Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Key Directives from DGCA regarding Chief of Flight Safety1
‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్‌ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి

దేశీయ విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, పునరావృతమవుతున్న భద్రతా పరమైన ఇబ్బందులను అరికట్టేందుకు అన్ని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు ఇకపై తప్పనిసరిగా ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ని నియమించాలని ఆదేశించింది.ప్రత్యేక భద్రతా విభాగం ఏర్పాటుప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం (రియాక్టివ్) కంటే, అవి జరగకముందే నివారించే (ప్రోఆక్టివ్) వ్యూహాన్ని అనుసరించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా నిపుణులైన సిబ్బందితో కూడిన ప్రత్యేక ‘విమాన భద్రతా విభాగం’ను ప్రతి ఆపరేటర్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రమాదాల నివారణ కార్యక్రమాలను ఈ విభాగం నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.కీలక బాధ్యతల్లో నిపుణులుభద్రతా పర్యవేక్షణ కోసం డీజీసీఏ ఒక నిబంధనను విధించింది. దీని ప్రకారం ‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం కూడా తప్పనిసరి చేసింది. ఒకవేళ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి పైలట్ అయితే డిప్యూటీ చీఫ్ హోదాలో తప్పనిసరిగా ఇంజినీర్ ఉండాలని తెలిపింది. ఒకవేళ చీఫ్ స్థానంలో ఇంజినీర్ ఉంటే, డిప్యూటీ చీఫ్ హోదాలో పైలట్ ఉండాలని పేర్కొంది. ఈ విధానం వల్ల విమాన నిర్వహణ (Maintenance), ఆపరేషన్స్ (Operations) మధ్య సమన్వయం పెరుగుతుందని డీజీసీఏ భావిస్తోంది.లోపాలపై ఆందోళనవిమాన ప్రమాదాలపై జరుగుతున్న పరిశోధనల్లో ప్రతిసారీ కొన్ని లోపాలు (Systemic flaws) బయటపడుతున్నాయని డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం లభించదని, సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (SMS)ను పటిష్టం చేయడం ద్వారానే అత్యున్నత భద్రత సాధ్యమని పేర్కొంది. ఈ కొత్త ఆదేశాలు కేవలం ప్యాసింజర్ విమానాలకే పరిమితం కాకుండా కింది విభాగాలన్నింటికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.1. షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు.2. కార్గో (సరుకు రవాణా) సర్వీసులు.3. నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు.సిబ్బంది సంక్షేమం - భద్రతా ఆడిట్లువిమానయానంలో మానవ తప్పిదాలను తగ్గించేందుకు సిబ్బంది అలసట (Fatigue)పై దృష్టి సారించాలని డీజీసీఏ ఆదేశించింది. పైలట్లు, ఇతర సిబ్బంది విమాన ప్రయాణ సమయాలు మించకుండా చూడాలని స్పష్టం చేసింది. గ్రౌండ్ సపోర్ట్, నిర్వహణ విభాగాల్లో ఎప్పటికప్పుడు అంతర్గత భద్రతా ఆడిట్లు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది.ఇదీ చదవండి: ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు

Gold and Silver rates on 21st January 2026 in Telugu states2
ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 21st january 20263
మార్కెట్‌ క్రాష్‌ ఈరోజూ కొనసాగుతుందా?

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు తగ్గి 25,242 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 82,127 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో సూచీలు దారుణంగా పడిపోయాయి.నిన్నటి స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్‌లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్‌లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్‌లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.Today Nifty position 21-01-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

recognition of gig workers to beginnings of protection by social security4
గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రతే లక్ష్యంగా ముందడుగు

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని సంస్కృతికి అనుగుణంగా భారతదేశంలో గిగ్‌ (Gig), ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్ ఉపాధి రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కేవలం పార్ట్-టైమ్ ఆదాయ వనరుగా మొదలైన ఈ రంగం, నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైంది. ఈ నేపథ్యంలో గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం, నిపుణులు ప్రతిపాదిస్తున్న నూతన విధానాలపై కథనం.నీతి ఆయోగ్ అంచనాలునీతి ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం, గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో నైపుణ్యాల విభజన ఆసక్తికరంగా ఉంది.మధ్యస్థ నైపుణ్యాలు: 47%అధిక నైపుణ్యాలు: 22%తక్కువ నైపుణ్యాలు: 31%భవిష్యత్తులో అధిక, తక్కువ నైపుణ్యాలు కలిగిన గిగ్ ఉద్యోగాల వాటా మరింత పెరుగుతుందని అంచనా. ఈ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘సామాజిక భద్రతా కోడ్-2020’ గిగ్ కార్మికులను ప్రత్యేక వర్గంగా గుర్తించింది. ఇది వారి ఆదాయం, కెరీర్ మార్గాలకు తగిన రక్షణ కల్పించేందుకు పునాది వేసింది.మౌలిక వసతులుగిగ్ కార్మికుల కోసం కొత్తగా వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న డిజిటల్ మౌలిక వసతులను వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 31.38 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు నమోదయ్యారు. ఆధార్‌తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) నంబర్ ద్వారా కార్మికులు తమ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్ లేదా రాష్ట్రాలు మారినా వారిని ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఈ-శ్రమ్ గుర్తింపును సామాజిక భద్రతా సంస్థలతో అనుసంధానిస్తే కార్మికులు తాత్కాలిక లేదా శాశ్వత ఉద్యోగాల్లోకి మారినా రక్షణ వ్యవస్థ కొనసాగుతుంది.ఆర్థిక వృద్ధి, బీమా రక్షణకొన్ని సంస్థల గణాంకాల ప్రకారం, 2021-22 నుంచి 2023-24 మధ్య ఆహార డెలివరీ రంగం చాలా వృద్ధిని సాధించింది. ఇది సుమారు 13.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం స్థూల ఉత్పత్తి విలువ రూ.1.2 లక్షల కోట్లను దాటింది. ఈ వృద్ధిని సామాజిక భద్రతతో ముడిపెట్టడానికి బీమా రక్షణ ఉత్తమ మార్గమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ సభ్యులకు అందుతున్న ఈడీఎల్‌ఐ (రూ.7 లక్షల వరకు జీవిత బీమా) పథకాన్ని గిగ్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల సిబ్బంది ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే కుటుంబానికి భరోసా లభిస్తుంది.చిన్న మొత్తాల్లో కట్‌ అయ్యేలా..గిగ్ కార్మికులకు స్థిర వేతనం ఉండదు కాబట్టి, ప్రతి రైడ్ లేదా డెలివరీ పూర్తయినప్పుడు చిన్న మొత్తాన్ని (Micro-contribution) ఆటోమేటిక్‌గా కట్ అయ్యే లావాదేవీ ఆధారిత విధానం వీరికి అత్యంత అనుకూలమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు

Gold & Silver Rates Continue Record-Breaking Rally5
రికార్డు స్థాయికి బంగారం ధర..

నిజామాబాద్‌ రూరల్‌: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,200 ఉండగా, మంగళవారం రూ.1,50,800లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.3.17 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు దాటే అవకాశం ఉందని నగరానికి చెందిన ఆభరణాల తయారీదారు సీహెచ్‌.భూషణ్‌చారి ‘సాక్షి’తో తెలిపారు.

IT discretionary spending rebounding globally and in India6
ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు

సుదీర్ఘ కాలం పాటు మందగమనంలో ఉన్న ఐటీ రంగంలో డిస్క్రెషనరీ టెక్నాలజీ ఖర్చులు (ఐచ్చికంగా ఆలోచించి అవసరాలకు మాత్రమే చేసే ఖర్చు) మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, గ్లోబల్ టెక్ కంపెనీలు ఇప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం అదనపు నిధులను వెచ్చించే కంటే అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా నిధులను మళ్లించడంపైనే సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.అంతర్గత పొదుపుతోనే కొత్త ప్రాజెక్టులుఎవరెస్ట్ గ్రూప్ సీఈఓ జిమిత్ అరోరా విశ్లేషణ ప్రకారం, ప్రతి రంగంలోని క్లయింట్లు తాము పూర్తిస్థాయి టెక్నాలజీ కంపెనీలుగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అయితే, టెక్నాలజీ బడ్జెట్ల వృద్ధి కేవలం తక్కువగానే (లో-టు-మిడ్ సింగిల్ డిజిట్) ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ కొత్త పెట్టుబడుల ద్వారా కాకుండా రోజువారీ కార్యకలాపాల (బిజినెస్ యాజ్ యూజువల్ - BAU) ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా జరుగుతోంది. ఖర్చులను కుదించి ఆ నిధులను అత్యాధునిక సాంకేతికత వైపు మళ్లించడంపైనే కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.ఏఐ డీల్స్‌తో జోష్ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలిల్ పరేఖ్ క్యూ3 ఫలితాల సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, యుటిలిటీస్ రంగాల్లో డిస్క్రెషనరీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీల్స్‌పై క్లయింట్లు ఆసక్తి చూపడం ఐటీ రంగానికి కలిసొస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, స్థిరమైన డిమాండ్ వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంపై ఆశలు పెరుగుతున్నాయి.అప్రమత్తత అవసరం..పరిస్థితి మెరుగుపడుతున్నా అప్రమత్తత అవసరమని మార్కెట్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వేతనాల పెరుగుదల వంటి చట్టబద్ధమైన ఖర్చుల వల్ల మార్జిన్లపై ఒత్తిడి ఉండొచ్చని, అందుకే సంస్థలు నియంత్రణాత్మక వ్యయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పూర్తిస్థాయిలో డిస్క్రెషనరీ ఖర్చులు ఊపందుకుంటాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు

Advertisement
Advertisement
Advertisement