Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

MG Windsor EV crossed landmark of 50000 sales in India within 400 days automobile1
400 రోజుల్లో 50,000 యూనిట్ల అమ్మకాలు

కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యూటిలిటీ వెహికల్ (CUV) ఎంజీ విండ్సర్ అమ్మకాలు కీలక మైలురాయి చేరుకున్నట్లు ప్రకటించింది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. గణాంకాల ప్రకారం ప్రతి గంటకు సగటున 5 యూనిట్ల ఎంజీ విండ్సర్ కార్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇది కంపెనీకి చారిత్రక విజయాన్ని సూచించడమే కాకుండా, భారతదేశంలో ఈవీ విభాగంలో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి ఈవీగా విండ్సర్‌ నిలిచిందని కంపెనీ తెలిపింది.ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ..‘విండ్సర్ ఈవీని ప్రారంభించినప్పుడు వినియోగదారులకు స్టైలిష్, విలువ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విండ్సర్ ఈవీ వేగంగా విజయం సాధించింది. రికార్డు సమయంలో 50,000 అమ్మకాలను చేరింది. ఈ విజయం న్యూ ఎనర్జీ వాహనాల పట్ల కంపెనీ నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి శక్తినిస్తుంది’ అన్నారు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తయారు చేసిన పరిమిత ఎడిషన్ సిరీస్ ఎంజీ విండ్సర్ ఇన్‌స్పైర్‌ను ఇటీవల భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు.ఎంజీ విండ్సర్ ఫీచర్లుఈ కారు 100 KW శక్తిని 200 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. దీని ప్రారంభ BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యూచరిస్టిక్ ఏరోగ్లైడ్ డిజైన్‌తో పాటు 135 డిగ్రీల వరకు వాలే ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: డ్రైవర్‌ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!

if ChatGPT down due try alternatives2
చాట్‌జీపీటీ డౌన్‌ అయితే పరిస్థితేంటి?

ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare)లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విస్తృతంగా అంతర్గత సర్వర్ లోపాలు (Internal Server Errors) ఏర్పడటానికి ఇది దారితీసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్‌ఫామ్‌ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యూఎస్‌, యూరప్, ఆసియాలో ఈ అంతరాయం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ అంతరాయం కారణంగా X (గతంలో ట్విట్టర్), స్పాటిఫై.. వంటి కీలక సేవలతో పాటు OpenAI ChatGPT సేవలు కూడా కొద్ది సమయం నిలిచిపోయాయి.క్లౌడ్‌ఫ్లేర్ సమస్య కారణంగా ChatGPTని సందర్శించిన వినియోగదారులకు ‘దయచేసి ముందుకు సాగడానికి challenges.cloudflare.com అన్‌బ్లాక్ చేయండి’ అనే సందేశం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జనరేటివ్‌ ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న చాట్‌జీపీటీ(క్లాడ్‌ఫ్లెయిర్‌ ఇన్‌ఫ్రా వాడుతుంది) సర్వీసులు మధ్యంతరంగా నిలిచిపోతే పనులు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయాలు చూద్దాం.గూగుల్ జెమినిగూగుల్ జెమిని అధునాతన మోడల్స్‌తో రూపొందించారు. గూగుల్‌ సెర్చ్‌కు రియల్ టైమ్ కనెక్షన్ కలిగి ఉంది. దీని కారణంగా ఇది ఎల్లప్పుడూ అప్‌డేటెడ్‌, రియల్‌టైమ్‌ సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్‌, డాక్స్‌, డ్రైవ్‌ వంటి గూగుల్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం కలిగి ఉంటుంది.ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐక్లాడ్ ఏఐ సెక్యూరిటీ, కచ్చితత్వం, నైతిక ఏఐ మోడల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇది long context documents నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.మైక్రోసాఫ్ట్ కోపైలట్మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంతర్లీనంగా చాట్‌జీపీటీలాగే అదే జనరేటివ్‌ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్‌లో(Word, Excel, PowerPoint, Outlook) ఇంటర్నల్‌గా ఉండే ఏఐ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫ్లోలో ఉన్నవారు కార్పొరేట్ పత్రాలను రూపొందించడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది అనువైనది.జాస్పర్ ఏఐజాస్పర్ ఏఐ ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది బ్లాగ్‌లు, కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, మార్కెటింగ్ కాపీలు అందిస్తుంది. మార్కెటర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్‌ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!

Ankur Warikoo revealed his driver earns Rs53350 per month praise dignity3
డ్రైవర్‌ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!

ప్రముఖ కంటెంట్ క్రియేటర్లలో ఒకరైన అంకుర్ వారికూ తన డ్రైవర్ వేతనం, కుటుంబంలో అతనికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తూ సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకూ నెటిజన్లు దృష్టిని ఆకర్షించేలా ఆయన చేసిన పోస్ట్‌ ఏమిటో చూద్దాం.అంకుర్‌ వారికూ చేసిన పోస్ట్‌లోని వివరాలు..‘దయానంద్ భయ్యా(డ్రైవర్‌) తాజా వార్షిక ఇంక్రిమెంట్‌తో అతని నెలవారీ వేతనం రూ.53,350కు చేరింది. దీనికి ఇన్సూరెన్స్, ఒక నెల దీపావళి బోనస్, తాజాగా ఇచ్చిన స్కూటీ అదనం. అతను 13 సంవత్సరాల క్రితం రూ.15,000 నెలవారీ వేతనంతో ఈ ఉద్యోగంలో చేరారు. తాను కేవలం డ్రైవర్ మాత్రేమే కాదు. మా కుటుంబంలో ఒకరు. నమ్మకమైన వ్యక్తి. అతని వద్ద ఇంటి తాళాలు ఉంటాయి. మా ఏటీఎం పిన్ నంబర్లు కూడా తనకు తెలుసు. అతను అత్యంత సమయపాలన, క్రమశిక్షణ గల వ్యక్తి. రోజూ ఉదయం 4:30 గంటలకు మేల్కొని, రాత్రి 8:30 గంటలకు నిద్రపోతారు. దయానంద్ భయ్యా ముగ్గురు పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, సంతోషంగా వివాహం చేసుకున్నారు. రాబోయే 5-6 సంవత్సరాల్లో అతని జీతం నెలకు రూ.1 లక్షకు చేరుకోవాలని ఆశిస్తున్నాను’ అని వారికూ అన్నారు.2024లో రూ.16.84 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన గుర్‌గావ్‌కు చెందిన వారికూ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. సూరజ్ బాలకృష్ణన్ అనే ఒక యూజర్ ‘ఉద్యోగులతో ఇలా సరైన మార్గంలో వ్యవహరించాలి. నిన్ను చూసి గర్వంగా ఉంది అంకుర్’ అని రాశారు. మరొకరు, ‘రోజువారీ సహాయం చేసే వారిని విస్మరించే ఈరోజుల్లో నిజంగా గౌరవంతో చూస్తున్నారు. మీరు మీ డ్రైవర్‌పట్ల చాలా విధేయతతో ఉన్నారు. ఉద్యోగుల నమ్మకం, కృషిని గుర్తించడం చాలా సంతోషం’ అని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: బ్యాటరీలతోనే బ్యాటరీలు తయారీ!

how EV battery recycling strengthens energy security automobile4
బ్యాటరీలతోనే బ్యాటరీలు తయారీ!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం వేగవంతమవుతున్న నేపథ్యంలో వీటికి శక్తినిచ్చే లిథియం-అయాన్ బ్యాటరీల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈవీల ఉత్పత్తి పెరిగే కొద్దీ పనికిరాని బ్యాటరీల సంఖ్య కూడా భారీగా పేరుకుపోతుంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వీటిని సరైన రీతిలో నిర్వహించకపోతే పర్యావరణానికి పెనుముప్పు తప్పదు. అయితే, ఈ బ్యాటరీల నిర్వహణనే ఒక భారీ ఆర్థిక అవకాశంగా కొన్ని కంపెనీలు మలుచుకుంటున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. త్వరలోనే ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ వేల కోట్ల డాలర్ల వ్యాపారంగా అవతరించనుంది.పెరుగుతున్న బ్యాటరీల వాడకంఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలే ప్రధానం. ఇంధన ధరల పెరుగుదల, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల నేపథ్యంలో అన్ని దేశాలూ ఈవీల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా అధిక శక్తి సాంద్రత, ఎక్కువ శ్రేణి(Range)ని అందించే అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు నిరంతరం కొత్త రసాయన ఫార్ములాలు ఉపయోగిస్తూ బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. అయితే వాహనం జీవితకాలం ముగిసిన తర్వాత లేదా బ్యాటరీ సామర్థ్యం తగ్గిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించాలనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ప్రస్తుతానికి పాత బ్యాటరీల నిర్వహణ గందరగోళంగా ఉంది.బ్యాటరీల రీసైక్లింగ్ఈవీ బ్యాటరీలను పర్యావరణ హితంగా రీసైకిల్ చేయడం సంక్లిష్ట ప్రక్రియ. వీటిలో విలువైన లోహాలు (కోబాల్ట్, నికెల్, లిథియం, మాంగనీస్) ఉంటాయి. ఈ లోహాలను తిరిగి వెలికి తీయడం రీసైక్లింగ్ ప్రధాన లక్ష్యం. అందుకు రెండు పద్ధతులను ఉపయోగిస్తున్నారు.హైడ్రోమెటలర్జీఇది అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి. ముందుగా బ్యాటరీలను సురక్షితంగా విడిభాగాలుగా చేసి, పొడిగా చేస్తారు. తర్వాత శక్తివంతమైన రసాయన ద్రావణాలను (యాసిడ్స్) ఉపయోగించి చూర్ణం పొడి పదార్థాన్ని కరిగిస్తారు. ఈ ద్రావణం నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన లోహాలను వేరుచేసి, శుద్ధి చేస్తారు. దీనివల్ల అధిక స్వచ్ఛత కలిగిన పదార్థాలను తిరిగి పొందవచ్చు.పైరోమెటలర్జీఈ ప్రక్రియను స్మెల్టింగ్ అని కూడా అంటారు. ఇందులో బ్యాటరీ భాగాలను నేరుగా అధిక ఉష్ణోగ్రతల వద్ద (సుమారు 1500 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ) కాల్చివేస్తారు. ఈ ప్రక్రియలో ప్లాస్టిక్, కార్బన్ వంటి పదార్థాలు కాలిపోతాయి. విలువైన లోహాలు ద్రవ రూపంలోకి మారి లోహ మిశ్రమం (Alloy)గా ఏర్పడతాయి. ఈ మిశ్రమం నుంచి కోబాల్ట్, నికెల్‌లను తిరిగి పొందుతారు. ఇందులో బ్యాటరీలను పూర్తిగా విడదీయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రతలు వెలువడడంతో లిథియంను తిరిగి పొందడం కష్టమవుతుంది.పైన తెలిపిన పద్ధతులతో పాటు కేవలం లోహాలను భౌతికంగా వేరుచేసే డైరెక్ట్ రీసైక్లింగ్ వంటి నూతన పద్ధతులపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.రీసైకిల్ చేయకపోతే కలిగే నష్టాలుపనితీరు తగ్గిపోయిన ఈవీ బ్యాటరీలను రీసైకిల్ చేయకుండా పారవేయడం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుంది. బ్యాటరీలలో ఉండే భారీ లోహాలు, విషపూరిత రసాయనాలు (ఉదా: లిథియం లవణాలు, ఎలక్ట్రోలైట్స్) భూమిలోకి, జల వనరులలోకి చేరి నీటిని, నేలను కలుషితం చేస్తాయి. పాత బ్యాటరీలను కాల్చివేసినా లేదా అవి శిథిలమైనా ప్రమాదకరమైన వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి.లిథియం-అయాన్ బ్యాటరీలు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. పారవేసిన ప్రదేశాల్లో ఇవి మండే ప్రమాదం ఉంది. రీసైకిల్ చేయకపోతే బ్యాటరీల్లోని కోబాల్ట్, నికెల్, లిథియం వంటి కీలకమైన ఖనిజ వనరులు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కొత్త బ్యాటరీల తయారీకి కేవలం మైనింగ్ మీదే ఆధారపడాల్సి వస్తుంది.రీసైక్లింగ్ వల్ల లాభాలుబ్యాటరీ రీసైక్లింగ్ కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, ఆర్థికంగా పరిశ్రమకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. లిథియం, కోబాల్ట్ వంటి లోహాల నిల్వలు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. రీసైక్లింగ్ ద్వారా ఈ విలువైన ముడిసరుకును దేశీయంగా తిరిగి పొందవచ్చు. ఇది సరఫరా గొలుసుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మైనింగ్, శుద్ధి ప్రక్రియలతో పోలిస్తే రీసైక్లింగ్ ద్వారా లోహాలను పొందడం దీర్ఘకాలంలో చౌకైన పద్ధతిగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు, రీసైకిల్ చేసిన కోబాల్ట్ కొత్తగా తవ్విన కోబాల్ట్ కంటే సుమారు 25% తక్కువ ఖర్చుతో లభించవచ్చని అంచనా. బ్యాటరీ రీసైక్లింగ్ అనేది కొత్త పరిశ్రమ. దీని నిర్వహణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.

Aadhaar cards soon to be issued with only photo QR code5
ఆధార్‌ కార్డుల్లో కొత్త మార్పులు..!!

ఆధార్‌ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్‌లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం ​కార్డుదారు ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన సరళీకృత ఆధార్ కార్డును జారీ చేసే విషయాన్ని యూఐడీఏఐ పరిశీలిస్తున్నదని ఆ సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.ఆఫ​్‌లైన్ స్టోరేజ్ లేదా ఆధార్ నంబర్ల వాడకాన్ని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అనేక సంస్థలు ఇప్పటికీ ఆధార్ ఫోటోకాపీలను సేకరిస్తున్నాయని ఆయన అన్నారు. హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బ్యాంకులు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆఫ్‌లైన్ ధృవీకరణను తగ్గించచడానికి, అలాగే వ్యక్తిగత గోప్యతను రక్షిస్తూ ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి డిసెంబర్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యూఐడీఏఐ యోచిస్తోంది.“కార్డుపై ఏవైనా వివరాలు ఎందుకు ఉండాలి? కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది ‍కదా అన్న ఆలోచన ఉంది. మనం ఎలా ప్రింట్ చేసిన కార్డులను ప్రజలు అలా అంగీకరిస్తూనే ఉంటారు. దుర్వినియోగం చేయాలనుకునే వారు వాటిని అలా చేస్తూనే ఉంటారు” అని సీఈఓ భువనేష్ కుమార్ అన్నారు.ఆధార్ కార్డు కాపీల ద్వారా జరిగే ఆఫ్‌లైన్ ధృవీకరణను పూర్తిగా అరికట్టే నిబంధన కూడా సిద్ధమవుతుందని, దీనిపై ప్రతిపాదనను డిసెంబర్ 1న యుఐడీఏఐ పరిశీలనకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. “ఆధార్‌ను డాక్యుమెంట్‌గా ఉపయోగించరాదు. ఆధార్ నంబర్ ద్వారా ప్రామాణీకరించాలి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించాలి. లేనిపక్షంలో నకిలీ పత్రం అయి ఉండే ప్రమాదం ఉంది,” అంటూ కుమార్ స్పష్టం చేశారు.ఆధార్‌ కొత్త యాప్‌ తీసుకొస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థలు తదితర వాటాదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్ ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరచనుందని, ఇది సుమారు 18 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందని యూఐడీఏఐ భావిస్తోంది.

SBI chairman calls for national financial grid6
ఎస్‌బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!

మోసాలను కట్టడి చేసే దిశగా ఫైనాన్షియల్‌ వ్యవస్థలోని అన్ని భాగాలను అనుసంధానం చేసేలా జాతీయ ఫైనాన్షియల్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రతిపాదించారు. ఇందులో క్రెడిట్‌ బ్యూరోలు, ఫ్రాడ్‌ రిజిస్ట్రీలు, ఈ–కేవైసీ సదుపాయాలు, ఏకీకృత చెల్లింపుల ప్లాట్‌ఫాం, అకౌంట్‌ అగ్రిగేటర్లు మొదలైన వర్గాలు ఉండొచ్చని చెప్పారు.సీఐఐ ఫైనాన్సింగ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలన్నీ కలిసి ఇండియన్‌ డిజిటల్‌ పేమెంట్‌ ఇంటెలిజెన్స్‌ కార్పొరేషన్‌ పేరిట లాభాపేక్షరహిత సంస్థను ఏర్పాటు చేయొచ్చని శెట్టి చెప్పారు. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పరిశ్రమ భాగస్వాములకు రియల్‌–టైమ్‌లో డేటాను అందించగలిగే ఉమ్మడి డిజిటల్‌ మౌలిక సదుపాయంగా ఇది ఉండాలని పేర్కొన్నారు.మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టెక్నాలజీ వ్యవస్థను సమీక్షించాలని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ ఆశీష్‌ పాండే చెప్పారు. ఉద్యోగులకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడం మొదలైనవి పరిశ్రమకు కీలక సవాళ్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement