Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

RBI Grants Relief to Small NBFCs with Regulatory Exemptions1
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఊరట

డిపాజిట్లు సేకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు (బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు) రిజిస్ట్రేషన్, రిజర్వ్‌ ఫండ్‌ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రూ. 1,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్‌ ఉన్నవి, ప్రజా ధనాన్ని తీసుకోని ఎన్‌బీఎఫ్‌సీలు ఈ జాబితాలో ఉంటాయి.ప్రస్తుతం టైప్‌ 1 ఎన్‌బీఎఫ్‌సీలుగా నమోదు చేసుకున్న సంస్థలు, మినహాయింపు పొందడానికి 2026 డిసెంబర్‌ 31 వరకు డీరిజిస్ట్రేషన్ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆర్‌బీఐ యాక్ట్‌ 1934లోని సెక్షన్‌ 45ఐఏ ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలు చట్టప్రకారం రిజి్రస్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే రిజర్వ్‌ ఫండ్‌ని ఏర్పాటు చేసి, తమ నికర లాభాల్లో 20 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం దానికి బదలాయించాల్సి ఉంటోంది.

Traditional School Financial Advice Is Outdated Robert Kiyosaki Warns2
'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయని, అప్పు చేయడం తప్పు కాదని, డబ్బును ఎలా నిర్వహించాలో తప్పకుండా తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..కియోసాకి హెచ్చరిక!ఈ రోజు చాలా మంది విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయి. ఎందుకంటే ''బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, కష్టపడి పని చేయు, డబ్బు సేవ్ చేయు, అప్పులు తగ్గించు, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టు'' అనే మాటలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవి ఇప్పటి ప్రపంచానికి సరిపోవని కియోసాకి హెచ్చరించారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 1971లో, అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించారు. ఆ తరువాత ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రించడం ప్రారంభించాయి. దీంతో డబ్బుకు విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో..జీతం కోసం పనిచేస్తూ మీరు ధనవంతులు కాలేరు, ఎందుకంటే ఆ జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో బంధించి ఉంచుతుంది. కాబట్టి ''డబ్బు కోసం పని చేయడం కాకుండా, ఆస్తులు సృష్టించడం లేదా సంపాదించండి అని కియోసాకి చెబుతారు. ధనవంతులు తమ డబ్బును వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడిగా పెడతారు. అప్పులు తీసుకుని కూడా ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే పన్నుల వ్యవస్థను కూడా చట్టబద్ధంగా తమకు అనుకూలంగా ఉపయోగిస్తారని కియోసాకి అంటారు.జీతంపై ఆధారపడటం వల్లమరోవైపు, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా జీతంపై ఆధారపడటం వల్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. అప్పు, పన్నులు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తాయి. ఇవి మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేస్తాయి. ఇందులో తేడా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానిలో లేదు. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిలో ఉందని కియోసాకి పేర్కొన్నారు.పాతబడిపోయే ప్రపంచంలో జీవిస్తున్నాంప్రతి 18 నెలలకు సమాచారం పాతబడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీరు 20 లేదా 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఆర్థిక విద్యతోనే ఇప్పటికీ పనిచేస్తుంటే, మీరు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. చెడ్డ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కేవలం మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. మీ ఆలోచనా విధానం దృఢంగా లేకుంటే.. ప్రతి ఆర్థిక వ్యవస్థ చెడ్డగానే కనిపిస్తుంది. అనే విధంగా.. మీ ఆలోచనా విధానం బలంగా, విజ్ఞానవంతంగా ఉంటే, మీరు ప్రతిచోటా అవకాశాన్ని చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'పాసివ్ ఇన్‌కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు

Gold Prices Drop by Rs 1200 Check Latest Rates Hyderabad Vijayawada Delhi3
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..

ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

Aviva Bajaj Launch New Insurance Plans4
స్థిరమైన ఆదాయానికి.. సరికొత్త ప్లాన్‌!

అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్‌ నెస్ట్‌ యాన్యూటీ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. సింగిల్‌ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్‌ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్‌లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్‌ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్‌ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్‌ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్‌ రథ్‌ తెలిపారు.బజాజ్‌ లైఫ్‌ ‘యంగ్‌ అచీవర్‌ ప్లాన్‌’ బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్‌ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్‌ లైఫ్‌ యంగ్‌ అచీవర్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్‌ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యథావిధిగా కొనసాగుతుంది.ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.ఇదీ చదవండి: ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి?

Nissan GRAVITE CNG Debuts Know The Details5
ఎక్కువ మైలేజ్ కోసం ఒక్క కిట్: రూ.83 వేలతో..

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) ఆల్ న్యూ నిస్సాన్ గ్రావైట్ కోసం.. ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 82,999. ఇది దేశంలోని 16 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది.ఈ సీఎన్‌జీ కిట్‌ను మోటోజెన్ తయారు చేసి.. నాణ్యతను కూడా నిర్ధారించింది. వినియోగదారులు ఈ కిట్‌ను నిస్సాన్ అధికారిక డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కిట్‌పై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది.సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌లో రెండు 25 లీటర్ సిలిండర్లు ఉంటాయి. కాబట్టి దీనిని కారులో ఫిక్స్ చేసినప్పుడు కూడా అదే స్పేస్ ఉంటుంది. మూడో వరుస సీటింగ్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ ఖర్చుతో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు ఈ కిట్ ఏర్పాటు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు..

Stock Market Closing Update Sun Tv Network Shares Down6
మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్!

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 77,269.40 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,119.30 వద్ద నిలిచాయి.కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్‌బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాలర్ ఎస్టేట్ లిమిటెడ్, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ లిమిటెడ్, ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, మనోమయ్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, కేఎస్‌బి లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినప్పటికీ.. తమిళనాట ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. కలానిధి మారన్ స్థాపించిన 'సన్ టీవీ నెట్‌వర్క్' షేర్స్ మాత్రం భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది. సంస్థ షేర్స్ ట్రేడింగ్ క్లోసీ అయ్యే సమయానికి 5.38 శాతం పడిపోయాయి. ఉదయం 10:40 గంటలకు, సన్ టీవీ షేర్లు 8% తగ్గి ఒక్కో షేరుకు రూ. 557.65 వద్ద ట్రేడవుతున్నాయి. ఆగస్టు 2024 తర్వాత ఈ స్టాక్ ఒకే రోజులో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement