Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Dubais new shared housing rules come with fines up to Dh1 million1
దుబాయ్‌లో హౌస్‌ షేరింగ్‌.. కొత్త రూల్స్‌

దుబాయ్‌లో భాగస్వామ్య వసతి (హౌస్ షేరింగ్/బెడ్ స్పేస్ రెంటల్స్)పై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 11న ఈ మేరకు లా నెం. (4) ఆఫ్ 2026 జారీ చేశారు. భాగస్వామ్య వసతిని నియంత్రించి, నివాసుల హక్కులను కాపాడటం, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను నిర్ధారించడం, అధిక జనసాంద్రతను నివారించడం, అక్రమ భవన మార్పులను అరికట్టడం ఈ చట్టం లక్ష్యాలు.కీలక నిబంధనలు ఇవే.. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, యూనిట్‌ను భాగస్వామ్య వసతిగా కేటాయించాలంటే దుబాయ్ మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి (పర్మిట్) తీసుకోవాలి. అనుమతి లేకుంటే ఇది చట్టవిరుద్ధం. అనుమతులు ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతాయి. యజమాని అభ్యర్థన మేరకు రెండేళ్ల పర్మిట్ కూడా ఇవ్వవచ్చు. పునరుద్ధరణ కోసం గడువు ముగియడానికి కనీసం 30 రోజుల ముందు దరఖాస్తు చేయాలి. భాగస్వామ్య యూనిట్లలో గరిష్ట ఆక్యుపెన్సీ లిమిట్, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన షేర్డ్ ఫెసిలిటీలు (వెంటిలేషన్, షేర్డ్ ఏరియాలు) నిర్ధారించాలి. అద్దెదారులు లేదా ఇతరులు యూనిట్‌లో ఏ భాగాన్నైనా సబ్-లీజ్‌కు ఇవ్వకూడదు లేదా పార్టిషన్లు (తాత్కాలిక గోడలు) ఏర్పాటు చేయకూడదు – ఇది నిషేధం. భాగస్వామ్య వసతి మార్కెట్‌పై ప్రత్యేక అద్దె సూచిక (రెంటల్ ఇండెక్స్) ఏర్పాటు చేస్తారు. ఇది సాధారణ అద్దె మార్కెట్ సూచిక నుండి వేరుగా ఉంటుంది.భారీ జరిమానాలుఉల్లంఘనలకు 500 నుండి 500,000 దిర్హమ్‌ల వరకు జరిమానా విధిస్తారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో పదేపదే ఉల్లంఘనలు జరిగితే గరిష్టంగా 1 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ.2.25 కోట్లు) వరకు జరిమానా పడవచ్చు.ఎందుకీ కొత్త చట్టం?గతంలో దుబాయ్‌లో అక్రమ విభజనలు (పార్టిషన్లు), బెడ్ స్పేస్ రెంటల్స్ వల్ల అగ్నిప్రమాదాలు, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, గత జూలైలో దుబాయ్ మెరీనాలో అక్రమంగా పార్టీషన్‌ చేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో 3,800 మందికి పైగా జనం నివసిస్తున్నారు. ఇలాంటి పార్టీషన్ల కోసం ఉపయోగించే తాత్కాలిక గోడలతో (చెక్క లేదా జిప్సమ్ బోర్డులు) అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటిలేషన్‌ కూడా సక్రమంగా ఉండదు. అత్యవసర నిష్క్రమణ మార్గాలకు ఆస్కారం ఉండదు.

Fired in Just 3 Days AI Engineer Now Earns 8 Times More a Year Later2
3 రోజుల్లోనే ఉద్యోగం పోతే.. ఈ ఏఐ ఇంజనీర్ ఏం చేసిందంటే..

ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరతాం.. అలా చేరిన మూడు రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోతే.. రీతూ మౌర్య అనే ఏఐ (AI) ఆటోమేషన్ ఇంజనీర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి కఠిన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం మూడు రోజుల్లోనే క్లయింట్ ముందు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. అయితే ఏడాది తరువాత అదే రంగంలో మొదట ఆఫర్ చేసిన జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని పేర్కొంది. ఈ విజయానికి స్వీయ అభ్యాసం, సరైన మార్గదర్శకత్వం కారణమని ఆమె చెప్పింది.ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవంఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రీతూ మౌర్య తన అనుభవాన్ని పంచుకుంది. తనను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ప్రారంభంలో సంస్థ ఫౌండర్‌ తనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. కానీ వాస్తవానికి ఆమె సందేశాలకు గంటల తరువాత కానీ సమాధానం ఇచ్చేవాడు కాదని, సమస్యలు అర్థం చేసుకునేందుకు కాల్ చేయడానికీ ముందుకు రాలేదని చెప్పింది. “ఉద్యోగంలో రెండో రోజుకే నాకు చాలా విషయాలు తెలియకపోయాయి. మార్గదర్శనం చేస్తానని చెప్పినా, అతను ఎక్కడా కనిపించలేదు” అని మౌర్య తెలిపింది.క్లయింట్ ముందు విమర్శలు… వెంటనే తొలగింపుమూడో రోజు అసైన్‌మెంట్ సమయంలో వ్యవస్థాపకుడు క్లయింట్ ముందే ఆమె పనితీరును తీవ్రంగా విమర్శించాడని మౌర్య తెలిపింది. “మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. నేను ఇదే పని ఒక గంటలో పూర్తి చేసేవాడిని. ఇకపై మనం కలిసి పనిచేయలేము” అని అతను చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అదే క్లయింట్ ఆమెను ఫుల్ టైమ్‌గా చేరగలరా అని అడిగిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వెల్లడించింది.మానసికంగా తీవ్ర ప్రభావంఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని మౌర్య తెలిపింది. “అంతా శూన్యంగా అనిపించింది. చాలా రోజులు ఏడ్చాను. నేను ఏమీ చేయలేనన్న భావన కలిగింది” అని ఆమె చెప్పింది. ఈ అనుభవం చాలా కాలం పాటు తనను వెంటాడిందని కూడా పేర్కొంది.మళ్లీ ప్రయాణం ప్రారంభంఅయితే తర్వాత ఆమె తనను తాను తిరిగి నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ చూడడం, సహచరుల సహాయం కోరడం, అలాగే “తెలివితక్కువ ప్రశ్నలు అయినా అడగడం” ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తన అభ్యాస ప్రయాణాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడం ప్రారంభించడంతో, చివరికి తనకు మరో సంస్థ అధినేత అవకాశం ఇచ్చారు.ఏడాదిలో భారీ మార్పుఉద్యోగం కోల్పోయిన ఏడాది తరువాత ప్రస్తుతం తాను మొదట ఇచ్చిన ఆఫర్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని మౌర్య తెలిపింది. “ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. అప్పటి విషపూరితమైన కార్యాలయం నుంచి బయటపడటం మంచిదే అనిపిస్తోంది” అని ఆమె పేర్కొంది.నెటిజన్ల స్పందనలుమౌర్య కథకు అనేక మంది టెక్ ప్రొఫెనల్స్‌ స్పందించారు. తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొంతమంది అనుభవం లేని వ్యవస్థాపకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించగా, మరికొందరు స్పష్టత కోసం ప్రశ్నలు అడిగినందుకు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. “అది ఐదేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సంఘటన పీడకలలా అనిపిస్తుంది. కానీ చివరకు నేను తిరిగి లేచి నిలబడ్డాను” అని మరో టెక్ ఉద్యోగి కూడా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.

US Senate Embraces AI Revolution ChatGPT Gemini Copilot Approved3
యూఎస్‌ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన పరిపాలన, శాసన ప్రక్రియలో కృత్రిమ మేధ విప్లవానికి నాంది పలికింది. అమెరికా సెనేట్ అధికారిక కార్యకలాపాల కోసం ప్రముఖ ఏఐ చాట్‌బాట్‌లు.. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమిని, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌ల వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ ఏఐ పరికరాలు సెనేట్ ప్లాట్‌ఫారమ్‌ల్లో అంతర్భాగంగా మారి విధాన నిర్ణేతలకు సహాయంగా నిలవనున్నాయి.పాలనలో వేగం.. పనిలో పారదర్శకతసెనేట్ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొనే సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా డ్రాఫ్టింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, అపారమైన సమాచారాన్ని విశ్లేషించి కచ్చితమైన డేటాను అందించడం, సుదీర్ఘమైన నివేదికలను క్లుప్తంగా బ్రీఫింగ్ నోట్స్ రూపంలోకి మార్చడం వంటి పనులు చేస్తాయి. ఒకే రకమైన పనులను ఆటోమేట్ చేయడం ద్వారా అధికారుల సమయాన్ని ఇవి ఆదా చేయనున్నాయి.అమెరికా ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక సంకేతంగా మారింది. పాలనలో ఏఐ కేవలం సహాయకారి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది అనివార్యమనే సంకేతాలు ఇస్తోంది. అయితే భద్రత, గోప్యత వంటి అంశాల్లో ఈ సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Iran–Israel Tensions Trigger Fertilizer Shock India Food Security at Risk4
చమురు, గ్యాస్‌.. తర్వాత దీని వంతే!

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 12 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతోన్న అసమాన దాడులు భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ప్రమాదంగా మారుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది చమురు, గ్యాస్‌ ధరల గురించే చర్చిస్తున్నారు, కానీ నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ‘ఎరువుల సెగ’ భారత ఆహార భద్రతను, 147 కోట్ల మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయనుందనే సంగతి విస్మరిస్తున్నారు.భారత వ్యవసాయానికి కీలకంగా హార్ముజ్ జలసంధి..భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎంతగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుందో, ఎరువుల కోసం కూడా అంతే స్థాయిలో ఆధారపడి ఉంది. ఇరాన్ వైఖరి కారణంగా హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన ప్రతిష్టంభన భారత్‌కు సవాలుగా మారింది.లెక్కలివే..భారత్ దిగుమతి చేసుకునే నత్రజని సంబంధిత ఎరువుల్లో (యూరియా, అమ్మోనియా) 63 శాతం, డీఏపీలో 32 శాతం కేవలం గల్ఫ్ దేశాల (యూఏఈ, ఖతార్, సౌదీ, ఒమన్) నుంచే వస్తాయి. దేశానికి కావాల్సిన పొటాష్‌ దిగుమతుల్లో 42 శాతం వాటా ఒక్క సౌదీ అరేబియాదే. ఇరాన్ నుంచి నేరుగా కొనుగోళ్లు తక్కువగా ఉన్నప్పటికీ (కేవలం 2.59 మిలియన్‌ డాలర్లు) ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం వల్ల బీమా ప్రీమియంలు పెరగడం, నౌకల రాకపోకలు నిలిచిపోవడం రైతన్నపై భారాన్ని పెంచుతున్నాయి.ఆహార భద్రతపై ప్రభావంభారతదేశంలో ఖరీఫ్, రబీ సీజన్లు వ్యవసాయానికి కీలకం. జూన్/ జులైలో విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత ఏర్పడితే అది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఎరువుల దిగుమతి బిల్లు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరుతుందని అంచనా. ఇందులో యూరియా వాటానే 61 శాతంగా ఉండనుంది.అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ భారం భారీగా పెరగనుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు సహజ వాయువు సెగఎరువుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, యూరియా దిగుమతులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (38 మిలియన్ టన్నుల లక్ష్యం). అయితే, యూరియా తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన సహజ వాయువు (నేచురల్‌ గ్యాస్‌) సరఫరా ఇప్పుడు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఖతార్, యూఏఈల నుంచి సరఫరా తగ్గడంతో భారత అగ్రశ్రేణి గ్యాస్ దిగుమతిదారు ‘పెట్రోనెట్’ మార్కెటింగ్ కంపెనీలకు 30 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయ ఎరువుల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది.ప్రత్యామ్నాయ మార్గాలురష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సరఫరా గొలుసులో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మిడిల్‌ఈస్ట్‌ సంక్షోభం నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంది. ఎరువుల దిగుమతికి సంబంధించి చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాలే ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలుగా తోస్తున్నాయి. ఇవి హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా సరఫరా చేయగలవు. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలి (ప్రస్తుతం వీటి వాటా 5% కంటే తక్కువ).ప్రభుత్వ ధీమాపరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ మార్చి 6న ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. రైతుల్లో అసంతృప్తి కలగకుండా ప్రభుత్వం ఎంతటి ప్రీమియం చెల్లించైనా ఎరువుల సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు కోసం రష్యా వైపు మొగ్గు చూపినట్లుగానే ఎరువుల భద్రత కోసం భారత్ త్వరలో మరిన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!

Stock Market closing updates On march 11 20265
స్టాక్‌ మార్కెట్‌లో ‘బ్లడ్‌ బాత్‌’

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్దకు చేరింది. దీంతో మార్కెట్‌లో ఈ ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. ఈరోజు (మార్చి 11, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలను పాతాళానికి నెట్టింది.సూచీల పతనానికి ప్రధాన కారణాలుఇంధన సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్‌ను భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతోంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశానికి పెద్ద దెబ్బగా మారింది.ఎనర్జీ సెక్టార్‌లో అమ్మకాలు: ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ముడి పదార్థాల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనతో ఎనర్జీ ఇండెక్స్ ఏకంగా కుప్పకూలింది.ఎఫ్ఐఐల విక్రయాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల వారు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతుండటంతో దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోతోంది.రూపాయి రికార్డు పతనం: చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను పెంచి, దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం నెలకొంది.కీలక రంగాలు పతనం: బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రెడ్ మార్క్‌లో ట్రేడయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ ఉన్న షేర్లు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యం పోసింది.ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది. నిఫ్టీకి 23,700 వద్ద కీలక సపోర్ట్‌ ఉంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అస్థిర సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నాణ్యమైన షేర్లలో సిప్ పద్ధతిని కొనసాగించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Middle East Tensions Global Inflation Central Banks Toward Rate Hikes6
వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!

మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. దీనివల్ల ఇన్నాళ్లూ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం వేచి చూసిన సామాన్యులకు, పెట్టుబడిదారులకు కేంద్ర బ్యాంకులు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత పెంచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.అంచనాలు తలకిందులుఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఒకటి లేదా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రేట్ల కోత ఉంటుందని ఊహించిన మార్కెట్ వర్గాలకు ఇది పెద్ద మలుపు.గత తప్పిదాల నుంచి పాఠాలు2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకులు ఆలస్యంగా స్పందించాయనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమని, అధిక ధరల వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని బ్యాంకర్లు భావిస్తారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్‌ బ్యాంకులు భావిస్తున్నాయి.బ్రిటన్‌లో సంక్లిష్ట పరిస్థితియూకేలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 3% వద్ద ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) లక్ష్యం (2%) కంటే ఎక్కువ. యుగోవ్/ సిటీగ్రూప్ సర్వే ప్రకారం, ఇరాన్ యుద్ధానికి ముందే వినియోగదారుల ధరల పెరుగుదల 3.3%గా ఉంది. దీంతో బీఓఈ తన అంచనాలు మారుస్తోంది.ఇదీ చదవండి: చికెన్‌, పిజ్జా, బర్గర్‌.. కంపెనీలకు కష్టాలు

Advertisement
Advertisement
Advertisement