ప్రధాన వార్తలు
ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఆదాయం విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.''మా సంస్థకు సంబంధించిన 2025 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచాయి. మా భాగస్వాములు & ఉద్యోగుల అంకితభావం, కృషి వల్ల ఈ త్రైమాసికం విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా.. మా వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించడం.. గర్వించదగ్గ విషయం'' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.సుందర్ పిచాయ్ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్..'వెల్ డన్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2025 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో.. సెర్చ్ & ఇతర యాడ్స్ విభాగం 17 శాతం వృద్ధిని సాధించింది. జెమిని యాప్ నెలకు 750 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. 2025లో యూట్యూబ్ యాడ్స్ & సబ్స్క్రిప్షన్ ద్వారా 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా విభాగాల వారీగా గూగుల్ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.Well done— Elon Musk (@elonmusk) February 5, 2026
ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు యథాతథం?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, దేశీయ బాండ్ మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఆర్బీఐ తన ఫిబ్రవరి పాలసీలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది నుంచి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ సమావేశంలోని అంశాలు రేపు ఉదయం వెలువడనున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలుగత పాలసీ సమావేశం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం భారత్-అమెరికా, భారత్-యూరప్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు. దీని ఫలితంగా భారతీయ వస్తువులపై సుంకాలు గతంలో ఉన్న 50% నుంచి 18%కి గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనే అతి తక్కువ టారిఫ్ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది మన ఎగుమతిదారుల పోటీతత్వాన్ని భారీగా పెంచనుంది.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిఅంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ‘జియో-ఎకనామిక్స్ స్ట్రెస్ ఇండెక్స్’ ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి పెరిగిన 3-4 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు గత వారం భారీ పతనాన్ని చూసిన లోహాల ధరలు తిరిగి కోలుకోవడం గమనార్హం.అమెరికా ఫెడ్ రేట్ల కోత సంకేతాలుఅమెరికాలో లేబర్ మార్కెట్ మందగించడం, వాస్తవ ఆదాయం స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.రూపాయి ఒడిదుడుకులుగత రెండు నెలలుగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.89-92 మధ్య ఊగిసలాడుతోంది. ఏప్రిల్ 2025లో అమెరికా సుంకాలను పెంచినప్పటి నుంచి రూపాయి 5.8% మేర క్షీణించింది. అయితే ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత రూపాయి విలువ కోలుకోవడం సానుకూలాంశం.ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణ గణనలో భాగంగా కొత్త సీపీఐ వెయిటేజీలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సాధారణ సమయంలో ద్రవ్యోల్బణం 20-30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం కొత్త లెక్కల ప్రకారం సీపీఐ 20-30 బేసిస్ పాయింట్లు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.పైన పేర్కొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతానికి కీలక వడ్డీరేట్ల మార్పులపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
ఐటీ కంపెనీపై కేసు పెట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.రోజుకు 16 గంటల పనిటైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆయన ఆశ్రయించారు.అనారోగ్యంలోనూ పనిభారంతాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్లో ఉన్న ఓవర్టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళనహైదరాబాద్కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలుపని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్కు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రుణ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్), దాని గ్రూప్ కంపెనీలతో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసాలపై దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోర్టు ఆదేశించింది.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోర్టు ఆదేశించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ దర్యాప్తును ముగించాలని ఈడీ, సీబీఐలకు స్పష్టం చేసింది.కోర్టు కీలక వ్యాఖ్యలు, ఆదేశాలుఒకే ఎఫ్ఐఆర్పై ప్రశ్నలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదు మేరకు సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే బహుళ బ్యాంకుల నుంచి ఫిర్యాదులు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతి ఫిర్యాదు వెనుక విభిన్న లావాదేవీలు ఉన్నాయని గుర్తు చేసింది.బ్యాంకు అధికారుల పాత్ర.. నిధుల మళ్లింపులో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ అధికారులు, సంస్థల మధ్య ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.నాలుగు వారాల గడువు.. దర్యాప్తు పురోగతిపై తదుపరి నాలుగు వారాల్లోగా సమగ్రమైన స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని రెండు ఏజెన్సీలను కోర్టు ఆదేశించింది.వాదోపవాదాలుప్రశాంత్ భూషణ్ (పిటిషనర్ తరఫు): రూ.పదివేల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురైందని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాన నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ముకుల్ రోహత్గీ (అనిల్ అంబానీ తరఫు): రిలయన్స్ గ్రూప్ బకాయిలను చెల్లించడానికి ప్రయత్నిస్తోందని, వ్యాపారంలో వచ్చే సాధారణ డిఫాల్ట్లను నేరపూరిత చర్యలుగా చూడకూడదని వాదించారు. నిందితులు విదేశాలకు పారిపోతారనే భయాల్లో నిజం లేదని ఆయన హామీ ఇచ్చారు.తుషార్ మెహతా (సొలిసిటర్ జనరల్): నకిలీ బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ గుర్తించిందని, యెస్ బ్యాంక్ పెట్టుబడులపై కూడా విచారణ జరుగుతోందని కోర్టుకు వివరించారు.ఇప్పటివరకు చేపట్టిన చర్యలుఇటీవలే ఈడీ సుమారు రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలికంగా జప్తు చేసింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఆర్సీఓఎం మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్ను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన తీరును బట్టి చూస్తే తక్షణమే కాలపరిమితితో కూడిన దర్యాప్తు అవసరమని భావించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోవర్క్’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్ఇన్లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్ఇన్లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్ లేదా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
పుంజుకున్న బంగారం, వెండి ధరలు తిరుగుటపా కట్టాయి. భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కార్పొరేట్
ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!
రుణ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఒక్కటి కాదు.. వస్తున్నాయ్ 100 రిలయన్స్లు
హైదరాబాద్లో యాపిల్ స్టోర్
ఇండియా టీచింగ్..వరల్డ్ లెర్నింగ్
పాస్పోర్ట్ కొత్త రూల్స్.. పది రోజుల్లో అమల్లోకి!
కొత్త రుణాలపై ఎస్బీఐ ఫోకస్
వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
జీసీసీలకు హాట్స్పాట్గా భారత్
భారత్లో గూగుల్ భారీ విస్తరణ.. 20,000 మందికి ఉద్యోగాలు!
మళ్లీ ట్రెండ్లోకి వెండి
న్యూఢిల్లీ: జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి వరుసగా మ...
మార్కెట్లో ర్యాలీ.. ఇప్పుడేం చేయాలంటే..
భారత స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 3, 2026 నాటి ట్రేడ...
సెన్సెక్స్ సునామీ
ముంబై: భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్న...
మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..
జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు ...
ఇంకా వెనక్కి రాని రూ.2000 నోట్లు!
పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్...
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్లో మ...
పీఎఫ్, ఈఎస్ఐ విరాళాల చెల్లింపులో ఊరట
వ్యాపార యజమానులకు, సంస్థలకు భారీ ఊరటనిచ్చే దిశగా క...
రెవెన్యూ గ్రాంట్ల ముగింపుతో రాష్ట్రాలపై ప్రభావం?
రాష్ట్రాలకు ఇంతకాలంగా అందిస్తున్న రెవెన్యూ లోటు గ్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
బంపరాఫర్.. ఐఫోన్పై రూ.24000 తగ్గింపు!
గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.మార్కెట్లో రూ.1,19,900లకు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్.. అమెజాన్ ఇండియాలో రూ.99 వేలకు (రూ.20900 తగ్గింపు) కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కింద (క్రెడిట్ కార్డుపై) రూ.4,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ. 24900 తగ్గింపు పొందవచ్చన్నమాట.ఐఫోన్ ఎయిర్ మొబైల్.. స్కై బ్లూ, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ & లైట్ గోల్డ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.5 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. అంతే కాకుండా యాపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్తో కూడిన యాపిల్ A19 ప్రో చిప్సెట్ పొందుతుంది.ఇదీ చదవండి: 15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!ఐఫోన్ ఎయిర్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్పై ఆధారపడి ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM & 256GB ఇంటర్నల్ స్టోరేజ్ను పొందుతుంది.కెమెరా సెటప్ విషయానికి వస్తే.. సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ రియర్ 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ షూటర్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్ల కోసం, ఫోన్లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. హ్యాండ్సెట్ 3149mAh బ్యాటరీ & 20W MagSafe వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పనిచేస్తుంది.
పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి: సుప్రీంకోర్టు
సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. దీనిలో పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గంవాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కేసు నేపథ్యం ఏమిటి?2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.కేసు పరిధి విస్తరణఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
ఎయిర్టెల్ షాక్.. ఆ ఫ్రీ ఆఫర్ ఇక లేదు
లక్షలాది మంది ఎయిర్టెల్ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త. రీఛార్జ్ ప్లాన్లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్స్క్రిప్షన్లను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసిన వినియోగదారులకు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఆఫర్ను ప్రారంభించినప్పుడే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది.పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ వివరాలుఎయిర్టెల్ గత సంవత్సరం తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ను తాత్కాలిక ప్రయోజనంగా అందించింది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.17,000 కాగా, ఎయిర్టెల్ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా లభించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 16 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అప్పుడే ఎయిర్టెల్ ప్రకటించింది. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి తొలగించింది.ఇప్పటికే క్లెయిమ్ చేసినవారికి ప్రభావం ఉంటుందా?జనవరి 16కు ముందే ఆఫర్ను క్లెయిమ్ చేసిన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారు ఆఫర్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను కొనసాగించవచ్చు. అయితే, జనవరి 16 తర్వాత రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదు.ఒక ఆఫర్ ముగిసినా… మరో కొత్త అవకాశంపెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ రద్దయినా, ఎయిర్టెల్ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తాజాగా ఎయిర్టెల్ అడోబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద, ఎయిర్టెల్కు చెందిన సుమారు 360 మిలియన్ల వినియోగదారులు ఇప్పుడు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్ పొందనున్నారు. సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ.4,000 ఖర్చయ్యే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా, వినియోగదారులు అడోబ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు, ఇతర ప్రీమియం సదుపాయాలను ఉచితంగా ఉపయోగించవచ్చు.
సాఫ్ట్వేర్ బూమ్ మళ్లీ వస్తుందా?
దేశంలో 90ల నాటి సాఫ్ట్వేర్ బూమ్ మళ్లీ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ మార్కెట్ వేత్త, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు రామ్దేవ్ అగర్వాల్. కేంద్ర బడ్జెట్ 2026ను ఆయన “భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు మాస్టర్ స్ట్రోక్”గా అభివర్ణించారు. 2047 వరకు డేటా సెంటర్లకు 100% ట్యాక్స్ హాలిడే (పన్ను రహితం) అందించే విధాన నిర్ణయాన్ని ఆయన “1,000 పౌండ్ల గొరిల్లా” (అత్యంత శక్తివంతమైన) తరహా నిర్ణయంగా పేర్కొన్నారు.ప్రస్తుత డిజిటల్ పురోగతిని 1990ల సాఫ్ట్వేర్ బూమ్తో పోలుస్తూ.. “మనం ఇప్పటికే ఏఐ(AI)ని స్వీకరించాం. ఇప్పుడు ‘ఏఐ ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్’ను నిర్మిస్తున్నాం. విద్యుత్, కేబుల్స్, మౌలిక సదుపాయాల్లో భారీ మూలధనం పెట్టుబడి పెడుతున్నాం” అని రామ్దేవ్ అగర్వాల్ తెలిపారు.మరోవైపు కేంద్ర బడ్జెట్ 2026లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెరగడం వల్ల సమీప కాలంలో మార్కెట్లకు హెడ్విండ్స్ ఉన్నాయని అంగీకరించారు. అయితే దేశ దీర్ఘకాలిక ఆదాయ కథ బలంగా కొనసాగుతోందని రామ్దేవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. “4.3% ద్రవ్యలోటు లక్ష్యం, రూ.12.2 లక్షల కోట్ల క్యాపెక్స్ పుష్తో, దీర్ఘకాలంలో భారతదేశమే నిజమైన విజేత” అని ఆయన పేర్కొన్నారు.బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఫ్యూచర్స్పై ఎస్టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.10% నుంచి 0.15%కి పెరిగింది. అలాగే ఆప్షన్ ఎక్సర్సైజ్పై పన్ను 0.125% నుంచి 0.15 శాతానికి ఎగిసింది. ఈ చర్యలు స్వల్పకాలిక ట్రేడింగ్ కార్యకలాపాలను తగ్గించవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.ఇది చదివారా? వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త కండీషన్బడ్జెట్లోని సూక్ష్మ అంశాలు కూడా అంతే ప్రాధాన్యత కలవని ఆయన అన్నారు. ఐటీ సేవల నిర్వచనాన్ని విస్తరించడం వల్ల గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు (GCC) బదిలీ ధరలపై స్పష్టత లభించిందని, ఇది హైఎండ్ టెక్నాలజీ వ్యాపారాలకు భారత్ స్వాగతం పలుకుతోందనే బలమైన సంకేతం అని పేర్కొన్నారు.
పర్సనల్ ఫైనాన్స్
లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఈ కీలక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను రాయితీలు పెరుగుతాయా? నిత్యావసరాల ధరలు తగ్గుతాయా? గృహ రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందా? అన్నవి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.అయితే, కేంద్ర బడ్జెట్ కేవలం టీవీల్లో చూసే అంకెలు మాత్రమే కాదు; అది నేరుగా మీ ఇంట్లో, మీ పిల్లల చదువులపై, మీ పొదుపుపై ప్రభావం చూపే అంశం. అందుకే, ప్రభుత్వ బడ్జెట్తో పాటు మీ ‘ఇంటి బడ్జెట్’ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? పన్ను మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? అసలు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం? వంటి అంశాలతో కూడిన ప్రత్యేక కథనం ఇదిగో..పన్ను మార్పులు..ఈసారి కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మరిన్ని మార్పులు లేదా సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీ వార్షిక ఆదాయం ఏ పన్ను స్లాబ్లోకి వస్తుందో లెక్కించుకుని, దానికి అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి.ఖర్చుల అంచనాబడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం లేదా గృహోపకరణాల ధరల్లో మార్పులు ఉండవచ్చు. మీ ఇంట్లో కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితా ఉంటే బడ్జెట్ తర్వాత ధరల హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.పొదుపు మంత్రంబడ్జెట్లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలకు పెద్దపీట వేయడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పై ప్రభావం ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం (పిల్లల చదువు, పెళ్లిళ్లు) ఎంత మేర కేటాయించాలో బడ్జెట్ ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాలి.‘ఇంటి బడ్జెట్’ ఎందుకు?ప్రభుత్వం దేశం కోసం ఎలాగైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుందో ప్రతి ఇంట్లో కూడా అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే..అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉంటుంది. బడ్జెట్ వేసుకుంటేనే మన దగ్గర ఎంత మిగులు ఉందో తెలుస్తుంది. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లోని మళ్లించవచ్చు.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. బడ్జెట్ వల్ల అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, పిల్లల చదువులు సాగాలన్నా.. కచ్చితమైన ప్లానింగ్ అవసరం. నెలకు ఎంత పొదుపు చేస్తున్నామో తెలిస్తేనే లక్ష్యం చేరువవుతుంది.బడ్జెట్ కోసం సింపుల్ టిప్: 50-30-20 రూల్మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి. మొత్తం నెలవారీ రాబడిలో..50%: అవసరాలు (అద్దె, కిరాణా, ఫీజులు)30%: కోరికలు (సినిమాలు, విహారయాత్రలు, షాపింగ్)20%: పొదుపు, పెట్టుబడులుకేంద్ర బడ్జెట్ 2026 దేశానికి ఒక రోడ్ మ్యాప్ అయితే, మీరు వేసుకునే ఇంటి బడ్జెట్ మీ కుటుంబ ఆర్థిక భరోసాకు పునాది. ఫిబ్రవరి 1న వెలువడే అధికారిక ప్రకటనలను బట్టి మీ ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐ
రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో పన్నులు, బీమా, పెన్షన్ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గృహ ఆర్థిక పొదుపును పెంచడం, నియంత్రణ సవాళ్లను తగ్గించడం, దేశంలో సామాజిక భద్రత కవరేజీని మెరుగుపరచడం ఈ సూచనల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.గృహ ఆర్థిక పొదుపులో బ్యాంకు డిపాజిట్ల వాటా 2024 ఆర్థిక సంవత్సరంలో 38.7 శాతం నుంచి 2025లో 35.2 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొదుపును ప్రోత్సహించేందుకు డిపాజిటర్లకు పన్ను ఉపశమన చర్యలు అవసరమని ఎస్బీఐ అభిప్రాయపడింది.బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి వర్తించే పన్ను విధానాన్ని దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల (LTCG, STCG)తో సమానంగా తీసుకురావాలని సూచించింది. అలాగే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల లాక్-ఇన్ వ్యవధిని మూడేళ్లకు తగ్గించి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)తో సమానంగా చేయాలని సిఫార్సు చేసింది. చిన్న పొదుపుదారులకు ఉపశమనం కలిగించేలా పొదుపు ఖాతాలపై వడ్డీకి వర్తించే టీడీఎస్ను పూర్తిగా తొలగించాలని లేదా కనీస పరిమితిని పెంచాలని కూడా ఎస్బీఐ సూచించింది.పరోక్ష పన్నుల విషయంలో, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)కు సంబంధించిన జీఎస్టీ నిబంధనల్లో స్పష్టత తీసుకురావాలని నివేదిక పేర్కొంది. జీఎస్టీ చట్టం, 2017లోని కొన్ని పదాలను సవరించడం ద్వారా వివాదాలు తగ్గించవచ్చని సూచించింది. అలాగే బ్యాంకులు పంపిణీ చేసే ఐఎస్డీపై వాల్యుయేషన్ వివాదాలు లేకుండా ఉండేందుకు సెక్షన్ 20(3)కు వివరణ జోడించాలని ప్రతిపాదించింది.ఎన్పీసీఐ, వీసా, మాస్టర్కార్డ్ వంటి సెటిల్మెంట్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులపై జీఎస్టీ టీడీఎస్ అమల్లో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ టీడీఎస్ వర్తించకుండా మినహాయింపు ఇవ్వాలని ఎస్బీఐ సూచించింది.బీమా రంగంలో, భారతదేశంలో బీమా వ్యాప్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి తగ్గిందని ఐఆర్డీఏఐ డేటాను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. జీవిత బీమా వ్యాప్తి 2.7 శాతానికి, నాన్-లైఫ్ బీమా 1 శాతానికి పరిమితమైందని పేర్కొంది. “2047 నాటికి అందరికీ బీమా” అనే ఐఆర్డీఏఐ లక్ష్యానికి ఇది సవాలుగా మారిందని హెచ్చరించింది. అలాగే 2025లో వచ్చిన ఫిర్యాదుల్లో 69 శాతం క్లెయిమ్స్కు సంబంధించినవేనని, ముఖ్యంగా ఆరోగ్య బీమా రంగంలో తక్షణ సంస్కరణలు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.పెన్షన్ రంగంలో కనీస పెన్షన్ హామీతో కూడిన బలమైన, సమగ్ర పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎస్బీఐ నొక్కి చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2026లో ఈ సూచనలను అమలు చేస్తే దేశ ఆర్థిక భద్రత బలోపేతమవుతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని ఎస్బీఐ పేర్కొంది.
Income Tax: బినామీ వ్యవహారాల జోలికెళ్లొద్దు..
బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు. అధికారుల అధికారాలు ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే... (1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం. ఇంకా ఏం చేస్తారు నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.ఆద్యులెవరు .. ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.నోటీసు ప్రక్రియ.. నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్ కోడ్ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్మెంట్ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.ఈ రెండు చట్టాలు–చుట్టాలు .. అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్కంటాక్స్ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్ చేయని ఆస్తులు.. డిక్లేర్ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్మెంట్ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్ చేస్తారు. వారి వలలో పడకండి!
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్కు, స్టాక్ మార్కెట్కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..


