Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India logistics sector is projected to require an additional 47 lakh skilled workers by 20301
లాజిస్టిక్స్‌ రంగంలో 47 లక్షల ఉద్యోగ అవకాశాలు 

న్యూఢిల్లీ: దేశ లాజిస్టిక్స్‌ రంగంలో 2030 నాటికి అదనంగా 47 లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారని లాజిస్టిక్స్‌ రంగ నైపుణ్య మండలి సీఈవో రవికాంత్‌ యమర్తి అన్నారు. రవాణా, గోదాములు, సరఫరా వ్యవస్థ వ్యాప్తంగా సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. ఈ తక్షణ, పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించేందుకు నైపుణ్యాల కల్పనకు సంబంధించి భారీ సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. లాజిస్టిక్స్‌ రంగంలో నియామకాలు బలంగా ఉన్నాయంటూ, 2025 ద్వితీయ ఆరు నెలల్లో 10.8 శాతం పెరిగినట్టు చెప్పారు. పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ ఎన్నో ఖాళీలు భర్తీ అవుతుండడాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. ముంబైలో జరిగిన లాజిమ్యాట్‌ ఇండియా 2026 ఆరంభ కార్యక్రమంలో భాగంగా రవికాంత్‌ మాట్లాడారు. నైపుణ్యాల అంతరాన్ని అధిగమించేందుకు లాజిమ్యాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 350 అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. లాజిస్టిక్స్‌ ఆవిష్కరణలు, సహకారం పరంగా అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ ప్రాధాన్యం పెరుగుతున్నట్టు ల్యాండెస్‌మెస్సే స్టగర్ట్‌ జీఎంబీహెచ్‌ అండ్‌ కేజీ వైస్‌ ప్రెసిడెంట్‌ బెర్న్‌హర్డ్‌ ముల్లర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లాజిస్టిక్స్‌ రంగంలో మరింత మంది మహిళలు భాగస్వాములు అయినప్పుడు లాజిస్టిక్స్‌ రంగ వృద్ధి మరింత వేగాన్ని సంతరించుకుంటుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ శ్యామ్‌ జగన్నాథన్‌ అభిప్రాయపడ్డారు.

Hyderabad office market is entering its next growth phase2
ఆఫీస్‌ మార్కెట్‌కు  అడ్డా.. హైదరాబాద్‌ 

హైదరాబాద్‌: ఆఫీస్‌ మార్కెట్‌కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్‌ మారుతోంది. స్థిరమైన డిమాండ్, ఆఫీస్‌ వసతుల ఖాళీలు తగ్గుతుండడం, అద్దె ధరల్లో స్థిరమైన పెరుగుదులతో హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టినట్టు రేటింగ్‌ సంస్థ ఇక్రా తెలిపింది. 2025–26లో చివరి త్రైమాసికం (2026 జనవరి–మార్చి) నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా 18–19 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ వసతులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. ఇందులో పావు వంతు (23 శాతం) వసతులకు లీజింగ్‌ ఒప్పందాలు ఇప్పటికే కుదిరినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల్లోనూ హైదరాబాద్‌ ఆఫీస్‌ వసతుల పట్ల కిరాయిదారుల్లో స్థిరమైన విశ్వాసానికి దీన్ని నిదర్శనంగా పేర్కొంది. లీజింగ్‌ భళా.. 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఆఫీస్‌ వసతుల మార్కెట్‌ బలమైన పనితీరు చూపించింది. ఈ కాలంలో హైదరాబాద్‌ మార్కెట్లో 8.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ గ్రేడ్‌–ఏ స్పేస్‌ అదనంగా అందుబాటులోకి వచి్చంది. ఇక ఆఫీస్‌ వసతుల నికర స్వీకరణ 8.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉందని ఇక్రా తెలిపింది. ముఖ్యంగా ఐటీ–బీపీఎం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) సంస్థల నుంచి డిమాండ్‌ నెలకొంది. దీంతో 2025 డిసెంబర్‌ నాటికి ఖాళీ వసతులు 17 శాతానికి తగ్గాయి. 2024 మార్చి నాటికి ఖాళీలు 18.2 శాతంగా ఉండడం గమనార్హం. కొత్త వసతులు అందుబాటులోకి వచి్చనా కానీ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ మూలాలు బలంగా ఉన్నట్టు, వసతుల భర్తీ రేటు 2027 మార్చి నాటికి 82.5–83 శాతానికి పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ఆఫీస్‌ మార్కెట్లో కింగ్‌.. దేశవ్యాప్తంగా టాప్‌–6 నగరాల్లోని గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ వసతుల్లో హైదరాబాద్‌ మార్కెట్‌ గత ఐదేళ్లలో వేగవంతమైన విస్తరణ చూసినట్టు ఇక్రా నివేదిక ఆధారంగా తెలుస్తోంది. పోటీ మార్కెట్లలో వసతులు ఏటా 7 శాతం మేర పెరిగితే, హైదరాబాద్‌లో 14 శాతం అధికమవుతూ వచ్చాయి. టాప్‌–6 నగరాల్లోని వసతుల్లో హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ వాటా 2021 మార్చి నాటికి 13 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్‌ నాటికి 16 శాతానికి చేరింది. హైటెక్‌ సిటీ/మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ ప్రాంతాల్లోని ఆఫీస్‌ వసతులు నగరంలోని మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ సరఫరాలో 63 శాతం వాటా కలిగి, సరఫరాకు కీలకంగా ఉన్నాయి. హైటెక్‌ సిటీలో 2026–27లో పరిమిత సరఫరానే ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఖాళీలు తక్కువగానే ఉండొచ్చని.. అయితే గచి్చ»ౌలి, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో ఖాళీలు స్థిరంగా ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. లీజు ధరలు క్రమంగా పెరుగుతున్నాయంటూ, ఈ మూడు సూక్ష్మ మార్కెట్లలో గత ఐదేళ్లలో ఏటా 3–4 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని ఇక్రా నివేదిక వెల్లడించింది. 2025–26 క్యూ4 నుంచి 2026–27 వరకు ఇదే స్థాయిలో లీజు ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్, బలమైన లీజింగ్‌ కార్యకలాపాలు మధ్య కాలానికి హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.

Bharti Airtel Profit falls 55percent YoY to Rs 6,630 crore in Q33
ఎయిర్‌టెల్‌ వీక్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 55 శాతం పడిపోయి రూ. 6,631 కోట్లకు పరిమితమైంది. నెట్‌వర్క్‌ నిర్వహణ వ్యయాలతోపాటు, ఉద్యోగ వ్యయాల పెరుగుదల, ప్రభుత్వ ఫీజులు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 14,781 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 20 శాతం జంప్‌చేసి రూ. 53,982 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 45,129 కోట్ల టర్నోవర్‌ సాధించింది. దీనిలో దేశీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 39,226 కోట్లయ్యింది. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు 28 శాతం ఎగసి రూ. 11,787 కోట్లకు చేరగా.. వీటిలో దేశీ వాటా 16 శాతం అధికంగా రూ. 9,250 కోట్లకు చేరింది. లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ చార్జీలు 7 శాతం పెరిగి రూ. 3,846 కోట్లయ్యాయి. ఉద్యోగ వ్యయాలు సైతం 12 శాతం అధికమై రూ. 1,958 కోట్లను తాకాయి. కస్టమర్ల సంఖ్య అప్‌ తాజా సమీక్షా కాలంలో ఎయిర్‌టెల్‌ ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 5.7 శాతం మెరుగుపడి రూ. 259ను తాకింది. కస్టమర్ల సంఖ్య 12 శాతం వృద్ధితో 57.6 కోట్లకు చేరింది. దేశీయంగా ఇది 13 శాతం పుంజుకుని 41.38 కోట్లకు చేరగా.. ఆఫ్రికాలో 10 శాతం బలపడి 17.93 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో 1.7 శాతం బలహీనపడి రూ. 1,992 వద్ద ముగిసింది.

Bilateral trade agreement between India and USA is almost ready4
మార్చికల్లా మొదటి అడుగు

న్యూఢిల్లీ: మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మార్చి మధ్య నాటికి భారత్, అమెరికా సంతకాలు చేస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. అనంతరం భారత వస్తు దిగుమతులపై అమెరికా సుంకాలు తగ్గిస్తుందని చెప్పారు. అలాగే, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపైనా భారత్‌ సుంకాలు తగ్గిస్తుందన్నారు. తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వచ్చే 4–5 రోజుల్లో రెండు దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేస్తాయని చెప్పారు. అనంతరం భారత ఉత్పత్తులపై సుంకాలు 18 శాతానికి దిగొస్తాయని చెప్పారు. ప్రస్తుతం భారత వస్తువులపై 50 శాతం టారిఫ్‌లను అమెరికా అమలు చేస్తోంది. దీన్ని 18 శాతానికి తగ్గించనున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. ఇందులో 25 శాతం, రష్యాపై చమురు కొంటున్న కారణంగా విధించినది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) మొదటి దశ దాదాపు సిద్ధమైంది. వచ్చే నాలుగైదు రోజుల్లో దీన్ని ఖరారు చేసి, సుంయక్త ప్రకటన విడుదల చేస్తాం. దీని ఆధారంగా భాగస్వామ్యం తొలి దశ మొదలవుతుంది’’అని గోయల్‌ వివరించారు. భారత ఉత్పత్తులపై 18 శాతం సుంకాలన్నవి అమెరికా జారీ చేసే అధికారిక ఉత్తర్వు ద్వారా అమల్లోకి వస్తాయన్నారు. 500 బిలియన్‌ డాలర్ల కొనుగోళ్లు.. 500 బిలియన్‌ డాలర్ల విలువైన కొనుగోళ్లపై గోయల్‌ స్పందిస్తూ.. భారత్‌ చాలా వేగంగా వృద్ధి సాధిస్తోందంటూ.. ఇందుకు పెద్ద మొత్తంలో ఇంధనం, డేటా సెంటర్ల ఎక్విప్‌మెంట్, ఐసీటీ ఉత్పత్తులు అవసరం అవుతాయని చెప్పారు. ఈ ప్రకారం రూ.500 బిలియన్‌ డాలర్లు అన్నది ఒక అంచనా అని.. అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Car Launches in India 2026 February From Nissan Tekton To Tata Sierra EV5
వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!

సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నిస్సాన్ టెక్టెన్‌: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్‌ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్‌పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరోన్: ఫోక్స్‌వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్‌పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.

Why is Gold Given in Pink Paper Know The Reasons6
బంగారం పింక్ పేపర్‌లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్‌ ఇదే!

సాధారణంగా చాలామంది గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు.. విక్రయదారులు బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తుంటారు. బహుశా కొందరికి అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు.. ఎందుకు ఈ రంగు కాగితంలోనే చుట్టి ఇస్తున్నారని. మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..బంగారాన్ని సాధారణంగా పింక్ కలర్ పేపర్‌లోనే చుట్టి ఇవ్వడం వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణం కన్నా.. సంప్రదాయం, మానసిక ప్రభావం, వ్యాపారానికి సంబంధించిన ఆచారం కలిసి ఉన్నాయనే చెప్పాలి. పసిడి మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన లోహం. అది కేవలం ఆభరణంగా మాత్రమే అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇది సంపదకు, శుభానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతటి విలువైన వస్తువును అందించే సమయంలో.. ఒక ప్రత్యేకత ఉండాలనే భావనతో వ్యాపారులు పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తూ వస్తున్నారు.రంగుఇతర రంగుల కంటే.. పింక్ కలర్ మృదుత్వం, శుభ్రత, సౌమ్యతను సూచిస్తుంది. చూడగానే హాయిని ఇచ్చే ఈ రంగు.. మనసులో సానుకూల భావనను కలిగిస్తుంది. బంగారం లాంటి మెరిసే లోహాన్ని పింక్ పేపర్‌ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొనుగోలుదారు కూడా నేను చాలా విలువైన లోహాన్ని కొనుగోలు చేశాననే సంతృప్తిని ఇస్తుంది.సాంప్రదాయంచాలాకాలం నుంచి ఆభరణాల దుకాణాల్లో పింక్ లేదా లైట్ రెడ్ కలర్ పేపర్ ఉపయోగించడం అలవాటుగా మారిపోయింది. ఒక ఆచారం మొదలైందంటే.. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆలాగే బంగారం విషయంలో పేపర్ రంగు నేటికీ కొనసాగుతోంది. బంగారం అంటే పింక్ పేపర్ అన్న భావన మనకు తెలియకుండానే మనసులో స్థిరపడిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!వ్యాపారంఇతర పేపర్‌లతో పిలిస్తే.. పింక్ కలర్ పేపర్ మురికి, మడతలు వంటి వాటిని అంత త్వరగా కనిపించనివ్వదు. అంతే కాకుండా ఇది పెద్దగా ఖరీదైంది కాదు కూడా. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒకే రంగు వాడటం వల్ల దాని గుర్తింపు ప్రత్యేకమవుతుంది. అందుకే దుకాణదారులు కూడా గోల్డ్ అంటే.. పింక్ రంగునే వాడుతుంటారు.మానసిక ప్రభావంప్రజలు ఎప్పుడైనా శుభం జరగాలనే కోరుకుంటారు. పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం వల్ల.. అది మరింత శుభంగా భావిస్తారు. పైన చెప్పుకున్నట్లు.. పింక్ రంగు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఇలా.. మొత్తం మీద గోల్డ్ అంటే పింక్ పేపర్ అని అందరూ పిక్స్ అయిపోయారు.

Advertisement
Advertisement
Advertisement