Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Nissan Gravite 7 seater MPV Launched At Rs 5 65 Lakh1
నిస్సాన్‌ గ్రావైట్‌.. మరో కొత్త 7-సీటర్‌ కారు వచ్చేసింది..

నిస్సాన్‌ (Nissan) తన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీ ‘గ్రావైట్‌’ (Gravite)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రెనాల్ట్‌ ట్రైబర్‌ (Renault Triber) ఆధారంగా రూపొందించిన ఈ గ్రావైట్‌.. ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ డిజైన్ మార్పులతో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మస్క్యులర్ స్టైలింగ్, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగిన ఇంటీరియర్ ఈ మోడల్‌కు ప్రత్యేకతను ఇస్తాయి.అయితే ఇంజిన్, ఫీచర్ల పరంగా చాలా వరకు ట్రైబర్‌ను పోలి ఉంటుంది. భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్‌ ఈ గ్రావైట్‌ను కీలక మోడల్‌గా భావిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.వేరియంట్లు, ధరలు, బుకింగ్ వివరాలునిస్సాన్‌ గ్రావైట్‌ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి విసియా (Visia), అసెంటా (Acenta), ఎన్‌-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna). ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..విసియా ఎంటీ – రూ. 5.65 లక్షలుఅసెంటా ఎంటీ – రూ. 6.59 లక్షలుఎన్‌-కనెక్టా ఎంటీ – రూ. 7.20 లక్షలుఎన్‌-కనెక్టా ఏఎంటీ – రూ. 7.80 లక్షలుటెక్నా ఎంటీ – రూ. 7.91 లక్షలుటెక్నా ఏఎంటీ – రూ. 8.49 లక్షలుటెక్నా లాంచ్‌ ఎడిషన్‌ ఎంటీ – రూ. 8.35 లక్షలుటెక్నా లాంచ్‌ ఎడిషన్‌ ఏఎంటీ – రూ. 8.93 లక్షలుగ్రావైట్‌ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వేరియంట్-వైజ్ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.ఎక్స్‌టీరియర్డిజైన్ పరంగా నిస్సాన్‌ గ్రావైట్‌.. రెనాల్ట్‌ ట్రైబర్‌ ప్రాథమిక సిల్హౌట్‌ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్‌ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్‌తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్‌పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ క్రోమ్ స్ట్రిప్‌తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.సైడ్ ప్రొఫైల్‌లో రెనాల్ట్‌ ట్రైబర్‌ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్‌లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్‌తో కలిపి అమర్చారు. బంపర్‌పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.ఇంటీరియర్ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్‌బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్‌ మోడల్‌ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్‌ను అందిస్తున్నాయి.ఫీచర్లు, సేఫ్టీగ్రావైట్‌లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ యాపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్‌తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్.ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్‌ కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్‌ ఉన్నాయి.ఇంజిన్, పనితీరుగ్రావైట్‌లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్‌ పవర్, 96 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఇవ్వగా ఇంధన సామర్ 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT)పోటీ మోడళ్లునిస్సాన్‌ గ్రావైట్‌ ప్రధానంగా రెనాల్ట్‌ ట్రైబర్‌తో పోటీ పడుతుంది. అలాగే మారుతి ఇర్టిగా, మారుతి ఎక్స్‌ఎల్‌6, కియా కారెన్స్‌, కియా కారెన్స్‌ క్లావిస్‌ లకు ఇది అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

Chinas Lunar New Year Impact on gold silver prices2
పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్‌ ఎంత?

చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావంతో ఆసియా కమోడిటీ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోవడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా చైనా, హాంకాంగ్‌లోని ఎక్స్ఛేంజీలు మూతపడటంతో మార్కెట్‌లో భాగస్వామ్యం సన్నగిల్లి, తాత్కాలిక అస్థిరత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.బుధవారం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 3.51 శాతం ఎగిసి రూ.2,36,824 వద్ద ట్రేడవగా, ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.88 శాతం పెరిగి రూ.1,52,742 వద్ద నమోదయ్యాయి.లూనార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?లూనార్ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య జరిగే చలించే పండుగ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన ఈ సెలవులు పూర్తి వారం పాటు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇది జనవరి 28 నుంచి ప్రారంభమై జనవరి, ఫిబ్రవరి నెలల్లో విస్తరించింది.పండుగకు ముందు వినియోగదారులు భారీగా షాపింగ్ చేయడం, కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు కర్మాగారాలు ముందుగానే మూసివేయడం సాధారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పనిదినాలు తగ్గిపోవడం, జనవరిలో పనిదినాలు పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి.బంగారం, వెండి ధరలపై ప్రభావంచైనా లూనార్ న్యూ ఇయర్ ఎఫెక్ట్‌ బంగారం, వెండి ధరలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ కమోడిటీ & కరెన్సీ అనలిస్ట్‌ అమీర్ మక్డా ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద భౌతిక బంగారం కొనుగోలుదారులలో ఒకటైన చైనా మార్కెట్ సెలవుల కారణంగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయి. దీని ఫలితంగా ధరలలో అతిశయోక్తి మార్పులు, విస్తృత బిడ్-ఆస్క్ స్ప్రెడ్లు కనిపిస్తాయని ఆయన చెబుతున్నారు.చారిత్రాత్మకంగా ఈ కాలంలో ధరల దిద్దుబాట్లు చోటుచేసుకుంటాయని, పండుగకు ముందు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు తీసుకోవడం వల్ల వేగం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా వెండి ధరలు ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితమవుతాయని, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పడిపోతుందని చెప్పారు. అందువల్ల ఈ సమయంలో బులియన్ ట్రేడింగ్‌లో జాగ్రత్త అవసరమని సూచించారు.షాంఘై, హాంకాంగ్ వంటి ప్రధాన ఆసియా ఎక్స్ఛేంజీలు మూసి ఉండటంతో మార్కెట్ కార్యకలాపాలు తగ్గిపోతాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి చెబుతున్నారు. తక్కువ భౌతిక డిమాండ్, పరిమిత మార్కెట్ మేకర్ల కారణంగా ధరలు కొన్నిసార్లు గణనీయంగా పడిపోవచ్చని తెలిపారు. అయితే ఈ పుల్‌బ్యాక్‌లు సాధారణంగా కాలానుగుణమని, ఆసియా మార్కెట్లు తిరిగి తెరుచుకున్న తర్వాత ధరలు స్థిరపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Britannia Industries Gears Up to Compete with Local Players Nationwide3
లోకల్‌తో పోటీకి బ్రిటానియా రెడీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్‌ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్‌ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్‌ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్‌ హర్గవే తెలిపారు.‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్‌లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్‌లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్‌డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్‌ తదితర పాపులర్‌ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం వల్లే.. ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్‌ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు. కొనుగోళ్లకూ సై.. విస్తృతమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్‌ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విపిన్‌ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్‌ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు.

Jio Unveils Nation First AI Stack at India AI Impact Summit4
ఇక ‘జియో ఏఐ స్టాక్’.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ముందడుగు

కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.జియో ఇంటెలిజెన్స్‌ ప్రోగ్రామ్‌ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లుజియో ఏఐ స్టాక్‌లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లు, డెవలప్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్‌లు, మల్టీలింగ్వల్‌ ఇంటెలిజెన్స్‌ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.జియో ఏఐ స్టాక్‌ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.భారతీయ భాషలకు ప్రాధాన్యంఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్‌ఫార్మ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Three Companies Line Up IPOs to Raise Over Rs 3000 Crore5
పబ్లిక్‌ ఇష్యూకు మూడు కంపెనీలు

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 1,000–1,053 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 1,900 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్‌ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 3,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 20న షేర్లను ఆఫర్‌ చేయనుంది. తొలుత 2025 ఆగస్ట్‌ దరఖాస్తులో రూ. 5,200 కోట్ల సమీకరణకు సిద్ధపడినప్పటికీ పరిమాణాన్ని కుదించింది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,125 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. మార్చి 2న లిస్ట్‌కానున్న కంపెనీ రూ. 12,325 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.కంపెనీ తీరిలా 2010లో ఏర్పాటైన రెనెవబుల్‌ ఎనర్జీ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ప్రధానంగా వాణిజ్య(కమర్షియల్‌), పారిశ్రామిక(ఇండ్రస్టియల్‌) రంగాలకు పవన, సౌర, హైబ్రిడ్‌(పునరుత్పాదక) విద్యుత్‌ సరఫరాసహా ఇంధన సరీ్వసులను అందిస్తోంది. ఆయా రంగాలకు నెట్‌ జీరో, కర్బననిర్మూలన సొల్యూషన్స్‌ సమకూర్చుతోంది. 2025 జూలై 31కల్లా కంపెనీ 2.54 గిగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు.. మరో 2.53 జీడబ్ల్యూ కాంట్రాక్ట్‌డ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 5.07 జీడబ్ల్యూ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 2024–25లో ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,610 కోట్లను అధిగమించింది. నష్టాల నుంచి బయటపడి రూ. 28 కోట్ల నికర లాభం ఆర్జించింది. డేటా సెంటర్లు, ఏఐ, టెక్నాలజీ, సిమెంట్, స్టీల్‌ తది తర రంగాల క్లయింట్లకు సరీ్వసులు అందిస్తోంది.గౌడియం ఐవీఎఫ్‌ ఐపీవో 20న ఫెర్టిలిటీ సర్వీసుల సంస్థ గౌడియం ఐవీఎఫ్‌ అండ్‌ విమెన్‌ హెల్త్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 75–79 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగియనుంది. దీనిలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్‌ మనికా ఖన్నా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా సంస్థ రూ. 165 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్‌ చేయనుంది. వెరసి కృత్రిమ గర్భధారణ(ఫెర్టిలిటీ) సరీ్వసులందించే సంస్థ తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను దేశవ్యాప్తంగా 19 కొత్త ఐవీఎఫ్‌ కేంద్రాల ఏర్పాటుకు వెచ్చించనుంది. రూ. 20 కోట్లు రుణచెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ఈ నెల 27న లిస్ట్‌కానున్న సంస్థ రూ. 575 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.కంపెనీ తీరిలా ఖన్నా ఏర్పాటు చేసిన గౌడియం ఐవీఎఫ్‌ దేశీయంగా రీప్రొడక్టివ్‌ టెక్నాలజీలలో సుప్రసిద్ధమైంది. 7 ప్రధాన కేంద్రాలుసహా 28 అనుబంధ విభాగాల ద్వారా సంస్థ సేవలు సమకూర్చుతోంది. 2024–25లో ఆదాయం రూ. 48 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు ఎగసింది. నికర లాభం రూ. 10 కోట్ల నుంచి రూ. 19 కోట్లకు జంప్‌చేసింది. కంపెనీ తొలుత(జనవరిలో) 1.83 కోట్ల ఈక్విటీ షేర్ల జారీసహా.. ప్రమోటర్‌ 25.31 లక్షల షేర్లు ఆఫర్‌ చేయనున్నట్లు పేర్కొంది. తదుపరి వీటి సంఖ్యను సవరించింది. ఐపీవో చేపట్టేందుకు 2025 జూలైలో గోప్యతా మార్గంలో సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది.కార్ల్స్‌బెర్గ్‌ ఐపీవో చూపు మాల్ట్‌ పానీయాల డెన్మార్క్‌ దిగ్గజం కార్ల్స్‌బెర్గ్‌ దేశీ బిజినెస్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయాలని యోచిస్తోంది. తద్వారా వాటాదారులకు విలువ చేకూర్చాలని చూస్తున్నట్లు గ్రూప్‌ సీఈవో జాకబ్‌ ఆరుప్‌ ఆండర్సన్‌ వెల్లడించారు. అయితే పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేశారు. దేశీయంగా పటిష్ట వృద్ధిని సాధిస్తున్న కంపెనీ దేశీ బిజినెస్‌ను లిస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. సంస్థ వాటాదారుల విలువ పెంచేందుకు ఐపీవోసహా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఇంతకుమించి మాట్లాడేందుకు చట్ట సంబంధిత అంశాలు అడ్డుపడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో లిస్టింగ్‌ అంశంపై స్పందించలేనని, అయితే వాటాదారులకు విలువ చేకూర్చడంపై ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.

Kia Seltos Crosses 6 Lakh Unit Production Milestone In India6
కియా తొలి మోడల్‌.. 6 లక్షల కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా సెల్టోస్‌ (Kia Seltos) మరో కీలక మైలురాయిని దాటింది. దేశంలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఉత్పత్తి 6 లక్షల యూనిట్లను అధిగమించినట్లు కియా ఇండియా ప్రకటించింది. 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తూ వస్తోంది. సెల్టోస్.. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి మోడల్ కావడం విశేషం. ప్రస్తుతం ఇది రెండో తరం వెర్షన్‌లో అందుబాటులో ఉంది.కియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సెల్టోస్ అమ్మకాలలో సుమారు 29 శాతం వాటా టాప్ వేరియంట్లదే. అధునాతన భద్రతా సాంకేతికతలు, అధిక సౌకర్యాలున్న ఫీచర్ రిచ్ వెర్షన్లను కస్టమర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది.సెల్టోస్‌ను ప్రారంభం నుంచే ప్రత్యేకతతో రూపుదిద్దినట్లు కియా ఇండియా పేర్కొంది. విభిన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలు, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నిండిన కేబిన్ ఈ ఎస్‌యూవీకి ప్రధాన బలాలుగా నిలిచాయి. ఈ మోడల్‌లో మూడు 1.5 లీటర్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 115 హెచ్‌పీ శక్తినిచ్చే సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 116 హెచ్‌పీ డీజిల్ ఇంజిన్, 160 హెచ్‌పీ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌‌ ఉన్నాయి.ట్రాన్స్‌మిషన్ పరంగా కూడా విస్తృత ఎంపికలు కల్పించింది. సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ; డీజిల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్; టర్బో పెట్రోల్‌కు 6-స్పీడ్ ఐఎమ్‌టి, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.ఫీచర్లు.. ధరప్రస్తుతం సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64-కలర్ అంబియెంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్-2 ఏడీఏఎస్, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి.ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్ హాక్ పార్క్ మాట్లాడుతూ.. “6 లక్షల అమ్మకాల మైలురాయిని దాటడం వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనం. డిజైన్, భద్రత, సాంకేతికత, పనితీరు రంగాల్లో ఉన్న బలమైన పునాది కారణంగానే సెల్టోస్ ఈ స్థాయికి చేరుకుంది. మిడ్-ఎస్‌యూవీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మోడల్‌గా ఇది నిలిచింది” అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement