ప్రధాన వార్తలు
ఏప్రిల్ నుంచి ఇక ఉద్యోగాల జాతరే..
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి అర్ధభాగంలో ఉపాధి ఊపందుకోనున్నట్లు టీమ్లీజ్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ నివేదిక పేర్కొంది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో ఉద్యోగాలు 4.7 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఈకామర్స్, టెక్ స్టార్టప్స్, హెల్త్కేర్, ఫార్మా, తయారీ(మ్యాన్యుఫాక్చరింగ్) రంగాలు ఊతమివ్వనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో టీమ్లీజ్ తెలియజేసింది.భారీ ఎంటర్ప్రైజెస్లో ఉపాధి కల్పన కనిపించనున్నట్లు తెలియజేసింది. వీటిలో 74 సంస్థలు విస్తరణ చేపట్టే సంకేతాలిచ్చినట్లు పేర్కొంది. మధ్యస్థాయి సంస్థలు 57 శాతం, చిన్న బిజినెస్లు 38 శాతం విస్తరణ యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. వెరసి విస్తరణ ద్వారా ఉపాధి కల్పన విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇటు డిజిటల్, అటు కీలక ఆర్థికవ్యవస్థ సంబంధిత పరిశ్రమల నుంచి ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఎకానమీ వృద్ధికి కీలకంగా నిలిచే రంగాలలో విద్యుత్, స్టీల్, చమురు గ్యాస్, సిమెంట్, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టులు తదితరాలున్నాయి. 8.9 శాతం ఎన్ఈసీ అత్యధికంగా ఈకామర్స్, టెక్ స్టార్టప్లు 8.9 శాతం నికర ఎంప్లాయ్మెంట్ చేంజ్(ఎన్ఈసీ)కు కారణంకానున్నట్లు టీమ్లీజ్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఫార్మాస్యూటికల్స్ 7 శాతం, తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాలు 6.6 శాతం ఎన్ఈసీ సాధించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో 4.7 శాతం ఎన్ఈసీ నమోదుకానున్నట్లు అభిప్రాయపడింది. నివేదికను 20 నగరాల నుంచి 23 రంగాలకు చెందిన 1,268 సంస్థల(ఎంప్లాయర్స్) అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా రూపొందించింది.ఇందుకు 2025 నవంబర్ నుంచి 2026 జనవరి కాలంలో సర్వే చేపట్టింది. దేశీయంగా మానవవనరుల పరిస్థితులు సైక్లికల్ డిమాండ్ను అనుసరించడంకాకుండా వ్యవస్థాగత, విధానపరమైన అంశాల ఆధారంగా మా ర్పులకు లోనవుతున్నట్లు వివరించింది. కాగా.. శ్రామిక చట్టాల అమలు కారణంగా ఉద్యోగ వ్య యాలు 80% పెరగనున్నట్లు 64 సంస్థలు తెలియజేశాయని, వేతన వ్యవస్థను పునర్నిర్వచించడం ప్రభావం చూపనున్నట్లు టీమ్లీజ్ సర్వీసెస్ వైస్ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు.
మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫారమ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన కీలక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదిక ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రధానంగా రియాలిటీ ల్యాబ్స్, సోషల్ మీడియా బృందాలు, రిక్రూట్మెంట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి.ఖర్చుల నియంత్రణే లక్ష్యం?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మెటా చేస్తున్న భారీ పెట్టుబడులే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మెటా మొత్తం ఖర్చులు 162 బిలియన్ల డాలర్లు నుంచి 169 బిలియన్ డాలర్ల మధ్య ఉంటాయని అంచనా. అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు, వారిని నిలుపుకునేందుకు కంపెనీ మిలియన్ల కొద్దీ డాలర్లను వేతనాల రూపంలో వెచ్చిస్తోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తోంది. దాంతో కేవలం టెక్నికల్ విభాగాలే కాకుండా సేల్స్ విభాగంలోని పరిమిత సంఖ్యలో ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.నిజానికి ఈ ఉద్యోగ కోతలు ఆకస్మికమైనవి కావు. ఈ నెల ప్రారంభంలోనే రాయిటర్స్ ఒక నివేదికలో మెటా తన మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే ఆలోచనలో ఉందని పేర్కొంది. ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ మేరకు సమాచారం అందిందని, సిబ్బంది తగ్గింపునకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
దేశాల్లో పెట్రోల్ మంటలు.. దారుణంగా ధరలు!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలుయుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలుగ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..దేశంపెరుగుదల శాతంమయన్మార్55.4%ఫిలిప్పీన్స్54.2%కంబోడియా52.8%లెబనాన్28.6%కెనడా25.0%పాకిస్తాన్24.4%చైనా23.2%జపాన్19.6%పొరుగు దేశాలైన పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్లో 0.98 డాలర్లుగా నమోదైంది.ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది.
ఫండ్స్లో పెట్టుబడులకు గిఫ్ట్ కార్డులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల దిశగా మరింత మంది ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు సెబీ.. గిఫ్ట్ కార్డులు లేదా గిఫ్ట్ ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లను (పీపీఐలు) ప్రతిపాదించింది. దీని ప్రకారం ఎవరైనా సరే గిఫ్టీపీపీఐలను కొనుగోలు చేసి వేరొకరికి కానుకగా ఇవ్వొచ్చు. ఈ గిఫ్ట్ పీపీఐలను స్వీకరించిన వారు వాటితో తమకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకంలో యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు.ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలను ఏప్రిల్ 14లోపు తెలియజేయాలని సెబీ కోరింది. గిఫ్ట్ పీపీఐలను ఎల్రక్టానిక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఏడాదిగా ఉంటుంది. గిఫ్ట్ పీపీఐ ద్వారా ఒక్కో ఇన్వెస్టర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ పరిమితి పెట్టింది.గిఫ్ట్ పీపీఐలను అనుమతించాలంటూ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చేసిన వినతి మేరకు సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. రిటైల్ కొనుగోళ్లకు సంబంధించి గిఫ్ట్ కార్డులు ఎంతో ప్రాచుర్యం పొందడం తెలిసిందే. ఇప్పుడు వీటిని పెట్టుబడుల వైపు మళ్లించేందుకు సెబీ నిర్ణయం తోడ్పడనుంది.
పాతాళానికి రూపాయి.. రోజుకో కొత్త పతనం
రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి పతనమవుతోంది. డాలర్ మారకంలో 20 పైసలు బలహీనపడి తాజా జీవితకాల కనిష్టం 93.96 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, నెలాఖరున డాలర్లకు డిమాండ్ నెలకొనడం అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 93.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 93.86 – 94.13 శ్రేణిలో ట్రేడైంది.
బైబ్యాక్లో షేర్లు అమ్ముకుంటే 12 శాతం సర్చార్జీ
న్యూఢిల్లీ: వ్యక్తిగత లేదా కార్పొరేట్ వాటాదారులు ఎవరైనా బైబ్యాక్లో భాగంగా విక్రయించే షేర్లపై ఆర్జించే లాభాలకు 12% సర్చార్జీ వర్తించనుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఫైనాన్స్ బిల్లులో సవరణలకు తాజాగా లోక్సభ ఆమోదముద్ర వేసింది.2026 ఫైనాన్స్ బిల్లులో 32 సవరణలకు ప్రభుత్వం ప్రతిపాదించగా.. లోక్సభ ఆమోదముద్ర వేసింది. రేపు(శుక్రవారం) రాజ్యసభలో ఆమో దం కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే రూ. 50 లక్షలవరకూ ఆదాయంగల వారిపై ఎలాంటి సర్చార్జీ లేదు.రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ పన్నువర్తించే ఆదాయంగల వారికి బైబ్యాక్లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించే లాభాలపై 10% సర్చార్జీ అమలు చేస్తున్నారు. అయితే ఫ్లాట్ 12% సర్చార్జీ విధింపుతో ఆయా పన్ను చెల్లింపుదారులపై భారం పడనుంది.
కార్పొరేట్
మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
12 శాతం వరకు పెరగనున్న ఏసీల రేట్లు
రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది!
టెలికాం కంపెనీల నయా దోపిడీ.. రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్ఫామ్ ఫీజు!
26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!
ఇంటికొచ్చే గ్యాస్ ఇన్ని రకాలా..?
జేపీ అసోసియేట్స్ దివాలా కేసు: NCLATను ఆశ్రయించిన వేదాంత
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కద...
కోలుకున్న పసిడి... అక్కడే వెండి
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో 4 రోజుల వరుస నష్టాల ను...
వార్కు బ్రేక్.. బుల్కు జోష్!
ముంబై: ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దా...
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కస...
ప్రకటనల హోరు.. స్పాన్సర్షిప్ జోరు
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 202...
ఉగ్రదేశంలో ఇంధన సెగ
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ...
పార్లమెంట్లో నేడు ‘సీఏపీఎఫ్ బిల్లు-2026’
దేశ అంతర్గత భద్రతలో కీలకమైన కేంద్ర సాయుధ పోలీసు బల...
యుద్ధ సంక్షోభం.. రంగంలోకి మంత్రుల బృందం..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఇంధన భద్రతకు ‘సౌర’ భరోసా
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్లో మారుతున్న పరిణామాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ ఎంత సున్నితమైందో మరోసారి గుర్తుచేశాయి. శిలాజ ఇంధనాల దిగుమతులపై భారీగా ఆధారపడే భారతదేశం వంటి దేశానికి ఇంధన భద్రత అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో సౌరశక్తి వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం.దశాబ్ద కాలంలో ఇలా..గడిచిన పదేళ్లలో భారత్ సౌరశక్తి రంగంలో అసాధారణ వృద్ధిని సాధించింది. భారీ సోలార్ పార్కులు, రూఫ్-టాప్ ఇన్స్టాలేషన్ల ద్వారా దేశీయ సోలార్ పవర్ సామర్థ్యం 130 గిగావాట్లకు చేరుకుంది. అయితే, సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఆ విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించడంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.భారీ ప్రాజెక్టులు.. వికేంద్రీకృత వ్యవస్థభారీ సోలార్ ప్లాంట్లు (ఎల్ఎస్ఎస్) తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాటికి ప్రధాన అడ్డంకి ట్రాన్స్మిషన్ (సరఫరా) వ్యవస్థ. మారుమూల ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను నగరాలకు చేరవేయడానికి భారీ వ్యయంతో కూడిన కారిడార్లు అవసరం. దీనివల్ల విద్యుత్ నష్టాలు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆలస్యం కారణంగా విద్యుత్ తరలింపు నిలిచిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘పీఎం సూర్య ఘర్’ వంటి పథకాలు గృహ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే వినియోగిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్పై ఒత్తిడి తగ్గుతుంది.గ్రిడ్ నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులుసాధారణంగా విద్యుత్ గ్రిడ్లు ఒకే దిశలో (పవర్ ప్లాంట్ నుంచి వినియోగదారుడికి) ప్రవహించేలా రూపొందించబడ్డాయి. కానీ రూఫ్-టాప్ సోలార్ వల్ల విద్యుత్ రెండు వైపులా ప్రవహిస్తుంది. దీనివల్ల గ్రిడ్ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. సంపన్న వినియోగదారులు సోలార్ వైపు మళ్లడంతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రాష్ట్రాలు అదనపు ఛార్జీలు విధిస్తూ సోలార్ వినియోగాన్ని పరోక్షంగా నిరుత్సాహపరుస్తున్నాయనే వాదనలున్నాయి.సవాళ్లు - పరిష్కారాలుసౌర విద్యుత్ ఉత్పత్తి మధ్యాహ్నం వేళలో గరిష్టంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో గృహాల్లో వినియోగం తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో డిమాండ్ పెరిగినప్పుడు సౌర ఉత్పత్తి ఉండదు. దీనినే అంతర్జాతీయంగా ‘డక్ కర్వ్’ సమస్య అంటారు. దీనిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పగటిపూట మిగిలిన విద్యుత్ను భద్రపరిచి రాత్రి వేళల్లో వాడుకోవాలి. విద్యుత్ సమృద్ధిగా ఉన్న సమయంలో రేట్లు తగ్గించి వినియోగదారులను ఆ సమయంలోనే ఎక్కువ విద్యుత్ వాడేలా ప్రోత్సహించాలి.సరికొత్త వ్యూహం.. సోలార్, ఈవీ అనుసంధానంప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత. ప్రభుత్వం పీఎం-డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించాలని చూస్తోంది. సగటున ఒక ఇంటిపై ఉండే 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే మిగులు విద్యుత్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఒక అపార్ట్మెంట్ లేదా కాలనీలోని ఇళ్లన్నీ కలిపి ఆ మిగులు విద్యుత్ను అక్కడే ఉండే పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు మళ్లించవచ్చు.తూత్తుకుడిలోని వీవోసీ పోర్ట్ ఇప్పటికే ఈ నమూనాను విజయవంతంగా అమలు చేస్తోంది. స్థానిక సౌర విద్యుత్ను అక్కడే ఈవీ వినియోగానికి అనుసంధానించడం ద్వారా భారీగా ఖర్చు తగ్గించుకున్నారు. భారతదేశ ఇంధన భవిష్యత్తు సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల అనుసంధానంలోనే ఉంది. డిస్కంలు సోలార్ను ఒక ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా భావించి స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అప్పుడే నిజమైన ఇంధన స్వయంసమృద్ధిని సాధించగలం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.More days, same price! BSNL Validity Bonus Offer ₹997 plan now gives 164 days instead of 150 days.Plan detail:* Cost: ₹997* Validity: 164 Days (Bonus included!)* Data: 2GB/Day* Calls: UnlimitedDon't miss out—this limited-time bonus till March 31, 2026.Recharge… pic.twitter.com/225a4Cb04P— BSNL India (@BSNLCorporate) March 22, 2026
హీట్కు హాట్ సొల్యూషన్: ఇదిగో కూల్ గ్యాడ్జెట్లు!
వేసవి వచ్చిందంటే బయట అడుగు పెడితే చాలు, సూర్యుడు తన వేడి గాలిని ముఖంపై కొడుతూ ‘ఇంట్లోనే ఉండు’ అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కాని, టెక్నాలజీ తెచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్లు, సూర్యుడు తన వేడి ఎంత పెరిగినా ‘ఊఫ్’ నుంచి ‘ఆహా!’గా మార్చేస్తాయి.ఫోనుకి బుజ్జి ఏసీ!సమ్మర్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మీ ఫోన్ వేడి పెనంలా మారిపోతుందా? అయితే మీ ఫోన్ చల్లబరచడానికి వచ్చేసింది ఈ మొబైల్ కూలింగ్ ప్యాడ్! ఇది మామూలు ఫ్యాన్ కాదు, ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ మీ ఫోన్ టెంపరేచర్ను కేవలం సెకన్లలోనే తగ్గించేస్తుంది. అంటే బయట ఎండలు మండిపోతున్నా, మీ ఫోన్ మాత్రం వింటర్ వాతావరణంలో ఉన్నట్టే చిల్ అవుతుంది! దీనికి ఉన్న ఎల్ఈడీ డిస్ప్లే ఫోన్ ఎంత చల్లగా ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. పైగా ఇందులోని మ్యాగ్నెట్ ఫీచర్ వల్ల ఫోన్ వెనుక సులభంగా అతుక్కుపోతుంది, మీరు గంటల తరబడి గేమింగ్ చేసినా లేదా లైవ్ స్ట్రీమింగ్ చేసినా ఫోన్ హ్యాంగ్ అవ్వదు, బ్యాటరీ కూడా వేడెక్కదు. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్.. ఏదైనా సరే, సెట్ అయిపోతుంది. ధర రూ. 700 మాత్రమే!మ్యాజిక్ గ్లాసెస్!ఫోన్ చూసి చూసి మీ కళ్లు ‘ఫ్రై’ అయిపోతున్నాయా? బయటకి వెళ్దామంటే సూర్యుడు సెగలతో సినిమా చూపిస్తున్నాడా? ఇలా ఒకేసారి కళ్లకు రక్షణ, మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చేందుకు వచ్చేసింది ఈ స్మార్ట్ బ్లూటూత్ గ్లాసెస్! ఇందులో ఇన్–బిల్ట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. అంటే మీరు కళ్లజోడు పెట్టుకుంటే చాలు, పక్కన ఎవరికీ వినిపించకుండా మీ చెవుల్లో మ్యూజిక్ వినిపిస్తుంది.ఫోన్ తీయకుండానే కాల్స్ కూడా మాట్లేడేయొచ్చు. సాంగ్స్ మార్చుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫోటోక్రోమిక్ లెన్సులు ఇంట్లో ఉన్నప్పుడు బ్లూ లైట్ నుంచి, అదే అడుగు బయట పెట్టగానే సెకన్లలో కూలింగ్ గ్లాసెస్లా మారి కళ్లకు రక్షణ ఇస్తాయి. పైగా వర్షం పడినా, చెమట పట్టినా ఏమీ కాకుండా దీనికి వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ధర రూ. 1,200 మాత్రమే!మంచు కురిపించే గొడుగు!బయట ఎండలు మండిపోతుంటే.. గొడుగు పట్టుకున్నా సెగలు తగులుతూ చిరాగ్గా ఉందా? అయితే మీ పర్సనల్ ఏసీలాంటి ఈ బీఎన్ఎఫ్ సన్ అంబ్రెల్లాని చూస్తే మీరు ఫిదా అయిపోతారు! దీని లోపల ఒక బుజ్జి ఫ్యాన్ ఉండటమే కాకుండా, ఇది చల్లని నీటిని మంచులా చల్లుతుంది. అంటే ఎండలో వెళ్తున్నా, మీ గొడుగు కింద ఒక చిన్న మంచువాన కురుస్తుంది. కేవలం నాలుగు ఏఏ బ్యాటరీలు ఉంటే చాలు.. గాలికి తిరగబడని విండ్ప్రూఫ్ డిజైన్తో, అటు గాలిని.. ఇటు మంచు జల్లులను మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది ఒక అదిరిపోయే ఆప్షన్. ధర రూ. 5,900.
ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్.. పియర్సన్తో టీసీఎస్ జట్టు
ముంబై: గ్లోబల్ లెర్నింగ్ సర్వీసుల సంస్థ పియర్సన్తో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) జట్టు కట్టింది. కృత్రిమ మేథతో సిబ్బందికి శిక్షణనిచ్చి, వారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఏఐ ఆధారిత లెర్నింగ్ ప్రోడక్టులు, సర్వీసులను రూపొందిస్తాయి.నియామకాల్లో, సిబ్బంది అభివృద్ధి ప్రోగ్రాంలలో అభ్యర్ధుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో పియర్సన్కి చెందిన వెర్సాంట్ ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ విధానాన్ని టీసీఎస్ ఉపయోగించనుంది. మరోవైపు అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసులను డిజిటలీకరించే దిశగా ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ అమెడ్యూస్తో టీసీఎస్ చేతులు కలిపింది.మరోవైపు, ఐటీ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు, ఇతరత్రా టెక్నాలజీల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ, టీసీఎస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
పర్సనల్ ఫైనాన్స్
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026
బ్యాంకు సెలవులు.. వారంలో 4 రోజులు క్లోజ్!
మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సెలవుల వివరాలు ఇవే...మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఇతర సేవలు: ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు.మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.
పాత సంవత్సరాలకు నోటీసులొస్తున్నాయి..
ముందుగా పాఠకలోకానికి పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, సాఫీగా గడవాలని కోరుకుంటున్నాం. ఆన్లైన్లో నోటీసుని చూడగానే ముందుగా ఎంతో ఆందోళన చెందారు చెంగలరావుగారు. తాను ప్రతి సంవత్సరం ఠంచనుగా సకాలంలో పన్నులు చెల్లించి, సకాలంలో రిటర్నులు వేసే కచ్చితమైన మనిషి. ఆరేడేళ్ల క్రితం గవర్నమెంటు వారిచ్చిన మెడల్, నగదు బహుమతి పొందారు. ఒకప్పుడు ఆయకర్ రత్న అవార్డులు, రాష్ట్రీయ సన్మానాలు పొందిన వారు చెంగలరావుగారికి ఆదర్శం. ప్రభుత్వం ఇటువంటి వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో పాల్గొనే వ్యక్తులుగా గుర్తిస్తుంది. అంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న చెంగలరావు గారికి నోటీసులు వచ్చాయి. ఆర్థిక సంవత్సరంలో మీరు పన్ను పూర్తిగా చెల్లించలేదు.. బకాయి, వడ్డీ చెల్లించండి అనేది వాటి సారాంశం. ఆ నోటీసులను పది సార్లు చదివి, ఉగ్రుడైపోయాడాయన. కోపం, విసుగు, అసహనం.. వెంటనే ఆడిటర్కి ఫోన్ చేశారు.‘‘ఏమోనండి. రికార్డులు తెచ్చి చూపిస్తే కానీ ఏమీ చెప్పలేం. అన్ని కాగితాలూ పట్టుకురండి’’ అని తేల్చిచెప్పారు ఆడిటరు. సంఘాన్ని, ప్రభుత్వాన్ని, డిపార్టుమెంటుని ఎడాపెడా తనలో తానే తిట్టుకుంటూ, కాసేపు ఆ కోపాన్ని పన్ను ఎగవేతదార్లపై ప్రదర్శించాక, భార్య కాంతం తమ్ముడు ఏకాంబరం వైపు ఫోకస్ మళ్లింది. ‘‘నీ తమ్ముడు కాంట్రాక్టరు. వాడెప్పుడైనా నేను కట్టినంత కట్టాడా. ఎప్పుడూ ఏడుపే. నష్టాలే బావగారూ అని. అటువంటి వాళ్లను ఏమీ అనరు’’ అంటూ విరుచుకుపడ్డారు. కానీ ఆమె జవాబు ఇవ్వలేదు.మనవడి సహాయంతో బీరువాపైన ఉన్న కాగితాలు కిందికి దించి, ఫైళ్లు వెతకడం మొదలెట్టారు. ఒక నోటీసు 2007–08ది కాగా మరో నోటీసు 2013–14ది. ముందుగానే రెండు నోటీసులను కాపీలు తీసుకుని, ఆయా సంవత్సరాల కాగితాల కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. ఒకటి ఇంచుమించు 18 ఏళ్ల క్రితం నాటిది. మరొకటి 12 ఏళ్ల నాటిది. అదృష్టవశాత్తు ఆయా కాగితాలు దొరికాయి. ‘ధన్యుడనైతిని రామా’ అని ఊపిరి పీల్చుకుని, ముందుగా 2007–08కి సంబంధించిన ఫైళ్లు తీసి ఒక్కొక్క కాగితాన్ని పరిశీలించడం మొదలెట్టారు.2014లో ఒక నోటీసు వచ్చింది. టీడీఎస్ తక్కువగా జమ అయింది, మిగతా మొత్తం చెల్లించమని. అన్ని కాగితాలు తీసి, ఒక్కొక్క రికవరీ, చెల్లింపు జమకి వివరణ ఇస్తూ, సమన్వయ పట్టిక చేసి, ఎంతో వివరంగా ఇచ్చారు. దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. అది ఇంకా క్లోజ్ అయినట్లు లేదు. అదే సంవత్సరానికి గాను మళ్లీ నోటీసు. ఆ రిటర్నులు.. అన్ని రికార్డులు, ఆ నోటీసు, తన జవాబు, తాను జతపరచిన కాగితాలు.. అన్నింటినీ పది సార్లు చెక్ చేసుకున్నారు. తనవన్నీ సరిగ్గా ఉన్నాయి. అయినా నోటీసు. వెంటనే ఆడిటర్గారికి ఫోన్ చేశారు. మొదటి పది నిమిషాలు ప్రసంగం..ఉక్రోషం.. ఊగిపోవడమైంది. అయినా సరే, నోటీసు వచ్చింది కాబట్టి, మళ్లీ జవాబు ఇవ్వాల్సిందేనని ఆడిటర్ ఆర్గ్యూ చేశారు. రాత్రి కొడుకు వచ్చాక, అప్పటివరకు అయిన గొడవంతా ఏకరువు పెట్టి, తానే స్వయంగా రిప్లైని చేతితో రాసి, కొడుకు చేత ప్రింటర్లో అన్ని కాపీలు తీశారు. అదొక అరవై పేజీల పుస్తకం అంత అయింది. ఈలోగా రాత్రయ్యింది. ఇక మర్నాడు మరొక నోటీసు.. అంటే 2013–14ది బైటికి తీశారు. 26ఏఎస్లో వివరాలు మిస్ మ్యాచ్ అయ్యాయనేది అందులోని సారాశం. టీడీఎస్ క్రెడిట్లు అవలేదు. షరామామూలే! అదే విపత్తు. అదే కసరత్తు.. మళ్లీ పని యావత్తూ. మొత్తానికి అన్ని కాగితాలూ దొరికాయి. కొడుకు సహాయంతో జవాబు పూర్తి చేశాక, ఓ 30 పేజీల ఫైలు తయారైంది. తన జ్యూరిస్డిక్షన్ అధికారి ఆఫీసుకి ఆటోలో బయలుదేరాడాయన. అధికారులు రెండు జవాబులు తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఎంతో ఆశగా అడిగారాయన ‘‘అన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయి.. రెండు మూడు రోజుల్లో అయిపోతుందా’’ అని. ఆ అధికారి ఆ కాగితాలను పక్కన పెట్టుకుంటూ ‘‘రెండు మూడు నెలల తర్వాత’’ అని ముక్తసరిగా చెప్పారు. ఇలాంటి చెంగలరావుగార్లు ఎందరో లెక్కలేదు. ఎంతో నిజాయితీగా చెల్లించే రిటైర్డు ఉద్యోగస్తులపై అస్త్రాల మీద అస్త్రాలు వస్తున్నాయి. రికార్డులు అప్డేట్ చేసుకోవడం లేదు.. ఇచ్చిన రిప్లై సరిగ్గా చెక్ చేసుకోవడం లేదు. ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం.. ఎంతో విచిత్రమైన పరిస్థితి. అంత పాత రికార్డులు ఉండకపోతే/దొరక్కపోతే ఏంటి పరిస్థితి! కాబట్టి డిమాండ్ల విషయంలో ఎంతో మెలకువగా వ్యవహరించాలి అధికారులు.
మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
చాలామందికి ఆదాయం అంటే నెల జీతం మాత్రమే. పెట్టుబడులను కూడా ఖర్చుల్లానే చూస్తుంటారు. భవిష్యత్తు ఆదాయానికి పెట్టుబడులే ప్రధానమన్న సూత్రాన్ని పెద్దగా పట్టించుకోరు. వారెన్ బఫెట్ మాటల్లో చెప్పాలంటే రెండో ఆదాయమనేది పెట్టుబడులతోనే వస్తుంది. మరి పెట్టుబడుల్లో సక్సెస్ కావాలంటే.? దీనికి పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు. కావాల్సిందల్లా సరైన ఆలోచన... క్రమశిక్షణ, ఓర్పు. ఈ మూడింటితో పెట్టుబడులను సరైన దారిలో కొనసాగించడం, సమయానికి మార్పులు చేయడం, దీర్ఘకాలం కొనసాగించటం చేయొచ్చు. అదే సంపద సృష్టికి మార్గం. నిజానికి చాలా మంది ఇన్వెస్టర్లు తొలుత ఉత్సాహంగా పెట్టుబడులు మొదలెడతారు. కొన్నాళ్లకు నిర్లక్ష్యం చేస్తారు. ఇదే వారి వైఫల్యానికి ప్రధాన కారణం. పెట్టుబడుల్లో విజయానికి ఫైనాన్షియల్ ప్లానర్లు ప్రత్యేకంగా చెబుతున్న సూత్రాలను వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...ముందుగా తెలుసుకోవటం... తరవాతే ఇన్వెస్ట్మెంట్చాలామంది ఇతరులు చెప్పారని, సోషల్ మీడియాలో చూశామని, ఇది బాగా లాభాలిస్తుందని ఎవరో చెబితే విన్నామని పెట్టుబడులు పెడతారు. ఇదే మొదటి పెద్ద తప్పు. మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి బాగా తెలుసుకోవాలి. అది ఎలా పనిచేస్తుంది? అందులో రిస్క్ ఎంత? రిటర్న్స్’ ఎన్నాళ్లకు వస్తాయి? మీ లక్ష్యాలకు ఇది సరిపోతుందా? ఇవన్నీ సరిచూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ వంటి వాటి లక్షణాలు, లాభాలు, రిసు్కలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టకూడదు. తెలియని దాంట్లో పెట్టుబడి పెట్టకూడదన్నది తొలి నియమం.మీ రిస్క్ సామర్థ్యాన్ని మీరే తెలుసుకోండిఅందరూ ఒకే రకమైన ఇన్వెస్టర్లు కాదు. కొంతమంది అధిక రిస్క్ తీసుకోగలుగుతారు. మరికొందరు అస్సలు రిస్క్ తీసుకోలేరు. ఇది ప్రధానంగా వారి ఆర్థిక స్థాయిలను బట్టి మారుతుంటుంది. మీరు తట్టుకోలేని స్థాయిలో రిస్క్ తీసుకుంటే... మార్కెట్లో సంభవించే చిన్న చిన్న మార్పులకే భయపడతారు. అప్పుడు ఆందోళనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, నష్టాల్లో కూరుకుపోతారు. మంచి ఇన్వెస్టర్ అంటే భయంలేని వాడు కాదు. తన సామర్థ్యాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసేవాడు.ఉచిత సలహాలకు విలువ ఉండదుఉచితంగా లభించే విషయాలను ఎవరూ సీరియస్గా తీసుకోరు. ఫైనాన్స్ విషయంలోనూ అదే జరుగుతుంది. కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే నష్టం మాత్రం చాలా ఖరీదైనదిగా మారుతుంది, ఒక్కోసారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని సరైన మార్గాన్ని నిర్దేశిస్తాడు., అవసరమైన సందర్భాల్లో పోర్ట్ఫోలియోలో మార్పులు కూడా సూచిస్తాడు. పెయిడ్ అడ్వైజర్ని సంప్రదించడం ఖర్చు కాదు. భవిష్యత్తు పెట్టుబడుల్లో భాగం.లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టండిలాభాలు వచ్చినప్పుడు వాటిని మొత్తం ఖర్చు చేయకండి. కొంత భాగాన్ని మళ్లీ పెట్టుబడుల్లో పెట్టండి. దీనివల్ల లాభాలపై మళ్లీ లాభాలు వస్తాయి. ఇదే నిజమైన సంపద రహస్యం. సరైన అసెట్ అలొకేషన్మీ పెట్టుబడులపై ఎంత రాబడి వస్తుందనేది మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారనేదానిపై ఆధారపడి ఉంటుంది. దీన్నే అసెట్ అలొకేషన్గా చెబుతుంటారు. ఈక్విటీ, డెట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ వంటి విభాగాల్లో మీ డబ్బును సరైన శాతాల్లో పెట్టుబడి చేయడమే ఈ అసెట్ అలొకేషన్. మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యం , మీ లక్ష్యాలు వాటి కాల వ్యవధి మీద ఇది ఆధారపడి ఉంటుంది. యువ ఇన్వెస్టర్లు రిస్క్ ఎక్కువ తీసుకోగలరు. అందుకే ఈక్విటీల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ భద్రత ముఖ్యం అవుతుంది. అప్పుడు డెట్లో పెట్టుబడికి ప్రాధాన్యమివ్వాలి. ఎవరైనా మొత్తం డబ్బు ఒకే చోట పెట్టడం ప్రమాదకరం.మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాట వినండిమీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ పెట్టుబడులను పర్యవేక్షిస్తుంటారు. మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తుంటారు. వారు ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, ఆలోచించి అమలు చేయడం మంచిది. ఫైనల్ నిర్ణయం మీరే తీసుకున్నా.. వారి అనుభవం పెట్టుబడుల విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.మార్కెట్ ఊగిసలాటలు సహజమేమార్కెట్ ఎప్పుడూ పైకి మాత్రమే వెళ్లదు. అప్పుడప్పుడూ పడిపోతుంది. కానీ మళ్లీ పెరుగుతుంది. ఇది సహజ ప్రక్రియ. చిన్న మార్పులకు భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే, మీరు నష్టాలకే బాట వేస్తారు. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయనే విషయం చరిత్ర చెబుతోంది. పెట్టుబడుల విషయంలో ఓర్పు ఇన్వెస్టర్కు అత్యంత ముఖ్యమైన ఆయుధం.పెట్టుబడులూ ప్రధానమే..మనందరికీ కుటుంబం ముఖ్యం. పని ముఖ్యం. కానీ పెట్టుబడులూ అంతే ముఖ్యమని తెలు సుకోవాలి. ఎందుకంటే ఇవే మీ భవిష్యత్తును కాపాడతాయి. చాలామంది చేసే తప్పేంటంటే ముందుగా ఖర్చులు చేస్తారు, మిగిలితే ఇన్వెస్ట్ చేస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్లు చేసే పని ముందుగా ఇన్వెస్ట్ చేయడం. తర్వాత ఖర్చులు ప్లాన్ చేసుకోవటం. ఇది చిన్న మార్పులా అనిపించినా, దీర్ఘకాలంలో సంపద సృష్టికి పెద్ద ఆధారమవుతుంది.దీర్ఘకాలిక లక్ష్యాలను ఎప్పుడూ మరవద్దుపిల్లల చదువు, రిటైర్మెంట్, ఇల్లు కొనడం లాంటి లక్ష్యాలు 10–15 సంవత్సరాల తర్వాత వచ్చే దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇవి సమయం మీద ఆధారపడే లక్ష్యాలు. సమయం అంటే కాంపౌండింగ్ శక్తి. ఈ డబ్బును చిన్న అవసరాలకు వాడితే మీరు కోల్పోయేది కేవలం డబ్బు కాదు. అంతకంటే విలువైన సమయం. డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేరు.పెట్టుబడులు చేయడం అలవాటు చేసుకోండివిజయవంతమైన ఇన్వెస్టర్లు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టరు. క్రమ పద్ధతిలో పెట్టుబడులు చేస్తుంటారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) వంటి పద్ధతులు మీలో క్రమశిక్షణను పెంచుతాయి. చిన్న మొత్తాలతో మొదలుపెట్టినా, కాలక్రమంలో అవి పెద్ద మొత్తాలుగా మారతాయి.పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాలిమార్కెట్ మారుతుంది. మీ జీవితం కూడా మారుతుంది. కొత్త లక్ష్యాలు వస్తాయి, పాత లక్ష్యాలు పూర్తవుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో కూడా మార్పులు చేయాలి. దీన్నే పెట్టుబడుల పరిభాషలో రీ–బ్యాలెన్సింగ్ అంటారు.ఉదాహరణకు పిల్లల చదువుకు చేసిన పెట్టుబడులు పూర్తయ్యాక, ఆ డబ్బును రిటైర్మెంట్ లక్ష్యానికి మళ్లించాలి.ఇదీ చదవండి: ‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం


