ప్రధాన వార్తలు
ఇండియా ఇక ముందూ ఇదే స్పీడు..
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తోందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఇక ముందూ భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 సంవత్సరం ఆరంభమైంది. వెనెజువెలాలో యూఎస్ జోక్యం చేసుకోవడం, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అస్పష్టత నెలకొనడం, గ్రీన్లాండ్పై వివాదం ఇవన్నీ భౌగోళిక ఆర్థిక సమస్యలను, విధానపరమైన అనిశ్చితిని పెంచేవే. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు బలంగా ఉండడం రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తున్నాయి. 2025–26 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సూచిస్తున్నాయి’’అని పేర్కొంది. అనిశ్చితుల మధ్య కూడా అంతర్జాతీయ వృద్ధి 2025లో స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. డిమాండ్ బలంగా.. డిసెంబర్ నెలకు సంబంధించి ముఖ్యమైన సూచికలు డిమాండ్ బలంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని, ఇది వృద్ధికి ప్రేరణనిస్తుందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో కొంత పెరిగినప్పటికీ, ఆర్బీఐ కనిష్ట లక్ష్యానికి దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వాణిజ్య రంగానికి బ్యాంక్లు, బ్యాంకింగేతర మార్గాల (కార్పొరేట్ బాండ్లు, ఎఫ్డీఐ తదితర) ద్వారా గడిచిన ఏడాది కాలంలో రుణ వితరణ పెరిగినట్టు తెలిపింది. ఏడాది క్రితం ఉన్న రూ.21.3 లక్షల కోట్ల నుంచి రూ.30.8 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది.ఎగుమతుల వైవిధ్యానికి, బలోపేతానికి గాను భారత్ గణనీయమైన కృషి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాలు, సమాఖ్యలతో (మొత్తం 50 దేశాలకు ప్రాతినిధ్యం వహించే) వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని గుర్తు చేసింది. న్యూజిలాండ్, ఒమన్తో చర్చలు ముగిసిపోగా, ఐరోపా సమాఖ్యతోనూ త్వరలో ముగింపునకు రానుండడం గమనార్హం. 2025లో జీఎస్టీ శ్లాబులను క్రమబద్దీకరించడం, ఆదాయపన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల్లో మార్పులు వంటివి వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని ఆర్బీఐ బులెటిన్ అభిప్రాయపడింది. రూపాయి క్షీణతకు ఎన్నో కారణాలు.. ఇక నుంచి ఆవిష్కరణలు – స్థిరత్వం, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యంపై విధాపరమైన దృష్టి ఉండాలని ఆర్బీఐ బులెటిన్ సూచించింది. నియంత్రణలు, పర్యవేక్షణ పట్ల వివేకవంతమైన విధానం ఉత్పాదకత పెంపునకు, దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి సాయపడుతుందని పేర్కొంది. తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కంటే భారత్లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం డిసెంబర్లో రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్టు వివరించింది.అలాగే, భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమైనట్టు తెలిపింది. రూపాయిలో ఆటుపోట్లన్నవి.. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. 2025 ఏప్రిల్–నవంబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని ఎఫ్డీఐ కంటే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. నవంబర్లో నికర ఎఫ్డీఐ వరుసగా మూడో నెలలోనూ ప్రతికూలంగా ఉందని, స్వదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు వెళ్లడమే కారణమని తెలిపింది.
గ్రీన్లాండ్: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది గ్రీన్లాండ్. దశాబ్దాల క్రితం తమ చేజారిన ఈ ద్వీప దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన స్వయంప్రతిపత్త ప్రాంతం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా వాస్తవంగా ఇక్కడ ఎక్కడా లేని భిన్న భూ యాజమాన్య చట్టాలు ఉన్నాయి.ఇంటి కొనుగోలు, భూమి పరిమితులుగ్రీన్లాండ్లో మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ భూమి స్వంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే.. గ్రీన్లాండ్ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందినది. ప్రైవేట్ భూ యాజమాన్యానికి అనుమతి ఉండదు. స్థానికులు, కంపెనీలు, లేదా సహకార గృహ సంఘాలు మాత్రమే భూమిని ఉపయోగించుకునే హక్కును పొందగలరు. కానీ భూమి అసలు వారికి స్వంతం కాదని గుర్తుంచుకోవాలి.హౌసింగ్ కంపెనీలు.. పబ్లిక్ హౌసింగ్, ఇతర ఆస్తులను నిర్వహిస్తాయి. మీరు ఇల్లు కొనుగోలు చేసినా, భూమి కోసం “సైట్ కేటాయింపు” (use-right allocation) కోసం స్థానిక మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ కేటాయింపు పొందిన తర్వాత మాత్రమే ఆ భూమిని ఉపయోగించుకునేందుకు వీలుంటుది. కానీ దాన్ని కొనలేరు.సైట్ కేటాయింపుతో ఏమేం చేయొచ్చు..కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు. నిర్మించిన ఇల్లు కొనుక్కోవచ్చు. కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్మాణం ఉపయోగాన్ని మార్చుకోవచ్చు (ఉదాహరణకు, దుకాణం నుంచి ఇల్లుగా మార్పు). పైపు, శాటిలైట్ డిష్, మురుగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.గ్రీన్లాండ్లో భూమి చట్టాలు ఒక తాత్విక సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. అదేంటంటే.. భూమి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండకూడదు. అది సమష్టిగా ప్రజలందరికీ చెందాలి.ఆస్తి ఎవరు కొనొచ్చు..గ్రీన్లాండ్, డెన్మార్క్ లేదా ఫారో దీవుల పౌరులు ఇక్కడ ఆస్తి కొనవచ్చు. ఈ ద్వీపంలో కనీసం రెండు సంవత్సరాలు నివసించి, పన్నులు చెల్లించిన వారు కూడా సైట్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయవచ్చు.ఇంటివలన పొందే స్థల పరిమాణం కూడా కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నాలుగు పడకగదుల అపార్ట్మెంట్ కేటాయిస్తారు. కానీ నుక్ వంటి పెద్ద పట్టణాలలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంటికి సైట్ కేటాయింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్గ్రీన్లాండ్లో పెద్ద పట్టణాలు గృహాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల కోసం ముఖ్యంగా స్వయంప్రతిపత్త ప్రాంతాలకు వలస వచ్చిన వారికి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇంటికి సైట్ కేటాయింపు కోసం వేచి ఉండే సమయం నుక్లో సుమారుగా 10–12 సంవత్సరాలు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వసతిని అందిస్తాయి.
జియో బ్లాక్రాక్: 8 నెలల్లో 10 లక్షల ఇన్వెస్టర్లు
జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) ఈ ఏడాది మేలో సేవలు ప్రారంభించగా, 10 లక్షల మంది ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో 18 శాతం తొలిసారి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టిన వారని సంస్థ ఎండీ, సీఈవో సిద్ స్వామినాథన్ వెల్లడించారు. ముఖ్యంగా 40 శాతం ఇన్వెస్టర్లు టాప్–30 పట్టణాలకు వెలుపలి ప్రాంతాల నుంచి ఉన్నట్టు చెప్పారు.పరిశ్రమ సగటు 28 శాతం కంటే ఎంతో ఎక్కువని పేర్కొన్నారు. టెక్నాలజీ అనుసరణ, ఇన్వెస్టర్లలో అవగాహనపై దృష్టి సారించడం మార్కెట్ విస్తరణకు దోహదం చేస్తున్నట్టు తెలిపారు. జియో బ్లాక్రాక్ ఏంఎసీ నిర్వహణలోని పెట్టుబడులు రూ.13,700 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. ఇందులో ఈక్విటీ ఆస్తులు 30 శాతంగా ఉన్నట్టు తెలిపారు. స్పెషలైజ్డ్ ఇన్వస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్), ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఆవిష్కరణతోపాటు, అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలను గిఫ్ట్సిటీ ద్వారా అందించనున్నట్టు చెప్పారు.సిఫ్ ప్రారంభానికి వీలుగా సెబీ నుంచి ఇటీవలే నిరభ్యంతర పత్రం అందుకున్నట్టు తెలిపారు. ఈ సంస్థ నుంచి జియోబ్లాక్రాక్ సెక్టార్ రొటేషన్ ఫండ్ ఎన్ఎఫ్వో ఈ నెల 27న ప్రారంభం కానుండడం గమనార్హం. రంగాల వారీ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల్లో మార్పులు చేస్తూ, అధిక రాబడులను ఇచ్చే విధంగా ఇది పనిచేస్తుంది.
పసిడి, వెండి ఢమాల్.. రెచ్చిపోయిన ధరలు రివర్స్!
జోరు మీదున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. దేశంలో పసిడి, వెండి భారీగా దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం పుత్తడి ధరలు (Today Gold Rate) భారీ స్థాయిలో తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. వెండి ధరలు కూడా గణనీయంగా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Stock Market Updates: పడిలేచిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం పుంజుకున్నాయి. లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 250 పాయింట్లు ఎగిసి 25,408 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 793 పాయింట్లు పుంజుకుని 82,703 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.03 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.2 శాతం పెరిగింది.నాస్డాక్ 1.18 % లాభంతో ముగిసింది.Today Nifty position 22-01-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
హైదరాబాద్లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్ సెర్చ్ను ఈజీ చేస్తున్న లింక్డ్ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్
కార్పొరేట్
డాక్టర్ రెడ్డీస్ లాభం 1,210 కోట్లు
దావోస్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ
జొమాటో: సీఈవోగా దిగిపోయిన దీపిందర్ గోయిల్
‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి
వింగ్స్ ఇండియా 2026లో ఎయిర్బస్
ఏఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్.. వేలాదిమందికి ఉద్యోగాలు!
సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రైలు ప్రయాణంలో మార్పులు!
కొన్ని కంపెనీలు డీలా.. ఇంకొన్ని భళా
భారత్లో బీమా వృద్ధికి భరోసా
ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
మార్కెట్ క్రాష్ ఈరోజూ కొనసాగుతుందా?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో క...
రికార్డు స్థాయికి బంగారం ధర..
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ ...
డెట్ ఫండ్స్కు ఇండెక్సేషన్ ప్రయోజనం
మరో 10 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న 2026–2...
రూ.10,300 కోట్ల యూరియా ప్రాజెక్టు
దేశీయ ఎరువుల ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధించడమ...
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి అణు ప్రాజెక్టులు?
భారతదేశ ఇంధన రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వ...
బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీలు అనుసంధానం?
అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప...
బడ్జెట్ 2026లో వ్యవసాయానికి కొత్త దిశ!
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వ్యవసాయ ర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐఫోన్ అయితే వాడినా ఓకే
దేశీయంగా కొత్త డివైజ్ల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్హ్యాండ్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ నెలకొంది. దీంతో రీఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2025లో 7–8 శాతం మేర వృద్ధి చెందిన సెకండరీ మార్కెట్ ఈ ఏడాది కూడా అదే జోరు కనబర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడుతుండటం, ఆన్లైన్–ఆఫ్లైన్ మాధ్యమాల ద్వారా నేరుగా కస్టమర్లకు మరింత అందుబాటు స్థాయిలో లభిస్తుండటంలాంటి అంశాలు రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలు.. థర్డ్ పార్టీలు రీఫర్బిష్ చేసి, అమ్మే డివైజ్లలో నాణ్యత సరిగ్గా లేకపోవడం, రిటర్నులు ఎక్కువగా వస్తుండటంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి దిగ్గజాలు గతేడాది ఈ విభాగం నుంచి తప్పుకున్నప్పుడు కొంతకాలం అమ్మకాలు నెమ్మదించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సదరు ప్లాట్ఫాంలపై ఆధారపడిన విక్రేతల వ్యాపారం తాత్కాలికంగా దెబ్బతిందని వివరించాయి. దీనితో నేరుగా వినియోగదారులను చేరుకునే వ్యూహాలకు క్యాషిఫై, కంట్రోల్జెడ్లాంటి సంస్థలు పదును పెట్టాయి. ఆన్లైన్ ప్లాట్ఫాంలను, ఆఫ్లైన్ రిటైల్ నెట్వర్క్లను విస్తరించాయి. ప్రభావం ఇంకా తెలియడం లేదు.. చాలామటుకు బ్రాండ్స్ దగ్గర 60–90 రోజుల వరకు సరిపడేంత నిల్వలు ఉండటం వల్ల రేట్ల పెంపు ప్రభావం పూర్తి స్థాయిలో ఇంకా తెలియడం లేదు. కొత్త డివైజ్ల రేట్లు 15–20 శాతం పెరిగాయంటే చాలు, కోవిడ్ కాలంలోలాగా రీఫర్బిష్డ్ ఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అప్పట్లో సరఫరాపరమైన సవాళ్ల వల్ల కొత్త ఫోన్లకు కొరత ఏర్పడి, కొనుగోలుదార్లు సెకండ్హ్యాండ్ డివైజ్ల వైపు మళ్లాల్సి వచి్చంది. ప్రస్తుతం కూడా మెమరీ, చిప్ల వ్యయాలు పెరిగి కొత్త డివైజ్ల రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయని క్యాషిఫై వర్గాలు వివరించాయి. ఎంట్రీ లెవెల్ షాక్.. అత్యధిక మార్కెట్ వాటా ఉండే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో రేట్ల పెంపు షాక్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న హ్యాండ్సెట్స్ రేటు వచ్చే ఆరు నెలల్లో దాదాపు 50 శాతం పెరిగి రూ. 