Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

RBI Bulletin Signals Continued Strong Growth for Indian Economy1
ఇండియా ఇక ముందూ ఇదే స్పీడు..

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తోందని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఇక ముందూ భారత్‌ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 సంవత్సరం ఆరంభమైంది. వెనెజువెలాలో యూఎస్‌ జోక్యం చేసుకోవడం, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందంపై అస్పష్టత నెలకొనడం, గ్రీన్‌లాండ్‌పై వివాదం ఇవన్నీ భౌగోళిక ఆర్థిక సమస్యలను, విధానపరమైన అనిశ్చితిని పెంచేవే. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు బలంగా ఉండడం రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తున్నాయి. 2025–26 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సూచిస్తున్నాయి’’అని పేర్కొంది. అనిశ్చితుల మధ్య కూడా అంతర్జాతీయ వృద్ధి 2025లో స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. డిమాండ్‌ బలంగా.. డిసెంబర్‌ నెలకు సంబంధించి ముఖ్యమైన సూచికలు డిమాండ్‌ బలంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని, ఇది వృద్ధికి ప్రేరణనిస్తుందని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో కొంత పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ కనిష్ట లక్ష్యానికి దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వాణిజ్య రంగానికి బ్యాంక్‌లు, బ్యాంకింగేతర మార్గాల (కార్పొరేట్‌ బాండ్లు, ఎఫ్‌డీఐ తదితర) ద్వారా గడిచిన ఏడాది కాలంలో రుణ వితరణ పెరిగినట్టు తెలిపింది. ఏడాది క్రితం ఉన్న రూ.21.3 లక్షల కోట్ల నుంచి రూ.30.8 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది.ఎగుమతుల వైవిధ్యానికి, బలోపేతానికి గాను భారత్‌ గణనీయమైన కృషి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాలు, సమాఖ్యలతో (మొత్తం 50 దేశాలకు ప్రాతినిధ్యం వహించే) వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని గుర్తు చేసింది. న్యూజిలాండ్, ఒమన్‌తో చర్చలు ముగిసిపోగా, ఐరోపా సమాఖ్యతోనూ త్వరలో ముగింపునకు రానుండడం గమనార్హం. 2025లో జీఎస్‌టీ శ్లాబులను క్రమబద్దీకరించడం, ఆదాయపన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల్లో మార్పులు వంటివి వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని ఆర్‌బీఐ బులెటిన్‌ అభిప్రాయపడింది. రూపాయి క్షీణతకు ఎన్నో కారణాలు.. ఇక నుంచి ఆవిష్కరణలు – స్థిరత్వం, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యంపై విధాపరమైన దృష్టి ఉండాలని ఆర్‌బీఐ బులెటిన్‌ సూచించింది. నియంత్రణలు, పర్యవేక్షణ పట్ల వివేకవంతమైన విధానం ఉత్పాదకత పెంపునకు, దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి సాయపడుతుందని పేర్కొంది. తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం డిసెంబర్‌లో రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్టు వివరించింది.అలాగే, భారత్‌–యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమైనట్టు తెలిపింది. రూపాయిలో ఆటుపోట్లన్నవి.. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. 2025 ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని ఎఫ్‌డీఐ కంటే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. నవంబర్‌లో నికర ఎఫ్‌డీఐ వరుసగా మూడో నెలలోనూ ప్రతికూలంగా ఉందని, స్వదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు వెళ్లడమే కారణమని తెలిపింది.

Real Estate in Greenland You Can Buy a Home But Not the Land2
గ్రీన్‌లాండ్‌: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది గ్రీన్‌లాండ్‌. దశాబ్దాల క్రితం తమ చేజారిన ఈ ద్వీప దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన స్వయంప్రతిపత్త ప్రాంతం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా వాస్తవంగా ఇక్కడ ఎక్కడా లేని భిన్న భూ యాజమాన్య చట్టాలు ఉన్నాయి.ఇంటి కొనుగోలు, భూమి పరిమితులుగ్రీన్‌లాండ్‌లో మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ భూమి స్వంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే.. గ్రీన్‌లాండ్ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందినది. ప్రైవేట్ భూ యాజమాన్యానికి అనుమతి ఉండదు. స్థానికులు, కంపెనీలు, లేదా సహకార గృహ సంఘాలు మాత్రమే భూమిని ఉపయోగించుకునే హక్కును పొందగలరు. కానీ భూమి అసలు వారికి స్వంతం కాదని గుర్తుంచుకోవాలి.హౌసింగ్ కంపెనీలు.. పబ్లిక్ హౌసింగ్, ఇతర ఆస్తులను నిర్వహిస్తాయి. మీరు ఇల్లు కొనుగోలు చేసినా, భూమి కోసం “సైట్ కేటాయింపు” (use-right allocation) కోసం స్థానిక మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ కేటాయింపు పొందిన తర్వాత మాత్రమే ఆ భూమిని ఉపయోగించుకునేందుకు వీలుంటుది. కానీ దాన్ని కొనలేరు.సైట్ కేటాయింపుతో ఏమేం చేయొచ్చు..కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు. నిర్మించిన ఇల్లు కొనుక్కోవచ్చు. కారు పార్కింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్మాణం ఉపయోగాన్ని మార్చుకోవచ్చు (ఉదాహరణకు, దుకాణం నుంచి ఇల్లుగా మార్పు). పైపు, శాటిలైట్ డిష్, మురుగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.గ్రీన్‌లాండ్‌లో భూమి చట్టాలు ఒక తాత్విక సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. అదేంటంటే.. భూమి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండకూడదు. అది సమష్టిగా ప్రజలందరికీ చెందాలి.ఆస్తి ఎవరు కొనొచ్చు..గ్రీన్‌లాండ్, డెన్మార్క్ లేదా ఫారో దీవుల పౌరులు ఇక్కడ ఆస్తి కొనవచ్చు. ఈ ద్వీపంలో కనీసం రెండు సంవత్సరాలు నివసించి, పన్నులు చెల్లించిన వారు కూడా సైట్‌ కేటాయింపు కోసం దరఖాస్తు చేయవచ్చు.ఇంటివలన పొందే స్థల పరిమాణం కూడా కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నాలుగు పడకగదుల అపార్ట్‌మెంట్ కేటాయిస్తారు. కానీ నుక్ వంటి పెద్ద పట్టణాలలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంటికి సైట్‌ కేటాయింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.గ్రీన్‌లాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్గ్రీన్‌లాండ్‌లో పెద్ద పట్టణాలు గృహాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల కోసం ముఖ్యంగా స్వయంప్రతిపత్త ప్రాంతాలకు వలస వచ్చిన వారికి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇంటికి సైట్‌ కేటాయింపు కోసం వేచి ఉండే సమయం నుక్‌లో సుమారుగా 10–12 సంవత్సరాలు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వసతిని అందిస్తాయి.

Jio BlackRock Reaches 1 Million Investors in Just 8 Months3
జియో బ్లాక్‌రాక్‌: 8 నెలల్లో 10 లక్షల ఇన్వెస్టర్లు

జియో బ్లాక్‌రాక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) ఈ ఏడాది మేలో సేవలు ప్రారంభించగా, 10 లక్షల మంది ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో 18 శాతం తొలిసారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారని సంస్థ ఎండీ, సీఈవో సిద్‌ స్వామినాథన్‌ వెల్లడించారు. ముఖ్యంగా 40 శాతం ఇన్వెస్టర్లు టాప్‌–30 పట్టణాలకు వెలుపలి ప్రాంతాల నుంచి ఉన్నట్టు చెప్పారు.పరిశ్రమ సగటు 28 శాతం కంటే ఎంతో ఎక్కువని పేర్కొన్నారు. టెక్నాలజీ అనుసరణ, ఇన్వెస్టర్లలో అవగాహనపై దృష్టి సారించడం మార్కెట్‌ విస్తరణకు దోహదం చేస్తున్నట్టు తెలిపారు. జియో బ్లాక్‌రాక్‌ ఏంఎసీ నిర్వహణలోని పెట్టుబడులు రూ.13,700 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. ఇందులో ఈక్విటీ ఆస్తులు 30 శాతంగా ఉన్నట్టు తెలిపారు. స్పెషలైజ్డ్‌ ఇన్వస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌), ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) ఆవిష్కరణతోపాటు, అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలను గిఫ్ట్‌సిటీ ద్వారా అందించనున్నట్టు చెప్పారు.సిఫ్‌ ప్రారంభానికి వీలుగా సెబీ నుంచి ఇటీవలే నిరభ్యంతర పత్రం అందుకున్నట్టు తెలిపారు. ఈ సంస్థ నుంచి జియోబ్లాక్‌రాక్‌ సెక్టార్‌ రొటేషన్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో ఈ నెల 27న ప్రారంభం కానుండడం గమనార్హం. రంగాల వారీ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల్లో మార్పులు చేస్తూ, అధిక రాబడులను ఇచ్చే విధంగా ఇది పనిచేస్తుంది.

Gold and Silver rates on 22nd January 2026 in Telugu states4
పసిడి, వెండి ఢమాల్‌.. రెచ్చిపోయిన ధరలు రివర్స్‌!

జోరు మీదున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్‌ పడింది. దేశంలో పసిడి, వెండి భారీగా దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం పుత్తడి ధరలు (Today Gold Rate) భారీ స్థాయిలో తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. వెండి ధరలు కూడా గణనీయంగా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 22nd january 20265
Stock Market Updates: పడిలేచిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం పుంజుకున్నాయి. లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 250 పాయింట్లు ఎగిసి 25,408 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 793 పాయింట్లు పుంజుకుని 82,703 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.05బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.03 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.2 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.18 % లాభంతో ముగిసింది.Today Nifty position 22-01-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

LinkedIn Report Reveals AI Engineer as Top Emerging Job in Hyderabad6
హైదరాబాద్‌లో ఇప్పుడు హాట్‌ జాబ్స్‌ ఇవే..

హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్‌ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్‌ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్‌గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్‌లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్‌తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్‌లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్‌ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్‌ సెర్చ్‌ను ఈజీ చేస్తున్న లింక్డ్‌ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్‌ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్‌ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్‌లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్‌ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్‌లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్

Advertisement
Advertisement
Advertisement