Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock market updates on 08 May 20261
290 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 90 పాయింట్లు తగ్గి 24,238 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 296 పాయింట్లు నష్టపోయి 77,546 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.2బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 101.1 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.38 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 0.13 శాతం నష్టపోయింది.Today Nifty position 08-05-2026(time: 09:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Engineering Dropout Reddit Sparks Viral Debate Career Pressure Mental Health2
చదువు మధ్యలో వదిలేశారా? ఆందోళన వద్దు..

దశాబ్దాలుగా మన దేశంలో ఇంజినీరింగ్ అంటే ఒక సురక్షితమైన భవిష్యత్తుకు భరోసా. కానీ, ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ డిగ్రీ మాయాజాలంలో చిక్కుకుని తీరా కొంతకాలం చదివాక తమ దారి తప్పిందని గ్రహిస్తున్నారు. ఇటీవల 21 ఏళ్ల యువకుడు రెడ్డిట్ వేదికగా పంచుకున్న అంశాలు నేటి తరం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు అద్దం పడుతోంది. మెకానికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో డ్రాపౌట్ అయిన ఆ యువకుడి కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది.రెడ్డిట్‌ పోస్ట్‌లోని వివరాల ‍ప్రకారం.. 17 ఏళ్ల వయసులో సమాజం, తల్లిదండ్రుల ఒత్తిడితో మెకానికల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నాడు. కానీ 21 ఏళ్లకు వచ్చేసరికి ఆ సబ్జెక్టులు అతనికి చాలా కష్టంగా అనిపించాయి. చేసే పనిపై ఇష్టం లేనప్పుడు ఆ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఒకవైపు కోర్సు పూర్తికాకపోవడం, మరోవైపు బయట గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతుండటం అతన్ని భయపెట్టాయి. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక మందగమనం వల్ల ఏ రంగం సురక్షితమో తెలియని అయోమయం అతడిని చుట్టుముట్టింది. తనకు పెద్ద పెద్ద హోదాల కంటే ఆచరణాత్మకమైన జీవితం కావాలి. కనీసం 40,000 డాలర్ల(సుమారు రూ.33 లక్షలు) వార్షిక ఆదాయం, గౌరవప్రదమైన సామాజిక వృత్తి ఉంటే చాలని అతను కోరుకుంటున్నాడు. కానీ ఇంజినీరింగ్ మానేశాక, ఆ స్థాయికి ఎలా వెళ్లాలో తెలియక పార్ట్-టైమ్ ఉద్యోగంతో కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు.భావోద్వేగాల కంటే దిశానిర్దేశం ముఖ్యంచాలామంది ఇంజినీరింగ్ మధ్యలో ఆపేయడాన్ని ఒక వ్యక్తిగత వైఫల్యంగా భావిస్తారు. కానీ వాస్తవానికి, భవిష్కత్తుపై స్పష్టమైన సంకేతం. ఆ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది. ల్యాబ్‌లు, కఠినమైన కోర్సు వర్క్ అతనికి సరిపడలేదు.డ్రాపౌట్ అవ్వడం అంటే కెరీర్ ముగిసిపోవడం కాదు. అది కేవలం ఒక రీసెట్ బటన్ మాత్రమే. విశ్లేషణల కంటే ఆచరణాత్మక మార్పు కీలకం.డిగ్రీ లేదు సరే.. నైపుణ్యాల మాటేమిటి?సదరు యువకుడు తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల నమ్మకంగా ఉన్నాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంజినీరింగ్ పూర్తి చేయకపోయినా అతనికి ఉన్న టెక్నికల్ పరిజ్ఞానం ఇతర రంగాల్లో ప్లస్ పాయింట్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్‌) సాంకేతికతపై అవగాహన ఉండి బాగా మాట్లాడితే ఈ రంగంలో ఏడాదికి 40,000 డాలర్లు (సుమారు రూ.33 లక్షలు) కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వారికి వైద్య రంగంలోని యంత్రాల గురించి త్వరగా అవగాహన కలుగుతుంది. రియల్ ఎస్టేట్, బిజినెస్ రంగంలో కస్టమర్లతో డీల్ చేయగలిగే నేర్పు ఉంటే ఇక్కడ ఆకాశమే హద్దు.ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకేవలం వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా 'ట్రేడ్ స్కిల్స్' వైపు చూడటం కూడా మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. లో-వోల్టేజ్ టెక్నీషియన్, ఏవియేషన్ మెకానిక్స్ వంటి రంగాల్లో అప్రెంటిస్‌షిప్ ద్వారా నేరుగా ఆదాయం పొందవచ్చు. సర్టిఫికేషన్ కోర్సుల్లో భాగంగా అకౌంటింగ్ లేదా డేటా అనలిటిక్స్ వంటి స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసి త్వరగా స్థిరపడవచ్చు.కెరీర్ పునర్నిర్మాణానికి..ఆందోళనను పక్కన పెట్టి గత అనుభవాన్ని విశ్లేషించుకోవడం.మీకు ఉన్న బలాలు (ఉదా: సేల్స్, డ్రాయింగ్, కోడింగ్) గుర్తించడం.ఎంచుకున్న రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగంలో చేరడం.కృత్రిమ మేధ వంటి మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకోవడం.డిగ్రీ ఒక అధ్యాయం మాత్రమే..ఇంజినీరింగ్ మధ్యలో వదిలేశాను అన్న మాట వినడానికి కాస్త కఠినంగా ఉండవచ్చు. కానీ, ప్రపంచ ప్రఖ్యాత విజేతలు చాలామంది తమ కెరీర్ ప్రారంభంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నవారే. డ్రాపౌట్ అవ్వడం వల్ల అవకాశాలు తగ్గిపోవు. కానీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోవడం వల్ల మాత్రమే ఎదుగుదల ఆగిపోతుంది. ఆర్థిక స్థిరత్వం అనేది కేవలం డిగ్రీతోనే రాదు. మనం చేసే పనిలో చూపే ప్రతిభతో వస్తుందని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: రూ.28 లక్షల జాబ్‌ వదులుకున్న మేనేజర్

LinkedIn study reveals rising job scam awareness among Indian professionals3
జాబ్‌ స్కాములపై అప్రమత్తంగా ప్రొఫెషనల్స్‌ 

న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాల పేరిట జరిగే స్కాముల గురించి భారతీయ ప్రొఫెషనల్స్‌లో అవగాహన పెరుగుతోంది. 82 శాతం మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకునే ముందు సదరు జాబ్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ లింక్డ్‌ఇన్‌ రూపొందించిన జాబ్‌ సెర్చ్‌ సేఫ్టీ పల్స్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగం నిఖార్సయినదేనా లేదా ఏదైనా కుంభకోణం అయి ఉంటుందా అని ఆలోచించి, అడుగేసే ప్రొఫెషనల్స్‌ సంఖ్య పెరుగుతోంది. అయితే, వేగం, పోటీ తీవ్రంగా ఉండే మార్కెట్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కష్టతరమైన వ్యవహారంగా ఉంటోంది. ముఖ్యంగా కెరియర్‌ తొలినాళ్లలో ఉన్న వారికి ఇది మరింత సవాలుతో కూడుకున్నదై ఉంటోంది. ఈ నేపథ్యంలో జాబ్‌ ప్లాట్‌ఫాంలు, కంపెనీలు, ఉద్యోగార్థులు.. అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా, ఉద్యోగావకాశాల వ్యవస్థను విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దడం అవసరమని లింక్డ్‌ఇన్‌ ఇండియా హెడ్‌ (లీగల్, పబ్లిక్‌ పాలసీ) అదితి ఝా తెలిపారు. 2026 మార్చి 16–30 మధ్య భారత్‌తో పాటు బ్రిటన్, అమెరికా, జర్మనీ, బ్రెజిల్‌లో నిర్వహించిన ఈ సర్వేలో 8,512 మంది పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఉద్యోగాన్ని దక్కించుకోవాలనే ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో అప్రమత్తతను పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా కెరియర్‌ని అప్పుడప్పుడే మొదలుపెట్టే ఉద్యోగార్థుల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. చాలా మంచి అవకాశంగా భావించి హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని 54 శాతం మంది జెన్‌ జెడ్‌ ఉద్యోగార్థులు తెలిపారు. జెన్‌ జెడ్‌ ప్రొఫెషనల్స్‌లో దాదాపు సగం మంది 49 శాతం జాబ్‌ స్కాము నుంచి తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. జెన్‌ ఎక్స్‌లో ఇలాంటి వారి సంఖ్య 36 శాతంగా ఉంది. → ఉద్యోగం కోసం బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు అనుకోకుండా తారసపడే అవకాశాలు (20 శాతం), సరైన వివరాలేమీ ఉండని, నమ్మశక్యంగా అనిపించని రిక్రూటర్‌ /కంపెనీ స్వయంగా సంప్రదించిన పరిస్థితుల్లో (18 శాతం) .. స్కామ్‌ అయి ఉంటుందేమోననే సందేహాలు ఉంటున్నాయి. → చర్చల పేరిట ఉద్యోగార్థులను విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల నుంచి వేరే వేదికల వైపు మళ్లించి, స్కామర్లు మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. 90 శాతం స్కామ్‌లలో, మెంబర్లను వ్యక్తిగత మెసేజింగ్‌ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు.

Trai proposes stricter complaint rules for telcos4
టెలికాం ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త నిబంధనలు 

సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్‌ కాల్స్‌ డ్రాప్‌ అవుతున్నాయా? డేటా స్పీడ్‌ రావడం లేదా? బిల్లుల్లో తప్పులున్నాయా? ఇకపై ఇలాంటి టెలికాం ఫిర్యాదుల పరిష్కారం కోసం గంటల తరబడి కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ప్రతిపాదించిన ’టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార (నాల్గవ సవరణ) నిబంధనలు–2026’ వినియోగదారుడికి మరింత ఉపశమనం ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసినట్లు గురువారం కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ ప్రకటనలో తెలిపింది. గతంలో నిమిషాల కొద్దీ వెయిటింగ్‌ నెట్‌వర్క్‌ సమస్యలు, డేటా సమస్యల పరిష్కారం కోసం గతంలో ఫిర్యాదు చేయాలంటే కేవలం కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయడం లేదా ఎస్‌ఎంఎస్‌ పంపడం మాత్రమే ప్రధాన మార్గాలుగా ఉండేవి. ఫిర్యాదు చేసిన తర్వాత దాని పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి కస్టమర్‌ కేర్‌కు మళ్లీ మళ్లీ ఫోన్‌ చేయాల్సిన అవసరం ఉండేది. ఓ పక్క పరిష్కారం కాకపోవడం, మరోపక్క ఫిర్యాదు నమోదు అయ్యిందో లేదో తెలుసుకునేందుకే గంటల కొద్దీ ఐవీఆర్‌ కాల్‌లో వెయిట్‌ చేయాల్సి వచ్చేది. చేసిన ఫిర్యాదు ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. కొత్త నిబంధనలు ఇలా కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి టెలికాం కంపెనీ తప్పనిసరిగా తమ మొబైల్‌ యాప్, అధికారిక వెబ్‌సైట్, ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల ద్వారా ఫిర్యాదులను స్వీకరించాలి. వినియోగదారుడు ఏ మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేసినా, దానికి ఒకే విధమైన ’యూనిక్‌ ఫిర్యాదు నెంబర్‌ను కేటాయించాలి. రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌ ద్వారా మనం చేసిన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. కస్టమర్‌ కేర్‌కు మళ్లీ ఫోన్‌ చేయాల్సిన అవసరం లేకుండా.. ఆన్‌–లైన్‌ పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటిలోపు పరిష్కారం అవుతుంది అనేది లైవ్‌ స్టేటస్‌ ద్వారా చూసుకోవచ్చు. పరిష్కార ప్రక్రియ మరింత పటిష్టం ముసాయిదా నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను మరింత పటిష్టం చేశారు. మొదటి దశలో.. వినియోగదారుడు చేసిన ఫిర్యాదును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి. ఒకవేళ ఇక్కడ పరిష్కారం లభించకపోయినా లేదా కంపెనీ ఇచి్చన సమాధానం నచ్చకపోయినా వెంటనే తదుపరి దశకు వెళ్లవచ్చు. ఇక రెండవ దశలో.. అప్పీలేట్‌ అథారిటీ వద్ద అప్పీల్‌ చేసుకునే విధానాన్ని ఇప్పుడు మరింత సులభతరం చేశారు. వినియోగదారులకు స్పష్టతనిచ్చేలా, ఎటువంటి గందరగోళం లేకుండా అప్పీల్‌ ఫారమ్‌లను డిజిటల్‌గా అందుబాటులో ఉంచుతారు. ఆటోమేటెడ్‌ అలర్ట్స్‌ – రిమైండర్స్‌ ఫిర్యాదు నమోదు కాగానే వినియోగదారుడికి ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా నిర్ధారణ సందేశం రావడంతో పాటు, పరిష్కార గడువు ముగిసేలోపు కంపెనీ ప్రతినిధులు వినియోగదారుడిని సంప్రదించేలా ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ట్రాయ్‌ సూచించింది. జవాబుదారీతనంలో భాగంగా.. ఫిర్యాదుల పరిష్కారంలో విఫలమైనా లేదా నిబంధనలు ఉల్లంఘించినా టెలికాం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకునేలా ట్రాయ్‌ ఈ సవరణలో నిబంధనలను పొందుపరిచింది. కంపెనీలు తమ వద్ద నమోదైన ఫిర్యాదులు, పరిష్కరించిన కేసులు, పెండింగ్‌లో ఉన్న వాటిపై త్రైమాసిక నివేదికలను బహిరంగపరచాల్సి ఉంటుంది.

Gold Prices Surge Within Hours Latest Rates in Hyderabad Vijayawada Delhi5
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!

మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

Robert Kiyosaki Reveals Which Assets Can Survive Market Crashes6
2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.పేపర్ ఆస్తులుకియోసాకి ప్రకారం.. స్టాక్‌లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకంఅంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట. రియల్ ఆస్తులురాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకిప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement