Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How To Increase Car Mileage1
కారు మైలేజ్ పెరగాలంటే..

ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లనే కొనుగోలు చేస్తుంటారు. అయితే క్రమంగా కొన్ని రోజులకు మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా.. మైలేజ్ పెరగాలంటే వాహనదారులు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.సరైన డ్రైవింగ్కారు మైలేజ్‌పై ఎక్కువ ప్రభావం చూపేది డ్రైవింగ్ విధానమే. ఆకాశమత్తుగా వేగం పెంచడం, సడన్ బ్రేక్స్ వేయడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి స్మూత్‌గా.. ఒక నిర్దిష్టమైన వేగంతో డ్రైవ్ చేయాలి. సాధారణంగా గంటకు 60 కిమీ నుంచి 80 కిమీ వేగం ఉత్తమ మైలేజ్‌కు అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా.. అవసరం లేనప్పుడు క్లచ్ నొక్కి ఉంచకుండా, సరైన గేర్‌ను ఉపయోగించాలి.వాహనాన్ని సక్రమంగా నిర్వహించడంవాహనాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా.. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తుండాలి. ఇది నిర్లక్ష్యం చేస్తే మైలేజ్ తప్పకుండా తగ్గుతుంది. టైర్ ప్రెషర్ సరిగా లేకపోతే ఇంజిన్‌పై ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్ మెయింటెనెన్స్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ వంటి వాటిని సమయానికి మారుస్తుండాలి.అనవసర బరువు వేయొద్దుకారులో లోపల లేదా కారు డిక్కీలో అవసరం లేని లగేజ్ ఉంచకూడదు. బరువు పెరిగితే.. ఇంజిన్ పనితీరు ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం లేని వస్తువులను తొలగించడం ద్వారా మైలేజ్ కొంత పెంచుకోవచ్చు.ఏసీ, ఎలక్ట్రిక్ పరికరాల వినియోయాగంకారులో అవసరం లేనప్పుడు ఏసీ ఆపేయాలి. ఏసీ వినియోగం కూడా ఇంధన వినియోగానికి కారణం అవుతుంది. ప్రత్యేకంగా నగరంలో తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు AC వాడకం మైలేజ్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా లైట్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను ఆఫ్ చేసి ఉంచాలి.రూట్ ప్లానింగ్మీరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. భారీ ట్రాఫిక్ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్‌లో ఉండటం వల్ల ఇంధనం వృథా అవుతుంది. కాబట్టి ముందుగానే రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, కారు ఇంజిన్ ఆప్ చేసుకోవడం ఉత్తమం.

Credit Information Companies asked RBI and govt to allow use non credit data2
గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్‌ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.బడ్జెట్ ప్రతిపాదనలు2025-26 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్‌లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకతగ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్‌బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..విద్యుత్తు బిల్లుల చెల్లింపులునీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులుల్యాండ్‌లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.ప్రయోజనాలుయుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్‌లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్‌వర్తినెస్‌’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.చట్టపరమైన, సాంకేతిక సవాళ్లుప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్‌ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్‌లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్‌బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌.. గిగ్‌ వర్కర్ల సమస్యలివే..

RBI Bank Holiday List 20263
2026లో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్

ఇంకొన్ని రోజుల్లో 2025 ముగుస్తుంది. ఇప్పటికే పండుగలు, ఇతర పర్వ దినాలకు సంబంధించిన సెలవులను సంబంధిత శాఖలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే ఏడాది (2026) సుమారు 21 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.➤మకర సంక్రాంతి (జనవరి 15)➤రిపబ్లిక్‌ డే (జనవరి 26)➤హోలీ (మార్చి 3)➤ఉగాది (మార్చి 19)➤రంజాన్‌ (మార్చి 21)➤శ్రీరామ నవమి (మార్చి 27)➤అకౌంట్స్‌ క్లోజింగ్‌ డే (ఏప్రిల్ 1)➤గుడ్‌ఫ్రైడే (ఏప్రిల్ 3)➤అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్ 14)➤మే డే (మే 1)➤బక్రీద్‌ (మే 27)➤మొహర్రం (జూన్ 26)➤స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)➤మిలాద్‌ ఉన్‌-నబీ (ఆగస్టు 26)➤శ్రీకృష్ణ జన్మాష్టమి (సెప్టెంబర్‌ 4)➤వినాయక చవితి (సెప్టెంబర్‌ 14)➤గాంధీ జయంతి (అక్టోబర్‌ 2)➤విజయ దశమి (అక్టోబర్‌ 20)➤దీపావళి (నవంబర్‌ 8)➤గురునానక్‌ జయంతి (నవంబర్‌ 24)➤క్రిస్మస్‌ (డిసెంబర్‌ 25)బ్యాంక్ హాలిడేస్ అనేవి రాష్ట్రాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అయితే.. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!

four big investment themes for 2026 check list4
2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!

2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్‌కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.కృత్రిమ మేధభారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్‌’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.ఈవీ చార్జింగ్ సదుపాయాలుఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.ఆఫీస్ వర్క్‌స్పేస్భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్‌గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.లగ్జరీ, ప్రీమియం వస్తువులుపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌.. గిగ్‌ వర్కర్ల సమస్యలివే..

Silver Price Double in Six Months Here Is The Reasons5
ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!

2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఇప్పుడు భారీగా పెరిగింది. ధరలు పెరుగుదల క్రమంలో జులై 26న 1,18,120 రూపాయల వద్ద నిలిచింది. ఆ తరువాత నెలలో (ఆగష్టు 26) రూ.1,23,126 వద్దను చేరింది. ఇలాగే కొనసాగుతూ.. డిసెంబర్ 26 నాటికి కేజీ వెండి రూ. 2,36,350 వద్ద నిలిచింది.జులై 26 ధరలతో పోలిస్తే.. డిసెంబర్ 26నాటి ధరలు రెట్టింపు. అంటే ఆరు నెలల కాలంలో వెండి రేటు డబుల్ అయింది. ఈ రోజు మాత్రమే సిల్వర్ రేటు రూ. 20వేలు పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది.ఈ రోజు (డిసెంబర్ 27) వెండి రేటు రూ. 20000 పెరగడంతో.. కేజీ సిల్వర్ ధర రూ. 2.74 లక్షలకు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ రేటు రూ. 11వేలు పెరిగి.. రూ. 2.51 లక్షల వద్ద ఉంది.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.ఇదీ చదవండి: బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్‌

Tata Nexon EV Crosses One Lakh Sales Milestone6
లక్ష మంది కొన్న టాటా ఎలక్ట్రిక్ కారు.. ఇదే!

టాటా మోటార్స్ భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. నెక్సాన్ EV దేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.2020లో తన మొట్టమొదటి నెక్సాన్ ఈవీని లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రారంభంలో నెలకు 300 నెక్సాన్ కార్లను విక్రయించిన టాటా మోటార్స్.. ఆ తరువాత నెలకు 3000 యూనిట్లను విక్రయించగలిగింది. ఇప్పుడు భారతీయ రోడ్లపై 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ భారతదేశ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 66 శాతం వాటాను కలిగి ఉంది.ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలుటాటా మోటార్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం XPRES-T ఈవీలను విక్రయిస్తోంది. కాగా కంపెనీ రానున్న రోజుల్లో.. సియెర్రా EV, అప్డేటెడ్ పంచ్ EV, అవిన్యా వంటి కార్లు లాంచ్ అవుతాయి.

Advertisement
Advertisement
Advertisement