Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Common Driving Mistakes That Damage Your Car Braking System1
అందుకే.. బ్రేకింగ్ సిస్టం డ్యామేజ్ అవుతుంది!

ఒక కారులో సేఫ్టీ అంటే.. అందులోనే సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాదు. బ్రేకింగ్ సిస్టం చాలా అవసరం. ఎయిర్ కండిషనింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు & పవర్ విండోస్ వంటి వాటిలో సమస్య తలెత్తితే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ బ్రేకింగ్ సిస్టం దెబ్బతింటే మాత్రం అది వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలపెడుతుంది.బ్రేక్స్ అనేవి వాహనాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా.. దానిని కంట్రోల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వేడి, ఒత్తిడి మధ్య పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే సరైన డ్రైవింగ్ & నిర్వహణ, బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచవచ్చు. బ్రేకింగ్ సిస్టం తొందరగా డ్యామేజ్ కావడానికి కారణాలు ఏమిటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.➤హార్డ్ బ్రేకింగ్: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ప్యాడ్లు, డిస్కులు తొందరగా నశిస్తాయి.➤ఓవర్ స్పీడ్ డ్రైవింగ్: ఎక్కువ స్పీడ్‌లో కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.➤ఓవర్‌లోడింగ్: వాహనంపై అధిక బరువు వేయడం బ్రేక్ భాగాలపై అదనపు ఒత్తిడి పెడుతుంది.➤క్వాలిటీ లేని బ్రేక్ ప్యాడ్లు: నాసిరకం లేదా డుప్లికేట్ భాగాలు త్వరగా దెబ్బతింటాయి.➤బ్రేక్ ఫ్లూయిడ్ సమస్యలు: ఫ్లూయిడ్ తక్కువగా ఉండటం, లీక్ అవడం వల్ల కూడా బ్రేకింగ్ పనితీరు తగ్గుతుంది.➤కాలిపర్ స్టికింగ్: బ్రేక్ కాలిపర్ సరిగా రిలీజ్ కాకపోతే ప్యాడ్లు ఎప్పుడూ డిస్క్‌ను తాకుతూ ఉంటాయి, దీంతో వేగంగా వేర్ అవుతుంది.➤డిస్క్/డ్రమ్ వంకర పడటం: అధిక వేడి లేదా నీటిలో నడపడం వల్ల డిస్కులు వంకరపడే అవకాశం ఉంది.➤మలినాలు చేరడం: బ్రేక్ భాగాల మధ్య మలినాలు చేరితే ఘర్షణ పెరిగి తొందరగా పాడవుతాయి.➤సర్వీసింగ్: సమయానికి చెక్ చేసి సర్వీస్ చేయకపోవడం, ప్యాడ్లు మార్చకపోవడం వల్ల ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.➤డ్రైవింగ్ అలవాట్లు: గేర్ తగ్గించకుండా బ్రేక్‌లపై మాత్రమే ఆధారపడటం, హాఫ్-క్లచ్ డ్రైవింగ్ వంటి అలవాట్లు బ్రేక్‌ల జీవితం తగ్గిస్తాయి.

Mindspace REIT to Invest Rs 350 Crore in Hyderabad Luxury Hotel2
హైదరాబాద్‌లో రూ.350 కోట్లతో లగ్జరీ హోటల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ హైదరాబాద్‌లో దాదాపు రూ. 350 కోట్లతో లగ్జరీ హోటల్‌ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. దీన్ని చాలెట్‌ హోటల్స్‌కి ప్రీ–లీజుకి ఇచ్చినట్లు తెలిపింది. 5.3 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాజెక్టులో 330 గదులు ఉంటాయి. 2027–28 నాలుగో త్రైమాసికంలో ఇది పూర్తయ్యే అవకాశం ఉందని మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ తెలిపింది.ఇరు సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం మైండ్‌స్పేస్‌ రీట్‌కి చెందిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ సంస్థ సదరు ప్రాపరీ్టని స్థూలంగా నిర్మించి ఇస్తుంది. ఇంటీరియర్స్, హోటల్‌ నిర్వహణ మొదలైన పనులను చాలెట్‌ చేపడుతుంది. ప్రస్తుతం చాలెట్‌కి మొత్తం మీద 3,300 గదుల పోర్ట్‌ఫోలియో ఉంది. మైండ్‌స్పేస్‌ రీట్‌కి హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణె చెన్నైలలో ఆఫీస్‌ అసెట్స్, బిజినెస్‌ పార్క్‌లు ఉన్నాయి.

Honda Activa Achieves 5 Million Unit Sales In Maharashtra3
యాక్టివాకు ఫుల్ డిమాండ్.. ఒక్క రాష్ట్రంలోనే 50 లక్షల సేల్స్!

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా కంపెనీకి చెందిన యాక్టివాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా మంచి అమ్మకాలు పొందిన ఈ టూవీలర్.. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే 50 లక్షల సేల్స్ సాధించింది.హోండా యాక్టివా స్కూటర్ 25 సంవత్సరాల్లో 50 లక్షల (ఒక్క మహారాష్ట్రలో మాత్రమే) అమ్మకాలను సాధించింది. కంపెనీ ప్రకారం.. పూణే, ముంబై, థానే, నాగ్‌పూర్ & నవీ ముంబై వంటి ప్రధాన నగరాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ స్కూటర్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హోండా యాక్టివామార్కెట్లో హోండా యాక్టివా రెండు మోడల్స్‌లో లభిస్తోంది. ఒకటి యాక్టివా 6జీ (110సీసీ), యాక్టివా 125 (125సీసీ). యాక్టివా 6జీ ధర సుమారు రూ.81,000 నుంచి రూ. 95,500 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. యాక్టివా 125 ధరలు రూ.91000 నుంచి రూ.96000 (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది.యాక్టివా 6జీ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.8 పీఎస్ పవర్, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. యాక్టివా 125 మోడల్ 123.92 సీసీ ఇంజిన్ ద్వారా 9.5 పీఎస్ పవర్, 11.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Infosys Narayana Murthy Warning to Indian Youth Master AI or Miss Out4
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్‌!

యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్‌గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్‌ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్‌ (Claude) ప్లాట్‌ఫామ్ ఆఫీస్‌ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్‌ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్‌ఫ్లో మేనేజ్‌మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు.

Gold and Silver rates on evening 26th February 2026 in Telugu states5
సాయంత్రానికే మారిన బంగారం ధరలు..

దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి ఇంకాస్త దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.200 తగ్గి రూ.1,48,200 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.800 క్షీణించి రూ.1,47,600 లకు దిగివచ్చింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.210 తగ్గి రూ.1,61,680 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.870 కరిగి రూ. 1,61,020 లకు క్షీణించింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,95,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

RBI Orders Banks to Remove Hidden Charges and Misleading App Tricks6
ఆర్‌బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్!

భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని నిర్మూలించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటనలు జారీ చేసింది.సాధారణంగా కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు ఉపయోగిస్తున్నప్పుడు.. చివరి దశలో కొన్ని అదనపు ఛార్జీలు కనిపిస్తుంటాయి. అవసరం లేని సేవలను కొనుగోలు చేయమని పదేపదే వచ్చే కొన్ని సూచనలు కూడా కనిపిస్తుంటాయి. స్పష్టంగా అర్థం కాని కొన్ని విషయాలు వినియోగదారులను కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇలాంటి మోసపూరిత రూపకల్పనలను డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. వీటిని నిర్మూలించడానికి ఆర్‌బీఐ కీలక చర్యలు చేపట్టింది.2026 సంవత్సరానికి సంబంధించిన 'రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్ 2026' అనే ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి, బ్యాంకులు తమ వెబ్‌సైట్లు & మొబైల్ యాప్‌లలో ఉన్న అన్ని డార్క్ ప్యాటర్న్స్‌ను 2026 జూలై నాటికి తొలగించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ ఆర్థిక ఉత్పత్తులను ప్రచారం చేసే విధానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కస్టమర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. ఏదైనా కొత్త సేవను అందించే ముందు వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అంటే.. కస్టమర్‌లకు పూర్తి సమాచారం ఇచ్చి, వారి అంగీకారం పొందిన తరువాత మాత్రమే అలాంటివి తెలియజేయాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ ప్రకటన వల్ల.. వినియోగదారులకు చాలా లాభాలున్నాయి. ముందుగా వారు చెల్లించాల్సిన ఛార్జీలు, తీసుకునే సేవల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. బ్యాంకులపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. పారదర్శకత & బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరుస్తాయి.ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్

Advertisement
Advertisement
Advertisement