Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock market updates on December 5th 20251
Stock Market Updates: ఫ్లాట్‌గా మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు భారత ఈక్విటీ మార్కెట్లు స్పల్ప నష్టాల్లో చలిస్తున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మూడు రోజుల సమావేశం ఈరోజు రెపో రేట్ ప్రకటనతో ముగియనుంది.ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 79 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 85,187 వద్ద, నిఫ్టీ 50 సూచీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం తగ్గి 26,021 వద్ద ఉంది.ఈ రోజు సెన్సెక్స్‌లో రిలయన్స్, ట్రెంట్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ పీవీ, సన్ ఫార్మా, టైటాన్ టాప్ లూజర్స్ గా ఉండగా, ఎటర్నల్, బీఈఎల్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఫార్మా, మెటల్ సూచీలు 0.3 శాతం నష్టపోయాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 0.28 శాతం పెరిగింది.Today Nifty position 05-12-2025(time: 10:03 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Passenger rights over Flight delays & cancellation2
ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అయితే ఇవన్నీ ఇవ్వాల్సిందే..!

దేశంలో విమానాల రద్దు సంఘటనలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ పౌర విమానయాన సంస్థ ఇండిగో.. భారీగా విమానాల రద్దుతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమానాలు క్యాన్సిల్‌ అయినప్పుడు విమానయాన సంస్థల బాధ్యతలు ఏంటి.. డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రయాణికులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి.. ఈ కథనలో తెలుసుకుందాం..భారతదేశంలో విమానాలు రద్దు అయినప్పుడు డీజీసీఏ (DGCA డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణికులకు రిఫండ్, ప్రత్యామ్నాయ విమానం, భోజనం/హోటల్ సౌకర్యం వంటి బాధ్యతలు వహించాలి. అలాగే ప్రయాణికులకు పాసింజర్‌ ఛార్టర్‌ ఆఫ్‌ రైట్స్‌ ద్వారా కొన్ని స్పష్టమైన హక్కులు కల్పించారు.విమానయాన సంస్థల బాధ్యతలుసమయానికి సమాచారం ఇవ్వాలి: విమానం క్యాన్సిల్‌ అయితే ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగానే తెలియజేయాలి. ప్రత్యామ్నాయ విమానం: అదే గమ్యస్థానానికి మరో విమానం ఉచితంగా ఏర్పాటు చేయాలి. రిఫండ్: ప్రయాణికుడు కోరుకుంటే పూర్తి టికెట్‌ ధర రిఫండ్ చేయాలి. భోజనం/హోటల్ సౌకర్యం: విమానం క్యాన్సిల్‌ లేదా 2 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రయాణికులకు భోజనం, రిఫ్రెష్‌మెంట్‌ వసతి కల్పించాలి. అదే 24 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే హోటల్ వసతితోపాటు ట్రాన్స్‌ఫర్(స్థానిక రవాణా) సౌకర్యం కల్పించాలి.ప్రయాణికుల హక్కులు ఇవే..విమానం క్యాన్సిల్‌ అయితే ప్రయాణికులు ఛార్జీలు రిఫండ్ తీసుకోవచ్చు లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఓవర్‌బుకింగ్ వల్ల ప్రయాణికుడికి సీటు దొరకకపోతే టికెట్‌ పూర్తి రిఫండ్‌తోపాటు పరిహారం పొందవచ్చు.లగేజీని విమానయాన సంస్థలు పోగొడితే నిబంధనల ప్రకారం ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.విమానాల ఆలస్యం లేదా క్యాన్సిలేషన్‌పై స్పష్టమైన సమాచారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..ప్రయాణికులు 7 రోజులు ముందే విమాన టికెట్‌ బుక్‌ చేసి, 24 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ పొందవచ్చు. విమానాలు 2 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా భోజనం, రిఫ్రెష్‌మెంట్‌ సౌకర్యం కల్పించాల్సిందే.24 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా హోటల్‌ వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లు చేయాలి.విమానాల క్యాన్సిలేషన్‌ సందర్భంలో పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలి. అయితే సేఫ్టీ కారణాలు (వాతావరణం, టెక్నికల్ సమస్యలు) రీత్యా విమానాలు ఆలస్యం లేదా రద్దు అయితే రిఫండ్/రీబుకింగ్ తప్పనిసరి. కానీ అదనపు పరిహారం ఇవ్వకపోవచ్చు.

Trade gap fix India for greater access to Russian market3
రష్యాకి మరిన్ని ఎగుమతులపై దృష్టి

వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి ఆస్కారం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ చెప్పారు. వినియోగ వస్తువులు, ఆహారోత్పత్తులు, వాహనాలు, ట్రాక్టర్లు, భారీ వాణిజ్య వాహనాలు, స్మార్ట్‌ఫోన్స్‌ లాంటి ఎల్రక్టానిక్స్‌ మొదలైన విభాగాల్లో అవకాశాలు ఉన్నాయని ఇరు దేశాల వ్యాపార వర్గాలతో భేటీలో ఆయన పేర్కొన్నారు.ద్వైపాక్షిక వాణిజ్యం 70 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. అమెరికా భారీ టారిఫ్‌లను భారత్, పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వాణిజ్య అసమానతలను తొలగించుకునే దిశగా కలిసి పని చేయాల్సి ఉందని పేర్కొన్నారు.2024–25లో రష్యాకు భారత్‌ ఎగుమతులు 4.96 బిలియన్‌ డాలర్లకు, దిగుమతులు 63.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 2023–24లో 56.89 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 59 బిలియన్‌ డాలర్లకు చేరింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. భారత పర్యటనకి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బృంద సభ్యుడు, ప్రెసిడెన్షియల్‌ ఆఫీస్‌ డిప్యుటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మ్యాక్సిమ్‌ ఒరెష్కిన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత్‌ నుంచి ఫార్మా, వ్యవసాయం, టెలికం పరికరాల్లాంటి ఆరు విభాగాల్లో ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు సున్నితంగా మారిన తరుణంలో భారత్‌లో పుతిన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Investment banking GCCs emerge as highest payers in financial sector4
ఎక్కువ జీతాలిస్తోంది ఇదిగో ఈ జీసీసీలే..

జూనియర్ల నుంచి సీనియర్ల వరకు వివిధ విభాగాలవ్యాప్తంగా అనుభవాన్ని బట్టి అత్యధిక వేతనాలివ్వడంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. రిటైల్, కమర్షియల్‌ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా రంగ జీసీసీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాలెంట్‌ సొల్యూషన్స్‌ సేవల సంస్థ కెరియర్‌నెట్‌ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.వివిధ రంగాలకు చెందిన 50,000 మంది ప్రొఫెషనల్స్‌ జీతభత్యాల డేటా ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో డేటా సైంటిస్టుకు రూ. 22.1 లక్షల నుంచి రూ. 46.9 లక్షల వార్షిక ప్యాకేజీ ఉంటోంది. అదే రిటైల్‌ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌లో చూస్తే వరుసగా రూ. 19.90–44.50 లక్షలు, రూ. 18.40 – 44.30 లక్షల స్థాయిలో ఉంటోంది.ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో జూనియర్‌ స్థాయిలోని ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లకు రూ. 20.7 లక్షల స్థాయిలో, సీనియర్‌లకు రూ. 47.5 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. అటు స్క్రమ్‌ మాస్టర్, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లాంటి ఉద్యోగాలకు ప్రారంభంలో ఒక మోస్తరు వేతనాలు ఉన్నా క్రమంగా, భారీ స్థాయికి చేరుతున్నాయి.

Hallmarking of 17 Lakh Silver Items5
17 లక్షల వెండి ఐటమ్‌లకు హాల్‌మార్కింగ్‌

వెండి ఆభరణాల నాణ్యతను ప్రామాణికంగా ధృవీకరించే దిశగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలో 17.35 లక్షల ఐటమ్‌లను హాల్‌మార్కింగ్‌ (హెచ్‌యూఐడీ) చేసినట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) ప్రామాణిక మార్కుకి అదనంగా ప్రతి ఉత్పత్తిపై విశిష్టమైన ఆరు అంకెల కోడ్‌ను, సిల్వర్‌ అనే పదం, స్వచ్ఛత గ్రేడ్‌ వివరాలను ముద్రిస్తారని సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు.సదరు ఉత్పత్తి ప్రమాణాలను ధృవీకరించిన అసేయర్‌–హాల్‌మార్కింగ్‌ సెంటర్‌ని కూడా ట్రాక్‌ చేసేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. బీఐఎస్‌ కేర్‌ మొబైల్‌ యాప్‌లో హెచ్‌యూఐడీని ఎంటర్‌ చేసి హాల్‌మార్క్‌ గల వెండి ఆభరణాల ప్రామాణికతను వినియోగదారులు తక్షణం తెలుసుకోవచ్చు.

Fitch Raises India GDP Growth To 7. 4 percent For Fy20266
భారత వృద్ధి 7.4 %

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచాలను పెంచుతున్నట్టు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. 2025–26లో 6.9 శాతం వృద్ధి నమోదుకావొచ్చన్న గత అంచనాను 7.4 శాతానికి పెంచింది. ఈ ఏడాది ప్రైవేటు వినియోగం వృద్ధికి ప్రధాన చోదకంగా ఉన్నట్టు వివరించింది. దీనికి తోడు ఇటీవల చేపట్టిన జీఎస్‌టీ సంస్కరణలతో సెంటిమెంట్‌ మెరుగుపడినట్టు తెలిపింది. ద్రవ్యోల్బణం గణనీయంగా దిగిరావడంతో ఆర్‌బీఐ డిసెంబర్‌ సమీక్షలో మరో పావు శాతం రెపో రేటును తగ్గించి, 5.25 శాతం చేయొచ్చని అంచనా వేసింది. 2025లో 100 బేసిస్‌ పాయింట్లు (ఒక శాతం) తగ్గింపునకు ఇది అదనమని పేర్కొంది. జూన్‌ త్రైమాసికంలో (క్యూ1) 7.8 శాతం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో (క్యూ2) 8.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావడంతో ఫిచ్‌ రేటింగ్స్‌ తన అంచనాలను సవరించినట్టయింది. కాకపోతే ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి రేటు కొంత నిదానించొచ్చని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్‌ జీడీపీ వృద్ధి 6.4 శాతానికి తగ్గుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఆర్థిక పరిస్థితులు సరళంగా మారితే వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 0.3 శాతానికి తగ్గడం తెలిసిందే. సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్‌టీ కింద 375 ఉత్పత్తులపై రేట్లు తగ్గడం ఇందుకు అనుకూలించింది.

Advertisement
Advertisement
Advertisement