ప్రధాన వార్తలు
కాకమీదున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో పెరిగిన పసిడి ధరలు ఈరోజు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 24,303 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 242 పాయింట్లు ఎగబాకి 78,356 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.93బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 94.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.8 శాతం పెరిగింది.నాస్డాక్ 1.59 శాతం పుంజుకుంది.Today Nifty position 16-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. ప్రమాదానికి బాధ్యులెవరు?
సాంకేతిక విప్లవం ఆటోమొబైల్ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది. కొంతకాలం క్రితం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయం చాలిత) కార్లు ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. టెస్లా, వేమో, క్రూయిజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు పలు భారతీయ స్టార్టప్లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, స్టీరింగ్ డ్రైవర్ చేతిలో లేకుండా కార్లు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు వాహనదారుల్లో మెదులుతున్నాయి.బాధ్యత ఎవరిది? డ్రైవర్దా లేక సాఫ్ట్వేర్దా?సాధారణ కార్ల ప్రమాదాల్లో మానవ తప్పిదం (హ్యుమన్ ఎర్రర్) ప్రధాన కారణం కాబట్టి డ్రైవర్పై బాధ్యత ఉంటుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో విషయం వేరు. ఇక్కడ ప్రమాద బాధ్యతను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు.1. లెవల్ 2, 3 (సెమీ-అటానమస్): ఇక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సాఫ్ట్వేర్ హెచ్చరించినా డ్రైవర్ స్పందించకుంటే బాధ్యత డ్రైవర్దే అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాత పద్ధతిలోనే జరుగుతుంది.2. లెవల్ 4, 5 (ఫుల్లీ-అటానమస్): ఇక్కడ కారు పూర్తిగా సాఫ్ట్వేర్ నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగితే అది ‘ప్రొడక్ట్ లయబిలిటీ’ కిందకు వస్తుంది. అంటే తయారీ కంపెనీ లేదా సాఫ్ట్వేర్ డెవలపర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధానంసెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్ ప్రక్రియలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి అటానమస్ కారులో సెన్సార్లు, కెమెరాల డేటా రికార్డ్ అవుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు మాన్యువల్ మోడ్లో ఉందా లేక అటానమస్ మోడ్లో ఉందా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుగా తనిఖీ చేస్తాయి.ఒకవేళ కారు సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల లేదా అల్గారిథమ్ లోపం వల్ల ప్రమాదం జరిగిందని తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ సదరు కార్ల తయారీ సంస్థ నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేస్తుంది. దీనినే ‘సబ్రోగేషన్’ అంటారు.బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్రస్తుతం ఉన్న ‘థర్డ్ పార్టీ లయబిలిటీ’ నిబంధనలే వర్తిస్తాయి. అయితే, పరిహారం చెల్లించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ తయారీదారుడిపై కేసు వేసే అవకాశం ఉంటుంది.ప్రస్తుత కంపెనీల విధానాలుసైబర్ ఇన్సూరెన్స్.. కారు హ్యాకింగ్కు గురై ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది.అల్గారిథమ్ లయబిలిటీ.. సాఫ్ట్వేర్ కోడింగ్లో లోపాల వల్ల జరిగే నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించేలా కొత్త క్లాజులు వస్తున్నాయి.టెస్లా ఇన్సూరెన్స్.. టెస్లా వంటి కంపెనీలు స్వయంగా ఇన్సూరెన్స్ను అందిస్తున్నాయి. డ్రైవర్ ‘సేఫ్టీ స్కోర్’ ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తున్నాయి.భారత్లో పరిస్థితి ఏమిటి?భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం (ఎంవీఏ) ప్రకారం, వాహనానికి డ్రైవర్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతానికి పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మన రోడ్లపై అనుమతి లేదు. అయితే, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) ఉన్న కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రమాదాలు జరిగితే ప్రస్తుతానికి డ్రైవర్నే బాధ్యుడిని చేస్తూ క్లెయిమ్లు సెటిల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!
