Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YouTube Down Company Response After Massive Outage1
యూట్యూబ్ డౌన్!.. స్పందించిన కంపెనీ

బుధవారం సాయంత్రం యూట్యూబ్ (Youtube) వినియోగించడంలో అంతరాయం ఏర్పడింది. సుమారు 3,20,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు డౌన్‌డెటెక్టర్ (Downdetector) వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వేలాది మంది యూట్యూబ్ మ్యూజిక్, టీవీ సేవలలో సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. 'ఎర్రర్ సంభవించింది, దయచేసి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి' వంటి ఎర్రర్ సందేశాలను చూసినట్లు లేదా డెస్క్‌టాప్ & మొబైల్ యాప్‌లు రెండింటిలోనూ ఖాళీ బ్లాక్ స్క్రీన్‌లను చూసినట్లు వినియోగదారులు నివేదించారు.''మీరు ప్రస్తుతం YouTubeలో వీడియోలను ప్లే చేయలేకపోతే, మేము దాన్ని పరిష్కరిస్తున్నాము! మీ ఓర్పుకు ధన్యవాదాలు'' అంటూ టీమ్ యూట్యూబ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.యూట్యూబ్ అంతరాయానికి కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ వెల్లడించేలేదు. అయితే దీని పరిష్కారానికి టీమ్ యూట్యూబ్ చురుగ్గా పనిచేస్తోంది. యూట్యూబ్ అంతరాయం యునైటెడ్ స్టేట్స్ అంతటా వినియోగదారులను ప్రభావితం చేసింది. డౌన్‌డెటెక్టర్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, ఫీనిక్స్, చికాగో, వాషింగ్టన్, డెట్రాయిట్ వంటి పట్టణ కేంద్రాల నుంచి అత్యధిక సంఖ్యలో నివేదికలు వస్తున్నాయి. ఈ సమస్య అమెరికాలో మాత్రమే కాకుండా.. భారత్, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కూడా తలెత్తిందని సమాచారం.If you’re not able to play videos on YouTube right now – we’re on it! Thanks for your patience, and you can follow along here for updates: https://t.co/EcPxm09f77— TeamYouTube (@TeamYouTube) October 16, 2025

GCC hiring in India rose 5to 7percent in July-September quarter2
జీసీసీల్లో హైరింగ్‌ జోరు 

న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీక్వెన్షియల్‌గా జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో హైరింగ్‌ 5–7 శాతం పెరగడం దీనికి నిదర్శనం. ఏఐ–డేటా, ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్, క్లౌడ్, ఫిన్‌ఆప్స్, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. క్వెస్‌ కార్ప్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), తయారీ, ఆటోమోటివ్, ఎనర్జీ, టెక్నాలజీ, హార్డ్‌వేర్‌ మొదలైన రంగాలు జీసీసీల వృద్ధికి కీలకంగా ఉంటున్నాయి. భారత్‌లో జీసీసీల పరిణామక్రమం ప్రస్తుతం అత్యంత వ్యూహాత్మక దశలోకి ప్రవేశిస్తోందని క్వెస్‌ కార్ప్‌ సీఈవో (ఐటీ స్టాఫింగ్‌) కపిల్‌ జోషి తెలిపారు. నియామకాలకు కేటాయించే బడ్జెట్లు ప్రధానంగా ఆదాయార్జన, సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టే విధంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో సుమారు 1,850 జీసీసీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 20 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 25 లక్షలకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. నివేదికలో మరిన్ని విశేషాలు .. → ఏఐ, డేటా సైన్స్‌ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు ఎనిమిది శాతం పెరగ్గా, ఫిన్‌ఆప్స్‌ ఆధారిత క్లౌడ్‌ సేవల విభాగంలో హైరింగ్‌ 6 శాతం పెరిగింది. → హైదరాబాద్, బెంగళూరులాంటి ప్రథమ శ్రేణి మెట్రో నగరాలు ఏఐ, క్లౌడ్‌ ఉద్యోగాలకు కీలకంగా నిలుస్తున్నాయి. ఇక కోయంబత్తూరు, కొచ్చి, అహ్మదాబాద్‌లాంటి ద్వితీయ శ్రేణి హబ్‌లలో త్రైమాసికాలవారీగా నియామకాలు 8–9 శాతం పెరిగాయి. తక్కువ వ్యయాలతో సరీ్వసులను అందించేందుకు తోడ్పడే కేంద్రాలుగా ఇలాంటి నగరాలు ఎదుగుతున్నాయి. → ఏఐ–డేటాలో అత్యధికంగా 41 శాతం స్థాయిలో నిపుణుల కొరత ఉంది. ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్‌ (39 శాతం), క్లౌడ్‌–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (25 శాతం), సైబర్‌సెక్యూరిటీ (18 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దీనితో, హైరింగ్‌ ప్రక్రియలో, ముఖ్యంగా ప్రథమ శ్రేణి నగరాల వెలుపల, మిడ్‌–సీనియర్‌ హోదాల్లో నియామకాల్లో జాప్యం జరుగుతోంది. → జూలై–సెప్టెంబర్‌ వ్యవధిలో జీసీసీల్లో నియామకాలకు సంబంధించి దక్షిణాది మెట్రో నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. 26 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిలి్చంది. తర్వాత స్థానాల్లో హైదరాబాద్‌ (22 శాతం), పుణె (15 శాతం), చెన్నై (12 శాతం) ఉన్నాయి. → బెంగళూరులో ఎక్కువగా అడ్వాన్స్‌డ్‌ ఏఐ, ఫిన్‌ఆప్స్‌ ఉద్యోగాలకు, హైదరాబాద్‌లో మలీ్ట–క్లౌడ్‌ ఇంటిగ్రేషన్‌ సంబంధ కొలువులకు డిమాండ్‌ నెలకొంది. పుణె, చెన్నైలో ఆటోమోటివ్‌ సాఫ్ట్‌వేర్, ప్లాట్‌ఫాం ఇంటిగ్రేషన్‌ మొదలైన విభాగాల్లో నిపుణులకు డిమాండ్‌ ఉంది.

Gold prices reached a new record high of Rs 1,31,800 per 10 grams Delhi Markets3
బంగారం @ 1,31,800

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో పసిడి ధరలు మరో సరికొత్త రికార్డును సృష్టించాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి బుధవారం మరో రూ.1,000 పెరిగి రూ.1,31,800 (పన్నులు సహా) స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కాస్తంత దిగొచ్చింది. కిలోకి రూ.3,000 తగ్గి రూ.1,82,000 (పన్నులు సహా) వద్ద స్థిరపడింది. మంగళవారం వెండి కిలోకి రూ.6,000 పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ట ధర రూ.1,85,000ను నమోదు చేయడం తెలిసిందే. పండుగల సీజన్‌ కావడంతో రిటైలర్లు, జ్యుయలర్ల కొనుగోళ్లతో పసిడి ధరలు పెరిగినట్టు ఆల్‌ ఇండియా సఫారా అసోసియేషన్‌ తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా బలమైన ర్యాలీ, దేశీయంగా భౌతిక బంగారం కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్‌ తోడవడంతో బంగారం ధర మరో నూతన రికార్డు గరిష్టానికి చేరింది. రూపాయి బలపడడం ధరల ర్యాలీకి కీలక అవరోధంగా వ్యవహరించింది. దీంతో దేశీ మార్కెట్లో ధరల పెరుగుదల పరిమితమైంది. మొత్తం మీద బుల్లిష్‌ ధోరణి కొనసాగుతోంది. పండుగల కొనుగోళ్లతో ఇదే ధోరణి కొనసాగుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పార్మర్‌ తెలిపారు.

Hyundai Motor India to invest Rs 45,000 crore by FY 20304
హ్యుందాయ్‌ పెట్టుబడుల ధమాకా!

ముంబై: కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా(హెచ్‌ఎంఐఎల్‌) దేశీయంగా భారీ పెట్టుబడులకు తెరతీస్తోంది. దక్షిణ కొరియా మాతృ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ కో ప్రెసిడెంట్, సీఈవో జోస్‌ మునోజ్‌ 2030కల్లా దేశీ యూనిట్‌ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా హ్యుందాయ్‌ కార్ల తయారీ, అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా రెండోపెద్ద కేంద్రంగా భారత్‌ నిలవనున్నట్లు తెలియజేశారు. భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న మునోజ్‌ ఎగుమతుల్లో హెచ్‌ఎంఐఎల్‌ వాటా 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా వృద్ధి లక్ష్యాలలో భాగంగా కంపెనీ ఆదాయాన్ని సైతం 1.5 రెట్లు పెంచుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించే ప్రణాళికల్లో ఉన్నట్లు హెచ్‌ఎంఐఎల్‌ ఎండీ అన్సూ కిమ్‌ తెలియజేశారు. ఇందుకు వీలుగా 2030కల్లా 26 ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. వీటిలో 7 కొత్త ప్రొడక్టులకు కంపెనీ తెరతీయనుంది. తద్వారా ఎంపీవీ, ఆఫ్‌రోడ్‌ ఎస్‌యూవీ విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటితోపాటు 2027కల్లా స్థానికంగా డిజైన్‌ చేసి అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని దేశీ మార్కెట్‌కోసం తయారు చేసే లక్ష్యంతో ఉంది. ఈ బాటలో లగ్జరీ విభాగ బ్రాండ్‌ జెనిసిస్‌ను దేశీయంగా 2027కల్లా విడుదల చేయాలని ఆశిస్తోంది. మూడు దశాబ్దాలు దేశీయంగా మూడు దశాబ్దాల విజయం తరువాత గతేడాది ఐపీవో ద్వారా కంపెనీ లిస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి దశ వృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నట్లు మునోజ్‌ కంపెనీ తొలిసారి నిర్వహించిన ఇన్వెస్టర్‌ డే సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 2030కల్లా రూ. 45,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల్లో 60 శాతం ప్రొడక్ట్, ఆర్‌అండ్‌డీపైనా.. మిగిలిన 40 శాతం సామర్థ్య విస్తరణ, అప్‌గ్రెడేషన్‌ కోసం వినియోగించనున్నట్లు వివరించారు. అమ్మకాలరీత్యా ప్రస్తుతం హ్యుందాయ్‌కు భారత్‌ మూడో పెద్ద మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్‌ ఇండియా విజన్‌కు అనుగుణంగా ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా భారత్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మునోజ్‌ పేర్కొన్నారు. కాగా.. కంపెనీ సీవోవో తరుణ్‌ గార్గ్‌ 2026 జనవరి 1నుంచి ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలిసారి భారతీయ వ్యక్తికి సారథ్యం అప్పగించడమనేది మాతృ సంస్థకు దేశీ కార్యకలాపాలపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు మునోజ్‌ పేర్కొన్నారు. హ్యుందాయ్‌ క్యాపిటల్‌ దేశీయంగా 2026 రెండో త్రైమాసికం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు.చిన్న కార్లు వీడేదిలేదు దేశీయంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఉన్నదని మునోజ్‌ పేర్కొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అప్‌గ్రేడ్‌ కావడానికి వీలయ్యే చిన్న కార్ల విభాగాన్ని వీడబోమని స్పష్టం చేశారు. ఎంట్రీలెవల్‌ కస్టమర్లు తదుపరి దశలో అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు వీలయ్యే ప్రొడక్టులపైనా దృష్టి కొనసాగించనున్నట్లు తెలియజేశారు. భారత్‌ను రెండు మార్కెట్లుగా పేర్కొనవచ్చని, గ్లోబల్‌ మార్కెట్ల తరహాలో మరిన్ని ఎస్‌యూవీలు, ఆఫ్‌రోడ్‌ వాహనాలకు వీలున్నట్లే మరోపక్క ఎంట్రీలెవల్‌ కార్లకు డిమాండ్‌ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

RBL Bank launches Humsafar RuPay Prepaid Card at Global Fintech Fest 20255
ఆర్‌బీఎల్ బ్యాంక్ నుంచి ప్రీపెయిడ్ కార్డులు

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL Bank), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో భాగస్వామ్యంలో ‘హమ్ సఫర్’ పేరుతో రూపే ప్రీపెయిడ్ కార్డులు ప్రారంభించింది. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ (GFF)లో ఈ ప్రీపెయిడ్ కార్డును ఆవిష్కరించింది.ఈ కార్డ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) అనుభవాన్ని అందించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను సమన్వయపరచడంలో దోహదపడుతుంది. వినియోగదారులు తమ ‘హమ్ సఫర్’ కార్డును తక్షణమే, సురక్షితంగా రీచార్జ్ చేసుకోవచ్చు.ఈ కార్డు ద్వారా వినియోగదారులు ప్రయాణం, ఆహారం, ఇంధనం, షాపింగ్, వినోదం వంటి అనేక అవసరాల కోసం సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది వాడటానికి సులభమైన ప్రీపెయిడ్ పరిష్కారంగా నిలుస్తుంది.హమ్ సఫర్ రూపే కార్డు ముఖ్య ప్రయోజనాలు🔹సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం: మెట్రో, బస్సుల్లో పొడవైన క్యూలను తప్పించుకుని వేగంగా ప్రయాణించవచ్చు.🔹నిరవధిక లావాదేవీలు: రూపే ప్లాట్‌ఫామ్ ఆధారంగా సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీల అనుభవం.🔹స్మార్ట్ ఖర్చు నిర్వహణ: అవసరమైనంత మొత్తాన్ని ముందుగానే లోడ్ చేసుకొని, ఎక్కువ కార్డులు లేదా నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉపయోగించవచ్చు.🔹మెరుగైన నియంత్రణ: ఖర్చులపై స్పష్టత, బడ్జెట్‌పై నియంత్రణ సాధ్యమవుతుంది.

LinkedIns 2025 Top Startups list reveals6
ఈ కంపెనీల్లో కెరియర్‌కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్‌ లిస్ట్‌

ప్రపంచపు అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్ (LinkedIn).. 2025 లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా జాబితాను (2025 LinkedIn Top Startups India List) ప్రకటించింది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగ ఆసక్తి, ఎంగేజ్‌మెంట్‌, అగ్రశ్రేణి ప్రతిభ ఆకర్షణ వంటి సూచకాలపై ఆధారపడి రూపొందించిన ఈ జాబితా.. వేగంగా ఎదుగుతున్న, అభివృద్ధికి అనుకూలమైన స్టార్టప్‌లను హైలైట్ చేస్తుంది.అగ్రస్థానాల్లో నిలిచిన స్టార్టప్స్క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో (Zepto) వరుసగా మూడవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ స్టోరేజ్‌ సంస్థ లూసిడిటీ రెండో స్థానంలో, బెంగళూరుకు చెందిన 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే ప్లాట్‌ఫామ్ స్విష్‌ మూడో స్థానాన్ని పొందాయి. ఈ సంస్థలు విభిన్న రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, వేగవంతమైన వృద్ధి, టెక్నాలజీలో లోతు, కేటగిరీ సృష్టిలో చురుకుదనంతో నిలిచాయి.ప్రాంతీయ ప్రాముఖ్యతబెంగళూరుకు చెందిన 9 స్టార్టప్స్ టాప్ 20లో చోటు దక్కించుకోగా, ఢిల్లీ, ముంబై ఆధారిత అంకుర సంస్థలు చెరో 2 జాబితాలో చేరాయి. ఇక పుణె(EMotorad), హైదరాబాద్ (Bhanzu) వంటి నగరాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.2025 టాప్ 20 స్టార్టప్స్ జాబితాజెప్టోస్విష్వీక్డేజార్కాన్విన్భాన్జురిఫైన్ ఇండియాఈమోటోరాడ్అట్లిస్ఇంటర్వ్యూ.ఐఓబ్లిస్ క్లబ్ఫస్ట్ క్లబ్స్నాబిట్గోక్విక్డెజెర్వ్న్యూమెకార్డు 91లైమ్ చాట్యాప్స్ ఫర్ భారత్ఉద్యోగ అవకాశాల కోసం చిట్కాలు ఈ జాబితా యువతకు కెరీర్ ఎంపికల్లో స్పష్టతనిచ్చే గైడ్‌గా నిలుస్తోంది. వేగంగా ఎదుగుతున్న సంస్థలను ఎలా ఎంచుకోవాలో, వాటిలో ఎలా ఉద్యోగం పొందాలో కొన్ని చిట్కాలను లింక్డ్ఇన్ ఇండియా సీనియర్ ఎడిటర్ నిరజితా బెనర్జీ అందించారు. అవి.. * స్టార్టప్ స్కేలింగ్ ట్రెండ్‌లను గమనించండి* వ్యవస్థాపకుల పట్ల విశ్వాసం, వ్యూహాలను పరిశీలించండి* ఆవిష్కరణతో పాటు కార్యాచరణలో నైపుణ్యం ఉన్న కంపెనీలను ఎంచుకోండి* మార్కెట్ విస్తరణ, ప్రొడక్ట్-మార్కెట్ ఫిట్‌ను అంచనా వేయండి

Advertisement
Advertisement
Advertisement