Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Expands PLI Scheme to MMF Technical Textiles Footwear Industry1
టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు

టెక్స్‌టైల్స్‌ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.10,683 కోట్లతో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్‌ఐ) పరిధిలోకి మ్యాన్‌ మేడ్‌ వ్రస్తాలు (ఎంఎంఎఫ్‌), ఫ్యాబ్రిక్స్, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌నూ చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే తాజా పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, టెక్స్‌టైల్స్‌రంగంలో వృద్ధి వేగం అందుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఫుట్‌వేర్‌ పరిశ్రమల ప్రతినిధులు తనను కలసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముడి సరకుల లభ్యత, నాణ్యత సమస్యలను పాదరక్షల పరిశ్రమల ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గత 12 ఏళ్లలో దేశంలో కొనుగోలు శక్తికి అనుగుణంగా పాదరక్షల వినియోగం పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. యూఎస్‌లో ఒక్కో వ్యక్తి 7 జతల పాదరక్షలు వినియోగిస్తుంటే, చైనాలో 3.3 జతలుగా ఉందని.. భారత్‌లోనూ 3 జతలకు చేరినట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

India Cuts Airport Fees by 25% for Airlines Iran War2
విమానయాన రంగానికి భారీ ఊరట

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానశ్రయాలలో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 3 నెలల పాటు 25 శాతం తగ్గిస్తూ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.రంగంలోకి ఏఈఆర్‌ఏకేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఈఆర్‌ఏ ఈ తాత్కాలిక తగ్గింపును తక్షణమే అమలులోకి తెచ్చింది. రాబోయే మూడు నెలల వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఛార్జీల తగ్గింపు వల్ల విమానాశ్రయాలకు కలిగే ఆదాయ లోటును భవిష్యత్తులో చేపట్టే టారిఫ్ సమీక్షల ద్వారా సర్దుబాటు చేస్తామని రెగ్యులేటర్ ఏఈఆర్‌ఏ చేసింది.దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాశ్రయ రుసుములను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ సంస్థలు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్ గగనతలంపై నిషేధం ఉండటంతో భారత విమానాలు ఇప్పటికే చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ‘ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు ఇంధనం, సిబ్బంది వేతనాల తర్వాత విమానాశ్రయ, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఛార్జీలే అధిక ఖర్చులుగా ఉన్నాయి’ అని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలిపింది.మరోవైపు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు విమానయాన రంగ షేర్లకు ఊపునిచ్చాయి. ఇరాన్‌తో అమెరికా రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన వార్తలతో బుధవారం ట్రేడింగ్‌లో ఇండిగో షేర్లు లాభపడ్డాయి. యుద్ధం సద్దుమణిగితే ఇంధన ధరలు దిగివస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్లు విమానయాన రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

RBI Keeps Repo Rate Unchanged at 5.25% in First Policy Review of FY 2026-273
యథాతథంగా కీలక వడ్డీరేట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్‌ 6 నుంచి 8 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది మొదటి విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.2025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. గడిచిన సమావేశంతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 100 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఇన్‌ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా?

Gold and Silver rates on 08 April 2026 in Telugu states4
మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 08 April 20265
బుల్‌రన్‌.. 2600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 761 పాయింట్లు పెరిగి 23,890 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 2602 పాయింట్లు ఎగబాకి 77,198 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.9బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 94 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.08 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 08-04-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Iran Linked Hackers Target US Critical Infrastructure6
అమెరికా ఇన్‌ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా?

అగ్రరాజ్యం అమెరికాలోని కీలక మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అనుబంధ హ్యాకింగ్ గ్రూపులు భారీ సైబర్ దాడులకు తెగబడుతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సరఫరా అయ్యే నీరు, ఇంధన వ్యవస్థలను నియంత్రించే సాఫ్ట్‌వేర్‌లలోని లొసుగులను వాడుకుని ఈ కీలక వ్యవస్థలను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అగ్రరాజ్య నిఘా వర్గాలు హెచ్చరించాయి.సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్‌ఏ) నేతృత్వంలో ఎఫ్‌బీఐ (ఎఫ్‌బీఐ), నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) సహా పలు ఫెడరల్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ మేరకు ఇటీవల ఒక అత్యవసర భద్రతా సలహా (అడ్వైజరీ) జారీ చేశాయి.రంగంలోకి 'అడ్వాన్స్‌డ్ పర్సిస్టెంట్ థ్రెట్'ఈ దాడుల వెనుక ఇరాన్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న అడ్వాన్స్‌డ్ పర్సిస్టెంట్ థ్రెట్ (ఏపీటీ) సభ్యులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ హ్యాకర్లు ప్రధానంగా పారిశ్రామిక కంప్యూటర్లైన ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లను (పీఎల్‌సీ) లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇవి నీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ గ్రిడ్‌లు, ఇంధన సరఫరా కేంద్రాల్లో యంత్రాలను నియంత్రించడానికి వాడే అత్యంత కీలకమైన పరికరాలు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ రాక్‌వెల్ ఆటోమేషన్ అభివృద్ధి చేసిన పీఎల్‌సీలను ఈ హ్యాకర్లు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇతర కంపెనీల పరికరాలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీలు హెచ్చరించాయి.దాడుల వెనుక భౌగోళిక రాజకీయ కారణాలు?గతంలో 2023లో పెన్సిల్వేనియాలోని నీటి శుద్ధి కేంద్రాలపై ఇరాన్ అనుబంధ ‘సైబర్ ఏవీ3ఎన్గర్స్’ గ్రూప్ జరిపిన దాడుల తరహాలోనే ప్రస్తుత దాడులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)తో ఈ హ్యాకర్లకు సంబంధాలు ఉన్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ తయారు చేసిన పరికరాలను వాడుతున్న అమెరికా సంస్థలను ఇరాన్ హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాల పట్ల ఇరాన్‌ ఈ సైబర్ యుద్ధం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ వార్తలు వెలుగులోకి వచ్చాక ఈరోజు ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో చేస్తున్న యుద్ధాన్ని రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య చర్చలు సఫలం అయితే ఇకపై యుద్ధం ఉండబోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్‌!

Advertisement
Advertisement
Advertisement