Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mercedes Benz Issues Recall in India1
మెర్సిడెస్ బెంజ్ రీకాల్: ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. భారతదేశంలో స్వచ్ఛంద రీకాల్‌ ప్రకటించింది. ఈ ప్రభావం 149 వాహనాలపై చూపుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన రీకాల్ నోటీసును ఫిబ్రవరి 15న జారీ చేసింది.బెంజ్ రీకాల్ ప్రభావం.. సీఎల్ఈ క్యాబ్రియోలెట్, సీఎల్ఈ 53 ఏఎంజీ కూపే & సీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ వాహనాలపై పడింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)లో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సంస్థ రీకాల్ జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫంక్షన్ పనిచేయకపోవచ్చని కూడా మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.రీకాల్ ప్రభావానికి గురైన వాహనాలు 2 సెప్టెంబర్ 2024 & 18 మార్చి 2025 మధ్య తయారు చేసినవని తెలుస్తోంది. రీకాల్ నోటీసు పొందిన కస్టమర్లు అధీకృత మెర్సిడెస్-బెంజ్ సర్వీస్ సెంటర్లు నేరుగా సంప్రదించి.. అవసరమైన తనిఖీ చేసుకోవచ్చు. డబ్బు చెల్లించకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Stock Market closing February 27 Sensex slumps 960 points2
బ్యాంకుల షేర్లు విలవిల.. స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం

దేశీ​య స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీతా పతనమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ క్షీణించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు గణనీయంగా క్షీణించాయి.నిఫ్టీ 1.22 శాతం లేదా 311.85 పాయింట్ల నష్టంతో 25,178.65 వద్ద, సెన్సెక్స్ 961.42 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 81,287.19 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పడిపోయాయి.విస్తృత మార్కెట్లు కూడా బెంచ్ మార్క్ సూచీలకు అనుగుణంగా పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.14 శాతం, 1.10 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా క్షీణించాయి. ఈ సూచీలు వరుసగా 2.3 శాతం, 2.1 శాతం నష్టపోయాయి.

Samsung Galaxy S26 Series Price and Features3
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌: ధరలు ఇలా

దక్షిణ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ తమ ఫ్లాగ్‌షిప్‌ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎస్‌26, ఎస్‌26ప్లస్, ఎస్‌ 26 అల్ట్రా అని మూడు వేరియంట్స్‌ ఉంటాయి. శాంసంగ్‌ పోర్టల్‌ ప్రకారం వేరియంట్‌ని బట్టి ధర రూ. 87,999 నుంచి రూ. 1,89,999 (అల్ట్రా) వరకు ఉంటుంది. ప్రీఆర్డర్‌ చేసే వారికి రూ. 20,000 వరకు విలువ చేసే ప్రయోజనాలు లభిస్తాయి.ఈ సిరీస్‌లోని అల్ట్రా వేరియంట్‌లో పరిశ్రమలోనే తొలిసారిగా ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ ఉంది. స్క్రీన్‌ మీద ఉన్న కంటెంట్‌ పక్క వారికి కనిపించకుండా కేవలం యూజరుకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్‌ని మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు ప్రైవసీని కాపాడుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలీట్‌ జెన్‌ 5 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, అరగంటలోనే 75 శాతం చార్జ్‌ అయ్యేలా సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ 3.0, 50 ఎంపీ, అల్ట్రా వైడ్‌ కెమెరా, 200 ఎంపీ వైడ్‌ కెమెరా, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనికి ముందు సిరీస్‌ తరహాలోనే ఈ ఫోన్లను కూడా భారత్‌లోని నోయిడా ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల, బెంగళూరులోని తమ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ వీటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ఈ సిరీస్‌తో దేశీయంగా యాపిల్‌ నుంచి పోటీ నెలకొన్న 800 డాలర్ల ఎగువ ధర పలికే సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్లో శాంసంగ్‌ తన స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Yes Bank Detects Rs 2 5 Crore Fraud in Multi Currency Forex Cards4
యస్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ తమ మల్టీ–కరెన్సీ ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డుల ద్వారా 2,80,000 డాలర్ల (సుమారు రూ. 2.5 కోట్లు) అనధికారిక లావాదేవీలను గుర్తించినట్లు వెల్లడించింది. బుక్‌మైఫారెక్స్‌ భాగస్వామ్యంతో జారీ చేసిన 5,000 మంది కస్టమర్లకు చెందిన కార్డుల ద్వారా ఫిబ్రవరి 24 తెల్లవారు ఝామున ఓ లాటిన్‌ అమెరికా దేశంలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది.అసాధారణ స్థాయిలో లావాదేవీలు తిరస్కరణకు గురవుతుండటంతో సిస్టం దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. సదరు కస్టమర్లు నష్టపోకుండా ఆ మొత్తాన్ని వెనక్కి రప్పించేలా కార్డ్‌ నెట్‌వర్క్‌తో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది. పటిష్టమైన నియంత్రణ విధానాల కారణంగా 688 అనధికారిక ప్రయత్నాలను సిస్టం అడ్డుకుందని, దీంతో 1,00,000 డాలర్ల నష్టాన్ని నివారించిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది.

Gold Prices to Hit 6300 Dollars by End of Year 2026 Says JPMorgan5
బాబోయ్ బంగారం.. ఊహించని రేటుకు గోల్డ్!

బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పసిడి ప్రియులకు జేపీ మోర్గాన్ రిపోర్ట్ షాకిచ్చింది. 2026లో గోల్డ్ రేటు ఎంతకు చేరుతుందో అంచనా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 5200 డాలర్ల వద్ద ఉంది. ఇది 2026 చివరి నాటికి 6300 డాలర్లకు చేరుకుంటుందని జేపీ మోర్గాన్ తన నివేదికలో వెల్లడించింది. ధరలు పెరగడానికి ప్రధాన కారణం భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మాత్రమే కాదు, ఆర్ధిక అనిశ్చితి కూడా ప్రధాన కారణమని స్పష్టం చేసింది.సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు పెరగడం, యూఎస్ ట్రెజరీ ఉపసంహరణకు సంబంధించిన బహిరంగ ప్రకటనలు కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతోంది. బంగారం రేటు పెరుగుతుందని జేపీ మోర్గాన్ మాత్రమే కాకుండా.. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మొదలైన బ్రోకరేజ్/ఏజెన్సీలు చెబుతున్నాయి.భారతదేశంలో బంగారం ధరలుభారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,570 వద్ద, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,48,100 రూపాయల వద్ద ఉంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. ఈ ఏడాది చివరి నాటికి తులం పసిడి ధర రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.బంగారం రేటు అందుకే పెరుగుతోందిసాధారణంగా భారతీయులు పండుగలకు, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా బంగారం ధరిస్తారు. దీనివల్ల పసిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాగా ఇప్పుడు దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైపోయింది. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతోంది. బంగారం సురక్షితమైన ఆస్తిగా భావించేవారు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. ఇవన్నీ బంగారం ధరలను భారీగా పెంచేస్తున్నాయి.ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్

Telangana Imposes One Time Road Safety Cess on New Vehicles from March 16
కారుకు రూ.10 వేలు.. బైక్‌కు రూ.2000.. మార్చి 1 నుంచి కొత్త సెస్‌

తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.తెలంగాణ మోటార్‌ వెహికల్స్‌ ట్యాక్సేషన్‌ యాక్ట్‌- 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది. గత జనవరిలో గవర్నర్ ఆమోదం పొందిన ఈ సవరణ ప్రకారం, చట్టంలోని సెక్షన్ 3-సి కింద కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వన్‌టైమ్ రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నారు.వాహనాల వారీగా సెస్ ఇలా…మోటార్ సైకిళ్లపై రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 2,000వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టర్-ట్రెయిలర్లు మినహా లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్ఎంవీ)పై రూ. 5,000కార్లు, పెద్ద ప్యాసింజర్ వాహనాలు సహా ఇతర రవాణా, రవాణాయేతర వాహనాలపై రూ. 10,000అయితే నాలుగు నుంచి ఏడుగురు సీటింగ్ సామర్థ్యం కలిగిన ఆటోరిక్షాలు వంటి ప్యాసింజర్ మూడు చక్రాల కాంట్రాక్ట్ క్యారేజీలకు ఈ సెస్ నుంచి మినహాయింపు కల్పించారు.పన్ను నిర్మాణంలో మార్పులునాలుగు చక్రాల లైట్ గూడ్స్ క్యారేజీలపై కూడా పన్ను విధానంలో మార్పులు చేశారు. కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్ సమయంలో వాహన ధరలో 7.5 శాతం పన్ను విధించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో రిజిస్టర్ చేసే వాహనాలపై వాటి వయస్సును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్టర్ అయి వినియోగంలో ఉన్న వాహనాలకు ప్రస్తుత త్రైమాసిక పన్ను కొనసాగుతుంది. పాత మూడు చక్రాల గూడ్స్ క్యారేజీలను సవరించిన పన్ను నిబంధనల నుంచి మినహాయించారు.ప్రత్యేక నిధికి జమరోడ్డు భద్రత సెస్ ద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక నాన్-లాప్సబుల్ ఫండ్‌కు జమ చేస్తారు. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, ప్రమాదాల నివారణ చర్యలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్య ద్వారా సుమారు రూ. 250 కోట్ల ప్రత్యేక నిధి సమీకరించగలమని అంచనా వేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత సెస్ తరహా విధానాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే రోడ్డు సేఫ్టీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అదనపు సెస్సులు వసూలు చేస్తున్నారు. కర్ణాటకలో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి సెస్సు అమల్లో ఉండగా, కేరళలో రోడ్డు భద్రతా ప్రాజెక్టుల కోసం అదనపు లెవీలు విధించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ప్రత్యేక రుసుములు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సులు వసూలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement