ప్రధాన వార్తలు
భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి..
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ కేవలం దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ తరుణంలో జపనీస్ ఆటో దిగ్గజాలైన టయోటా, హోండా, సుజుకి దేశీయ విఫణిలో ఏకంగా 11 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్దమయ్యాయి. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది.ప్రపంచ వాహన తయారీదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో.. ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని ఎంచుకుంటున్నాయి. ఇండియా కేవలం తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతికి కూడా అనువైన దేశం కావడంతో చాలా దేశాల చూపు మనదేశంపై పడింది. అంతే కాకుండా ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లో ఖర్చులు కొంత తక్కువగా ఉంటాయి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, మద్దతు ఇచ్చే ప్రభుత్వ విధానాలు విదేశీ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి.భారతదేశ కార్ల మార్కెట్లో దాదాపు 40 శాతం వాటా ఉన్న సుజుకి, ఏటా 40 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.టయోటా కంపెనీ కూడా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. హైబ్రిడ్ కాంపోనెంట్ సరఫరా గొలుసును విస్తరించాలని, మహారాష్ట్రలో కొత్త ప్లాంట్ను నిర్మించాలని యోచిస్తోంది.హోండా కంపెనీ కూడా.. భారతదేశాన్ని ఎగుమతి స్థావరంగా చేసుకోబోతున్నట్లు.. ఇక్కడ నుంచే జీరో సిరీస్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.చైనాకు దూరం!2021 నుంచి భారతదేశ ఆటోమొబైల్ రంగంలో జపాన్ పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో చైనాకు నిధులను 80 శాతం కంటే ఎక్కువ తగ్గించాయి. చైనా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో.. ధరలు పెరిగిపోవడం వల్ల, కంపెనీలకు వచ్చే లాభాలు క్రమంగా తగ్గిపోయాయి. ఈ కారణంగానే చైనాకు.. జపాన్ పెట్టుబడులు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.వేగం పెంచిన టయోటా & సుజుకిటయోటా 2030 నాటికి.. భారతదేశంలో 15 కొత్త లేదా అప్డేటెడ్ మోడళ్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీంతో తన మార్కెట్ వాటాను 8 నుండి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ పెడుతున్న పెట్టుబడులు.. వాహనాల ఉత్పత్తిని మరో 10 లక్షలు పెంచుతాయి.సుజుకి కూడా భారతదేశాన్ని తన ప్రపంచ ఎగుమతి స్థావరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ & అంతర్జీతీయ మార్కెట్లలో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే.. సుజుకి యొక్క ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని కంపెనీ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి అన్నారు.ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!హోండా కంపెనీ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచే యోచనలో ఉంది. హోండాకు, భారతదేశం దాని ప్రపంచ కార్ల వ్యూహంలో కేంద్రంగా మారుతోంది. ఇండియా ఇప్పుడు అమెరికా, జపాన్లతో పాటు హోండా యొక్క టాప్ మూడు కార్ల మార్కెట్లలో ఒకటిగా ఉందని సీఈఓ తోషిహిరో మిబే పేర్కొన్నారు.
హైదరాబాద్లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ
‘ఆదిభట్లలో ఓ నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితం భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు వంద అపార్ట్మెంట్లను కూడా విక్రయించలేకపోయింది. దీంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి, ఆఫీసును తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను కూడా భరించలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రస్తుతం బిల్డర్ కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నాడు.’ ..ఒకరిద్దరు కాదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా మంది పరిస్థితి ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడం, అపరిమిత సరఫరా, వడ్డీ రేట్లు, అధిక ధరలు, ప్రభుత్వ ప్రతికూల విధానాలు వంటి రకరకాల కారణాలతో అపార్ట్మెంట్ల విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో నగరంలో ఇన్వెంటరీ పెరిగిపోయింది. కస్టమర్ల వాకిన్స్ లేకపోవడంతో అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనిర్ధిష్ట కాలంలో మార్కెట్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను ఇన్వెంటరీగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 5,61,756 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. ఇందులో అత్యధికంగా ముంబైలో 1.76 లక్షల యూనిట్లుండగా.. రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుతం నగరంలో 95,331 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. గతేడాది సెప్టెంబర్లో ఏకంగా లక్షకుపైగా ఇన్వెంటరీ ఉండగా.. ప్రస్తుతం కొంతమేర తగ్గాయి. అయితే దక్షిణాది నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఇన్వెంటరీ అత్యధికంగా ఉంది. బెంగళూరులో 59,244, చెన్నైలో 32,379 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి.పశ్చిమంలోనే ఎక్కువ..దేశంలో భవనాల ఎత్తుపై ఆంక్షలు లేని ఏకైక నగరం హైదరాబాదే. ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడంతో డెవలపర్లు పోటీపడుతూ హైరైజ్ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. ఎకరం, రెండెకరాల స్థలంలోనే రెండు వేలు, మూడు వేల అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. దీంతో ప్రతికూల సమయంలో విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. నగరంలో సగానికి పైగా ఇన్వెంటరీ పశ్చిమ హైదరాబాద్లోనే ఉంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాలలో డిమాండ్కు మించి అపార్ట్మెంట్ల సరఫరా రావడమే ఇందకు ప్రధాన కారణం.నాలాలు, చెరువులంటే భయం..నాలాలు, చెరువులకు సమీపంలో ప్రాజెక్ట్ల పేరు వింటేనే కస్టమర్లు జంకుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నా సరే లేక్ వ్యూ ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకు వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ ఏ కారణంతో ఎప్పుడు కూలుస్తారో? అక్రమ నిర్మాణం అంటారోనని గృహ కొనుగోలుదారులు వెనుకడుగేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందనో, ఆహ్లాదకర వాతావరణం ఉంటుందనో ధైర్యం చేసి అపార్ట్మెంట్ కొని, బ్యాంక్ ఈఎంఐ భారం భరించడం కంటే లేక్ వ్యూలకు దూరంగా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయం కస్టమర్లలో నెలకొంది. దీంతో గతంలో లేక్వ్యూ అంటే ఎగబడి కొన్న జనం.. నేడు విక్రయాలు లేక ప్రాజెక్ట్లు విలవిల్లాడుతున్నాయి.లేఆఫ్లు కూడా కారణమే..స్థిరాస్తి రంగంలో సగానికి పైగా కొనుగోళ్లు ఐటీ సెక్టార్ నుంచే జరుగుతుంటాయి. కృత్రిమ మేధస్సు(ఏఐ) శరవేగంగా దూసుకొస్తుండటంతో ఐటీ విభాగంలో లే ఆఫ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రాపర్టీ విక్రయాలు మందగించాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని అయోమయంలో ఐటీ ఉద్యోగులు అపార్ట్మెంట్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.ఎక్కువ లగ్జరీ ఇళ్ల ఇన్వెంటరీ..రూ.2–3 కోట్ల ధర ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్లలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉంది. విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉండటంతో ఈ విభాగంలో ఇన్వెంటరీ పెరిగింది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరగడంతో బిల్డర్లు కూడా లగ్జరీ ప్రాజెక్ట్లను ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించారు. ఇది కూడా ఇన్వెంటరీ పెరిగేందుకు కారణమే. పెరిగిన భూముల ధరల నేపథ్యంలో రూ.60 లక్షల లోపు ధర ఉండే మధ్య తరగతి ఇళ్లను నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా కారణంగా ఈ విభాగంలో ఇన్వెంటరీ ఎక్కువగా లేదు. లగ్జరీ సెగ్మెంట్లో డెవలపర్లు పోటీపడి మరీ ప్రాజెక్ట్లను చేపట్టడంతో ప్రస్తుతం విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
గెంటేశారనే కోపంతో రూ.12వేల కోట్ల కంపెనీ ఏర్పాటు!
అవమానాలు జరిగిన చోటే సత్తా ఏంటో చూపించాలని పెద్దలు చెబుతుంటారు. సరిగ్గా సుధీర్ జాటియా జీవితంలో ఇదే జరిగింది. ఒకప్పుడు తాను నడిపిన సంస్థ నుంచి కొన్ని కారణాల చేత తనను బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. దాంతో అదే రంగంలో అంతకుమించిన శక్తిగా ఎదిగాలనుకున్నారు. ఫలితంగా ఇప్పటికే ఆ రంగంలో లాభాలులేక కొట్టుమిట్టాడుతున్న ఓ కంపెనీని కొనుగోలు చేసి తనను బయటకు పంపిన కంపెనీకి అతిపెద్ద పోటీదారుగా మారారు. ఓటమిని గెలుపు మెట్టుగా మార్చుకున్న సుధీర్ జాటియా వ్యాపారం ప్రయాణం తెలుసుకుందాం.దాదాపు రెండు దశాబ్దాల పాటు సుధీర్ జాటియా ఒకే పరిశ్రమలో, అందులోనూ వీఐపీ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలో కీలక పాత్ర పోషించారు. అయితే, 2010లో ఆ సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు సుధీర్ జాటియా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అంతటితో నిరాశ చెందకుండా ఒక కొత్త లక్ష్యానికి పునాది వేశారు. ఆయన కొనుగోలు చేసిన సఫారీ ఇండస్ట్రీస్ నేడు రూ.12,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగి భారీ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.ముంబై నగరంలో జన్మించిన సుధీర్ జాటియా ముంబై విశ్వవిద్యాలయం నుంచి కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన జీవితంలో తొలి వ్యాపార అనుభవం తండ్రి నిర్వహించిన టెక్స్టైల్ వ్యాపారంతో మొదలైంది. 1988లో ఆయన తండ్రి, దిలీప్ పిరమల్ (వీఐపీ) సంయుక్తంగా అరిస్టోక్రాట్ (Aristocrat) అనే లగేజ్ కంపెనీని కొనుగోలు చేశారు. దాంతో 21 ఏళ్ల వయసులో జాటియా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అరిస్టోక్రాట్, VIP వంటి పెద్ద సంస్థల మధ్య పనిచేస్తూ ఆయన కేవలం రెండేళ్లలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎదిగారు.ఊహించని మలుపుతన కుటుంబ ప్రయోజనాలను కాపాడుకుంటూ వ్యాపారంలో నైపుణ్యం సంపాదించిన సుధీర్ జాటియా 2003లో వీఐపీ, అరిస్టోక్రాట్ రెండింటికీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆ సంస్థను భారతదేశంలోనే అతిపెద్ద లగేజ్ సామ్రాజ్యంగా నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, 2010లో VIP వ్యవస్థాపకుల్లో కొందరు తమ కుటుంబ సభ్యులను(తరువాతి తరం) సంస్థ నాయకత్వంలోకి తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో జాటియాను ఆ కంపెనీ నుంచి పంపించాలని నిర్ణయించిట్లు ఆరోపణలున్నాయి(వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు). జీవితంలో కష్టపడి పనిచేసిన సంస్థ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మనసులో బలమైన సంకల్పం ఏర్పడింది.సఫారీవీఐపీ నుంచి బయటకు వచ్చిన తరువాత సుధీర్ జాటియాకు తన వ్యాపార నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనే కసి పెరిగింది. ఆయన దృష్టి అప్పటికే మార్కెట్లో బలహీనంగా ఉన్న సఫారీ ఇండస్ట్రీస్ (Safari Industries)పై పడింది. 2011లో జాటియా కేవలం రూ.29 కోట్లతో సఫారీ ఇండస్ట్రీస్లో 56% వాటాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో సఫారీ కంపెనీ మొత్తం విలువ రూ.55 కోట్లు మాత్రమే. సఫారీ అమ్మకాలు అప్పటివరకు ఎక్కువగా సైనిక క్యాంటీన్లపై ఆధారపడి ఉండేవి. ఆయన మొదటగా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. నాణ్యత లేనిదే మార్కెటింగ్ పనికిరాదని గట్టిగా నమ్మారు.ఆన్లైన్ మార్కెటింగ్కు సంబంధించి VIP వంటి పాత కంపెనీలు సంకోచిస్తున్న సమయంలో సుధీర్ జాటియా ముందడుగు వేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. ఆన్లైన్ ప్రకటనలపై భారీగా పెట్టుబడి పెట్టారు. ఇది సఫారీకి మార్కెట్లో విపరీతమైన వృద్ధిని అందించింది.రూ.12,000 కోట్ల సామ్రాజ్యంతన అనుభవం, మార్కెట్పై ఉన్న పట్టు, ముక్కుసూటి నిర్ణయాలతో సుధీర్ జాటియా సఫారీని అనూహ్యంగా వృద్ధి చేశారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత సఫారీ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. 2018-19 ప్రాంతంలో సుమారు రూ.1,500 - రూ.1,800 కోట్లుగా ఉన్న సఫారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆయన వ్యూహాత్మక నాయకత్వంలో ప్రస్తుతం సుమారు రూ.12,000 కోట్లకు పైగా చేరుకుంది. ఈ వృద్ధి, ఆయన పూర్వ సంస్థ వీఐపీ కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.ఇదీ చదవండి: బీమా రంగానికి ఏఐ ధీమా
నన్నెవరూ తొలగించలేరు: రాబర్ట్ కియోసాకి
ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఈ సంవత్సరం తన థాంక్స్ గివింగ్ సందేశాన్ని తొలగింపులను ఎదుర్కొంటున్న అమెరికన్ ఉద్యోగుల పట్ల కరుణను వ్యక్తం చేయడానికి ఉపయోగించారు. అదే సమయంలో ఉద్యోగం కంటే కూడా వ్యాపారం, వ్యవస్థాపకత ప్రాముఖ్యతపై తన దీర్ఘకాల నమ్మకాన్ని పునరుద్ఘాటించారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్లో, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత ఉపాధి కన్సల్టెన్సీ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ నుంచి వచ్చిన తాజా డేటాను ఉదహరించారు. ఇది 1,53,000 మంది అమెరికన్ ఉద్యోగులు ఈ హాలిడే సీజన్లో (క్రిస్మస్ వేళ) ఉద్యోగాలు కోల్పోతారని నివేదించింది.‘నా హృదయం ముక్కలైంది. ఎవరి జీవితంలోనైనా కొన్ని సంఘటనలు ఉద్యోగం కోల్పోవడం కంటే కూడా బాధాకరంగా ఉంటాయి’ అని రాసుకొచ్చిన కియోసాకి ఎంటర్ప్రెన్యూర్గా తన సొంత అనుభవాన్ని ప్రతిబింబించారు. తానెప్పుడూ తొలగింపునకు గురికాలేదని పేర్కొన్నారు. ఏదేమైనా, సాంప్రదాయ ఉపాధిపై ఆధారపడే వారిపై ఉద్యోగం కోల్పోవడం.. భావోద్వేగ, ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని ఆయన అంగీకరించారు."నేను ఎంటర్ప్రెన్యూర్ను కాబట్టి నన్ను ఎప్పుడూ, ఎవరూ తొలగించలేరు.ఎందుకంటే నేను ఉద్యోగిని కాదు" అన్నారు కియోసాకి. అయితే తన స్నేహితుల్లో కొందరి తండ్రులు ఉద్యోగాలు కోల్పోయారని, ఇది కుటుంబం మొత్తాన్ని బాధించే అంశమని పేర్కొన్నారు.ఆర్థిక స్వాతంత్య్రం ఆవశ్యతను ఎత్తిచూపుతూనే ఆనందంగా ఉండాల్సిన పండుగ వేళ ఉద్యోగాలు కోల్పోయినవారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అటువంటివారి పట్ల మరింత కరుణ, దయ కలిగిఉండాలని, అవసరమైతే వారి బాధ్యతను తీసుకోవాలని తన సందేశంలో సూచించారు.HAPPY THANKSGIVING “You’re Fired.” Employment Consultant: Challenger Grey and Christmas just announced 153,000 American employees are going to be fired.Breaks my heart. Few events in anyone’s life are more painful than being fired.I’ve never been fired because I am an…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 8, 2025
బీమా రంగానికి ఏఐ ధీమా
ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు కృత్రిమ మేధ(AI)ను కేవలం ఒక సాంకేతిక సాధనంగా మాత్రమే కాకుండా వ్యాపార వృద్ధిని నడపడానికి ఉపయోగిస్తున్నాయి. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి వాడుతున్నాయి. ప్రస్తుతం ఏఐ జీవిత, జనరల్ బీమా డొమైన్లలో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో విస్తరిస్తోంది.టెస్టింగ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వరకుగతంలో బీమా పరిశ్రమలో ఏఐను ప్రత్యేక డొమైన్ల్లో మాత్రమే పరీక్షించేవారు. కానీ ఇటీవలకాలంలో ఏఐ వాడకం పెరిగింది. జెనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీలేష్ పర్మార్ అభిప్రాయం ప్రకారం.. ‘జీవిత బీమాలో ఏఐ పరీక్షల దశ నుంచి వ్యూహాత్మకంగా మారి విభిన్న విభాగాల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. దాంతో పరిశ్రమలో పట్టు సాధించింది’ అన్నారు.పాలసీదారుల రిస్క్ అంచనావిస్తృతమైన డేటాను (సాంప్రదాయ డేటా, IoT పరికరాలు, సామాజిక మాధ్యమాలు, మొదలైనవి) విశ్లేషించడం ద్వారా పాలసీదారుల రిస్క్ను అంచనా వేయడానికి ఏఐ సహాయపడుతుంది. దీనివల్ల మరింత కచ్చితమైన ప్రీమియం ధరలను (Pricing) నిర్ణయించడం సాధ్యమవుతుంది. ఏఐ ఆధారిత టూల్స్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, క్లెయిమ్ ఫైలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేస్తున్నాయి. దీనివల్ల క్లెయిమ్స్ త్వరగా పరిష్కారం అవుతున్నాయి. క్లెయిమ్స్ డేటాలోని అసాధారణ నమూనాలను, మోసపూరిత స్కీమ్లను ఏఐ ఆధారిత టూల్స్ను త్వరగా గుర్తిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు నష్టాలు తగ్గుతున్నాయి.నిరంతరం సేవఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు 24/7 అందుబాటులో ఉండి పాలసీ కొటేషన్లు, క్లెయిమ్ స్టేటస్, సాధారణ ప్రశ్నలకు తక్షణమే సమాధానం ఇస్తాయి. సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ సమయం తీసుకునే క్లెయిమ్లను ఏఐ ఆటోమేట్ చేయడం ద్వారా పాలసీదారులు తక్షణమే పరిహారాన్ని పొందగలుగుతారు. పాలసీదారుని వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా సరైన ప్రీమియం ధరతో (తక్కువ రిస్క్ ఉన్నవారికి తక్కువ ప్రీమియం) అతనికి సరిపోయే పాలసీలను ఏఐ సిఫార్సు చేస్తుంది. చాట్బాట్ల ద్వారా రోజులో ఏ సమయంలోనైనా తమ ప్రశ్నలకు సమాధానాలు, పాలసీ వివరాలు, సపోర్ట్ లభిస్తుంది. పాలసీ కొనుగోలు దగ్గరి నుంచి క్లెయిమ్ చేయడం వరకు మొత్తం ప్రక్రియలను సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: అధిక పనిగంటలు.. ఉద్యోగుల వెతలు
బంగారం.. బీకేర్ఫుల్
మంచిర్యాల జిల్లా: కార్తికమాసంతో పెళ్లిళ్ల సీజన్ పునఃప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని యువతీ యువకులు వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంబంధాలు కుదిరిన వారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనివార్యం. నెల రోజుల క్రితం 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1.33 లక్షలకు ఎగబాకి దడపుట్టించగా ప్రస్తుతం ఆ ధర రూ.1.24 లక్షలకు పడిపోయి కాస్త ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ షురూ కావడంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ఈక్రమంలో కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం ఎమరుపాటుగా వ్యవహరించినా నష్టపోక తప్పదు. నిశిత పరిశీలన, నిర్ధారణ, అప్రమత్తంగా ఉండటం అనివార్యమైన అంశాలుగా వినియోగదారులు గుర్తించాలని మంచిర్యాల జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి విజయ్కుమార్ సూచిస్తున్నారు. పాటించాల్సిన అంశాలను ‘సాక్షి’కి వివరించారు.ఇవి పరిశీలించాలి బంగారం తూకం వేసేందుకు జ్యూవెల్లరీ షాపుల్లో వేయింగ్ మిషన్ వినియోగిస్తారు. దానిని ప్రతీ సంవత్సరం లీగల్ మెట్రాలజీ అధికారులు పరిశీలించి సీలు వేస్తారు. ఆ మిషన్పై సీలు ఉందా.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ షాపు యజమానులు కలిగి ఉన్నారా? తెలుసుకోవాలి. అనుమానం వస్తే షాపు యాజమానిని అడిగి నిర్ధారణ చేసుకోవాలి.వేయింగ్ మిషన్తో తూకంలో అనుమానం కలిగితే వెయిట్స్తో తూకం వేయించాలిఏదేనీ ఆర్నమెంట్ కొనుగోలు చేసినపుడు బంగారంతో పాటు రాగి, వెండి, పచ్చలు, రాళ్లు, వజ్రం ఉ ండవచ్చు. బిల్లు ఇచ్చేటప్పుడు ఆ ఆర్నమెంట్లో ఏ మేం ఉన్నాయి.. ఎంత శాతం ఉన్నాయో వివరా లు తప్పనిసరిగా బిల్లు రశీదులో నగల వ్యాపారి పొందుపర్చాలి.అలా వివరాలు లేకపోతే నమోదు చేయించుకోవాలి. జీఎస్టీ నంబర్ ఉన్న రశీదు తీసుకోవాలి.కొనుగోలు చేసిన ఆభరణం వెనకాల హగ్ మార్క్ గుర్తు ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి.షాపు ముందు ధరల పట్టిక ప్రదర్శించాలి జ్యువెల్లరీ షాపులో అమ్మకానికి పెట్టిన బంగారం, వెండి ధరలు ఏరోజుకారోజు తప్పనిసరిగా దుకాణం ముందు ప్రదర్శించాలి.రెడీమేడ్ బంగారు ఆభరణాలలో వినియోగించే స్టోన్స్, సిల్వర్, కాపర్ ధర కూడా పట్టికలో విధిగా పొందుపర్చాలి.మేకింగ్ చార్జీ ఆర్నమెంట్ రకాల ప్రకారంగా తేడా ఉంటుంది. చార్జీల అంశం లీగల్ మెట్రాలజీ నిబంధనల పరి«ధిలోకి రావు.అందువల్ల జ్యువెల్లరీ షాపుల నిర్వాహకులు కొనుగోలు దారుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొనుగోలుదారు సొంత నిర్ణయం తీసుకోవాలి.వేస్టేజీ చార్జీ ఎంత అనేది తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, ఖానాపూర్, కాగజ్నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 100 వరకు జ్యువెల్లరీ సేల్స్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా రూ.కోట్లలో బంగారం, వెండి ఆభరణాల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.నమ్మకంతోనే కొనుగోళ్లు జ్యువెల్లరీ షాపుల్లో బంగారం, వెండి కొనుగోళ్లు చా లామట్టుకు నమ్మకంతోనే జరుగుతున్నా యి. స దరు షాపు యజమానుల నిజాయతీపై ఆ ధారపడి అమ్మకాలు సాగుతున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ఈతరం యువతీ యువకులు మాల్స్ ను ఆశ్రయిస్తుండగా తల్లిదండ్రులు మాత్రం వంశపారం పర్యంగా వస్తున్న జ్యువెల్లరీ షాపుకు వెళ్లి కొ నుగోలు చేయడానికి ఇష్టపడుతుండటం గమనార్హం.శుభ ముహూర్తాలు ఇవే... వివాహాలకు శుభ గడియలు వచ్చేశాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 17 వరకు, తిరిగి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 11వ తేదీ వరకు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. ఆతర్వాత ఉగాదికి కొత్త పంచాంగం వచ్చాక కానీ శుభముహూర్తాలు ఉండనున్నాయి.బంగారం మార్పిడిలో మోసాలకు అవకాశం వివాహాది శుభకార్యాలకు చాలా మట్టుకు పాత బంగారం అప్పజెప్పి కొత్త బంగారం తీసుకునే క్రమంలో మోసం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాత బంగారం, వెండి ఆభరణాలకు తరుగు అధికంగా తీసి వినియోగదారులను మోసం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొలతల్లో, తరుగు విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా మరోషాపుకు వెళ్లి తూకం వేయించి నిర్ధారించుకోవాలి.
కార్పొరేట్
గెంటేశారనే కోపంతో రూ.12వేల కోట్ల కంపెనీ ఏర్పాటు!
నన్నెవరూ తొలగించలేరు: రాబర్ట్ కియోసాకి
అధిక పనిగంటలు.. ఉద్యోగుల వెతలు
ప్రపంచ టాప్ 10లో 3 భారతీయ బ్యాంకులు!
టీసీఎస్ ఏఐ రీసెర్చ్ సెంటర్
ఐదు నెలల కనిష్టానికి సేవలరంగం
అమెరికా కంపెనీలో వాటా కొన్న హైదరాబాద్ స్టార్టప్
షుగర్ ఉన్నోళ్లకు నో వీసా!.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇక్కడ అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి
ఇల్లు కొనడానికి ఈఎంఐ: టెకీ సలహా..
ఐపీవో వేల్యుయేషన్స్లో సెబీ జోక్యం చేసుకోదు
ముంబై: ఐపీవోలకు సంబంధించిన వేల్యుయేషన్స్ విషయంలో ...
39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!
భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్...
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార...
బంగారం కొనబోతే.. పసిడి ప్రియులకు నిరాశ
దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుల...
బ్యాంక్ సిబ్బంది స్థానిక భాషలో మాట్లాడాలి
ముంబై: కస్టమర్లతో మరింత మమేకం అయ్యేందుకు గాను బ్యా...
రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు
దివాలా ప్రక్రియలో చిక్కుకున్న కంపెనీల ఆస్తులను రుణ...
స్పెషాలిటీ స్టీల్కు మరో విడత ప్రోత్సాహకాలు
స్పెషాలిటీ స్టీల్ తయారీలోకి మరిన్ని పెట్టుబడులను ...
మూడో భారీ ఎకానమీగా భారత్!
అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ త్వరల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
టీసీఎస్ షాకింగ్ శాలరీ.. నెలకు రూ.422 పెరిగితే..
ఒక టీసీఎస్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాలుగేళ్లకు పైగా పనిచేసిన తనకు ఈ సంవత్సరం నెలకు కేవలం రూ.422 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చిందని అతను పేర్కొన్నారు. “టీసీఎస్ నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపు ఇచ్చింది..” అంటూ రెడ్డిట్లో పోస్ట్ చేశారు.2021లో కంపెనీలో చేరినట్లు పేర్కొన్న రెడిటర్ .. “ఇది నా చెడు నిర్ణయాల ఫలితం” అని పేర్కొంటూ, తాను సపోర్ట్ ప్రాజెక్ట్లో పనిచేశానని, అక్కడ “జీరో లెర్నింగ్, జీరో గ్రోత్, అంతులేని అరుపులు, మైక్రోమేనేజ్మెంట్” ఉండేదని రాసుకొచ్చారు. తన పెంపు ఆరు నెలల ఆలస్యంగా వచ్చిందని, ఈ పరిస్థితుల్లో టీసీఎస్ వంటి సంస్థలు “పల్లీలు కొనుక్కునే చెల్లింపులు” ఇస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన “మీ విలువ తెలుసుకోండి” అని టీసీఎస్ ఉద్యోగులు, ఫ్రెషర్లకు సూచించారు.వైరల్గా మారిన ఈ పోస్ట్పై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు. ‘ఇంక్రిమెంట్ దారుణంగా ఇవ్వడంతో నేను 7 సంవత్సరాల తర్వాత టీసీఎస్ వీడాను’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ సంవత్సరం తనకు జీరో హైక్ వచ్చిందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “ఐటీని విడిచిపెట్టడం ఉత్తమ మార్” అంటూ మరొకరు కామెంట్ చేశారు.ఇక టీసీఎస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. “వ్యక్తిగత కేసులపై మేం వ్యాఖ్యానించం. కానీ ఆ పోస్ట్లో పేర్కొన్నవి అవాస్తవాలు” అని టీసీఎస్ ప్రతినిధి పేర్కొన్నారు. “సెప్టెంబర్ 1 నుంచి మా ఉద్యోగుల 80% మందికి వేతన సవరణలు అమలయ్యాయి. సగటు ఇంక్రిమెంట్ 4.5% నుంచి 7% మధ్య ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపు ఇచ్చాం” అని తెలిపారు
మస్క్లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!
కృత్రిమ మేధ(AI) వేగంగా అభివృద్ధి చెందడం మొదలైనప్పటి నుంచి ఉద్యోగాల కోత సంచలనంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాటి కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తూ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ గాడ్ ఫాదర్గా పిలువబడే జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐలో వస్తున్న మార్పు భవిష్యత్తులో కోట్లాది మందిని నిరుద్యోగులుగా మారుస్తుందని, ఈలోగా కేవలం ఎలాన్ మస్క్ వంటి కొద్దిమంది మాత్రమే ధనవంతులు అవుతారని జోస్యం చెప్పారు.కంపెనీల వైఖరిఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఐబీఎం, టీసీఎస్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐని అమలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని హింటన్ బ్లూమ్బెర్గ్కు ఇచ్చిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోకుండా ఏఐతో ముందుకు వెళ్లే మార్గం ఉందా అని అడిగినప్పుడు ‘అది సాధ్యం కాదని నమ్ముతున్నాను. డబ్బు సంపాదించాలంటే మానవ శ్రమను భర్తీ చేయాలి. అందుకు ఏఐను వాడుతున్నారు. కంపెనీలు లాభాలు పెంచుకునేందుకు ఈ పంథాను వినియోగిస్తున్నాయి’ అన్నారు.ఏఐ సమస్య కాదు.. సామాజిక సమస్య..ఏఐ అభివృద్ధి వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతపై జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ.. ‘టెక్ బిలియనీర్లు మాత్రమే ఈ రేసులో విజేతలుగా నిలుస్తారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగుల స్థానంగా ఏఐ పని చేస్తుంది. మస్క్ వంటి వ్యక్తులు మాత్రమే ధనవంతులు అవుతారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది ఏఐ సమస్య కాదు, సామాజిక సమస్య. ఏఐ మన సమాజాన్ని, మన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తుందనేది నిశితంగా గమనించాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత
ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వృద్ధి కారణంగా ఏర్పడిన గ్లోబల్ ఫ్లాష్ మెమరీ కాంపొనెంట్ల కొరత వల్ల ఎల్ఈడీ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఈడీ టీవీలు సహా అనేక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఫ్లాష్ మొమరీ కాంపొనెంట్ల తయారీలో కీలకంగా ఉన్న కంపెనీలు అధిక మార్జిన్ కలిగిన ఏఐ డేటా సెంటర్ల వైపు మళ్లడమేనని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్లాష్ మెమరీ ధరలు పెరుగుదలLED టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్లో విరివిగా ఉపయోగిస్తున్న ఫ్లాష్ మెమరీ ధరలు కొద్ది నెలల్లోనే భారీగా పెరిగాయి. వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం 1GB/8GB మెమరీ ధర ఏప్రిల్లో 2.61 డాలర్ల వరకు ఉండగా అక్టోబర్ నాటికి అది ఏకంగా 14.40 డాలర్లకు పెరిగింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ధరల పెరుగుదల 50 శాతానికిపైగా చేరాయి. ఇది టీవీ తయారీదారుల ఇన్పుట్ ఖర్చులపై ఒత్తిడి పెంచింది.