Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Closing Update 27th March 20261
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్, సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్, RPSG వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నాగ ధున్సేరి గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, MBL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, ఆర్చీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Jio IPO Details2
జియో ఐపీవో ఎప్పుడంటే?

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లోని టెలికం నిర్వాహక హోల్డింగ్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కొత్త ఏడాదిలో ఐపీవో బాట పట్టిన తొలి కంపెనీగా నిలిచే వీలుంది.దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చైర్మన్‌గా 2016లో టెలికం కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ.. ఆయన తనయుడు ఆకాశ్‌ అంబానీ నాయకత్వంలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. 125 బిలియన్‌ డాలర్ల విలువను ఆశిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయించే వీలుంది.దీంతో ఐపీవో పరిమాణం 3 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 28,000 కోట్లు)గా సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెరసి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2022 మే నెలలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ 2.5 బిలియన్‌ డాలర్ల ఐపీవో చేపట్టింది. ఇది రికార్డుకాగా.. తదుపరి 2024 అక్టోబర్‌లో ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్‌ 2.97 బిలియన్‌ డాలర్ల సమీకరణతో స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. తద్వారా రికార్డును సవరించింది.

Rs 150 Cr Kotak mahindra Bank Scam Deepens India Banking Security Crisis3
బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు

భారతీయ బ్యాంకింగ్ రంగంలో వరుస కుంభకోణాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల చండీగఢ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో జరిగిన రూ.590 కోట్ల భారీ మోసం మరవకముందే తాజాగా హరియాణాలోని పంచకుల కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.150 కోట్ల మున్సిపల్ నిధులు మాయమవ్వడం చర్చనీయాంశం అయింది. సామాన్యుడి సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బ్యాంకులు వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరుగుతోంది?వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను పరిశీలిస్తే ఇవి కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే కాదని, వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన వైఫల్యాలని అర్థమవుతోంది. ఐడీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంకు ఉదంతాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే.. బ్యాంక్ సిబ్బంది సహకారం లేకుండా ఇంత భారీ స్థాయిలో నిధుల మళ్లింపు సాధ్యం కాదు. ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, నకిలీ స్టేట్‌మెంట్లు ఇవ్వడం వంటివి ఉన్నతాధికారుల కళ్లుగప్పి జరగడం వెనుక బ్యాంక్ లోపలి శక్తుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.నిఘా వైఫల్యంప్రైవేట్ బ్యాంకుల్లో అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థ కేవలం లాభనష్టాల లెక్కలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ రికార్డుల మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు వంటివి) బల్క్ డిపాజిట్లు చేసినప్పుడు బ్యాంకు మేనేజర్లు ఇచ్చే స్టేట్‌మెంట్లను గుడ్డిగా నమ్ముతారు. దీనిని ఆసరాగా చేసుకుని షెల్ కంపెనీలకు నిధులు మళ్లించడం సులభతరమవుతోంది.వ్యవస్థ ప్రక్షాళనకు కావాల్సిన కఠిన చర్యలుఇలాంటి స్కామ్‌లు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం పోలీసు విచారణ సరిపోదు. బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు రావాలి.ఏడాదికి ఒకసారి జరిగే ఆడిటింగ్ కాకుండా ప్రతి నెలా ప్రభుత్వ నిధులపై థర్డ్-పార్టీ స్వతంత్ర ఆడిట్ జరగాలి.కస్టమర్లు తమ ఎఫ్‌డీ స్టేటస్‌ను బ్యాంక్ పంపే కాగితాల ద్వారా కాకుండా నేరుగా సెంట్రల్ సర్వర్ ద్వారా చెక్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ లేదా ప్రత్యేక పోర్టల్ ఉండాలి.భారీ స్కామ్ జరిగినప్పుడు కేవలం కింది స్థాయి క్లర్కులను మాత్రమే కాకుండా సంబంధిత బ్రాంచ్ మేనేజర్, రీజినల్ మేనేజర్లను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు తమ నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంచేటప్పుడు ఆయా బ్యాంకుల క్యాపిటల్ అడక్వసీ రేషియో, గత ట్రాక్ రికార్డును కచ్చితంగా పరిశీలించేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలి.ఇదీ చదవండి: సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!

India Accelerates Rare Earth Magnet Exploration Self Reliance by 20304
వ్యూహాత్మక ఖనిజాల వేట

సాంకేతిక, రక్షణ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. దేశీయంగా ‘రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల’ (అరుదైన అయస్కాంత ఖనిజాలు) ఉత్పత్తిని భారీగా పెంచడమే కాకుండా లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి ఏడాదికి 5,000 టన్నుల అరుదైన అయస్కాంత ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.విశాఖలో ప్లాంట్ ప్రారంభంఅణుశక్తి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో ‘సమారియం-కోబాల్ట్’ అయస్కాంతాల తయారీ ప్లాంట్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. దీని ప్రస్తుత సామర్థ్యం ఏడాదికి 500 టన్నులు. తదుపరి దశలో దీన్ని 2,000 టన్నులకు, ఆపై 2030 నాటికి 5,000 టన్నులకు పెంచనున్నారు. నియోడైమియం-ఐరన్-బోరాన్ వంటి అధునాతన అయస్కాంతాల తయారీపై పైలట్ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం చేపట్టింది.పెరుగుతున్న డిమాండ్.. ప్రైవేటు భాగస్వామ్యంప్రస్తుతం దేశంలో ఈ అయస్కాంతాల అవసరం ఏడాదికి 4,000 టన్నులుగా ఉండగా 2030 నాటికి అది 8,000 టన్నులకు చేరుతుందని అంచనా. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అణుశక్తి చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. తద్వారా కీలక ఖనిజాల అన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపింది. అయితే, యురేనియం వంటి వ్యూహాత్మక వనరులపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది.లిథియం అన్వేషణపై దృష్టిఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన నిల్వలకు అత్యంత కీలకమైన లిథియం కోసం రాజస్థాన్‌లోని దేగానా, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాల్లో ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. దేగానాలో ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయని త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్ల’ను ఏర్పాటు చేయడం ద్వారా ఖనిజ శుద్ధి ప్రక్రియను బలోపేతం చేయనున్నారు.వీటిని ఎందుకు ఉపయోగిస్తారు?ఈ అరుదైన ఖనిజాలు కేవలం ఎలక్ట్రానిక్స్ కోసమే కాకుండా.. రక్షణ రంగంలో క్షిపణులు, రాడార్ల తయారీలో, అంతరిక్ష రంగంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో, గ్రీన్ ఎనర్జీ విభాగంలో విండ్ టర్బైన్లు, ఈవీ మోటార్లలో ఇవి అత్యంత కీలకం. రాజస్థాన్, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో శిలల రూపంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలికితీయడం కొంత సంక్లిష్టమైనప్పటికీ అధునాతన సాంకేతికతతో ఈ సవాలును అధిగమిస్తామని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!

gold and silver rates on 27 march 2026 in Telugu states5
పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 27 March 20266
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 243 పాయింట్లు నష్టపోయి 23,063 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 841 పాయింట్లు పడిపోయి 74,445 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.84బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 107.06 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.74 శాతం నష్టపోయింది.నాస్‌డాక్‌ 2.38 శాతం పడిపోయింది.Today Nifty position 27-03-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement