Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Equity Funds and WhiteOak Capital Midcap Fund1
రాబడులకు మెరుగైన దారి

న్యూఢిల్లీ: పెట్టుబడి ద్వారా సంపద సృష్టించుకోవాలని భావించే వారు రిస్క్‌ తీసుకునేందుకు సైతం సిద్ధం కావాల్సిందే. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు ఇన్వెస్టర్‌ రిస్క్‌ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా 10–15–20 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాలకు సంబంధించి పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని భావించే వారికి ఈక్విటీ ఫండ్స్‌ ఎంతో అనుకూలం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం దిశగా కేంద్ర సర్కారు పనిచేస్తోంది. కనుక రానున్న ఒకటి రెండు దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరిస్తుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో.. అందులోనూ లార్జ్‌క్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు తప్పక చోటు కలి్పంచుకోవాలి. మిడ్‌క్యాప్‌ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ గురించి విశ్లేషణ ఇది. రాబడులు ఈ పథకం ప్రారంభమై మూడేళ్లు అయింది. 2022 సెప్టెంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. కానీ, మొదటి మూడేళ్లలో మిడ్‌క్యాప్‌ విభాగంలో దిగ్గజ ఫండ్స్‌ పథకాల మించి బలమైన పనితీరు నమోదు చేసింది. ఏడాది కాలంలో పెట్టుబడులపై 5.28 శాతం రాబడిని ఇవ్వగా.. మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడి 28 శాతం వరకు ఉంది. కానీ, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 150 టీఆర్‌ఐ మూడేళ్లలో ఏటా ఇచి్చన రాబడి 23.51 శాతంగానే ఉంది. ఇక మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడి 22.97 శాతంతో పోల్చినా వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ అదనపు రాబడిని తెచ్చిపెట్టు తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్, కోటక్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్, నిప్పన్‌ ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్, మోతీలాల్‌ ఓస్వాల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను రాబడి పరంగా అధిగమించింది. బలమైన రాబడులు ఒక్కటే ప్రామాణికం కాదు. స్థిరమైన పనితీరు, అస్థిరతల్లో స్థిరత్వాన్ని చూడాల్సి ఉంటుంది. ఆ విధంగానూ ఈ పథకానికి మంచి మార్కులే పడతాయి. 110 వారాల్లో ఈ పథకం రాబడులు నికర సానుకూలంగా ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. పెట్టుబడుల విధానం భవిష్యత్తులో దిగ్గజాలు కాగల కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఇప్పటికే ఈ పథకం ఇన్వెస్ట్‌ చేసిన కొన్ని స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌గా, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ లార్జ్‌క్యాప్‌గా అవతరించాయి. పెట్టుబడుల్లో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తుంటుంది. ఆ తర్వాత లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.4,346 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 97 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. వీటిని పరిశీలిస్తే మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 56.36 శాతం ఎక్స్‌పోజర్‌ కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు 32.61 శాతం కేటాయించింది. స్మాల్‌క్యాప్స్‌లో 9.53 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. పోర్ట్‌ఫోలియోలో ఏకంగా 120 స్టాక్స్‌ను కలిగి ఉంది. పైగా టాప్‌ 10 స్టాక్స్‌లో పెట్టుబడులు 29 శాతం మించి లేవు. అంటే పెట్టుబడుల్లో ఏకీకృత రిస్క్‌ను తగ్గించే విధంగా పెట్టుబడులున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో 25.4 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. హెల్త్‌కేర్‌ కంపెనీలకు 15.48 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 15.24 శాతం, ఇండ్రస్టియల్స్‌ కంపెనీలకు 13.45 శాతం, కన్జూమర్‌ డి్రస్కీíÙనరీ కంపెనీలకు 12 శాతం చొప్పున కేటాయించింది.

Home loans and gold loans are offered by banks and Nbfcs2
మీ ఇల్లు బంగారంగానూ!

తాకట్టు... రుణం!. ఈ రెండూ భవిష్యత్తుని నిర్ణయించేవే. అది ఎదగటమైనా... పాతాళానికి పడిపోవటమైనా!. దానికి దిక్సూచులు ఏ అవసరానికి తీసుకుంటున్నాం? ఎంత క్రమశిక్షణతో తిరిగి తీరుస్తున్నామనేవే. ఇక రుణ ప్రపంచానికి హృదయం లాంటివి హోమ్‌లోన్‌... గోల్డ్‌ లోన్‌. ఒకటి ఆశలు నెరవేర్చేదైతే మరొకటి అవసరాన్ని తీర్చేది. మరి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో రెండూ ఈ రుణాలిస్తున్నాయి కదా... ఏది మంచిది? ఏ రుణం ఎక్కడ తీసుకుంటే మంచిది? వీటికి సమాధానమే ఈ వెల్త్‌ స్టోరీ...సరైన రుణాన్ని, సరైన సంస్థను ఎంచుకోకకపోవటం వల్ల లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉండదూ? గృహరుణంలో ఒక్క 0.5 శాతం తేడా వల్ల మనం చెల్లించే సొమ్ము కొన్ని లక్షల రూపాయలు పెరిగిపోతుందంటే ఇబ్బందికరంగా లేదూ? అందుకే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో ఎక్కడ రుణం తీసుకున్నా... మన అవసరమేంటన్నది ముఖ్యం. ఆ అవసరానికి మనకు ఎంత త్వరగా రుణం వస్తోంది? ఎంత వడ్డీకి వస్తోంది? మన దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయా? మనకు కొన్ని వెసులుబాట్లు అవసరమా? ఇలాంటివన్నీ చూసుకుని, దానికి తగ్గ సంస్థను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. అదెలాగో చూద్దాం... గృహ రుణానికి బ్యాంకే మంచిదా? గృహ రుణం తీసుకునే వారు ఒక్క వడ్డీ రేటే కాకుండా చాలా అంశాలు చూడాలి. అదేమిటంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా బ్యాంకుల్లోనే తక్కువ. ఎందుకంటే ఇవి ఆర్‌బీఐ రెపో రేటు మాదిరి ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్‌తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్‌బీఐ రేట్లకు అనుగుణంగా తక్షణం మార్పుచేర్పులుంటాయి. ఉదాహరణకు 0.5 శాతం గనక వడ్డీ రేటు తగ్గితే... 20 ఏళ్ల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.3 లక్షలు మిగుల్చుకోవచ్చు. పైపెచ్చు బ్యాంకుల్లో గృహ రుణాలను గరిష్టంగా 30 ఏళ్ల కాలానికీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, దీర్ఘకాలం కారణంగా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. కాకపోతే బ్యాంకుల్లో గృహ రుణ దరఖాస్తుల పరిశీలన చాలా కఠినంగా ఉంటుంది. ప్రాపరీ్టకి క్లియర్‌ టైటిల్‌తోపాటు, రుణ గ్రహీత క్రెడిట్‌ స్కోర్‌ (రుణ పరపతి/ రుణ చరిత్ర) 700కు పైన ఉండాలి. చెల్లింపుల సామర్థ్యాలనూ బ్యాంక్‌లు చూస్తాయి. దీనికితోడు న్యాయపరమైన క్లియరెన్స్‌ కూడా తీసుకుంటాయి. కనుక ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఎన్‌బీఎఫ్‌సీలు ఎవరికంటే... నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) గృహ రుణాల విషయంలో బ్యాంకుల మాదిరి అంత కఠినంగా వ్యవహరించవు. 700కు దిగువన క్రెడిట్‌స్కోరు ఉన్న వారికి సైతం, ఇతర అర్హతల ఆధారంగా ఇవి రుణాలను అందిస్తుంటాయి. ఆదాయ ధ్రువీకరణల్లేని స్వయం ఉపాధిపై ఉన్న వారికి, తక్కువ ఆదాయ వర్గాలకు సైతం ఎన్‌బీఎఫ్‌సీల్లో రుణాలు లభిస్తాయి. పైపెచ్చు ఎన్‌బీఎఫ్‌సీల్లో గృహ రుణం కేవలం రోజుల వ్యవధిలో మంజూరవుతుంది. సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లోనే రుణం పొందొచ్చు. అంటే బ్యాంకులతో పోలి్చనపుడు ఎన్‌బీఎఫ్‌సీల్లో వేగవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఆశించొచ్చు. కాకపోతే ఎన్‌బీఎఫ్‌సీల్లో వడ్డీ రేట్లు ఎక్కువ. కనుక వడ్డీ రూపంలో కాస్త ఎక్కువ చెల్లించాలి. బ్యాంకుల్లో మాదిరి అధిక రుణం మొత్తం అన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో సాధ్యపడదు. వీరికి బ్యాంక్‌ బెటర్‌.. → మంచి క్రెడిట్‌ స్కోరు ఉండి, ఆదాయ ధ్రువీకరణలున్న వారికి. → ఆర్‌బీఐ నియత్రణల కింద మరింత పారదర్శకత కోరుకునే వారికి. → సమయం పట్టినా తక్కువ వడ్డీకి రుణం కావాలనుకునేవారికి. వీరికి ఎన్‌బీఎఫ్‌సీలు.. → తక్కువ ఆదాయం లేదా ఫ్రీలాన్స్, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం వచ్చేవారికి → వేగంగా రుణం మంజూరు కోరుకునే వారికి. ళీ వడ్డీ రేటు కాస్త ఎక్కువైనా.. తమ అవసరాలకు వీలుగా సౌకర్యవంతమైన షరతులపై రుణం కోరుకునే వారికి బంగారంపై రుణం ఎక్కడ నయం? గృహ రుణం మాదిరే బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే రుణమూ సెక్యూర్డ్‌ కిందికే వస్తుంది. కనుక వీటిపైనా రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ రుణం మొత్తం, వడ్డీ రేటు, కాల వ్యవధి, చెల్లింపుల్లో సౌలభ్యం పరంగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. బ్యాంక్‌లు ఎక్కడ బెటరంటే... → బంగారంపై వడ్డీ రేటు బ్యాంకుల్లో తక్కువ. ఇవి 8 శాతం రేటుకే రుణాలిస్తుంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ రేటు గరిష్టంగా 12 శాతం వరకు ఉంటుంది. → బంగారంపై బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. రుణం తీసుకుని, ప్రతి నెలా చెల్లింపులు చేయకుండా.. ఒకేసారి తిరిగి చెల్లించేట్టయితే ఏడాది కాలానికి మంజూరు చేస్తారు. → రుణం తీసుకుని నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించేట్టు అయితే రెండు నుంచి మూడేళ్ల కాలానికి రుణాలిస్తారు. → ఇక బ్యాంకుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులైతే బంగారంపై తక్కువ రేటుకు రుణాలిస్తుంటాయి. → ఆర్‌బీఐ మార్గదర్శకాలను బ్యాంకులు కచి్చతంగా అనుసరిస్తుంటాయి. కనుక భద్రత, పారదర్శకత ఎక్కువ. → బ్యాంకుల్లో బంగారంపై రుణం అదే రోజు, గంటల్లోనే మంజూరవుతుంది. → కాకపోతే బ్యాంకుల్లో బంగారం విలువపై తక్కువ రుణం లభిస్తుంది. అంటే ఎక్కువ బ్యాంకులు బంగారం విలువలో 65–70 శాతానికి మించి రుణాన్ని ఇవ్వవు. ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కడ బెటరంటే... → ఎన్‌బీఎఫ్‌సీల్లో బంగారం రుణాలపై అధిక వడ్డీ రేటు అమలవుతుంది. వీటిల్లో 12 శాతం నుంచి 30 శాతం మధ్య రేటు ఉంటుంది. → కేవైసీ పరంగా ఆధార్, పాన్‌ ఇస్తే చాలు... బ్యాంకుల్లో మాదిరే బంగారంపై రుణం అదే రోజు వేగంగానే మంజూరవుతుంది. → ముఖ్యంగా బంగారంపై అధిక రుణాన్ని ఎన్‌బీఎఫ్‌సీలు ఆఫర్‌ చేస్తుంటాయి. కానీ, ఇందుకోసం అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సిందే. → వడ్డీని ఏ నెలకానెల కట్టేసి.. అసలును చివర్లో కట్టేస్తే సరిపోతుంది. → కాకపోతే వీటిల్లో రుణ కాలవ్యవధి బ్యాంకుల్లో మాదిరి సుదీర్ఘంగా ఉండదు. ఆరు నెలలు, ఏడాదికే ఆఫర్‌ చేస్తాయి. ఆ తర్వాత రెన్యువల్‌ చేసుకోవాలి. → రుణాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తాయి. అంగీకారానికి ముందు.. → రుణం తీసుకునే ముందు ఒప్పంద నియమ నిబంధనలు, షరతులు, చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. → తిరిగి చెల్లింపుల పరంగా ఉన్న ఆప్షన్లను తెలుసుకోవాలి. → రుణాన్ని నిరీ్ణత కాల వ్యవధికి ముందే తీర్చివేస్తే పెనాల్టీ మాదిరి ఏవైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? అడగాలి. → వివిధ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య రుణ రేట్లు, చార్జీలను పోల్చి చూసుకోవాలి. → సాధారణంగా దీర్ఘకాల రుణాలకు బ్యాంక్‌లు అనుకూలం, సౌకర్యం. → అత్యవసరంగా, అధిక రుణం కోరుకునే వారికి ఎన్‌బీఎఫ్‌సీలు అనుకూలం.రుణ వ్యయాలు తగ్గించుకోవడమెలా? → రుణం తీసుకోవడానికి ముందు తమ క్రెడిట్‌ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఏడాదిలో ఒక్కసారి క్రెడిట్‌ స్కోరును ఆయా సంస్థలు ఉచితంగా ఇస్తాయి. → 760కు పైన క్రెడిట్‌ స్కోరు ఉన్న వారు తక్కువ వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు కోసం డిమాండ్‌ చేయొచ్చు. → గృహ రుణం అయితే ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ (ఆర్‌బీఐ రెపో/ఈబీఎల్‌ఆర్‌) రేటు ఆధారితంగా ఎంపిక చేసుకోవాలి. → రుణం తీసుకునే సమయంలో అధిక రేటు ఉండి, ఆ తర్వాత రేట్లు దిగొస్తే.. మిగిలిన బకాయిని తక్కువ రేటు ఉన్న సంస్థకు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి.

Wealth Creation Plan for 2026, sakshi special story3
ఐపీఓలంటే అద్భుతాలు కావు!

స్టాక్‌ మార్కెట్లలోని కంపెనీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినవే. కాకపోతే వాటిలో అగ్రశ్రేణి కంపెనీలుగా (లార్జ్‌క్యాప్‌) మారినవి కొన్నే. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. ఐపీఓల్లో ఇన్వెస్ట్‌ చేయాలో.. వద్దో తెలిసిపోతుంది. ఎందుకంటే ఐపీఓలంటే అద్భుతాలు కావు. ఆటోమేటిగ్గా సంపదను సృష్టించే సాధనాలూ కావు. అవి అవకాశాలతో పాటే రిస్కులనూ మన ముందుంచుతాయి. అలాగని ఐపీఓలకు దూరంగా ఉండమని కాదు. ఐపీఓ అంటే... మార్కెట్లు పంపే ఆహ్వాన పత్రికలు. దేన్ని స్వీకరించాలో... దేన్ని తిరస్కరించాలో మనమే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో.. 2025లో ఐపీఓకు వచి్చన కంపెనీల పరిస్థితేంటో... 2026లో ఎలా వ్యవహరించాలో సమగ్రంగా వివరించేదే ఈ ‘వెల్త్‌’ స్టోరీ...ప్రస్తుతం ప్రైమరీ (ఐపీఓ) మార్కెట్‌ మంచి దూకుడు మీదుంది. దాదాపు 200కు పైగా కంపెనీలు లిస్టింగ్‌లకు సన్నద్ధమవుతున్నాయి. వీటిలో ఫిన్‌టెక్‌ యూనికార్న్‌లు, గ్రీన్‌ ఎనర్జీ వెంచర్ల నుంచి కన్జూమర్‌ బ్రాండ్లు, ఇన్‌ఫ్రా రంగ దిగ్గజాల వరకు చాలా ఉన్నాయి. జీడీపీ ఏడు శాతానికి పైగా కొనసాగుతుందనే సానుకూల అంచనాలు, డీమ్యాట్‌ ఖాతాలు 15 కోట్ల స్థాయిని దాటిపోవడం, ప్రతి నెలా సిప్‌ల ద్వారా రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లలోకి వస్తుండటం వంటి పరిణామాలు కంపెనీలకు మంచి ఊపునిస్తున్నాయి.ఐపీవోలు ఎందుకు..కంపెనీలు వివిధ కారణాలరీత్యా పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. అవేంటంటే.. → కార్యకలాపాలను విస్తరించడానికి, కొత్త టెక్నాలజీల ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటానికి → రుణాలుంటే తీర్చెయ్యడానికి... → ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, అలాగే ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించుకోవటానికి → బ్రాండ్‌ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకునేందుకు ఇలాంటి అవసరాలకు సంబంధించి ఐపీవోలనేవి కంపెనీకి సహాయకరంగానే ఉంటాయి. అయితే, షేరు ధర అదే పనిగా పెరుగుతూనే ఉంటుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు కొన్ని కంపెనీలు లిస్టింగ్‌లో మంచి లాభాలే ఇవ్వొచ్చు. మరికొన్ని కంపెనీలు లిస్టింగ్‌ వేళ నిరాశపర్చినా, ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ పుంజుకుని మెరుగైన రాబడులు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో చాలా మటుకు కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనలేక చతికిలబడి, షేర్లు కనుమరుగైపోతుంటాయి కూడా.రిటైల్‌ ఇన్వెస్టర్ల తప్పులివీ...ఆ ఐపీవో బాగా లిస్టయ్యింది.. ఈ ఇష్యూ బాగా లాభాలు తెచ్చిందనే అత్యుత్సాహంతో చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొందరు గ్రే మార్కెట్లను ఫాలో అవుతూ అక్కడ ప్రీమియం రేటు పలికే వాటి వెంటబడుతుంటారు. ఇంకొందరు భారీగా ఓవర్‌సబ్‌్రస్కయిబ్‌ అయ్యింది కదా కచి్చతంగా లాభాలొచ్చేస్తాయనుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మరికొందరు లిస్టింగ్‌ రోజున భలే ఎగ్జైటింగ్‌గా ఉంటుందని పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ఈ అత్యుత్సాహంలో కొన్ని విషయాలు విస్మరిస్తుంటారు. వ్యాపారం మోడల్‌ నిజంగా బలమైనదేనా? దీర్ఘకాలికంగా నిలబడేదేనా? ప్రమోటర్ల ట్రాక్‌ రికార్డు బాగుందా లేదా? ఐపీవో ద్వారా తీసుకున్న డబ్బును కంపెనీ ఏ అవసరాల కోసం వాడుకుంటోంది? ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. 2025లో ఏం జరిగిందంటే... గతేడాది ఐపీవోలు తీపి, చేదు జ్ఞాపకాలు రెండింటినీ ఇచ్చాయి. దాదాపు 373 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో 103 మెయిన్‌ బోర్డ్‌ ఇష్యూ లు కాగా 270 కంపెనీలు ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్టయ్యాయి. టాటా క్యాపిటల్‌ (రూ.15,512 కోట్లు), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ (రూ.12,500 కోట్లు) వంటి దిగ్గజాలు భారీగా నిధులు సమీకరించాయి. కొత్త తరం సంస్థలు మీషో రూ. 5,421 కోట్లు సమీకరించగా, గ్రో క్యాపిటల్‌ రూ.6,632 కోట్లు రాబట్టుకుంది. వీటిలో లిస్టింగ్‌ నాడు ఏకంగా 136 శాతం లాభాన్నిచి్చన స్టాలియన్‌ ఇండియా ఫ్లోరోకెమికల్స్‌ లాంటి కంపెనీలతో పాటు తొలిరోజే 56 శాతం నష్టాన్నిచ్చిన గ్లోటిస్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద ఇష్యూల్లో మీషోనే తీసుకుంటే ఇష్యూ ధర రూ.111 అయితే దాదాపు 46 శాతం అధికంగా రూ.162.50 వద్ద లిస్టయ్యింది. అలాగని అన్నీ ఇదే రీతిలో లిస్టింగ్‌ లాభాలిచ్చాయనుకోవడానికి లేదు. గతేడాది సగటున లిస్టింగ్‌ లాభాలు చూస్తే 8 శాతం స్థాయికే (అంతకు ముందటి సంవత్సరాలకన్నా తక్కువగా) పరిమితమయ్యాయి. వీటిలో దాదాపు సగ భాగం లిస్టింగ్‌లో ఏడాది చివరి నాటికి లాభాల్లోనే ఉండగా, మిగతావి ఇష్యు రేటు కన్నా కిందికి పడిపోయాయి. ఇక ఎస్‌ఎంఈ ఐపీవోలైతే మరీ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని మలీ్టబ్యాగర్లుగా మారినప్పటికీ మిగతావి భారీగా పడిపోయాయి. హైప్‌ అనేది ఎల్లకాలం ఉండదని, వాస్తవంగా వ్యాపారానికి ఉండే బలమే కీలకమనే పాఠాన్ని 2025 మరోసారి నేరి్పంది.2026 ప్రత్యేకత ఏంటి.. ఈసారి 200 పైగా కంపెనీలు ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి రూ. 2.5 లక్షల కోట్లకు మించి సమీకరించవచ్చనే అంచనాలున్నాయి. వీటిలో పలు కంపెనీలు భారీ వేల్యుయేషన్లతో రాబోతున్నాయి. ఉదాహరణకు రూ. 11– 12 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో రిలయన్స్‌ జియో ఐపీవో దేశంలోనే అతి పెద్ద ఇష్యూగా ఉంటుందనేది నిపుణుల అంచనా. ఇది 2026 ప్రథమార్ధంలోనే రావచ్చు. అలాగే ఎన్‌ఎస్‌ఈ, ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, ఓయో, జెప్టో, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌... ఇలా బోలెడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు తమ వాటాలను విక్రయించుకుని ని్రష్కమించనున్నాయి. డీమ్యాట్‌ ఖాతాలు పెరుగుతుండటం, సిప్‌ పెట్టుబడుల వెల్లువతో వీటికి రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీగానే డిమాండ్‌ ఉంటుందనే అంచనాలున్నాయి. వెరసి ఈసారి కూడా స్టాక్‌ మార్కెట్లు సందడిగానే ఉండనున్నాయి.ఏం చేయాలంటే... ఇదంతా చూసిన తర్వాత ఇంతకీ ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయాలా వద్దా అంటే... ఇవి మీ పోర్ట్‌ఫోలియోలో స్మార్ట్‌ భాగంగా ఉండొచ్చు. సముచిత రేటులో లభిస్తున్న బలమైన కంపెనీల ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయండి. కానీ పెట్టుబడులకు సంబంధించి అదొక్కటే వ్యూహంగా మాత్రం పెట్టుకోవద్దు. → మంచి అవకాశాల కోసం కాస్త వేచి చూడండి. ఇలాంటివి ఏడాదిలో 4– 6 వరకు వస్తుంటాయి. → బాగుందనిపించగానే ఇన్వెస్ట్‌ చేసేయొద్దు. వ్యాపార ప్రాథమిక విషయాలను తెలుసుకునేందుకు ప్రాస్పెక్టస్‌ని కూడా కాస్త తిరగేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. → పబ్లిక్‌ ఇష్యూల్లో పెట్టుబడులను మీ దీర్ఘకాలిక మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా బ్లూ–చిప్‌ స్టాక్స్‌కి అనుబంధంగానే ఉంచుకోవడం మంచిది. చివరిగా చెప్పేదేమిటంటే పబ్లిక్‌ ఇష్యూలంటే లాటరీలు కావు! యుఫోరియాకి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. లిస్టింగ్‌కి వచ్చిన కంపెనీ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉంటే కేవలం లిస్టింగ్‌ రోజునే కాదు దీర్ఘకాలికంగా కూడా మంచి రాబడులను అందుకోవచ్చని గుర్తుంచుకోవాలి.

Berkshire Hathaway New CEO Greg Abel Salary More Than Warren Buffett4
బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త సీఈఓ: వేతనం ఎన్ని కోట్లంటే?

ప్రముఖ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓగా వైదొలగిన తరువాత.. 'గ్రెగ్ అబెల్' బాధ్యతలు స్వీకరించారు. ఈయన కేవలం బఫెట్ వారసుడిగానే మాత్రమే కాకుండా.. అమెరికాలో అత్యధిక పారితోషికం పొందుతున్న ప్రముఖులలో ఒకరుగా నిలిచారు.2026 సంవత్సరానికి అబెల్ వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు. ఇది 2024లో తీసుకున్న వేతనం కంటే 19 శాతం ఎక్కువ. అంతే కాకుండా ఈ జీతం వారెన్ బఫెట్ వేతనం కంటేఎక్కువ కావడం గమనార్హం.95 సంవత్సరాల వయసులో.. వారెన్ బఫెట్ పదవీ విరమణ చేసిన తరువాత, ఈ ఏడాది జనవరి 1 నుంచి గ్రెగ్ అబెల్ అధికారికంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. బెర్క్‌షైర్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతే కాకుండా కంపెనీకి చెందిన నాన్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్‌ను కూడా పర్యవేక్షించారు.కెనడాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన గ్రెగ్ అబెల్, బఫెట్‌కు అత్యంత సన్నిహిత సహాయకుడిగా పేరుపొందారు. ఆయన వద్ద ప్రస్తుతం సుమారు 171 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ షేర్లు ఉన్నాయి. 2022లో బెర్క్‌షైర్ హాత్‌వే ఎనర్జీలో తన 1 శాతం వాటాను కంపెనీకే విక్రయించి 870 మిలియన్ డాలర్లు పొందారు. ఇప్పుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ అబెల్, బెర్క్‌షైర్ హాతవేను కొత్త యుగంలోకి నడిపించడమే కాకుండా.. అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో ఒకరిగా నిలిచారు.ఇదీ చదవండి: 2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!

Mukesh Ambani Speech in Vibrant Gujarat Regional Conference5
రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు: అంబానీ కీలక ప్రకటన

2026 జనవరి 11న రాజ్‌కోట్‌లో నిర్వహించిన 'వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్‌'లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్వీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో.. రిలయన్స్ గుజరాత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచిందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో గుజరాత్‌లో సంస్థ రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మరో ఐదేళ్లలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది గుజరాత్ పాలనపై, నాయకత్వంపై, అభివృద్ధి సామర్థ్యంపై రిలయన్స్‌కు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.ఈ భారీ పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాల కోసమే కాకుండా.. గుజరాత్ ప్రజలు & భారతీయుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అంబానీ వివరించారు. పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ & గ్రీన్ మెటీరియల్స్‌లో భారతదేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేయడం రిలయన్స్ అన్నారు.Address by RIL CMD Shri Mukesh D. Ambani at the Vibrant Gujarat Regional Conferences - Kutch & Saurashtra Region pic.twitter.com/21DsQ6Ueuy— Reliance Industries Limited (@RIL_Updates) January 11, 2026

Do You Know About Pre Approved Personal Loan Know The Details Here6
ప్రీ అప్రూవ్డ్ లోన్ గురించి తెలుసా.. బ్యాంక్ ఎవరికి ఇస్తుందంటే?

ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.ఈ లోన్ ఎవరికి ఇస్తారు?బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.గుర్తుంచుకోవాల్సిన విషయాలుబ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.

Advertisement
Advertisement
Advertisement