Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Anant Ambani Donates for Kerala Temples and Elephant Welfare1
అనంత్ అంబానీ కేరళ దేవాలయాలకు భూరి విరాళం

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు భారీ విరాళాలు ప్రకటించారు. రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి, గజరాజుల సంరక్షణకు సంబంధించి మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.రాజరాజేశ్వరం ఆలయ పునరుద్ధరణకు పెద్దపీటఇటీవల తలపరంబలోని చారిత్రక రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.12 కోట్ల భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అత్యంత పురాతనమైన, పురావస్తు ప్రాధాన్యత కలిగిన తూర్పు గోపురాన్ని పునరుద్ధరించడానికి ఈ నిధులను ప్రధానంగా వెచ్చించనున్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పడతాయి. తక్షణ విరాళం కింద ఆలయ నిర్వహణ కమిటీకి రూ.3 కోట్ల చెక్కును అందజేశారు.ఏనుగుల సంరక్షణ కోసం..అంతకుముందు, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ స్వామివారికి రూ.3 కోట్ల విరాళాన్ని సమర్పించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా స్ఫూర్తితో గురువాయూర్ ఏనుగుల సంక్షేమం కోసం వినూత్న ప్రణాళికలను ప్రకటించారు.ఏనుగుల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆసుపత్రి నిర్మాణం.ఏనుగులను గొలుసులతో కట్టేయకుండా స్వేచ్ఛగా తిరిగేలా ఆధునిక వసతి గృహాల ఏర్పాటు.ఏనుగులకు గౌరవప్రదమైన, శాస్త్రీయమైన సంరక్షణ అందించడానికి అవసరమైన సాంకేతిక మద్దతు.‘భారతీయ ఆధ్యాత్మిక ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి విశ్వాసం, కరుణ, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే జీవన కేంద్రాలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే మన సంప్రదాయంలో భాగమైన మూగజీవాలకు అత్యుత్తమ వైద్యం, గౌరవం అందించడమే మా లక్ష్యం’ అని అనంత్ అంబానీ అ‍న్నారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

Global Tech Layoffs 2026: 51,000 Jobs Lost As AI Reshapes Industry2
టెక్‌ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు

గ్లోబల్ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతోంది. 2026 ప్రారంభం నుంచే టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ మంత్రాన్ని జపిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి మళ్లుతున్న పెట్టుబడులు, కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 51,000 మంది నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. నియామకాలు మందగించడం, కేవలం నైపుణ్యం కలిగిన స్వల్ప శ్రామిక శక్తితోనే గరిష్ట ఉత్పాదకత సాధించాలనే లక్ష్యంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.రంగంలోకి ఏఐప్రస్తుత సంక్షోభంలో క్లౌడ్ కంప్యూటింగ్, హార్డ్‌వేర్, గేమింగ్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రధాన తొలగింపులు కింది విధంగా ఉన్నాయి.ఒరాకిల్.. టెక్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే లేఆఫ్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించింది. ఇందులో భారత్‌కు చెందిన 12,000 మంది ఉండటం గమనార్హం. ఏఐ మౌలిక సదుపాయాల పటిష్టతకే తమ ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.అమెజాన్.. కొవిడ్‌ సమయంలో పెరిగిన అదనపు సిబ్బందిని తగ్గించుకునే క్రమంలో సుమారు 16,000 మందికి ఉద్వాసన పలికింది. రోబోటిక్స్ విభాగంలోనూ కోతలు విధించడం ద్వారా కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది.డెల్.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 11,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు కొత్త నియామకాలపై కఠిన ఆంక్షలు విధించింది.బ్లాక్(Block).. జాక్ డోర్సే నేతృత్వంలోని ఈ సంస్థ 4,000 మందిని తొలగిస్తూ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడమే ఇందుకు కారణమని బహిరంగంగా ప్రకటించింది.మెటా, అట్లాసియన్.. మెటా తన రియాలిటీ ల్యాబ్స్‌లో 10 శాతం సిబ్బందిని తగ్గించగా, అట్లాసియన్ 1,600 మందిని ఇంటికి పంపింది. మారుతున్న ఏఐ నైపుణ్య అవసరాలే ఇందుకు కారణమని అట్లాసియన్ పేర్కొంది.కారణాలేంటి?కంపెనీలు తమ మూలధనాన్ని సాధారణ నిర్వహణ నుంచి ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎఫిషియన్సీ (సామర్థ్యం) పేరుతో ఖర్చులను తగ్గిస్తున్నాయి. సంప్రదాయ కోడింగ్, సపోర్ట్ ఉద్యోగాల కంటే ఏఐ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ తెలిసిన వారి కోసమే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.మానవ మేధ vs కృత్రిమ మేధఈ లేఆఫ్స్ పరంపర ఉద్యోగ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఏఐ వల్ల సాధారణ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఏఐ నైపుణ్యం కలిగిన వారికి కొత్త అవకాశాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టెక్ రంగం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య కంటే సాంకేతిక సామర్థ్యానికే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులు కేవలం ఖర్చు తగ్గింపు మాత్రమే కాదు, అది పరిశ్రమ నిర్మాణంలో వస్తున్న పెను మార్పు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే ఈ డిజిటల్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

West Asia Turmoil Accelerates India Rise as Global Data Center Hub3
భారత్‌వైపు టెక్‌ కంపెనీల చూపు..

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం ప్రపంచ ఐటీ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ డేటా భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో భౌగోళికంగా, ఆర్థికంగా సురక్షితమైన స్థావరంగా భావిస్తున్న భారతదేశం ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది.గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్‌), మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాల కోసం కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌ ఇప్పటికే దేశంలోని ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్లయిన CtrlS, Sify, NTT, CapitaLand, Airtel Nxtraలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పశ్చిమాసియా క్లయింట్లు సైతం తమ డేటాను భారత్‌కు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు.భారత్ ఎందుకు అత్యుత్తమ ఎంపిక?అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ వర్క్‌లోడ్‌ను యూరప్ లేదా అమెరికాకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ధరల ప్రయోజనం. నిపుణులు విశ్లేషణ ప్రకారం, భారత్‌లో ఒక డేటా సెంటర్ నిర్మించే ఖర్చుతో పోలిస్తే సింగపూర్‌ వంటి దేశాల్లో రెండింతలు ఖర్చవుతుంది. అంటే భారత్‌లో పెట్టుబడి పెడితే మిగిలిన సొమ్ముతో మరో అదనపు కేంద్రాన్ని ఉచితంగా నిర్మించుకున్నంత లాభం చేకూరుతుంది.జీపీయూలకు భారీ డిమాండ్కేవలం డేటా స్టోరేజ్ మాత్రమే కాకుండా కృత్రిమ మేధ ప్రాసెసింగ్‌కు అవసరమైన జీపీయూ(గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు) కోసం కూడా అంతర్జాతీయ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘యొట్టా’ డేటా సర్వీసెస్ ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలతో 16 మిలియన్‌ డాలర్ల నుంచి 1.3 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ జీపీయూ ఒప్పందాలను కుదుర్చుకుంది. పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికి రాబోయే నాలుగు నెలల్లో సుమారు 30,000 అదనపు B300/B200 జీపీయూలను సిద్ధం చేయాలని యొట్టా భావిస్తోంది.సాధారణ కార్యాలయాల వలె డేటా సెంటర్లను తక్షణమే మార్చడం సాధ్యం కాదు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు దీర్ఘకాలికంగా భారత్‌కు మేలు చేయనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, గల్ఫ్ దేశాల్లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రిస్క్.. భారత్‌ను గ్లోబల్ క్లౌడ్ కారిడార్‌లో ఒక శక్తివంతమైన సెకండరీ హబ్‌గా నిలబెడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్లోబల్ టెక్ రంగంలో ఇదొక నిర్మాణాత్మక మార్పు. భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే డిజిటల్ ఎకానమీలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

India Plans 2.5 Lakh Cr Credit Guarantee Shield to Protect MSMEs Aviation4
రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం సిద్ధం!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ సంక్షోభం వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలను ఆదుకునేందుకు సుమారు రూ.2.5 లక్షల కోట్ల భారీ క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొవిడ్ సమయంలో ఎంఎస్‌ఎంఈలను ఆదుకున్న ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్’ (ఈసీఎల్‌జీఎస్‌) తరహాలోనే ఈ నూతన ప్యాకేజీ ఉండబోతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు.వ్యాపారాలకు రక్షణ కవచంప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్యలను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఈ పథకం ఊపిరి పోయనుంది. ఇందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.ఈ పథకం కింద వ్యాపారాలు పొందే రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ద్వారా 90 శాతం క్రెడిట్ గ్యారెంటీ లభిస్తుంది. ఒకవేళ రుణగ్రహీత డిఫాల్ట్ అయితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.ఈ పథకం సుమారు నాలుగేళ్ల పాటు అమలులో ఉండే అవకాశం ఉంది.వివిధ రంగాలు, ఉప-రంగాలకు సుమారు రూ.100 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.గత అనుభవాల దృష్ట్యా రుణాలను చౌకగా అందించేందుకు బ్యాంకుల వడ్డీ రేటును 9.25 శాతం, ఎన్‌బీఎఫ్‌సీల వడ్డీ రేటును 14 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉంది.అసలు మొత్తం తిరిగి చెల్లింపుపై ఏడాది పాటు మారటోరియం లభిస్తుంది. అయితే, ఈ కాలంలో వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.విమానయాన, ఎంఎస్‌ఎంఈ రంగాలపై ప్రత్యేక దృష్టిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా విమాన మార్గాల మళ్లింపు, ఇంధన ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు పెరగడంతో విమానయాన రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ రంగానికి తక్షణ మద్దతు అవసరమని అధికారులు గుర్తించారు. ‘ప్రస్తుతం లిక్విడిటీ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విమానయానం, ఎంఎస్‌ఎంఈలు, ఇతర కీలక వ్యాపారాలకు అండగా నిలవడమే మా ప్రాధాన్యత. ఇరాన్ సంక్షోభం వల్ల విమానయాన కార్యకలాపాల్లో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మద్దతు అవసరం’ అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

Gold and Silver rates on 07 April 2026 in Telugu states5
చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 07 April 20266
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు నష్టపోయి 22,819 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 505 పాయింట్లు దిగజారి 73,694 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.11బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 111 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.44 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.54 శాతం పుంజుకుంది.Today Nifty position 07-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement