Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 23rd January 2026 in Telugu states1
బాంబులా పేలిన బంగారం, వెండి ధరలు! ఇక కొన్నట్టే!!

బంగారం, వెండి ధరలు మళ్లీ రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఒక్క రోజు ఇలా తగ్గాయో లేదో వెంటనే బాంబులా పేలాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు(Today Gold Rate) రూ.5 వేలకు పైగా ఎగిశాయి. ఇక వెండి ధరలైతే వింటేనే భయమేస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 23rd January 20262
Stock Market Updates: లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు పెరిగి 25,332 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 120 పాయింట్లు లాభపడి 82,427 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.4బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 65.3 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.5% లాభపడింది.నాస్‌డాక్‌ 0.9% లాభపడింది.Today Nifty position 23-01-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Dubais Emirates NBD Gets CCI Nod to Acquire Majority Stake in RBL Bank3
దుబాయ్‌ బ్యాంకు చేతికి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌(ఈఎన్‌బీడీ)కు అనుమతి లభించింది. ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ చేసిన ఈ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో 3 బిలియన్‌ డాలర్లు(రూ. 26,850 కోట్లు) వెచ్చించి మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఈఎన్‌బీడీ తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఇందుకు ఈఎన్‌బీడీతోపాటు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ బోర్డులు ఆమోదముద్ర వేసినట్లు 2025 అక్టోబర్‌లో ఈఎన్‌బీడీ వెల్లడించింది. నియంత్రిత సంస్థల అనుమతుల తదుపరి ఫ్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా ఆర్‌బీఎల్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఈఎన్‌బీడీ అక్టోబర్‌లో వెల్లడించింది. తద్వారా ప్రతిపాదిత పెట్టుబడులను వెచ్చించనుంది.అంతేకాకుండా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ సాధారణ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ సైతం ప్రకటించవలసి ఉంది. వెరసి పబ్లిక్‌ నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరిగా ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వవలసి ఉంది.కాగా.. అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌లో నిర్దారిత వాటా కొనుగోలుకి అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌కు కూడా సీసీఐ అనుమతి మంజూరు చేసింది. దీంతో అపోలో హెల్త్‌లో అపోలో హాస్పిటల్స్‌ 30.58 శాతం వాటా సొంతం చేసుకోనుంది. తద్వారా అపోలో హెల్త్‌లో వాటాను ప్రస్తుత 68.84 శాతం నుంచి 99.42 శాతానికి అపోలో హాస్పిటల్స్‌ పెంచుకోనుంది. అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ ప్రైమరీ, సెకండరీ హెల్త్‌కేర్‌ సర్వీసులకు వీలు కల్పించడంతోపాటు, డయాగ్నోస్టిక్, టెలిమెడికల్‌ కన్సల్టేషన్‌ సర్వీసులు అందిస్తున్న విషయం విదితమే.

Hyderabad Housing Sales Shine in 2025 Despite National Slowdown4
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భళా!

హైదరాబాద్‌ ఇళ్ల మార్కెట్‌ 2025లో మెరిసింది. అమ్మకాలు 6 శాతం పెరిగి 54,271 యూనిట్లుగా ఉన్నాయి. 2024లో విక్రయాలు 51,337 యూనిట్లుగా ఉన్నాయి. దక్షిణాదిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో అమ్మకాలు గతేడాది 15 శాతం పెరిగి 1.33 లక్షల యూనిట్లకు చేరినట్టు ప్రాప్‌టైగర్‌ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్‌–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2025లో 3,86,365 యూనిట్లుగా ఉన్నట్టు, 2024లో విక్రయాలు 4,36,992 యూనిట్లతో పోల్చితే 12 శాతం తగ్గినట్టు పేర్కొంది. బెంగళూరులో 54,414 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు 2025లో నమోదయ్యాయి. 2024లో విక్రయాలు 48,272 యూనిట్ల కంటే 13 శాతం పెరిగాయి. చెన్నైలోనూ గతేడాది ఇళ్ల విక్రయాలు 55 శాతం దూసుకెళ్లి 24,892 యూనిట్లకు చేరాయి. కోల్‌కతాలో విక్రయాలు 15,172 యూనిట్లుగా ఉన్నాయి. 2024తో పోల్చితే 12 శాతం పెరిగాయి. ముంబై రీజియన్‌లో విక్రయాలు 26 శాతం తగ్గి 1,05,595 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విక్రయాలు 13 శాతం తగ్గాయి. 35,711 యూనిట్లు అమ్ముడయ్యాయి. పుణెలో అమ్మకాలు 12 శాతం తగ్గి 29,223 యూనిట్లకు పరిమితమయ్యాయి. అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 12 శాతం తగ్గి 37,087 యూనిట్లుగా ఉన్నాయి. టాప్‌–8 నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా 6 శాతం తగ్గి 2025లో 3,61,096 యూనిట్లుగా ఉంది. 2021 తర్వాత ఇదే కనిష్ట సరఫరా అని ప్రాప్‌ టైగర్‌ నివేదిక తెలిపింది. డిమాండ్‌ దెబ్బతినలేదు.. ‘‘2025 సంవత్సరంలో డిమాండ్‌కు విఘాతం కలగలేదు. సర్దుబాటు జరిగిందంతే. కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. డెవలపర్లు మాత్రం సరఫరా పరంగా సమయోచితంగా వ్యవహరించారు. ఈ ధోరణి నిల్వపరమైన ఒత్తిళ్లు తగ్గి, ధరలు స్థిరంగా ఉండేలా సాయపడింది’’అని ఆరమ్‌ ప్రాప్‌టెక్‌ ఈడీ ఓంకార్‌ షెట్యే తెలిపారు.

Union Budget 2026 Exporters Seek Tax Relief Customs Duty Rationalisation5
కేంద్ర బడ్జెట్‌ 2026: పన్ను రాయితీలు కల్పించాలి

న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్‌లో తమకు పన్నుల్లో రాయితీలు కల్పించాలని, సుంకాలను క్రమబద్దీకరించాలని, అంతర్జాతీయంగా బ్రాండింగ్, మార్కెటింగ్‌కు సహకారం అందించాలని ఎగుమతి దారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇన్వర్టెడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ స్ట్రక్చర్‌ పరంగా ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.తుది ఉత్పత్తుల కంటే విడిభాగాలు, ముడి సరుకులపై పన్ను రేట్లు అధికంగా ఉండడాన్ని ఇన్వర్టెడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ స్ట్రక్చర్‌గా చెబుతారు. ఎగుమతులకు ఉద్దేశించిన కీలక విడిభాగాలు, ముడి సరుకుల దిగుమతులపై సుంకాలను క్రమబద్దీకరించాలని, దీనివల్ల తయారీ వ్యయాలు దిగొస్తాయని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) పేర్కొంది. తుది వ్రస్తాల కంటే సింథటిక్‌ యార్న్, ఫైబర్‌పై కస్టమ్స్‌ డ్యూటీ అధికంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇది టెక్స్‌టైల్‌ వ్యాల్యూ చైన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పేర్కొంది.అలాగే, ఎల్రక్టానిక్స్‌ తుది ఉత్పత్తుల కంటే ఎలక్టాన్రిక్స్‌ విడిభాగాలైన ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, కనెక్టర్లు, సబ్‌ అసెంబ్లీలపై అధిక సుంకాలు పడుతున్నాయంటూ.. ఇది దేశీయంగా వ్యాల్యూ చైన్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు వివరించింది. కెమికల్, ప్టాస్టిక్స్‌ రంగంలోనూ ముడి పదార్థాలలైన కెమికల్స్, పాలీమర్స్‌పై అధికంగా సుంకాలు అమలవుతున్నాయని, లెదర్‌ పరిశ్రమలోనూ ఇదే విధానం ఉన్నట్టు తెలిపింది.‘‘కనుక ముడి సరుకులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఈ లోపాలకు చెక్‌ పెట్టాలి. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయి. మూలధన నిధుల పరంగా ఒత్తిళ్లు తగ్గుతాయి. దేశీ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. భారత ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుంది’’అని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌ పేర్కొన్నారు.ప్రపంచస్థాయి షిప్పింగ్‌ లైన్స్‌.. ప్రపంచ స్థాయి షిప్పింగ్‌ లైన్స్‌ (ఆపరేటర్లు) అభివృద్ధికి విధానపరమైన, ద్రవ్యపరమైన మద్దతు అందించాలని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ రల్హాన్‌ కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం విదేశీ షిప్పింగ్‌ లైన్స్‌పై ఆధారపడడం వల్ల రవాణా కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు చెప్పారు. సరఫరా వ్యవస్థలో సమస్యలను, రవాణా చార్జీల్లో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు తెలిపారు.ఇక కొత్త తయారీ యూనిట్లకు 15 శాతం రాయితీ కార్పొరేట్‌ పన్ను రేటును మరో ఐదేళ్ల కాలానికి పొడిగించాలని కూడా కోరారు. రాయితీ రేట్లపై రుణాలను అందించాలని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) కేంద్రానికి సూచించింది. టెక్స్‌టైల్‌ మెషినరీపై జీఎస్‌టీని తగ్గించాలని, చిన్న యూనిట్లకు టెక్నాలజీ నవీకరణ కోసం పథకాన్ని ప్రకటించాలని ఏఈపీసీ చైర్మన్‌ శక్తివేల్‌ డిమాండ్‌ చేశారు.

US stocks rallied after President Trump announced a Greenland deal framework6
తగ్గిన ట్రంప్‌..మార్కెట్‌ జంప్‌ 

ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం అరశాతం మేర లాభపడింది. గ్రీన్‌ల్యాండ్‌ స్వా«దీనం విషయంలో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా–భారత్‌ ట్రేడ్‌ డీల్‌ ఖరారవుతుందనే అంచనాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి స్వల్ప రికవరీ, క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 398 పాయింట్లు లాభపడి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 25,290 వద్ద నిలిచింది. ఉదయమే లాభాలతో మొదలైన సూచీలు... రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల 3రోజుల మార్కెట్‌ పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఒక దశలో సెన్సెక్స్‌ 874 పాయింట్లు ఎగసి 82,783 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ర్యాలీ చేసి 25,434 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌ విషయంలో ఈయూ దేశాలపై విధించిన టారిఫ్‌లను ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్‌ సూచీలు 1% వరకు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 1.50% పెరిగాయి. అమెరికా స్టాక్‌ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → కన్జూమర్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ 2.43%, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.03%, ఇండ్రస్టియల్స్‌ 1.78%, యుటిలిటి 1.45%, విద్యుత్‌ 1.43%, మెటల్స్‌ 1.34%, ఎఫ్‌ఎంసీజీ 1.22%, కమోడిటిస్‌ 1.15%, ఫార్మా 1.11 శాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌లు వరుసగా 1.28%, 1.13 శాతం పెరిగాయి. → డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 8% క్షీణించి రూ.859 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఏకంగా 10% పతనమై రూ.838 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ తాకింది.

Advertisement
Advertisement
Advertisement