభావంతో అల్యూమినియం ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోగా, పీవీసీ పైపుల ధరలు 20-33% వరకు పెరిగాయి.హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి.. ఇల్లు కొనాలా? వద్దా?ప్రస్తుత సంక్షోభం ఉన్నప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర నగరాల కంటే స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడే కొనడం ఎందుకు మంచిదంటే.. పెరగనున్న ధరలు: నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల ధరలను పెంచక తప్పదు. వచ్చే 3-6 నెలల్లో అపార్ట్మెంట్ల ధరలు 10-15% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పాత ధరలకు అందుబాటులో ఉన్న రెడీ-టు-మూవ్ ఇళ్లను తీసుకోవడం లాభదాయకం.తక్కువ వడ్డీ రేట్లు: ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు 5.5% నుండి 6.0% మధ్య ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.డిమాండ్&సరఫరా: హైదరాబాద్లో ఐటీ, ఫార్మా రంగాల విస్తరణ వల్ల ఇళ్లకు డిమాండ్ తగ్గడం లేదు. కొకాపేట, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.మీరు సొంత అవసరానికి ఇల్లు కొనాలనుకుంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలే మేలనిపిస్తుంది. అయితే, పెట్టుబడి దృష్ట్యా ఆలోచించే వారు మాత్రం భౌగోళిక రాజకీయ పరిస్థితులు కుదుటపడే వరకు కొంత సమయం వేచి చూడటం లేదా 'ఓపెన్ ప్లాట్ల'పై దృష్టి పెట్టడం సురక్షితం.నిర్మాణం చేపట్టే వారు జాగ్రత్త!మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తే, బడ్జెట్లో 15-20% అదనపు నిధులు కేటాయించుకోవడం అవసరం. ధరల పెరుగుదల వల్ల అనుకున్న బడ్జెట్ దాటిపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు స్థానిక సామగ్రిని వాడటం ద్వారా ఖర్చును నియంత్రించవచ్చు.
కార్పొరేట్
వర్క్ ఫ్రమ్ హోమ్ రిజెక్ట్.. కంపెనీకి రూ.210 కోట్లు ఫైన్!
ఎల్పీజీ ఏటీఎం వచ్చేసింది.. ఇక ఎనీ టైమ్ గ్యాస్!
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్’
వ్యాపారాలకు రూ.2వేల కోట్ల ప్రయోజనాలు: అమెజాన్
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ గా భారత్
సెమాగ్లూటైడ్ జనరిక్స్ వెల్లువ
చౌకగా సెమాగ్లూటైడ్.. దిగ్గజ కంపెనీల లాంచ్!
రూ.47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!
ఆయిల్పై అమెరికా అంచనా.. ఇరాన్ క్లారిటీ
అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. రెండు ర...
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ...
క్రూడ్ బాంబ్.. మార్కెట్ క్రాష్
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో ...
ఆల్గో ట్రేడింగ్ కేసులో సెటిల్మెంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథ...
పన్ను ఎగవేతలకు టెక్నాలజీతో చెక్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు విరోధులుకాదని ఆర...
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ ...
ముంచుకొస్తున్న నీటి గండం!
దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న వేళ భారత్ తీవ్రమైన...
దాపరికాలుంటే ఊరుకోం..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మా...
ఆటోమొబైల్
టెక్నాలజీ
సెమీకాన్ మార్కెట్ @ 300 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటం, ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతుండటం, డేటా సెంటర్లు విస్తరిస్తుండటం తదితర అంశాలు ఇందుకు దన్నుగా నిలవనున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ భవిష్యత్తుపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 90 శాతం సెమీకండక్టర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, 2035 ఆఖరు నాటికి దేశీ డిమాండ్లో 60 శాతం చిప్స్ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోనుంది. ‘భారత్లో సెమీకండక్టర్ మార్కెట్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, గత మూడేళ్లుగా వార్షికంగా 20 శాతం మేర వృద్ధి చెందుతోందని అంచనా. ఈ నేపథ్యంలో ఏఐ, ఆటోమోటివ్స్, డేటా సెంటర్స్, ఎల్రక్టానిక్స్ తయారీ ఊతంతో 2030 నాటికల్లా 120 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చు‘ అని డెలాయిట్ పేర్కొంది. దేశీయంగా సెమీకండక్టర్ల డిమాండ్లో మొబైల్ ఫోన్లు, ఆటోమోటివ్, కంప్యూటింగ్, డేటా సెంటర్లలాంటి సెగ్మెంట్ల వాటా 70 శాతం పైగా ఉండనుంది. ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద ఇప్పటికే 10 ప్రాజెక్టుల్లోకి 19 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎనిమిది ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ ..టెస్ట్ (ఓఎస్ఏటీ) ప్లాంట్లు, ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ ఉన్నాయి. సుమారు 20–25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మరో 18–20 ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమలోకి మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చు. అలాగే 2030–2035 మధ్య ఇంకో 75–80 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవస్థ మరింతగా విస్తరిస్తుంది‘ అని నివేదిక వివరించింది. భారీగా ఉద్యోగాలు.. సెమీకండక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. 2035 నాటికి పరిశ్రమలో సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందులో 30% ఉద్యోగాలు తయారీ కార్యకలాపాల్లో, 30% డిజైన్ సర్వీసుల్లో, మిగతా 40 శాతం ఇతరత్రా విభాగాల్లోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏటా 4,00,000–5,00,000 మందికి పరిశ్రమ సంబంధిత కోర్సులు, నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. అయితే, ఈ సానుకూల పరిణామాలన్నీ కూడా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని వివరించింది. స్థలం, యుటిలిటీలు, మౌలిక సదుపాయాలకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, వార్షికంగా బడ్జెట్లో కేటాయింపులు, నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్న ప్రోత్సాహక స్కీములకే పరిమితం కాకుండా నిధుల లభ్యతపరంగా కచ్చితత్వం ఉండేలా జాతీయ స్థాయి ప్రోగ్రాంను రూపొందించాలని సూచించింది.
డెల్ కంపెనీ సైలెంట్గా ఇంత పని చేసిందా!!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) సైలెంట్గా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన గ్లోబల్ వర్క్ఫోర్స్ను సుమారు 11,000 తగ్గించి, మొత్తం సిబ్బందిని 108,000 నుండి 97,000కు తీసుకువచ్చింది. ఈ వివరాలు తాజాగా విడుదల చేసిన వార్షిక 10-K ఫైలింగ్లో వెల్లడయ్యాయి.కంపెనీ ఈ తొలగింపులపై పెద్దగా బహిరంగ ప్రకటన చేయకపోయినా, ఉద్యోగ విరమణ (severance) ఖర్చుల రూపంలో సుమారు 569 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇది కంపెనీ అమలు చేస్తున్న “క్రమశిక్షణా వ్యయ నిర్వహణ” వ్యూహంలో భాగమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 693 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం.ఒకేసారి పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడం కాకుండా, దశలవారీగా సిబ్బందిని తగ్గించుకున్నట్లు కంపెనీ ఫైలింగ్ సూచిస్తోంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను ఆధునీకరించడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఎంటర్ప్రైజ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.డెల్ ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కొత్త విషయమేమీ కాదు. 2023లో సుమారు 1.33 లక్షల మంది ఉన్న డెల్ వర్క్ఫోర్స్, 2024లో 1.20 లక్షలకు, 2025లో 1.08 లక్షలకు పడిపోయింది. తాజా కోతలతో మూడు సంవత్సరాల్లో దాదాపు 27 శాతం వర్క్ఫోర్స్ తగ్గిపోయినట్లైంది.ఇక టెక్ రంగంలో మొత్తం పరిస్థితి కూడా ఇదే దిశగా సాగుతోంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు 66 టెక్ కంపెనీలు కలిపి 39,000కు పైగా ఉద్యోగాలను తగ్గించాయి. మెటా ప్లాట్ఫామ్స్, అట్లాసిన్, బ్లాక్ వంటి సంస్థలు కూడా ఏఐ ఆధారిత మార్పుల దిశగా ఉద్యోగ కోతలు చేపడుతున్నాయి.
భారత్లో పాగా వేసేందుకు అమెజాన్ దూకుడు!
భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యునికేషన్ (శాట్కామ్) విభాగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దిగ్గజ కంపెనీల మధ్య పోటీ ముదురుతోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే రేసులో ముందంజలో ఉండగా జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ తన ‘ప్రాజెక్ట్ కూపర్’ కోసం అనుమతులను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులు భారత టెలికాం శాఖ (డాట్)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అనుమతుల కోసం..భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం అమెజాన్ గత కొంతకాలంగా వేచి చూస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో దీన్ని వేగవంతం చేయాలని కోరుతూ అమెజాన్ వరుస లేఖలు రాసినట్లు సమాచారం.స్టార్లింక్ వర్సెస్ కూపర్ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పాగా వేయడమే కాకుండా భారత్లో కూడా అనుమతుల ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. స్టార్లింక్తో పోలిస్తే అమెజాన్ తన సాటిలైట్ లాంచింగ్ షెడ్యూల్లో కొంత వెనుకబడి ఉంది. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి, భారతీయ వినియోగదారులకు త్వరగా చేరువ కావడానికి అమెజాన్ వేగంగా చర్యలు చేపడుతోంది.భారీ కెపాసిటీతో సవాలుస్టార్లింక్ సేవలతో పోలిస్తే తమ శాటిలైట్ నెట్వర్క్ భారత్లో గణనీయమైన స్థాయిలో డేటా కెపాసిటీని అందించగలదని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్, నిరంతర కనెక్టివిటీ విషయంలో స్టార్లింక్కు గట్టి పోటీ ఇస్తామని కంపెనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.టెలికాం రంగంలో కొత్త విప్లవంకేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ కూపర్ పనిచేస్తోంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.భారత ప్రభుత్వం ఇప్పటికే స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ సంస్థలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమెజాన్ ఎంత త్వరగా లైసెన్స్ పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెజాన్ రంగంలోకి దిగితే ధరల యుద్ధం మొదలై అంతిమంగా భారతీయ వినియోగదారులకే మేలు జరుగుతుందని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఎంఐ ల్యాబ్స్తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్తో నడిచే అతి పెద్ద ఏఐ ఆధారిత కంప్యూట్ ప్లాట్ఫాంను నిర్మించేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ)తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం నోయిడాలో ప్రాథమికంగా 1 గిగావాట్ ఏఐ కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దీన్ని 2 గిగావాట్ల స్థాయికి విస్తరిస్తారు. దీని విద్యుత్ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్ విద్యుత్ వ్యయాలతో పోలిస్తే 50–70 శాతం తక్కువగా ఉండనున్నాయి.ఈ ఒప్పందం కింద కంప్యూట్ ప్లాట్ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ భాగస్వామిగా ఓఎక్స్ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్వేర్ రోడ్మ్యాప్, సప్లై చెయిన్ వ్యూహాలను డిజైన్ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభం కాగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.పర్యావరణహిత విద్యుత్ దిగ్గజం గ్రీన్కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు. సిలికాన్ వేలీ కంపెనీలకు సేవలందిస్తున్న ఓఎక్స్ఎంఐక్యూ అనుభవం తమకు ఉపకరిస్తుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు. ఏఎంఐ ల్యాబ్స్ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి తెలిపారు.
పర్సనల్ ఫైనాన్స్
EPF కనీస పెన్షన్ పెంపు.. పార్లమెంటు కమిటీ కీలక సిఫార్సులు
ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 (EPS, 1995) కింద.. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్టైల్స్, స్కిల్ డెవలప్మెంట్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ.7,500కు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది.కనీస పెన్షన్పై ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునః సమీక్షించి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కేటాయింపులు చేయాలని సూచించింది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
కస్టమర్లకు అలర్ట్.. మారిపోతున్న క్రెడిట్ కార్డు రూల్స్..
దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు ఏప్రిల్ 2026 నుంచి తమ క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు అమలు చేయనున్నాయి. ముఖ్యంగా క్యాష్బ్యాక్ ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ విధానం, అలాగే కొన్ని చెల్లింపులపై లావాదేవీ ఛార్జీల్లో మార్పులు ఉండనున్నాయి.ఈ మార్పులను ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), యెస్ బ్యాంక్ (YES Bank), ఎస్బీఐ (SBI Card) తమ వినియోగదారులకు తెలియజేశాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని తమ ఖర్చు విధానాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది.యాక్సిస్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్లో మార్పులుఏప్రిల్ 12 నుంచి ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్లో కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ చెల్లింపులపై 25% క్యాష్బ్యాక్ కొనసాగుతుంది.ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 10% క్యాష్బ్యాక్ అందుతుంది.అయితే ప్రతి బిల్లింగ్ సైకిల్కు గరిష్ట క్యాష్బ్యాక్ పరిమితి ఇప్పుడు బేస్ క్యాష్బ్యాక్ క్యాప్తో అనుసంధానం అవుతుంది.స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్ఫారమ్లపై ఇప్పటివరకు ఉన్న 10% క్యాష్బ్యాక్ నిలిపివేయనున్నారు.బదులుగా జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్ఫారమ్లపై 10% వాల్యూ-బ్యాక్ అందించనున్నారు.యెస్ బ్యాంక్ కొత్త ఛార్జీలుఏప్రిల్ 1 నుంచి యెస్ బ్యాంక్ యుటిలిటీ బిల్లులు, ట్రాన్స్పోర్ట్ చెల్లింపులపై కొత్త పరిమితులు, ఛార్జీలు అమలు చేయనుంది. కొత్త నిబంధనలు ఇలా.. విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులపై నెలవారీ ఖర్చు నిర్దిష్ట పరిమితిని దాటితే 1% ఛార్జీ వసూలు చేస్తారు.కార్డు రకాన్ని బట్టి పరిమితులు ఉంటాయి. యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు అయితే నెలకు రూ.1,00,000 వరకు, ప్రీమియం కార్డులైతే రూ.50,000 వరకు, ఇతర కార్డులకు రూ.25,000 వరకు పరిమితులను నిర్ణయించారు.ఈ పరిమితులను దాటిన తర్వాత చేసిన యుటిలిటీ చెల్లింపులపై 1% ఫీజు వర్తిస్తుంది.అదే విధంగా టోల్, బ్రిడ్జ్ చెల్లింపులు కూడా నిర్దిష్ట పరిమితిని మించితే 1% ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ఒక్క లావాదేవీకి గరిష్ట ఛార్జీ రూ.5,000 వరకు మాత్రమే ఉంటుంది.ఎస్బీఐ.. రివార్డ్ పాయింట్ రిడంప్షన్ మార్పులుఎస్బీఐ కార్డ్ కూడా ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్ రిడంప్షన్ విధానంలో కొత్త నియమాలను అమలు చేయనుంది. కొత్త పాలసీ ప్రకారం..స్టేట్మెంట్ క్రెడిట్గా నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లు మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు.రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ 4,000 పాయింట్ల గుణిజాల్లో మాత్రమే ఉంటుంది.అయితే ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ వంటి కొన్ని కార్డులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది.
స్పెషల్ అలవెన్సులు.. పన్ను భారాలు
జీతంలో కొంత భాగాన్ని స్పెషల్ అలవెన్స్ రూపంలో ఇస్తారు. ఉద్యోగస్తులు వాళ్ల సీటీసీ అంటే ’కాస్ట్ టు ది కంపెనీ’లో ’టేక్ హోమ్ పే’ ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు. బేసిక్ పే కాకుండా అదనంగా ఇచ్చే జీతాన్ని స్పెషల్ అలవెన్స్ అంటారు. ఇవి కాకుండా ఇంటద్దె అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొదలైన వాటిని కేవలం ఆయా పేర్లలో పేర్కొన్న వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి.ఇవి కాకుండా ఎన్నో స్పెషల్ అలవెన్సులు ఉన్నాయి. స్వభావరీత్యా నిర్దేశించినవి తప్ప అన్ని అలవెన్సులు పన్నుకి గురవుతాయి. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీల నిమిత్తం వీటిని తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. కొన్ని పనితీరును బట్టి ఉంటాయి. కొన్ని పని పరిస్థితులను బట్టి ఉంటాయి. 1961వ చట్టంలో ఉన్న అన్ని అలవెన్సులను 2025 చట్టంలో పొందుపరిచారు. చాలా సులభంగా అర్థం అయ్యేలాగా, ఒక పట్టిక రూపంలో పొందుపరిచారు. ఇవి మూడు రకాలు..మినహాయింపు లేని అలవెన్సులు డీఏ, సీసీఏ, పెర్ఫార్మెన్స్ అలవెన్స్, అటెండెంట్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్ మొదలైన వాటిమీద ఎటువంటి మినహాయింపు లేదు. ఇవన్నీ జీతంలో భాగమే. పన్నుకి గురవుతాయి. కొన్ని అలవెన్సులకి షరతులకు లోబడి మినహాయింపులు ఉంటాయి. అవేంటంటే హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, స్టాండర్డ్ డిడక్షన్అలవెన్స్ ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపు. ఈ తరహా అలవెన్సులను మీరు ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపునిస్తారు. ఖర్చు పెట్టని మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఉదాహరణకు కన్వేయన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్, రీసెర్చ్ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్.. వీటి అన్నింటికి ఖర్చులు పెట్టాలి. ఓచర్లు ఇవ్వాలి.పాత పద్ధతి – కొత్త పద్ధతి.. కొత్త పన్ను విధానంలో బేసిక్ లిమిట్ అధికం. ఎక్కువ శ్లాబ్లు, తక్కువ పన్ను రేట్లు, అందువల్ల అలవెన్స్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. ఈ కింది అలవెన్సులను మినహాయించరు.ఇంటద్దె అలవెన్సు, లీవ్ ట్రావెల్ అలవెన్సు, పిల్లల విద్య అలవెన్సు, పిల్లల హాస్టల్ అలవెన్సు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు (దివ్యాంగులకు కాదు), హెల్పర్, యూనిఫాం అలవెన్సు, ఇంటర్నెట్ అలవెన్సు, ఎంటర్టైన్మెంట్ అలవెన్సు. ఇవన్నీ కాకుండా ఇప్పటి 80సి కింద ఇస్తున్న.. పీఎఫ్, ఎన్నెస్సీలు, జీవిత బీమా, పిల్లల చదువు ఫీజులు.. మొదలైన వాటికి కూడా ఇవ్వరు. ఎన్పీఎస్ చెల్లింపులు, అగ్నివీర్ కార్పస్ ఫండ్ చెల్లింపులు.. ఈ రెండు మినహాయింపులు ఇస్తారు. కొత్త విధానంలో మినహాయింపులు వచ్చేవి కొన్ని..స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000. కన్వేయన్స్ అలవెన్స్ / డైలీ / ట్రాన్స్పోర్ట్ అలవెన్సు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ అలవెన్సు. వృత్తి పన్ను. ఫ్యామిలీ పెన్షను .. రూ. 25,000 వరకు. స్థలాభావం వల్ల అన్ని షరతులు ఇక్కడ పొందుపరచలేదు. చట్టంలోనూ, రూల్స్లోను వివరంగా దొరుకుతాయి.. లేదా ఉంది కదా.. గూగుల్ తల్లి.. సంప్రదించండి. 1961 చట్టంతో పోల్చి కొత్త చట్టాన్ని విశదీకరిస్తే వచ్చిన మార్పులు.ఎంటర్టైన్మెంట్ అలవెన్సుకి మినహాయింపు లేదుప్రత్యేక సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్సులకు మినహాయింపులు కొనసాగుతాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చే అలవెన్సులకు మినహాయింపు ఉంది.ఫెనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని ఉండవు. ఇకనుంచి ఒకే పదం ’ట్యాక్స్ సంవత్సరం’.రాబోయే ప్రక్రియలన్నీ డిజిటల్ ప్రపంచంలోనే ఉంటాయి. అరకొర సిబ్బందికి ఏఐ బ్రహ్మాస్త్రంలాగా దొరికింది. అంతా డిజిటల్ రికార్డులు, డిజిటల్ పరిష్కారాలు, టెక్నాలజీమయం. కాబట్టి, మనకు డిజిటల్ అక్షరాస్యత కావాలి. డిజిటల్ సామర్థ్యాలు.. నైపుణ్యాలు సంపాదించాలి. సర్వసన్నద్ధంగా ముందుకెళ్లాలి.
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.


