Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Harley Davidson X440 T Launched At Rs 2 79 Lakh1
హార్లే డేవిడ్సన్ కొత్త బైక్: ధర ఎంతో తెలుసా?

హీరో మోటోకార్ప్ & హార్లే-డేవిడ్సన్ కంపెనీలు అభివృద్ధి చేసిన బైకులను ఎప్పటికప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తూ.. ప్రజాదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా HD X440 T పేరుతో ఓ బైక్ లాంచ్ చేశాయి. దీని ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).నలుపు, ఎరుపు, నీలం & తెలుపు అనే నాలుగు రంగులలో లభించే ఈ లేటెస్ట్ హార్లే-డేవిడ్సన్ హెచ్డీ ఎక్స్440 టీ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డిజైన్ కలిగిన ఈ బైకులో 440cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 27hp & 38Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఎంపికలో లభిస్తుంది. ఈ బైక్ ప్రత్యేకంగా రైడ్-బై-వైర్, రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్‌ వంటివి పొందుతుంది. రియర్ సబ్‌ఫ్రేమ్ కొత్త టెయిల్ సెక్షన్‌ పొందుతుంది. గ్రాబ్ హ్యాండిల్స్ & పొడవైన సీటు వంటివి రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తాయి.ఇదీ చదవండి: జనవరి నుంచి ఈ కారు ధరల పెంపు!

IndiGo plans to hire over 900 pilots by 2025 to comply with DGCA rules2
పైలట్ల నియామక చర్యలు షురూ..

భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో తీవ్రమైన పైలట్ కొరత సంక్షోభంలో కూరుకుపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీడీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, నియామక లోపం కారణంగా ఇటీవల ఇండిగో వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ నుంచి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు కూడా జారీ అయింది.పైలట్ల నియామకానికి ప్రణాళికలుకొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలకు అనుగుణంగా పైలట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇండిగో తన నియామక షరతులను ఎత్తివేసింది. డీజీసీఏకు సమర్పించిన ప్రణాళికల ప్రకారం ఇండిగో వేగంగా పైలట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 10, 2026 నాటికి 158 మంది కొత్త పైలట్లను నియమించుకోవాలని నిర్ణయించింది. రాబోయే 12 నెలల్లో 900 మంది (300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లు)ని క్రూలో చేర్చుకుంటామని చెప్పింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మరో 742 మంది పైలట్ల నియామకం జరుపుతామని పేర్కొంది.ప్రస్తుతం 2,357 కెప్టెన్లు, 2,194 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్న ఇండిగో ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 2,425 కెప్టెన్లు, 2,284 మంది ఫస్ట్ ఆఫీసర్లకు పెంచాలని ప్రణాళిక వేసింది.విశ్లేషకుల హెచ్చరికఎలారా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను పూర్తిగా పాటించేందుకు ఇండిగోకు ఫిబ్రవరి నాటికి కనీసం 1,000 మంది పైలట్లు అవసరం. కెప్టెన్లకు 12 నెలలు, కో-పైలట్లకు 6 నెలల సుదీర్ఘ నోటీసు వ్యవధి కారణంగా ఈ నియామకాలు కష్టమవుతాయని ఎలారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గగన్ దీక్షిత్ పేర్కొన్నారు.మార్టిన్ కన్సల్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ డి మార్టిన్ ప్రకారం ఇండిగోకు వాస్తవానికి 5,525 మంది పైలట్లు అవసరం. కానీ, డిసెంబర్ ఫైలింగ్‌లో 4,551 మంది మాత్రమే ఉన్నారు. అంటే 974 మంది కొరత ఉంది. విదేశీ పైలట్ల నియామకానికి రెగ్యులేటరీ క్లియరెన్స్‌కు కూడా మూడు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఇండిగో ప్రతి విమానానికి 2.5 మంది పైలట్లతో పనిచేస్తుండగా ఎయిర్ ఇండియా, ఆకాసా ఎయిర్ వంటి ఇతర ఎయిర్‌లైన్స్‌లు 5.4 మంది పైలట్లతో పనిచేస్తున్నాయి.విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇండిగో డిసెంబర్ 10-15 నాటికి ఆపరేషన్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తోంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రద్దులు, రీషెడ్యూలింగ్‌పై పూర్తి వేవర్‌లను ప్రకటించింది.డీజీసీఏ హెచ్చరిక, జరిమానాకు అవకాశంనవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు డిసెంబర్ 6న డీజీసీఏ, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ఆపరేషన్లలో లోపాల కారణంగా జరిమానాలు లేదా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవచ్చని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నిబంధనల నుంచి ఇండిగోకు మాత్రమే ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?

why gold prices increased significantly know all details3
బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు చారిత్రక రికార్డులు సృష్టిస్తున్నాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నుంచి వస్తున్న భారీ కొనుగోలు డిమాండ్‌కు తోడు భారత రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాలకు పడిపోవడంతో దేశీయంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోయాయి. ఇటీవల గ్రాము బంగారం ధర రూ.13,015 (పది గ్రాములకు సుమారు రూ.1,30,150) మార్క్‌ను తాకింది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ధోరణి కొనసాగుతూ 2026లో బంగారం ధరలు మరో 5% నుంచి 30% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్థిక అస్థిరత నేపథ్యంలో బంగారం సురక్షిత ఆస్తిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.సెంట్రల్ బ్యాంకుల రికార్డు కొనుగోలు2025లో ఆర్‌బీఐ తన బంగారు నిల్వలను గణనీయంగా పెంచింది. మార్చి 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఆర్‌బీఐ ఏకంగా 64 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దేశ మొత్తం బంగారం నిల్వలు 880.2 టన్నులకు చేరాయి. దీని మొత్తం విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. చైనా, టర్కీ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అక్టోబర్ 2025లో సెంట్రల్ బ్యాంకులు మొత్తంగా 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది 2025లో అత్యధిక నెలవారీ కొనుగోలుగా నమోదైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా ప్రకారం, 2025 సంవత్సరంలో ఈ కొనుగోలుతో మొత్తంగా బంగారం 750-900 మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం ఉంది.రూపాయి బలహీనతఅంతర్జాతీయ మార్కెట్ ధరలతో పాటు భారత రూపాయి బలహీనపడటం దేశీయంగా బంగారం ధరలను మరింత పెంచింది. డిసెంబర్ 2025లో డాలర్‌ విలువ సుమారు రూ.90.20కి చేరింది. దాంతో జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. 2025లో రూపాయి సగటు రేటు రూ.86.96/డాలర్‌గా ఉంది. రూపాయి బలహీనత వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ధర కారణంగా కొనుగోలుదారులకు మరింత ఖరీదైనదిగా మార్చింది. తద్వారా దేశీయ ధరలు విపరీతంగా పెరిగాయి.ఆర్థిక అస్థిరతలుబంగారం ధరల పెరుగుదలకు ప్రపంచ ఆర్థిక అస్థిరత కూడా దోహదపడుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈజింగ్, పెరుగుతున్న అంతర్జాతీయ అప్పు, అధిక ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్, మిడిల్‌ ఈస్ట్‌ సంఘర్షణల వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మార్చాయి. 2025లో బంగారం ధర 48% పెరిగి 3,896 డాలర్లు/ఔన్స్‌కు చేరింది. దాంతో ఇది 1979 తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదలగా ఉంది.2026లో బంగారం అంచనాలునిపుణుల అంచనాల ప్రకారం, 2026లో బంగారం ధరలు ఆర్థిక మాంద్యం తీవ్రతపై ఆధారపడి ప్రస్తుత స్థాయి నుంచి 5-15% వరకు పెరగవచ్చు. డబ్ల్యూజీసీ ప్రకారం అంతర్జాతీయంగా ధరలు 4,000-4,500 డాలర్లు/ఔన్స్ మధ్య స్థిరపడవచ్చు. జేపీ మోర్గాన్ ప్రకారం క్యూ4 2025 నాటికి 3,675 డాలర్లు/ఔన్స్‌కు, ‍క్యూ2 2026 నాటికి 4,000 డాలర్లకి చేరవచ్చు.ఇదీ చదవండి: సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా

Apple facing biggest leadership shake up in decades whats happening4
సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా

సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలిక స్థిరమైన కంపెనీగా ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్.లో సీనియర్‌ ఉద్యోగులు రాజీనామాలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కీలక ఇంజినీర్ల ఆకస్మిక, సామూహిక నిష్క్రమణలు కంపెనీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో యాపిల్ వృద్ధిపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.గత వారంలోనే యాపిల్ తన కృత్రిమ మేధ (AI) అధిపతి జాన్ జియానాండ్రియా, ఇంటర్‌ఫేస్ డిజైన్ చీఫ్ అలాన్ డై తమ పదవి నుంచి నిష్క్రమించారు. వీరితో పాటు జనరల్ కౌన్సిల్ కేట్ ఆడమ్స్, సామాజిక కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ కూడా 2026లో పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు అధికారులు నేరుగా సీఈఓ టిమ్‌కుక్‌కు రిపోర్ట్ చేసేవారు.టిమ్‌కుక్‌ ప్రయత్నాలు..అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరి కొంతమంది కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాపిల్‌లో అత్యంత గౌరవనీయమైన, ఇన్-హౌస్ చిప్స్ ప్రాజెక్ట్‌ హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ సమీప భవిష్యత్తులో పదవి నుంచి నిష్క్రమించాలని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల కుక్‌కు తెలిపారు. కుక్, స్రూజీని నిలుపుకోవడానికి వేతన ప్యాకేజీ ఆఫర్‌ చేస్తూ ముఖ్యమైన బాధ్యతలతో సహా దూకుడుగా ప్రయత్నిస్తున్నారు.యాపిల్‌కు సమస్యఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణ ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా ఏఐ ప్రతిభ టెక్ ప్రత్యర్థుల వైపు మళ్లుతుండడం యాపిల్‌కు మరో పెద్ద సమస్యగా మారింది. మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్., ఓపెన్‌ఏఐ, వివిధ స్టార్టప్‌లు యాపిల్ ఇంజినీర్లకు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది సంస్థ ఏఐ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ జనరేటివ్ ఏఐలో ముందుండేందుకు కష్టపడుతోంది.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌లో 10,000 ఉద్యోగాల కోత

famous bank may cut upto 10000 jobs by 2027 check full details5
ప్రముఖ బ్యాంక్‌లో 10,000 ఉద్యోగాల కోత

స్విట్జర్లాండ్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన యూబీఎస్‌ రాబోయే మూడేళ్లలో సుమారు 10,000 ఉద్యోగాలను తొలగించే ప్రణాళికను పరిశీలిస్తోందని స్విస్ వార్తాపత్రిక ‘సోన్‌టాగ్స్ బ్లిక్’(SonntagsBlick) తెలిపింది. 2023లో క్రెడిట్ సూయిస్ విలీనం తర్వాత ఈ భారీ పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది.బ్యాంకు వ్యవస్థలో పునరావృత కార్యకలాపాలను తగ్గించడానికి ఈ ఉద్యోగ కోతలు, విలీన ప్రక్రియ ఎంతో తోడ్పడుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే యూబిఎస్ ప్రతినిధులు ఈ 10,000 సంఖ్యను మాత్రం కచ్చితంగా ధ్రువీకరించలేదని గమనించాలి.క్రెడిట్ సూయిస్ కొనుగోలు (మార్చి 2023) తర్వాత యూబీఎస్‌ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా వీలైనంత తక్కువగా ఉద్యోగ కోతలు ఉండేటా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు యూబీఎస్‌ ప్రతినిధులు చెప్పారు. బ్యాంకులో ఏవైనా తగ్గింపులు ఉంటే దానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో తక్షణ తొలగింపుల (లేఆఫ్స్‌) సంఖ్యను తగ్గించడానికి బ్యాంకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం2024 చివరి నాటికి యూబీఎస్‌లో సుమారు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 10,000 కోతలు దాదాపు 9 శాతం తగ్గుదలకు సమానం. ఇప్పటికే బ్యాంక్ 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 1,04,427కి తగ్గించింది. అంటే, ఈ విలీనం ప్రభావంతో ఇదివరకే సుమారు 15,000 ఉద్యోగాలు తొలగించినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో నరాల సమస్య

Hyderabad tech professional fulfilled her dream of owning Mini Cooper6
9 టూ 5 జాబ్‌ చేస్తూ రూ.65 లక్షల మినీ కూపర్

హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళా టెక్కీ తను చేస్తున్న ఉద్యోగం ద్వారా ఆమె కలల కారు ‘మినీ కూపర్ ఎస్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నిహారిక నాయక్ అనే మహిళ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఐకానిక్ వాహనాన్ని డెలివరీ అందుకుంటున్న క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన 16 ఏళ్ల కెరియర్‌ ప్రయాణం, మంచి జీతంతో ఈ కారును కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు.39 ఏళ్ల నిహారిక నాయక్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక మిడ్ సైజ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థలో క్వాలిటీ అస్యూరెన్స్ హెడ్‌గా 9 టూ 5 జాబ్‌ పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆమె 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ‘నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ ఉద్యోగాలపై స్పష్టత లేదు. ఐటీ రంగం అస్థిరంగా ఉంది’ అని నిహారిక గుర్తు చేసుకున్నారు. ‘కానీ నేను ఆ రంగాన్ని ఎంచుకున్నాను. 16 సంవత్సరాలుగా దానిలోనే ఉన్నాను’ అని చెప్పారు.కెరియర్‌లో వృత్తిపరమైన ఎదుగుదల కోసం ఉద్యోగాలు మారడం ఆమెకు లాభదాయకమైన నిర్ణయంగా అనిపించిందని చెప్పారు. మేనేజర్‌ స్థానంలో ఉన్న ఆమె ప్రస్తుతం అధిక జీతం పొందుతున్నట్లు చెప్పారు. గత ఆరేళ్లుగా ఒకే టెక్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్న ఆమె తన జీతం ఎంతో సరిగ్గా చెప్పనప్పటికీ సంవత్సరానికి రూ.45 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు ధ్రువీకరించారు. అయితే మొదట్లో ఐటీ ఉద్యోగంలో చాలా తక్కువగా వేలల్లోనే జీతం ఉండేదన్నారు. ఒకే రంగాన్ని నమ్ముకొని అందుకు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే జీతం అదే పెరుగుతుందన్నారు. నిహారిక నాయక్ మినీ కూపర్ ఎస్ ఆన్ రోడ్ ధర హైదరాబాద్‌లో రూ.65 లక్షలుగా ఉంది.ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో నరాల సమస్య

Advertisement
Advertisement
Advertisement