Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Middle Class Faces Financial Insecurity1
వాయిదాల వార్నింగ్‌!

ఆదాయాలు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ఎదిగి... ఎగువ మధ్య తరగతిగా మారుతోంది. కాకపోతే ఈ ఆదాయాలతో పాటు ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. ఇది సహజమే. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే చిక్కల్లా... మధ్య తరగతి పొదుపు తగ్గుతుండటమే. ఎందుకంటే దేశంలో పొదుపు మొత్తాల శాతం దశాబ్దాల కనిష్ఠానికి చేరిపోతోంది. ఇది నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ప్రమాదకరమైన ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది. అదేంటంటే... ఈఎంఐల ఉచ్చు. ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్లు, విహారయాత్రలు, విద్య... ఇలా ప్రతిదీ ఇపుడు ‘సులభతరమైన’ నెలవారీ వాయిదాల్లో దొరికేస్తోంది. దీనికి కంపెనీలు పెడుతున్న ముద్దుపేరు బీఎన్‌పీఎల్‌. ఇప్పుడు కొనండి... తరువాత చెల్లించండి. ఈ ఈజీ కొనుగోళ్ల మాయలో పడి ఆర్థిక ప్రణాళికలను, క్రమశిక్షణను అటకెక్కించే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్నుంచి బయటపడకపోతే ఉచ్చులో చిక్కుకుని ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలంటూ హెచ్చరిస్తున్నదే ఈ ‘వెల్త్‌ స్టోరీ’.ఈఎంఐల సమస్య ఎకాయెకిన కాకుండా నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మొదలవుతోంది. క్రమంగా పెనుభారంగా మారి కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తోంది. తామరతంపరగా పెరిగిపోయే ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో సింహభాగాన్ని తినేస్తున్నాయి. అప్పులకు, ఇంటి అవసరాలకు చెల్లించేయగా.. చివరికి పొదుపు చేసేందుకు పైసా మిగ లని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు పొదుపు వాయిదా పడిపోతుంది. ఇది ఒక స్థాయిని చేరాక పొదుపు సంగతి పక్కనబెడితే ఖర్చులకూ సరిపోని పరిస్థితి. వీటికి తోడు ఊహించని విధంగా ఏ చిన్న కుదుపు వచ్చినా (ఉద్యోగం పోవడం, వైద్యం ఖర్చుల్లాంటివి) అప్పుల కోసం హైరానా పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటోంది. గృహ రుణం ఈఎంఐ, కారు రుణం ఈఎంఐ, వ్యక్తి గత రుణం లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐ, విద్యారుణం ఈఎంఐ ఇలా ప్రతి దానికి ఈఎంఐలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.లెక్కేసుకుంటే.. .సాధారణంగా ఈఎంఐల గురించి ఫైనాన్షియల్‌ ప్లానర్లు చెప్పే సూత్రం ఒకటి ఉంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐల భారం 30–35 శాతానికి మించకూడదు. కానీ వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో వాయిదాల భారం 50–60 శాతం పైగా ఉంటోంది. ఇక క్రెడిట్‌ కార్డ్‌ రోలోవర్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి నెలా అలా పెరుగుతూనే ఉంటోంది. డిఫాల్ట్‌ ముప్పును అటుంచితే కనీసం ఊపిరి కూడా తీసుకోలేని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది.ఈ సమస్య ఎందుకింత వేగంగా పెరుగుతోంది.. అప్పులు, ఈఎంఐల సమస్య వేగంగా పెరుగుతుండటానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని... రుణాలు సులువుగా దొరకడం ఇప్పుడు రుణం తీసుకోవడమనేది గతంలోలాగా సుదీర్ఘ ప్రక్రియగా ఉండటం లేదు. క్షణాల్లో లోన్స్‌ కి అప్రూవల్‌ లభిస్తోంది. నిమిషాల్లో క్రెడిట్‌ అయి పోతోంది. జీవన విధానంపరమైన ద్రవ్యోల్బణం జీతం పెరిగిందంటే చాలు లైఫ్‌ స్టయిల్‌ని కూడా మార్చేసే ధోరణి ఉంటోంది. దానికి తగ్గట్లుగా లోన్‌ తీసుకోవడం, ఇంకో కొత్త ఈఎంఐని జోడించుకోవడం చక చకా జరిగిపోతోంది. ‘‘నో–కాస్ట్‌ ఈఎంఐ’’ భ్రమ అసలు వడ్డీ ప్రసక్తే ఉండదు.. తీసుకున్నంతే కట్టొచ్చు అని ఆర్థిక సంస్థలు ఊరిస్తుంటాయి. కానీ మన లెక్కకు అందని, మనకు తెలియని వడ్డీ ఎంతో కొంత ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. సామాజిక ఒత్తిళ్లు వచ్చినదానితో ఇంట్లో ఎంతగా సర్దుకుని ఉందామనుకున్నా హంగులు, ఆర్భాటాలు లేకపోతే ఉపయోగం లేదు అనే రకంగా సామాజిక ఒత్తిడి ఉంటోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్స్‌ లాంటివి విజయానికి గుర్తుల్లాగా ఉంటున్నాయి. చెల్లించుకోక తప్పదు మూల్యం.. ఈఎంఐలు అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్ల చాలా దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఎమర్జెన్సీ నిధి అనేది ఎప్పటికీ ఏర్పాటు చేసుకోలేం. పిల్లల చదువులకు సంబంధించిన ప్రణాళికలు దెబ్బతింటాయి. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేద్దామనుకున్నా నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంటుంది. వీటన్నింటి వల్ల శాశ్వత ప్రాతిపదికన ఒకే ఒక్కటి లభిస్తుంది. అదేంటంటే మానసిక ఒత్తిడి. చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ ట్రబుల్‌ అనేది ఆసుపత్రి వ్యయాల రూపంలో కూతవేటు దూరంలోనే ఉంటుంది.మూడు ప్రశ్నలు.. ఏ రుణం తీసుకోవాలన్నా ముందుగా మీకు మీరు ఓ మూడు ప్రశ్నలు వేసుకోండి. అవేంటంటే.. → ఈ ఈఎంఐ తీసుకున్న తర్వాత కూడా పొదుపును యథాప్రకారం కొనసాగించగలనా? → ఒక 3 నెలల పాటు ఆదాయం రాకపోయినా కూడా ఈఎంఐలను కట్టగలనా? → ఈఎంఐపై కొనుక్కుంటున్నదేదైనా సరే నా భవిష్యత్తును మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందా, లేక కేవలం లైఫ్‌స్టయిల్‌కే పనికొచ్చేదా? వీటిల్లో దేనికైనా సరే జవాబు ‘‘నో’’ అని వస్తే.. కాస్త ఆలోచించండి. చివరిగా చెప్పేదేమిటంటే.. రుణాలు, ఈఎంఐలనేవి చెడ్డవి కావు. కాకపోతే ఈఎంఐలు మరీ ఎక్కువైపోతే ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అనిశ్చితి నెలకొన్న తరుణంలో షో కోసం అప్పు మీద కొని పెట్టుకునేవాటికంటే పొదుపు చేయడం, చేతిలో డబ్బు ఆడటమే చాలా ముఖ్యమని గుర్తెరగాలి.బయటపడేదిలా.. పీకల్లోతు ఈఎంఐల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ కాస్తంత సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే దాన్నుంచి తప్పించుకోవడం కష్టమేమీ కాదు. అదెలాగో చూద్దాం.. 1. ఈఎంఐలకు ఒక పరిమితి విధించుకోవాలి → మొత్తం ఈఎంఐల భారం నెలకు నికరంగా వచ్చే ఆదాయంలో మూడో వంతు స్థాయికి మించకుండా చూసుకోవాలి. → ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని డిసైడ్‌ కావాలి. 2. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోండి. → ఎటు పోయి ఎటొచ్చినా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడేంత నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఆ తరువాతే కొత్త లోన్స్‌ గురించి ఆలోచించాలి. 3. అధిక వడ్డీ రుణాల నుంచి బైటపడాలి → ముందుగా వడ్డీ భారం ఎక్కువగా ఉండే క్రెడిట్‌ కార్డులపై రుణాలు, వ్యక్తిగత రుణాలను తీర్చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. → కాస్త కాస్త చొప్పున ప్రీపేమెంట్‌ చేసినా, భారీగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. 4. ‘‘అవసరం’’, ‘‘అప్‌గ్రేడ్‌’’కి మధ్య వ్యత్యాసం.. → సాధారణంగా మనకి అవసరమైనవి కొన్ని ఉంటాయి. స్థాయిని చూపించుకునేందుకు తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలు. ఉదాహరణకు సొంత ఇల్లు అనేది ఒక అవసరం. కానీ ఖరీదైన కార్లు, కొత్త గ్యాడ్జెట్స్‌కు మారుతుండటమనేది అప్‌గ్రేడ్‌ కావాలనే తాపత్రయానికి నిదర్శనం.

PSBs are on track to post record combined profits exceeding 2 lakh cr2
రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు

భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలుతాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.‘ఆర్‌బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Speed is Important For The Car to Give More Mileage3
కారు మైలేజ్‌ కోసం.. ముఖ్యం ఈ వేగం!

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్‌లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది.స్థిరమైన వేగం మైలేజ్‌కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్‌ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచకూడదు.

Post Office RD Scheme Deposit RS 5000 Monthly and Get RS 8 Lakh in 10 Years4
నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!

ఎంత డబ్బు సంపాదించే వారికైనా పొదుపు చేయడం తప్పనిసరి. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా.. దుబారా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా.. ప్రభుత్వ హామీతో సురక్షితమైన లాభం ఆశించేవారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.నెలకు రూ.5000 చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ ఖాతాలో జమ చేస్తూ.. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయలి. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం దీనికి 6.7 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల కాలం మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది.దీనిని మీరు పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 (5000 x 120 నెలలు). దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.నిజానికి ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి. పిల్లల చదువుకు, పెళ్లి వంటి అవసరాలకు ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా

Union Minister rejected claims India conceded ground in the trade deal5
‘అమెరికాకు భారత్‌ తలొగ్గలేదు’

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.బలమైన ఆర్థిక శక్తిగా భారత్ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్‌ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.అమెరికా నుంచి కొనుగోళ్లువచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్‌లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.వ్యూహాత్మక చర్చలువాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్‌లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Reliance Jio Affordable 5G Recharge Plans in 20266
జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా..

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్‌లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.రూ.198 రీఛార్జ్ ప్లాన్ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.రూ.349 రీఛార్జ్ ప్లాన్ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్‌స్టార్, జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!

Advertisement
Advertisement
Advertisement