Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Notifies Online Gaming Law Ban on Money Games Boost Esports Social Play1
ఆన్‌లైన్‌ గేమింగ్‌ కొత్త నిబంధనలు

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టపరమైన ప్రక్రియలు, కొత్త నిబంధనలను కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ ఏర్పాటుకు కూడా వీలు కల్పిస్తాయి. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ.. ఈస్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషల్‌ గేమింగ్‌ను ప్రోత్సహించడం ఈ చట్టం ఉద్దేశం. చట్ట ప్రకారం ఇప్పటికే నిషేధించిన రియల్‌ మనీ గేమ్స్‌ కాకుండా చాలా వరకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ తెలిపారు.కేవలం నిర్ధిష్ట కేసుల్లోనే పర్యవేక్షణ ఉంటుందన్నారు. చట్టం కింద ఈస్పోర్ట్స్‌ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘వీలున్నంత వరకు నియంత్రణలను సులభతరంగా ఉంచాలన్నదే మా ఉద్దేశం. మనీ గేమ్స్‌ కాని చాలా వరకు గేమ్స్‌ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ మనీ గేమ్‌ లేదా ఆన్‌లైన్‌ సోషల్‌ గేమ్‌ లేదా ఈస్పోర్ట్స్‌లో ఏదన్నది నిర్ధారించుకోవాలంటూ ఎవరినీ బలవంతం చేయడం లేదు’’అని కృష్ణన్‌ పేర్కొన్నారు. కొత్త నిబంధనల్లో యూజర్ల భద్రతా సదుపాయాలను సైతం నిర్వచించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు

India D2C growth powered by Tier 2, 3 cities with 66 percent in FY 20262
డీ2సీ బ్రాండ్లకు చిన్న నగరాల్లో ఆదరణ 

న్యూఢిల్లీ: డైరెక్ట్‌ టు కన్జ్యూమర్‌ బ్రాండ్లు (డీ2సీ) మెట్రో నగరాలను దాటి, ద్వితీయ (టైర్‌–2), తృతీయ శ్రేణి (టైర్‌–3) నగరాల్లో కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. ప్రముఖ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికామర్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డీ2సీ బ్రాండ్లకు వచి్చన కొత్త ఆర్డర్లలో 66 శాతం వాటా ఈ చిన్న పట్టణాల నుంచే ఉండడం విశేషం. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో వస్తున్న మార్పులను ఇది ప్రతిఫలిస్తోంది. 2025–26లో డీ2సీ బ్రాండ్లకు నికరంగా పెరిగిన గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ/ స్థూల ఉత్పత్తుల విక్రయ విలువ)లో 60 శాతం చిన్న నగరాల నుంచే ఉంది. మెట్రో నగరాలకు వెలుపల డీ2సీ బ్రాండ్లకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. సంప్రదాయ బ్రాండ్ల మాదిరి డీలర్లు, హోల్‌సేలర్లు, రిటైల్‌ సంస్థల ప్రమేయం లేకుండా.. ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్, సొంత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించే ఉత్పత్తులను డీ2సీ బ్రాండ్లుగా చెబుతారు. చిన్న నగరాలే ఆశాకిరణం.. డీ2సీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు చూపించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో (2024–25) పోలి్చతే ఆర్డర్ల పరంగా 33 శాతం, విక్రయాల విలువలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 10–12 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.1.11 లక్షల కోట్లు) ఉన్న భారత డీ2సీ మార్కెట్, 2030 నాటికి 60 బిలియన్‌ డాలర్లకు (రూ.5.58 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా నాలుగు రెట్లు పెరగనుంది. డెలివరీ వ్యవస్థలో మెరుగుదల వల్ల ఆర్డర్లు వెనక్కి రావడం 39 శాతం నుంచి 21 శాతానికి తగ్గనున్నట్టు పేర్కొంది. టెక్నాలజీతో చేరువ.. ఆర్డర్ల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ), చాట్‌ ఆధారిత సేవల వాడకం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగతీకరించిన షాపింగ్‌ అనుభవం వల్ల బ్రాండ్ల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఆన్‌లైన్‌ వ్యాపారం ఇకపై కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాబోదని, మారుమూల ప్రాంతాలు వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని విశ్లేషించింది. సుమారు 40 కోట్ల ఆర్డర్ల డేటాను విశ్లేషించి యూనికామర్స్‌ ఈ నివేదికను రూపొందించింది.

Radisson Hotel Group plans to 65,000 to 80,000 jobs in India by 20303
భారత్‌లో 500 హోటల్స్‌ లక్ష్యం

న్యూఢిల్లీ: భారత్‌లో 2030 నాటికి ప్రాపర్టీల సంఖ్యను 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాడిసన్‌ హోటల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎలీ యూనిస్‌ తెలిపారు. దీనితో 60,000–80,000 వరకు ఉద్యోగావకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా రిక్రూట్‌ చేసుకోవడం కోసం ఉద్యోగార్థులకి శిక్షణ కలి్పంచేందుకు టూరిజం, హాస్పిటాలిటీ స్కిల్‌ కౌన్సిల్, స్థానిక వర్సిటీలు, ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాడిసన్‌కి 200 పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రథమ నుంచి నాలుగో శ్రేణి నగరాలవ్యాప్తంగా కొత్త హోటల్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు యూనిస్‌ చెప్పారు. వీటిల్లో 15 శాతం ఫైవ్‌ స్టార్‌వి, 45–50 శాతం అప్‌స్కేల్, త్రీ–స్టార్, ఫోర్‌–స్టార్‌ హోటల్స్‌ ఉంటాయని వివరించారు. కొత్తగా చేపట్టే వాటిల్లో 55 శాతం ప్రాజెక్టులు ప్రథమ శ్రేణి, 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటాయని యూనిస్‌ వివరించారు. 10 శాతం రిసార్టుల్లో, ఇంకో 10 శాతం ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఉంటాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ప్రస్తుతం భారత్‌లో వ్యాపారం యథావిధిగానే నడుస్తోందని యూనిస్‌ వివరించారు. దుబాయ్, సౌదీ అరేబియాలాంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. తమకు అంతర్జాతీయంగా టాప్‌ 3 కీలక మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని ఆయన చెప్పారు.

West Asia crisis poses risks to India trade and macroeconomic stability4
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు.. 

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్‌ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్‌ ట్రేడ్‌ వాచ్‌ రిపోర్టులో నీతి ఆయోగ్‌ ఈ విషయాలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్‌పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్‌–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్‌ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్‌ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్‌ సగటున 6 శాతం వృద్ధి చెందింది. → రత్నాభరణాల రంగం మిడ్‌–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి. → డిజైన్‌ ఆధారిత తయారీ, క్లస్టర్‌ ఆర్‌అండ్‌డీ, జీఐ బ్రాండెడ్‌ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. → డ్యూటీ డ్రాబ్యాక్‌/ రీఫండ్స్‌ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి. → రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్‌ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్‌ ఫైనాన్స్‌ను మెరుగుపర్చాలి. → 2026 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. → మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది. → రత్నాభరణాల రంగంలో భారత్‌ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్‌ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్‌ వాటా 60 శాతంగా ఉంది.

Donald Trump Hails Tim Cook as Apple Greatest Leader Surpassing Steve Jobs5
టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు

టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యాపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి చేర్చడంలో టిమ్‌ పాత్ర అనిర్వచనీయమన్నారు. స్టీవ్ జాబ్స్ హయాంలో కూడా యాపిల్ ఈ స్థాయికి చేరుకునేది కాదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.స్టీవ్ జాబ్స్ కంటే కుక్ మేటి!సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుంది. కానీ, ట్రంప్ తన విశ్లేషణలో టిమ్ కుక్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. ‘నేను ఎల్లప్పుడూ టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ పెద్ద అభిమానిని. అయితే, ఒకవేళ స్టీవ్ జాబ్స్ అకాల మరణం చెందకుండా టిమ్ కుక్ బదులుగా ఆయనే సంస్థను నడిపించి ఉంటే.. యాపిల్ కచ్చితంగా బాగా పనిచేసేది, కానీ టిమ్ హయాంలో ఉన్నంత ఉన్నత స్థితికి మాత్రం చేరుకునేది కాదు’ అని ట్రంప్ అన్నారు.సమస్యల పరిష్కర్తగా కుక్..తమ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ టిమ్ కుక్ పనితీరును ట్రంప్ కొనియాడారు. తన మొదటి టర్మ్ ప్రారంభంలో టిమ్‌ చేసిన ఒక ఫోన్ కాల్ తమ స్నేహానికి పునాది వేసిందని ఆయన తెలిపారు. ‘సాధారణంగా కంపెనీలు కన్సల్టెంట్లకు మిలియన్ల డాలర్లు చెల్లిస్తాయి, కానీ పని పూర్తి కాదు. కానీ కుక్ నేరుగా నాకు కాల్ చేసి సమస్యను వివరించేవారు. ఆయన అడిగే విధానం, సమస్యలోని తీవ్రత నాకు నచ్చేవి. నేను వెంటనే వాటిని పరిష్కరించేవాడిని’ అని ట్రంప్ పేర్కొన్నారు. టిమ్‌ కేవలం తన పనే కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో ట్రంప్ గుర్తుచేశారు. కుక్ ఒక నమ్మశక్యం కాని వ్యక్తి అని, ఆయన కెరీర్ సాటిలేనిదని ప్రశంసించారు.15 ఏళ్ల ప్రస్థానం..దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు.ఇంజినీర్ నుంచి గ్లోబల్ లీడర్ వరకు..టిమ్ కుక్ ప్రయాణం ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌తో మొదలైంది. ఐబీఎంలో 12 ఏళ్లు, ఆపై కాంపాక్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యాపిల్‌ చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో కంపెనీ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించి, లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత స్టీవ్‌జాబ్స్‌ మరణానంతరం సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం యాపిల్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన విభాగం. అటువంటి సంస్థను విజయవంతంగా నడిపిన కుక్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

CBI Raids Reliance Communications Over Alleged LIC Bond Irregularities6
రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై సీబీఐ పంజా

ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్రగామిగా వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కు జారీ చేసిన బాండ్లు, రుణ పత్రాల (డిబెంచర్స్‌) వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం కంపెనీకి చెందిన వివిధ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.రికార్డుల స్వాధీనం - సోదాల వివరాలురిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన నవీ ముంబై ప్రధాన కార్యాలయంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా 2009 నుంచి 2016 మధ్య కాలంలో ఎల్‌ఐసీకి జారీ చేసిన బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్స్‌కు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నవీ ముంబై కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగే కీలక ప్రాంతాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, అంతర్గత ఈమెయిల్స్, ఆర్థిక లావాదేవీల చిట్టాను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ దర్యాప్తు ప్రధానంగా 2009-2016 మధ్య జరిగిన లావాదేవీలపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ సమయంలో కంపెనీ నిధుల సేకరణ కోసం అనుసరించిన మార్గాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన ఆరోపణ.దర్యాప్తు వెనుక అసలు కారణం?ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ మొత్తంలో నిధులను సేకరించింది. అయితే ఈ డిబెంచర్లు, బాండ్ల జారీ సమయంలో కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపించిందా? లేదా నిధుల మళ్లింపు జరిగిందా? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా పబ్లిక్ మనీ ఉన్న ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కంపెనీ వైఫల్యం చెందడం, అంతకుముందు జరిగిన ఒప్పందాల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఈ సోదాలకు దారితీశాయి.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Advertisement
Advertisement
Advertisement