ప్రధాన వార్తలు
జియో.. జెరోధా.. కొత్త మ్యూచువల్ ఫండ్లు
జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ను కేదార్నాథ్ మిరాజ్కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 50:50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్ఈ 100 ఇండెక్స్ (టీఆర్ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!
ఇంటికొచ్చే గ్యాస్ ఇన్ని రకాలా..?
సామాన్యుడి వంటగదిలో ఎర్రటి గ్యాస్ సిలిండర్ (LPG) కనిపించడం సర్వసాధారణం. కానీ, మారుతున్న కాలంతో పాటు గ్యాస్ వినియోగం తీరు కూడా మారుతోంది. నగరాల్లో వాహనాల కోసం సీఎన్జీ (CNG), ఇళ్లలో పైప్లైన్ ద్వారా వచ్చే పీఎన్జీ (PNG).. ఇలా గ్యాస్ రకాలు వినడానికి ఒకేలా ఉన్నా, వాటి ఉపయోగాలు మాత్రం వేరు. భారతదేశ ఇంధన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నాలుగు రకాల గ్యాస్ల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.వంటగదిలో రారాజు.. ఎల్పీజీకోట్లాది భారతీయ కుటుంబాలకు వంటగదిలో గ్యాస్ అంటే మొదట గుర్తొచ్చేది ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే ప్రోపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమమే ఇది. గ్యాస్ను ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దీనిని రవాణా చేయడం సులభం కాబట్టి, మారుమూల గ్రామాల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' వంటి పథకాలతో ఇది ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరువైంది.సీఎన్జీ.. వాహనాలకు ‘గ్రీన్’ సిగ్నల్కాలుష్యాన్ని తగ్గించడంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) కీలక పాత్ర పోషిస్తోంది. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా దీనిని వాహనాల్లో వాడుతున్నారు. ఇది ఇతర ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ప్రస్తుతం నగరాల్లో ఆటోలు, బస్సులు, కార్ల కోసం సీఎన్జీ వాడకం విపరీతంగా పెరిగింది. ఇది సహజ వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేయడం ద్వారా తయారవుతుంది.పీఎన్జీ.. సిలిండర్ల గోల లేని వంట గ్యాస్నగరాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG). ఇంటికి వాటర్ కనెక్షన్ ఉన్నట్టే, భూగర్భ పైప్లైన్ల ద్వారా నేరుగా వంటగదికి గ్యాస్ వస్తుంది. దీని వల్ల సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. మీరు ఎంత వాడుకుంటే అంతకే మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లు చెల్లించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు.ఎల్ఎన్జీ.. భారీ పరిశ్రమల ఇంధనంలిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సాధారణంగా మనం నేరుగా వాడేది కాదు. కానీ ఇది దేశీయ ఇంధన సరఫరా గొలుసులో అత్యంత కీలకమైనది. సహజ వాయువును మైనస్ 162°C వద్ద చల్లబరిచి ద్రవంగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం తగ్గి, ఓడల ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. తీర ప్రాంతాలకు చేరుకున్న ఎల్ఎన్జీని తిరిగి గ్యాస్గా మార్చి విద్యుత్ ప్లాంట్లు, భారీ పరిశ్రమలకు పంపిస్తారు.
జేపీ అసోసియేట్స్ దివాలా కేసు: NCLATను ఆశ్రయించిన వేదాంత
జైప్రకాష్(జేపీ) అసోసియేట్స్ దివాలా పరిష్కార ప్రక్రియపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పును సవాలు చేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను వేదాంత ఆశ్రయించింది.జేపీ అసోసియేట్స్ ఆస్తులకు రూ.14,535 కోట్లతో అదానీ గ్రూప్ సమర్పించిన బిడ్కు ఎన్సీఎల్టీ ఆమోదం తెలపడం తెలిసిందే. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ ఆస్తుల కోసం అదానీతోపాటు వేదాంత, దాల్మియా భారత్ సైతం పోటీ పడ్డాయి. కానీ, రుణదాతల కమిటీ మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన రూ.14,535 కోట్ల బిడ్కు అంగీకారం తెలిపగా.. దీనికి మార్చి 17న ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. దీన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్లో వేదాంత సవాల్ చేసింది. దీనిపై ఇద్దరు సభ్యుల బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది.
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ.. ప్రభుత్వం కొత్త ‘ఆఫర్’
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్లో ప్రధాన వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గాన్ని ఎంచుకునే అవకాశముంది. ప్రస్తుతం బ్యాంక్లో పబ్లిక్కు 5.29 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ నెల మొదట్లో ప్రభుత్వం బ్యాంక్లో 60.72 శాతం వాటా విక్రయానికి బిడ్స్ను ఆహ్వానించింది.అయితే ఇందుకు సరైన స్పందన లభించకపోవడంతో ఓఎఫ్ఎస్ అవకాశాలనుప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ధర కంటే దిగువన అదికూడా రెండు సంస్థలు మాత్రమే వాటా కొనుగోలుకి ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్లో ప్రభుత్వానికి 45.48 శాతం, బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉన్న సంగతి తెలిసిందే.పబ్లిక్ వాటా స్వల్పంగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్ మార్కెట్ విలువ పరిమితంగానే నమోదవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పబ్లిక్కు కనీసం 10–15 శాతం వాటా కల్పిస్తే బ్యాంక్ షేరుకి తగిన ధర నమోదయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డాయి. దీంతో ఓఎఫ్ఎస్ ద్వారా వాటా విక్రయానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
కార్పొరేట్
ఇంటికొచ్చే గ్యాస్ ఇన్ని రకాలా..?
జేపీ అసోసియేట్స్ దివాలా కేసు: NCLATను ఆశ్రయించిన వేదాంత
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ.. ప్రభుత్వం కొత్త ‘ఆఫర్’
రూ. 15వేలు జీతంలో ఆనందం.. రూ. 2.5లక్షల్లో అసంతృప్తి!
బిడ్డను కోల్పోయిన గర్భిణి.. కంపెనీకి రూ.210 కోట్ల ఫైన్!
ఎల్పీజీ ఏటీఎం వచ్చేసింది.. ఇక ఎనీ టైమ్ గ్యాస్!
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్’
వ్యాపారాలకు రూ.2వేల కోట్ల ప్రయోజనాలు: అమెజాన్
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ గా భారత్
బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..
ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్త...
పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డ...
వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ ర...
గుడ్న్యూస్.. బంగారం బాగా తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా నాలుగో ...
‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం
సాధారణంగా జీడి తోటలంటే కేవలం జీడిపిక్కల కోసమేననే భ...
సాగుకు ముందస్తు భరోసా
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్పై అమ...
ఇంధన భద్రతలో భారత్ ముందున్న సవాలు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన ...
రూపీ.. ‘లో’బీపీ
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో విదేశీ పెట్టుబడులు తరల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
గ్యాంబ్లింగ్ సైట్లపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 పైగా వెబ్సైట్లు, యాప్లను బ్లాక్ చేసింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ఫాంలు, ఆన్లైన్ కేసినోలకు సంబంధించినవని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సట్టా, మట్కా గ్యాంబ్లింగ్ నెట్వర్క్లు, రియల్ మనీ కేసినో గేమ్ యాప్స్పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి 8,400 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు వివరించాయి. ఇందులో అత్యధిక భాగం (సుమారు 4,900) ఆన్లైన్ గేమింగ్ చట్టం వచ్చాక చర్యలు తీసుకున్నవేనని వివరించాయి.
ఇంక సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏం చేస్తారు?
సాంకేతిక రంగంలో కొలువుల కోత భయాలు నిజమవుతున్నాయా? గతంలో కేవలం సాధారణ పనులకే పరిమితమైన కృత్రిమ మేధ (AI), ఇప్పుడు హై-టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) రంగాల్లో పనిచేసే వారి భవితవ్యంపై పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.'ప్రాపంచిక' పనులకు ఇక స్వస్తి..ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పెర్ప్లెక్సిటీ' సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ (X) వేదికగా టెక్ పరిశ్రమలో రాబోయే మార్పులపై కుండబద్దలు కొట్టారు. "సాఫ్ట్వేర్ ఉత్పత్తుల టెస్టింగ్, నాణ్యతను అంచనా వేయడం (QA) వంటి ప్రాపంచిక పనులు (Mundane Jobs) క్రమంగా కనుమరుగవుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ఆ కోడ్ను తనిఖీ చేసే బాధ్యతను కూడా ఏఐ తన భుజాన వేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.రంగంలోకి 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్'పెర్ప్లెక్సిటీ సంస్థ ఇటీవల విడుదల చేసిన 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్' అప్డేట్ ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఈ సాధనం వెబ్ అప్లికేషన్లను నిర్మించడమే కాకుండా, వాటిని స్వయంగా పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఆటోమేటెడ్ టెస్టింగ్ : 'ప్లేరైట్' (Playwright) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా క్వాలిటీ చెకర్ అవసరం లేకుండానే అప్లికేషన్ను రన్ చేస్తుంది.మానవ ప్రమేయం అక్కర్లేదు: ఒక సాధారణ వినియోగదారు యాప్ను ఎలా ఉపయోగిస్తారో, ఈ AI సిస్టమ్ కూడా అలాగే యాప్ను తనిఖీ చేసి, లోపాలను (Bugs) గుర్తిస్తుంది.క్షణాల్లో పరిష్కారం: డెవలపర్లు జోక్యం చేసుకోకముందే సమస్యలను గుర్తించి, వాటిని బ్యాక్గ్రౌండ్లోనే పరిష్కరించేలా ఈ టూల్ను రూపొందించారు.
జియో ప్లాన్: ఒక్కసారి రీచార్జ్తో బోలెడు బెనిఫిట్లు
పదే పదే రీఛార్జ్ చేయించుకునే తలనొప్పి లేకుండా, ఒక్కసారి రీఛార్జ్తో ఏడాది మొత్తం ప్రశాంతంగా గడపాలనుకునే వారి కోసం రిలయన్స్ జియోలో ఒక అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 3,599 ధరతో కూడిన ఈ ప్లాన్ కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా, ఏకంగా రూ. 35,000 పైగా విలువైన ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుండటం విశేషం.జియో రూ. 3,599 ప్లాన్ పూర్తి వివరాలుఈ ప్లాన్ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. 365 రోజులు (పూర్తిగా ఒక సంవత్సరం) వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటా పొందే అవకాశం ఉంటుంది.సాధారణ బెనిఫిట్స్తో పాటు, ఈ ప్లాన్ ద్వారా లభించే ఎక్స్ట్రా ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ మ్యాచ్లు, లేటెస్ట్ సినిమాలు చూడాలనుకునే వారి కోసం కంపెనీ 3 నెలల డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది.అలాగే ఈ ప్లాన్లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రియుల కోసం భారీ విలువ కలిగిన గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ను జియో ఆఫర్ చేస్తోంది. ఫోన్ మెమరీ సమస్యను అధిగమించేందుకు 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది.
ఏఐలో భారత్కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు.
పర్సనల్ ఫైనాన్స్
పాత సంవత్సరాలకు నోటీసులొస్తున్నాయి..
ముందుగా పాఠకలోకానికి పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, సాఫీగా గడవాలని కోరుకుంటున్నాం. ఆన్లైన్లో నోటీసుని చూడగానే ముందుగా ఎంతో ఆందోళన చెందారు చెంగలరావుగారు. తాను ప్రతి సంవత్సరం ఠంచనుగా సకాలంలో పన్నులు చెల్లించి, సకాలంలో రిటర్నులు వేసే కచ్చితమైన మనిషి. ఆరేడేళ్ల క్రితం గవర్నమెంటు వారిచ్చిన మెడల్, నగదు బహుమతి పొందారు. ఒకప్పుడు ఆయకర్ రత్న అవార్డులు, రాష్ట్రీయ సన్మానాలు పొందిన వారు చెంగలరావుగారికి ఆదర్శం. ప్రభుత్వం ఇటువంటి వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో పాల్గొనే వ్యక్తులుగా గుర్తిస్తుంది. అంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న చెంగలరావు గారికి నోటీసులు వచ్చాయి. ఆర్థిక సంవత్సరంలో మీరు పన్ను పూర్తిగా చెల్లించలేదు.. బకాయి, వడ్డీ చెల్లించండి అనేది వాటి సారాంశం. ఆ నోటీసులను పది సార్లు చదివి, ఉగ్రుడైపోయాడాయన. కోపం, విసుగు, అసహనం.. వెంటనే ఆడిటర్కి ఫోన్ చేశారు.‘‘ఏమోనండి. రికార్డులు తెచ్చి చూపిస్తే కానీ ఏమీ చెప్పలేం. అన్ని కాగితాలూ పట్టుకురండి’’ అని తేల్చిచెప్పారు ఆడిటరు. సంఘాన్ని, ప్రభుత్వాన్ని, డిపార్టుమెంటుని ఎడాపెడా తనలో తానే తిట్టుకుంటూ, కాసేపు ఆ కోపాన్ని పన్ను ఎగవేతదార్లపై ప్రదర్శించాక, భార్య కాంతం తమ్ముడు ఏకాంబరం వైపు ఫోకస్ మళ్లింది. ‘‘నీ తమ్ముడు కాంట్రాక్టరు. వాడెప్పుడైనా నేను కట్టినంత కట్టాడా. ఎప్పుడూ ఏడుపే. నష్టాలే బావగారూ అని. అటువంటి వాళ్లను ఏమీ అనరు’’ అంటూ విరుచుకుపడ్డారు. కానీ ఆమె జవాబు ఇవ్వలేదు.మనవడి సహాయంతో బీరువాపైన ఉన్న కాగితాలు కిందికి దించి, ఫైళ్లు వెతకడం మొదలెట్టారు. ఒక నోటీసు 2007–08ది కాగా మరో నోటీసు 2013–14ది. ముందుగానే రెండు నోటీసులను కాపీలు తీసుకుని, ఆయా సంవత్సరాల కాగితాల కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. ఒకటి ఇంచుమించు 18 ఏళ్ల క్రితం నాటిది. మరొకటి 12 ఏళ్ల నాటిది. అదృష్టవశాత్తు ఆయా కాగితాలు దొరికాయి. ‘ధన్యుడనైతిని రామా’ అని ఊపిరి పీల్చుకుని, ముందుగా 2007–08కి సంబంధించిన ఫైళ్లు తీసి ఒక్కొక్క కాగితాన్ని పరిశీలించడం మొదలెట్టారు.2014లో ఒక నోటీసు వచ్చింది. టీడీఎస్ తక్కువగా జమ అయింది, మిగతా మొత్తం చెల్లించమని. అన్ని కాగితాలు తీసి, ఒక్కొక్క రికవరీ, చెల్లింపు జమకి వివరణ ఇస్తూ, సమన్వయ పట్టిక చేసి, ఎంతో వివరంగా ఇచ్చారు. దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. అది ఇంకా క్లోజ్ అయినట్లు లేదు. అదే సంవత్సరానికి గాను మళ్లీ నోటీసు. ఆ రిటర్నులు.. అన్ని రికార్డులు, ఆ నోటీసు, తన జవాబు, తాను జతపరచిన కాగితాలు.. అన్నింటినీ పది సార్లు చెక్ చేసుకున్నారు. తనవన్నీ సరిగ్గా ఉన్నాయి. అయినా నోటీసు. వెంటనే ఆడిటర్గారికి ఫోన్ చేశారు. మొదటి పది నిమిషాలు ప్రసంగం..ఉక్రోషం.. ఊగిపోవడమైంది. అయినా సరే, నోటీసు వచ్చింది కాబట్టి, మళ్లీ జవాబు ఇవ్వాల్సిందేనని ఆడిటర్ ఆర్గ్యూ చేశారు. రాత్రి కొడుకు వచ్చాక, అప్పటివరకు అయిన గొడవంతా ఏకరువు పెట్టి, తానే స్వయంగా రిప్లైని చేతితో రాసి, కొడుకు చేత ప్రింటర్లో అన్ని కాపీలు తీశారు. అదొక అరవై పేజీల పుస్తకం అంత అయింది. ఈలోగా రాత్రయ్యింది. ఇక మర్నాడు మరొక నోటీసు.. అంటే 2013–14ది బైటికి తీశారు. 26ఏఎస్లో వివరాలు మిస్ మ్యాచ్ అయ్యాయనేది అందులోని సారాశం. టీడీఎస్ క్రెడిట్లు అవలేదు. షరామామూలే! అదే విపత్తు. అదే కసరత్తు.. మళ్లీ పని యావత్తూ. మొత్తానికి అన్ని కాగితాలూ దొరికాయి. కొడుకు సహాయంతో జవాబు పూర్తి చేశాక, ఓ 30 పేజీల ఫైలు తయారైంది. తన జ్యూరిస్డిక్షన్ అధికారి ఆఫీసుకి ఆటోలో బయలుదేరాడాయన. అధికారులు రెండు జవాబులు తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఎంతో ఆశగా అడిగారాయన ‘‘అన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయి.. రెండు మూడు రోజుల్లో అయిపోతుందా’’ అని. ఆ అధికారి ఆ కాగితాలను పక్కన పెట్టుకుంటూ ‘‘రెండు మూడు నెలల తర్వాత’’ అని ముక్తసరిగా చెప్పారు. ఇలాంటి చెంగలరావుగార్లు ఎందరో లెక్కలేదు. ఎంతో నిజాయితీగా చెల్లించే రిటైర్డు ఉద్యోగస్తులపై అస్త్రాల మీద అస్త్రాలు వస్తున్నాయి. రికార్డులు అప్డేట్ చేసుకోవడం లేదు.. ఇచ్చిన రిప్లై సరిగ్గా చెక్ చేసుకోవడం లేదు. ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం.. ఎంతో విచిత్రమైన పరిస్థితి. అంత పాత రికార్డులు ఉండకపోతే/దొరక్కపోతే ఏంటి పరిస్థితి! కాబట్టి డిమాండ్ల విషయంలో ఎంతో మెలకువగా వ్యవహరించాలి అధికారులు.
మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
చాలామందికి ఆదాయం అంటే నెల జీతం మాత్రమే. పెట్టుబడులను కూడా ఖర్చుల్లానే చూస్తుంటారు. భవిష్యత్తు ఆదాయానికి పెట్టుబడులే ప్రధానమన్న సూత్రాన్ని పెద్దగా పట్టించుకోరు. వారెన్ బఫెట్ మాటల్లో చెప్పాలంటే రెండో ఆదాయమనేది పెట్టుబడులతోనే వస్తుంది. మరి పెట్టుబడుల్లో సక్సెస్ కావాలంటే.? దీనికి పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు. కావాల్సిందల్లా సరైన ఆలోచన... క్రమశిక్షణ, ఓర్పు. ఈ మూడింటితో పెట్టుబడులను సరైన దారిలో కొనసాగించడం, సమయానికి మార్పులు చేయడం, దీర్ఘకాలం కొనసాగించటం చేయొచ్చు. అదే సంపద సృష్టికి మార్గం. నిజానికి చాలా మంది ఇన్వెస్టర్లు తొలుత ఉత్సాహంగా పెట్టుబడులు మొదలెడతారు. కొన్నాళ్లకు నిర్లక్ష్యం చేస్తారు. ఇదే వారి వైఫల్యానికి ప్రధాన కారణం. పెట్టుబడుల్లో విజయానికి ఫైనాన్షియల్ ప్లానర్లు ప్రత్యేకంగా చెబుతున్న సూత్రాలను వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...ముందుగా తెలుసుకోవటం... తరవాతే ఇన్వెస్ట్మెంట్చాలామంది ఇతరులు చెప్పారని, సోషల్ మీడియాలో చూశామని, ఇది బాగా లాభాలిస్తుందని ఎవరో చెబితే విన్నామని పెట్టుబడులు పెడతారు. ఇదే మొదటి పెద్ద తప్పు. మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి బాగా తెలుసుకోవాలి. అది ఎలా పనిచేస్తుంది? అందులో రిస్క్ ఎంత? రిటర్న్స్’ ఎన్నాళ్లకు వస్తాయి? మీ లక్ష్యాలకు ఇది సరిపోతుందా? ఇవన్నీ సరిచూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ వంటి వాటి లక్షణాలు, లాభాలు, రిసు్కలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టకూడదు. తెలియని దాంట్లో పెట్టుబడి పెట్టకూడదన్నది తొలి నియమం.మీ రిస్క్ సామర్థ్యాన్ని మీరే తెలుసుకోండిఅందరూ ఒకే రకమైన ఇన్వెస్టర్లు కాదు. కొంతమంది అధిక రిస్క్ తీసుకోగలుగుతారు. మరికొందరు అస్సలు రిస్క్ తీసుకోలేరు. ఇది ప్రధానంగా వారి ఆర్థిక స్థాయిలను బట్టి మారుతుంటుంది. మీరు తట్టుకోలేని స్థాయిలో రిస్క్ తీసుకుంటే... మార్కెట్లో సంభవించే చిన్న చిన్న మార్పులకే భయపడతారు. అప్పుడు ఆందోళనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, నష్టాల్లో కూరుకుపోతారు. మంచి ఇన్వెస్టర్ అంటే భయంలేని వాడు కాదు. తన సామర్థ్యాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసేవాడు.ఉచిత సలహాలకు విలువ ఉండదుఉచితంగా లభించే విషయాలను ఎవరూ సీరియస్గా తీసుకోరు. ఫైనాన్స్ విషయంలోనూ అదే జరుగుతుంది. కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే నష్టం మాత్రం చాలా ఖరీదైనదిగా మారుతుంది, ఒక్కోసారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని సరైన మార్గాన్ని నిర్దేశిస్తాడు., అవసరమైన సందర్భాల్లో పోర్ట్ఫోలియోలో మార్పులు కూడా సూచిస్తాడు. పెయిడ్ అడ్వైజర్ని సంప్రదించడం ఖర్చు కాదు. భవిష్యత్తు పెట్టుబడుల్లో భాగం.లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టండిలాభాలు వచ్చినప్పుడు వాటిని మొత్తం ఖర్చు చేయకండి. కొంత భాగాన్ని మళ్లీ పెట్టుబడుల్లో పెట్టండి. దీనివల్ల లాభాలపై మళ్లీ లాభాలు వస్తాయి. ఇదే నిజమైన సంపద రహస్యం. సరైన అసెట్ అలొకేషన్మీ పెట్టుబడులపై ఎంత రాబడి వస్తుందనేది మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారనేదానిపై ఆధారపడి ఉంటుంది. దీన్నే అసెట్ అలొకేషన్గా చెబుతుంటారు. ఈక్విటీ, డెట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ వంటి విభాగాల్లో మీ డబ్బును సరైన శాతాల్లో పెట్టుబడి చేయడమే ఈ అసెట్ అలొకేషన్. మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యం , మీ లక్ష్యాలు వాటి కాల వ్యవధి మీద ఇది ఆధారపడి ఉంటుంది. యువ ఇన్వెస్టర్లు రిస్క్ ఎక్కువ తీసుకోగలరు. అందుకే ఈక్విటీల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ భద్రత ముఖ్యం అవుతుంది. అప్పుడు డెట్లో పెట్టుబడికి ప్రాధాన్యమివ్వాలి. ఎవరైనా మొత్తం డబ్బు ఒకే చోట పెట్టడం ప్రమాదకరం.మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాట వినండిమీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ పెట్టుబడులను పర్యవేక్షిస్తుంటారు. మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తుంటారు. వారు ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, ఆలోచించి అమలు చేయడం మంచిది. ఫైనల్ నిర్ణయం మీరే తీసుకున్నా.. వారి అనుభవం పెట్టుబడుల విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.మార్కెట్ ఊగిసలాటలు సహజమేమార్కెట్ ఎప్పుడూ పైకి మాత్రమే వెళ్లదు. అప్పుడప్పుడూ పడిపోతుంది. కానీ మళ్లీ పెరుగుతుంది. ఇది సహజ ప్రక్రియ. చిన్న మార్పులకు భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే, మీరు నష్టాలకే బాట వేస్తారు. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయనే విషయం చరిత్ర చెబుతోంది. పెట్టుబడుల విషయంలో ఓర్పు ఇన్వెస్టర్కు అత్యంత ముఖ్యమైన ఆయుధం.పెట్టుబడులూ ప్రధానమే..మనందరికీ కుటుంబం ముఖ్యం. పని ముఖ్యం. కానీ పెట్టుబడులూ అంతే ముఖ్యమని తెలు సుకోవాలి. ఎందుకంటే ఇవే మీ భవిష్యత్తును కాపాడతాయి. చాలామంది చేసే తప్పేంటంటే ముందుగా ఖర్చులు చేస్తారు, మిగిలితే ఇన్వెస్ట్ చేస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్లు చేసే పని ముందుగా ఇన్వెస్ట్ చేయడం. తర్వాత ఖర్చులు ప్లాన్ చేసుకోవటం. ఇది చిన్న మార్పులా అనిపించినా, దీర్ఘకాలంలో సంపద సృష్టికి పెద్ద ఆధారమవుతుంది.దీర్ఘకాలిక లక్ష్యాలను ఎప్పుడూ మరవద్దుపిల్లల చదువు, రిటైర్మెంట్, ఇల్లు కొనడం లాంటి లక్ష్యాలు 10–15 సంవత్సరాల తర్వాత వచ్చే దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇవి సమయం మీద ఆధారపడే లక్ష్యాలు. సమయం అంటే కాంపౌండింగ్ శక్తి. ఈ డబ్బును చిన్న అవసరాలకు వాడితే మీరు కోల్పోయేది కేవలం డబ్బు కాదు. అంతకంటే విలువైన సమయం. డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేరు.పెట్టుబడులు చేయడం అలవాటు చేసుకోండివిజయవంతమైన ఇన్వెస్టర్లు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టరు. క్రమ పద్ధతిలో పెట్టుబడులు చేస్తుంటారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) వంటి పద్ధతులు మీలో క్రమశిక్షణను పెంచుతాయి. చిన్న మొత్తాలతో మొదలుపెట్టినా, కాలక్రమంలో అవి పెద్ద మొత్తాలుగా మారతాయి.పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాలిమార్కెట్ మారుతుంది. మీ జీవితం కూడా మారుతుంది. కొత్త లక్ష్యాలు వస్తాయి, పాత లక్ష్యాలు పూర్తవుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో కూడా మార్పులు చేయాలి. దీన్నే పెట్టుబడుల పరిభాషలో రీ–బ్యాలెన్సింగ్ అంటారు.ఉదాహరణకు పిల్లల చదువుకు చేసిన పెట్టుబడులు పూర్తయ్యాక, ఆ డబ్బును రిటైర్మెంట్ లక్ష్యానికి మళ్లించాలి.ఇదీ చదవండి: ‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం
రక్షణ ప్లస్ రాబడి
మన దేశంలో ఇన్వెస్ట్మెంట్లంటే మొదటి నుంచీ ఒకటే ధోరణి. అయితే డిపాజిట్లు. లేకుంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు. ఇవి రెండూ కాకుంటే బంగారం లేదా రియలీ్ట. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ఇబ్బందికరం అనుకునేవారు మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయించటం. ఇప్పటికీ చాలామందిది ఇదే తీరు. వారికి మ్యూచువల్ ఫండ్లంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవే. కానీ ఇప్పుడు మార్కెట్లు ఇలా వేటిలోనూ ఒకదాంట్లో పెట్టుబడులు పెట్టి ఊరుకునేలా లేవు. అలాగని అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టాలంటే... వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకోవటం అంత తేలికకాదు. అందుకే ఇలాంటివన్నీ చేసే ఫండ్స్ను చూసుకోవాలి. అటు డెట్లోను, ఇటు స్టాక్ మార్కెట్లో, మరోవైపు బంగారంలోనూ... ఇలా మూడింటా పెట్టుబడులు పెడుతూ... అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్లేవే మల్టీ అసెట్ ఫండ్స్. పేరుకు తగ్గట్టే ఇవి భిన్న రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. డెట్లో పెడతాయి కనక కొంత రక్షణ తప్పనిసరిగా ఉంటుంది. పైపెచ్చు అవసరాన్ని బట్టి మారుస్తాయి కనక చక్కని రాబడి కూడా ఇస్తున్నాయి. రిస్క్ లు, రాబడుల మధ్య సమతూకాన్ని పాటిస్తూ వివిధ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఈ మల్టీ అసెట్ ఫండ్స్... ప్రస్తుతం అందరికీ అవసరమైనవనటంలో సందేహం లేదు. వాటిపై సమగ్ర అవగాహనే ఈ వెల్త్ స్టోరీ...కనీసం మూడు అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్నే మల్టీ అసెట్ ఫండ్స్గా వ్యవహరిస్తుంటారు. ఇవి పెట్టుబడి వృద్ధి కోసం ఈక్విటీల్లో, స్థిరత్వం కోసం డెట్ సాధనాలు– బాండ్స్లో, రిస్క్ లను హెడ్జ్ చేసేందుకు పసిడి/ కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రతి అసెట్ క్లాస్కి కనీసం ఇంత కేటాయించాలనే నిబంధనలుంటాయి. కాబట్టి దానికి తగ్గట్లే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి ఫండ్ ఒకటి ఉంటే సంపూర్ణమైన పోర్ట్ఫోలియో ఉన్నట్లే లెక్క. ఇవన్నీ ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్లను చూస్తే విడివిడిగా స్టాక్స్ని ఎంచుకోవడం కన్నా అసెట్స్ అలొకేషన్ వైపే పరిస్థితులు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. డెట్ మార్కెట్లు స్థిరపడుతున్నాయి. పుత్తడి పటిష్టమైన హెడ్జింగ్కి ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక్క అసెట్ని నమ్ముకుంటే వర్కౌట్ కాదని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారు. మల్టీ అసెట్ ఫండ్స్తో ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందుకుంటున్నారు. ఇవి పరిస్థితులను బట్టి వివిధ అసెట్స్ మధ్య కేటాయింపులను ఆటోమేటిక్గా మార్చేస్తాయి. మార్కెట్లలో మార్పులను బట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. పోర్ట్ఫోలియో పతనమయ్యే రిస్కులను తగ్గిస్తాయి. మల్టీ అసెట్ ఎందుకు ఉపయోగకరం అంటే..వివిధ అసెట్స్ వ్యాప్తంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు వీలుంటుంది. పరిస్థితులను బట్టి పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతుంది. ఈక్విటీల్లో మాత్రమే పెట్టే పెట్టుబడులతో పోలిస్తే హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. వీటిలోనైతే మార్కెట్ కరెక్షన్లకు లోనయ్యేటప్పుడు రక్షణ ఉంటుంది. దీర్ఘకాలికంగా సిప్ ఇన్వెస్టింగ్ కోసం ఇవి అనువైనవి కూడా.డెట్ (బాండ్లు) పాత్ర.. డెట్ విభాగమనేది మల్టీ అసెట్ ఫండ్స్కి ఉండే బలాల్లో ఒకటి. ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది. పోర్ట్ఫోలియోలో ఒడిదుడుకులను తగ్గిస్తుంది. ఈక్విటీలు కరెక్షన్కి లోనయ్యే సమయంలో పోర్ట్ఫోలియో మరీ ఎక్కువగా పడిపోకుండా కాస్త కుషన్గా పని చేస్తుంది. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు బాండ్లు అనేవి భద్రత కోసమే కాక పోర్ట్ఫోలియోను సంరక్షించుకునే వ్యూహంగా కూడా పనికొస్తాయి. సరైన ఫండ్ని ఎంచుకోవడం ఇలా.. అసెట్ అలొకేషన్ని పరిశీలించాలి → ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపించే ఫండ్లలో అధిక రాబడులతో పాటు అధిక రిస్క్ లూ ఉంటాయి. → బ్యాలెన్స్డ్గా పెట్టుబడులు పెట్టే ఫండ్లలో మాత్రమే స్థిరమైన రాబడులుంటాయి. నిలకడపై ఫోకస్ → స్వల్పకాలిక రాబడులను కాకుండా 3–5 ఏళ్ల పనితీరును పరిశీలించాలి. ఫండ్ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి → ఐసీఐసీఐ = కాంట్రేరియన్ → ఎస్బీఐ = బ్యాలెన్స్డ్ → క్వాంట్ = అగ్రెసివ్ మీ రిస్కు సామర్థ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవాలి→ కన్జర్వేటివ్ = ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ → మోడరేట్ = ఐసీఐసీఐ, కోటక్ → అగ్రెసివ్ = నిప్పన్, క్వాంట్ ఈ రిస్క్ లుంటాయ్.. మార్కెట్లు బులిష్గా దూకుడు మీదున్నప్పుడు ఇవి పెద్దగా రాణించకపోవచ్చు. అలాగే రాబడులనేవి ఫండ్ మేనేజర్ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక మరీ డైవర్సిఫికేషన్ ఎక్కువగా చేసినా కూడా వృద్ధి అవకాశాలు పరిమితమవుతాయి.– సాక్షి, వెల్త్
సిబిల్ స్కోరుపై పెరుగుతున్న అవగాహన
ముంబై: రుణాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 18.3 కోట్ల మంది భారతీయులు తమ సిబిల్ స్కోరును స్వయంగా పరిశీలించుకుంటున్నారు.తొలిసారిగా పరిశీలించుకునే వారి సంఖ్య గతేడాది డిసెంబర్ గణాంకాల ప్రకారం వార్షికంగా 27 శాతం పెరిగింది. క్రెడిట్ మానిటరింగ్ చేసుకుంటున్న వారి సగటు స్కోరు 728గా ఉంది. ఇలా పర్యవేక్షించుకుంటున్న వారిలో సుమారు 45 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో తమ స్కోరును మరింత మెరుగుపర్చుకుంటున్నారు.సాధారణంగా వ్యక్తిగత రుణాల్లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగదారులు స్కోరును తెలుసుకునే వారని, కానీ ప్రస్తుతం తరచుగా తెలుసుకోవడం, దాన్ని మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. మిలీనియల్స్, జెన్ జెడ్ తరం, మహిళలు ఈ విషయంలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెట్రోయేతర ప్రాంతాల్లో స్కోరు ను పరిశీలించుకునే ధోరణి పెరుగుతోందన్నారు.


