Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Lowered AI entry barriers accelerating business from SMEs1
ఏఐతో ఉత్పాదకత పెరుగుతుంది 

న్యూఢిల్లీ: కంపెనీలు మరిన్ని లాభాల కోసమే కృత్రిమ మేథ (ఏఐ) జపం చేస్తున్నాయనే అభిప్రాయం మారాల్సిన అవసరం ఉందని సేల్స్‌ఫోర్స్‌ దక్షిణాసియా ప్రెసిడెంట్‌ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. దీనితో ఉత్పాదకత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, వైద్యం..విద్యలాంటి సేవలను గణనీయంగా విస్తరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏజెంటిక్‌ ఏఐ వల్ల ఉద్యోగాల తొలగింపు కన్నా ఉద్యోగులకు మరింత సాధికారత లభిస్తుందని వివరించారు. ఏఐ శకంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు పెరిగే కొద్దీ ఆసుపత్రులు కిక్కిరిసిపోయే అవకాశం ఉందని .. అలాంటి పరిస్థితుల్లో ఏజెంటిక్‌ ఏఐ, డిజిటల్‌పరమైన మద్దతుతో వాటిపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ వ్యవస్థ విషయానికొస్తే రోగ లక్షణాలను రికార్డ్‌ చేసేందుకు, పేషంటును చూడటానికి ముందే డాక్టరుకు ప్రాథమిక విశ్లేషణ ఇచ్చేందుకు ఏజెంటిక్‌ ఏఐ ఉపయోగపడుతుందని భట్టాచార్య చెప్పారు. టెక్నాలజీ, యూపీఐలాంటి ప్లాట్‌ఫాంల వల్లే బ్యాంకింగ్‌ పరిధిలోని వారికి కూడా సరీ్వసులను విస్తరించేందుకు వీలయ్యిందన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా సేల్స్‌ఫోర్స్‌కి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటిగా కొనసాగుతోందని ఆమె చెప్పారు.

SBI expects to maintain a 3percent net interest margin says Chairman CS Setty2
3 శాతం ‘నిమ్‌’ సాధిస్తాం 

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ఎంపీసీ డిసెంబర్‌ సమీక్షలో రెపో రేటును పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తాము పెట్టుకున్న 3 శాతం నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) లక్ష్యాన్ని సాధిస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో రేటు కోత ఉంటే, అది పావు శాతం మించకపోవచ్చన్నది తమ అంచనా అని చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై పెద్ద ప్రభావం ఉండదన్నారు. రేటు తగ్గింపునకు అవకాశం ఉందని, ఈ విషయాన్ని గత సమీక్ష సందర్భంగానే పేర్కొన్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఈ వారం మొదట్లో ప్రకటించడం గమనార్హం. దినికితోడు స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో వచ్చే ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు పెరిగిపోయాయి. సెపె్టంబర్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.5 శాతంగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) 7 శాతంగా ఉండొచ్చని శెట్టి అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధి రేటు, సానుకూల ద్రవ్యోల్బణం పరిస్థితులతో రేట్ల కోతకు అవకాశాలున్నట్టు చెప్పారు. పలు మార్గాలున్నాయ్‌.. ఆర్‌బీఐ ఈ ఏడాది ఒక శాతం వరకు రేట్లు తగ్గించడంతో మార్జిన్లను కాపాడుకోవడం బ్యాంకులకు సవాలుగా మారిన తరుణంలో.. తన మార్జిన్లను కాపాడుకునేందుకు ఎస్‌బీఐకి పలు చోదకాలున్నట్టు శెట్టి పేర్కొన్నారు. ‘‘సీఆర్‌ఆర్‌ ఒక శాతం కోత పూర్తిగా అమల్లోకి రావడంతో దీనివల్ల వడ్డీ ఆదాయం మెరుగవుతుంది. రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. గడువు ముగిసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లు అమలు చేయడంతోపాటు, సేవింగ్స్‌ డిపాజిట్లపై 0.2 శాతం వడ్డీ రేటు తగ్గించడం వల్ల మార్జిన్ల పరంగా ప్రయోజనం కలుగుతుంది’’అని శెట్టి వివరించారు. ఎస్‌బీఐ ఆస్తుల్లో కేవలం 30 శాతమే ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆఫ్‌ రెపో రేటుతో అనుసంధామైనవిగా చెప్పారు. దీనివల్ల ఆర్‌బీఐ రేట్ల కోత చేపట్టినప్పుడు మూడింట ఒక వంతు రుణాల రేట్లను మార్చాల్సి వస్తుందని, దీంతో మార్జిన్లపై ఒత్తిడి పరిమితంగానే ఉంటుందని వివరించారు. సెపె్టంబర్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ నిమ్‌ 2.93 శాతంగా ఉండడం గమనార్హం.

India quick commerce sector now employs 450,000-500,000 monthly3
గిగ్‌ వర్కర్లకు భారీ డిమాండ్‌

కరోనా మహమ్మారి తలెత్తిన తదుపరి దేశీయంగా ఊపిరిపోసుకున్న క్విక్‌ కామర్స్‌ సర్వీసులు మరింత క్విక్‌గా విస్తరిస్తున్నాయి. నిజానికి తొలుత ఈకామర్స్‌ కంపెనీల సర్వీసులకు డిమాండ్‌ ఊపందుకోగా.. ఆపై ఇది క్విక్‌ సర్వీస్‌ కంపెనీలకు వ్యాప్తించింది. దీంతో గిగ్‌ వర్కర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం గిగ్‌ వర్కర్ల భద్రతకు కొత్త చట్టాలను తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాలు చూద్దాం.. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా క్లిక్‌ తదితర పలు ఈకామర్స్‌ దిగ్గజాలు ఇంటివద్దకే వస్తువులను అందించడం ద్వారా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. ఈ బాటలో ఫుడ్‌ డెలివరీ కోసం ఏర్పాటైన ఎటర్నల్‌(గతంలో జొమాటో), స్విగ్గీ వేగవంత సర్వీసులను అందించడం ద్వారా పలు నగరాలలో చొచ్చుకుపోయాయి. గ్రోసరీస్‌ను త్వరితగతిన అందించేందుకు తెరతీసిన బ్లింకిట్, బిగ్‌బాస్కెట్‌ సైతం వినియోగదారులను త్వరితగతిన ఆకట్టుకున్నాయి. మరోపక్క అర్బన్‌ కంపెనీ, నోబ్రోకర్‌ తదితరాలు గృహ పరిరక్షణ, వస్తు సేవల సంబంధ సర్వీసులను సైతం అందించడం ద్వారా వేగంగా బిజినెస్‌ను విస్తరిస్తున్నాయి. కాగా.. 10 నిముషాలలో గ్రోసరీస్‌ను డెలివరీ చేయడం ద్వారా ప్రధానంగా బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌ బిజినెస్‌లను భారీగా విస్తరిస్తున్నాయి. ఇవికాకుండా క్యాబ్, బైక్‌ ట్యాక్సీ సేవలను సమకూర్చేందుకు ఆవిష్కృతమైన ఓలా, ఉబర్, ర్యాపిడో సైతం ప్రధాన నగరాలలో సర్వీసులను భారీగా విస్తరిస్తున్నాయి. వెరసి కొద్ది నెలలుగా గిగ్‌ వర్కర్లకు దేశీయంగా డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. గ్రోసరీ డెలివరీలు జూమ్‌ బ్లింకిట్‌(ఎటర్నల్‌), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌ సుమారు 10 నిముషాల్లోనే వినియోగదారులకు సరుకులను డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇందుకు భారీస్థాయిలో డెలివరీ వర్కర్లను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా సరుకులను నిల్వపెట్టుకునేందుకు వీలుగా డార్క్‌ స్టోర్లను సైతం విస్తారంగా ఏర్పాటు చేస్తున్నాయి. తద్వారా ఆయా ప్రాంతాలలో వేగవంత డెలివరీలను చేపట్టగలుగుతున్నాయి. దీనిలో గిగ్‌ వర్కర్లే ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో భారీగా నియమించుకుంటున్నాయి. 70–80% అప్‌ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ వినియోగదారులను ఆకట్టుకుంటుండటంతో వినియోగదారుల ఇంటివద్దకే డెలివరీలు అందించేందుకు గిగ్‌ వర్కర్ల నియామకం ఇటీవల ఊపందుకుంది. ఫలితంగా బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో సగటున నెలకు 4,50,00 నుంచి 5,00,000 మందిని నియమించుకుని సర్వీసులు అందిస్తున్నాయి. ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, మానవ వనరుల సంస్థలు అందించిన వివరాల ప్రకారం గతేడాది(2024)లో ఈ కంపెనీలన్నీ సగటున 2,50,000 నుంచి 3,00,000 మందిని వినియోగించుకున్నాయి. ఈ ఏడాది జూలై–సెపె్టంబర్‌ కాలాన్ని తీసుకుంటే జొమాటో 5.5 లక్షల మంది నెలవారీ యాక్టివ్‌ డెలివరీ పార్ట్‌నర్స్‌తో బిజినెస్‌ నిర్వహిస్తోంది. మాతృ సంస్థ ఎటర్నల్‌ వివరాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 11 శాతం అధికం. స్విగ్గీ మరింత అధికంగా 6.9 లక్షల మందిని డెలివరీ సర్వీసులకు వినియోగించుకుంటోంది. గతేడాదితో పోలిస్తే సంఖ్య 32 శాతం జంప్‌చేసింది. ప్రధాన నగరాల హవా ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగర ప్రాంతాలలో క్విక్‌ సర్వీసులకు భారీ డిమాండ్‌ కనిపిస్తున్నట్లు స్టాఫింగ్‌ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇటీవల ఫుడ్‌ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్విక్‌ కామర్స్‌ కంపెనీలు వేతన సంబంధ ప్రోత్సాహకాలివ్వడం ద్వారా డెలివరీ పార్ట్‌నర్స్‌ను సర్వీసులలో కొనసాగించుకోగలుగుతున్నట్లు తెలియజేశాయి. డార్క్‌ స్టోర్లలో విశ్రాంతికి సైతం వీలుండటం డెలివరీ పార్ట్‌నర్స్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు వివరించాయి. డెలివరీల జోరు సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో బ్లింకిట్‌ 22.3 కోట్ల ఆర్డర్లను డెలివరీ చేసింది. వార్షికంగా ఇది 140 శాతం పురోగతికాగా.. ఇన్‌స్టామార్ట్‌ 49 శాతం అధికంగా 10.1 కోట్ల డెలివరీలను పూర్తిచేసింది. బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్‌ అంచనాల ప్రకారం ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌ కంపెనీల 10 నిముషాల డెలివరీలు నిర్వహించేందుకు 2030కల్లా 15 లక్షల మంది పార్ట్‌నర్స్‌ను నియమించుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా డార్క్‌ స్టోర్ల ద్వారా ఇందుకు దన్నుగా ప్యాకింగ్, పికప్‌ సేవలకు మరో 2,00,000 నుంచి 3,00,000 మంది గిగ్‌ వర్కర్స్‌ అవసరం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే బ్లింకిట్‌ 1,816 డార్క్‌ స్టోర్లను ఏర్పాటు చేసుకోగా.. ఇన్‌స్టామార్ట్‌ 1,102 స్టోర్లు, జెప్టో 1,000 స్టోర్లు నిర్వహిస్తున్నాయి. 2027కల్లా మొత్తం డార్క్‌ స్టోర్లను 3,000కు పెంచుకోవాలని బ్లింకిట్‌ ప్రణాళికలు అమలు చేస్తుండటం గమనార్హం! – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ Quick Commerce (1166213)e-commerce (756092)gig workers (1163850)huge demand (1057581)Central Government (1166326)New laws (107113

staircase of SBI branch demolished during an anti encroachment drive4
నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..

ఒడిశాలోని భద్రక్ జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన చర్చనీయాంశమైంది. అక్రమ నిర్మాణాల తొలగింపు (ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్) సందర్భంగా బ్యాంకు మొదటి అంతస్తు కార్యాలయానికి ఉన్న మెట్లను కూల్చివేశారు. దాంతో కస్టమర్లు, సిబ్బంది బ్యాంకు సర్వీసులు పొందడానికి తాత్కాలికంగా ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చిన నిచ్చెన ద్వారానే బ్యాంకులోకి ప్రవేశించాల్సిన పరిస్థితి నెలకొంది.మెట్లు కూల్చివేతభద్రక్ రైల్వే స్టేషన్ నుంచి చరంపా మార్కెట్ వరకు నవంబర్ 20, 21 తేదీల్లో పెద్ద ఎత్తున క్లియరెన్స్ ఆపరేషన్ జరిగింది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఎస్‌బీఐ భవనం ముందు భాగం మెట్లతో సహా అనేక దుకాణాలు, ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయడానికి ముందుగా బహిరంగ ప్రకటనలు చేసి ఆక్రమణదారులకు రెండు రోజుల సమయం ఇచ్చామని అధికారులు చెప్పారు. చాలా మంది దుకాణదారులు స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలిపారు.SBI, Bhadrak (Odisha).Anti-encroachment drive demolished the bank branch's staircase.Customers are measuring ladder which is placed over tractor-trolley to access the bank.Several questions to ask. But .. leave it! India is not for beginners 😒 pic.twitter.com/tvAgpMZCyi— The Hawk Eye (@thehawkeyex) November 25, 2025అయితే బ్యాంకు భవన యజమానికి అక్రమ నిర్మాణాలపై అనేక నోటీసులు వచ్చినా ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచారం. సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చివేత ప్రక్రియ జరిగింది.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్‌ గట్టి దెబ్బ

Cabinet approved Rs 7280 cr scheme promote manufacturing rare earth magnets5
భారత్‌లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు

భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం రూ.7,280 కోట్ల భారీ పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ‘సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించే పథకం’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.ఈ పథకం ద్వారా దేశీయంగా అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా 6,000 ఎంటీపీఏ (సంవత్సరానికి మెట్రిక్ టన్) సామర్థ్యంతో అరుదైన లోహ అయస్కాంతాలను తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.కీలక రంగాల్లో వీటి ఉపయోగంఈ అరుదైన లోహ అయస్కాంతాలు అనేక కీలక, అత్యాధునిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. వీటిలో కింది విభాగాలున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు)ఏరోస్పేస్ఎలక్ట్రానిక్స్వైద్య పరికరాలురక్షణ రంగంలబ్ధిదారులకు కేటాయింపు, ప్రోత్సాహకాలు.దేశీయంగా ఈ విభాగంలో తయారీని వేగవంతం చేసేందుకు ఈ పథకం ప్రపంచ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు లబ్ధిదారులకు కేటాయించాలని భావిస్తోంది. ప్రతి లబ్ధిదారునికి 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు కేటాయించనున్నారు.పథకం కాలపరిమితిఈ ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారీ సదుపాయాన్ని ప్రోత్సహించే పథకం వ్యవధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాలు ఉంటాయి. ఆర్ఈపీఎం అమ్మకంపై ప్రోత్సాహకాన్ని పంపిణీ చేయడానికి 5 సంవత్సరాలు గడువు నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్‌ గట్టి దెబ్బ

CITES CoP20 in Samarkand formally endorsed Vantara initiative6
ఐరాస సంస్థ ‘సైట్స్‌’ మెచ్చిన వంతారా

జంతు సంరక్షణలో ఇండియాలోని రిలయన్స్‌ ఆధ్వర్యంలో ఉన్న వంతారా వండి సంస్థలు చూపుతున్న నిబద్ధతను ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్‌లో విస్తృత పరిశీలన జరిపి 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరుగుతోంది. సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. "ఈ కేంద్రాలు జంతువులను సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు" అని తెలిపింది.వంతారా అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ తెలిపింది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ కీలకంగా ప్రస్తావించిన అంశం. భారత్‌కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది. జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు లేవని తెలిపింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

Advertisement
Advertisement
Advertisement