ప్రధాన వార్తలు
గోల్డ్లోన్ సూపర్ రన్
ముంబై: బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండడం.. వాటి తనఖా రుణాల మార్కెట్ విస్తరణకు అనుకూలిస్తోంది. 2025 నవంబర్ నాటికి రెండేళ్లలో పసిడి రుణాలు రెట్టింపై రూ.15.6 లక్షల కోట్లకు చేరాయి. ధరల పెరుగుదలతో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు వాటిపై మరింత మొత్తంలో రుణాల మంజూరునకు వీలు కల్పిస్తోంది. 2025 నవంబర్ నాటికి ఏడాది కాలంలో బంగారం తనఖా రుణాలు 42 శాతం పెరిగాయి. 2024 నవంబర్ నాటికి ఏడాది కాలంలో పెరుగుదల 39 శాతంగా ఉంది. దీంతో 2023 నాటికి రుణాల మొత్తం రూ.7.9 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నవంబర్ చివరికి రూ.15.6 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం రిటైల్ రుణాల్లో పసిడి రుణాల వాటా 9.7 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇది 8.1 శాతంగా ఉంది. ఈ వివరాలను క్రెడిట్ బ్యూరో సంస్థ క్రిఫ్ హైమార్క్ విడుదల చేసింది. పసిడి రుణాల్లో రూ.2.5 లక్షలకు మించినవి మొత్తం రుణాల్లో సగం మేర ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఇవి 36.4 శాతంగా ఉన్నాయి. 36 శాతం రుణాలు పురుషులు తీసుకున్నవే. మరింత వేగవంతం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన బంగారం రుణాలు, వాటి విలువ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లోనే అధిగమించడం గమనార్హం. బంగారం రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు 60% వాటాతో ఆధిపత్యం చలాయిస్తున్నా యి. బంగారం రుణ ఆధారిత ఎన్బీఎఫ్సీల వాటా 8.1%గా ఉంది. బంగారం రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు క్రిఫ్ హైమార్క్ తెలిపింది.దక్షిణాదిలోనే అధికం.. బంగారం రుణాల మా ర్కెట్ దక్షిణాదిలోనే ఎక్కు వగా ఉంది. మూడింట రెండొంతుల బంగారం రుణా లు దక్షిణాది రాష్ట్రాలో ఉన్నాయి. ఇక పది రాష్ట్రా ల పరిధిలోనే 90% రుణాలు ఉండడం గమనార్హం. 2025 నవంబర్తో ముగిసిన ఏడాది కాలంలో బంగారం రుణాల్లో 67% వృద్ధి గుజరాత్లో నమోదైంది. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో 50% వృద్ధి కనిపించింది. బంగారం రుణాలు సకాలంలో చెల్లించని రాష్ట్రాల్లో ఎక్కువగా తమిళనాడు, యూపీ, మహారాష్ట్రలు ఉన్నాయి.
వెండి, పసిడి అదే పరుగు..
న్యూఢిల్లీ: వెండి, పసిడి రేట్లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. అమెరికన్ డాలరు బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్ల దన్నుతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కిలో ధర మరో రూ. 15,000 పెరిగి ఇంకో కొత్త ఆల్ టైం గరిష్టం రూ. 3,85,000కి ఎగిసింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 5,000 మేర పెరిగి రూ. 1,71,000కు ఎగిసింది. బంగారం, వెండి రేట్లు పటిష్టంగా ర్యాలీ చేస్తున్నాయని, ప్రతీ రోజు కొత్త గరిష్టాలకు ఎగదోసేందుకు బుల్స్కి కొత్త కారణాలు లభిస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరంగా అనిశ్చితులు మొదలైన అంశాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి రేట్లకు రెక్కలొస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 74.57 డాలరు పెరిగి 5,256.35 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో 130.13 డాలర్లు ఎగిసి 5,311.38 డాలర్ల స్థాయిని కూడా తాగింది. అటు సిల్వర్ ధర 0.12 శాతం పెరిగి 112.22 డాలర్లకు చేరింది. అటు ఫ్యూచర్స్ మార్కెట్ కామెక్స్లో గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్టు ఒక దశలో దాదాపు 200 డాలర్లు పైగా పెరిగి 5,344.70 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఇక సిల్వర్ సైతం సుమారు పది డాలర్లకు పైగా పెరిగి ఒక దశలో 116.11 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ కాంట్రాక్టు రూ. 1,75,848 వద్ద, సిల్వర్ మార్చి కాంట్రాక్టు రూ. 3,85,200 వద్ద ట్రేడయ్యింది. అనిశ్చితికి, టారిఫ్ బెదిరింపులు, ఫెడరల్ రిజర్వ్ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాల్లాంటివి భౌగోళిక–రాజకీయ అనిశ్చితికి దారితీస్తూ, సిల్వర్, గోల్డ్ ధరలను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.
దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే దాదాపు రెండు దశాబ్దాల్లో 2044 నాటికి దక్షిణాసియాలోని ఎయిర్లైన్స్కి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరం కానున్నాయి. ఇందులో భారత్ వాటా దాదాపు 90 శాతం ఉండనుంది. అమెరికన్ విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ తమ కమర్షియల్ మార్కెట్ ఔట్లుక్ (సీఎంవో)లో ఈ మేరకు అంచనాలు వేసింది. బుధవారమిక్కడ ఏవియేషన్ సదస్సు వింగ్స్ 2026 కార్యక్రమం సందర్భంగా బోయింగ్ ఎండీ (కమర్షియల్ మార్కెటింగ్, యురేషియా, ఇండియన్ సబ్కాంటినెంట్) అశ్విన్ నాయుడు ఈ విషయాలు తెలిపారు. 3,300 విమానాల డిమాండ్కి సంబంధించి 2,875 చిన్న విమానాలు, 395 పెద్ద విమానాలు ఉండవచ్చని చెప్పారు. ప్రాంతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో విమానాల సంఖ్య వచ్చే 20 ఏళ్లలో నాలుగు రెట్లు పెరగనుందని నాయుడు తెలిపారు. ఇదే సమయంలో భారత్, దక్షిణాసియాలో ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ సగటున 7 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి జనాభా, ఆర్థిక వృద్ధి, ఎయిర్పోర్టులు, కనెక్టివిటీ పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని వివరించారు. భారీగా సిబ్బంది .. వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రాంతీయంగా విమానయాన సంస్థలకు సుమారు 1,41,000 మంది సిబ్బంది అవసరమవుతారని నాయుడు తెలిపారు. ఇందులో 45,000 మంది పైలట్లు, 45,000 మంది టెక్నీషియన్లు, 51,000 మంది క్యాబిన్ సిబ్బంది ఉంటారని వివరించారు. దక్షిణాసియాలో మెయింటెనెన్స్, రిపేర్, డిజిటల్ సర్వీసులు, శిక్షణ మొదలైన ఏవియేషన్ సరీ్వసులపై 195 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైటెక్ తయారీ రంగం, ఈకామర్స్ తదితర రంగాల దన్నుతో ఎయిర్ కార్గో మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుందని, ఈ నేపథ్యంలో కొత్తవి, కన్వర్ట్ చేసిన ఫ్రైటర్ల సంఖ్య ప్రస్తుత స్థాయి నుంచి అయిదు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
యూఎస్తో వాణిజ్య ఒప్పందంపై కేంద్రం స్పష్టత
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ తన పట్టును బిగిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భారత్-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు మంగళవారంతో ముగిశాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు స్పష్టతనిచ్చారు. భారత్ తన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిందని, యూఎస్తో ట్రేడ్ డీల్ పరంగా ఇప్పుడు ముందడుగు వేయాల్సింది అమెరికానే అని తేల్చి చెప్పారు.అమెరికా అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని కొందరు సభ్యులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలను ప్రస్తుత చర్చలతో ముడిపెట్టవద్దని అధికారులు హెచ్చరించారు. ‘భారత్ తన వైపు నుంచి ఇవ్వాల్సిన ఆఫర్లను ఇప్పటికే యూఎస్ ముందుంచింది. భారత్ వైపు నుంచి ప్రక్రియ పూర్తయింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది యూఎస్’ అని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందం అసలు వివరాలు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR), చర్చల బృందాలకు మాత్రమే తెలుసని పేర్కొన్నారు.భారత్-ఈయూ ఒప్పందం కీలకంఅమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ ఈయూతో ఒప్పందం వేగవంతం కావడం వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ప్రీమియం వస్తువులపై భారత్ సుంకాల తగ్గింపునకు అంగీకరించింది. ప్రతిగా భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలకు ఈయూ మార్కెట్లో భారీ రాయితీలు లభించనున్నాయి. ఇది దేశంలో ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది.వ్యూహాత్మకంగా..అమెరికాతో ఉన్న అనిశ్చితి వల్లే ఈయూతో భారత్ వేగంగా ఒప్పందం చేసుకుంటోందనే వాదనలను అధికారులు తోసిపుచ్చారు. ‘ప్రతి చర్చకు దాని సొంత పథం, వ్యూహాత్మక హేతుబద్ధత ఉంటుంది. ఈయూ చర్చలు అమెరికా చర్చల కంటే చాలా ముందు నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఇది సహజమైన పరిణామమే తప్పా ఒక దేశంపై ఆధారపడి తీసుకున్న నిర్ణయం కాదు’ అని అధికారులు వివరించారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
బడ్జెట్ 2026పై పారిశ్రామిక వర్గాల అంచనాలు
కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ పారిశ్రామిక వర్గాల అంచనాలు, ఆశలపై కేపీఎంజీ ఇండియా సర్వే విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను చట్టం నేపథ్యంలో పన్ను విధానాల సరళీకరణ, ప్రోత్సాహకాలపై స్టేక్హోల్డర్లు ఏమనుకుంటున్నారో ఈ ప్రీ-బడ్జెట్ సర్వే స్పష్టం చేస్తోంది.జనవరి 2026లో నిర్వహించిన ఈ సర్వేలో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఫార్మా, హెల్త్కేర్ వంటి కీలక రంగాలకు చెందిన 100 మందికి పైగా పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ప్రధాన మార్పులు ఇవే..పన్ను ప్రోత్సాహకాల పునరుద్ధరణతయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో ఉన్న తక్కువ పన్ను రేటు విధానాన్ని మళ్లీ తీసుకురావాలని 34 శాతం మంది కోరుతుండగా, దాదాపు 50 శాతం మంది నిర్దిష్ట రంగాల వారీగా ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.కొత్త ఐటీ చట్టం - సరళీకరణకొత్త చట్టం దిశగా అడుగులు పడుతున్నా కొన్ని అంశాల్లో మరింత స్పష్టత, సరళీకరణ అవసరమని సర్వే నొక్కి చెప్పింది. అందులో..టీడీఎస్/టీసీఎస్ నిబంధనల అమలులో సరళత.క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానంలో మార్పులు.లిటిగేషన్ (న్యాయపరమైన వివాదాలు), అసెస్మెంట్ ప్రక్రియలో వేగం అవసరమనే అభిప్రాయాలున్నాయి.స్టాండర్డ్ డిడక్షన్మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిచ్చేలా బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని గణనీయంగా పెంచాలని 73 శాతం మంది కోరుతున్నారు.జీఎస్టీ, ఇతర సంస్కరణలుజీఎస్టీ ‘ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్’లో ఉన్న లోపాల వల్ల క్రెడిట్ నోట్ల మిస్మ్యాచ్లు పెరుగుతున్నాయని, వీటిని సరిదిద్దాలని 82 శాతం మంది కోరుతున్నారు.ప్రస్తుత డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) వివాదాలను వేగంగా పరిష్కరించడంలో విఫలమవుతోందని సగం మంది ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ల (IFSC) కోసం దీర్ఘకాలిక నిబంధనలు కావాలని 51 శాతం మంది కోరారు.‘పరిశ్రమ వర్గాలు కేవలం పన్ను తగ్గింపులనే కాకుండా పారదర్శక వివాద పరిష్కార వ్యవస్థను, పన్ను నిబంధనల పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి రానున్న కొత్త చట్టం ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి’ అని కేపీఎంజీ ఇండియా, ట్యాక్స్ హెడ్ సునీల్ బడాలా అన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
హైదరాబాద్లోకి మరో అంతర్జాతీయ కంపెనీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్ఎఫ్ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో కొత్త ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు.గ్లోబల్ నెట్వర్క్లో కీలకం..ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్హాఫెన్, స్పెయిన్లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న బీఏఎస్ఎఫ్ డిజిటల్ హబ్ల్లో ఇప్పుడు హైదరాబాద్ చేరనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి.ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్లో ఉన్నాయి’ అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.నియామక ప్రక్రియ ప్రారంభంహైదరాబాద్ హబ్ నిర్వహణ కోసం ‘BASF Digital Solutions Private Limited’ అనే కొత్త భారతీయ చట్టపరమైన సంస్థను (Legal Entity) ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ, ఇతర సన్నాహక పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు డీట్రిచ్ స్పాండౌ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అత్యుత్తమ డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఒక ఆకర్షణీయమైన వర్క్ప్లేస్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ఇప్పటికే ఉన్న తయారీ, ఆర్ అండ్ డీ కేంద్రాలకు ఈ డిజిటల్ హబ్ అదనపు మద్దతు ఇస్తుందని కంపెనీ ఇండియా గ్రూప్ కంపెనీల అధిపతి అలెగ్జాండర్ గెర్డింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
కార్పొరేట్
దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం
బడ్జెట్ 2026పై పారిశ్రామిక వర్గాల అంచనాలు
హైదరాబాద్లోకి మరో అంతర్జాతీయ కంపెనీ
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు ఊరట
అదానీ గ్రూప్-ఎంబ్రేయర్ మధ్య ఒప్పందం
సిల్వర్ సునామీ
భారత్ - ఈయూ డీల్: భారీగా తగ్గనున్న వీటి ధరలు!
షార్ట్కట్స్ లేవు, అదృష్టం కాదు.. గూగుల్లో జాబ్!
భారత్-ఈయూ డీల్: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?
ఐసీఐసీఐ ప్రు నుంచి ఐసిఫ్ పథకాలు
25,100 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో క...
ఇకపై సిల్వర్ రీసైక్లింగ్
ఎంఎంటీసీ–పీఏఎంపీ వెండి రీసైక్లింగ్ (పునర్వినియోగ...
లిస్టింగ్కు 12 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇన్ఫ్రా.మార్కెట్ మాతృ సంస్థ హెల్లా ఇ...
అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో.. తొ...
భారత మార్కెట్ రూపురేఖలు మార్చే డీల్!
భారతీయ విలాసవంతమైన కార్ల ప్రియులకు, టెక్ ప్రియులకు...
వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగానికి ...
వారంలో ఐదు రోజులే పని!?
బ్యాంకింగ్ రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ‘వా...
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో ‘గ్లూటెన్’ గుర్తింపు
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల తయారీలో పారదర్శకత పెంచే ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
H-1B visa: ఇండియన్ టెకీలకు షాక్.. ఇంటర్వ్యూలు ఇంకా లేటు!
అమెరికా హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తుదారులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా, తాజా పరిణామాలతో అపాయింట్మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయ ఐటీ వృత్తి నిపుణులపై తీవ్రంగా పడనుంది.భారత్లోని అమెరికా కాన్సులేట్లలో భారీ బ్యాక్లాగ్లు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో, ఇప్పటికే ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలలు వెనక్కి నెట్టి 2027 మధ్యకాలానికి మార్చినట్లు సమాచారం.వాస్తవానికి 2025 డిసెంబర్లో మొదలైన జాప్యం కారణంగా అప్పట్లో అపాయింట్మెంట్లను 2026కి మార్చారు. అనంతరం అవి 2026 అక్టోబర్కి, ఇప్పుడు నేరుగా 2027కి వాయిదా పడడం వృత్తి నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారులు స్టాంపింగ్ కోసం భారత్కు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 2027 వరకు రెగ్యులర్ అపాయింట్మెంట్లు లేవని ‘అమెరికన్ బజార్’ కూడా వెల్లడించింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు కూడా రద్దయ్యాయని సమాచారం. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్నవారికి సైతం తేదీలు మార్చి ఏడాది తర్వాతకు కేటాయిస్తూ ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది.ఉద్యోగాలు, కుటుంబాలపై తీవ్ర ప్రభావంఈ జాప్యం వల్ల వేలాది మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయారు. కొందరి భార్యా పిల్లలు అమెరికాలో ఉండగా, వారు మాత్రం భారత్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు, వీసా గడువు పొడిగింపుల విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన ఉద్యోగులకు కొన్ని సంస్థలు పొడిగింపులు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సింగపూర్ ఐటీ కంపెనీని కొంటున్న హెచ్సీఎల్ టెక్
దేశీ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ తాజాగా సింగపూర్కి చెందిన ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సంస్థ ఫినర్జిక్ సొల్యూషన్స్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 19 మిలియన్ సింగపూర్ డాలర్లను (సుమారు రూ. 136 కోట్లు) వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సేవల విభాగంలో, ముఖ్యంగా కోర్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని హెచ్సీఎల్ టెక్ తెలిపింది.ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఒప్పందం పూర్తి కాగలదని వివరించింది. 2019లో ప్రారంభమైన ఫినర్జిక్కి భారత్, సింగపూర్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్లో కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో కంపెనీ 12.6 మిలియన్ సింగపూర్ డాలర్ల ఆదాయం ఆర్జించింది.హెచ్సీఎల్ టెక్ ఫినర్జిక్ సొల్యూషన్స్ను కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కోర్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల్లో డిజిటల్ పరిష్కారాలపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఫినర్జిక్ వద్ద ఉన్న డొమైన్ నైపుణ్యం, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం హెచ్సీఎల్ టెక్కు ఉపయోగపడనుంది. ముఖ్యంగా యూరప్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలపర్చుకునే అవకాశం ఈ డీల్ ద్వారా లభించనుంది.ఈ కొనుగోలుతో హెచ్సీఎల్ టెక్ తన బ్యాంకింగ్ క్లయింట్లకు మరింత సమగ్ర సేవలను అందించగలదు. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు కొత్త సేవలను అందించే క్రాస్-సెల్లింగ్ అవకాశాలు పెరగడంతో పాటు, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఆదాయ వృద్ధికి ఇది దోహదపడనుంది. ఐటీ సేవల కంపెనీలు డొమైన్ ఆధారిత సంస్థలను కొనుగోలు చేసి విలువ పెంచుకునే ధోరణిలో భాగంగానే ఈ డీల్ను మార్కెట్ వర్గాలు చూస్తున్నాయి.
టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం
న్యూఢిల్లీ: టెక్నాలజీపై నియంత్రణ కలిగి ఉండడమే అసలైన సార్వభౌమత్వమని జోహో సంస్థ వ్యవస్థాపకుడు చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. సాంకేతికాభివృద్ధితో ప్రపంచం పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశాలకు సాంకేతిక స్వయం ప్రతిపత్తి అత్యవసరమన్నారు. కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ అజెండాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ లక్ష్యాల్లో తామూ భాగస్వామం కావడం ఆనందంగా ఉందన్నారు. జోహో పనితీరును కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సీఈవోలు ప్రశంసిస్తున్నారని శ్రీధర్ తెలిపారు. మాతృభూమి అవకాశాలతో ఎదురుచూస్తోంది .. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, సుంకాలు, వీసా అనిశి్చతుల నేపథ్యంలో భారతీయ వృత్తి నిపుణులు మాతృ దేశానికి రావాలని వెంబు పిలుపునిచ్చారు. ఇక్కడి అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ ఇతర దేశాల్లో పనిచేస్తున్న భారత వృత్తి నిపుణులను కోరారు. ప్రపంచస్థాయి కంపెనీలు సైతం విస్తరణ వ్యూహాల్లో భాగంగా మనదేశంలోనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. ‘దేశ జనాభా, విద్యా వ్యవస్థ, మౌలిక వసతులు, ప్రభుత్వ విధానాల సమ్మేళనం భారత్ టెక్ వ్యవస్థకు పరిపూర్ణ మద్దతు ఇస్తున్నాయ’ని శ్రీధర్ తెలిపారు.ఐపీఓపై ఆసక్తి లేదు.. జోహో సంస్థను ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లే ఆసక్తి లేదని శ్రీధర్. సంస్థ ప్రైవేట్గా కొనసాగడం వల్ల పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. త్రైమాసిక ఫలితాల ఒత్తిళ్లకు లోనవాల్సిన అవసరం లేదని, అలాంటి తాత్కలిక లక్ష్యాలు తమకు ఇష్టం లేదని చెప్పారు. జోహో ఉత్పత్తుల ఆవిష్కరణలకు మూలధన నిధుల కంటే దీర్ఘకాలిక సహనం అవసరమన్నారు. దేశానికి దీర్ఘకాలిక దృష్టితో పనిచేసే, సహనంతో కూడిన ఆర్అండ్డీ ఆధారిత సంస్థలు మరిన్ని అవసరమన్నారు. ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ సొల్యూషన్ (ఈఆర్పీ) ఆవిష్కరణ.. భారతీయ వ్యాపార కంపెనీల కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సొల్యూషన్ను శ్రీధర్ ఆవిష్కరించారు. ప్రస్తుతానికి ఈఆర్పీ సొల్యూషన్ భారత మార్కెట్కే పరిమితమవుతుందని, తరువాత దశలవారీగా ప్రపంచ మార్కెట్లోకి విస్తరించనుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అ య్యేందుకు దాదాపు అయిదేళ్ల సమయం పట్టిందని, భవిష్యత్తులో జోహోకు ప్రధాన వృద్ధి ఇంజిన్ గా ఈఆర్పీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ దరిద్రం.. పాత ఫోన్లూ కొనలేక అవస్థలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులకు కొత్త స్మార్ట్ఫోన్ల సంగతి పక్కనపెడితే పాత (యూజ్డ్) ఫోన్లనూ కొనుక్కోవడమూ భారమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం.. యూజ్డ్ స్మార్ట్ఫోన్లపై విధించే వాల్యుయేషన్, సుంకాలను తగ్గించింది.ప్రస్తుత ధరల వద్ద కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హై-ఎండ్ స్మార్ట్ఫోన్లు అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్తో పాటు ఇతర వేరియంట్లకు కూడా కొత్త అంచనా విలువలను కస్టమ్స్ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది.ప్రపంచవ్యాప్తంగా పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. డాన్ పత్రిక నివేదిక ప్రకారం.. ఐఫోన్ వంటి మోడళ్లు వయస్సు పెరిగే కొద్దీ, వారి ప్రాథమిక రిటైల్ జీవితకాలం ముగింపునకు చేరుకునే సరికి సహజంగానే విలువ కోల్పోతాయి.మార్కెట్ రేట్లకు అనుగుణంగా విలువలను సర్దుబాటు చేయడం ద్వారా, ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను పౌరులకు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రీవ్యాల్యూయేషన్ చేపట్టారు. తాజా అప్డేట్లో నాలుగు ప్రముఖ బ్రాండ్లకు చెందిన 62 మోడళ్ల హ్యాండ్సెట్లు ఉన్నాయి.శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల మార్కెట్ డేటా, అధికారిక ట్రేడ్-ఇన్ ధరలను పరిశీలించిన తర్వాత కొత్త విలువలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై అమ్మకపు పన్ను, నిలిపివేత పన్ను, ప్రత్యేక సుంకాలు వంటి సంక్లిష్టమైన పన్ను విధానం అమల్లో ఉండగా, ఇవన్నీ ప్రభుత్వ నోటిఫై చేసిన వాల్యుయేషన్ ఆధారంగా లెక్కిస్తారు.2026 కోసం సవరించిన వ్యాల్యూయేషన్లు 2024తో పోలిస్తే యూజ్డ్ స్మార్ట్ఫోన్ల విలువల్లో భారీ తగ్గుదలని చూపుతున్నాయి. ముఖ్యంగా యూజ్డ్ ఐఫోన్ల ధరలు 32% నుంచి 81% వరకు తగ్గాయి. ఈ మార్పులతో పాకిస్తాన్లో పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గి, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
పర్సనల్ ఫైనాన్స్
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
రోజుకో రూ.200.. అవుతాయి రూ.10 లక్షలు!
సంపద నిర్మించుకోవడానికి ఎప్పుడూ అధిక రిస్క్ పెట్టుబడులు లేదా స్టాక్ మార్కెట్పై లోతైన అవగాహనే అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే చిన్నపాటి రోజువారీ పొదుపు కూడా కాలక్రమేణా బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది. అలాంటి నమ్మదగిన పథకమే ‘పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్’ (RD). రోజుకు కేవలం రూ.200 పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చు.చిన్న పొదుపు.. పెద్ద ఫలితంఈ పథకంలోని అసలైన బలం స్థిరత్వం. రోజుకు రూ.200 అంటే నెలకు రూ.6,000 మాత్రమే. ఇది చాలా కుటుంబాలకు సులభంగా నిర్వహించగలిగే మొత్తమే. ఈ చిన్న మొత్తాలు మీ నెలవారీ బడ్జెట్పై ఒత్తిడి లేకుండా, క్రమంగా పెద్ద మొత్తంగా మారతాయి.పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. పోస్టాఫీస్ భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో, ఈ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపిక.ఖాతా ప్రారంభం సులభంకేవలం రూ.100తోనే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు తమ సమీప పోస్టాఫీసులో ఈ ఖాతాను సులభంగా తెరవవచ్చు. నెలవారీ డిపాజిట్లు వెంటనే ప్రారంభించవచ్చు.రికరింగ్ డిపాజిట్కు ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ అనంతరం, ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పొడిగింపు వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పెరిగి, సంపద మరింత వేగంగా పెరుగుతుంది.అత్యవసర అవసరాలకు రుణ సదుపాయంఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ, ఆర్డీ వడ్డీ రేటు కంటే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.కొన్ని షరతుల మేరకు ప్రీ-మెచ్యూరిటీ విత్డ్రాయల్కు కూడా అవకాశం ఉంటుంది. అనివార్య కారణాలతో ఖాతాదారు మరణించినప్పుడు, డిపాజిట్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందవచ్చు.రోజుకు రూ.200.. రూ.10 లక్షలు ఎలా అవుతాయంటే?➕రోజుకు రూ.200 ➕నెలకు రూ.6,000➕5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే➕మొత్తం డిపాజిట్: రూ.3.60 లక్షలు➕వడ్డీ: సుమారు రూ.68,197➕మెచ్యూరిటీ మొత్తం: రూ.4.28 లక్షలు➕అదే ఖాతాను మరో 5 ఏళ్లు పొడిగిస్తే➕మొత్తం డిపాజిట్: రూ.7.20 లక్షలు➕మొత్తం వడ్డీ: సుమారు రూ.2.05 లక్షలు➕తుది మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ.10.25 లక్షలుసున్నా మార్కెట్ రిస్క్, ప్రభుత్వ హామీ, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా చిన్నపాటి రోజువారీ పొదుపులు కూడా గొప్ప ఆర్థిక మైలురాయిగా మారతాయని పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం నిరూపిస్తోంది.


