Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

NBFC AUM to grow at 19percent, cross Rs 50 lakh crore next fiscal Year1
ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 18% వృద్ధి

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) తమ నిర్వహణ ఆస్తుల్లో 18 శాతం వృద్ధిని కొనసాగిస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. కొన్ని విభాగాల్లో రుణపరమైన ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈమేరకు వృద్ధి సాధ్యమేనని పేర్కొంది. మొత్తం మీద ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2027 మార్చి నాటికి రూ.50 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. కస్టమర్‌ లెవరేజ్‌ అధికమైన నేపథ్యంలో (సామర్థ్యానికి మించి రుణ భారం) ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ, అన్‌సెక్యూర్డ్‌ రుణ విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీలు రిస్క్‌ను సమతుల్యం చేస్తూ వృద్ధిని సాధించడంపై దృష్టి సారిస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు. వ్యక్తిగత రుణాల్లో 25 శాతం వృద్ధి.. → వ్యక్తిగత రుణాలలో (ఎన్‌బీఎఫ్‌సీ ఏయూఎంలో 11 శాతం) వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 18 శాతం నుంచి 22–25 శాతానికి పెరుగుతుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2023–24లో నమోదైన 37 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. → జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో ఉండడం రిటైల్‌ రుణాల డిమాండ్‌ను పెంచుతుందని తెలిపింది. → ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో అన్‌సెక్యూర్డ్‌ ఎంఎస్‌ఎంఈ రుణాలు 6 శాతంగా ఉంటాయంటూ, ఇందులో సకాలంలో చెల్లింపులు చేయని రుణాలు పెరుగుతున్నట్టు పేర్కొంది. దీని ఫలితంగా ఏయూఎంలో వృద్ధి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఉన్న 31 శాతం నుంచి 13–14 శాతానికి తగ్గనున్నట్టు వెల్లడించింది. → ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 15 శాతం వాటా కలిగిన లోన్‌ ఎగైనెస్ట్‌ ప్రాపర్టీ (ప్రాపర్టీ తనఖాపై రుణం) రుణాల్లో 26–27 శాతం వృద్ధి ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో నమోదు అవుతుందని అంచనా వేసింది. – బంగారం రుణ విభాగం (ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 6 శాతం) ఇక ముందూ బలమైన వృద్ధిని కొనసాగిస్తుందని తెలిపింది. బంగారం రుణ మార్కెట్‌ అసంఘటిత రంగం నుంచి సంఘటితం వైపు మళ్లుతుండడం, ఈ విభాగం విస్తరణకు మద్దతునిస్తుందని పేర్కొంది.

December As Eight IPOs Line Up to Raise Over Rs30,000 Crore in India2
లిస్టింగ్‌కు 3 కంపెనీలు రెడీ

న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ ఈ క్యాలండర్‌ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు దూసుకెళుతున్నాయి. నిజానికి 2024లో 76 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా ఉమ్మడిగా రూ. 1.53 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే మెయిన్‌బోర్డులో 93 కంపెనీలు రూ. 1.54 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో మరో మూడు కంపెనీలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం. ఏఐ సొల్యూషన్స్‌ ఎండ్‌టు ఎండ్‌ ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సొల్యూషన్లు అందించే ఫ్రాక్టల్‌ అనలిటిక్స్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 1,279 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 3,621 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 4,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో క్వినాగ్‌ బిడ్కో రూ. 1,463 కోట్లు, టీపీజీ హోల్డింగ్స్‌ రూ. 2,000 కోట్లు, జీఎల్‌ఎమ్‌ కుటుంబ ట్రస్ట్‌ రూ. 129 కోట్లు విలువైన షేర్లను ఆఫర్‌ ఆఫర్‌ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ కంపెనీ ఫ్రాక్టల్‌ యూఎస్‌ఏలో పెట్టుబడులు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, ఆర్‌అండ్‌డీ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వెచి్చంచనుంది. సాస్‌ కంపెనీ సాస్‌ సర్వీసులందించే అమాగీ మీడియా ల్యాబ్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 1,020 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రస్తుత వాటాదారులు 3.41 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 667 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. కార్డియాక్‌ స్టెంట్స్‌ 2001లో ఏర్పాటైన మెడికల్‌ పరికరాల తయారీ కంపెనీ సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు రానుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.76 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేర్లు ఆఫర్‌ చేయనున్న సంస్థలలో శ్రీ హరి ట్రస్ట్, సమారా క్యాపిటల్‌ మార్కెట్స్‌ హోల్డింగ్, కొటక్‌ ప్రీఐపీవో అపార్చునిటీస్‌ ఫండ్‌ తదితరాలున్నాయి. కంపెనీ ప్రధానంగా కార్డియాక్‌ స్టెంట్స్‌ను తయారు చేస్తోంది. కంపెనీ భారత్, థాయ్‌లాండ్‌లలో రెండు ఆర్‌అండ్‌డీ కేంద్రాలను నిర్వహిస్తోంది.

Blocking Not Enough To Stop Spam Calls, Report On DND App3
నంబర్‌ బ్లాక్‌ చేస్తే సరిపోదు

న్యూఢిల్లీ: స్పామ్‌ కాల్స్‌ని ఆపేందుకు ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ చేయడంతో సరిపెట్టొద్దని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది. ట్రాయ్‌ డీఎన్‌డీ (డు నాట్‌ డిస్టర్బ్‌) యాప్‌ ద్వారా ఆ నంబర్ల గురించి ఫిర్యాదు చేయాలని సూచించింది. డీఎన్‌డీ యాప్‌ ద్వారా వచి్చన ఫిర్యాదుల ఆధారంగా స్పామ్, మోసపూరిత మెసేజీలతో సంబంధమున్న సుమారు లక్ష ఎంటీటీలను (సంస్థలు, వ్యక్తులు), 21 లక్షలకు పైగా మొబైల్‌ నంబర్లను డిస్కనెక్ట్, బ్లాక్‌లిస్ట్‌ చేశామని పేర్కొంది. యూజర్లు ఏదైనా స్పామ్‌ కాల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ గురించి యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే వాటిని ట్రేస్‌ చేసేందుకు, నిర్ధారించుకునేందుకు, శాశ్వతంగా మొబైల్‌ నంబర్లను డిస్కనెక్ట్‌ చేసేందుకు ట్రాయ్‌ అలాగే టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లకి వీలవుతుందని తెలిపింది. అలా కాకుండా వ్యక్తిగతంగా బ్లాక్‌ చేయడమనేది ఆ డివైజ్‌కి మాత్రమే పరిమితమవుతుందని, స్కామర్లు ఇతరులను కాంటాక్ట్‌ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూజర్లంతా కలిసికట్టుగా ఫిర్యాదులు చేస్తే, దేశవ్యాప్తంగా టెలికం సేవల దురి్వనియోగాన్ని అరికట్టవచ్చని వివరించింది.

Enforcement Directorate has frozen Rs 523 crore in deposits to online gamings4
గేమింగ్‌ సంస్థల డిపాజిట్లు ఫ్రీజ్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలకు చెందిన రూ. 523 కోట్లను ఫ్రీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. ఇటీవల రియల్‌ మనీ గేమింగ్‌ని నిషేధించిన తర్వాత ఆ మొత్తాన్ని ప్లేయర్లకు రిఫండ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయా కంపెనీలు తమ దగ్గరే అట్టే పెట్టుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. విన్‌జో, గేమ్స్‌క్రాఫ్ట్‌ తదితర గేమింగ్‌ కంపెనీల డిపాజిట్లు వీటిలో ఉన్నాయి. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా నవంబర్‌ 18–22 మధ్య ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లోని నిర్దేశ నెట్‌వర్క్స్‌ (ఎన్‌ఎన్‌పీఎల్‌), గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ (జీటీపీఎల్‌), విన్‌జో గేమ్స్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రియల్‌ మనీ గేమ్స్‌లో (ఆర్‌ఎంజీ) మనుషులతో కాకుండా సాఫ్ట్‌వేర్‌తో ఆడుతున్న విషయాన్ని కస్టమర్లకు తెలియనివ్వకుండా విన్‌జో అనైతిక వ్యాపార విధానాలు అమలు చేసిందని, క్రిమినల్‌ కార్యకలాపాలు నిర్వహించిందని ఈడీ ఆరోపించింది. గేమర్లకు రిఫండ్‌ చేయాల్సిన మొత్తాన్ని తమ ఖాతాల్లో అట్టే పెట్టుకుందని పేర్కొంది. గేమ్స్‌క్రాఫ్ట్‌పై కూడా ఇదే తరహా ఆరోపణలున్నట్లు వివరించింది.

Which Fund is Good for Fixed Income Know The Experts Opinion5
స్థిరమైన ఆదాయానికి ఏ ఫండ్‌ మంచిది..?

నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. స్థిరమైన ఆదాయం కోసం లిక్విడ్‌ ఫండ్‌ లేదా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – నివేష్‌ పటేల్‌లిక్విడ్‌ ఫండ్స్‌ స్థిరత్వంతో, తక్కువ రిస్‌్కతో ఉంటాయి. కనుక షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌తో పోలి్చతే సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం లిక్విడ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. లిక్విడ్‌ ఫండ్స్‌పై మార్కెట్‌ అస్థిరతలు పెద్దగా ఉండవు. లిక్విడ్‌ఫండ్స్‌ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు.లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్‌స్టంట్‌గా అదే రోజు వెనక్కి తీసుకునేందుకు (నిరీ్ణత మొత్తం) కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అనుమతిస్తున్నాయి. లేదంటే మరుసటి రోజు అయినా పెట్టుబడులు చేతికి అందుతాయి. వీటిల్లో రాబడి ఎంతన్నది ముందుగానే అంచనాకు రావొచ్చు. షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి యూనిట్‌ నెట్‌ అసెట్‌ వ్యాల్యూ (ఎన్‌ఏవీ)లో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. కనుక ఇది నెలవారీ ఉపసంహరించుకునే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మేరకు రిస్క్‌ కూడా అధికంగా ఉంటుంది.నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు హెల్త్‌ రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం ఉంది. అయినా, వ్యక్తిగతంగా ఒక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం మంచి ఆలోచనేనా? – రేణుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు హెల్త్‌ కవరేజీ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ఎంపానెల్డ్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు పరిహారం పొందొచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగా చికిత్సలకు సైతం రీయింబర్స్‌మెంట్‌ పొందొచ్చు. వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు కుడా పరిహారం వస్తుంది. కాకపోతే ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితం. అయితే, ప్రభుత్వ ఆమోదం పొందిన ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉందో, అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోండి.ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన, రోబోటిక్‌ వంటి అత్యాధునిక చికిత్సలను తమకు ఇష్టమైన ఆస్పత్రిలో పొందాలని కోరుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కనీసం రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవాలి. అది కూడా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి హెల్త్‌ ట్రాక్‌ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో–పే షరతుకు అంగీకరించాల్సి వస్తుంది. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సదుపాయం అధిక శాతం చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ రూపంలోనే ఉంటుంది. కనుక ముందుగా తాము చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వద్ద క్లెయిమ్‌ దాఖలు చేసి పొందగలరు. అదే వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఉంటే అవసరమైన సందర్భంలో నగదు రహిత చికత్సను దాని కింద పొందొచ్చు.ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Fact Check Of RBI Rs 5000 Notes6
త్వరలో రూ.5000 నోట్లు!.. స్పందించిన కేంద్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.5000 నోట్లను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.సోషల్ మీడియాలో రూ.5000 నోట్లకు సంబంధించి, వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఐదు వేలరూపాయల నోట్ల విషయంలో ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆర్ధిక అంశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. సామజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు స్పష్టం చేసింది.ప్రస్తుతం భారతదేశంలో రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండువేల రూపాయల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్‌ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్‌ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.⚠️ सतर्क रहें ⚠️सोशल मीडिया पर दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक द्वारा ₹5000 के नए नोट जारी किए जाएंगे#PIBFactCheck✅ यह दावा #फर्जी है✅@RBI द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है✅ आधिकारिक वित्तीय जानकारी हेतु वेबसाइट https://t.co/e6gEcOvLu3 पर विजिट करें pic.twitter.com/EF82vaxMvE— PIB Fact Check (@PIBFactCheck) November 24, 2025

Advertisement
Advertisement
Advertisement