Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Kevin Warsh nominated by Donald Trump to next Chair Federal Reserve1
కెవిన్ వార్ష్ చేతికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉంటున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌ స్థానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. యూఎస్‌ సెంట్రల్ బ్యాంక్‌గా ఉన్న ‘ఫెడరల్ రిజర్వ్’ తదుపరి ఛైర్మన్‌గా మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం 2026 మే నెలలో ముగియనుంది. ఆ వెంటనే వార్ష్ బాధ్యతలు చేపడతారని ట్రంప్ వెల్లడించారు.అర్హతలే ప్రామాణికం..వార్ష్ ఎంపికను సమర్థిస్తూ ఆయన నేపథ్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడైన వార్ష్ గతంలో మోర్గాన్ స్టాన్లీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా 2006–2011 మధ్య కాలంలో ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో సభ్యుడిగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. జీ-20 సదస్సుల్లో అమెరికా ప్రతినిధిగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్థిక సంస్కరణల సలహాదారుగా ఆయనకున్న ట్రాక్ రికార్డును ట్రంప్ హైలైట్ చేశారు. వార్ష్‌ను ‘యూఎస్‌ పరిపాలన విభాగంలో ఇట్టే ఇమిడిపోయే అద్భుతమైన అభ్యర్థి’గా ట్రంప్ అభివర్ణించారు.మార్కెట్ల స్పందనట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి కనిపించింది. అక్కడి మార్కెట్‌ సూచీలైన డౌ జోన్స్, నాస్‌డాక్, ఎస్‌ అండ్‌ పీ 500 పతనమయ్యాయి. వార్ష్ గతంలో ‘ఇన్‌ఫ్లేషన్ హాక్’(ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి)గా పేరు పొందడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.స్వతంత్రతపై ప్రశ్నలు.. సెనెట్ ఆమోదం బాకీవార్ష్ ఎంపికపై ఆర్థిక వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు ట్రంప్ తక్కువ వడ్డీ రేట్లను ఆశిస్తుండగా వార్ష్ దానికి అనుగుణంగా నడుచుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉందని కొందరు రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెవిన్ వార్ష్ నియామకం ఇప్పుడు అమెరికా సెనెట్ ఆమోదానికి వెళ్లనుంది. అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సెనెట్ ఆమోదం లభిస్తేనే మే 2026 నుంచి ఫెడ్‌ నిర్వహణ బాధ్యతులు వార్ష్ చేతుల్లోకి వెళ్తుంది.ట్రంప్‌ చిరకాల మిత్రుడి అల్లుడే వార్ష్‌కెవిన్ వార్ష్ భార్య జైన్ లాడర్ ప్రపంచ ప్రసిద్ధ కాస్మెటిక్స్ సంస్థ అయిన ‘ఎస్టే లాడర్’ వ్యవస్థాపకురాలు ఎస్టే లాడర్ మనవరాలు. ఆమె ఒక బిలియనీర్, వ్యాపారవేత్త. జైన్.. రోనాల్డ్ లాడర్ కుమార్తె. రోనాల్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చిరకాల మిత్రుడు, మద్దతుదారుగా ఉన్నారు. జైన్ లాడర్ 1996లో తన కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె ఎస్టే లాడర్ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డేటా ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆమె నికర ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.22,000 కోట్లకు పైగా). కెవిన్ వార్ష్, జైన్ లాడర్‌కు మధ్య స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పరిచయం ఏర్పడింది. వారు 2002లో వివాహం చేసుకున్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

Key Points from Kumar Mangalam Birla Latest Reflections on india growth2
చైనా, భారత్‌ నడిపిస్తాయ్‌

రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ కీలకంగా మారుతుందని ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా భారత్‌ స్థానం మరింత బలోపేతం కావడం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ తీరుతెన్నులను మార్చివేయనుందని చెప్పారు. ఈ దశాబ్దం చివరికి అంతర్జాతీయ తయారీ అన్నది ఏ ఒక్క దేశం చుట్టూ కేంద్రీకృతం కాదంటూ.. భారత్, చైనా కీలకంగా వ్యవహరిస్తాయన్నారు. ఐసీఏఐ వరల్డ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.ప్రపంచ సరఫరా వ్యవస్థలు అస్థిరంగా ఉన్నాయంటూ.. టారిఫ్‌లు పెంచడం కారణంగా 400 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంలో మార్పులు చోటుచేసుకున్నాయన్న ప్రపంచ ఆర్థిక వేదిక డేటాను ప్రస్తావించారు. తయారీపై పెట్టుబడులు అన్నవి ఇప్పుడు షాక్‌లను తట్టుకోగల, రిస్క్‌లను సమర్థంగా నిర్వహించగల, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థల్లోకే వెళుతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో భారత్‌ సుముచిత స్థానంలో ఉన్నట్టు బిర్లా చెప్పారు. దేశీ మార్కెట్‌ విస్తరణకుతోడు పారిశ్రామిక బేస్, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం దీర్ఘకాల పెట్టుబడులకు నమ్మకాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి తగ్గే సమయానికి.. అదనపు శ్రామిక శక్తిలో భారత్‌ పావు వంతు వాటా కలిగి ఉంటుందన్నారు.భారత్‌లో 3 టెలికం సంస్థలు ఉండాల్సిందే..సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)కు సంబంధించి ఇటీవల వెలువడిన పరిష్కారం వొడాఫోన్‌ ఐడియాకి నిర్ణయాత్మక ములుపు వంటిదని కుమారమంగళం బిర్లా అన్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు, ప్రభుత్వ జోక్యంతో దీర్ఘకాలంపాటు నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు. మనుగడ కోసం కాకుండా ఇకపై స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టేందుకు అవకాశం కల్పించిందన్నారు. వొడాఫోన్‌ ఐడియాకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ సైతం ఒక ప్రమోటర్‌ కావడం తెలిసిందే. భారత మార్కెట్‌కు మూడు టెలికం సంస్థలు ఉండడం సముచితమేనని కుమారమంగళం బిర్లా అన్నారు. అస్థిరమైన ప్రపంచంలో భారత వృద్ధి స్థిరమైన అంశంగా మారినట్టు చెప్పారు. భారత దేశ వృద్ధిలో తమ గ్రూప్‌ చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.‘‘భారత్‌ వృద్ధితోపాటే ఆదిత్య బిర్లా గ్రూప్‌ కూడా ఎదుగుతుంది. ఎన్నో రంగాల్లో భౌతిక, డిజిటల్‌ సంస్థాగత సామర్థ్యాన్ని నిర్మిస్తున్నాం. తద్వారా దేశంతో పాటుగా ఎదుగుతాం. దేశ పురోగతి నుంచి ప్రయోజనం పొందుతూనే, సుస్థిరతకు కూడా తోడ్పడతాం’’అని కుమారమంగళం బిర్లా పేర్కొన్నారు. ‘కష్టకాలాలు ఎప్పటికీ ఉండవు. కానీ, దృఢమైన కంపెనీలు శాశ్వతం’ అన్న తన నమ్మకాన్ని వొడాఫోన్‌ ఐడియా అనుభవం గుర్తు చేస్తున్నట్టు చెప్పారు. తమ జాయింట్‌ వెంచర్‌ వొడాఫోన్‌ ఐడియా టెలికం రంగ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు అనిశ్చితులు, సవాళ్లను ఎదుర్కొని నిలబడినట్టు పేర్కొన్నారు. ఎన్నో అనుకూలతలు..మూడు దశాబ్దాలుగా ప్రపంచ తయారీ కేవలం ఒక భౌగోళిక ప్రదేశం (చైనా)పైనే ఆధారపడి ఉండడాన్ని కుమార మంగళం బిర్లా ప్రస్తావించారు. ఆ నమూనా అసాధారణ ఫలితాలనిచ్చిదంటూ.. ఇకపై ఇదే విధానం కొనసాగబోదన్నారు. చైనా ప్లస్‌ వన్‌ నమూనా మరింత బలపడుతుందన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధితో లాజిస్టిక్స్‌ (రవాణా) వ్యయాలు తగ్గుతాయన్నారు. పట్టణాభివృద్ధితోపాటు తలసరి ఆదాయం 10,000 డాలర్లకు పెరగడం.. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ను బలమైన శక్తిగా ఇతర దేశాలు చూస్తాయన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

NBFC gold loan market is booming3
ఎన్‌బీఎఫ్‌సీ బంగారం రుణాలు పెరుగుదల

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నిర్వహణలోని బంగారం రుణ ఆస్తులు (గోల్డ్‌ లోన్‌ ఏయూఎం) 207 మార్చి నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య 40 శాతం వృద్ధి చెందనున్నట్టు పేర్కొంది. 2023 నుంచి 2025 మధ్య వార్షిక రుణ వృద్ధి 27 శాతం కంటే అధికమని తెలిపింది. బంగారం ధరలు గణనీయంగా పెరగడం వాటిపై రుణ వితరణను వృద్ధి చేయనున్నట్టు పేర్కొంది.‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో బంగారం ధరలు 68 శాతం పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరాయి. దీంతో బంగారం తనఖా విలువ పెరిగింది. రుణదాతలు మరింత మొత్తంలో రుణ పంపిణీకి అవకాశం ఏర్పడింది. అన్‌సెక్యూర్డ్‌ తదితర విభాగాల్లో రుణ లభ్యతకు పరిమిత అవకాశాల నేపథ్యంలో రుణ గ్రహీతలు.. ఇతర మార్గాల్లో రుణాలపై దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో బంగారం రుణ సేవల్లోని ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకుల నుంచి గట్టి పోటీ నెలకొన్నప్పటికీ తమ మార్కెట్‌ వాటాను విస్తరించుకుంటున్నాయి’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ తన నివేదికలో వివరించింది.బడా ఎన్‌బీఎఫ్‌సీల విస్తరణ..బంగారం రుణాల్లోని బడా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్రాండ్‌ గుర్తింపు ఉందని.. ఇవి తమ శాఖల వారీ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటున్నట్టు క్రిసిల్‌ రేటింగ్స్‌ డైర్టెర్‌ అపర్ణ కిరుబకరణ్‌ తెలిపారు. మధ్యస్థాయి ఎన్‌బీఎఫ్‌సీలు ఒకవైపు తమ శాఖలను విస్తరిస్తూనే.. మరోవైపు ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల తరఫున భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. తక్కువ స్థాయి బంగారం రుణాలకు అధిక రుణాన్నిచ్చే (ఎల్‌టీవీ) నిబంధనలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నందున.. రుణ వితరణకు ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత వెసులుబాటు లభిస్తుందన్నారు. కాకపోతే ఎన్‌బీఎఫ్‌సీలు రిస్క్‌ మదింపు, నిర్వహణ ప్రక్రియలపై కఠిన నియంత్రణ కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా బంగారం స్వచ్ఛత, బరువు, కచ్చితమైన విలువ మదింపు అవసరమన్నారు. శాఖల స్థాయిలో నిర్ణీత కాలానికోసారి ఆడిట్‌ చేపట్టడమూ అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

Key Highlights of Raghuram Rajan Latest Comments on FDI4
వృద్ధి జోరు..అయినా ఇన్వెస్టర్లు పరార్‌

దేశీయంగా ప్రైవేట్‌ పెట్టుబడులు గణనీయంగా పెరిగితేనే భారత్‌ ఆశించిన స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం సాధ్యపడుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పారు. కార్పొరేట్‌ రంగం నిలకడగా పెట్టుబడులు పెంచడం దేశీయంగా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. 50 శాతం టారిఫ్‌ల భారంతో అమెరికా–భారత్‌ బంధంపై అనిశ్చితి నెలకొనడం కూడా పెట్టుబడుల రాకకు కొంత ప్రతిబంధకంగా ఉండొచ్చని చెప్పారు. అది తొలగిపోతే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో చురుగ్గా పాలుపంచుకునేందుకు వీలవుతుందని, భారత్‌కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.గత కొన్నాళ్లుగా భారత మార్కెట్‌ కొంత పటిష్టంగా మారిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న భారత్‌ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న చిత్రమైన పరిస్థితిపై స్పందిస్తూ, ‘‘ప్రైవేట్‌ రంగం కూడా పెట్టుబడులు పెడుతుంటే ఎఫ్‌డీఐలు వస్తాయి. కానీ ప్రైవేట్‌ రంగం ఇన్వెస్ట్‌ చేయడం లేదు. అంటే ఇక్కడ పరిస్థితి ఏదో సరిగ్గా లేదు. పాలసీపరమైన అనిశ్చితి కూడా కారణమనేది కొందరి అభిప్రాయం’’ అని రాజన్‌ చెప్పారు. గతేడాది వరుసగా నాలుగో నెల నవంబర్‌లో కూడా ఎఫ్‌డీఐ గణాంకాలు ప్రతికూలంగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ డేటా ప్రకారం ఆ నెలలో వచ్చిన ఎఫ్‌డీఐల కన్నా అధికంగా 446 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడులాంటి రాష్ట్రాలు ఎఫ్‌డీఐలను ఆకర్షించగలుగుతున్నప్పటికీ విస్తృత స్థాయిలో పెట్టుబడులు తరలిపోతుండటానికి కారణాలేమిటనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని రాజన్‌ పేర్కొన్నారు. యూఎస్‌ ట్రెజరీలను తగ్గించుకుంటున్నది అందుకే..సర్వత్రా అనిశ్చితి నెలకొనడం, కొన్ని విధానాలను ఉల్లంఘించేందుకు అమెరికా సంసిద్ధంగా ఉండటంలాంటి అంశాల వల్ల చాలా దేశాలు అమెరికా ట్రెజరీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుని, డైవర్సిఫికేషన్‌ వైపు మొగ్గు చూపుతున్నాయని రాజన్‌ చెప్పారు. అమెరికా ట్రెజరీల్లో భారత్‌ హోల్డింగ్స్‌ అయిదేళ్ల కనిష్టానికి పడిపోవడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సులభంగా మార్చుకునేందుకు వీలుంటుందనే నమ్మకం వల్లే డాలరు రిజర్వ్‌ కరెన్సీగా చెలామణీ అవుతోందని, కానీ ప్రస్తుతం ఆ నమ్మకం సడలుతోందని రాజన్‌ పేర్కొన్నారు. కానీ, బ్రిటన్, చైనా, జపాన్, రష్యాలాంటి దేశాలు సొంత సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో డాలరుకు దీటైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు. సెంట్రల్‌ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నప్పటికీ, అది బబుల్‌ స్థాయికి చేరిందేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయని రాజన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్‌ రిజర్వుల్లో ఎక్కువభాగం డాలర్‌ బాండ్లే ఉంటాయని రాజన్‌ తెలిపారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

Nirmala Sitharaman ninth Budget speech might break her own record5
కేంద్ర బడ్జెట్ 2026-27: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ మూడో విడత పాలన, అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్‌ టారిప్‌లు, వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఇది కీలకమైన బడ్జెట్ కావడంతో సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి కళ్లు ఆర్థిక మంత్రి ప్రసంగంపైనే ఉన్నాయి.ఆశలు.. ఆకాంక్షలుద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయపు పన్ను మినహాయింపులు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు చిరువ్యాపారులు, ఇటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా తమ రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి తన తొమ్మిదో బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘ సమయంపాటు చదివి కొత్త రికార్డును సృష్టిస్తారని కొందరు భావిస్తున్నారు.రికార్డు ప్రసంగాలుభారత బడ్జెట్ చరిత్రలో ప్రసంగాలకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ప్రసంగ సమయంలో కొందరు మంత్రులు కవితలతో ఆకట్టుకుంటే మరికొందరు గంటల తరబడి గణాంకాలతో వివరిస్తారు.బడ్జెట్ ప్రసంగం నిడివి పరంగా నిర్మలా సీతారామన్ పేరిట రికార్డు ఉంది. 2020 బడ్జెట్‌ సమయంలో ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు. 2019లో ఆమె నెలకొల్పిన 2 గంటల 19 నిమిషాల రికార్డును ఆమె మళ్లీ తిరగరాశారు. అంతకుముందు ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ (2003లో 2 గంటల 13 నిమిషాలు), అరుణ్ జైట్లీ (2014లో 2 గంటల 10 నిమిషాలు) సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.పదాల పరంగా మన్మోహన్ సింగ్ రికార్డుప్రసంగంలోని పదాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చిన 1991 బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. లైసెన్స్ రాజ్‌ చట్టానికి స్వస్తి పలికి ఆర్థిక సరళీకరణకు బాటలు వేసిన ప్రసంగం ఇది.సంక్షిప్త ప్రసంగం1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం. పటేల్ కేవలం 800 పదాలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇది భారత చరిత్రలోనే అతి తక్కువ నిడివి గల ప్రసంగం. 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి తన శైలికి భిన్నంగా వ్యవహరించారు.ఈసారి ఏం జరగబోతోంది?దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును స్థిరంగా ఉంచుతూనే సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే నిర్ణయాలను నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రసంగంతో అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?

NSE gets key approval for its IPO6
మార్కెట్లోకి బిగ్‌బాస్‌ ఎంట్రీ

న్యూఢిల్లీ: దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఐపీవో విషయంలో ముందుకెళ్లేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నో అబ్జక్షన్‌ సరి్టఫికెట్‌ (ఎన్‌వోసీ) జారీ చేసింది. ఇష్యూకి సెబీ అనుమతి లభించడం తమ సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయని ఎన్‌ఎస్‌ఈ చైర్‌పర్సన్‌ శ్రీనివాస్‌ ఇంజేటి తెలిపారు. భాగస్వాములందరికి మరింత విలువను జోడించేందుకు ఇది తోడ్పడగలదని చెప్పారు. ఎన్‌వోసీ లభించిన తర్వాత ఇష్యూకి రావడానికి ఏడు నుంచి ఎనిమిది నెలలు పట్టొచ్చని ఎన్‌ఎస్‌ఈ ఎండీ ఆశీష్‌ కుమార్‌ చౌహన్‌ గతంలో తెలిపారు.సంస్థ ఐపీవో దేశీయంగా అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో సుమారు 1.77 లక్షల షేర్‌హోల్డర్లుండగా, అన్‌లిస్టెడ్‌ గ్రే మార్కెట్లో రూ. 5 లక్షల కోట్ల పైగా విలువ పలుకుతోందని అనలిస్టులు తెలిపారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటాల విక్రయం ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు 2016లో ఎన్‌ఎస్‌ఈ మొదటిసారిగా ముసాయిదా ఆఫర్‌ పత్రాలను సమర్పించింది.అయితే, గవర్నెన్స్‌ లోపాల ఆరోపణలు, కో–లొకేషన్‌ కేసు తదితర అంశాల కారణంగా పబ్లిక్‌ ఇష్యూకి అప్పట్లో సెబీ ఆమోదముద్ర వేయలేదు. ఆ తర్వాత నుంచి ఎన్‌ఎస్‌ఈ పలుమార్లు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. రూ. 1,388 కోట్లు చెల్లించి కో– లొకేషన్‌ కేసును పరిష్కరించుకునేందుకు ఎన్‌ఎస్‌ ఈ గతేడాది ముందుకొచి్చంది. ఈ నేపథ్యంలో కంపెనీ లిస్టింగ్‌ ప్రణాళికలను పరిశీలించేందుకు 2025 మార్చ్‌లో అంతర్గతంగా కమిటీని వేసింది. సెటి ల్మెంట్‌ అభ్యర్ధనకు ఆమోదముద్ర వేసినట్లు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే ఇటీవలే తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement