Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Updated Bajaj Pulsar 220F New KTM Duke 160 Variant Launched in India1
అదే బైక్‌.. అప్‌డేటెడ్‌ వెర్షన్‌

బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ ‘2026 పల్సర్‌ 220ఎఫ్‌’ మోటార్‌సైకిల్‌ను కొత్త అప్‌డేట్‌లతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్‌–షోరూం ధర రూ. 1.28 లక్షలు. స్వల్ప స్టైలింగ్, రంగులతో పాటు ప్రధానంగా కాస్మెటిక్, ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. రైడింగ్‌ సేఫ్టీని పటిష్టం చేసేందుకు సింగిల్‌–ఛానల్‌ ఏబీఎస్‌ నుంచి డ్యూయల్‌–ఛానల్‌ ఏబీఎస్‌కి అప్‌గ్రేడ్‌ చేశారు.మరింత స్పష్టంగా కనిపించేలా, మోడ్రన్‌ లుక్‌తో ఎల్‌ఈడీ టర్న్‌–సిగ్నల్స్‌(ఇండికేటర్స్‌) అమర్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీతో కూడిన డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ ఈ మోడల్‌లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్‌ చెర్రీ రెడ్, బ్లాక్‌ ఇంక్‌ బ్లూ, బ్లాక్‌ కాపర్‌ బీయి, బ్లాక్‌ కాపర్‌ బేజ్‌ గ్రీన్‌ లైట్‌ కాపర్‌ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.అత్యుత్తమ పనితీరుతో అభిమానులను ఆకట్టుకున్న 220సీసీ ట్విన్‌ స్పార్క్‌ డీటీఎస్‌–ఐ ఇంజిన్‌ను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచేసింది. ఇది ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ టెక్నాలజీతో, ఆయిల్‌–కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ సెటప్‌లో వస్తుంది. ఈ ఇంజిన్‌ 8,500 ఆర్‌పీఎం వద్ద 20.9 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తూ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది.‘కేటీఎం డ్యూక్‌ 160’ కొత్త వేరియంట్‌ప్రీమియం బైక్‌ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేటీఎం సంస్థ ’160 డ్యూక్‌’లో మరింత అధునాతన వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.78 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌–షోరూం). అయిదు అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. జెన్‌–3 కేటీఎం 390 డ్యూక్‌ నుంచి దీనిని ప్రేరణగా తీసుకున్నారు.రైడర్‌ తన అభిరుచికి తగ్గట్లు డిస్‌ప్లే థీమ్‌ను మార్చుకోవచ్చు. రైడర్‌ మెనూలు, కనెక్టివిటీ వంటి బైక్‌ ఫంక్షన్‌లను నియంత్రించేందుకు 4–వే స్విచ్‌ క్యూబ్‌ కూడా ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బైక్‌ను కేటీఎం మై రైడ్‌ యాప్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

RBI slaps Rs 61 95 lakh penalty on Kotak Mahindra Bank2
కొటక్‌ బ్యాంక్‌పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్‌ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.జరిమానా ఇందుకే.. ‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది.

Uncertainty Clears in Hyderabads Real Estate Market House Construction Tips3
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!

కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్‌లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్‌ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్‌ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్‌ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్‌ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్‌లకే కాదు చిన్న ప్రాజెక్ట్‌లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్‌షిప్‌ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇ‍ల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్‌పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్‌ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్‌లో జవాబుదారితనం పెరిగింది.

70percent of realtors expect over 5percent growth in housing prices4
ఇళ్ల ధరలు 5 శాతం అప్‌ 

న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుకు పటిష్టమైన డిమాండ్‌ నెలకొనడంతో వచ్చే ఏడాదిలో (2026) ఇళ్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల 5 శాతం పైగా ఉంటుందని దాదాపు 70 శాతం రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, రియల్‌ ఎస్టేట్‌ డేటా అనలిటిక్స్‌ సంస్థ సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్, డిసెంబర్‌ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 647 మంది డెవలపర్లు పాల్గొన్నారు. క్రెడాయ్‌ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే క్యాలెండర్‌ సంవత్సరంలో ఇళ్ల ధరలు 5 శాతానికి మించి పెరుగుతాయని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. పెరుగుదల 25 శాతానికి మించి ఉంటుందని 1 శాతం మంది, 15–25 శాతం మధ్య ఉంటుందని 3 శాతం మంది అంచనా వేశారు. ఇక ఇళ్ల ధరలు 10–15 శాతం మధ్యలో పెరుగుతాయని 18 శాతం మంది, 5–10 శాతం మేర పెరుగుతాయని 46 శాతం మంది పేర్కొన్నారు. రేట్లు తగ్గుతాయని 8 శాతం మంది మాత్రమే తెలపగా, ధరల పెరుగుదల 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సుమారు 25 శాతం మంది వివరించారు. స్పెక్యులేషన్‌ కన్నా డిమాండ్‌కే ప్రాధాన్యం.. 2026 క్యాలెండర్‌ సంవత్సరంలో రెసిడెన్షియల్‌ సెగ్మెంట్‌ సానుకూలంగా ఉంటుందని మూడింట రెండొంతుల మంది డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గృహాలకు డిమాండ్‌ 5 శాతం మేర పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రియల్‌ ఎస్టేట్‌ రంగ వృద్ధి ప్రధానంగా వినియోగదారుల డిమాండ్‌ను బట్టే ఉంటుందే తప్ప స్పెక్యులేషన్‌ ఆధారితమైనదిగా ఉండదని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ జి. పటేల్‌ తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించి, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపరీ్టలను అందించడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. ఈ వృద్ధి గతిని నిలబెట్టుకోవాలంటే వేగవంతమైన అనుమతులు, రెగ్యులేటరీపరంగా మరింత స్పష్టత అవసరమవుతుందని పటేల్‌ వివరించారు. క్లియరెన్స్‌లను క్రమబదీ్ధకరిస్తే వివిధ మార్కెట్లవ్యాప్తంగా కొత్త గృహాల సరఫరా పెరుగుతుందని, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాలు పర్యావరణహితంగా, సమంగా అభివృద్ధి చెందగలవని చెప్పారు. డిమాండ్‌ స్థిరంగా ఉండబోతోందని, ఒక పద్ధతి ప్రకారమే కొత్త గృహాల సరఫరా పెరగబోతోందని నివేదిక తెలియజేస్తోందని సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సీఈవో అభిõÙక్‌ కిరణ్‌ గుప్తా తెలిపారు. హౌసింగ్‌ ప్రాజెక్టులకు రుణాల పాలసీని సమీక్షిస్తాం ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి వెల్లడి రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చే విషయంలో తమ పాలసీని పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో జవాబుదారీతనం, పారదర్శకత కీలకాంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. చాలా సంస్థలు గతంలో రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి రుణాల విషయంలో దూకుడుగా వెళ్లి, చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం హౌసింగ్‌ ప్రాజెక్టుల రుణాల్లో ఎస్‌బీఐ వాటా చాలా తక్కువే ఉంటోంది. అయితే, కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్, ముఖ్యంగా ఆఫీస్‌ స్పేస్‌ విభాగానికి రుణాలను క్రమంగా పెంచుకుంటోంది. ‘ప్రాజెక్టు నిర్వహణ, రిస్కు మేనేజ్‌మెంటు, పారదర్శకత విషయాల్లో స్థిరత్వం ఉంటే కాస్త నమ్మకం కలుగుతుంది. అలాగే జవాబుదారీతనం కూడా మాలాంటి బ్యాంకులకు కీలకంగా ఉంటుంది. అప్పుడు (పరిశ్రమ) తక్కువ వడ్డీ రేటుకే కన్‌స్ట్రక్షన్‌ రుణాలను పొందేందుకు వీలుంటుంది‘ అని క్రెడాయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శెట్టి చెప్పారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్యకలాపాలు నిర్వహించే నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిర్వహణ వ్యయాలను తగ్గించుకుంటే, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందించేందుకు వీలవుతుందని శెట్టి సూచించారు.

Haldiram enters strategic partnership with L Catterton5
హల్దీరామ్స్‌లో కేటర్‌టన్‌కు వాటా 

న్యూఢిల్లీ: దేశీ స్నాక్స్‌ దిగ్గజం హల్దీరామ్స్‌లో తాజాగా కన్జూమర్‌ ఫోకస్‌డ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కేటర్‌టన్‌ పార్ట్‌నర్స్‌ వాటా కొనుగోలు చేసింది. అంతేకాకుండా హల్దీరామ్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు ఎల్‌.కేటర్‌టన్‌ తాజాగా వెల్లడించింది. అయితే పెట్టుబడి విలువ లేదా వాటా సంబంధ వివరాలు పేర్కొనలేదు. దేశీయంగా నాయకత్వస్థాయిలో ఉన్న హల్దీరామ్స్‌ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వీలుగా చేతులు కలిపినట్లు తెలియజేసింది. కేటర్‌టన్‌ సుమారు 39 బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులను నిర్వహిస్తోంది. వెరసి ఇప్పటికే హల్దీరామ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన పలు అంతర్జాతీయ దిగ్గజాల సరసన చేరింది. ప్యాకేజ్‌డ్‌ స్నాక్స్, స్వీట్స్‌సహా రెస్టారెంట్లను నిర్వహించే హల్దీరామ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు చేపట్టే టెమాసెక్‌(సింగపూర్‌ కేంద్రం), అల్ఫా వేవ్‌ గ్లోబల్, ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ(ఐహెచ్‌సీ) ఈ ఏడాది మొదట్లో వాటాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వివరాలు వెల్లడికానప్పటికీ 10 బిలియన్‌ డాలర్ల(రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఎల్‌.కేటర్‌టన్‌కు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ మాజీ ఎండీ సంజీవ్‌ మెహతా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఫామ్‌లీ, ఫెరారా క్యాండీ, కెటెల్‌ ఫుడ్స్, లిటిల్‌ మూన్స్, ప్లమ్‌ ఆర్గానిక్స్‌ తదితరాలలో పెట్టుబడులు చేపట్టింది.

75percent Indian students use AI to make study abroad choices6
కొలువులు ఉంటేనే.. విదేశాల్లో చదువు.. 

ముంబై: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, వీసా పాలసీలు మారిపోతున్న నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసంపై ఆసక్తి గల విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. అఫోర్డబిలిటీతో పాటు (అందుబాటు స్థాయిలో వ్యయాలు) చదువు అనంతరం ఉద్యోగావకాశాలు, తాము చదివే కోర్సులపై కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం తదితర అంశాలకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ ఆధారిత విదేశీ విద్య సేవల ప్లాట్‌ఫాం లీప్‌ స్కాలర్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 30 లక్షల మంది పైగా విద్యార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇది రూపొందింది. దీని ప్రకారం 2024–25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 377 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇది 219 శాతం వృద్ధి చెందింది. ఇక న్యూజిలాండ్‌పై 6 శాతం నుంచి 2,900 శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై 7 శాతం నుంచి 5,400 శాతానికి ఆసక్తి పెరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక 18 నెలల పాటు వర్క్‌ వీసా లభిస్తుండటం జర్మనీ విషయంలో సానుకూలాంశం. పాశ్చాత్య వర్సిటీలతో పోలిస్తే విద్యా వ్యయాలు తక్కువగా ఉండటం, కాస్త అందుబాటు దూరంలో ఉండటం యూఏఈకి సానుకూలంగా నిలుస్తోంది. అటు విద్యాభ్యాసం పూర్తయ్యాక మూడేళ్ల పాటు నివసించేందుకు, పని చేసేందుకు వర్క్‌ వీసా ఇచ్చే ఇమ్మిగ్రేషన్‌ పాలసీలతో భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్‌ ఆకర్షణీయంగా ఉంటోంది. ‘విద్యార్థులు ఇప్పుడు కేవలం అఫోర్డబిలిటీని మాత్రమే చూడటం లేదు. ఫలానా యూనివర్సిటీలో చదివామని గొప్పలకు పోవడం కన్నా సదరు డిగ్రీతో ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనేది కూడా వారికి కీలకంగా ఉంటోంది. పెట్టిన పెట్టుబడిపై రాబడి అవకాశాలను సైతం వారు లెక్కలు వేసుకుంటున్నారు‘ అని లీప్‌ స్కాలర్‌ సహ–వ్యవస్థాపకుడు ఆర్నవ్‌ కుమార్‌ తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → స్పెషలైజేషన్‌కి విద్యార్థులు గతంలో కన్నా మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 40.4 శాతం మంది విద్యార్థులు ఏఐ, మెషిన్‌ లెరి్నంగ్, డేటా సైన్స్‌ మొదలైన వాటిల్లో మాస్టర్స్‌ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తిగా ఉన్నారు. → 59.6 శాతం మంది వివిధ కోర్సుల్లో ఏఐ మాడ్యూల్స్‌ కూడా ఉన్న మాస్టర్స్‌ డిగ్రీలను ఎంచుకుంటున్నారు. → బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్‌ తదితర రంగాలకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు చేసినా, ఏఐకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇది నిదర్శనం. → ఏఐ కోర్సులు చదివేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల కన్నా తాము చదువుపై పెడుతున్న పెట్టుబడిపై రాబోయే రాబడులను కూడా లెక్కలు వేసుకుంటున్నారు. → కోర్సు ఖర్చు, ఇతరత్రా వ్యయాలూ తమకు అత్యంత ప్రాధాన్యతాంశాలని 75 శాతం మంది వెల్లడించారు. స్కాలర్‌షిప్‌కు 70 శాతం, కెరియర్‌ పురోగతికి 58 శాతం, జీతభత్యాల పెరుగుదల అవకాశాల అంశానికి 49 శాతం ఓట్లు లభించాయి. 40 శాతం ఓట్లతో అధ్యాపకుల అనుభవం, రీసెర్చ్‌ అవకాశాలకు అయిదో ర్యాంకు దక్కింది. టాప్‌ 5 ప్రాధాన్యతాంశాల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. → విదేశీ విద్యను ఎంచుకునే అబ్బాయిలు (58 శాతం), అమ్మాయిల (42 శాతం) మధ్య అంతరం తగ్గుతోంది. అమ్మాయిలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్‌ (స్టెమ్‌) కోర్సులను ఎంచుకుంటున్నారు. అందులోనూ ఏఐ, డేటా సైన్స్‌కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement