Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

govt considering restoring senior citizen railway concessions in Budget 20261
బడ్జెట్ 2026: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?

త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్-19 సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.ఆరేళ్ల నిరీక్షణకు తెర పడనుందా?రైల్వే రాయితీల పునరుద్ధరణపై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సీనియర్‌ సిటిజన్‌ ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది.గతంలో ఉన్న రాయితీ వివరాలు..పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 40 శాతం రాయితీ.మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 50 శాతం రాయితీ.వర్తించే తరగతులు: స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి దాదాపు అన్ని క్లాసుల్లో ఈ సదుపాయం ఉండేది.రాయితీ నిలిపివేతకు కారణాలేంటి?మార్చి 2020లో కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో రైల్వే ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు ఈ రాయితీలను రద్దు చేశారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీల వల్ల భారతీయ రైల్వేపై ఏటా రూ.1,600 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని, రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడినప్పటికీ ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రాయితీలను పునప్రారంభించలేదు.బడ్జెట్ 2026పై ఆశలుప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్లు మళ్లీ పాత పద్ధతిలోనే వయసు ధ్రువీకరణ ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా కౌంటర్లలో రాయితీ టికెట్లు పొందవచ్చు.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Reliance resume importing Russian crude from February 20262
రష్యా నుంచి మళ్లీ చమురు దిగుమతి

ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫిబ్రవరి నుంచి రష్యా ముడి చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించనుంది. దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చే లక్ష్యంతో రోజుకు సుమారు 1,50,000 బ్యారెళ్ల వరకు రష్యన్ చమురును కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. గోవాలో జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్’ సందర్భంగా రిలయన్స్ ఉన్నతాధికారి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు.ఆంక్షలకు లోబడే కొనుగోళ్లుగతంలో రష్యా చమురు దిగ్గజాలైన రోస్ నెఫ్ట్, లుకోయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ గత డిసెంబర్ తర్వాత రష్యా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ప్రస్తుతం అమెరికా ఆంక్షల పరిధిలోకి రాని విక్రేతలు, వాణిజ్య మధ్యవర్తుల ద్వారా తిరిగి రష్యా నుంచి చమురును సేకరించాలని రిలయన్స్ భావిస్తోంది. ‘ఫిబ్రవరి, మార్చి నెలల్లో అంతర్జాతీయ నిబంధనలు, ఆంక్షలకు లోబడి ఉన్న రష్యన్ చమురును రిలయన్స్ కొనుగోలు చేయనుంది’ అని రాయిటర్స్ నివేదిక తెలిపింది.జామ్ నగర్ రిఫైనరీ సామర్థ్యంగుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో రోస్ నెఫ్ట్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం రోజుకు 5,00,000 బ్యారెళ్ల వరకు రష్యా చమురును దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రిలయన్స్ తన సరఫరా వనరులను వైవిధ్యపరుచుకుంటోంది.టర్మ్ డీల్స్ ద్వారా నిరంతర సరఫరా కోసం సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. కొంతభాగం ఉత్తర అమెరికా-​కెనడా నుంచి చమురు సేకరిస్తోంది. వెనిజువెలా ముడి చమురును తిరిగి దిగుమతి చేసుకునేందుకు అమెరికా అనుమతి కోసం రిలయన్స్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Gold and Silver rates on 30th January 2026 in Telugu states3
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

budget2026-viksitbharat-middleclass-hopes4
బడ్జెట్ 2026: వికసిత్‌ భారత్ దిశగా అడుగులు!

భారత జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతున్న వేళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోని వివరాల ప్రకారం.. ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు మాత్రమే కాదు, సామాన్యుడి ఆశల ప్రతిరూపంగా ఉండనుందనే అంచనాలున్నాయి.వేతన జీవులకు..కేంద్ర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు అనేది వేతన జీవులకు అత్యంత కీలకమైన అంశంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే తగ్గింపు. అంటే, మొత్తం వార్షిక ఆదాయం నుంచి ఎటువంటి ఖర్చులు చూపించాల్సిన అవసరం లేకుండానే ఈ మొత్తాన్ని నేరుగా మినహాయించుకోవచ్చు.పెంపు ఎందుకు అవసరం?గత కొన్ని ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రూ.75,000 (గత సవరణల ప్రకారం) స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుత జీవన వ్యయానికి సరిపోవడం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగుల చేతిలో ఖర్చు చేయడానికి మరింత నగదు మిగులుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచి జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది.మౌలిక సదుపాయాలకు బూస్ట్దేశాభివృద్ధికి మౌలిక వసతులే కీలకమని నమ్ముతున్న కేంద్రం ఈసారి మూలధన వ్యయం (Capital Expenditure) కేటాయింపుల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గడువును పెంచడం ద్వారా స్థానికంగా రోడ్లు, బ్రిడ్జిల వంటివాటి నిర్మాణం వేగవంతం అవుతుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) మరింత విస్తరించనున్నారు.యువత - ఉపాధిరాబోయే రోజుల్లో లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగ వేటలో పడనున్నారు. దీన్ని ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రధానంగా జౌళి (Textiles), పర్యాటకం, ఈ-కామర్స్ రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీలు ఉండొచ్చు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఎంఎస్‌ఎంఈచిన్న తరహా పరిశ్రమల ఆర్థిక ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్‌ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని మరింత సరళతరం చేస్తూ కొలేటరల్(పూచీకత్తు) లేకుండా రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి ఎగుమతి సుంకాల్లో సడలింపులు ఉండవచ్చు.వ్యవసాయం, గ్రామీణ వికాసంవాతావరణ మార్పుల ధాటికి తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రస్తుత తక్షణ అవసరం.రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని(‍ప్రస్తుతం ఏటా రూ.6000) పెంచాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది.భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల వినియోగం, ఆధునిక గోదాముల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘అందరికీ ఇల్లు’ లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహ నిర్మాణ రంగానికి అదనపు కేటాయింపులు చేయనున్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

stock market updates on 30th january 20265
బడ్జెట్‌ సెషన్‌కు ముందు ఊగిసలాడుతున్న నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 167 పాయింట్లు తగ్గి 25,247 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 522 పాయింట్లు నష్టపోయి 82,071 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 30-01-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Key Highlights from JLL India Office Leasing Report 20256
ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం

భారత కార్యాలయ వసతుల లీజింగ్‌లో (ఆఫీస్‌ స్పేస్‌) అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతోంది. 2025లో దేశ వ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో 58 శాతం మేర ఆఫీస్‌ వసతులను అంతర్జాతీయ కంపెనీలే లీజింగ్‌కు తీసుకున్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది దేశవ్యాప్తంగా టాప్‌–7 నగారల్లో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగి 83.3 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) చేరింది. ఇందులో 48.6 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని అంతర్జాతీయ కంపెనీలు తీసుకున్నాయి. 2024లో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 77.2 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, కోల్‌కతా నగరాల్లోని లీజింగ్‌ను విశ్లేషించిన అనంతరం జేఎల్‌ఎల్‌ ఇండియా ఈ వివరాలు విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వ్యూహాత్మక వ్యాపార కేంద్రంగా భారత్‌ స్థానం మరోసారి రుజువైనట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌ నైపుణ్యాలున్న మానవ వనరుల లభ్యతకుతోడు ప్రముఖ నగరాల్లో అందుబాటు ధరలకే ప్రీమియం ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడుల దిశగా ఆకర్షిస్తున్నట్టు తెలిపింది. 60 శాతం జీసీసీల్లోనే..అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో గేతడాది 48.6 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ వసతులను అద్దెకు తీసుకుంటే.. అందులో 31.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల్లోనే (జీసీసీలు) ఉండడం గమనార్హం. 7 నగరాల్లో గతేడాది మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో దేశీ సంస్థలు 34.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని లీజుకు తీసుకున్నాయి. అంతర్జాతీయ సంస్థల వ్యాపార విస్తరణకు బెంగళూరు అత్యంత ప్రాధాన్య నగరంగా ఉంది. భారత ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ మార్కెట్‌లో జీసీసీలు ప్రముఖ శక్తిగా ఉన్నట్టు జేఎల్‌ఎల్‌ భారత ఎండీ రాహుల్‌ అరోరా పేర్కొన్నారు. గతేడాది ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో కోవర్కింగ్‌ ఆపరేటర్లు కూడా కీలక పాత్ర పోషించినట్టు జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది. భవిష్యత్‌కు వీలైన పని ప్రదేశాలుగా, నిపుణుల లభ్యత, నిర్వహణ సౌలభ్యంతో జీసీసీలు కీలకంగా మారినట్టు భైవ్‌ వర్క్‌స్పేస్‌ సీఈవో శేష్‌ రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

Advertisement
Advertisement
Advertisement