ప్రధాన వార్తలు
మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే?
చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ అట్టో కంటే భిన్నంగా ఉంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, రెట్రో-స్టైల్ డోర్ హ్యాండిల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కుడి వైపు ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్పై ఛార్జింగ్ ఫ్లాప్, కనెక్టెడ్ టెయిల్ లైట్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది 7 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ స్టీరింగ్, వైర్లెస్ ఛార్జింగ్, నాలుగు డిస్క్ బ్రేకులు, మూడు రాడార్లతో కూడిన రియర్-వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు 38.88kWh బ్లేడ్ LFP బ్యాటరీ ప్యాక్తో 380 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 74 Bhp పవర్, 135 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భద్రతా ఫీచర్లలో EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆరు ఎయిర్బ్యాగ్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్గేట్ ఉన్నాయి.
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
మార్చి నెల దాదాపు ముగిసింది. ఇక రానున్నది ఏప్రిల్. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితాను ఈ కథనంలో చూసేద్దాం.ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా.. అగర్తలా, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 5: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 11: రెండవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 12: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, ఇటానగర్, కోహిమా, న్యూఢిల్లీ, రాయ్పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సర దినం (నబబర్ష)/బోహాగ్ బిహు/విషు/హిమాచల్ దినం కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కొచ్చి, కోల్కతా, సిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 19: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 20: బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలా బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 25: నాల్గవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 26: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 1 నుంచి.. జీతంలో మార్పులు ఉంటాయా?
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది.. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా అమల్లోకి రానుంది. ఈ తరుణంలో ఉద్యోగులలో జీతభత్యాలు సంబంధించి ఆందోళన, ఆసక్తి పెరిగిపోయింది.2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో పన్ను నిబంధనలకు సంబంధించిన మార్పులు ఉండదు. అయినప్పటికీ.. జీతం నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీటీసీ యథాతథంగా ఉన్నప్పటికీ.. జీతంలో భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటి వరకు పన్నురహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్మెంట్లు, ఇతర ప్రయోజనాలు అన్నీ కూడా కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను పరిధిలోకి రానున్నాయి. ఇదే జరిగితే.. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు.కార్మిక చట్టాల ప్రకారం.. బేసిక్ జీతం, మొత్తంలో సీటీసీలో 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ కొంత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతుంది. కంపెనీ అందించే వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వెహికల్, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే.. పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.ఏప్రిల్ 1 నుంచి.. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025భారతదేశంలో గత 65 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961.. త్వరలో (2026 ఏప్రిల్ 1 నుంచి) రద్దు అవుతుంది. దీని స్థానంలో కొత్తగా రూపొందించిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, 2025 అమల్లోకి వస్తుంది. పాత చట్టం అనేక సవరణలతో చాలా క్లిష్టంగా మారి, 800కి పైగా సెక్షన్లు కలిగి ఉండేది.కొత్త చట్టం ముఖ్య ఉద్దేశ్యం పన్ను విధానాన్ని సులభతరం చేయడం. ఇందులో పన్ను రేట్లు లేదా ఎక్కువగా డిడక్షన్లలో పెద్ద మార్పులు లేవు. అయితే చట్టాన్ని సులభమైన భాషలో రాసి, సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కి తగ్గించారు. అలాగే చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా మారుతుంది.మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం ప్రకారం పన్ను విధింపు ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 తరువాత వచ్చిన ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుంది. పాత చట్టం కింద ఉన్న కేసులు, అప్పీలు మొదలైనవి పూర్తయ్యే వరకు అదే చట్టం ప్రకారం కొనసాగుతాయి.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఉక్రెయిన్తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న యుద్ధ వ్యయం, విస్తరిస్తున్న బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తన సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని (Physical Gold) విక్రయించడం ప్రారంభించింది. 'బిఎన్ఈ ఇంటెల్లిన్యూస్' (bne IntelliNews) నివేదిక ఈ సంచలన విషయాలను వెల్లడించింది.నివేదికలోని ముఖ్యాంశాలుభారీగా విక్రయాలు: 2022 నుంచి 2025 మధ్య కాలంలో రష్యా సుమారు 150 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని విక్రయించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే మరో 35 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలను వదులుకుంది.రికార్డు స్థాయి విక్రయం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. 2002 తర్వాత రెండు నెలల కాలంలో జరిగిన అతిపెద్ద విక్రయం ఇదే కావడం గమనార్హం.లోటు బడ్జెట్ సెగ: 2025 నాటికి రష్యా బడ్జెట్ లోటు జీడీపీలో 2.6 శాతానికి చేరింది. వాస్తవానికి ఇది 0.5% మాత్రమే ఉంటుందని అంచనా వేసినా, యుద్ధ పరిస్థితుల వల్ల అంచనాలు తలకిందులయ్యాయి.వ్యూహం మారింది..గతంలో రష్యా తన బంగారు నిల్వలపై కేవలం ఆర్థిక లావాదేవీలు (Speculative transfers) మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు నేరుగా భౌతిక బంగారాన్ని (Physical Bullion) మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనివల్ల రష్యా బంగారం నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అత్యల్ప స్థాయి.తగ్గిన చమరు ఆదాయం అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో రష్యా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు రష్యా మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ వాటా సగభాగం ఉండగా, ఇప్పుడది 20 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటడంతో, ఆ గరిష్ట ధరల వద్ద బంగారాన్ని అమ్మి నగదు సమీకరించుకోవాలని రష్యా భావిస్తోంది.ప్రపంచంలో ఐదో స్థానంవరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, రష్యా వద్ద ఇప్పటికీ 2,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో కొనసాగుతోంది. 2014 (క్రిమియా ఆక్రమణ) నుంచి డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది.ఆర్థిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంయుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా ప్రభుత్వం వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తోంది. వాటిలో.. నేషనల్ వెల్ఫేర్ ఫండ్: ఇందులో ఉన్న నిధులను యుద్ధ అవసరాలకు వాడుకుంటోంది.పన్నుల పెంపు: వ్యాట్ (VAT) రేట్లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.బాండ్ల జారీ: దేశీయంగా బాండ్లను జారీ చేసి నిధులను సేకరిస్తోంది.ఉక్రెయిన్తో యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, రష్యా తన అత్యంత విలువైన 'బంగారు' నిల్వలను విక్రయించడం ప్రారంభించడం ఆ దేశ ఆర్థిక స్థితిపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
శుభ్మన్ గిల్ లగ్జరీ అపార్ట్మెంట్.. ధర తెలిస్తే షాకవుతారు!
ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్మన్ గిల్' కూడా చేరారు.శుభ్మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్ను పూజా లీజర్ అండ్ లైఫ్స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.శుభ్మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్మెంట్స్ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నారు.👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.
కార్పొరేట్
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఆ దేశంలో ఆఫీసులు.. స్వర్గాలు!
పెరగనున్న ఐఫోన్ ధరలు: కారణం ఇదే!
నోకియా 14,000 మందికి లేఆఫ్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి జెఫ్రీస్ నిష్క్రమణ
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!
ఇంటీరియో టార్గెట్.. మార్కెట్లో రూ.550 కోట్లు!
బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు
మహాదేవ్ యాప్.. రూ.1,700 కోట్ల ఆస్తులు జప్తు!
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ...
జియో ఐపీవో ఎప్పుడంటే?
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్...
పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో...
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?
భారత్కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబ...
నకిలీ ట్రేడింగ్ యాప్లకు సెబీ చెక్
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక...
పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..
అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే...
ఆర్బీఐ పాలసీ మీటింగుల షెడ్యూల్ వచ్చేసింది..
ముంబై: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రూ.1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ!
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సంవత్సరం పొడవునా ఫోన్ను యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్కు వెళ్లడం గానీ, ఆన్లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్ను పొందవచ్చు.గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు!
తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..
కృత్రిమ మేధ (ఏఐ) అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు క్లిష్టంగా భావించిన మ్యాసివ్ మల్టీ టాస్కింగ్ ల్యాంగ్వేజ్ అండర్స్టాండింగ్(ఎంఎంఎల్యూ) వంటి పరీక్షల్లో 90 శాతానికి పైగా స్కోరు సాధించి మనుషుల మేధస్సును సవాలు చేస్తోంది. అయితే, ఏఐ సామర్థ్యాన్ని కొలిచే పాత కొలమానాలు సరిపోవని భావించిన శాస్త్రవేత్తలు దానికి అత్యంత కఠినమైన పరీక్షలు సిద్ధం చేశారు. అదే ‘హ్యూమనిటీస్ లాస్ట్ ఎగ్జామ్(హెచ్ఎల్ఈ). ఎంఎంఎల్యూ అనేది ఏఐ మోడల్స్ తెలివితేటలను, విజ్ఞానాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్మార్క్ పరీక్ష. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన హెచ్ఎల్ఈ పరీక్ష వివరాలు, ఏఐ మోడల్స్ పనితీరుపై కథనం.ఏమిటీ హెచ్ఎల్ఈ? ఎందుకంత కఠినం?ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 500 సంస్థల నుంచి దాదాపు 1,000 మంది నిపుణులు సిద్ధం చేసిన 2,500 ప్రశ్నల సమాహారమే ఈ హెచ్ఎల్ఈ. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ, స్కేల్ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఏఐ మోడల్స్లోని లోపాలను ఎత్తిచూపడం, వాటి అసలు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. 100కు పైగా విభాగాల్లోని నిపుణులు పంపిన ప్రతి ప్రశ్న ప్రస్తుత ఏఐ మోడల్స్ను ఓడించడమే కాకుండా ఇద్దరు నిపుణుల సమీక్షను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆయా రంగాల్లోని నిపుణుల మధ్యే 15.4% నుంచి 18% వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే, ఏ ఒక్క మనిషి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం.గెలుపు ఎవరిది?ఈ పరీక్ష ప్రారంభమైనప్పుడు (జనవరిలో ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన సమయానికి) అత్యుత్తమ ఏఐ మోడల్స్ కూడా 10 శాతం కంటే తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. కానీ, గత కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది.ఏఐ మోడల్ప్రారంభ స్కోరు (%)ప్రస్తుత స్కోరు (%)GPT-4o2.7%-OpenAI o18.0%-DeepSeek-R18.5%-GPT-5-25.3%Gemini 2.5 Pro-21.6%Gemini 3 Pro (Live)-38.3% ఆందోళన కలిగిస్తున్న అంశాలుఈ పరీక్షలో బయటపడిన ప్రధాన లోపం ‘కాలిబ్రేషన్ ఎర్రర్’. సమాధానం తప్పు అని తెలిసినా ఏఐ మోడల్స్ అది 100% సరైనదని మొండిగా వాదిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగం లేదా ఆర్థిక రంగంలో ఏఐని వాడేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ‘ఒక తప్పు సమాధానాన్ని తప్పు అని ఏఐ గుర్తించలేకపోవడం అనేది సాంకేతిక లోపం కాదు, ప్రస్తుత ఏఐ డిజైన్ లోనే ఉన్న ఒక నిర్మాణాత్మక సమస్య’ అని నిపుణులు చెబుతున్నారు.కొలమానమే కరిగిపోతోందా?ఏఐ సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందంటే దాన్ని కొలిచే ‘యార్డ్స్టిక్’ కూడా సరిపోవడం లేదు. అందుకే పరిశోధకులు ‘హెచ్ఎల్ఈ రోలింగ్’ పేరుతో నిరంతరం అప్డేట్ అయ్యే డైనమిక్ టెస్టింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో అత్యుత్తమ స్కోరు సాధించినంత మాత్రాన దానికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు కాదని, కేవలం అకడమిక్ ప్రశ్నల్లో నిపుణత సాధించినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి సృష్టించిన పరీక్షను మనిషి కంటే వేగంగా ఏఐ ఛేదిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
ఇంధన భద్రతకు ‘సౌర’ భరోసా
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్లో మారుతున్న పరిణామాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ ఎంత సున్నితమైందో మరోసారి గుర్తుచేశాయి. శిలాజ ఇంధనాల దిగుమతులపై భారీగా ఆధారపడే భారతదేశం వంటి దేశానికి ఇంధన భద్రత అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో సౌరశక్తి వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం.దశాబ్ద కాలంలో ఇలా..గడిచిన పదేళ్లలో భారత్ సౌరశక్తి రంగంలో అసాధారణ వృద్ధిని సాధించింది. భారీ సోలార్ పార్కులు, రూఫ్-టాప్ ఇన్స్టాలేషన్ల ద్వారా దేశీయ సోలార్ పవర్ సామర్థ్యం 130 గిగావాట్లకు చేరుకుంది. అయితే, సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఆ విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించడంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.భారీ ప్రాజెక్టులు.. వికేంద్రీకృత వ్యవస్థభారీ సోలార్ ప్లాంట్లు (ఎల్ఎస్ఎస్) తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాటికి ప్రధాన అడ్డంకి ట్రాన్స్మిషన్ (సరఫరా) వ్యవస్థ. మారుమూల ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను నగరాలకు చేరవేయడానికి భారీ వ్యయంతో కూడిన కారిడార్లు అవసరం. దీనివల్ల విద్యుత్ నష్టాలు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆలస్యం కారణంగా విద్యుత్ తరలింపు నిలిచిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘పీఎం సూర్య ఘర్’ వంటి పథకాలు గృహ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే వినియోగిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్పై ఒత్తిడి తగ్గుతుంది.గ్రిడ్ నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులుసాధారణంగా విద్యుత్ గ్రిడ్లు ఒకే దిశలో (పవర్ ప్లాంట్ నుంచి వినియోగదారుడికి) ప్రవహించేలా రూపొందించబడ్డాయి. కానీ రూఫ్-టాప్ సోలార్ వల్ల విద్యుత్ రెండు వైపులా ప్రవహిస్తుంది. దీనివల్ల గ్రిడ్ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. సంపన్న వినియోగదారులు సోలార్ వైపు మళ్లడంతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రాష్ట్రాలు అదనపు ఛార్జీలు విధిస్తూ సోలార్ వినియోగాన్ని పరోక్షంగా నిరుత్సాహపరుస్తున్నాయనే వాదనలున్నాయి.సవాళ్లు - పరిష్కారాలుసౌర విద్యుత్ ఉత్పత్తి మధ్యాహ్నం వేళలో గరిష్టంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో గృహాల్లో వినియోగం తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో డిమాండ్ పెరిగినప్పుడు సౌర ఉత్పత్తి ఉండదు. దీనినే అంతర్జాతీయంగా ‘డక్ కర్వ్’ సమస్య అంటారు. దీనిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పగటిపూట మిగిలిన విద్యుత్ను భద్రపరిచి రాత్రి వేళల్లో వాడుకోవాలి. విద్యుత్ సమృద్ధిగా ఉన్న సమయంలో రేట్లు తగ్గించి వినియోగదారులను ఆ సమయంలోనే ఎక్కువ విద్యుత్ వాడేలా ప్రోత్సహించాలి.సరికొత్త వ్యూహం.. సోలార్, ఈవీ అనుసంధానంప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత. ప్రభుత్వం పీఎం-డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించాలని చూస్తోంది. సగటున ఒక ఇంటిపై ఉండే 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే మిగులు విద్యుత్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఒక అపార్ట్మెంట్ లేదా కాలనీలోని ఇళ్లన్నీ కలిపి ఆ మిగులు విద్యుత్ను అక్కడే ఉండే పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు మళ్లించవచ్చు.తూత్తుకుడిలోని వీవోసీ పోర్ట్ ఇప్పటికే ఈ నమూనాను విజయవంతంగా అమలు చేస్తోంది. స్థానిక సౌర విద్యుత్ను అక్కడే ఈవీ వినియోగానికి అనుసంధానించడం ద్వారా భారీగా ఖర్చు తగ్గించుకున్నారు. భారతదేశ ఇంధన భవిష్యత్తు సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల అనుసంధానంలోనే ఉంది. డిస్కంలు సోలార్ను ఒక ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా భావించి స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అప్పుడే నిజమైన ఇంధన స్వయంసమృద్ధిని సాధించగలం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.More days, same price! BSNL Validity Bonus Offer ₹997 plan now gives 164 days instead of 150 days.Plan detail:* Cost: ₹997* Validity: 164 Days (Bonus included!)* Data: 2GB/Day* Calls: UnlimitedDon't miss out—this limited-time bonus till March 31, 2026.Recharge… pic.twitter.com/225a4Cb04P— BSNL India (@BSNLCorporate) March 22, 2026
పర్సనల్ ఫైనాన్స్
ఇక ఫింగర్ప్రింట్తోనే పేమెంట్స్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఫీచర్ ముఖ్యాంశాలురూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లోని బయోమెట్రిక్ ఫీచర్ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.యాక్టివేట్ చేసుకునే విధానంభీమ్ యాప్లో ఈ కొత్త ఫీచర్ను యాక్టివేట్ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్ఫారమ్లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది.
జియో.. జెరోధా.. కొత్త మ్యూచువల్ ఫండ్లు
జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ను కేదార్నాథ్ మిరాజ్కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 50:50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్ఈ 100 ఇండెక్స్ (టీఆర్ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026
బ్యాంకు సెలవులు.. వారంలో 4 రోజులు క్లోజ్!
మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సెలవుల వివరాలు ఇవే...మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఇతర సేవలు: ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు.మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.


