ప్రధాన వార్తలు
మహీంద్రా సినీలక్స్ ఎడిషన్: 500 కి.మీ రేంజ్!
మహీంద్రా అండ్ మహీంద్రా.. తన XEV 9e కారును స్పెషల్ ఎడిషన్ రూపంలో 'సినీలక్స్' పేరుతో లాంచ్ చేసింది. ప్యాక్ త్రీ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైన ఈ మోడల్ ధర రూ. 29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XEV 9e సినీలక్స్ స్పెషల్ ఎడిషన్ కోసం కంపెనీ మార్చి 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు మార్చి 10న మొదలవుతాయి. శాటిన్ బ్లాక్ & శాటిన్ వైట్ రంగుల్లో లభించే ఈ కారు.. రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా & ఆటో పార్క్ అసిస్ట్తో ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.సినీలక్స్ ఎడిషన్ 79 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది, ఇది గరిష్టంగా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ను అందిస్తుంది. ఇది 282 బీహెచ్పీ & 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. కాబట్టి పనితీరు కూడా బాగుంటుందని సమాచారం.
ఊహకందని స్థాయికి చేరిన బంగారం ధర!
బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రూ. 1,59,280 వద్ద ఉన్న గోల్డ్ రేటు (ఫిబ్రవరి 28) శనివారం నాటికి రూ. 1,68,710 వద్దకు చేరింది. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. వారం రోజుల్లో రూ. 1,59,280 నుంచి రూ. 1,68,710 వద్దకు (రూ.9430 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 1,46,000 నుంచి రూ. 1,54,650 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 8650 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ రోజు (మార్చి 1) ధరలు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 1,73,080 వద్దకు చేరాయి.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. ఫిబ్రవరి 22న రూ.1,60,150 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9490 పెరిగి.. ఫిబ్రవరి 28 నాటికి 1,69,640 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 10 గ్రాములు 1,46,800 రూపాయల నుంచి రూ. 1,55,500 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో 8700 రూపాయలు పెరిగిందన్నమాట.ఫిబ్రవరి 22న 1,59,430 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర ఫిబ్రవరి 28నాటికి రూ. 9430 పెరిగి.. 1,68,860 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,46,150 రూపాయల దగ్గర నుంచి రూ. 1,54,800 వద్దకు చేరింది. వారం రోజుల్లో రూ. 8650 పెరిగింది.
అదానీ గ్రీన్ ఎనర్జీకి నార్జెస్ బ్యాంక్ గుడ్బై!
తమ పోర్ట్ఫోలియో నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్)ను తప్పించనున్నట్లు నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ నార్జెస్ బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో షేర్లను విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇలాంటి ఆరోపణలతోనే 2024 మే నెలలోనూ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లను వదిలించుకుంది.నార్జెస్ బ్యాంక్ 2020 జూలైలో తొలిసారి ఏజీఈఎల్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 341 ధరలో వీటిని సొంతం చేసుకోగా.. ప్రస్తుతం షేరు రూ. 944 వద్ద కదులుతోంది. కాగా.. గతంలోనూ నార్వేజియన్ వెల్త్ ఫండ్ వివిధ కారణాలతో దేశీ బ్లూచిప్స్ ఐటీసీ, ఎల్అండ్టీ, ఎన్హెచ్పీసీ, ఎన్టీపీసీ, వేదాంతాలను పోర్ట్ఫోలియో నుంచి తప్పించింది.మార్కెట్ గణాంకాల ప్రకారం 2025 ప్రారంభంనుంచి నార్జెస్ బ్యాంక్ 4.39 కోట్ల డాలర్ల విలువైన ఏజీఈఎల్ షేర్లను విక్రయించగా.. దేశీ మ్యూచువల్ ఫండ్స్ 50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.కియోసాకి తన ట్వీట్లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.ఇదే ట్వీట్లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ హయాంలో మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.తర్వాత చేసిన మరో ట్వీట్లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఓమర్, గవర్నర్ టిమ్ వాల్జ్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్ పీటర్సన్ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.WAR!!!! Whst is it good for?Ironically I was landing in Hanoi when the war against Iran started .If truth be told we all know the war against Iran is a war financed by American Jews and Christians against Muslims for oil and to protect Israel.Vietnam was a war of Christians…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 28, 2026
జియో ఫైనాన్షియల్ యాప్లో వినూత్న ఫీచర్లు
ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్ను మార్కెట్ప్లేస్ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్ స్కోర్ మొదలైనవి కూడా ఇవ్వనుంది.ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్లో జోడిస్తున్నట్లు జేఎఫ్ఎస్ ఎండీ హితేష్ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్ సిఫార్సు చేస్తుంది.దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
దారుణంగా పెరిగిన బంగారం ధరలు.. వార్ ఎఫెక్ట్!
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజూ దారుణంగా పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండివైపు మళ్లడంతో డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు కాస్త పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
కార్పొరేట్
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
ట్రావెల్కి హోలీ జోష్
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
టీసీఎస్ కోడ్విటా ఛాంపియన్ 2026 విజేతలు
యస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్
ఐపీఓ రివర్స్ గేర్!
ఘనంగా జాతీయ ఆరోగ్య మేళా 2026 ప్రారంభం
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్
ఏసీ ధరలు అప్! కారణం ఇదే..
ఐఆర్ఎఫ్సీ వాటా ఆఫర్.. స్పందించని ఇన్వెస్టర్స్
ఒక్కసారిగా ఇంత రేటా.. భారీగా ఎగిసిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి....
బ్యాంకుల షేర్లు విలవిల.. స్టాక్ మార్కెట్ భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీతా పతనమయ్య...
బాబోయ్ బంగారం.. ఊహించని రేటుకు గోల్డ్!
బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పసిడి ప్రియులకు జేప...
విచిత్రంగా బంగారం ధరలు..
దేశంలో పుత్తడి ధరలు (Today Gold Rate) ఎప్పటికప్పడు...
విమాన ప్రయాణికులకు ఊరట
విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జ...
ఆర్బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్!
భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరు...
అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు...
సెమీకండక్టర్లకు దశాబ్దాలపాటు మద్దతు
సంపన్న దేశాల తరహాలోనే వచ్చే 20–25 ఏళ్ల పాటు సెమీకం...
ఆటోమొబైల్
టెక్నాలజీ
దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్లో ఉద్యోగాలు
జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.ఏమిటీ ‘టెంపుల్’?ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్ టైమ్లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.ఫిట్నెస్కు ప్రాధాన్యం‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు.We're recruiting at @temple.At Temple, we are building the ultimate wearable for elite performance athletes. A device that measures what no other wearable in the world measures, with a level of precision that doesn't exist yet.To build it, we need people who are obsessive… pic.twitter.com/iCHaMUwdEw— Deepinder Goyal (@deepigoyal) February 27, 2026
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్: ధరలు ఇలా
దక్షిణ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎస్26, ఎస్26ప్లస్, ఎస్ 26 అల్ట్రా అని మూడు వేరియంట్స్ ఉంటాయి. శాంసంగ్ పోర్టల్ ప్రకారం వేరియంట్ని బట్టి ధర రూ. 87,999 నుంచి రూ. 1,89,999 (అల్ట్రా) వరకు ఉంటుంది. ప్రీఆర్డర్ చేసే వారికి రూ. 20,000 వరకు విలువ చేసే ప్రయోజనాలు లభిస్తాయి.ఈ సిరీస్లోని అల్ట్రా వేరియంట్లో పరిశ్రమలోనే తొలిసారిగా ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ ఉంది. స్క్రీన్ మీద ఉన్న కంటెంట్ పక్క వారికి కనిపించకుండా కేవలం యూజరుకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ని మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు ప్రైవసీని కాపాడుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అరగంటలోనే 75 శాతం చార్జ్ అయ్యేలా సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 3.0, 50 ఎంపీ, అల్ట్రా వైడ్ కెమెరా, 200 ఎంపీ వైడ్ కెమెరా, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనికి ముందు సిరీస్ తరహాలోనే ఈ ఫోన్లను కూడా భారత్లోని నోయిడా ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు శాంసంగ్ తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల, బెంగళూరులోని తమ ఆర్అండ్డీ సెంటర్ వీటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ఈ సిరీస్తో దేశీయంగా యాపిల్ నుంచి పోటీ నెలకొన్న 800 డాలర్ల ఎగువ ధర పలికే సూపర్ ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ తన స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సైబర్ భద్రతలో రాజీ లేదు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మెసేజింగ్ యాప్లకు సంబంధించి ప్రతిపాదించిన ‘సిమ్ బైండింగ్’ నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండబోదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ముఖ్యంగా వెబ్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్ఫామ్లకు విధించిన 6 గంటల ఆటోమేటిక్ లాగ్-అవుట్ నిబంధనను సడలించబోమని తేల్చి చెప్పారు.ఏమిటీ సిమ్ బైండింగ్? వినియోగదారులపై ప్రభావం?టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్-2024 ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్.. మెసేజింగ్ యాప్లు ఇకపై వినియోగదారుడి ఫోన్లోని యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఫోన్ నుంచి ఒరిజినల్ సిమ్ కార్డును తొలగించినా లేదా అది డీయాక్టివేట్ అయినా ఆ పరికరంలో మెసేజింగ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయి. ల్యాప్టాప్ లేదా పీసీల్లో వాడే వెబ్ వెర్షన్లు ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగ్-అవుట్ అవుతాయి. వినియోగదారులు క్యూఆర్ కోడ్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను పాటించడానికి ఇచ్చిన 90 రోజుల గడువు ఫిబ్రవరి 28, 2026తో ముగియనుంది. దీన్ని పొడిగించే ఆలోచన లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) స్పష్టం చేసింది. ‘జాతీయ భద్రతే మాకు ముఖ్యం. మోసాలను నివారించడానికి సిమ్ బైండింగ్ తప్పనిసరి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని సింధియా పేర్కొన్నారు.ఏజీఆర్, స్పెక్ట్రమ్ వేలంటెలికాం ఆపరేటర్లు కోరుతున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) ఉపశమనంపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వొడాఫోన్ ఐడియా తరహాలో ఏజీఆర్ ఉపశమనం కోరే ఏ సంస్థ అయినా న్యాయపరమైన మార్గాలనే అనుసరించాలని సూచించారు. మరోవైపు, తదుపరి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్ సిఫార్సులను సమర్పించిందన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే వేలం కాలక్రమాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.శాటిలైట్ ఇంటర్నెట్: స్టార్లింక్కు షరతులుభారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ఇంకా అవసరమైన భద్రతా డెమోలను పూర్తి చేయలేదని మంత్రి తెలిపారు. భారత సరిహద్దుల వెలుపల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే సామర్థ్యం, నెట్వర్క్పై పూర్తి స్థాయి భద్రతా నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని వివరించారు.ఇదీ చదవండి: విమాన ప్రయాణికులకు ఊరట
ఏఐతో మరిన్ని అవకాశాలు
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.
పర్సనల్ ఫైనాన్స్
కొంచెం రిస్క్ ఉన్నా.. లాభం రావాలంటే?
ఈక్విటీలలో థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ అన్నవి కొంచెం రిస్క్ ఉన్నా సరే, రాబడులు కూడా బలంగా ఉండాలని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇవి తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్ మాత్రం భిన్నమైన, మెరుగైన పనితీరుతో ఆకర్షిస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని వైవిధ్యం కోసం కేటాయించుకోవాలని భావించేట్టు అయితే.. ఈ ఫండ్ను పరిశీలించొచ్చు.రాబడులుఈ పథకం 2021 జనవరిలో ప్రారంభమై.. ఐదేళ్ల ట్రాక్ రికార్డును పూర్తి చేసింది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే అది రూ.2.51లక్షలుగా మారి ఉండేది. ఐదేళ్లలోనూ ఏటా 20.56 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ 500 టీఆర్ఐ రాబడి 15.47 శాతమే ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో పెట్టుబడులపై 18 శాతం రాబడిని అందించింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడి 22.82 శాతంగా ఉంది. ఇక ఇదే విభాగంలో ఇతర పథకాలతో పోలి్చతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్ ట్రాక్ రికార్డు పటిష్టంగా ఉంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6.10 లక్షలు ఐదేళ్లలో రూ.9.74 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 18.47 కాంపౌండెడ్ రాబడి (సీఏజీఆర్)కి సమానం.పెట్టుబడుల విధానం..బిజినెస్ సైకిల్స్ అంటే.. కొన్ని వ్యాపారాలకు ఒక్కో సమయంలో డిమాండ్ బలంగా ఉంటుంది. ప్రస్తుతం మెటల్స్లో బంగారం, వెండి, అల్యూమినియం, రాగి ధరలు గణనీయంగా పెరగడం, ఈ రంగాల్లోని కంపెనీలు బలంగా లాభాలు ఆర్జించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సైకిల్స్ను ఈ ఫండ్ ముందే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. స్థూల ఆర్థిక పరిస్థితులకు (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వృద్ధి గమనం, ద్రవ్య పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు) అనుగుణంగా ప్రయోజనం పొందే రంగాలను, థీమ్యాటిక్ అవకాశాలను ముందే గుర్తించి, ఆయా రంగాల్లోని బలమైన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. పరిస్థితులకు అనుగుణంగా విదేశీ స్టాక్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,808 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97.88 శాతం మేర ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.75 శాతం, నగదు రూపంలో 1.37 శాతం కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను గమనించగా.. లార్జ్క్యాప్స్ కంపెనీల్లో 73.54 శాతం, మిడ్క్యాప్ కంపెనీల్లో 9.6 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 5.51 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో మొత్తం 84 స్టాక్స్ ఉన్నాయి. రంగాల వారీ కేటాయింపులను పరిశీలిస్తే.. అత్యధికంగా 32.28 శాతం మేర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్స్ కంపెనీల్లో 17.52 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీల్లో 12.90 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది.
రూ.7 కోట్ల ఫ్రాడ్లో ఇరుక్కున్న ఇంజినీరింగ్ విద్యార్థి
స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోందిబెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్తో పాటు ఎయిర్టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్లో ధ్రువీకరించాడు కూడా.అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఓ హెచ్చరికే!స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్ ద్వారా అడగవు."తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్లే!స్ట్రాంగ్ పాస్వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.అన్నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.ఖాతా స్టేట్మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.
మ్యూచువల్ ఫండ్స్.. ‘న్యూ ఆఫర్స్’..
ఎల్ఐసీ ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా టెక్నాలజీ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫాంలు, ఇంటర్నెట్ బిజినెస్లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి బీఎస్ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్ దోషి, జైప్రకాశ్ తోషి్నవాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘బరోడా బీఎన్పీ’ ఈఎస్జీ స్ట్రాటజీ ఫండ్ పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ తాజాగా ఈఎస్జీ బెస్ట్–ఇన్–క్లాస్ స్ట్రాటెజీ ఫండ్ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్జీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్ కంపెనీలు ఇచ్చే ఈఎస్జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్జీ టీఆర్ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్ గ్రోవర్ తెలిపారు. బజాజ్ లైఫ్ బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ జీవిత బీమా సంస్థ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలైన (యులిప్స్) బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, బజాజ్ లైఫ్ సుప్రీం, బజాజ్ లైఫ్ గెయిన్లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.వెల్త్ కంపెనీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ ..తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి క్రిసిల్ హైబ్రిడ్ 50+50 మోడరేట్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది.
ప్రభుత్వ సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు?
భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.మోసం బయట పడిందిలా..ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్బీఐ, ఎస్బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్లో పీఎస్యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్షిప్లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్తో ఆకర్షిస్తాయి.మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్బీఐ లిక్విడిటీ మేనేజ్మెంట్, సీఆర్ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.ఐడీఎఫ్సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్లను పరిశీలించాలి. ఆర్బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం.