కొత్త కారు కొనేవారికి రూ.55,000 వరకు ఆఫర్!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన అమ్మకాలతో దేశంలోనే మూడో అతిపెద్ద కార్ల తయారీదారుగా (మారుతీ సుజుకీ, మహీంద్రా తర్వాత) నిలిచిన టాటా మోటార్స్ అదే జోరును కొనసాగించేందుకు ఏప్రిల్ నెలలో ఆఫర్లను ప్రకటించింది. తన పాపులర్ ఐసీఈ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) మోడళ్లపై ఏకంగా రూ.55,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.హ్యుందాయ్ను దాటేసిన టాటా!గత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) విభాగం ఊహించని వృద్ధిని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 5,53,585 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు 2026 నాటికి 14.05% వృద్ధిని నమోదు చేస్తూ 6,31,387 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఘనతతో హ్యుందాయ్ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టి టాటా మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.ఏ మోడల్పై ఎంత తగ్గింపు?వినియోగదారుల డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ డిస్కౌంట్ రూపంలో ఈ రాయితీలు లభిస్తాయి. మోడల్, వేరియంట్ను బట్టి ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.మోడల్గరిష్ఠ డిస్కౌంట్టాటా కర్వ్ (Curvv)రూ. 55,000టాటా హారియర్ (Harrier)రూ. 45,000టాటా సఫారీ (Safari)రూ. 45,000టాటా ఆల్ట్రోజ్ (Altroz)రూ. 35,000టాటా నెక్సాన్ (Nexon)రూ. 30,000టాటా టియాగో (Tiago)రూ. 30,000టాటా టిగోర్ (Tigor)రూ. 30,000 పోటీ మార్కెట్లో హోరాహోరీవేసవి సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రధాన కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. మారుతీ సుజుకీ తన కార్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించగా, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.60,000 వరకు తగ్గింపు ఇస్తోంది. వాటితో పోలిస్తే టాటా ఆఫర్లు తక్కువగా అనిపించినప్పటికీ సేఫ్టీ రేటింగ్స్, సరికొత్త డిజైన్ల కారణంగా టాటా కార్లకు డిమాండ్ భారీగా ఉందని కంపెనీ అధికారలు చెబుతున్నారు.గమనిక: పైన పేర్కొన్న డిస్కౌంట్లు సీటీ, డీలర్షిప్, స్టాక్ లభ్యతను బట్టి మారుతుంటాయి. కచ్చితమైన ధర, ఆఫర్ల కోసం మీ సమీపంలోని అధికారిక షోరూమ్ను సంప్రదించగలరు.ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!
భారత్ వృద్ధి వేగవంతం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, 2027లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2026లో 6.5 శాతం వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొంది. భారత వస్తువులపై అమెరికా అదనపు టారిఫ్లను 50 శాతం నుంచి10 శాతానికి తగ్గించడం వంటి సానుకూల అంశాలు వృద్ధికి దోహదం చేస్తాయని ఐఎంఎఫ్ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణల కారణంగా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఈ సానుకూలతల అండతో 2026లో వృద్ధి రేటు 0.3 శాతం మెరుగుపడి 6.5 శాతానికి చేరుతుందని, 2027లో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటు తగ్గొచ్చు.. ఇరాన్ యుద్ధంతో ప్రంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందంటూ, దీని ఫలితంగా 2025లో వృద్ది రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2026లో వృద్ధి అంచనాను 3.3 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. 2025లో నమోదైన 3.4 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. 2027లోనూ 3.2 శాతానికి వృద్ధి రేటు తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదికి ద్రవ్యోల్బణం అంచనాలను లోగడ ప్రకటించిన (జనవరిలో) అంచనా 3.8 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. యుద్ధానికి ముందు వరకు అమెరికా టారిఫ్లను ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగానే నిలబడిందని.. డేటా సెంటర్లు, ఏఐపై భారీ పెట్టుబడులు, ఉత్పాదక పెరగడం ఆర్థికంగా అనుకూలించినట్టు విశ్లేషించింది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం ఈ వేగానికి అడ్డుపడిందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త పీర్నే ఒలీవర్ పేర్కొన్నారు.
కార్పొరేట్ మిడ్ లెవెల్ మంత్ర
న్యూఢిల్లీ: అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కార్పొరేట్ కంపెనీలు నియామకాల విషయంలో విభిన్న పంథాలో వెళ్తున్నాయి. ప్రధానంగా మధ్య స్థాయి నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. స్టాఫింగ్ సర్వీసెస్, హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ జీనియస్ హెచ్ఆర్టెక్ నివేదిలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల్లో 49 శాతం కంపెనీలు తాము మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవడంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాయి. సిబ్బందిని పెంచుకోవడానికి సంబంధించి 10–15 శాతానికి మించి గణనీయంగా రిక్రూట్ చేసుకోనున్నట్లు 28 శాతం సంస్థలు, 0–5 శాతం వరకు పెంచుకునే అవకాశాలున్నట్లు 43 శాతం సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి 2,359 మంది సీఎక్స్వో స్థాయి లీడర్లు, సీనియర్ ప్రొఫెషనల్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపు ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 34 శాతం సంస్థలు వేతనాల పెంపు 10 శాతానికి మించి ఉండేలా ప్రణాళికలు వేసుకుంటుండగా, 46 శాతం సంస్థల్లో ఒక మోస్తరుగా 5–10 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. రిపోర్టులోని మరిన్ని కీలకాంశాలు.. → వేతనాల పెంపు విషయంలో రెగ్యులేటరీ, కార్మిక చట్ట సంస్కరణలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది. మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం 48 శాతంగా ఉండగా, జూనియర్, సీనియర్ స్థాయుల్లో వరుసగా 26, 22 శాతంగా నమోదైంది. → అట్రిషన్ అంశం చాలా సంస్థలకు ఆందోళనకర విషయంగా ఉంటోంది. మెజారిటీ 55 శాతం సంస్థలు 10–20 శాతం మేర అట్రిషన్ ఉంటుందని అంచనా వేస్తుండగా, ఇది 20 శాతానికి మించి ఉంటుందని 15 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగుల సెగ్మెంట్లో ఇది ఎక్కువగా ఉంటుందని 67 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రాంతీయంగా చూస్తే దక్షిణాది జోన్లో అత్యధికంగా అట్రిషన్ ఉంటుందని 55 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆకాంక్షలు కూడా దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. పనిపరంగా వెసులుబాట్లు, లక్ష్యాలు, కెరియర్లో వేగంగా పురోగమించేందుకు అవకాశాలు మొదలైన విషయాల్లో 50 శాతం పైగా ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. ముఖ్యంగా జెన్ అల్ఫా, జెన్ జెడ్ తరానికి చెందిన యువ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగులను అట్టే పెట్టుకోవాలంటే నిరంతరం వారితో ఎంగేజ్ కావడం, ఫీడ్బ్యాక్ ఇస్తుండటం, నేర్చుకునే అవకాశాలు కల్పించడంలాంటివి కీలకాంశాలుగా ఉంటున్నాయని 38 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. → ఉద్యోగ భద్రత గురించి ఆందోళనపై మిశ్రమాభిప్రాయాలు నెలకొన్నాయి. వేతనం, వృద్ధి అంశాలతో పోలిస్తే అట్రిషన్పై దీని ప్రభావం ఒక మోస్తరుగానే ఉంటుందని లేదా పరిమిత స్థాయిలోనే ఉంటోందని చెరి 43 శాతం సంస్థలు వెల్లడించాయి. → 2026–27లో డేటా ఆధారిత వ్యూహాలతో, మిడ్ లెవెల్ నిపుణులు, డిజిటల్ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ, మారే వ్యాపార అవసరాలకు అనుగుణంగా హైరింగ్ ఆచితూచి ఉంటుంది. అట్రిషన్ రేటు పెరుగుతుండటమనేది మరింత పటిష్టమైన ప్లానింగ్, రిటెన్షన్ (ఉద్యోగులు వీడిపోకుండా అట్టే పెట్టుకోవడం) ఆవశ్యకతను తెలియజేస్తోంది. → పరిస్థితి, అవసరాలను బట్టి హైర్ చేసుకోవడం, పర్మనెంట్–ప్రాజెక్ట్ ఆధారిత నియామకాల మధ్య సమతౌల్యత పాటించే దిశగా పరిశ్రమ మళ్లుతోంది. వేగం, నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకునే సామర్థ్యాలు, సంస్థ నిలకడగా వృద్ధి చెందేందుకు తోడ్పడే సామర్థ్యాలు మొదలైనవి హైరింగ్ని ప్రభావితం చేస్తున్నాయి. → డైవర్సిఫికేషన్కి పెద్ద పీట వేస్తూ పురుషులు, మహిళా ఉద్యోగుల హైరింగ్లో పురుషులు, మహిళల నిష్పత్తి 50:50 స్థాయిలో ఉండేలా 27 శాతం కంపెనీలు చూసుకుంటున్నాయి. ఇది 60:40 స్థాయిలో ఉండేలా చూసుకునేందుకు 31 శాతం కంపెనీలు ప్రయతి్నస్తున్నాయి. అయితే, ఇప్పటికీ పురుషులను రిక్రూట్ చేసుకోవడం వైపే చాలా మటుకు పరిశ్రమలు ఒకింత ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. → చెరో 32 శాతం వాటాతో పశ్చిమ, ఉత్తరాదిలో హైరింగ్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండనున్నాయి. తూర్పు, దక్షిణాది ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
కార్పొరేట్
కార్పొరేట్ మిడ్ లెవెల్ మంత్ర
ఏఐ వినియోగంలో భారత్ టాప్.. కానీ..
దుబాయ్లో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ ఆఫర్లు!
రూ.22 వేల కోట్ల లాస్.. ‘టాటా’ ఆదుకోవాల్సిందే..!
‘వందేభారత్ స్టైల్’ లోకల్ రైలు వచ్చేసింది..
పాటలు వింటూ రైలులో ప్రయాణిస్తున్నారా? జాగ్రత్త!
కో-ఆపరేటివ్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
యాపిల్ పెట్టుబడిపై నీలినీడలు!
మహిళలకూ ఉండాలి టర్మ్ పాలసీ
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గ...
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ఇరాన్ - అమెరికా యుద్ధం ఎ...
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!
పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (స...
‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే క...
రెమిటెన్సులకు యుద్ధం సెగ
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత్కు వచ్చే రె...
కార్మికుల వేతనాలు పెంపు
ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక రంగంలో గత కొన్ని రోజ...
ధరలు.. ఇంకాస్త పైకి
న్యూఢిల్లీ: మార్చిలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగా...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వంటగది కోసం.. ప్రత్యేక గ్యాడ్జెట్స్!
వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్లో, తక్కువ శ్రమతో స్టయిలిష్గా పూర్తి చేసే గాడ్జెట్లు మీకోసం!స్ప్రే టచ్! మీ కిచెన్లో టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా కంట్రోల్లో ఉండాలంటే ఈ స్మార్ట్ ఆయిల్ స్ప్రేయర్ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్ మ్యాజిక్ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్ ఫ్రయ్యర్లో చికెన్ రోస్ట్ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్ కూడా తగ్గుతుంది! సలాడ్స్ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!వంటింట్లో ఆర్గానిక్ ఫామ్!బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్ మేకర్! ఇందులో ఉన్న స్మార్ట్ ‘నాబ్’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్మెంట్ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!స్నాక్ పార్ట్నర్!సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్ డిష్ నట్ బౌల్!ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్ టైమ్ను క్లీన్గా, స్టయిలిష్గా మార్చే చిన్న మ్యాజిక్ బౌల్! ఇందులో డబుల్ డిష్ బౌల్స్ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్ నట్స్ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే!
గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై భారీ తగ్గింపు!
ఖరీదైన స్మార్ట్ఫోన్లు ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తాయా?.. అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పిక్సెల్ 10 మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 55వేల కంటే తక్కువ ధరకు లభించనుంది.ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999 ఉండగా.. దానిని తగ్గింపుతో రూ. 74,999కు అందుబాటులో ఉంచింది. అంటే ప్రారంభంలోనే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది కాకుండా.. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే వెంటనే రూ. 4,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా భారీ తగ్గింపు పొందవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా గరిష్టంగా రూ.52,000 వరకు తగ్గింపు పొందవచ్చు.ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత పిక్సెల్ 7 ఎక్స్చేంజ్ చేసుకుంటే.. 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ లభించవచ్చు. అదనంగా మరో 5000 ఇతర డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ రూ. 55,000 కంటే కూడా తక్కువకు లభించే అవకాశం ఉంది.గూగుల్ పిక్సెల్ 10గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజిని పొందుతుంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ లభిస్తుంది. ఏఐ బేస్డ్ పనులను నిర్వహించడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. డిస్ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్తో వస్తుంది, ఇది మంచి క్లారిటీ ఇస్తుంది. అలాగే 4970 యాంపియర్ బ్యాటరీ ఉండటం వల్ల సాధారణ వినియోగంలో ఒక రోజు మొత్తం సులభంగా పనిచేస్తుంది.
విడ్స్లో కొత్త ఫీచర్లు
తమ ‘విడ్స్’ ప్లాట్ఫామ్ను 2024లో పరిచయం చేసింది గూగుల్. అప్పటి నుంచి ఇది క్రియేటర్లకు ఉపయోగపడుతోంది. ప్రారంభంలో కేవలం సంస్థల కోసమే ఉద్దేశించినప్పటికీ కాలక్రమేణ ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా విషయానికి వస్తే....గూగుల్ తన వీడియో క్రియేషన్ యాప్ ‘విడ్స్’లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఎడిటింగ్లో అనుభవం లేని వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. వీడియో మేకింగ్ను సులభతరం, వేగవంతం, మరింత సృజనాత్మకంగా మార్చడానికి కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి.అప్డేట్లో ప్రధానమైనది...సాధారణ టెక్ట్స్ప్రాంప్ట్లను ఉపయోగించి డిజిటల్ అవతార్లను మ్యానేజ్ చేసే కొత్త పద్ధతి. క్యారెక్టర్లను మాన్యువల్గా యానిమేట్ చేయడానికి బదులుగా సూచనలు టైప్ చేయడం ద్వారా అవతార్లు స్పందించేలా చూడవచ్చు.టెక్స్ట్ టు యాక్షన్ఈ అప్డేట్తో యూజర్లు సహజమైన భాషను ఉపయోగించి ఒక సన్నివేశంలో అవతార్లు నటించేలా చేయవచ్చు. ఒక ప్రొడక్ట్ గురించి అవతార్ చెప్పడంలాటి వాటి గురించి క్రియేటర్లు చెబితే దానికి అనుగుణంగా యాప్ ఆ సీన్ను జనరేట్ చేస్తుంది. వ్యాపారం లేదా బ్రాండెడ్ కంటెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ను బట్టీ అవుట్పుట్ మారినప్పటికీ, వీడియో అంతటా అవతార్లు దృశ్యపరంగా స్థిరంగా ఉంటాయి. ప్రొఫెషనల్ లుక్తో కనిపించడానికి ఇది ఉపకరిస్తుంది. యూజర్లు క్యారెక్టర్లను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్లను ఉపయోగించి క్యారెక్టర్ల రూపాన్ని మార్చవచ్చు. వీడియో థీమ్కు సరిపోయే కొత్త నేపథ్యాన్ని జోడించవచ్చు. క్రియేటర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం.స్మార్ట్ వీడియో క్రియేషన్ టూల్స్‘అవతార్’ కంట్రోల్తో పాటు వీయో 3.1 వీడియో–జనరేషన్ మోడల్ని విడ్స్లో అనుసంధానించింది గూగుల్. ఎడిటర్లోనే నేరుగా షార్ట్, ఎనిమిది సెకన్ల వీడియోలను క్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ యూజర్లకు ఉపకరిస్తుంది. సాధారణ యూజర్లు నెలకు పది వీడియోల వరకు ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు.గత నెలలో విడ్స్ కోసం లైరియా 3, లైరియా 3 ప్రో మ్యూజిక్ మోడల్స్ను విడుదల చేసింది గూగుల్. అదనపు సాఫ్ట్వేర్ అవసరం లేకుండానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్లను జోడించి పూర్తి వీడియోలు రూపొందించడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది.చదవండి: ఐఆర్సీటీసీ కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే చాన్స్ లేదు!సులభంగా... షేరింగ్ అండ్ రీకార్డింగ్యూజర్లు తమ స్క్రీన్ రికార్డ్ చేయడానికి క్రోమ్ ఎక్స్ టెన్షన్ డెవలప్ చేసింది గూగుల్. తద్వారా ఆడియో, వీడియో ట్యుటోరియల్స్, డెమోనిస్ట్రేషన్స్ను సులభతరం చేస్తుంది.
అందరికీ నచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్!
మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా నిలిచింది తక్కువ ఖర్చుతో.. సిమ్ యాక్టివ్గా ఉంచుకోవాలని భావించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక.రూ.189 రీఛార్జ్ ప్లాన్ వివరాలురిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 300 ఎస్ఎమ్ఎస్లు, ఇంటర్నెట్ వినియోగానికి 2జీబీ డేటా లభిస్తాయి. ఒకసారి ఈ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. కానీ స్పీడ్ తగ్గుతుంది. దీనివల్ల కనీస అవసరాల కోసం అయినా కనెక్టివిటీ కొనసాగించవచ్చు.50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్స్ మాత్రమే కాకుండా జియోటీవీ ద్వారా ఎక్కడైనా టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. అంతే కాకుండా.. డిజిటల్ యుగంలో డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది ఫోటోలు, వీడియోలు వంటి ఫైల్స్ను సురక్షితంగా నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.అయితే.. ఈ ప్లాన్ కొన్ని థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్లో కనిపించకపోవచ్చు. అందువల్ల వినియోగదారులు మైజియో యాప్ను డౌన్లోడ్ చేసి, అందులోని ‘రీఛార్జ్’ విభాగంలో ఈ ప్లాన్ను ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేయాలి.
పర్సనల్ ఫైనాన్స్
ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్పైనే..
ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఇన్వెస్టింగ్పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్ని అందిస్తున్నట్లు వివరించింది.2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్ 50 ఫండ్ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్ క్యాప్ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు.
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి.
సక్సెస్కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.డైవర్సిఫికేషన్ ప్రధానం పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.ఒడిదుడుకులు.. వ్యూహాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం సాధారణంగా సరైన ఫండ్ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు.
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ధరల వ్యత్యాసం2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.ఎందుకీ పరుగు?బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.మారిన వినియోగదారుల తీరుధరలు భారమైనా సెంటిమెంట్ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.వ్యాపారుల వ్యూహాలుకస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.