15,000కు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే అతి పెద్ద సెగ్మెంట్ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని, దీనితో కస్టమర్లు రీఫర్బిష్డ్ డివైజ్ల వైపు డిమాండ్ మళ్లొచ్చని ఆశిస్తున్నట్లు వివరించాయి. అయితే, రేట్లు పెరగడమనేది మరో ప్రతికూల పరిణామానికి కూడా దారి తీయొచ్చని భావిస్తున్నారు. యూజర్లు తమ పాత డివైజ్లను మరింత కాలం అట్టే పెట్టుకునేందుకు ప్రాధాన్యతనివ్వొచ్చని, ఫలితంగా మార్కెట్లో సరఫరా తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 50 శాతం డివైజ్లు రీఫర్బిష్డ్ లేదా ఎక్సే్చంజ్ మార్కెట్లోకి రావడానికి అనువైనవిగానే ఉంటున్నాయి. కానీ ఇందులో సగం మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. మిగతా వాటిని యూజర్లు నిరుపయోగంగా డ్రాలలో పడేయడమో లేక తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇవ్వడమో చేస్తున్నారు. ఈ–వ్యర్థాలు, పాత డివైజ్ల విక్రయ విలువ గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంటోంది. ఐఫోన్లే కావాలి.. రీఫర్బిష్ చేసిన యాపిల్ ఐఫోన్లకు భారీగా డిమాండ్ నెలకొంది. వాటి లభ్యత కూడా పెరుగుతోంది. దీనితో 2019లో సుమారు 2 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్ వాటా ఇప్పుడు 9 శాతానికి చేరుకుంది. రీఫర్బిష్డ్ సంస్థల మొత్తం అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 60 శాతంగా ఉంటోందని పరిశ్రమ అంచనా. లేటెస్ట్ డివైజ్ల ప్రారంభ ధర ఎక్కువగా ఉండటంతో, యాపిల్ డివైజ్లను మొదటిసారిగా వాడే వారు, వేరే బ్రాండ్స్ బదులుగా దాదాపు అదే రేటుకో అంతకన్నా కాస్త తక్కువ రేటుకో లభించే పాత ఐఫోన్లనే తీసుకోవడంవైపు మొగ్గుచూపుతున్నారు. యాపిల్లో ఎంట్రీ లెవెల్ మోడల్ లేకపోవడంతో ఈ ధోరణి కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్లో ఏడాది, రెండేళ్ల పాత ఫోన్లతో పోలిస్తే నాలుగైదేళ్లు పాతబడ్డ యాపిల్ ఫోన్లకు కూడా డిమాండ్ బాగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. – సాక్షి బిజినెస్ డెస్క్
మొసళ్లుంటాయ్... జాగ్రత్త!
స్టాక్ మార్కెట్లు అదేపనిగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లు కూడా పెట్టుబడి పెడితే బాగుంటుంది కదా అని ఊగిసలాడుతున్నారు. ఇదే అదనుగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏఐ అండతో ఏకంగా నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్నే సృష్టిస్తున్నారు. నకిలీ లాభాలు చూపిస్తున్నారు. 10వేలు విత్డ్రా చేయనిచ్చి... 10 లక్షలు లాగేస్తున్నారు. కొందరి దగ్గరైతే కోట్లు కొట్టేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్లో సాక్షాత్తూ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ భార్యనే మోసం చేశారంటే మోసగాళ్లు ఏ స్థాయిలో రెచి్చపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. చాలామందికి లాభాల ఆశచూపించి... నకిలీ ఖాతాల్లోకి నగదు వేయించుకుని చెక్కేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే... మార్కెట్ ర్యాలీలో భాగంగా కొన్ని అనామకపు షేర్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఫలానా షేరు కొంటే నెలలో రెండింతలవుతుందంటూ ఎస్ఎంఎస్లూ వస్తున్నాయి. వీటి వలలో చిక్కుకుని చాలామంది విలవిలలాడుతున్నారు. మరి దీనికి మార్గమేంటి? స్టాక్ మార్కెట్ అంటే మోసం మాత్రమే కాదు కదా? ఈ మోసాల బారిన పడకుండా ఉండటమెలా? మన డబ్బులు మనం కాపాడుకోవటం ఎలా? ఇదే ఈ వారం బిగ్ ‘వెల్త్ స్టోరీ’.నకిలీలు, మోసగాళ్ల సంగతి పక్కనబెడితే... ముందుగా మార్కెట్లో ట్రేడవుతున్న షేర్లతోనే ఎలాంటి స్కామ్లు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. పంప్ అండ్ డంప్.. పెద్దగా ఎవరికీ తెలియన ఓ అనామకపు షేరు ఉన్నట్టుండి తెరమీదికి వస్తుంది. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ఆ షేరు ధర అప్పటికే పెరగటం మొదలవుతుంది. దీనికి గురించి సోషల్ మీడియాలో ఫిన్ఫ్లుయెన్సర్లు ఊదరగొడతారు. ఊరూపేరూ లేని ఎస్ఎంఎస్లు కూడా వచ్చేస్తుంటాయి. అప్పటిదాకా ఆ షేరు గురించి తెలియనివారు కొందరు ఇన్వెస్ట్ చేయటం మొదలుపెడతారు. కొందరు వేచి చూద్దామని వాచ్లిస్ట్లో పెడతారు. అది మెల్లగా పెరుగుతుంటుంది. దీంతో అందరూ ఎగబడతారు. అంతే... అప్పటికే దాన్ని కొనిపెట్టుకున్న స్టాక్మార్కెట్ తిమింగలాలు రేటు పెరిగే కొద్దీ వాటిని అమ్మేస్తుంటారు. బాగా సొమ్ము చేసుకుంటారు. ఒక దశ తర్వాత వేగంగా ఆ షేరు కుప్పకూలుతుంది. మళ్లీ లేచినా... కొద్దిరోజులకే మళ్లీ పడుతుంది. భారీ రేటుకు కొన్న ఇన్వెస్టర్లు ఇరుక్కు పోయినట్లే!!.బాయిలర్ రూమ్ ఆపరేషన్స్ బాయిలర్ రూమ్లో ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు. తక్షణం బయటపడేలా బాయిలర్ ఒత్తిడి చేస్తుందన్న మాట. అదే తరహాలో... మంచి తరుణం మించిన దొరకదు, లాస్ట్ చాన్స్ అంటూ ఊరూ పేరూ లేని, పనికిమాలిన స్టాక్స్ను కొనిపించేలా కొందరు బ్రోకర్లు, ఫిన్ఫ్లుయెన్సర్లు ఒత్తిడి పెంచుతుంటారు. దాన్ని వాళ్లు సొమ్ము చేసుకుంటారు.శక్తివంతమైన ఆయుధాలున్నాయ్.. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు, మన చేతిలోనే కొన్ని శక్తివంతమైన ఆయుధాలున్నాయి. వాటిని కాస్త పదును పెట్టుకుంటే సరి. అవేంటంటే... → ఏ అంశాన్నయినా లోతుగా పరిశీలించాలి.. → కంపెనీ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలి → కంపెనీ వార్షిక నివేదికలను చదవాలి → వార్తలను విశ్వసనీయ సోర్స్ల ద్వారానే ధృవీకరించుకోవాలి → సెబీ ఇన్వెస్టర్ హెల్ప్లైన్ → ఎన్ఎస్ఈ/బీఎస్ఈ అలర్టులు → ప్రామాణికమైన ఫైనాన్షియల్ న్యూస్ ప్లాట్ఫాంలుఇన్సైడర్ ట్రేడింగ్ కంపెనీలు బయటకు వెల్లడించని సమాచారం కూడా యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. అది సహజం. దీన్ని ఆధారం చేసుకుని యాజమాన్యంగానీ, వారికి దగ్గరగా ఉండే వారు గానీ ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేస్తుంటారు. కంపెనీకి ప్రతికూలంగా ఉండే సమాచారం గనక వారికి తెలిస్తే... షేర్లను విక్రయించేయటం, సానుకూలమైన సమాచారం తెలిస్తే కొని పెట్టుకోవటం చేస్తుంటారు. ఆ తరువాత సమాచారం బయటకు వస్తుంది. దానికి తగ్గట్టుగా షేరు రియాక్ట్ అవుతుంది. దీనివల్ల ముందే ట్రేడింగ్ చేసిన కంపెనీ ఇన్సైడర్లు బాగుపడతారు. కాబట్టే దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో షేరు పెరగడానికి లేదా పడటానికి అసలు కారణాలేంటో తెలియని ఇన్వెస్టర్లు నష్టపోతూ ఉంటారు. పోంజీ, పిరమిడ్ స్కీములు ఇన్వెస్ట్మెంట్ స్కీములో కొత్తగా ఎవరినైనా చేరిస్తే, భారీగా లాభాలిస్తామంటారు. కానీ అసలు లాభాల్లో నుంచి కాకుండా, కొత్త ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న డబ్బులో కొంత పాత ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంటారు. అంతిమంగా ఇలాంటి స్కీములు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాయి. లింకు తెగి అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా కుప్పకూలుతారు.బేసిక్ అంశాలను తెలుసుకోవాలి .. పెట్టుబడుల పెట్టే ముందు ఇలాంటి కొన్ని ఆర్థికాంశాల గురించి తెలుసుకుంటే మంచిది. → పీ/ఈ నిష్పత్తి (కంపెనీ లాభాన్ని సంవత్సరాలతో గుణించడమన్న మాట) → ఎర్నింగ్స్ పర్ షేర్ (ఈపీఎస్– సదరు కంపెనీ ఒక షేరుకు ఎంత చొప్పున ఆర్జిస్తోంది) → రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్వోఈ– షేర్హోల్డర్ల ప్రతి రూ.100కు కంపెనీ ఎంత లాభాన్ని తెస్తోంది) అంకెల గురించి అంతగా అర్థం కాకపోయినా ఫర్వాలేదని, గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేయొద్దు.ఫాంటమ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటినే ఫాంటమ్ రిటర్న్స్’, ఫాంటమ్ అసెట్స్ అని కూడా పిలుస్తుంటారు. ఫాంటమ్ అనేది ఊహే కదా... అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అన్నమాట. అసలు ఉనికిలోనే లేని నకిలీ స్టాక్స్, బాండ్స్, ఫండ్స్లాంటి వాటిని అంటగడతారు. నకిలీ లాభాలు చూపిస్తుంటారు. నకిలీ స్టేట్మెంట్లు పంపిస్తారు. అంతా రియల్ అనుకుని, లాభాలు పెరుగుతుండటం చూసి మరింత పెట్టుబడి పెట్టేస్తుంటారు. ఎప్పుడైనా విత్డ్రా చేద్దామని అనుకుంటే... ఆ రోజే మొత్తం సిస్టమ్ మాయమైపోతుంది. ఈ మధ్య ఇలాంటివి బాగా పెరిగాయి. మరి తప్పించుకోవటమెలా? మరి ఇన్ని రూపాల్లో మోసగాళ్లు దాడులు చేస్తుంటే మనని మనం కాపాడుకోవటం ఎలా? ఈ సందేహానికి సమాధానం ఒక్కటే... ఆథరైజ్డ్ అవునా కాదా అన్నది చూసుకోవటం. రూపాయి పెట్టుబడి పెడుతున్నా సరే, ఇన్వెస్టింగ్కు ముందే బ్రోకర్ లేదా ప్లాట్ఫాం గురించి ధ్రువీకరించుకోవాలి. సెబీలోను, ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈలోను రిజిస్టర్డా కాదా అన్నది తెలుసుకోవాలి. సెబీలో నమోదు చేసుకోనివారికి ఎవరికైనా... పెట్టుబడి సలహాలివ్వడానికి గానీ మీ డబ్బును మేనేజ్ చేయడానికి గానీ చట్టబద్ధమైన అర్హత ఉండదు. → గ్యారంటీ రాబడులొస్తాయని చెబితే...! ఎందుకంటే స్టాక్మార్కెట్లో రాబడులకు గ్యారంటీ ఉండదు. → వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతారంటూ ఒత్తిడి చేస్తే...! ఎందుకంటే ఒత్తిడిలో ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. → అవాంఛిత కాల్స్, మెసేజీలు లేదా ఈమెయిల్స్ ద్వారా వచి్చన సమాచారాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఆ సమాచారం సరైనదైతే మీకెందుకు పంపుతారు? వాళ్లే ఉపయోగించుకుంటారుగా!. → నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే నమ్మొద్దు → గుర్తు తెలియని ప్రొఫైల్స్ లేదా ఫేక్ యోగ్యతాపత్రాలు చూపిస్తే పట్టించుకోవద్దు → ఎవరైనా సరే ‘‘మీ డబ్బు చాలా వేగంగా రెట్టింపవుతుంది’’ అంటూ హామీ ఇస్తున్నారంటే, అది సలహా కాదు, అలర్టవ్వాల్సిన విషయమని గుర్తుంచుకోవాలి. ఈ ప్రశ్నలు వేసుకోవాలి.. పెట్టుబడికి ముందు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అవేంటంటే.. → అసలు సదరు కంపెనీ ఏం చేస్తుంది? → దాన్ని నడిపేది ఎవరు? వారికి విశ్వసనీయత ఉందా? → ఆదాయం నిజమైనదేనా? నిలకడగా వచ్చేదేనా? → ఈ పెట్టుబడి ఎందుకు పెట్టానో ఎవరు అడిగినా సరళంగా వివరించగలనా? → ఏదైనా తేడా వస్తే బైటపడే మార్గమేంటి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చుకోలేకపోతే, కాస్త ఆగి, ఆలోచించాలి.తప్పుడు రీసెర్చ్ రిపోర్టులు కొన్ని ఊరూపేరూ లేని సంస్థల నుంచి రీసెర్చ్ రిపోర్టులంటూ బయటికొస్తాయి. వారు కావాలనుకున్న షేరు తాలూకు భవిష్యత్తును ఊదరగొడుతూ చూపిస్తారు. రకరకాల మెయిల్స్ ద్వారా ఈ రిపోర్టులు వచ్చి పడుతుంటాయి. నిజమేనని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే అంతే గతి.అనధికారిక ట్రేడింగ్ ఒక్కోసారి కమీషన్ కోసం కక్కుర్తి పడి ఏజెంట్లు లేదా బ్రోకర్లు మీ అనుమతి లేకుండా మీ అకౌంట్లో అనధికారికంగా ట్రేడింగ్ చేస్తుండవచ్చు. దీన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి.మోసపూరిత అడ్వైజరీ స్కాములు సడెన్గా వాట్సాప్లో ఓ మెసేజ్ వస్తుంది. ఫలానా గ్రూపుకు చెందిన నిపుణుడు సలహాలిస్తాడంటూ లింకు పంపిస్తారు. ఆ గ్రూపు లో చేరితే... అప్పటికే కొందరు ఆ ఎక్స్పర్ట్ను పొగుడుతూ ఉంటారు. మీరిచి్చన సలహా వల్ల నేను లక్షలు సంపాదించానంటూ మెసేజీలు పెడుతుంటారు. ఆ సలహా ఏంటో... ఎప్పుడిచ్చారో కూడా మనకు తెలీదు. ఇలా కొందరు చేస్తుండగానే... ఫలానా చోట ఖాతా తెరిస్తే తాను నేరుగా సలహాలిస్తానంటూ సదరు నిపుణుడు చెబుతాడు. అందులో ఉన్నదంతా ఆ నిపుణుడి మనుషులే కాబట్టి ‘సరే సర్’.. అంటారు. అదంతా నిజమని నమ్మి మనం కూడా ఖాతా తెరిచినా... ఎక్స్పర్ట్కు ఫీజు చెల్లించినా... అంతే సంగతి.ఆన్లైన్ ఖాతాలను రక్షించుకోవాలి.. డిజిటల్ భద్రతకు చెక్లిస్ట్ → 2–ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ని ఎనేబుల్ చేయాలి → బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను వాడాలి → ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు → సందేహాస్పద లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి → అధికారిక సోర్సుల నుంచే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి ప్రస్తుత ప్రపంచంలో మిమ్మల్ని ముంచినా మీ ఫోనే... మిమ్మల్ని కాపాడగలిగేది కూడా మీ చేతిలోని ఫోనే.