ప్రధాన వార్తలు
వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.పెరుగుతున్న బ్యాటరీలుప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.రీసైక్లింగ్ ప్రక్రియబ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్కు బాధ్యత వహించాలి.బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్ లైఫ్ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
2025లో బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే..
2025 ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్చే డివైజ్ ఏదైనా ఉందంటే అది స్మార్ట్ ఫోన్. శాంసంగ్ నుంచి మొదలు పెడితే పోకో వరకూ ఇలా అనేక మొబైల్ బ్రాండ్లు ప్రతినెలా కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంటాయి.అయితే ఎక్కువ మందికి కావాల్సినవి.. కొనేవి బడ్జెట్ ఫోన్లే కాబట్టి.. రూ.20 వేల ధరలోపు 2025లో వచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్లేవో ఈ కథనంలో చూద్దాం.. వీటిని చాలా మంది ఇప్పటికే కొని వినియోగిస్తుండవచ్చు. లేదా ఇప్పుడు కొనుక్కోవచ్చు..షియోమీ రెడ్ మీ నోట్ 14 5జీ: పనితీరు, కెమెరా, బ్యాటరీ సమతుల్య మిశ్రమంతో అద్భుతమైన ఆల్ రౌండర్. రోజువారీ ఉపయోగం, స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ కోసం రూ.17,000 లోపు మంచి ఆప్షన్.రియల్మీ 14ఎక్స్ 5జీ: మంచి డిస్ప్లే, బ్యాటరీ లైఫ్తో బడ్జెట్ ఎంపిక. ధర రూ .15,000 కంటే తక్కువ. దృఢమైన రోజువారీ పనితీరు, 5జీ సపోర్ట్ కోరుకునేవారికి సరిగ్గా సరిపోతుంది.మోటరోలా మోటో జీ86 పవర్ 5జీ: మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్, క్లీన్ సాఫ్ట్ వేర్ ఎక్స్పీరియన్స్తో బ్రాండ్ సపోర్ట్తో రూ.18,000 కంటే తక్కువ ధరలో అద్భుతమైన మిడ్-రేంజ్ ఫోన్ఒప్పో కే13 5జీ స్టైలిష్: డిజైన్, సులభమైన పనితీరు దీన్ని రూ.20,000 లోపు ఫోన్లలో పోటీ ఎంపికగా చేస్తుంది. డిస్ ప్లే క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్ పొందింది.వన్ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ: తక్కువ ధర పాయింట్ (రూ.12 వేలు నుంచి రూ.15 వేలు) వద్ద క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్, మంచి పనితీరును కోరుకుంటే ఇది మంచి ఆప్షన్.గమనిక: దాదాపు అన్ని ప్రధాన స్మోర్ట్ఫోన్ బ్రాండ్లను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ధరల రేంజ్, ఫీచర్లను బట్టి పైన జాబితాను ఇవ్వడం జరిగింది.
భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
భారత ఆటోమొబైల్ రంగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా నిస్సాన్ మోటార్ ఇండియా కీలక అడుగు వేసింది. త్వరలో లాంచ్ చేయబోతున్న కాంపాక్ట్ త్రీ-రో ఎంపీవీకి ‘గ్రావైట్’ (Gravite) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈమేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ అమియో రీజియన్ ఛైర్పర్సన్ మెసిమిలియనో మెస్సినా, నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్వస్తా పాల్గొన్నారు. ఈ మోడల్కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకున్నారు.కంపెనీ ప్రకటించిన రోడ్మ్యాప్ ప్రకారం గ్రావైట్ ఎంపీవీని జనవరి 2026లో ఆవిష్కరించునున్నారు. షోరూమ్ల్లో మార్చి 2026 నుంచి ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. దీని ధరల వివరాలు కూడా అప్పుడే తెలియజేస్తామని చెప్పారు. నిస్సాన్ ఇండియా నూతన ఉత్పత్తి వ్యూహంలో భాగంగా జులై 2024లో ప్రకటించిన రెండో మోడల్ ఇది. దీని తర్వాత 2026 మధ్యలో టెక్టన్ ఎస్యూవీని, 2027 ప్రారంభంలో మరొక 7 సీట్ల సీ-ఎస్యూవీని విడుదల చేయాలని నిస్సాన్ యోచిస్తోంది.గ్రావైట్ ఎంపీవీని తమిళనాడులోని ఒరగదంలోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్లో పూర్తిస్థాయిలో స్థానికంగా తయారు చేయనున్నట్లు అమియో రీజియన్ ఛైర్పర్సన్ మెసిమిలియనో మెస్సినా చెప్పారు. భారత కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీని డిజైన్ ఉంటుందన్నారు. ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ కంపెనీకు ప్రధాన మార్కెట్ అని చెప్పారు.నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్వస్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో 7-సీటర్ ఆప్షన్గా ఈ మోడల్ నిలవనుంది. ఇండియాలో కంపెనీ వేగంగా వృద్ధి చెందాలని భావిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన మాగ్నైట్, త్వరలో లాంచ్ కానున్న టెక్టాన్, గ్రావైట్ మోడళ్ల ఆవిష్కరణ అందుకు నిదర్శనం. భవిష్యత్తులో భారత్లో నిస్సాన్ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువయ్యేలా చేసేందుకు కంపెనీ 100 షోరూమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చేలా, కస్టమర్లకు నచ్చే డిజైన్లలో ఉత్పత్తులను అందిస్తున్నాం. ఈ క్రమంలో టెక్నాలజీని వాడుతున్నాం. అదే సమయంలో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అన్నారు.డిజైన్, ఫీచర్లునిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాల ప్రకారం కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, అప్డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ (LED ల్యాంప్స్), అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బానెట్, టెయిల్గేట్పై స్పష్టంగా కనిపించే ‘గ్రావైట్’ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ గురించి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరుగైన క్యాబిన్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.ఇదీ చదవండి: డ్రైవర్ల పంట పండించే ‘భారత్ ట్యాక్సీ’
మరింతగా పడిపోతున్న రూపాయి?? కారణాలు తెలిస్తే షాక్..!
భారత రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రోజురోజుకూ తగ్గిపోతోంది. మరోవైపు జీడీపీపరంగా భారత్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఐదో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. మరి జీడీపీలో పురోగతి సాధిస్తున్నా రూపాయి పతనం ఎందుకు.. భారత అంతర్జాతీయ విధానంలో ఉన్న లోపాలేంటి.. విద్యాపరంగా పరిమితులేంటి.. తదితర అంశాలను వివరంగా విశ్లేషించారు ఫారిన్ ట్రేడ్ నిపుణులు, హైదరాబాద్కు చెందిన డా.మురళీదర్శన్. సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానంఅంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం చాలా విస్తృతమైన అంశం. ప్రతి దేశం మనతో స్నేహంగా ఉంటుందని ఆశించకూడదు. అధిక టారిఫ్లు భారత ఎగుమతులను బలహీనపరుస్తున్నాయి. అనేక విదేశీ కంపెనీలు భారత్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. దీని వల్ల రూపాయి విలువ పడిపోవడం, ఎగుమతులు తగ్గడం జరుగుతోంది.రూపాయి విలువ.. జీడీపీజీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) రూపాయి విలువకు ప్రత్యక్ష సంబంధం లేదు. జీడీపీ అనేది దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఎగుమతులు, దిగుమతుల వ్యత్యాసం, విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు వంటివి రూపాయి విలువ ప్రభావితమయ్యే కీలక అంశాలు. దిగుమతులపై ఎక్కువ ఆధారపడితే రూపాయి బలహీనమవుతుంది.ఎగుమతుల లోపాలుభారత ఎగుమతులు ప్రధానంగా సాఫ్ట్వేర్, ఔషధ రంగంపై ఆధారపడి ఉన్నాయి. కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ప్రతి దేశానికి అనుగుణంగా ఎగుమతి విధానాలు మార్చుకోవాలి.పరిమిత విద్యా వ్యవస్థభారతదేశంలో నాణ్యమైన పరిశోధనా సంస్థలు చాలా పరిమితంగా ఉన్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు తిరిగి రావడం లేదు. దీనివల్ల దేశానికి మేథో నష్టం జరుగుతోంది. ఒకప్పుడు నలంద, తక్షశిల వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మనవే. ఇప్పుడు మళ్లీ అలాంటి విద్యా ప్రమాణాలు తీసుకురావాలి.పాలనలో మేధావుల పాత్రరాజకీయాల్లో, విధాన నిర్ణయాల్లో నిపుణుల అవసరం ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ఏకాధిపత్యం రాజ్యమేలుతుంది. ప్రస్తుతం 2% మంది వద్ద 98% సంపద ఉంది. సహజ వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగించాలి.ఉపాధి అవకాశాలు, సహజ వనరులుభారతదేశానికి విశాలమైన తీరప్రాంతం ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం తీరాలు ఉన్నాయి. నౌకల మరమ్మత్తులు, నిర్వహణ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఉపగ్రహ మ్యాపింగ్ సేవలను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయవచ్చు.విలువ జోడింపు అవసరంఏ ఉత్పత్తికైనా విలువ జోడింపు అవసరం. ఉదాహరణకు టమాటాలు పండించే రైతులు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతుంటారు. వారు వాటిని సాస్ లేదా కేచప్లుగా మార్చి ఎగుమతి చేస్తే మంచి లాభం వస్తుంది. అలాగే కాఫీ, రఫ్ డైమండ్స్ కూడా. ఉత్పత్తికి విలువ జోడిస్తే ఉపాధి లభిస్తుంది. విదేశీ మారకం ద్రవ్యం పెరుగుతుంది.స్టార్టప్స్, పరిశోధనపరిశోధనా సంస్థలు పరిశ్రమలకు సహకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగించాలి. విదేశీ టెక్నాలజీని దేశీయ అవసరాలకు అనుసంధానం చేయాలి. స్టార్టప్స్కు సరైన విధాన మద్దతు ప్రభుత్వాల నుంచి అందించాల్సిన అవసరం ఉంది.యువతకు సందేశంఅంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఎంచుకోండి. విద్య, పరిశోధన, వ్యాపారంపై దృష్టి పెట్టండి. మంచి నాయకులను ఎన్నుకోండి. యువత శక్తితో వ్యవస్థను మార్చవచ్చు. దేశ అభివృద్ధికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది. అపారమైన మానవ వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా దూరదృష్టి ఉన్న నాయకత్వం, నాణ్యమైన విద్య, కొత్త మార్కెట్లు, విలువ జోడింపు, సమాన అభివృద్ధి.డా.మురళీదర్శన్ మనోగతం మరింత వివరంగా చూడండి.. ఈ కింది వీడియోలో..
పసిడి ఇంకా పైకి.. వెండి మరో‘సారీ’..
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఎగిశాయి.ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) మోస్తరుగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
మారుతీ వ్యాగన్ఆర్లో తిరిగే సీటు!
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వాహనంలోకి సులువుగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా తమ వ్యాగన్ఆర్ కారులో స్వివల్ సీట్ ఆప్షన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది.రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. వ్యాగన్ఆర్ స్వివల్ సీటు .. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ఏఆర్ఏఐ) భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. అసమానతలను తొలగించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పర్యావరణహిత అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ఇది ముందడుగని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 11 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 200కు పైగా మారుతీ సుజుకి అరేనా డీలర్షిప్లలో ఈ స్వివల్ సీటు ఏర్పాటు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త వ్యాగన్ఆర్ కార్లకు అలాగే ఇప్పటికే ఉన్న కార్లకు కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఏఆర్ఏఐ సర్టిఫికేషన్, 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.ఈ ప్రాజెక్ట్ కోసం మారుతీ సుజుకి, ఎన్ఎస్ఆర్సీఈఎల్- ఐఐఎం బెంగళూరు స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద బెంగళూరుకు చెందిన ట్రూఅసిస్ట్ టెక్నాలజీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు వ్యాగన్ఆర్ స్వివెల్ సీట్ను రెట్రోఫిట్ కిట్గా అరేనా డీలర్షిప్లలో ఆర్డర్ చేయవచ్చు. వాహనం నిర్మాణం లేదా ప్రాథమిక పనితీరులో ఎటువంటి మార్పులు చేయకుండా ఈ సీటును అమర్చుతారు.టాల్ బాయ్ డిజైన్ కలిగిన వ్యాగన్ఆర్.. విశాలమైన హెడ్రూమ్, లెగ్రూమ్తో ఈ ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్కు అత్యంత అనుకూలంగా నిలుస్తుంది. భారత్లో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకీ మోడళ్లలో వ్యాగన్ఆర్ ఒకటి.
కార్పొరేట్
స్టీల్కు పెరగనున్న డిమాండ్
ఖర్చులు కట్...లాభాలకు బూస్ట్
డ్రైవర్ల పంట పండించే ‘భారత్ ట్యాక్సీ’
రైల్వే వాలెట్ నుంచి నగదు విత్డ్రా కుదరదు
వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే..
ఇన్సూరెన్స్ మార్కెట్లో ఎందుకింత ఒత్తిడి?
ఇది సక్సెస్ కాదు.. గిగ్ కార్మికుల గొడ్డు చాకిరీ!
ఈ వింటర్ వెకేషన్కు అంతా అక్కడికే!
వేదాంతా విడదీతకు ఓకే
వంతారాలో లియోనెల్ మెస్సీ
తగ్గిన బంగారం దిగుమతులు: నవంబర్లో 60 శాతం..
దేశీయంగా బంగారం దిగుమతులు గత నెలలో వార్షికంగా 60 శ...
రెండోరోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నవంబర్లో బలమైన పనితీరు చ...
ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు
ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల...
రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్!
భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే చారిత...
భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..
అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్, చైనా సహా ఇతర ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: యూజర్లకు పండగే!
రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హీరో యాన్యువల్ రీఛార్జ్ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్కు 18 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ను పొందవచ్చు.సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్స్టార్, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.ఫ్లెక్సీ ప్యాక్ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్
ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.Attention !!!Non- stop connection at 2399/- for 365 days#BharatFibre #SuccessStory #Partnership #4Gmobile #BusinessSuccess #BSNLSelfCareApp #SwitchToBSNL #entertainment #mobilerecharge #fypage✨ #explorepage pic.twitter.com/774dFc3jeJ— BSNL_Kolkata (@BSNL_KOTD) December 13, 2025
పైపుల్లో కరెంట్!: ఇంజినీర్ల మ్యాజిక్
ఇంటి దగ్గర ఉన్న సాధారణ నీటి పైపులు రాత్రి వీధి దీపాలను వెలిగించగలవంటే నమ్ముతారా? నిజమే. ఎలాంటి సౌర ఫలకాలూ లేకుండా, పెద్ద యంత్రాలను అమర్చే అవసరం లేకుండా కేవలం నీరు పారుతూనే విద్యుత్ తయారవుతోంది. ఇదే ఇజ్రాయెల్ ఇంజినీర్లు ఆవిష్కరించిన ‘స్మార్ట్ వాటర్ పైప్స్’ మ్యాజిక్! పైపుల లోపల చిన్న చక్రాలు లాంటివి అమర్చితే, నీరు ఒత్తిడితో ప్రవహించినప్పుడు అవి మెల్లగా తిరుగుతాయి. ఆ తిప్పుడే నీటి ప్రవాహాన్ని నేరుగా విద్యుచ్ఛశక్తిగా మారుస్తుంది. నీరు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా తన దారినే ప్రవహిస్తుంది. నగరాలు ఇప్పుడు ఈ స్మార్ట్ ఎనర్జీ పైపులను పరీక్షిస్తున్నాయి.వీధి దీపాలు వెలిగించడం నుంచి నగరంలోని సెన్సర్లు పనిచేయించడం వరకూ ఇవే సరిపోతున్నాయని తేలింది. అంతేకాదు, పైపుల్లో ఎక్కడ లీక్ ఉందో, నీటి నాణ్యత ఎలా ఉందో కూడా వెంటనే తెలియజేస్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న చిన్న వ్యవస్థలే భవిష్యత్తును ఎలా మార్చగలవో ఈ పైపులు చూపుతున్నాయి.
