Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indias Real Estate Market Gets a Boost from Institutional Investors1
రియల్‌ ఎస్టేట్‌కి పెట్టుబడులు బూస్ట్‌

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (సంస్థాగత) గతేడాది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 8.47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు కొలియర్స్‌ ఇండియా తెలిపింది. 2024లో వచ్చిన 6.56 బిలియన్‌ డాలర్ల కంటే 29 శాతం అధికమని పేర్కొంది. ఇందులో దేశీ పెట్టుబడులు గణనీయంగా పెరగ్గా, విదేశీ పెట్టుబడులు తగ్గాయి. దేశీ ఇన్వెస్టర్ల నుంచి 4.82 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.2024లో దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2.24 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూస్తే 120 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2025లో 16 శాతం తగ్గి 3.65 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ వివరాలతో కొలియర్స్‌ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్లలో ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్‌ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొప్రయిటరీ బుక్‌లు, పెన్షన్‌ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ, రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌–డెవలపర్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, రీట్‌లు, సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.‘‘2025లో అధిక శాతం పెట్టుబడులను ఆఫీస్‌ ఆస్తులు ఆకర్షించాయి. మొత్తం పెట్టుబడుల్లో 54 శాతం (4.53 బిలియన్‌ డాలర్లు) ఆఫీస్‌ ఆస్తుల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నివాస ప్రాజెక్టులు, పారిశ్రామిక, గోదాముల్లోకి వెళ్లాయి’’అని కొలియర్స్‌ ఇండియా ఎండీ, సీఈవో బాదల్‌ యాజ్ఙిక్‌ తెలిపారు. 2026లో సంస్థాగత పెట్టుబడులు మరింత బలపడతాయని, అంతర్జాతీయంగా పెట్టుబడులకు రిస్క్‌ ధోరణి పెరగడం, దేశీ ఇన్వెస్టర్లు ఇందుకు మద్దతుగా నిలవనున్నట్టు పేర్కొంది.

Auto Retail Sales Hit 28 2 Million Units in 2025 on GST 2 0 Boost2
కార్లు, బైక్‌లు.. బాగానే కొన్నారు..

దేశీయంగా ఆటో మొబైల్‌ రిటైల్‌ అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. అంతకుముందు ఏడాది(2024)తో పోలిస్తే 2025లో 8 శాతం మేర విక్రయాలు పెరిగాయి. ప్రథమార్ధమంతా మందగమనాన్ని ఎదుర్కొన్నప్పటికీ..., జీఎస్‌టీ 2.0 అమలు తర్వాత వాహన విక్రయాలు పరుగులు పెట్టాయని ఆటో మొబైల్‌ సమాఖ్య(ఫాడా) పేర్కొంది. ఇందుకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. 2024 క్యాలెండర్‌ ఇయర్‌లో 2,61,45,445 యూనిట్లు అమ్ముడవ్వగా.., 2025లో 2,81,61,228 యూనిట్లు మేర అమ్ముడయ్యాయని ఫాడా తెలిపింది.2025లో విక్రయాలు ఇలా...,∙2024లో 40,79,532 ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడవగా.., 2025లో 10% వృద్ధితో 44,75,309 యూనిట్లు అమ్ముడయ్యాయి.∙టూవీలర్‌ అమ్మకాల్లో 7.24 శాతం వృద్ధి నమోదైంది. 2024లో 1,89,24,815 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025లో 2,02,95,650 యూనిట్లు విక్రయమయ్యాయి.∙త్రిచక్ర వాహన అమ్మకాలు 2024లో 12,21,886 యూనిట్లు కాగా.. 2025లో 7.21 శాతం వృద్ధితో 13,09,953 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు 6.71% పెరిగి 10,09,654 యూనిట్లుగా నమోదయ్యాయి. 2024లో ఇవి 9,46,190 యూనిట్లుగా ఉన్నాయి.‘‘2025 ఏడాది దేశీయ ఆటో పరిశ్రమ ప్రయాణాన్ని రెండు దశలుగా అభివర్ణించవచ్చు. జనవరి నుంచి ఆగస్టు వరకు.... కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను రాయితీలు, ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు వంటి సానుకూలతలున్నప్పట్టకీ.., అమ్మకాలు స్తబ్దుగా సాగాయి. ఈ దశలో కస్టమర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తత వహించారు. అయితే సెప్టెంబర్‌ నుంచి పరిస్థితి మారింది. జీఎస్‌టీ 2.0 సవరణలో భాగంగా 350 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైకులు, స్కూటర్లపై జీఎస్‌టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. అలాగే పెట్రోల్‌ కార్లలో 1200 సీసీ కన్నా, డీజిల్‌ కార్లలో 1500 సీసీ కన్నా తక్కువ వాటిపై జీఎస్‌టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. ప్రభావంతో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో వాహన విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయి’’ అని ఫాడా అధ్యక్షుడు సీఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు.వాహన పరిశ్రమ విద్యుదీకరణ(ఎలక్ట్రిఫికేషన్‌)వైపు అడుగులను 2025 ఏడాది స్వాగతించిందన్నారు. టూ వీలర్స్, పీవీ, సీవీ, త్రీ వీలర్స్‌ ఇలా అన్ని విభాగాల్లో ఈవీ వాటా గణనీయంగా పెరిగిందన్నారు. మొత్తంగా.. 2025 క్యాలెండర్‌ సంవత్సరం ఉత్సాహభరితంగా ముగిసిందన్నారు. ఈ ఏడాది(2026) అవుట్‌లుపై ఫాడా వివరణ ఇస్తూ .., ‘‘తొలి మూడు నెలల్లో రిటైల్‌ విక్రయాలకు ఢోకా లేదు. తాము నిర్వహించిన సర్వే ప్రకారం, 74.91% డీలర్లు వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నారు. జీఎస్‌టీ 2.0తో కొనుగోళ్ల సామర్థ్యం పెరగడం, పండుగలు, వివాహాల సీజన్, ఆర్థిక సంవత్సరం ముగింపులో కనిపించే కొనుగోళ్ల ప్రభావం డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ(ఐఎండీ) ముందస్తు అంచనాల ప్రకారం ఏడాది వర్షపాతం తగిన మోతాదులో ఉండొచ్చు. కావున గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ ఎలాగూ ఉంటుంది. స్థూల ఆర్థిక గణాంకాల దృష్ట్యా పరిశీలిస్తే... ఆర్‌బీఐ రెపో రేటు 5.25% వద్ద ఉండటం రుణ వ్యయాల విషయంలో అదనపు ఊరట లభిస్తోంది. అలాగే, వినియోగానికి పెద్దపీట వేసే విధంగా పన్ను రాయితీలకు ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్‌ రావొచ్చంటూ చర్చలు జరుగుతున్నాయి. అలాంటి బడ్జెట్‌ అమలులోకి వస్తే, డ్రిస్కేషనరీ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. సరఫరా సరైన సమయానికి సరఫరా, ఫైనాన్స్‌ ప్రక్రియల వేగవంతం, డీలర్‌ నెట్‌వర్క్‌లో క్రమబద్ధమైన నిల్వ నిర్వహణ జరిగితే..., 2026లోనూ ఆటో అమ్మకాలు టాప్‌గేర్‌ దూసుకెళ్లే వీలుందని ఫాడా అంచనా వేసింది.

Music Drives Gen Z Travel Boom Airbnb Report3
పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్

భారతదేశంలోని జెన్‌ జీ (Gen Z) నవ యువతలో సంగీతం ప్రాధాన్యత పెరుగుతోంది. ట్రావెల్‌ టెక్‌ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) విడుదల చేసిన తాజా అధ్యయనం పలు ఆసక్తి వివరాలు తెలియజేస్తోంది. సంగీత కచేరీలు, మ్యూజిక్‌ ఫెస్టివల్స్ యువయాత్రలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఎయిర్‌బీఎన్‌బీ ‘ఎక్స్‌పీరియన్స్‌-లెడ్‌ ట్రావెల్‌ ఇన్‌సైట్స్‌’ రిపోర్ట్ ప్రకారం, 2026లో 62% యువ భారతీయులు కచేరీలు, సంగీత ఫెస్టివల్స్ కోసం ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు. ఇది సంప్రదాయ విహారం కోసం చేసే యాత్రల నుండి సాంస్కృతిక అనుభవాల ఆధారిత యాత్రల వైపు మార్పును సూచిస్తుంది. ఇప్పటికే 76% మంది జెన్‌ జీ ప్రతినిధులు.. సంగీత కార్యక్రమం కోసమే తాము ఓ కొత్త నగరాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు.ఈవెంట్‌ ముగిసినా..ఇలా మ్యూజిక్‌ ఈవెంట్ల కోసం వెళ్లినవారు ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఈవెంట్‌ అయిపోయాక కూడా అక్కడే ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలను మరింతగా అన్వేషిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 53% మంది ఇలాగే స్థానిక ప్రాంతాలు, కాఫీ షాపులు, నైట్‌లైఫ్, సాంస్కృతిక హాట్‌స్పాట్లను చూడటం కోసం తమ వసతిని మరికొన్ని రోజులు కొనసాగించారు.విదేశాలకూ వెళ్తాం..ఈ సంగీత ఆధారిత యాత్రలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. 40% కి పైగా జెన్‌ జీ ప్రతినిధులు అంతర్జాతీయంగా జరిగే మ్యూజిక్‌ ఈవెంట్‌ల కోసం ముఖ్యంగా అమెరికా, యూరోప్, ఆసియా దేశాలకు కూడా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 70% మంది ఫ్రెండ్స్ తో సమూహంలో ఈ ఈవెంట్లలో పాల్గొనడాన్ని ఇష్టపడుతున్నారు. గ్రూప్ స్టేలకు డిమాండ్‌ను పెంచుతోంది.ఖర్చు లెక్కేం లేదు..ఇలా మ్యూజిక్‌ ట్రిప్‌లకు వెళ్లడం కోసం ఖర్చుకు కూడా వెనకాడటం లేదు భారత జెన్‌జీ యువత. ప్రతి పది మందిలో ఆరుగురు యువ యాత్రికులు తమ నెలవారీ ఆదాయంలో 21–40% మ్యూజిక్‌ కన్సర్ట్‌ -ఆధారిత ట్రిప్‌లపైనే ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో సంగీత కార్యక్రమ ప్రయాణానికి చేసే సగటు ఖర్చు రూ.51 వేల దాకా ఉంటోంది.ఇదీ చదవండి: ఇవేం ధరలు బాబోయ్‌.. హ్యాట్రిక్‌ కొట్టేసిన పసిడి, వెండి

Gold and Silver rates on January 7th 2026 in Telugu states4
ఇవేం ధరలు బాబోయ్‌.. హ్యాట్రిక్‌ కొట్టేసిన పసిడి, వెండి

దేశంలో బంగారం, వెండి ధరలు మరింత భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజూ ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) మరింతగా పెరిగాయి. వెండి ధరలు అయితే అత్యంత భారీగా దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on January 7th 20265
Stock Market Updates: 26,150 దిగువన నిఫ్టీ..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు కరిగి 26,141 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 75 పాయింట్లు క్షీణించి 84,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.26బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 61.79 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.6 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.6 శాతం పెరిగింది.Today Nifty position 07-01-2026(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Tata Power Sets Record in Rooftop Solar Installations6
సోలార్‌ రూఫ్‌టాప్‌లో టాటా పవర్‌ రికార్డు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో ఒక గిగావాట్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్ల సామర్థ్యాన్ని తన సబ్సిడరీ సంస్థ ‘టాటా పవర్‌ సోలరూఫ్‌’ ద్వారా సాధించినట్టు టాటా పవర్‌ ప్రకటించింది. ఈ కాలంలో 1.7 లక్షల నివాస, వాణిజ్య, పారిశ్రామిక భవనాలపై ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసినట్టు(ఇనస్టలేషన్‌), అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇన్‌స్టలేషన్లతో (38,494) పోల్చి చూస్తే 345 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది.ఇదే కాలంలో నివాస, వాణిజ్య, పారిశ్రామిక విభాగంలో లక్ష మంది కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్టు, దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 3 లక్షలకు, ఇన్‌స్టాల్డ్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ సామర్థ్యం 4 గిగావాట్లకు పెరిగినట్టు వివరించింది. ఒక్క డిసెంబర్‌ త్రైమాసికంలోనే 58,476 రూఫ్‌టాప్‌ సోలార్‌ ఇన్‌స్టలేషన్లను సాధించినట్టు తెలిపింది.ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో అత్యధికంగా యూపీలో 30,857, మహారాష్ట్రలో 21,044 ఇన్‌స్టలేషన్లను చేసినట్టు పేర్కొంది. ఘర్‌ ఘర్‌ సోలార్‌ కార్యక్రమం ద్వారా రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ ప్రయోజనాల గురించి వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement