Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

know the answers of financial questions by experts1
22..? 24..? ఏది మంచిది?

ఫైనాన్షియల్‌ వ్యవహారాలపై చాలామందికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. దాంతో పెద్దగా రాబడులు రాని విధానాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో భారీగా నష్టపోతుంటారు. ఈక్రమంలో ఏది మేలో.. ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, బ్యాంకులు, రియల్టీ, స్టాక్‌ మార్కెటు, మ్యూచువల్‌ ఫండ్స్‌.. వంటి ఎన్నో సాధనాల్లో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి చాలానే ప్రశ్నలుంటాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులు ఇస్తున్న సమాధానాలు చూద్దాం.బంగారంతరచూ బంగారంలో 22 కేరెట్లు, 24 కేరెట్లు అంటుంటారు కదా! ఏది మంచిది?ఆభరణాల కోసమైతే 22 కేరెట్ల బంగారాన్ని కొంటే సరిపోతుంది. అలాకాకుండా ఇన్వెస్ట్‌ చేయడానికైతే 24 కేరెట్ల బంగారమే బెటర్‌. దీన్లో తరుగు ఉండదు కాబట్టి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారమైతే ఎప్పుడు విక్రయించినా అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు మనకు లభిస్తుంది. సాధారణంగా కాయిన్లు, బిస్కెట్ల వంటివి 24 కేరెట్లలోనే లభిస్తుంటాయి. ధర కూడా 22 కన్నా 24 కేరెట్లు కాస్త ఎక్కువ ఉంటుంది. కొందరైతే ఆభరణాల కోసం 18 కేరెట్ల బంగారాన్ని కూడా వాడతారు. ఇది మరికొంత చౌక.స్టాక్‌ మార్కెట్లు..ఈ ఏడాది చాలా ఐపీఓలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇలాగే రావచ్చేమో. మరి 2026లో ఐపీఓల్లో పెట్టుబడి పెట్టవచ్చా?ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓలు అత్యధిక ధర వద్ద ఇష్యూకు వస్తున్నాయి. లిస్టింగ్‌ నాడు లాభాలొస్తున్నా... అది దైవాదీనమనుకోవాలి. ఎందుకంటే చాలా ఐపీఓలు లిస్ట్‌ అయిన నెల–రెండు నెలలకే నేల చూపులు చూస్తున్నాయి. కాబట్టి ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టినా కంపెనీ ఫండమెంటల్స్‌ చూడండి. ఫండమెంటల్స్‌ బాగుండి, ఆ వ్యాపారానికి భవిష్యత్‌ ఉందనిపిస్తే పెట్టండి. దీర్ఘకాలానికైనా పనికొచ్చేలా ఉండాలి.రియల్టీ..నేనో స్థలం కొందామనుకుంటున్నాను. గేటెడ్‌ కమ్యూనిటీలో అయితే మంచిదా... లేకపోతే మామూలు సింగిల్‌గా ఉండే ప్లాటయితే మంచిదా?ప్లాట్ల విషయానికొచ్చినపుడు గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండే స్థలానికున్న రక్షణ బయట సింగిల్‌గా ఉండే స్థలాలకు ఉండదు. కబ్జాలకు అవకాశం తక్కువ. కాకపోతే స్థలమన్నది ఎక్కడ కొన్నా ముందుగా చెక్‌ చేసుకుని కొనటం తప్పనిసరి. గేటెడ్‌ అయితే రీసేల్‌ కాస్త సులువుగా అవుతుంది. దీనికోసం 10–20 శాతం ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు. బ్యాంకింగ్‌..నేను భవిష్యత్‌ లక్ష్యాల కోసం క్రమానుగత ఇన్వెస్ట్‌మెంట్‌ చేద్దామనుకుంటున్నాను. బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయటం మంచిదా... మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచివా? దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసేటపుడు మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవటమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి షేర్‌ మార్కెట్‌కు ఉంటుంది. పైపెచ్చు ఆర్‌డీతో పోలిస్తే దీర్ఘకాలానికి ఫండ్లే మంచి రాబడినిస్తాయి. ఆర్‌డీ సురక్షితమే అయినా రాబడి తక్కువ. స్వల్పకాలానికైతే అది మంచిది.ఫండ్స్‌...నేను మ్యూచువల్‌ పండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నాను. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో 22 మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇది మంచిదేనా? అసలు ఎన్ని ఫండ్స్‌ ఐతే బెటర్‌?వాస్తవానికి అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే అన్ని ఫండ్ల పనితీరూ ఒక్కలా ఉండదు. ఇలా పెట్టడమంటే షేర్లలో పెట్టినట్లే. షేర్లలో పెట్టుబడి పెడితే రిస్కు ఎక్కువనే కదా మీరు మ్యూచువల్‌ ఫండ్లు ఎంచుకున్నది. మరి ఇన్ని ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తే అన్నింటి పనితీరునూ ఎప్పటికపుపడు గమనిస్తూ వెళ్లగలరా? అందుకే నా సూచనేమిటంటే కనిష్టంగా 3, గరిష్ఠంగా 5 మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇన్సూరెన్స్‌...క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ అంటే ఏంటి? ఎంతవరకూ ఉపకరిస్తుంది? అది తీసుకోవటం మంచిదేనా? మంచిదే. మీ ఆరోగ్య బీమా ప్రీమియానికి కొంత మొత్తాన్ని జోడించటం ద్వారా ఈ రైడర్‌ను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కేన్సర్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మేజర్‌ అవయవ మారి్పడి వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆసుపత్రి బిల్లు ఎంతయిందనే అంశంతో సంబంధం లేకుండా ఇన్సూర్‌ చేసిన మొత్తాన్ని కంపెనీ మీకు చెల్లించేస్తుంది. ఆ మొత్తాన్ని మీరు చికిత్సకు, రికవరీకి, ఈ మధ్యలో చెల్లించాల్సిన ఈఎంఐల వంటి ఖర్చులు వాడుకోవచ్చు. ఊహించని వ్యాధులొచ్చినపుడు ఈ రైడర్‌ వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటమనేది తప్పుతుంది. కాబట్టి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను తీసుకోవటం సరైనదే.ఇదీ చదవండి: ఇండిగో కొంప ముంచింది ఇదే..

IndiGo Pilot Management Challenges diff from airindia know more2
ఇండిగో కొంప ముంచింది ఇదే..

దేశీయ విమానయాన రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఇండిగో విమాన సేర్వీసుల్లో ఇటీవల భారీ అంతరాయాలు, రద్దులు సంభవించాయి. దాంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఒక సంక్షోభానికి దారితీసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు, పైలట్ల కొరత ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిరిండియా వ్యూహాత్మకంగా పైలట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.కొత్త నిబంధనలు ఇండిగోపై ప్రభావండైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.ఎయిరిండియా దూకుడుఇండిగో ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఒక అవకాశంగా మారింది. ఎయిరిండియా ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలును ముందుగానే ఊహించి సిబ్బంది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ వంటి ఇతర విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అదనపు పైలట్లను సకాలంలో నియమించుకునేలా చర్యలు చేపట్టాయి. వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నాయి. ఇండిగో మాదిరిగా కాకుండా ఎయిరిండియా తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించుకొని, తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకుంది. ఎయిరిండియా కేవలం కొత్త పైలట్లను నియమించుకోవడమే కాకుండా, తన పైలట్ వినియోగ ప్రణాళికలో మరింత సంప్రదాయబద్ధమైన విధానాన్ని అవలంబించింది. దీనివల్ల ప్రతి విమానానికి తగినంత మంది సిబ్బంది ఉండేలా చూసుకుంది. తద్వారా ఇండిగో మాదిరిగా భారీ అంతరాయాలను నివారించగలిగింది.పైలట్-టు-ఎయిర్‌క్రాఫ్ట్ నిష్పత్తిపై విశ్లేషణఎయిరిండియా (Air India) ఒక విమానానికి సగటున 5.4 మంది పైలట్ల నిష్పత్తిని కలిగి ఉంది. ఇది బఫర్, భద్రతపై దృష్టి సారించే వ్యూహాన్ని సూచిస్తుంది. అధిక సంఖ్యలో పైలట్లను కేటాయించడం వల్ల కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతినివ్వడం, డ్యూటీ పరిమితులను సులభంగా పాటించడం సాధ్యమవుతుంది. ఫలితంగా, నిబంధనల మార్పును ఎయిరిండియా సమర్థవంతంగా అధిగమించగలిగింది.మరోవైపు ఇండిగో ఒక్కో విమానానికి కేవలం 2.5 మంది పైలట్ల నిష్పత్తిని మాత్రమే కలిగి ఉంది. ఇది తక్కువ ఖర్చుతో గరిష్టంగా విమానాలను ఉపయోగించాలనే ‘లీన్ మ్యాన్‌పవర్’(Lean Manpower) వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఇండిగో ఈ తక్కువ నిష్పత్తి ఆపరేషనల్ వైఫల్యానికి దారితీసింది. విశ్రాంతికి వెళ్లాల్సిన పైలట్లను భర్తీ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీలో ప్రకటనలు..?

employees have right to disconnect from work calls after office hours check details3
పనివేళల తర్వాత నో కాల్స్‌.. నో ఈమెయిల్స్‌

డిజిటల్ యుగంలో వర్క్‌-లైఫ్‌ సమతుల్యత తీవ్రంగా ప్రభావితమవుతోందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసు పనివేళల తర్వాత పని సంబంధిత కాల్స్, ఈమెయిల్స్ లేదా ఇతర కమ్యూనికేషన్ల నుంచి దూరంగా ఉండే హక్కును కల్పించే ఒక ముఖ్యమైన ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే ఈ ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పని భారం పెరిగి, వ్యక్తిగత సమయం కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కాపాడటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025పనివేళలు ముగిసిన తర్వాత, అలాగే సెలవు దినాల్లో పని సంబంధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు (కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్‌లు) స్పందించకుండా ఉండే చట్టబద్ధమైన హక్కును ఉద్యోగులకు కల్పించడం దీని ఉద్దేశం. ఈ హక్కును వినియోగించుకున్నందుకుగాను ఉద్యోగిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేదా ప్రతికూల శిక్షలు ఉండకుండా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.ఈ బిల్లు ఉద్యోగుల సంక్షేమ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 10 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు పనివేళల తర్వాత కమ్యూనికేషన్ నిబంధనలపై ఉద్యోగులతో చర్చలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై జరిమానా (ఉద్యోగుల మొత్తం వేతనంలో 1% వరకు) విధించడం వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి.ప్రైవేట్ మెంబర్ బిల్లు మాత్రమే..ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు. కేంద్ర మంత్రులు కాకుండా సాధారణ పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టే ఈ బిల్లులు చట్టాలుగా మారడం భారతదేశంలో చాలా అరుదు. అయినప్పటికీ, ఇది ఉద్యోగుల వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ‘యూరప్‌ కంటే మనం చాలా నయం’

Railways Minister stated Indian Railways punctuality has now reached better4
‘యూరప్‌ కంటే మనం చాలా నయం’

భారతీయ రైల్వేల సమయపాలన (పంచువాలిటీ) 80 శాతానికి పెరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇది అనేక యూరోపియన్ దేశాల కంటే మెరుగ్గా ఉందన్నారు. మెరుగైన నిర్వహణ పద్ధతులు, క్రమబద్ధమైన కార్యాచరణ నవీకరణలే ఈ ప్రగతికి కారణమని చెప్పారు.ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిస్తూ మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని అనేక రైల్వే డివిజన్లు ఇప్పటికే 90 శాతం సమయపాలన మార్కును దాటాయని తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో రైల్వే శాఖ అమలు చేసిన నిర్వహణ పద్ధతులు, క్రమబద్ధమైన కార్యాచరణల ప్రభావమే ఈ విజయానికి ప్రధాన కారణమని హైలైట్ చేశారు.‘రైల్వేల మొత్తం సమయపాలన 80 శాతానికి చేరుకుంది. ఇది ఒక ముఖ్యమైన విజయం. 70 రైల్వే డివిజన్లలో సమయపాలన 90 శాతానికి పైగా ఉంది. అనేక యూరోపియన్ దేశాల కంటే భారతీయ రైల్వేలు సమయపాలనలో మెరుగ్గా ఉన్నాయి’ అని మంత్రి సభకు తెలియజేశారు.మెరుగైన సమయపాలనకు కారణాలు..ఇటీవలి సంవత్సరాల్లో రైల్వే ఆపరేషన్లను పర్యవేక్షించడం, మెరుగ్గా నిర్వహించడంలో కొత్త, మరింత కఠినమైన పద్ధతులు అమలు చేశారు. ఈ పద్ధతులు లోపాలను గుర్తించడం, సరిదిద్దడం, రైళ్ల కదలికలను మరింత సమర్థవంతంగా సమన్వయం చేయడంలో సహాయపడ్డాయి.రైల్వే మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో క్రమం తప్పకుండా చేసిన అప్‌గ్రేడ్‌లు రైళ్ల ఆలస్యాన్ని తగ్గించడానికి తోడ్పడ్డాయి. సిగ్నలింగ్ వ్యవస్థల మెరుగుదల, ట్రాక్ మెయింటెనెన్స్ అప్‌డేట్లు సమయపాలనను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి.ఉత్తరప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులుఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టుల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రక చర్య అని వైష్ణవ్ అన్నారు. 2014కు ముందు కేవలం రూ.100 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారని, అది నేడు అనేక రెట్లు పెరిగిందని నొక్కి చెప్పారు. చారిత్రక సాంస్కృతిక సంబంధాలు ఉన్న యూపీలోని బల్లియా స్టేషన్ నుంచి ప్రస్తుతం 82 రైలు సర్వీసులను నడుపుతున్నట్లు సభకు తెలియజేశారు.రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. భద్రత ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఈ నిర్మాణాలపై ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. అభివృద్ధికి వేగవంతమైన అనుమతులను నిర్ధారించడానికి ప్రత్యేకంగా ఓవర్ బ్రిడ్జిల కోసం 100 కి పైగా డిజైన్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీలో ప్రకటనలు..?

OpenAI officially denied rumors testing advertisements ChatGPT5
చాట్‌జీపీటీలో ప్రకటనలు..?

ఓపెన్‌ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో ఓపెన్‌ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్‌జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.ఇటీవలి వారాల్లో చాట్‌జీపీటీ సంభాషణల్లో యాడ్‌ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్‌లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్‌జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్‌లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్‌లు నిజమైనవి కావు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్‌🚨 OpenAI has denied the rumors of testing advertisements inside its popular AI chatbot, ChatGPT. pic.twitter.com/vbs3vH8krz— Indian Tech & Infra (@IndianTechGuide) December 7, 2025

Telangana govt US Consulate General in Hyderabad renamed Donald Trump Avenue6
హైదరాబాద్ రోడ్లకు ట్రంప్, రతన్ టాటా, గూగుల్ పేర్లు

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రముఖ ప్రపంచ నాయకుల గౌరవార్థం హైదరాబాద్‌లోని కీలక రహదారులకు వారి పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ ద్వారా తెలియజేయనుంది.గ్లోబల్‌గా గుర్తింపు కోసం..రాష్ట్రాన్ని ఆవిష్కరణలతో నడిచే భారతదేశానికి చిహ్నంగా నిలబెట్టే విస్తృత వ్యూహంలో ఈ నామకరణ ప్రతిపాదనలు ఒక భాగమని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ముఖ్యమైన రోడ్లకు ప్రముఖ గ్లోబల్ కార్పొరేషన్ల పేర్లు పెట్టాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు..డొనాల్డ్ ట్రంప్ అవెన్యూతో పాటు మరికొందరు ప్రముఖ వ్యక్తులు, కార్పొరేషన్ల గౌరవార్థం ఇతర రోడ్లకు కూడా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం నగరంలోని రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును కలిపే రాబోయే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తన పేరు పెట్టాలని నిర్ణయించింది.గూగుల్ స్ట్రీట్హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయడాన్ని గుర్తించి ఈ లేన్‌ను గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్‌

Advertisement
Advertisement
Advertisement