ప్రధాన వార్తలు
ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు ఒక అరుదైన, ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. కొంతమంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అధునాతనమైన ‘స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ దాడులు ఎంత శక్తివంతమైనవంటే, సాధారణ సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా కూడా వీటిని పూర్తిగా నిరోధించడం యాపిల్కు సవాలుగా మారింది.ఏమిటీ దాడులు?ఇవి సాధారణంగా మనం చూసే వైరస్లు లేదా ఫిషింగ్ లింక్ల వంటివి కావు. ఇవి ‘జీరో-క్లిక్’ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే, వినియోగదారు ఎటువంటి లింక్ను క్లిక్ చేయకపోయినా, ఏ అటాచ్మెంట్ను ఓపెన్ చేయకపోయినా.. కేవలం ఒక మెసేజ్ రావడం ద్వారా లేదా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.సాధారణంగా ఇవి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, కార్యకర్తలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతుంటాయి. ఈ దాడులకు సంబంధించిన విషయాలు యాపిల్ సంస్థకు కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే వీటిని ప్యాచ్ చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు.ఐఓఎస్ 26 అప్డేట్ ఎందుకు ముఖ్యం?ప్రస్తుతం యాపిల్ తన అత్యంత సురక్షితమైన ఐఓఎస్ 26 వెర్షన్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇది ఐఫోన్ 11, ఆపై మోడళ్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కీలకమైన సెక్యూరిటీ ప్యాచ్లు కేవలం ఐఓఎస్ 26లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత వెర్షన్లకు (ఉదాహరణకు ఐఓఎస్ 18) యాపిల్ ఇకపై ప్యాచ్లను అందించదని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?ఇప్పుడేం చేయాలి?మీ డేటా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ ఫోన్ ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్ అయితే వెంటనే Settings > General > Software Update లోకి వెళ్లి iOS 26కు అప్డేట్ చేయండి.కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్ను రీబూట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న అనుమానాస్పద ప్రక్రియలు ఆగిపోయే అవకాశం ఉంది.మీరు ఒకవేళ కీలక వ్యక్తి అయి, మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తే ఫోన్లోని ‘లాక్డౌన్ మోడ్’ను ఆన్ చేయండి. ఇది వెబ్ బ్రౌజింగ్, మెసేజ్ అటాచ్మెంట్స్ వంటి కొన్ని ఫీచర్లను పరిమితం చేస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్ పట్టుబడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.సైబర్ దాడులు నిరంతరం మారుతుంటాయి. కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడమే ఐఫోన్ వినియోగదారులకు ఉన్న అత్యుత్తమ రక్షణ అని గమనించాలి.
పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్.. వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.ముందస్తు ప్రణాళికసేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.ధరల పరిశీలనఒక సైట్లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్లైన్లో కొన్ని టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్బ్యాక్ ద్వారా వాలెట్లోకి వస్తుంది.నో-కాస్ట్ ఈఎంఐఖరీదైన వస్తువులు (ల్యాప్టాప్స్, ఫ్రిజ్లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.ఎక్స్ఛేంజ్ ఆఫర్లుమీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.సైబర్ భద్రత అత్యంత ముఖ్యంషాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్వేలను మాత్రమే వాడండి.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
ఏటా 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి
భారత పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏఎం గ్రీన్, జర్మనీకి చెందిన ఇంధన దిగ్గజం యూనిపర్ (Uniper)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఏటా 5 లక్షల టన్నుల వరకు పునరుత్పాదక అమ్మోనియాను యూనిపర్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఈమేరకు యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్, ఏఎం గ్రీన్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ కుమార్ చలమలశెట్టి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.ఒప్పందంలోని అంశాలు..ఏడాదికి గరిష్టంగా 5,00,000 టన్నుల గ్రీన్ అమ్మోనియాను యూనిపర్ కొనుగోలు చేయనుంది. ఒక భారతీయ సంస్థ ఇటువంటి భారీ స్థాయి అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1 ఎంటీపీఏ (ఏటా మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం) ప్లాంట్ నుంచి 2028 నాటికి మొదటి విడత ఎగుమతి ప్రారంభం కానుంది. ఈ అమ్మోనియా యూరోపియన్ RFNBO (Renewable Fuel of Non-Biological Origin) సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ చలమలశెట్టి మాట్లాడుతూ.. ‘గ్లోబల్గా ఎనర్జీ పరంగా వస్తున్న మార్పులో భారత్ పాత్రకు ఈ భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలుస్తుంది. మా ప్రత్యేకమైన క్లీన్ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ గ్రీన్ అమ్మోనియా.. కెమికల్స్, అల్యూమినియం వంటి కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తయ్యే పరిశ్రమలు తమ ఉద్గారాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్ స్పందిస్తూ.. ‘భారత్, యూరప్ మధ్య మొట్టమొదటి భారీ స్థాయి సరఫరా కేరిడార్ను ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ద్వారా ఎరువులు, రిఫైనింగ్ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని తెలిపారు. ఏఎం గ్రీన్ కో-ఫౌండర్ మహేష్ కొల్లి మాట్లాడుతూ, తమ పెట్టుబడిదారులు (Gentari, GIC, ADIA) సహకారంతో ప్రపంచ స్థాయి నాణ్యతతో సరైన ధరలో గ్రీన్ అమ్మోనియాను అందించే పర్యావరణ వ్యవస్థను నిర్మించామని తెలిపారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పత్రాలు చర్చనీయాంశం అయ్యాయి. మొండి బకాయిలు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, తనిఖీ నివేదికలు(Inspection Reports) వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకులు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించాయి.అసలు వివాదం ఏమిటి?సమాచార హక్కు చట్టం (RTI) కింద ధీరజ్ మిశ్రా, వాతిరాజ్, గిరీష్ మిట్టల్, రాధా రామన్ తివారీ వంటి సామాజిక కార్యకర్తలు ఆర్బీఐ వద్ద కొన్ని కీలక పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా..టాప్ 100 ఎన్పీఏల వివరాలు.బ్యాంక్ ఆఫ్ బరోడాకు విధించిన రూ.4.34 కోట్ల జరిమానాకు సంబంధించిన తనిఖీ నివేదికలు.యెస్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు.ఎస్బీఐ, ఆర్బీఎల్ బ్యాంకులపై ఆర్బీఐ జరిపిన పర్యవేక్షణ మూల్యాంకన నివేదికలు.ఆర్బీఐ వర్సెస్ బ్యాంకులుఆర్టీఐ నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని వెల్లడించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావించింది. సుప్రీంకోర్టు గతంలో జయంతిలాల్ ఎన్. మిస్త్రీ కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఆర్బీఐకి బ్యాంకులతో ఎటువంటి విశ్వసనీయ సంబంధం (Fiduciary Relationship) లేదని, కాబట్టి సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాచారం వెల్లడిస్తే తమ వాణిజ్య ప్రయోజనాలకు, మార్కెట్ పోటీతత్వానికి హాని కలుగుతుందని, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయంతిలాల్ మిస్త్రీ తీర్పును పునపరిశీలించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.సీఐసీ కీలక నిర్ణయంఈ వ్యవహారాలను విచారించిన సమాచార కమిషనర్ ఖుష్వంత్ సింగ్ సేథీ వీటి సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను గతంలో డబుల్ బెంచ్ విచారించినందున ఈ కేసులన్నింటినీ సీఐసీ నేతృత్వంలోని లార్జర్ బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయా సమాచారాలను దరఖాస్తుదారులకు వెల్లడించకూడదని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు.డిపాజిటర్ల హక్కులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనం విషయంలో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ లార్జర్ బెంచ్ సమాచార వెల్లడికి మొగ్గు చూపితే బ్యాంకింగ్ రంగంలోని లోపాలు, ఎగవేతదారుల వివరాలు బహిర్గతం అవుతాయి. లేదంటే బ్యాంకుల గోప్యతకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.2.7 కోట్ల జీతం.. ఉద్యోగం వదిలేసిన 22 ఏళ్ల యువకుడు..
రూ.2.7 కోట్ల జీతం.. జాబ్ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..
ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే? సరిగ్గా ఇదే ఆలోచనతో, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్లూలీ (Kluly) అనే ఏఐ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) డేనియల్ మిన్ తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడాదికి ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2.7 కోట్లు) వేతనం ఉన్న కొలువును వదులుకుని ఆయన కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.చిన్న వయస్సులోనే..ప్రఖ్యాత వార్టన్ స్కూల్ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన డేనియల్ మిన్ మే 2025లో తన 21వ ఏటనే క్లూలీలో చేరారు. మిన్ తన ప్రతిభతో తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ విజయం వెనుక ఉన్న శ్రమ క్రమంగా అతని మానసిక స్థితిపై ప్రభావం చూపడం మొదలైందని తాను చెప్పారు.రాజీనామా అనంతరం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ మిన్ తన మనసులో మాటను పంచుకున్నారు. ‘కెరీర్ ప్రారంభంలో రోజుకు 12 గంటలు కష్టపడటం సహజమని నేను భావించాను. కానీ, కాలక్రమేణా ఆ ‘గ్రైండ్’(నిరంతర పని) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నా స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం లేదా నా సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన పని, క్రమేణా భారంగా మారిందని, పని కాకుండా అసలు వేరే జీవితమే లేకుండా పోయిందని వెల్లడించారు.సీఈఓ ముందే..కంపెనీ సీఈఓ రాయ్ లీ తన పనితీరును గమనించి రాజీనామా గురించి అడిగినప్పుడు డేనియల్ మిన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. తన రాజీనామా నిర్ణయాన్ని చెబుతూ ఆయన సీఈఓ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, రాయ్ లీ ఎంతో సానుభూతితో స్పందించారని, ఉద్యోగం కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని తనను ప్రోత్సహించారని మిన్ తెలిపారు. ‘తమ ఉద్యోగుల శ్రేయస్సును కోరుకునే ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం’ అన్నారు.సోషల్ మీడియా స్పందనడబ్బు కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావించి డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘గ్రైండ్ కల్చర్ పేరుతో యువతను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదు’ అని కొందరు కామెంట్ చేశారు. ‘మీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ కొందరు కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి, కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీని వదులుకుని డేనియల్ మిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై మరోసారి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం
ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం
దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులకు ఐటీ, ఫైనాన్స్, బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ కొలువులే ఆర్థిక భరోసాకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. కానీ, ఆ స్వర్ణయుగం ఇప్పుడు ముగిసిందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జీ హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేసిన వైట్ కాలర్ ఉద్యోగాల మార్కెట్, ఇప్పుడు కేవలం 1 శాతం వృద్ధికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన భారతదేశ ఉద్యోగ భవిష్యత్తుపై విశ్లేషణ చేశారు.ఆవిరవుతున్న ఆశలు‘మారుతున్న సాంకేతిక పరిస్థితుల కారణంగా జీతం పొందే యుగం ముగిసింది. దశాబ్దాలుగా పట్టణ మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక ఎదుగుదలకు స్థిరమైన కార్యాలయ ఉద్యోగాలుగా భావించే విభాగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. టెక్ కంపెనీల్లో లే-ఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు), ఆటోమేషన్, కృత్రిమ మేధ (AI) విప్లవం కలిసి పాతకాలపు కొలువుల తీరును మార్చేస్తున్నాయి’ అన్నారు.‘ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో నియామకాలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా ఉత్పాదకత పెంచుకుంటూ, కొత్త నియామకాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కోడింగ్, కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ పనులు ఇప్పుడు సాఫ్ట్వేర్లే చేస్తున్నాయి. కేవలం టెక్ రంగమే కాదు.. ఫైనాన్స్, లీగల్, లాజిస్టిక్స్, మీడియా రంగాల్లో కూడా 2031 నాటికి ప్రస్తుతమున్న 25 శాతం ఉద్యోగాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’ అని చెప్పారు.విద్యార్థులకు వేక్-అప్ కాల్ప్రస్తుత విద్యా విధానం, పాత కెరియర్ సూత్రాలను అంటిపెట్టుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ముఖర్జీ హెచ్చరించారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వేచి ఉండటం ఇప్పుడు ఒక జూదం లాంటిదని అభిప్రాయపడ్డారు. ‘మీరు ఆటోమేట్ చేయలేని నైపుణ్యాలను నేర్చుకోకపోతే, రోజురోజుకు తగ్గిపోతున్న ఈ జాబ్ మార్కెట్లో నిరుద్యోగులుగా మిగిలిపోతారు’ అని సౌరభ్ ముఖర్జీ తెలిపారు.ఇప్పుడు ఏం చేయాలి?మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఏం చేయాలో ముఖర్జీ కొన్ని సూచనలు చేశారు.1. మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం: మెషీన్లు చేయలేని పనులైన సృజనాత్మకత, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటిపై దృష్టి పెట్టాలి.2. అడాప్టబిలిటీ: ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలను నేర్చుకోవడంతో పాటు వాటిని నిరంతరం అప్డేట్ చేసుకోవాలి.3. ఇతర నైపుణ్యాలు: కేవలం రెజ్యూమ్ ఉంటే సరిపోదు. ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, రియల్టైమ్ అనుభవం చాలా అవసరం.4. నెట్వర్కింగ్: పరిశ్రమ నిపుణులతో కనెక్ట్ అవ్వడం ద్వారా మారుతున్న మార్కెట్ ట్రెండ్స్ను ముందే పసిగట్టాలి.ఇదీ చదవండి: మీ డబ్బు - మీ నిర్ణయం..
కార్పొరేట్
ఏటా 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి
రూ.2.7 కోట్ల జీతం.. జాబ్ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..
ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం
మీ ఇల్లు బంగారంగానూ!
బెర్క్షైర్ హాత్వే కొత్త సీఈఓ: వేతనం ఎన్ని కోట్లంటే?
రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు: అంబానీ కీలక ప్రకటన
2010లో పెట్టిన ఆర్డర్.. 2026లో వచ్చిన డెలివరీ
ఆయిల్ పామ్ సాగుపై పెరుగుతున్న ఆసక్తి
మళ్లీ మొబైల్ చార్జీల మోత
ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఎప్పటినుంచంటే?
పడిలేచిన పసిడి.. ఒక్కసారిగా పెరిగిన రేటు!
శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 24 గ...
వరుస నష్టాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ...
తారుమారైన బంగారం, వెండి ధరలు..
బంగారం, వెండి ధరలలో మిశ్రమ మార్పులు చోటుచేసుకున్నా...
Stock Market Updates: నష్టాల్లో నిఫ్టీ.. సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా...
సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!
వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాను.. భారత్ అధిగ...
విదేశీ కాసుల గలగల.. పెరిగిన ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు డిసెంబర్ 26తో ముగిసిన వారంలో...
ఆర్ధిక వ్యవస్థలో భారత్.. జర్మనీని అధిగమించాలంటే?
2025 చివరి నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి.. ప్...
చెక్కుల తక్షణ క్లియరెన్స్ రెండో దశ వాయిదా
చెక్కుల చెల్లింపులను వేగవంతం చేసే రెండో దశ అమలును ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అదే రీఛార్జ్ ప్లాన్.. పెరిగిన డైలీ డేటా!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.BSNL enhances prepaid plans with extra daily data!Enjoy a data boost on ₹2399, ₹485, ₹347 & ₹225 at no extra cost. Stay connected longer on Bharat’s trusted network. Offer valid till 31 Jan 2026Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c#BSNL… pic.twitter.com/iQvAesldmr— BSNL India (@BSNLCorporate) January 9, 2026
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్టెల్ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!జూన్ 2026 నుంచి టారిఫ్లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.
ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన టీసీఎస్
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంత మంది ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) నిబంధనలను గత త్రైమాసికాల్లో పాటించని వారికి వార్షికోత్సవ ఆధారిత పనితీరు శాలరీ అప్రైజల్స్ను నిలిపివేసినట్లు సమాచారం.దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్లో, ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన అనంతరం వార్షిక సైకిల్ ప్రకారం అప్రైజల్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన ఫ్రెషర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అలాగే సంస్థ అంతర్గత పోర్టల్ ‘అల్టిమాటిక్స్’లోనూ ఈ అప్డేట్ కనిపిస్తుంది.ఈమెయిల్లో ఏం చెప్పిందంటే..“మీ వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, Q2 FY26 (జూలై 2025 – సెప్టెంబర్ 2025) వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాటించకపోవడంతో కార్పొరేట్ స్థాయిలో తదుపరి ప్రాసెసింగ్ జరగలేదు. జనవరి 2025లో మీ వార్షికోత్సవం ఉన్నప్పటికీ Q3లోనూ WFO పాటించకపోతే, మీరు FY26 బ్యాండింగ్ సైకిల్కు అనర్హులవుతారు. పనితీరు బ్యాండ్ విడుదల చేయబడదు” అని ఓ ఉద్యోగికి పంపిన ఈమెయిల్లో టీసీఎస్ యాజమాన్యం పేర్కొందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించింది.ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న తొలి ప్రధాన భారతీయ ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. ఇతర ఐటీ సంస్థలు సాధారణంగా వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే కార్యాలయ హాజరును తప్పనిసరి చేస్తుండగా, టీసీఎస్ ఆఫీస్ హాజరును వేరియబుల్ పే, అప్రైజల్స్తో అనుసంధానించింది.టీసీఎస్లో వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదట కంపెనీ లాంఛనంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అనంతరం సూపర్వైజర్ ఉద్యోగి గోల్ షీట్ను సిద్ధం చేస్తారు. సదరు ఉద్యోగి దానిని సమీక్షించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రైజర్తో చర్చలు జరుగుతాయి. సంవత్సరంలో సాధించిన లక్ష్యాల ఆధారంగా పనితీరు మూల్యాంకనం నిర్వహించి, తుది బ్యాండింగ్ ఫలితాలను విడుదల చేస్తారు.కాగా 2022లో లేటరల్ నియామకాల (లాటరల్ హైర్స్) కోసం టీసీఎస్ చివరి వార్షికోత్సవ అప్రైజల్స్ను నిలిపివేసింది. ఇక గతేడాది టీసీఎస్ తన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మినహాయింపు విధానంలో మార్పులు చేసింది. భారతదేశంలోని ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసం గరిష్టంగా ఆరు రోజుల వరకు మినహాయింపులు పొందవచ్చు. ఉపయోగించని రోజులను తదుపరి త్రైమాసికానికి మళ్లించుకునే అవకాశం లేదు.ఇది చదివారా? ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!కార్యాలయ స్థల పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులు ఒకే ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు మాత్రమే నివేదించవచ్చు. అయితే హాజరు మినహాయింపుల కోసం బల్క్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ద్వారా సబ్మిట్ చేయడాన్ని కంపెనీ నిషేధించింది.
శాంసంగ్ కొత్త టెలివిజన్.. ఇలాంటిది ఇదే తొలి టీవీ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్ టెలివిజన్ను తీసుకొచ్చింది. ‘సీఈఎస్ 2026’లో ప్రపంచంలోనే మొట్టమొదటి 130-అంగుళాల మైక్రో ఆర్జీబీ టీవీ (R95H మోడల్)ను ఆవిష్కరించింది. ఇది శాంసంగ్ ఇప్పటివరకు రూపొందించిన అతిపెద్ద మైక్రో ఆర్జీబీ డిస్ప్లే మాత్రమే కాదు, అల్ట్రా-ప్రీమియం టీవీల డిజైన్, టెక్నాలజీలో ఒక కొత్త దిశను సూచిస్తోంది.“మైక్రో ఆర్జీబీ మా పిక్చర్ క్వాలిటీ ఆవిష్కరణలో అత్యున్నత స్థాయి. ఈ 130-అంగుళాల మోడల్ ఆ దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్తుంది” అని శాంసంగ్ విజువల్ డిస్ప్లే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హన్ లీ తెలిపారు. “టెక్నాలజీని కళగా మలిచే మా ఒరిజినల్ డిజైన్ తత్వాన్ని ఆధునిక ఇంజనీరింగ్తో మళ్లీ పరిచయం చేస్తున్నాం” అన్నారు.టీవీ ఫీచర్లుఈ మైక్రో ఆర్జీబీ టీవీ భారీ పరిమాణం, నెక్స్ట్-జనరేషన్ కలర్ టెక్నాలజీ, ప్రీమియం డిజైన్ల సమ్మేళనం. ‘టైమ్లెస్ ఫ్రేమ్’ డిజైన్తో రూపొందిన ఈ టీవీ, గదిలో ఒక సాధారణ స్క్రీన్లా కాకుండా ఒక విశాలమైన, లీనమయ్యే కళాఖండంలా కనిపిస్తుంది.130-అంగుళాల మోడల్లో మైక్రో ఆర్జీబీ ఏఐ ఇంజిన్ ప్రో, కలర్ బూస్టర్ ప్రో, హెచ్డీఆర్ ప్రో వంటి అధునాతన టెక్నాలజీలు ఉన్నాయి. ఇవి ఏఐ సహాయంతో రంగుల స్పష్టత, కాంట్రాస్ట్, వివరాలను మెరుగుపరుస్తాయి.మైక్రో ఆర్జీబీ ప్రెసిషన్ కలర్ 100 ద్వారా 100% బీటీ.2020 వైడ్ కలర్ గ్యామట్ను అందిస్తుంది. వీడీఈ సర్టిఫికేషన్తో, నిజ జీవితానికి దగ్గరగా రంగులను ప్రదర్శిస్తుంది. శాంసంగ్ గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ ప్రతిబింబాలను తగ్గించి అన్ని లైటింగ్ పరిస్థితుల్లో స్పష్టమైన వీక్షణను ఇస్తుంది.ఈ టీవీ హెచ్డీఆర్10+ అడ్వాన్స్డ్, ఎక్లిప్సా ఆడియో, అలాగే మెరుగైన విజన్ ఏఐ కంపానియన్కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ ఫుట్బాల్ మోడ్ ప్రో, ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రో, లైవ్ ట్రాన్స్లేట్, జనరేటివ్ వాల్పేపర్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్ప్లెక్సిటీ వంటి ఫీచర్లతో స్మార్ట్ అనుభవాన్ని అందిస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
మీ ఇల్లు బంగారంగానూ!
తాకట్టు... రుణం!. ఈ రెండూ భవిష్యత్తుని నిర్ణయించేవే. అది ఎదగటమైనా... పాతాళానికి పడిపోవటమైనా!. దానికి దిక్సూచులు ఏ అవసరానికి తీసుకుంటున్నాం? ఎంత క్రమశిక్షణతో తిరిగి తీరుస్తున్నామనేవే. ఇక రుణ ప్రపంచానికి హృదయం లాంటివి హోమ్లోన్... గోల్డ్ లోన్. ఒకటి ఆశలు నెరవేర్చేదైతే మరొకటి అవసరాన్ని తీర్చేది. మరి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో రెండూ ఈ రుణాలిస్తున్నాయి కదా... ఏది మంచిది? ఏ రుణం ఎక్కడ తీసుకుంటే మంచిది? వీటికి సమాధానమే ఈ వెల్త్ స్టోరీ...సరైన రుణాన్ని, సరైన సంస్థను ఎంచుకోకకపోవటం వల్ల లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉండదూ? గృహరుణంలో ఒక్క 0.5 శాతం తేడా వల్ల మనం చెల్లించే సొమ్ము కొన్ని లక్షల రూపాయలు పెరిగిపోతుందంటే ఇబ్బందికరంగా లేదూ? అందుకే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో ఎక్కడ రుణం తీసుకున్నా... మన అవసరమేంటన్నది ముఖ్యం. ఆ అవసరానికి మనకు ఎంత త్వరగా రుణం వస్తోంది? ఎంత వడ్డీకి వస్తోంది? మన దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయా? మనకు కొన్ని వెసులుబాట్లు అవసరమా? ఇలాంటివన్నీ చూసుకుని, దానికి తగ్గ సంస్థను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. అదెలాగో చూద్దాం... గృహ రుణానికి బ్యాంకే మంచిదా? గృహ రుణం తీసుకునే వారు ఒక్క వడ్డీ రేటే కాకుండా చాలా అంశాలు చూడాలి. అదేమిటంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా బ్యాంకుల్లోనే తక్కువ. ఎందుకంటే ఇవి ఆర్బీఐ రెపో రేటు మాదిరి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేట్తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ రేట్లకు అనుగుణంగా తక్షణం మార్పుచేర్పులుంటాయి. ఉదాహరణకు 0.5 శాతం గనక వడ్డీ రేటు తగ్గితే... 20 ఏళ్ల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.3 లక్షలు మిగుల్చుకోవచ్చు. పైపెచ్చు బ్యాంకుల్లో గృహ రుణాలను గరిష్టంగా 30 ఏళ్ల కాలానికీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, దీర్ఘకాలం కారణంగా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. కాకపోతే బ్యాంకుల్లో గృహ రుణ దరఖాస్తుల పరిశీలన చాలా కఠినంగా ఉంటుంది. ప్రాపరీ్టకి క్లియర్ టైటిల్తోపాటు, రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ (రుణ పరపతి/ రుణ చరిత్ర) 700కు పైన ఉండాలి. చెల్లింపుల సామర్థ్యాలనూ బ్యాంక్లు చూస్తాయి. దీనికితోడు న్యాయపరమైన క్లియరెన్స్ కూడా తీసుకుంటాయి. కనుక ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఎన్బీఎఫ్సీలు ఎవరికంటే... నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) గృహ రుణాల విషయంలో బ్యాంకుల మాదిరి అంత కఠినంగా వ్యవహరించవు. 700కు దిగువన క్రెడిట్స్కోరు ఉన్న వారికి సైతం, ఇతర అర్హతల ఆధారంగా ఇవి రుణాలను అందిస్తుంటాయి. ఆదాయ ధ్రువీకరణల్లేని స్వయం ఉపాధిపై ఉన్న వారికి, తక్కువ ఆదాయ వర్గాలకు సైతం ఎన్బీఎఫ్సీల్లో రుణాలు లభిస్తాయి. పైపెచ్చు ఎన్బీఎఫ్సీల్లో గృహ రుణం కేవలం రోజుల వ్యవధిలో మంజూరవుతుంది. సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లోనే రుణం పొందొచ్చు. అంటే బ్యాంకులతో పోలి్చనపుడు ఎన్బీఎఫ్సీల్లో వేగవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఆశించొచ్చు. కాకపోతే ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేట్లు ఎక్కువ. కనుక వడ్డీ రూపంలో కాస్త ఎక్కువ చెల్లించాలి. బ్యాంకుల్లో మాదిరి అధిక రుణం మొత్తం అన్ని ఎన్బీఎఫ్సీల్లో సాధ్యపడదు. వీరికి బ్యాంక్ బెటర్.. → మంచి క్రెడిట్ స్కోరు ఉండి, ఆదాయ ధ్రువీకరణలున్న వారికి. → ఆర్బీఐ నియత్రణల కింద మరింత పారదర్శకత కోరుకునే వారికి. → సమయం పట్టినా తక్కువ వడ్డీకి రుణం కావాలనుకునేవారికి. వీరికి ఎన్బీఎఫ్సీలు.. → తక్కువ ఆదాయం లేదా ఫ్రీలాన్స్, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం వచ్చేవారికి → వేగంగా రుణం మంజూరు కోరుకునే వారికి. ళీ వడ్డీ రేటు కాస్త ఎక్కువైనా.. తమ అవసరాలకు వీలుగా సౌకర్యవంతమైన షరతులపై రుణం కోరుకునే వారికి బంగారంపై రుణం ఎక్కడ నయం? గృహ రుణం మాదిరే బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే రుణమూ సెక్యూర్డ్ కిందికే వస్తుంది. కనుక వీటిపైనా రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ రుణం మొత్తం, వడ్డీ రేటు, కాల వ్యవధి, చెల్లింపుల్లో సౌలభ్యం పరంగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. బ్యాంక్లు ఎక్కడ బెటరంటే... → బంగారంపై వడ్డీ రేటు బ్యాంకుల్లో తక్కువ. ఇవి 8 శాతం రేటుకే రుణాలిస్తుంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ రేటు గరిష్టంగా 12 శాతం వరకు ఉంటుంది. → బంగారంపై బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. రుణం తీసుకుని, ప్రతి నెలా చెల్లింపులు చేయకుండా.. ఒకేసారి తిరిగి చెల్లించేట్టయితే ఏడాది కాలానికి మంజూరు చేస్తారు. → రుణం తీసుకుని నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించేట్టు అయితే రెండు నుంచి మూడేళ్ల కాలానికి రుణాలిస్తారు. → ఇక బ్యాంకుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులైతే బంగారంపై తక్కువ రేటుకు రుణాలిస్తుంటాయి. → ఆర్బీఐ మార్గదర్శకాలను బ్యాంకులు కచి్చతంగా అనుసరిస్తుంటాయి. కనుక భద్రత, పారదర్శకత ఎక్కువ. → బ్యాంకుల్లో బంగారంపై రుణం అదే రోజు, గంటల్లోనే మంజూరవుతుంది. → కాకపోతే బ్యాంకుల్లో బంగారం విలువపై తక్కువ రుణం లభిస్తుంది. అంటే ఎక్కువ బ్యాంకులు బంగారం విలువలో 65–70 శాతానికి మించి రుణాన్ని ఇవ్వవు. ఎన్బీఎఫ్సీలు ఎక్కడ బెటరంటే... → ఎన్బీఎఫ్సీల్లో బంగారం రుణాలపై అధిక వడ్డీ రేటు అమలవుతుంది. వీటిల్లో 12 శాతం నుంచి 30 శాతం మధ్య రేటు ఉంటుంది. → కేవైసీ పరంగా ఆధార్, పాన్ ఇస్తే చాలు... బ్యాంకుల్లో మాదిరే బంగారంపై రుణం అదే రోజు వేగంగానే మంజూరవుతుంది. → ముఖ్యంగా బంగారంపై అధిక రుణాన్ని ఎన్బీఎఫ్సీలు ఆఫర్ చేస్తుంటాయి. కానీ, ఇందుకోసం అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సిందే. → వడ్డీని ఏ నెలకానెల కట్టేసి.. అసలును చివర్లో కట్టేస్తే సరిపోతుంది. → కాకపోతే వీటిల్లో రుణ కాలవ్యవధి బ్యాంకుల్లో మాదిరి సుదీర్ఘంగా ఉండదు. ఆరు నెలలు, ఏడాదికే ఆఫర్ చేస్తాయి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. → రుణాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తాయి. అంగీకారానికి ముందు.. → రుణం తీసుకునే ముందు ఒప్పంద నియమ నిబంధనలు, షరతులు, చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. → తిరిగి చెల్లింపుల పరంగా ఉన్న ఆప్షన్లను తెలుసుకోవాలి. → రుణాన్ని నిరీ్ణత కాల వ్యవధికి ముందే తీర్చివేస్తే పెనాల్టీ మాదిరి ఏవైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? అడగాలి. → వివిధ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య రుణ రేట్లు, చార్జీలను పోల్చి చూసుకోవాలి. → సాధారణంగా దీర్ఘకాల రుణాలకు బ్యాంక్లు అనుకూలం, సౌకర్యం. → అత్యవసరంగా, అధిక రుణం కోరుకునే వారికి ఎన్బీఎఫ్సీలు అనుకూలం.రుణ వ్యయాలు తగ్గించుకోవడమెలా? → రుణం తీసుకోవడానికి ముందు తమ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఏడాదిలో ఒక్కసారి క్రెడిట్ స్కోరును ఆయా సంస్థలు ఉచితంగా ఇస్తాయి. → 760కు పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారు తక్కువ వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కోసం డిమాండ్ చేయొచ్చు. → గృహ రుణం అయితే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ (ఆర్బీఐ రెపో/ఈబీఎల్ఆర్) రేటు ఆధారితంగా ఎంపిక చేసుకోవాలి. → రుణం తీసుకునే సమయంలో అధిక రేటు ఉండి, ఆ తర్వాత రేట్లు దిగొస్తే.. మిగిలిన బకాయిని తక్కువ రేటు ఉన్న సంస్థకు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి.
ప్రీ అప్రూవ్డ్ లోన్ గురించి తెలుసా.. బ్యాంక్ ఎవరికి ఇస్తుందంటే?
ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.ఈ లోన్ ఎవరికి ఇస్తారు?బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.గుర్తుంచుకోవాల్సిన విషయాలుబ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.
బ్యాంకులకు వారమంతా సెలవులే!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల షెడ్యూల్ను ప్రకటించింది. స్వామి వివేకానంద జయంతి, మకర సంక్రాంతి, తిరువళ్లువర్ దినోత్సవం, ఉళవర్ తిరునాళ్ వంటి పండుగల నేపథ్యంలో వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు వారపు సెలవులుగా పాటిస్తాయి. ఇదే క్రమంలో ఈ జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు (వారాంతాలు కలుపుకొని) ఉంటాయి.ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా సెలవులు మారవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందువల్ల ఖాతాదారులు తమ స్థానిక బ్యాంకు శాఖ సెలవు షెడ్యూల్ను ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం అవసరం.వచ్చే వారం బ్యాంకు సెలవులు ఇవే..జనవరి 12: స్వామి వివేకానంద జయంతి – పశ్చిమ బెంగాల్జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు – గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోంజనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాళం / పొంగల్ / మాఘే సంక్రాంతి / మకర సంక్రాంతి – తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కింజనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం – తమిళనాడుజనవరి 17: ఉళవర్ తిరునాళ్ – తమిళనాడుజనవరి 18: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవుబ్యాంకులు మూసివున్నా ఇవి పనిచేస్తాయిబ్యాంకు సెలవు దినాల్లో కూడా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఏటీఎం నగదు ఉపసంహరణ వంటి సేవలను సాధారణంగానే వినియోగించుకోవచ్చు. అయితే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం చెక్కులు, ప్రామిసరీ నోట్లకు సంబంధించిన లావాదేవీలు సెలవు రోజుల్లో జరగవు.
పీఎఫ్ భాగ్యం మరింత మందికి దక్కుకుందా?
దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. తప్పనిసరి ఉద్యోగ భవిష్య నిధి (EPF)కు వర్తించే వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే, ఇప్పటివరకు ఈపీఎఫ్ పరిధికి బయట ఉన్న లేదా పరిమిత ప్రయోజనాలకే పరిమితమైన లక్షలాది ఉద్యోగులకు అదనపు భద్రత లభించే అవకాశముంది.ఏమిటీ వేతన పరిమితి?ప్రస్తుతం, ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం డీఏతో కలిపి రూ .15,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే ఈపీఎఫ్ తప్పనిసరిగా వర్తిస్తోంది. ఆ పరిమితిని పెంచితే, మధ్యస్థ వేతనాలు (వేతన రూ.30 వేల వరకూ పెంచే అవకాశం) పొందే ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ కవరేజీలోకి వస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం, ఎంఎస్ఎంఈలు, సేవారంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఉన్న రూ .15 వేల గరిష్ట వేతన పరిమితి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2014 సెప్టెంబర్లో దీన్ని నిర్ణయించారు. గత దశాబ్ద కాలంలో జీతాలు, జీవన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కానీ పీఎఫ్ పరిమితి మాత్రం మారకుండా అలాగే కొనసాగుతూ వస్తోంది.వేతన పరిమితి పెంచితే ప్రయోజనాలువేతనంతో పాటు సంస్థ వాటా కూడా ఈపీఎఫ్లో జమ కావడంతో దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది.పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత మెరుగవుతుంది.ఈపీఎస్ పరిధి విస్తరించడంతో పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.ఈపీఎఫ్కు చెల్లించే మొత్తాలపై పన్ను రాయితీలు ఉంటాయి.గృహ నిర్మాణం, వైద్యం, విద్య వంటి అవసరాలకు నిబంధనల ప్రకారం ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది.యాజమాన్యాలపై ప్రభావంవేతన పరిమితి పెంపుతో యాజమాన్యాలపై చెల్లింపుల భారం కొంత పెరగవచ్చు. అయితే, ఉద్యోగుల నిలుపుదల (రిటెన్షన్) మెరుగవడం, సామాజిక భద్రతతో కూడిన స్థిరమైన వర్క్ఫోర్స్ ఏర్పడటం వంటి దీర్ఘకాలిక లాభాలు సంస్థలకు దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రతిపాదనపై కార్మిక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపనుంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే, దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థకు ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.


