Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Nita Ambani attends NABs 75th anniversary1
అంధుల జీవితాల్లో వెలుగులు.. రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన నీతా అంబానీ

నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB) ఇండియా 75వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంధులకు అండగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున రాబోయే ఐదేళ్లలో రూ.5 కోట్ల విరాళాన్ని అందజేస్తామని నీతా అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్, నాబ్‌ సంయుక్త కృషితో ఇప్పటివరకు 22,000 మందికి పైగా అంధులకు చూపు తెప్పించారు.

Gold Rates Jump Thousands in by Evening 21st january in Telugu States2
సాయంత్రానికే మరింత షాక్‌.. మారిపోయిన పసిడి ధరలు

బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో పసిడి ధరలు ఎగుస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికే మరింత పెరిగాయి.హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.4600 పెరిగి రూ. 1,41,900 లకు చేరుకోగా సాయంత్రానికి మొత్తంగా రూ.6250 ఎగిసి రూ.1,43,550లకు చేరింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.5020 ఎగిసి రూ. 1,54,800 లను తాకగా సాయంత్రానికి మొత్తంగా రూ.6820 పెరిగి రూ.1,56,600లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

All Eyes on Davos as Trump Delivers High Stakes Speech3
దావోస్‌: గ్రీన్‌లాండ్‌ మాక్కావాలి..

గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్‌లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలుఅధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.“నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.యూరప్ సరైన దిశలో లేదుడబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.“నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.గ్రీన్‌లాండ్‌ కావాల్సిందే..అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్‌లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. డెన్మార్క్‌కు కృతజ్ఞత లేదని ట్రంప్‌ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్‌లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్‌లాండ్‌లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్‌లాండ్‌ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు.

Rupee Falls To Record Low Of 91.74 Against US Dollar4
పడిపోయిన రూపాయి.. రికార్డు పతనం

భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. నిరంతర విదేశీ నిధుల నిష్క్రమణ, లోహ దిగుమతిదారుల నుంచి బలమైన డాలర్ డిమాండ్ నేపథ్యంలో బుధవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 77 పైసలు క్షీణించి 91.74 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది.గ్రీన్‌లాండ్ సమస్యతో పాటు సంభావ్య సుంకాలపై ఐరోపాలో ఉద్రిక్తతలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు.ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి 91.05 వద్ద ప్రారంభమై, ట్రేడింగ్‌లో క్రమంగా క్షీణిస్తూ డాలర్‌తో పోలిస్తే 91.74 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. ఇది మునుపటి ముగింపు స్థాయితో పోలిస్తే 77 పైసల పతనం.మంగళవారం రూపాయి డాలర్‌తో పోలిస్తే 7 పైసలు తగ్గి 90.97 వద్ద ముగిసింది. అంతకుముందు 2025 డిసెంబర్ 16న ఇంట్రా-డే కనిష్ట స్థాయి నమోదై, ఆ రోజు రూపాయి 91.14 వరకు పడిపోయింది.ఇదిలా ఉండగా, ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 0.02 శాతం తగ్గి 98.61 వద్ద ట్రేడ్ అవుతోంది.అంతర్జాతీయ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.88 శాతం తగ్గి 63.70 డాలర్లకు చేరుకుంది.దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కూడా నెగెటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 289.85 పాయింట్లు పడిపోయి 81,890.62 వద్ద, నిఫ్టీ 77.40 పాయింట్లు తగ్గి 25,155.10 వద్ద ట్రేడవుతున్నాయి.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) మంగళవారం రూ.2,938.33 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Sets Global Ambition with Next Gen Life Sciences Policy 2026 305
దావోస్‌: తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ

ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వేదికగా తెలంగాణ ప్రభుత్వం తన నెక్ట్స్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ను ఆవిష్కరించింది. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోనే టాప్ ఐదు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తీర్చిదిద్దడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.ఈ విధానం ద్వారా 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2 లక్షల కోట్లు) పెట్టుబడుల ఆకర్షణ, 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి, అలాగే అధునాతన థెరప్యూటిక్స్, సస్టెయినబుల్ బయో-మాన్యుఫాక్చరింగ్, ఫ్రంటియర్ ఆర్‌ అండ్‌ డీ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.దావోస్‌లో పాలసీని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ “ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, మార్పు తీసుకువచ్చే బయోసైన్సెస్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోంది” అని పేర్కొన్నారు. గ్లోబల్ భాగస్వామ్యాలు, వినూత్న ఆవిష్కరణలు, సస్టెయినబిలిటీ ద్వారా ప్రపంచ ఆరోగ్య రంగంపై ప్రభావం చూపడమే రాష్ట్ర సంకల్పమని తెలిపారు.రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లోనే తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని, రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు.పాలసీ ముఖ్యాంశాలుప్రపంచ స్థాయి లక్ష్యం: 2030 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలుగ్రీన్ ఫార్మా సిటీ: జీరో లిక్విడ్ డిశ్చార్జ్, నెట్-జీరో ప్రమాణాలతో పర్యావరణహిత పారిశ్రామిక క్లస్టర్ఫార్మా విలేజ్‌లు: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వెంబడి 1,000–3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ప్రత్యేక హబ్‌లుజీనోమ్ వ్యాలీ విస్తరణ: షేర్డ్ ల్యాబ్స్‌తో కూడిన కొత్త బయో-ఇన్నోవేషన్, బయోమాన్యుఫాక్చరింగ్ క్లస్టర్వన్‌బయో: దేశంలోనే తొలి గ్రోత్-ఫేజ్ బయోఫార్మా స్కేల్-అప్ కేంద్రంలైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్: రూ.1,000 కోట్ల (111 మిలియన్ డాలర్లు) వరకు విస్తరించగల ప్రత్యేక నిధిటాలెంట్ అభివృద్ధి: గ్లోబల్ ప్రమాణాల విద్య కోసం తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్

Deepinder Goyal steps down as CEO of Eternal Group; Dhindsa to take charge6
జొమాటో: సీఈవోగా దిగిపోయిన దీపిందర్‌ గోయిల్‌

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయిల్ ఎటర్నల్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది. ఇది ఫిబ్రవరి 1న అమల్లోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. “ఇటీవల నేను అధిక రిస్క్‌, ప్రయోగాత్మకత కలిగిన కొత్త ఆలోచనల వైపు ఆకర్షితుడనయ్యాను. ఇవి పబ్లిక్ కంపెనీ అయిన ఎటర్నల్ పరిధి వెలుపల మరింత సమర్థంగా అమలయ్యే ఆలోచనలు” అని వాటాదారులకు రాసిన లేఖలో గోయిల్ పేర్కొన్నారు.అలాగే, “ఎటర్నల్ తన ప్రస్తుత వ్యాపార నమూనాకు అనుబంధంగా కొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించాలంటే పూర్తి దృష్టి, క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో సంస్థలో కొనసాగుతూ బయట కొత్త ఆలోచనలను అన్వేషించడానికి కావాల్సిన వ్యక్తిగత సమయం లేదని నేను భావిస్తున్నాను. భారతదేశంలోని పబ్లిక్ కంపెనీ సీఈవో బాధ్యతలు పూర్తిస్థాయి నిబద్ధతను కోరుకుంటాయి” అని తెలిపారు.బోర్డులో కొనసాగనున్న గోయిల్సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, దీపిందర్ గోయిల్ ఎటర్నల్ డైరెక్టర్ల బోర్డులో వైస్ చైర్మన్‌గా కొనసాగుతారు. “నా జీవితంలో దాదాపు 18 సంవత్సరాలు ఈ సంస్థ నిర్మాణానికి అంకితం చేశాను. ఇకపై కూడా అదే నిబద్ధతతో పనిచేస్తాను. మా భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం యథాతథంగా కొనసాగుతుంది. అన్ని వ్యాపార విభాగాల సీఈవోలు ఇప్పటివరకు ఉన్న స్వతంత్రతతోనే పని చేస్తారు” అని గోయిల్ స్పష్టం చేశారు.కొత్త సీఈవోగా అల్బిందర్ ధిండ్సాఎటర్నల్ గ్రూప్ నూతన సీఈవోగా బ్లింకిట్ వ్యవస్థాపకుడు, సీఈవో అల్బిందర్ ధిండ్సా బాధ్యతలు స్వీకరించనున్నారు. రోజువారీ కార్యకలాపాలు, ఆపరేటింగ్ ప్రాధాన్యతలు మరియు కీలక వ్యాపార నిర్ణయాల అమలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది.బ్లింకిట్‌ను స్థాపించడానికి ముందు, ధిండ్సా జొమాటోలో అంతర్జాతీయ విస్తరణ విభాగం అధిపతిగా పనిచేశారు. సంస్థ గ్లోబల్ విస్తరణ వ్యూహానికి ఆయన కీలక పాత్ర పోషించారు.2013లో బ్లింకిట్‌ను సహ-వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన ధిండ్సా, ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు.

Advertisement
Advertisement
Advertisement