Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Pete Lau CEO OnePlus hit with Taiwan arrest warrant1
వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్ సహ వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో పీట్ లౌ (Pete Lau)పై తైవాన్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. చైనా టెక్ ఎగ్జిక్యూటివ్‌లపై తైవాన్ తీసుకున్న అత్యంత అరుదైన, కఠినమైన చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు. ప్రధానంగా అక్రమ నియామకాలు, సాంకేతిక సమాచార లీకేజీపై తైవాన్ ప్రభుత్వం చేపట్టిన అణిచివేత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు.వివాదానికి ప్రధాన కారణం ఏంటి?తైవాన్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం, వన్ ప్లస్ సంస్థ ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండానే కొన్నేళ్లుగా తైవాన్‌కు చెందిన ఇంజినీర్లను అక్రమంగా నియమించుకుంది. ఈక్రమంలో తైవాన్, చైనా మధ్య వ్యాపార, ఉపాధి సంబంధాలను నియంత్రించే కఠినమైన చట్టాలను వన్ ప్లస్ ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 70 మందికి పైగా తైవాన్ ఇంజినీర్లను వన్ ప్లస్ చట్టవిరుద్ధంగా చేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇంజినీర్లు వన్ ప్లస్ పరికరాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, పరిశోధన విభాగాల్లో పనిచేశారని గుర్తించారు.జాతీయ భద్రత, సాంకేతిక పరిరక్షణఈ కేసు కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదని, ఇది తైవాన్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో తైవాన్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. చైనా సంస్థలు ఇలాంటి నియామకాల ద్వారా తమ దేశ మేధో సంపత్తిని, క్లిష్టమైన సాంకేతికతను తస్కరించే ప్రమాదం ఉందని తైవాన్ ఆందోళన చెందుతోంది.కంపెనీ స్పందనఈ పరిణామాలపై వన్ ప్లస్ స్పందిస్తూ.. తమ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే సాగుతాయని, ఈ చట్టపరమైన అంశం కంపెనీ రోజువారీ పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపదని తెలిపింది. అయితే, ప్రస్తుతానికి చైనా-తైవాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా పీట్ లౌ అప్పగింత సాధ్యంకానప్పటికీ ఈ వారెంట్ కారణంగా టెక్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించినట్లయింది.పీట్ లౌ ప్రస్థానం..చైనాలో జన్మించిన పీట్‌ లౌ 2013లో వన్ ప్లస్ స్థాపించడానికి ముందు ఒప్పో (Oppo)లో సీనియర్ ఎగ్జిక్యూటవ్‌ స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తాను వన్ ప్లస్ సీఈవోగా ఉండటంతో పాటు, ఒప్పోలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీపీఓ)గా కూడా పని చేస్తున్నారు. తన నాయకత్వంలోనే వన్ ప్లస్ పెద్ద బ్రాండ్‌గా ఎదిగి ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మెరుగైన స్థానాన్ని సంపాదించుకున్నారు.ఇదీ చదవండి: నిధులు మూరెడు.. పనులు జానెడు!

stock market updates on 16th january 20262
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,693 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 146 పాయింట్లు నష్టపోయి 83,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.27బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 63.6 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.26 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.25 శాతం పుంజుకుంది.Today Nifty position 16-01-2026(time: 9:19 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Public money is not constraint in rural India People matters3
నిధులు మూరెడు.. పనులు జానెడు!

భారతదేశ గ్రామీణ అభివృద్ధి పథంలో అసలైన సవాలు నిధుల కొరత కాదని నిపుణులు చెబుతున్నారు. ఆ నిధులను సమర్థంగా ఖర్చు చేస్తూ ఫలితాలుగా మార్చగల మానవ వనరుల కొరత ఎక్కువగా ఉందని విధానకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతర సాంకేతిక మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రొఫెషనల్‌ వ్యక్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.అంకెల్లో నిధుల వెల్లువప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే గ్రామీణ ఉపాధికి నిధుల కొరత లేదన్నది స్పష్టమవుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ (2024-25)కు సుమారు రూ.1.32 లక్షల కోట్లు కేటాయించారు. ఎంజీనరెగా(‍ప్రస్తుతం వీబీ జీరామ్‌జీ)కు రూ.86,000 కోట్లు ఇచ్చారు. ఒడిశా వంటి రాష్ట్రాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే రూ.33,919 కోట్లు కేటాయించాయి. ఇంత భారీ పెట్టుబడులు పెడుతున్నా సమీక్షలు కేవలం ‘ఎంత మందికి లబ్ధి చేకూరింది? ఎన్ని ఎరువులు పంచారు?’ అనే గణాంకాలకే పరిమితమవుతున్నాయి. కానీ, ఆ పెట్టుబడుల వల్ల పంటల ఉత్పాదకత పెరిగిందా? రైతుల కుటుంబ ఆదాయం మెరుగుపడిందా? అన్న కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు.పరిష్కారమేంటి?ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఆఫీసు పనుల్లో నిమగ్నమై ఉండటంతో క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిచే వ్యవస్థ అవసరం. దీనికోసం జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన స్థానిక యువత పరిష్కారంగా తోస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.వీరి విధులు - బాధ్యతలుతమ సొంత గ్రామంలోనే ఉంటూ వాతావరణానుకూల సాగు, పశువైద్యం, నీటి నిర్వహణలో రైతులకు మార్గనిర్దేశం చేస్తారు.శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ గౌరవ వేతనంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాల నుంచి సర్వీసు ఫీజులు పొందవచ్చు.పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పథకాల అమలును పర్యవేక్షిస్తారు.తక్కువ ఖర్చు - ఎక్కువ లాభంశిక్షణలో పూర్తి చేసిన ఒక్కో వ్యక్తికి డిజిటల్ కిట్ కోసం సుమారు రూ.1 లక్ష వెచ్చిస్తే, 10,000 మందిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ.100 కోట్లు మాత్రమే. ఇది వార్షిక వ్యవసాయ బడ్జెట్‌లో చాలా స్వల్ప భాగం. కానీ, ఈ చిన్న పెట్టుబడితో ప్రతి గ్రామంలో ఒక నిరంతర పర్యవేక్షణ, మద్దతు వ్యవస్థ ఏర్పడి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు వృథా కాకుండా సరైన ఫలితాలను ఇస్తాయి.తూర్పు ఆఫ్రికాలో కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, కొన్ని ఆసియా దేశాల్లోని ఫీల్డ్ ఫెసిలిటేటర్లు ఇలాంటి విధానంతోనే విజయాలు సాధించారు. భారతదేశంలో ఇప్పటికే ఉన్న కృషి సఖీలు, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కేడర్లను కేవలం ప్రాజెక్టులకే పరిమితం చేయకుండా వారిని కీలక వనరులుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం

Kia Carens Clavis gets new HTE EX variant with sunroof4
కియా కారెన్స్ క్లావిస్ కొత్త వేరియంట్

