Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Should Family Pay the Loan if The Borrower Dies1
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?

ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భాల్లో మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి?, ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు.. ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.నిజానికి పర్సనల్ లోన్ పొందటానికి దాదాపు ఎలాంటి ఆస్తులకు పూచీకత్తు అవసరం లేదు. కాబట్టి దీనిని అన్‌సెక్యూర్డ్ లోన్ కింద పరిగణిస్తారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లింపు విషయం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.చాలా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్‌తో పాటు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయి. ఆలాంటి ఇన్సూరెన్స్ ఉంటే.. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి లోన్ భారం.. మరణించిన లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై పడదు. ఇన్సూరెన్స్ లేని సందర్భంలో.. కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతనికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తులపై క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఆస్తుల విలువలో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలింది వారసులకు అప్పగిస్తుంది. ఒకవేళా కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తే లోన్ చెల్లించాలి. గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ గ్యారంటర్ దగ్గర నుంచి లోన్ రికవర్ చేస్తుందిఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?ఏ ఆస్తులు లేవు, కో-అప్లికెంట్ లేరు, గ్యారంటర్ లేరు అన్నప్పుడు.. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. దానికి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ మాఫీ చేసే అవకాశం కూడా ఉంది.

If You Dont Use Bank Account What Happens To The Money2
బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఛానళ్లు అకౌంట్ ఉపయోగించకుండా ఉంటే ఏమవుతుంది?, ఖాతాలోని డబ్బును మళ్లీ విత్‌డ్రా చేసుకోవచ్చాయా?, అనే విషయాలు బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు.బ్యాంక్ అకౌంట్‌ను రెండేళ్లు ఉపయోగించకుండా (ఎలాంటి లావాదేవీలు చేయకుండా) ఉంటే.. ఇనాక్టివ్ లేదా డోర్మాంట్ అవుతుంది. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు ఏడాది మాత్రమే. అంటే.. గడువు లోపల చిన్న చిన్న లావాదేవీలైన తప్పకుండా చేసి ఉండాలి. లేకుంటే.. డెబిట్ కార్డు పనిచేయకపోవచ్చు, ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా.. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు చెల్లించాలి ఉంటుంది. కాబట్టి ఖాతాలోని బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది.మీ బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ అయినప్పటికీ.. అకౌంట్‌లో ఉన్న ఎక్కడికీ పోదు. కానీ ఎక్కువ కాలం ఎవరు క్లెయిమ్ చేయకపోతే.. ఖాతాలోని మొత్తం డబ్బు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్' (DEAF)కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు.. కావలసిన కేవైసీ పూర్తి చేసి మళ్లీ మీ ఖాతాలోని డబ్బును తీసుకోవచ్చు.కేవైసీ అప్డేట్ చేయాలంటే..కేవైసీ అప్డేట్ చేసి.. మళ్లీ మీ ఖాతాను యాక్టివేట్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్, పాన్ వంటివాటితో కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత చిన్న మొత్తంలో లావాదేవీలను చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: పెరిగిన ధరలు.. వెండి అవసరం!: మస్క్ ట్వీట్

Elon Musk Retweets X User Post Over China Silver Export Controls and Industrial Impact3
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్

బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

2026 January Bank Holidays Full List4
2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో ఈ రోజుల్లోనే..

2025 డిసెంబర్ నెల ముగుస్తోంది. త్వరలో 2026 జనవరి ప్రారంభం కానుంది. ఈ నెలలో బ్యాంకులకు సుమారు 16 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.➤జనవరి 1: న్యూ ఇయర్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు➤జనవరి 2: మన్నం జయంతి సందర్భంగా ఐజ్వాల్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 3: హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా లక్నోలో బ్యాంకులకు సెలవు➤జనవరి 4: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 10: రెండో శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 11: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా.. కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 14: మకర సంక్రాంతి/మాగ్ బిహు సందర్భంగా.. అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్‌లలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/మాఘే సంక్రాంతి/మకర సంక్రాంతి.. సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు➤జనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 17: ఉళవర్ తిరునాల్ సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 18: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు/సరస్వతీ పూజ (శ్రీ పంచమి)/వీర్ సురేంద్రసాయి జయంతి/బసంత్ పంచమి సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 24: నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 25: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. బ్యాంకులకు సెలవుఅందుబాటులో ఆన్‌లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Woman Receives Termination Email From A Company She Never Worked5
ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ

కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను ఎప్పుడు, ఎందుకు జాబ్ నుంచి తొలగిస్తున్నాయో కూడా తెలియకుండా తీసేస్తున్నాయి. రాత్రిలో మెయిల్స్ పంపిన సంస్థలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా.. ఒక మహిళ తాను పనిచేయని కంపెనీ నుంచి తొలగింపు మెయిల్ పొందింది.సైమన్ ఇంగరి అనే ఎక్స్ యూజర్.. ''నా భార్య ఎప్పుడూ పని చేయని కంపెనీలో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఒక మెయిల్ పొందిందని వెల్లడించారు''. ఈ మెయిల్ చూసిన నా భార్య ఒక్కసారిగా షాకైంది. వచ్చిన మెయిల్.. తాను పనిచేయని కంపెనీ అని తెలుసుకునే లోపే భయానికి గురైందని అన్నారు. అంతే కాకుండా.. ఎవరికైనా ఇలాంటి సందేశాలను పంపే ముందు మెయిల్ ఐడీ జాగ్రత్తగా గమనించాలని హెచ్‌ఆర్‌కు చెబుతూ.. ఇలాంటి తప్పుడు మెయిల్స్ వల్ల ఎవరికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని సూచించారు.ఇదీ చదవండి: సుందర్‌ పిచాయ్‌ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?సైమన్ ఇంగరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆ కంపెనీపై విమర్శలు కురిపిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో పెరుగుతున్న నిర్లక్ష్యం & ఉద్యోగ అభద్రతకు ఇదొక ఉదాహరణ అని చెబుతున్నారు. ఇది చిన్న తప్పు కాదు. ఒక ఉద్యోగి మానసిక స్థితిని దెబ్బతీస్తుందని అన్నారు.My wife received a termination email in 2025 December.Her heart dropped after seeing it. She froze for a second.Did she miss a deadline? Did she say something wrong?Turns out, she just got terminated from a company she didn't even work for.Dear HR, please check the email…— Simons (@Simon_Ingari) December 25, 2025

Robot Dance To Dhurandhar Song At IIT Bombay Techfest6
ధురంధర్ పాటకు రోబో డ్యాన్స్

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త హ్యుమానాయిడ్ రోబోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోబోట్స్ ఎన్నెన్నో అద్భుతాలు చేశాయి. ఇప్పుడు తాజాగా ఒక రోబో డ్యాన్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఐటీ బాంబేలో టెక్‌ఫెస్ట్ 2025లో.. ఒక హ్యూమనాయిడ్ రోబోట్ డ్యాన్స్ వేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీనిని బిద్యుత్ ఇన్నోవేషన్ (Bidyut Innovation) అభివృద్ధి చేసింది. ధురంధర్ సినిమాలోని పాటకు.. అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఈ రోబోట్ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.టెక్‌ఫెస్ట్.. ఆసియాలో అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడతారు. హ్యుమానాయిడ్ రోబోట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవన్నీ.. బ్యాలెన్స్ కంట్రోల్, మోషన్ ప్లానింగ్, రియల్-టైమ్ రెస్పాన్సిబిలిటీ వంటివి పొందుతాయి. View this post on Instagram A post shared by IIT NIT IIIT (@iit__nit__iiit)

Advertisement
Advertisement
Advertisement