Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Govt considering merger of state-run entities PFC and REC1
పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీనం

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ ఫైనాన్షియల్‌ నవరత్నాలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), ఆర్‌ఈసీ(గతంలో రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌) మధ్య విలీన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ రెండు పీఎస్‌యూలను విలీనం చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ ప్రాజెక్టులకు రుణాలు సమకూర్చడంలో రెండు సంస్థలు కీలక పాత్ర పోషించే సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాజా(2026–27) బడ్జెట్‌లో ఈ రెండు ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్‌ సంస్థల పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదించారు. తద్వారా వీటికి మరింత బలాన్ని చేకూర్చే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. ఆర్‌ఈసీలో మెజారిటీ వాటాను 2019 మార్చిలో పీఎఫ్‌సీ కొనుగోలు చేసింది. దీంతో 2019–20లో వీటి మధ్య విలీనానికి తెరతీయనున్నట్లు అంచనాలు వెలువడినప్పటికీ ఆచరణలోకి రాకపోవడం గమనార్హం!

Finance ministry mulls raising FDI limit in public sector banks to 49percent2
ప్రభుత్వ బ్యాంకులకు పెట్టుబడుల పుష్‌

న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంకులలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని పెంచే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత 20 శాతం పరిమితిని 49 శాతానికి పెంచాలని చూస్తున్నట్లు ఆర్థిక సరీ్వసుల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనస్థాయిని బలపరిచేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు అంతర్‌మంత్రిత్వ శాఖలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకు(పీఎస్‌బీ)లలో ఎఫ్‌డీఐ పరిమితి 20 శాతంకాగా.. ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు 74 శాతంగా అమలవుతోంది. అయితే 49 శాతంవరకూ ఆటోమేటిక్‌ మార్గంలో అను మతిస్తారు. ఆపై 74 శాతంవరకూ ప్రభుత్వ అనుమతిని పొందవలసి ఉంటుంది. నిజానికి 2020 నుంచి 12 పీఎస్‌బీలలో ప్రభు త్వం వద్దగల షేర్ల సంఖ్యలో మార్పులేనప్పటికీ కొన్ని బ్యాంకులలో వాటా శాతాలు మార్పులకు లోనయ్యాయి. ఆయా బ్యాంకులు మూలధన సమీకరణకు కొత్తగా షేర్లను జారీ చేయడం ప్రభావం చూపింది. కాగా.. ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించి ఈ నెల లో లేదా వచ్చే నెలలో ఫైనాన్షియల్‌ బిడ్స్‌ ను ఆహ్వానించనున్నట్లు నాగరాజు తెలియజేశారు.

Gold prices remain volatile amid global uncertainties says Nirmala Sitharaman3
గ్లోబల్‌ అనిశ్చితి వల్లే గోల్డ్‌ రష్‌

న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచుతూ, వృద్ధికి దోహదపడే సాధనంగా పెట్టుబడులను ప్రభుత్వం పరిగణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ఈ ధోరణినే ప్రతిఫలిస్తోందని పేర్కొన్నారు. నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యాన్ని చూస్తే వృద్ధి సాధనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. 2026–27 బడ్జెట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్లే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని, అనేక సెంట్రల్‌ బ్యాంకులు కూడా బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు ఏ కరెన్సీపైనా నమ్మకం లేకపోవడాన్ని, అందుకే పసిడి వైపు మొగ్గుచూపడాన్ని ఇది తెలియజేస్తోందని ఆమె వివరించారు. స్పెక్యులేటివ్‌ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ జోలికి వెళ్లకుండా సామాన్యులను నిలువరించేందుకే ఎఫ్‌అండ్‌వోపై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ని పెంచినట్లు వివరించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం 90 శాతం మంది పైగా రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో తీవ్ర నష్టాల పాలవుతున్నారని వెల్లడైన నేపథ్యంలో ఎస్‌టీటీ పెంపు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. ‘స్పెక్యులేషన్‌ అత్యధికంగా ఉంటున్న ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌తో తమ పిల్లలు తీవ్రంగా డబ్బు నష్టపోతున్నారని, ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని కోరుతూ చాలా మంది తల్లిదండ్రుల నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఎస్‌టీటీని పెంచడం వల్ల ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ చేయకుండా కొంత నిరోధించేందుకు వీలవుతుంది‘ అని మంత్రి చెప్పారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ద్రవ్యలోటు లక్ష్యం ఒక్కో సంవత్సరంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ద్రవ్య లోటు లక్ష్యాలు ఆధారపడి ఉంటాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. గతంలో క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా కాస్త తక్కువ ఉండేలా ప్రతి ఏటా ద్రవ్య లోటు లక్ష్యాలు విధించుకునే విధానం ఉండేదని ఆమె తెలిపారు. ఈసారి వృద్ధికి మరింత ప్రాధాన్యమిస్తున్నందున 4.3 శాతం ద్రవ్య లోటు సౌకర్యవంతమైన స్థాయే అనే ప్రభుత్వం భావిస్తోందని మంత్రి వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్‌ మానిటైజేషన్‌ యథాప్రకారంగానే కొనసాగుతాయన్నారు. పన్నుయేతర ఆదాయాలను బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయ పరిస్థితి ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Airtel Discontinues Free Perplexity Pro AI Subscription Offer4
ఎయిర్‌టెల్‌ షాక్‌.. ఆ ఫ్రీ ఆఫర్‌ ఇక లేదు

లక్షలాది మంది ఎయిర్‌టెల్ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త. రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను ఎయిర్‌టెల్ నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసిన వినియోగదారులకు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఆఫర్‌ను ప్రారంభించినప్పుడే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ వివరాలుఎయిర్‌టెల్ గత సంవత్సరం తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను తాత్కాలిక ప్రయోజనంగా అందించింది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.17,000 కాగా, ఎయిర్‌టెల్ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా లభించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 16 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అప్పుడే ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల నుంచి తొలగించింది.ఇప్పటికే క్లెయిమ్ చేసినవారికి ప్రభావం ఉంటుందా?జనవరి 16కు ముందే ఆఫర్‌ను క్లెయిమ్ చేసిన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారు ఆఫర్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను కొనసాగించవచ్చు. అయితే, జనవరి 16 తర్వాత రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదు.ఒక ఆఫర్ ముగిసినా… మరో కొత్త అవకాశంపెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ రద్దయినా, ఎయిర్‌టెల్ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తాజాగా ఎయిర్‌టెల్ అడోబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద, ఎయిర్‌టెల్‌కు చెందిన సుమారు 360 మిలియన్ల వినియోగదారులు ఇప్పుడు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్ పొందనున్నారు. సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ.4,000 ఖర్చయ్యే ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా, వినియోగదారులు అడోబ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు, ఇతర ప్రీమియం సదుపాయాలను ఉచితంగా ఉపయోగించవచ్చు.

Duty Free Import Limit Raised for International Passengers in India5
ఫారిన్‌ నుంచి ఇక ఎక్కువ తెచ్చుకోవచ్చు..!

విదేశాల నుంచి వచ్చే వారు సాధారణంగా మిత్రులు, బంధువులకు బహుమతులు తీసుకువస్తుంటారు. అయితే ఇప్పటివరకు దిగుమతి సుంకాలు, పరిమితుల కారణంగా ఎక్కువ విలువైన వస్తువులను తీసుకురావడం సాధ్యపడేది కాదు. ఇకపై ఆ పరిస్థితి మారనుంది.అంతర్జాతీయ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్ 2026–27లో కేంద్ర ప్రభుత్వం డ్యూటీ ఫ్రీగా భారత్‌కు తీసుకురాగల వస్తువుల విలువ పరిమితిని పెంచింది. ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి కొత్త బ్యాగేజీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.కొత్త బ్యాగేజీ నిబంధనలు ఏమిటంటే..వాయు లేదా సముద్ర మార్గంలో వచ్చే భారత సంతతికి చెందిన నివాసితులు, పర్యాటకులు రూ. 75,000 వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్‌కు తీసుకురావచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి రూ. 50,000 మాత్రమే ఉండేది.అలాగే విమాన లేదా సముద్ర మార్గంలో వచ్చే విదేశీ పర్యాటకులకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచారు.అయితే కొన్ని రకాల వస్తువులకు మాత్రం ఈ సడలింపులు వర్తించవు. 50 యూనిట్లకు మించిన తుపాకీ గుళికలు, 100 కంటే ఎక్కువ సిగరెట్లు, 25 కంటే ఎక్కువ సిగార్లు, 125 గ్రాములకంటే ఎక్కువ పొగాకు, 2 లీటర్లకు మించిన మద్యం, ఆభరణాల రూపంలో కాకుండా బంగారం లేదా వెండి, టెలివిజన్లు వీటిలో ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులుకేంద్ర బడ్జెట్ 2026–27లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ నిర్ణయంతో భారత్‌లోకి దిగుమతి చేసుకునే వ్యక్తిగత వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ మరింత అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ముందుగానే విడుదలైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

Gold Rates crashed by Evening 2nd February 2026 in Telugu States6
సాయంత్రానికి మరింత క్రాష్‌.. గంటల్లోనే పడిపోయిన బంగారం

బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం భారీగా తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి మరింత పడిపోయాయి.హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.8300 తగ్గి రూ. 1,38,900 లకు దిగిరాగా సాయంత్రానికి మొత్తంగా రూ.12300 క్షీణించి రూ.1,34,900లకు పడిపోయింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.9050 తగ్గి రూ. 1,51,530 లకు తగ్గగా సాయంత్రానికి మరింత రూ.13410 పడిపోయి రూ.1,47,170లకు క్షీణించింది.వేగంగా మారిపోతున్న దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మారుతుండటంతో బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
Advertisement