ప్రధాన వార్తలు
ఏఐతో ఉత్పాదకత పెరుగుతుంది
న్యూఢిల్లీ: కంపెనీలు మరిన్ని లాభాల కోసమే కృత్రిమ మేథ (ఏఐ) జపం చేస్తున్నాయనే అభిప్రాయం మారాల్సిన అవసరం ఉందని సేల్స్ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. దీనితో ఉత్పాదకత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, వైద్యం..విద్యలాంటి సేవలను గణనీయంగా విస్తరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏజెంటిక్ ఏఐ వల్ల ఉద్యోగాల తొలగింపు కన్నా ఉద్యోగులకు మరింత సాధికారత లభిస్తుందని వివరించారు. ఏఐ శకంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు పెరిగే కొద్దీ ఆసుపత్రులు కిక్కిరిసిపోయే అవకాశం ఉందని .. అలాంటి పరిస్థితుల్లో ఏజెంటిక్ ఏఐ, డిజిటల్పరమైన మద్దతుతో వాటిపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ వ్యవస్థ విషయానికొస్తే రోగ లక్షణాలను రికార్డ్ చేసేందుకు, పేషంటును చూడటానికి ముందే డాక్టరుకు ప్రాథమిక విశ్లేషణ ఇచ్చేందుకు ఏజెంటిక్ ఏఐ ఉపయోగపడుతుందని భట్టాచార్య చెప్పారు. టెక్నాలజీ, యూపీఐలాంటి ప్లాట్ఫాంల వల్లే బ్యాంకింగ్ పరిధిలోని వారికి కూడా సరీ్వసులను విస్తరించేందుకు వీలయ్యిందన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా సేల్స్ఫోర్స్కి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా కొనసాగుతోందని ఆమె చెప్పారు.
3 శాతం ‘నిమ్’ సాధిస్తాం
న్యూఢిల్లీ: ఆర్బీఐ ఎంపీసీ డిసెంబర్ సమీక్షలో రెపో రేటును పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తాము పెట్టుకున్న 3 శాతం నికర వడ్డీ మార్జిన్ (నిమ్) లక్ష్యాన్ని సాధిస్తామని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్లో రేటు కోత ఉంటే, అది పావు శాతం మించకపోవచ్చన్నది తమ అంచనా అని చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై పెద్ద ప్రభావం ఉండదన్నారు. రేటు తగ్గింపునకు అవకాశం ఉందని, ఈ విషయాన్ని గత సమీక్ష సందర్భంగానే పేర్కొన్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ వారం మొదట్లో ప్రకటించడం గమనార్హం. దినికితోడు స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో వచ్చే ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు పెరిగిపోయాయి. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.5 శాతంగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) 7 శాతంగా ఉండొచ్చని శెట్టి అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధి రేటు, సానుకూల ద్రవ్యోల్బణం పరిస్థితులతో రేట్ల కోతకు అవకాశాలున్నట్టు చెప్పారు. పలు మార్గాలున్నాయ్.. ఆర్బీఐ ఈ ఏడాది ఒక శాతం వరకు రేట్లు తగ్గించడంతో మార్జిన్లను కాపాడుకోవడం బ్యాంకులకు సవాలుగా మారిన తరుణంలో.. తన మార్జిన్లను కాపాడుకునేందుకు ఎస్బీఐకి పలు చోదకాలున్నట్టు శెట్టి పేర్కొన్నారు. ‘‘సీఆర్ఆర్ ఒక శాతం కోత పూర్తిగా అమల్లోకి రావడంతో దీనివల్ల వడ్డీ ఆదాయం మెరుగవుతుంది. రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. గడువు ముగిసే ఫిక్స్డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లు అమలు చేయడంతోపాటు, సేవింగ్స్ డిపాజిట్లపై 0.2 శాతం వడ్డీ రేటు తగ్గించడం వల్ల మార్జిన్ల పరంగా ప్రయోజనం కలుగుతుంది’’అని శెట్టి వివరించారు. ఎస్బీఐ ఆస్తుల్లో కేవలం 30 శాతమే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆఫ్ రెపో రేటుతో అనుసంధామైనవిగా చెప్పారు. దీనివల్ల ఆర్బీఐ రేట్ల కోత చేపట్టినప్పుడు మూడింట ఒక వంతు రుణాల రేట్లను మార్చాల్సి వస్తుందని, దీంతో మార్జిన్లపై ఒత్తిడి పరిమితంగానే ఉంటుందని వివరించారు. సెపె్టంబర్ త్రైమాసికంలో ఎస్బీఐ నిమ్ 2.93 శాతంగా ఉండడం గమనార్హం.
గిగ్ వర్కర్లకు భారీ డిమాండ్
కరోనా మహమ్మారి తలెత్తిన తదుపరి దేశీయంగా ఊపిరిపోసుకున్న క్విక్ కామర్స్ సర్వీసులు మరింత క్విక్గా విస్తరిస్తున్నాయి. నిజానికి తొలుత ఈకామర్స్ కంపెనీల సర్వీసులకు డిమాండ్ ఊపందుకోగా.. ఆపై ఇది క్విక్ సర్వీస్ కంపెనీలకు వ్యాప్తించింది. దీంతో గిగ్ వర్కర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం గిగ్ వర్కర్ల భద్రతకు కొత్త చట్టాలను తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాలు చూద్దాం.. దేశీయంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, టాటా క్లిక్ తదితర పలు ఈకామర్స్ దిగ్గజాలు ఇంటివద్దకే వస్తువులను అందించడం ద్వారా సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టాయి. ఈ బాటలో ఫుడ్ డెలివరీ కోసం ఏర్పాటైన ఎటర్నల్(గతంలో జొమాటో), స్విగ్గీ వేగవంత సర్వీసులను అందించడం ద్వారా పలు నగరాలలో చొచ్చుకుపోయాయి. గ్రోసరీస్ను త్వరితగతిన అందించేందుకు తెరతీసిన బ్లింకిట్, బిగ్బాస్కెట్ సైతం వినియోగదారులను త్వరితగతిన ఆకట్టుకున్నాయి. మరోపక్క అర్బన్ కంపెనీ, నోబ్రోకర్ తదితరాలు గృహ పరిరక్షణ, వస్తు సేవల సంబంధ సర్వీసులను సైతం అందించడం ద్వారా వేగంగా బిజినెస్ను విస్తరిస్తున్నాయి. కాగా.. 10 నిముషాలలో గ్రోసరీస్ను డెలివరీ చేయడం ద్వారా ప్రధానంగా బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బిగ్బాస్కెట్ బిజినెస్లను భారీగా విస్తరిస్తున్నాయి. ఇవికాకుండా క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలను సమకూర్చేందుకు ఆవిష్కృతమైన ఓలా, ఉబర్, ర్యాపిడో సైతం ప్రధాన నగరాలలో సర్వీసులను భారీగా విస్తరిస్తున్నాయి. వెరసి కొద్ది నెలలుగా గిగ్ వర్కర్లకు దేశీయంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. గ్రోసరీ డెలివరీలు జూమ్ బ్లింకిట్(ఎటర్నల్), స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బిగ్బాస్కెట్ సుమారు 10 నిముషాల్లోనే వినియోగదారులకు సరుకులను డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇందుకు భారీస్థాయిలో డెలివరీ వర్కర్లను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా సరుకులను నిల్వపెట్టుకునేందుకు వీలుగా డార్క్ స్టోర్లను సైతం విస్తారంగా ఏర్పాటు చేస్తున్నాయి. తద్వారా ఆయా ప్రాంతాలలో వేగవంత డెలివరీలను చేపట్టగలుగుతున్నాయి. దీనిలో గిగ్ వర్కర్లే ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో భారీగా నియమించుకుంటున్నాయి. 70–80% అప్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ వినియోగదారులను ఆకట్టుకుంటుండటంతో వినియోగదారుల ఇంటివద్దకే డెలివరీలు అందించేందుకు గిగ్ వర్కర్ల నియామకం ఇటీవల ఊపందుకుంది. ఫలితంగా బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో సగటున నెలకు 4,50,00 నుంచి 5,00,000 మందిని నియమించుకుని సర్వీసులు అందిస్తున్నాయి. ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్లు, మానవ వనరుల సంస్థలు అందించిన వివరాల ప్రకారం గతేడాది(2024)లో ఈ కంపెనీలన్నీ సగటున 2,50,000 నుంచి 3,00,000 మందిని వినియోగించుకున్నాయి. ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలాన్ని తీసుకుంటే జొమాటో 5.5 లక్షల మంది నెలవారీ యాక్టివ్ డెలివరీ పార్ట్నర్స్తో బిజినెస్ నిర్వహిస్తోంది. మాతృ సంస్థ ఎటర్నల్ వివరాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 11 శాతం అధికం. స్విగ్గీ మరింత అధికంగా 6.9 లక్షల మందిని డెలివరీ సర్వీసులకు వినియోగించుకుంటోంది. గతేడాదితో పోలిస్తే సంఖ్య 32 శాతం జంప్చేసింది. ప్రధాన నగరాల హవా ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన నగర ప్రాంతాలలో క్విక్ సర్వీసులకు భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు స్టాఫింగ్ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇటీవల ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్విక్ కామర్స్ కంపెనీలు వేతన సంబంధ ప్రోత్సాహకాలివ్వడం ద్వారా డెలివరీ పార్ట్నర్స్ను సర్వీసులలో కొనసాగించుకోగలుగుతున్నట్లు తెలియజేశాయి. డార్క్ స్టోర్లలో విశ్రాంతికి సైతం వీలుండటం డెలివరీ పార్ట్నర్స్కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు వివరించాయి. డెలివరీల జోరు సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబర్లో బ్లింకిట్ 22.3 కోట్ల ఆర్డర్లను డెలివరీ చేసింది. వార్షికంగా ఇది 140 శాతం పురోగతికాగా.. ఇన్స్టామార్ట్ 49 శాతం అధికంగా 10.1 కోట్ల డెలివరీలను పూర్తిచేసింది. బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ అంచనాల ప్రకారం ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీల 10 నిముషాల డెలివరీలు నిర్వహించేందుకు 2030కల్లా 15 లక్షల మంది పార్ట్నర్స్ను నియమించుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా డార్క్ స్టోర్ల ద్వారా ఇందుకు దన్నుగా ప్యాకింగ్, పికప్ సేవలకు మరో 2,00,000 నుంచి 3,00,000 మంది గిగ్ వర్కర్స్ అవసరం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే బ్లింకిట్ 1,816 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసుకోగా.. ఇన్స్టామార్ట్ 1,102 స్టోర్లు, జెప్టో 1,000 స్టోర్లు నిర్వహిస్తున్నాయి. 2027కల్లా మొత్తం డార్క్ స్టోర్లను 3,000కు పెంచుకోవాలని బ్లింకిట్ ప్రణాళికలు అమలు చేస్తుండటం గమనార్హం! – సాక్షి, బిజినెస్ డెస్క్ Quick Commerce (1166213)e-commerce (756092)gig workers (1163850)huge demand (1057581)Central Government (1166326)New laws (107113
నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన చర్చనీయాంశమైంది. అక్రమ నిర్మాణాల తొలగింపు (ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్) సందర్భంగా బ్యాంకు మొదటి అంతస్తు కార్యాలయానికి ఉన్న మెట్లను కూల్చివేశారు. దాంతో కస్టమర్లు, సిబ్బంది బ్యాంకు సర్వీసులు పొందడానికి తాత్కాలికంగా ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చిన నిచ్చెన ద్వారానే బ్యాంకులోకి ప్రవేశించాల్సిన పరిస్థితి నెలకొంది.మెట్లు కూల్చివేతభద్రక్ రైల్వే స్టేషన్ నుంచి చరంపా మార్కెట్ వరకు నవంబర్ 20, 21 తేదీల్లో పెద్ద ఎత్తున క్లియరెన్స్ ఆపరేషన్ జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా ఎస్బీఐ భవనం ముందు భాగం మెట్లతో సహా అనేక దుకాణాలు, ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయడానికి ముందుగా బహిరంగ ప్రకటనలు చేసి ఆక్రమణదారులకు రెండు రోజుల సమయం ఇచ్చామని అధికారులు చెప్పారు. చాలా మంది దుకాణదారులు స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలిపారు.SBI, Bhadrak (Odisha).Anti-encroachment drive demolished the bank branch's staircase.Customers are measuring ladder which is placed over tractor-trolley to access the bank.Several questions to ask. But .. leave it! India is not for beginners 😒 pic.twitter.com/tvAgpMZCyi— The Hawk Eye (@thehawkeyex) November 25, 2025అయితే బ్యాంకు భవన యజమానికి అక్రమ నిర్మాణాలపై అనేక నోటీసులు వచ్చినా ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచారం. సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఇతర ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చివేత ప్రక్రియ జరిగింది.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
భారత్లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం రూ.7,280 కోట్ల భారీ పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ‘సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించే పథకం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ పథకం ద్వారా దేశీయంగా అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా 6,000 ఎంటీపీఏ (సంవత్సరానికి మెట్రిక్ టన్) సామర్థ్యంతో అరుదైన లోహ అయస్కాంతాలను తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.కీలక రంగాల్లో వీటి ఉపయోగంఈ అరుదైన లోహ అయస్కాంతాలు అనేక కీలక, అత్యాధునిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. వీటిలో కింది విభాగాలున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు)ఏరోస్పేస్ఎలక్ట్రానిక్స్వైద్య పరికరాలురక్షణ రంగంలబ్ధిదారులకు కేటాయింపు, ప్రోత్సాహకాలు.దేశీయంగా ఈ విభాగంలో తయారీని వేగవంతం చేసేందుకు ఈ పథకం ప్రపంచ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు లబ్ధిదారులకు కేటాయించాలని భావిస్తోంది. ప్రతి లబ్ధిదారునికి 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు కేటాయించనున్నారు.పథకం కాలపరిమితిఈ ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారీ సదుపాయాన్ని ప్రోత్సహించే పథకం వ్యవధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాలు ఉంటాయి. ఆర్ఈపీఎం అమ్మకంపై ప్రోత్సాహకాన్ని పంపిణీ చేయడానికి 5 సంవత్సరాలు గడువు నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
ఐరాస సంస్థ ‘సైట్స్’ మెచ్చిన వంతారా
జంతు సంరక్షణలో ఇండియాలోని రిలయన్స్ ఆధ్వర్యంలో ఉన్న వంతారా వండి సంస్థలు చూపుతున్న నిబద్ధతను ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వంతారా కాంప్లెక్స్లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్లో విస్తృత పరిశీలన జరిపి 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతోంది. సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. "ఈ కేంద్రాలు జంతువులను సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు" అని తెలిపింది.వంతారా అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ తెలిపింది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ కీలకంగా ప్రస్తావించిన అంశం. భారత్కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది. జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు లేవని తెలిపింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
కార్పొరేట్
ఏఐతో ఉత్పాదకత పెరుగుతుంది
నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..
ఐరాస సంస్థ ‘సైట్స్’ మెచ్చిన వంతారా
ధనికులను వణికిస్తున్న వెల్త్ ట్యాక్స్!
హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాల రిపేరీ కేంద్రం
అసంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగాలు
అదానీ ఎంటర్ప్రైజెస్ రైట్స్ ఇష్యూ
ఎస్బీఐ వెంచర్స్ టార్గెట్ రూ. 2,000 కోట్లు
క్రాష్ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మరో కొత్త సదుపాయం
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు....
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ విలువ పెట్టుబడిదారుడుగ...
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్...
గోల్డెన్ న్యూస్: పసిడి ప్రియులకు ఆనందమే..
దేశంలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పసిడి ధరలు క...
రుణాలను చౌకగా అందిస్తే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందా?: అదెలా..
సరసమైన రుణాల లభ్యత దేశీయ మార్కెట్లను పెంచుతుంది. అ...
‘ఆహార వృధా అంత ఎక్కువేం లేదు’
ప్రజల్లో అనుకుంటున్నట్టు మన దేశంలో ఆహార వృధా అంత ఎ...
కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు: తక్షణమే అమల్లోకి
భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట...
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్
న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్లో ఫ్లాట్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
బిలినీయర్స్ అంతా ఒక్కచోట!
అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.Trillion Squad assembled pic.twitter.com/tQMjRrfxx5— Ambuj Mishra (@Ambujmishra9090) November 22, 2025ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.Somewhere in a parallel universe: pic.twitter.com/SFlYRiUpcn— DogeDesigner (@cb_doge) November 22, 2025
బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్సైకిల్పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్స్క్రిప్షన్ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్సైట్లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,19,900. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఈ ఫోన్ కేవలం 54,900 రూపాయలకే లభించనుంది. అంటే.. రూ. 65,000 తగ్గుతుందన్నమాట.నవంబర్ 22 నుంచి ప్రారంభమైన నవంబర్ 30 వరకు సాగే బ్లాక్ ఫ్రైడే సేల్లో.. ఐఫోన్ ఎయిర్ మొబైల్ తక్కువ ధరలకు అందుబాటులో ఉండనుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఆఫర్స్, ఇతరత్రా ఆఫర్స్ పొందినట్లయితే మీకు రూ. 65000 తగ్గుతుందన్నమాట.ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్స్యాపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5 ఇంచెస్ OLED ప్యానెల్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ పొందిన ఈ ఫోన్ 3,000 నిట్స్ పీక్ అవుట్డోర్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో యాపిల్ ప్రత్యేక 7-లేయర్ యాంటీరిఫ్లెక్టివ్ కోటింగ్ అందించింది. ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్సెట్పై నడుస్తుంది, ఇది ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్లో ఉపయోగించిన అదే శక్తివంతమైన ప్రాసెసర్. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ రియర్ కెమెరా, ముందు భాగంలో, 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ & స్కై బ్లూ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.BSNL పోర్ట్ఫోలియోలో అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ. 500 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని సంస్థ తెలిపింది.రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన ఈ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. యూజర్ అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్/రోజుకు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 72 రోజులు మాత్రమే.72 Days of Smart Savings in One Recharge!BSNL’s ₹485 Plan gives you 72 days of unlimited calls, 2GB/day data & 100 SMS/day.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNL #BSNLRecharge #BSNL4G pic.twitter.com/t6IyOzc0cA— BSNL India (@BSNLCorporate) November 23, 2025ఇప్పటికే రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు
పర్సనల్ ఫైనాన్స్
స్థిరమైన ఆదాయానికి ఏ ఫండ్ మంచిది..?
నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. స్థిరమైన ఆదాయం కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – నివేష్ పటేల్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్్కతో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్తో పోలి్చతే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. లిక్విడ్ ఫండ్స్పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. లిక్విడ్ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు.లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులను ఇన్స్టంట్గా అదే రోజు వెనక్కి తీసుకునేందుకు (నిరీ్ణత మొత్తం) కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. లేదంటే మరుసటి రోజు అయినా పెట్టుబడులు చేతికి అందుతాయి. వీటిల్లో రాబడి ఎంతన్నది ముందుగానే అంచనాకు రావొచ్చు. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి యూనిట్ నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ)లో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. కనుక ఇది నెలవారీ ఉపసంహరించుకునే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు హెల్త్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. అయినా, వ్యక్తిగతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆలోచనేనా? – రేణుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు హెల్త్ కవరేజీ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ఎంపానెల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు పరిహారం పొందొచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగా చికిత్సలకు సైతం రీయింబర్స్మెంట్ పొందొచ్చు. వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు కుడా పరిహారం వస్తుంది. కాకపోతే ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితం. అయితే, ప్రభుత్వ ఆమోదం పొందిన ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉందో, అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోండి.ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన, రోబోటిక్ వంటి అత్యాధునిక చికిత్సలను తమకు ఇష్టమైన ఆస్పత్రిలో పొందాలని కోరుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కనీసం రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవాలి. అది కూడా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి హెల్త్ ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో–పే షరతుకు అంగీకరించాల్సి వస్తుంది. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సదుపాయం అధిక శాతం చికిత్సలకు రీయింబర్స్మెంట్ రూపంలోనే ఉంటుంది. కనుక ముందుగా తాము చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వద్ద క్లెయిమ్ దాఖలు చేసి పొందగలరు. అదే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అవసరమైన సందర్భంలో నగదు రహిత చికత్సను దాని కింద పొందొచ్చు.ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
వ్యవసాయ ఆదాయం.. పన్ను భారం లెక్కింపు
గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్కంట్యాక్స్ పడదు. కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్ ఇన్కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం. ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000B. వ్యవసాయ ఆదాయం, బేసిక్ లిమిట్ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి. రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది. అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి. ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)చెల్లించాల్సిన పన్ను (5) – (6)దీనికి విద్యా సుంకం అదనంరూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది. పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది. మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్ ఇంటిగ్రేషన్ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి. ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్ ప్లానింగ్ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక.
అప్పు ఎంత చేయొచ్చు..? తెలిసినవారు అధిక సంపన్నులు!
"అప్పులేని వాడే అధిక సంపన్నుడు" అన్నాడు కవి వేమన. కానీ ఆధునిక అవసరాలు అనివార్యమైన నేటి రోజుల్లో "అప్పు ఎంత చేయొచ్చో తెలిసినవారు అధిక సంపన్నులు" అంటున్నారు ఆర్థిక నిపుణులు. పేదవారి నుంచి సంపన్నుల వరకూ అప్పు చేయనిదే పూట గడవదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారు ఏదో ఒక రూపంలో అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక సగటు మధ్యతరగతి జీవితంలో అప్పు నిత్యకృత్యమే.నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అప్పుల తిప్పలు తప్పడం లేదు. అయితే జీవన శైలిలో మార్పుల కారణంగా కొన్ని అప్పులు అనవరంగా వచ్చి మీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి రుణ బాధ్యతలను మరింత దగ్గరగా పర్యవేక్షించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అస్సలు అప్పు లేకుండా ఉండటం మంచిదే. అయితే, కొన్నిసార్లు ముఖ్యంగా ఇల్లు, వాహనాల కొనుగోలు లేదా ఉన్నత విద్య వంటి వాటి కోసం అప్పు ఆచరణాత్మక అవసరం.తు.చ.తప్పకూడని అప్పు సూత్రంఆర్థికంగా ఆరోగ్యంగా ఉండటానికి, నిపుణులు ఒక క్లిష్టమైన నియమాన్ని నొక్కి చెబుతారు. అదే ఒక నెలలో ఈఎంఐలు (EMI), చేబదుళ్లు వంటివాటి కోసం వెళ్లే మొత్తం ఒక వ్యక్తి స్థూల నెలవారీ ఆదాయంలో 36 శాతానికి మించకూడదు. రుణం-ఆదాయ నిష్పత్తి అని పిలిచే ఈ పరిమితిని తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని కొలవడానికి బ్యాంకులు విస్తృతంగా ఉపయోగిస్తాయి. అప్పు దీన్ని మించితే రుణగ్రహీత బడ్జెట్ ను ఒత్తిడి చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.ముఖ్యంగా యువతకు..ఈ అప్పు సూత్రం యువతకు ముఖ్యమైంది. సులభమైన క్రెడిట్ ఆప్షన్లు, ఒక్క స్క్రీన్ ట్యాప్తో అందుబాటులో ఉన్న తక్షణ రుణాలతో నిండిన ఆర్థిక దృశ్యంలోకి దేశ యువత ప్రవేశిస్తున్నారు. సామాజిక ఒత్తిళ్లు, ఆన్ లైన్ షాపింగ్, దూకుడు మార్కెటింగ్ తరచుగా ఆదాయానికి మించి ఖర్చు చేయిస్తుంటాయి. ఫలితంగా, చాలా మంది యువ సంపాదనాపరులు జీవితం ప్రారంభంలోనే అధిక వడ్డీ రుణాల ఉచ్చులో పడతారు. వయసు 20, 30ల ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన రుణ అలవాట్లను అలవరచుకోవడం దీర్ఘకాలికంగా సంపద సృష్టిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?అప్పునకు దూరంగా ఉండటానికి మార్గాలుమీ మొదటి ఉద్యోగం ప్రారంభం నుంచే ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని ట్రాక్ చేయండి. ఆదాయం పెరిగినప్పటికీ, ఈఎంఐలు మీ స్థూల జీతంలో 36% మించకుండా చూసుకోండి.లైఫ్ స్టైల్ అప్ గ్రేడ్ చేయడానికి ముందు అత్యవసర నిధిని నిర్మించుకోండి.యువత తరచుగా ఖర్చు చేయడానికి అనుకూలంగా పొదుపును దాటవేస్తారు. సంక్షోభ సమయంలో ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండటానికి ఈ ఎమెర్జెన్సీ ఫండ్ అవసరం.క్రెడిట్ కార్డులు లేదా ఇప్పుడు కొని తర్వాత చెల్లించే యాప్ల ద్వారా హఠాత్తు కొనుగోళ్లను నివారించండి. బై-నౌ-పే-లేటర్ సర్వీసులు యువ వినియోగదారులలో ప్రాచుర్యం పొందాయి. కానీ ఊహించని రుణ ఉచ్చులను సృష్టించగలవు.విద్యా రుణాలను తెలివిగా ఎంచుకోండి. సైన్ అప్ చేయడానికి ముందు వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే ఎంపికలు, మారటోరియం కాలాలను పోల్చి చూసుకోండి.బడ్జెట్ను రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి. కొన్ని యాప్లు ఖర్చులను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఒక సాధారణ నెలవారీ బడ్జెట్ అధిక ఖర్చును నిరోధిస్తుంది. పొదుపును ప్రోత్సహిస్తుంది.అధిక వడ్డీ రుణంపై దృష్టి పెట్టండి. వడ్డీని నివారించడానికి మొదట క్రెడిట్ కార్డు బకాయిలను క్లియర్ చేయండిఅదనపు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోండి. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ వర్క్ లేదా డిజిటల్ గిగ్ లు ఆరోగ్యకరమైన రుణ-ఆదాయ నిష్పత్తిని నిర్వహించడంలో సహాయపడతాయి.ప్రతిదానికీ ఫైనాన్స్ చేయడానికి బదులుగా పెద్ద కొనుగోళ్లను ప్లాన్ చేయండి. అది బైక్, ఫోన్ లేదా విహారం అయినా. మొదట పొదుపు చేయడం ఈఎంఐలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?
కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను (New Labour Code) అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల (Wages) నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం (టేక్-హోమ్) తగ్గుతుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.ఎక్కువ బేసిక్ పే.. తక్కువ టేక్ హోమ్వేతనాలలో కనీసం 50 శాతం భాగం ప్రాథమిక వేతనం + కరువు భత్యం (డీఏ) + నిలుపుదల భత్యం (రిటైనింగ్ అలవెన్స్) రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సీటీసీ (CTC)లో తక్కువగా ఉంచి, మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్ (ఉద్యోగి 12%, యజమాన్యం 12%), గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల, తక్కువ బేసిక్ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు (కటింగ్స్) పోయి ఎక్కువ జీతం చేతికందేది.రిటైనింగ్ అలవెన్స్ అంటే..రిటైనింగ్ అలవెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు. దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యాజమాన్యాలు చూసుకుంటాయి. అయితే కొత్త లేబర్ కోడ్లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50 శాతాన్ని మినహాయింపుల కసం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్& అసోసియేట్స్కు చెందిన అలయ్ రజ్వీ ప్రకారం.. ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్/గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందనీ, కానీ టేక్-హోమ్ పై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.


