ప్రధాన వార్తలు
తప్పుల్ని టెక్నాలజీకి ఆపాదించొద్దు
ముంబై: బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లను రూపొందించేటప్పుడు, నిర్ణయాలపై అర్థవంతమైన మానవ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని బ్యాంకర్లకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. తప్పుడు నిర్ణయాలకు టెక్నాలజీ టూల్స్ను నిందించడం ఆర్బీఐకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ జరిగిన వార్షిక ‘ఫిబాక్’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు మానవ విచక్షణను ఏఐతో భర్తీ చేస్తే సరిపోదని, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే విధంగా ఏఐని సరైన రీతిలో వినియోగించుకోవాలని బ్యాంకులను కోరారు.ఏఐని అదుపులో పెట్టాల్సిన ఒక రిసు్కలా కాకుండా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన సామర్థ్యంగానే ఆర్బీఐ పరిగణిస్తోందని మల్హోత్రా చెప్పారు. కాబట్టి బ్యాంకులు ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా, ఈ టూల్స్ను అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ఒక బ్యాంకు తీసుకునే నిర్ణయానికి అంతిమ బాధ్యత దానిదే కావాలి తప్ప విక్రేతదో లేదంటే ఆల్గారిథమ్దో కాకూడదు. ఏఐ మోడల్ నిర్ణయం తీసుకుందని మనం చెప్పలేం. వినియోగదారుడికైనా, అదేవిధంగా బ్యాంకుకైనా అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైన సమాధానం కాదు’ అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కస్టమర్ సర్వీసులతో సహా వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఈ మధ్య పలు భారతీయ బ్యాంకులు ఏఐ టూల్స్ను భారీగా వాడుకోవడం, ఏఐ వల్ల కొంత కాలానికి వివిధ రంగాల్లో ఉద్యోగ కోతలు తప్పవన్న ఆందోళనల నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సైబర్ సెక్యూరిటీ రిసు్కలు పొంచి ఉన్నాయ్... సైబర్ సెక్యూరిటీ రిసు్కలతో సహా ఏఐ వల్ల బ్యాంకింగ్ రంగానికి తలెత్తే ముప్పుల పట్ల బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఇటీవల ఒక ఏఐ మోడల్ స్వయంగా సిస్టమ్పై దాడి చేసిన సంఘటనను ఆయన ఉదహరించారు. ఏఐ మోడళ్లు పక్షపాత ధోరణితో వ్యవహరించే రిస్కులు కూడా ఉంటాయన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలు, హోదాలు, అదేవిధంగా కొన్ని వర్గాల పట్ల ఇష్టం, అయిష్టం చూపించే ధోరణులు ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. డేటా గోప్యత అనేది కేవలం చట్టపరమైన నిబంధనలను పాటించడానికే పరిమితం కాకుండా చూసుకోవాలన్నారు. బ్యాంకుల్లో వాస్తవంగా ఎలాంటి ఏఐ మోడళ్లు పనిచేస్తున్నాయనేది ఆర్బీఐకి తెలియాలని, కాబట్టి ఆయా మోడల్స్కు సంబంధించిన పూర్తి జాబితాను నిర్వహించాలని కూడా బ్యాంకులకు మల్హోత్రా సూచించారు.
ఈ–టూవీలర్లకు ‘పీఎం’ స్కీము పొడిగింపు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ’పీఎం ఈ–డ్రైవ్’ స్కీము గడువును 2028 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అయితే, దీనిపై ఇచ్చే సబ్సిడీని రూ. 5,000 నుంచి (కిలోవాట్హవర్కి – కేడబ్ల్యూహెచ్) సగానికి రూ. 2,500కి తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రతి కేడబ్ల్యూహెచ్ సామర్థ్యానికి రూ. 2,500 మేర సబ్సిడీ పొందవచ్చు. ఒక్కో వాహనంపై సబ్సిడీ గరిష్టంగా రూ. 5,000 ఉంటుంది.గతంలో, అంటే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ ప్రతి కేడబ్ల్యూహెచ్కి రూ. 5,000గాను, గరిష్ట పరిమితి రూ. 10,000గాను ఉంది. తాజా ప్రోత్సాహకాన్ని పొందాలంటే ఈ–టూవీలర్ ఎక్స్–ఫ్యాక్టరీ రేటు గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. ఈ స్కీము తాజా విడత కోసం కేంద్రం రూ. 2,767 కోట్లు కేటాయించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు అమలయ్యే పీఎం ఈ–డ్రైవ్ పథకానికి మొత్తం రూ. 11,900 కోట్లు వెచ్చిస్తోంది.
పసిడి తగ్గేదేలే..
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి.
ఆడి కొత్త ప్లాన్.. వచ్చే మూడేళ్లలో..
వచ్చే మూడేళ్లలో తమ మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాహనాల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు 8 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే పండుగల సీజన్లో సరికొత్త ఆడి క్యూ3తో మొదలుపెట్టి 2027 నాటికి మొత్తం మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.2027లో నెక్ట్స్ జనరేషన్ ఆడి ఏ5, ఫ్లాగ్షిప్ ఆడి క్యూ9ని అందుబాటులోకి తేనున్నట్లు ధిల్లాన్ పేర్కొన్నారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెడుతూ వచ్చే ఏడాది ఆఖరు నాటికి రిటైల్ నెట్వర్క్ని 25 శాతం పైగా విస్తరించనున్నట్లు వివరించారు. షోరూమ్ల సంఖ్యను 40కి పెంచుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్íÙప్లను తమ ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్టునకు కూడా అప్గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఐపీఓ మార్కెట్లో జోష్.. 9 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్!
గతేడాది(2025) డిసెంబర్.. ఈ ఏడాది(2026) ఏప్రిల్ మధ్య దరఖాస్తు చేసిన 9 కంపెనీల ప్రాస్పెక్టస్లను సెబీ తాజాగా అనుమతించింది. జాబితాలో రీడిఫ్.కామ్ ఇండియాసహా ప్లేసింపుల్ గేమ్స్, గరుడా ఏరోస్పేస్ తదితరాలున్నాయి. ఇప్పటికే వారాంతాన(7న) రెండు కంపెనీల(లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్) పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకాగా.. స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఎన్క్యూబ్ ఎథికల్స్ రూ. 3,000 కోట్ల సమీకరణకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసింది. తాజాగా లిస్టింగ్కు అనుమతి పొందిన జాబితాలో జాక్సన్ గ్రీన్, అడ్రాయిట్ ఇండస్ట్రీస్, ఎక్స్ప్రెషన్ 360 సర్వీసెస్ ఇండియా, ఎస్ఎన్వీఏ ట్రావెల్టెక్, నైనీ పేపర్స్తోపాటు.. రైల్వే రంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈపీసీ సర్వీసుల కంపెనీ లక్స్యో సైతం చేరింది.గోప్యతా విధానంలో జాక్సన్ గ్రీన్ లిమిటెడ్, రీడిఫ్.కామ్ ఇండియా, ఎస్ఎన్వీఏ ట్రావెల్టెక్, గరుడా ఏరోస్పేస్ గోప్యతా మార్గంలో సెబీకి దరఖాస్తు చేయడం ద్వారా అనుమతి పొందాయి. కాగా.. పూర్తి క్యాజువల్ మొబైల్ గేమ్స్ కంపెనీ ప్లేసింపుల్ గేమ్స్ ఐపీవో ద్వారా రూ. 3,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీలో 97 శాతం వాటా కలిగిన ప్రమోటర్ సంస్థ ఎంటీజీక్స్ గేమింగ్ హోల్డింగ్ ఏబీ ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. 2024–25లో కంపెనీ రూ. 2,260 కోట్ల ఆదాయం సాధించింది.ఇక గరుడా ఏరోస్పేస్ ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. డ్రోన్ల తయారీ ఈ చెన్నై స్టార్టప్ వ్యవసాయం, రక్షణ రంగాలతోపాటు ఎంటర్ప్రైజ్ సరీ్వలెన్స్ సంబంధ యూఏవీలను రూపొందిస్తోంది.ఇన్ఫీబీమ్ నుంచి..ఎవెన్యూస్ఏఐ లిమిటెడ్(గతంలో ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్) అనుబంధ కంపెనీ రీడిఫ్.కామ్ ఇండియా సీసీఎవెన్యూ పేరుతో డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ బిల్డ్ఏబజార్ను సైతం ఏర్పాటు చేసింది. ఇంజినీరింగ్, తయారీ రంగ కంపెనీ అడ్రాయిట్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 98.97 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 13.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాలు, రవాణా మౌలిక సదుపాయాలు తదితరాల కొనుగోలు(పెట్టుబడి వ్యయాలు)కు వెచ్చించనుంది. అనుబంధ సంస్థ అడ్రాయిట్ డ్రైవ్షాఫ్టŠస్లో పెట్టుబడి, రుణ చెల్లింపులకు సైతం నిధులు వినియోగించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్, ఇండ్రస్టియల్ రంగ పరికరాలు తయారు చేస్తోంది.టెక్నాలజీ, పేపర్..కోల్కతా మీడియా, ప్రకటనల కంపెనీ ఎక్స్ప్రెషన్ 360 సర్వీసెస్ ఇండియా పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్కు చేరనున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కంపెనీ లక్స్యో ఐపీవోకింద రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. టెక్నాలజీ ఆధారిత ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ ట్రావోమింట్ను నిర్వహిస్తున్న ఎస్ఎన్వీఏ ట్రావెల్టెక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది.కంపెనీ ప్రధానంగా వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా విమానాలు, హోటళ్లు, అద్దె కార్లు, ప్రయాణ బీమా తదితర ట్రావెల్ బుకింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్కు సమీకృత పేపర్ తయారీ కంపెనీ నైనీ పేపర్స్కు సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. కంపెనీ రైటింగ్, ప్రింటింగ్, ఇండ్రస్టియల్, ప్యాకేజింగ్ సంబంధ పేపర్ను తయారు చేస్తోంది. ఉత్తరాఖండ్లోని కాశిపూర్లో తయారీ ప్లాంటును కలిగి ఉంది. సెబీ నుంచి తాజాగా అనుమతి పొందిన కంపెనీలన్నీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.
కరెన్సీ నోట్లలో కీలక మార్పు!
కరెన్సీ నోట్ల విషయంలో కేంద్రం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్(ప్లాస్టిక్)తో తయారు చేసిన నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.ముందు రూ.10, రూ.20 నోట్లపై ఈ ప్రయోగం చేయనున్నారు. ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల నోట్లను తయారు చేసి, ప్రజల మధ్య చలామణిలోకి తీసుకువచ్చి ఎలా పనిచేస్తాయో పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని పాలిమర్ కరెన్సీ నోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.కొత్త పాలిమర్ నోట్లు వస్తున్నాయని.. పాత పేపర్ నోట్లు వెంటనే రద్దు అవుతాయని ప్రజలు భయపడాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లతో పాటు కొత్త పాలిమర్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి. ముందుగా ఈ నోట్లు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎంతకాలం మనగలుగుతున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి వంటి విషయాలను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుంది.ట్రయల్స్ సక్సెస్ అయితే.. తర్వాత వీటిని రెగ్యులర్గా చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. పాలిమర్ నోట్లు.. కాగితం నోట్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ఇవి పలుచని ప్లాస్టిక్ లాంటి పదార్థంతో తయారవుతాయి. అందువల్ల నీటికి, తేమకు, దుమ్ముకు తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.పేపర్ నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. నకిలీ నోట్లను తయారు చేయడం కూడా కొంత కష్టంగా ఉండేలా భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేయవచ్చు. ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని పాలిమర్ నోట్లు వాడుతున్నారు. భారత్లో కూడా గతంలో పరిమిత స్థాయిలో వీటిని పరీక్షించారు.కొత్త నోట్లు ఎప్పటి నుంచి మన చేతుల్లోకి వస్తాయనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. పాలిమర్ నోట్ల తయారీకి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదటి దశలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది. నోట్ల తయారీకి అవసరమైన మెటీరియల్, ప్రింటింగ్ ఏర్పాట్లు, ట్రయల్స్ ఎక్కడ నిర్వహించాలి వంటి విషయాలపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ట్రంప్ టవర్స్!
కార్పొరేట్
టీసీఎస్ ఉద్యోగుల డేటా లీక్!
నిఫ్టీ-50 నుంచి విప్రో అవుట్!
ఏఐ వ్యయం పెంచాల్సిందేనన్న ఆర్బీఐ!
బ్లింకిట్ ‘డార్క్ స్టోర్’ ఆహార లైసెన్స్ రద్దు
గౌతమ్ అదానీకి భారీ ఊరట
ఎయిర్పోర్ట్ ఆపరేటర్ల ఎయిర్లైన్స్ నిర్వహణపై నో బ్యాన్
12 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్ల రుణాల రైటాఫ్..!
ఎయిర్టెల్తో చేతులు కలిపిన ఐటీఐ
రాయల్ ఛాలెంజ్, ఓల్డ్ మాంక్ మద్యం బ్యాన్
2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు!
బంగారం ధరల్లో మార్పు.. ఎట్టకేలకు గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు తగ్గాయి. ఐదు రోజుల క్రితం నుంచి...
ఫ్లాట్గా స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ప...
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
బంగారం, వెండి ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయ...
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
వెండి ధరలు రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న వేళ ప్...
మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు..
విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తయ్యాక అక్కడే స్థిరపడ...
పొలాల్లో తగలేసే గడ్డి కాదిది.. కోట్లు కురిపించే నిధి!
దేశంలో ఇప్పటివరకు కేవలం పర్యావరణ సమస్యగా, పొలాల్లో...
పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు
ఉదయాన్నే బండి స్టార్ట్ చేయగానే మీ జేబులోంచి రూపాయి...
బ్యాంక్ లోన్ కట్టలేదా? కొత్త నిబంధనలు ఇవే!
బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ వసూళ్ల వ్యవహారంలో రిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రూ.25 లక్షల జీతం.. రూ.50 లక్షలకు పెంపు! అయినా టెన్షన్..
భారీ జీతం పెంపు వస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఓ టెక్ ఉద్యోగికి మాత్రం 100 శాతం జీతం పెరిగినా సంతోషం కంటే ఉద్యోగ భద్రతపై భయమే ఎక్కువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ‘ఎక్స్’ పోస్టు ప్రకారం.. ఓ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెరిగింది. అయితే, ఈ పెంపు కంపెనీలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుల తర్వాత రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ పోస్టు ప్రకారం.. కంపెనీలో సాధారణంగా జూన్లో ఉద్యోగుల పనితీరు మదింపు, జీతాల పెంపు ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొత్తం 150 మంది ఉద్యోగుల్లో 50 మందిని కంపెనీ తొలగించినట్లు పోస్టులో పేర్కొన్నారు. దీంతో మిగిలిన ఉద్యోగులు తమకు ఇంక ఎలాంటి జీతాల పెంపు ఉండదని భావించారట. ‘‘కనీసం ఉద్యోగం మిగిలింది.. అదే చాలు’’ అనే పరిస్థితికి వచ్చారని పోస్టు పేర్కొంది.అయితే, అదే సమయంలో ఓ ఉద్యోగికి మాత్రం ఊహించని ఈమెయిల్ వచ్చింది. ప్రమోషన్తో పాటు ఏకంగా 100 శాతం జీతం పెంపు ప్రకటించినట్లు పోస్టులో ఉంది. దీంతో అతని వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది.ఈ భారీ పెంపునకు కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఉద్యోగి వారాంతంలో స్వయంగా రూపొందించిన ఓ చిన్న AI చాట్బాట్ ఆ సంస్థకు గణనీయమైన విలువను తీసుకొచ్చినట్లు వైరల్ పోస్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతని సామర్థ్యాన్ని కంపెనీ గుర్తించి భారీగా పరిహారం పెంచినట్లు చెబుతోంది. అయితే, మేనేజర్ ఈ పెంపు సంస్థలోనే అత్యధికమైన వాటిలో ఒకటని చెప్పడంతో పాటు, తన జీతం గురించి ఇతర ఉద్యోగులతో మాట్లాడవద్దని సూచించినట్లు పోస్టులో ఉంది.అయితే ఇక్కడే ఉద్యోగికి ఆందోళన మొదలైంది. ఇప్పటికే కంపెనీ 50 మందిని తొలగించిన పరిస్థితిలో తన జీతం రెట్టింపు కావడం భవిష్యత్తులో తన ఉద్యోగానికి ప్రమాదంగా మారుతుందా? మరోసారి తొలగింపులు జరిగితే అధిక ప్యాకేజీ కారణంగా కొత్త ఉద్యోగం దొరకడం కష్టమవుతుందా? అనే సందేహాలు అతడిని వెంటాడుతున్నట్లు పోస్టు తెలిపింది.ముఖ్యంగా సిస్టమ్ డిజైన్ వంటి అంశాల్లో తనకు నైపుణ్యం ఉన్నప్పటికీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) అంటే తనకు ఇష్టం లేదని, అదే సమయంలో రూ.50 లక్షల ప్యాకేజీ స్థాయి ఉద్యోగాలకు మారాలంటే ఇంటర్వ్యూల్లో డీఎస్ఏ నైపుణ్యాలు అవసరమవుతాయా అనే ఆందోళన కూడా అతడికి ఉందట.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగి ప్రస్తుత కంపెనీని వదిలి వెళ్లాలని అసలు కోరుకోవడం లేదు. తన మేనేజర్ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్తో పాటు తన ఉద్యోగాన్ని నిజంగా ఇష్టపడుతున్నానని చెప్పినట్లు పోస్టులో ఉంది. అందుకే అతని అసలు ప్రశ్న ‘ఇప్పుడే ఉద్యోగం మారాలా?’ అనేది కాదు.. ‘రేపు ఉద్యోగం పోతే మరో అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నానా?’ అనేదే.ఈ కథనంపై సోషల్ మీడియాలోనూ భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపును గొప్ప అవకాశంగా అభివర్ణించగా, మరికొందరు ఉద్యోగ భద్రత, నైపుణ్యాల అప్డేట్, అత్యవసర పొదుపులపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదిలా ఉంటే, 2026లో టెక్ ఉద్యోగ మార్కెట్లో అధిక వేతనాలపై ఆకర్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రూ.25 లక్షల ఉద్యోగాన్ని వదిలి విదేశాల్లో మాస్టర్స్ చేసిన ఓ భారతీయ టెకీ.. తిరిగి వచ్చాక వందలాది దరఖాస్తులు చేసినా కేవలం కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే వచ్చాయని, రూ.40–50 లక్షల ప్యాకేజీ ఆశించిన చోట రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్లు మాత్రమే లభించాయని వెల్లడించాడు.The company doubled a guy’s salary to ₹50 LPAbut instead of just happiness, the hike brought a whole new fear. Every year, appraisals happened in june. This time, instead of appraisals, the company suddenly laid off around 50 out of 150 employees.Those of them who…— Pooja (@poojaofficial5) August 8, 2026
ఒక్క రోజులో పెరగనున్న ఐఫోన్ ధర?
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్ ధరలను ఆగస్టు 10 అంటే సోమవారం నుంచే పెంచే అవకాశం ఉందని తాజా లీక్ వెల్లడించింది. చైనీస్ సోషల్ మీడియాలో ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ (Fixed Focus Digital) అనే టెక్ లీకర్ చేసిన పోస్టు ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే ధర ఎంత పెరుగుతుంది, ఏ మోడళ్లకు వర్తిస్తుంది అనే వివరాలను లీకర్ వెల్లడించలేదు. అయితే యాపిల్ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ వార్తకు ప్రధాన కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల విస్తరణతో మెమరీ చిప్లకు డిమాండ్ పెరగడం, సరఫరాపై ఒత్తిడి ఏర్పడటం వల్ల హార్డ్వేర్ తయారీ వ్యయాలు పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే యాపిల్ ఉత్పత్తులపై కనిపించింది. జూన్లో కంపెనీ భారత్లో మ్యాక్బుక్, ఐపాడ్ తదితర ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లలో పెంపు రూ.1 లక్ష వరకు వెళ్లింది.అయితే ఆ ధరల పెంపు సమయంలో ఐఫోన్ ధరలు మాత్రం పెంచలేదు. అందుకే ఇప్పుడు ఐఫోన్ 17పై కూడా ధరల భారం పడుతుందన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. యాపిల్ గతంలో పెరిగిన కాంపోనెంట్ వ్యయాలను కొంతకాలం భరించినప్పటికీ, మెమరీ ధరల పెరుగుదల తీవ్రంగా మారడంతో వినియోగదారులపై కొంత భారాన్ని మోపాల్సి వస్తోందని కంపెనీ వివరణ ఇచ్చింది.ఐఫోన్ 17కు ఎక్కువ కాలం డిమాండ్?ఇక 2026లో యాపిల్ ఐఫోన్ లాంచ్ వ్యూహంలో మార్పులు చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఐఫోన్ 18 Pro, ఐఫోన్ 18 Pro Max, అలాగే యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ సెప్టెంబర్లో రావచ్చని సమాచారం. అదే సమయంలో సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడళ్లను 2027 రెండో త్రైమాసికానికి వాయిదా వేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.అది నిజమైతే ఐఫోన్ 17 సాధారణం కంటే ఎక్కువ కాలం యాపిల్ లైనప్లో కొనసాగాల్సి ఉంటుంది. దీంతో కొత్త Pro మోడళ్లు వచ్చిన తర్వాత కూడా సాధారణ ధర శ్రేణిలో ఐఫోన్ 17కు డిమాండ్ కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ధరల పెంపు జరిగితే, ప్రస్తుత ఐఫోన్ 17 కొనుగోలు చేయాలనుకునే వారికి ఆగస్టు 10 కీలక తేదీగా మారే అవకాశం ఉంది.అన్ని ఐఫోన్ 17 మోడళ్ల ధరలు పెరుగుతాయా?ప్రస్తుత లీక్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఐఫోన్ 17 Pro, Pro Max ధరలు పెంచితే, వాటి తర్వాతి తరం మోడళ్లు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఆ నిర్ణయం యాపిల్కు కొంత సంక్లిష్టంగా మారవచ్చు. కాబట్టి యాపిల్ అధికారిక ధరల జాబితాను విడుదల చేసే వరకు ఎదురుచూడక తప్పదు.
ఎయిర్టెల్, విఐలకు సుప్రీంకోర్టు నోటీసులు!
బాంబే హైకోర్టు వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం, సుప్రీంకోర్టు టెలికాం ఆపరేటర్లైన భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు నోటీసులు జారీ చేసింది.2008 నుంచి 2012 మధ్య 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగి ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం వన్టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలంటూ బాంబే హైకోర్టు జూన్లో తీర్పు ఇచ్చింది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది.అయితే.. హైకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్పెక్ట్రమ్ అనేది పరిమితమైన వనరు కాబట్టి, కంపెనీలు 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ ఉపయోగించినందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు టెలికాం కంపెనీల వివరణ కూడా తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.ప్రస్తుతం.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీంతో హైకోర్టు తీర్పు ప్రస్తుతానికి కొనసాగుతోంది. అయితే.. కేసు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తే.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలపై భారీగా ఛార్జీల భారం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికాం కంపెనీలకు ఇది మరింత కష్టమవుతుంది.
జియో కొత్త ప్లాన్లు.. ఓటీటీ ప్రియులకు పండగే!
డిజిటల్ నెట్వర్క్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంటూ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. విశేష ఆదరణ పొందిన ‘జియో ఓటీటీ-పాస్’ పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ.. కొత్తగా 3 నెలల (త్రైమాసిక), 1 సంవత్సరం (వార్షిక) వ్యాలిడిటీ ప్లాన్లను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ఖర్చుతోనే వినియోగదారులకు మరింత ఎక్కువ డేటాను, నిరంతరం ప్రీమియం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా జియో ఈ నిర్ణయం తీసుకుంది.కొత్త ప్లాన్ల వివరాలురూ.200 ఓటీటీ పాస్: 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. (వాయిస్-ఓన్లీ ప్యాక్లు మినహా) యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులందరూ రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.550 ఓటీటీ పాస్ (కొత్తది): 84 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీతో మొత్తం 90 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ 5జీ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 3 నెలలు లేదా 1 సంవత్సరం బేస్ ప్లాన్ ఉన్న చందాదారులకు ఇది వర్తిస్తుంది.రూ.2,000 ఓటీటీ పాస్ (కొత్తది): ఏడాది పొడవునా (365 రోజుల వ్యాలిడిటీ) నిరంతరాయ సేవలతో 365 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ 5జీ లభిస్తుంది. 1 సంవత్సరం బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.ప్రతినెల రూ.1,500 ప్రయోజనాలుఈ ఓటీటీ-పాస్ సబ్స్క్రిప్షన్ల ద్వారా వినియోగదారులకు ప్రతినెల దాదాపు రూ.1,500 విలువైన ప్రయోజనాలు దక్కనున్నాయి. ఇందులో 15 అధునాతన ప్రీమియం ఓటీటీ యాప్లతో పాటు జియోటీవీ యాప్ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా వీక్షించే వెసులుబాటును కల్పించారు.ప్లాన్ ధరవ్యాలిడిటీహై-స్పీడ్ డేటాప్రధాన ప్రయోజనాలురూ. 20028 రోజులు30 GBఅన్లిమిటెడ్ 5జీ + ప్రైమ్ వీడియో మొబైల్ + ఓటీటీలురూ. 55084 రోజులు90 GBఅన్లిమిటెడ్ 5జీ + అమెజాన్ ప్రైమ్ లైట్ + ఓటీటీలురూ. 2000365 రోజులు365 GBఅన్లిమిటెడ్ 5జీ + అమెజాన్ ప్రైమ్ లైట్ + ఓటీటీలుయూజర్లకు లభించే ఓటీటీ బెనిఫిట్స్యూట్యూబ్ ప్రీమియం: స్మార్ట్ టీవీ, ట్యాబ్, మొబైల్ల్లో ఎలాంటి ప్రకటనలు లేని స్ట్రీమింగ్, బ్యాక్గ్రౌండ్ ప్లే, ఆఫ్లైన్ డౌన్లోడ్ సౌకర్యం.జియోహాట్స్టార్ మొబైల్ + హాలీవుడ్: లైవ్ స్పోర్ట్స్ మ్యాచ్లు, హాట్స్టార్ ఒరిజినల్స్, హాలీవుడ్ హిట్ సినిమాల ప్రత్యక్ష వీక్షణ.అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్: రూ.550, రూ.2,000 పాస్లపై ‘అమెజాన్ ప్రైమ్ లైట్’.. అలాగే రూ.200 పాస్పై ‘ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్’ యాక్సెస్ లభిస్తుంది.12 ఇతర ప్రీమియం యాప్లు: సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ఫ్యాన్కోడ్, హోయ్చోయ్, చౌపాల్, ప్లానెట్ మరాఠీ, కంచా లంకా, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ యాప్లను జియోటీవీ వేదికగా సులభంగా వీక్షించవచ్చు.1000+ లైవ్ టీవీ ఛానెళ్లు: స్టార్ ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సెట్ హెచ్డీ, సన్ టీవీ హెచ్డీ, డిస్కవరీ, కార్టూన్ నెట్వర్క్ వంటి అగ్రగామి ఛానెళ్లు ప్రసారమవుతాయి.కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రూ.550, రూ.2,000 జియో ఓటీటీ-పాస్లు ప్రస్తుతం మైజియో యాప్, అధికారిక Jio.com వెబ్సైట్, అధీకృత డిజిటల్ రీటైల్ అవుట్లెట్లలో రీఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో విస్తృతమైన డేటా, నిరంతరాయ వినోదాన్ని కోరుకునే చందాదారులకు ఈ కొత్త ప్లాన్లు ఒక గొప్ప డిజిటల్ వరం అని చెప్పవచ్చు.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు
పర్సనల్ ఫైనాన్స్
ITR-4: లెక్కలు లేకున్నా.. సక్రమంగా రిటర్నులు
ఈ వారం ఫారం 4 గురించి తెలుసుకుందాం. ‘లెక్కలు’ అనగానే వ్యాపారం/వృత్తులకు వర్తిస్తాయి. జీతాలు, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతర ఆదాయాలు.. వీటిలో దేనికి దానికే ప్రత్యేకంగా, చట్టపరంగా బుక్స్ రాయాలి. ఆదాయం పన్ను చట్టంలో ‘అకౌంటు బుక్స్’.. అంటే, ఏమిటో నిర్వచనం ఇచ్చారు. దీని ప్రకారం బుక్స్ని నిర్వహించండి. కొంత టర్నోవరు, వసూళ్లు దాటితే ఆడిట్ చేయాలి. కానీ, ఒక మినహాయింపు ఇచ్చారు. మీరు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ వైపే వెళ్లక్కర్లేదు.ఫారం ఐటీఆర్ – 4 అంటే ఏమిటి.. 🔷 వ్యక్తులు/హిందూ ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థలు 🔷 రెసిడెంట్లు అయి ఉండాలి 🔷 సంవత్సరంలో ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు 🔷 పాత చట్టం ప్రకారం 44 ఏడీ, 44ఏడీఏ, 44 ఏఈల వ్యాపారం ఉండాలి. 🔷 వ్యాపారం/వృత్తి ఆదాయంతో పాటు జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, వ్యవసాయం ఆదాయం రూ. 5,000 లోపల, నిర్దేశించిన ఇతర ఆదాయాలు 🔷 నాన్–రెసిడెంట్లు, రూ. 50,00,000 ఆదాయం దాటినవారు, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ వారు, లాంగ్టర్మ్లో రూ. 1,25,000 దాటిన వారు, కంపెనీ డైరెక్టర్లు, రెండు ఇళ్ల మీద ఆదాయం ఉన్నవారు, లాటరీ ఆదాయం ఉన్నవారు.. వీళ్లంతా ఈ ఫారం వేయకూడదు.44ఏడీఏ అంటే ఎవరు.. వృత్తి నిపుణులు – లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్.. వీరందరూ, వారి టర్నోవరు/వసూళ్లు.. సంవత్సరానికి రూ. 50,00,000 దాటకపోతే.. వ్యవహారాల్లో 5 శాతం లోపల నగదు లావాదేవీలు జరిపితే రూ. 75,00,000 దాటకపోతే, వీరు 50 శాతం ఆదాయంగా చూపించాలి.44 ఏడీ అంటే ఎవరు.. పై సెక్షన్ వృత్తి నిపుణులకు వర్తిస్తే, ఈ సెక్షన్ వ్యాపారస్తులకు, టర్నోవరు/వసూళ్లు రూ. 2 కోట్లు దాటకూడదు. 5 శాతం నగదు వ్యవహారాలు దాటకుండా ఉంటే రూ. 3 కోట్లు. వీరు ఈ టర్నోవరుపైన 6 శాతం చొప్పున లాభం ప్రకటించాలి. 6 శాతం దాటి చూపినా ఫర్వాలేదు. కానీ 6 శాతం కన్నా తక్కువ చూపిస్తే బుక్స్ రాసి ఆడిట్ చేయించాలి. ఇదంతా బ్యాంకింగ్ చానల్. నగదు వ్యవహారాలైతే 8 శాతం చొప్పున చూపించాలి.44ఏఈ ఎవరంటే.. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులకే వర్తిస్తుంది. సొంతంగా గానీ.. అద్దెకు గానీ, లీజుగా గానీ కేవలం 10 వాహనాలు లేదా తక్కువ ఉండాలి. ప్యాసింజరు బళ్లకు వర్తించదు. హెవీ వెహికల్ అయితే, ఒక టన్నుకి రూ. 1,000. ఇతర వెహికల్ అయితే ఒక బండికి రూ. 7,500.పైన చెప్పిన మూడు రకాలవారికి 🔷 బుక్స్ అవసరం లేదు 🔷 ఆడిట్ అవసరం లేదు 🔷 వ్యాపార ఖర్చులు మినహాయింపు 🔷 పాత పద్ధతిలో అయితే 80సీ మొదలైన తగ్గింపులుంటాయిఅయితే ముఖ్యమైన విషయం 🔷 ఇతర రికార్డులు, వ్యాపారానికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్లు మొదలైనవన్నీ ఉండాలి. 🔷 జీఎస్టీ రికార్డులు ఉండాలి 🔷 బ్యాంకు అకౌంటు బుక్స్ ఉండాలి 🔷 బిల్లులు, ఇన్వాయిస్లు, వసూళ్లకు సంబంధించి రికార్డులు ఉండాలి 🔷 లాగ్ బుక్స్ ఉండాలికొన్ని పరిమితులు/ఆంక్షలు ఉన్నాయి. అవి దాటలేదని నిర్ధారించడానికి అవసరమైన రికార్డులుంటే లెక్కలు లేకుండానే, సక్రమంగా రిటర్నులు వేయొచ్చు.
పోర్ట్ఫోలియోకి స్థిరత్వం, వృద్ధికి దన్ను
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే విషయంలో ‘పెట్టుబడి పెట్టాలా వద్దా’ అని కాకుండా .. ‘ఎందులో పెట్టాలి’ అనేదే అత్యంత క్లిష్టమైన సవాలుగా అనిపిస్తుంది. సాధారణంగా చాలాకాలంగా లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరత్వానికి, నిలకడైన వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ, పోర్ట్ఫోలియోలకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు, మిడ్ క్యాప్ స్టాక్స్.. కార్పొరేట్ రంగ తదుపరి వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే, ఈ రెండింటికీ పోర్ట్ఫోలియోల్లో స్థానం ఉంటున్నప్పటికీ, వీటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం చెప్పినంత ఈజీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ డేటా ప్రకారం ’లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్’ కేటగిరీలోకి నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2025 జూన్లో రూ. 3,497 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, 2026 జూన్ నాటికి 24 శాతం పెరిగి రూ. 4,321 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఫక్తు లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి పెట్టుబడులు ఒక మోస్తరుగానే వృద్ధి చెంది రూ. 2,067 కోట్లు వచ్చాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనే డైవర్సిఫికేషన్ ద్వారా మిడ్ క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి సామర్థ్యాన్ని, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం అలాగే లిక్విడిటీ ప్రయోజనాలను కూడా పొందాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఇది తెలియజేస్తోంది. ఈ కేటగిరీకి ఎందుకింత ప్రాధాన్యత.. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రత్యేకత అంతా కూడా దీన్ని నిర్వహించే విధానంలోనే ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ తమ దగ్గరున్న నిధుల్లో కనీసం 35 శాతాన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో, మరో 35 శాతాన్ని మిడ్ క్యాప్ కంపెనీల్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. మిగతా భాగాన్ని ఫండ్ మేనేజర్ తన విచక్షణకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ విధానం వల్ల రెండు విభాగాల్లోనూ ఎప్పుడూ సరైన ప్రాతినిధ్యం ఉండటమే కాకుండా, అధిక లాభాలకు ఆస్కారమున్న సాధనానికి కేటాయింపులను పెంచేందుకు వీలుంటుంది. డబుల్ ప్రయోజనాలు.. సాధారణంగా లార్జ్ క్యాప్ కంపెనీలకు నిరూపితమైన వ్యాపార మోడల్స్, పటిష్టమైన బ్యాలెన్స్ ఉంటాయి. ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఉండటం వల్ల మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా కూడా పోర్ట్ఫోలియోకి ఇవి కొంత స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇక మిడ్ క్యాప్ కంపెనీలను చూస్తే ఇవి చిన్న సంస్థలకంటే మెరుగైన వృద్ధి దశలో ఉండి, ఇంకా లార్జ్ క్యాప్ స్థాయికి చేరుకోనివై ఉంటాయి. వ్యాపార విస్తరణ, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, లాభదాయకతను పెంచుకోవడం ద్వారా ఇవి దీర్ఘకాలంలో అధిక ఆదాయ వృద్ధిని అందిస్తాయి.అయితే, దీనికి తగ్గట్లుగానే వీటిలో రిస్క్లు, ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ రెండింటి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లోని పలు రంగాల్లో లార్జ్ క్యాప్లు ఆకర్షణీయమైన విలువకే లభిస్తుండగా, మిడ్ క్యాప్లు మరింత మెరుగైన రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండింటినీ కలపడం ద్వారా ఒకే పోర్ట్ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలనూ పొందవచ్చు. నిబంధనలకు ప్రాధాన్యత.. ఈ కేటగిరీ కేవలం విభిన్న క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీల కలయికగా మాత్రమే కాకుండా, పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకునే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా చూపుతుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల బాగా రాణించిన రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడమో లేదా నష్టాల్లో ఉన్న విభాగాల నుంచి వెంటనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన విధానం సహజమే అయినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు పోర్ట్ఫోలియో తీవ్రంగా దెబ్బతింటుంది.లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ కంపెనీలకి తప్పనిసరిగా కేటాయింపులు ఉండేలా చూడటం ద్వారా ఇలాంటి ఆలోచనా ధోరణుల వల్ల, ఇన్వెస్టర్లు నష్టాల బారిన పడకుండా చూసేందుకు తోడ్పడుతుంది. ఇన్వెస్టర్ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా, ఈ ఫండ్ నిర్మాణ స్వరూపంలోనే క్రమశిక్షణ ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ విభాగాల్లో ఏది ఎప్పుడు మెరుగ్గా రాణిస్తుందో అనేది అంచనాలు వేసుకోవాల్సిన పని ఇన్వెస్టర్లకు ఉండదు. పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ రెండూ ఉంటాయి కాబట్టి, మార్కెట్ ఎలా ఉన్నా, ఆయా సమయాల్లో లభించే అవకాశాలను ఇది అందిపుచ్చుకుంటుంది. ఎవరికి అనుకూలం..? ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలను కోరుకుంటున్నా, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు తమ పెట్టుబడులను తాము స్వయంగా నిర్వహించుకోలేని ఇన్వెస్టర్లకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ ఫండ్లను విడివిడిగా కొనుగోలు చేసి నిర్వహించుకోవడానికి బదులుగా, స్థిరత్వం అలాగే వృద్ధి రెండింటినీ ఒకే ఫండ్ ద్వారా పొందాలనుకునే కొత్త ఇన్వెస్టర్లకు ఇది సరైన ఎంపిక. ఇప్పటికే లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, స్మాల్ క్యాప్స్లో రిస్కుల బారిన పడకుండా, అధిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేటగిరీ ఫండ్స్ ఇటు లార్జ్ క్యాప్స్, అటు మిడ్ క్యాప్స్కి అర్థవంతంగా పెట్టుబడులు కేటాయిస్తూనే, కొంత మేర స్మాల్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈక్విటీ మార్కెట్లలో అవకాశాలను సమతూకంతో అందించే ప్రయత్నం చేస్తాయి. వేర్వేరు ఫండ్లలో పెట్టుబడులు పెట్టి వాటిని తరచూ రీబ్యాలెన్స్ చేసే శ్రమ లేకుండా, ఒకే ఈక్విటీ ఫండ్ తమ పోర్ట్ఫోలియోకి ప్రధాన ఆధారంగా ఉండాలని కోరుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా.. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఏ ఒక్క ఫండ్ కేటగిరీ కూడా అన్ని అవసరాలనూ తీర్చలేదు. అయితే, లార్జ్ అండ్ మిడ్–క్యాప్ ఫండ్లు నిరూపితమైన పెద్ద కంపెనీల స్థిరత్వాన్ని, ఎదుగుతున్న కంపెనీల వృద్ధి సామర్థ్యాలని ఒక నియమావళికి లోబడి ఇన్వెస్టర్లకు అందిస్తాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ ఫండ్స్లోకి పెరిగిన నిధులను చూస్తే, ఇన్వెస్టర్లు కేవలం ఒకే రకమైన మార్కెట్–క్యాప్పై ఆధారపడకుండా స్థిరత్వంతో కూడిన వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. పెట్టుబడుల కేటాయింపుల్లో క్రియాశీలకంగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు స్థిరత్వం అటు వృద్ధి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో సందర్భంలో రాణిస్తుంది. తదుపరి రాణించబోయే సెగ్మెంట్ గురించి అంచనాలు వేసుకంటూ, ఊహాగానాల్లో ఉండిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడులను కొనసాగించిన వారికే ప్రయోజనాలు దక్కుతాయనేది గుర్తుంచుకోవాలి. ఇందుకోసం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ క్రమశిక్షణతో కూడుకున్న విధానంగా ఉపయోగపడతాయి.
EMI లాక్: కోటక్ బ్యాంక్ హైబ్రిడ్ హోమ్ లోన్
న్యూఢిల్లీ: గృహ రుణాల ఈఎంఐల భారం విషయంలో రుణగ్రహీతలకు స్పష్టత ఉండే విధంగా ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్తగా హైబ్రిడ్ హోమ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో వడ్డీ రేటు 65 నెలల వరకు స్థిరంగా ఉండేలా లాక్ చేసుకునేందుకు వీలవుతుంది. రుణం తీసుకున్న తొలినాళ్లలో ఈఎంఐల భారం విషంయలో కొంత వెసులుబాటు పొందేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.ఈ పథకం కింద 39, 52 లేదా 65 నెలల వరకు ఈఎంఐని లాక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫలితంగా కీలకమైన రెపో రేట్లు మారినా ఆ ప్రభావం వాయిదాలపై ఉండదని తెలిపింది. ఉదాహరణకు ఇటీవల వడ్డీ రేట్ల పెరుగుదల ధోరణులను చూస్తే, ఈ పథకం కింద రూ. 1 కోటి గృహ రుణం తీసుకున్న వారికి కనీసం రూ. 3.46 లక్షల వరకు ఆదా అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటు 7.6% నుంచి ప్రారంభమవుతోంది.
UPI సృష్టికర్త ఎవరు.. ఎలా మొదలైంది ఈ డిజిటల్ విప్లవం?
దేశంలో డిజిటల్ చెల్లింపులకు పర్యాయపదంగా మారిపోయిన యూపీఐ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. యూపీఐ లావాదేవీలపై భవిష్యత్లో ఎంపిక చేసిన కొన్ని వ్యాపార లావాదేవీలకు స్వల్ప ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ప్రభుత్వ తాజా ప్రకటనతో దీనిపై చర్చ మొదలైంది. అయితే యూపీఐపై ఛార్జీల గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో.. అసలు యూపీఐ ఎలా పుట్టింది? దీని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.. మరి సమాధానాలు తెలుసుకుందామా..ఒక వ్యక్తి సృష్టి కాదు.. ఒక వ్యవస్థ ఆవిష్కరణయూపీఐ (Unified Payments Interface)ని ఒక్క వ్యక్తి సృష్టించలేదు. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. ఆర్బీఐ నియంత్రణలో పనిచేసే ఎన్పీసీఐ.. దేశంలోని రిటైల్ పేమెంట్ వ్యవస్థలకు మౌలిక వేదికగా ఏర్పడింది. ఇప్పటికే ఉన్న IMPS మౌలిక సదుపాయాలపై ఆధారపడి, వివిధ బ్యాంకు ఖాతాలను ఒకే ఇంటర్ఫేస్ ద్వారా అనుసంధానించి తక్షణ చెల్లింపులు చేసేలా యూపీఐని రూపొందించారు.అంటే యూపీఐ అనేది ఒక యాప్ కాదు. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారులు, వ్యాపారులను ఒకే వ్యవస్థలో అనుసంధానించే పేమెంట్ ప్రోటోకాల్. అందుకే ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు, వేర్వేరు యాప్లను ఉపయోగించినా, నేరుగా డబ్బు పంపడం సాధ్యమవుతోంది.2016లో కీలక అడుగుయూపీఐ ప్రయోగాత్మకంగా 2016 ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ముంబైలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ దీనిని పైలట్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీసీఐకి అప్పటి సలహాదారుగా ఉన్న నందన్ నీలేకని, ఎన్పీసీఐ చైర్మన్ బాలచంద్రన్ ఎం., అప్పటి ఎండీ & సీఈవో ఏపీ హోటా, సీవోవో దిలీప్ అస్బే తదితరులు కీలకంగా పాల్గొన్నారు.నందన్ నీలేకని పేరు ఎందుకు వినిపిస్తుంది?యూపీఐ గురించి మాట్లాడినప్పుడు నందన్ నీలేకని పేరు తరచూ వినిపిస్తుంది. అందుకు కారణం ఆయన అప్పట్లో ఎన్పీసీఐకి సలహాదారుగా ఉండటం, డిజిటల్ పేమెంట్స్కు సంబంధించిన వ్యవస్థల రూపకల్పనలో కీలకంగా సహకరించడం. అదే సమయంలో యూపీఐని డిజైన్ చేయడం, నిర్మించడం, ఆపరేషనల్ చేయడంలో దిలీప్ అస్బే కీలక పాత్ర పోషించినట్లు అంతర్జాతీయ టెలికాం యూనియన్ (ITU) ప్రొఫైల్ కూడా పేర్కొంటుంది. ఆయన అప్పట్లో ఎన్పీసీఐ సీవోవోగా ఉండగా యూపీఐ ప్రాజెక్టులో కీలకంగా పనిచేశారు.21 బ్యాంకులతో ప్రారంభం2016 ఏప్రిల్లో ప్రారంభమైన పైలట్లో 21 మెంబర్ బ్యాంకులు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి యూపీఐ సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మొదట్లో యూపీఐ ద్వారా డబ్బు పంపడం, డబ్బు కోరడం వంటి ప్రాథమిక సేవలు మాత్రమే ఉండగా.. కాలక్రమేణా QR చెల్లింపులు, ఆటోపే, యూపీఐ లైట్, 123పే వంటి అనేక సేవలు జతయ్యాయి.ఇక్కడే యూపీఐ ప్రత్యేకత బయటపడింది. బ్యాంకు ఖాతా నంబర్, IFSC వంటి వివరాలు ప్రతిసారీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా యూపీఐ ID, మొబైల్ నంబర్ లేదా QR కోడ్ ద్వారా చెల్లింపులు చేయగలిగే విధానాన్ని ఇది తీసుకొచ్చింది.యూపీఐకి అసలు బలం.. ఇంటర్ఆపరబిలిటీయూపీఐ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని ఇంటర్ఆపరబిలిటీ. అంటే ఒకే యాప్కు లేదా ఒకే బ్యాంకుకు వినియోగదారు పరిమితం కాకుండా.. వివిధ బ్యాంకు ఖాతాలను వివిధ యూపీఐ యాప్లతో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధానం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్ని మార్చింది. నగదు, కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటి పద్ధతుల మధ్య ఉన్న గ్యాప్ను యూపీఐ తగ్గించింది. ముఖ్యంగా చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, స్వయం ఉపాధి చేసుకునేవారికి QR కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించడం సులభమైంది.నేడు ఎక్కడికి చేరింది?యూపీఐ ఇప్పుడు కోట్లాది భారతీయుల రోజువారీ చెల్లింపు సాధనంగా మారింది. 2026 జూన్ నాటికి యూపీఐ ప్లాట్ఫామ్పై 55.49 కోట్ల మంది వినియోగదారులు నమోదయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. FY 2025-26లో యూపీఐ ద్వారా 24,162 కోట్ల లావాదేవీలు, మొత్తం రూ.314 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2026 మేలోనే యూపీఐ ద్వారా సుమారు రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2,320.19 కోట్ల లావాదేవీలు జరిగాయి.ఇప్పుడు ఛార్జీల చర్చ ఎందుకు?యూపీఐ ఇంత పెద్ద స్థాయికి చేరడంతో దాని మౌలిక సదుపాయాలను నిర్వహించే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫిన్టెక్ సంస్థల ఆదాయ నమూనాపై చర్చ పెరిగింది. ప్రస్తుతం సాధారణ వినియోగదారుల యూపీఐ చెల్లింపులపై ఛార్జీ లేదు. గతంలోనూ రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.తాజాగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిన విషయం ఏమిటంటే.. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. భవిష్యత్లో ఎండీఆర్ (Merchant Discount Rate -MDR) తీసుకొచ్చినా అది పరిమిత సంఖ్యలో, నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని వ్యాపార లావాదేవీలకే వర్తించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. సాధారణ వినియోగదారుడిపై నేరుగా ఛార్జీ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.


