ప్రధాన వార్తలు
ఫోన్పే పనితీరు ఓకే..
న్యూఢిల్లీ: ఐపీవో బాటలో సాగుతున్న ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే పనితీరు మెరుగుపడుతున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం చూస్తే.. గత మూడేళ్లలో ఆదాయం, లాభదాయకత, నగదు ఆర్జన పుంజుకున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ ఆదాయం గతేడాది(2024–25) రూ. 7,115 కోట్లకు చేరింది. 2022–23లో నమోదైన రూ. 2,914 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 56 శాతం జంప్చేసింది. వివిధ బిజినెస్ విభాగాల మానిటైజేషన్ సైతం ఇందుకు సహకరించింది.వీటిలో మర్చంట్ చెల్లింపులు, రుణాలు, బీమా పంపిణీ కలగలసి ఉన్నాయి. ఆదాయంలో మర్చంట్ పేమెంట్ల బిజినెస్ 15 శాతం నుంచి 2025కల్లా 28 శాతానికి బలపడగా.. 2025 సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల్లో 31 శాతానికి ఎగసింది. రుణాలు, బీమా పంపిణీ విభాగం సైతం 2023లో నామమాత్ర వృద్ధి కనబరచగా.. 2025కల్లా 8 శాతానికి, తదుపరి ఆరు నెలల్లో 12 శాతానికి పుంజుకుంది. ఇది కంపెనీకి కీలకమైన చెల్లింపుల బిజినెస్ నుంచి డైవర్సిఫికేషన్ను సూచిస్తోంది. నష్టాలకు చెక్ పలు అంశాలలో నిర్వహణా పనితీరు మెరుగుపడిన నేపథ్యంలో ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే నష్టాలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది రూ. 1,727 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే రూ. 1,069 కోట్లమేర రికవర్ అయ్యాయి. ఇదే కాలంలో నష్టాల మార్జిన్ 90.68 శాతం నుంచి 22.64 శాతానికి మెరుగుపడ్డాయి. గత రెండేళ్ల(2024, 2025)లో సర్దుబాటు తదుపరి నిర్వహణ లాభం(ఇబిటా) సానుకూలస్థాయికి చేరింది.నిర్వహణ సామర్థ్యం, కఠిన వ్యయ నియంత్రణలు ఇందుకు సహకరించాయి. ఇక 2024–25లో రూ. 190 కోట్లకుపైగా ఫ్రీ క్యాష్ఫ్లో సాధించగా.. తదుపరి 6 నెలల్లో రూ. 250 కోట్లు అందుకుంది. ప్రధానంగా కార్యకలాపాల ద్వారానే నగదు ఆర్జన సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు 2025 సెప్టెంబర్ లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సవాళ్లున్నా సాఫ్ట్వేర్దే హవా
ముంబై: భౌగోళిక–రాజకీయ అంశాల కారణంగా ఒడిదుడుకులు నెలకొని, కృత్రిమ మేథతో (ఏఐ) పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ టెక్నాలజీ రంగం ఆదాయం 315 బిలియన్ డాలర్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందనుంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వార్షిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు జత కావడం ద్వారా ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 58.15 లక్షల నుంచి పెరిగి 59.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.33 లక్షల కొత్త కొలువులు జత కాగా, ఈసారి 2,000 మాత్రమే పెరగడమనేది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ స్థాయి వృద్ధిగా నమోదు కానుంది. ఆదాయం వృద్ధి చెందినంత స్థాయిలో కొలువులు పెరగకపోయినప్పటికీ, నికరంగా ఉద్యోగాలు పెరుగుతుండటమనేది సానుకూలాంశమని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. టెక్నాలజీలో పరిస్థితులు మారే కొద్దీ రాబోయే రోజుల్లోనూ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తుననట్లు వివరించారు. 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో 20 లక్షల మంది ఏఐ శిక్షణ పొందగా, వీరిలో 3 లక్షల మంది అడ్వాన్స్డ్ ఏఐ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే కొత్త విభాగాల్లో టెక్నాలజీపై ఖర్చు చేయడం పెరుగుతుండటం సానుకూలమైన విషయమన్నారు. నివేదిక ప్రకారం.. ⇒ ప్రధాన ఐటీ సరీ్వసుల ఆదాయం 143 బిలియన్ డాలర్ల నుంచి 149 బిలియన్ డాలర్లకు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రెవెన్యూ 55 బిలియన్ డాలర్ల నుంచి 59 బిలియన్ డాలర్లకు, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఆదాయం 21 బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ⇒ ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఆదాయాలు 59 బిలియన్ డాలర్ల నుంచి 63 బిలియన్ డాలర్లకు, హార్డ్వేర్ కంపెనీల ఆదాయాలు 19 బిలియన్ డాలర్ల నుంచి 21 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి. ⇒ గతంలో అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం ఆసియా–పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీ మార్కెట్లో ఆదాయాలు అత్యధికంగా 7.9 శాతం మేర వృద్ధి చెందనుండటం ఆసక్తికరమైన అంశం. ⇒ విభాగాలవారీగా చూస్తే ఆరోగ్య సంరక్షణ, ట్రావెల్, రవాణా సెగ్మెంట్ల ఆదాయాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ⇒ చాలా మటుకు కంపెనీలు ఏఐ ఆదాయాలను వెల్లడించవు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కృత్రిమ మేథపరమైన ఆదాయాలు 10–12 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా.
ఏఐతో ఐటీకి ఇబ్బందే...
ముంబై: పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున కృత్రిమ మేధకు (ఏఐ) మారడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు బాధాకరమైన ప్రక్రియగానే ఉంటుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ చెప్పారు. అయితే, గతంలో వై2కే సవాళ్లు వచ్చినప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లుగానే, పరిశ్రమ తిరిగి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యాలు పరిశ్రమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారన్నారు.ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఏఐ మోడల్స్ రాకతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశీ ఐటీ రంగం కీలక దశలో ఉందని, వచ్చే 5–10 ఏళ్లలో పరిశ్రమ సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోడింగ్ విషయంలో ఆంథ్రోపిక్ క్లాడ్ అత్యద్భుతంగా పని చేసినప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కోడింగ్ వాటా 30 శాతమే ఉంటుంది కాబట్టి పరిశ్రమలో అవకాశాలు మెరుగ్గానే ఉండొచ్చన్నారు. ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ రాబోయే రోజుల్లో ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని కుమార్ చెప్పారు. క్లయింట్లకు భారీగా బిల్లింగ్ వేస్తూ, గణనీయంగా వృద్ధి చెందిన సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) కంపెనీలకు, ఇకపై అదే స్థాయిలో చార్జీలు విధించడం సాధ్యపడదు కాబట్టి అవి సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులకు తగ్గ స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశాలు లేనందున విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు సమస్యలు ఎదురుకావొచ్చన్నారు.
కోబాల్ షాక్
ముంబై: అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ కొత్త అప్డేట్ తీసుకొచ్చినప్పుడల్లా ‘ఐటీ మార్కెట్’ వణికిపోతోంది. తాజాగా కోబాల్ వంటి పాత ప్రోగ్రామింగ్ భాషలతో పనిచేస్తున్న సిస్టమ్లు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చేందుకు తమ ‘క్లాడ్ కోడ్’ టూల్ ఉపయోగపడుతుందని ప్రకటించింది. ఈ కోడింగ్ టూల్స్తో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గి, కంపెనీల ఆదాయాల పరిమితం కావొచ్చని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఐటీ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒకశాతానికి పైగా పతనమైంది.అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత అనిశి్చతులు, క్రూడాయిల్ ధరలు, అమెరికా–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,425 వద్ద నిలిచింది. ఒక్కరోజే రూ.2.85 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలహీనపడి 90.95 వద్ద స్థిరపడింది. బలహీనంగా మొదలై.. భారీ నష్టాల్లోకి..అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ గడిచే కొద్ది మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఏఐ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేయటంతో ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో చిత్తు అయ్యాయి. రియల్టీ, మీడియా స్టాక్స్ కూడా భారీగానే నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,360 పాయింట్లు క్షీణించి 82 వేల స్థాయి దిగువన 81,934 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పతనమై 25,328 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అలాగే మంగళవారం నిఫ్టీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మార్పు, చేర్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. ⇒ ఆంథ్రోపిక్ తాజా అప్డేట్ ప్రకటనతో భారత ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్టీఐఎం 6.50%, టెక్ మహీంద్రా 6.17%, పెర్సిస్టెంట్ 6%, హెచ్సీఎల్ టెక్ 5.83%, కోఫోర్జ్ 5.24% క్షీణించాయి. ఎంఫసిస్ 3.67%, టీసీఎస్ 3.56%, ఇన్ఫోసిస్ 3.56%, విప్రో 3% పతనమయ్యాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్సు 4.8% నష్టపోయింది. కృత్రిమ మేధ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్సు ఈ ఫిబ్రవరిలో ఏకంగా 21% కుప్పకూలింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2008) తర్వాత ఈ సూచీ ఒక నెలలో ఆ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 5%, రియల్టీ 2.61%, టెలీకమ్యూనికేషన్ 1.79%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.12%, ఇండ్రస్టియల్స్ 0.91%, క్షీణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.68%, 0.54% చొప్పున క్షీణించాయి. ⇒ ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ఇతర చట్టాల ద్వారా టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండోనేíÙయా 1.4%, హాంగ్కాంగ్ 1.85%, సింగపూర్ 0.4% పతనమయ్యాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు అరశాతం వరకు పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఆరంభంలో భారీగా పడి, వెంటనే కోలుకుని లాభాలతో ట్రేడవుతున్నాయి.ఐబీఎంకు ఆంథ్రోపిక్ భయంఐబీఎం సిస్టమ్స్లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోబాల్ను తమ ‘క్లాడ్ కోడ్ టూల్ ఆధునికీకరించగలదంటూ ఆంథ్రోపిక్ చేసిన ప్రకటనతో ఐబీఎం షేరు కుప్పకూలింది. సోమవారం ఏకంగా 13.2% క్షీణించి 223.35 డాలర్ల వద్ద ముగిసింది. 2000 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువకు ఒక్కరోజే 40 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.టెక్ నిపుణులు నెలల పాటు శ్రమించి రూపొందించే కోడ్ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేసే కోబాల్ క్లాడ్ కోడ్ టూల్ ఆవిష్కరణతో ఐబీఎంతో పాటు అంతర్జాతీయంగా సైబర్ సెక్యురిటీ, సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీస్ (సాస్) రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లు భారీ నష్టపోయాయి. ఈ ప్రభావమూ దేశీయ ఐటీ సంస్థల షేర్లపై పడింది. సోమవారం భారీ నష్టం నుంచి తేరుకున్న ఐబీఎం షేరు మంగళవారం ఇంట్రాడేలో 4.27% లాభంతో 232.88 డాలర్లను తాకింది.
తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఒకటి. చాలామంది వాహన ప్రియులకు ఈ కార్లలో ఒక్కసారైనా తిరగాలని ఉంటుంది. కానీ వీటి ధర కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు. ధనవంతులు సైతం రోల్స్ రాయిస్ కారు కొనాలంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ (Reuben Singh) యూకేకు చెందిన వ్యాపారవేత్త, ఇషర్ క్యాపిటల్ సీఈఓ. తలపాగా ధరించడం వల్ల ఈయన ఒకప్పుడు జాతి వివక్షను, ఆంగ్లేయుల నుంచి అవమానాలను ఎదుర్కున్నారు. సిక్కులు పవిత్రంగా చూసే తలపాగాను అవమానించడంతో.. సింగ్ తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు.టర్బన్ ఛాలెంజ్ పేరుతో ప్రతి వారం ఆయన ధరించిన తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి.. దానితో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తం 15 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయనను అవమానించినవారే అవాక్కయ్యారు.ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన కియోసాకి బుక్రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. ఈయన వద్ద పోర్స్చే 918 స్పైడర్, బుగట్టి వెయ్రాన్, పగని హుయారా, లంబోర్గిని హురాకాన్, లిమిటెడ్ ఎడిషన్ ఫెరారీ F12 బెర్లినెట్టా కార్లను కూడా కలిగి ఉన్నారు.ఎవరీ రూబెన్ సింగ్?బ్రిటన్ బిల్ గేట్స్గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రూబెన్ సింగ్. తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు.
బెస్ట్ మైలేజ్ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువ!
కార్లు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకుంటారు. ఇందులో కూడా కొంత తక్కువ ధరలో లభించే కార్లు అయితే బెస్ట్ అని భావిస్తారు. కాబట్టి ఈ కథనంలో అత్యుత్తమ మైలేజ్ (ఏఆర్ఏఐ) ఇచ్చే రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 కార్ల గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి సెలెరియో (రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.73 లక్షలు): 25-26 కిమీ/లీ పెట్రోల్ & 35 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి స్విఫ్ట్ (రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షలు): 24.8 కిమీ/లీ పెట్రోల్ & 32.85 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి డిజైర్ (రూ. 6.26 లక్షల నుంచి రూ. 8.031 లక్షలు): 24.8 కి.మీ/లీ పెట్రోల్ & 33.73 కి.మీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.84 లక్షలు): 25.19 కి.మీ/లీ పెట్రోల్ & 33.47 కి.మీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి ఆల్టో కే10 (రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షలు): 24.9 కిమీ/లీ పెట్రోల్ & 33.40 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షలు): 25.30 కిమీ/లీ పెట్రోల్ & 32.73 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి బాలెనో (రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షలు): 22.35 కిమీ/లీ పెట్రోల్ & 30.61 కిమీ/కేజీ సీఎన్జీటాటా టియాగో (రూ. 4.57 లక్షల నుంచి రూ. 7.82 లక్షలు): రూ. 19 కి.మీ./లీటర్ పెట్రోల్హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ (రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.92 లక్షలు): 16-18 కి.మీ/లీ పెట్రోల్రెనాల్ట్ క్విడ్ (రూ. 4.30 లక్షల నుంచి రూ. 6.45 లక్షలు): 22 కి.మీ/లీ పెట్రోల్
కార్పొరేట్
తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!
రూ.20 వేలకోట్ల పెట్టుబడి: ఎయిర్టెల్ ప్లాన్ ఏంటి?
25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన బుక్
తెలంగాణలో త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’
‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్ఫామ్ ప్రారంభం
ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు
బ్యాంకులూ..మీ పని మీరు చూసుకోండి
అమెజాన్ అతిపెద్ద ఆఫీస్.. ఇక్కడే..
2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మోసం.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్!
మార్కెట్కు ‘యూఎస్ సుప్రీం’ జోష్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ...
'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్
భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ ...
ట్రంప్ సుంకాలు రేపటి నుంచి బంద్
అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల (టారిఫ్స్)కు బ్...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్...
భారత ఆర్థిక భవిష్యత్తుకు పెన్షన్లు కీలకం
భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించి చర్చ వచ్చినప్పుడల్...
‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను ...
యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా స...
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్: 25 జేబీ డేటా..
ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేసే రిలయన్స్ జియో.. తాజాగా రూ. 365 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?, డేటా, ఎస్ఎమ్ఎస్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ. 365 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. కస్టమర్లు 25 జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇవి కాకుండా.. యూజర్లు మూడు నెలల పాటు జియో హాట్స్టార్ మొబైల్ & టీవీ యాక్సెస్ను పొందవచ్చు.జియోఏఐ క్లౌడ్ కింద 50 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్ను కూడా అందిస్తోంది. అంతే కాకుండా.. రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్లాన్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే, దీనిని యాక్టివేట్ చేయాలి. ఈ ప్లాన్ను ఉపయోగించడానికి మీరు 18 ఏళ్లు పైబడి ఉండాలని గుర్తుంచుకోండి.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం
కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్ గవర్నెన్స్లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
గ్లోబల్ జాబ్స్కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు. ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలుఇండియాపై ప్రశంసలుపన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే..
పర్సనల్ ఫైనాన్స్
ప్రభుత్వ సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు?
భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.మోసం బయట పడిందిలా..ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్బీఐ, ఎస్బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్లో పీఎస్యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్షిప్లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్తో ఆకర్షిస్తాయి.మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్బీఐ లిక్విడిటీ మేనేజ్మెంట్, సీఆర్ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.ఐడీఎఫ్సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్లను పరిశీలించాలి. ఆర్బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం.
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!
నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు ‘స్కాన్అండ్పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్ ఎస్టేట్లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్.. ఇన్కమ్టాక్స్.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్కమ్ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్మెంట్ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.
రిటైర్మెంట్కు రెడీనా?
రిటైర్మెంట్ అంటే... 60 ఏళ్లకు కదా! అనుకుంటారంతా. ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించటమెందుకని రోజులు గడిపేస్తూ ఉంటారు. దాదాపు 70 శాతం మంది వేతన జీవులది ఇదే పరిస్థితి. కాకపోతే ఆ మిగిలిన 30 శాతం మందీ మరోరకంగా ఆలోచిస్తుంటారు. వారి దృష్టిలో రిటైర్మెంట్ అంటే ఉద్యోగానికి గుడ్బై చెప్పటం కాదు. తప్పనిసరి పనికి స్వస్తి చెప్పి... నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛను సంపాదించుకోవటం. ఆ స్వేచ్ఛను ఎంత త్వరగా సంపాదించుకోగలిగితే... అంత త్వరగా తప్పనిసరి పనికి గుడ్బై కొట్టేయటం. చాలామందికి 60 ఏళ్లు దాటినా కూడా ఈ తరహా స్వేచ్ఛ సాధ్యం కాదు. కొందరు మాత్రం 40లు, 50లలోనే సాధ్యం చేసుకోగలుగుతున్నారు. ఎలా? దీనికి ఏం చేయాలి? ఇదే ఈ వెల్త్ స్టోరీ...క్యాంపస్లోనో, కాలేజీ నుంచి బయటకు వచ్చాకో మంచి జాబ్ కొడితే సెటిలైపోయినట్లేనని భావిస్తారు చాలామంది. ఆదాయాన్ని బట్టి ఖరీదైన ఫోన్లు, కారు, ప్రీమియం హౌస్... ఇలా ఖర్చు చేసుకుంటూ వెళుతుంటారు. భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఈఎంఐల రూపంలో ఇప్పుడే ఖర్చు చేసేస్తుంటారు. వారికప్పుడు రిటైర్మెంట్ గుర్తుకే రాదు. కొందరికి గుర్తుకు వచ్చినా ప్రాధాన్యంగా తీసుకోరు. 40 ఏళ్లు దాటాక మెల్లగా ఆలోచించటం మొదలుపెడతారు. అక్కడి నుంచి మరో 15–20 ఏళ్లే ఉండడంతో, ఇక తప్పదులే అనుకుని ఆదాయంలో కొంత పక్కన పెట్టడం ఆరంభిస్తారు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఈ వాయిదానే పెద్ద ప్రతికూలమన్నది చాలా మంది తెలుసుకోరు. 20–30ల నుంచి పెట్టుబడి ఆరంభిస్తేనే అది పెద్ద నిధిగా మారుతుంది. వాస్తవానికి రిటైర్మెంట్ ప్రణాళిక ఫెయిలవటానికి ప్రధాన కారణం పెట్టుబడిని ఆలస్యంగా మొదలు పెట్టడమే. త్వరగా మొదలు పెడితే చక్ర వడ్డీ ఫలితంగా (కాంపౌండింగ్) అది పెద్ద మొత్తమవుతుందన్నది గుర్తించకపోవటమే.అవగాహన లేమి..ప్రైవేటు రంగంతోపాటు, అసంఘటిత రంగంలోని వారికి సామాజిక భద్రత తక్కువే. ఉద్యోగుల భవిష్యనిధి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి 7–8 శాతమే. ఇందులో 6 శాతం ద్రవ్యోల్బణం తీసివేస్తే మిగిలేది ఎంత? కొంత మంది బీమా పాలసీల్లో (ఎండోమెంట్, యులిప్) ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎండోమెంట్ ప్లాన్లలో దీర్ఘకాల రాబడి 4–5 శాతం మించదు. యూనిట్ లింక్డ్ ప్లాన్లలోనూ (యులిప్) రాబడి 8–9 శాతమే. తమకున్న ప్రాపర్టీ ఆదుకుంటుందిలే? అన్నది కూడా అవగాహన లేమే. ఒక్క చిన్న వివాదంతో ప్రాపర్టీ ఏళ్ల కొద్దీ అపరిష్కృతంగా ఉండిపోగలదు.వృద్థాప్యంలో తమ అవసరాలను చూసుకోవడానికి పిల్లలు ఉన్నారుగా? ఇలాంటి ఆలోచనలు.. 60 తర్వాత 20–30 ఏళ్ల ప్రశాంత జీవనానికి సోపానాలు కానే కావు.అత్యాధునిక వైద్య విధానాలతో ఆయుర్దాయం (జీవనకాలం) పెరుగుతోంది. వైద్య వ్యయాలు కూడా ఏటేటా రెండంకెల స్థాయిలో పెరుగుతుండడం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తమే ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షల పొదుపు కరిగిపోవచ్చు. ఇక మనలో కొంత మంది అయితే విశ్రాంత జీవన నిధిని పిల్లల విద్యావసరాలకు ఖర్చు పెట్టేస్తుంటారు. ఇది చేయరాని తప్పు. ఆలస్యం అమృతం విషం..25 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవచ్చు. కానీ సంపద సమకూర్చుకోవడంలో ఎంతో తేడా వస్తుంది. నెలకు రూ.15,000 చొప్పున 25 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 60వ ఏట వరకు 10 శాతం వార్షిక రాబడి (సగటు) వచ్చే ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 35 ఏళ్లలో రూ.5.14 కోట్లు (రూ.514 లక్షలు) సమకూరుతుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.60 లక్షలే.ఐదేళ్లు ఆలస్యంగా 30వ ఏట నుంచి మొదలు పెట్టి 60 వరకు 30 ఏళ్ల పాటు ఇంతే మేర పొదుపు చేస్తే సమకూరేది రూ.3.12 కోట్లు. ఐదేళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.2 కోట్ల నిధిని కోల్పోయినట్టు అవుతుంది. ఇంకో పదేళ్లు ఆలస్యంగా 40 ఏళ్లలో మొదలు పెడితే.. 20 ఏళ్లలో ఇదే రూ.15,000తో సమకూరేది కోటీ ఎనిమిది లక్షల రూపాయలు. ఎంత కావాలి..?ఒక వ్యక్తికి నేడు నెలవారీ రూ.50,000 ఖర్చు అవుతుంటే.. 25 ఏళ్ల తర్వాత అదే మాదిరి జీవన అవసరాలకు నెలకు రూ.2 లక్షలు అవసరమవుతుంది. ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన అంచనా ఇది. నెలకు రూ.2 లక్షల ఆదాయం రూ.4–5 కోట్ల నిధిపైనే సాధ్యం. మరి రూ.5 కోట్ల నిధిని సమకూర్చుకోవడం మధ్య తరగతి వారికి ఐదు, పదేళ్లలో సాధ్యమేనా..? కనీసం ఇంత అవసరం..ఆర్జన ఆరంభించిన మొదటి నెల నుంచే 20–25 శాతాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఈక్విటీ ఫండ్స్లో ప్రతినెలా సిస్టమ్యాటిక్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏటా ఆదాయ వృద్ధికి సమానంగా రిటైర్మెంట్ ఫండ్ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రతి నెలా ఇంటి అద్దె, గ్రోసరీ, యుటిలిటీ (బ్రాడ్బ్యాండ్, మొబైల్, విద్యుత్) కేటాయింపులు ఎలా తప్పనిసరో.. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ నిధి కోసం నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం కూడా అంత అవసరం. లేదంటే ఒక లక్ష్యం కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది.రిటైర్మెంట్ నాటికి సమకూర్చుకున్న నిధిని మూడు భాగాలు చేసుకోవాలిస్వల్పకాల అవసరాలు, ఆరోగ్య అత్యవసరాల్లో వెంటనే తీసుకునేందుకు వీలుగా (రెండేళ్ల అవసరాలకు సరిపడా) ఒక భాగం ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం లిక్విడిటీ (వెంటనే నగదుగా మార్చుకునే) ఎక్కువగా ఉండే లిక్విడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.3–10 ఏళ్ల అవసరాల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక పదేళ్లకు మించిన అవసరాల కోసం మరో భాగం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పెట్టుబడుల విషయంలో కొంత రిస్క్ తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాల నిధి ద్రవ్యోల్బణాన్ని మించి ఎక్కువగా కాంపౌండ్ అవుతుంది.వాస్తవాలు ఇవీ..రిటైర్మెంట్ కోసం తాము మరింత ముందు నుంచే ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు? అని 50 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మంది ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది.రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారు 2025 నాటికి 37 శాతమే. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ విషయంలో ప్రణాళికలేమితో ఉన్నట్టు తెలుస్తోంది.తమ పొదుపు నిధి రిటైర్మెంట్ తర్వాత పట్టుమని పదేళ్లు అయినా చాలుతుందో, లేదోనని 63 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.పట్టణాల్లో సగం మంది రిటైర్మెంట్ కోసం ముందు నుంచే పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. కానీ, 40 శాతం మంది విశ్రాంత జీవనం కోసం అసలు పెట్టుబడే మొదలు పెట్టలేదు.ప్రణాళిక మొదలు పెట్టిన వారిలోనూ కేవలం 37 శాతమే సమకూర్చుకోవాల్సిన నిధిలో పావు శాతం లక్ష్యానికి చేరారు. రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న వారిలో జీవిత బీమానూ పరిగణనలోకి తీసుకుంటున్నవారు 95 శాతంగా ఉన్నారు.అత్యంత ముఖ్యమైన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకం గురించి 64 శాతం మందికి తెలిసినా.. అందులో ఇన్వెస్ట్ చేస్తున్న వారు 16–25 శాతం మించిలేరు.ఇక రిటైర్మెంట్ కోసం పక్కన పెడుతున్న వారిలో కూడా జీవించినంత కాలం ఆ నిధి సరిపోతుందన్న నమ్మకంతో ఉన్నవారు 19 శాతం మందే.ఈ ఫలితాలు విశ్రాంత జీవన అవసరాలకు చాలా ముందుగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
ఖర్చులకు కళ్లెం వేద్దాం!
ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్ఫోన్లు, కార్లు, లాప్టాప్లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్మెంట్’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్టాప్లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్గ్రేడెడ్ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్ స్టోరీ చూడండి...మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్స్టయిల్ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. ద్రవ్యోల్బణం.. సైలెంట్ కిల్లర్ ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్స్టయిల్పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. → మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె → కారును అప్గ్రేడ్ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. → మరింత తరచుగా బయట తినటం, ఫుడ్ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. → జిమ్తో పాటు అనేక ఓటీటీలు, యాప్లు సబ్స్క్రయిబ్ చెయ్యటం. వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. ‘అవసర ఖర్చుల’ భ్రమ .. అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్ఫోన్ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. ఏం చేయాలంటే.. జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. → పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్ రూల్ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్స్టయిల్ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. → పొదుపును ఆటోమేట్ చేయాలి ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్స్టయిల్ ఖర్చులు ఆటోమేటిక్గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. → ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్గ్రేడ్ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. → సబ్్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది. మూడు కేటగిరీలు.. వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్స్టయిల్ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది. లైఫ్స్టయిల్ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. → బయట హోటళ్లలో తినడం → విహార యాత్రలు → సబ్స్క్రిప్షన్లు→ అప్గ్రేడెడ్ గ్యాడ్జెట్లు → తరచుగా వాహనాలను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండటంతప్పనిసరైన ఖర్చులు ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. → విద్య → ఆరోగ్య సంరక్షణ → ప్రాథమిక హౌసింగ్ → బీమా → నిత్యావసరాలులీకేజీలు అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్ కిందికి వస్తాయి. → ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్లైన్లో షాపింగ్ → క్రెడిట్ కార్డ్ బాకీలను రోలోవర్ చేస్తుండటం. → ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కన్వీనియెంట్గా చేసే వ్యయాలురియాలిటీ చెక్ లైఫ్స్టయిల్కి సంబంధించి అప్గ్రేడ్స్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్స్టయిల్ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశ్చింతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్ సూత్రం ఒకటి ఉంది. → 50%– తప్పనిసరి అవసరాలు → 30% – లైఫ్స్టయిల్, కోరికలు → 20% – పొదుపు, పెట్టుబడులు. లైఫ్స్టయిల్ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్గా పడిపోతాయి.


