Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Oppo Reno15 Series Phones1
ఒప్పో రెనో15 సిరీస్‌ ఫోన్లు: ధరలు ఇలా..

స్మార్ట్‌ఫోన్స్‌ దిగ్గజం ఒప్పో ఇండియా తాజాగా ప్రీమియం రెనో15 సిరీస్‌ ఫోన్లను ప్రవేశపెట్టింది. రెనో15 ప్రో మినీ, ప్రో, రెనో 15 పేరిట మూడు వేరియంట్లలో ఇవి లభిస్తాయి. ట్రావెల్‌ ఫొటోగ్రఫీకి మరింత ఉపయోగకరంగా ఉండేలా ప్రో, ప్రో మినీల్లో 20 ఎంపీ కెమెరా, ప్యూర్‌టోన్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, ఏఐఎడిటింగ్‌ టూల్స్‌ మొదలైన ఫీచర్స్‌ ఉంటాయి.పరిశ్రమలోనే తొలిసారిగా హోలోఫ్యూజన్‌ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. వేరియంట్‌ని బట్టి ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒప్పో ప్యాడ్‌5 (రేటు రూ. 26,999 నుంచి ప్రారంభం), ఎన్‌కో బడ్స్‌3 ప్రో+ని (ధర రూ. 2,499) కూడా కంపెనీ ఆవిష్కరించింది.

Reasons For The Stock Market Crash2
స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే!

దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్‌లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్‌లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్‌లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు!

Stock Market Closing Update 20th January 20253
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల సంపద ఆవిరి!

మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. ఆర్తి సర్ఫ్యాక్టెంట్స్ లిమిటెడ్, పటేల్ రిటైల్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, అంజని పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ రసయాన్ లిమిటెడ్, ఆల్మండ్జ్ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

BIS introduced new rules for diamond clarity and terminology4
సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు

వజ్రాల కొనుగోలులో వినియోగదారులు ఎదుర్కొంటున్న గందరగోళానికి తెరదించుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘డైమండ్’ అనే పదాన్ని కేవలం సహజ సిద్ధంగా లభించే వజ్రాలకే ఉపయోగించాలని స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, మార్కెట్‌లో పారదర్శకతను పెంచేందుకు బీఐఎస్‌ తాజాగా IS 19469:2025 అనే కొత్త ప్రమాణాన్ని ఆమోదించింది. ఇది అంతర్జాతీయ ప్రమాణమైన ISO 18323:2015 (జ్యువెల్లరీ: డైమండ్ పరిశ్రమలో వినియోగదారుల విశ్వాసం)కు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది.కొత్త మార్గదర్శకాల్లోని అంశాలుభూగర్భంలో సహజంగా ఏర్పడిన వజ్రాలను మాత్రమే ‘డైమండ్’గా పరిగణిస్తారు. విక్రేతలు వీటిని మరింత స్పష్టంగా చెప్పాలనుకుంటే ‘నేచురల్’, ‘రియల్’, ‘జెన్యూన్’ లేదా ‘‍ప్రీషస్’ వంటి విశేషణాలను జోడించవచ్చు. ప్రయోగశాలల్లో కృత్రిమంగా తయారుచేసే వజ్రాల విషయంలో విక్రేతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని విక్రయించేటప్పుడు కచ్చితంగా ‘laboratory-grown diamond’ లేదా ‘laboratory-created diamond’ అనే పూర్తి పదాలను వాడాలి. ఇకపై ల్యాబ్ వజ్రాల కోసం LGD, lab-grown, lab-diamond వంటి షార్ట్ కట్ పేర్లను వాడటం నిషిద్ధం.ల్యాబ్ వజ్రాలను విక్రయించేటప్పుడు ‘నేచర్స్’, ‘ప్యూర్’, ‘ఎర్త్-ఫ్రెండ్లీ’ లేదా ‘కల్చర్డ్’ వంటి పదాలను ఉపయోగించకూడదని బీఐఎస్‌ ఆదేశించింది. కేవలం బ్రాండ్ పేరుతో వీటిని విక్రయించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.పరిశ్రమ వర్గాల స్పందనబీఐఎస్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యాచురల్ డైమండ్ కౌన్సిల్ (NDC) స్వాగతించింది. ఎన్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ రిచా సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ కొత్త ప్రమాణాలు వినియోగదారులకు ఎంతో కాలంగా అవసరమైన స్పష్టతను ఇస్తాయి. సహజ వజ్రాల విశిష్టతను ఇవి కాపాడతాయి’ అని పేర్కొన్నారు. అటు జ్యువెల్లరీ వ్యాపారులు కూడా ఈ మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైమండ్ పదజాలంలో అయోమయం తొలగించడం వల్ల పరిశ్రమ మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..

Toyota Urban Cruiser Ebella Unveiled in India5
టయోటా తొలి ఎలక్ట్రిక్ కారు.. 543 కిమీ రేంజ్!

టయోటా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'ను అధికారికంగా ఆవిష్కరించింది. దీనిని ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఈవిటారా ఆధారంగా రూపొందించారు. కాబట్టి డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటివన్నీ కూడా.. దాదాపు విటారాలో ఉన్నట్లుగానే ఉన్నాయి.టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా బాడీ షెల్‌ ఈవిటారా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఒక ప్రత్యేకమైన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో సొగసైన హెడ్‌ల్యాంప్‌లు, విభిన్నమైన ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంది. ఇది ఈవిటారా లాగా లైట్ బార్ ద్వారా కనెక్టెడ్ ఎల్ షేప్ టెయిల్‌లైట్‌లను పొందుతుంది.లోపల భాగంలో అర్బన్ క్రూయిజర్ ఈవీ.. ఈవిటారాలో మాదిరిగానే అదే డాష్‌బోర్డ్‌ను పొందుతుంది. ఇది డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్‌ను కలిగి ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీటు, సన్‌రూఫ్, జేబీఎల్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.భారతదేశంలో, అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా రెండు బ్యాటరీ ఎంపికలతో (49 kWh & 61 kWh) లభిస్తుంది. 49 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 142 bhp & 189 Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటారును.. 61 కిలోవాట్ బ్యాటరీ 172 bhp & 189 Nm టార్క్ అందించే మరింత శక్తివంతమైన మోటారుతో వస్తుంది. పెద్ద బ్యాటరీ 543 కిమీ వరకు ప్రయాణించగలదని సమాచారం.ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా 5 మోనోటోన్ (కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్) కలర్స్, 4 డ్యూయల్-టోన్ కలర్ (కేఫ్ వైట్/బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్/బ్లాక్ రూఫ్, స్పోర్టిన్ రెడ్/బ్లాక్ రూఫ్ & ఎంటైసింగ్ సిల్వర్/బ్లాక్ రూఫ్) ఎంపికలలో లభిస్తుంది. కాగా కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది.

Indian Railways revamping Amrit Bharat Express from January 20266
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రైలు ప్రయాణంలో మార్పులు!

భారతీయ రైల్వే సామాన్య ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను చేరువ చేస్తూ తీసుకువచ్చిన ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ సేవల్లో కీలక మార్పులు చేసింది. అమృత్‌ భారత్ రైళ్లలో టికెట్ బుకింగ్ విధానం, ఛార్జీల నిర్మాణం, రిజర్వేషన్ నిబంధనల్లో కొత్త మార్పులు అమలులోకి తీసుకొచ్చింది.ఆర్‌ఏసీ విధానానికి స్వస్తిఅమృత్ భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రైళ్లలో ఆర్‌ఏసీ విధానం ఉండదు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో అది నేరుగా కన్ఫర్మ్ అవుతుంది లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. దీనివల్ల సీటు షేర్ చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రయాణం మరింత సుఖమయంగా ఉంటుంది. అయితే, రద్దీ సమయాల్లో ప్రయాణించే అవకాశం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.ఛార్జీలు ఇవే..రైల్వే ఆదాయం, సర్వీసుల నాణ్యతను సమతుల్యం చేస్తూ కనీస ఛార్జీలను నిర్ణయించింది. కనీసం 200 కిలోమీటర్ల దూరానికి టికెట్ ఛార్జీ వసూలు చేస్తారు. దీని బేసిక్ ఛార్జీ రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. సెకండ్ క్లాస్ (అన్‌రిజర్వ్డ్) కేటగిరీలో కనీసం 50 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ వసూలు చేస్తారు. దీని ప్రారంభ ధర రూ.36. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.అమృత్ భారత్ vs వందే భారత్.. ప్రధాన వ్యత్యాసాలుఅమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌సామాన్యులకు తక్కువ ధరలో ప్రయాణంప్రీమియం, వేగవంతమైన ప్రయాణంనాన్-ఏసీ(స్లీపర్, సెకండ్ క్లాస్)పూర్తిగా ఏసీ (చైర్ కార్, స్లీపర్)ఆర్‌ఏసీ లేదు (కన్ఫర్మ్ లేదా వెయిటింగ్)కేవలం కన్ఫర్మ్ టికెట్లుమెరుగైన బెర్త్‌లుఆటోమేటిక్ డోర్లు, వై-ఫై, క్యాటరింగ్ దేశవ్యాప్తంగా కొత్త మార్గాలుకనెక్టివిటీని పెంచే లక్ష్యంతో రైల్వే శాఖ మరో 9 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ప్రధానంగా ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.కామాఖ్య - రోహ్‌తక్: అస్సాం నుంచి హర్యానా వరకు.దిబ్రూగఢ్ - లఖ్‌నవూ: యూపీ, అస్సాం మధ్య.సంత్రాగాచి - తాంబరం: కోల్‌కతా, చెన్నై మధ్య.హౌరా - ఆనంద్ విహార్ (ఢిల్లీ): కోల్‌కతా నుంచి ఢిల్లీ. ఇవేకాక ఇతర ప్రాంతాల్లోనూ ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement