Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India to be Among Renaults Top 3 Global Markets 7 New Models by 20301
టాప్‌ 3 మార్కెట్లలో భారత్‌

చెన్నై: రాబోయే రోజుల్లో భారత్‌ తమ టాప్‌ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనో గ్లోబల్‌ గ్రూప్‌ సీఈవో ఫ్రాంకోయిస్‌ ప్రొవోస్ట్‌ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు.అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్‌ నుంచి ఏటా 2 బిలియన్‌ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్‌ వివరించారు. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’బ్రిడ్జర్‌ కాన్సెప్ట్‌’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనంగా, తమ విద్యుత్‌ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు.తమ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్‌ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్‌ చెప్పారు.

Aditya Birla Capital Empowers Women Entrepreneurs Launches Leadership Program2
మహిళలకు ‘లీడర్‌షిప్‌’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్‌

ముంబై: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌), తన ఫిన్‌టెక్‌ విభాగం ఇన్ఫినైట్‌ కింద మహిళల కోసం మహిళలే నిర్వహించే ‘లీడర్‌షిప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సేవలు ఫిన్‌టెక్‌ రంగాల్లో ప్రారంభ దశలో ఉన్న మహిళా వ్యాపారవేత్తలకు దీని కింద మద్దతు ఇస్తుంది. అలాగే, వారికి అవసరమైన వనరులు అందించడంతోపాటు వేగంగా తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వ్యాపార విస్తరణకు స్థిరమైన అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రకటించింది.ఈ 'లీడర్‌షిప్‌' కార్యక్రమం ద్వారా ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లోని అగ్రశ్రేణి నిపుణుల నుండి ప్రత్యక్ష పర్యవేక్షణ (Mentorship) లభిస్తుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, మార్కెట్ యాక్సెస్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్కింగ్ అవకాశాలను కల్పించడం ద్వారా వారి స్టార్టప్‌లను విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ఫిన్‌టెక్ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో లింగ వివక్షను తొలగించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఏబీసీఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు.అంతేకాకుండా, ఈ వేదిక ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీలవుతుంది. వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడం ద్వారా వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా వారిని సిద్ధం చేస్తారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, సుస్థిరమైన, సమ్మిళిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ ముందడుగు వేసింది.

Gautam Adani overtakes Mukesh Ambani as Asias richest person3
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్‌ అంబానీ నెం.2

ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టి ఆయన స్థానాన్ని అదానీ ఆక్రమించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా గణాంకాల ప్రకారం.. గౌతమ్‌ అదానీ నికర సంపద 92.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన అత్యంత సంపన్నుల్లో ఆసియాలో అగ్ర స్థానానికి, ప్రపంచంలో 19 ప్లేస్‌కు చేరుకున్నారు.చాలా కాలం ఆసియా అత్యంత సంపన్నుడుగా కొనసాగిన ముఖేష్‌ అంబానీ 90.8 బిలయన్‌ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానానికి పరిమితమయ్యారు. వీరి సంపద మధ్య అంతరం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మార్పు ప్రపంచ సంపద కదలికల అస్థిర స్వభావాన్ని తెలియజేస్తోంది.అంబానీ vs అదానీ: లాభాలు.. నష్టాలుఈ సంవత్సరం తన గ్రూప్ స్టాక్ పనితీరులో స్థిరమైన లాభాలు అదానీ సంపద పెరుగుదలకు కలిసొచ్చాయి. సంపదకు 8.1 బిలియన్ డాలర్లు జత కలిశాయి. దీనికి విరుద్ధంగా, అంబానీ అదే కాలంలో తన నికర సంపదలో 16.9 బిలియన్ డాలర్లను కోల్పోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఫ్లాట్ మార్కెట్ పనితీరును కనబరిచింది. దీంతో అంబానీ సంపద 76.7 మిలియన్ డాలర్ల స్వల్ప పెరుగుదలను చూసింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. దీంతో కేవలం ఒక రోజులో అదానీ సంపదకు 3.56 బిలియన్ డాలర్లు జత కలిశాయి.ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే..ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లారీ పేజ్ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ 10 లో జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, మైఖేల్ డెల్, జెన్సన్ హువాంగ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జిమ్ వాల్టన్ ఉన్నారు.

Robert Kiyosaki WARNED predictions in Rich Dads Prophecy are coming true4
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్‌’

ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026

Simple Ultra electric scooter launched with 400km range5
కారును మించిన ‘రేంజ్‌’లో కొత్త స్కూటర్‌

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లోకి సంచలన మోడల్‌ను ప్రవేశపెట్టింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ అల్ట్రా' (Simple Dot One/Ultra)ను రూ. 2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 'జెన్ 2' లైనప్‌తో పాటు ఆవిష్కరించిన ఈ స్కూటర్, ఇప్పుడు బుకింగ్స్‌కు సిద్ధంగా ఉంది.ఒక్క ఛార్జ్‌తో 400 కిలోమీటర్లు!ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్ల (IDC) మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ద్విచక్ర వాహన రంగంలో ఇదే అత్యధికం. ఈ స్థాయి రేంజ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లకు కూడా లేదు.ఉదాహరణకు, భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ (ధర సుమారు రూ. 7.99 లక్షలు) ఒక్క ఛార్జ్‌పై 293 కిమీ మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కన చూస్తే, కారు కంటే సగం ధరలోనే అంతకంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా 'సింపుల్ అల్ట్రా' రికార్డు సృష్టించింది.పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ఈ స్కూటర్ 6.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రైడర్ భద్రత కోసం ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే, రైడింగ్ డేటా, కనెక్టివిటీ ఫీచర్ల కోసం 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.విలువ పరంగా చూస్తే.. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 2.35 లక్షలు ఖర్చు చేయడం ఎక్కువ అనిపించినా, అది ఇచ్చే 400 కిమీ రేంజ్ వాహనదారులకు భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 250 డ్యూక్ (రూ. 2.17 లక్షలు) వంటి స్పోర్ట్స్ బైక్ల ధరకు ఇంచుమించు సమానంగా ఉంది.

HCL employee asks appraisal to CEO dancing on stage at anniversary event6
డ్యాన్స్‌ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!

కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్‌లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసలేం జరిగింది?హెచ్‌సీఎల్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్‌ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.సీన్ కట్ చేస్తే.. సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్‌ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.ఇదీ చదవండి: ‘టెక్‌ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. View this post on Instagram A post shared by Prajjwal Bhatia (@prajjwal_bhatia)

Advertisement
Advertisement
Advertisement