Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India EV batteries being a second life repurposed for energy storage1
వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు

ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్‌లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.పెరుగుతున్న బ్యాటరీలుప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్‌ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.రీసైక్లింగ్ ప్రక్రియబ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్‌కు బాధ్యత వహించాలి.బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్‌ లైఫ్‌ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్‌గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్‌లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్‌లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్‌

Best 5G smartphones under Rs 20000 in India for 20252
2025లో బెస్ట్‌ బడ్జెట్‌ ఫోన్లు ఇవే..

2025 ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్చే డివైజ్‌ ఏదైనా ఉందంటే అది స్మార్ట్‌ ఫోన్‌. శాంసంగ్‌ నుంచి మొదలు పెడితే పోకో వరకూ ఇలా అనేక మొబైల్‌ బ్రాండ్‌లు ప్రతినెలా కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తూనే ఉంటాయి.అయితే ఎక్కువ మందికి కావాల్సినవి.. కొనేవి బడ్జెట్‌ ఫోన్‌లే కాబట్టి.. రూ.20 వేల ధరలోపు 2025లో వచ్చిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లేవో ఈ కథనంలో చూద్దాం.. వీటిని చాలా మంది ఇప్పటికే కొని వినియోగిస్తుండవచ్చు. లేదా ఇప్పుడు కొనుక్కోవచ్చు..షియోమీ రెడ్ మీ నోట్ 14 5జీ: పనితీరు, కెమెరా, బ్యాటరీ సమతుల్య మిశ్రమంతో అద్భుతమైన ఆల్ రౌండర్. రోజువారీ ఉపయోగం, స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ కోసం రూ.17,000 లోపు మంచి ఆప్షన్‌.రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ: మంచి డిస​్‌ప్లే, బ్యాటరీ లైఫ్‌తో బడ్జెట్ ఎంపిక. ధర రూ .15,000 కంటే తక్కువ. దృఢమైన రోజువారీ పనితీరు, 5జీ సపోర్ట్‌ కోరుకునేవారికి సరిగ్గా సరిపోతుంది.మోటరోలా మోటో జీ86 పవర్ 5జీ: మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్‌, క్లీన్‌ సాఫ్ట్ వేర్ ఎక్స్‌పీరియన్స్‌తో బ్రాండ్ సపోర్ట్‌తో రూ.18,000 కంటే తక్కువ ధరలో అద్భుతమైన మిడ్-రేంజ్ ఫోన్‌ఒప్పో కే13 5జీ స్టైలిష్: డిజైన్, సులభమైన పనితీరు దీన్ని రూ.20,000 లోపు ఫోన్‌లలో పోటీ ఎంపికగా చేస్తుంది. డిస్ ప్లే క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్‌ పొందింది.వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ 5జీ: తక్కువ ధర పాయింట్ (రూ.12 వేలు నుంచి రూ.15 వేలు) వద్ద క్లీన్ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌, మంచి పనితీరును కోరుకుంటే ఇది మంచి ఆప్షన్‌.గమనిక: దాదాపు అన్ని ప్రధాన స్మోర్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ధరల రేంజ్‌, ఫీచర్లను బట్టి పైన జాబితాను ఇవ్వడం జరిగింది.

Nissan officially named its upcoming 7seat MPV for India the Gravite3
భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్‌

భారత ఆటోమొబైల్ రంగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా నిస్సాన్ మోటార్ ఇండియా కీలక అడుగు వేసింది. త్వరలో లాంచ్‌ చేయబోతున్న కాంపాక్ట్ త్రీ-రో ఎంపీవీకి ‘గ్రావైట్’ (Gravite) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈమేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ అమియో రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ మెసిమిలియనో మెస్సినా, నిస్సాన్ ఇండియా మోటార్‌ ఎండీ సౌరభ్‌వస్తా పాల్గొన్నారు. ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకున్నారు.కంపెనీ ప్రకటించిన రోడ్‌మ్యాప్ ప్రకారం గ్రావైట్ ఎంపీవీని జనవరి 2026లో ఆవిష్కరించునున్నారు. షోరూమ్‌ల్లో మార్చి 2026 నుంచి ఈ మోడల్‌ అందుబాటులోకి రానుంది. దీని ధరల వివరాలు కూడా అప్పుడే తెలియజేస్తామని చెప్పారు. నిస్సాన్ ఇండియా నూతన ఉత్పత్తి వ్యూహంలో భాగంగా జులై 2024లో ప్రకటించిన రెండో మోడల్ ఇది. దీని తర్వాత 2026 మధ్యలో టెక్టన్ ఎస్‌యూవీని, 2027 ప్రారంభంలో మరొక 7 సీట్ల సీ-ఎస్‌యూవీని విడుదల చేయాలని నిస్సాన్ యోచిస్తోంది.గ్రావైట్ ఎంపీవీని తమిళనాడులోని ఒరగదంలోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో స్థానికంగా తయారు చేయనున్నట్లు అమియో రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ మెసిమిలియనో మెస్సినా చెప్పారు. భారత కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీని డిజైన్‌ ఉంటుందన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ కంపెనీకు ప్రధాన మార్కెట్‌ అని చెప్పారు.నిస్సాన్ ఇండియా మోటార్‌ ఎండీ సౌరభ్‌వస్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో 7-సీటర్ ఆప్షన్‌గా ఈ మోడల్‌ నిలవనుంది. ఇండియాలో కంపెనీ వేగంగా వృద్ధి చెందాలని భావిస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో లాంచ్‌ అయిన మాగ్నైట్‌, త్వరలో లాంచ్‌ కానున్న టెక్టాన్‌, గ్రావైట్‌ మోడళ్ల ఆవిష్కరణ అందుకు నిదర్శనం. భవిష్యత్తులో భారత్‌లో నిస్సాన్‌ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువయ్యేలా చేసేందుకు కంపెనీ 100 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చేలా, కస్టమర్లకు నచ్చే డిజైన్లలో ఉత్పత్తులను అందిస్తున్నాం. ఈ క్రమంలో టెక్నాలజీని వాడుతున్నాం. అదే సమయంలో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అన్నారు.డిజైన్, ఫీచర్లునిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాల ప్రకారం కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, అప్‌డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ (LED ల్యాంప్స్), అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బానెట్, టెయిల్‌గేట్‌పై స్పష్టంగా కనిపించే ‘గ్రావైట్’ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ గురించి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన క్యాబిన్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.ఇదీ చదవండి: డ్రైవర్ల పంట పండించే ‘భారత్‌ ట్యాక్సీ’

Foreign trade expert Dr Murali Darshan insights on Indian Rupee4
మరింతగా పడిపోతున్న రూపాయి?? కారణాలు తెలిస్తే షాక్..!

భారత రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రోజురోజుకూ తగ్గిపోతోంది. మరోవైపు జీడీపీపరంగా భారత్‌ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఐదో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. మరి జీడీపీలో పురోగతి సాధిస్తున్నా రూపాయి పతనం ఎందుకు.. భారత అంతర్జాతీయ విధానంలో ఉన్న లోపాలేంటి.. విద్యాపరంగా పరిమితులేంటి.. తదితర అంశాలను వివరంగా విశ్లేషించారు ఫారిన్‌ ట్రేడ్‌ నిపుణులు, హైదరాబాద్‌కు చెందిన డా.మురళీదర్శన్‌. సాక్షి డిజిటల్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానంఅంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం చాలా విస్తృతమైన అంశం. ప్రతి దేశం మనతో స్నేహంగా ఉంటుందని ఆశించకూడదు. అధిక టారిఫ్‌లు భారత ఎగుమతులను బలహీనపరుస్తున్నాయి. అనేక విదేశీ కంపెనీలు భారత్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. దీని వల్ల రూపాయి విలువ పడిపోవడం, ఎగుమతులు తగ్గడం జరుగుతోంది.రూపాయి విలువ.. జీడీపీజీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) రూపాయి విలువకు ప్రత్యక్ష సంబంధం లేదు. జీడీపీ అనేది దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఎగుమతులు, దిగుమతుల వ్యత్యాసం, విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు వంటివి రూపాయి విలువ ప్రభావితమయ్యే కీలక అంశాలు. దిగుమతులపై ఎక్కువ ఆధారపడితే రూపాయి బలహీనమవుతుంది.ఎగుమతుల లోపాలుభారత ఎగుమతులు ప్రధానంగా సాఫ్ట్‌వేర్, ఔషధ రంగంపై ఆధారపడి ఉన్నాయి. కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ప్రతి దేశానికి అనుగుణంగా ఎగుమతి విధానాలు మార్చుకోవాలి.పరిమిత విద్యా వ్యవస్థభారతదేశంలో నాణ్యమైన పరిశోధనా సంస్థలు చాలా పరిమితంగా ఉన్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు తిరిగి రావడం లేదు. దీనివల్ల దేశానికి మేథో నష్టం జరుగుతోంది. ఒకప్పుడు నలంద, తక్షశిల వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మనవే. ఇప్పుడు మళ్లీ అలాంటి విద్యా ప్రమాణాలు తీసుకురావాలి.పాలనలో మేధావుల పాత్రరాజకీయాల్లో, విధాన నిర్ణయాల్లో నిపుణుల అవసరం ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ఏకాధిపత్యం రాజ్యమేలుతుంది. ప్రస్తుతం 2% మంది వద్ద 98% సంపద ఉంది. సహజ వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగించాలి.ఉపాధి అవకాశాలు, సహజ వనరులుభారతదేశానికి విశాలమైన తీరప్రాంతం ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం తీరాలు ఉన్నాయి. నౌకల మరమ్మత్తులు, నిర్వహణ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఉపగ్రహ మ్యాపింగ్ సేవలను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయవచ్చు.విలువ జోడింపు అవసరంఏ ఉత్పత్తికైనా విలువ జోడింపు అవసరం. ఉదాహరణకు టమాటాలు పండించే రైతులు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతుంటారు. వారు వాటిని సాస్ లేదా కేచప్‌లుగా మార్చి ఎగుమతి చేస్తే మంచి లాభం వస్తుంది. అలాగే కాఫీ, రఫ్ డైమండ్స్ కూడా. ఉత్పత్తికి విలువ జోడిస్తే ఉపాధి లభిస్తుంది. విదేశీ మారకం ద్రవ్యం పెరుగుతుంది.స్టార్టప్స్, పరిశోధనపరిశోధనా సంస్థలు పరిశ్రమలకు సహకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగించాలి. విదేశీ టెక్నాలజీని దేశీయ అవసరాలకు అనుసంధానం చేయాలి. స్టార్టప్స్‌కు సరైన విధాన మద్దతు ప్రభుత్వాల నుంచి అందించాల్సిన అవసరం ఉంది.యువతకు సందేశంఅంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఎంచుకోండి. విద్య, పరిశోధన, వ్యాపారంపై దృష్టి పెట్టండి. మంచి నాయకులను ఎన్నుకోండి. యువత శక్తితో వ్యవస్థను మార్చవచ్చు. దేశ అభివృద్ధికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది. అపారమైన మానవ వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా దూరదృష్టి ఉన్న నాయకత్వం, నాణ్యమైన విద్య, కొత్త మార్కెట్లు, విలువ జోడింపు, సమాన అభివృద్ధి.డా.మురళీదర్శన్‌ మనోగతం మరింత వివరంగా చూడండి.. ఈ కింది వీడియోలో..

Gold and Silver rates on 18th December 2025 in Telugu states5
పసిడి ఇంకా పైకి.. వెండి మరో‘సారీ’..

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఎగిశాయి.ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) మోస్తరుగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Maruti Suzuki ushers in inclusive mobility with WagonR Swivel seat6
మారుతీ వ్యాగన్‌ఆర్‌లో తిరిగే సీటు!

సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు వాహనంలోకి సులువుగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా తమ వ్యాగన్‌ఆర్‌ కారులో స్వివల్‌ సీట్‌ ఆప్షన్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది.రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. వ్యాగన్‌ఆర్‌ స్వివల్‌ సీటు .. ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (ఏఆర్‌ఏఐ) భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. అసమానతలను తొలగించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పర్యావరణహిత అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ఇది ముందడుగని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 11 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 200కు పైగా మారుతీ సుజుకి అరేనా డీలర్‌షిప్‌లలో ఈ స్వివల్‌ సీటు ఏర్పాటు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త వ్యాగన్‌ఆర్‌ కార్లకు అలాగే ఇప్పటికే ఉన్న కార్లకు కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్, 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.ఈ ప్రాజెక్ట్ కోసం మారుతీ సుజుకి, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్‌- ఐఐఎం బెంగళూరు స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద బెంగళూరుకు చెందిన ట్రూఅసిస్ట్‌ టెక్నాలజీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు వ్యాగన్‌ఆర్ స్వివెల్ సీట్‌ను రెట్రోఫిట్ కిట్‌గా అరేనా డీలర్‌షిప్‌లలో ఆర్డర్ చేయవచ్చు. వాహనం నిర్మాణం లేదా ప్రాథమిక పనితీరులో ఎటువంటి మార్పులు చేయకుండా ఈ సీటును అమర్చుతారు.టాల్ బాయ్ డిజైన్ కలిగిన వ్యాగన్‌ఆర్.. విశాలమైన హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌తో ఈ ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్‌కు అత్యంత అనుకూలంగా నిలుస్తుంది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకీ మోడళ్లలో వ్యాగన్‌ఆర్ ఒకటి.

Advertisement
Advertisement
Advertisement