Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Poco M8 5G Launched in India Price Features and Specifications1
కొత్త ఫోన్‌: పోకో ఎం8 5జీ వచ్చేసింది..!

స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ‘పోకో’ భారత మార్కెట్లో ‘పోకో ఎం8 5జీ’ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. మిడ్‌రేంజ్‌ ధర విభాగపు కస్టమర్లే లక్ష్యంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌ను అమర్చారు. 6.77 అంగుళాల 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉంది. ఇది 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్, 240హెచ్‌జెడ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్, 3,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వెట్‌ టచ్‌ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో తడిచేతులతో ఉపయోగించినా, తేలికపాటి వర్షంలోనూ పనిచేస్తుంది. వెనుక భాగంలో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ లైట్‌ ఫ్యూజన్‌ 400 సెన్సర్‌ అందించారు.ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,520ఎంహెచ్‌ఏ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. ఇది 45డబ్యూ ఫాస్ట్‌ వైర్డ్‌ ఛార్జింగ్, అలాగే 18డబ్ల్యూ రివర్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఉంటాయి. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.6జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ ధర రూ.21,999గా.. 8జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌ ధర రూ. 21,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Bank holidays next week January 12 to 18 Full schedule2
బ్యాంకులకు వారమంతా సెలవులే!!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. స్వామి వివేకానంద జయంతి, మకర సంక్రాంతి, తిరువళ్లువర్ దినోత్సవం, ఉళవర్ తిరునాళ్ వంటి పండుగల నేపథ్యంలో వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు వారపు సెలవులుగా పాటిస్తాయి. ఇదే క్రమంలో ఈ జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు (వారాంతాలు కలుపుకొని) ఉంటాయి.ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా సెలవులు మారవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అందువల్ల ఖాతాదారులు తమ స్థానిక బ్యాంకు శాఖ సెలవు షెడ్యూల్‌ను ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా తమ బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోవడం అవసరం.వచ్చే వారం బ్యాంకు సెలవులు ఇవే..జనవరి 12: స్వామి వివేకానంద జయంతి – పశ్చిమ బెంగాల్జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు – గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోంజనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాళం / పొంగల్ / మాఘే సంక్రాంతి / మకర సంక్రాంతి – తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కింజనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం – తమిళనాడుజనవరి 17: ఉళవర్ తిరునాళ్ – తమిళనాడుజనవరి 18: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవుబ్యాంకులు మూసివున్నా ఇవి పనిచేస్తాయిబ్యాంకు సెలవు దినాల్లో కూడా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఏటీఎం నగదు ఉపసంహరణ వంటి సేవలను సాధారణంగానే వినియోగించుకోవచ్చు. అయితే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం చెక్కులు, ప్రామిసరీ నోట్లకు సంబంధించిన లావాదేవీలు సెలవు రోజుల్లో జరగవు.

Oil Palm Farming Gains Momentum Amid Government Support3
ఆయిల్‌ పామ్‌ సాగుపై పెరుగుతున్న ఆసక్తి

వంటనూనెల పంటలతో పోలిస్తే అయిదు రెట్లు అధిక దిగుబడి, దాదాపు 30 ఏళ్ల వరకు ఉత్పాదకత ఉండే ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ సీఈవో (ఆయిల్‌ పామ్‌ బిజినెస్‌) సౌగత నియోగి తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీలు, ధరలకు హామీ, ప్రోత్సాహకాలను ఇస్తుండటం తదితర చర్యలు దీనికి సానుకూలంగా ఉంటున్నాయని చెప్పారు.దీనికి సంబంధించిన జాతీయ మిషన్‌ కింద 2019–20లో 3.5 లక్షల హెక్టార్లుగా ఉన్న ఆయిల్‌ పామ్‌ సాగును 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచుకోవాలని లక్ష్యాలు ఉన్నాయని నియోగి తెలిపారు. అయితే, గతేడాది నవంబర్‌ నాటికి ఇది లక్ష్యానికన్నా తక్కువగా 6.20 లక్షల హెక్టార్లకు మాత్రమే చేరినప్పటికీ, సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతుండటం సానుకూల అంశమన్నారు.విస్తరణకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, పర్యావరణహితమైన సాగు విధానాల్లాంటివి అమలైతే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నియోగి చెప్పారు. ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన, లాభదాయకమైన పంటగానే కాకుండా దేశీయంగా వంటనూనెల భద్రత సాధనకు కూడా ఉపయోగపడగలదని వివరించారు.

How Modern Glass Windows Transform Homes House construction tips4
ఇంటి​కి లగ్జరీ లుక్‌.. కిటికీలోనే ఉంది కిటుకు!

ఇంటీరియర్‌లో అద్దాలు భాగమైపోయాయి. రంగులు, మొక్కలు, ఫర్నీచర్‌ మాత్రమే కాదు విండోలతోనూ ఇంటికి లగ్జరీ లుక్‌ వస్తుంది. ఇన్సులేషన్‌ కిటికీలతో ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించే గుణం ఉండటమే వీటి ప్రత్యేకత అని ఇంటీరియర్‌ నిపుణులు చెబుతున్నారు. దుమ్ము, ధూళిలతో పాటు శబ్ధాబ్దాలను ఇంటి లోపలికి రాకుండా ఈ కిటికీలు అడ్డుకుంటాయని చెబుతున్నారు.కాలుష్యం, రణగొణ ధ్వనులతో బిజీబిజీగా ఉంటే మెట్రో నగరాలలో నిశ్శబ్ద, ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకోవడం సహజమే. అందుకే గృహ కొనుగోలుదారులు హరిత భవనాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో బిల్డర్లు అపార్ట్‌మెంట్ల డిజైనింగ్‌ దశ నుంచే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లగ్జరీ లుక్‌తో పాటు ఆహ్లాదభరిత వాతావరణం కల్పించేందుకు పెద్ద కిటికీలను ఎంపిక చేస్తున్నారు. గ్లేజింగ్, సీలింగ్‌ సాంకేతికతలతో తయారైన కిటికీలు మార్కెట్‌లో హాట్‌ ఫేవరేట్‌గా మారాయి.సంప్రదాయ సింగిల్‌ గ్లేజ్‌ విండోలతో బయటి నుంచి శబ్దాలు, దుమ్ముధూళి వంటివి సులభంగా ఇంటి లోపలికి వస్తాయి. అలాగే అపార్ట్‌మెంట్లలో పైఅంతస్తులలోని నివాసితుల హడావుడి, పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్, నిర్మాణ సంబంధిత ధ్వనులు కిటికీ ఫ్రేమ్‌ల చుట్టూ ఉన్న చిన్న ఓపెనింగ్‌ల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో నివాసితులకు చికాకు, ఒత్తిడి వంటివి కలుగుతాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది కస్టమర్లు మెరుగైన ఉష్ణోగ్రతలను నిర్వహించే ఇన్సులేటింగ్‌ గ్లాస్‌ కిటికీలను ఎంచుకుంటున్నారు.రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు షీట్లతో తయారైన ఈ విండోల మధ్యలో గాలి లేదా ఇతర వాయువుతో నిండి ఉంటుంది. దీంతో వేసవి కాలంలో ఇంటి లోపల వాతావరణం వెచ్చగా ఉండకుండా శీతాకాలంలో వేడిని బయటకు వెళ్లకుండా ఇన్సులేషన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఇన్సులేటింగ్‌ గ్లాస్‌ కిటికీలు ఉన్న ఇంట్లో ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది.లామినేటెడ్‌ గ్లాస్‌ కిటికీలకు ధ్వనిని నియంత్రించే గుణం ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు పొరలతో తయారయ్యేదే లామినేటెడ్‌ గ్లాస్‌లు. ఇవి హానికారక యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. ఇంటి లోపల అధిక వేడిని తగ్గిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కోసం టెంపర్డ్‌ గ్లాస్‌ ఉత్తమమైంది. దీనికి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉంటుంది. వీటిని ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలలో వినియోగిస్తుంటారు.ఇది చదివారా? ఇళ్లు మారేవారికి.. ఇదో మంచి మార్గం!మీ ఇల్లు అధిక ధ్వనులు విడుదలయ్యే ప్రాంతాలైన విమానాశ్రయం, పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వీధులకు చేరువలో ఉంటే.. మీ ఇంట్లో తప్పనిసరిగా అకౌస్టిక్‌ విండోలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అదనపు సౌండ్‌ ఫ్రూఫింగ్‌ వీటి సొంతం. బహుళ గాజులు, ఇతరత్రా పదార్థాలతో తయారైన ఈ కిటికీలు బయటి శబ్దాలను ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీంతో ఎళ్లవేళలా ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.

Explore India booming perfume market 20265
పెర్ఫ్యూమ్‌ బ్రాండ్లకు నిధుల పరిమళం

సాక్షి, బిజినెస్‌ డెస్క్: కొంతకాలంగా దేశీ ఫ్రాగ్రెన్స్‌ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త తరం లగ్జరీ పెర్ఫ్యూమ్‌ బ్రాండ్లు పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఫ్రాగానోట్స్‌ గతేడాది ఆగస్టులో రుకమ్‌ క్యాపిటల్‌ నుంచి ప్రీ–సిరీస్‌ ఫండింగ్‌ కింద 1 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. అటు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిరా ఫ్రాగ్రెన్సెస్‌ మాతృ సంస్థ మియోలా గతేడాది అక్టోబర్‌లో ప్రీ–సిరీస్‌ ఎ రౌండ్‌ కింద 6 మిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంది. ఇక ఇండోర్‌కి చెందిన హౌస్‌ ఆఫ్‌ ఈఎం5 సంస్థ బోట్‌ సహవ్యవస్థాపకుడు అన్‌ గుప్తా నుంచి నిధులు సేకరించింది. ఇప్పటివరకు రూ. 5–6 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. మరోవైపు, గుజరాత్‌కి చెందిన అదిల్‌ ఖాద్రి బ్రాండ్‌.. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా షోలో రూ. 50 లక్షల ఫండింగ్‌ దక్కించుకుంది. 2023లో ఏర్పాటైన గుడ్‌మెల్ట్స్‌ అనే బ్రాండ్‌ కూడా ఆనికట్‌ క్యాపిట్ల నుంచి ప్రీ–సీడ్‌ ఫండింగ్‌ని సమకూర్చుకుంది. భారీగా కార్యకలాపాల విస్తరణ.. శశాంక్‌ చౌరీ ప్రారంభించిన హౌస్‌ ఆఫ్‌ ఈఎం5 తొలి ఏడాదిలో (2022–23) కేవలం 900 ఆన్‌లైన్‌ ఆర్డర్లను ప్రాసెస్‌ చేసింది. ప్రస్తుతం రోజుకు 2,000 ఆర్డర్లు, నెలకు దాదాపు 80,000 పైగా బాటిల్స్‌ని విక్రయిస్తోంది. కంపెనీ కస్టమర్లలో అత్యధిక శాతం వాటా 28–45 ఏళ్ల వారిదే ఉంటోంది. గత మూడేళ్లలో హౌస్‌ ఆఫ్‌ ఈఎం5 సుమారు రూ. 200 కోట్ల టర్నోవరు సాధించింది. వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆఫ్‌లైన్‌లో కూడా కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఆ తర్వాత అమెజాన్‌ ఫస్ట్‌ ద్వారా గ్లోబల్‌గా కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. తమ కంపెనీ లాభాల్లోనే కొనసాగుతోందని, ఇన్వెస్టర్లు ఆసక్తిగానే ఉన్నా, ప్రస్తుతం మరిన్ని నిధులు సమీకరించాల్సిన తక్షణ అవసరమేమీ లేదని శశాంక్‌ తెలిపారు. మరోవైపు, 2018లో ప్రారంభమైన ఆదిల్‌ ఖాద్రి ప్రీమియం సెగ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ప్రతి నెలా రూ. 11–12 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. థర్డ్‌ పార్టీ తయారీ సంస్థ భాగస్వామ్యంతో నాలుగైదు నెలలకు సరిపడ నిల్వలను ఉత్పత్తి చేసి పెట్టుకుంటోంది. అంతర్గతంగా నిధులతోనే విస్తరణ చేపడుతోంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, లక్నో, జైపూర్, సూరత్, అహ్మదాబాద్‌ తదితర నగరాల్లో దాదాపు 50 స్టోర్స్‌ నిర్వహిస్తోంది. వచ్చే రెండున్నర–మూడేళ్లలో స్టోర్స్‌ సంఖ్యను 111కి పెంచుకునే యోచనలో ఉంది. 2 బిలియన డాలర్ల మార్కెట్‌.. దేశీఫ్రాగ్రెన్స్‌ మార్కెట్‌ పరిమాణం ప్రస్తుతం సుమారు 2 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఓ నివేదికలో తెలిపింది. ఇది 2030 నాటికి 4.08 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పెర్‌ఫ్యూమ్‌ బ్రాండ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2022లో గరిమా కక్కర్‌ ప్రారంభించిన ఫ్రాగానోట్‌ వచ్చే రెండేళ్లలో మెట్రోల్లో ఆఫ్‌లైన్‌ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అలాగే వారణాసి, సోలన్‌లాంటి ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లపైనా దృష్టి పెడుతోంది. ప్రధానంగా వచ్చే మూడేళ్లలో ప్రీమియం అఫోర్డబుల్‌ సెగ్మెంట్లో స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అటు హీరా ఫ్రాగ్రెన్సెస్‌ మాతృ సంస్థ మియోలా కూడా వచ్చే 12–18 నెలల్లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది. ఇటీవలే సమీకరించిన నిధుల్లో నుంచి సుమారు 2–2.2 మిలియన్‌ డాలర్లను ఇందుకోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది.

Telecom operators hike mobile tariffs by 15percent in june 20266
మళ్లీ మొబైల్‌ చార్జీల మోత

న్యూఢిల్లీ: టెలికం చార్జీల మోతకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి టారిఫ్‌లను టెల్కోలు సుమారు 15 శాతం పెంచే అవకాశం ఉంది. దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి రెట్టింపు కానుంది. ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్‌ ఒక నివేదికలో ఈ విషయాలు పేర్కొంది. 2026 ప్రథమార్ధంలో జియో ప్రతిపాదిత ఐపీవోతో టెలికం పరిశ్రమ వేల్యుయేషన్‌ పెరుగుతుందని రిపోర్టును రూపొందించిన ఈక్విటీ అనలిస్ట్‌ అక్షత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. గతంలో ధోరణులకు తగ్గట్లుగా దాదాపు రెండేళ్ల తర్వాత దేశీయంగా జూన్‌లో మొబైల్‌ టారిఫ్‌లు 15 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 16 శాతానికి చేరొచ్చని తెలిపారు. డేటా, పోస్ట్‌పెయిడ్‌ వినియోగం పెరుగుతుండటంతో మొబైల్‌ ఏఆర్‌పీయూ (యూజరుపై సగటున వచ్చే ఆదాయం) పెరుగుతోందని నివేదిక తెలిపింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఇన్వెస్టర్లకు రెండంకెల స్థాయిలో రాబడిని ఇచ్చేందుకు, భారతి ఎయిర్‌టెల్‌కి దాదాపు సరిసమానమైన వేల్యుయేషన్‌ని పొందేందుకు జియో సుమారు 10–20 శాతం మేర మొబైల్‌ టారిఫ్‌లు పెంచవచ్చు. → ఏజీఆర్‌ బాకీలపై ప్రభుత్వం 5 ఏళ్ల మారటోరియం ఇవ్వడం వల్ల 2026–30 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన మొత్తం.. 35–85 శాతం మేర తగ్గుతుంది. అయినప్పటికీ చెల్లింపులు జరిపేందుకు 2027–2030 ఆర్థిక సంవత్సరాల మధ్య మొబైల్‌ సరీ్వసుల రేట్లు 45 శాతం మేర పెంచాల్సి ఉంటుంది. → పెట్టుబడి వ్యయాలు తగ్గడం వల్ల టెల్కోల మార్జిన్లు పెరగవచ్చు. 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ దాదాపు పూర్తయ్యింది. 2025 ఆర్థిక సంవత్సరం నుంచే పెట్టుబడి వ్యయాలు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
Advertisement