ప్రధాన వార్తలు
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన మెరుగుపడినప్పటికీ పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఇంకాస్త అప్రమత్తత అవసరమని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కాంతార్తో కలిసి నిర్వహించిన ఐదో ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐరిస్ 5.0)’ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాదిలో రిటైర్మెంట్ ఇండెక్స్ 2022లో 43 పాయింట్లు ఉండగా 2025 నాటికి అది స్వల్పంగా మారి 45కు చేరింది. అయితే జాతీయ సగటు (44 నుంచి 48కి)తో పోలిస్తే ఈ వృద్ధి నెమ్మదిగానే ఉంది.నివేదికలోని అంశాలు..దక్షిణాది ప్రజలు తమ ఫిట్నెస్పై మునుపటి కంటే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య 37% నుంచి 44%కి పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ.ఆరోగ్య ధీమా: సుమారు 80 శాతం మంది తాము పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.డిజిటల్ హెల్త్: వెల్నెస్ యాప్లను ఉపయోగించడంలో దక్షిణాది వాసులు (18%) జాతీయ సగటు (15%) కంటే ముందున్నారు.బీమా: హెల్త్ చెకప్ల పట్ల ఆసక్తి పెరిగినప్పటికీ ఆరోగ్య బీమా వినియోగం మాత్రం 44% వద్దే నిలిచిపోయింది. ఇది జాతీయ సగటు (50%) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.10 ఏళ్లకే నిధులు ఖాళీ?పదవీ విరమణ ప్రణాళిక అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని 54% మంది భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనుకబడి ఉన్నారు.దేశవ్యాప్తంగా 67% మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెడుతుంటే దక్షిణాదిలో అది కేవలం 61% మాత్రమే ఉంది.రిస్క్ ఉన్నా అధిక లాభాలనిచ్చే ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడులు కేవలం 33% మాత్రమే ఉండగా, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పద్ధతులపైనే (58%) ఎక్కువగా ఆధారపడుతున్నారు.తమ పొదుపు మొత్తాలు రిటైర్మెంట్ తర్వాత పదేళ్లకు మించి రావని 27% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆస్తులు (39%), ఇతర తక్షణ ఖర్చుల (33%) కారణంగా పదవీ విరమణ పొదుపుపై దృష్టి పెట్టలేకపోతున్నామని సర్వేలో తేలింది.ఒంటరితనం దూరంఆర్థికంగా వెనుకబడటం మినహాయిస్తే కుటుంబ మద్దతు విషయంలో దక్షిణాది వాసులు ధైర్యంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులు అండగా ఉంటారనే నమ్మకం 57 శాతానికి పెరిగింది. గతంలో 75 శాతంగా ఉన్న ఒంటరితనపు భయంతో ఉండేవారు. ప్రస్తుతం ఇది 68 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం.‘ఆరోగ్యం, వెల్నెస్ పట్ల అవగాహన పెరగడం శుభపరిణామం. అయితే ఆలోచనలకు ఆచరణ తోడైనప్పుడే పూర్తిస్థాయి పదవీ విరమణ భద్రత లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికల్లో ఉన్న ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది’ అని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ తల్వార్ అన్నారు. దక్షిణాదిలో ప్రజలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా మారుతున్నప్పటికీ ఆర్థికంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మదుపు చేయడం ద్వారానే సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
లోన్ కావాలా? ఇవి తెలియకపోతే ఇబ్బందే!
ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు, కారు కొనుగోలు లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం రుణం తీసుకోవడం సర్వసాధారణం. అయితే, అవసరం కదా అని ఏ ఆర్థిక సంస్థ కనిపిస్తే అందులో అప్పు చేయడం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే, ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలను పాఠకుల కోసం అందిస్తున్నాం.క్రెడిట్ స్కోరురుణం మంజూరు చేయడంలో క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరు ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి. దరఖాస్తుకు ముందే మీ స్కోరును సరిచూసుకోండి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపరుచుకున్నాకే లోన్కు వెళ్లడం ఉత్తమం.ఎలాంటి వడ్డీ రేటో ముందే తెలుసుకోండి..వడ్డీ రేట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్థిర వడ్డీ. ఇందులో రుణ కాలపరిమితి మొత్తం వడ్డీ మారదు. రెండోది ఫ్లోటింగ్ రేటు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు మార్పులకు అనుగుణంగా వడ్డీ మారుతుంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీకు ఏది లాభదాయకమో నిర్ణయించుకోండి.తిరిగి చెల్లించే సామర్థ్యంనెలవారీ ఆదాయంలో 40% నుంచి 50% మించి అన్ని లోన్ల ఈఎంఐలు ఉండకుండా చూసుకోవాలి. లోన్ తీసుకునే ముందే ఆన్లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీరు ఎంత చెల్లించగలరో లెక్కవేసుకోండి.ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలుకేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు.. లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, జీఎస్టీ వంటి వాటిపై కూడా కన్నేయాలి. ఒక్కోసారి తక్కువ వడ్డీ అని చెప్పి ఇతర ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసే అవకాశం ఉంది.లోన్ కాలపరిమితికాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది కానీ, మీరు చెల్లించే మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి, మీ ఆర్థిక స్థితిని బట్టి సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం తెలివైన పని.ముందస్తు చెల్లింపు నిబంధనలుమీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు లోన్ మొత్తాన్ని ముందే కట్టేయాలని అనుకుంటే బ్యాంకులు ఏమైనా పెనాల్టీలు విధిస్తున్నాయో అడగండి. ముఖ్యంగా పర్సనల్ లోన్ల విషయంలో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి.ఇతర నిబంధనలులోన్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు ‘ఫైన్ ప్రింట్’ (లోసుగులతో కూడిన ఇతర నిబంధనలు) చదవండి. బీమా తీసుకోవాలనే నిబంధన లేదా సర్వీస్ ఛార్జీల పెంపు వంటి అంశాలు అందులో ఉండవచ్చు.ఇతర బ్యాంకుల ధరలతో పోలికఒక్క బ్యాంక్తోనే ఆగిపోకుండా కనీసం 3-4 ఆర్థిక సంస్థల ఆఫర్లను పోల్చి చూడండి. ప్రస్తుతం అనేక వెబ్సైట్లు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను ఒకే చోట పోల్చి చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.లోన్ ఇన్సూరెన్స్దురదృష్టవశాత్తూ రుణగ్రహీతకు ఏదైనా జరిగితే, ఆ అప్పు కుటుంబ సభ్యులపై భారం కాకుండా ఉండేందుకు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇది తప్పనిసరి కాకపోయినా భద్రత దృష్ట్యా ఆలోచించదగ్గ విషయం.బ్యాంక్ విశ్వసనీయత, సేవలుకేవలం తక్కువ వడ్డీ ఇస్తున్నారని తెలియని యాప్ల ద్వారా లేదా గుర్తింపు లేని సంస్థల ద్వారా రుణాలు తీసుకోవద్దు. ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలను మాత్రమే ఎంచుకోండి. అలాగే వారి కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి.రుణం అనేది అవసరానికి ఆసరా కావాలి కానీ, అది మీ ప్రశాంతతను దూరం చేసే భారం కాకూడదు. పైన పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం ఇంధనాలతో పాటు వాణిజ్య ఎల్పీజీ, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ షాక్ ఇచ్చింది.ప్రీమియం ఇంధనాలకు ధరల సెగలగ్జరీ కార్లు, సూపర్ బైక్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పీ100 (100-ఆక్టేన్ పెట్రోల్) ధర ఢిల్లీలో లీటరుకు ఏకంగా రూ.11 పెరిగింది. దాంతో రూ.149 నుంచి రూ.160 కు చేరింది. ఎక్స్ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) రూ.91.49 నుంచి రూ.92.99 కు పెంచింది. రెండు వారాల క్రితమే హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను రూ.101.89 కు సవరించగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా అదే బాటలో పయనించింది.రూ.2,000 దాటిన వాణిజ్య సిలిండర్ ధరవ్యాపారస్తులు, హోటళ్లు, క్యాటరింగ్ రంగంపై కమర్షియల్ ఎల్పీజీ భారం పడింది. జనవరి 1, 2026 నుంచి ఇది ఇటీవలి పెంపుతో ఐదోసార్లు ధరలు పెంచినట్లయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర (ఏప్రిల్ 1) రూ.2,078.50 (19 కిలోల సిలిండర్)గా ఉంది. మార్చి 1 నాటి ధర రూ.1,768.50. గత నెల రోజుల్లోనే రూ.310 మేర భారం పడింది.ఏటీఎఫ్ రూ.2 లక్షలువిమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ధర రూ.2,07,341.22 (కిలోలీటరుకు). గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గరిష్టంగా రూ.1.1 లక్షలు ఉన్న ధర, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని రికార్డులను తుడిచివేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భారాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఊరటప్రీమియం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సాధారణ వాహనదారులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ధరల సెగ తగలకుండా చూసేందుకు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల చమురు కంపెనీలకు కలిగే భారీ నష్టాలను భర్తీ చేయడంతో పాటు రిటైల్ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
1850 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 567 పాయింట్లు పెరిగి 22,901 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1874 పాయింట్లు ఎగబాకి 73,833 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.19 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.91 శాతం పెరిగింది.నాస్డాక్ 3.83 శాతం పుంజుకుంది.Today Nifty position 01-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిణామాలు కేవలం పెట్రోల్ ధరలనో, స్టాక్ మార్కెట్లనో ప్రభావితం చేస్తాయని భావిస్తే పొరపాటే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర పోరు ఇప్పుడు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా దేశంలోని కండోమ్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతీయ రబ్బరు పరిశ్రమ వర్గాల తాజా సమాచారం ప్రకారం, కండోమ్ల తయారీ వ్యయం గణనీయంగా పెరగడమే కాకుండా సరఫరా గొలుసు పూర్తిగా అస్తవ్యస్తమైంది.ఏమిటీ సమస్య?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీదారులలో ఒకటి. అయితే, ఈ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా ఇప్పుడు యుద్ధం కారణంగా సంక్షోభంలో పడింది. కండోమ్ తయారీలో వాడే సింథటిక్ రబ్బరు, ఇతర పెట్రోకెమికల్ అనుబంధ పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఎందుకు ఈ అంతరాయం?కండోమ్ల తయారీలో వాడే పాలిమర్లు, సింథటిక్ రబ్బరు, లూబ్రికెంట్లు ముడి చమురు ఉప ఉత్పత్తులు. యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర పెరగడంతో వీటి తయారీ వ్యయం 30% నుంచి 40% వరకు పెరిగింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే రసాయనాలు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉత్పత్తి కేంద్రాల్లో ముడి పదార్థాల కొరత ఏర్పడింది. ఎర్ర సముద్రం ప్రాంతంలో అస్థిరత వల్ల నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో రావాల్సి వస్తోంది. దీనివల్ల ఫ్రైట్ ఛార్జీలు పెరగడంతోపాటు డెలివరీ సమయం 20 రోజుల నుంచి 40 రోజులకు పెరిగింది.ఎవరు ప్రభావితమవుతున్నారు?దేశంలోని దిగ్గజ కండోమ్ తయారీ సంస్థలు పెరిగిన ఖర్చులను భరించలేక ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను 10% నుంచి 20% వరకు పెంచే యోచనలో ఉన్నాయి. భారత్ నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు జరిగే కండోమ్ ఎగుమతులు మందగించాయి. ఇది దేశీయ విదేశీ మారక నిల్వలపై కూడా ప్రభావం చూపుతుంది. ఉచితంగా పంపిణీ చేసే గర్భనిరోధక సాధనాల కోసం ప్రభుత్వం వెచ్చించే బడ్జెట్ భారం పెరగనుంది.ఎక్కడ ప్రభావం ఎక్కువగా ఉంది?భారతదేశంలో రబ్బరు ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని తయారీ యూనిట్లు ఈ ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సింథటిక్ రబ్బరు కోసం మనం సుమారు 48% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.ఎంత మేర నష్టం?గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల రబ్బరు రసాయనాల దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం, పెరిగిన లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంల వల్ల ఒక్కో కంటైనర్ రవాణా ఖర్చు రెట్టింపు అయ్యింది.ముందున్న సవాళ్లుయుద్ధం మరికొంత కాలం కొనసాగితే కేవలం కండోమ్లే కాకుండా గ్లౌజులు, క్యాథెటర్లు వంటి వైద్య పరికరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారనున్నాయి. గ్లోబల్ సప్లై చైన్ ఎంతటి సున్నితమైనదో ఈ పరిస్థితి అర్థం చేస్తోంది. ఇంధన భద్రతతో పాటు రసాయన ముడి పదార్థాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత
కార్పొరేట్
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
భారత్లో ఒరాకిల్ 12,000 మందికి ఉద్వాసన
మొబైల్స్, ఏసీ రేట్లకు రెక్కలు
కొచ్చి చేరుకున్న నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత!
ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్
పిల్లల భోజనానికి వాఘ్ బక్రీ చేయూత
త్వరలోనే జియో లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ‘ఏటీ-1 బాండ్ల’ సంక్షోభం
4 లక్షల చాక్లెట్లు ట్రక్కుతో సహా మాయం
ఐపీఓకు ఆరు కంపెనీలు
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మా...
'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ ...
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెర...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార...
డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ఊతం..
దేశీయంగా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఏకీకృత చె...
వడ్డీ రూ.50,000 మించితే టీడీఎస్
బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను...
పశ్చిమాసియా యుద్ధం మరింత కాలం కొనసాగితే?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు ఇలాగే ...
రూ.84,582 కోట్ల లిక్విడిటీని విడుదల చేసిన ఆర్బీఐ
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిట...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వ్యూహాత్మక ఖనిజాల వేట
సాంకేతిక, రక్షణ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. దేశీయంగా ‘రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల’ (అరుదైన అయస్కాంత ఖనిజాలు) ఉత్పత్తిని భారీగా పెంచడమే కాకుండా లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి ఏడాదికి 5,000 టన్నుల అరుదైన అయస్కాంత ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు.విశాఖలో ప్లాంట్ ప్రారంభంఅణుశక్తి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో ‘సమారియం-కోబాల్ట్’ అయస్కాంతాల తయారీ ప్లాంట్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. దీని ప్రస్తుత సామర్థ్యం ఏడాదికి 500 టన్నులు. తదుపరి దశలో దీన్ని 2,000 టన్నులకు, ఆపై 2030 నాటికి 5,000 టన్నులకు పెంచనున్నారు. నియోడైమియం-ఐరన్-బోరాన్ వంటి అధునాతన అయస్కాంతాల తయారీపై పైలట్ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం చేపట్టింది.పెరుగుతున్న డిమాండ్.. ప్రైవేటు భాగస్వామ్యంప్రస్తుతం దేశంలో ఈ అయస్కాంతాల అవసరం ఏడాదికి 4,000 టన్నులుగా ఉండగా 2030 నాటికి అది 8,000 టన్నులకు చేరుతుందని అంచనా. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అణుశక్తి చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. తద్వారా కీలక ఖనిజాల అన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపింది. అయితే, యురేనియం వంటి వ్యూహాత్మక వనరులపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది.లిథియం అన్వేషణపై దృష్టిఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన నిల్వలకు అత్యంత కీలకమైన లిథియం కోసం రాజస్థాన్లోని దేగానా, జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాల్లో ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. దేగానాలో ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయని త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్ల’ను ఏర్పాటు చేయడం ద్వారా ఖనిజ శుద్ధి ప్రక్రియను బలోపేతం చేయనున్నారు.వీటిని ఎందుకు ఉపయోగిస్తారు?ఈ అరుదైన ఖనిజాలు కేవలం ఎలక్ట్రానిక్స్ కోసమే కాకుండా.. రక్షణ రంగంలో క్షిపణులు, రాడార్ల తయారీలో, అంతరిక్ష రంగంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో, గ్రీన్ ఎనర్జీ విభాగంలో విండ్ టర్బైన్లు, ఈవీ మోటార్లలో ఇవి అత్యంత కీలకం. రాజస్థాన్, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో శిలల రూపంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలికితీయడం కొంత సంక్లిష్టమైనప్పటికీ అధునాతన సాంకేతికతతో ఈ సవాలును అధిగమిస్తామని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!
ఏప్రిల్ నుంచి ఇక ఉద్యోగాల జాతరే..
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి అర్ధభాగంలో ఉపాధి ఊపందుకోనున్నట్లు టీమ్లీజ్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ నివేదిక పేర్కొంది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో ఉద్యోగాలు 4.7 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఈకామర్స్, టెక్ స్టార్టప్స్, హెల్త్కేర్, ఫార్మా, తయారీ(మ్యాన్యుఫాక్చరింగ్) రంగాలు ఊతమివ్వనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో టీమ్లీజ్ తెలియజేసింది.భారీ ఎంటర్ప్రైజెస్లో ఉపాధి కల్పన కనిపించనున్నట్లు తెలియజేసింది. వీటిలో 74 సంస్థలు విస్తరణ చేపట్టే సంకేతాలిచ్చినట్లు పేర్కొంది. మధ్యస్థాయి సంస్థలు 57 శాతం, చిన్న బిజినెస్లు 38 శాతం విస్తరణ యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. వెరసి విస్తరణ ద్వారా ఉపాధి కల్పన విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇటు డిజిటల్, అటు కీలక ఆర్థికవ్యవస్థ సంబంధిత పరిశ్రమల నుంచి ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఎకానమీ వృద్ధికి కీలకంగా నిలిచే రంగాలలో విద్యుత్, స్టీల్, చమురు గ్యాస్, సిమెంట్, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టులు తదితరాలున్నాయి. 8.9 శాతం ఎన్ఈసీ అత్యధికంగా ఈకామర్స్, టెక్ స్టార్టప్లు 8.9 శాతం నికర ఎంప్లాయ్మెంట్ చేంజ్(ఎన్ఈసీ)కు కారణంకానున్నట్లు టీమ్లీజ్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఫార్మాస్యూటికల్స్ 7 శాతం, తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాలు 6.6 శాతం ఎన్ఈసీ సాధించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో 4.7 శాతం ఎన్ఈసీ నమోదుకానున్నట్లు అభిప్రాయపడింది. నివేదికను 20 నగరాల నుంచి 23 రంగాలకు చెందిన 1,268 సంస్థల(ఎంప్లాయర్స్) అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా రూపొందించింది.ఇందుకు 2025 నవంబర్ నుంచి 2026 జనవరి కాలంలో సర్వే చేపట్టింది. దేశీయంగా మానవవనరుల పరిస్థితులు సైక్లికల్ డిమాండ్ను అనుసరించడంకాకుండా వ్యవస్థాగత, విధానపరమైన అంశాల ఆధారంగా మా ర్పులకు లోనవుతున్నట్లు వివరించింది. కాగా.. శ్రామిక చట్టాల అమలు కారణంగా ఉద్యోగ వ్య యాలు 80% పెరగనున్నట్లు 64 సంస్థలు తెలియజేశాయని, వేతన వ్యవస్థను పునర్నిర్వచించడం ప్రభావం చూపనున్నట్లు టీమ్లీజ్ సర్వీసెస్ వైస్ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు.
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన
సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్లో రిమోట్గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం జీతం కాదు.. అతను పనిచేసే విధానం!రోహన్ ధావన్ అనే ఎంట్రాప్రెన్యూర్ తన మేనల్లుడి గురించి లింక్డ్ఇన్ (LinkedIn)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువ డెవలపర్ రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే లాప్టాప్ తెరిచి పనిచేస్తాడట. పని ముగియగానే దర్జాగా లాగ్-ఆఫ్ అవుతాడు. మిగిలిన రోజంతా ఖాళీగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు సంతోషపడాల్సింది పోయి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు."వీడు అసలు పనేం చేయడం లేదు.. ఇంత జీతం ఇస్తున్నారంటే ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడా?" అని ఆ తండ్రి తన ఆందోళనను ధావన్తో పంచుకున్నారు.కష్టపడటం అంటే గంటలు గడపడమేనా?సాధారణంగా భారతీయ మధ్యతరగతి ఇళ్లలో ఒక వ్యక్తి రోజుకు 10-12 గంటలు ఆఫీసులో కష్టపడితేనే అదే 'నిజమైన పని' అని నమ్ముతారు. "అలసటను ఒక గౌరవ చిహ్నంగా, పని సులభంగా అవ్వడాన్ని అనుమానంగా చూసే మనస్తత్వం మన సమాజంలో ఉంది" అని ధావన్ తన పోస్ట్లో విశ్లేషించారు. ఒకవేళ అదే అబ్బాయి తక్కువ జీతానికి టీసీఎస్ (TCS) లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పగలూరాత్రి కష్టపడితే, ఆ తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేవారని ఆయన పేర్కొన్నారు.పని తీరును మార్చిన ఏఐ2026 నాటి ఆధునిక పని వాతావరణంలో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో 8 గంటలు పట్టే పనిని, సరైన ఏఐ టూల్స్ వాడి 3 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రిమోట్ ఉద్యోగాల్లో మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారనే దానికంటే, ఎంత నాణ్యమైన పనిని డెలివరీ చేశారన్నదే ముఖ్యం. టెక్నాలజీపై పట్టున్న యువత ఇప్పుడు 'హార్డ్ వర్క్' కంటే 'స్మార్ట్ వర్క్' వైపు మొగ్గు చూపుతున్నారు.బిజీగా ఉన్నట్లు నటన!చాలా మంది యువ నిపుణులు తమ పనిని త్వరగా ముగించినప్పటికీ, సమాజం లేదా బాస్ల నుండి వచ్చే విమర్శల భయంతో "బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారని" ధావన్ ఎత్తి చూపారు. ఉత్పాదకతను గంటలతో కొలిచే పద్ధతి ఇంకా పోలేదని ఇది నిరూపిస్తోంది.
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్: ‘సిప్’ ఇన్వెస్టర్లకు షాక్!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో పెట్టుబడులు పెడుతున్న వారికి మార్కెట్ పనితీరు షాక్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే గడిచిన ఏడాది, రెండేళ్ల కాలంలో వీటిల్లో రాబడి లేకపోగా, నష్టాలు మిగిలాయి. ముఖ్యంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో సిప్ పెట్టుబడులపై 48 శాతం వరకు నష్టపోయినవి ఉన్నాయి. 556 పథకాలను పరిశీలించగా, వీటిల్లో 486 నికర నష్టాలను ఇవ్వగా, 70 పథకాలు ఎంతో కొంత లాభాలను పంచాయి. విదేశీ ఫండ్స్లో లాభాలు.. ముఖ్యంగా గత కొంత కాలంలో దేశీ పథకాలు నష్టాలను మిగల్చగా, అంతర్జాతీయ ఫండ్స్ రాబడులు కురిపించాయి. ఇందులో క్వాంట్ టెక్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ డిజిటల్ ఇండియా ఫండ్ సైతం ఉన్నాయి. కారణాలు ఎన్నో.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై రాబడులకు గ్యారంటీ లేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక పరిణామాలకు అనుగుణంగా ఈక్విటీలు ర్యాలీ చేస్తుంటాయి. దిద్దుబాటుకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో దీర్ఘకాలం పాటు దిద్దుబాటు దశలోకి వెళ్లొచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే కోలుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్మాల్, మిడ్క్యాప్లో ఎక్కువ దిద్దుబాటు కనిపిస్తుంటుంది. కనుక స్వల్పకాలానికి ఈక్విటీలు అనుకూలం కాదు. మధ్య, దీర్ఘకాలానికే వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నది నిపుణుల సూచన.కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయినా సరే ఐదేళ్లలోనే రాబడులు వస్తాయని చెప్పలేం. అనుకోకుండా మార్కెట్లు ఐదేళ్లపాటు దిద్దుబాటు, స్థిరీకరణ దశలోకి వెళితే రాబడులు లేకపోగా, నష్టాలూ ఎదురుకావొచ్చు. లంప్సమ్ అయినా, సిప్ అయినా రాబడులు/నష్టాలు మార్కెట్ గమనంపైనే ఆధారపడి ఉంటాయి. కనీసం 7–10 ఏళ్ల కాలంలో ఈ ప్రతికూలతలను అధిగమించి మెరుగైన రాబడులు అందుకోవచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? రాబడుల వెంట పరుగెత్తకుండా, గడిచిన ఏడాది కాల రాబడులను అనుసరించకుండా ఎంపిక చేసుకున్న పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను వైవిధ్యం చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫండ్స్కు సైతం కొంత కేటాయించుకోవాలన్నది సూచన. అంతర్జాతీయంగా ఏఐ, టెక్ ఫండ్స్కు లేదా చైనా, యూఎస్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని జెడ్ఫండ్స్ సీఈవో మనీష్ కొతారి పేర్కొన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా ఫండ్స్ మంచి పనితీరు వెనుక ఏఐ, టెక్ అంశాలున్నాయని చెప్పారు. సిప్ను కేవలం 2–3 ఏళ్ల కాలానికి చూడొద్దన్నారు. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి, సంపద సృష్టించుకునేందుకు రూపొందించిన సాధనం సిప్ అని చెప్పారు. కనీసం 10–15 ఏళ్ల కాల దృష్టితో చూడాలన్నారు. అంతర్జాతీయ ఫండ్స్కు 10–20 శాతం మేర పెట్టుబడులు కేటాయించుకోవచ్చని, ముఖ్యంగా యూఎస్ మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచించారు.
బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!
మీకు ఈ వారం బ్యాంకు పనులున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మార్చి 30 నుండి ఏప్రిల్ 5 మధ్య దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. పండుగలు, వార్షిక ఖాతాల ముగింపు, ఆదివారం సెలవుల కారణంగా ఈ వారంలో దాదాపు ఆరు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి సందర్భాలను పురస్కరించుకుని ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు ఈ వారంలో ఆరు రోజులు మూతపడనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచేది వారంలో ఒక్క రోజే అన్నమాట.సెలవుల పూర్తి వివరాలు ఇవే..మార్చి 30 (సోమవారం): మహావీర్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో సెలవు.ఏప్రిల్ 1 (బుధవారం): బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు (Annual Closing) సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాధారణ వినియోగదారులకు సేవలు నిలిచిపోతాయి.ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కేరళలో బ్యాంకులు మూసివేస్తారు.ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.ఏప్రిల్ 5 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.సాధారణంగా నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. కాబట్టి ఏప్రిల్ 4 (శనివారం) నాడు బ్యాంకులు తెరిచి ఉండే అవకాశం ఉంది.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) చెల్లింపులు (GPay, PhonePe మొదలైనవి) ఎప్పటిలాగే పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎం (ATM) కేంద్రాల్లో నగదు ఉపసంహరణ సేవలు కొనసాగుతాయి.ముందస్తు ప్రణాళిక అవసరంవరుస సెలవుల దృష్ట్యా నగదు అవసరాలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా బ్యాంకింగ్ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
2022–23 రిటర్నులు వేయకపోతే..
పైన చెప్పినది 2022–23 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించినది. చెప్పాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విషయం. పరాభవ నామ సంవత్సరం ప్రారంభంలోనే ఇన్కం ట్యాక్స్ డిఫాల్టర్లకు డిపార్ట్మెంట్ వారు షాకిచ్చారు. షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందయ్యా అంటే.. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ సైకిల్ 6ని ఫాలో అవుతున్నారు. సాధారణంగా రిస్క్ మేనేజ్మెంట్లో ఆరు అంశాలు ఉంటాయి. అవేంటంటే..🔸 రిస్క్ని గుర్తించడం 🔸 వాటి విశ్లేషణ 🔸 నిర్ధారణ 🔸 తగిన చర్యలు తీసుకోవడం 🔸 పర్యవేక్షణ 🔸 నివేదికఇంచుమించు ఇదే పంథాలో డిపార్ట్మెంట్ తమ పంజా విసురుతోంది. డిపార్ట్మెంట్ వారి నిర్వహణ నిమిత్తం అంటు 2026 మార్చి 23న ఒక అంతర్గత సూచన అంటూ జారీ చేశారు. విషయం ఏమిటంటే, 2021–22 ఆర్థిక సంవత్సరం.. అంటే 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో జరిగిన పెద్ద వ్యవహారాలను బైటికి తీసి (అలాగని .. వార్తాపత్రికల్లో ప్రచురించరు), వాటిని విశ్లేషించి, అసలు రిటర్నులు వేయనివారిని, అంటే, నాన్–ఫైలర్స్ని గుర్తించి, వారి మీద చట్టరీత్యా చర్యలు చేపడతారు.ఎలా గుర్తిస్తారు?ఆర్థిక వ్యవహారాల పట్టికలు. ప్రతి సంవత్సరం స్థిరాస్తి క్రయవిక్రయాలు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించి వాటి నిర్వాహక సంస్థల నుంచి డిపార్ట్మెంట్ వారికి సమాచారం చేరిపోతుంది. వార్షిక సమాచార రిటర్న్ ద్వారా ఇది జరుగుతుంది.టీడీఎస్ సర్టిఫికెట్లు. ప్రతి డిడక్టర్ టీడీఎస్ మొత్తాన్ని రికవర్ చేసి, సకాలంలో గవర్నమెంట్ ఖజానాకి చెల్లించాలి. ఆ మేరకు సరి్టఫికెట్లు 16 లేదా 16ఏ జారీ చేయాలి. అంతే కాకుండా వాటికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయాలి. వీటిలో మీకు చేసిన చెల్లింపుల వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయి.టీడీఎస్లాగానే, టీసీఎస్పరంగా మీ సంబంధిత సమాచారం ఉంటుంది.జీఎస్టీ రికార్డులుఎగుమతులు–దిగుమతులు. కస్టమ్స్ అధికారి వద్ద రికార్డులు, షిప్మెంట్ రికార్డులు, హెచ్ఎస్ఈ కోడ్లు, వాళ్ల పేర్లు, టర్నోవర్ వివరాలు, విలువ.. ఈ సమాచారం అంతా ఉంటుంది.ట్యాక్స్ పేయర్స్ ప్రొఫైల్స్మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాఆస్తులు.. అప్పులుఎవరితో ఏయే వ్యవహారాలు జరిపారు.థర్డ్ పార్టీతో వ్యవహారాలుఇలాంటి వివరాలన్నీ సేకరించి మీ రిటర్న్ ప్రొఫైల్, ఆర్థిక సమాచారపు ప్రొఫైల్, వ్యక్తిగత సమాచారపు ప్రొఫైల్, అకౌంట్స్, ఆస్తుల ప్రొఫైల్, ఎవరితో సంబంధం ఉందో ఆ ప్రొఫైల్, ఇతర ఏజెన్సీల ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ తర్వాత వారి దగ్గర నుండి సమాచారం అందుకోని వారి జాబితా, అందుకుని కూడా రెస్పాన్స్ ఇవ్వని వారి జాబితాలు తయారు చేసి, అందులోని నాన్–ఫైలర్స్ని బైటికి తీస్తారు. ఆ తర్వాత నోటీసులు.. ప్రక్రియ మొదలు.ఈ మేరకు దిశ, సూచనలు, సలహాలు, ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు రిటర్నులు అనవసరమైతే, వారిని వదిలేస్తారు. రిటర్నులు వేయాల్సి ఉన్నా, వేయని డిఫాల్టర్స్ని మాత్రం వదలరు. ‘ఇన్కం – ఎస్కేప్డ్‘ కింద భావించి, కథ నడుపుతారు. ఈ రోజు 2021–22 మొదలు, త్వరలోనే ఆ తర్వాత సంవత్సరాల వ్యవహారాల మీదా నిఘా ఇలాగే ఉంటుంది. తగిన జాగ్రత్త వహించండి. అందాకా కథ పోనివ్వకండి. అప్డేటెడ్ రిటర్న్స్ వేసుకునే అవకాశం ఉన్న కాగితాలతో వృత్తి నిపుణులను సంప్రదించండి.ఈ సందర్భంలో మహాభారతంలో తిక్కన రాసిన పద్యం గుర్తుంచుకోండి ‘వచ్చిన వాడు ఫల్గుణుడు. అవశ్యము గెల్తుమనంగ రాదు‘ అని. దాని అర్థం ఏమిటంటే, ఆ వచ్చిన వాడు అర్జునుడు.. యుద్ధం చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు.. మనం సిద్ధంగా ఉండాలి. దేనికైనా ఓర్చుకోవాలి. సంధి చేసుకోవడం మంచిదని భావం.మనకు అన్వయించుకుంటే.. ఆ వచ్చేవాళ్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. విస్తృత అధికారాలతో పాటు సమాచారంతో వస్తారు. సరైన తోవలో నడుచుకోవడం శ్రేయస్కరం.
మల్టీ అసెట్ ఫండ్స్తో పెట్టుబడుల్లో వైవిధ్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు మల్టీ అసెట్ ఫండ్స్కి గణనీయంగా ఆదరణ పెరుగుతున్నట్లు యాక్సిస్ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ ఆశీష్ నాయక్ తెలిపారు. ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఈ ఫండ్స్లోకి రూ. 8,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీనితో ఈ కేటగిరీ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 1.83 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఫోలియోల సంఖ్య 49.1 లక్షలకు చేరినట్లు వివరించారు. వరుసగా నాలుగో నెలా హైబ్రిడ్ కేటగిరీకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సారథ్యం వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీస్ (పసిడి లేదా వెండి)లో ఇన్వెస్ట్ చేస్తాయని నాయక్ వివరించారు. సాధారణంగా వివిధ సందర్భాల్లో వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందిస్తాయని చెప్పారు. కార్పొరేట్ ఆదాయాలు బాగున్నప్పుడు ఈక్విటీలు పెరుగుతాయని, అలాగే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు డెట్ సాధనాలు ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఇక ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నా, అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నా పసిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. ‘‘ఈక్విటీ వేల్యుయేషన్స్ భారీ స్థాయిలో పెరిగిపోగా, వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని డెట్ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. గ్లోబల్గా అనిశి్చతితో కమోడిటీల రేట్లపై అనిశ్చితి నెలకొనడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారికన్నా మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన మదుపరుల పోర్ట్ఫోలియోల్లో ఒడిదుడుకులు కొంత తక్కువగా ఉన్నట్లు వివరించారు. ఇలా ఒకే ఫండ్ ద్వారా వివిధ అసెట్స్కి కేటాయింపులు జరిపే వ్యూహం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు గుర్తిస్తున్నారని నాయక్ చెప్పారు. అయితే, ఈ కోవకి చెందిన ఫండ్స్ అన్నీ ఒకే రకంగా పని చేయవని గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపితే మరికొన్ని బ్యాలెన్స్డ్గా లేదా వ్యవహరిస్తాయని చెప్పారు. అలాగే కేవలం బుల్ మార్కెట్కే పరిమితం కాకుండా గతంలో వివిధ పరిస్థితుల్లో ఫండ్ ఎలా పని చేసిందనేది కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.


