Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Iran War Sends Retail Petrol Prices Soaring Up To 55pc Globally1
దేశాల్లో పెట్రోల్‌ మంటలు.. దారుణంగా ధరలు!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలుయుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలుగ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..దేశంపెరుగుదల శాతంమయన్మార్55.4%ఫిలిప్పీన్స్54.2%కంబోడియా52.8%లెబనాన్28.6%కెనడా25.0%పాకిస్తాన్24.4%చైనా23.2%జపాన్19.6%పొరుగు దేశాలైన పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌లో 0.98 డాలర్లుగా నమోదైంది.ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది.

Techie works 3 hours earns Rs 40 LPA parents fear Is He Doing Something Illegal2
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్‌లో రిమోట్‌గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం జీతం కాదు.. అతను పనిచేసే విధానం!రోహన్ ధావన్ అనే ఎంట్రాప్రెన్యూర్‌ తన మేనల్లుడి గురించి లింక్డ్‌ఇన్ (LinkedIn)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువ డెవలపర్ రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే లాప్‌టాప్ తెరిచి పనిచేస్తాడట. పని ముగియగానే దర్జాగా లాగ్-ఆఫ్ అవుతాడు. మిగిలిన రోజంతా ఖాళీగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు సంతోషపడాల్సింది పోయి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు."వీడు అసలు పనేం చేయడం లేదు.. ఇంత జీతం ఇస్తున్నారంటే ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడా?" అని ఆ తండ్రి తన ఆందోళనను ధావన్‌తో పంచుకున్నారు.కష్టపడటం అంటే గంటలు గడపడమేనా?సాధారణంగా భారతీయ మధ్యతరగతి ఇళ్లలో ఒక వ్యక్తి రోజుకు 10-12 గంటలు ఆఫీసులో కష్టపడితేనే అదే 'నిజమైన పని' అని నమ్ముతారు. "అలసటను ఒక గౌరవ చిహ్నంగా, పని సులభంగా అవ్వడాన్ని అనుమానంగా చూసే మనస్తత్వం మన సమాజంలో ఉంది" అని ధావన్ తన పోస్ట్‌లో విశ్లేషించారు. ఒకవేళ అదే అబ్బాయి తక్కువ జీతానికి టీసీఎస్‌ (TCS) లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పగలూరాత్రి కష్టపడితే, ఆ తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేవారని ఆయన పేర్కొన్నారు.పని తీరును మార్చిన ఏఐ2026 నాటి ఆధునిక పని వాతావరణంలో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో 8 గంటలు పట్టే పనిని, సరైన ఏఐ టూల్స్ వాడి 3 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రిమోట్ ఉద్యోగాల్లో మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారనే దానికంటే, ఎంత నాణ్యమైన పనిని డెలివరీ చేశారన్నదే ముఖ్యం. టెక్నాలజీపై పట్టున్న యువత ఇప్పుడు 'హార్డ్ వర్క్' కంటే 'స్మార్ట్ వర్క్' వైపు మొగ్గు చూపుతున్నారు.బిజీగా ఉన్నట్లు నటన!చాలా మంది యువ నిపుణులు తమ పనిని త్వరగా ముగించినప్పటికీ, సమాజం లేదా బాస్‌ల నుండి వచ్చే విమర్శల భయంతో "బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారని" ధావన్ ఎత్తి చూపారు. ఉత్పాదకతను గంటలతో కొలిచే పద్ధతి ఇంకా పోలేదని ఇది నిరూపిస్తోంది.

Experts Call for Policy Shifts to Turn Household Gold into Financial Assets3
ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!

దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు. అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం 'ఆర్థికీకరణ' (Financialization) ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా కరెంట్ ఖాతా లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రరత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని చౌదరి గుర్తుచేశారు. దేశ మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15 శాతం ఉందన్నారు. దాదాపు 50 లక్షల మందికిపైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు.50 వేల టన్నుల బంగారం నిల్వలునేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, భారతీయ ఇళ్లు, దేవాలయాల్లో కలిపి సుమారు 25,000 నుండి 50,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా అని తెలిపారు. "మన దగ్గర పటిష్టమైన ప్లాట్‌ఫాం, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) వినియోగాన్ని పెంచడానికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.అడ్డంకిగా 3% జీఎస్టీభౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసేందుకు ఈజీఆర్‌ విధానాన్ని సెబీ (SEBI) అందుబాటులోకి తెచ్చింది. అయితే, బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3 శాతం జీఎస్టీ (GST) దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని కృష్ణన్ వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించిందని వెల్లడించారు.పెరుగుతున్న డిమాండ్.. పుంజుకుంటున్న గోల్డ్ లోన్స్గత రెండేళ్లలో బంగారం ధరలు 30 శాతం పెరిగినప్పటికీ, ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదని ఇక్రా (ICRA) ప్రతినిధి జితిన్ మక్కర్ తెలిపారు. ప్రధాన జ్యువెలరీ రిటైలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ స్టోర్ నెట్ వర్క్ ను 20 శాతం మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో గతంలో రూ. 1 లక్ష కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.తప్పనిసరి హాల్‌మార్కింగ్, 'ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్' వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయని, ఇది దిగుమతుల నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషించారు.

BHIM App Approve UPI Payments up to Rs 5000 using Biometrics4
ఇక ఫింగర్‌ప్రింట్‌తోనే పేమెంట్స్!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్‌ రికగ్నిషన్‌తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఫీచర్‌ ముఖ్యాంశాలురూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని బయోమెట్రిక్ ఫీచర్‌ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్‌లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.యాక్టివేట్ చేసుకునే విధానంభీమ్ యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ను యాక్టివేట్‌ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫారమ్‌లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులో ఉంది.

Cabinet clears modified UDAN scheme with Rs 28840 crore outlay5
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా మొత్తం రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదంజాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుఐవీఎఫ్‌ఆర్‌టీ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు క్యాబినెట్ అనుమతిఉడాన్ 2.0 పథకానికి క్యాబినెట్ ఆమోదంపదేళ్ల వ్యవధిలో 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ప్రభుత్వంఈ పథకం కింద కొత్తగా 100 విమానాశ్రయాల అభివృద్ధి200 హెలిపాడ్ ల ఆధునీకరణఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కోసం 2,577 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం ఎయిర్ లైన్స్ ఆపరేటర్స్ కు వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద 10,043 కోట్ల రూపాయల సహాయం ఈ పథకం కింద కొత్తగా 120 ప్రాంతాలకు పెరుగనున్న ఎయిర్ కనెక్టివిటీపర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ విధానానికి క్యాబినెట్ ఆమోదం సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 52 శాతం విద్యుత్ ఉత్పత్తి

Stock Market Closing March 25 Sensex Soars 1205 Pts6
భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. ఐటీ షేర్లు మాత్రం డీలా

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన తరువాత చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రెండవ సెషన్ లో ఎగిశాయి.నిఫ్టీ 1.72 శాతం లేదా 392.70 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద, సెన్సెక్స్ 1.63 శాతం లేదా 1,205 పాయింట్లు పెరిగి 75,273.45 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్‌లో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance), అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), ట్రెంట్ (Trent), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) వంటి షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. మరోవైపు, ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి లోనవ్వడంతో టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రధానంగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీనితో పాటు పవర్ గ్రిడ్ (Power Grid), టీసీఎస్ (TCS) వంటి షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.30 శాతం, 2.59 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ గెయినర్ గా నిలిచాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ కూడా తమ సహచరులను అధిగమించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది.

Advertisement
Advertisement
Advertisement