ప్రధాన వార్తలు
బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్సైకిల్పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్స్క్రిప్షన్ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్సైట్లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని అహిర్వాన్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల అభిషేక్ యాదవ్.. పాన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. ఇతడు ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తన భార్యకు బంగారు గొలుసు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి కారణంగా ఒకేసారి గొలుసు కొనలేడు. కాబట్టి డబ్బు కూడబెట్టాలనుకున్నాడు. అప్పటి నుంచి నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. ఏడాది పొడువునా రూ.10, రూ. 20నాణేలను కూడబెట్టాడు.మొత్తం కూడబెట్టిన నాణేల బస్తాలను.. బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు. బస్తాలను కౌంటర్లో దగ్గర పెట్టాడు. ఇది చూసిన షాప్ యజమాని మహేష్ వర్మ మొదట ఆశ్చర్యపోయాడు. ఇన్ని నాణేలను బ్యాంకు కూడా తీసుకోదని వర్మ.. అభిషేక్తో చెప్పాడు. కానీ కొంతసేపటి తరువాత అంగీకరించాడు. మొత్తం నాణేలను లెక్కపెడితే.. రూ. 1.05 లక్షలు ఉన్నాయి. దీనిని లెక్కపెట్టడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?అభిషేక్ యాదవ్ తన భార్య కోసం కొన్న గొలుసు రూ. 1.25 లక్షలు. కానీ అతడు తెచ్చిన డబ్బును మహేష్ వర్మ తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల పద్దతిలో కట్టించుకోవడానికి అంగీకరించాడు. మొత్తానికి యాదవ్ తన భార్య కోసం.. బంగారు గొలుసు కొనేసాడు.A Kanpur Paan sellar saves ₹20 Coins daily to buy ₹1 Lakh Gold Chain as a surprise Gift for his Wife.JEWELLER : I was SHOCKED. It took more than two hours to count all the coins 😳MAN : I’ll present it to her when she returns from her Maayka ♥️ pic.twitter.com/Dr0nMX6htj— News Algebra (@NewsAlgebraIND) November 23, 2025
రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,19,900. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఈ ఫోన్ కేవలం 54,900 రూపాయలకే లభించనుంది. అంటే.. రూ. 65,000 తగ్గుతుందన్నమాట.నవంబర్ 22 నుంచి ప్రారంభమైన నవంబర్ 30 వరకు సాగే బ్లాక్ ఫ్రైడే సేల్లో.. ఐఫోన్ ఎయిర్ మొబైల్ తక్కువ ధరలకు అందుబాటులో ఉండనుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఆఫర్స్, ఇతరత్రా ఆఫర్స్ పొందినట్లయితే మీకు రూ. 65000 తగ్గుతుందన్నమాట.ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్స్యాపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5 ఇంచెస్ OLED ప్యానెల్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ పొందిన ఈ ఫోన్ 3,000 నిట్స్ పీక్ అవుట్డోర్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో యాపిల్ ప్రత్యేక 7-లేయర్ యాంటీరిఫ్లెక్టివ్ కోటింగ్ అందించింది. ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్సెట్పై నడుస్తుంది, ఇది ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్లో ఉపయోగించిన అదే శక్తివంతమైన ప్రాసెసర్. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ రియర్ కెమెరా, ముందు భాగంలో, 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ & స్కై బ్లూ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.BSNL పోర్ట్ఫోలియోలో అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ. 500 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని సంస్థ తెలిపింది.రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన ఈ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. యూజర్ అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్/రోజుకు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 72 రోజులు మాత్రమే.72 Days of Smart Savings in One Recharge!BSNL’s ₹485 Plan gives you 72 days of unlimited calls, 2GB/day data & 100 SMS/day.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNL #BSNLRecharge #BSNL4G pic.twitter.com/t6IyOzc0cA— BSNL India (@BSNLCorporate) November 23, 2025ఇప్పటికే రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు
షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 విజయం సాధించిన తరువాత.. షఫాలీ వర్మ కొత్త ఎంజీ సైబర్స్టర్ కారును కొనుగోలు చేశారు. మూడు ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కురాలైన మహిళల్లో ఒకరైన వర్మ.. 2025లో ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టులో భాగంగా ఉండటంతో పాటు 2023 ఆసియా కప్ & 2023 U-19 T20 ప్రపంచ కప్ను గెలుచుకోవడం ద్వారా ఆటలో గణనీయమైన విజయాన్ని సాధించారు. ఇక ఈమె కొనుగోలు చేసిన కారు విషయానికి వస్తే..ఎంజీ సైబర్స్టర్సైబర్స్టర్ అనేది ప్రపంచ మార్కెట్కు ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన మొట్టమొదటి రోడ్స్టర్. దీనిని సంస్థ ప్రీమియం డీలర్షిప్లలో మాత్రమే M9 ఎలక్ట్రిక్ MPVతో విక్రయిస్తోంది. జూలై 2025లో అమ్మకానికి వచ్చినప్పటి నుంచి.. సైబర్స్టర్కు మంచి ఆదరణ లభించింది. ఈ కారు మొదటి రెండు నెలల్లో 250 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. కాగా ఈ కారు కోసం ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలు కావడం గమనార్హం.భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎంజీ రోడ్స్టర్ ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్ మోటార్ AWD పవర్ట్రెయిన్ను కలిగి ఉంటుంది. ఇది 77 kWh బ్యాటరీతో 528 bhp & 725 Nm టార్క్ అందిస్తుంది. ఇది పూర్తి ఛార్జ్పై 580 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ కార్లు ఉన్న దేశాలుమంచి డిజైన్ పొందిన ఈ కారు.. టాప్ రూఫ్తో సరైన స్పోర్ట్స్ కారు మాదిరిగా కనిపిస్తుంది. క్యాబిన్ స్టీరింగ్ వెనుక ట్రై-స్క్రీన్ డిస్ప్లేతో డ్రైవర్-సెంట్రిక్ లేఅవుట్ను కూడా ఉంది. బోస్ ఆడియో సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్ వంటివి ఈ కారులో ఉన్నాయి. సైబర్స్టర్ EV ప్రస్తుతం ధర రూ. 75 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు
పెట్టుబడి సురక్షితంగా ఉండాలనుకునే పెట్టుబడిదారులు.. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, స్థిర రాబడి కూడా పొందవచ్చు. అయితే ఇందులో పెద్ద మొత్తంలో లాభం రాకపోయినా.. నష్టం మాత్రం ఉండదు. అయితే మీకు వచ్చే రాబడి వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథనంలో ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.సాధారణంగా వడ్డీ రేట్లలో పెద్దగా తేడా ఉండదు, కానీ 50 బేసిస్ పాయింట్ల చిన్న వ్యత్యాసం కూడా మీ పెట్టుబడిని గణనీయంగా పెంచుతుంది. లాభం అనేది ముఖ్యంగా పెట్టుబడి పెట్టిన మొత్తం గణనీయంగా ఉన్నప్పుడు & కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లుHDFC బ్యాంక్: ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్పై 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు ఈ బ్యాంక్ కొంత ఎక్కువ వడ్డీ అందిస్తుంది.ICICI బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు.. సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.6% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది.కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు 6.4%, సీనియర్ సిటిజన్లకు 6.9% వడ్డీని అందిస్తుంది. అయితే, 391 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగినప్పుడు.. బ్యాంక్ అత్యధికంగా 6.7%, 7.2% వడ్డీని అందిస్తుంది.ఫెడరల్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు తన మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.7% & సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితాలో ఇది ఒకరి కావడం గమనార్హం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.3% వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 6.8% వడ్డీని అందిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు కొంత ఎక్కువ వడ్డీ (6.45% & 6.95%) అందిస్తుంది.కెనరా బ్యాంక్: ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.25% & సీనియర్ సిటిజన్లకు 6.75 వడ్డీని ఇస్తుంది. అయితే, 444 రోజుల కాలపరిమితి ఉన్నప్పుడు అత్యధిక రేట్లు (6.5% & 7%) పొందవచ్చు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది మూడు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.6% & సీనియర్ సిటిజన్లకు 7.1% వడ్డీని అందిస్తుంది.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!
కార్పొరేట్
యాక్సిస్ బ్యాంక్ శాలరీ ప్రోగ్రాం: వారికోసమే..
తండ్రి అయ్యే వేళ.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమన్న మేనేజర్
ప్రముఖ సంస్థలతో చేతులు కలిపిన హైదరాబాద్ కంపెనీలు
సత్య సాయి సేవలో విఖ్యాత వ్యాపారవేత్తలు
ఐ–బ్యాంకులకు ఐపీవోల పండగ
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్లో..
అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా?
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో
డార్క్ ప్యాటర్న్స్పై 26 సంస్థల సెల్ఫ్ డిక్లరేషన్
వందలాది ఇంజినీర్ల తొలగింపు: 2026లో మరోమారు!
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
బంగారం ధరలలో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ...
బంగారం ధరలు రివర్స్.. వెండి భారీ క్రాష్
దేశంలో బంగారం ధరలు రివర్స్ అయ్యాయి. పసిడి ధరలు చె...
వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమ...
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటాని...
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షల...
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐటీ ఉద్యోగుల జీతాలు.. కొత్త లేబర్ కోడ్
ఐటీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి.. ఇవి కాక అనేక ఇతర ప్రయోజనాలు.. ఆహా జాబ్ అంటే ఐటీ వాళ్లదే అనుకుంటాం. కానీ వాస్తవంలోకి వెళ్తే ఉద్యోగులకు అరకొర జీతాలు.. అదీ నెలనెలా సక్రమంగా ఇవ్వని ఐటీ కంపెనీలు అనేకం ఉన్నాయి. అలాంటి బాధితులకు ఉపశమనం కలగనుంది.దేశంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొత్త లేబర్ కోడ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లేబర్ కోడ్లను తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులకు ప్రతి నెలా 7వ తేదీలోగా జీతం పంపిణీ చేయడం తప్పనిసరి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇకపై జీతాల్లో జాప్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇక మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా కొత్త లేబర్కోడ్ పలు అంశాలను నిర్దేశించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, వేతనంలో లింగ ఆధారిత అసమానత ఉండదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.అంతేకాకుండా నైట్ షిఫ్టులలో పని చేయడం ద్వారా అందే అధిక వేతనాలు, ఇతర ప్రయోజాలను మహిళలు కూడా పొందవచ్చు. ఇందుకు అనుగుణంగా మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులలో పని చేసుకునేలా అన్ని సంస్థలలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.వీటన్నింటితో పాటు పరిశ్రమ-నిర్దిష్ట కోడ్ ప్రకారం.. వేధింపులు, వివక్ష, వేతన సంబంధిత వివాదాలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ నిర్ణీత కాల ఉపాధి, నియామక పత్రాలు అందించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను ప్రకటించింది.ఇది చదివారా?: కొత్త జాబ్ ట్రెండ్స్.. ప్రయోగాత్మక పని విధానాలు
ఒప్పో నుంచి సరికొత్త ఫైండ్ ఎక్స్9 సిరీస్
ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్ ఎక్స్9 సిరీస్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వేరియంట్ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఒప్పో ఈ–స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.హాసెల్బ్లాడ్తో కలిసి రూపొందించిన కొత్త తరం కెమెరా సిస్టం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన పనితీరు మొదలైన విశేషాలు ఇందులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే హాసెల్బ్లాడ్ టెలీకన్వర్టర్ కిట్ రూ. 29,999కి లభిస్తుంది. ఇక, లేటెస్ట్ టీడబ్ల్యూఎస్ ఎన్కో బడ్స్3 ప్రోప్లస్ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,899గా ఉంటుంది.హాసెల్బ్లాడ్తో భాగస్వామ్యంఫైండ్ ఎక్స్9 సిరీస్లో ప్రధాన ఆకర్షణ హాసెల్బ్లాడ్తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెన్ కెమెరా సిస్టమ్. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుభవానికి దగ్గరగా ఉండే రంగులు, కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా టెలిఫోటో ఫోటోగ్రఫీ కోసం హాసెల్బ్లాడ్ టెలీకన్వర్టర్ కిట్ కూడా పరిచయమైంది.మెరుగైన బ్యాటరీ, పనితీరుఫైండ్ ఎక్స్9 సిరీస్ స్మార్ట్ఫోన్లలో బలమైన ప్రాసెసర్, ఆప్టిమైజ్డ్ సాఫ్ట్వేర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, నిరంతర మల్టీటాస్కింగ్ సామర్థ్యం, హై–ఎండ్ గేమింగ్కు సరిపడే పనితీరు ఈ డివైస్లను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.
పాకిస్థాన్ వ్యవస్థలకు డిజిటల్ షాక్!
సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ, భారత్పై పదే పదే విషం చిమ్మే పాకిస్థాన్కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ (Indian Cyber Force) అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లోలం అవుతోంది.ఏమేమి లీక్ అయ్యాయి?‘ఇండియన్ సైబర్ ఫోర్స్’(ICF) అందించిన వివరాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ఆపరేషన్లో పాకిస్థాన్కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావడం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడి.పోలీసు రికార్డులు, పాస్పోర్ట్ డేటా: పౌరుల వ్యక్తిగత, గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా (2.2 జీబీ), పాస్పోర్ట్ వివరాలు బహిర్గతమయ్యాయి.Pakistan Railway Employee Data (name, father name, mother name, employee, cnic, address ) & Land Management(name, father name, mother name, shop name, cnic, address ) Data Breached! (Maintenance system)Remember the name "Indian Cyber Force" #PakistanRailwayHacked… pic.twitter.com/kWR1eF5srZ— Indian Cyber Force (@CyberForceX) November 20, 2025ఆర్థిక డేటా: ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల CNIC (జాతీయ ఐడీలు), పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్ రికార్డులు ఉన్నాయి.Police Record Verification Data OF Pakistan Breached! 2.2 GB Data Le*akedIncluded: Passports, Electricity Bills etc Greetz to: solveig#IndianCyberForce#OperationHuntDownPorkies pic.twitter.com/Z4NtYVl2ZB— Indian Cyber Force (@CyberForceX) November 19, 2025రైల్వే: పాకిస్థాన్ రైల్వే ఉద్యోగుల వివరాలు (పేరు, తల్లిదండ్రుల పేర్లు, CNIC, చిరునామా), ల్యాండ్ మేనేజ్మెంట్ (భూమి నిర్వహణ) డేటా లీక్ అయ్యింది.విద్యుత్తు, ఫార్మసీ: విద్యుత్ బిల్లుల సమాచారం, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ఫార్మసీ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా సున్నితమైన డేటా (బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్వర్డ్లు) బహిర్గతమైంది.We have breached Pakistan Pharmacy Company, Next Pharmaceutical pk 24 GB+ data exfiltrated. Exposes: Company name, Bank Account, Private Emails, Passwords, Documents Check: https://t.co/fL4C6GJPNW#IndianCyberForce pic.twitter.com/TqXG4Ag4KR— Indian Cyber Force (@CyberForceX) November 5, 2025విద్య: టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ట్రైనింగ్ అథారిటీ (TEVTA) సైట్ కూడా హ్యాక్ చేశారు.ఆపరేషన్ సింధూర్-ర్యాన్సమ్వేర్ దాడి: ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ అధికారిక వెబ్సైట్ల సర్వర్లపై రాన్సమ్వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్లను ఎన్క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది.వ్యవస్థల నిర్లక్ష్యం: పాకిస్థాన్ వైఫల్యంఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. CNICలు(జాతీయ ఐడీలు), పన్ను రికార్డులు, పోలీసు డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్నది బహిరంగ రహస్యం.ఆర్థిక అనిశ్చితి ప్రభావంఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి.పౌరుల గోప్యతకు ప్రమాదంఈ లీక్ల ద్వారా పాకిస్థాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే, సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా దీటైన సమాధానం ఇవ్వగలదని ఈ సంఘటన రుజువు చేసింది.ఈ ఆపరేషన్ పాకిస్థాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్.. తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవడం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా, డిజిటల్ రంగంలో కూడా గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని పంపుతుంది.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
ఆధార్ డేటాపై హాట్మెయిల్ కోఫౌండర్ సంచలన ఆరోపణలు
భారత పౌరుల ఆధార్ డేటా భద్రతపై హాట్ మెయిల్ కోఫౌండర్ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్ డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు ఈ డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియా ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.‘మొత్తం ఆధార్ డేటాబేస్ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు ఓ కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించింది’ భాటియా తన పోస్ట్లో పేర్కొన్నారు.భారత ఆధార్ డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.సబీర్ భాటియా ఆధార్ వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్ డిజైన్, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో ఓ పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్ నిర్మాణానికి 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్ డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్ కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్ ఆథెంటికేషన్ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు. There’s a story doing the rounds that the entire Aadhaar database has been stolen by crypto criminals, with data of 815M people reportedly on sale for $80,000. I can’t confirm if this is true… but it does highlight the risks of designing complex systems without deep technical…— Sabeer Bhatia (@sabeer) November 19, 2025
పర్సనల్ ఫైనాన్స్
ట్రేడింగ్లో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు ఆర్బీఐ హెచ్చరిక
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్పట్ల జాగ్రత్త వహించవలసిందిగా ఇన్వెస్టర్లను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన ఆర్బీఐ కొత్తగా అలర్ట్ లిస్ట్లో 7 ప్లాట్ఫామ్స్ను జత చేసింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్నెట్ ఎఫ్ఎక్స్, క్యాప్ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్, ట్రైవ్, ఎన్ఎక్స్జీ మార్కెట్స్, నార్డ్ ఎఫ్ఎక్స్ చేరాయి.విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999(ఫెమా) ప్రకారం జాబితాలోని సంస్థలకు అధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతిలేకపోవడంతోపాటు.. ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్(ఈటీపీలు)ను సైతం నిర్వహించేందుకు వీలులేదని కేంద్ర బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా జాబితాలోని సంస్థలు, ప్లాట్ఫామ్స్, వెబ్సైట్లు ప్రకటనల ద్వారా అనధికారిక ఈటీపీలను ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించింది. శిక్షణ, అడ్వయిజరీ సర్వీసులందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటున్నాయని తెలియజేసింది.
నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములా
సరైన ఆదాయం పొందాలంటే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక ఉత్తమమైన మార్గం. 11-12-20 ఫార్ములా ప్రకారం.. ఇందులో పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.11-12-20 ఫార్ములాఈ ఫార్ములా ప్రకారం.. నెలకు 11,000 రూపాయలు 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే, 12 శాతం రిటర్న్తో రూ. కోటి పొందవచ్చు.20 సంవత్సరాలు.. నెలకు రూ. 11000 చొప్పును పెట్టుబడిగా పెడితే మొత్తం రూ. 26.40 లక్షలు అవుతుంది. 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే.. మీరు చక్రవడ్డీ రూపంలో మరో రూ.83.50 లక్షల ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు + వచ్చిన చక్రవడ్డీ రెండూ కలిపితే.. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీకు వచ్చే రిటర్న్స్ బాగున్నప్పుడే.. ఎక్కువ ఆదాయం వస్తుంది.మీ పెట్టుబడికి ఎక్కువ లాభం రావడానికి కారణం.. చక్రవడ్డీ. ఎందుకంటే మీ పెట్టుబడి కంటే.. ఎక్కువ వడ్డీ రూపంలోనే యాడ్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి.. ఆ పెట్టుబడికి వచ్చిన వడ్డీపై కూడా మీరు రిటర్న్స్ ఆశించవచ్చు. ఈ కారణంగానే మీరు 20 ఏళ్లలో భారీ ఆదాయం ఆశించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడికి లాంగ్ టర్న్ ఉత్తమమైన ఎంపిక.NOTE: పెట్టుబడి పెట్టడం అనేది.. మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి.
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్ ప్రొఫెషనల్స్), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్ జెడ్) తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.1980 తర్వాత పుట్టిన వారికి..1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.ఆరోగ్య సమస్యలువయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్నెస్) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.1997-2007 మధ్య పుట్టిన యువతఈ జనరేషన్ జీ/మిలీనియల్స్కు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.ఆర్థిక బాధ్యతలుఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.దీర్ఘకాలిక రక్షణతక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..
ఆరోగ్యం అత్యంత విలువైన ఆస్తి. అందుకే, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పాలసీ తీసుకునే క్రమంలో బీమా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను, ముఖ్యంగా పాలసీదారునికి ప్రతికూలంగా ఉండే అంశాలను చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. పాలసీ తాలూకు నిజమైన నిబంధనలు, పరిమితులు కప్పిపుచ్చడం వల్ల క్లెయిమ్ సమయంలో పాలసీదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏజెంట్లు కావాలనే దాచే లేదా ఎక్కువగా చెప్పని అంశాలేమిటో చూద్దాం.కో-పేమెంట్ నిబంధనచాలా పాలసీల్లో కో-పేమెంట్ నిబంధన ఉంటుంది. దీని ప్రకారం ఆసుపత్రి బిల్లులో నిర్ణీత శాతాన్ని (ఉదాహరణకు, 10% లేదా 20%) పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల ప్లాన్లలో ఇది సర్వసాధారణం. ఏజెంట్లు ఈ ముఖ్యమైన ఆర్థిక భారాన్ని విస్మరిస్తారు.వెయిటింగ్ పీరియడ్స్బీమా పాలసీని కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ప్రభావితం చేస్తాయి. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు (కొన్ని ప్రత్యేక ప్రమాదాలు మినహా) వరకు ఎలాంటి అనారోగ్యానికి క్లెయిమ్ చేయలేరు. కీళ్ల నొప్పులు, క్యాటరాక్ట్, హెర్నియా వంటి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు 1 లేదా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వెంటనే ఈ వ్యాధులకు క్లెయిమ్ రాదని ఏజెంట్లు స్పష్టంగా చెప్పరు.రూమ్ రెంట్ క్యాపింగ్చాలా ప్లాన్లలో బీమా మొత్తం ఆధారంగా రోజువారీ గది అద్దెపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాలసీలో బీమా మొత్తంలో 1% మాత్రమే రూమ్ అద్దెగా నిర్ణయించవచ్చు. దీని అర్థం రూ.5 లక్షల పాలసీకి రోజుకు గరిష్టంగా రూ.5,000 మాత్రమే గది అద్దె కింద చెల్లిస్తారు. మీరు అంతకంటే ఖరీదైన గదిని ఎంచుకుంటే అధిక అద్దెతో పాటు గది అద్దెతో సంబంధం ఉన్న ఇతర ఖర్చులలో కొంత భాగాన్ని (ఉదాహరణకు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు) పాలసీదారుడే భరించాల్సి వస్తుంది.క్లెయిమ్ తిరస్కరణదరఖాస్తు ఫామ్లో పాలసీదారుని మునుపటి ఆరోగ్య చరిత్ర, శస్త్రచికిత్సలు, తీసుకుంటున్న మందుల గురించి తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వడం వల్ల క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏజెంట్లు పాలసీ త్వరగా ఆమోదం పొందాలనే ఉద్దేశంతో దాచమని సలహా ఇస్తారు. ఇది క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణం అవుతుంది.సబ్ లిమిట్స్కొన్ని చికిత్సలు లేదా సర్వీసులపై బీమా కంపెనీ నిర్దిష్ట పరిమితులు విధిస్తుంది. ఉదాహరణకు, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు రూ.40,000 మించి చెల్లించరు. అంబులెన్స్ ఛార్జీలకు రూ.2,000 మించి చెల్లించరు. మీరు ఆ చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా పరిమితి మేరకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది.కవర్ కాని అంశాలుసౌందర్య చికిత్సలు (Cosmetic Treatment), అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు, అప్పుడే పుట్టిన శిశువుల చికిత్స ఖర్చులు (కొన్ని వారాల వరకు), నాన్-మెడికల్ వస్తువులు (గ్లోవ్స్, మాస్కులు, టూత్ బ్రష్, పౌడర్ మొదలైనవి) వంటి అనేక అంశాలను పాలసీ కవర్ చేయదు. ఈ మినహాయింపుల జాబితాను ఏజెంట్లు చాలా అరుదుగా వివరిస్తారు.పాలసీదారులు ఏం చేయాలి?బీమా పాలసీ గురించి ఏజెంట్ మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా డాక్యుమెంట్ను పూర్తిగా చదవాలి.నిబంధనలు, షరతులు, మినహాయింపులు, కో-పేమెంట్ సెక్షన్లను పరిశీలించాలి.పాలసీ పత్రాలు అందిన తర్వాత 15 రోజుల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు పాలసీ నచ్చకపోతే పూర్తి డబ్బు వెనక్కి తీసుకొని రద్దు చేసుకోవచ్చు.వెయిటింగ్ పీరియడ్స్, కో-పేమెంట్, రూమ్ రెంట్ క్యాపింగ్ గురించి ఏజెంట్ను స్పష్టంగా అడిగి ఈమెయిల్ రూపంలో సమాచారం పొందాలి.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం


