Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BSNL launches VoWiFi Service Nationwide Know The Details1
యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్..

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. నూతన సంవత్సరం సందర్భంగా.. భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) లేదా వై-ఫై కాలింగ్‌ సర్వీస్ ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా BSNL కస్టమర్‌లు Wi-Fi కనెక్షన్‌ను ఉపయోగించి కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది గ్రామీణ & మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ సేవ సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు వై-ఫై కాలింగ్‌ కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు . కంపెనీ తన నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు.. వినియోగదారులకు మెరుగైన అందించాలనే లక్ష్యంతో ఈ వై-ఫై కాలింగ్‌ ఫీచర్ తీసుకొచ్చింది.VoWiFi అనేది IP మల్టీమీడియా సబ్‌సిస్టమ్ (IMS) ఆధారిత సేవ. ఇది Wi-Fi 7 మొబైల్ నెట్‌వర్క్‌ల మధ్య సజావుగా హ్యాండ్‌ఓవర్‌లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. కాబట్టి ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!When mobile signal disappears, BSNL VoWiFi steps in. Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.Now live across India for all BSNL customers, Because conversations… pic.twitter.com/KPUs79Lj9w— BSNL India (@BSNLCorporate) January 1, 2026

Today Gold and Silver Price January 2nd in Indian Market2
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రెండో రోజూ..

జనవరి 1న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు (జనవరి 2) అమాంతం దూసుకెళ్లాయి. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా 1140 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. వెండి రేటు కూడా అదే బాటలో అడుగులు వేస్తూ రూ. 4000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2.60 లక్షలకు చేరింది.ఈ కథనంలో బంగారం, వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock Market Update 2nd January 20263
స్టాక్ మార్కెట్ అప్డేట్: లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 333.44 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 85,522.04 వద్ద, నిఫ్టీ 105.60 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 26,252.15 వద్ద కొనసాగుతున్నాయి.స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్, సింటర్‌కామ్ ఇండియా, కేఎస్ఆర్ ఫుట్‌వేర్ లిమిటెడ్, లాసా సూపర్‌జెనరిక్స్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వివిమెడ్ ల్యాబ్స్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఒసియా హైపర్ రిటైల్ లిమిటెడ్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, కిరి ఇండస్ట్రీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

India GST collections rise 6. 1percent to Rs 1. 75 lakh crore in December4
జోరుగా జీఎస్‌టీ వసూళ్లు 

న్యూఢిల్లీ: నిత్యావసరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 2025 డిసెంబర్‌ నెలకు రూ.1.74 లక్షల కోట్లు వసూలైంది. 2024 డిసెంబర్‌లో ఆదాయం రూ.1.64 లక్షల కోట్లు కంటే 6 శాతం పెరిగింది. గత ఏడాది సెపె్టంబర్‌ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్‌టీ రేటు తగ్గించడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులు ఎత్తివేయడం ఫలితంగా వాటి రేట్లు దిగొచ్చాయి. అయినప్పటికీ జీఎస్‌టీ ఆదాయం మెరుగ్గా నమోదవుతుండడం గమనార్హం. దేశీ ఉత్పత్తులపై ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతి అయిన వస్తువులపై జీఎస్‌టీ రూపంలో ఆదాయం 19.7 శాతం పెరిగి రూ.51,977 కోట్లకు చేరింది. రిఫండ్‌లు సైతం 31 శాతం పెరిగి రూ.28,890 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌ నెలకు నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. 2024 డిసెంబర్‌ నెలకంటే 2.2 శాతం పెరిగింది. సెస్సు రూపంలో ఆదాయం రూ.4,238 కోట్లకు పరిమితమైంది. 2024 డిసెంబర్‌లో రూ.12,003 కోట్ల సెస్సు వసూలు కావడం గమనించొచ్చు. సెపె్టంబర్‌ 22 నుంచి సెస్సు అన్నది కేవలం పొగాకు, వాటి ఉత్పత్తులకే పరిమితం చేయగా, లగ్జరీ వస్తువులపై తొలగించడం తెలిసిందే.

India allows banks to sponsor pension funds under NPS5
పెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటుకు బ్యాంక్‌లకు అనుమతి 

న్యూఢిల్లీ: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) కింద పెన్షన్‌ ఫండ్స్‌ ఏర్పాటుకు బ్యాంక్‌లను అనుమతిస్తూ పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్ణయం తీసుకుంది. పెన్షన్‌ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం, చందాదారుల ప్రయోజనాలను కాపాడడంతోపాటు, పోటీని పెంచేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రకటించింది. పెన్షన్‌ ఫండ్స్‌ అన్నవి ఎన్‌పీఎస్‌ చందాదారుల పెట్టుబడులను ఇన్వెస్ట్‌ చేస్తూ, రాబడులను పంచే బాధ్యతను చూస్తుంటాయి. బ్యాంకుల నెట్‌వర్త్‌ ఆధారంగా వాటిని అనుమతించేందుకు, పూర్తి కార్యాచరణ, మార్గదర్శకాలను తర్వాత నోటిఫై చేయనున్నట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ కింద 10 పెన్షన్‌ ఫండ్స్‌ సేవలు అందిస్తున్నాయి. మరోవైపు ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌లో ముగ్గురిని నియమిస్తూ పీఎఫ్‌ఆర్‌డీఐ నిర్ణయం తీసుకుంది.

Cloud Wars Heat Up as Tech Giants Expand AI Infrastructure6
బిలియన్ల బిడ్‌ వార్‌ 

సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్‌ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్‌–10 టెక్‌ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్‌ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), క్లౌడ్‌ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్‌–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్‌ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్‌లకు 1.5 బిలియన్‌ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్‌ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్‌ యూఎస్‌ నుంచి హెచ్‌1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్‌ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్‌బుక్‌ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్‌ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్‌లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్‌కు తెరతీస్తూ గత వారం మిడ్‌టైర్‌ కంపెనీ కోఫోర్జ్‌ 2.39 బిలియన్‌ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఎన్‌కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్‌ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్‌ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్‌గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్‌(జనవరి–డిసెంబర్‌ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్‌ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్‌ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్‌ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్‌ ఇంజినీరింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement