ప్రధాన వార్తలు
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) పోర్టల్ల్లో అత్యాధునిక ఏఐ చాట్బాట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.ఈ-శ్రమ్, ఎన్సీఎస్ పోర్టల్స్లో ఏఐ చాట్బాట్లుఇండియా ‘ఏఐ-ఫస్ట్ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్సీఎస్లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.ఈ చాట్బాట్లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్లేషన్ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు
2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు
ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగా 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2010లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుంది.న్యూఢిల్లీలో జరిగిన ఆరో అమెజాన్ సంభవ్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పింది. ఏఐ నేతృత్వంలోని డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అమెజాన్ పేర్కొంది.డిజిటలైజేషన్, ఉద్యోగాలుకొన్నేళ్లుగా అమెజాన్ దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తోంది. ఈ సమ్మిట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 వరకు భారత పరిశ్రమల్లో సుమారు 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష, కాలానుగుణ ఉద్యోగాలకు అమెజాన్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్వైపు మళ్లించినట్లు చెప్పింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్వర్క్లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది.అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలియన్ల మంది భారతీయులకు ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2030 నాటికి మా ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ డాలర్లకు అంటే నాలుగు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
‘తాజ్ బంజారా’ను కొనేసిన అరబిందో
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్ హోటల్ ‘తాజ్ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్లో ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో ఉన్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.ఐకానిక్ తాజ్ బంజారాఒకప్పుడు తాజ్ గ్రూప్కి చెందిన ఫ్లాగ్షిప్ లగ్జరీ హోటల్గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..హైదరాబాద్లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్-యూజ్ సెగ్మెంట్ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్ బంజారా హోటల్ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కు తెరతీస్తుందా అన్నది చూడాలి.
హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం
హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లోని టి-హబ్లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్లకు సహాయపడుతుంది” అన్నారు.
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు
ముంబై.. దేశంలో అత్యంత కీలకమైన నగరం. దీన్ని దేశ ఆర్థిక రాజధానిగా కూడా పేర్కొంటుంటారు. దేశంలోని అనేక కార్పొరేట్ సంస్థలు, కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఆర్థికపరమైన కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో విదేశాలతోపాటు, దేశ నలుమూలల నుంచి ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ముంబై నగరాన్ని ప్రభావితం చేసింది.ఇండిగో విమాన అంతరాయాల ప్రభావం ముంబై విమానాశ్రయంలో వారం రోజులుగా ప్రయాణికులను సతాయించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 1 నుంచి 8 వరకు 905 విమానాలు రద్దు అయ్యాయి. 1,475 విమానాలు 30 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయాల వల్ల సుమారు 40,789 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే..ముంబై ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎనిమిది రోజులలో 3,171 విమానాలు నడపాల్సి ఉండగా కేవలం 2,266 మాత్రమే నడిపగలిగింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. డిసెంబర్ 1న 14గా ఉన్న విమాన రద్దులు డిసెంబర్ 5న 295కి పెరిగాయి. ఆలస్యాలు కూడా ఎక్కువయ్యి, డిసెంబర్ 3న 281 విమానాలు గరిష్ట ఆలస్యాన్ నమోదు చేశాయి.స్తంభించిన ప్రయాణికుల బ్యాగేజీఅంతరాయాలు పెరుగుతూనే ఉండటంతో టెర్మినళ్లలో కార్యకలాపాలు క్రమంగా స్తంభించాయి. రద్దయిన విమానాల కారణంగా సుమారు 780 చెక్-ఇన్ బ్యాగులు ప్రయాణికులకు అందకుండా నిలిచిపోయాయి. వీటిలో 90% బ్యాగులను బుధవారం నాటికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.ఎక్కువగా ప్రభావితమైన మార్గాలు ఇవే..ముంబై నుంచి బయలుదేరే అనేక దేశీయ మార్గాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ప్రధానంగా అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, కొచ్చి, గోవా, లక్నో నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయంగా ఆమ్స్టర్డామ్, ఇస్తాంబుల్ మార్గాలలో కూడా పెద్ద ఎత్తున ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకున్నాయి.
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం మెల్లగా కుదుటపడుతోంది. విమానాల సర్వీసుల రద్దు, ఆపరేషనల్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్ తనిఖీలు వంటి అంశాలను పరిశీలించేందుకు డీజీసీఏ ప్రత్యేక బృందాలను నియమించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, సంస్థపై ఒత్తిడిని మరింత పెంచుతూ విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో మొత్తం ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇండిగో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా, ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను రద్దు చేసే యోచనలో కూడా డీజీసీఏ ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీసుల నిరంతరత, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాల ఆధారంగా రూట్లను పునర్వ్యవస్తీకరించనున్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో ఇండిగో సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్నప్పటికీ, విస్తృతంగా సేవలు అందించే సంస్థగా ఉన్నందున మరికొన్ని రోజులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కార్పొరేట్
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
స్మార్ట్ ఫోన్ రేట్లకు రెక్కలు
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే..
హైదరాబాద్లో లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ల విస్తరణ
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ
తారుమారైన బంగారం, వెండి ధరలు..
దేశంలో బంగారం, వెండి ధరలు తారుమారయ్యాయి. మళ్లీ పెర...
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు చారిత్రక...
‘కొత్త కరెన్సీ వస్తోంది.. డాలర్కు గుడ్బై’
ప్రముఖ ఇన్వెస్టర్, పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్...
ఇదో అవకాశంగా చూడాలి.. ఆర్బీఐ గవర్నర్
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప...
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీల...
రష్యాకి మరిన్ని ఎగుమతులపై దృష్టి
వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతు...
7 ట్రిలియన్ డాలర్లకు గ్రీన్ ఎకానమీ
అంతర్జాతీయ గ్రీన్ ఎకానమీ (పర్యావరణ అనుకూల రంగాలు)...
ఆటోమొబైల్
టెక్నాలజీ
సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా
సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలిక స్థిరమైన కంపెనీగా ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్.లో సీనియర్ ఉద్యోగులు రాజీనామాలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, కీలక ఇంజినీర్ల ఆకస్మిక, సామూహిక నిష్క్రమణలు కంపెనీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో యాపిల్ వృద్ధిపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.గత వారంలోనే యాపిల్ తన కృత్రిమ మేధ (AI) అధిపతి జాన్ జియానాండ్రియా, ఇంటర్ఫేస్ డిజైన్ చీఫ్ అలాన్ డై తమ పదవి నుంచి నిష్క్రమించారు. వీరితో పాటు జనరల్ కౌన్సిల్ కేట్ ఆడమ్స్, సామాజిక కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ కూడా 2026లో పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు అధికారులు నేరుగా సీఈఓ టిమ్కుక్కు రిపోర్ట్ చేసేవారు.టిమ్కుక్ ప్రయత్నాలు..అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరి కొంతమంది కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాపిల్లో అత్యంత గౌరవనీయమైన, ఇన్-హౌస్ చిప్స్ ప్రాజెక్ట్ హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ సమీప భవిష్యత్తులో పదవి నుంచి నిష్క్రమించాలని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల కుక్కు తెలిపారు. కుక్, స్రూజీని నిలుపుకోవడానికి వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తూ ముఖ్యమైన బాధ్యతలతో సహా దూకుడుగా ప్రయత్నిస్తున్నారు.యాపిల్కు సమస్యఎగ్జిక్యూటివ్ల నిష్క్రమణ ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా ఏఐ ప్రతిభ టెక్ ప్రత్యర్థుల వైపు మళ్లుతుండడం యాపిల్కు మరో పెద్ద సమస్యగా మారింది. మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్., ఓపెన్ఏఐ, వివిధ స్టార్టప్లు యాపిల్ ఇంజినీర్లకు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది సంస్థ ఏఐ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ జనరేటివ్ ఏఐలో ముందుండేందుకు కష్టపడుతోంది.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్లో 10,000 ఉద్యోగాల కోత
తక్కువ ధరలో వచ్చేసిన స్మార్ట్ ఫోన్, ట్యాబ్..
రెడ్మీ తాజాగా ‘రెడ్మీ 15సీ’ పేరుతో మరో 5జీ స్మార్ట్ఫోన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. 6.9 అంగుళాల హెచ్డీ అడాప్టివ్సింక్ డిస్ప్లే, డస్ట్ .. వాటర్ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, (33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్) దీని ప్రత్యేకతలు.మిడ్నైట్ బ్లాక్, మూన్లైట్ బ్లూ, డస్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి రెండేళ్ల ఓఎస్ అప్గ్రేడ్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్లను ఇస్తారు. ధరల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ రేటు రూ.12,499గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 13,999గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 15,499గా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 వచ్చేసింది దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్లో తన కొత్త ‘‘గెలాక్సీ ట్యాబ్ ఏ11’’ టాబ్లెట్ను విడుదల చేసింది. ఇందులో 8.7 అంగుళాల స్క్రీన్, 5100ఎంఏహెచ్ బ్యాటరీ, 6 ఎన్ఎం ఆధారిత ఆక్టా–కోర్ ప్రాసెసర్, 5ఎంపీ కెమెరా, 8జీబీ వరకు ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.పెద్ద ఫైల్స్కు తగినంత స్థలాన్ని చేకూర్చుకునేందుకు 128జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్తో 2టీబీ వరకు విస్తరించకోవచ్చు. క్లాసిక్ గ్రే, సిల్వర్ రంగులలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999 (4జీబీ ర్యామ్ + 64జీబీ)కాగా, గరిష్ట ధర రూ.20,999 (8జీబీ ర్యామ్ + 128 బీజీ)గా ఉంది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లతో పాటు శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్ఫామ్ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి.
ఓపెన్ఏఐని మించిపోనున్న గూగుల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్ ఓపెన్ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్బాట్లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం
పర్సనల్ ఫైనాన్స్
పసిడి ధర మరింత పెరుగుతుందా?
బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా? – శ్రావణి అద్దంకిబంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్ క్లాస్కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు. నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – దీపక్పెట్టుబడిలో తక్కువ రిస్క్ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
సంక్షోభం అంచున ప్రపంచం.. ముందే చెబుతున్నా మీ ఇష్టం
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుడు, ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే హెచ్చరిక చేశారు. 2026 నుంచి అతిపెద్ద మాంద్యం ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచే ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్లో పేర్కొన్నారు.ఉద్యోగ నష్టాలు.. ముందస్తు సంకేతాలుప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకుంటున్న ఉద్యోగ నష్టాలను రాబోయే మహా మాంద్యానికి ముందస్తు సంకేతాలుగా కియోసాకి పేర్కొన్నారు. ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ నివేదికను ఉటంకిస్తూ, నవంబర్లో అమెరికాలో దాదాపు 32,000 ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలతో పాటు, చిన్న వ్యాపారాలు 1,20,000 మంది ఉద్యోగులను తొలగించడం మరింత కలవరానికి గురిచేసిందని అన్నారు.‘2026లో భారీగా ఉద్యోగ తొలగింపులు మొదలవుతాయి. మీ ఉద్యోగం ప్రమాదంలో ఉంటే ఇప్పుడే నా పాఠం #4ని గుర్తుచేసుకోండి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి’ అని కియోసాకి ఉద్యోగులకు హితవు పలికారు.డబ్బు సంపాదించే మార్గాలుమాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. మాంద్యం సమయంలో అమ్మకం నైపుణ్యం అనేది జీవనాధారమవుతుందని, దురదృష్టవశాత్తూ చాలా మంది ఉద్యోగులకు ఈ నైపుణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.రియల్ ఎస్టేట్ క్రాష్2026లో ముఖ్యంగా రెసిడెన్షియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య) రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా క్రాష్ అవుతుందని కియోసాకి హెచ్చరించారు. ‘బేరసారాలు ఉండవు. లైఫ్టైమ్ ఒప్పందాలు మీ కోసం ఎదురుచూస్తాయి. పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండండి’ అని మాంద్యం సమయంలోనే అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉంటాయని ఆయన సూచించారు.కళాశాల డిగ్రీ కంటే నైపుణ్యాలు ఉత్తమంఉపయోగంలేని డిగ్రీల కోసం మళ్లీ కళాశాలకు వెళ్లి రుణాలు తీసుకోవద్దని, దానికి బదులుగా నర్సింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వృద్ధుల సంరక్షణ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నారు. ‘ప్రపంచానికి ఎప్పుడూ ఈ నైపుణ్యాలు కావాలి’ అని అన్నారు.Lesson #4: How to get richer when the economy crashes:ADP just announced 32,000 jobs were lost in November. Those job losses are from big businesses.The frightening news is small businesses laid off 120,000 workers.The bigger lay offs will begin in 2026 when the world…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 4, 2025బంగారం, వెండి, క్రిప్టో.. ఇవే భవిష్యత్తుప్రస్తుతం చెలామణిలో ఉన్న డాలర్ను కియోసాకి మళ్లీ నకిలీ డబ్బుగా అభివర్ణించారు. సంక్షోభ సమయంలో డబ్బును కాపాడుకోవడానికి నిజమైన ఆస్తుల్లో పొదుపు చేయాలని ఆయన సూచించారు. బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథేరియం వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఔన్సుకు 57 డాలర్లుగా ఉన్న వెండి ధర, జనవరి 2026 నాటికి 96 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇదీ చదవండి: విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం
ఉచితంగా క్రెడిట్ స్కోరు.. యస్ బ్యాంక్ మైక్రోసైట్
ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా ’స్కోర్క్యాహువా.బ్యాంక్.ఇన్’ పేరిట మైక్రోసైట్ని ప్రవేశపెట్టింది. క్రెడిట్ స్కోర్ను ఉచితంగా చెక్ చేసుకునేందుకు, రుణాల సంబంధ అంశాలు, క్రెడిట్ ప్రొఫైల్ ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.క్రెడిట్ స్కోర్పై అవగాహన పెంచేందుకు, రుణాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేసేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద దీన్ని రూపొందించినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.ఇందులో ఆర్థిక అంశాల సంబంధిత బ్లాగ్లు, వీడియోలు క్రెడిట్ స్కోరుపై అపోహలు తొలగించే సమాచారం మొదలైనవి ఉంటాయి. ఈ సందర్భంగా నాలుగు టీవీ ప్రకటనలను కూడా బ్యాంకు ఆవిష్కరించింది.
ఇది నేర్చుకుంటేనే బయటపడతారు: కియోసాకి
ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న రాబర్ట్ కియోసాకి.. దాన్నుంచి బయటపడి ధనవంతులు కావాలంటే ఏం చేయాలో 10 సూచనలు ఇస్తానన్నారు. వాటిలో మూడోది ఇప్పుడు వెల్లడించారు. ఈ మేరకు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.కృత్రిమ మేధస్సు త్వరలో మిలియన్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఇటీవలి ట్వీట్లలో వాదించారు. ఇందులో సాంప్రదాయకంగా స్థిరంగా పరిగణించబడే లేదా చట్టం, వైద్యం, వినోదం వంటి విస్తృతమైన విద్య అవసరమయ్యే వృత్తులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ మార్పు చాలా మందిని స్వయం ఉపాధి, ప్రత్యామ్నాయ ఆదాయ నమూనాల వైపు నెట్టివేస్తుంది.అల్లకల్లోలమైన ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడానికి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) అని కూడా పిలువబడే నెట్ వర్క్ మార్కెటింగ్ ఒక మార్గంగా నిలుస్తుందని కియోసాకి వర్ణిస్తున్నారు. అటువంటి వ్యాపారాలు అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.LESSON # 3: How to get richer as global economy crashes.Join a network marketing business.Reasons why a network marketing business will make you richer.AI (Artificial Intelligence) will wipe out millions of jobs even jobs that required lots of schooling like lawyers,…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 3, 2025