కియా కారెన్స్ క్లావిస్ లైనప్‌నకు కొత్త వేరియంట్‌ను జోడించింది. సరికొత్త కొత్త హెచ్‌టీఈ HTE (EX) వేరియంట్‌ను విడుదల చేసింది. వీటిలో G1.5 పెట్రోల్ వేరియంట్‌ ధర రూ.12,54,900 (ఎక్స్-షోరూమ్), G1.5 టర్బో-పెట్రోల్ వేరియంట్‌ ధర రూ. 13,41,900, D1.5 డీజిల్ వేరియంట్‌ ధర రూ.14,52,900గా కంపెనీ నిర్ణయించింది.హెచ్‌టీఈ (ఈఎక్స్‌) వేరియంట్ మూడు ఐసీఈ పవర్ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అలాగే ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న హెచ్‌టీఈ (O) వేరియంట్‌ కంటే కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. మరిన్ని మెరుగైన ఫీచర్లను కోరుకునే కస్టమర్ల కోసం దీన్ని తీసుకొచ్చారు.తొలిసారి సన్‌రూఫ్‌హెచ్‌టీఈ (ఈఎక్స్‌) వేరియంట్‌లో కీలక అప్‌డేట్‌ కారెన్స్ క్లావిస్ G1.5 పెట్రోల్ వెర్షన్లో స్కై లైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. ఈ పవర్‌ట్రెయిన్‌తో సన్‌రూఫ్ ఇవ్వడం ఇదే మొదటిసారి.మెరుగైన ఫీచర్లు, మరింత సౌకర్యంహెచ్‌టీఈ (ఈఎక్స్‌) వేరియంట్‌లో పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను జోడించడం ద్వారా క్యాబిన్ సౌకర్యాన్ని మరింత పెంచారు. వెలుపల భాగంలో ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), ఎల్‌ఈడీ పొజిషన్ లైట్లు ఇచ్చారు.అంతర్గతంగా, మెరుగైన వెలుతురు కోసం ఎల్‌ఈడీ క్యాబిన్ లైట్లు, అలాగే డ్రైవర్ వైపు పవర్ విండోకు ఆటో అప్ / డౌన్ ఫంక్షన్ అందించడం ద్వారా సౌకర్యంతో పాటు భద్రతను కూడా మెరుగుపరిచారు.

Motorola Signature India Launch Date Announced Expected Price Specs5
మోటరోలా సిగ్నేచర్ వచ్చేస్తోంది.. ఎ‍ప్పుడంటే..

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం హ్యాండ్‌సెట్ మోటరోలా సిగ్నేచర్‌ను భారతదేశంలో జనవరి 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. ఇటీవల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026లో ఈ ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే మోటరోలా సిగ్నేచర్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్‌ను అప్‌డేట్ చేశారు. దీని ద్వారా ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.ప్రధాన ఫీచర్లుడిస్‌ప్లే విషయానికి వస్తే, మోటరోలా సిగ్నేచర్‌లో 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు గరిష్టంగా 6,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, “సౌండ్ బై బోస్” ఆడియో సపోర్ట్ ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.కెమెరా విభాగంలో, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-828 సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిజైన్ పరంగా, ఇది అల్యూమినియం ఫ్రేమ్‌తో 6.99 మిమీ మందంతో ఉండగా, బరువు సుమారు 186 గ్రాములు మాత్రమే.పవర్ కోసం ఇందులో 5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై నడుస్తుంది.ధర ఇదేనా?ధర విషయానికొస్తే, 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.84,999గా లీక్ అయింది. అయితే ఇది బాక్స్ ధర మాత్రమే కావడంతో, వాస్తవ రిటైల్ ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.82,000గా ఉండొచ్చని సమాచారం. అధికారిక ధరలను మోటరోలా లాంచ్ రోజున వెల్లడించనుంది.మోటరోలా సిగ్నేచర్ పాంటోన్ మార్టిని, ఆలివ్, కార్బన్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

Union Bank of India Q3 FY2026 Results6
యూబీఐలో ఎన్‌పీఏలు తగ్గుముఖం

ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,073 కోట్లను తాకింది. ప్రొవిజన్లు భారీగా తగ్గడం ఇందుకు అనుకూలించింది. అయితే నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 9,328 కోట్లకు చేరింది. బ్యాంకింగ్‌ వ్యవస్థకంటే తక్కువగా రుణ వృద్ధి 7 శాతానికి పరిమితంకావడం, నికర వడ్డీ మార్జిన్లు 0.15 శాతం నీరసించి 2.76 శాతానికి చేరడం ప్రభావం చూపాయి.డిపాజిట్లు సైతం 3.4 శాతం మాత్రమే పుంజుకున్నాయి. వడ్డీయేతర ఆదాయం 3 శాతం పెరిగి రూ. 4,541 కోట్లకు చేరింది. కాగా.. తాజా స్లిప్పేజీలు రూ. 2,199 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు నీరసించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.29 శాతం నుంచి 3.06 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 1,599 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 322 కోట్లకు పరిమితమయ్యాయి. వెరసి లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

Advertisement
Advertisement
Advertisement