Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why People Think Term Insurance Is a Waste see details1
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?

ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్‌ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్‌లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్‌ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం

Assembly passed the Bill raising daily working hours for shop employees2
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం

హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.బిల్లులోని ముఖ్యాంశాలుప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: మీ స్మార్ట్‌వాచ్‌.. బీమా ప్రీమియం​ డిసైడ్‌ చేస్తుందా?

Pay How You Live Insurance Lifestyle Linked Premiums Set Transform India3
మీ స్మార్ట్‌వాచ్‌.. బీమా ప్రీమియం​ డిసైడ్‌ చేస్తుందా?

ఉదయాన్నే లేచి పార్కులో వాకింగ్ చేస్తున్నారా? ఆఫీసులో లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కుతున్నారా? రాత్రికి సమయానికి నిద్రపోతున్నారా? అయితే, ఇవన్నీ కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ జేబును కూడా కాపాడబోతున్నాయి! ఇప్పటివరకు మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే బీమా కంపెనీలు ఇకపై మీరు ఎలా జీవిస్తున్నారు(Lifestyle) అనే అంశాన్ని బట్టి రేట్లను ఫిక్స్ చేయనున్నాయి.ఒకప్పుడు బీమా అంటే కేవలం పాలసీ పత్రాలు, క్లెయిమ్‌లకే పరిమితం. కానీ ఇప్పుడు ‘పే-హౌ-యు-లివ్’(Pay-How-You-Live) విధానంతో అడుగులు వేస్తోంది. కస్టమర్ల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు, రోజువారీ డేటా ఆధారంగా ప్రీమియంలను నిర్ణయించేదే ఈ విధానం. మీ స్మార్ట్ వాచ్ ఇచ్చే డేటా ఆధారంగా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బీమా ప్రీమియం తగ్గుతుంది. అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం కాబోతోంది. 2025లో ఐఆర్‌డీఏఐ తెచ్చిన సంస్కరణలతో ఈ డైనమిక్ ఇన్సూరెన్స్ మోడల్ ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది.‘పే హౌ యు లివ్’ అంటే..సాధారణంగా బీమా పాలసీలు వయసు, జెండర్‌ వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తాయి. కానీ, ‘పే-హౌ-యు-లివ్’ నమూనాలో రియల్ టైమ్ వెల్‌నెస్‌ డేటా కీలకం అవుతుంది. స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ యాప్‌ల ద్వారా సేకరించిన సమాచారం (ఉదాహరణకు రోజువారీ నడక, నిద్ర సమయం, వ్యాయామం) ఆధారంగా అల్గారిథమ్‌లు బీమా ప్రీమియంలను సర్దుబాటు చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే ఆరోగ్యవంతులకు ప్రీమియం తగ్గుతుంది. మీ జీవనశైలి మెరుగుపడితే మీ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.2025లో వచ్చిన మార్పులుఈ విధానం వేగవంతం కావడానికి ఐఆర్‌డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) 2025లో ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలు ఈ మార్పులకు ప్రధాన కారణం.ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉన్న గరిష్ట వయసు పరిమితులను తొలగించడం వల్ల వృద్ధులకు కూడా ఈ వెల్‌నెస్‌ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.గతంలో 8 ఏళ్లుగా ఉన్న మోరటోరియం కాలాన్ని(పాలసీదారుడు తన పాలసీని నిర్దిష్ట కాలం పాటు కొనసాగించిన తర్వాత బీమా సంస్థ తన క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీలులేని కాలం) 5 ఏళ్లకు తగ్గించడం ద్వారా వినియోగదారులకు భరోసా పెరిగింది.వృద్ధులపై ప్రీమియం భారం పడకుండా, పెంపును 10% కి పరిమితం చేయడం వంటి చర్యలు ఈ మోడల్‌ను మరింత న్యాయబద్ధంగా మార్చాయి.స్మార్ట్ పరికరాల వాడకం పెరగడం వల్ల డేటా సేకరణ సులభమైంది.ప్రస్తుత మార్కెట్ స్థితిగతులుభారతదేశంలో ఈ ధోరణి ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రారంభమైంది. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు ‘పే హౌ యు డ్రైవ్’ ద్వారా సురక్షితంగా వాహనం నడిపేవారికి రాయితీలు ఇస్తున్నాయి.ఆరోగ్య బీమా.. ప్రస్తుతం జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా స్టెప్ కౌంట్ ఆధారంగా రివార్డ్ పాయింట్లు ఇచ్చే పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.జీవిత బీమా.. 2025 నాటికి టాప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వెల్‌నెస్‌ రైడర్లను జోడిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి పేఅవుట్లను పెంచేలా మార్పులు జరుగుతున్నాయి.సవాళ్లుఈ విధానం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించడం వల్ల డేటా భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. జన్యుపరమైన లేదా అనివార్యమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మోడల్ వల్ల ప్రీమియం భారం పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఐఆర్‌డీఏఐ పారదర్శకత, సమ్మిళిత నిబంధనలను కఠినతరం చేస్తోంది.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ మోడల్‌కు మరింత ఆదరణ పెరుగుతోంది. దేశంలోని యువత సాంకేతికతను ఇష్టపడటం ఈ మార్పుకు కలిసివచ్చే అంశం. బీమా అనేది కేవలం ఆపదలో ఆదుకునే ఆర్థిక ఉత్పత్తిగానే కాకుండా, కస్టమర్లను ఆరోగ్యంగా ఉంచే ఒక వెల్‌నెస్‌ పార్టనర్‌గా రూపాంతరం చెందుతోంది.ఇదీ చదవండి: ‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్‌ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..

National Housing Market Snapshot Q4 2025 Details4
హౌసింగ్ మార్కెట్‌లో మందగమనం

దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని మందగమనాన్ని ఎదుర్కొంటోంది. 2025 సంవత్సరం ముగింపు నాటికి భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ప్రాప్‌ఈక్విటీ అనే రియల్టీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025 నాలుగో త్రైమాసికంలో మొత్తం 98,019 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం క్షీణత నమోదైంది. ముఖ్యంగా 2021 మూడో త్రైమాసికం తర్వాత నమోదైన అత్యల్ప విక్రయాల వాల్యూమ్ ఇదే కావడం గమనార్హం.నవీ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల జోరుమొత్తం మార్కెట్ డీలా పడినా నవీ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లు మాత్రం సానుకూల వృద్ధిని కనబరిచాయి. నవీ ముంబై అమ్మకాల్లో 13 శాతం వృద్ధిని నమోదు చేసి స్టార్ పర్ఫార్మర్‌గా నిలిచింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ 4 శాతం వృద్ధితో నిలకడను చాటుకుంది. అయితే, మిగిలిన ఏడు ప్రధాన నగరాల్లో అమ్మకాలు ఏకంగా 31 శాతం వరకు పడిపోయాయి.ప్రధాన నగరాల్లో అమ్మకాల పరిస్థితిబెంగళూరు: 15,603 యూనిట్ల విక్రయాలతో గతంతో పోలిస్తే 7 శాతం క్షీణతను చూసింది.హైదరాబాద్: ఇక్కడ కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.పుణె: అత్యధికంగా 31 శాతం క్షీణతతో 15,788 యూనిట్లకు పడిపోయింది.చెన్నై, కోల్‌కతా: వరుసగా 16 శాతం వార్షిక క్షీణతను నమోదు చేశాయి.ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గుఅమ్మకాలు తగ్గినప్పటికీ డెవలపర్ల ఆదాయం, ఇళ్ల విలువల విషయంలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. 2023లో 4.81 లక్షల ఇళ్ల లాంచ్ విలువ రూ.6.3 లక్షల కోట్లుగా ఉంటే, 2024లో లాంచ్ అయిన ఇళ్ల సంఖ్య (4.11 లక్షలు) తగ్గినప్పటికీ, వాటి విలువ మాత్రం రూ.6.8 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కొనుగోలుదారులు, డెవలపర్లు లగ్జరీ/ప్రీమియం విభాగం వైపు మళ్లుతున్నారని స్పష్టం చేస్తోంది.తగ్గిన సరఫరాకేవలం అమ్మకాలే కాకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా ఈ త్రైమాసికంలో 10 శాతం తగ్గి 88,427 యూనిట్లకు చేరుకుంది. పెరిగిన నిర్మాణ వ్యయం, మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల డెవలపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్ట్‌ల సరఫరాలో వరుసగా 16%, 7% మేర తగ్గుదల నమోదైంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!

Universal Studios planning stages to build theme park know details5
‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్‌ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..

ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వివిధ దేశాల్లోని పర్యాటకులను అలరించే ‘యూనివర్సల్ స్టూడియోస్’ థీమ్ పార్క్ ఇప్పుడు సౌదీలో ఏర్పాటు కానుంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా ఈ ప్రాజెక్టుకు వేదిక కానుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, యూనివర్సల్ స్టూడియోస్ మాతృ సంస్థ కామ్ కాస్ట్ (Comcast) ప్రతినిధులు ఈ థీమ్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కామ్ కాస్ట్ సీఈఓ బ్రియాన్ రాబర్ట్స్ ఇటీవల స్వయంగా ఖిద్దియా సైట్‌ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.334 చదరపు కిలోమీటర్లుఈ థీమ్ పార్క్ ఏర్పాటు కానున్న ఖిద్దియా ప్రాజెక్ట్ విస్తీర్ణం 334 చదరపు కిలోమీటర్లుగా ఉందని అంచనా. ఇది ఫ్లోరిడాలోని ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఏటా 4.8 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సౌదీ జీడీపీకి సుమారు 4.5 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.పర్యాటక రంగంలో దూసుకుపోతున్న సౌదీసౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేవలం చమురుపైనే ఆధారపడకుండా వైవిధ్యీకరించాలని చూస్తోంది. గతేడాది 10 కోట్ల మందికిపైగా సందర్శకులు సౌదీని సందర్శించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6.09 కోట్ల మంది పర్యాటకులు రావడం గమనార్హం. 2030 నాటికి ఏడాదికి 15 కోట్ల మంది పర్యాటకులను రప్పించాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!

Bengaluru based Sarla Aviation clear ground testing its flying taxi6
ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!

ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని గంటల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుందా.. అంటే అవుననే చెప్పాలి. గాల్లో ప్రయాణించే పక్షిలా.. నగరంలోని గగనతలంలో విహరిస్తూ గమ్యాన్ని నిమిషాల్లో చేరుకునే ఎయిర్ టాక్సీ కల సాకారం కాబోతోంది. బెంగళూరుకు చెందిన ‘సరళా ఏవియేషన్’ తమ అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్‌తో భారత విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సరళా ఏవియేషన్’ (Sarala Aviation) అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 హాఫ్-స్కేల్ ప్రోటోటైప్ గ్రౌండ్ టెస్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నగరంలోని కంపెనీ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలు దేశీయ ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని నిజం చేసే దిశగా నిలిచాయి.ఈ విమానం ప్రత్యేకతలు7.5 మీటర్ల భారీ రెక్కల విస్తీర్ణంతో రూపొందిన SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన అతిపెద్ద, అధునాతన eVTOL విమానంగా గుర్తింపు పొందింది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. సాధారణ మోడల్స్ లాగా కాకుండా ఈ విమానాన్ని మొదటి నుంచే వాణిజ్య ధ్రువీకరణ (Certification) పొందేలా డిజైన్ చేశారు. ఇది భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన పూర్తిస్థాయి విమానానికి పునాదిగా నిలుస్తుంది.‘ఈ విభాగంలో కేవలం మొదటి స్థానంలో ఉండటం కాదు, ఏవియేషన్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదగడమే మా లక్ష్యం’ అని సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ రాకేష్ గావ్కర్ పేర్కొన్నారు. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద తయారు చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీతో ఎంతో మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో నగరాల్లో గంటల తరబడి ఉండే ట్రాఫిక్ ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించనుందని చెప్పింది.నిధుల సేకరణఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం సుమారు 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.108 కోట్లు) నిధులను సేకరించింది. దీనికి అదనంగా, భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జాతీయ ప్రదర్శన కోసం ఒక పూర్తిస్థాయి స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా సిద్ధం చేసింది. 2024లోనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL)తో సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు తక్కువ సమయంలో ప్రయాణించేలా eVTOL సేవలను ప్రారంభించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపింది.తదుపరి దశ ఏమిటి?గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం కావడంతో కంపెనీ ఇప్పుడు తన ఎయిర్ టాక్సీ ప్రోగ్రామ్‌లో అతి ముఖ్యమైన ధ్రువీకరణ (Validation) దశలోకి ప్రవేశించింది. త్వరలోనే ఈ హాఫ్-స్కేల్ విమానం గాలిలోకి ఎగిరే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే భారత్ సొంత ఎయిర్ టాక్సీలను కలిగిన దేశాల జాబితాలో చేరుతుంది.ఇదీ చదవండి: ఇది గ్రాఫిక్స్‌ కాదు.. నిజంగా రోబోనే!

Advertisement
Advertisement
Advertisement