Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why Platinum Prices Lower Than Gold and Silver1
పీక్‌లో గోల్డ్, సిల్వర్: డీలా పడిన ప్లాటినం!

భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి ధరలు పెరగడానికి కారణాలుఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలుబంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది.

Huge Demand for EV Batteries2
ఈవీ బ్యాటరీలకు భారీ డిమాండ్‌

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీ (ఈవీ బ్యాటరీ) డిమాండ్‌ వచ్చే ఏడేళ్లలో గణనీయంగా పెరనుందని కస్టమైజ్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ (సీఈఎస్‌) సంస్థ అంచనా వేసింది. 2025లో ఈవీ బ్యాటరీ డిమాండ్‌ 17.7 గిగావాట్‌ హవర్‌ (జీడబ్యూ్యహెచ్‌) ఉండగా, 2032 నాటికి 256.3 గిగావాట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఏటా 35 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి (సీఏజీఆర్‌) ఈ రంగంలో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, ఎలక్ట్రిఫికేషన్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదల అవుతుండడం, విధానపరమైన మద్దతు అన్నీ కలసి ఈవీ మార్కెట్‌ భారీ వృద్ధికి అనుకూలిస్తున్నట్టు తన నివేదికలో సీఈఎస్‌ వివరించింది.‘‘భారతదేశ ఎలక్ట్రిక్‌ వాహన విప్లవానికి బ్యాటరీ కెమిస్ట్రీ పురోగతులు కీలకమైనవి. ఎల్‌ఎఫ్‌పీ జెన్‌ 4, సోడియం అయాన్‌ టెక్నాలజీ ఆవిష్కరణలు కేవలం సాంకేతికపరమైన పురోగతులే కాదు. ఎలక్ట్రిక్‌ వాహనాలను మరింత అందుబాటు ధరలకు తీసుకొచ్చే సంచలనాలు. సురక్షితమైన, ఒక్కచార్జ్‌తో మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి’’అని సీఈఎస్‌ ఎండీ వినాయక్‌ వలింబే తెలిపారు. ఎల్‌ఎఫ్‌పీ జెన్‌4 సెల్స్‌ అన్నవి ఇప్పుడు 300 వాట్‌హవర్‌/కిలోని అధిగమించాయంటూ.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, ధరలు తగ్గేందుకు అనుకూలిస్తాయ ఈ నివేదిక తెలిపింది.సవాళ్లను అధిగమించాలి..భారత్‌ తన ఎలక్ట్రిఫికేషన్‌ (ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లడం) లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పరిశ్రమతో సహకారం, బలమైన బ్యాటరీ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు, వ్యూహాత్మక పెట్టుబడుల సవాళ్లను అధిగమించేందుకు విధానపరమైన జోక్యం అవసరమని సీఈఎస్‌ నివేదిక సూచించింది. బ్యాటరీల్లో వినియోగించే కీలక ముడి పదార్థాలను, ఖనిజాలపై చైనా నియంత్రణలు.. భారత్‌లో గిగాఫ్యాక్టరీల నిర్మాణాన్ని నిదానింపజేయొచ్చని, సరఫరా వ్యవస్థ రిస్‌్కలకు దారితీయొచ్చని హెచ్చరించింది. అధిక ఆరంభ పెట్టుబడులకుతోడు, దేశీయంగా ఖనిజ నిల్వలు పరిమితంగా ఉండడం భారత స్వావలంబన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.

Manufacturing to Contribute 25 Percent of GDP by 20473
తయారీ హబ్‌గా భారత్‌!

భారత్‌ 2047 నాటికి తయారీ దిగ్గజంగా మారాలంటే.. జీడీపీలో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలని బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ (బీసీజీ), జెడ్‌47 సంయుక్త నివేదిక సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)తో దేశీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నట్టు పేర్కొంది.ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమోటివ్‌-ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో 2047 నాటికి 25 ట్రిలియన్‌ డాలర్ల అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కాలంలో తయారీ రంగంలో భారత్‌ వృద్ధికి ఈ రంగాలు కీలకంగా మారనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటికితోడు బలమైన జీడీపీ వృద్ధి, పారిశ్రామిక మద్దతు, స్పష్టమైన విధానాలు/పెట్టుబడులతో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, టెక్నాలజీ అమలు ద్వారా సామర్థ్యాలను విస్తృతం చేయడం ద్వారా తయారీ రంగానికి బలమైన పునాదులు వేయాలని సూచించింది.2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం కోసం.. రక్షణ, ఈవీ, సెమీకండక్టర్లకు సంబంధించి ప్రాంతీయ తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. నోయిడా–చెన్నై–హోసూర్, దొలెరా కారిడార్లు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నట్టు తెలిపింది. ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తుది మార్కెట్‌ 2022లో 33 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి 117 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రక్షణ రంగానికి 2025–26లో కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉండగా, దేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో కేటాయింపులు రెట్టింపు కానున్నట్టు పేర్కొంది.

Will Diesel Cars Be Stopped in India And Know The Reasons Here4
డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..

ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలుబీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?

Shortage of Ordinary And Middle Class Houses in Hyderabad5
సామాన్యుడి కల.. 29 లక్షల ఇళ్లు అవసరం!

హైదరాబాద్‌లో సామాన్యుడికి సొంతిల్లు కలే. దీన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ భాగస్వామ్యం తప్పనిసరి. నిజం చెప్పాలంటే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలోనే సామాన్య, మధ్యతరగతి ఇళ్ల సరఫరా పెరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రైవేట్‌ సంస్థలను ఆకర్షించాల్సి ఉంటుందని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కొరతను అధిగమించేందుకు చిన్న, తక్కువ ధరల ఇళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సిటీ అభివృద్ధి ఔటర్‌ దాటింది. కనెక్టివిటీ, సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దీంతో సామాన్యులకు గృహాలు కొనగలుగుతారు. – సాక్షి, సిటీబ్యూరోరాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఇళ్ల డిమాండ్‌పై రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో మధ్యతరగతి వర్గాలకు 20.30 లక్షలు, పేద వర్గాలకు 8.70 లక్షల ఇళ్లు కలిపి.. మొత్తం 29 లక్షల ఇళ్ల డిమాండ్‌ ఉందని తేలింది. ఈ కొరతను అధిగమించాలంటే పీపీపీ విధానం మేలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌), రీజినల్‌ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య పీపీపీ విధానంలో సరసమైన గృహాలను నిర్మించే యోచన చేస్తున్నట్లు ఇటీవల గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో పేద, మధ్యతరగతి ప్రజలకు కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.మౌలిక వసతుల కల్పన..అందుబాటు గృహాలను నిర్మించాలంటే నగరంలో స్థలం కొరత. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ముందుగా శివారుల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. ఓఆర్‌ఆర్, త్రిబుల్‌ ఆర్‌ మధ్య ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక వసతులను కల్పించాలి. అలా చేస్తే అందుబాటు గృహాల నిర్మాణాలు ఊపందుకుంటాయి.ప్రభుత్వం ఉచితంగా స్థలాలను కేటాయించి.. జాయింట్‌ వెంచర్‌గా అందుబాటు గృహాలను నిర్మిస్తే విజయవంతం అవుతాయి. ఎలాగంటే.. ప్రైవేట్‌ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాయి కనుక నిర్మాణంలో నాణ్యతతో పాటూ వారికి దక్కే వాటా ఫ్లాట్లు ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించుకుంటారు. దీంతో ప్రాజెక్ట్‌లో భిన్నమైన సంస్కృతి వస్తుంది. నిర్వహణ కూడా బాగుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్‌ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి.ముచ్చటగా మూడు పద్ధతులు➤ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం రాష్ట్రాన్ని మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తుంది.➤కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌)లో మురికివాడలను యథాస్థితిలో పునరాభివృద్ధి చేయనున్నారు. ఐటీ కారిడార్లలో అందుబాటు ధరల్లో అద్దె గృహాల విధానాన్ని తీసుకురానున్నారు.➤పెరీ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(ప్యూర్‌) పరిధిలో బహుళ అంతస్తుల గ్రీన్‌ఫీల్డ్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే పారిశ్రామిక క్లస్టర్ల వద్ద కార్మికులకు సరసమైన ధరలకు గృహాలు నిర్మించడంపై దృష్టిపెడతారు.➤మిగిలిన ప్రాంతం పరిధిలో చిన్న, మధ్య తరహా టౌన్‌íÙప్‌లు, పారిశ్రామిక పార్క్‌లు, లాజిస్టిక్‌ హబ్‌లతో గృహ నిర్మాణ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

Why AI Cos Struggle With Profitability Today Pathways to Profitability6
ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!

టెక్ దిగ్గజాల దృష్టి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనే ఉంది. లాభాలు స్థిరంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెనరేటివ్ ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల ఓపెన్‌ ఏఐతో ఒప్పందం చేసుకుని 300 బిలియన్ల పెట్టుబడులు పెట్టినప్పుడు ఒరాకిల్‌ స్టాక్‌ప్రైస్‌ 335 డాలర్లకు పెరిగింది. ఆ తరువాత రెండు మూడు నెలల్లోనే 190 కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ విభాగంలో పెట్టుబడులు లాభాలుగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలంటే కంపెనీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? స్థిరమైన లాభాల కోసం ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో విశ్లేషిద్దాం.ఏఐ పెట్టుబడులుటెక్ దిగ్గజాలు ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలనిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల నుంచి గరిష్ట లాభాలను పొందడానికి కంపెనీలు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలి.కేవలం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా నిర్దిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించే సర్వీసులను పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కస్టమర్ సేవల్లో ఆటోమేషన్, కోడ్ డెవలప్‌మెంట్ వేగవంతం చేయడం, లేదా కచ్చితమైన డేటా అనలిటిక్స్ అందించడం వంటి విభిన్న సర్వీసులపై దృష్టి సారించాలి.ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో సర్వీసులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుఐటీ కంపెనీలు స్టార్టప్‌లతో సహకారం కలిగి ఉంటూ తమ సొంత ఆర్ అండ్ డీపైనే ఆధారపడకుండా వినూత్న ఏఐ స్టార్టప్‌లతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి లేదా వాటిని కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీని త్వరగా మార్కెట్‌లోకి తీసుకురావచ్చు. క్లయింట్‌లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార ప్రక్రియల్లో ఏఐని ఏకీకృతం చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.మానిటైజేషన్ మోడల్స్ఏఐ ఆధారిత టూల్స్‌కు నెలవారీ లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను అమలు చేయాలి. క్లయింట్ ఏఐ సర్వీసును ఎంత ఉపయోగించారో దాని ఆధారంగా ధరను నిర్ణయించడం ద్వారా తక్కువ వినియోగం ఉన్న క్లయింట్‌లను కూడా ఆకర్షించవచ్చు.మానవ వనరుల పెంపుఏఐ టెక్నాలజీని ఉపయోగించే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల శిక్షణలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల ఏఐ ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యత పెరుగుతుంది.ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా క్లయింట్ కంపెనీలు టెక్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సేవలకు డిమాండ్‌లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి.ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నైపుణ్యాల కొరత ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తోంది.జెనరేటివ్ ఏఐ టూల్స్ కొన్ని సంప్రదాయ ఐటీ పనులను (ఉదా: ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్) ఆటోమేట్ చేయగలవు. ఇది ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రస్తుత వ్యాపార నమూనాకు సవాలుగా మారుతోంది.డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేగవంతం కావడంతో సైబర్‌ దాడుల ప్రమాదం పెరుగుతోంది. భద్రతకు సంబంధించిన వ్యయం అధికమవుతోంది.పోటీ పెరగడం, క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవాలని చూడడంతో ఐటీ సేవలకు ధరలను తగ్గించాల్సిన ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది.సవాళ్లు అధిగమించాలంటే..పైన పేర్కొన్న సవాళ్లను అధిగమించి లాభాల వృద్ధిని కొనసాగించడానికి ఐటీ కంపెనీలు కొన్ని మార్గాలను అనుసరించాలి. అంతర్గత ప్రక్రియల్లో, క్లయింట్ ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ఉపయోగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించాలి. తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న ప్రాంతాల నుంచి సేవలు అందించే మోడల్‌ను బలోపేతం చేయాలి. పాత నైపుణ్యాలు గల ఉద్యోగులను ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలలోకి తిరిగి శిక్షణ ఇవ్వాలి. దీని ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమించవచ్చు. ఉద్యోగులకు ఏఐ ఫస్ట్ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయాలి.ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్!

Advertisement
Advertisement
Advertisement