ప్రధాన వార్తలు
ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశంలోని 15 ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 4% పెరిగి రూ.37,409 కోట్లకు చేరినట్లు స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ నివేదిక తెలిపింది. వార్షిక ప్రాతిపదికన గృహ విక్రయాల సంఖ్య (వాల్యూమ్స్ పరంగా) 4% తగ్గి 39,201 యూనిట్లకు పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది. ఇక కొత్తగా మార్కెట్లోకి వచి్చన హౌసింగ్ యూనిట్ల సంఖ్య(కొత్త సప్లై) 10% క్షీణించి 28,721కు దిగివచి్చంది. ⇒ అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదర, జైపూర్, నాసిక్, నాగ్పూర్, మొహాలి, భువనేశ్వర్, లక్నో, భూపాల్, కొయంబత్తూర్, గోవా త్రివేండ్రం, కొచి్చ.... ఈ 15 నగరాల్లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ అహ్మదాబాద్లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 6% తగ్గి 13,021 యూనిట్లకు పరిమితమయ్యాయి. సూరత్లో విక్రయాలు 8% క్షీణించి 4,936 యూనిట్లకు దిగివచ్చాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ, అమ్మకాల్లో 60% గుజరాత్లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదరల్లో నమోదయ్యాయి. ⇒ భారత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన శక్తి కేంద్రాలుగా టైర్–2 నగరాలు ఎదుగుతున్నాయని ప్రాప్ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్ జసుజా తెలిపారు. ఉద్యోగ అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతాల మధ్య మెరుగుతున్న అనుసంధానం(కనెక్టివిటీ) అంశాలు రియల్ ఎస్టేట్ విభాగాల్లో డిమాండ్ను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ⇒ సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త గృహ ప్రాజెక్టుల లాంచింగ్ క్షీణించడమనేది మందగమనానికి సంకేతంగా కాకుండా, రియల్ ఎస్టేట్ డెవలపర్లు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు కీర్తి చిలుకూరి తెలిపారు.
ఎల్ఐసీ స్టాక్స్ కొనుగోళ్లపై సలహాలివ్వం
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై తమ శాఖ ఎలాంటి సలహాలివ్వదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో మార్గనిర్దేశం సైతం చేయదని తెలియజేశారు. అదానీ గ్రూప్ కంపెనీలలో ప్రామాణిక నిర్వహణా సంబంధ నిబంధనల (ఎస్వోపీ)మేరకే ఎల్ఐసీ వాటాల కొనుగోళ్లు చేపట్టినట్లు ఒక ప్రశ్నకు గాను లోక్సభకి ఇచి్చన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. టాప్ ర్యాంక్ బీమా దిగ్గజం అనేక సంవత్సరాలుగా ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు (ఫండమెంటల్స్) ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీలపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక మాత్రమే స్టాక్స్ కొనుగోళ్లు చేపడుతుందని వివరించారు. వెరసి ఎస్వోపీల ప్రకారం తగిన పరిశీలనతోపాటు.. రిసు్కలపై అధ్యయనం చేశాక అదానీ గ్రూప్లోని ఆరు కంపెనీలలో ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ కంపెనీల పుస్తక విలువ రూ. 38,659 కోట్లుకాగా.. సంబంధిత కంపెనీల రుణ పత్రాలలోనూ మరో రూ. 9,626 కోట్లవరకూ పెట్టుబడులు చేపట్టినట్లు తెలియజేశారు. ఎల్ఐసీ ఫండ్ చేపట్టే పెట్టుబడి నిర్ణయాలపై ఆర్థిక శాఖ ఎలాంటి సూచనలు లేదా సలహాలు ఇవ్వబోదని, స్టాక్ కొనుగోళ్లలో ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చట్టాల ప్రకారమే ... ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు 1938 బీమా చట్టం, ఐఆర్డీఏఐ నియంత్రణలు, ఆర్బీఐసహా.. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులకు వీలుగా ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించినట్లు అక్టోబర్లో వాషింగ్టన్ పోస్ట్లోని ఒక నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో రుణభారంతోపాటు.. యూఎస్లో నిశిత పరిశీలనను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులకు ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను అమలు చేసినట్లు నివేదిక ఆరోపించింది. 2025 మే నెలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో ఎల్ఐసీ 57 కోట్ల డాలర్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్వోపీలు, బోర్డు అనుమతులతో 2025 మేలో ఎల్ఐసీ.. అదానీ పోర్ట్స్ జారీ చేసిన ఎన్సీడీలలో రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన టాప్–500 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడులు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం పెట్టుబడుల్లో ప్రధాన వాటా భారీ కంపెనీలలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 50 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల పుస్తక విలువ 2025 సెపె్టంబర్ 30 కల్లా రూ. 4,30,777 కోట్లుగా పేర్కొన్నారు.
మీషో ఐపీవో @ రూ. 5,421 కోట్లు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం మీషో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) రేపు (డిసెంబర్ 3న) ప్రారంభమై 5న ముగుస్తుంది. దీని ద్వారా కంపెనీ రూ. 5,421 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 105–111గా ఉంటుంది. దీని ప్రకారం మీషో వేల్యుయేషన్ గరిష్టంగా రూ. 50,096 కోట్లుగా ఉంటుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 4,250 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో రూ. 1,171 కోట్ల విలువ చేసే 10.55 కోట్ల షేర్లను విక్రయించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 2 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది. డిసెంబర్ 12న స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను క్లౌడ్ మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, బ్రాండ్ ప్రచారం, వేరే సంస్థల కొనుగోళ్లు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. వినియోగదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్ భాగస్వాములు, కంటెంట్ క్రియేటర్లను అనుసంధానించే ఈ–కామర్స్ ప్లాట్ఫాంగా మీషో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రతి రోజు కొనుగోలుదారులకు తక్కువ ధరల్లో ఉత్పత్తులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కంపెనీ ఎండీ విదిత్ ఆత్రే తెలిపారు. మీషో ఈ ఏడాది జూలైలో కాని్ఫడెన్షియల్ విధానంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించగా, ఐపీవోకి అక్టోబర్లో అనుమతులు లభించాయి. సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయాలు రూ. 5,577 కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది రూ. 4,311 కోట్లుగా నమోదైంది. రూ. 922 కోట్ల ఈక్వస్ ఇష్యూకన్జూమర్ డ్యూరబుల్ గూడ్స్, ఏరోస్పేస్ భాగాల కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఈక్వస్ ఐపీవో ద్వారా రూ. 922 కోట్లు సమీకరించనుంది. ఇది కూడా డిసెంబర్ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూ ప్రకారం ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 118–124గా ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ. 670 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ కింద రూ. 252 కోట్ల విలువ చేసే 2.03 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. రెండు అనుబంధ సంస్థలైన ఏరోస్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, ఈక్వస్ కన్జూమర్ ప్రోడక్ట్స్ తీసుకున్న రుణాలను తీర్చివేసేందుకు, మెషినరీ కొనుగోలుకు, ఇతర సంస్థల కొనుగోళ్లకు ఐపీవో నిధులను కంపెనీ ఉపయోగించుకోనుంది. ఐపీవో కోసం జూన్లో సెబీకి దరఖాస్తు చేసుకోగా సెపె్టంబర్లో అనుమతులు వచ్చాయి. ప్రధానంగా ఏరోస్పేస్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈక్వస్ ఇతరత్రా కన్జూమర్ ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన విభాగాల్లోకి కూడా విస్తరించింది. ఇన్ఫీ నారాయణ మూర్తి ఫ్యామిలీ ఆఫీస్ అయిన కాటమారన్, ఎమికస్ క్యాపిటల్ మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఎయిర్బస్, బోయింగ్, హనీవెల్ హాస్బ్రో, వండర్òÙఫ్లాంటి సంస్థలు ఈక్వస్కి క్లయింట్లుగా ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఓయోట్రావెల్ టెక్ ప్లాట్ఫాం ఓయో మాతృ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారుల అనుమతిని పొందడం కోసం డిసెంబర్ 20న అసాధారణ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్హోల్డర్లకు ఇచి్చన సమాచారం ప్రకారం అర్హులైన షేర్హోల్డర్లకు ప్రతి 19 ఈక్విటీ షేర్లకు గాను 1 ఈక్విటీ షేరును బోనస్గా జారీ చేసే ప్రతిపాదనపై ఓటింగ్ ఉంటుంది. దీనికి డిసెంబర్ 5 రికార్డు తేదీగా ఉంటుంది. బోనస్ ఇష్యూ, ఐపీవో సంబంధిత తదుపరి నిధుల అవసరాలరీత్యా అ«దీకృత మూలధనాన్ని రూ. 2,431 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనపైనా షేర్హోల్డర్లు ఓటింగ్లో పాల్గొంటారు.అదే బాటలో విద్యా వైర్స్ .. వైండింగ్, కండక్టివిటీ ఉత్పత్తుల తయారీ సంస్థ విద్యా వైర్స్ తమ ఐపీవోకి సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణిని రూ. 48–52గా నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ గరిష్ట విలువ రూ. 1,100 కోట్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విద్యా వైర్స్ రూ. 300 కోట్లు సమీకరిస్తోంది. ఐపీవో డిసెంబర్ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా రూ. 274 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా రూ. 26 కోట్ల విలువ చేసే 50.01 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు, రుణాల చెల్లింపునకు, కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. విద్యా వైర్స్ ప్రధానంగా పేపర్ ఇన్సులేటెడ్ కాపర్ కండక్టర్లు, స్పెషలైజ్డ్ వైండింగ్ వైర్లు, పేపర్ ఇన్సులేటెడ్ కాపర్ కండక్టర్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. డిసెంబర్ 9న స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు లిస్టవుతాయి.
జీఎస్టీ వసూళ్లు డీలా
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం ఏడాది కనిష్టానికి పడిపోయింది. నవంబర్లో రూ.1,70,276 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైంది. 2024 నవంబర్లో ఆదాయం రూ.1.69 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 0.7 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్లో మాత్రం స్థూల జీఎస్టీ వసూళ్లు అంతక్రితం ఏడాది ఇదే నెలతో (రూ.1.87 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 4.6 శాతం అధికంగా రూ.1.95 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం తెలిసిందే. జీఎస్టీలో శ్లాబులను కుదించడంతోపాటు, 375 వరకు ఉత్పత్తులను తక్కువ పన్ను శ్లాబులోకి మార్చడం తెలిసిందే. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అక్టోబర్లో మెరుగైన ఆదాయానికి పండుగల సమయంలో కొనుగోళ్లు దోహదపడినట్టు, నవంబర్ నెల గణాంకాల్లో రేట్ల సవరణ ప్రభావం కనిపించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 8.9 శాతం పెరిగి రూ.14,75,488 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లు 4 శాతం తగ్గి రూ.18,196 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లను మినహాయించి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం రూ.1.52 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడంతో డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్ మార్కెట్) ఔన్స్కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్ 31న ఔన్స్ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్ డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడ్ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
ట్రైన్ ఆలస్యమైందా?: ఇలా చేస్తే డబ్బు మొత్తం రీఫండ్..
కొన్ని సందర్భాల్లో.. అనేక కారణాల వల్ల రైలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు లేదా రైలు రావడం ఆలస్యం కావొచ్చు. AC యూనిట్లు పనిచేయకపోవచ్చు, కోచ్ కాన్ఫిగరేషన్లు మారవచ్చు, రైలును పూర్తిగా దారి మళ్లించనూవచ్చు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు టీడీఆర్ లేదా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ఉపయోగించుకోవడం ద్వారా.. మొత్తం డబ్బు రీఫండ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు.టీడీఆర్ సేవను ఉపయోగించడం వల్ల.. తన డబ్బు మొత్తం రీఫండ్ అయిందని.. ఒక ఎక్స్ యూజర్ తన అనుభవాన్ని పేర్కొన్నారు.ఎక్స్ యూజర్, తన భార్య రైలులో సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారని, అయితే ట్రైన్ ఏడు గంటలు ఆలస్యమైందని IRCTC నుంచి మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. ట్రైన్ ఆలస్యం కావడంతో బస్సులో ప్రయాణించాలనుకున్నాము. అయితే ట్రైన్ టికెట్ కోసం పెట్టిన డబ్బును రీఫండ్ పొందడానికి.. TDR దాఖలు చేసి, రైలు 3 గంటలకు పైగా ఆలస్యం అయిందని.. నేను రైలులో ప్రయాణం చేయలేదనే రీజన్ ఎంచుకున్నాను. రీఫండ్ కూడా త్వరగానే ప్రారంభమైంది, డిసెంబర్ 1న వచేశాయని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తోటి ప్రయాణీకులను కూడా కోరారు.ఇదీ చదవండి: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్గా..టీడీఆర్ గురించినిజానికి TDR అనేది కొత్త సర్వీస్ కాదు. అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రైల్వే శాఖ రైలును రద్దు చేసినప్పుడు, ట్రైన్ మూడు గంటలు ఆలస్యమైనప్పుడు, సరైన టికెట్ ఉన్నప్పటికీ.. ప్రయాణం చేయలేనప్పుడు, ప్రయాణం సమయంలో ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. టీడీఆర్ను తప్పనిసరిగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫైల్ చేయాలి. రైలు బయలుదేరిన నాలుగు గంటల్లోగా టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.Received Message from IRCTC that Train was 7 hours late. Booked a Bus Ticket to the Destination.Instead of Cancelling Train Ticket, Filed TDR on Nov 30th 2025.Refund initiated on Dec 1st 2025.Super Fast. Credit where due for timely communication from Railways 👍… pic.twitter.com/weZiQNuenT— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) December 1, 2025
కార్పొరేట్
ఎల్ఐసీ స్టాక్స్ కొనుగోళ్లపై సలహాలివ్వం
ట్రైన్ ఆలస్యమైందా?: ఇలా చేస్తే డబ్బు మొత్తం రీఫండ్..
వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్
విమానాల్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్.. అసలు సమస్యేంటి?
వంట గ్యాస్ ధరల తగ్గింపు
యాప్లా.. మార్కెటింగ్ యంత్రాలా?
ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ
గృహ రుణానికి ముందే గుడ్బై
మీ కార్డు సంపాదిస్తోందా?
హిందుస్తాన్ పవర్కి సౌర విద్యుత్ ప్రాజెక్టు
ఎఫ్ఎస్టీసీలో అదానీ గ్రూప్నకు వాటాలు
డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పైలట్లకు...
చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపార...
వారంలో ఇంత తేడానా!.. భారీగా పెరిగిన గోల్డ్ రేటు
బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. రూ.1.30 లక్షలు దా...
'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబం...
జనన ధ్రువీకరణకు ఆధార్ చెల్లదు
ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా లేదా పుట్టిన ...
‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్స్న...
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భా...
భారత్లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహి...
ఆటోమొబైల్
టెక్నాలజీ
నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’: ధర ఎంతంటే?
లండన్ ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ కొత్తగా తమ ఫోన్ (3ఎ) లైట్ స్మార్ట్ఫోన్ని భారత్లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్ ఫోన్ డిసెంబర్ 5 నుంచి ఫ్లిప్కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్ ఔట్లెట్స్లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’లో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ పొందవచ్చు.
చలికి చెక్ పెట్టె దుప్పటి.. వెచ్చని పాదాల కోసం సాక్స్!
చలి గాలులు వీచినా, మీకు మాత్రం హాయిగా హీట్ థెరపీ టచ్ ఇచ్చే గాడ్జెట్లు వచ్చేశాయి. ఈ స్మార్ట్ గాడ్జెట్లు మీ శరీరానికి వెచ్చగా హత్తుకుంటూ కంఫర్ట్, కేర్, రిలాక్సేషన్ అన్నీ కలిపి చలికాలాన్ని ఒక హాయికాలంగా మార్చేస్తాయి.చలికి చెక్ ఈ దుప్పటి!చలి వణికిస్తోందా? ఇక ఆ ఫీలింగ్కు ‘టాపిష్ ఎలక్ట్రిక్ దుప్పటి’తో ఫుల్స్టాప్ పెట్టొచ్చు! ఈ దుప్పటి కోరల్ ఫ్లీస్ మెటీరియల్తో తయారై, చర్మానికి మృదువుగా తాకుతూ తక్షణమే వెచ్చదనాన్ని ఇస్తుంది. రివర్సిబుల్ డిజైన్తో రెండు వైపులా ఉపయోగించుకోవచ్చు. అందం కూడా, సౌకర్యం కూడా! ఇన్బిల్ట్ థర్మల్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల చలి ఎంత పెరిగినా, వేడి సమతుల్యంగా ఉంటుంది. షాక్ప్రూఫ్ సిస్టమ్ ఉండటంతో దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ దుప్పటిని మంచంపై పరచి, పైన హీటింగ్ డివైజ్ పెట్టి ఉపయోగించాలి. మడిచి పెట్టకూడదు. ఉపయోగించడానికి ముందు పవర్ ఆఫ్ చేయడం తప్పనిసరి. దీని రిమోట్కి ఐదు సంవత్సరాల వారంటీ ఉండటం విశేషం. ధర కేవలం రూ. 995.వెచ్చని పాదాలు!చలికాలమైనా, వేసవికాలమైనా ఇక కాళ్లకు ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. థర్మామెడ్ స్మార్ట్ సాక్స్ మీ పాదాలను హాయిగా, ఆరోగ్యవంతంగా ఉంచే మంచి స్నేహితులు! ఇవి ప్రత్యేక థర్మో రెగ్యులేషన్ ఫాబ్రిక్తో తయారవడం వలన, వేడి చలి రెండింటినీ సమతుల్యం చేస్తాయి. చెమట పట్టినా ఆరిపోతాయి, వాతావరణం చలిగా ఉంటే వెచ్చదనాన్ని ఇస్తాయి. పాదాలను ఎప్పుడూ పొడిగా, సువాసనగా ఉంచుతాయి. ఫంగస్, బ్యాక్టీరియా తదితర ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచే యాంటీ మైక్రోబియల్ టెక్నాలజీతో ఈ సాక్స్ మరింత హైజినిక్గా ఉంటాయి. కాళ్ల వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడే సున్నితమైన కంప్రెషన్ డిజైన్ వీటి ప్రత్యేకత. లోపల మృదువైన కుషన్ ఉండటంతో రోజంతా ధరించినా ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉంటుంది. ధర రూ. 850 మాత్రమే!స్మార్ట్ బాటిల్!బాటిల్ని క్లీన్ చేయడానికి ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు! ఎందుకంటే, ఈ ‘లార్క్ స్మార్ట్ వాటర్ బాటిల్’ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా సెల్ఫ్–క్లీన్ అవుతుంది. దీని లోపలే ఉండే శుద్ధి వ్యవస్థ బాటిల్ నీటిని కేవలం 60 సెకన్లలో శుభ్రం చేస్తుంది. యూవీ సీ ఎల్ఈడీ టెక్నాలజీతో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నిర్వీర్యం చేస్తుంది. దీంతో, ఎటువంటి కెమికల్స్ లేకుండా, నీరు ఎప్పుడూ తాజాగా, సురక్షితంగా ఉంటుంది. డబుల్ వాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేషన్తో చల్లని నీటిని 24 గంటలు, వేడి పానీయాన్ని 12 గంటలు నిల్వ ఉంచుతుంది. యూఎస్బీ చార్జింగ్తో నెల రోజుల వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. ధర రూ. 21,649.
ఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లను కొంత మంది సిమ్ లేకపోయినా వాడుతుంటారు. ఇకపై అలా కుదరదు. ఫోన్లో యాక్టివ్ సిమ్ ఉంటేనే ఆ యాప్లు పనిచేస్తాయి. యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు అంటే వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటివి క్రియాశీల సిమ్ కార్డుకు నిరంతరం అనుసంధానమై ఉంటేనే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఆయా యాప్ సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.గత నవంబర్ చివరలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) జారీ చేసిన కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనల్లో ఇది భాగం. ఈ మార్పులను అమలు చేస్తూ సమ్మతి నివేదికలను సమర్పించడానికి సర్వీస్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్స్ విభాగం 90 నుంచి 120 రోజుల సమయం ఇచ్చింది.సిమ్ లింకేజీ తప్పనిసరి ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశాల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, అరట్టై వంటివాటితోపాటు జియోచాట్, షేర్చాట్ వంటి స్థానిక కమ్యూనికేషన్ యాప్లు కూడా వాటిని ఉపయోగిస్తున్న డివైజ్లలొ యాక్టివ్ సిమ్ కార్డు ఉంటేనే పనిచేయాలి.ఇక వాట్సాప్, టెలిగ్రామ్ వెబ్ వర్షన్లను కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. వాటి వినియోగానికి సంబంధించి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్ వెబ్ సర్వీసులు ఏకధాటిగా పనిచేయవు. ప్రతి ఆరు గంటలకోసారి మొబైల్ను ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు, చాలా యాప్లు ఇన్స్టాలేషన్ సమయంలో మాత్రమే యూజర్ మొబైల్ నంబర్ను ధ్రువీకరించేవి. కొత్త నిబంధనల ప్రకారం, యూజర్ ఇచ్చే మొబైల్ నంబర్ నిరంతరం క్రియాశీలకంగా లింక్ చేయబడి ఉండాలి.ఎందుకీ కొత్త నిబంధన?రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన సిమ్ పక్కన పడేసినా లేదా ఇనాక్టివ్ అయినా కూడా ఆయా యాప్లు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ లొసుగును సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని అరికట్టడానికే ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.ఇదీ చదవండి: మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్.. ట్రిపుల్ 50MP కెమెరా.. 7000mAh బ్యాటరీ
మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్..
స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ తమ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐక్యూ 15ని ఆవిష్కరించింది. డిస్కౌంట్లు పోగా ధర రూ. 64,999 నుంచి ప్రారంభమవుతుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, సూపర్కంప్యూటింగ్ చిప్ క్యూ3, ఆండ్రాయిడ్ 16, ట్రిపుల్ 50 ఎంపీ కెమెరా సిస్టం, 7000 ఎంఏహెచ్ సిలికాన్ ఎనోడ్ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐక్యూ 15 (iQOO 15) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. రెండు మోడళ్లపై పరిచయ లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి అమెజాన్, ఐక్యూ ఈస్టోర్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై రూ. 7,000 డిస్కౌంటు, అర్హత కలిగిన కస్టమర్లకు అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంటు లభిస్తాయి.ఐక్యూ 15 పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లుస్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, Q3 గేమింగ్ చిప్ సెట్లు వేగవంతమైన ప్రాసెసింగ్, మల్టీ టాస్కింగ్, యాప్ స్విచింగ్, గేమింగ్ లను అందిస్తాయి. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇందులో ఉంది.ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6పై నడుస్తుంది. ఐదేళ్ల సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను కంపెనీ అందించనుంది.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50MP సోనీ IMX921 మెయిన్ సెన్సార్, 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 50MP అల్ట్రావైడ్ షూటర్తో బహుముఖ ట్రిపుల్ రియర్ సెటప్ ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.6.85-అంగుళాల శామ్ సంగ్ M14 అమోల్డ్ LTPO డిస్ ప్లే ప్యానెల్. ఇది 2K రిజల్యూషన్, 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది.భారీ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటివి అదనపు ఫీచర్లు.ఇదీ చదవండి 👉 కొత్త రూల్: ఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!
పర్సనల్ ఫైనాన్స్
మీ కార్డు సంపాదిస్తోందా?
చాలామందికి క్రెడిట్ కార్డంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా... క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు. పైపెచ్చు కాస్త సంపాదించుకోవచ్చు కూడా. వీటన్నిటికీ తోడు హోటళ్లు, సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లపై ఎప్పటికప్పుడు ఆఫర్లూ వస్తాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లలో ఉచిత సదుపాయాలు... ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు నో–కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే... రూపాయి వడ్డీలేకుండా వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం... ఇలా చాలా లాభాలుంటాయి. కాకపోతే ఒక్కటే షరతు. ఏ క్రెడిట్ కార్డుపై ఎంత కొన్నా... బిల్లు గడువు తేదీ ముగిసేలోగా పూర్తిగా చెల్లించెయ్యాలి. అలాకాకుండా ఈ సారి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకున్నారో...! మీ పని అయిపోయినట్లే!!.సరైన ఆదాయం లేకపోవటమో... అప్పులంటే భయమో... లేదా సమాచారం లేకపోవటమో... ఏదైనా కావచ్చు. మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం చాలా తక్కువ. మన జనాభాలో వీటిని వాడుతున్నవారు ఐదారు శాతానికి మించి లేరు. అమెరికా లాంటి దేశాల్లో ఏకంగా 80 శాతం మందికిపైగా కనీసం ఒక్క క్రెడిట్ కార్డయినా వాడతారు. అందుకే ఈ క్రెడిట్ కార్డుల వ్యాపార విస్తరణకు దేశంలో విపరీతమైన అవకాశాలున్నాయి కాబట్టే... కంపెనీలు రకరకాల ఆఫర్లిస్తూ మరింతమందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇదీ.. అసలైన లాభం ప్రతి క్రెడిట్ కార్డుకూ ఓ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు రాఘవకు యాక్సిస్ బ్యాంకు కార్డుంది. దాని లిమిట్ రూ.6 లక్షలు. అంటే రూ.6 లక్షల వరకూ తను వాడుకోవచ్చన్న మాట. మరి ఆ కార్డు జేబులో పెట్టుకుంటే... తన జేబులో రూ.6 లక్షలున్నట్లే కదా? ఆసుపత్రి వంటి ఎంత ఎమర్జెన్సీ వచి్చనా... డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా దీన్ని వాడొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీల కోసం డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకోవాల్సిన పనిలేదు కూడా. ఇక ప్రతి కార్డుకూ బిల్లింగ్ తేదీ... చెల్లించడానికి గడువు తేదీ ఉంటాయి. ప్రతి బిల్లింగ్ తేదీకి 30 రోజుల సైకిల్... చెల్లించడానికి మరో 15 రోజుల గడువు ఉంటాయి. అంటే మొత్తంగా 45 రోజుల వ్యవధన్న మాట. బిల్లింగ్ తేదీ అయిన వెంటనే భారీ మొత్తాన్ని వాడినా అది తదుపరి బిల్లులోనే వస్తుంది. గడువు తేదీ కూడా ఉంటుంది కనక దాదాపు 40 రోజులు వడ్డీ లేకుండా అప్పు దొరికినట్లన్న మాట. దాన్ని గడువులోపు చెల్లించేస్తే వాడిన మొత్తంపై పైసా వడ్డీ కూడా ఉండదు.ఇదీ.. ప్రమాదానికి సంకేతం మీరు కార్డుపై ఆ నెల అవసరం కొద్దీ రూ.2 లక్షలు వాడారనుకుందాం. తదుపరి నెల బిల్లులో వాడుకున్న మొత్తాన్ని చూపించటంతో పాటు... ఒకవేళ మీరు దాన్ని చెల్లించలేకపోతే వాడినదాంట్లో 5 శాతాన్ని చెల్లించవచ్చని (మినిమం బిల్) పేర్కొంటారు. అంటే రూ.10వేలు చెల్లిస్తే చాలు. అది ఈజీ కూడా. కానీ మిగిలిన మొత్తంపై 36 శాతానికిపైగా వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మరో నెల గడిస్తే మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కనీస బిల్లు కూడా చెల్లించకపోతే ఆపరాధ రుసుములు భారీగా ఉంటాయి. మీ లిమిట్ను దాటి వాడినా భారీ చార్జీలు చెల్లించాలి. వీటివల్ల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయిపోతాయి. ప్రతినెలా కనీస బిల్లు కట్టుకుంటూ పోతే ఆ రుణం ఎప్పటికీ తీరదని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డుతో అతిపెద్ద ప్రమాదం ఇదే.కో–బ్రాండెడ్ కార్డులు కూడా... చాలా బ్యాంకులు రకరకాల సంస్థలతో జతకట్టి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సిటీబ్యాంకు ఐఓసీతో జతకట్టి సిటీ–ఐఓసీ కార్డును ఆఫర్ చేసింది. సిటీ క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంకు కూడా దాన్ని కొనసాగిస్తోంది. ఐఓసీ బంకులో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకుంటే 2 శాతం వరకూ క్యాష్బ్యాక్ వస్తుందన్న మాట. ఆ పాయింట్లను నేరుగా బిల్లు రూపంలో చెల్లించేయొచ్చు కూడా.రోజువారీ వినియోగానికి ఇవి బెస్ట్.. → ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్: ఆన్లైన్ కొనుగోళ్లపై ఫ్లాట్ 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. → యాక్సిస్ బ్యాంక్ ఏస్: కొనుగోళ్లపై 2–5 మధ్య క్యాష్ బ్యాక్. గూగుల్ పేతో లింక్ చేసుకోవచ్చు. → హెచ్డీఎఫ్సీ రిగాలియా: ప్రయాణాలు, రెస్టారెంట్లలో చెల్లింపులపై రివార్డులు.ఇలా చేయొద్దు... → కార్డుపై చేసే చెల్లింపుల్లో కొన్నింటిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, ప్రతి నెలా ఇదే ధోరణి అనుసరిస్తే ఈఎంఐలు చెల్లించడం కష్టం. → ఆఫర్లు ఉన్నాయని చెప్పి, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయడం స్మార్ట్ కానే కాదు. → వార్షిక ఫీజుపైనా దృష్టి సారించాలి. కొన్ని ఫ్రీగా ఇచ్చినా... కొన్ని సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఇదీ క్యాష్బ్యాక్ పవర్.. → ఒక నెలలో కార్డుతో ఆన్లైన్లో రూ.30,000 ఖర్చు చేశారు. → 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ కింద రూ.1,500 వెనక్కి వస్తుంది. → ఇలా ఒక ఏడాదిలో రూ.18,000 ఆదా చేసుకోవచ్చు. → ఈ మొత్తంతో కుటుంబానికి కావాల్సిన ఆరోగ్య బీమాను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్లో ఏటా రూ.18,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే, 12 శాతం రాబడి ఆధారంగా రూ.3.53 లక్షలు సమకూరుతుంది. స్మార్ట్ అంటే ఇలా.. → క్రెడిట్కార్డు బిల్లును ప్రతి నెలా గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. → కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయనే చేయొద్దు → గడువు తేదీకి చెల్లింపులు జరిగేలా ఆటో డెబిట్ సదుపాయం యాక్టివేట్ చేసుకోవాలి. → లిమిట్ ఉంది కదా అని చెప్పి నియంత్రణ లేకుండా వాడకూడదు. → క్రెడిట్ కార్డులు రెండుకు మించకుండా చూసుకోండి.
డిసెంబర్ డెడ్లైన్లు.. కొత్త మార్పులు
డిసెంబర్ నెలలో పలు బ్యాంకింగ్, పెన్షన్, ఆదాయపు పన్ను సంబంధించిన కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేత నుంచి, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పాన్–ఆధార్ లింకింగ్, ఐటీఆర్ గడువులు, ఎన్పీఎస్ నుంచి యూపీఎస్కు మారడానికి ఆప్షన్ గడువు.. ఇలా అనేక అంశాలు గమనించాల్సివి ఉన్నాయి.నవంబర్తో ముగిసే కీలక గడువులుఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేతస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30 తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్లో ఎంక్యాష్ (mCASH) సేవలను నిలిపివేస్తోంది. దీని తర్వాత లబ్ధిదారును నమోదు చేయకుండా డబ్బు పంపడం లేదా లింక్ ద్వారా నిధులు స్వీకరించడం సాధ్యం కాదు. బదులుగా వినియోగదారులు యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సురక్షిత చెల్లింపు మార్గాలను ఉపయోగించాలని ఎస్బీఐ సూచించింది.లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు చివరి తేదీప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను నవంబర్ 30లోపు తప్పనిసరిగా సమర్పించాలి. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇంటి వద్ద సేవల ద్వారా, బ్యాంకులు/పోస్టాఫీసుల ద్వారా, డిజిటల్ యాప్ ద్వారా కూడా సమర్పించవచ్చు. గడువు దాటితే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.ఎన్పీఎస్ నుండి యూపీఎస్కు మార్పు..ఎన్పీఎస్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి మారడానికి నవంబర్ 30 చివరి అవకాశం ఉంది. దరఖాస్తులు సీఆర్ఏ వ్యవస్థ ద్వారా లేదా నోడల్ కార్యాలయాలకు భౌతికంగా అందించాలి.డిసెంబర్లో కీలక ఆదాయపు పన్ను గడువులుపన్ను ఆడిట్ కేసుల ఐటీఆర్పన్ను ఆడిట్కి అర్హులైన మదింపుదారుల కోసం ఐటీఆర్ దాఖలు గడువును సీబీడీటీ డిసెంబర్ 10 వరకు పొడిగించింది. అసలు గడువు అక్టోబర్ 31తోనే ముగిసింది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుఅసలు గడువులో ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(4) కింద డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత దాఖలు చెయ్యడం అసాధ్యం. జరిమానా, వడ్డీ, రిఫండ్ నష్టం వంటి పరిణామాలు ఎదురవచ్చు.పాన్–ఆధార్ లింకింగ్2024 అక్టోబర్ 1 లోపు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ పొందిన వ్యక్తులు తమ పాన్ ఇనాక్టివ్ కాకుండా ఉండాలంటే డిసెంబర్ 31 లోపు ఆధార్–పాన్ లింకింగ్ పూర్తి చేయాలి.
ధనికులయ్యే ‘తొలి కిటుకు’ చెప్పేసిన కియోసాకి..
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక కఠినమైన హెచ్చరికను జారీ చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రపంచ ఆస్తి బుడగ పేలడం ప్రారంభించిందని, అత్యంత ప్రభావవంతమైన "క్యారీ ట్రేడ్"కు జపాన్ ముగింపు పలుకుతోందని హెచ్చరించారు.ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor) రచయిత.. జపాన్ "క్యారీ ట్రేడ్" అంటే అతి-తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే దీర్ఘకాల పద్ధతి గురించి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో వరుస పోస్టులలో వ్యాఖ్యానించారు. ఈ విధానం ద్వారా ప్రపంచ రియల్ ఎస్టేట్, ఈక్విటీలు, బాండ్లు, కమాడిటీలు, ప్రైవేట్ వ్యాపారాలలోకి ప్రవహించిన మూలధనం ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలను పెంచడానికి సహాయపడిందని పేర్కొన్నారు.కియోసాకి (Robert Kiyosaki ) ప్రకారం.. ఈ అనూహ్య తిరోగమనం ఇప్పుడు యు.ఎస్. థాంక్స్ గివింగ్ సమయంలో "చరిత్రలో అతిపెద్ద క్రాష్"ను ప్రేరేపిస్తోంది. మార్కెట్లు కుదుపునకు లోనవుతున్నప్పుడు ఆ సంక్షోభానికి చిక్కకుండా ధనవంతులు కావడానికి ఏం చేయాలో తాను 10 వ్యూహాలను చెబుతానన్న కియోసాకి తన తొలి కిటుకును బయట పెట్టేశారు.తొలి వ్యూహం ఇదే.. కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.కోట్లాది మంది ఉద్యోగాలు పోయి, ఆస్తులు పోగొట్టుకుని బికారులయ్యే ఈ తరుణంలో ‘నేను ధనవంతున్ని కావాలని ప్లాన్ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిన ఆయన ఉద్యోగ మార్కెట్పైనే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆధారపడి ఉంటుందన్న తన ‘రిచ్ డాడ్’ పాఠాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయినా మీరు మాత్రం ధనికులు కావచ్చని తనను అనుసరించేవారికి కియోసాకి సూచించారు. తన నుంచి మరిన్ని సూచనలు రాబోతున్నాయన్న ఆయన ఇవి కేవలం తన సూచనలు మాత్రమేనని, సిఫార్సులు కాదని స్పష్టం చేశారు.30 YEAR BUBBLE BURSTINGJapan ends “CARRY TRADE” ending.For 30 years Japan has loaned billions to investors in global markets, and money flowed into real estate, stocks, bonds, commodities & businesses. The Japanese “carry trade” blew the assets of the world….into the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025
ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్!
క్లెయిమ్ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్తో కలిసి సమగ్ర పోర్టల్ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అన్క్లెయిమ్డ్ అసెట్స్ కోసం ఉద్గాం పేరుతో ఆర్బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వేర్వేరు పోర్టల్స్ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్క్లెయిమ్డ్ అసెట్స్పై అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్–క్లెయిమ్డ్ అసెట్స్గా పరిగణిస్తున్నారు.