ఫ్రాడ్ అని అనుమానం వస్తే.. వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సత్వరం ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఏ మా త్రం జాప్యం చేసినా మోసగాళ్లు తప్పించుకునేందుకు అవ కాశం ఇచి్చనట్లవుతుంది. ఈ కింది వాటికి రిపోర్ట్ చేయాలి. → సెబీ ఆన్లైన్ కంప్లైంట్ పోర్టల్ → ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ → మీ బ్రోకర్ → లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ఆరోగ్యకరమైన మైండ్సెట్ పెట్టుబడులకు సంబంధించి ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలి. → హైప్ని బట్టి కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలి → పోర్ట్ఫోలియోలో వైవిధ్యం పాటించాలి. అంటే డబ్బంతా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత ఈక్విటీ, కొంత డెట్, కాస్తంత బంగారంలో పెట్టుబడి పెడితే ఎటు పోయి ఎటొచ్చీ ఏదైనా పడిపోయినా మరొకటి మెరుగ్గా ఉండటం వల్ల ఓవరాల్గా రిసు్కలు తగ్గుతాయి. → ‘హాట్ టిప్స్’ వెంటబడకూడదు. చేతులు కాల్చుకోకూడదు. → FOMO.. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఇక ఎప్పటికీ కుదరదు, ఆ మంచి అవకాశం ఇక దొరకనే దొరకదు అన్నట్లుగా ఒక్కోసారి కంగారు పుట్టించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. స్కామర్లు ఇలాంటివాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త వహించాలి. → సిసలైన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బోరింగ్గానే ఉంటుంది. కానీ అదే మంచిది. ఓపిగ్గా, రీసెర్చ్ చేసి, క్రమశిక్షణతోనే పెట్టుబడుల ఫలాలు అందుకోవచ్చు. షార్ట్కట్లంటూ ఉండవు. స్టాక్ మార్కెట్ అనేది అన్ని వివరాలను తెలుసుకుని, జాగ్రత్తగా వ్యవహరించే ఇన్వెస్టర్లకు మాత్రమే లాభాలనిస్తుంది. అజాగ్రత్తగా ఉండే వారిని నష్టాలతో శిక్షిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండాలి. అదే సమయంలో అప్రమత్తంగానూ ఉండాలి. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనుకోవడం కాకుండా పెట్టుబడిని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి!.
డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు, అమెరికా న్యాయస్థానాలకు మధ్య జరుగుతున్న ‘గుత్తాధిపత్య’ పోరు కొత్త మలుపు తిరిగింది. తమ సెర్చ్ డేటాను చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పంచుకోవాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీలుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ డేటా బదిలీని వాయిదా వేయాలని కంపెనీ కోరింది.తీర్పు నేపథ్యం ఏమిటి?ఆన్లైన్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని 2024లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి అమిత్ మెహతా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. యాపిల్, శామ్సంగ్ వంటి కంపెనీలకు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించి, గూగుల్ను ‘డిఫాల్ట్’ సెర్చ్ ఇంజిన్గా ఉంచడం ద్వారా పోటీని అణచివేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలో గూగుల్ తన సెర్చ్ డేటాను ప్రత్యర్థులకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.గూగుల్ వాదన ఏంటి?అప్పీలు పెండింగ్లో ఉండగానే డేటాను పంచుకుంటే కంపెనీకి చెందిన కీలక వాణిజ్య రహస్యాలు ప్రత్యర్థుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రజలు గూగుల్ను బలవంతంగా కాకుండా, మంచి సేవలు అందిస్తుంది కాబట్టే వాడుతున్నారు’ అని గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్లో గట్టి పోటీ ఉందని, కోర్టు నిర్ణయం ఆవిష్కరణల స్థాయిని తక్కువ అంచనా వేసిందని కంపెనీ వాదిస్తోంది.షరతులకు అంగీకారం.. కానీ!గోప్యత, భద్రతా రక్షణలకు సంబంధించిన నిబంధనలను పాటించడానికి సిద్ధమని గూగుల్ తెలిపింది. అయితే డేటా షేరింగ్, సిండికేటెడ్ ఫలితాలు, ప్రకటనల పంపిణీ విషయంలో మాత్రమే స్టే కోరుతోంది.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
భారతీయ భోజనాన్ని డీకోడ్ చేసే కృత్రిమమేధ
భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.ఈ ప్రాజెక్ట్కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.పరిశోధనలోని ముఖ్యాంశాలుసాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్ఐటీ హైదరాబాద్ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.బిర్యానీపై ప్రత్యేక దృష్టిభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.వంట గదిలో ఏఐ అసిస్టెంట్ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!
పర్సనల్ ఫైనాన్స్
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో కొంత భాగం మినహాయించి, మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చో చూడవచ్చు. అంతే కాకుండా యూపీఐ పిన్ నెంబర్ ఉపయోగించడం ద్వారా.. మీ ఖాతాలు బదిలీ చేసుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న తరువాత ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి
ఎస్బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్డ్రాయల్ మెషిన్ (ఏడీడబ్ల్యూఎం) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత పరిమితిని మించి ఉపయోగించే కస్టమర్లపై ఫీజులు పెరిగాయి. ఈ సవరించిన ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ఎస్బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.11 + జీఎస్టీగా నిర్ణయించారు. ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల నేపథ్యంలో ఏటీఎం సేవల ధరలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.ప్రభావం వీరిపైనే..ఉచిత లావాదేవీ పరిమితిని మించి ఎస్బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఈ మార్పులు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. అయితే, పలు ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి మినహాయింపును ఎస్బీఐ ఇచ్చింది.ఉచిత లావాదేవీల పరిమితులురెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర కలిపి) యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై అన్ని ప్రదేశాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. గతంలో వీరికి అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి.ప్రభావం లేని ఖాతాలివే.. ఈ సవరణల వల్ల కింది ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలు – ప్రస్తుత ఛార్జ్ నిర్మాణమే కొనసాగుతుంది. ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితంగా, ఉచితంగా కొనసాగుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకేసీ) ఖాతాలకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రతి ఇంట్లో లక్షాధికారి! ఈ ఎస్బీఐ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్ కోసం పొదుపు, పెట్టుబడులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడి అవసరమనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఈ భావనకు భిన్నంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకువచ్చిన ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం నిలుస్తోంది. నెలకు కేవలం రూ.610 పెట్టుబడితోనే రూ.1 లక్ష కార్పస్ ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం.ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం?ఇది ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితి పాటు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి మొత్తం (అసలు + వడ్డీ) లభిస్తుంది. క్రమమైన పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.ఈ ఆర్డీ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.రూ.610తో రూ.1 లక్ష ఎలా?ఈ పథకంలోని 10 ఏళ్ల ప్లాన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెలకు రూ.610 చొప్పున పొదుపు చేస్తే, 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు రూ.1 లక్ష కార్పస్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.20 పొదుపు చేస్తే చాలు.. ఆరు అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగానే వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసేవాళ్లు, తక్కువ ఆదాయం కలిగినవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా మారింది.వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.. ‘హర్ ఘర్ లఖ్పతి’ ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితి, పొదుపుదారు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 6.55 శాతం, 5–10 సంవత్సరాల కాలానికైతే 6.30% వడ్డీ లభిస్తుంది.అదే సీనియర్ సిటిజన్లు అయితే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 7.05 శాతం, 5–10 సంవత్సరాల కాలానికి 6.80% వడ్డీ అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లు ఎస్బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మారవచ్చు అన్నది గమనించాలి.తక్కువ కాలంలో లక్ష్యం చేరాలంటే?త్వరగా రూ.1 లక్ష కార్పస్ కావాలనుకునే వారు ఎక్కువ నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. 3 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.2,510, 5 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.1,420 పొదుపు చేయాల్సి ఉంటుంది.రూ.1 లక్ష కన్నా ఎక్కువ కావాలంటే..ఈ పథకం కేవలం రూ.1 లక్ష వరకే కాదు. పొదుపుదారులు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వంటి అధిక లక్ష్యాలను కూడా ఎంచుకోవచ్చు. లక్ష్యం మొత్తాన్ని బట్టి నెలవారీ చందా ఆధారపడి ఉంటుంది. పిల్లల చదువు, వివాహ ఖర్చులు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరు అర్హులు?భారతీయ పౌరుడెవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు.
పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్.. వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.ముందస్తు ప్రణాళికసేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.ధరల పరిశీలనఒక సైట్లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్లైన్లో కొన్ని టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్బ్యాక్ ద్వారా వాలెట్లోకి వస్తుంది.నో-కాస్ట్ ఈఎంఐఖరీదైన వస్తువులు (ల్యాప్టాప్స్, ఫ్రిజ్లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.ఎక్స్ఛేంజ్ ఆఫర్లుమీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.సైబర్ భద్రత అత్యంత ముఖ్యంషాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్వేలను మాత్రమే వాడండి.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత


