Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Adani Group Navi Mumbai International Airport begun flight operations1
ముంబయిలో రెండో ఎయిర్‌పోర్ట్‌.. కార్యకలాపాలు షురూ!

భారత పౌర విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) వాణిజ్య కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మొదటి ప్యాసింజర్‌ విమానం విజయవంతంగా టేకాఫ్, ల్యాండ్ అయింది.ఘన స్వాగతం.. తొలి విమానం ఇదే!బెంగళూరు నుంచి ప్రారంభమైన ఎయిర్‌క్రాఫ్ట్‌ విమానాశ్రయంలో మొదటి సర్వీసుగా నిలిచింది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం (6E460) రన్‌వేపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా విమానానికి సంప్రదాయ పద్ధతిలో ‘వాటర్ సెల్యూట్’తో స్వాగతం పలికారు.అనంతరం ఉదయం 8:40 గంటలకు ఇక్కడి నుంచి మొదటి విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఇండిగో విమానం (6E882) టేకాఫ్ అయింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.#WATCH | Maharashtra: Navi Mumbai International Airport commenced its airside operations today with the arrival of its first commercial flight. The aircraft was accorded a ceremonial water cannon salute on arrival. The inaugural arrival, IndiGo flight 6E460 from Bengaluru,… pic.twitter.com/SWoKSexdW4— ANI (@ANI) December 25, 2025మొదటి విమానాశ్రయంపై తగ్గనున్న ఒత్తిడిప్రస్తుతం అందుబాటులో ఉన్న ముంబై విమానాశ్రయంపై ఉన్న విపరీతమైన రద్దీని తగ్గించడంలో ఈ కొత్త విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుంది. గంటకు 10 విమానాల కదలికలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది. 2018లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ కొవిడ్-19 వంటి వివిధ కారణాల వల్ల దాదాపు ఎనిమిదేళ్లు ఆలస్యమైంది. ఈ విమానాశ్రయం అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ పర్యవేక్షణలో ఉంది.ఆకృతిలో ప్రత్యేకతలువిమానాశ్రయ రూపకల్పన భారత జాతీయ పుష్పం కమలం ఆకారంలో ఉంటుంది. దీని మొదటి దశ నిర్మాణానికి సుమారు రూ.19,650 కోట్లు** ఖర్చు చేశారు. ఇది 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ విమానాశ్రయం ప్రస్తుతం ఏడాదికి 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది ప్రయాణికులను నిర్వహించగలదు. భవిష్యత్తులో మొత్తం ఐదు దశలు పూర్తయిన తర్వాత ఇది ఏటా 90 మిలియన్ల(9 కోట్లు) మంది ప్రయాణికులకు సేవలందించనుంది.

Personal loan money utilization by Young Indians Youth Finance2
పర్సనల్‌ లోన్‌ తీసుకుని ఏంచేశారు వీళ్లు..?

ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో పర్సనల్‌ లోన్స్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది ఫస్ట్‌ హాఫ్‌లో పర్సనల్‌ లోన్స్‌ తీసుకున్న యువతరంలో 27 శాతం రుణాలు ‘ట్రావెల్‌’ కోసం తీసుకోబడ్డాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే మొదటిసారి.‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కనిపించిన భారీ మార్పు ఇది. యువతరం పర్సనల్‌ లోన్స్‌ తీసుకోవడానికి ప్రధాన కారణం...వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఇల్లు కొనడం...మొదలైనవి కాదు. ఒకే ఒక కారణం... ప్రయాణం’ అని చెప్పారు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్, రచయిత సార్థక్‌ అహుజ.ఈ మార్పుకు కారణం ఏమిటి?‘ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంత ఇల్లు అనే కల యువతరంలో చాలామందికి కలగానే మిగిలిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తక్షణం సంతృప్తిని ఇచ్చే విషయాలకు యువతరం ప్రాధాన్యత ఇస్తోంది. ట్రావెల్, లగ్జరీ వస్తువులు కొనుగోలు... మొదలైనవి అందులో ఉన్నాయి’ ఫిన్‌టెక్‌ ఇన్నోవేషన్‌తో అప్పుల కోసం పడే ఇబ్బందులు యువతరానికి తగ్గాయి. జీరో–కాస్ట్‌ ఇఎంఐలు, బై నౌ పే ల్యాటర్‌ (బిఎన్‌పీఎల్‌) స్కీమ్‌లు యువతరానికి స్పీడ్‌గా చేరువవుతున్నాయి.వాళ్ళు అలా... మనం ఇలా...చైనా యువతరం విషయానికి వస్తే...కోవిడ్‌ తరువాత ‘రివెంజ్‌ స్పెండింగ్‌’ నుంచి ‘రివెంజ్‌ సేవింగ్‌’కు మళ్లింది. ఎంతో కొంత అయినా సరే బంగారం మదుపు చేయడంపై మోజు పెరిగింది. బంగారాన్ని మదుపు చేయడం అనేది సరికొత్త స్టేటస్‌ సింబల్‌గా మారింది. ‘రేపు నేను సంపాదిస్తాను కాబట్టి ఈరోజు అప్పు చేయాలని మన యువతరం ఆలోచిస్తుంది. రేపు నా ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే ΄పొదుపు చేస్తాను అని చైనీస్‌ యువతరం అనుకుంటుంది’ అంటున్నారు అహుజ.ఇదీ చదవండి: బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?

How India betterment on the Global Innovation Index Rank3
పదేళ్లలో భారీగా పుంజుకున్న ఆవిష్కరణల సూచీ

గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశం ప్రపంచ ఆవిష్కరణల సూచీ (Global Innovation Index)లో ఎంతో ప్రగతి సాధించింది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి 39వ స్థానానికి చేరుకోవడం హర్షణీయం. ఇది దేశంలో మారుతున్న ఆర్థిక, సాంకేతిక ముఖచిత్రానికి నిదర్శనం. డబ్ల్యూఐపీవో (WIPO) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారత్ తన స్థానాన్ని స్థిరంగా మెరుగుపరుచుకుంటూ ఆవిష్కరణల కేంద్రంగా అవతరిస్తోంది.గత పదేళ్లలో భారత్ సాధించిన ర్యాంకులు దేశంలో వచ్చిన గుణాత్మక మార్పులను సూచిస్తున్నాయి.సంవత్సరంజీఐఐ ర్యాంక్201476201581202048202439 ఈ వృద్ధికి ప్రధాన కారణాలుబలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. 2014లో కేవలం కొన్ని వందల స్టార్టప్‌లు ఉండగా, నేడు ఆ సంఖ్య 1.40 లక్షలు దాటింది. 110కి పైగా యూనికార్న్ కంపెనీలు దేశంలో ఆవిష్కరణల జోరును పెంచాయి.ప్రభుత్వ విధానాలు, డిజిటల్ విప్లవం.. యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించాయి. ఇది ఆర్థిక లావాదేవీలనే కాక, కొత్త రకమైన ఫిన్‌టెక్ ఆవిష్కరణలకు దారితీసింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ కీలక పాత్ర పోషిస్తున్నాయి.పరిశోధన, అభివృద్ధిపై దృష్టి.. ప్రభుత్వం ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’(ANRF) వంటి సంస్థల ద్వారా పరిశోధనలకు భారీ నిధులను కేటాయిస్తోంది. సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో ఒకటిగా ఉండటం గమనార్హం.మేధో సంపత్తి హక్కుల బలోపేతం.. పేటెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేయడం వల్ల భారత్ నుంచి స్వదేశీ పేటెంట్ల నమోదు పెరిగింది. 2015తో పోలిస్తే ప్రస్తుతం పేటెంట్ల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది.భారత్ అందిపుచ్చుకున్న అవకాశాలుఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) సేవల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs) పరంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ పరిశోధనా కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేయడం ద్వారా మన దేశం గ్లోబల్ టెక్ హబ్‌గా మారింది.స్పేస్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఫలితాలను సాధించడంలో భారత్ తనదైన ముద్ర వేసింది.భారత్ 39వ స్థానానికి చేరుకున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను మరింత పెంచాల్సి ఉంది. విద్యావ్యవస్థ, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచితే భారత్ టాప్-25 దేశాల జాబితాలోకి చేరడం ఏమాత్రం కష్టం కాదు.ఇదీ చదవండి: రేషన్‌ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం

Google plans to allow Gmail users to change their email addresses4
మెయిల్‌ ఐడీ నచ్చలేదా? మార్చుకుందురులే..!

మనలో చాలా మందికి ఈమెయిల్‌ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్‌ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్‌ ఆటోమెటిక్‌గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్‌ అడ్రెస్‌గా సెట్‌ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్‌ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.ఇప్పుడా అవకాశాన్ని గూగల్‌ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్‌ డాక్యుమెంటేషన్‌ను ఇటీవల అప్‌డేట్‌ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్‌లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.ప్రసిద్ద ఫోర్బ్స్‌ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్‌ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్‌ అడ్రస్‌ కూడా అలియాస్‌గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్‌ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్‌లు, ఇమెయిల్‌లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్‌కు థర్డ్‌ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్‌ అడ్రెస్‌ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్‌ అందిస్తున్న కొత్త ఫీచర్‌ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు.

Direct Benefit Transfer considered as way to prevent ration loss full details5
రేషన్‌ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం

ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా ఒక కిలో బియ్యం సేకరించి, దాన్ని భద్రపరిచి, రవాణా చేసి లబ్ధిదారుడికి చేరవేసేసరికి దాదాపు రూ.40 వరకు ఖర్చు చేస్తోంది. అంటే, మనం ‘ఉచితం’ అని పిలుచుకుంటున్న ఈ బియ్యం వెనుక సామాన్యుడు పన్ను రూపంలో చెల్లించిన భారీ మూల్యం ఉంది. దురదృష్టవశాత్తు 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే రవాణా, నిల్వ లోపాల వల్ల సుమారు 53,000 టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు గోడౌన్లలో కుళ్లిపోతున్న ధాన్యాలు వెరసి ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పడం లేదు.ఈ భారీ నష్టాన్ని, లీకేజీలను అరికట్టడానికి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ‘నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ DBT)’ పరిష్కారంగా తోస్తుంది. ప్రభుత్వం భరిస్తున్న ఈ రూ.40 ఖర్చును నేరుగా పేదల ఖాతాల్లో వేస్తే వారు మార్కెట్‌లో తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందనే వాదనలున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఆహార భద్రతా పథకంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై విశ్లేషణ.ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా పేరుగాంచిన భారత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ప్రస్తుతం 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలను అందిస్తోంది. అయితే, పేదల ఆకలి తీరుస్తున్న ఈ పథకం వెనుక ప్రభుత్వం భరిస్తున్న ఆర్థిక భారం, వ్యవస్థలోని లోపాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ఒక కిలో ధాన్యం ధర ఎంత?సాధారణ పౌరులకు రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు ఉచితంగా లభిస్తున్నప్పటికీ, ప్రభుత్వంపై పడుతున్న వ్యయం సామాన్యమైనది కాదు. ధాన్యాల సేకరణ, నిల్వ, రవాణా, వడ్డీ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే కిలో ధాన్యం రేషన్ షాపుకు చేరడానికి ప్రభుత్వానికి రూ.28 నుంచి రూ.40 వరకు ఖర్చవుతోంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌సీఐ వ్యయంబియ్యం (కిలోకు): రూ.39.75గోధుమలు (కిలోకు): రూ.27.74మొత్తం ఆహార సబ్సిడీ బిల్లు: రూ.2.05 లక్షల కోట్లువ్యవస్థలోని లోపాలు.. వేల కోట్ల నష్టంప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. గణాంకాల ప్రకారం, సబ్సిడీ ధాన్యాల్లో సుమారు 28 శాతం లక్షిత గృహాలకు చేరడం లేదు. అంటే దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యం పక్కదారి పడుతోంది లేదా వృథా అవుతోంది. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి రూ.69,108 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, నిల్వ సమయంలో జరుగుతున్న నష్టం కూడా ఆందోళనకరంగా ఉంది. 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే ఎఫ్‌సీఐ రవాణాలో 40,000 టన్నులు, నిల్వలో 13,000 టన్నుల ధాన్యాన్ని కోల్పోయింది.నగదు బదిలీ(DBT) పరిష్కారమేనా?ఈ లాజిస్టిక్స్ చైన్‌లోని లోపాలను సరిదిద్దడానికి నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ DBT) ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ధాన్యం పంపిణీకి చేసే ఖర్చును నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధిత బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల..సప్లై చైన్ లీకేజీలను అరికట్టవచ్చు.లబ్ధిదారులు తమకు నచ్చిన నాణ్యమైన ఆహారాన్ని స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు.కర్ణాటకలోని ‘అన్న భాగ్య’ నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులు మెరుగైన ఆహారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారు.ముందున్న మార్గంపీడీఎస్‌ వ్యవస్థను నేరుగా నగదు బదిలీకి మార్చడం ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. దీనికోసం ప్రభుత్వం కొన్ని వ్యూహాలను అనుసరించాలి.లబ్ధిదారులే స్వచ్ఛందంగా నగదు లేదా ధాన్యం ఎంచుకునేలా 12-18 నెలల సమయం ఇవ్వాలి.ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నగదు బదిలీ మొత్తాన్ని సవరించాలి.మౌలిక సదుపాయాలు లేని చోట్ల నగదుకు బదులు ఆహార కూపన్లను వినియోగించవచ్చు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే!

Gold and Silver rates on 26th December 2025 in Telugu states6
బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?

దేశంలో బంగారం, వెండి ధరల దూకుడు తగ్గడం లేదు. వరుసగా ఐదో రోజూ ధరలు అమాంతం ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) మరింత భారీగా పెరిగాయి. వెండి ధరలు మరో కొత్త మార్కునూ దాటేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
Advertisement