ప్రధాన వార్తలు
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.బిల్లులోని ముఖ్యాంశాలుప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా?
మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా?
ఉదయాన్నే లేచి పార్కులో వాకింగ్ చేస్తున్నారా? ఆఫీసులో లిఫ్ట్కు బదులు మెట్లు ఎక్కుతున్నారా? రాత్రికి సమయానికి నిద్రపోతున్నారా? అయితే, ఇవన్నీ కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ జేబును కూడా కాపాడబోతున్నాయి! ఇప్పటివరకు మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే బీమా కంపెనీలు ఇకపై మీరు ఎలా జీవిస్తున్నారు(Lifestyle) అనే అంశాన్ని బట్టి రేట్లను ఫిక్స్ చేయనున్నాయి.ఒకప్పుడు బీమా అంటే కేవలం పాలసీ పత్రాలు, క్లెయిమ్లకే పరిమితం. కానీ ఇప్పుడు ‘పే-హౌ-యు-లివ్’(Pay-How-You-Live) విధానంతో అడుగులు వేస్తోంది. కస్టమర్ల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు, రోజువారీ డేటా ఆధారంగా ప్రీమియంలను నిర్ణయించేదే ఈ విధానం. మీ స్మార్ట్ వాచ్ ఇచ్చే డేటా ఆధారంగా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బీమా ప్రీమియం తగ్గుతుంది. అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం కాబోతోంది. 2025లో ఐఆర్డీఏఐ తెచ్చిన సంస్కరణలతో ఈ డైనమిక్ ఇన్సూరెన్స్ మోడల్ ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది.‘పే హౌ యు లివ్’ అంటే..సాధారణంగా బీమా పాలసీలు వయసు, జెండర్ వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తాయి. కానీ, ‘పే-హౌ-యు-లివ్’ నమూనాలో రియల్ టైమ్ వెల్నెస్ డేటా కీలకం అవుతుంది. స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ యాప్ల ద్వారా సేకరించిన సమాచారం (ఉదాహరణకు రోజువారీ నడక, నిద్ర సమయం, వ్యాయామం) ఆధారంగా అల్గారిథమ్లు బీమా ప్రీమియంలను సర్దుబాటు చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే ఆరోగ్యవంతులకు ప్రీమియం తగ్గుతుంది. మీ జీవనశైలి మెరుగుపడితే మీ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.2025లో వచ్చిన మార్పులుఈ విధానం వేగవంతం కావడానికి ఐఆర్డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) 2025లో ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలు ఈ మార్పులకు ప్రధాన కారణం.ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉన్న గరిష్ట వయసు పరిమితులను తొలగించడం వల్ల వృద్ధులకు కూడా ఈ వెల్నెస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.గతంలో 8 ఏళ్లుగా ఉన్న మోరటోరియం కాలాన్ని(పాలసీదారుడు తన పాలసీని నిర్దిష్ట కాలం పాటు కొనసాగించిన తర్వాత బీమా సంస్థ తన క్లెయిమ్ను తిరస్కరించడానికి వీలులేని కాలం) 5 ఏళ్లకు తగ్గించడం ద్వారా వినియోగదారులకు భరోసా పెరిగింది.వృద్ధులపై ప్రీమియం భారం పడకుండా, పెంపును 10% కి పరిమితం చేయడం వంటి చర్యలు ఈ మోడల్ను మరింత న్యాయబద్ధంగా మార్చాయి.స్మార్ట్ పరికరాల వాడకం పెరగడం వల్ల డేటా సేకరణ సులభమైంది.ప్రస్తుత మార్కెట్ స్థితిగతులుభారతదేశంలో ఈ ధోరణి ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రారంభమైంది. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు ‘పే హౌ యు డ్రైవ్’ ద్వారా సురక్షితంగా వాహనం నడిపేవారికి రాయితీలు ఇస్తున్నాయి.ఆరోగ్య బీమా.. ప్రస్తుతం జిమ్ మెంబర్షిప్లు లేదా స్టెప్ కౌంట్ ఆధారంగా రివార్డ్ పాయింట్లు ఇచ్చే పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.జీవిత బీమా.. 2025 నాటికి టాప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వెల్నెస్ రైడర్లను జోడిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి పేఅవుట్లను పెంచేలా మార్పులు జరుగుతున్నాయి.సవాళ్లుఈ విధానం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించడం వల్ల డేటా భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. జన్యుపరమైన లేదా అనివార్యమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మోడల్ వల్ల ప్రీమియం భారం పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఐఆర్డీఏఐ పారదర్శకత, సమ్మిళిత నిబంధనలను కఠినతరం చేస్తోంది.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ మోడల్కు మరింత ఆదరణ పెరుగుతోంది. దేశంలోని యువత సాంకేతికతను ఇష్టపడటం ఈ మార్పుకు కలిసివచ్చే అంశం. బీమా అనేది కేవలం ఆపదలో ఆదుకునే ఆర్థిక ఉత్పత్తిగానే కాకుండా, కస్టమర్లను ఆరోగ్యంగా ఉంచే ఒక వెల్నెస్ పార్టనర్గా రూపాంతరం చెందుతోంది.ఇదీ చదవండి: ‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..
హౌసింగ్ మార్కెట్లో మందగమనం
దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని మందగమనాన్ని ఎదుర్కొంటోంది. 2025 సంవత్సరం ముగింపు నాటికి భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ప్రాప్ఈక్విటీ అనే రియల్టీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025 నాలుగో త్రైమాసికంలో మొత్తం 98,019 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం క్షీణత నమోదైంది. ముఖ్యంగా 2021 మూడో త్రైమాసికం తర్వాత నమోదైన అత్యల్ప విక్రయాల వాల్యూమ్ ఇదే కావడం గమనార్హం.నవీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ల జోరుమొత్తం మార్కెట్ డీలా పడినా నవీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్లు మాత్రం సానుకూల వృద్ధిని కనబరిచాయి. నవీ ముంబై అమ్మకాల్లో 13 శాతం వృద్ధిని నమోదు చేసి స్టార్ పర్ఫార్మర్గా నిలిచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ 4 శాతం వృద్ధితో నిలకడను చాటుకుంది. అయితే, మిగిలిన ఏడు ప్రధాన నగరాల్లో అమ్మకాలు ఏకంగా 31 శాతం వరకు పడిపోయాయి.ప్రధాన నగరాల్లో అమ్మకాల పరిస్థితిబెంగళూరు: 15,603 యూనిట్ల విక్రయాలతో గతంతో పోలిస్తే 7 శాతం క్షీణతను చూసింది.హైదరాబాద్: ఇక్కడ కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.పుణె: అత్యధికంగా 31 శాతం క్షీణతతో 15,788 యూనిట్లకు పడిపోయింది.చెన్నై, కోల్కతా: వరుసగా 16 శాతం వార్షిక క్షీణతను నమోదు చేశాయి.ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గుఅమ్మకాలు తగ్గినప్పటికీ డెవలపర్ల ఆదాయం, ఇళ్ల విలువల విషయంలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. 2023లో 4.81 లక్షల ఇళ్ల లాంచ్ విలువ రూ.6.3 లక్షల కోట్లుగా ఉంటే, 2024లో లాంచ్ అయిన ఇళ్ల సంఖ్య (4.11 లక్షలు) తగ్గినప్పటికీ, వాటి విలువ మాత్రం రూ.6.8 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కొనుగోలుదారులు, డెవలపర్లు లగ్జరీ/ప్రీమియం విభాగం వైపు మళ్లుతున్నారని స్పష్టం చేస్తోంది.తగ్గిన సరఫరాకేవలం అమ్మకాలే కాకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా ఈ త్రైమాసికంలో 10 శాతం తగ్గి 88,427 యూనిట్లకు చేరుకుంది. పెరిగిన నిర్మాణ వ్యయం, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల డెవలపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్లో కొత్త ప్రాజెక్ట్ల సరఫరాలో వరుసగా 16%, 7% మేర తగ్గుదల నమోదైంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!
‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..
ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వివిధ దేశాల్లోని పర్యాటకులను అలరించే ‘యూనివర్సల్ స్టూడియోస్’ థీమ్ పార్క్ ఇప్పుడు సౌదీలో ఏర్పాటు కానుంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా ఈ ప్రాజెక్టుకు వేదిక కానుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, యూనివర్సల్ స్టూడియోస్ మాతృ సంస్థ కామ్ కాస్ట్ (Comcast) ప్రతినిధులు ఈ థీమ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కామ్ కాస్ట్ సీఈఓ బ్రియాన్ రాబర్ట్స్ ఇటీవల స్వయంగా ఖిద్దియా సైట్ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.334 చదరపు కిలోమీటర్లుఈ థీమ్ పార్క్ ఏర్పాటు కానున్న ఖిద్దియా ప్రాజెక్ట్ విస్తీర్ణం 334 చదరపు కిలోమీటర్లుగా ఉందని అంచనా. ఇది ఫ్లోరిడాలోని ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఏటా 4.8 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సౌదీ జీడీపీకి సుమారు 4.5 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.పర్యాటక రంగంలో దూసుకుపోతున్న సౌదీసౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేవలం చమురుపైనే ఆధారపడకుండా వైవిధ్యీకరించాలని చూస్తోంది. గతేడాది 10 కోట్ల మందికిపైగా సందర్శకులు సౌదీని సందర్శించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6.09 కోట్ల మంది పర్యాటకులు రావడం గమనార్హం. 2030 నాటికి ఏడాదికి 15 కోట్ల మంది పర్యాటకులను రప్పించాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!
ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!
ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని గంటల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుందా.. అంటే అవుననే చెప్పాలి. గాల్లో ప్రయాణించే పక్షిలా.. నగరంలోని గగనతలంలో విహరిస్తూ గమ్యాన్ని నిమిషాల్లో చేరుకునే ఎయిర్ టాక్సీ కల సాకారం కాబోతోంది. బెంగళూరుకు చెందిన ‘సరళా ఏవియేషన్’ తమ అధునాతన ఎయిర్క్రాఫ్ట్తో భారత విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సరళా ఏవియేషన్’ (Sarala Aviation) అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 హాఫ్-స్కేల్ ప్రోటోటైప్ గ్రౌండ్ టెస్టింగ్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నగరంలోని కంపెనీ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలు దేశీయ ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని నిజం చేసే దిశగా నిలిచాయి.ఈ విమానం ప్రత్యేకతలు7.5 మీటర్ల భారీ రెక్కల విస్తీర్ణంతో రూపొందిన SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన అతిపెద్ద, అధునాతన eVTOL విమానంగా గుర్తింపు పొందింది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. సాధారణ మోడల్స్ లాగా కాకుండా ఈ విమానాన్ని మొదటి నుంచే వాణిజ్య ధ్రువీకరణ (Certification) పొందేలా డిజైన్ చేశారు. ఇది భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన పూర్తిస్థాయి విమానానికి పునాదిగా నిలుస్తుంది.‘ఈ విభాగంలో కేవలం మొదటి స్థానంలో ఉండటం కాదు, ఏవియేషన్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదగడమే మా లక్ష్యం’ అని సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ రాకేష్ గావ్కర్ పేర్కొన్నారు. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తయారు చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీతో ఎంతో మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో నగరాల్లో గంటల తరబడి ఉండే ట్రాఫిక్ ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించనుందని చెప్పింది.నిధుల సేకరణఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం సుమారు 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.108 కోట్లు) నిధులను సేకరించింది. దీనికి అదనంగా, భారత్ మొబిలిటీ ఎక్స్పోలో జాతీయ ప్రదర్శన కోసం ఒక పూర్తిస్థాయి స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసింది. 2024లోనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL)తో సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు తక్కువ సమయంలో ప్రయాణించేలా eVTOL సేవలను ప్రారంభించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపింది.తదుపరి దశ ఏమిటి?గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం కావడంతో కంపెనీ ఇప్పుడు తన ఎయిర్ టాక్సీ ప్రోగ్రామ్లో అతి ముఖ్యమైన ధ్రువీకరణ (Validation) దశలోకి ప్రవేశించింది. త్వరలోనే ఈ హాఫ్-స్కేల్ విమానం గాలిలోకి ఎగిరే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే భారత్ సొంత ఎయిర్ టాక్సీలను కలిగిన దేశాల జాబితాలో చేరుతుంది.ఇదీ చదవండి: ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
కార్పొరేట్
మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా?
రిలయన్స్ కన్జూమర్ చేతికి ‘ఉదయం’
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
చైనా జేవీలో అరబిందో ఫార్మా వాటాల పెంపు
బిలియన్ డాలర్ల ఆదాయం
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అప్డేట్స్
పిల్లల విద్య కోసం ఐదేళ్లు..: ఖతార్లో ఇషా అంబానీ
బయోఫ్యాబ్రి.. భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం
H-1B visa: ఆగిన వర్క్పర్మిట్ల పునరుద్ధరణ
నకిలీ ఉత్పత్తులపై అవగాహన: హెర్బలైఫ్ ఇండియా సరికొత్త కార్యక్రమం
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
పసిడి @ 1.38 లక్షలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయ...
రూ.1.4 లక్షలకు చేరువలో బంగారం!: ఇక కొనేదెలా..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజ...
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణ...
పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను ఆధునీకరించే క్రమం...
చలి చంపుతున్నా వ్యాపారం భళా
భారతదేశంలో చలికాలం కేవలం వాతావరణ మార్పులకే పరిమితం...
క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటి...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
సాగర గర్భంలో అపార ఖనిజ సంపద.. వెలికితీత సాధ్యమేనా?
భారతదేశం అనేక ఖనిజాలకు (ఇంధన, లోహ, అలోహ ఖనిజాలు) నిలయం. వీటిని సరైన విధంగా గుర్తించి.. వినియోగించుకుంటే.. దిగుమతి కోసం దాదాపు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమిపైన మాత్రమే కాకుండా.. సముద్ర గర్భంలో కూడా విరివిగా లభిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియా.. నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ (NGHP) ద్వారా.. సముద్రంలో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఇంతకీ ఇదెందుకు ఉపయోగపడుతుంది?, ఎలా బయటకు తీయాలి?, బయటకు తీయడం వల్ల లాభం ఏమిటనే.. ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశం.. బంగాళాఖాతంలో మాత్రమే కాకుండా, దాని తూర్పు ఖండాంతర అంచున దగ్గర కూడా భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాల విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. కానీ దీనిని (మీథేన్ హైడ్రేట్) సముద్రం నుంచి బయటకు తీయగల సరైన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని బయటకు తీయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ద్వారా కొన్ని హక్కులను పొందాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్ను బయటకు తీయడం కష్టమా?, ఎందుకు?సముద్రం అడుగున ఉన్న భూభాగం చల్లగా (0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్) ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీథేన్ హైడ్రేట్ గడ్డ కట్టుకుని ఉంటుంది. అయితే దీనిని బయటకు తీయాలని ప్రయత్నించినప్పుడు.. కొంత ఉష్ణోగ్రత వల్ల కరిగిపోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మీథేన్ హైడ్రేట్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది.డీ–ప్రెషరైజేషన్, థర్మల్ స్టిమ్యులేషన్, వంటి టెక్నాలజీలను ఉపయోగించి లేదా కొన్ని రసాయన పద్దతుల ద్వారా మీథేన్ హైడ్రేట్ బయటకు తీయవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఎక్కువ సేపు పని చేయడం అనేది చాలా కష్టమైన పని. అంతే కాకుండా పనిచేస్తున్నప్పుడు మీథేన్ విడుదలైతే చాలా ప్రమాదం. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్ వల్ల ఉపయోగాలుసముద్రంలోని భారీ మీథేన్ హైడ్రేట్ను బయటకు తీస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ దిగుమతులు తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వంట గ్యాస్, పరిశ్రమల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్ తరాలు ఉపయోగించుకోవడానికి నిల్వ చేసుకుపోవచ్చు. బొగ్గు, పెట్రోలియంతో పోలిస్తే.. మీథేన్ హైడ్రేట్ ఉపయోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి.పరిధి దాటితే పరిస్థితులు తీవ్రం!సముద్రం అనేది ఏ ఒక్క దేశం అధీనంలో ఉండదు. ఇది మొత్తం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది. కేవలం తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ఆ దేశం ఆధీనంలో ఉంటుంది. అయితే తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రంలో లభించే వనరులను దేశం ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. ఈ పరిధి ఏ దేశం దాటినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సముద్రంలోని నిక్షేపాలను ఏ ఒక్క దేశం స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.ఇదీ చదవండి: 'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం
ప్రపంచ 5జీ అగ్రగామిగా భారత్
కొద్దిరోజుల్లో 2025వ సంవత్సరం ముగుస్తున్న వేళ, టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్ ప్రపంచ దిగ్గజంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు (400 మిలియన్లు) చేరుకుంది. ఇది భారతదేశ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్యలో దాదాపు 32 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచ డిజిటల్ వృద్ధికి భారత్ ప్రధాన ఇంజిన్గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా 5G విస్తరిస్తున్నప్పటికీ, భారతదేశ వృద్ధి పథం సాటిలేనిదిగా ఉంది. 2025 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5G కస్టమర్ల సంఖ్య సుమారు 290 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ప్రపంచవ్యాప్త మొబైల్ కస్టమర్ల సంఖ్య మూడింట ఒక వంతు. 110 కోట్లకు పైగా వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, భారత్ రికార్డు వేగంతో ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తోంది. జులై 2025 నాటికి 36.5 కోట్ల వినియోగదారులను చేరుకున్న భారతీయ మార్కెట్, 2030 నాటికి 100 కోట్లకు, 2031 నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా.ముందంజలో జియోఈ విప్లవంలో రిలయన్స్ జియో (Reliance Jio) కేవలం భారతీయ లీడర్గానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ పవర్హౌస్గా అవతరించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో జియో 50 కోట్ల మొబైల్ వినియోగదారుల చారిత్రక మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 31 నాటికి ఆ సంఖ్య 51 కోట్లకు పెరిగింది. కేవలం ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే దాదాపు 3 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారు. కేవలం 5G విభాగంలోనే, 2025 చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 26 కోట్లకు చేరుకోనుంది. జియో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్లో 5G వాటా ఇప్పుడు 50 శాతంగా ఉంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లో ఈ నెట్వర్క్ ద్వారా ఏకంగా 162 ఎక్సాబైట్ల (162 బిలియన్ జీబీ) డేటా వినియోగం జరిగింది. 5G నెట్వర్క్కు మారడం వల్ల ఏడాది ప్రారంభంలో 32.3 జీబీగా ఉన్న సగటు జియో వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఇప్పుడు 38.7 జీబీకి పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యంఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రిలయన్స్ జియో తిరుగులేని డిజిటల్ లీడర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కంపెనీ చెప్పింది. 2025 చివరి నాటికి ఈ ప్రాంతంలో జియో వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 3.2 కోట్లు దాటినట్లు పేర్కొంది. దూకుడుగా విస్తరణ, సాంకేతిక విజయాలతో తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్ పర్ఫార్మర్గా నిలిచినట్లు తెలిపింది. మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా, హోమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా కంపెనీ విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు స్పష్టం చేసింది. జియో ఎయిర్ఫైబర్ (Jio Fiber) సేవలు మార్కెట్ వాటాలో సింహభాగాన్ని దక్కించుకోవడంతో, రెండు రాష్ట్రాల్లో వైర్లైన్ వినియోగదారుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుకుందని చెప్పింది.100 కోట్ల దిశగా ప్రయాణంభారత ప్రభుత్వం ఈ డిజిటల్ ప్రయాణంపై ధీమాగా ఉంది. 2026 నాటికి దేశీయ 5G వినియోగదారుల సంఖ్య 43 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, 5G డివైజెస్ అందుబాటులోకి రావడంతో 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలున్నాయి. 5G ప్రారంభించిన కేవలం మూడేళ్లలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంది. ఈ చారిత్రక మార్పులో రిలయన్స్ జియో ముందు వరుసలో నిలిచినట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
వాట్సాప్లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!
టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా 'ఘోస్ట్పెయిరింగ్' పేరుతో వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్వాట్సప్లోని డివైజ్ లింక్ ఫీచర్ ద్వారా.. ఓటీపీ, పాస్వర్డ్స్, వెరిఫికేషన్స్ వంటి వివరాలతో సంబంధం లేకుండానే స్కామర్లు.. యూజర్స్ ఖాతాల్లోకి చొరబడతున్నారు. దీనినే టెక్ నిపుణులు ఘోస్ట్పెయిరింగ్ అంటున్నారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ ఇలా..సోషల్ ఇంజినీరింగ్ ద్వారా.. సైబర్ నేరగాళ్లు ఘోస్ట్పెయిరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. స్కామర్లు.. యూజర్ల వాట్సప్కు తెలిసిన కాంటాక్టుల ద్వారా Hey, is this you in this photo? లేదా I just found your picture అనే మోసపూరిత మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్లో ఇంటర్నల్గా వేరే లింక్ ఉంటుంది. కాబట్టి యూజర్లు తమకు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే.. ఒక ఫేక్ వెబ్పేజ్ ఓపెన్ అవుతుంది.ఓటీపీ గానీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడుకోలేక లాక్ చేస్తారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలామీకు తెలియని లేదా.. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దు.వాట్సాప్ సెట్టింగ్స్లో 'Linked Devices' ఆప్షన్ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్లు ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.వీసీ సజ్జనార్ ట్వీట్వాట్సాప్ ఘోస్ట్పెయిరింగ్ ఫీచర్ గురించి.. వీసీ సజ్జనార్ ట్వీట్ చేసారు. ఇందులో.. "హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి'' అని వెల్లడించారు.🚨 Cyber Alert: New WhatsApp “GhostPairing” scam 🚨If you receive a message saying “Hey, I just found your photo” with a link — DO NOT click it, even if it appears to come from someone you know.⚠️ This is a GhostPairing scam.The link takes you to a fake WhatsApp Web page and… pic.twitter.com/7PsZJXw2pt— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 21, 2025
పర్సనల్ ఫైనాన్స్
Income Tax: పన్ను చెల్లించే విధానం ఇలా..
ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.మొదటిది. టీడీఎస్..ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్ని టీసీఎస్ అంటారు.రెండోది. టీసీఎస్..ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.మూడోది.. ఎస్టీటీ..ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే.
ఒకే ఒక్క రూల్.. ఎంతో మందిని ‘రిచ్’ చేసింది!
ఒకే ఒక్క రూల్.. ప్రపంచ మార్కెట్లను ఎన్నో ఏళ్లుగా ఏలుతోంది. సగటు ఇన్వెస్టర్లు ధనవంతులు అయ్యేందుకు రామ బాణంలా పనిచేస్తూ వస్తోంది. అదే వారెన్ బఫెట్ ప్రతిపాదించిన 90/10 పెట్టుబడి వ్యూహం. వ్యక్తిగత మదుపరులకు అందుబాటులో ఉన్న అత్యంత సరళమైన, ప్రభావవంతమైన విధానాలలో ఒకటిగా ఇది నిలిచింది. అధిక రుసుములు, అనవసరమైన సంక్లిష్టతను నివారిస్తూ, దీర్ఘకాలంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నుంచి లాభపడేందుకు సగటు మదుపరులకు సహాయపడాలనే ఉద్దేశంతో బఫెట్ ఈ నియమాన్ని సూచించారు.మార్కెట్ను అంచనా వేయడంలో చాలా మంది యాక్టివ్ ఫండ్ మేనేజర్లు విఫలమవుతున్నారని చాలా కాలంగా విమర్శిస్తూ వచ్చిన బఫెట్.. చారిత్రక మార్కెట్ డేటా, సహనం, కాంపౌండింగ్ శక్తిపై ఆధారపడేలా పెట్టుబడి ప్యూహాన్ని ప్రతిపాదించారు. 90/10 వ్యూహం పెట్టుబడిదారులకు వృద్ధిని గరిష్టంగా పొందే అవకాశం ఇస్తూనే, చిన్న భద్రతా వలయాన్ని కూడా కల్పిస్తుంది. తక్కువ నిర్వహణ, దీర్ఘకాలికంగా నిలకడైన, అమలు సాధ్యమైన వ్యూహంగా దీన్ని రూపొందించారు.ఏమిటీ 90/10 రూల్?మదుపరులు పెట్టే పెట్టుబడుల్లో 90 శాతం తక్కువ ఖర్చుతో కూడిన ఎస్& పి 500 ఇండెక్స్ ఫండ్లో మిగిలిన 10 శాతం స్వల్పకాలిక అమెరికా ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఈ నియమం సారాంశం.బఫెట్ 2013లో తన బెర్క్ షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో ఈ నియమాన్ని మొదటిసారిగా బహిరంగంగా వివరించారు. బెంజమిన్ గ్రాహం బోధనలను ఆధారంగా తీసుకుని, చాలా మంది వ్యక్తిగత మదుపరులకు స్టాక్స్ను లోతుగా విశ్లేషించే సమయం లేదా నైపుణ్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాల్లాంటి స్టాక్స్ను ఎంచుకోవడానికి ప్రయత్నించడంకన్నా, విస్తృత మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన మార్గం అనేది బఫెట్ అభిప్రాయం.తన భార్య కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్కు సంబంధించిన పెట్టుబడులకు కూడా ఇదే సూత్రాన్ని పాటించారు బఫెట్. దీంతో ఈ వ్యూహంపై ఇన్వెస్టర్లకు నమ్మకం మరింత బలపడింది.బఫెట్ లాజిక్ ఇదే..కాలక్రమేణా అమెరికన్ వ్యాపార రంగం పెరుగుతుందనేది బఫెట్ నమ్మకం. ఆ వృద్ధిని సంపూర్ణంగా పొందాలంటే విస్తృత మార్కెట్ బహిర్గతం అవసరం. అధిక ఫీజులు, భావోద్వేగ నిర్ణయాలు, తప్పుడు టైమింగ్ వంటి అంశాలు మదుపరుల రాబడులను తగ్గిస్తాయి. ఇండెక్స్ ఫండ్లు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.బఫెట్ తరచూ చెప్పే మాట ఒక్కటే ‘చిన్నపాటి ఫీజులు కూడా దీర్ఘకాలంలో భారీ నష్టాలకు దారి తీస్తాయి.’ప్రయోజనాలు.. పరిమితులు90/10 వ్యూహం అనేక స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఎస్&పీ 500 దాదాపు ఒక శతాబ్దంలో స్థిరమైన వృద్ధిని అందించిందని దీర్ఘకాలిక డేటా చూపిస్తోంది. దాని విస్తృత వైవిధ్యం.. అధిక ఈక్విటీ కేటాయింపుతో వచ్చే రిస్క్ను కూడా పరిమితం చేస్తుంది. తక్కువ నిర్వహణ రుసుములు కాంపౌండింగ్ను మరింత పెంచుతాయి. కాలక్రమేణా పోర్ట్ ఫోలియోకు వేలాది డాలర్లను జోడిస్తాయి.అయితే ఈక్విటీలకు 90 శాతం కేటాయింపు అందరికీ తగినది కాదని విమర్శకులు గమనించారు. ఇది పదవీ విరమణ చేసిన వారికి లేదా రిస్క్ సహనం తక్కువ ఉన్నవారికి దూకుడుగా ఉండవచ్చు.
కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఏఐ ఫీచర్లతో..
డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా చేసేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ కొత్తగా ’కెనరా ఏఐ1పే’ పేమెంట్స్ యాప్ని ప్రవేశపెట్టింది. యూపీఐ ప్లాట్ఫాం ద్వారా వేగవంతంగా, సురక్షితంగా పేమెంట్స్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది.నెలవారీగా ఖర్చులను విశ్లేషించుకునేందుకు స్పెండ్ అనలిటిక్స్, సులువుగా క్యూఆర్ స్కాన్ చేసేందుకు విడ్జెట్ సదుపాయం, తక్షణ నగదు బదిలీలు.. బిల్లుల చెల్లింపులు మొదలైన వాటికి యూపీఐ ఆటోపేలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అలాగే, పిన్ నంబరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న మొత్తాలను చెల్లించేందుకు వీలుగా యూపీఐ లైట్ ఫీచరు సైతం ఇందులో ఉన్నట్లు వివరించింది.ఇదే యాప్లో మల్టీ లెవల్ భద్రతా వ్యవస్థను కూడా పొందుపరిచినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు (Fraud Detection) ద్వారా అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసే విధంగా ఈ యాప్ను రూపొందించారు. బయోమెట్రిక్ లాగిన్, డివైస్ బైండింగ్, రియల్టైమ్ అలర్ట్స్ వంటి సదుపాయాలతో వినియోగదారుల ఖాతా భద్రత మరింత బలోపేతం అవుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు.అలాగే, ఈ యాప్ ద్వారా వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా సులభంగా చెల్లింపులు స్వీకరించవచ్చని పేర్కొన్నారు. చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది.
బీమా ప్రీమియం పెరిగింది.. మరి కవరేజీ సరిపోతుందా?
విద్యలేని వాడు వింత పశువు అని ఒకప్పుడు అనేవారు.. ఈ ఆధునిక కాలంలో మాత్రం ఈ సామెతను బీమా లేని వారికి వాడుకోవాలి. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన 2020 నుంచి భారత్లో బీమా ప్రీమియం గణనీయంగా పెరిగింది. కచ్చితంగా చెప్పాలంటే ప్రీమియం 73 శాతం వరకూ పెరగ్గా బీమా చేసిన మొత్తం కూడా 240 శాతం వరకూ ఎక్కువైంది. కానీ... ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే... ఉన్న బీమా కవరేజీ అస్సలు సరిపోవడం లేదు. ఇతర అవసరాల కోసం దాచుకున్న సొమ్ము ఖర్చుపెట్టాలి లేదంటే అప్పు చేయాలి. అందుకే... మీ బీమా పాలసీ ఏటికేడాదీ పెరిగిపోతున్న వైద్యం ఖర్చులను తట్టుకునేలా ఉందా? లేదా? సరిచూసుకోండి.దేశంలో చాలామంది బీమా పాలసీ తీసుకున్న వారు తమకు రూ.10 - 15 లక్షల కవరేజీ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. కొంచెం ఆదాయం తక్కువగా ఉన్న వారు రూ.పది లక్షల మొత్తానికి సర్దుకుంటూంటే.. మధ్యతరగతి వారు ఇంకో ఐదు లక్షల వరకూ ఎక్కువ మొత్తంతో పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ఈ పెంపు సరిపోతుందా? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే వైద్యం ఖర్చులు ఏటా పన్నెండు నుంచి 14 శాతం వరకూ పెరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు మాత్రమే కాకుండా.. ఆసుపత్రుల్లో గదుల అద్దెలు, మందులు, ఇతర కన్స్యూమబల్స్ రేట్లు పెరిగిపోవడం ఇందుకు కారణం. గత ఐదేళ్లలో పెరిగిన ప్రీమియం మొత్తం కూడా ఈ వ్యత్యాసాన్ని తట్టుకోలేకపోతోంది. ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదని చాలామంది పాలసీదారులు అనుకుంటున్నారని, అంతకంటే వేగంగా ఆసుపత్రి బిల్లులు పెరుగుతున్నాయని గుర్తించడం లేదని నిపుణులు చెబుతున్నారు.టాప్ అప్లతో ఉపశమనం...పెరిగిపోతున్న వైద్యం ఖర్చులకు అనుగుణంగా మీ పాలసీను మలచుకోవడం ఒక మార్గం. బేస్ ప్లాన్కు అనువైన టాప్అప్ పాలసీలు జోడించుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ వస్తుంది. కొన్ని కంపెనీలు ద్రవ్యోల్బణానికి తగ్గట్టు ఏటా బీమా మొత్తాన్ని పెంచే పాలసీలు అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లంబార్డ్లలో పాలసీ మొత్తం ఏటా పదిశాతం పెరిగేలా ఇన్ఫ్లేషన్ షీల్డ్ కవరేజీ అందిస్తున్నాయి. కుటుంబంలో ఒకొక్కరి ఒక్కో పాలసీ కాకుండా.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఎంచుకోండి. దీనివల్ల అందుబాటులో ఉండే మొత్తం ఎక్కువగా ఉంటుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు ఏ ఏ అంశాలపై కవరేజీ లేదన్నది స్పష్టంగా అర్థం చేసుకోండి. కొన్ని పాలసీల్లో ఆసుపత్రిలో గది అద్దెలపై పరిమితి ఉంటుంది. లేదా పూర్తి మినహాయింపు ఉండవచ్చు. అలాగే ఏ ఏ ప్రొసీజర్లకు కవరేజీ వర్తిస్తుందో కూడా గమనించండి. వీటితోపాటు వీలైనంత వరకూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంత అదనపు మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసుకోవడమూ అవసరమే.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.


