Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Vishal Mega Mart Sells Stake For Rs 7635 Crore1
విశాల్‌ మెగా మార్ట్‌లో వాటా విక్రయం

సూపర్‌ మార్కెట్‌ చైన్‌ కంపెనీ విశాల్‌ మెగా మార్ట్‌లో సమయత్‌ సర్వీసెస్‌ తాజాగా 14 శాతం వాటా విక్రయించింది. పీఈ దిగ్గజం కేదార క్యాపిటల్, స్విట్జర్లాండ్‌ కంపెనీ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన ఎస్‌పీవీ ఇది. షేరుకి రూ. 117 సగటు ధరలో 13.96 శాతం వాటాకు సమానమైన 65.25 కోట్ల షేర్లను అమ్మివేసింది.వీటి విలువ దాదాపు రూ. 7,636 కోట్లుకాగా.. విశాల్‌లో సమయత్‌ వాటా 54.09 శాతం నుంచి 40.13 శాతానికి దిగివచి్చంది. ఈ నేపథ్యంలో విశాల్‌ మెగా మార్ట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పతనమై రూ. 118 వద్ద ముగిసింది.

India First Ferrari 296 Speciale Drive Gautam Singhania2
అరుదైన కారులో గౌతమ్ సింఘానియా (వీడియో)

రేమండ్ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా మరో ఫెరారీ కారును కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కుడి చేతి డ్రైవ్ 'ఫెరారీ 296 స్పెషలే'. భారతదేశంలో కూడా ఇది మొదటి మోడల్ కావడం గమనార్హం. దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).కారు డ్రైవ్ చేస్తున్న వీడియోను గౌతమ్ సింఘానియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఫెరారీ 296 స్పెషలే (Ferrari 296 Speciale) అద్భుతమైన డిజైన్, గొప్ప పనితీరును అందిస్తుందని అభివర్ణించారు.Proud owner of the world's first Ferrari 296 Speciale Right Hand Drive — and the very first in India. 🇮🇳🏎️An exceptional blend of innovation, performance, and design — and a personal milestone I deeply value.#Ferrari296Speciale #FerrariIndia #FirstInIndia #RightHandDrive… pic.twitter.com/Qaaw2x6oAE— Gautam Singhania (@SinghaniaGautam) February 27, 2026ఫెరారీ 296 స్పెషలేఫెరారీ 296 స్పెషల్ అనేది 296 GTB ట్రాక్ ఫోకస్డ్ వెర్షన్. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 3.0 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్‌తో పనిచేస్తుంది. దాదాపు 880 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రియర్ వీల్ డ్రైవ్ ఫెరారీలలో ఒకటిగా నిలిచింది.ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్ విద్యుత్ శక్తితో మాత్రమే తక్కువ దూరాలను కూడా అనుమతిస్తుంది. ఈ కారు 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని స్పీడ్ గంటకు 330 కి.మీ కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

Why Are Highway Signs Green Know The Details Here3
అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు!

దాదాపు అందరూ భారతదేశంలోని హైవేలపై ప్రయాణించి ఉంటారు. ఆ సమయంలో మీకు అక్కడక్కగా తెల్ల రంగు అక్షరాలతో.. ఆకుపచ్చ రంగు సైన్ బోర్డులను చూసి ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా?, జాతీయ రహదారులపై ఇలాంటి రంగులోనే సైన్ బోర్డులు ఎందుకు అమర్చారో!. బహుశా దీనిగురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.డైరెక్షన్ & గైడెన్స్భారతదేశంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు & ప్రధాన జిల్లా రహదారులపై డైరెక్షన్ & గైడెన్స్ సైన్‌లు ఆకుపచ్చ రంగుపై తెల్ల రంగు అక్షరాలతో ఉంటాయి. ఇవి నగరాలు, ఎగ్జిత్, జంక్షన్లు & రూట్ నెంబర్‌లను చూపుతాయి. వేగంగా వెళ్లేవారు కూడా వీటిని వెంటనే గమనించగలరు. పగలు మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా ఈ రంగు సైన్‌లను సులభంగా చదవాలనే ఉద్దేశ్యంతో ఐఆర్సీ ఈ రంగు సైన్‌లను నిర్దేశించింది.సేఫ్టీ & విజిబిలిటీఆకుపచ్చ బోర్డుపై తెల్లని అక్షరాలు ఉండటం వల్ల దూరం నుంచి కూడా సులభంగా కనిపిస్తుంది. పగలు మాత్రమే కాకుండా.. రాత్రి సమయంలో కూడా బోర్డులు స్పష్టంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ/తెలుపు కలయిక అనేది డ్రైవర్లు ముఖ్యమైన దిశాత్మక వివరాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఆకస్మిక లేన్ మార్పులు లేదా చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి తగ్గిస్తుంది.రోడ్డు రకాల గుర్తింపుడ్రైవర్లు తాము ఎలాంటి రోడ్డుపై ఉన్నామనే విషయం తెలుసుకోవడంలో కలర్ కోడింగ్ పనికొస్తుంది. ఇవి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను మార్గాలను సూచిస్తాయి. అయితే పట్టణ లేదా నగర రోడ్లపై సంకేతాలు నీలం రంగులో ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు తాము ఏ వేగంతో ప్రయాణించాలో ముందుగానే అంచనా వేసుకోవచ్చు. దీనిద్వారా భద్రత & అవగాహన పెరుగుతుంది.ప్రశాంతతఇతర రంగులతో పోలిస్తే గ్రీన్ కలర్ ప్రశాంతతను ఇస్తుంది. అయితే హైవేపై ఉన్న కలర్ గురించి ట్రాఫిక్ కోడ్‌లలో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే గ్లోబల్ ట్రాఫిక్ డిజైన్ రీసెర్చ్ ప్రకారం.. గ్రీన్ కలర్ తటస్థమైనది. కాబట్టి హైవేపై పసుపు, ఎరుపు రంగు కాకుండా గ్రీన్ కలర్ ఎంచుకున్నారు. డైవర్లు లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు.. గ్రీన్ కలర్ చూస్తే కొంత ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.భారతీయ ప్రమాణాలుఆకుపచ్చ రంగు హైవే సంకేతాలు భారతీయ ప్రమాణాలను (IRC:67-2022) అనుసరిస్తాయి. రాష్ట్రాలు & ఎక్స్‌ప్రెస్‌వేలలో రూట్, దూర సమాచారం కోసం ఆకుపచ్చను స్థిరంగా ఉపయోగించడం ద్వారా, వివిధ ప్రాంతాలు లేదా నేపథ్యాల నుంచి వచ్చిన డ్రైవర్లు సహా, త్వరగా డీకోడ్ చేయగలరని & గందరగోళం లేకుండా సంకేతాలకు ప్రతిస్పందించగలరని ట్రాఫిక్ అధికారులు నిర్ధారిస్తారు.ఇదీ చదవండి: ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది!

Iran-Israel Conflict: Gold, Silver Prices Surge4
యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరూ సురక్షితంగా భావించే బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు.. దేశంలోని ఏ నగరంలో ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి రూ. 1,68,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 6550 పెరిగి రూ. 1,54,650 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,69,640 (రూ. 7090 పెరిగింది). 22 క్యారెట్ల రేటు రూ. 1,55,500 (రూ. 6500 పెరిగింది) వద్ద ఉంది.ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి, రూ. 1,68,860 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 6550 పెరిగి రూ. 1,54,800 వద్ద నిలిచింది.వెండి ధరలుబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 3.20 లక్షలు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 2.95 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు!

Demand for Green Buildings Over 720 Registered in Hyderabad5
హరిత భవనాలకు డిమాండ్.. హైదరాబాద్‌లో 720కి పైగా రిజిస్టర్‌!

నగరంలో పెరిగిన కాలుష్యం కారణంగా సొంతిల్లు కొనుగోలు చేసే వారు హరిత భవనాలపై ఆసక్తి చూపుతున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యకరంగా ఉంచే ఈ భవనాలకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. కాస్త ఖరీదైనా వీటివైపే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరోస్వచ్ఛమైన గాలి, వెలుతురుతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌర శక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)కి అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్‌ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు.నిత్యావసరాలకు వినియోగించే నీటిని బయటకు పంపకుండా వాటిని రీసైకిల్‌ చేసి మొక్కలు, బాత్‌రూమ్‌ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్‌ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది.అదనపు వ్యయం రెండేళ్లలో వాపస్‌..ఈ భవనాల్లో నిత్యం నీరు, విద్యుత్‌ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్‌ మెటీ రియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్‌ బిల్డింగ్స్‌ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్‌ వరకు గ్రీన్‌ ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్‌ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు.

Rising Dollar Value Boosts NRI Investment in Indian Real Estate6
పెరిగిన డాలర్ విలువ.. అపార్ట్‌మెంట్స్ కొంటున్న ఎన్‌ఆర్‌ఐలు!

ఏడాది క్రితం ఒక డాలర్‌కు రూ.85 వచ్చేవి.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.92 వచ్చే పరిస్థితి.. అంటే ఏడాదిలో 4.29 శాతం పెరిగింది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి ప్రవాసులు ఇక్కడ పెట్టుబడి కోసం అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నారు. కాకపోతే అనుకున్న వెంటనే పెట్టుబడి పెట్టగలిగేది, దీర్ఘకాలంలో లాభాలిచ్చేది స్థిరాస్తి రంగమే కావటంతో ఇటువైపు చూస్తున్నారు. ప్రధానంగా ముంబై, ఎన్‌సీఆర్‌(ఢిల్లీ), బెంగళూరు, హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రవాసులకు టైమొచ్చింది.. పెట్టుబడి అనగానే ఎన్‌ఆర్‌ఐ (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌)లకు ముందుగా గుర్తొచ్చేది మ్యూచ్‌వల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లే.. ఆ తర్వాతే స్థిరాస్తి, బంగారం వంటివి. అయితే ఇందులో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎప్పుడూ లాభాలనే తీసుకొస్తాయన్నది కాదనలేని వాస్తవం. దీంతో రియల్టీ రంగంలో ప్రవాసుల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. డాలర్‌ విలువ పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, భౌగోళిక పరిస్థితులు, ఇండియాలో సరళీకృత పన్ను విధానాలు, రెరా, జీఎస్టీలతో స్థిరాస్తి రంగంలో పెరిగిన పారదర్శకత, డిజిటల్‌ లావాదేవీల సౌలభ్యం, సులువైన ఆస్తి నిర్వహణ, పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు, అధిక లాభాలు, పన్ను మినహాయింపులు, సరళీకృత పన్ను విధానాలు అందుబాటు ధరలు.. వంటి రకరకాల కారణంగా ఎన్‌ఆర్‌ఐలు భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు.రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..భారత స్థిరాస్తి రంగం బూమ్‌లో ప్రవాసులు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ) వ్యక్తులు భాగస్వాములే.. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, కెనడా, ఆ్రస్టేలియా, పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఎక్కువగా ప్రవాసుల పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో ఎన్‌ఆర్‌ఐల వాటా 2015లో 7–10 శాతంగా ఉండగా.. 2025 నాటికి 18–20 శాతానికి పెరిగింది. 2024–25లో దేశీయ గృహ విభాగంలోకి ప్రవాసులు 85,000 నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు.ఎన్‌ఆర్‌ఐలు కొనాలంటే..ఎన్‌ఆర్‌ఐల ప్రాపర్టీ లావాదేవీలు, నిబంధనలు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఎఫ్‌ఈఎంఏ) కిందికి వస్తాయి. ప్రవాస భారతీయుడు గానీ భారత సంతతి(పీఐఓ) దేశంలోని నివాస, వాణిజ్య స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే కొనుగోళ్లలో పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే వ్యవసాయ భూమి గానీ ఫాంహౌజ్, ప్లాంటేషన్‌ ప్రాపర్టీలను మాత్రం కొనుగోలు చేసే వీలు లేదు. వీటి కొనుగోళ్లకు ఆర్‌బీఐ అనుమతి ఉండాలి. బహుమతి లేదా వారసత్వంగా పొందిన ప్రాపర్టీలకు మాత్రమే యాజమాన్య హక్కులు ఉంటాయి. ప్రాపర్టీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకుండా ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల ద్వారా కొనుగోళ్లు భారత రూపాయిలలో జరుగుతాయి. ప్రవాసులు కొనుగోలు చేసే ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాలకు పన్ను మినహాయింపు(టీడీఎస్‌) 12.5 శాతం, స్వల్పకాలిక మూధన లాభాలు 30 శాతం మినహాయింపు ఉంటుంది.విక్రయించాలనుకుంటే..ఫెమా నిబంధనల ప్రకారం ఎన్‌ఆర్‌ఐ సొంత ఆస్తి, వారసత్వంగా పొందిన నివాస, వాణిజ్య స్థిరాస్తిని దేనినైనా విక్రయించే వీలుంది. ఒకవేళ ఎన్‌ఆర్‌ఐకి వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమి, ప్లాంటేషన్, ఫాంహౌజ్‌ గానీ ఉంటే దాన్ని విక్రయించాలనుకుంటే మాత్రం కేవలం స్థానికులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇతర ఎన్‌ఆర్‌ఐ లేదా భారత సంతతికి గానీ గిఫ్ట్‌గా అందించవచ్చు. అలాగే ప్రవాసులకు అద్దె ఆదాయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.హైదరాబాద్‌లో ప్రవాసుల పెట్టుబడులు..అమెరికా, ఆ్రస్టేలియా దేశాల్లో నివాసం ఉంటున్న సిటీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు రూ.3 కోట్లు, ఆపై విలువ ఉన్న ప్రాపర్టీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024–25లో నగరంలో ప్రవాసులు రూ.6,800 కోట్లు–రూ.10,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువగా ఉండటం ప్రవాసులకు కలిసొస్తుంది. కొంత కాలంగా స్థిరాస్తి మార్కెట్‌లో ఆశించిన జోరు లేకపోవడంతో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఇంటి రుణాలు తీసుకొని మరీ నగరంలో ఉంటున్న వారి తల్లిదండ్రులకు పంపించి ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. విల్లాల కంటే ఫ్లాట్ల కొనుగోళ్లకే ప్రవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉండటం, అద్దె కూడా వస్తుండటం దీనికి ప్రధాన కారణాలు. పైగా నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. కోట్లు వెచ్చించి విల్లా కొనుగోలు చేసినా.. త్వరగా అద్దెకు పోదు. అందుకే అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లకే ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు.కొనేముందే పరిశీలించాలియాజమాన్య హక్కులు, పత్రాలు, టైటిల్స్‌ సరిగా ఉన్నాయో లేదో నిపుణులు, న్యాయవాదులతో తనిఖీ చేయించాలి. యాజమాన్య హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? వారసత్వంగా వచ్చిందా? సంయుక్త భాగస్వామ్యంగా ఉందా? బ్యాంకులో తనఖా కింద ఉందా? వంటి కోణాల్లో ఆరా తీయాలి.స్థిరాస్తిని కొనుగోలు చేసేముందు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాలి. నీరు, విద్యుత్‌ వంటి బిల్లులు చెల్లించారో లేదో పూర్తిగా పరిశీలించాలి.కొత్త నిర్మాణాల్లో అయితే ల్యాండ్‌ టైటిల్స్‌ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థల నుంచి అన్ని రకాల నిర్మాణ అనుమతులు, ఎన్‌ఓసీలను తీసుకున్నారా లేదా గమనించాలి.నిర్మాణంలో ఉంటే.. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేస్తుంటే.. పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీఓఏ)ను ఇవ్వాల్సిందిగా డెవలపర్‌ను కోరాలి. దీన్ని డాక్యుమెంటేషన్‌ చేసుకోవడం మంచిది. సులభతరం కూడా.. పీఓపీ పొందిన వ్యక్తి ద్వారా మీ ప్రాపర్టీ కాంట్రాక్ట్‌కు గానీ మార్ట్‌గేజ్‌కు గానీ లేదా అమ్మకానికి గానీ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా సంబంధిత ప్రాపర్టీని డిస్పోజల్‌ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్వాదీనం, అగ్రిమెంట్‌ వంటి విషయంలో పీఓపీ ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి.

Advertisement
Advertisement
Advertisement