ప్రధాన వార్తలు
భారత్-ఈయూ ఒప్పందం: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?
భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్ను విస్తరించడంలో సహాయపడుతుంది. ఈ విషయాన్ని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా & సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో లగ్జరీ కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం మాత్రమే. ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పదం ఈ అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు.భారత్ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి గట్టి విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఇండియా కేవలం పెద్ద మార్కెట్ మాత్రమే కాదు.. సంస్కరణలు & భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న విధానాలతో గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని హర్దీప్ సింగ్ తెలిపారు. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం పెరగడమే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్ మార్పిడి మరింత బలపడుతుందని వివరించారు.ప్రస్తుతం భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా వచ్చే కార్లపై భారీగా కస్టమ్స్ డ్యూటీలు ఉన్నాయి. ఇవి తగ్గితే.. వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని బ్రార్ అన్నారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ విక్రయాల్లో దిగుమతి వాటా ఐదు శాతం మాత్రమే ఉంది. ట్యాక్స్ తగ్గేదే ఈ వాటా పెరుగుతుందని అన్నారు.ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు..దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువైన అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.ట్యాక్స్ తగ్గిస్తే.. ఫోక్స్వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది.
భారత మార్కెట్ రూపురేఖలు మార్చే డీల్!
భారతీయ విలాసవంతమైన కార్ల ప్రియులకు, టెక్ ప్రియులకు ఇక పండగే! భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పిలవబడే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో యూరప్ నుంచి భారత్లోకి వస్తున్న యూరోపియన్ బ్రాండెడ్ కార్లు, అత్యున్నత స్థాయి వైద్య పరికరాలు, దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గనున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో భారత మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేయబోతున్న ఈ ఒప్పందం వివరాలు, ఏయే వస్తువులపై సుంకాలు ఎంత మేర తగ్గుతాయో కింద చూద్దాం.భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వచ్చే దశాబ్ద కాలంలో భారత దిగుమతి మార్కెట్ను సమూలంగా పునర్నిర్మించేలా, కీలక రంగాల్లో భారీగా సుంకాలు తగ్గనున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఆటోమొబైల్ రంగంలో..ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం కార్లపై సుంకాల తగ్గింపు. ప్రస్తుతం 70% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని భారత్ క్రమంగా 10%కి తగ్గించనుంది. ఏడాదికి 2,50,000 వాహనాల వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ మార్పు భారత ప్రీమియం కార్ల మార్కెట్ను పూర్తిగా రీసెట్ చేస్తుందని ఈయూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.ఎగుమతులు - సుంకాల ఆదా2032 నాటికి భారతదేశానికి ఈయూ ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. 90% పైగా వస్తువులపై సుంకాల తగ్గింపు ఉంటుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 4 బిలియన్ యూరోల మేర ట్యాక్స్ ఆదా అవుతుందని బ్రస్సెల్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గరిష్టంగా ఉన్న సుంకాలు (యంత్రాలపై 44%, రసాయనాలపై 22%, ఫార్మాపై 11%) గణనీయంగా తగ్గనున్నాయి.వైద్యం, సాంకేతిక రంగంభారతదేశంలో వైద్య సేవల ఖర్చులను తగ్గించే దిశగా ఈ ఒప్పందం దోహదపడనుంది. దాదాపు అన్ని వైద్య పరికరాలపై సుంకాలను సున్నాకి తగ్గించనున్నారు. 90% ఉత్పత్తులపై సుంకాలు తొలగిపోతాయి. దీనివల్ల ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. విమానాలు, అంతరిక్ష నౌకలకు సంబంధించి దాదాపు పూర్తిస్థాయిలో సుంకాల తొలగింపు ఉంటుంది.ఆహారం, పానీయాలుయూరప్ నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ పానీయాలపై సుంకాలను భారత్ భారీగా తగ్గించింది. యూరోపియన్ వైన్లపై 20 నుంచి 30 శాతం వరకు సుంకాలు తగ్గనుండగా వివిధ రకాల స్పిరిట్లపై 40 శాతం వరకు రాయితీ లభించనుంది. అన్నిటికంటే ఎక్కువగా యూరోపియన్ బీరుపై ఏకంగా 50 శాతం మేర సుంకాలు తగ్గనున్నాయి.కేవలం పానీయాలకే పరిమితం కాకుండా వంట గదిలో అత్యవసరమైన ఆహార నూనెలపై కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. ఐరోపా నుంచి వచ్చే ఆలివ్ ఆయిల్, మార్గరీన్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్పై ఉన్న దిగుమతి సుంకాల్లో ప్రభుత్వం భారీ కోత విధించింది. దీనివల్ల భారతీయ వినియోగదారులకు నాణ్యమైన యూరోపియన్ ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.భారత ఎగుమతులకు లబ్ధిఏడేళ్ల వ్యవధిలో 99.5% వాణిజ్య వస్తువులపై ఈయూ కూడా సుంకాలను తగ్గించనుంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అందులో..సముద్ర ఉత్పత్తులు, తోలు, వస్త్రాలు.రసాయనాలు, రబ్బరు, రత్నాలు, ఆభరణాలు.ఈ ఒప్పందం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వినియోగదారుల మార్కెట్లో యూరప్ పట్టును బలోపేతం చేయనుంది. అయితే, యూరోపియన్ ఉత్పత్తుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకునేలా దేశీయ తయారీదారులు ఏ విధంగా సిద్ధమవుతారనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?
కేంద్ర బడ్జెట్పై ఈవీ తయారీదారుల ఆశలు
దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సింహభాగం ఆక్రమించిన మోటార్సైకిళ్ల విభాగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహకాలు కేవలం స్కూటర్లు, మూడు చక్రాల వాహనాలకే పరిమితమవ్వడంపై తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్లోనైనా తమకు తగిన గుర్తింపు, సబ్సిడీలు లభిస్తాయని ఆశిస్తున్నారు.పథకాలు ఉన్నా.. ప్రయోజనం తక్కువే!కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫేమ్-2 (2019-2024) పథకం కానీ, ఇటీవల ప్రారంభించిన పీఎం ఈ-డ్రైవ్ (ప్రధాని ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) స్కీమ్ కానీ ప్రధానంగా ఈ-స్కూటర్లకే మేలు చేశాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రట్టన్ఇండియా ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ అంజలి రట్టన్ మాట్లాడుతూ.. ‘భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో దాదాపు 70 శాతం అమ్మకాలు మోటార్సైకిళ్లవే. స్కూటర్ల వాటా కేవలం 30 శాతమే. అయినప్పటికీ ఎలక్ట్రిక్ విభాగంలో స్కూటర్లకే పెద్దపీట వేశారు. ఈ దశలో మోటార్సైకిళ్లకు ప్రోత్సాహకాలు అందించకపోతే ఈవీ తయారీ వేగం మందగిస్తుంది’ అన్నారు.పరిశ్రమ డిమాండ్లు ఇవే..అహ్మదాబాద్కు చెందిన ‘మ్యాటర్’ వంటి సంస్థలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నాయి. ఈవీ మోటార్సైకిల్ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని తయారీదారులు కోరుతున్నారు. కొనుగోలుదారులకు సబ్సిడీలతో పాటు ఉత్పత్తిదారులకు రాయితీలు కల్పించాలని చెబుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను (PLI) మరింత సరళతరం చేయాలని కోరుతున్నారు. పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బైక్లను భారత్లోనే తయారు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?
వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధిని పరుగులు తీయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది.ఆందోళన కలిగిస్తున్న వృద్ధి రేటువ్యవసాయ రంగ వృద్ధి రేటులో కనిపిస్తున్న మందగమనంపై పీఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు 2025–26 అంచనాల ప్రకారం 3.1 శాతానికి పడిపోయింది. 2020–21లో దేశ మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయ రంగం వాటా 20.4 శాతం ఉండగా 2023–24 నాటికి అది 17.7 శాతానికి తగ్గింది. గత 5-6 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ కొవిడ్ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల సగటు జీవీఏ వృద్ధి 3–4 శాతం వద్దే నిలిచిపోయింది.బడ్జెట్పై అంచనాఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు బడ్జెట్లో భారీ నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు.1. చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి సహకార సంఘాల ద్వారా వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం.2. పంట పండించడమే కాకుండా అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడం.3. పంట కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతుల కల్పన.4. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక సంస్థల ద్వారా మార్కెట్ అవకాశాన్ని పెంచడం.ప్రభుత్వం ప్రతిపాదించబోయే ఈ సమగ్ర గ్రామీణ పునరుజ్జీవన కార్యాచరణ కేవలం వ్యవసాయానికే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా గొలుసుల (Supply Chains) ఆధునీకరణ ద్వారా వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీల ప్రభావం తగ్గి నేరుగా రైతుకే లాభం చేకూరే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?
నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
25,100 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 25,152 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు పుంజుకొని 81,771 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 27-01-2026(time: 9:32 am)ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్పొరేట్
భారత్-ఈయూ ఒప్పందం: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?
ఐసీఐసీఐ ప్రు నుంచి ఐసిఫ్ పథకాలు
చైనాలో చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు..
కోటక్ బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్కు పద్మభూషణ్
కోటక్ బ్యాంక్ కళకళ.. పెరిగిన లాభం
టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం
అంబానీ ఫ్యామిలీతో కొరియన్ బిజినెస్మెన్.. గర్వంగా ఉందంటూ పోస్ట్
బిజినెస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ దాకా
వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
అమెజాన్ ఉద్యోగులకు అమావాస్యే! కత్తులు సిద్ధం!!
యాక్సిస్ కొత్త మ్యూచువల్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ బీఎస్ఈ సెక...
సాయంత్రానికి సగం ఊరట.. మారిపోయిన పసిడి ధరలు
బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వే...
పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. రిచ్ డాడ్...
వామ్మో! బంగారం ఊసు ఎత్తకపోవడమే బెటర్..తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
కేంద్ర బడ్జెట్ 2026: ఆరోజు నిర్మలమ్మ పలికే పదాలివే..
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట...
1950లో బడ్జెట్ లీక్!.. తర్వాత ఏం జరిగిందంటే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్...
ఎరువుల దిగుమతి భారం తగ్గించేలా చర్యలు
దేశీయంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, విదేశ...
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చాలా రోజులుగా ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం
న్యూఢిల్లీ: టెక్నాలజీపై నియంత్రణ కలిగి ఉండడమే అసలైన సార్వభౌమత్వమని జోహో సంస్థ వ్యవస్థాపకుడు చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. సాంకేతికాభివృద్ధితో ప్రపంచం పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశాలకు సాంకేతిక స్వయం ప్రతిపత్తి అత్యవసరమన్నారు. కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ అజెండాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ లక్ష్యాల్లో తామూ భాగస్వామం కావడం ఆనందంగా ఉందన్నారు. జోహో పనితీరును కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సీఈవోలు ప్రశంసిస్తున్నారని శ్రీధర్ తెలిపారు. మాతృభూమి అవకాశాలతో ఎదురుచూస్తోంది .. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, సుంకాలు, వీసా అనిశి్చతుల నేపథ్యంలో భారతీయ వృత్తి నిపుణులు మాతృ దేశానికి రావాలని వెంబు పిలుపునిచ్చారు. ఇక్కడి అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ ఇతర దేశాల్లో పనిచేస్తున్న భారత వృత్తి నిపుణులను కోరారు. ప్రపంచస్థాయి కంపెనీలు సైతం విస్తరణ వ్యూహాల్లో భాగంగా మనదేశంలోనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. ‘దేశ జనాభా, విద్యా వ్యవస్థ, మౌలిక వసతులు, ప్రభుత్వ విధానాల సమ్మేళనం భారత్ టెక్ వ్యవస్థకు పరిపూర్ణ మద్దతు ఇస్తున్నాయ’ని శ్రీధర్ తెలిపారు.ఐపీఓపై ఆసక్తి లేదు.. జోహో సంస్థను ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లే ఆసక్తి లేదని శ్రీధర్. సంస్థ ప్రైవేట్గా కొనసాగడం వల్ల పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. త్రైమాసిక ఫలితాల ఒత్తిళ్లకు లోనవాల్సిన అవసరం లేదని, అలాంటి తాత్కలిక లక్ష్యాలు తమకు ఇష్టం లేదని చెప్పారు. జోహో ఉత్పత్తుల ఆవిష్కరణలకు మూలధన నిధుల కంటే దీర్ఘకాలిక సహనం అవసరమన్నారు. దేశానికి దీర్ఘకాలిక దృష్టితో పనిచేసే, సహనంతో కూడిన ఆర్అండ్డీ ఆధారిత సంస్థలు మరిన్ని అవసరమన్నారు. ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ సొల్యూషన్ (ఈఆర్పీ) ఆవిష్కరణ.. భారతీయ వ్యాపార కంపెనీల కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సొల్యూషన్ను శ్రీధర్ ఆవిష్కరించారు. ప్రస్తుతానికి ఈఆర్పీ సొల్యూషన్ భారత మార్కెట్కే పరిమితమవుతుందని, తరువాత దశలవారీగా ప్రపంచ మార్కెట్లోకి విస్తరించనుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అ య్యేందుకు దాదాపు అయిదేళ్ల సమయం పట్టిందని, భవిష్యత్తులో జోహోకు ప్రధాన వృద్ధి ఇంజిన్ గా ఈఆర్పీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ దరిద్రం.. పాత ఫోన్లూ కొనలేక అవస్థలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులకు కొత్త స్మార్ట్ఫోన్ల సంగతి పక్కనపెడితే పాత (యూజ్డ్) ఫోన్లనూ కొనుక్కోవడమూ భారమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం.. యూజ్డ్ స్మార్ట్ఫోన్లపై విధించే వాల్యుయేషన్, సుంకాలను తగ్గించింది.ప్రస్తుత ధరల వద్ద కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హై-ఎండ్ స్మార్ట్ఫోన్లు అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్తో పాటు ఇతర వేరియంట్లకు కూడా కొత్త అంచనా విలువలను కస్టమ్స్ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది.ప్రపంచవ్యాప్తంగా పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. డాన్ పత్రిక నివేదిక ప్రకారం.. ఐఫోన్ వంటి మోడళ్లు వయస్సు పెరిగే కొద్దీ, వారి ప్రాథమిక రిటైల్ జీవితకాలం ముగింపునకు చేరుకునే సరికి సహజంగానే విలువ కోల్పోతాయి.మార్కెట్ రేట్లకు అనుగుణంగా విలువలను సర్దుబాటు చేయడం ద్వారా, ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను పౌరులకు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రీవ్యాల్యూయేషన్ చేపట్టారు. తాజా అప్డేట్లో నాలుగు ప్రముఖ బ్రాండ్లకు చెందిన 62 మోడళ్ల హ్యాండ్సెట్లు ఉన్నాయి.శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల మార్కెట్ డేటా, అధికారిక ట్రేడ్-ఇన్ ధరలను పరిశీలించిన తర్వాత కొత్త విలువలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై అమ్మకపు పన్ను, నిలిపివేత పన్ను, ప్రత్యేక సుంకాలు వంటి సంక్లిష్టమైన పన్ను విధానం అమల్లో ఉండగా, ఇవన్నీ ప్రభుత్వ నోటిఫై చేసిన వాల్యుయేషన్ ఆధారంగా లెక్కిస్తారు.2026 కోసం సవరించిన వ్యాల్యూయేషన్లు 2024తో పోలిస్తే యూజ్డ్ స్మార్ట్ఫోన్ల విలువల్లో భారీ తగ్గుదలని చూపుతున్నాయి. ముఖ్యంగా యూజ్డ్ ఐఫోన్ల ధరలు 32% నుంచి 81% వరకు తగ్గాయి. ఈ మార్పులతో పాకిస్తాన్లో పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గి, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఐఫోన్ 18 వివరాలు లీక్.. ధర ఇంతేనా?
యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఓ కొత్త ఐఫోన్ మోడల్ లాంచ్ చేస్తూ ఉంది. గత ఏడాది ఐఫోన్ 17 పేరుతో స్మార్ట్ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఐఫోన్ 18 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ రెండూ కూడా కొత్త ఫీచర్స్ పొందనున్నాయి. ప్రో & ప్రో మ్యాక్స్లలో 6.27 అంగుళాల 120Hz, 6.86 అంగుళాల 120Hz అలాగే ఉన్నాయి. ఐఫోన్ ప్రతి సంవత్సరం కొత్త చిప్ పొందుతుంది. ఇందులో భాగంగానే.. ఐఫోన్ 18 ప్రో కోసం A20 ప్రో చిప్ 2nm ప్రాసెస్ అందించనున్నారు.కెమెరా విషయానికి వస్తే.. ఒక వెనుక కెమెరాలో మెకానికల్ ఐరిస్ ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో & ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అవకాశం ఉంది. వీటి ధరలు వరుసగా రూ.1,34,900 & రూ.1,49,900గా ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే స్టోరేజ్.. కాన్ఫిగరేషన్ అప్గ్రేడ్లను బట్టి ధరలు మారుతాయి.
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్న్యూస్!
ఈ రోజుల్లో యూట్యూబ్ చాలామంది జీవితాల్లో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ లాంటి చిన్న వీడియోలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే రోజూ కొత్త వీడియోలు చేయడం క్రియేటర్లకు కొంత కష్టంగా మారుతోంది. ఈ సమయంలో.. యూట్యూబ్ ఒక కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. అదే ఏఐ డిజిటల్ ట్విన్ (డిజిటల్ క్లోన్). యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన 206 వార్షిక లేఖలో ఈ ఫీచర్ గురించి వెల్లడించారు.ఏఐ డిజిటల్ ట్విన్ ద్వారా.. క్రియేటర్స్ ఏఐ జనరేటెడ్ వెర్షన్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తమలాగే కనిపించే ప్రతిరూపం సాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?, ఇదెలా పని చేస్తుంది? అనే విషయాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ఇది ఓపెన్ఏఐ సొర యాప్ మాదిరిగా ఫోటోరియలిస్టిక్ వెర్షన్లను సృష్టించడానికి ఎలా అనుమతిస్తుందో అదే విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.యూట్యూబ్ షార్ట్స్ రోజుకు 200 బిలియన్ వ్యూవ్స్ పొందుతున్నాయి. ఈ సమయంలో దీనికోసం కొత్త ఫీచర్స్ కూడా సంస్థ సీఈఓ మోహన్ వెల్లడించారు. ఇందులో ఇమేజ్ పోస్ట్లను నేరుగా ఫీడ్లోకి జోడించవచ్చు. పిల్లలు & టీనేజర్లు షార్ట్స్ స్క్రోలింగ్ చేయడానికి ఎంత సమయం వెచ్చించాలనేది కూడా తల్లిదండ్రులకు కంట్రోల్ చేయవచ్చు. దీనికోసం కూడా ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత పేరెంట్స్ టైమర్ సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!
పర్సనల్ ఫైనాన్స్
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
రోజుకో రూ.200.. అవుతాయి రూ.10 లక్షలు!
సంపద నిర్మించుకోవడానికి ఎప్పుడూ అధిక రిస్క్ పెట్టుబడులు లేదా స్టాక్ మార్కెట్పై లోతైన అవగాహనే అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే చిన్నపాటి రోజువారీ పొదుపు కూడా కాలక్రమేణా బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది. అలాంటి నమ్మదగిన పథకమే ‘పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్’ (RD). రోజుకు కేవలం రూ.200 పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చు.చిన్న పొదుపు.. పెద్ద ఫలితంఈ పథకంలోని అసలైన బలం స్థిరత్వం. రోజుకు రూ.200 అంటే నెలకు రూ.6,000 మాత్రమే. ఇది చాలా కుటుంబాలకు సులభంగా నిర్వహించగలిగే మొత్తమే. ఈ చిన్న మొత్తాలు మీ నెలవారీ బడ్జెట్పై ఒత్తిడి లేకుండా, క్రమంగా పెద్ద మొత్తంగా మారతాయి.పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. పోస్టాఫీస్ భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో, ఈ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపిక.ఖాతా ప్రారంభం సులభంకేవలం రూ.100తోనే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు తమ సమీప పోస్టాఫీసులో ఈ ఖాతాను సులభంగా తెరవవచ్చు. నెలవారీ డిపాజిట్లు వెంటనే ప్రారంభించవచ్చు.రికరింగ్ డిపాజిట్కు ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ అనంతరం, ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పొడిగింపు వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పెరిగి, సంపద మరింత వేగంగా పెరుగుతుంది.అత్యవసర అవసరాలకు రుణ సదుపాయంఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ, ఆర్డీ వడ్డీ రేటు కంటే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.కొన్ని షరతుల మేరకు ప్రీ-మెచ్యూరిటీ విత్డ్రాయల్కు కూడా అవకాశం ఉంటుంది. అనివార్య కారణాలతో ఖాతాదారు మరణించినప్పుడు, డిపాజిట్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందవచ్చు.రోజుకు రూ.200.. రూ.10 లక్షలు ఎలా అవుతాయంటే?➕రోజుకు రూ.200 ➕నెలకు రూ.6,000➕5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే➕మొత్తం డిపాజిట్: రూ.3.60 లక్షలు➕వడ్డీ: సుమారు రూ.68,197➕మెచ్యూరిటీ మొత్తం: రూ.4.28 లక్షలు➕అదే ఖాతాను మరో 5 ఏళ్లు పొడిగిస్తే➕మొత్తం డిపాజిట్: రూ.7.20 లక్షలు➕మొత్తం వడ్డీ: సుమారు రూ.2.05 లక్షలు➕తుది మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ.10.25 లక్షలుసున్నా మార్కెట్ రిస్క్, ప్రభుత్వ హామీ, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా చిన్నపాటి రోజువారీ పొదుపులు కూడా గొప్ప ఆర్థిక మైలురాయిగా మారతాయని పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం నిరూపిస్తోంది.
ఎస్బీఐ జనరల్ నుంచి హెల్త్ ఆల్ఫా
న్యూఢిల్లీ: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ‘ఎస్బీఐజీ హెల్త్ ఆల్ఫా’ పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కార్నాన్ని ఆవిష్కరించింది. కస్టమర్ల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా హెల్త్ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించింది. ఎన్నో రకాల ఆప్షనల్ (ఐచ్ఛిక) ప్రయోజనాలతో తీసుకోవచ్చని తెలిపింది.మెరుగైన క్యుములేటివ్ బోనస్, సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ) ఆప్షన్లలో సౌలభ్యం, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో అనుసంధానం, నేటి జీవనశైలి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన కవరేజీని హెల్త్ ఆల్ఫా అందిస్తుందని వెల్లడించింది. ఇందులో 50కు పైగా కవరేజీ ఆప్షన్లు ఉన్నట్టు, జిమ్, క్రీడా గాయాలు, ఫిట్నెస్ సంబంధిత గాయాలకు ఓపీడీ కవరేజీ ప్రయోజనం ఉన్నట్టు తెలిపింది.జీవితాంతం ఒకే తరహా ప్రయోజనాలతో కాకుండా, వివిధ స్థాయిల్లోని అవసరాలకు అనుగుణంగా (వివాహానంతరం ప్రసవ సంబంధిత, పిల్లల ఆరోగ్య సంబంధిత, వృద్ధాప్యంలో అదనపు కవరేజీ తదితర) ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పేర్కొంది. అదనపు యాడాన్లను తీసుకుని, అవసరం లేని వాటిని ఆప్ట్ అవుట్ చేసుకునేందుకు సైతం అవకాశం ఉంటుందని తెలిపింది.


