Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IndiGo Flights To Get Costlier As It Imposes Fuel Surcharge Amid Iran War1
ఇండిగో విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జీలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో విమాన ఇంధన ధరలు భగ్గుమన్న నేపథ్యంలో దేశీయంగా విమానయాన సంస్థలు టికెట్లపై అదనపు చార్జీలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా చార్జీలు పెంచేయగా, తాజాగా ఇండిగో కూడా అదే బాట పట్టింది. మార్చి 14 నుంచి (నేడు) దేశీ, విదేశీ రూట్లలో బుక్‌ చేసుకునే టికెట్లపై రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తున్నట్లు వెల్లడించింది.దేశీ రూట్లు, భారత ఉపఖండంలో తిరిగే ఫ్లయిట్లకు ఫ్యుయల్‌ చార్జ్‌ రూ. 425గా, పస్చిమాసియా సర్వి సులకు రూ. 900గా ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక ఆగ్నేయాసియా, చైనా, ఆఫ్రికా ఫ్లయిట్లకు రూ. 1,800గా, యూరప్‌ రూట్లలో రూ. 2,300గా చార్జీ ఉంటుంది. ఇప్పటికే ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ దేశీ రూట్లలో విధిస్తున్న రూ. 399 కన్నా ఇది అధికంగా ఉండటం గమనార్హం. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్‌ వాటా 40 శాతం ఉంటుంది.

Rupee falls 5 paise to 92.30 against dollar2
పాతాళానికి రూపాయి

ముంబై: చమురు ధరల సెగతో దేశీ కరెన్సీ విలువ కరుగుతూనే ఉంది. తాజాగా డాలరుతో మారకంలో రూపాయి 5 పైసలు క్షీణించి 92.30 వద్ద ముగిసింది. వెరసి వరుసగా మూడో రోజు సరికొత్త కనిష్టానికి చేరింది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.5 శాతం పుంజుకుని 102 డాలర్ల ఎగువకు చేరడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 0.5 శాతం బలపడి 100ను అధిగమించడం రూపాయిని దెబ్బతీశాయి.దీంతో ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 92.33 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి ఇంట్రాడేలో 92.47 వద్ద మరోసారి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు కొనసాగుతుండటం సైతం రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Fitch raises India GDP growth projection for FY26 to 7. 5 Percent3
ఈ ఏడాది జీడీపీ జోరు

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.5 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.7%, 2027–28లో 6.5% మేర వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4% చొప్పున వృద్ధి ఉంటుందని లోగడ పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 2026లో బ్యారెల్‌కు సగటున 70 బ్యారెళ్ల స్థాయిలో ఉంటుందని అంచనా వ్యక్తం చేసింది.దేశీ డిమాండ్‌ ఈ ఏడాది వృద్ధిని నడిపించే కీలక అంశమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల వ్యయాలు 8.6%, పెట్టుబడులు 6.9% చొప్పున పెరుగుతాయని తెలిపింది. 2025 డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 7.8%కి పరిమితం కావడం తెలిసిందే. గతేడాది సెపె్టంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4%గా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఆర్థిక కార్యకలాపాలు భారత్‌లో నిదానించినట్టు సంకేతాలు కనిపిస్తున్నా యంటూ, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, రుణ వితరణలో రెండంకెల వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. పెట్టుబడుల వృద్ధి పుంజుకుంటుంది.. స్వల్పకాలంలో పెట్టుబడుల వృద్ధి మందగించొచ్చని, సులభతర ఆర్థిక పరిస్థితులు, కనిష్ట స్థాయిలో వడ్డీ రేట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధ భాగంలో పుంజుకోవచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఈ ఏడాది, వచ్చే ఏడాదికి వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిల్లోనే స్థిరపడొచ్చని పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2.6 శాతం ప్రపంచ జీడీపీ 2026లో 2.6%గా ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఇరాన్‌ యుద్ధంతో ఇంధన ధరలు భారీగా పెరగకపోవచ్చని భావిస్తూ ఈ అంచనాకు వచి్చంది. ఒకవేళ చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరి, అక్కడే కొనసాగితే అది ప్రపంచ సరఫరా వ్యవస్థకు పెద్ద షాక్‌గా మారుతుందని తెలిపింది. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన నేపథ్యంలో క్రూడ్‌ ఈ నెలాఖరు వరకు 90–100 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది.

Star Health Settles Claims Worth Rs 1150 Crore in Telugu States: Himanshu Walia4
తెలుగు రాష్ట్రాల్లో రూ. 1,150 కోట్ల క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు తెలుగు రాష్ట్రాల్లో 1.7 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 1,150 కోట్లు సెటిల్‌ చేసింది. 24 లక్షల మందికి పైగా బీమా కవరేజీ అందిస్తోంది. నగదురహిత క్లెయిమ్స్‌లో 96% క్లెయిమ్స్‌ని 3 గంటల వ్యవధిలోనే సెటిల్‌ చేస్తున్నట్లు సంస్థ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ హిమాంశు వాలియా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 75 శాఖల వ్యాప్తంగా 89,000 మంది అడ్వైజర్లు, 1,800 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయని, తమ వ్యాపారంలో ఈ రాష్ట్రాల వాటా 10%గా ఉంటుందని చెప్పారు.బీమా పాలసీలను మరింత చౌకగా పెద్ద సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను పాలసీదారులకు పూర్తిగా బదలాయించామని, ప్రీమియంలు సైతం పెంచలేదని పేర్కొ న్నారు. కృత్రిమ మేధ దన్నుతో 20 శాతం క్లెయిమ్‌లను పరిష్కరిస్తుండగా, వచ్చే రెండేళ్లలో దీన్ని 50%కి పెంచుకోనున్నామని హిమాంశు తెలిపారు. ఇందుకోసం టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

Gold Price Down in India Know The Latest Rates Here5
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!

భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 తగ్గి.. రూ.1,60,690 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1400 రూపాయలు తగ్గి.. రూ. 147300 వద్ద నిలిచింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 1530, రూ.1400 తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 1,60,840 & రూ. 1,47,450 వద్ద ఉన్నాయి.చెన్నైలో మాత్రం గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉదయం ఎంత ధర ఉందో, సాయంత్రానికి కూడా అదే ధర వద్ద నిలిచింది. దీంతో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162560 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,49,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

How To Creat Parent Managed Accounts  Step By Step Guide6
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్

వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో వాట్సాప్‌ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్‌పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్● ముందుగా పిల్లల ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ● తరువాత యాప్‌ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.● తరువాత మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి● పిల్లల ఫోన్ నంబర్‌ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలిపిల్లల ఫోన్ స్క్రీన్‌పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ & సేఫ్టీ సెట్టింగ్స్‌ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.

Advertisement
Advertisement
Advertisement