Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Micro Daily SIPs Gateway for First Time Investors1
డైలీ సిప్‌తో పెట్టుబడులు మరింత సులభతరం

మొదటిసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నవారికి, చిన్న మొత్తాలతో పెట్టుబడుల ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే వారికి మైక్రో, డైలీ సిప్‌లు అనువైన సాధనాలుగా ఉంటున్నాయని షేర్‌.మార్కెట్‌ (ఫోన్‌పే వెల్త్‌) ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోడక్ట్స్‌ హెడ్‌ నీలేష్‌ డి నాయక్‌ తెలిపారు. రోజువారీ ప్రాతిపదికన నగదు రూపంలో ఆదాయాలు ఉండేవారికి, స్వయం ఉపాధి పొందే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయని చెప్పారు. క్రమంగా వారు పెట్టుబడుల పరిమాణాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్‌మెంట్‌ వైపు మళ్లేందుకు తోడ్పడుతున్నాయని వివరించారు.ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌లనేవి దీర్ఘకాలిక పెట్టుబడులనే విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలని నాయక్‌ సూచించారు. మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు, మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి గురించి ఆందోళన చెందరాదన్నారు. తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లను కూడబెట్టుకునే అవకాశంగా దీన్ని పరిగణించాలని సూచించారు. స్వల్పకాలిక హెచ్చుతగ్గులపై స్పందించడం కంటే, సిప్‌లను కొనసాగించడం శ్రేయస్కరమన్నారు. వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్టింగ్, ట్రేడింగ్‌ విభాగాల్లో స్టాక్స్, ఈటీఎఫ్‌లు, ఐపీవోలు, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్, అధునాతన ఫీచర్లు, ఇంటెలిజెంట్‌ టూల్స్‌ మొదలైనవి అందిస్తున్నామని నాయక్‌ చెప్పారు. మైక్రో సిప్‌ల ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టే యూజర్లకు యాప్‌లోని కంటెంట్‌తో పాటు సోషల్‌ మీడియా సహా పలు టచ్‌పాయింట్ల మాధ్యమాల ద్వారా అవగాహన కలి్పస్తున్నామని ఆయన తెలిపారు. మార్కెట్లపై నమ్మకాన్ని, పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇవి ఇన్వెస్టర్లకు తోడ్పడుతున్నాయన్నారు.ఏఐ దన్నుడిజిటల్‌ వినియోగం పెరిగే కొద్దీ వెల్త్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడులు, ట్రేడింగ్‌ని అన్ని వర్గాల ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చాయని నాయక్‌ చెప్పారు. పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో కృత్రిమ మేధ, డేటా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడంలో తమకు, సజావుగా మార్కెట్‌ యాక్సెస్‌ లభించేలా ఇన్వెస్టర్లకు ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై మరింతగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామని నాయక్‌ తెలిపారు. ప్రత్యేకంగా సరళమైన, ఇంటరాక్టివ్‌ యాప్‌ని కూడా తాము రూపొందించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్‌కు రెడీనా?

Retirement Isnt 60 Its Freedom Whenever You Choose check details2
రిటైర్మెంట్‌కు రెడీనా?

రిటైర్మెంట్‌ అంటే... 60 ఏళ్లకు కదా! అనుకుంటారంతా. ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించటమెందుకని రోజులు గడిపేస్తూ ఉంటారు. దాదాపు 70 శాతం మంది వేతన జీవులది ఇదే పరిస్థితి. కాకపోతే ఆ మిగిలిన 30 శాతం మందీ మరోరకంగా ఆలోచిస్తుంటారు. వారి దృష్టిలో రిటైర్మెంట్‌ అంటే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పటం కాదు. తప్పనిసరి పనికి స్వస్తి చెప్పి... నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛను సంపాదించుకోవటం. ఆ స్వేచ్ఛను ఎంత త్వరగా సంపాదించుకోగలిగితే... అంత త్వరగా తప్పనిసరి పనికి గుడ్‌బై కొట్టేయటం. చాలామందికి 60 ఏళ్లు దాటినా కూడా ఈ తరహా స్వేచ్ఛ సాధ్యం కాదు. కొందరు మాత్రం 40లు, 50లలోనే సాధ్యం చేసుకోగలుగుతున్నారు. ఎలా? దీనికి ఏం చేయాలి? ఇదే ఈ వెల్త్‌ స్టోరీ...క్యాంపస్‌లోనో, కాలేజీ నుంచి బయటకు వచ్చాకో మంచి జాబ్‌ కొడితే సెటిలైపోయినట్లేనని భావిస్తారు చాలామంది. ఆదాయాన్ని బట్టి ఖరీదైన ఫోన్లు, కారు, ప్రీమియం హౌస్‌... ఇలా ఖర్చు చేసుకుంటూ వెళుతుంటారు. భవిష్యత్‌ ఆదాయాన్ని కూడా ఈఎంఐల రూపంలో ఇప్పుడే ఖర్చు చేసేస్తుంటారు. వారికప్పుడు రిటైర్మెంట్‌ గుర్తుకే రాదు. కొందరికి గుర్తుకు వచ్చినా ప్రాధాన్యంగా తీసుకోరు. 40 ఏళ్లు దాటాక మెల్లగా ఆలోచించటం మొదలుపెడతారు. అక్కడి నుంచి మరో 15–20 ఏళ్లే ఉండడంతో, ఇక తప్పదులే అనుకుని ఆదాయంలో కొంత పక్కన పెట్టడం ఆరంభిస్తారు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఈ వాయిదానే పెద్ద ప్రతికూలమన్నది చాలా మంది తెలుసుకోరు. 20–30ల నుంచి పెట్టుబడి ఆరంభిస్తేనే అది పెద్ద నిధిగా మారుతుంది. వాస్తవానికి రిటైర్మెంట్‌ ప్రణాళిక ఫెయిలవటానికి ప్రధాన కారణం పెట్టుబడిని ఆలస్యంగా మొదలు పెట్టడమే. త్వరగా మొదలు పెడితే చక్ర వడ్డీ ఫలితంగా (కాంపౌండింగ్‌) అది పెద్ద మొత్తమవుతుందన్నది గుర్తించకపోవటమే.అవగాహన లేమి..ప్రైవేటు రంగంతోపాటు, అసంఘటిత రంగంలోని వారికి సామాజిక భద్రత తక్కువే. ఉద్యోగుల భవిష్యనిధి లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రాబడి 7–8 శాతమే. ఇందులో 6 శాతం ద్రవ్యోల్బణం తీసివేస్తే మిగిలేది ఎంత? కొంత మంది బీమా పాలసీల్లో (ఎండోమెంట్, యులిప్‌) ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఎండోమెంట్‌ ప్లాన్లలో దీర్ఘకాల రాబడి 4–5 శాతం మించదు. యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్లలోనూ (యులిప్‌) రాబడి 8–9 శాతమే. తమకున్న ప్రాపర్టీ ఆదుకుంటుందిలే? అన్నది కూడా అవగాహన లేమే. ఒక్క చిన్న వివాదంతో ప్రాపర్టీ ఏళ్ల కొద్దీ అపరిష్కృతంగా ఉండిపోగలదు.వృద్థాప్యంలో తమ అవసరాలను చూసుకోవడానికి పిల్లలు ఉన్నారుగా? ఇలాంటి ఆలోచనలు.. 60 తర్వాత 20–30 ఏళ్ల ప్రశాంత జీవనానికి సోపానాలు కానే కావు.అత్యాధునిక వైద్య విధానాలతో ఆయుర్దాయం (జీవనకాలం) పెరుగుతోంది. వైద్య వ్యయాలు కూడా ఏటేటా రెండంకెల స్థాయిలో పెరుగుతుండడం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తమే ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షల పొదుపు కరిగిపోవచ్చు. ఇక మనలో కొంత మంది అయితే విశ్రాంత జీవన నిధిని పిల్లల విద్యావసరాలకు ఖర్చు పెట్టేస్తుంటారు. ఇది చేయరాని తప్పు. ఆలస్యం అమృతం విషం..25 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవచ్చు. కానీ సంపద సమకూర్చుకోవడంలో ఎంతో తేడా వస్తుంది. నెలకు రూ.15,000 చొప్పున 25 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 60వ ఏట వరకు 10 శాతం వార్షిక రాబడి (సగటు) వచ్చే ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. 35 ఏళ్లలో రూ.5.14 కోట్లు (రూ.514 లక్షలు) సమకూరుతుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.60 లక్షలే.ఐదేళ్లు ఆలస్యంగా 30వ ఏట నుంచి మొదలు పెట్టి 60 వరకు 30 ఏళ్ల పాటు ఇంతే మేర పొదుపు చేస్తే సమకూరేది రూ.3.12 కోట్లు. ఐదేళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.2 కోట్ల నిధిని కోల్పోయినట్టు అవుతుంది. ఇంకో పదేళ్లు ఆలస్యంగా 40 ఏళ్లలో మొదలు పెడితే.. 20 ఏళ్లలో ఇదే రూ.15,000తో సమకూరేది కోటీ ఎనిమిది లక్షల రూపాయలు. ఎంత కావాలి..?ఒక వ్యక్తికి నేడు నెలవారీ రూ.50,000 ఖర్చు అవుతుంటే.. 25 ఏళ్ల తర్వాత అదే మాదిరి జీవన అవసరాలకు నెలకు రూ.2 లక్షలు అవసరమవుతుంది. ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన అంచనా ఇది. నెలకు రూ.2 లక్షల ఆదాయం రూ.4–5 కోట్ల నిధిపైనే సాధ్యం. మరి రూ.5 కోట్ల నిధిని సమకూర్చుకోవడం మధ్య తరగతి వారికి ఐదు, పదేళ్లలో సాధ్యమేనా..? కనీసం ఇంత అవసరం..ఆర్జన ఆరంభించిన మొదటి నెల నుంచే 20–25 శాతాన్ని రిటైర్మెంట్‌ ఫండ్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ప్రతినెలా సిస్టమ్యాటిక్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏటా ఆదాయ వృద్ధికి సమానంగా రిటైర్మెంట్‌ ఫండ్‌ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రతి నెలా ఇంటి అద్దె, గ్రోసరీ, యుటిలిటీ (బ్రాడ్‌బ్యాండ్, మొబైల్, విద్యుత్‌) కేటాయింపులు ఎలా తప్పనిసరో.. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్‌ నిధి కోసం నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం కూడా అంత అవసరం. లేదంటే ఒక లక్ష్యం కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది.రిటైర్మెంట్‌ నాటికి సమకూర్చుకున్న నిధిని మూడు భాగాలు చేసుకోవాలిస్వల్పకాల అవసరాలు, ఆరోగ్య అత్యవసరాల్లో వెంటనే తీసుకునేందుకు వీలుగా (రెండేళ్ల అవసరాలకు సరిపడా) ఒక భాగం ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం లిక్విడిటీ (వెంటనే నగదుగా మార్చుకునే) ఎక్కువగా ఉండే లిక్విడ్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్, మనీ మార్కెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.3–10 ఏళ్ల అవసరాల కోసం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్, హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఇక పదేళ్లకు మించిన అవసరాల కోసం మరో భాగం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పెట్టుబడుల విషయంలో కొంత రిస్క్‌ తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాల నిధి ద్రవ్యోల్బణాన్ని మించి ఎక్కువగా కాంపౌండ్‌ అవుతుంది.వాస్తవాలు ఇవీ..రిటైర్మెంట్‌ కోసం తాము మరింత ముందు నుంచే ఎందుకు ఇన్వెస్ట్‌ చేయలేదు? అని 50 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మంది ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది.రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగిన వారు 2025 నాటికి 37 శాతమే. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ విషయంలో ప్రణాళికలేమితో ఉన్నట్టు తెలుస్తోంది.తమ పొదుపు నిధి రిటైర్మెంట్‌ తర్వాత పట్టుమని పదేళ్లు అయినా చాలుతుందో, లేదోనని 63 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.పట్టణాల్లో సగం మంది రిటైర్మెంట్‌ కోసం ముందు నుంచే పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. కానీ, 40 శాతం మంది విశ్రాంత జీవనం కోసం అసలు పెట్టుబడే మొదలు పెట్టలేదు.ప్రణాళిక మొదలు పెట్టిన వారిలోనూ కేవలం 37 శాతమే సమకూర్చుకోవాల్సిన నిధిలో పావు శాతం లక్ష్యానికి చేరారు. రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేస్తున్న వారిలో జీవిత బీమానూ పరిగణనలోకి తీసుకుంటున్నవారు 95 శాతంగా ఉన్నారు.అత్యంత ముఖ్యమైన నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) పథకం గురించి 64 శాతం మందికి తెలిసినా.. అందులో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు 16–25 శాతం మించిలేరు.ఇక రిటైర్మెంట్‌ కోసం పక్కన పెడుతున్న వారిలో కూడా జీవించినంత కాలం ఆ నిధి సరిపోతుందన్న నమ్మకంతో ఉన్నవారు 19 శాతం మందే.ఈ ఫలితాలు విశ్రాంత జీవన అవసరాలకు చాలా ముందుగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ

Stock Market Experts Views and Advice to this week3
మార్కెట్లకు టఫ్‌ టెస్ట్‌

ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం 24 న నెలవారీ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ, కీలక మాక్రో డేటా విడుదల, గ్లోబల్‌ ట్రేడ్‌ పరిణామాలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో మార్పులు మార్కెట్‌ దిశను నిర్ధేశించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా టారిఫ్‌ బాదుడు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. ఈవారం మార్కెట్లు అప్రమత్తంగా కదులుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సమీప కాలంలో మార్కెట్లు రేంజ్‌బౌండ్‌ ట్రేడింగ్‌లోనే కొనసాగే అవకాశముందని, గ్లోబల్‌ రిస్క్‌ సెంటిమెంట్, మాక్రో డేటా గణాంకాలు మార్కెట్‌కు ప్రధాన ట్రిగ్గర్లుగా ఉండనున్నాయి. ప్రతి గ్లోబల్‌ న్యూస్, ఎకనామిక్‌ డేటాకు మార్కెట్‌ తక్షణ ప్రతిస్పందన చూపే ‘‘ఈవెంట్డ్రివెన్‌ ట్రేడింగ్ఙ్‌ జరిగే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీతో పెరిగే ఒడిదుడుకులు ఫిబ్రవరి నెలవారీ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ కారణంగా మార్కెట్లలో షార్ట్‌టర్మ్‌ వోలాటిలిటీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ట్రేడర్లు పొజిషన్‌ రోల్‌ఓవర్స్, షార్ట్‌ కవరింగ్, ప్రాఫిట్‌ బుకింగ్‌ వంటి చర్యలకు దిగుతారు. దీంతో సూచీలు అకస్మాత్తుగా పెరగడం ,ఊహించని విధంగా పతనం కావడం సాధారణం. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, హెవీ వెయిట్‌ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశముంది. మాక్రో డేటాపై పెట్టుబడిదారుల ఫోకస్‌ ఈవారం విడుదలయ్యే కీలక ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. జీడీపీ గణాంకాలు, విదేశీ మారక నిల్వలు తదితర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు దేశ ఆర్థిక వృద్ధి జోరు, కార్పొరేట్‌ ఎరి్నంగ్స్‌ ట్రెండ్‌పై స్పష్టత ఇవ్వనున్నాయి. జీడీపీ గణాంకాలు బలంగా ఉంటే మార్కెట్‌కు సపోర్ట్‌ లభించే అవకాశం ఉంది, బలహీన గణాంకాలు వస్తే షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ పెరిగే అవకాశముంది. ట్రంప్‌ టారిఫ్‌ నిర్ణయం గ్లోబల్‌ మార్కెట్లపై ప్రభావం అమెరికా తాజా టారిఫ్‌ నిర్ణయం గ్లోబల్‌ ట్రేడ్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. టారిఫ్‌ల పెంపు ట్రేడ్‌ టెన్షన్‌ను మళ్లీ పెంచే అవకాశముండటంతో ఎమర్జింగ్‌ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. గ్లోబల్‌ సరఫరా వ్యవస్థ, ఎగుమతులపై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూడ్‌ ఆయిల్, అమెరికాఇరాన్‌ పరిణామాలు కీలకం క్రూడ్‌ ఆయిల్‌ ధరల హెచ్చుతగ్గులు భారత మార్కెట్లకు కీలక సూచికగా మారనున్నాయి. అంతర్జాతీయ జియోపాలిటికల్‌ టెన్షన్స్, ముఖ్యంగా అమెరికాఇరాన్‌ సంబంధాల పరిణామాలు ఆయిల్‌ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆయిల్‌ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగి మార్కెట్లపై నెగటివ్‌ ప్రభావం పడే అవకాశముంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, గ్లోబల్‌ లిక్విడిటీపై కన్ను విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాల ధోరణి మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్ణయించే మరో కీలక అంశం. గ్లోబల్‌ వడ్డీ రేట్ల సంకేతాలు, డాలర్‌ బలం, రిస్క్‌ సెంటిమెంట్‌ ఆధారంగా ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడి వ్యూహాలను మార్చే అవకాశం ఉంది. గత వారమిలా..గత వారం(16–20) దేశీ స్టాక్‌ మార్కెట్లు చాలావరకూ సానుకూలంగానే కదిలాయి. దేశీయంగా ఏఐ సదస్సు, యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌పై అంచనాలు తదితర అంశాలు ఇన్వెస్టర్లకు తొలుత జోష్‌నిచ్చాయి. అయితే ఏఐ కారణంగా దేశీ టెక్నాలజీ రంగంలో పెనుమార్పులకు తెరలేవనున్న అంచనాలు సాఫ్ట్‌వేర్‌ సేవల రంగ కౌంటర్లలో భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. ఇది సెంటిమెంటును దెబ్బతీయగా.. గత గురువారం అన్ని రంగాలలోనూ భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. వెరసి గత వారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్వల్ప లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 188 పాయింట్లు(0.25 శాతం) బలపడి 82,815 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) జమ చేసుకుని 25,571 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 0.35 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం నీరసించింది.టెక్నికల్‌గా చూస్తే.. ఈ వారం వారాంతాన(27న) దేశ క్యూ3 జీడీపీ, జనవరి మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. క్యూ2(జూలై–సెపె్టంబర్‌)లో ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇక అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో జీడీపీ 7 శాతం పురోగమించనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేయగా.. ఇతర ఫైనాన్షియల్‌ సంస్థలు 7.4 శాతం వృద్ధిని ఊహిస్తున్నాయి. కాగా.. ఈ వారం యూఎస్‌ ప్రభుత్వ టారిఫ్‌లను ఆ దేశ సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తిరిగి 15 శాతం టారిఫ్‌లను తాజాగా ప్రకటించడంతో అయోమయం నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ వారం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని తెలియజేశారు. → గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాయిని అధిగమించడంలో తడబడింది. అయితే 25,200–24,800 పాయింట్ల వద్ద ఈ వారం మద్దతు కనిపించే వీలుంది. ఈ స్థాయిల నుంచి బలపడి 26,000 పాయింట్లను దాటితే మరింత జోరు చూపే అవకాశముంది. 26,400 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. → బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మొదట 82,200–82,000 పాయింట్ల వద్ద సపోర్ట్‌ తీసుకునే అవకాశముంది. ఇక్కడి నుంచి పురోగమిస్తే 84,000 పాయింట్ల మైలురాయికి చేరుకోవచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత బలపడేందుకు వీలుంది. సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Explanation of Lifestyle inflation refers to the increase in expenditures as your income goes up4
ఖర్చులకు కళ్లెం వేద్దాం!

ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్‌ఫోన్లు, కార్లు, లాప్‌టాప్‌లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్‌మెంట్‌’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్‌టాప్‌లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్‌ సబ్‌స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్‌ స్టోరీ చూడండి...మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్‌స్టయిల్‌ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. ద్రవ్యోల్బణం.. సైలెంట్‌ కిల్లర్‌ ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్‌స్టయిల్‌పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్‌గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. → మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె → కారును అప్‌గ్రేడ్‌ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. → మరింత తరచుగా బయట తినటం, ఫుడ్‌ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. → జిమ్‌తో పాటు అనేక ఓటీటీలు, యాప్‌లు సబ్‌స్క్రయిబ్‌ చెయ్యటం. వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. ‘అవసర ఖర్చుల’ భ్రమ .. అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్‌ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. ఏం చేయాలంటే.. జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. → పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్‌ రూల్‌ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్‌స్టయిల్‌ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. → పొదుపును ఆటోమేట్‌ చేయాలి ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్‌స్టయిల్‌ ఖర్చులు ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. → ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్‌ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్‌గ్రేడ్‌ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. → సబ్‌్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్‌ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది. మూడు కేటగిరీలు.. వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్‌స్టయిల్‌ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేíÙంచి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది. లైఫ్‌స్టయిల్‌ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్‌గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్‌ చేసుకోవడానికి వీలుంటుంది. → బయట హోటళ్లలో తినడం → విహార యాత్రలు → సబ్‌్రస్కిప్షన్లు ∙అప్‌గ్రేడెడ్‌ గ్యాడ్జెట్లు ∙తరచుగా వాహనాలను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ ఉండటంతప్పనిసరైన ఖర్చులు ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. → విద్య → ఆరోగ్య సంరక్షణ → ప్రాథమిక హౌసింగ్‌ → బీమా → నిత్యావసరాలులీకేజీలు అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్‌ కిందికి వస్తాయి. → ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ → క్రెడిట్‌ కార్డ్‌ బాకీలను రోలోవర్‌ చేస్తుండటం. → ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కనీ్వనియెంట్‌గా చేసే వ్యయాలురియాలిటీ చెక్‌ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించి అప్‌గ్రేడ్స్‌ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్‌స్టయిల్‌ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశి్చంతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్‌ సూత్రం ఒకటి ఉంది. → 50%– తప్పనిసరి అవసరాలు → 30% – లైఫ్‌స్టయిల్, కోరికలు → 20% – పొదుపు, పెట్టుబడులు. లైఫ్‌స్టయిల్‌ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్‌గా పడిపోతాయి.

Good news for TCS employees Variable pay climbs to 80pc5
ఆ ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌..

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) పనిచేసే ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. కారణం.. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్ పేను మూడో త్రైమాసికంలో గరిష్ఠంగా 80 శాతం వరకు పెంచింది. దాదాపు రెండేళ్లుగా తక్కువ స్థాయిలో కొనసాగిన చెల్లింపుల తరువాత ఇది గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు.రెండేళ్ల తర్వాత గణనీయమైన పెంపుఇటీవలి కాలంలో మధ్య, సీనియర్ స్థాయి సిబ్బందికి వేరియబుల్ పే 20–50 శాతం మధ్యకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చాలామంది మధ్యస్థాయి ఉద్యోగులు సుమారు 80 శాతం వేరియబుల్ చెల్లింపులు పొందినట్లు సమాచారం. సీనియర్ స్థాయి ఉద్యోగులకు 40–80 శాతం మధ్య చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. ‘మనీ కంట్రోల్‌’ కథనం ప్రకారం.. ఉద్యోగులకు జనవరిలో ఈ మొత్తాలు జమయ్యాయి.కంపెనీ వర్గాల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి పైగా తమ త్రైమాసిక వేరియబుల్ వేతనంలో 100 శాతం అందుతోంది. అయితే, పూర్తి చెల్లింపులు ఎక్కువగా జూనియర్ స్థాయి ఉద్యోగులకే పరిమితమై ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్‌లోనూ బలమైన చెల్లింపులుఇక మరో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) కూడా డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి (Q3FY26) సగటున 85 శాతం పనితీరు బోనస్ చెల్లింపులు విడుదల చేసింది. గత మూడున్నరేళ్లలో ఇది బలమైన వేరియబుల్ పే ఫలితంగా నిలిచింది.ఇదీ చదవండి: కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన

Infinix Note Edge 5G Launched in India with Premium Features at Budget Price6
ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌

చైనా మొబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ తీసుకువచ్చింది.‘ఇన్ఫినిక్స్‌ నోట్‌ ఎడ్జ్‌ 5జీ’ పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999గా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించారు.లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 12 నెలల సాధారణ వారెంటీతో పాటు 12 నెలల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. వన్‌టైమ్‌ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌ లైన్‌ స్టోర్స్‌లో ఈ ఫిబ్రవరి 25నుంచి సేల్‌ అందుబాటులో ఉండనుంది.సిల్క్‌ ఫైబర్‌ ఫినిష్, స్టెల్లర్‌ బ్లూ, లూనార్‌ టైటానియం కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే త్రీడీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఐపీ65 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికెట్, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వెనకవైపు 50 మెగా పిక్సెల్‌ మెయిన్‌ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ లెన్స్‌తో కూడిన డ్యుయల్‌ కెమెరా సెట్‌ అప్‌ ఉంది.ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తోంది. 5జీ, డ్యూయల్‌ 4జీ వీఓఎల్‌ఈటీ కనెక్టివిటీ సపోర్టులున్నాయి. వై–ఫై, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్‌–సీ పోర్ట్, ఐఆర్‌ సెన్సార్‌ ఉన్నాయి. ఇన్‌–డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లున్నాయి.

Advertisement
Advertisement
Advertisement