ప్రధాన వార్తలు
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే భారత్కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్ఎన్జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్పీజీ వినియోగం ఒక మిలియన్ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అందరికీ ఒకే ఏఐ పరిష్కారాలు సరిపోవు
న్యూఢిల్లీ: కంపెనీల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ప్లగ్ అండ్ ప్లే (సిద్ధంగా ఉన్న) రకమైన సాధారణ సాఫ్ట్వేర్లు సరిపోవని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ వెల్లడించింది. సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి స్థాయి ఏఐ పరిష్కారాలను అందించే ఐటీ కంపెనీలకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపింది. ఏఐపై నిర్ణయాధికారం కలిగిన 600 మందితోపాటు 38 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను సర్వే చేసి ఒక నివేదిక విడుదల చేసింది.సంస్థలు ఏఐ భాగస్వామిని (టెక్నాలజీ సంస్థ) ఎంపిక చేసేటప్పుడు ధర లేదా సత్వర ఫలితాలు కంటే, తమ అవసరాలకు తగ్గట్టు రూపొందించిన ప్రత్యేక పరిష్కారాలు, విధానాలను కీలకంగా చూస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా అందుబాటులో ఉండే ఏఐ సాఫ్ట్వేర్లు తమ వ్యాపార అవసరాలకు సరిపోవంటూ కొన్ని సంస్థలు ఏఐ సేవలను తిరస్కరిస్తున్నాయని వెల్లడించింది. తగినంత అనుభవం లేకపోవడం, ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేయకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడాన్ని కారణాలుగా పేర్కొంది. కీలక సవాళ్లు.. ఏఐ స్వీకరణలో సంస్థలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లలో.. నియంత్రణ, నిబంధనలపరమైన ఆందోళనలు.. పెట్టుబడిపై సరైన రాబడిని చూపించడం కష్టంగా ఉండడం.. ఏఐ వ్యూహంపై సరైన స్పష్టతలేమిని పేర్కొంది. ఏఐ విజయవంతం కావాలంటే ఒక్కో నమూనాను అమలు చేయడంతోనే సరిపోదని, సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. అలాగే ఏఐపై పెట్టుబడులను ప్రయోగాత్మకంగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులుగా సంస్థలు చూస్తున్నాయని తెలిపారు. ఏఐ మనుషుల పనులను వేగవంతం చేస్తుందే కానీ, వారి ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని కాగ్నిజెంట్ అధ్యయన నివేదిక పేర్కొంది. మనుషులు ఏఐ కలిసి పనిచేసే విధంగా పనితీరులో మార్పులు వస్తాయని తెలిపింది.
ప్రమాదంలో యూపీఐ సెక్యూరిటీ!
న్యూఢిల్లీ: ఆన్లైన్ మోసగాళ్లు కొత్త టెక్నాలజీతో యూపీఐ యూజర్లనూ బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ భద్రతా ఫీచర్లను ఛేదించుకుని మరీ, ఆర్థిక లావాదేవీలు కానిచ్చేస్తున్నారని, సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్సెక్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. టెలీగ్రామ్లో 20 గ్రూప్లు చురుగ్గా పనిచేస్తున్నట్టు, ప్రతీ బృందంలో 100కు పైగా సభ్యులున్నుట్టు తెలిపింది. ఈ గ్రూప్లు ‘డిజిటల్ లూటెరా’ పేరుతో చర్చించుకోవడం, పంపిణీ చేయడం, నిర్వహించడం చేస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇది కేవలం మరొక యూపీఐ మాల్వేర్ రకమే కాదు.డివైజ్పై ఉన్న నమ్మకంపైనే డిజిటల్ లూటెరా దాడి చేస్తోంది. ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చివేస్తున్నప్పుడు.. సంప్రదాయ రక్షణలైన సిమ్ బైండింగ్ యాప్ (సిమ్కు అనుసంధానమైన) సిగ్నేచర్ తనఖీ కూడా పనికిరాకుండా పోతుంది. దీనికి పరిష్కారం కనుగొనకపోతే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అంతటినీ తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది’’అని హెచ్చరించింది. ఒక టెలిగ్రామ్ గ్రూప్ రెండు రోజుల్లోనే రూ.25–30 లక్షల లావాదేవీలను పూర్తి చేసిందని క్లౌడ్సెక్ విశ్లేషణలో తేలింది. ఈ మోసపూరిత వ్యవస్థ ఎంత వేగంగా విస్తరించగలదు, ఎంత మంది మోసం చేయగలదన్నదానికి ఇది నిదర్శమని పేర్కొంది. మోసం ఇలా... మొబైల్ ఫోన్ యూజర్ తనకు తెలియకుండా హానికారక ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు.. డిజిటల్ లూటెరా కిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. వెంటనే సైబర్ నేరస్థులకు ఫోన్పై నియంత్రణ వెళుతుంది. దీంతో బ్యాంక్ ఓటీపీలు అటాకర్ల టెలీగ్రామ్ ఛానళ్లకు వెళతాయి. భద్రతకు ఢోకాలేదు: ఎన్పీసీఐ దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూపీఐ నిర్వహణ సంస్థ/ఎన్పీసీఐ) స్పందించింది. డిజిటల్ చెల్లింపుల నిర్వహణకు సంబంధించి బలమైన తనిఖీలున్నట్టు స్పష్టం చేసింది. ‘‘సంబంధిత నివేదికను ఎన్పీసీఐ పరిశీలించింది. ఆ విధమైన రిస్క్లను పరిష్కరిచేందుకు తగినన్ని రక్షణలు ఉన్నాయి. బహుళ అంచల రక్షణలతో, గుర్తింపు ధ్రువీకరణలతో లావాదేవీలను సురక్షితంగా, భద్రంగా చేసుకునే విధంగా యూపీఐని రూపొందించడమైంది’’అని ఎన్పీసీఐ వివరణ ఇచ్చింది.
కాలేజీ స్టూడెంట్స్ కోసం ఐక్యూ జెడ్11ఎక్స్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తాజాగా కాలేజీ విద్యార్థుల కోసం జెడ్11ఎక్స్ ఫోన్ని ఆవిష్కరించింది. దీని ధర డిస్కౌంట్ల అనంతరం రూ. 17,499 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్, ఐక్యూ పోర్టల్స్తో పాటు వివో స్టోర్స్, ఇతర ఔట్లెట్స్లో మార్చి 16 మధ్యాహ్నం నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.మల్టీటాస్కింగ్కి ఉపయోగపడేలా 7200 ఎంఏహెచ్, మీడియాటెక్ డైమెన్సిటీ టర్బో చిప్, సోనీ ఏఐ ఆధారిత 50 ఎంపీ కెమెరా, ముందు..వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్, 6.76 అంగుళాల డిస్ప్లే, రెండేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయని సంస్థ సీఈవో నిపుణ్ మార్యా తెలిపారు. నిర్దిష్ట ఎస్బీఐ, యాక్సిస్ క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు లభిస్తాయి. మేకిన్ ఇండియా నినాదానికి కట్టుబడి ఉంటూ గ్రేటర్ నోయిడాలోని వివో ప్లాంటులో వీటిని తయారు చేస్తారు.
నియామకాల పండగే!
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు వచ్చే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరగనున్నట్లు మ్యాన్పవర్ గ్రూప్ తాజా సర్వే తెలిపింది. వ్యాపారాల్లో పెరిగిన విశ్వాసం, దేశీ డిమాండ్ బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారం.. 2026 సంవత్సరం రెండో త్రైమాసికానికి నెట్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో) 68 శాతానికి చేరి రికార్డు స్థాయిని తాకింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 17 పాయింట్లు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 పాయింట్లు ఎక్కువ.జనవరి 1 నుంచి ఫిబ్రవరి 3 మధ్య దేశవ్యాప్తంగా 3,000కిపైగా సంస్థల యజమానుల అభిప్రాయాలను మ్యాన్పవర్ గ్రూప్ తెలుసుకుని ఈ వివరాలు విడుదల చేసింది. గతేడాది చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు, 2026 సంవత్సరానికి బలమైన ఆర్థిక వృద్ధి అంచనాలు వ్యాపారాలకు మద్దతునిస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. అలాగే భారత్– ఐరోపా సమాఖ్య (ఈయూ) వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వంటివి మెరుగైన ఎగుమతులకు సహాయపడతాయని పేర్కొంది. నియామకాలు పెరుగుతాయన్న సంస్థల అంచనాల నుంచి, నియామకాలు తగ్గుతాయని చెప్పిన కంపెనీల అంచనాలను మినహాయించగా వచి్చందే నెట్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ (ఎన్ఈవో). ఫైనాన్స్, బీమాలో ఎక్కువ.. ⇒ మ్యాన్పవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీలు గరిష్ట నియామక అంచనాలతో ఉన్నాయి. ఇది 71 పాయింట్లుగా ఉంది. గత త్రైమాసికం నుంచి 8 పాయింట్లు పెరిగింది. అదే గతేడాది క్యూ2తో పోలి్చతే ఏకంగా 26 పాయింట్లు పెరిగింది. అంతేకాదు ఫైనాన్స్, బీమా రంగంలో నియామక అంచనాల పరంగా అంతర్జాతీయంగానూ భారత్ మొదటి స్థానంలో ఉంది. ⇒ ఆటోమోటివ్ రంగం సైతం పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో తీసుకోనుంది. ఆ తర్వాత టెక్నాలజీ, ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలు రానున్నాయి. ⇒ ఆతిథ్య రంగంలో నియామకాల అంచనా 31 శాతంగా ఉంది. ఈ రంగంలో కొంత అప్రమత్త ధోరణి కనిపించింది. ⇒ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యోగ నియామకాలు పెరగనుండగా, ఉత్తర భారత్లో మాత్రం 70 పాయింట్లతో బలమైన అంచనాలు కనిపించాయి. ⇒ ఇప్పటికే 87 శాతం సంస్థలు నియామకాలు, శిక్షణ విషయంలో ఏఐని వినియోగిస్తున్నాయి. ఏఐ తమ అంచనాలను పూర్తిగా అందుకుంటున్నట్టు 11 శాతం సంస్థలే చెప్పాయి.వేధిస్తున్న నిపుణుల కొరత..‘‘నియామకాల ఉద్దేశ్యం బలంగా ఉంది. ఇది యాజమాన్యాల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. అదే సమయంలో నిపుణుల కొరత సైతం వేధిస్తోంది. తమకు కావాల్సిన నైపుణ్యాలను గుర్తించడం కష్టంగా ఉందని 82 శాతం సంస్థలు అంటున్నాయి. రానున్న రోజుల్లో నియామక నిర్ణయాలను కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావితం చేయనుంది’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటీ తెలిపారు.
మస్క్ టీమ్లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.ఎవరీ దేవేంద్ర చాప్లోట్?IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్బుక్ AI రీసెర్చ్లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.Welcome to @xAI! https://t.co/5tAdHPJmfx— Elon Musk (@elonmusk) March 13, 2026సాధించిన పురస్కారాలుదేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్షాప్లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.
కార్పొరేట్
కీలక రంగాల్లో భాగస్వామిగా తెలంగాణ.. టాంజానియా బృందంతో మంత్రి
మస్క్ టీమ్లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 16వేల మంది ఇంటికి!
వీసాల పొడిగింపు.. భారత్ గుడ్ న్యూస్
మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక.. ఎన్ఎస్ఈ ఐపీవో సన్నాహాలు
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు రిజర్వేషన్లు బంద్!
ఇన్ఫోసిస్ మొహాలీ క్యాంపస్ విస్తరణ
సీఈఓ పదవికి శంతను వీడ్కోలు.. కొత్త బాస్ ఎవరు?
సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు
కరుగుతోన్న ఇన్వెస్టర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్ట...
క్రూడ్ మంట.. బేర్ పంజా!
మళ్లీ ముడిచమురు ధరల మంటతోపాటు పశ్చిమాసియాలో యుద్ధ ...
గిఫ్ట్ సిటీ తొలి ఐపీవో తేదీ మార్పు
పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో గిఫ్ట్ సిటీ తొలి...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కె...
రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు?
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా ఇ...
జీడీపీకి చిల్లు.. నెలకు 8 బిలియన్ డాలర్లు!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలతో ఇంధనాల ...
గ్యాస్ కష్టాలు.. మూతపడుతున్న రెస్టారెంట్లు!
అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణం...
బంగ్లాదేశ్కు భారత్ ఆపన్నహస్తం
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుత...
ఆటోమొబైల్
టెక్నాలజీ
క్రోమ్ బ్రౌజర్లో ఏఐ టూల్స్
సురక్షితమైన, మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని కల్పించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో క్రోమ్ బ్రౌజర్ యూజర్ల కోసం ప్రత్యేకంగా బిల్ట్ ఇన్ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, హిందీలాంటి 8 ప్రాంతీయ భాషలతో పాటు 50 ల్యాంగేజ్లకు సపోర్ట్ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ జెమిని 3.1 మోడల్పై రూపొందించిన ఈ ఫీచర్లతో, బ్రౌజర్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని వివరించింది. ముందుగా డెస్క్టాప్, ఐవోఎస్లలో ఇవి అందుబాటులో ఉంటాయని గూగుల్ డైరెక్టర్ షార్మెయిన్ డిసిల్వా తెలిపారు.వీటిని తొలిసారిగా ప్రవేశపెడుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని వివరించారు. కొత్త ఫీచర్ల ప్రకారం వేరే ట్యాబ్కి మారాల్సిన అవసరం లేకుండా యూజర్లు, ప్రస్తుత ట్యాబ్లోనే పైన కుడివైపున ఉండే బ్రౌజింగ్ అసిస్టెంట్ ఐకాన్ని క్లిక్ చేసి నేరుగా చాట్ చేయొచ్చు. చాంతాడంత కంటెంట్ను సంక్షిప్తంగా పొందవచ్చు. జీమెయిల్తో అనుసంధానించడం వల్ల ప్రస్తుత పేజీ నుంచి వేరే పేజీకి వెళ్లక్కర్లేకుండా, సైడ్ ప్యానెల్ నుంచే ఈమెయిల్స్ రాయొచ్చు, పంపించవచ్చు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే!
3 రోజుల్లోనే ఉద్యోగం పోతే.. ఈ ఏఐ ఇంజనీర్ ఏం చేసిందంటే..
ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరతాం.. అలా చేరిన మూడు రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోతే.. రీతూ మౌర్య అనే ఏఐ (AI) ఆటోమేషన్ ఇంజనీర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి కఠిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం మూడు రోజుల్లోనే క్లయింట్ ముందు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. అయితే ఏడాది తరువాత అదే రంగంలో మొదట ఆఫర్ చేసిన జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని పేర్కొంది. ఈ విజయానికి స్వీయ అభ్యాసం, సరైన మార్గదర్శకత్వం కారణమని ఆమె చెప్పింది.ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవంఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో రీతూ మౌర్య తన అనుభవాన్ని పంచుకుంది. తనను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ప్రారంభంలో సంస్థ ఫౌండర్ తనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. కానీ వాస్తవానికి ఆమె సందేశాలకు గంటల తరువాత కానీ సమాధానం ఇచ్చేవాడు కాదని, సమస్యలు అర్థం చేసుకునేందుకు కాల్ చేయడానికీ ముందుకు రాలేదని చెప్పింది. “ఉద్యోగంలో రెండో రోజుకే నాకు చాలా విషయాలు తెలియకపోయాయి. మార్గదర్శనం చేస్తానని చెప్పినా, అతను ఎక్కడా కనిపించలేదు” అని మౌర్య తెలిపింది.క్లయింట్ ముందు విమర్శలు… వెంటనే తొలగింపుమూడో రోజు అసైన్మెంట్ సమయంలో వ్యవస్థాపకుడు క్లయింట్ ముందే ఆమె పనితీరును తీవ్రంగా విమర్శించాడని మౌర్య తెలిపింది. “మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. నేను ఇదే పని ఒక గంటలో పూర్తి చేసేవాడిని. ఇకపై మనం కలిసి పనిచేయలేము” అని అతను చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అదే క్లయింట్ ఆమెను ఫుల్ టైమ్గా చేరగలరా అని అడిగిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వెల్లడించింది.మానసికంగా తీవ్ర ప్రభావంఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని మౌర్య తెలిపింది. “అంతా శూన్యంగా అనిపించింది. చాలా రోజులు ఏడ్చాను. నేను ఏమీ చేయలేనన్న భావన కలిగింది” అని ఆమె చెప్పింది. ఈ అనుభవం చాలా కాలం పాటు తనను వెంటాడిందని కూడా పేర్కొంది.మళ్లీ ప్రయాణం ప్రారంభంఅయితే తర్వాత ఆమె తనను తాను తిరిగి నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూడడం, సహచరుల సహాయం కోరడం, అలాగే “తెలివితక్కువ ప్రశ్నలు అయినా అడగడం” ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తన అభ్యాస ప్రయాణాన్ని లింక్డ్ఇన్లో పంచుకోవడం ప్రారంభించడంతో, చివరికి తనకు మరో సంస్థ అధినేత అవకాశం ఇచ్చారు.ఏడాదిలో భారీ మార్పుఉద్యోగం కోల్పోయిన ఏడాది తరువాత ప్రస్తుతం తాను మొదట ఇచ్చిన ఆఫర్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని మౌర్య తెలిపింది. “ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. అప్పటి విషపూరితమైన కార్యాలయం నుంచి బయటపడటం మంచిదే అనిపిస్తోంది” అని ఆమె పేర్కొంది.నెటిజన్ల స్పందనలుమౌర్య కథకు అనేక మంది టెక్ ప్రొఫెనల్స్ స్పందించారు. తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొంతమంది అనుభవం లేని వ్యవస్థాపకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించగా, మరికొందరు స్పష్టత కోసం ప్రశ్నలు అడిగినందుకు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. “అది ఐదేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సంఘటన పీడకలలా అనిపిస్తుంది. కానీ చివరకు నేను తిరిగి లేచి నిలబడ్డాను” అని మరో టెక్ ఉద్యోగి కూడా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.
యూఎస్ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన పరిపాలన, శాసన ప్రక్రియలో కృత్రిమ మేధ విప్లవానికి నాంది పలికింది. అమెరికా సెనేట్ అధికారిక కార్యకలాపాల కోసం ప్రముఖ ఏఐ చాట్బాట్లు.. ఓపెన్ఏఐ చాట్జీపీటీ, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ల వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ ఏఐ పరికరాలు సెనేట్ ప్లాట్ఫారమ్ల్లో అంతర్భాగంగా మారి విధాన నిర్ణేతలకు సహాయంగా నిలవనున్నాయి.పాలనలో వేగం.. పనిలో పారదర్శకతసెనేట్ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొనే సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా డ్రాఫ్టింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, అపారమైన సమాచారాన్ని విశ్లేషించి కచ్చితమైన డేటాను అందించడం, సుదీర్ఘమైన నివేదికలను క్లుప్తంగా బ్రీఫింగ్ నోట్స్ రూపంలోకి మార్చడం వంటి పనులు చేస్తాయి. ఒకే రకమైన పనులను ఆటోమేట్ చేయడం ద్వారా అధికారుల సమయాన్ని ఇవి ఆదా చేయనున్నాయి.అమెరికా ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక సంకేతంగా మారింది. పాలనలో ఏఐ కేవలం సహాయకారి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది అనివార్యమనే సంకేతాలు ఇస్తోంది. అయితే భద్రత, గోప్యత వంటి అంశాల్లో ఈ సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు?
ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్తో హల్ చల్ చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.యూజర్ల ఫిర్యాదులు యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట
పర్సనల్ ఫైనాన్స్
ఎన్పీఎస్ నుంచి విత్డ్రా ఇలా..
ఆర్థికంగా ఏదైనా అవసరం వస్తే గట్టెక్కేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతాం. చివరికి ఏదో ఒక రుణమైనా తీసుకుని బయటపడదామని అనుకుంటాం. కానీ, అధిక వడ్డీ రేట్లపై అప్పులు తెచి్చ, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టే బదులు.. ఏవైనా పెట్టుబడులుంటే, వాటిని వినియోగించుకోవడం మంచిది. అలాంటి సందర్భాల్లో జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) నుంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు!. కాకపోతే దీన్ని విచక్షణ మేరకు వినియోగించుకోవాలి. ఎంత అవసరం అయినా... భవిష్యత్తు కోసం ఉద్దేశించినది కనుక వివేకంతో వ్యవహరించాలి.ఎలా వెనక్కి తీసుకోవచ్చు?ఆన్లైన్లో అయితే ప్రొటీన్ ఈగోవ్ పోర్టల్కు వెళ్లాలి. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్), పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ ఆప్షన్తో రీసెట్ చేసుకోవచ్చు.లాగిన్ అనంతరం ‘విత్డ్రాయల్’ సెక్షన్కు వెళ్లాలి. అందులో ట్రాన్సాక్ట్ ఆన్లైన్ సెక్షన్లో విత్డ్రాయల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.విత్డ్రాయల్ రకాన్ని ఎంపిక చేసుకోవాలి. రిటైర్మెంట్ లేదా పాక్షిక ఉపసంహరణ లేదా ముందస్తుగా వైదొలగడంలో ఒకదాన్ని ఎంచుకోవాలి.ఫారమ్లోని వివరాలను పూర్తిచేయాలి. ప్రాన్ను ధ్రువీకరించి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.ఈ అభ్యర్థన ఆమోదం పొందితే రెండు పనిదినాల్లో సభ్యుడి ఖాతాలో నిబంధనల మేరకు రావాల్సిన మొత్తం జమ అవుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు సమర్పణకు వీలుగా సీఆర్ఏ వెబ్సైట్ నుంచి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీ) నుంచి కూడా తీసుకోవచ్చు.పత్రంలో పాన్ వివరాలు, వ్యక్తిగత వివరాలు న మోదు చేసి, కేవైసీ డాక్యుమెంట్లు జత చేయాలి.ఈ పత్రాన్ని తీసుకెళ్లి ఏదేనీ పీవోపీలో సమరి్పంచొచ్చు. ఎన్పీఎస్ పీవోపీ మీకు సమీపంలో ఎక్క డ ఉన్నదీ గూగుల్ సెర్చ్ద్వారా తెలుసుకోవచ్చు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్ ఇలా పీవోపీలు చాలానే ఉన్నాయి.పాక్షిక ఉపసంహరణఎన్పీఎస్లో టైర్–1 ఖాతా ప్రారంభించిన మూడేళ్ల అనంతరం, మూసివేయాల్సిన అవసరం లేకుండా పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అర్హత లభిస్తుంది.సొంత చందాల మొత్తం... అంటే తాను చెల్లించిన దాని నుంచి 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యాజమాన్యం జమ చేసిన మొత్తాన్ని గానీ, పెట్టుబడులపై వృద్ధి రూపంలో పెరిగిన మొత్తాన్ని గానీ పరిగణనలోకి తీసుకోరు.జీవిత కాలంలో నాలుగు పర్యాయాలు ఇలా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఒక సారి ఉపసంహరించుకున్నాక మరో నాలుగేళ్ల తరవాత గానీ మళ్లీ ఉపసంహరించుకోలేరు.పిల్లల ఉన్నత విద్య లేదా వివాహ అవసరాల కోసం పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు.ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సైతం తీసుకోవచ్చు. అప్పటికే సొంతంగా ఇల్లు కలిగి ఉండకూడదు.సభ్యులు లేదా సభ్యుడిపై ఆధారపడిన కుటుంబీకులు తీవ్ర అనారోగ్యానికి గురై... వారి చికిత్స కోసం డబ్బు అవసరమైతే పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఖాతాపై రుణం తీసుకుని, దాన్ని తీర్చేయాలనుకున్నా కూడా పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.ఈ విషయాలను గమనించాలి..60 ఏళ్ల నాటికి లేదా 15 ఏళ్ల పాటు చందాలు జమ చేసిన తర్వాత మొత్తం నిధి రూ.8లక్షలు మించకుండా ఉంటే అందులో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి.ఎన్పీఎస్ సభ్యుడు/సభ్యురాలు మరణించినట్టయితే వారి పేరిట ఉన్న ఫండ్ను నామినీకి బదిలీ చేస్తారు.ఎన్పీఎస్ కింద గరిష్ట వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు ఇటీవలే పెంచారు. దీని ప్రకారం సభ్యులు రిటైర్మెంట్ అనంతరం తప్పుకోకుండా.. అప్పటి వరకు సమకూరిన నిధిని ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో కావాల్సినంత నెలవారీ తీసుకోవచ్చు.60 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఎన్పీఎస్లో కొనసాగే వారు సైతం పాక్షిక ఉపసంహరణ ఎంపిక చేసుకోవచ్చు. అయితే రెండు ఉపసంహరణల మధ్య కనీసం మూడేళ్ల విరామం ఉండాలి.తప్పుకోవడంసభ్యులకు 60 ఏళ్లు నిండగానే నిబంధనల ప్రకారం వారు పూర్తిగా ఈ పథకం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.ఎన్పీఎస్ నిధి అప్పటికి రూ.12 లక్షలకు మించి ఉంటే ఎలాంటి పన్ను చెల్లించకుండా మొత్తం నిధిలో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను ఇచ్చేది) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఎన్పీఎస్ నిధి ఒకవేళ రూ.8–12లక్షల్లోపు ఉంటే రూ.6 లక్షలను ఒకే విడత వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయటం... లేదంటే కనీసం ఆరేళ్ల కాలానికి సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ (ప్రతి నెలా నిరీ్ణత మొత్తం) పద్ధతిని, లేదంటే రెండింటి మిశ్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఫండ్ విలువ రూ.8 లక్షల్లోపు ఉంటే 100 శాతాన్ని ఒకే విడత ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు.సిస్టమ్యాటిక్ లంప్సమ్ విత్డ్రాయల్ (ఎస్ఎల్డబ్ల్యూ)ను సైతం ఎంపిక చేసుకోవచ్చు. 80 శాతాన్ని ఒకే విడత కాకుండా క్రమానుగతంగా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు.ముందస్తుగా వైదొలగడంఎన్పీఎస్లో 60 ఏళ్లకు ముందుగా కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా వైదొలిగే అవకాశం ఉంది.ఎన్పీఎస్ ప్రారంభించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి.ఆ సమయానికి ఉన్న నిధి నుంచి 20 శాతాన్నే ఉపసంహరించుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సిందే.మొత్తం నిధి రూ.5 లక్షలు లేదా అంత కంటే తక్కువే ఉన్న సందర్భాల్లో నూరు శాతం వెనక్కి తీసుకుని గుడ్బై కొట్టేయొచ్చు.టైర్–2 అకౌంట్ నుంచి ఉపసంహరణఈ ఖాతాలో ఉన్న నిధి మొత్తాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వేచ్ఛగా వెనక్కి తీసుకోవచ్చు.టైర్– 1 మాదిరి ఈ ఖాతా నుంచి నిధి ఉపసంహరణకు ఎలాంటి షరతులూ లేవు.టైర్ –2 ఖాతా నుంచి ఉపసంహరించుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.
ఇన్వెస్ట్ చేస్తేనే ఇంకా ముందుకు..
దేశీయంగా మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత, సంపద సృష్టి అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని ఫిన్టెక్ ప్లాట్ఫాం ఎల్ఎక్స్ఎంఈ ఫౌండర్ ప్రీతి రాఠీ గుప్తా తెలిపారు. చాలా మంది మహిళల్లో పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ మ్యుచువల్ ఫండ్స్, ఈక్విటీలు, పెన్షన్లు, లేదా బీమాలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోందని వివరించారు.చాలా మంది బంగారం, నగదు, చిట్ఫండ్స్పైనే ఆధారపడుతుంటారని, వీటిపై దీర్ఘకాలంలో రాబడులు అంతంత మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి సంబంధించి ఎల్ఎక్స్ఎంఈ–ఈవై ఉమెన్స్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఇండెక్స్ (2026) అధ్యయనం ప్రకారం భారత్కి 100కి 28.1 స్కోరు మాత్రమే లభించిందని గుప్తా చెప్పారు. బీమా లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉద్యోగం, వేతనజీవులకు మాత్రమే రూపొందించబడిన సిస్టంలు మొదలైనవి మహిళల పురోగతికి ఆటంకాలుగా ఉంటున్నాయని వివరించారు.అయితే, మహిళలు క్రమంగా ఆర్థిక భద్రతపై మరింతగా దృష్టి పెట్టే ధోరణి పెరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ నిధి, బీమా కవరేజీ, ఆర్థిక పరిజ్ఞానం, కమ్యూనిటీ మద్దతు మొదలైనవి మహిళలు పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించేందుకు, క్రమంగా సంపద నిర్మించుకునేందుకు తోడ్పడతాయని ఆమె చెప్పారు. పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 40 లక్షల కోట్ల మేర జత కాగలదని గుప్తా పేర్కొన్నారు.
PF ఖాతాలో రూ.లక్ష ఉంటే.. ఎంత వడ్డీ వస్తుందంటే?
2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును మునుపటి మాదిరిగానే 8.25 శాతం వద్దనే ఉంచారు. ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత.. వడ్డీ రేటు చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉన్నప్పుడు.. పీఎఫ్ ఖాతాలో ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత మొత్తం ఎంత వడ్డీ వస్తుందనే విషయాన్ని గమనిస్తే.. 2026 మార్చి 31 నాటికి ఖాతాలో రూ. 1 లక్ష ఉంటే రూ. 8250 (8.25 శాతం) వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 1,08,250 అవుతుంది. ఆ తరువాత ఏడాది కూడా ఇదే వడ్డీ ఉంటే.. ఆ మొత్తంపై కూడా వడ్డీ పెరుగుతుంది.ఒకవేళా రూ. 5 లక్షలు పీఎఫ్ ఖాతాలో ఉంటే.. వడ్డీ రూ.41250 జమ అవుతుంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే రూ. 82500 వడ్డీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే ఏడాది మధ్యలో అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకుంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ జమ అవుతుంది.పీఎఫ్ వడ్డీ రేటు గతంలో..నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భారీ సబ్సిడీ స్కీమ్.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆదాయ వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50 లక్షల వరకు మూలధన సబ్సిడీ పొందే అవకాశం ఉంది.సగం సబ్సిడీకేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు వ్యయంపై 50 శాతం వరకు మూలధన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.50 లక్షలుగా నిర్ణయించారు.అర్హులెవరు?ఈ పథకానికి వ్యక్తిగత రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG), సహకార సంఘాలు, సెక్షన్-8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎన్ని గాడిదలు ఉండాలంటే..గాడిదల పెంపక యూనిట్కు అర్హత పొందాలంటే కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలతో ప్రాజెక్టు ఉండాలి. స్థానిక జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేస్తోంది.సబ్సిడీ విడుదల ఇలా..ఈ సబ్సిడీని రెండు విడతలుగా విడుదల చేస్తారు. ప్రాజెక్టుకు బ్యాంకు రుణం ఆమోదం పొందిన తర్వాత మొదటి విడతను విడుదల చేస్తారు. అనంతరం గాడిదల పెంపక కేంద్రం పూర్తయి, అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీని అందిస్తారు.దేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2019లో జరిగిన 20వ పశు జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. 2012తో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు.ఒకప్పుడు గ్రామీణ రవాణా, నిర్మాణ పనుల్లో విస్తృతంగా ఉపయోగించిన గాడిదలకు యాంత్రీకరణ పెరగడంతో డిమాండ్ తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు, స్థానిక జాతులను సంరక్షించేందుకు గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


