Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mukesh Ambani hails Dr Raghunath Mashelkar1
వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు: కొనియాడిన అంబానీ

శాస్త్రీయ రంగంలో ప్రతిభను మరియు "నవ భారత్" స్ఫూర్తిని కొనియాడుతూ జరిగిన ఒక ప్రత్యేక సాయంత్రం వేళ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్‌కు ఘన నివాళులర్పించారు. డాక్టర్ మషేల్కర్ రికార్డు స్థాయిలో 54 గౌరవ డాక్టరేట్లు పొందిన అసాధారణ విద్యా మైలురాయిని పురస్కరించుకుని, ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమం, పుస్తకావిష్కరణ నిర్వహించారు.ఈ వేడుకలో ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మ, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, శాస్త్రీయ రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు.వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు వరకు..సభికులను ఉద్దేశించి అంబానీ మాట్లాడుతూ, ముంబై వీధి దీపాల కింద చదువుకున్న ఒక సామాన్య బాలుడు ప్రపంచ స్థాయి శాస్త్రీయ ఐకాన్‌గా ఎదిగిన డాక్టర్ మషేల్కర్ ప్రయాణాన్ని వివరించారు."డాక్టర్ మషేల్కర్ జీవిత ప్రయాణంలో నేను ఆధునిక భారతదేశ ప్రయాణాన్ని చూస్తున్నాను," అని అంబానీ పేర్కొన్నారు. "అతను పేదరికం నుంచి ప్రపంచ స్థాయి గౌరవం వరకు ఎదిగారు. దీనికి కారణం వారి తల్లి అంజనీ గారి ప్రేమ, ఆయన ఉక్కు సంకల్పమే."చాలామంది జీవితంలో ఒక డిగ్రీ పొందడానికే కష్టపడతారని, కానీ మషేల్కర్ గారు 54 డాక్టరేట్లు సాధించారని అంబానీ కొనియాడారు. అంత ఎదిగినా ఆయన ఎంతో వినయంగా ఉంటారని, "పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడూ కిందకే వంగి ఉంటుంది" అనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుందని అన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై డాక్టర్ మషేల్కర్ చూపిన ప్రభావం ఈ ప్రసంగంలో ప్రధానాంశంగా నిలిచింది. రిలయన్స్‌ను కేవలం ప్రాజెక్టులను అమలు చేసే సంస్థ నుంచి సైన్స్ ఆధారిత ఆవిష్కరణల (Innovation) దిశగా మళ్లించడంలో మషేల్కర్, ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మల పాత్ర కీలకమని అంబానీ అంగీకరించారు.2000వ సంవత్సరంలో మషేల్కర్ సూచన మేరకు స్థాపించబడిన రిలయన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కంపెనీ సంస్కృతినే మార్చివేసిందని ఆయన వెల్లడించారు. నేడు రిలయన్స్‌లో 1,00,000 కంటే ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ఉన్నారని గర్వంగా చెప్పారు. "రిలయన్స్‌ను ఒక పారిశ్రామిక సంస్థగా కాకుండా, ఒక సైన్స్ కంపెనీగా చూడాలని ఆయన మాకు నేర్పారు," అని అంబానీ అన్నారు. ముఖ్యంగా జియో & గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మషేల్కర్ దార్శనికతకు నిలువుటద్దాలని పేర్కొన్నారు.'గాంధీ ఇంజనీరింగ్' మరియు కృత్రిమ మేధ (AI)ఈ సందర్భంగా డాక్టర్ మషేల్కర్ రాసిన తాజా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆయన ప్రసిద్ధ సిద్ధాంతమైన *"More from Less for More"* (తక్కువ వనరులతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా ఎక్కువ ఉత్పత్తి చేయడం) గురించి వివరించారు. దీనినే ఆయన 'గాంధీ ఇంజనీరింగ్' అని పిలుస్తారు.ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుత కృత్రిమ మేధ (AI) యుగానికి అన్వయిస్తూ, అంబానీ ఒక ముఖ్యమైన మాట చెప్పారు: "AI రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వం వహించాలి, కానీ 'కరుణ లేని సాంకేతికత.. కేవలం యంత్రం మాత్రమే' అని మనం గుర్తుంచుకోవాలి." తెలివితేటలతో పాటు సానుభూతిని, సంపదతో పాటు లక్ష్యాన్ని జోడించడం ద్వారా భారత్ ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాను చూపగలదని ఆయన ఆకాంక్షించారు.క్వాంటం కంప్యూటింగ్, సింథటిక్ బయాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలలో భారత్ "డీప్-టెక్ సూపర్ పవర్"గా ఎదగాలంటే, పారిశ్రామిక రంగం & విద్యా సంస్థల మధ్య బలమైన అనుసంధానం ఉండాలని అంబానీ పిలుపునిచ్చారు. ప్రసంగం ముగియగానే, అంబానీ "జ్ఞాన యోగి" అని పిలిచిన డాక్టర్ మషేల్కర్‌కు సభికులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో గౌరవ వందనం సమర్పించారు.

Silver Jumps by Rs 16000 in a Week2
రూ. 16వేలు పెరిగిన వెండి రేటు: వారంలోనే ఇంతలా

బంగారం ధరలు మాదిరిగా కాకుండా.. వెండి ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో (డిసెంబర్ 14 నుంచి 20 వరకు) సిల్వర్ రేటు ఏకంగా రూ. 16,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.2025 డిసెంబర్ 14న రూ. 2,10,000 వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 20వ తేదీ (శనివారం) నాటికి రూ. 2,26,000లకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. ఒక గ్రామ్ సిల్వర్ రేటు 226 రూపాయలకు చేరిందన్న మాట. వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే తగ్గిన రేట్లు, మిగిలిన నాలుగు రోజులు పెరుగుదల దిశగానే వెళ్లాయి.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.

WhatsApp GhostPairing Scam Explained And VC Sajjanar Tweet3
వాట్సాప్‌లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!

టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా 'ఘోస్ట్‌పెయిరింగ్' పేరుతో వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్వాట్సప్‌లోని డివైజ్ లింక్ ఫీచర్ ద్వారా.. ఓటీపీ, పాస్‌వర్డ్స్, వెరిఫికేషన్స్ వంటి వివరాలతో సంబంధం లేకుండానే స్కామర్లు.. యూజర్స్ ఖాతాల్లోకి చొరబడతున్నారు. దీనినే టెక్ నిపుణులు ఘోస్ట్‌పెయిరింగ్ అంటున్నారు.ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్ ఇలా..సోషల్ ఇంజినీరింగ్ ద్వారా.. సైబర్ నేరగాళ్లు ఘోస్ట్‌పెయిరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. స్కామర్లు.. యూజర్ల వాట్సప్‌కు తెలిసిన కాంటాక్టుల ద్వారా Hey, is this you in this photo? లేదా I just found your picture అనే మోసపూరిత మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్‌లో ఇంటర్నల్‌గా వేరే లింక్ ఉంటుంది. కాబట్టి యూజర్లు తమకు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే.. ఒక ఫేక్ వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది.ఓటీపీ గానీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడుకోలేక లాక్‌ చేస్తారు.ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలామీకు తెలియని లేదా.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయవద్దు.వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్‌ చేయండి.Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.వీసీ సజ్జనార్ ట్వీట్వాట్సాప్ ఘోస్ట్‌పెయిరింగ్ ఫీచర్ గురించి.. వీసీ సజ్జనార్ ట్వీట్ చేసారు. ఇందులో.. "హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్‌ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్‌ చేయకండి'' అని వెల్లడించారు.🚨 Cyber Alert: New WhatsApp “GhostPairing” scam 🚨If you receive a message saying “Hey, I just found your photo” with a link — DO NOT click it, even if it appears to come from someone you know.⚠️ This is a GhostPairing scam.The link takes you to a fake WhatsApp Web page and… pic.twitter.com/7PsZJXw2pt— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 21, 2025

Nita Ambani praises Mukesh Ambani at Dhirubhai Ambani International School Annual Day4
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) వార్షికోత్సవ వేడుకలను నీతా అంబానీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. పూజా కార్యక్రమంతో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''కుటుంబం అంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకునే ప్రదేశం, మన కష్టాలను ఆనందాలను పంచుకునే ప్రదేశం, విభేదాలను పరిష్కరించుకోవడం ఎలా అని తెలుసుకునే ప్రదేశం. విలువలు, సంస్కృతి అనేది తాతలు, తల్లిదండ్రుల నుంచి లభిస్తాయని పేర్కొన్నారు. నా అతిపెద్ద బలం, నా చీర్‌లీడర్ నా భర్త ముఖేష్" అని అన్నారు.ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ మాత్రమే కాకుండా.. ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ మొదలైన సెలబ్రిటీలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by DAIS Mumbai (@daismumbai)

JSW MG Motor India to Hike Car Prices5
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్‌ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా, బీఎమ్‌డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే. అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ కూడా తమ బైక్‌ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు.భారత్‌లో తయారు చేసే జీ 310 ఆర్‌ఆర్, సీఈ 02 బైక్‌లతో పాటు ఎఫ్‌ 900 జీఎస్, ఎఫ్‌ 900 జీఎస్‌ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్‌లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది.

Restaurants Want To leave Food Delivery Apps6
ఫుడ్‌ డెలివరీ యాప్‌లు వద్దు బాబోయ్‌..

దేశంలో ఫుడ్‌ డెలివరి యాప్‌లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్‌లు రెస్టారెంట్‌ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్‌ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్‌ డెలివరి యాప్‌లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.అయితే ఇవే ఫుడ్‌ డెలివరి యాప్‌లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్‌ డెలివరి యాప​్‌లు, రెస్టారెంట్ల మధ్య నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్‌లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్‌ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్‌ డెలివరీ యాప్‌లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..అధిక కమీషన్లు ఫుడ్‌ డెలివరీ యాప్‌లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్‌పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్‌లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్‌కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది. సొంత డెలివరీ యాప్‌ల వైపు రెస్టారెంట్లుఅధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్‌లు, వెబ్‌సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.బ్రాండ్ విలువకు దెబ్బఫుడ్ డెలివరీ యాప్‌లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్‌లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది.

Advertisement
Advertisement
Advertisement