Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India gross GST collections for March 2026 surpassed Rs 2 lakh crore1
రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు 

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు మార్చిలో మరింత బలపడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 9% పెరిగి రూ.2,00,064 కోట్లకు చేరింది. ఇందులో దిగుమతులపై జీఎస్‌టీ రూపంలో వసూలైన మొత్తం 17.8% పెరిగి రూ.53,861 కోట్లుగా ఉంది. 2025–26లో నెలవారీ మూడో అత్యధిక వసూళ్లు ఇవి. 2025 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.36 లక్షల కోట్లు వసూలు కాగా, మేలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2025 మార్చి నెలలో జీఎస్‌టీ ఆదాయం రూ.1.83 లక్షల కోట్లుగా ఉంది. మార్చి నెలలో రిఫండ్‌లు 13.8% పెరిగి రూ.22,074 కోట్లకు చేరాయి. రిఫండ్‌లు మినహాయించి చూస్తే నికర జీఎస్‌టీ ఆదాయం 8% వృద్ధితో రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం జీఎస్‌టీ వసూళ్లు అంతక్రితం ఏడాదితో పోల్చి చూస్తే 8.3 శాతం పెరిగి రూ.22.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెపె్టంబర్‌లో జీఎస్‌టీ శ్లాబులను కుదించడం ఫలితంగా 375 ఉత్పత్తులపై పన్ను రేటు దిగిరావడం తెలిసిందే. అయినప్పటికీ జీఎస్‌టీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Aviation Sector Gets Partial Relief2
దేశీ ఎయిర్‌లైన్స్‌కి ఊరట 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగిసినప్పటికీ విమాన ఇంధనం రేట్లను భారీగా పెంచకుండా దేశీ విమానయాన సంస్థలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొంత ఊరటనిచ్చాయి. వాస్తవానికి రెట్టింపు స్థాయిలో పెంచాల్సినప్పటికీ పెంపును 8.5%కి పరిమితం చేశాయి. అయితే, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ (ఎల్‌పీజీ), ప్రీమియం పెట్రోల్‌ రేట్లను మాత్రం పెంచాయి. తాజా పరిమాణంతో దేశీ ఎయిర్‌లైన్స్‌కి ఏటీఎఫ్‌ ధర ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 8,289 (8.56%) పెరిగి రూ. 1,04,927కి చేరింది. కానీ విదేశీ ఎయిర్‌లైన్స్, నాన్‌–శెడ్యూల్డ్, చార్టర్‌ ఫ్లయిట్స్‌కి మాత్రం 114.5% ఎగిసింది. రూ.1,10,703 పెరిగి రూ. 2,07,341కి చేరింది. ఇది రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ‘విమాన టికెట్‌ చార్జీలు భారీగా పెరగకుండా ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు, దేశీ ఎయిర్‌లైన్స్‌పై భారాన్ని తగ్గించేందుకు, కీలక తరుణంలో పరిశ్రమలో స్థిరత్వాన్ని తెచ్చేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఎయిర్‌ కనెక్టివిటీకి ఆటంకాలు ఏర్పడకుండా చూడటం ద్వారా ఎకానమీకి కూడా ప్రయోజనం చేకూర్చగలదు’ అని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఏవియేషన్‌ పరిశ్రమకు, విమాన ప్రయాణికులపై పెను భారం పడకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌ పేర్కొన్నాయి. సాధారణ పెట్రోల్, వంట గ్యాస్‌ ధర యథాతథం.. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ రేటు ఢిల్లీలో రూ. 195.50 మేర పెరిగి రూ. 2,078.50కి చేరింది. ప్రీమియం డీజిల్‌ రేటు లీటరుకు రూ. 1.50 మేర పెరిగి రూ. 92.99కి చేరగా, 100 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధర రూ. 11 పెరిగి రూ. 160కి చేరింది. సాధారణ, అన్‌బ్రాండెడ్‌ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ వంట గ్యాస్‌ ధరల్లో ఎటువంటి మార్పుల్లేవు. వంట గ్యాస్‌ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రతి సిలిండర్‌పై రూ. 380 మేర ఆదాయ నష్టం వాటిల్లుతోంది’ అని పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ శాఖ పేర్కొంది.ఇండిగో ఇంధన చార్జీల పెంపు..ఏటీఎఫ్‌ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఇంధన చార్జీలను రూ. 275–10,000 వరకు పెంచుతున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా ప్రయాణ దూరాన్ని బట్టి దేశీ రూట్లలో ఫ్లయిట్లకు సంబంధించి ఈ పెంపు రూ. 275–950 శ్రేణిలో, ఇంటర్నేషనల్‌ ఫ్లయిట్స్‌లో రూ. 900 – 10,000 శ్రేణిలో ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో మార్చి 14 నుంచి ఇండిగో రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తోంది.

Indian stock market started the new financial year FY273
కొత్త ఆర్థిక సంవత్సరం బుల్‌ స్టార్ట్‌!

ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని(2026–27) దేశీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలతో మొదలుపెట్టింది. పశ్చిమాసియా యుద్ధం 2–3 వారాల్లో ముగిస్తుందనే ఆశలు సూచీలను పరుగులు పెట్టించాయి. క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం కలిసొచ్చిది. ఫలితంగా బుధవారం సెన్సెక్స్‌ 1,187 పాయింట్లు పెరిగి 73,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు బలపడి 22,679 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 2,017 పాయింట్లు ఎగసి 73,964 వద్ద, నిఫ్టీ 610 పాయింట్లు బలపడి 22,941 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే ట్రేడింగ్‌ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా సూచీల లాభాలు సగానికి తుడిపెట్టుకుపోయాయి. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ. 422.01 లక్షల కోట్లకు చేరింది. → ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 8%, జపాన్‌ 5%, తైవాన్‌ 4% ర్యాలీ చేశాయి. ఇండోనేíÙయా, హాంగ్‌కాంగ్, సింగపూర్‌ 2%, చైనా, థాయ్‌లాండ్‌ 1.55% పెరిగాయి. యూరప్‌ మార్కెట్లు 1.5% – 2% లాభపడ్డాయి. అమెరికా స్టాక్‌ సూచీలు 1% లాభంతో ట్రేడవుతున్నాయి. → ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. రంగాల వారీ ఇండెక్సుల్లో సరీ్వసెస్‌ 5%, పీఎస్‌యూ బ్యాంక్‌ 3.66%, ఇండ్రస్టియల్స్‌ 3.40%, క్యాపిటల్‌ గూడ్స్‌ 3.29%, కన్జూమర్‌ డి్రస్కేషనరీ 2.79%, కమోడిటీస్‌ 2.72%, ఐటీ 2.40% పెరిగాయి. సెన్సెక్స్‌లో ఎన్‌టీపీసీ (–1.64%), సన్‌ఫార్మా (–1.64%), పవర్‌గ్రిడ్‌ (–1.13%), అ్రల్టాటెక్‌ (–0.29%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. బుల్‌ పరుగులు ఎందుకంటే ..ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరాన్‌ యుద్ధాన్ని 2–3 వారాల్లో ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగవని హామీ ఇస్తే యుద్ధం ముగింపునకు సిద్ధమేనని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తెలిపారు. దీంతో భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకుంది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 4% క్షీణించి 100 డాలర్ల దిగువకు దిగివచ్చాయి. మూడునెలల గరిష్టానికి చేరిన అమెరికన్‌ బాండ్లపై రాబడులు అనూహ్యంగా దిగివచ్చాయి. దలాల్‌ స్ట్రీట్‌ మార్చిలో 11% భారీ పతనం తర్వాత షార్ట్‌ కవరింగ్, వాల్యూ బయింగ్‌ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. → జెట్‌ ఫ్యూయెల్‌ ధరలు పరిమితంగానే పెరగడంతో ఏవియేషన్‌ రంగానికి చెందిన ఇండిగో షేరు 6%, స్పైస్‌జెట్‌ 2% పెరిగాయి.

iSprout Launches 5 6 Lakh Sq Ft Enterprise Grade Workspace for GCCs in Hyderabad4
హైదరాబాద్‌లో ఐస్పౌట్ భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ 'ఐస్పౌట్' (iSprout), హైదరాబాద్‌లోని మీనాస్ టవర్స్‌లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 20 అంతస్తుల ఈ భారీ కాంప్లెక్స్‌లో ఇప్పటికే 10 అంతస్తులు ప్రముఖ కంపెనీలకు లీజుకు ఇవ్వడం విశేషం. ఈ సరికొత్త విస్తరణతో భాగ్యనగరంలో ఐస్పౌట్ మొత్తం పోర్ట్‌ఫోలియో 17 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని 100 నుంచి 3,000 సీట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.ఈ కొత్త కేంద్రం కేవలం కార్యాలయ సముదాయం మాత్రమే కాకుండా, ప్రతి క్లయింట్ అవసరాలకు అనుగుణంగా 'కస్టమ్ డిజైన్' చేసిన వర్క్‌స్పేస్‌లను అందిస్తోంది. హై-స్పీడ్ ఐటీ మౌలిక సదుపాయాలు, మీటింగ్ రూమ్‌లు, కొలాబరేషన్ సూట్‌లతో పాటు హై-ఎండ్ రెస్టారెంట్లు, కాఫీ షాపులు వంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం 60 రోజుల్లోనే కంపెనీల బ్రాండ్ నిబంధనల ప్రకారం కార్యాలయాన్ని సిద్ధం చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లకు సమీపంలో ఉండటం, మెట్రో కనెక్టివిటీ ఉండటం ఈ కేంద్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఐస్పౌట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 నగరాల్లో 26 కేంద్రాలను నిర్వహిస్తూ, 350కి పైగా కంపెనీలకు సేవలు అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 14,000 సీట్లుగా ఉన్న కంపెనీ సామర్థ్యం, 2026 నాటికి 43,000 సీట్లకు చేరుకోవడం సంస్థ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం. హైదరాబాద్ తమకు అత్యంత వ్యూహాత్మక మార్కెట్ అని, గ్లోబల్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇక్కడ మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతలను తాము తీసుకుంటామని ఐస్పౌట్ సీఈఓ, కో-ఫౌండర్ సుందరి పాటిబండ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Indias New CCTV Regulations What Hikvision TP Link Users Need to Know5
చైనా సీసీ కెమెరాలకు చెక్‌! ఇక కొత్త నిబంధనలు

దేశ భద్రత, సైబర్ రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ (CCTV) కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 1 నుండి మారిన నిబంధనలు ఇవే..ఏప్రిల్ 1 నుండి దేశంలో విక్రయించే ప్రతి ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన STQC (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) ఫ్రేమ్‌వర్క్ నుండి అనుమతి పొందాలి.కంపెనీలు తమ కెమెరాలలో ఉపయోగించే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) లేదా ప్రాసెసర్ ఎక్కడ తయారైందో స్పష్టంగా తెలియజేయాలి.ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ, హార్డ్‌వేర్ మూలం, ఫర్మ్‌వేర్ భద్రత మరియు ట్యాంపరింగ్ (ట్యాంపర్ రెసిస్టెన్స్) వంటి అంశాలపై STQC అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.కెమెరా డేటాను ఇతరులు రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే కాకుండా, భారత్‌లో అసెంబుల్ చేసే పరికరాలు కూడా ఈ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. క్లియరెన్స్ లేని ఉత్పత్తుల విక్రయం ఇకపై చట్టవిరుద్ధం.ఏ బ్రాండ్‌లపై ప్రభావం పడుతుంది?భారత సీసీటీవీ మార్కెట్‌లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన హిక్ విజన్ (Hikvision), టీపీ-లింక్ (TP-Link), దహువా (Dahua) వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం వీరు కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.పాత కెమెరాల పరిస్థితి ఏమిటి?ఇప్పటికే ఇళ్లు, కార్యాలయాల్లో వాడుతున్న కెమెరాల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రస్తుత కెమెరాలను స్వాధీనం చేసుకోదు. పాత కెమెరాలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, భవిష్యత్తులో ఆయా కంపెనీల నుండి వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (మరమ్మతులు) విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ధరలు పెరుగుతాయా?చైనా కంపెనీలకు ఆంక్షలు ఎదురైనప్పటికీ, భారతీయ బ్రాండ్లు సీపీ ప్లస్ (CP Plus), ప్రమా (Prama), క్యోబో (Kyobo), మ్యాట్రిక్స్ (Matrix), స్పర్ష్ (Sparsh) ఇప్పటికే తమ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వీటి వాటా 80 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ, భద్రతా పరీక్షల కోసం అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల, రానున్న రోజుల్లో ముఖ్యంగా మిడ్, ప్రీమియం రేంజ్ కెమెరాల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Airtel Announces 1 Billion Investment in Nxtra Led by Alpha Wave Global6
ఎయిర్‌టెల్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు

భారతీ ఎయిర్‌టెల్ తన డేటా సెంటర్ విభాగమైన 'నెక్స్ట్రా' (Nxtra)లో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కలిసి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) నిధులను సమకూర్చనున్నాయి. ఈ పెట్టుబడిలో భారతీ ఎయిర్‌టెల్ కూడా పాలుపంచుకోనుంది. ఈ నిధుల సేకరణ అనంతరం నెక్స్ట్రా సంస్థ విలువ సుమారు 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్ 435 మిలియన్ డాలర్లు, కార్లైల్ 240 మిలియన్ డాలర్లు, యాంకోరేజ్ క్యాపిటల్ 35 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఎయిర్‌టెల్ సంస్థే సమకూర్చనుంది. ఈ పెట్టుబడుల తర్వాత కూడా నెక్స్ట్రాలో మెజారిటీ వాటా ఎయిర్‌టెల్ వద్దే ఉంటుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల విస్తరణే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు.ప్రస్తుతం నెక్స్ట్రా సంస్థకు దేశవ్యాప్తంగా 300 మెగావాట్ల సామర్థ్యం ఉండగా, రానున్న కొన్నేళ్లలో దీన్ని 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో శరవేగంగా పెరుగుతున్న క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, హైపర్‌స్కేలర్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ఈ విస్తరణ దోహదపడనుంది. దేశీయ డేటా సెంటర్ మార్కెట్‌లో 25 శాతం వాటాను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.నెక్స్ట్రా ఇప్పటికే పుణెలో అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉండగా, తాజాగా చెన్నై, ముంబై, కోల్‌కతాలలో ఏఐ-రెడీ (AI-ready) క్యాంపస్‌లను నిర్మిస్తోంది. గూగుల్‌తో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 14 ప్రధాన కోర్ డేటా సెంటర్లు, 120కి పైగా ఎడ్జ్ కేంద్రాలతో నెక్స్ట్రా తన సేవలను అందిస్తోంది. ఈ కొత్త పెట్టుబడులతో భారత్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement