ప్రధాన వార్తలు
గృహ రుణానికి ముందే గుడ్బై
ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ పెట్టి కావాలనుకుంటున్న వస్తువు సొంతం చేసుకుంటారు. కొందరు ఉన్నదానికి తగ్గదే కొనుక్కుని సర్దుకుపోతారు. మరికొందరైతే ఇటు సర్దుకుపోలేక... అటు కావాలనుకున్నది కొనలేక తరువాత చూద్దామని వాయిదా వేసుకుంటుంటారు. కానీ... ‘తరువాత’ అనేది రావటం కష్టం. ఎందుకంటే మనం అప్గ్రేడ్ అయ్యేసరికి మన కోరిక, లేకపోతే ఆ వస్తువు ధర కూడా అప్గ్రేడ్ అవుతాయి కదా? ఇదంతా ఎందుకంటే... ఆ మొదటి కేటగిరీ గురించి. ఇంకాస్త ఎక్కువపెట్టి ముందుకెళ్లే వారి గురించి. వారు మొదట్లో కొంత ఇబ్బంది పడినా... తాను అనుకున్నది చేశామనే సంతృప్తి ఉంటుంది కదా! అది ఆర్థికంగానూ లాభాన్నే ఇస్తుంది. గృహ రుణం చెల్లింపుల్లో అలా ఇంకాస్త ఎక్కువ పెట్టే వారి గురించే ఈ ప్రత్యేక కథనం...ప్రతి ఒక్కరికీ సొంతిల్లు కలే. ఒకప్పుడు రిటైర్మెంట్ తరువాతే సొంతిల్లు. ఈజీ రుణాల కారణంగా... ఈ తరం మాత్రం ఉద్యోగంలో చేరిన మొదట్లోనే సొంతింటికి ఓటేస్తున్నారు. 20–30 ఏళ్ల పాటు రుణ చెల్లింపులకు గడువు పెట్టుకున్నా... వీలైనంత త్వరగా తీర్చేయడానికి కష్టపడుతున్నారు. మరి మీకు తెలుసా ఒక 5వేల రూపాయలు ఎంత మ్యాజిక్ చేస్తుందో? నెలనెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా రూ.5వేలు గనక చెల్లిస్తే... 20 ఏళ్లలో ఏకంగా రూ.11.5 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. పైపెచ్చు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలమూ తగ్గుతుంది. అదెలాగంటే...రూ.5,000 చేసే మ్యాజిక్ ఇదీ...ఉదాహరణకు శ్రీకర్ రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాలానికి నెలకు రూ.40వేలు ఈఎంఐ చెల్లించడానికి ముందే మానసికంగా సిద్ధపడ్డాడు. కానీ మరో రూ.5వేలు అదనంగా చెల్లిస్తే..? ఏం జరుగుతుందో చూద్దాం... → శ్రీకర్ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతం. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ,.43,500 → 20 ఏళ్లలో రూ.50 లక్షల అసలుతో పాటు మరో రూ.54 లక్షలు వడ్డీ కింద చెల్లించాలి. → కానీ ప్రతినెలా రూ.43,500 కాకుండా దానికి రూ.5వేలు జోడించి రూ.48,500 చెల్లిస్తే.... → 20 ఏళ్ల రుణం కాస్తా 16 ఏళ్ల 6 నెలల్లో తీరిపోతుంది. వడ్డీ రూపంలో ఏకంగా రూ.11.5 లక్షలు ఆదా అవుతుంది. → ఒకవేళ రూ.10,000 అదనంగా (రూ.53,500 చొప్పున) చెల్లిస్తే... రుణం 13 ఏళ్లకే తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.20 లక్షలు మిగులుతుంది. → ఇలా స్మార్ట్ చెల్లింపులతో 20 ఏళ్ల రుణ బంధాన్ని 12–13 ఏళ్లకే తీర్చుకోవచ్చు.ఒకే విడతా లేక నెలవారీనా..?→ వేతన జీవులు ప్రతి నెలా ఈఎంఐకి కొంత అదనంగా చెల్లిస్తూ వెళ్లడమే మంచి మార్గం → దీనివల్ల ప్రతి నెలా అసలు కాస్త తగ్గుతూ వెళుతుంది. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఇతర ఖర్చులపైనా నియంత్రణ వస్తుంది → బోనస్ లాంటివి వచి్చనపుడు ఆ మొత్తాన్ని గృహ రుణం ముందస్తు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → అయితే ఎక్కువ మొత్తం ఒకేసారి చెల్లిస్తున్నపుడు... గృహ రుణం వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ వచ్చే మార్గాలేవైనా ఉన్నాయేమో చూడాలి. → అలాంటి మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని పరిశీలించాకే గృహ రుణం సంగతి చూడాలి. ఎందుకంటే గృహరుణాలపై వడ్డీ తక్కువ.అంత ఆదా సాధ్యమా?→ గృహ రుణంపై బ్యాంకులు ప్రతి నెలా చివర్లో మిగిలే నికర బకాయిపైనే వడ్డీ విధిస్తాయి. → ప్రతి నెలా చెల్లించే అదనపు మొత్తం నేరుగా అసలులో జమవుతుంది. తదుపరి నెలలో ఆ మేరకు అసలుపై వడ్డీ మిగులుతుంది. → ఈఎంఐకి అదనంగా ఇలా ఎంత అదనంగా చెల్లిస్తారో... అంత మేర వడ్డీ భారాన్ని, కాల వ్యవధిని తగ్గించుకోవచ్చు. → రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలో వీలైనంత అదనంగా చెల్లిస్తే... వడ్డీ– కాలవ్యవధిని అంత గణనీయంగా తగ్గుతాయి. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు. ఫ్లోటింగ్ – ఫిక్స్డ్ రేటు రుణం→ ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న గృహ రుణం అయితే ముందస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ పడదు. → ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకున్న వారు ముందుగా చేసే చెల్లింపులపై 1– 3 శాతం మేర పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. → ప్రస్తుతం బ్యాంక్లు/ ఎన్బీఎఫ్సీలు ఫ్లోటింగ్ రేటునే అనుసరిస్తున్నాయి. ఫిక్స్డ్ రేటుపై, పెనాల్టీ లేని ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించొచ్చు. → ఒకవేళ బ్యాంక్ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్ ఇస్తే.. అంగీకరించొద్దు.
వృద్ధి గుడ్.. మరి వడ్డీ రేట్లో?
మార్కెట్లు ఆల్టైమ్ రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాయి. గతంలో రెండుసార్లు మార్కెట్ ఈ స్థాయిలకు వచ్చి... అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక కొంత కరెక్షన్కు గురయ్యింది. ఈ సారి మాత్రం మార్కెట్లు ముందుకెళ్ళి, కొత్త ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందనేది నిపుణుల మాట. గత వారం చివర్లో... అది కూడా మార్కెట్లు ముగిశాక విడుదలైన క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలు మార్కెట్ను ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది వారి అభిప్రాయం. ఎందుకంటే వృద్ధి రేటు అంచనాలను మించింది. తయారీ, సర్వీసు రంగాలు 9 శాతం వృద్ధిని దాటి పరుగు తీయడంతో ఆరి్థక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇది ఆరు త్రైమాసికాలలోనే అత్యధికం. కాబట్టి ఈ ప్రభావం సోమవారం మార్కెట్లలో ప్రతిఫలించనునున్న విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ టారిఫ్ల నేపథ్యంలో జీఎస్టీ రేట్లను సవరించటమనేది దేశ ఆరి్థక వ్యవస్థ బలపడటానికి ఉపకరించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. దేశీ కీలకాంశాలివే... → ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయబోయే దేశీయ అంశాల్లో ప్రధానమైనది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధానంపై జరిపే సమీక్షా సమావేశం. ఈ నెల 5న (వారాంతాన) ఈ సమావేశం ముగుస్తుంది. మరింతగా రేట్లను తగ్గించటమా... లేదా యథాతథ పరిస్థితిని కొనసాగించటమా అన్నది మార్కెట్లను ప్రభావితం చేయనుంది. వృద్ధి రేటు పెరిగింది కనక రేట్ల కోత ఉండొచ్చన్నదే ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తోంది. → డిసెంబరు 1న (సోమవారం) అక్టోబర్ నెలకు సంబంధించిన దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలవుతాయి. సెపె్టంబర్లో ఐఐపీ 4 శాతం వద్ద నిలకడగా నమోదైంది. తయారీ రంగం 4.8 శాతం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. → నవంబర్ నెలకు ఆటో రంగ విక్రయ గణాంకాలు సైతం 1న వెలువడనున్నాయి. దీంతో పాటు హెచ్ఎస్బీసీ తయారీ, సర్వీసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. సాంకేతికంగా స్పీడ్.. → గత వారం మొదట్లో దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. దీంతో సరికొత్త గరిష్టాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 85707 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,203 పాయింట్ల వద్ద ముగిశాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం సైతం మార్కెట్లు మరింత పుంజుకునే వీలుంది. నిఫ్టీ 26,300 పాయింట్లను దాటితే.. 26,800– 26,850 వరకూ బలపడవచ్చు. ఇలాకాకుండా ఈ స్థాయిలో బలహీనపడితే.. తొలుత 26,000 పాయింట్లకు నీరసించవచ్చు. తదుపరి 25,850–25,800 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. గమనించాల్సిన ప్రధాన షేర్లు... అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారత్ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, గెయిల్ ఇండియా కంపెనీల షేర్లను గతవారం పలు బ్రోకరేజీ సంస్థలు రికమెండ్ చేశాయి. వీటి టార్గెట్ ధరను అప్గ్రేడ్ చేశాయి కూడా. దీంతో ఈ వారం ఇన్వెస్టర్లు ఈ షేర్లలో కదలికలను గమనించవచ్చు.
మీ కార్డు సంపాదిస్తోందా?
చాలామందికి క్రెడిట్ కార్డంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా... క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు. పైపెచ్చు కాస్త సంపాదించుకోవచ్చు కూడా. వీటన్నిటికీ తోడు హోటళ్లు, సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లపై ఎప్పటికప్పుడు ఆఫర్లూ వస్తాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లలో ఉచిత సదుపాయాలు... ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు నో–కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే... రూపాయి వడ్డీలేకుండా వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం... ఇలా చాలా లాభాలుంటాయి. కాకపోతే ఒక్కటే షరతు. ఏ క్రెడిట్ కార్డుపై ఎంత కొన్నా... బిల్లు గడువు తేదీ ముగిసేలోగా పూర్తిగా చెల్లించెయ్యాలి. అలాకాకుండా ఈ సారి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకున్నారో...! మీ పని అయిపోయినట్లే!!.సరైన ఆదాయం లేకపోవటమో... అప్పులంటే భయమో... లేదా సమాచారం లేకపోవటమో... ఏదైనా కావచ్చు. మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం చాలా తక్కువ. మన జనాభాలో వీటిని వాడుతున్నవారు ఐదారు శాతానికి మించి లేరు. అమెరికా లాంటి దేశాల్లో ఏకంగా 80 శాతం మందికిపైగా కనీసం ఒక్క క్రెడిట్ కార్డయినా వాడతారు. అందుకే ఈ క్రెడిట్ కార్డుల వ్యాపార విస్తరణకు దేశంలో విపరీతమైన అవకాశాలున్నాయి కాబట్టే... కంపెనీలు రకరకాల ఆఫర్లిస్తూ మరింతమందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇదీ.. అసలైన లాభం ప్రతి క్రెడిట్ కార్డుకూ ఓ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు రాఘవకు యాక్సిస్ బ్యాంకు కార్డుంది. దాని లిమిట్ రూ.6 లక్షలు. అంటే రూ.6 లక్షల వరకూ తను వాడుకోవచ్చన్న మాట. మరి ఆ కార్డు జేబులో పెట్టుకుంటే... తన జేబులో రూ.6 లక్షలున్నట్లే కదా? ఆసుపత్రి వంటి ఎంత ఎమర్జెన్సీ వచి్చనా... డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా దీన్ని వాడొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీల కోసం డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకోవాల్సిన పనిలేదు కూడా. ఇక ప్రతి కార్డుకూ బిల్లింగ్ తేదీ... చెల్లించడానికి గడువు తేదీ ఉంటాయి. ప్రతి బిల్లింగ్ తేదీకి 30 రోజుల సైకిల్... చెల్లించడానికి మరో 15 రోజుల గడువు ఉంటాయి. అంటే మొత్తంగా 45 రోజుల వ్యవధన్న మాట. బిల్లింగ్ తేదీ అయిన వెంటనే భారీ మొత్తాన్ని వాడినా అది తదుపరి బిల్లులోనే వస్తుంది. గడువు తేదీ కూడా ఉంటుంది కనక దాదాపు 40 రోజులు వడ్డీ లేకుండా అప్పు దొరికినట్లన్న మాట. దాన్ని గడువులోపు చెల్లించేస్తే వాడిన మొత్తంపై పైసా వడ్డీ కూడా ఉండదు.ఇదీ.. ప్రమాదానికి సంకేతం మీరు కార్డుపై ఆ నెల అవసరం కొద్దీ రూ.2 లక్షలు వాడారనుకుందాం. తదుపరి నెల బిల్లులో వాడుకున్న మొత్తాన్ని చూపించటంతో పాటు... ఒకవేళ మీరు దాన్ని చెల్లించలేకపోతే వాడినదాంట్లో 5 శాతాన్ని చెల్లించవచ్చని (మినిమం బిల్) పేర్కొంటారు. అంటే రూ.10వేలు చెల్లిస్తే చాలు. అది ఈజీ కూడా. కానీ మిగిలిన మొత్తంపై 36 శాతానికిపైగా వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మరో నెల గడిస్తే మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కనీస బిల్లు కూడా చెల్లించకపోతే ఆపరాధ రుసుములు భారీగా ఉంటాయి. మీ లిమిట్ను దాటి వాడినా భారీ చార్జీలు చెల్లించాలి. వీటివల్ల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయిపోతాయి. ప్రతినెలా కనీస బిల్లు కట్టుకుంటూ పోతే ఆ రుణం ఎప్పటికీ తీరదని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డుతో అతిపెద్ద ప్రమాదం ఇదే.కో–బ్రాండెడ్ కార్డులు కూడా... చాలా బ్యాంకులు రకరకాల సంస్థలతో జతకట్టి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సిటీబ్యాంకు ఐఓసీతో జతకట్టి సిటీ–ఐఓసీ కార్డును ఆఫర్ చేసింది. సిటీ క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంకు కూడా దాన్ని కొనసాగిస్తోంది. ఐఓసీ బంకులో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకుంటే 2 శాతం వరకూ క్యాష్బ్యాక్ వస్తుందన్న మాట. ఆ పాయింట్లను నేరుగా బిల్లు రూపంలో చెల్లించేయొచ్చు కూడా.రోజువారీ వినియోగానికి ఇవి బెస్ట్.. → ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్: ఆన్లైన్ కొనుగోళ్లపై ఫ్లాట్ 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. → యాక్సిస్ బ్యాంక్ ఏస్: కొనుగోళ్లపై 2–5 మధ్య క్యాష్ బ్యాక్. గూగుల్ పేతో లింక్ చేసుకోవచ్చు. → హెచ్డీఎఫ్సీ రిగాలియా: ప్రయాణాలు, రెస్టారెంట్లలో చెల్లింపులపై రివార్డులు.ఇలా చేయొద్దు... → కార్డుపై చేసే చెల్లింపుల్లో కొన్నింటిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, ప్రతి నెలా ఇదే ధోరణి అనుసరిస్తే ఈఎంఐలు చెల్లించడం కష్టం. → ఆఫర్లు ఉన్నాయని చెప్పి, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయడం స్మార్ట్ కానే కాదు. → వార్షిక ఫీజుపైనా దృష్టి సారించాలి. కొన్ని ఫ్రీగా ఇచ్చినా... కొన్ని సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఇదీ క్యాష్బ్యాక్ పవర్.. → ఒక నెలలో కార్డుతో ఆన్లైన్లో రూ.30,000 ఖర్చు చేశారు. → 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ కింద రూ.1,500 వెనక్కి వస్తుంది. → ఇలా ఒక ఏడాదిలో రూ.18,000 ఆదా చేసుకోవచ్చు. → ఈ మొత్తంతో కుటుంబానికి కావాల్సిన ఆరోగ్య బీమాను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్లో ఏటా రూ.18,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే, 12 శాతం రాబడి ఆధారంగా రూ.3.53 లక్షలు సమకూరుతుంది. స్మార్ట్ అంటే ఇలా.. → క్రెడిట్కార్డు బిల్లును ప్రతి నెలా గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. → కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయనే చేయొద్దు → గడువు తేదీకి చెల్లింపులు జరిగేలా ఆటో డెబిట్ సదుపాయం యాక్టివేట్ చేసుకోవాలి. → లిమిట్ ఉంది కదా అని చెప్పి నియంత్రణ లేకుండా వాడకూడదు. → క్రెడిట్ కార్డులు రెండుకు మించకుండా చూసుకోండి.
రూ.200 కంటే తక్కువ రీఛార్జ్: డైలీ 2జీబీ డేటా..
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Get more value every day with the #BSNL ₹199 Plan!Enjoy 2GB/day, unlimited calls & 100 SMS/day for 28 days - powered by Bharat's trusted network.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNLPlans #PrepaidPlans #BSNL #ConnectingBharat#BestPrepaidPlan #BSNLRecharge pic.twitter.com/mxRECIwJcU— BSNL India (@BSNLCorporate) November 30, 2025రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి'.. ఎప్పటికప్పుడు పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. మనీ టిప్ 2 పేరుతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలో అనే విషయం గురించి పేర్కొన్నారు.కియోసాకి తన ట్వీట్ ప్రారంభంలో.. 100 డాలర్లకు ఎంత కొంటారు? అని చెబుతూ.. 1900లో వంద డాలర్లకు, ఎనిమిది నెలలకు సరిపోయే సామాగ్రి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలంటే.. ఓడిపోయేవారిగా ఉండటం మానేయండని పేర్కొన్నారు.ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.ఇదీ చదవండి: 'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'నేను చెప్పేవాటినే పాటిస్తుంటాను. నేను 1965 నుండి వెండిని ఆదా చేస్తున్నాను. 1972 నుండి బంగారం, 2019 నుంచి బిట్కాయిన్. 2023 నుంచి ఎథీరియం ఆదా చేస్తున్నానని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల నేను నా 4.5 మిలియన్ డాలర్ల ఇంటిని 2000లో కొనుగోలు చేసిన 4,50,000 డాలర్ల బంగారంతో కొనుగోలు చేసానని అన్నారు. త్వరలో టిప్ 3 వస్తుంది అని ట్వీట్ ముగించారు.HOW MUCH WILL $100 BUY?1900: $100 would buy 8 months of groceries.1960: $100 was worth $372000: $100 worth $62025: $100 worth $3.80Money tip # 2: On how to be a winner as the global economy crashes is:“Stop Being a Loser.”Losers are losers because they…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 30, 2025
నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’: ధర ఎంతంటే?
లండన్ ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ కొత్తగా తమ ఫోన్ (3ఎ) లైట్ స్మార్ట్ఫోన్ని భారత్లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్ ఫోన్ డిసెంబర్ 5 నుంచి ఫ్లిప్కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్ ఔట్లెట్స్లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’లో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ పొందవచ్చు.
కార్పొరేట్
గృహ రుణానికి ముందే గుడ్బై
మీ కార్డు సంపాదిస్తోందా?
హిందుస్తాన్ పవర్కి సౌర విద్యుత్ ప్రాజెక్టు
ఐదేళ్లలో 10 కోట్ల కస్టమర్లు.. అపోలో ఫార్మసీ లక్ష్యం
నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో మస్క్
9,400 మందికి ట్రెయినింగ్.. స్టైపెండ్
హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై రూ.91 లక్షల జరిమానా.. కారణం..
రికార్డు స్థాయిలో భారత్లో బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు!
ప్రపంచంలోనే అత్యుత్తమ హెలికాప్టర్ల నిర్వహణకు రూ.8000 కోట్లు
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్స్: కేవలం 30 సెకన్లలో..
వెండికి హాల్మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్వర్క్
బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి చేసిన ప్...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కె...
ఒక్కసారిగా మారిపోయిన బంగారం ధరలు..
దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు త...
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల ప్రభావంతో భార...
‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్స్న...
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భా...
భారత్లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహి...
ట్యాక్స్ రీఫండ్.. ఆలస్యానికి కారణం ఇదే..
ఆదాయపు పన్ను (ఐటీ) రీఫండ్ల జారీలో జరుగుతున్న జాప్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
డిసెంబర్ 11న మరో యాపిల్ స్టోర్: ఈసారి ఎక్కడంటే?
భారతదేశంలో యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ నోయిడాలో యాపిల్ స్టోర్ ప్రారభించడానికి సన్నద్ధమైంది. దీనిని 2025 డిసెంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో.. కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్లెట్. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్ను ప్రారంభించనుంది.డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్.. నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్ మరియు బెంగళూరులోని హెబ్బాల్లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్తో సహా.. యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.బెంగళూరు, పూణేలలో యాపిల్ కొత్త అవుట్లెట్లను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ ఇప్పుడు నోయిడా స్టోర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీకి మన దేశంలో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.యాపిల్ తన మొదటి రెండు ఇండియా స్టోర్లను.. ముంబైలోని BKC & ఢిల్లీలోని సాకేత్లలో ఏప్రిల్ 2023లో ప్రారంభించింది. ఈ రెండు స్టోర్ల నుంచి తొలి ఏడాదే.. రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అత్యంత బలమైన పనితీరు కనబరిచిన అవుట్లెట్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 60 శాతం అమ్మకాలు చిన్న సాకేత్ స్టోర్ ద్వారా జరిగాయి.ఇదీ చదవండి: రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్
ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. తాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ & పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్మాన్, అరవింద్ శ్రీనివాస్లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్కాస్ట్లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
‘సేఫ్ సెకండ్ అకౌంట్’తో డిజిటల్ మోసాలకు చెక్
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు కొత్త సర్వీసు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ తమ యూజర్ల భద్రతకు భరోసా ఇస్తూ, కొత్త సర్వీసు వివరాలు వెల్లడిస్తూ లేఖ రాశారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి తమ డబ్బుకు రక్షణ కల్పించేలా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ అనే కొత్త సర్వీసు ప్రారంభించినట్లు ప్రకటించారు.నకిలీ పార్శిల్ డెలివరీ కాల్స్, ఫిషింగ్ లింక్లు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్న తరుణంలో విట్టల్ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న సేఫ్ సెకండ్ అకౌంట్ ద్వారా వినియోగదారుల డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత కల్పిస్తున్నాం. నేటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చాలా మంది యూపీఐ లేదా ఇతర చెల్లింపుల యాప్లకు తమ ప్రధాన సేవింగ్స్ ఖాతాతో అనుసంధానిస్తున్నారు. మోసగాళ్లకు పొరపాటున మీ అకౌంట్ వివరాలు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఎయిర్టెల్ సేఫ్ సెకండ్ అకౌంట్ మీ డబ్బు సురక్షితంగా ఉండటానికి సరళమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది’ అని గోపాల్ విట్టల్ అన్నారు.ఈ ఖాతా ప్రత్యేకతలు..ఈ ఖాతా ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల కోసం ఉద్దేశించారు. ఇందులో చాలా తక్కువ బ్యాలెన్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ కూడా లభిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రుణాలు అందించదు కాబట్టి, వినియోగదారులు ఇందులో పెద్ద మొత్తాలను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఓపెన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?
ఉచితంగా ఐటీ కోర్సులు.. 87 వేల మందికి..
అట్టడుగు వర్గాల యువతకు భవిష్యత్ తరపు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు టెక్ దిగ్గజం ఐబీఎం, నాస్కామ్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. ఐబీఎం స్కిల్స్బిల్డ్ ప్రోగ్రాం కింద 87,000 మందికి శిక్షణనివ్వనున్నాయి. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇచ్చి వారిలో ఉద్యోగ సామర్థ్యాలను పెంపొందించనున్నాయి.ఈ ప్రోగ్రాం కింద కృత్రిమ మేథ (ఏఐ), సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ తదితర అంశాల్లో ఉచితంగా డిజిటల్ కోర్సులు, శిక్షణను అందిస్తారు. మెంటార్స్ నుంచి కూడా మద్దతు ఉంటుంది. 2030 నాటికి 3 కోట్ల మందికి శిక్షణనివ్వాలన్న ఐబీఎం లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు, భారతదేశవ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో అమలవుతుంది.ప్రాజెక్ట్ ప్రభావంఅట్టడుగు వర్గాల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అందుతాయి.భారతదేశంలో డిజిటల్ సమానత్వం పెరుగుతుంది.ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, పెద్ద కంపెనీలకు స్కిల్డ్ వర్క్ఫోర్స్ లభిస్తుంది.ఇది కేవలం శిక్షణ ప్రోగ్రాం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు పునాది వేసే ప్రయత్నం.
పర్సనల్ ఫైనాన్స్
ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్!
క్లెయిమ్ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్తో కలిసి సమగ్ర పోర్టల్ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అన్క్లెయిమ్డ్ అసెట్స్ కోసం ఉద్గాం పేరుతో ఆర్బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వేర్వేరు పోర్టల్స్ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్క్లెయిమ్డ్ అసెట్స్పై అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్–క్లెయిమ్డ్ అసెట్స్గా పరిగణిస్తున్నారు.
‘శ్రేయోభిలాషుల’తో బతుకు బస్స్టాండ్!
కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని, మీ భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వేసే ప్రతి అడుగును.. మీ చుట్టూ ఉండే కొంతమంది తెలియకుండానే లేదా కావాలనే వెనక్కి లాగుతుంటారు. తరచుగా మన ఆర్థిక కష్టాలకు మార్కెట్ హెచ్చుతగ్గులు, తక్కువ జీతం ఉందని నిందిస్తాం. కానీ నిజమైన శత్రువులు మన పక్కనే ఉంటారని గుర్తుంచుకోండి. వీరి ఆలోచనా విధానాలు, ఆర్థిక అలవాట్లు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపి పేదవారిగా మార్చేస్తుంటారు. మనల్ని పేదవారిగా మార్చే ఈ వ్యక్తులు ఎవరు? వారి మనస్తత్వం మన భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం.ఖర్చులను ప్రోత్సహించడంపేద మనస్తత్వం ఉన్నవారు సాధారణంగా తక్షణ లభించే సంతృప్తిని కోరుకుంటారు. పొదుపు చేయడాన్ని లేదా పెట్టుబడి పెట్టడాన్ని వాయిదా వేస్తూ ‘రేపటి గురించి ఎవరి తెలుసు?’ అనే ధోరణితో ఉంటారు. అలాంటివారు మిమ్మల్ని తరచుగా అనవసరమైన విందులకు, పార్టీలకు లేదా ఫ్యాషన్ వస్తువులకు ఖర్చు పెట్టమని ప్రోత్సహిస్తారు. దీనివల్ల మీ బడ్జెట్ను దాటి ఖర్చు చేస్తారు. ‘అందరూ కొంటున్నారు, నువ్వు కొనకపోతే ఎలా?’ అనే ఒత్తిడికి లోనై అప్పులు చేయక తప్పదు.నిరాశావాదంకొందరు ఆర్థిక విజయానికి కృషి చేయడం కంటే తమ పేదరికానికి వ్యవస్థను, ప్రభుత్వాన్ని, లేదా ఇతరులను నిందించడానికి మొగ్గు చూపుతారు. వారి నిరాశావాదం మీ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ఆటంకం కలిగిస్తుంది. ‘డబ్బు సంపాదించడం కేవలం అదృష్టవంతులకే సాధ్యం’, ‘ఈ వయసులో పొదుపు చేయడం ఎందుకు?’ వంటి మాటలు మీలోనూ నిరుత్సాహాన్ని పెంచి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను చంపేస్తాయి.తప్పుడు సలహాలుకొందరి సొంత ఆర్థిక జీవితాలు గందరగోళంగా ఉన్నప్పటికీ మీకు అనవసరమైన, అధిక రిస్క్ కూడిన పథకాల్లో డబ్బు పెట్టమని సలహా ఇవ్వవచ్చు. వారి సలహాలు విని మీరు పదేపదే తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించాలనే పథకాలపై దృష్టి పెట్టడం వల్ల మీ సంపద కరిగిపోతుంది.ఈ విషవలయం నుంచి బయటపడే మార్గంతమ ఆర్థిక స్థితితో మీ స్థితిని పోల్చుకునే వారితో దూరం పాటించండి.‘నో’ అనడం నేర్చుకోండి. అది మీ డబ్బుకి రక్షణ కవచం.మీ ఆర్థిక లక్ష్యాలను ఎవరితోనూ షేర్ చేయకండి. ఎగతాళి చేసే వారు ఎక్కువ.ఆదా, పెట్టుబడి, ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడే వారితోనే స్నేహం చేయండి.ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు
భారీగా బ్యాంకు సెలవులు.. చివరి నెలలో తెరిచేది కొన్ని రోజులే..
నవంబర్ నెల ముగుస్తోంది. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలలో చేయాల్సిన పనుల గురించి చాలా మంది ముందుగా షెడ్యూల్ వేసుకుంటూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనవి బ్యాంకు పనులు. అయితే ఇందు కోసం బ్యాంకు బ్రాంచిలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో రానున్న నెలలో బ్యాంకు సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్యాలెండర్ ప్రకారం.. ప్రభుత్వ సెలవు దినాలు, వారాంతపు మూసివేత కారణంగా డిసెంబరులో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు దాదాపు 18 రోజులు మూసి ఉంటాయి. సెలవుల జాబితాలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతోపాటు జాతీయ, ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి.సెలవు దినాలలో అన్ని బ్యాంకు బ్రాంచీల వద్ద సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఖాతాదారులు తమ బ్యాంకుల ప్రాంతీయ సెలవు క్యాలెండర్ ప్రకారం బ్రాంచీ సందర్శనలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, సెలవు దినాలలోనూ ఆల్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు వంటి ఆన్లైన్ సేవలను వినియోగించుకోవచ్చు.డిసెంబర్లో సెలవులు ఇవే..డిసెంబర్ 1 - అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లలో రాష్ట్ర అవతరణ దినోత్సవండిసెంబరు 3 - గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగడిసెంబరు 7- ఆదివారండిసెంబరు 12 - మేఘాలయలో పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతిడిసెంబర్ 13 - రెండో శనివారండిసెంబరు 14- ఆదివారండిసెంబర్ 18 - మేఘాలయలో యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగాడిసెంబర్ 19- గోవాలో విమోచన దినోత్సవండిసెంబర్ 20 - సిక్కిం, గోవాలో లోసూంగ్ / నామ్సూంగ్డిసెంబరు 21- ఆదివారండిసెంబర్ 22 - సిక్కింలో లోసూంగ్ / నామ్సూంగ్డిసెంబర్ 24 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో క్రిస్మస్డిసెంబర్ 25 - క్రిస్మస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేతడిసెంబర్ 26 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయలలో క్రిస్మస్ వేడుకలుడిసెంబర్ 27 - నాలుగో శనివారండిసెంబరు 28- ఆదివారండిసెంబర్ 30 - మేఘాలయలో యు కియాంగ్ నంగ్బా వర్ధంతిడిసెంబర్ 31 - మిజోరాం, మణిపూర్ లలో నూతన సంవత్సర వేడుకలు / ఇమోయిను ఇరాట్పా
రిజైన్ చేసిన రెండు రోజుల్లోనే ఫైనల్ సెటిల్మెంట్
కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తున్న క్రమంలో ఇప్పటి వరకూ ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా లేదా అనధికారికంగా అనుసరిస్తున్న పలు ప్రక్రియలు ఇప్పుడు అధికారికంగా ఒకే రకంగా ప్రామాణీకరణ చెందుతున్నాయి. అలాంటి ప్రక్రియల్లో ఒకటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ (FnF).ఉద్యోగులు రాజీనామా చేసినప్పుడు లేదా వారిని యాజమాన్యాలు తొలగించిన సందర్భంలో గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, శాలరీ బకాయిలు, బోనస్, ఇన్సెంటివ్లు, పీఎఫ్/ఈఎస్ఐ సంబంధిత ఏర్పాట్లు వంటి అనేక చట్టబద్ధ సెటిల్మెంట్లు ఉంటాయి. వీటిని ఇప్పటి వరకూ కొన్ని కంపెనీలు ఉద్యోగుల సర్వీస్ కాలం ముగింపు రోజే అంటే చివరి పనిదినమే చెల్లిస్తుండగా మరికొకొన్ని కంపెనీలు 30 రోజుల చట్టబద్ధమైన కాలపరిమితిలో చెల్లించేవి.ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగుల ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ డబ్బును రెండు పనిదినాల్లో చెల్లించాలి. ఈ విషయంలో గందరగోళం లేకుండా యాజమాన్యాలన్నీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరించేలా కేంద్ర కార్మిక శాఖ ప్రామాణీకరిస్తోంది. అయితే గ్రాట్యుటీ చెల్లింపునకు మాత్రం విడిగా కాల వ్యవధి ఉంటుంది.కాగా 2026 ఏప్రిల్ 1 లోపు నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోందని, కొత్త కార్మిక నిబంధనలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అమలు చేయడానికి ఇదే కాలక్రమాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించిందని కార్మిక కార్యదర్శి వందన గుర్నానీ తెలిపారు.కొత్త నిబంధన వల్ల ఉద్యోగులకు ప్రయోజనాలుఉద్యోగి రాజీనామా చేసిన వెంటనే రెండు రోజుల్లో సెటిల్మెంట్ రావడంతో కొత్త ఉద్యోగానికి మారుతున్నవారికి లేదా మధ్యలో గ్యాప్ తీసుకున్నవారికి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.కంపెనీలు ఏదైనా కారణం చెప్పి సెటిల్మెంట్ ఆలస్యం చేయడం ఇక సాధ్యం కాదు. మోసాలు, అన్యాయాలపై నియంత్రణ పెరుగుతుంది.సెటిల్మెంట్ ఆలస్యం కారణంగా వచ్చే వివాదాలు, కేసులు తగ్గుతాయి.ఇది చదివారా? ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?కంపెనీలపై ప్రభావంహెచ్ఆర్ & ఫైనాన్స్ ప్రక్రియలలో కఠినమైన క్రమశిక్షణ అవసరమౌతుంది. రెండు రోజుల్లో సెటిల్మెంట్ చేయాలంటే హెచ్ఆర్ ఎగ్జిట్ ఫార్మాలిటీలను వేగంగా పూర్తి చేయాలి. ఫైనాన్స్ టీమ్ వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ మేరకు సిస్టమ్లు ఆటోమేటెడ్ కావాలి.రెండు రోజుల్లో సెటిల్మెంట్ పెద్ద కంపెనీలకు సమస్య కాకపోయినా చిన్న, మధ్య తరహా సంస్థలు వెంటనే చెల్లింపుల కోసం క్యాష్ రిజర్వులు ఉంచుకోవాల్సి ఉంటుంది. లేబర్ కోడ్ ఉల్లంఘనకు జరిమానాలు, లీగల్ ఇష్యూలు వస్తాయి. కాబట్టి కంపెనీలు తమ ఎస్వోపీలను అప్డేట్ చేయాలి.రెండు రోజుల్లో సెటిల్మెంట్ చేయడానికి మాన్యువల్ ప్రాసెస్ కష్టసాధ్యమౌతుంది. ఫలితంగా ఆటోమేషన్, హెచ్ఆర్ఎంఎస్, పేరోల్ టూల్స్ డిమాండ్ పెరుగుతుంది.


