Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 24 April 20261
కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:05 సమయానికి నిఫ్టీ(Nifty) 176 పాయింట్లు తగ్గి 23,994 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 671 పాయింట్లు నష్టపోయి 76,984 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.88బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 105.94 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.41 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 0.89 శాతం దిగజారింది.Today Nifty position 24-04-2026(time: 10:05 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Energy Prices Surge as West Asia Tensions Disrupt Trade RBI Flags Growth Challenges2
పశ్చిమాసియా యుద్ధంతో ఆర్థిక సవాళ్లు

పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్‌ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్‌లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది.ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్‌లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్‌ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్‌లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్‌ను రూపొందించిన ఆర్‌బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు.

Engineering exports to Gulf countries down3
గల్ఫ్‌ దేశాలకు ఇంజనీరింగ్‌ ఎగుమతులు డౌన్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్‌ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్‌ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్‌ ఎగుమతులను 250 బిలియన్‌ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్‌ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్‌లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్‌ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్‌ డాలర్లు, కొరియాకి 3 బిలియన్‌ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్‌ అండ్‌ స్టీల్, ఎలక్టరిక్‌ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్‌ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి.

Infosys Q4 net profit rises 28percent QoQ to Rs 8,501 crore4
ఇన్ఫోసిస్‌ లాభం జూమ్‌ 

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 21% జంప్‌చేసి రూ. 8,501 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 7,033 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13% బలపడి రూ. 46,402 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 40,925 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 25 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. గైడెన్స్‌ ఓకే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఆదాయంలో 1.5–3.5 శాతం మధ్య పురోగతిని సాధించగలమని ఇన్ఫోసిస్‌ తాజాగా అంచనా(గైడెన్స్‌) ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా ఫైనాన్షియల్‌ సర్వీసులు, యుటిలిటీస్, ఏఐ సర్వీసులు దోహదపడగలవని పేర్కొంది. కొత్త ఏడాది పటిష్టంగా ప్రారంభమైనట్లు కంపెనీ తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు కుదురుకుంటున్నాయని తెలియజేసింది. పూర్తి ఏడాదికి గుడ్‌: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇన్ఫోసిస్‌ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 29,440 కోట్లను తాకింది. 2024–25లో రూ. 26,713 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం వృద్ధితో రూ. 1,78,650 కోట్లకు చేరింది. ఇతర విశేషాలు...→ క్యూ4లో 3.2 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ పొందింది. పూర్తి ఏడాదికి 14.9 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 55 శాతం కొత్త డీల్స్‌. → క్యూ4లో 8,440 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,28,594కు పరిమితమైంది. అయితే 2024–25 క్యూ4 సంఖ్య(3,23,578)తో పోలిస్తే 5,016 మంది పెరిగారు. → గతేడాది మొత్తం 20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జయేష్‌ ఎస్‌. తెలియజేశారు. → ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు జయేష్‌ వెల్లడించారు. → ఏఐ సంప్రదాయ ఐటీ సర్వీసులు, బీపీవో మోడల్స్‌కు చెక్‌ పెడుతున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. అయితే ఏఐ ద్వారా ఇతర సర్వీసులు పుంజుకుంటున్నట్లు పరేఖ్‌ పేర్కొన్నారు. → ప్రస్తుత సీఈవో పరేఖ్‌ ఐదేళ్ల పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 2% క్షీణించి రూ. 1,242 వద్ద ముగిసింది. కాగా.. యూఎస్‌ మార్కెట్లో ఇన్ఫీ ఏడీఆర్‌ 4.5% పతనమై 12.87 డాలర్లను తాకింది.పటిష్ట వృద్ధి ఫైనాన్షియల్, కమ్యూనికేషన్స్, తయారీ విభాగ సర్వీసులతోపాటు.. ప్రాంతాలవారీగా చూస్తే యూరప్‌లో పటిష్ట వృద్ధి సాధించాం. 2026–27లో ఏఐ సర్వీసులలో భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, ఎనర్జీ, యుటిలిటీ, రీసోర్సెస్‌ విభాగాలలో వృద్ధికి వీలుంది. – సలీల్‌ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్‌

India to have 313 billionaires by 20315
బిలియనీర్ల హబ్‌గా భారత్‌!

న్యూఢిల్లీ: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉంటే, 2031 నాటికి 51 శాతం పెరిగి 313కి చేరుకోనున్నట్టు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు) 19,877గా ఉంటే, 2031 నాటికి వీరి సంఖ్య 25,217కు చేరుకోనుంది. బిలియన్‌ డాలర్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని బిలియనీర్లు (కుబేరులు)గా, 30 మిలియన్‌ డాలర్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా చెబుతారు. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అయిన నైట్‌ఫ్రాంక్‌ ఈ మేరకు 20వ ఎడిషన్‌ ‘ద వెల్త్‌ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, అసమాన ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. సంపద సృష్టి వేగంగా జరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్‌ మార్కెట్స్‌ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతున్నట్టు తెలిపింది. రాజధానిగా ముంబై.. దేశంలోని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలలో 35.4 శాతం మందికి ముంబై చిరునామాగా ఉంది. అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల జనాభా పరంగా భారత్‌ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగానూ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 2021లో ఉన్న 5,51,435 నుంచి 7,13,626కు పెరిగింది. గత ఐదేళ్లలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 58 శాతం పెరిగి 2026లో 207కు చేరింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్‌ మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా అమెరికాలో 914 మంది ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ‘‘భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆర్థిక పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. పారిశ్రామిక స్ఫూర్తితో ఎదుగుతూ.. బలమైన మూలధన నిల్వలు, అత్యాధునిక ఆర్థిక మార్కెట్లతో రాణిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సమూహం పెరుగుతోంది. డిజిటలైజేషన్, లిస్టెడ్‌ కంపెనీలు, ప్రైవేటు క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు.

Billionaire CEO Calls Out Employees Craving Work Life Balance6
'పని ఇష్టం లేనప్పుడే.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్'

గత కొన్నేళ్లుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈవో 'ఇనాకీ ఎరెనో' తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇనాకీ ఎరెనో ప్రకారం.. జెన్ జీ తరానికి చెందిన యువత ఎక్కువగా పని ఒత్తిడిని తగ్గించుకుని, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం, కుటుంబ సమయం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొంతమంది పెద్ద వ్యాపార నాయకులు ఈ ఆలోచనతో ఏకీభవించడం లేదు.ఒక ఉద్యోగి తరచుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అని ఆలోచిస్తే.. అది ఆ ఉద్యోగం తనకు సరిపడటం లేదని అర్థం. ఒక వ్యక్తి తన పనిని నిజంగా ఇష్టపడితే, పని - జీవితం మధ్య కఠినమైన సరిహద్దులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని ఎరెనో పేర్కొన్నారు.ఎరెనో తన అనుభవాన్ని కూడా ఉదాహరణగా చెప్పారు. ఆయన ఒక పెద్ద కంపెనీని నిర్వహిస్తున్నప్పటికీ.. వీకెండ్స్‌లో నా కుమారుడితో కలిసి జిమ్‌కు వెళ్తున్నప్పుడు కూడా వ్యాపార ఆలోచనలు చేయడం, ఈమెయిల్స్ చూడడం వంటివి తనకు ఒత్తిడిగా అనిపించదని చెప్పారు. తన పనిని ఆనందంగా చేసుకుంటే, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన భారంగా చూడాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయం. తమకు నచ్చిన పని ఎంచుకుంటేనే పని–జీవిత సమతుల్యత అనే సమస్యే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక స్కేల్ ఏఐ కో-ఫౌండర్ లూసీ గువో (Lucy Guo) కూడా ఇదే తరహా అభిప్రాయం చెప్పారు. పని–జీవిత సమతుల్యత అవసరం అనిపిస్తే, ఆ ఉద్యోగం సరైనది కాకపోవచ్చు అని అన్నారు. తాను తన పనిని ఎంతో ఇష్టపడతానని, అందుకే అలాంటి సమస్య ఎదురుకాదని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement