Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

L TMRHL AND TUCKIT LAUNCH SMART LOCKER SOLUTIONS ACROSS HYDERABAD METRO STATIONS1
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్స్: కేవలం 30 సెకన్లలో..

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్.. టక్కీట్ సహకారంతో.. మొత్తం లేదు మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్లను ప్రారంభించింది. ఇది ప్రయాణికుల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్టోరేజ్ లాకర్లు.. హెల్మెట్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు & ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవచ్చు. చేతిలో వస్తువులు లేకుండా.. తిరగాలనుకునే ప్రయాణికులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ప్రారంభోత్సవం.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో జరిగింది.ఎలా ఉపయోగించుకోవాలంటే?లాకర్ ప్యానెల్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మీ వస్తువులు ఎన్ని ఉన్నాయి, ఎంత పరిమాణంలో లాకర్ కావాలనే విషయాన్ని ఎందుకోవాలి. మీరు ఎంతసేపు మీ వస్తువులను అక్కడ ఉంచాలో.. దానికి డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం కేవలం 30 సెకన్లలోపు పూర్తవుతుంది.ఏడు మెట్రో స్టేషన్స్మియాపూర్అమీర్‌పేట్పంజాగుట్టLB నగర్ఉప్పల్పరేడ్ గ్రౌండ్హై-టెక్ సిటీ

Honda Amaze Bags 5 Star Safety Rating At Bharat NCAP Crash Test Know The Full details Here2
సేఫ్టీలో 5 స్టార్.. సురక్షితమైన కారుగా అమేజ్!

మూడవ తరం హోండా అమేజ్.. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్-టెస్ట్ ప్రోగ్రామ్ కింద.. పెద్దల ప్రయాణీకులకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ & పిల్లల ప్రయాణీకులకు 4-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కుటుంబ సెడాన్‌లలో ఒకటిగా నిలిపింది.క్రాష్ టెస్టింగ్‌లో హోండా అమేజ్ గొప్ప ఫలితాలను సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 14.33 పాయింట్లు. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 16కి 14.00 స్కోర్ చేసి.. మొత్తం అడల్ట్ సేఫ్టీ టెస్టులో 24కి 23.81 స్కోర్ సాధించింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, లోడ్ లిమిటర్‌లతో కూడిన బెల్ట్ ప్రిటెన్షనర్లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ సీట్ల కోసం ISOFIX మౌంట్‌లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లుపిల్లల సేఫ్టీ విషయంలో.. అమేజ్ CRS ఇన్‌స్టాలేషన్‌లో 12/12 స్కోర్‌ను సాధించింది. ఈ సెడాన్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్, రియర్ డీఫాగర్ అండ్ చైల్డ్-సేఫ్టీ లాక్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణంలో రక్షణ కల్పిస్తాయి.

Employee With 26000 Rupees Salary Buys iPhone Worth Rs 700003
రూ. 26వేల జీతం.. ₹70000 ఐఫోన్: మండిపడుతున్న నెటిజన్స్

ఈ రోజుల్లో ఐఫోన్ కొనుగోలు చేయడం అనేది.. చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. ఈ కారణంగానే కొత్త మోడల్ మార్కెట్లోకి రాగానే ఎగబడిమరీ కొనేస్తుంటారు. ధరలు ఎంత ఉన్నప్పటికీ.. తగ్గేదే అన్నట్టు ఈఎంఐ ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల రూ. 26వేలు జీతం ఉన్న వ్యక్తి.. రూ. 70000 ఐఫోన్ కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీకి చెందిన కవల్జీత్ సింగ్ (ఖడక్ సింగ్ దా ధాబా కో ఫౌండర్, ది చైనా డోర్ ఫౌండర్) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. రూ. 26,000 జీతం ఉన్న తన ఉద్యోగి రూ. 70,000 ఐఫోన్‌ను ఎలా కొన్నారో వివరించారు. తన ఉద్యోగి ఇంత బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం.. తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు.ఐఫోన్ కొన్న ఉద్యోగి.. తన కంపెనీలో డెలివరీ డ్రైవర్‌గా చేరారని, కొన్ని సంవత్సరాలలోనే అతడు స్థానిక కార్యకలాపాలను చూసుకుంటున్నారని కవల్జీత్ సింగ్ అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సంస్థ నుంచి రూ. 14000 అడ్వాన్స్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని 12 నెలల ఈఎంఐ ఆప్షన్ కింద చెల్లింపు ఎంచుకున్నాడు.తన జీతం రూ. 26000, ఇప్పుడు ఐఫోన్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాడు, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నాడు. అయితే అతనిపై తన ముగ్గురు పిల్లలు, భార్య ఆధారపడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అతడు ఐఫోన్ కొనడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని కవల్జీత్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు అతని నిర్ణయాన్ని తప్పుపట్టారు. మరికొందరు కవల్జీత్ సింగ్ తక్కువ జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని.. తాను తీసుకునే నిర్ణయం తప్పు అని చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు.One of my Operations Manager with 26k salary has just bought a ~70 k iPhone.His financing plan⬇️1 month salary advance from us14k cash payment30k online financing with approx 3k monthly EMI for 12 months.& btw he has 3 kids & a dependent wife at homeMind= Blown !— Kawaljeet Singh (@kawal279) November 26, 2025

Apple Noida Store to Open on 2025 Dec 114
డిసెంబర్ 11న మరో యాపిల్ స్టోర్: ఈసారి ఎక్కడంటే?

భారతదేశంలో యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ నోయిడాలో యాపిల్ స్టోర్ ప్రారభించడానికి సన్నద్ధమైంది. దీనిని 2025 డిసెంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో.. కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్‌లెట్‌. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్‌ను ప్రారంభించనుంది.డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్.. నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్‌ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్ మరియు బెంగళూరులోని హెబ్బాల్‌లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌తో సహా.. యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.బెంగళూరు, పూణేలలో యాపిల్ కొత్త అవుట్‌లెట్‌లను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ ఇప్పుడు నోయిడా స్టోర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీకి మన దేశంలో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.యాపిల్ తన మొదటి రెండు ఇండియా స్టోర్‌లను.. ముంబైలోని BKC & ఢిల్లీలోని సాకేత్‌లలో ఏప్రిల్ 2023లో ప్రారంభించింది. ఈ రెండు స్టోర్‌ల నుంచి తొలి ఏడాదే.. రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అత్యంత బలమైన పనితీరు కనబరిచిన అవుట్‌లెట్‌లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 60 శాతం అమ్మకాలు చిన్న సాకేత్ స్టోర్ ద్వారా జరిగాయి.ఇదీ చదవండి: రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్

AI Agent Leaks Startup Secret and Zoho CEO Tweet Viral5
రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్

నేడు అన్ని రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది.జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu)కు.. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా?, అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది.నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) అని, ఏఐ ఏజెంట్‌గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొంది, అని శ్రీధర్ వెంబు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.I got an email from a startup founder, asking if we could acquire them, mentioning some other company interested in acquiring them and the price they were offering. Then I received an email from their "browser AI agent" correcting the earlier mail saying "I am sorry I disclosed…— Sridhar Vembu (@svembu) November 28, 2025

Key Highlights of Q2 GDP FY26 July september 20256
ఊహించిన దాని కంటే మెరుగైన వృద్ధి

భారత ఆర్థిక వ్యవస్థ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) అనూహ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 5.6% వృద్ధి కంటే గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఇది కొన్ని సర్వేలు అంచనా వేసిన 7.3 శాతం వృద్ధి రేటును మించిపోయింది.ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్ధీకరణ వస్తువుల వినియోగాన్ని పెంచుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక సగటున 4.1% పెరిగింది (గత సంవత్సరం 2.7%), తయారీ ఉత్పత్తి 4.9% పెరిగింది (గత సంవత్సరం 3.3%) అన్నారు.మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి కారణంగా గ్రామీణ వ్యయం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో సుమారు 60% వాటాను కలిగి ఉన్న గృహ వినియోగం బలపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ మూలధన వ్యయం 31% పెరిగింది. ఇది మునుపటి త్రైమాసికంలో 52% పెరుగుదల కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ, సంవత్సరం క్రితం నమోదైన 10% వృద్ధి కంటే మెరుగ్గా ఉంది.సరుకుల ఎగుమతులు 8.8% పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 7% తగ్గుదలను ఈ గణాంకాలు తిప్పికొట్టాయి. యూఎస్ సుంకాల అమలు కంటే ముందు ఫ్రంట్ లోడెడ్ షిప్‌మెంట్ల ద్వారా ఈ పెరుగుదల నమోదైంది.జీఎస్టీ కోతలతో పెరిగిన డిమాండ్భారతదేశం సెప్టెంబర్ 22 నుంచి చాలా వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో ఇది వినియోగాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ జీఎస్టీ తగ్గింపులు అమల్లోకి రాకముందే గృహోపకరణాలు, కిరాణా సామాగ్రికి డిమాండ్ పెరిగినట్లు కొన్ని సంస్థలు నివేదికలు రూపొందించాయి. జీఎస్టీ పునర్వ్యవస్థీకరణ వల్ల సామాన్య ప్రజలకు రూ.2 లక్షల కోట్లు మిగులనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ అదనపు డబ్బు భవిష్యత్తులో వినియోగాన్ని మరింతగా పెంచడానికి దోహదపడుతుంది.ఆందోళన కలిగించే అంశాలుఅద్భుతమైన జీడీపీ వృద్ధి సాధించినప్పటికీ కొన్ని ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని రాయిటర్స్ నివేదించింది. ముఖ్యంగా పట్టణ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు వెనుకబడుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ డిమాండ్ పుంజుకున్నప్పటికీ స్థిరమైన, సమగ్రమైన వృద్ధికి పట్టణ డిమాండ్, ప్రైవేట్ రంగ పెట్టుబడుల పునరుద్ధరణ కూడా కీలకం.ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

Advertisement
Advertisement
Advertisement