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, విప్రో
దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. ఎంటర్ప్రైజ్లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్నర్ ల్యాబ్స్లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్ప్రైజెస్కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్ప్రైజ్లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది.
పర్సనల్ ఫైనాన్స్
ఫండ్ పరిశ్రమకు సిప్ దన్ను
అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లు (సిప్), మార్కెట్ వృద్ధితో అసెట్ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా తెలిపారు. రిటైర్మెంట్ లేదా పిల్లల చదువులాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మదుపరులు, చివరివరకు పెట్టుబడులను కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.యాక్టివ్ వ్యూహాలు అత్యధిక రాబడులను అందించినంత వరకు వాటిపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతుందని షవివరించారు. దేశీయంగా యాక్టివ్ ఫండ్లు సహేతుకమైన పనితీరును కనపరుస్తున్నందున వాటిల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏదైనా ఫండ్ సంస్థకు ఇతర సంస్థల నుంచి పోటీ, లేదా నియంత్రణ నిబంధనలపరమైన రిసు్కల కన్నా పనితీరు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే పెద్ద రిసు్కగా ఉంటుందని షా వివరించారు.‘‘డిజిటైజేషన్, డెమోగ్రాఫిక్స్, ఆర్థిక అసెట్ద్లోకి కుటుంబాల పొదుపు మొత్తాలు భారీగా వస్తుండటంలాంటి అంశాల దన్నుతో భారత జీడీపీ గణనీయంగా వృద్ధి నమోదు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ఊతంతో దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి రూపంలో ఈక్విటీ మార్కెట్లలో కూడా ఇది ప్రతిఫలిస్తోంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులను కొనసాగించే వారికి సముచితమైన ప్రతిఫలం దక్కుతుందని ఇవి నమ్మకం కలిగిస్తున్నాయి’’ అని షా తెలిపారు.లిస్టయినా జవాబుదారీతనం యథాతథం.. ‘‘స్టాక్ మార్కెట్లలో కంపెనీ లిస్టయినప్పటికీ మా జవాబుదారీతనం, బాధ్యతలేమీ మారవు. ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించి, వారి సంపద వృద్ధి చెందితేనే మా ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి యూనిట్హోల్డర్లకు ఒనగూరే ప్రయోజనాలతో షేర్హోల్డర్ల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అన్నింటికన్నా ప్రధానంగా డబ్బును నిర్వహించే రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీగానే మమ్మల్ని మేము భావిస్తాం. లిస్టింగ్ తర్వాత కూడా అదే కొనసాగుతుంది. ఫండ్ పరిశ్రమ చాలా విస్తృత స్థాయి వ్యాపారం. ఇన్వెస్టర్లకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియంత్రణ సంస్థ వ్యయాలను క్రమబదీ్ధకరించింది. దీనితో ఇన్వెస్టర్లకు ఫండ్స్ మరింత అందుబాటులోకి వస్తాయి. అలాగే మార్జిన్లు తగ్గినా పరిమాణం పెరగడం వల్ల సంస్థకు ఆ మేరకు భర్తీ అవుతుంది. కాలక్రమేణా అధిక లాభాలకు దోహదపడుతుంది’’ అని షా చెప్పారు.ఇక ఐపీవో వల్ల కంపెనీ నిర్వహణ స్వరూపం ఏమీ మారదన్నారు. గత మూడు దశాబ్దాలుగా పెట్టుబడులు కొనసాగిస్తున్న ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ పాక్షికంగానే వాటాలను విక్రయిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంకు మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి అదే మేనేజ్మెంట్, అవే పెట్టుబడి సూత్రాలు, గవర్నెన్స్తో వ్యాపారం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ ఇష్యూతో లిక్విడిటీ, యాజమాన్యం పెరుగుతుందే తప్ప కంపెనీ వ్యూహంలో మార్పు ఉండదని షా తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరున్న పలు దిగ్గజ సంస్థలు యాంకర్ ఇన్వెస్టర్లుగా ఈ ఇష్యూలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. తమ బిజినెస్ మోడల్, నిర్వహణ క్రమశిక్షణ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, భారత అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమపై వాటికున్న నమ్మకానికి ఇది నిదర్శనంగా ఉంటుందని వివరించారు.
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. కొత్త డెడ్లైన్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా స్పందించారు.2026 మార్చిలోపు ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. మీరు ఇప్పటికే 75 శాతం పీఎఫ్ను విత్డ్రా చేసుకోవచ్చు. దీనిని మరింత సరళతరం చేయడంలో భాగంగానే ఏటీఎం విత్డ్రా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని కూడా మాండవియా హైలైట్ చేశారు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ను ఉపసంహరించుకోవడానికి అనేక ఫామ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సభ్యులకు ఇబ్బందిగా మారుతుందని, ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!అక్టోబర్ 2025లో, ప్రావిడెంట్ ఫండ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ప్రధాన సంస్కరణలను ఆమోదించింది. ఈపీఎఫ్ ఉపసంహరణ నియమాలు గందరగోళంగా ఉన్నాయని, దీని వల్లనే కొన్నిసార్లు పీఎఫ్ ఉపసంహరణ ఆలస్యం, తిరస్కరణ జరుగుతోందని కార్మిక మంత్రి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపసంహరణ చట్రాన్ని సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ 13 వర్గాలను విలీనం చేసి 3 విభాగాలుగా వర్గీకరించారు. ఇది పీఎఫ్ ఉపసంహరణను మరింత సులభతరం చేసింది.
ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..
ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.మ్యూచువల్ ఫండ్స్ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఈక్విటీ ఫండ్స్దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.డెట్ ఫండ్స్ఇవి బాండ్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.ఈక్విటీ, స్టాక్ మార్కెట్పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్పై, కంపెనీల ఫండమెంటల్స్పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే అధిక రిస్క్తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.రియల్ ఎస్టేట్భౌతిక ఆస్తులుఇళ్లు, అపార్ట్మెంట్లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.రీట్స్(Real Estate Investment Trusts)రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.చిన్న వ్యాపారాలుపెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్తో కూడుకుంది.ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలుపీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.ఎన్పీఎస్: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: అమల్లోకి ఎప్పుడంటే?
ఒకప్పుడు స్వాతంత్రం రాక ముందు ఆదాయపు పన్ను చట్టం 1922, స్వాతంత్రం వచ్చిన తరువాత చట్టం 1961 అమలులోకి వచ్చింది. మధ్యలో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, నాలుగైదు సార్లు పెనుమార్పులు. తీసివేతలు, కలిపివేతలు, 65 సార్లు 4,000 మార్పులు చేశారు. ఈ సంవత్సరం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు.ఆదాయపు పన్ను చట్టం 2025.. 47 చాప్టర్లను 23కు కుదించారు. 819 సెక్షన్లను 536కి తగ్గించారు. ఇప్పుడు షెడ్యూళ్లు లేవు. ఇప్పుడు వాటి సంఖ్య 16. ప్రస్తుతం అంకెలకు ఇంగ్లీషు అక్షరాలు తగిలించి.. మూడు అక్షరాల రైలుబండిలా పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఇకపై అలా ఉండదు. కేవలం నంబర్లే... సెక్షన్ 10లో ఉండే అన్ని మినహాయింపులను షెడ్యూల్స్లో అమర్చారు. క్లారిటీ కోసం కొన్ని టేబుల్స్, ఫార్మూలాలు ప్రవేశపెట్టారు. అదేదో సినిమా డైలాగు గుర్తొస్తోంది. ‘అయితే నాకేంటి’? ఈ మార్పుల వలన మనకు ఒరిగేది ఏమిటి? 1.4.2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టం ప్రత్యేకతలు ఏమిటంటే...?సరళీకృతంగా ఉంటుంది. వాడుకలో లేనివాటిని తీసివేశారుకొన్ని అంశాలను నెంబరింగ్ ఇచ్చి క్రమబద్ధీకరించారు. కొన్ని అంశాలను పునర్నిర్మాణం చేశారు. రాబోయే పదం ‘‘పన్ను సంవత్సరం’’. ప్రస్తుత అకౌటింగ్ సంవత్సరం, ఫైనాన్సియల్ సంవత్సరం, ఆదాయపు సంవత్సరం, గత సంవత్సరం, ఇవన్నీ మనకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మనం ఆదాయం సంపాదించిన సంవత్సరం. ఈ ఆదాయాన్ని సంవత్సరం తరువాత అస్సెస్సుమెంట్ సంవత్సరం అంటే ఆ తరువాత సంవత్సరంలో అస్సెస్సు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అస్సెస్సుమెంట్ సంవత్సరం అని అంటారు.రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి అవుతుందని అడిగినట్లు... 64 ఏళ్లు దాటినా టాక్స్ ప్లేయర్కి ఈ రెండు సంవత్సరాల మధ్య తేడా తెలియదు. కన్ఫ్యూజన్ పోలేదు. ఎన్నో పొరపాట్లు జరిగేవి. ఇన్కం టాక్స్ చెల్లించేటప్పుడు చలాన్లో సంవత్సరానికి సంబంధించిన కాలమ్ నింపేటప్పుడు తికమక అయ్యేవారు. ఇకపై తికమక అవసరం ఉండదు. 1.4.2026 నుంచి నుంచి ఒకే పదం వాడుకలోకి వస్తుంది. అదే ‘‘పన్ను సంవత్సరం’’. టీడీఎస్కి సంబంధించిన అంశాలను చాలా పద్ధతి ప్రకారం ఎటువంటి తికమక రాకుండా చేశారు. ఒక సెక్షన్ ద్వారా జీతాలకు సంబంధించిన అంశాలు పొందుబరిచారు. ఒకే ఒక సెక్షన్ ద్వారా మిగతా అన్ని టీడీయస్ అంశాలు పొందుబరిచారు. ఈ పట్టిక సమగ్రం.., సంపూర్ణం. క్రమసంఖ్య ఏ ఆదాయం మీద చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? పరిమితులు... ఇలా ఉంటాయి వివరాలు... రెసిడెంట్లకు, నాన్ రెసిడెంట్లకు, టీసీఎస్.. ఎవరికి అక్కర్లేదు.? ఇలా అన్నీ టేబుల్స్ ద్వారా చక్కగా వివరించారు. పాతకాలపు పదజాలానికి స్వస్తి పలికారు. పాతవాటికి మంగళం పలికి, ప్రపంచంలో ఆచరించే మంచి పద్ధతులకు చట్టంలో చోటిచ్చారు.వర్చువల్, డిజిటల్ ఆస్తులను నిర్వచించారు. క్రిప్టో కరెన్సీ, టోకనైజ్డ్ ఆస్తులు, టెక్నాలజీ ద్వారా ఏర్పడే హక్కులు మొదలైనవి వివరించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చేస్తారు. టెక్నాలజీని ఆసరా తీసుకొని అధికార్లకువిస్తృత అధికారాలు కల్పించారు. ఇన్నాళ్లు సెర్చ్లు అంటే ఇంటినో, ఆఫీసునో, ఫిజికల్ ఏరియా మాత్రమే ఉండేవి. ఇక నుంచి మీ ఈ–మెయిల్స్, క్లౌడ్ సర్వర్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్సైట్లు అన్నింట్లోనూ చొరబడతారు ఎగబడతారు. ఇకపై బుకాయించలేము. ఈ నగదు నాది కాదు మా మామగారిది అనలేము. అధికారులకు విస్తృత సమాచారం ఇవ్వడం వల్ల మీకు సంబంధించిన సమాచారం వారి చెంతనే ఉంటుంది. కాబట్టి కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా నడుచుకుందాం. చట్ట ప్రకారం మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి. ఫిబ్రవరిలో బడ్జెటుకు కసరత్తు జరుగుతోంది. అందులో శ్లాబులు, రేట్లు మారవచ్చు. మారకపోవచ్చు. ఈ రాబోయే మార్పులు తప్ప, మిగతా అంతా కొత్త చట్టం మనకు అందుబాటులో ఉంటుంది.కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య


