Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Latest Price in India and Know The Rates Change1
ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు

అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే ఆశలు సన్నగిల్లడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో.. మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి.భారతదేశంలో నేడు (మంగళవారం) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 123660 (10 గ్రామ్స్), 22 క్యారెట్ల ధర రూ. 1,13,350 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1740 & రూ. 1600 తక్కువ. పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.నవంబర్ 13న రూ. 1,28,620 లక్షల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 18) రూ. 1,23,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ఐదు రోజుల్లో రూ. 4960 తగ్గిందని తెలుస్తోంది. అంటే ఐదు రోజుల్లో దాదాపు 5000 రూపాయలు తగ్గిందన్నమాట.వెండి విషయానికి వస్తే.. రూ. 1.83 లక్షల (నవంబర్ 13) వద్ద ఉన్న సిల్వర్ రేటు.. నేటికి రూ. 1.70 లక్షలకు చేరింది. అంటే వెండి రేటు కూడా ఐదు రోజుల్లో రూ. 13వేలు తగ్గిందన్నమాట.అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ఫెడ్‌ వడ్డీ రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఫెడ్ వడ్డీ రేటు పెరిగినప్పుడు.. గోల్డ్ రేటు తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గినప్పుడు.. పసిడి ధరలు పెరుగుతాయి. బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలల మీద.. రాజకీయ, భౌగోళిక కారణాలు.. ఆర్ధిక వ్యవస్థలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..

Business Opportunities Through Social Media2
సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారావకాశాలు

యూట్యూబ్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేసే అవకాశాలను కల్పించనున్నట్లు హైదరాబాదీ సంస్థ డబ్ల్యూకామర్స్‌ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ శ్రీరామనేని తెలిపారు. ఈ విధానంలో పెట్టుబడి, సరుకుల నిల్వలాంటి బాదరబందీ ఉండదని.. చిరు వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు ఎవరైనా దీన్ని ప్రారంభించవచ్చని వివరించారు.ఇందుకోసం కంపెనీ తాము ఆఫర్‌ చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు, విక్రేతల పేరుతో ఆన్‌లైన్‌ స్టోర్‌ ఏర్పాటు చేస్తుంది. దాని లింకులు/క్యూఆర్‌ కోడ్‌లను విక్రేతలు తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం లేదా తెలిసినవారికి షేర్‌ చేయాలి. వాటి ఆధారంగా జరిగే ఆయా ఉత్పత్తుల అమ్మకాలపై విక్రేతకు 20–40 శాతం లాభం ఉంటుంది.డెలివరీ బాధ్యతలను కంపెనీ తీసుకుంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22,000కు పైగా యాక్టివ్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌ ఉన్నాయని, హెల్త్, వెల్‌నెస్‌ తదితర విభాగాల్లో 40కి పైగా బ్రాండ్స్, 600 పైచిలుకు ఉత్పత్తులు ఉన్నాయని శ్రీధర్‌ చెప్పారు.

​Narayana Murthy Pitches 72 Hours Work Week Again Its 9 9 6 Rule in China3
996 ఫార్ములా: ఇన్ఫోసిస్ నారాయణమూర్తిపై ఆగ్రహం!

వారానికి 72 గంటల పని మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఈ వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కొందమంది సమర్ధించారు. మరికొందరు విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ నిలవాలంటే.. 996 నియమం చాలా అవసరం అని ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏమిటీ 996 రూల్?చైనాలో పాటిస్తున్న 9-9-6 నియమాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 996 ఫార్ములా ప్రకారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని, వారానికి 6 రోజులను సూచిస్తుంది. అంటే రోజుకు 12 గంటలు.. 6 రోజులు చేయాలన్నమాట. ఇలా మొత్తానికి వారానికి 72 గంటలు పనిచేయాలన్నమాట.చైనాలోని చాలా కంపెనీలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కొన్ని సంస్థలు ఈ నియమాన్ని రద్దు చేసినప్పటికీ.. ఇంకొన్ని అమలు చేస్తూనే ఉన్నాయి. కాగా చైనా ప్రభుత్వం కూడా దీనిని క్రమంగా నియంత్రించడానికి తగిన చర్యలను తీసుకుంటోంది. అలాంటి ఈ విధానాన్ని నారాయణమూర్తి ప్రస్తావించడం.. కొంత మందిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే.. తప్పకుండా యువత మరింత నిబద్దతతో పనిచేయాలి. భారత్ వృద్ధి రేటు 6.57 శాతం. దీని కంటే ఆరు రెట్లు పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనాతో మనం పోటీ పడాలంటే.. పనిగంటలు పెంచాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేస్తారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. పేదలకు అవకాశాలు కల్పించడానికి యువత కష్టపడి, తెలివిగా పనిచేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.నెటిజన్ల రియాక్షన్నారాయణమూర్తి వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్లు స్పందించారు. ఒకరు చైనా స్థాయి జీతాలు, మౌలిక సదుపాయాలు & జీవన వ్యయం ఇవ్వండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని అన్నారు. భారతదేశానికి 72 గంటల వారాలు అవసరం లేదు. అద్దె, కిరాణా సామాగ్రి, పాఠశాల ఫీజులు & పెట్రోల్‌కు సరిపోయే జీతాలు భారతదేశానికి అవసరం. ప్రజలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని మరొక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టెక్ కంపెనీ కొత్త చర్య.. భయపడుతున్న ఐటీ ఉద్యోగులు!యూరప్ దేశంలో 10-5-5 విధానం నడుస్తోంది. దీని గురించి మీకు తెలుసా అంటూ.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పని, వారానికి 5 రోజులు మాత్రమే. ఈ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారాంతాల్లో సంతోషంగా జీవితం గడుపుతారు అని ఇంకొక యూజర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా నారాయణమూర్తి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.🚨 "There is a saying in China, 9, 9, 6. You know what it means? 9 am to 9 pm, 6 days a week. And that is 72 hours work-week, " said Narayana Murthy. pic.twitter.com/FCeNFynG1F— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2025

Stock Market Closing Update 18th November 20254
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.96 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 84,625.99 వద్ద, నిఫ్టీ 121.40 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టంతో 25,910.05 వద్ద నిలిచాయి.ఫిజిక్స్ వాలా లిమిటెడ్, సెక్యూర్‌క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఎనర్జీ డెవలప్‌మెంట్ కంపెనీ, బ్యాంగ్ ఓవర్సీస్, పన్సారి డెవలపర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్, పావ్నా ఇండస్ట్రీస్, సాండ్స్ పవర్ స్విచ్, పయనీర్ ఎంబ్రాయిడరీస్, రీటాన్ టీఎంటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Government Hikes Vehicle Fitness Test Fees Check Updated Cost5
భారీగా పెరిగిన వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజు: కొత్త ధరలు ఇలా..

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) దేశవ్యాప్తంగా.. వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజును భారీగా పెంచుతూ, కొత్త సవరణలు చేసింది. కేంద్ర మోటారు వాహన నియమాల కింద.. కొత్త సవరణలు వెంటనే అమలులోకి వస్తాయి. వాహనాల వయసు, కేటగిరీ ఆధారంగా ఫీజును నిర్ణయించడం జరిగింది.సవరణలలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. అధిక ఫీజులు మాత్రమే కాకుండా, వాహనాల వయసు పరిమితి తగ్గింపు. అంటే.. కొత్త సవరణలకు ముందు, 15 సంవత్సరాల కంటే పాత వాహనాలకు స్లాబ్‌లు వర్తిస్తాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాహనాలకు కూడా ఛార్జీలను విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.మూడు కేటగిరీలువాహనాల వయసు ఆధారంగా.. ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటిది 10-15 సంవత్సరాలు, రెండవది 15-20 సంవత్సరాలు, మూడవ వర్గం 20 సంవత్సరాల కంటే పాత వాహనాలు. కేటగిరిని బట్టి ఫీజులు క్రమంగా పెరుగుతాయి. వయస్సు ఆధారిత స్లాబ్‌లు అనేవి టూవీలర్స్, త్రీవీలర్స్, క్వాడ్రిసైకిళ్లు, లైట్ వెయిట్ వెహికల్స్, మిడ్ సైజ్, హెవీ వెహికల్స్ లేదా ప్యాసింజర్ వాహనాలతో సహా అన్ని వర్గాల వాహనాలకు వర్తిస్తాయి.కొత్త ధరలు ఇలా..కొత్త సవరణలు.. భారీ వాణిజ్య వాహనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ట్రక్కులు లేదా బస్సులు ఇప్పుడు ఫిట్‌నెస్ పరీక్ష కోసం రూ. 25,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. అదే వయస్సు గల మధ్యస్థ వాణిజ్య వాహనాల ఫీజు రూ. 1800 నుంచి రూ. 20వేలకు పెరిగింది.20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న.. తేలికపాటి మోటారు వాహనాలకు ఫీజు రూ.15,000కు పెరిగింది, 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న త్రిచక్ర వాహనాలకు ఇప్పుడు రూ.7,000 వసూలు చేస్తారు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ద్విచక్ర వాహనాలకు రుసుము రూ.600 నుంచి రూ.2,000కు పెరిగింది.15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాహనాలకు కూడా కొత్త ఫీజులు ఉన్నాయి. సవరించిన నియమం 81 ప్రకారం.. ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ కోసం మోటార్‌సైకిళ్లకు రూ.400, తేలికపాటి మోటారు వాహనాలకు రూ.600, మధ్యస్థ & భారీ వాణిజ్య వాహనాలకు రూ.1,000 వసూలు చేస్తారు.ఇదీ చదవండి: నా దృష్టిలో అదే నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..

Telangana Deputy CM called for the banking sector play a key role in economic journey6
‘2047 తెలంగాణ రైజింగ్’ ఉత్సవాల్లో కొత్త పాలసీలు

తెలంగాణ ఆర్థిక ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 2047 నాటికి ఆధునిక, సమగ్ర, భవిష్యత్తుకు సిద్ధమయ్యే తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ‘2047 తెలంగాణ రైజింగ్’ ఉత్సవాల్లో కీలక పాలసీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన 47వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ త్రైమాషిక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేందుకు HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ద్వారా 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టును బ్యాంకులు ప్రాధాన్య రంగంగా చూడాలని కోరారు. తెలంగాణను మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతోపాటు 13% జీడీపీ పెరుగుదలే లక్ష్యంగా 2047 రోడ్‌మ్యాప్‌ను విడుదల చేస్తామని తెలిపారు.ఏటా 10% పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్రం పట్ల తమ కల ఏంటో, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నామో వివరిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ నది పునర్జీవనం వంటి అంశాలను ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు వివరిస్తామన్నారు.ఉపాధి, సంపద సృష్టికి మద్దతుడిప్యూటీ సీఎం బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు (MSME) బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టించబడుతుందన్నారు. తద్వారా జీడీపీ పెరుగుతుందని తెలిపారు.విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిరాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించి, డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని చెప్పారు. బ్యాంకర్లు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను ఈ రంగాల్లో ఖర్చు చేయాలని, చీఫ్ సెక్రెటరీతో సహా ఉన్నతాధికారులను సంప్రదించి ముందుకు సాగాలని సూచించారు.ఇదీ చదవండి: గిఫ్ట్‌ సిటీకి ఎందుకంత క్రేజ్‌..

Advertisement
Advertisement
Advertisement