Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Implements Four Labour Codes From November 21st 20251
కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు: తక్షణమే అమల్లోకి

భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు.. తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు.కొత్త చట్టాలువేతనాల కోడ్ (2019)పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020)సామాజిక భద్రత కోడ్ (2020)వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)కనీస వేతనానికి గ్యారెంటీ, గ్రాట్యూటీ, సామాజిక భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే ఈ కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఇప్పటికే ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో ఉంటాయి.వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్‌ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది.OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.ప్రయోజనాలుకొత్త కార్మిక కోడ్‌ల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు, కార్మికులందరికీ కనీస వేతనం గ్యారెంటీ, అపాయింట్మెంటు లెటర్ గ్యారెంటీ, సమాన పనికి సమాన వేతనం, మహిళల ఆమోదం, భద్రత చర్యలకు లోబడి రాత్రి వేళలో స్త్రీలు పని చేయడానికి అనుమతి, 40 కోట్ల మంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ, ఏడాది తర్వాత ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిస్‌‌‌‌కు గ్రాట్యూటీ, ఓవర్ టైంకు రెట్టింపు వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య రక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం వంటివి ఉన్నాయి.నరేంద్ర మోదీ ట్వీట్''శ్రమేవ్ జయతే! నేడు, మన ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్‌లను అమలులోకి తెచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలలో ఒకటి'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Shramev Jayate!Today, our Government has given effect to the Four Labour Codes. It is one of the most comprehensive and progressive labour-oriented reforms since Independence. It greatly empowers our workers. It also significantly simplifies compliance and promotes ‘Ease of…— Narendra Modi (@narendramodi) November 21, 2025

Gold prices Fluctuated In The Evening Today2
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..

బంగారం ధరలలో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (నవంబర్ 21) ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. అంటే గంటల వ్యవధిలో పసిడి ధరలు తారుమారయ్యాయి.విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో బంగారం ధరలు ఉదయం రూ. 1,14,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,24,480 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 1,13,800 (రూ. 250 తగ్గింది), రూ. 1,24,130 (రూ. 280 తగ్గింది) వద్దకు చేరాయి.ఢిల్లీలో కూడా ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గింది. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ. 200 (రూ. 1,24,630), 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 220 (రూ. 1,14,250) పెరిగింది. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 280 (రూ. 1,24,130), రూ. 250 (రూ. 1,13,800) తగ్గింది.చెన్నైలో బంగారం ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధరలు రూ. 1,14,600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,25,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!

OPPO Unveils Flagship Find X9 Series in India Starting at Rs 749993
ఒప్పో నుంచి సరికొత్త ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌

ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వేరియంట్‌ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్‌ 21 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఒప్పో ఈ–స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.హాసెల్‌బ్లాడ్‌తో కలిసి రూపొందించిన కొత్త తరం కెమెరా సిస్టం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన పనితీరు మొదలైన విశేషాలు ఇందులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే హాసెల్‌బ్లాడ్‌ టెలీకన్వర్టర్‌ కిట్‌ రూ. 29,999కి లభిస్తుంది. ఇక, లేటెస్ట్‌ టీడబ్ల్యూఎస్‌ ఎన్‌కో బడ్స్‌3 ప్రోప్లస్‌ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,899గా ఉంటుంది.హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యంఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ హాసెల్‌బ్లాడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్‌ జెన్‌ కెమెరా సిస్టమ్. ఇది ప్రొఫెషనల్‌ ఫోటోగ్రఫీ అనుభవానికి దగ్గరగా ఉండే రంగులు, కాంట్రాస్ట్‌, డైనమిక్‌ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా టెలిఫోటో ఫోటోగ్రఫీ కోసం హాసెల్‌బ్లాడ్‌ టెలీకన్వర్టర్‌ కిట్ కూడా పరిచయమైంది.మెరుగైన బ్యాటరీ, పనితీరుఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో బలమైన ప్రాసెసర్‌, ఆప్టిమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ వంటి అంశాలు ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, నిరంతర మల్టీటాస్కింగ్‌ సామర్థ్యం, హై–ఎండ్‌ గేమింగ్‌కు సరిపడే పనితీరు ఈ డివైస్‌లను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

RBI warns against 7 new forex trading platforms4
ట్రేడింగ్‌లో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ హెచ్చరిక

అనధికారిక ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా ఇన్వెస్టర్లను రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన ఆర్‌బీఐ కొత్తగా అలర్ట్‌ లిస్ట్‌లో 7 ప్లాట్‌ఫామ్స్‌ను జత చేసింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్‌నెట్‌ ఎఫ్‌ఎక్స్, క్యాప్‌ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్‌ మార్కెట్స్, ట్రైవ్, ఎన్‌ఎక్స్‌జీ మార్కెట్స్, నార్డ్‌ ఎఫ్‌ఎక్స్‌ చేరాయి.విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999(ఫెమా) ప్రకారం జాబితాలోని సంస్థలకు అధికారికంగా ఫారెక్స్‌ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతిలేకపోవడంతోపాటు.. ఎల్రక్టానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌(ఈటీపీలు)ను సైతం నిర్వహించేందుకు వీలులేదని కేంద్ర బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా జాబితాలోని సంస్థలు, ప్లాట్‌ఫామ్స్, వెబ్‌సైట్లు ప్రకటనల ద్వారా అనధికారిక ఈటీపీలను ప్రమోట్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. శిక్షణ, అడ్వయిజరీ సర్వీసులందిస్తున్నట్లు క్లెయిమ్‌ చేసుకుంటున్నాయని తెలియజేసింది.

Uday Kotak Reflects on Kotak Mahindra Bank Rise From Small Office5
అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!

కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, శుక్రవారంతో 40 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఉదయ్ కోటక్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు."నేటికి నలభై సంవత్సరాల క్రితం, నేను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో రూ. 30 లక్షల మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించాను. అదే కోటక్ మహీంద్రా బ్యాంక్. మారుతున్న కాలంతో పాటు ఇది కూడా వృద్ధి చెందాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు... తుమ్ జియో హజారో సాల్" అని ఉదయ్ కోటక్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.కోటక్ మహీంద్రా బ్యాంక్ కథ 1985లో ప్రారంభమైంది. ఉదయ్ కోటక్ తన కుటుంబ వస్త్ర వ్యాపారంలో ముందుకు సాగడానికి ఆసక్తి చూపలేదు. కానీ తన కుటుంబ సంస్థ కోటక్ & కో. అనుబంధంగా కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను రూ. 30 లక్షలతో ప్రారంభించారు. అదే సమయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి తిరిగి వచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా సంస్థలో భాగం కావడానికి రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత కోటక్ మహీంద్రా బ్యాంకుగా మారింది. ఈ రోజు బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.2 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఆనంద్ మహీంద్రా ట్వీట్కోటక్ బ్యాంకు 40 ఏళ్ల ప్రయాణంలో ఆనంద్ మహీంద్రా కూడా అభినందనలు తెలిపారు. "నీ ప్రయాణం నిజంగా ఒక అద్భుతం, ఉదయ్'' అని చెబుతూనే ఒక ఫోటోను షేర్ చేశారు. మీరు తదుపరి లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. నేను మిమ్మల్ని & మీ బృందాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాను' అని అన్నారు.కోటక్ మహీంద్రా గ్రూప్ గురించి1985లో ప్రారంభమైన కోటక్ మహీంద్రా గ్రూప్ భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థలలో ఒకటి. ఫిబ్రవరి 2003లో, గ్రూప్ ప్రధాన సంస్థ అయిన కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి బ్యాంకింగ్ లైసెన్స్‌ను పొందింది, భారతదేశంలో బ్యాంకుగా మారిన మొట్టమొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ 'కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్' అయింది.కోటక్ మహీంద్రా గ్రూప్ (గ్రూప్) ప్రతి రంగాన్ని కవర్ చేసే విస్తృత శ్రేణి ఆర్థిక సేవలను అందిస్తుంది. వాణిజ్య బ్యాంకింగ్ నుంచి స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వరకు విభిన్న ఆర్థిక అవసరాలను తీరుస్తుంది.ఇదీ చదవండి: వారానికి 72 గంటల పని.. వారికి మాత్రమే!కోటక్ మహీంద్రా గ్రూప్ UK, USA, గల్ఫ్ రీజియన్, సింగపూర్, మారిషస్‌లలోని అనుబంధ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్, అబుదాబి, సింగపూర్, మారిషస్‌లలో దీని కార్యాలయాలు ఉన్నాయి. 31 మార్చి 2025 నాటికి, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ జాతీయ స్థాయిలో 2,148 శాఖలు, 3,295 ATMలు (క్యాష్ రీసైక్లర్లు సహా) కలిగి ఉంది.Your journey is truly the stuff of legend, Uday.Heartiest congratulations on the 40th anniversary of @KotakBankLtd.For forty years, it’s been one of my greatest privileges to cheer for you as a friend, believer, and admirer.And I’ll keep cheering, even louder, for you and… https://t.co/zRsEmXbvbE pic.twitter.com/XXUtvopqX7— anand mahindra (@anandmahindra) November 21, 2025

How much will Nitish Kumar earn as Bihar CM6
బిహార్‌ సీఎంగా నితీష్‌ కుమార్‌ ఈసారి సంపాదనెంత?

జేడీయూ అధ్యక్షుడు, ఎన్‌డీఏ కీలక నేత నితీష్ కుమార్ తాజాగా బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రికార్డు స్థాయిలో 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎంగా ఆయన జీతమెంత? ప్రభుత్వపరంగా ఎంత సంపాదింబోతున్నారు? తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఆ వివరాలు ఇవిగో.. నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కావడానికి ముందు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్ 31న తాజా ఆస్తి ప్రకటన ప్రకారం.. నితీష్‌ కుమార్‌ నెట్‌వర్త్‌ సుమారు రూ .1.64 కోట్లు. చేతిలో రూ .21,052 నగదు, బ్యాంకు డిపాజిట్లు రూ .60,811 ఉన్నాయి. ఇంకా ఆయనకు 13 ఆవులు, 10 దూడలు ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. నితీష్‌ వద్ద ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కూడా ఉంది.సీఎంగా అందే జీతంబిహార్‌ సీఎంగా నితీష్‌ కుమార్ నెలకు సుమారు రూ .2.5 లక్షల జీతం పొందుతారు. ఇందులో వసతి, కార్యాలయం, భద్రత, శాసనసభ్యుడిగా ఇతర సౌకర్యాలు ఉంటాయి. అదే మంత్రులకు అయితే నెలకు రూ .65,000 వేతనం, రూ .70,000 ప్రాంతీయ భత్యం లభిస్తుంది.ఎంపీ, ఎమ్మెల్యేగా పెన్షన్నితీష్‌ కుమార్ 1985 లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ 1995లో మరో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రధానంగా లోక్‌సభ సభ్యుడిగా (MP) కొనసాగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయన తరచుగా ఎమ్మెల్సీ మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ద్వారా సభలో సభ్యత్వం పొందారు. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.శాసనసభ్యులకు అందించే పెన్షన్ రూ .45,000 గా నిర్ణయించిన నేపథ్యంలో అందుకునే నితీష్‌ మొత్తం శాసనసభ్య పెన్షన్ సుమారు రూ .1,38,000. దీనికి తన ఎంపీ పెన్షన్ కూడా కలిపితే మొత్తం దాదాపు రూ .2,03,000 పెన్షన్ లభిస్తుంది. బీహార్ ఎమ్మెల్యేల వేతనం నెలకు రూ .1.4 నుండి రూ .1.5 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ప్రాథమిక వేతనం రూ .50 వేలు, నియోజకవర్గ భత్యం రూ .55 వేలు, వ్యక్తిగత సహాయకుడికి రూ .40 వేలు, స్టేషనరీకి రూ .15,000 ఉంటాయి. అసెంబ్లీ లేదా కమిటీ సమావేశాల సమయంలో రోజుకు రూ .3 వేలు లభిస్తుంది.

Advertisement
Advertisement
Advertisement