ప్రధాన వార్తలు
మరింత తగ్గిన గోల్డ్ రేటు: లేటెస్ట్ ధరలు ఇలా..
మార్చి 2 నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,48,600 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,47,700 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,110 రూపాయల నుంచి రూ. 1,61,130 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,48,750 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,47,850 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,62,260 రూపాయల వద్ద నుంచి రూ. 1,61,280 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,49,600 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,200 వద్దనే ఉన్నాయి.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రారంభైనప్పుడు భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మార్చి 2న రూ. 1,70,510 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (మార్చి 6) 1,61,130 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ఎంత తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్లో ఉన్న తన ప్లాట్ను రూ.18.50 కోట్లకు విక్రయించింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.ప్రీతి జింటా 2025 నవంబర్లో అదే భవనంలోని (రుస్తోంజీ పరిశ్రమ్ భవనం) 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ప్లాట్ను రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రెండో ప్లాట్ విక్రయించడం విశేషం.ఇప్పుడు ప్రీతి జింటా విక్రయించిన ప్లాట్కు సంబంధించిన ఒప్పందం.. 2026 మార్చి 2న నమోదు అయింది. దీనిని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాల వ్యక్తులు ప్రియా నగర్ & రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది.సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు విక్రయిస్తున్నారు కూడా. ఇప్పటికే అక్షయ్ కుమార్ 2025లో 100 కోట్లకు పైగా విలువైన అనేక ఆస్తులను విక్రయించారు. అమితాబ్ బచ్చన్ కూడా 2025లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ప్రీతి జింటా ఈ జాబితాలో చేరారు.ఇదీ చదవండి: ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్' విలన్నవంబర్లో విక్రయించిన ప్లాట్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రీతి జింటా మళ్లీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోట్ల విలువైన కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
బంగారానికి భారీ డిస్కౌంట్.. ఎక్కడ.. ఎందుకు?
మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్కు, అమెరికా-ఇజ్రాయెల్కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!
ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ.1748 ప్లాన్రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్కు యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.2025 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3599 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3999 ప్లాన్రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది.
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
రాంచీ: అధునాతన గ్రేడ్ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్పూర్ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. నెదర్లాండ్స్లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్పూర్లో 1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. హైడ్రోజన్ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కుప్పకూలిన మార్కెట్లు.. కూల్చేసిన క్రూడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఏడాది కాల గరిష్టానికి పెరగడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు షెషన్ చివర్లో గణనీయ నష్టాలను చవిచూశాయి.నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 1.27 శాతం లేదా 315.45 పాయింట్ల నష్టంతో 24,450.45 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.37 శాతం లేదా 1,097 పాయింట్లు నష్టపోయి 78,918.90 వద్ద ముగిసింది.యూఎస్-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున హోర్ముజ్ జలసంధి షిప్పింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇది సరఫరా అంతరాయం భయానికి ఆజ్యం పోసింది. దీంతో యూరోపియన్ వాణిజ్య సెషన్ లో బ్రెంట్ క్రూడ్ ను బ్యారెల్ కు 87 డాలర్ల మార్కుకు పైగా నెట్టింది.నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.24 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.27 శాతం క్షీణతతో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన సూచీగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్లో నష్టపోయిన ఇతర రంగాలు. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ స్వల్ప లాభాలతో సెక్టోరల్ సూచీలను అధిగమించింది.
కార్పొరేట్
పేటీఎం తర్వాత మరో భారీ ఐపీవో.. ఫోన్పే ప్లాన్ ఇదే!
బంగారానికి భారీ డిస్కౌంట్.. ఎక్కడ.. ఎందుకు?
ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
అదీ ‘ఆర్థిక’ యుద్ధమే: రాబర్ట్ కియోసాకి
నౌకలు నిల్చిపోతే కీలక రంగాలపై ఎఫెక్ట్
అనిల్ అంబానీకి ఈడీ షాక్
యుద్ధ భయం.. బీమా ప్రీమియం ప్రియం
పల్లె మహిళల్లోనూ యూపీఐ పరిమళాలు
రాంకీ ఇన్ఫ్రాకి రూ.1,402 కోట్ల కాంట్రాక్టు
ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం
భారతీయ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్త...
మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!
దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగ...
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో క...
దలాల్ స్ట్రీట్లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్ట...
వార్ ఎఫెక్ట్.. భారత్కు తప్పని ఇబ్బందులు!
అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ...
92 దాటేసిన రూపాయి!
ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలకు రెక్కల...
సేవల్లో పనితీరు.. ఫ్లాట్
న్యూఢిల్లీ: సేవల రంగ కార్యకలాపాలు ఫిబ్రవరిలో కాస్త...
ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్ర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది.
ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు
ఇటీవల నిర్వహించిన 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారీ పెట్టుబడులకు తెరలేచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఏఐపై కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్సహా అదానీ గ్రూప్, గూగుల్, టాటా, లైట్స్పీడ్ వెంచర్స్ తదితరాలు ఉమ్మడిగా 240 బిలియన్ డాలర్లు(రూ. 21.84 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబాటును ప్రదర్శించాయి. గత నెల 16–21 మధ్య నిర్వహించిన ఏఐ సదస్సు సుమారు 6 లక్షల మంది హాజరైన అతిపెద్ద ఈవెంట్గా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు వీటిలో పాలుపంచుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్ మోడళ్లు, హార్డ్వేర్, అప్లికేషన్లు తదితర విభాగాలలో 200 బిలియన్ డాలర్లకుపైగా ఏఐ సంబంధిత పెట్టుబడులకు కట్టుబాటు కనిపించినట్లు తెలియజేసింది. దిగ్గజాలు ఇలా..ఏఐ సదస్సులో డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 110 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఏడేళ్లలో వీటిని వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2035కల్లా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది. జనరల్ కేటలిస్ట్ ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కు కమిట్మెంట్ను ప్రకటించింది. ఈ బాటలో లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమని తెలియజేసింది.గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్తగా ఇండియా– యూఎస్ సబ్సీ కేబుల్ మార్గంసహా.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించారు. వీటిలో విశాఖపట్టణంలోని ఏఐ హబ్ సైతం కలసి ఉంది. ఇక టాటా గ్రూప్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం! ఈ సదస్సులో దేశ సావరిన్ కంప్యూట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన 38,000 జీపీయూలకు జతగా కొద్ది వారాలలో మరో 20,000 జీపీయూలకు తెరతీయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేషనల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత పటిష్టంకానుంది. 850 ఎగ్జిబిటర్లతో 10 థిమాటిక్ పెవిలియన్లతో ఏర్పాటైన ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఎగ్జిబిషన్లలో ఒకటిగా నిలిచినట్లు ప్రస్తావించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొందరికి శాపంగా మారుతోంది. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..సాఫ్ట్వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.బోధన రంగం (2029): క్లాస్రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.2033 (రక్షణ రంగం)గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.భవిష్యత్తు మంత్రంమారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్కు కారణం ఇదే..
పర్సనల్ ఫైనాన్స్
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.రాబడులుఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంమంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్ను తరచూ మార్చదు. ఒక కౌంటర్లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లలో (రీట్)నూ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల సిలిండర్ కొత్త రేటు..
మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలురాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.గృహ ఎల్పీజీ రేట్లు యథాతథంఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.
ఇన్సూరెన్స్తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్ ఈక్విటీ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్ గ్లోబల్ ఇన్వెస్ట్ లాంటి యూనిట్ లింక్డ్ పథకాల ద్వారా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.ట్రస్ట్ ఎంఎఫ్ మిడ్క్యాప్ ఫండ్ ప్రధానంగా మిడ్–క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మిడ్ క్యాప్ ఫండ్ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్క్యాప్ 150 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్–క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్ రికార్డుతో ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్కిడ్ అష్యూర్, స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్ ప్లస్) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్... జాగ్రత్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్మిట్ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్మెంట్ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్ పేరు, అడ్రస్, పాన్.. మీకు ఓనర్కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్ ఆదాయాన్ని ట్రాక్ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్ చేత రిటర్ను వేయించండి.


