Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India crude oil imports from Russia surged record high in November 20251
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్‌ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్‌తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్‌ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్‌ చమురు దిగుమతి చేసుకున్నాయి.గణనీయ పెరుగుదలనవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్‌ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్‌ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్‌నెఫ్ట్‌(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్‌ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.తగ్గుముఖం పట్టే అవకాశంనవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..

Price of luxury homes appreciates 40pc since 2022 Hyderabad Real estate2
ఇళ్ల ధరలు: మూడేళ్లలోనే ఎంత మార్పు?

దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్‌ ఎ‍స్టేట్‌ రీసెర్చ్‌ సంస్థ అనరాక్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్‌ కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. ఈ విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 2022–2025 మధ్య లగ్జరీ సెగ్మెంట్‌లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇలా..ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది.

How Life Insurance Helps Women Save on Taxes3
జీవిత బీమాతో మహిళలకు పన్నుల ఆదా

జీవిత బీమాను ఒకప్పు డు పురుషులు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికిమరియు పన్ను భారం తగ్గించుకోవడానికిఉపయోగించేసాధనంగా భావించేవారు. ఇప్పు డు మహిళలు కూడా అదే ప్రయోజనాలు పొందుతూ తమ ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తున్నారు.మహిళల కోసం జీవిత బీమా పన్ను ప్రయోజనాలు వారికిపన్ను కు వచ్చే ఆదాయాన్ని తగ్గించడంలో, పన్ను లేకుండా వచ్చే మొత్తాలను పొందడంలో, మరియు ఆర్థిక భదత్రను నిర్మించడంలో సహాయపడుతాయి. ఈ ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మహిళలకు సంపదను పెంచుకోవడంలో మరియు రక్షించుకోవడంలో జీవితబీమాను తెలివైన సాధనంగా మారుస్తుంది.జీవిత బీమాతో ఆదాయ పన్ను ప్రయోజనాలుజీవిత బీమా మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడమేకాదు, ఆదాయ పన్ను చట్టం పక్రారం మంచి పన్ను ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఇప్పు డు ఇవి ఏవో చూద్దాం.1. ప్రీమియంపైపన్ను తగ్గింపు (సెక్షన్ 80C)జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియంపైసెక్షన్ 80C పక్రారం పన్ను తగ్గింపు లభిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ₹1.5 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు . ఇదిమీకు, మీ జీవిత భాగస్వా మికిలేదా మీ పిల్లల కోసం తీసుకున్న పాలసీలకు వర్తిస్తుంది.2. పాలసీమెచ్యూ రిటీమొత్తం పన్ను నుండిమినహాయింపు (సెక్షన్ 10(10D))పాలసీమెచ్యూ రిటీసమయంలో లేదా బీమాదారుడిమరణ సమయంలో కుటుంబం పొందేమొత్తం సెక్షన్ 10(10D) ప్రకారం పూర్తిగా పన్ను రహితం. దీంతో మొత్తం మీ కుటుంబానికిఎలాంటిపన్ను భారంలేకుండా లభిస్తుంది. మహిళలు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించి పన్ను రహిత మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు .3. యూఎల్ఐపీలు (ULIPs) పైపన్ను ప్రయోజనాలు ULIPలకు చెల్లించిన ప్రీమియం కూడా సెక్షన్ 80C కింద తగ్గింపుకు అర్హం. కొన్ని షరతులు నెరవేరితేమెచ్యూరిటీ మొత్తం కూడా సెక్షన్ 10(10D) కింద పన్ను రహితం. ULIPs బీమాతో పాటు పెట్టుబడిఅవకాశం అందిస్తాయి. అందువల్లపన్ను ఆదా చేస్తూ సంపదను పెంచుకోవచ్చు .4. పెన్షన్ లేదా అన్న్యుటీ పాలసీలపై పన్ను లాభంపెన్షన్ లేదా అన్న్యు టీఅందించే జీవిత బీమా పాలసీతీసుకుంటే, చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80CCC కింద తగ్గింపునకు అర్హం. పదవీ విరమణ తర్వా త వచ్చే అన్న్యుటీపై పన్ను ఉంటుందేకానీ, పెట్టుబడికాలంలో మీరు ముందుగానే పన్ను ఆదా చేసుకోవచ్చు .పన్ను ప్రయోజనాల కోసం జీవిత బీమాను ఉపయోగించేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయంజీవిత బీమా ద్వా రా పన్ను ప్రయోజనాలు పొందేటప్పుడు ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయి.● సరైన పాలసీని ఎంచుకోండి: టర్మ్ ప్లాన్, ఎండోవ్మెంట్ ప్లాన్, ULIP వంటికొన్ని పాలసీలకేపన్ను ప్రయోజనాలు ఉంటాయి. రక్షణ, పెరుగుదల మరియు పన్ను ఆదా మధ్య సరైన సమతుల్యం కలిగిన పాలసీని తీసుకోండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్షన్ 80C కింద పూర్తిపన్ను తగ్గింపును ఇస్తుంది, ఇదిమహిళలకు మంచి ఎంపిక.● ప్రీమియం పరిమితులు మరియు సామర్థ్యాన్ని తెలుసుకోండి: సెక్షన్ 80C కింద సంవత్సరానికి₹1.5 లక్షల వరకు మాత్రమే తగ్గింపులు లభిస్తాయి. మీరు ప్రీమియంను ప్లాన్ చేసేటప్పు డు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. అలా చేస్తేమీరు గరిష్టపన్ను ప్రయోజనం పొందగలరు.● పన్ను రహిత చెల్లింపుల నియమాలను అర్థం చేసుకోండి: మెచ్యూ రిటీలేదా మరణ లాభాలు సెక్షన్ 10(10D) కింద పన్ను రహితంగా ఉండాలంటేపాలసీకొన్ని నిబంధనలను పాటించాలి. ఇందులో కనీస ప్రీమియం చెల్లింపులు మరియు అవసరమైన పాలసీవ్యవధిఉంటాయి.● లాక్-ఇన్ పీరియడ్ గురించి తెలుసుకోండి: కొన్ని పాలసీలకు, ముఖ్యంగా ULIPsకు, 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలానికి ముందే ఉపసంహరణ చేస్తే పన్ను ప్రయోజనాలు తగ్గవచ్చు.● రికార్డులను సరిగ్గా ఉంచండి: పన్ను తగ్గింపులు క్లెయిమ్ చేసేసమయంలో ప్రీమియం రసీదులు మరియు పాలసీపత్రాలు అవసరం అవుతాయి. అందువల్లవీటిని జాగత్ర్తగా భదప్రరచండి.మహిళలకు జీవిత బీమా రక్షణకన్నా ఎక్కు వని ఇస్తుంది. ఇదిఆర్థిక స్థిరత్వా న్ని మరియు నిజమైన పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. సెక్షన్ 80C తగ్గింపులు మరియు సెక్షన్ 10(10D) మినహాయింపులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వా రా మహిళలు తమ ఆర్థిక పణ్రాళికపైస్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలరు. సరైన నిర్ణయాలు మరియు జాగ్రత్తైన పణ్రాళికతో మహిళలు జీవిత బీమాతో ఉన్న అపోహలను తొలగించి మరింత భద్రమైన మరియు ఆర్థికంగా బలమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు.

Pharma industry must shift towards innovative products PHARMEXCIL4
వినూత్న ఉత్పత్తులపై ఫార్మా ఫోకస్‌ చేయాలి

ప్రపంచ ఫార్మసీగా భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టాలంటే వచ్చే అయిదేళ్లలో దేశీ ఫార్మా పరిశ్రమ క్రమంగా వినూత్నమైన, సంక్లిష్టమైన జనరిక్స్‌ తయారీ వైపు మళ్లాలని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషి చెప్పారు. బయోసిమిలర్లు, బయోలాజిక్స్, పెప్టైడ్‌లు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.అంతర్జాతీయంగా పోటీ, భౌగోళిక–రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం పేటెంట్లు ముగిసిన ఉత్పత్తులనే తయారు చేయడం కాకుండా పరిశోధనల ఆధారిత ఆవిష్కరణలవైపు మళ్లాల్సిన అవసరం ఉందని జోషి చెప్పారు. జనరిక్‌ మార్కెట్‌ స్థాయిని దాటి ఇతర విభాగాల్లోనూ భారత్‌ స్థానాన్ని పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని సీపీహెచ్‌ఐ–పీఎంఈసీ ఇండియా 18వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.అమెరికా టారిఫ్‌ల ముప్పుపై ఆందోళన నెలకొన్నప్పటికీ ఈ ఏడాది ఎగుమతులు ఇప్పటివరకు వృద్ధి బాటలోనే ఉన్నాయని, 2.31 శాతం పెరిగాయని జోషి చెప్పారు. ఇక ఫార్మసీ బోధనాంశాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందని సదస్సులో పాల్గొన్న కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత సిలబస్‌ అనేది వాస్తవ పరిస్థితులను, నేటి ఫార్మా వ్యవస్థ అవసరాలను ప్రతిబింబించేలా ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్‌ డిస్కవరీ, రీసెర్చ్‌ మెథడాలజీల నుంచి ముడి వస్తువుల సేకరణ, ఏఐ ఆధారిత ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌లాంటి అన్ని అంశాల గురించి విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని తెలిపారు.

Nifty Hits All Time High After 14 Months 5
నిఫ్టీకి ‘నూతన’ ఊపు.. 14 నెలలకు ఆల్-టైమ్ హై

భారత స్టాక్‌మార్కెట్‌లో గురువారం (నవంబర్‌ 27) కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE) ప్రధాన బెంచ్‌మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 నూతన చరిత్ర సృష్టించింది. 14 నెలల తర్వాత కొత్త ఆల్–టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.సెషన్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 50 సూచీ 26,295 పాయింట్లపైకి ఎగబాకి, 2024 సెప్టెంబర్ 27న నమోదైన పూర్వపు రికార్డు 26,277.35 పాయింట్లను అధిగమించింది. నిఫ్టీకి ఈ కొత్త మైలురాయిని చేరుకోవడానికి మొత్తం 287 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.రికార్డు హైకి దోహదం చేసిన అంశాలుస్టాక్ మార్కెట్‌లో కొనుగోలు ధోరణి పెరగడానికి అనేక కారకాలు దోహదం చేశాయి.దేశీయ, అంతర్జాతీయ వడ్డీ రేట్లు కోతపై మార్కెట్ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను గణనీయంగా పెంచాయి.కంపెనీల బలమైన క్యూ2 ఫలితాలు, అనేక రంగాల్లో ఆదాయ వృద్ధి ఊపందుకోవడం వల్ల సూచీకి శక్తి లభించింది.మ్యూచువల్ ఫండ్స్, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ ఇన్‌ఫ్లోలు కొనసాగాయి.మార్కెట్ వాల్యుయేషన్‌లు కొంత సడలించడంవల్ల కొనుగోలు ఆకర్షణ పెరిగింది.గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్, అంతర్జాతీయ ట్రేడ్ & మాక్రో డేటా మెరుగుదల కూడా ప్రభావం చూపాయి.నిఫ్టీ పరిణామ క్రమంనిఫ్టీ సూచీ తన ప్రారంభం (1995–96) నుంచి ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా పెరుగుతూ భారీ వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది.2007లో తొలిసారి 5,000 మార్క్‌ను దాటిన నిఫ్టీ 2017లో 10,000 మార్క్‌ను 2021లో 20,000 మైలురాయిని తాకింది. 2024లో 25,000 మార్క్‌ను అందుకున్న ఈ ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ 2025లో 26,000 మైలురాయిని దాటింది.నిఫ్టీ సూచీకి 2024 సంవత్సరం అనేక రికార్డులు అందించింది. ఆ ఒక్క ఏడాదిలోనే నిఫ్టీ 59 కొత్త రికార్డు హైలు నమోదు చేసింది.ఏ స్టాక్స్ మెరిశాయంటే..తాజా ర్యాలీలో ముఖ్యంగా బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మెరిశాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇంజనీరింగ్ సెక్టార్‌లో లార్సెన్‌ & టూబ్రో, కన్స్యూమర్ & మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఏషియన్‌ పెయింట్స్‌ వంటి స్టాక్స్ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ఇతర బ్లూ–చిప్ కంపెనీలు కూడా సానుకూల త్రైమాసిక ఫలితాలు వెలువరించడంతో సూచీకి కొత్త ప్రాణం పోశాయి.నిపుణుల విశ్లేషణమార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుత ర్యాలీ పూర్తిగా ఫండమెంటల్స్ ఆధారిత స్థిరమైన వృద్ధిగా కనిపిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం, ఎఫ్‌ఐఐ రాకల్లో మెరుగుదల, దేశీయ డిమాండ్ పెరుగుదల.. ఇవన్నీ మార్కెట్‌కు మద్దతునిస్తున్నాయి.ఇకపోతే, అంతర్జాతీయ స్థూల అనిశ్చితులు, డాలర్ బలం, క్రూడ్ ధరల్లో మార్పులు వంటి అంశాలు వచ్చే రోజుల్లో మార్కెట్‌లో అస్థిరతకు దారితీయవచ్చు అని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం.. పాలసీ సడలింపులు, ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగితే నిఫ్టీ 2026 నాటికి 30,000 మార్క్‌ను తాకే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Gold and Silver rates on 27 November 2025 in Telugu states6
వామ్మో వెండి హ్యాట్రిక్‌.. బంగారమే నయం కదా!

దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు కాస్త శాంతించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
Advertisement