Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

microsoft partnered with Indian govt to deploy AI chatbots eShram NCS1
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్‌) పోర్టల్‌ల్లో అత్యాధునిక ఏఐ చాట్‌బాట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.ఈ-శ్రమ్, ఎన్‌సీఎస్‌ పోర్టల్స్‌లో ఏఐ చాట్‌బాట్‌లుఇండియా ‘ఏఐ-ఫస్ట్‌ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్‌సీఎస్‌లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.ఈ చాట్‌బాట్‌లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్‌ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్‌ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు

Key Highlights of Amazon Announcement check details2
2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు

ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగా 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం 35 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2010లో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుంది.న్యూఢిల్లీలో జరిగిన ఆరో అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పింది. ఏఐ నేతృత్వంలోని డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ‍ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్‌ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అమెజాన్ పేర్కొంది.డిజిటలైజేషన్, ఉద్యోగాలుకొన్నేళ్లుగా అమెజాన్ దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తోంది. ఈ సమ్మిట్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 వరకు భారత పరిశ్రమల్లో సుమారు 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష, కాలానుగుణ ఉద్యోగాలకు అమెజాన్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్‌వైపు మళ్లించినట్లు చెప్పింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్‌వర్క్‌లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది.అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలియన్ల మంది భారతీయులకు ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2030 నాటికి మా ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్‌ డాలర్లకు అంటే నాలుగు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

Auro Realty buys Taj Banjara for Rs 315 Crore 3
‘తాజ్ బంజారా’ను కొనేసిన అరబిందో

హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్‌ హోటల్‌ ‘తాజ్‌ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్‌కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్‌ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో ఉ‍న్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్‌లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.ఐకానిక్ తాజ్ బంజారాఒకప్పుడు తాజ్ గ్రూప్‌కి చెందిన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ హోటల్‌గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్‌గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్‌ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్-యూజ్ సెగ్మెంట్‌ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్‌ బంజారా హోటల్‌ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌కు తెరతీస్తుందా అన్నది చూడాలి.

Telangana CM Revanth Reddy Inaugurates Google for Startups Hub in Hyderabad4
హైదరాబాద్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం

హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్‌గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్‌వర్క్‌ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్‌లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్‌షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్‌లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్‌ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్‌షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్‌తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్‌లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్‌లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్‌ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్‌ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్‌తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్‌లకు సహాయపడుతుంది” అన్నారు.

IndiGo Crisis hit over 40000 passengers at Mumbai airport 905 flights cancelled5
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు

ముంబై.. దేశంలో అత్యంత కీలకమైన నగరం. దీన్ని దేశ ఆర్థిక రాజధానిగా కూడా పేర్కొంటుంటారు. దేశంలోని అనేక కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఆర్థికపరమైన కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో విదేశాలతోపాటు, దేశ నలుమూలల నుంచి ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ముంబై నగరాన్ని ప్రభావితం చేసింది.ఇండిగో విమాన అంతరాయాల ప్రభావం ముంబై విమానాశ్రయంలో వారం రోజులుగా ప్రయాణికులను సతాయించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 1 నుంచి 8 వరకు 905 విమానాలు రద్దు అయ్యాయి. 1,475 విమానాలు 30 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయాల వల్ల సుమారు 40,789 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే..ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎనిమిది రోజులలో 3,171 విమానాలు నడపాల్సి ఉండగా కేవలం 2,266 మాత్రమే నడిపగలిగింది. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. డిసెంబర్ 1న 14గా ఉన్న విమాన రద్దులు డిసెంబర్ 5న 295కి పెరిగాయి. ఆలస్యాలు కూడా ఎక్కువయ్యి, డిసెంబర్ 3న 281 విమానాలు గరిష్ట ఆలస్యాన్ నమోదు చేశాయి.స్తంభించిన ప్రయాణికుల బ్యాగేజీఅంతరాయాలు పెరుగుతూనే ఉండటంతో టెర్మినళ్లలో కార్యకలాపాలు క్రమంగా స్తంభించాయి. రద్దయిన విమానాల కారణంగా సుమారు 780 చెక్-ఇన్ బ్యాగులు ప్రయాణికులకు అందకుండా నిలిచిపోయాయి. వీటిలో 90% బ్యాగులను బుధవారం నాటికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.ఎక్కువగా ప్రభావితమైన మార్గాలు ఇవే..ముంబై నుంచి బయలుదేరే అనేక దేశీయ మార్గాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ప్రధానంగా అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, కొచ్చి, గోవా, లక్నో నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయంగా ఆమ్‌స్టర్‌డామ్‌, ఇస్తాంబుల్ మార్గాలలో కూడా పెద్ద ఎత్తున ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకున్నాయి.

IndiGo Turmoil Government Orders Major Operational Cuts6
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం మెల్లగా కుదుటపడుతోంది. విమానాల సర్వీసుల రద్దు, ఆపరేషనల్‌ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్‌ తనిఖీలు వంటి అంశాలను పరిశీలించేందుకు డీజీసీఏ ప్రత్యేక బృందాలను నియమించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, సంస్థపై ఒత్తిడిని మరింత పెంచుతూ విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో మొత్తం ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇండిగో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా, ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను రద్దు చేసే యోచనలో కూడా డీజీసీఏ ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీసుల నిరంతరత, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాల ఆధారంగా రూట్లను పునర్‌వ్యవస్తీకరించనున్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో ఇండిగో సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్నప్పటికీ, విస్తృతంగా సేవలు అందించే సంస్థగా ఉన్నందున మరికొన్ని రోజులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement