Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

nightclub market grow steadily know how to business going on in night clubs1
నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు

గోవా నైట్‌క్లబ్‌లో ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌తో నైట్‌లైఫ్‌ ఇండస్ట్రీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, దాని ఆర్థిక వ్యవస్థలోని అంశాలు చర్చకు వస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే లైట్లు, డీజే సంగీతం ఉండే నైట్‌క్లబ్‌ల్లో కోట్లాది రూపాయల బిజినెస్‌ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. భారతదేశంలో కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి నగరాలు ఈ రాత్రిపూట వినోద రంగంలో ఏటా సుమారు 10% వృద్ధిని నమోదు చేస్తున్నాయి.నైట్‌క్లబ్ వ్యాపార నమూనానైట్‌క్లబ్‌లు ప్రధానంగా అధిక మార్జిన్ కలిగిన ఉత్పత్తులు, సర్వీసులను విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జిస్తాయి. నైట్‌క్లబ్ ఆదాయంలో అత్యంత కీలకమైన భాగం ఆల్కహాల్, ఇతర పానీయాల విక్రయం. పానీయాలపై లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ టేబుల్స్ లేదా ప్రత్యేక విభాగాల్లో ‘బాటిల్ సర్వీస్’ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇందులో కస్టమర్‌లు అధిక ధరలకు ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తారు. దీనికి ప్రత్యేక సర్వీస్ అందిస్తుండడంతో నైట్‌క్లబ్‌లు ఆదాయం సంపాదిస్తాయి.ప్రవేశ రుసుము, కవర్ ఛార్జీలువారాంతాల్లో లేదా ప్రత్యేక ఈవెంట్‌ల సమయంలో కస్టమర్‌ల సంఖ్యను నియంత్రించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ రుసుము లేదా కవర్ ఛార్జ్ (దీనిలో కొంత మొత్తం పానీయాలకు లెక్కిస్తారు) వసూలు చేస్తారు.ప్రత్యేక ఈవెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లుప్రముఖ జాతీయ/ అంతర్జాతీయ డీజేలు, కళాకారులతో ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా టికెట్ ధరలను పెంచుతుంటారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో కస్టమర్‌లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.కార్పొరేట్ ఈవెంట్‌లుప్రైవేట్ పార్టీలు, కార్పొరేట్ ఫంక్షన్‌లు, ప్రొడక్ట్ లాంచ్‌ల కోసం క్లబ్‌ను అద్దెకు ఇస్తుంటారు.బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లుమద్యం, సాఫ్ట్‌డ్రింక్స్ లేదా ఇతర లైఫ్‌స్టైల్ బ్రాండ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.నిర్వహణ, సవాళ్లునైట్‌క్లబ్‌ను విజయవంతంగా నడపడం కేవలం సంగీతం, డ్రింక్స్‌కు సంబంధించినది మాత్రమే కాదు. ఇది సంక్లిష్టమైన నిర్వహణ సవాళ్లతో కూడుకుంది. మద్యం లైసెన్స్, అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ, మ్యూజిక్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి అనేక రకాల అనుమతులను పొందాలి. వాటిని ఎప్పటికప్పుడు రెన్యువల్‌ చేసుకోవాలి. గోవాలో జరిగిన సంఘటన వంటి వాటి నేపథ్యంలో నైట్‌క్లబ్‌ల భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వాల నుంచి పర్యవేక్షణ, నియంత్రణ మరింత కఠినతరం కావాల్సి ఉంది.భద్రతా వాతావరణంనాణ్యమైన ధ్వని, లైటింగ్ సిస్టమ్, విభిన్న వాతావరణం (Ambiance), ప్రముఖ డీజేల ఎంపిక క్లబ్ పేరును, ప్రజాదరణను పెంచుతాయి. తాగుబోతుల నియంత్రణ, గొడవలు, ముఖ్యంగా మహిళా కస్టమర్ల భద్రత కోసం బలమైన భద్రతా సిబ్బంది అవసరం.ఖర్చుల నిర్వహణక్లబ్‌ల ఏర్పాటు కోసం స్థలం అద్దె, విద్యుత్, నీరు, బీమా వంటి స్థిర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. క్లబ్‌లో స్టాక్‌ను నిర్వహించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, పానీయాల నాణ్యతను కాపాడటం లాభాలకు కీలకం. డీజేలు, బార్‌ అటెండర్లు, వెయిటర్లు, భద్రతా సిబ్బందికి అయ్యే వేతనాలుంటాయి.భద్రతా ప్రమాణాల ఉల్లంఘనల పర్యవసానంక్లబ్‌ల్లో కిటికీలు లేని చీకటి ప్రదేశాలు, ఇరుకైన మెట్లు, మూసివేసిన ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం లేదా ఉన్నా పని చేయకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను పెంచుతాయి. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన క్లబ్ యజమానులు, నిర్వాహకులు భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులను ఎదుర్కోవలసి వస్తుంది. భద్రతా వైఫల్యాలు క్లబ్ బ్రాండ్‌కు, నైట్‌లైఫ్ పరిశ్రమ ప్రతిష్టకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఇప్పుడేం చేయాలంటే..భారతదేశంలో నైట్‌క్లబ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. అయితే, ఇది నిలకడగా, సురక్షితంగా మనుగడ సాగించాలంటే కేవలం లాభాలపైనే కాకుండా.. భద్రతా ప్రమాణాలపై, చట్టపరమైన నిబంధనల అమలుపై నిర్వాహకులు, ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలి. గోవా సంఘటన లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వ్యాపార లాభాలతో పాటు కస్టమర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తక్షణ అవసరం.ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం

Pilot Demand and Salaries in India2
పైలట్లకు ఎంత డిమాండో.. మరి జీతాలు?

విమాన పైలట్‌ అన్నది అత్యుత్తమ కెరియర్‌లలో ఒకటి. పైలట్‌ అవ్వాలని చాలా మంది చిన్నప్పటి నుంచే కల కంటుంటారు. తాజాగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో (Indigo Crisis) పైలట్లకు, విమాన సిబ్బందికి డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం.. ఈ క్రమంలో వారికి జీత భత్యాలు ఎలా ఉంటాయన్న ఉత్సుకత చాలామందిలో ఉంటుంది.. ఇక్కడ తెలుసుకుందామా..భారతదేశ విమానయాన రంగం ఆకాశాన్నే తాకుతున్నట్టుగా వృద్ధి చెందుతోంది. టూరిజం బూమ్‌, ఇతర కారణాలతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఎయిర్‌లైన్స్‌ ఎప్పటికప్పుడు కొత్త విమానాలు ఆర్డర్ చేస్తున్నాయి. దీంతో పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి అసాధారణ డిమాండ్ ఏర్పడింది.దేశంలో ప్రస్తుతం సుమారు 20 వేల మంది పైలట్లు, దాదాపు 35 వేల మ​ంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు. మరో 10 సంవత్సరాల్లో 30,000 మంది పైలట్లు, 6.78 లక్షల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది అవసరమవుతారని అంతర్జాతీయ అవియేషన్ అంచనాలు సూచిస్తున్నాయి.22,400 మంది అవసరంవిమానయాన శాఖ డేటా ప్రకారం.. భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా మారింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి పెద్ద ఎయిర్‌లైన్‌లు రోజువారీ 2,000కి పైగా ఫ్లైట్‌లు నడుపుతున్నాయి. "2026 నాటికి 7,000 మంది కొత్త పైలట్లు, 2028 నాటికి మొత్తం 22,400 మంది అవసరం" అని ఇండియన్ ఎయిర్‌లైన్స్ అసోసియేషన్ (IAA) ఓ నివేదికలో పేర్కొంది.ఆకర్షణీయ జీత భత్యాలుపైలట్ల జీతభత్యాలు ఎయిర్‌లైన్‌ ప్రాతిపదికన, అనుభవం, విమాన రకం (A320, A321, ATR) వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.ట్రైనీ పైలట్‌లు మొదటి సంవత్సరంలోనే నెలకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు జీతం పొందుతారు.ఫస్ట్ ఆఫీసర్ (కో-పైలట్) పదవిలో ₹1.5 లక్షలు నుంచి ₹3 లక్షల వరకు, కెప్టెన్‌లకు ₹3 లక్షలు నుంచి ₹15 లక్షల వరకు (కొందరు ₹25 లక్షల వరకు) ఆదాయం ఉంటుంది.సీనియర్ పైలట్‌లు రూ.12 లక్షల వరకు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.జీతాలతో పాటు ఫ్లయింగ్ అలవెన్స్, నైట్ అలవెన్స్, స్టే అలవెన్స్, ఇన్స్యూరెన్స్, హోటల్ & ట్రాన్స్‌పోర్ట్‌ ఫెసిలిటీస్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.ఇక క్యాబిన్ క్రూ సిబ్బంది విషయానికి వస్తే ఫ్రెషర్లకు జీతం రూ.25,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ రూ.1 లక్షకుపైగా చేరుకుంటుంది.ఎయిర్ ఇండియాలో ఫ్రెషర్లు రూ.59,000 నుంచి రూ.61,000 వరకు పొందుతున్నారు. సీనియర్లు రూ.1.5 లక్షలు నుంచి రూ.2.5 లక్షల వరకు అందుకుంటున్నారు.ఈ జీతాలతో పాటు, ఉచిత ఫ్లైట్ టికెట్లు, హౌసింగ్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటి భత్యాలు ఉన్నాయి.

why JioHotstar announced Rs 4000 cr investment over next five years3
దక్షిణాది మార్కెట్‌పై జియోహాట్‌స్టార్ మెగా ప్లాన్

దక్షిణాది మీడియా, వినోద పరిశ్రమలో జియోహాట్‌స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. మాతృ సంస్థ జియోస్టార్ (JioStar) రాబోయే ఐదేళ్లలో రూ.4,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి దక్షిణాది క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చెన్నైలో ఇటీవల జరిగిన ‘సౌత్ అన్‌బౌండ్ (South Unbound)’ అనే ఈవెంట్‌లో వివిధ 25 కొత్త ప్రసార ప్రకటనలను ఆవిష్కరించారు.భారీ పెట్టుబడి లక్ష్యం ఏమిటి?జియోహాట్‌స్టార్‌కు దక్షిణాది ప్రాంతం ఒక కీలక వృద్ధి కేంద్రంగా మారిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల వినియోగదారులతో పోలిస్తే దక్షిణాది వీక్షకులు తమ ప్లాట్‌ఫామ్‌పై 70% ఎక్కువ సమయం గడుపుతున్నారని, 50% ఎక్కువ కంటెంట్ విభాగాలను చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ను మరింత బలోపేతం చేయడానికి దక్షిణాది ప్రేక్షకులకు మరింత వైవిధ్యభరితమైన, నాణ్యత కలిగిన కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో రూ.4,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలిపారు.ఈ నిధులను రచయితలు, దర్శకులు, నూతన డిజిటల్ కథా రచయితల అభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, రైటింగ్ ల్యాబ్‌ల కోసం ఉపయోగించనున్నారు. కంటెంట్ నిర్మాణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక నిర్మాణ సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిధులు ఎంతో తోడ్పడుతాయని కంపెనీ చెప్పింది. దీని ద్వారా 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 15,000 పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.ఐపీఎల్ హక్కుల నష్టాన్ని భర్తీ చేస్తుందా?జియోహాట్‌స్టార్ ఐపీఎల్ మీడియా హక్కులను కోల్పోవడం, ఆ తర్వాత దక్షిణాదిలో ఈ భారీ పెట్టుబడి ప్రకటనకు మధ్య ఉన్న సంబంధంపై మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జియోహాట్‌స్టార్ దక్షిణాది ప్రేక్షకులకు ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉద్దేశించిన కంటెంట్‌ను అందించాలని నిర్ణయించింది. ఐపీఎల్ అనేది క్రీడా విభాగానికి చెందింది. దక్షిణాదిలో ఓటీటీ వీక్షణలు తగ్గి, నిలుపుదల రేటు (Retention Rate) ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున జియోహాట్‌స్టార్ ఈ పెట్టుబడిని కేవలం ఐపీఎల్ లోటును భర్తీ చేయడానికి కాకుండా ప్రాంతీయ మార్కెట్‌లో ప్రజలకు వినోదాన్ని పంచుతూ తాను ఆర్థికంగా వృద్ధి చెందే అంశంగా చూడాలని కొందరు చెబుతున్నారు. ప్రాంతీయ కంటెంట్ సృష్టికర్తలు, స్థానిక కథనాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచుకోవాలని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం

Key Updates on the IndiGo Crisis, Check details4
ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం

ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్‌ 2 నుంచి 5000 విమాన సర్వీసులు వరకు రద్దయ్యాయని తెలుస్తుంది. ఇటీవల ఇండిగో సీఈఓ పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరించినట్లు చెప్పారు. కానీ విమానాల రద్దు, సర్వీసుల్లో అంతరాయం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు బెంగళూరులో 60 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో చెప్పింది. దాంతోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని తాజా పరిణామాలు కింద చూద్దాం.అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం మొత్తం 18 ఇండిగో విమానాలను రద్దు చేశారు. వీటిలో తొమ్మిది రావాల్సినవి, మరో తొమ్మిది బయలుదేరాల్సిన సర్వీసులు ఉన్నాయి.మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు సకాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం ఉదయం 60 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. రావాల్సినవి-32, బయలుదేరాల్సినవి-28.ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈ రోజు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు హాజరుకానున్నారు. ఇటీవలి కార్యాచరణ అంతరాయాలపై డేటా, అప్‌డేట్లతో సహా సమగ్ర నివేదికను సమర్పించడానికి డీజీసీఏ ఆయనను పిలిచింది.ఇటీవల విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఒక వీడియో సందేశంలో ప్రయాణికులకు క్షమాపణలు కోరారు. వేలాది మంది ప్రయాణికులు ఈ సంఘటన వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు.Message from Vikram Singh Mehta, Chairman and Non-Executive Independent Director of IndiGo pic.twitter.com/sySacxlFq0— IndiGo (@IndiGo6E) December 10, 2025ఇండిగో నిన్న 220 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.సామూహిక విమానాల రద్దు కారణంగా మూడో త్రైమాసికంలో దేశీయ వింటర్‌ షెడ్యూల్‌లో 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: సవాళ్లపై భారత్‌ నజర్‌ వేయాల్సిందే!

Gold and Silver rates on 11th December 2025 in Telugu states 5
పసిడి ఊరట.. వెండి మంట!

దేశంలో వెండి ధరల మంటలు కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు మాత్రం ఊరటనిచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం అలాగే వరుసగా నాలుగో రోజూ ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on December 11th 20256
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు తగ్గి 25,736కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 81 పాయింట్లు నష్టపోయి 84,332 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-12-2025(time: 9:20 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement