Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

You may soon have to pay to use Instagram WhatsApp FB premium features1
హాయ్‌ ఫ్రెండ్స్‌... ఇన్‌స్టా ఇకపై ఫ్రీ కాకపోవచ్చు!

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి తన ప్లాట్‌ఫాంలలో కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్లను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. యాప్‌ల ప్రాథమిక వెర్షన్లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే ఉత్పాదకత, సృజనాత్మకత, ఆధునిక ఏఐ (AI) టూల్స్‌తో వచ్చే అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం ప్లాన్‌లను పరీక్షించనున్నట్లు మెటా టెక్‌క్రంచ్‌కు ధ్రువీకరించింది.మెటా ప్రకారం.. ప్రతి యాప్‌కు దాని ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉంటాయి. ఒకే స్థిరమైన ప్లాన్‌కు బదులుగా, వివిధ ఫీచర్ బండిల్స్‌ను ప్రయోగాత్మకంగా అందించి, వినియోగదారులకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవాలని కంపెనీ భావిస్తోంది.ఈ సబ్‌స్క్రిప్షన్‌లలో ప్రధానంగా ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. మెటా ఇటీవల సుమారు 2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన ‘మానస్’ ఏఐ ఏజెంట్‌ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మానస్‌ను మెటా యాప్‌లలోనే భాగంగా చేర్చడమే కాకుండా, వ్యాపారాల కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌గా కూడా అందించనుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మానస్ ఏఐ షార్ట్‌కట్‌ను జోడించే పనిలో మెటా ఉంది.అలాగే, అధునాతన ఏఐ ఫీచర్లకు ఛార్జీలు వసూలు చేయాలని కూడా మెటా భావిస్తోంది. ఉదాహరణకు, ‘వైబ్స్’ అనే ఏఐ ఆధారిత షార్ట్-ఫార్మ్ వీడియో టూల్. దీంట్లో ఏఐని ఉపయోగించి వీడియోలను సృష్టించడం, రీమిక్స్ చేయడం వంటివి చేయొచ్చు. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న ఈ ఫీచర్‌ను ఫ్రీమియం మోడల్‌కు మార్చే యోచనలో మెటా ఉంది.ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు అపరిమిత ఆడియన్స్ లిస్టులు సృష్టించే అవకాశం, ఎవరు తిరిగి ఫాలో చేయడం లేదో తెలుసుకునే ఫీచర్, స్టోరీలను అనామకంగా వీక్షించే సౌకర్యం (పోస్టర్‌కు తెలియకుండా) వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.కాగా ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు, మెటా వెరిఫైడ్ వేరువేరు. మెటా వెరిఫైడ్ ప్రధానంగా క్రియేటర్లు, బిజినెస్‌ అకౌంట్ల కోసం రూపొందించినది. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్, డైరెక్ట్ సపోర్ట్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాబోయే కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు మాత్రం సాధారణ రోజువారీ యాజర్ల కోసం తీసుకొస్తున్నవి.

Gold and Silver rates on 28th January 2026 in Telugu states2
షాకింగ్‌ ధరలు.. కొత్త మార్క్‌లకు బంగారం, వెండి

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజు విరామం ఇచ్చి అమాంతం ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బంగారం ధరలు(Today Gold Rate) భారీ పెరుగుదలను నమోదు చేశాయి. వెండి ధరలు కొత్త మార్క్‌ను తాకాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 28th January 20263
Stock Market Updates: లాభాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే 34.88 పాయింట్లు పెరిగి 81,892.36 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 83.45 పాయింట్ల లాభంతో 25,258.85 వద్ద ప్రారంభమైంది.భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) ఖరారు చేయడంపై సానుకూల సెంటిమెంట్ మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో పయనిస్తున్నాయి.Today Nifty position 28-01-2026(time: 9:25 am)నేటి క్యూ3 ఫలితాలులార్సెన్ & టూబ్రో, మారుతి సుజుకి ఇండియా, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టివిఎస్ మోటార్, లోధా డెవలపర్స్, ఎస్బిఐ కార్డ్స్, జిఇ వెర్నోవా టిడి ఇండియా, ఫీనిక్స్ మిల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్, మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, కొచ్చిన్ షిప్యార్డ్, గ్లాండ్ ఫార్మా, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్, టివిఎస్ హోల్డింగ్స్, పైన్ ల్యాబ్స్, స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్, పిరమల్ ఫార్మా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ, ఇక్లెర్క్స్ సర్వీసెస్ తదితరాలు ఈ రోజు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Union Budget 2026: Traditional Halwa Ceremony And Its Significance4
తీపితో సీక్రెట్‌ లాక్‌

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు కీలక సంప్రదాయ కార్యక్రమం బడ్జెట్‌ హల్వా సెరమనీ న్యూఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో మంగళవారం ఘనంగా, సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంతో బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి, ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు, బడ్జెట్‌ తయారీలో పాల్గొన్న సిబ్బంది కలిసి హల్వాను పంచుకున్నారు.భారత సంప్రదాయంలో శుభారంభానికి తీపి పంచుకోవడం ఆనవాయితీ కావడంతో, బడ్జెట్‌ ప్రక్రియ ప్రారంభానికి ఇది ప్రతీకగా కొనసాగుతోంది. వచ్చే నెల (ఫిబ్రవరి)1 న ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమరి్పంచనున్నారు. హల్వా వేడుక తర్వాత ఆర్థిక మంత్రి సీతారామన్‌ బడ్జెట్‌ ముద్రణ విభాగాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం బడ్జెట్‌ బృందానికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు. బడ్జెట్‌ వరకు దిగ్బంధం బడ్జెట్‌ రూపకల్పనలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు నార్త్‌ బ్లాక్‌లోనే (లాకిన్‌) ఉండిపోతారు. బాహ్య ప్రపంచంతో వారికి ఎలాంటి సమాచార, సంబంధాలు ఉండవు. బడ్జెట్‌ తుది పత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్‌ అవ్వకుండా ఈ విధానాన్ని పాటిస్తుంటారు. ఇలా లాకిన్‌లో ఉండే అధికారులు, సిబ్బందికి అభినందన పూర్వకంగా హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే 1980 నుంచి 2020 వరకు బడ్జెట్‌ ప్రతులను ముద్రించే వారు. ఆ తర్వాత నుంచి పరిమితంగా కొన్ని పత్రాలను ముద్రించి, మిగిలిన మొత్తం డిజిటల్‌ రూపంలోకి మారింది. 1950కు పూర్వం రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ పత్రాల ముద్రణ నడిచింది. డాక్యుమెంట్లు లీక్‌ అవ్వడంతో 1950లో మింట్‌రోడ్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో నార్త్‌బ్లాక్‌కు మారింది.

SBI Calls for Tax Relief on Bank Deposits Insurance Pensions in new Budget5
ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐ

రాబోయే కేంద్ర బడ్జెట్‌ 2026లో పన్నులు, బీమా, పెన్షన్ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గృహ ఆర్థిక పొదుపును పెంచడం, నియంత్రణ సవాళ్లను తగ్గించడం, దేశంలో సామాజిక భద్రత కవరేజీని మెరుగుపరచడం ఈ సూచనల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.గృహ ఆర్థిక పొదుపులో బ్యాంకు డిపాజిట్ల వాటా 2024 ఆర్థిక సంవత్సరంలో 38.7 శాతం నుంచి 2025లో 35.2 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొదుపును ప్రోత్సహించేందుకు డిపాజిటర్లకు పన్ను ఉపశమన చర్యలు అవసరమని ఎస్బీఐ అభిప్రాయపడింది.బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి వర్తించే పన్ను విధానాన్ని దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల (LTCG, STCG)తో సమానంగా తీసుకురావాలని సూచించింది. అలాగే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల లాక్-ఇన్ వ్యవధిని మూడేళ్లకు తగ్గించి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)తో సమానంగా చేయాలని సిఫార్సు చేసింది. చిన్న పొదుపుదారులకు ఉపశమనం కలిగించేలా పొదుపు ఖాతాలపై వడ్డీకి వర్తించే టీడీఎస్‌ను పూర్తిగా తొలగించాలని లేదా కనీస పరిమితిని పెంచాలని కూడా ఎస్బీఐ సూచించింది.పరోక్ష పన్నుల విషయంలో, ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)కు సంబంధించిన జీఎస్టీ నిబంధనల్లో స్పష్టత తీసుకురావాలని నివేదిక పేర్కొంది. జీఎస్టీ చట్టం, 2017లోని కొన్ని పదాలను సవరించడం ద్వారా వివాదాలు తగ్గించవచ్చని సూచించింది. అలాగే బ్యాంకులు పంపిణీ చేసే ఐఎస్‌డీపై వాల్యుయేషన్ వివాదాలు లేకుండా ఉండేందుకు సెక్షన్ 20(3)కు వివరణ జోడించాలని ప్రతిపాదించింది.ఎన్పీసీఐ, వీసా, మాస్టర్‌కార్డ్ వంటి సెటిల్మెంట్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులపై జీఎస్టీ టీడీఎస్ అమల్లో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ టీడీఎస్ వర్తించకుండా మినహాయింపు ఇవ్వాలని ఎస్బీఐ సూచించింది.బీమా రంగంలో, భారతదేశంలో బీమా వ్యాప్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి తగ్గిందని ఐఆర్డీఏఐ డేటాను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. జీవిత బీమా వ్యాప్తి 2.7 శాతానికి, నాన్-లైఫ్ బీమా 1 శాతానికి పరిమితమైందని పేర్కొంది. “2047 నాటికి అందరికీ బీమా” అనే ఐఆర్డీఏఐ లక్ష్యానికి ఇది సవాలుగా మారిందని హెచ్చరించింది. అలాగే 2025లో వచ్చిన ఫిర్యాదుల్లో 69 శాతం క్లెయిమ్స్‌కు సంబంధించినవేనని, ముఖ్యంగా ఆరోగ్య బీమా రంగంలో తక్షణ సంస్కరణలు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.పెన్షన్ రంగంలో కనీస పెన్షన్ హామీతో కూడిన బలమైన, సమగ్ర పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎస్బీఐ నొక్కి చెప్పింది. కేంద్ర బడ్జెట్‌ 2026లో ఈ సూచనలను అమలు చేస్తే దేశ ఆర్థిక భద్రత బలోపేతమవుతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని ఎస్బీఐ పేర్కొంది.

Key Highlights on SGB Gold Reserve Fund in Budget 20266
ఎస్‌జీబీలతో కేంద్ర ఖజానాకు గండి!

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వంపై సార్వభౌమ గోల్డ్ బాండ్ (సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌-SGB) రిడెంప్షన్ల భారం ఊహించని విధంగా పెరుగుతోంది. ఈ వ్యయాన్ని తట్టుకునేందుకు రానున్న బడ్జెట్‌లో ‘గోల్డ్‌ రిజర్వ్‌ ఫండ్‌’ కేటాయింపులను కేంద్రం భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.నిధుల కేటాయింపులో భారీ వ్యత్యాసంగత కొన్నేళ్లుగా బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గతేడాది బడ్జెట్ అంచనాల్లో కేవలం రూ.8,550 కోట్లు కేటాయించగా, రిడెంప్షన్ల ఒత్తిడి వల్ల సవరించిన అంచనాల్లో అది ఏకంగా రూ.28,000 కోట్లకు పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) కేవలం రూ.700 కోట్లే ప్రాథమికంగా కేటాయించినప్పటికీ వాస్తవ రిడెంప్షన్ల దృష్ట్యా దీన్ని భారీగా పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్ అంచనాల్లోనూ ఈ నిధికి సింహభాగం కేటాయించే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.పెరుగుతున్న భారంఎస్‌జీబీ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. బాండ్లు జారీ చేసినప్పటి ధరతో పోలిస్తే ప్రస్తుత మార్కెట్ ధరలు 4 నుంచి 5 రెట్లు పెరగడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం.సార్వభౌమ గోల్డ్ బాండ్ (SGB) పథకంలో భాగంగా 2017-18 సిరీస్ కింద జారీ చేసిన బాండ్ల ధరలను పరిశీలిస్తే అప్పట్లో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.2,881 నుంచి రూ.2,951 మధ్య ఉంది. అయితే, ఈ బాండ్లు మెచ్యూరిటీ సమయానికి బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారులు ఒక్కో గ్రాముపై రూ.9,486 నుంచి రూ.13,486 వరకు రిడెంప్షన్ ధరను పొందగలిగారు. అంటే జారీ చేసిన ధరతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు అధిక లాభం చేకూరింది.ఇక 2018-19 సిరీస్ విషయానికి వస్తే ఇందులో ఐదో ట్రాంచ్ (5th Tranche) బాండ్లు ముందస్తు రిడెంప్షన్‌కు (Premature Redemption) అవకాశం లభించింది. ఈ క్రమంలో వీటిని ఒక్కో యూనిట్‌కు రూ.14,853 గరిష్ట ధర వద్ద రిడీమ్ చేయడం గమనార్హం. ఇది అప్పట్లో బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం గ్రాముకు రూ.16,000 మార్కును దాటి కొనసాగుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదల వల్ల రాబోయే కాలంలో రిడెంప్షన్ కావాల్సిన బాండ్ల కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.2026-27లో 2018-19 సిరీస్‌కు చెందిన 6 ట్రాంచ్‌లు తుది రిడెంప్షన్‌కు రానున్నాయి. అలాగే 2021-22 సిరీస్‌కు చెందిన 10 ట్రాంచ్‌లు ముందస్తు రిడెంప్షన్‌కు అర్హత సాధించనున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపనున్నాయి.కొత్త బాండ్ల జారీకి బ్రేక్భౌతిక బంగారం దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 146 టన్నులకు పైగా బంగారానికి సమానమైన పెట్టుబడులు వచ్చాయి. అయితే, ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వానికి ఇది భారంగా మారింది. 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 వరకు మొత్తం 67 ట్రాంచ్‌లు జారీ అయ్యాయి. పెరుగుతున్న ఆర్థిక భారంతో 2024 తర్వాత ప్రభుత్వం కొత్త ట్రాంచ్‌లను జారీ చేయలేదు. భవిష్యత్తులోనూ కొత్త బాండ్లు వచ్చే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.ధర నిర్ణయం ఇలా..ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత గల బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. రిడెంప్షన్ తేదీకి ముందున్న చివరి మూడు వ్యాపార దినాల సగటు ధర ఆధారంగా పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తారు.ఇదీ చదవండి: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Advertisement
Advertisement
Advertisement