Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Shipments Stranded in Dubai as Iran Conflict Grounds Flights1
దుబాయ్‌ దాటని బంగారం..

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్‌గా పేరుగాంచిన దుబాయ్‌ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్‌ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్‌, లండన్‌ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్‌ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్‌లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.దుబాయ్‌కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్‌ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ట్రేడింగ్ హబ్‌ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్‌కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్‌రైటింగ్ చేస్తాయి.ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్‌ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్‌24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌గా పేరొందిన ఎమిరేట్స్‌ బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్‌, న్యూయార్క్‌ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్‌ ఛేస్‌ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి.

Rupee Falls To All Time Low Against US Dollar Amid Middle East War2
యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా పడిపోయిన రూపాయి

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడింది. అమెరికా–ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 67 పైసలు క్షీణించి 92.16 వద్ద ముగిసింది. ఇది తాత్కాలికంగా నమోదైన ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి కావడం గమనార్హం.ఫారెక్స్ మార్కెట్ వర్గాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ‘రిస్క్ ఆఫ్’ పరిస్థితుల కారణంగా డాలర్ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీల బుట్టతో పోలిస్తే గ్రీన్‌బ్యాక్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది.ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి 92.05 వద్ద ప్రారంభమై, ఒక దశలో 92.35 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 92.16 వద్ద ముగిసి, గత ముగింపు స్థాయి 91.49తో పోలిస్తే 67 పైసల నష్టాన్ని చవిచూసింది. సోమవారం రూపాయి 41 పైసలు బలహీనపడి 91.49 వద్ద స్థిరపడగా, హోలీ సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ మూతపడింది.ఇరాన్‌పై అమెరికా దాడులు, అలాగే హోర్ముజ్ జలసంధి మార్గంగా ఇంధన సరఫరాలకు ఉన్న ముప్పు కారణంగా ప్రపంచ చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్‌కు 1.29 శాతం పెరిగి 82.46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,122.66 పాయింట్లు క్షీణించి 79,116.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 385.20 పాయింట్లు పడిపోయి 24,480.50 వద్ద స్థిరపడింది.మొత్తంగా, ప్రపంచ అనిశ్చితి పరిస్థితులు, విదేశీ నిధుల ఉపసంహరణ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Over 2 5 Million Users Boycott ChatGPT3
చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసిన 25 లక్షల మంది!

అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్‌జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్‌సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసినట్లు పేర్కొంది.900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్‌వర్క్‌లో ఏఐ మోడల్‌ను అమలు చేయడానికి అనుమతి లభించింది.ఈ డీల్‌తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్‌జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్‌జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్‌ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్‌సైట్ పేర్కొంది.ఇదిలా ఉండగా, సెన్సార్‌ టవర్‌ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్‌ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్‌బాట్ యాప్, అమెరికాలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌ చార్టుల్లో చాట్‌జీపీటీ యాప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్‌క్రంచ్‌ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌ యూఎస్‌లో అన్‌ఇన్‌స్టాల్‌ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.

Stock Market Crash Close Sensex slumps 1100 points4
స్టాక్‌ మార్కెట్‌ క్రాష్‌.. 1122 పాయింట్లు కూలిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మధ్యప్రాచ్యంలో ఏర్పడుతున్న పరిస్థితి గురించి మదుపరులు ఆందోళన చెందడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడవ సెషన్‌లోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 1.6 శాతం లేదా 385.2 పాయింట్ల నష్టంతో 24,480.5 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.40 శాతం లేదా 1,122.66 పాయింట్లు నష్టపోయి 79,116.19 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఎన్బీ ట్రేడ్‌& ఫైనాన్స్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌, సాధన నైట్రో కెమ్‌, పాదం కాటన్‌ యార్న్స్‌, ఎఫ్‌ మెక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎకో హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌, రూబీ మిల్స్‌, మార్గ్‌ టెక్నో ప్రాజెక్ట్స్‌, పిక్చర్‌హౌస్‌ మీడియా, శ్రీ హవిషా హాస్పెటాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్స్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను మించి పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.2 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బుధవారం సెషన్ ను లాభాలతో ముగించిన ఏకైక సెక్టోరల్ సూచీ నిఫ్టీ ఐటీ.

Missed Just 3 EMIs Lost Rs 1 2 Crore Home Hidden Risks of Housing Loans5
ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..

సొంతిల్లు ప్రతి ఒక్కరికీ జీవిత కల. చాలా మంది హోమ్ లోన్‌ తీసుకుని తమ సొంతింటి ప్రయాణాన్ని మొదలు పెడుతుంటారు. అయితే సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఎంత పడితే అంత ఈఎంఐ (నెలసరి వాయిదా) పెట్టుకుని ఇల్లు కొనుక్కోవడం ఎంత రిస్కో ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సోషల్‌ మీడియా ముందుకు తీసుకొచ్చారు.బెంగళూరులో ఒక వ్యక్తి కేవలం మూడు హోమ్‌ లోన్‌ ఈఎంఐలు చెల్లించకపోవడంతో తన రూ.1.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కోల్పోయిన సంఘటన చర్చనీయాంశమైంది. గృహ రుణాల్లో దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.గోయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పొరుగువారు స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన ఆదాయం కలిగి ఉండి ప్రముఖ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే అక్టోబర్‌లో ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఒత్తిడి మొదలైంది. జనవరి నాటికి వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు సర్ఫాసి యాక్ట్‌ (SARFAESI Act) కింద రికవరీ చర్యలు ప్రారంభించింది.సర్ఫాసి చట్టం ప్రకారం బ్యాంకులు.. కోర్టు జోక్యం లేకుండానే బకాయిలను వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంటాయి. నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపే ఆస్తిని రూ.95 లక్షలకు వేలం వేశారు. ఆ మొత్తంలో రూ.80 లక్షలు బకాయిలకు సర్దుబాటు కాగా, ఎనిమిదేళ్ల పాటు ఈఎంఐలు చెల్లించిన రుణగ్రహీత చేతికి కేవలం రూ.15 లక్షలు మాత్రమే మిగిలాయి.తుది ఈఎంఐ పూర్తయ్యే వరకు తనఖా పెట్టిన ఆస్తిపై పూర్తి హక్కులు రుణగ్రహీతకు ఉండవని గోయెల్ హెచ్చరించారు. ఆకస్మికంగా ఆదాయం ఆగిపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగానే బ్యాంకును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి రుణ పునర్వ్యవస్థీకరణ, కాలపరిమితి పొడిగింపు వంటి అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ నష్టం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.ఫైనాన్షియల్ ప్లానర్లు సాధారణంగా నెలవారీ ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకూడదని సూచిస్తున్నారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నిధులను వినియోగించుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించవచ్చు.

West Asia Tensions Oil Markets China Backed Aramco Cuts Refinery Operations6
ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!

పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా తన వ్యూహాన్ని మార్చుకుంది. సౌదీ ఆరామ​్‌కో మద్దతు ఉన్న చైనాలోని చమురు రిఫైనరీలు తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. క్రూడ్‌ సరఫరాకు బ్రేక్ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా ప్రస్తుతం సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ క్రూడాయిల్‌ అవసరాల్లో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సరఫరా ఒత్తిడి ఇతర దేశాల రిఫైనర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రంగంలోకి చైనా రిఫైనరీ దిగ్గజాలుసౌదీ ఆరామ్‌కో భాగస్వామ్యం కలిగిన చైనా ప్రధాన రిఫైనరీ జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీపీసీ) రోజుకు 2 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న తన యూనిట్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.రోజుకు 8 లక్షల బ్యారెళ్ల ప్రాసెసింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ చైనాలోనే అతిపెద్దది. తాజా నిర్ణయంతో మార్చి నెలలో ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, ఫుజియాన్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ కో (ఫ్రెప్‌) కూడా తన 80,000 బీపీడీ సామర్థ్యం గల చిన్న ముడి చమురు యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేసింది.ఇదీ చదవండి: ఏజీఆర్‌ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!

Advertisement
Advertisement
Advertisement