Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Only These Six Assets Will Survive 2026 Says Robert Kiyosaki1
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులుబంగారం (Gold)వెండి (Silver)చమురు (Oil)ఆహారం (Food)బిట్‌కాయిన్ (Bitcoin)ఈథీరియం (Ethereum)కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.బంగారం, వెండిబంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.క్రిప్టో కరెన్సీకియోసాకి బిట్‌కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.చమురు, ఆహారంచమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!

Airbnb Data Shows How Indian Travellers Are Turning to Asia This Summer2
అందరిచూపు.. ఆసియా దేశాలవైపు!

భారతీయ ప్రయాణికులు ఈ వేసవిలో ఎక్కువగా ఆసియా దేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నట్లు ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. ఇప్పటి యువత, ముఖ్యంగా Gen Z తరం, కొరియన్ డ్రామాలు, జపనీస్ సంస్కృతి, ఆసియన్ స్ట్రీట్ ఫుడ్ వంటి వాటికి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఆసియా టూరిజం మీద ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.ఎయిర్‌బీఎన్‌బీ గణాంకాల ప్రకారం.. ఈ వేసవిలో 40 శాతం కంటే ఎక్కువ జెన్ జీ వర్గానికి చెందిన వారు ఆసియా దేశాలకు ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణాలు కేవలం కేవలం విశ్రాంతి కోసం కాకుండా అనుభవాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత కచేరీలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన అనుభవాలు వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.జపాన్, దక్షిణ కొరియా, దక్షిణ - తూర్పు ఆసియా దేశాల్లోని నగరాలు భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓసాకా, టోక్యో, బుసాన్ వంటి నగరాల్లో సెర్చ్‌లు గణనీయంగా పెరిగాయి. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్ వంటి నగరాలు కూడా తమ సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు, పరిచయంతో కూడిన వాతావరణం వల్ల ప్రజాదరణ పొందుతున్నాయి.ప్రయాణం ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా కుటుంబంతో, స్నేహితులతో కలిసి చేసే అనుభవంగా మారుతోంది. దాదాపు 60 శాతం మంది గ్రూప్ లేదా ఫ్యామిలీ ట్రావెల్‌ చేసినట్లు గణాంకాల ద్వారా తెలిసింది. దేశీయంగా కూడా కొత్త ట్రెండ్‌లు కనిపిస్తున్నాయి. ప్రజలు సాధారణంగా వెళ్లే ప్రదేశాలకంటే భిన్నమైన, ప్రకృతి, సంప్రదాయం, సంస్కృతి కలిగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తిరువనంతపురం, పూరి, జైపూర్, మేఘాలయ వంటి ప్రదేశాలు ఉన్నాయి.

Hyundai TVS Electric Autos3
హ్యుందాయ్‌ - టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ ఆటోలు!

మన రోడ్లపై ఇక హ్యుందాయ్‌–టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ ఆటోలు పరుగులు తీయనున్నాయి. దేశంలో చివరి గమ్యస్థాన రవాణా (లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ–త్రీవీలర్‌ విభాగంలో హ్యుందాయ్‌ మోటార్, టీవీఎస్‌ మోటార్‌ సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి.దీని ప్రకారం ఉత్పత్తి రూపకల్పన, సాంకేతికాభివృద్ధిలను హ్యుందాయ్‌ అందించనుంది. టీవీఎస్‌ తన ఎలక్ట్రిక్‌ ప్లాట్‌ఫారమ్, తయారీ సామర్థ్యం, మార్కెట్‌ నైపుణ్యంతో భాగస్వామ్యం కానుంది. అలాగే దేశీయ తయారీ, డిస్ట్రిబ్యూషన్, విక్రయాలను టీవీఎస్‌ నిర్వహించనుంది. ‘భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో–2025’లో ఈ–త్రీ వీలర్‌ కాన్సెప్ట్‌ విజయవంతంగా ప్రదర్శన అనంతరం ఇరు సంస్థలు ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ కార్పొరేట్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూన్సన్‌ కో మాట్లాడుతూ, భారతదేశం తమకు కీలక మార్కెట్‌గా ఉన్నందున రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగస్వామ్యం కావడం లక్ష్యమని తెలిపారు.ఇదీ చదవండి: పోర్స్చే కారుపై సిమెంట్ కలిపిన వ్యాపారవేత్త: వీడియో

Bengaluru Entrepreneur Turns Porsche Bonnet Into Cement Mixer4
పోర్షే కారుపై సిమెంట్ కలిపిన వ్యాపారవేత్త: వీడియో

బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో వ్యాపారవేత్త అఖిల్ హేమాద్రి రోడ్డుపై గుంతను పూడ్చడానికి చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.వీడియోలో గమనించినట్లయితే.. కోట్ల రూపాయల విలువైన పోర్షే (Porsche) కారులో అఖిల్ హేమాద్రి అక్కడికు వచ్చి, రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చడానికి సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే.. సిమెంట్ మిశ్రమాన్ని కారు బానెట్ మీద కలిపాడు. ఖరీదైన కారుపై ఇలా చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ ఆయన తన కారుపై రక్షణ పొర (PPF) ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగదని చూపించడానికి ఈ విధానం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.సిమెంట్ మిశ్రమం కలిపిన తరువాత గుంతను పూడ్చేస్తాడు. చివరగా బానెట్‌పై ఉన్న షీట్‌ను తొలగిస్తారు. దీంతో కారుకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా కార్ల రక్షణ కోసం ఉపయోగించే పీపీఎఫ్ బలాన్ని చూపించడమే ఈ వీడియో ఉద్దేశ్యం అయినప్పటికీ.. ఈ చర్య ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారని పేర్కొన్నారు.వీడియో షేర్ చేసిన హెచ్1 కార్ డీటైలింగ్.. ''మన పరిసరాలను పరిశుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మనం ప్రతిదానికీ ఎల్లప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడకూడదు. మన దేశంలో జనాభా చాలా ఎక్కువ, కేవలం ప్రభుత్వ ప్రయత్నాలతో మాత్రమే మార్పు రాదు. మనలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది'' అని వెల్లడించింది. View this post on Instagram A post shared by H1 Car Detailing Factory (@h1_car_detailing)

Stock Market Closing Update 21st April 20265
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!

మంగళవారం ఉదయం శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,576.60 వద్ద నిలిచాయి.శ్యామ్ టెలికాం లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, మనాక్సియా స్టీల్స్ లిమిటెడ్, వైశాలి ఫార్మా లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పశుపతి కాట్‌స్పిన్ లిమిటెడ్, సైబర్ మీడియా (ఇండియా) లిమిటెడ్, తంబోలి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అక్షిత కాటన్ లిమిటెడ్, సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Inside Tesla India Strategy Jobs Signal a Much Bigger Play6
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్‌ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్‌మెంట్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

Advertisement
Advertisement
Advertisement