Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and silver hit records1
వారెవ్వా ఏమి జోరు..

న్యూఢిల్లీ: రోజుకో రికార్డు నెల కొల్పుతున్న వెండి, బంగారం మరోసారి దూకుడు ప్రదర్శించాయి. కేజీ వెండి ధర రూ. 6,000 జంప్‌చేసి రూ. 2,71,000ను తాకింది. ఈ బాటలో స్థానిక(ఢిల్లీ) మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ. 400 పెరిగి రూ. 1,45,000కు చేరింది. ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వివరాల ప్రకారం వెండి అన్ని పన్నులు కలుపుకుని, పూర్తి స్వచ్చత కలిగిన బంగారం ధరలివి. వెరసి మరోసారి పసిడి, వెండి చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అస్థిరతలు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు బులియన్‌ వర్గాలు మరోసారి తెలియజేశాయి.అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులకోసం ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలవైపు చూసే సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతోపాటు.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌లు, అసెట్‌ మేనేజర్స్‌ పసిడిలో ఇన్వెస్ట్‌ చేస్తుంటే.. వెండికి సోలార్, ఈవీ, ఎల్రక్టానిక్స్‌ తదితర ఇండ్రస్టియల్‌ డి మాండ్‌ సైతం జత కలుస్తోంది. 2 రోజుల్లో రూ. 21,000 గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్‌ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది.అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్‌ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్‌ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్‌ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్‌ కామెక్స్‌ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్‌) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం!

India car colour preference: Black dominates2
‘జెన్‌’ ఇన్‌ బ్లాక్‌

ఎన్ని రంగులు ఉన్నా తెల్ల రంగు కారు అందమే వేరు. ఆకర్షణీయమైన, ప్రశాంతమైన లుక్, అధిక రీసేల్‌ వేల్యూలాంటి అంశాల కారణంగా దశాబ్దాలుగా తెల్ల కార్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. కానీ ఇప్పుడు దాని స్థానాన్ని క్రమంగా నల్ల రంగు కార్లు ఆక్రమిస్తున్నాయి. జేటో డైనమిక్స్‌ డేటా ప్రకారం గత అయిదేళ్లుగా వార్షికంగా తెల్ల కార్ల ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు తగ్గాయి. 2021లో అమ్ముడైన మొత్తం కార్లలో వీటి వాటా 43.9 శాతంగా ఉండగా, 2025లో 40.7 శాతానికి పడిపోయింది. అదే సమయంలో నల్ల రంగు కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.2021లో 14.8 శాతంగా ఉన్న వీటివాటా 2025లో దాదాపు 20.76 శాతానికి ఎగిసింది. పరిశ్రమ సగటుతో పోలిస్తే నల్ల రంగు కార్ల అమ్మకాలు గత అయిదేళ్లుగా భారీగా వృద్ధి చెందాయని మారుతీ సుజుకీ వర్గాలు తెలిపాయి. జెనరేషన్‌ జెడ్, యువ కొనుగోలుదార్లలో ప్రీమియం ఎడిషన్లు, బ్లాక్‌ కలర్‌ కార్లపై ఆసక్తి పెరిగిందని పేర్కొన్నాయి. హ్యుందాయ్‌ మోటర్స్‌ 2021లో దేశీయంగా నమోదు చేసిన అమ్మకాల్లో నల్ల కార్ల వాటా 9 శాతంగా ఉండగా 2024 నాటికి (జనవరి–నవంబర్‌) ఇది 19 శాతానికి పెరిగింది. వ్యక్తిత్వాన్ని వ్యక్తపర్చేందుకు ఉపయోగపడే సాధనంగా కారు మారిందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. దీనితో ఆత్మవిశ్వాసం, ప్రీమియం లుక్‌ ఉట్టిపడే రంగుల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. మారుతున్న అభిరుచులు, మార్కెటింగ్‌ వ్యూహాలు.. కొనుగోలుదారుల మారుతున్న అభిరుచులు, కార్ల కంపెనీలు అనుసరించే వ్యూహాలతో కూడా నలుపు రంగుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రీమియం, లైఫ్‌స్టయిల్‌ ఆధారిత సెగ్మెంట్లలో ముదురు వర్ణాలను ఇండివిడ్యువాలిటీ, హోదా, ఆధునికతకు ముడిపెట్టి ఆటోమొబైల్‌ కంపెనీలు వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. హై ఫ్యాషన్, లగ్జరీ ఉత్పత్తులుగా వాటిని మార్కెటింగ్‌ చేస్తున్నాయి. తయారీపరంగా కూడా మిగతా తేలికపాటి రంగులతో పోలిస్తే నలుపు రంగుతో పెయింటింగ్‌ ప్రక్రియ సరళంగా పూర్తవుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.నలుపు రంగు అనేది దుమ్మును, చిన్న చిన్న గీతలను అంతగా కనిపించకుండా చేయగలదని వివరించాయి. 2025లో దేశీయంగా అమ్ముడైన మొత్తం స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల్లో (ఎస్‌యూవీ) దాదాపు 30 శాతం వాటా వాహనాలు నలుపు రంగు వాటిది కాగా, హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది 6.77 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే యువతరం బోల్డ్‌ స్టయిల్‌ స్టేట్‌మెంట్‌గా నలుపు రంగును ఎంచుకుంటుండగా, పెద్దవారు కాస్త తేలికపాటి రంగులను ఎంచుకుంటున్నారు. వేడిమిని ఎక్కువగా గ్రహించే స్వభావం, భారత్‌లో వేడి వాతావరణంలో మెయింటెనెన్స్‌పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ మాస్‌ మార్కెట్‌ కొనుగోలుదారులు నలుపు ఎస్‌యూవీలను దూకుడుగా కనిపించే స్టయిల్‌ కోసం ఎంపిక చేసుకుంటుండగా, లగ్జరీ కొనుగోలుదార్లు హోదాకు చిహ్నంగా ఎంచుకుంటున్నారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్

No more 10 minute delivery from Blinkit and Swiggy3
క్విక్‌ డెలివరీకి బ్లింకిట్‌ బై..

న్యూఢిల్లీ: డెలివరీ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆందోళనల నడుమ క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ ’10 నిమిషాల్లో డెలివరీ’ నినాదాన్ని పక్కన పెట్టింది. జెప్టో, ఇన్‌స్టామార్ట్‌లాంటి మిగతా సంస్థలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలివరీ అగ్రిగేటర్‌ సంస్థలతో గత వారం భేటీ అయిన కేంద్ర కార్మీక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇచ్చిన సూచనల మేరకు కంపెనీలు ’10 మినిట్‌’ డెలివరీ డెడ్‌లైన్‌ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మాండవీయ సారథ్యంలో జరిగిన సమావేశంలో బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీలాంటి దిగ్గజాలు పాల్గొన్నాయి.బ్లికింగ్ట్‌ సత్వరం ఆదేశాలను అమలు చేస్తూ తమ బ్రాండింగ్‌ నుంచి 10 నిమిషాల్లో డెలివరీ హామీని తొలగించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికి తగ్గట్లుగా కంపెనీ తన బ్రాండ్‌ మెసేజింగ్‌ని కూడా అప్‌డేట్‌ చేసింది. ‘10 నిమిషాల్లో 10,000 పైగా ఉత్పత్తుల డెలివరీ‘ హామీని ‘మీ ఇంటి ముంగిట్లోకే 30,000కు పైగా ఉత్పత్తుల డెలివర్‌ అవుతాయి‘ అని మార్చింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని, 10 మినిట్స్‌ ఇన్‌స్టంట్‌ డెలివరీ సిస్టమ్‌కు స్వస్తి పలకడాన్ని గిగ్, ప్లాట్‌ఫాం సర్విస్‌ వర్కర్ల యూనియన్‌ స్వాగతించింది. 10 నిమిషాల డెలివరీని వ్యతిరేకిస్తూ గిగ్‌ వర్కర్లు నూతన సంవత్సరం రోజున దేశీయంగా సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.

govt consider monthly wage ceiling for EPFO and ESIC coverage4
ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వేతన పరిమితి పెంపు?

దేశంలోని కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం ఉంది. ఉద్యోగుల సామాజిక భద్రతా పథకాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ), ఈఎస్‌ఐసీ (ఉద్యోగుల స్టేట్‌ బీమా సంస్థ)ల వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ రెండు సంస్థల వేతన పరిమితిని నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య స్థాయికి పెంచాలని భావిస్తోంది.ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీల మధ్య వేతన పరిమితుల్లో భారీ వ్యత్యాసం ఉంది.ఈపీఎఫ్‌ఓ పరిమితి: నెలకు రూ.15,000 (ఇది 2014 సెప్టెంబర్ నుంచి మార్పు చేయలేదు).ఈఎస్‌ఐసీ పరిమితి: నెలకు రూ.21,000.ఈ వ్యత్యాసం వల్ల వేతనాల పెరుగుదల కారణంగా చాలా మంది ఉద్యోగులు సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, పెరిగిన కనీస వేతనాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రెండు పథకాలను ఏకరీతిగా చేయడం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం.సుప్రీంకోర్టు ఆదేశాలుఈ తాజా పరిణామాల్లో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అత్యంత కీలకంగా మారాయి. జనవరి 2026 ప్రారంభంలో (జనవరి 5 నాటి సమాచారం ప్రకారం) సుప్రీం కోర్టు, ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి, ఈపీఎఫ్‌ఓ బోర్డుకు నాలుగు నెలల గడువు విధించింది. దశాబ్ద కాలంగా పరిమితి మారకపోవడంపై పిటిషనర్లు, ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటానికి ఇది ఒక విజయంగా భావించవచ్చు.లబ్ధిదారులపై ప్రభావంఈ మార్పు అమల్లోకి వస్తే సామాజిక భద్రతా వలయం గణనీయంగా విస్తరిస్తుంది. ఈపీఎఫ్‌ఓ పరిధిలో ప్రస్తుతం ఉన్న 8.5 కోట్ల మంది సభ్యుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈఎస్‌ఐసీలో ప్రస్తుతం ఉన్న 14 కోట్ల మంది లబ్ధిదారులకుతోడు పరిమితి పెంపుతో మరిన్ని కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుంది.పెరగనున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం వాటా జమ చేస్తారు. యజమాని వాటాలో 8.33 శాతం పెన్షన్ స్కీమ్ (EPS)కు, 3.67 శాతం పీఎఫ్‌ ఖాతాకు వెళ్తుంది. వేతన పరిమితి పెరిగితే ఈ కాంట్రిబ్యూషన్‌ మొత్తం పెరిగి ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ మరింత మెరుగ్గా మారుతాయి.సాధారణంగా ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న రూ.15,000 గరిష్ట వేతన పరిమితి ఆధారంగా లెక్కలు కింది విధంగా ఉంటాయి.1. ఉద్యోగి వాటా (12%): గరిష్టంగా కట్ అయ్యే మొత్తం: రూ.15000*12%= రూ.1,800.2. యజమాని వాటా (12%): రెండు భాగాలుగా విడిపోతుంది.EPF (3.67%): 15000*3.67%= రూ.550.EPS (పెన్షన్ - 8.33%): 15000*8.33%= రూ.1250.కాబట్టి, ప్రస్తుత అధికారిక పరిమితి ప్రకారం మీ జీతం నుంచి నెలవారీ గరిష్టంగా కట్ అయ్యే పీఎఫ్‌ మొత్తం రూ.1,800.ఒకవేళ వేతన పరిమితి రూ.25,000 లేదా రూ.30,000 కి పెరిగితే..వేతన పరిమితిఉద్యోగి వాటా (12%)యజమాని వాటా (EPS + EPF)మొత్తం నెలకు జమ అయ్యేదిరూ.25,000రూ.3,000రూ.3,000 (EPS: రూ.2,083 + EPF: రూ.917)రూ.6,000రూ.30,000రూ.3,600రూ.3,600 (EPS: రూ.2,499 + EPF: రూ.1,101)రూ.7,200

No More 10 Minute Delivery System Says Mandaviya5
10 నిమిషాల డెలివరీ ఎత్తివేత!

జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడంతో పాటి.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ వంటివాటిని నిరసిస్తూ గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. దీనిపై కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందిస్తూ.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడానికంటే ముందు.. డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్లింకిట్ , జెప్టో, జొమాటో & స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో ఒక సమావేశం నిర్వహించారు. బ్లింకిట్ ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ విధానం తొలగించింది. ఇక త్వరలోనే ఇతర అగ్రిగేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని పేర్కొన్నారు.10 నిమిషాల డెలివరీ వల్ల సమస్యలు!ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’ పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్‌ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.10 నిమిషాల డెలివరీ ఉద్దేశ్యం.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు.

Key Highlights of Vande Bharat Sleeper Express fares range6
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు ఖరారు

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెలలోనే పట్టాలెక్కనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అస్సాంలోని గువాహతి (కామాఖ్య) మధ్య ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన టికెట్ ధరలు, రిజర్వేషన్ నిబంధనలను రైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించింది.జనవరి 17న ప్రారంభంరైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్, టెస్టింగ్, భద్రతా సర్టిఫికేషన్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయి. జనవరి 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సాధారణ ప్రయాణికులకు జనవరి 18 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు రైల్వే బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో కేవలం ‘కన్ఫర్మ్’ అయిన టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. సాధారణ రైళ్లలో ఉండే ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఇందులో ఉండదు. అంటే, రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత సీటు కేటాయించబడని వారికి ప్రయాణించే అవకాశం ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ARP) మొదటి రోజు నుంచే అన్ని బెర్తులు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.టికెట్ ధరలు, కనీస ఛార్జీరైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన సర్క్యులర్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరు ప్రాతిపదికన నిర్ణయించారు.కనీస ఛార్జీ: ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.3 ఏసీ కిలోమీటరుకు రూ.2.4 (కనీస ధర రూ.960)2 ఏసీ: కిలోమీటరుకు రూ.3.1 (కనీస ధర రూ.1,240)1 ఏసీ: కిలోమీటరుకు రూ.3.8 (కనీస ధర రూ.1,520)హౌరా-గువాహతి మార్గంలో పూర్తి ప్రయాణానికి 3 ఏసీకి సుమారుగా రూ.2,300, 2 ఏసీకి రూ.3,000, ఫస్ట్ ఏసీకి రూ.3,600 (కేటరింగ్ ఛార్జీలతో కలిపి) ఉండొచ్చని అంచనా. వీటికి అదనంగా జీఎస్టీ ఛార్జీలు ఉండే అవకాశం ఉందని గమనించాలి.రిజర్వేషన్ కోటాలుఈ రైలులో అన్ని రకాల కోటాలు వర్తించవు. కేవలం కింద పేర్కొన్న ముఖ్యమైన విభాగాలకు మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది.1. మహిళలు2. దివ్యాంగులు3. సీనియర్ సిటిజన్లు4. డ్యూటీ పాస్ కోటా (రైల్వే సిబ్బంది కోసం). మిగిలిన ఇతర ప్రత్యేక కోటాలకు ఈ రైలులో చోటు లేదు.ఈ రైలు ప్రత్యేకతలుమొత్తం 16 కోచ్‌లతో (11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ) నడవనున్న ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్స్, విమాన స్థాయి సౌకర్యాలతో ఈ వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని భారీతీయ రైల్వే తెలిపింది.ఇదీ చదవండి: ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు

Advertisement
Advertisement
Advertisement