ఏఐ డిమాండ్: సాధారణ ఎలక్ట్రానిక్స్కు అంతరాయంసెమీకండక్టర్ పరిశ్రమలోని ప్రధాన కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారించడమే ఈ కొరతకు మూలకారణం అని తెలుస్తుంది. చిప్ తయారీదారులు ఏఐ డేటాసెట్లలో ఉపయోగించే DDR6, DDR7 చిప్ సెట్ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కారణంగా టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల్లో సాధారణంగా వాడే DDR3, DDR4 మెమరీ ఉత్పత్తి తగ్గిపోయింది.ఎస్పీపీఎల్(థామ్సన్ బ్రాండ్ లైసెన్స్) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ..‘2021-22 చిప్సెట్ కొరత తర్వాత ఫ్లాష్ మెమరీ అతిపెద్ద సమస్యగా ఉంది. త్వరలో ఎల్ఈడీ టెలివిజన్ ధరలు పెరుగుతాయి’ అన్నారు. ఈ మెమరీ కాంపోనెంట్స్ ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు 2026 కోసం మెమరీ సెట్లను భద్రపరచడానికి పోటీ పడుతుండటంతో సరఫరా గొలుసు అంతరాయాలు పెరిగి ధరల ఒత్తిడి మరింత తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు.ఈ కొరత ఎప్పటివరకంటే..ఈ కొరత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల వరకు కొనసాగుతుందని ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు) అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీలు తమ ఆర్డర్లను వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇన్వెంటరీని క్రమబద్ధీకరిస్తున్నాయి.టీవీలలో ఫ్లాష్ మెమరీని ఎందుకు ఉపయోగిస్తారంటే..స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్ (webOS), టైజెన్ (Tizen) వంటి ఆపరేటింగ్ సిస్టమ్లపై పనిచేస్తాయి. ఈ OS కోడ్, టీవీని నడిపించే ఫర్మ్వేర్ (firmware) కోడ్ అంతా ఫ్లాష్ మెమరీలోనే శాశ్వతంగా నిల్వ అవుతుంది. టీవీని ఆన్ చేసినప్పుడు ఫ్లాష్ మెమరీలోని ఈ OS, ఫర్మ్వేర్ నుంచి డేటా లోడ్ అవుతుంది. అప్పుడే టీవీ పనిచేయడం మొదలవుతుంది.నెట్ఫ్లిక్స్ (Netflix), యూట్యూబ్ (YouTube), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వంటి యాప్లను వినియోగదారులు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ఫ్లాష్ మెమరీ స్థలాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు
భారత ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాల్లో మార్పులు
భారతదేశం ఇటీవల ఆవిష్కరించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పాలనా మార్గదర్శకాలు దేశ సాంకేతిక నియంత్రణ విధానంలో కీలకమైన మార్పును సూచిస్తున్నాయి. తక్షణమే కఠినమైన చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం ‘ఇన్నోవేషన్-ఫస్ట్’ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుకూల సవరణలు చేసి ఏఐ వ్యవస్థలను నియంత్రించాలని నిర్ణయించింది.ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త ఏఐ చట్టాన్ని ప్రతిపాదించకుండా ఏఐ వ్యవస్థలను నియంత్రించడంలో ఉన్న లోపాలను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న చట్టాలను సమగ్రంగా సమీక్షించాలని పిలుపునిచ్చింది. ఏఐ రంగంలో వేగంగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.సవరణలు వీటిలోనే..ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (DPDP), 2023ఏఐ వ్యవస్థలు స్వయంగా డేటాను సవరించడం లేదా ఉత్పత్తి చేయడం వల్ల ఇంటర్మీడియరీల(మధ్యవర్తుల) ప్రస్తుత రక్షణ నిబంధనలకు సవాలు ఏర్పడుతుంది. ఏఐ-సృష్టించిన కంటెంట్కు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై నియంత్రణపరమైన స్పష్టత కొరవడింది. ఈక్రమంలో పైన తెలిపిన చట్టాల్లో ఈమేరకు సవరణలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమస్యను పర్యవేక్షించడానికి ప్రభుత్వం సంస్థాగత ఫ్రేమ్ వర్క్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఏఐ గవర్నెన్స్ గ్రూప్(ఏఐ గవర్నెన్స్ను పర్యవేక్షించే ప్రధాన సంస్థ), టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ (TPEC-నిర్దిష్ట చట్టపరమైన లోపాలను గుర్తించడం, సవరణలను ప్రతిపాదించడం, అమలును పర్యవేక్షించడం)వంటి వాటిని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?
పర్సనల్ ఫైనాన్స్
బంగారం, వెండి, బిట్కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. సందర్భమేదైనా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, బిటికాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీపై తన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. న్యూయార్క్ నగరానికి కొత్త మేయర్గా జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) ఎన్నికైన సందర్భంగా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజగా ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు.‘మార్క్సిస్ట్ మామ్దానీ న్యూయార్క్ మేయర్ అయ్యారా? అతను రెంట్ స్టెబిలిటీని పెంచుతారని న్యూయార్క్ వాసులకు తెలుసా?’ అంటూ ట్వీట్ చేశారు. అద్దెపై నియంత్రణ అన్నది మార్క్సిస్ట్ సిద్ధాంతమని, దానర్థం అపార్ట్మెంట్ తరాలుగా అద్దెకుండేవారి చేతుల్లోనే ఉండిపోతుందని, ఓనర్లు మాత్రం హక్కులు కోల్పోతారని హెచ్చరించారు.అన్నింటికీ మార్క్సిస్ట్ ప్రభుత్వమే యాజమాని అయ్యేటప్పుడు ఇక ప్రజలు దేనికైనా ఓనర్లుగా ఉండటం ఎందుకు? అంటున్నారు. అమెరికా స్వేచ్ఛ, పెట్టుబడి వ్యవస్థ కోల్పోంతోందని, మార్క్సిస్ట్ దేశంగా మారిపోతోందని అసంతృప్తిని వెలిబుచ్చారు. వామపక్ష ప్రభుత్వం నడిపే స్కూళ్లలో ఆర్థిక బోధన ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, అసలైన ఆర్థిక జ్ఞానంతో మిమ్మిల్ని మీరు రక్షించుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు. రియల్ మనీ గురించి తెలుసుకోవాలన్నారు. బంగారం, వెండిని (gold and silver) దేవుని సొమ్ముగా, బిట్కాయిన్, ఎథీరియంను ప్రజా సొమ్ముగా అభివర్ణించారు.OMG: Marxist Momdami Mayor of NYC? Don’t New Yorkers know that he will increase “Rent Stability” which is Marxist and means;1: Infinite Rent Control…. Which means a renter has control of their apartment for generations. A person can pass on their apartment to their kids,…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 5, 2025
జనవరి 1 నుంచి ఆ పాన్ కార్డులు చెల్లవు..!
ఆధార్తో లింక్ చేసుకోని పాన్ కార్డులు వచ్చే జనవరి 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే తమ ఆధార్తో పాన్ కార్డులు లింక్ చేసుకోనివారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.ఆధార్, పాన్ కార్డులు.. రెండూ దేశంలో అత్యంత ముఖ్యమైన ధ్రువ పత్రాలు. ఒకటి దేశ పౌరుడిగా విశిష్ట గుర్తింపును తెలియజేసేదైతే మరొకటి ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. పన్ను ఎగవేతలను అక్రమాలను అరికట్టడానికి ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. దీనికి గడువును మాత్రం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) 2024 అక్టోబర్ 1వ తేదీకి ముందు జారీ చేసిన పాన్ కార్డులను 2025 డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసుకోవాలని గడువు విధించింది. ఆ లోపు లింకింగ్ పూర్తి కాకపోతే అలాంటి పాన్కార్డులు చెల్లుబాటు కావని సీబీడీటీ గతంలో వెల్లడించింది. ఇప్పుడా గడువు సమీపిస్తోంది. ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయనివారు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకోండిలా..ఆదాయపు పన్ను శాఖ ఆన్లైన్ పోర్టల్లో మీ పాన్, ఆధార్ ను సులభంగా లింక్ చేసుకోవచ్చు. ఈ దశలను అనుసరించండి..అధికారిక ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ కు వెళ్లండి."లింక్ ఆధార్" పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.ఇప్పుడు మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వివరాలను వెరిఫై చేయండి.ఒకవేళ మీ పాన్ ఇప్పటికే ఇనాక్టివ్గా ఉంటే, మొదట రూ .1,000 లింకింగ్ ఫీజు చెల్లించాలి.లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్సైట్లో ‘క్విక్ లింక్స్’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్పై క్లిక్ చేయండి.
జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?
డబ్బు సంపాదించడం ఒక కళ. ధనవంతులు అయ్యేందుకు చాలా మార్గాలు అనుసరించి లక్ష్యం చేరినా, దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం దేనికి ఖర్చు చేస్తున్నారో సరైన అవగాహన లేకుండానే చాలా మంది నష్టపోతున్నారు. ఇది కేవలం తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే కాదు, అపార సంపద ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేసుకోవడానికి బదులు, దారిద్ర్యం వైపు నడిపించే ప్రమాదకరమైన అలవాట్లు, ఆర్థిక నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవడం అత్యవసరం.అదుపులేని వినియోగం‘నాకు ఇప్పుడే ఆ వస్తువు అవసరం లేదు, కానీ కొనాలి’ అనే భావన పేదరికానికి మొదటి మెట్టు. క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై వస్తువులను కొనుగోలు చేయడం, వాటిపై భారీ వడ్డీ చెల్లించడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. తరచుగా కొత్త మోడల్ ఫోన్లు, కార్లు లేదా ఫ్యాషన్ వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేయడం వంటి విధానాల ద్వారా డబ్బు కరిగిపోతుంది. కొనుగోలు చేసిన వస్తువుల విలువ కాలక్రమేణా తగ్గిపోతుంది. ఇతరులను అనుకరించడానికి లేదా సమాజంలో గొప్పగా కనిపించడానికి స్థోమతకు మించిన ఖర్చులు చేయకూడదు.ఆర్థిక అవగాహన లేకపోవడండబ్బు సంపాదించడం గురించి తెలుసుకోవడమే కాదు, అది ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం అతిపెద్ద లోపం. డబ్బును బ్యాంకులో ఉంచడం సురక్షితమని భావించి చాలా మంది దాని విలువ ద్రవ్యోల్బణం కారణంగా క్రమంగా తగ్గిపోతోందని గ్రహించడం లేదు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ముఖ్యం. కానీ ఆ పొదుపును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు. పన్నుల విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా ఎక్కువ పన్నులు చెల్లించడం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.అత్యవసర నిధి..ఊహించని సంఘటనలకు (ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, ప్రమాదాలు) సిద్ధంగా లేకపోవడం వల్ల పేదరికం అంచుల్లోకి వెళుతారు. అత్యవసర సమయాల్లో డబ్బు లేకపోతే అధిక వడ్డీకి అప్పులు చేయక తప్పదు. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. కనీసం ఆరు నెలల జీవన వ్యయాలకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకోవాలి. ఏ చిన్న విపత్తు వచ్చినా తీవ్ర సంక్షోభం నుంచి కపాడుకోవడానికి ఇది తోడ్పడుతుంది.ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటంఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై పూర్తిగా ఆధారపడటం ఆర్థిక ప్రమాదానికి సంకేతం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఉద్యోగం పోతుందో చెప్పలేం. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేకపోతే కుటుంబ పోషణ కష్టమవుతుంది. అదనపు ఆదాయ వనరుల ద్వారా సంపదను వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. అన్ని గుడ్లను ఒకే బుట్టలో ఉంచడం మంచిది కాదనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక..రేపటి గురించే కాకుండా 20-30 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల కూడా చాలామంది పేదరికంలోకి వెళ్తున్నారు. యువతలో రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. దానికోసం పొదుపు/పెట్టుబడి పెట్టడం లేదు. దాంతో వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. ఇల్లు కొనడం, పిల్లల విద్య వంటి స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే పరిస్థితులు తారుమారవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లభించే చక్రవడ్డీ శక్తిని గుర్తించాలి.ఇదీ చదవండి: దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
నాకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఒకటే ఉంది. అందులో జీతమే పడుతుందని కొందరు.. పెన్షన్ తప్ప ఇంకేమీ వేయనని ఇంకొందరు.. మార్చి నెలాఖరుకల్లా చాలా తక్కువ.. అంటే మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంటుందని మరికొందరు చెప్తుంటారు. అక్షరాలా ఇదే నిజమైతే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు వ్యవహారాల మీద ఎలాంటి నిఘా ఉండదు. కేవలం ఫిక్సిడ్ డిపాజిట్ల మీదే దృష్టి ఉంటుందని కొందరి పిడివాదన.డిపార్టుమెంటు వారికి అవేమీ పట్టవు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అన్ని బ్యాంకులు, అన్ని బ్రాంచీలు ప్రతి సంవత్సరం విధిగా, మీకు సంబంధించిన అన్ని సేవింగ్స్ ఖాతాల వ్యవహారాలను కొన్ని నిబంధనలకు లోబడి డిపార్టుమెంటుకు చేరవేస్తాయి. ఆ చేరవేత, ఆ తర్వాత ఏరివేత.. మెదడుకి మేత.. కృత్రిమ మేథస్సుతో వాత.. వెరసి మీకు నోటీసుల మోత! అసాధారణమైన నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వారి దృష్టిలో పడతాయి. వివిధ సంస్థలు, ఏజెన్సీలు ప్రతి సంవత్సరం ‘‘నిర్దేశిత ఆర్థిక వ్యవహారాల’’ను ఒక రిటర్ను ద్వారా తెలియజేస్తాయి.పది లక్షలు దాటిన నగదు డిపాజిట్లుఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి కాని, దఫదఫాలుగా కానీ వెరసి నగదు డిపాజిట్లు రూ. 10,00,000 దాటితే మీ ఖాతా వ్యవహారాలు.. సేవింగ్స్ ఖాతాలో పడినట్లు కాదు.. డిపార్టుమెంటు వారి చేతిలో పడ్డట్లే.విత్డ్రాయల్స్కొందరు తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్డ్రా చేస్తారు. వ్యాపారం నిమిత్తం, పెళ్లి ఖర్చుల నిమిత్తం.. ఇలా చేయడం చట్టపరంగా తప్పు కాకపోవచ్చు. అసమంజసంగా అనిపిస్తే ఆరా తీస్తారు. ‘సోర్స్’ గురించి కూపీ లాగుతారు.క్రెడిట్ కార్డులపై భారీ చెల్లింపులుఅకౌంటు ద్వారా పెద్ద పెద్ద మొత్తాలు క్రెడిట్ కార్డుల చెల్లింపులకు వెళ్తుంటాయి. వీటి మీద నిఘా, విచారణ ఉంటాయి.రూ. 30,00,000 దాటిన క్రయ విక్రయాలు..ఇలాంటి క్రయవిక్రయాలను సబ్రిజిస్టార్ వాళ్లు ప్రతి సంవత్సరం రిపోర్ట్ చేస్తారు. వెంటనే బ్యాంకు అకౌంట్లను చెక్ చేస్తారు. సాధారణ పద్దులు/రొటీన్ పద్దులు ఉండే అకౌంట్లలో పెద్ద పెద్ద పద్దులుంటే, వారి అయస్కాంతంలాగా వారి దృష్టికి అతుక్కుపోతాయి.విదేశీయానం.. విదేశీ మారకం..విదేశీయనం నిమిత్తం, విదేశీ చదువు కోసం, విదేశాల్లో కార్డుల చెల్లింపులు... ఇలా వ్యవహారం ఏదైనా కానీ రూ. 10,00,000 దాటితో పట్టుకుంటారు. దీనికి ఉపయోగించిన విదేశీ మారకం, చట్టబద్ధమైనదేనా లేక హవాలానా అనేది ఆరా తీస్తారు.నిద్రాణ ఖాతాల్లో నిద్ర లేకుండా చేసే వ్యవహారాలుకొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి లావాదేవీలు ఉండని ఖాతాలను నిద్రాణ లేదా ని్రష్కియ ఖాతాలని అంటారు. వాటిలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద వ్యవహారాలేమైనా జరిగాయంటే.. అధికారుల కళ్లల్లో పడతాయి. ఇలాంటి వ్యవహారాలు అధికారుల దృష్టిని ఆకట్టుకుంటే.. వారు వెంటనే పట్టుకుంటారు.డిక్లేర్ చేయని వ్యవహారాలు చనిపోయిన మావగారు, పెళ్లప్పుడు ఇచ్చిన స్థలాన్నో, ఇళ్లనో ఇప్పుడు అమ్మేసి, వచి్చన ఆ పెద్ద మొత్తాన్ని అకౌంటులో వేసి, ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తే అది మౌనరాగం కాదు. గానాబజానా అయిపోతుంది. ఖజానాకి చిల్లులు పడతాయి. పొంతన లేని డివిడెండ్లు.. వడ్డీ.. కొన్న షేర్లు భారీగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్లు కొండంత ఉన్నా డివిడెండ్లు, వడ్డీల రూపంలో ఆదాయం ఆవగింజంత కనిపిస్తోందంటే ..తస్మాత్ జాగ్రత్త.ఎన్నో అకౌంట్లు .. కానీ ఒక్కదాన్నే..కొందరికి ఎన్నో అకౌంట్లు ఉంటాయి. తప్పు లేదు. కానీ వారు ఇన్కంట్యాక్స్ రిటర్నుల్లో ‘ఏకో నారాయణ’ అన్నట్లు ఒక దాన్ని మాత్రమే డిక్లేర్ చేస్తారు. డిపార్టుమెటు వారి దగ్గర మీ పది అకౌంట్ల వివరాలు పదిలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.వేరే వ్యక్తుల సహాయార్థం.. ఏదో, సహాయమని, బంధువులు, స్నేహితుల పెద్ద పెద్ద వ్యవహారాలను మీ అకౌంట్లలో నడిపించకండి. వివరణ మీరు ఇవ్వాల్సి వస్తుంది.. ఇవ్వగలరా? అప్పులను తిరిగి చెల్లించేటప్పుడే ఆశగా ఎక్కువ వడ్డీ చూపించి, పెద్ద మొత్తాన్ని మీ అకౌంట్లో వేసి, ‘నా పేరు చెప్పకు గురూ’ అని అంటారు.. కానీ, వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేంటి అనే అటలాగా, వీళ్ల వ్యవహారాలేంటి.. వాళ్ల వ్యవహారాలేంటి అని ఆరా తీస్తూ, దొంగ లావాదేవీలు లేదా డిక్లేర్ చేయని లావాదేవీలను డిపార్టుమెంటు వారు కళ్లు మూసుకుని సైతం పట్టేస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని మనం కళ్లు తెరుచుకుని ఉండాలి.


