ప్రధాన వార్తలు
రూ.10 వేల లోపు ఫోన్లలో నెం.1 బ్రాండ్ ఇదే..
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లను అందిస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘ఐటెల్’ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయతలో అగ్రస్థానంలో నిలిచింది. సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశ డివైజ్ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయత, అందుబాటు ధరల ప్రాధాన్యత’ అనే నివేదికలో ఐటెల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల 2,086 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డ్యూరబులిటీ ఇండెక్సులో అగ్రస్థానంరూ.10,000 లోపు ధర కలిగిన మొబైల్ విభాగంలో 0.86 మన్నిక(డ్యూరబులిటీ) సూచికతో ఐటెల్ మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత శాంసంగ్ (0.79), వివో (0.72) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ విభాగంలో 91% మంది వినియోగదారులు ఐటెల్ మన్నికైన బ్రాండ్ అని వెల్లడించారు. స్మార్ట్ఫోన్ విభాగంలోనూ 85% స్కోరుతో ఐటెల్ రెండో స్థానంలో నిలిచింది.నివేదికలో మరిన్ని అంశాలుదాదాపు 81% మంది వినియోగదారులు ఐటెల్ను బలమైన, మన్నికకు మారుపేరుగా భావిస్తున్నారు. 79% మంది దీని డిజైన్ సౌకర్యవంతంగా ఉందని ప్రశంసించారు. 74% మంది ఈ బ్రాండ్ను అత్యంత నమ్మదగినదిగా గుర్తించారు. 85% మంది తాము చెల్లించే ధరకు తగిన గొప్ప విలువ (వాల్యూ ఆఫ్ మనీ) లభిస్తుందని నమ్ముతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 51% మంది భవిష్యత్తులో ఐటెల్ ఫీచర్ ఫోన్ను, 30% మంది ఐటెల్ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.
ఇల్లు కొంటే.. ఇన్ని ఖర్చులా?
సొంతిల్లు.. సగటు భారతీయుడి జీవితకాల స్వప్నం. తొలి ఇంటి కొనుగోలు మధ్యతరగతి కుటుంబానికి ఓ మైలురాయి. అయితే, మొదటిసారి ఇల్లు కొనేవారు కేవలం ఆస్తి విలువ (Market Value), నెలవారీ ఈఎంఐ (EMI) లెక్కలతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ నుంచి మెయింటెనెన్స్ వరకు ఎదురయ్యే 'అదనపు బాదుడు' గురించి అవగాహన లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రారంభంలోనే భారీ భారంఆస్తి కొనుగోలులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, లీగల్ ఛార్జీలు, బ్రోకరేజ్, గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజులు వంటి లావాదేవీ ఖర్చులు ముఖ్యమైన భాగం. ఇవి సాధారణంగా ముందస్తుగా చెల్లించాల్సి ఉండటంతో, కొనుగోలుదారుడి నగదు ప్రవాహంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఖర్చులను రుణంగా పొందడం కష్టం కాబట్టి డౌన్ పేమెంట్కు తోడు అదనపు నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుంది.ఫర్నిషింగ్, ఫిట్-అవుట్ ఖర్చులుఇల్లు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు ఫర్నిచర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్ వంటి ఖర్చులు తప్పనిసరి అవుతాయి. ముఖ్యంగా అన్ఫినిష్డ్ లేదా కొత్తగా నిర్మించిన ఇళ్ల విషయంలో ఫిట్-అవుట్ ఖర్చులు మరింత పెరుగుతాయి. ఇవి చిన్నచిన్న ఖర్చులుగానే కనిపించినా, అన్నీ కలిపి పెద్ద మొత్తానికి చేరుతాయి.పునరావృత ఖర్చులుఇల్లు కొనుగోలు తర్వాత నిర్వహణ చార్జీలు, ఆస్తి పన్ను, గృహ బీమా, మరమ్మతులు, అపార్ట్మెంట్ సొసైటీ ఫీజులు వంటి ఖర్చులు నిరంతరం ఉంటాయి. అద్దెదారులతో పోలిస్తే యజమానులు ఈ ఖర్చులను నేరుగా భరించాల్సి రావడం వల్ల నెలవారీ బడ్జెట్పై అదనపు భారంగా మారుతుంది.ఈఎంఐలే కాదు.. వడ్డీ చూసుకోవాలిచాలా మంది కొనుగోలుదారులు ‘తక్కువ ఈఎంఐ’ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ గృహ రుణం మొత్తం కాలపరిమితిలో చెల్లించాల్సిన వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. 20–30 సంవత్సరాల దీర్ఘకాల రుణాలలో, మొత్తం చెల్లింపు ఆస్తి అసలు ధర కంటే గణనీయంగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే, ఈఎంఐ తక్కువగా కనిపించినా, దీర్ఘకాలంలో భారీ వడ్డీ భారం ఉంటుంది.అవకాశ వ్యయండౌన్ పేమెంట్ కోసం వినియోగించే పెద్ద మొత్తాన్ని ఇతర పెట్టుబడుల్లో పెట్టి ఉంటే వచ్చే లాభాన్ని కోల్పోవడం ‘అవకాశ వ్యయం’గా పరిగణించాలి. అలాగే, అధిక ఈఎంఐల వల్ల భవిష్యత్ పొదుపులు, పెట్టుబడులపై పరిమితులు ఏర్పడతాయి. ఇది ఆర్థిక స్వేచ్ఛను ప్రభావితం చేసే అంశంగా నిపుణులు చెబుతున్నారు.సమగ్ర ప్రణాళిక అవసరంఇల్లు కొనుగోలు జీవితంలో ఒక కీలక మైలురాయి అయినప్పటికీ, అది ఆర్థికంగా భారంగా మారకుండా ముందస్తు ప్రణాళిక అత్యంత అవసరం. కేవలం ఆస్తి ధర లేదా ఈఎంఐల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం వల్ల స్థోమత తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. అన్ని అనుబంధ ఖర్చులను ముందుగానే అంచనా వేసి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాలను విశ్లేషించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే అపార్ట్మెంట్లు!
బయోమెట్రిక్తో యూపీఐ, కార్డు చెల్లింపులు
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఐమొబైల్ యాప్లో యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం బయోమెట్రిక్ ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ప్రింట్ ధృవీకరణ ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా యూపీఐ పిన్ నంబరును ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, ఫిన్టెక్ ప్లాట్ఫాం పేయూతో కలిసి కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్ ధృవీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తెలిపింది. దీనితో ఇకపైయాక్సిస్ బ్యాంక్ కార్డ్హోల్డర్లు ఫేస్ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులను ఆమోదించవచ్చని పేర్కొంది.
డాలర్ ‘బిగ్ బాస్’ గుప్తా కన్నుమూత
కోల్కతా: హౌజరీ ఉత్పత్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ దీన్దయాళ్ గుప్తా (88) కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937 సెప్టెంబర్ 13న హర్యానాలోని మాన్హేరు గ్రామంలో జన్మించిన గుప్తా 1962లో కోల్కతాకి చేరుకుని, హౌజరీ ఉత్పత్తుల తయారీ, విక్రయ వ్యాపారాన్ని చేపట్టారు.1972లో డాలర్ ఇండస్ట్రీస్కి పునాది వేశారు. అయిదు దశాబ్దాల పాటు సారథ్యం వహిస్తూ రూ. 1,700 కోట్ల ఆదాయాలు గల అగ్రగామి హౌజరీ, దుస్తుల తయారీ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పలు పురస్కారాలు అందుకున్నారు.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ స్థానంలో రోహిత్ జైన్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) రోహిత్ జైన్ నియామకానికి ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జైన్ ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. రవి శంకర్కు పొడిగించిన పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జైన్ మే 3వ తేదీ లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్బీఐ చట్టం–1934 ప్రకారం, కేంద్ర బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి.వీరిలో ఇద్దరిని రిజర్వ్ బ్యాంక్ అంతర్గత అధికారుల నుంచి, ఒకరిని కమర్షియల్ బ్యాంకింగ్ రంగం నుంచి, మరొకరిని మానిటరీ పాలసీ విభాగానికి నేతృత్వం వహించేలా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆర్బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్.సి. ముర్ము, పూనమ్ గుప్తా, స్వామినాథన్ జే తదితరులు ఉన్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ. 4,027 కోట్లు
న్యూఢిల్లీ: రుణాల వృద్ధి, మొండిబాకీలకు ప్రొవిజనింగ్ తగ్గుదల వంటి సానుకూలాంశాల ఊతంతో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 4,027 కోట్ల నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 3,663 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 13 శాతం అధికం. లాభం సుమారు రూ. 3,737 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ. 7,284 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ. 7,876 కోట్లకు పెరిగింది. రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై బ్యాంక్ బోర్డు రూ. 0.65 మేర డివిడెండ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాబోయే రోజుల్లో మార్జిన్లు నిర్దిష్ట శ్రేణికి పరిమితం కావచ్చని బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దేవాంగ్ ఘీవాలా తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ వేల్యుయేషన్ భారీగా ఉండటం వల్లే దాని కోసం పోటీపడలేదని ఎండీ అశోక్ వాస్వానీ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర కన్నా తక్కువ రేటుకే బిడ్లు రావడమనేది అంచనాలకి, వాస్తవానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాపారం యథాప్రకారంగానే ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు సహా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించి ఇతరత్రా ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గృహ రుణాల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉనట్లు పేర్కొంది. సైబర్ రిస్క్ లు, ఏఐ సంబంధ ముప్పులను ఎదుర్కొనేందుకు సిస్టమ్స్ను పటిష్టం చేసుకోవడంపై బ్యాంకు మరింతగా పెట్టుబడులు పెడుతోంది.మరిన్ని విశేషాలు..→ నిర్వహణ లాభం వార్షికంగా 7 శాతం పెరిగి రూ. 5,855 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 4.8 శాతం వృద్ధితో రూ. 14,175 కోట్లకు, వడ్డీ వ్యయాలు 0.9 శాతం పెరిగి రూ. 6,299 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం 2.1 శాతం క్షీణించి రూ. 3,116 కోట్లకు తగ్గింది. → అసెట్ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 1.30 శాతం నుంచి 1.20 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్ఎన్పీఏ) 0.31 శాతం నుంచి 0.25 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రొవిజనింగ్ గణనీయంగా 43 శాతం మేర తగ్గి రూ. 909 కోట్ల నుంచి రూ. 516 కోట్లకు నెమ్మదించి, లాభాలకు ఊతమిచ్చింది. → నికర వడ్డీ మార్జిన్ వార్షికంగా 4.97 శాతం నుంచి 4.67 శాతానికి చేరింది. క్రితం క్వార్టర్లో ఇది 4.54 శాతంగా నమోదైంది. నిధుల సమీకరణ వ్యయాలు 5.09 శాతం నుంచి 4.45 శాతానికి తగ్గాయి. → 2026 మార్చి 31 నాటికి నికరంగా రుణాలు 16 శాతం వృద్ధితో రూ. 4.96 లక్షల కోట్లకు చేరాయి. → మొత్తం డిపాజిట్లు 15 శాతం వృద్ధి చెంది రూ. 5.72 లక్షల కోట్లకు చేరగా, కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 43.3 శాతంగా ఉంది. రుణ, డిపాజిట్ల నిష్పత్తి 86.6 శాతంగా ఉంది. → స్లిప్పేజీలు 32 శాతం తగ్గి రూ. 1,018 కోట్లకు దిగి వచ్చాయి. → మొత్తం కస్టమర్ల సంఖ్య 5.2 కోట్లుగా ఉంది. → కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం 10 శాతం వృద్ధితో రూ. 4,933 కోట్ల నుంచి రూ. 5,423 కోట్లకు చేరగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 19,288 కోట్లుగా నమోదైంది.
కార్పొరేట్
డాలర్ ‘బిగ్ బాస్’ గుప్తా కన్నుమూత
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ. 4,027 కోట్లు
ఇంధన ధరల ప్రభావం.. అమెరికా విమానయాన సంస్థ క్లోజ్!
బీమా రంగంలో సంచలనం: 100% విదేశీ పెట్టుబడులు!
అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!
పారిపోయిన ‘పైసల దొంగలు’ 21 మంది!
నమ్మావో ముంచేస్తారు!
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్ ఫిక్స్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
అంతుచిక్కని పసిడి ధరలు.. మళ్లీ తారుమారేనా..
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి...
940 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
స్టాక్ మార్కెట్లలో బుల్ రన్.. ఈరోజు లాభాలకు కారణాలు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఏప్రిల్ 29, 2...
యూపీఐ లావాదేవీలు @ రూ. 314 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీ...
పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.10, రూ.12.50 పెరిగ...
భారత్ నెత్తిన చమురు ధరల భారం
ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 120 డాలర్లకు చేరిత...
ఆయిల్ కంపెనీలకు ‘పశ్చిమాసియా’ కష్టాలు..
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఒప్పో, వన్ప్లస్, రియల్మీ విలీనం!
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు దిగ్గజ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న మార్కెట్ సమీకరణలు, తీవ్రతరమవుతున్న పోటీని తట్టుకునేందుకు తన అనుబంధ బ్రాండ్లు అయిన వన్ప్లస్, రియల్మీలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ఒక కొత్త బిజినెస్ యూనిట్గా విలీనం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యూహాత్మక పునర్నిర్మాణం ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో సమన్వయాన్ని పెంచాలని ఒప్పో భావిస్తోంది.ఈ విలీనం ద్వారా వన్ప్లస్, రియల్మీ బ్రాండ్లు తమ గ్లోబల్, దేశీయ కార్యకలాపాలను ఒకే విభాగం కింద నిర్వహించనున్నాయి. వన్ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ ఈ కొత్త ప్రొడక్ట్ హబ్కు నాయకత్వం వహించనున్నారు. ఆయన నేరుగా వన్ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీట్ లావుకు రిపోర్ట్ చేస్తారు. ఉత్పత్తుల అభివృద్ధితోపాటు మార్కెటింగ్, సర్వీసు విభాగాలు కూడా ఒకే యూనిట్ కిందకు రానున్నాయి. టీమ్ల మధ్య డూప్లికేషన్ను (ఒకే పనిని రెండు వేర్వేరు బృందాలు చేయడం) తగ్గించి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే సమయాన్ని వేగవంతం చేయడమే దీని లక్ష్యమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.వినియోగదారులపై ప్రభావం ఎంత?ఈ విలీనం జరిగినప్పటికీ మార్కెట్లో వన్ప్లస్, రియల్మీ తమ వ్యక్తిగత బ్రాండ్ గుర్తింపును కోల్పోవని తెలుస్తోంది. అంటే, యూజర్లు ఇప్పటిలాగే వన్ప్లస్ నుంచి ప్రీమియం అనుభవాన్ని, రియల్మీ నుంచి బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లను ఆశించవచ్చు. అయితే, తెరవెనుక పనిచేసే టెక్నాలజీ, వనరులు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో సమన్వయం కనిపిస్తుంది. భారతదేశం, ఐరోపా వంటి కీలక మార్కెట్లలో ఒప్పో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్య దోహదపడుతుంది. ముఖ్యంగా భారత్లో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కంపెనీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ‘స్థానిక వ్యూహాలతో భారత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ పునర్వ్యవస్థీకరణ కేవలం అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడానికే’ అని చెప్పింది.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
అర కోటి పైగా జీతం.. అయినా ఏం లాభం!
సమాజం దృష్టిలో అతను ఒక 'సక్సెస్ఫుల్' పర్సన్. చేతినిండా జీతం, సొంత ఇల్లు, అందమైన భార్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ఒక మనిషి తన జీవితంలో సాధించాలనుకునేవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ, లోలోపల మాత్రం ఒక రకమైన శూన్యం. 42 ఏళ్ల ఓ ఐటీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అంతర్మథనం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మధ్య వయసులో పురుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒంటరితనంపై ఇది చర్చకు దారితీసింది.కాగితం మీద అంతా పర్ఫెక్ట్! కానీ..ఆ వ్యక్తి తన పోస్ట్లో తన ప్రస్తుత స్థితిని ఇలా వివరించారు.. ‘నాకు 42 ఏళ్లు. వార్షిక ఆదాయం రూ. 55 లక్షలు. చెన్నైలో సొంత ఇల్లు ఉంది. భార్య పిల్లలతో జీవితం కాగితం మీద చూస్తే చాలా పరిపూర్ణంగా కనిపిస్తుంది. సమాజం నిర్దేశించిన విజయాలన్నీ నేను అందుకున్నాను. కానీ ఈ సక్సెస్ వెనుక ఏదో మిస్ అవుతున్న భావన నన్ను వెంటాడుతోంది’.యంత్రంలా మారిన 40ల జీవితం!తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అతను అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జ్ఞాపకాల్లో 20లు.. ముచ్చట్లతో 30లు గడిచాయంటూ రాసుకొచ్చిన ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతూ తన ఒంటరితనాన్ని బయటపెట్టారు. ‘ఇప్పుడు నా ఫోన్ చాలా అరుదుగా మోగుతుంది. వచ్చే కాల్స్ అన్నీ ఆఫీస్ పని గురించో, బ్యాంక్ అలర్ట్ గురించో లేక ఇంటికి వచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మని వచ్చే ఆదేశాలో మాత్రమే ఉంటున్నాయి. శారీరకంగా నేను ఒంటరిని కాకపోయినా, మానసికంగా మాత్రం ఒక యంత్రంలా మారిపోయాననిపిస్తోంది’ అని నిట్టూర్చారు.నేనొక ఏటీఎం మెషీన్నా?ఇంటికి వెళ్తే తన బాధ్యతలు తప్ప తన ఉనికికి గుర్తింపు లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే. స్కూల్ ఫీజులు కట్టేవాడిగా, ఇంట్లో వైఫై పనిచేయకపోతే బాగు చేసేవాడిగా, రిపేర్లు చూసుకునే వ్యక్తిగానే నా పాత్ర పరిమితమైపోయింది. ఆఫీసులో సీనియర్ హోదాలో ఉండటంతో నా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉండాలని అందరూ ఆశిస్తారు. నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, బలంగా కనిపించాలి. నా బలహీనతను బయటపెట్టే అవకాశం ఎక్కడా లేదు’. అని ఘొల్లుమన్నారు.ఆ 15 నిమిషాలే నా ప్రపంచం!‘కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కావాలనే కారును నెమ్మదిగా నడుపుతాను. ఆ అదనపు 15 నిమిషాలు కారులో ఒంటరిగా ఉన్నప్పుడే.. నేను మళ్లీ 'నేను'లా అనిపిస్తాను’ అంటూ తన మనసులోని భారాన్ని దించుకోవడానికి అతను చేసే చిన్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది.ఈ పోస్ట్ చదివిన చాలామంది నెటిజన్లు, ముఖ్యంగా ఐటీ రంగంలోని మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్, 'ఇదీ మా కథే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం ఒక్కటే జీవితం కాదని, మనుషుల మధ్య భావోద్వేగ అనుబంధాలు, వ్యక్తిగత సమయం ఎంత అవసరమో ఈ పోస్ట్ గుర్తు చేస్తోంది.Confessions and realities42M, 55LPAI am a 42-year-old man with a senior job in IT. I have a house in Chennai, a supportive wife, and two children. On paper, everything about my life looks perfect. I have achieved all the things society says a man should achieve.In my…— Dr Mouth Matters (@GanKanchi) April 29, 2026
యాపిల్ గ్యాడ్జెట్తో ఐ ఆపరేషన్
సాంకేతిక ప్రపంచంలో ఒకప్పుడు కేవలం విలాసవంతమైన గ్యాడ్జెట్గా భావించిన ‘యాపిల్ విజన్ ప్రో’ ఇప్పుడు ప్రాణాలను రక్షించే, చూపును ప్రసాదించే వైద్య విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్పేషియల్ కంప్యూటింగ్ పరికరాన్ని వైద్యులు విజయవంతంగా ఉపయోగిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కంటిశుక్లం ఆపరేషన్లలో..న్యూయార్క్కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్, ఈ గ్యాడ్జెట్ను శస్త్రచికిత్సా పరికరంగా ఉపయోగించారు. 2025 చివరి నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు సాధారణంగా ఉపయోగంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కంటిశుక్లం (కాటరాక్ట్) శస్త్రచికిత్సల్లో దీని వినియోగం మెరుగైన ఫలితాలను ఇస్తోంది.‘స్కోప్ ఎక్స్ ఆర్’ పనితీరుఈ సాంకేతికత నేరుగా ఆపరేషన్ గదిలోని సర్జికల్ మైక్రోస్కోప్తో అనుసంధానించబడి ఉంటుంది. మైక్రోస్కోప్ నుంచి వచ్చే ప్రత్యక్ష దృశ్యాలను హై-రిజల్యూషన్ 3డీ నాణ్యతతో సర్జన్ కళ్ల ముందు ఉంచుతుంది. శస్త్రచికిత్స జరుగుతుండగానే రోగి పాత స్కాన్ రిపోర్టులు, కీలక డేటాను సర్జన్ తన చూపును పక్కకు తిప్పకుండానే హెడ్సెట్ స్క్రీన్పై చూసుకోవచ్చు. మానిటర్ల వైపు చూడటానికి పదేపదే తల తిప్పాల్సిన అవసరం లేకపోవడంతో సర్జన్ పూర్తి ఏకాగ్రత రోగి కంటిపైనే ఉంటుంది.‘ఇది ఉన్న పరికరాలను తొలగించదు. కానీ ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తుంది. సమాచారం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా అది అంతా మన కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడం అద్భుతం’ అని డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్ చెప్పారు.రిమోట్ సహకారంవిజన్ ప్రో ద్వారా మరో కీలక ప్రయోజనం ‘రిమోట్ కొలాబరేషన్’. ఒక క్లిష్టమైన ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న నిపుణుడైనా వర్చువల్గా ఆపరేటింగ్ థియేటర్లోకి ప్రవేశించవచ్చు. సర్జన్ ఏం చూస్తున్నారో అదే దృశ్యాన్ని రిమోట్ తీసుకున్న నిపుణుడు కూడా చూస్తూ రియల్టైమ్లో సూచనలు ఇచ్చే వీలుంటుంది. ఇది వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో, క్లిష్టమైన కేసులలో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.సవాళ్లువైద్య రంగంలో మిశ్రమ వాస్తవికత (మిక్స్డ్ రియాలిటీ) ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇందులో ప్రభుత్వాల నుంచి క్లినికల్ అనుమతులు పొందడం క్లిష్టమైన ప్రక్రియ. పరికరాల ధరలు అధికంగా ఉండటం వల్ల సామాన్య ఆసుపత్రులకు ఇవి ఇంకా అందుబాటులో లేవు. దీనిని వాడటానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక నైపుణ్యం అవసరం.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
సంప్రదాయ మోడల్లో ఏఐ పెను మార్పులు
భారతీయ ఐటీ రంగం గత నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ ‘పిరమిడ్’ టాలెంట్ మోడల్లో కృత్రిమ మేధ పెను మార్పులు తీసుకురాబోతోంది. అట్టడుగున భారీ సంఖ్యలో ఫ్రెషర్లు, పైకి వెళ్లే కొద్దీ తగ్గే సీనియర్ల సంఖ్యతో కూడిన ఈ పిరమిడ్ మోడల్ నిర్మాణం రాబోయే రోజుల్లో ‘వజ్రం’ (Diamond) ఆకృతిని(అడుగున ఏఐ టూల్స్ ఎంట్రీ లెవల్ పనులను వేగంగా చేస్తాయి. దీనివల్ల ఫ్రెషర్ల అవసరం తగ్గుతుంది. మధ్య భాగంలో డైమండ్ వెడల్పుగా ఉంటుంది. అంటే, ఏఐని సమర్థవంతంగా వాడుకోగలిగే నిపుణులు ఎక్కువవుతారు) సంతరించుకోనుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ విశ్లేషించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల నియామక ప్రక్రియలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాత్మక మార్పులు పూర్తిస్థాయిలో ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.ఏఐ సేవలే వృద్ధికి చోదక శక్తులుప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ ఏఐ సేవల వ్యూహం తమకు అద్భుతంగా పనిచేస్తోందని పరేఖ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాన్ని కంపెనీ గుర్తించింది. ఇన్ఫోసిస్ ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించింది. పాత సేవలను ఏఐ ఆగ్మెంటెడ్ సర్వీసులుగా మారుస్తూ క్లయింట్లకు మరింత విలువను చేకూరుస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి స్థూల ఆర్థిక సవాళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే ఏడాదిలో వృద్ధి మెరుగ్గా ఉంటుంది’ అని అంచనా వేశారు.20,000 మంది ఫ్రెషర్లకు చోటునియామకాలపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ గతేడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు సలీల్ పరేఖ్ వెల్లడించారు. అయితే, వారి శిక్షణా విధానంలో భారీ మార్పులు చేశారు. ‘కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడంలో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. పిరమిడ్ ఆకారం మారినప్పటికీ నిపుణులైన వ్యక్తులతో పాటు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే కొత్త వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్
పర్సనల్ ఫైనాన్స్
లైవ్ ధరలకు బంగారం.. ‘ధన్ గోల్డ్ వాల్ట్’ లాంచ్
పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్ వాల్ట్ పేరిట ప్రత్యేక సాధనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం ధన్ వెల్లడించింది. ఎంసీఎక్స్లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేయడంతో పాటు అవే లైవ్ ధరల ప్రకారం భౌతిక రూపంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఈ లావాదేవీల సెటిల్మెంట్, భౌతిక డెలివరీ ప్రక్రియను ఎంసీఎక్స్సీసీఎల్ పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన లోహాలను అత్యంత సురక్షితమైన ఇనిస్టిట్యూషనల్ గ్రేడ్ వాల్ట్లలో కూడా భద్రపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి హిడెన్ చార్జీలు, అదనపు రుసుములు ఉండవని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్ జాదవ్ తెలిపారు. ఈ తరహా సాధనాల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు.డిజిటల్ బంగారం కొనుగోలు పద్ధతుల్లో ఈ ‘ధన్ గోల్డ్ వాల్ట్’ ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. సాధారణంగా డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడతాయి, కానీ ధన్ నేరుగా ఎంసీఎక్స్ లైవ్ ధరలను అనుసంధానించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు కేవలం 1 గ్రాము బంగారం లేదా వెండి నుండి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.భవిష్యత్తులో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నేరుగా నగల రూపంలోకి మార్చుకునేందుకు లేదా అవసరమైనప్పుడు విక్రయించి నగదును తక్షణమే తమ బ్యాంక్ ఖాతాల్లోకి పొందేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు మార్కెట్ ఒడుదొడుకులను గమనిస్తూ తక్కువ ధర ఉన్నప్పుడు తక్షణమే ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత.
హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్ రిలీఫ్
క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరటనిస్తూనే, బ్యాంకుల పనితీరులో పారదర్శకత పెంచేలా ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, జరిమానాలు, రిపోర్టింగ్ విషయంలో ఆర్బీఐ ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో కీలక మార్పులు చేసింది. ప్రధానంగా ఆలస్యపు చెల్లింపుల (Late Payments) విషయంలో కస్టమర్లపై పడే భారాన్ని తగ్గించడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశం.ప్రధాన మార్పులు ఇవే..నిర్ణీత గడువు తేదీ (Due Date) ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదు. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు విండో కాలాన్ని అందించాలి. ఈ మూడు రోజుల్లోపు చెల్లింపు చేస్తే, దానిని ‘గత బకాయి’ (Past Due)గా పరిగణించరు, క్రెడిట్ స్కోర్పైనా ప్రభావం పడదు.గతంలో బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం, గడువు తర్వాత చెల్లించాల్సిన నికర బకాయి మొత్తంపై మాత్రమే జరిమానా విధించాలి.జరిమానా విధించడానికి మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, 'ఆలస్యమైన రోజుల' లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుంది.కార్డుదారులకు కాస్త రిలీఫ్వినియోగదారులకు ఇది ఒక రకమైన 'సేఫ్టీ నెట్' లాంటిది. పొరపాటున ఒక రోజు ఆలస్యమైనా భారీ జరిమానాలు, క్రెడిట్ రేటింగ్ (Credit Score) పడిపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే వడ్డీ రేట్లు, బిల్లింగ్ సైకిల్స్లో ఎటువంటి మార్పు ఉండదు. గడువు దాటిన తర్వాత చేసే ప్రతి ఆలస్యం బ్యాంకుల అంతర్గత రికార్డుల్లో నమోదవుతూనే ఉంటుంది.ఆర్బీఐ లక్ష్యం ఇదే..వివిధ బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు తమకు నచ్చినట్లుగా జరిమానాలు విధించడం, క్రెడిట్ బ్యూరోలకు నివేదించడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ భావిస్తోంది. ఆస్తి వర్గీకరణ, ఆదాయ గుర్తింపు నియమాలను అన్ని బ్యాంకులకు ఒకేలా వర్తింపజేయడం ఈ మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం.అమలు ఎప్పటి నుంచి?ఈ సవరించిన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు తమ సాఫ్ట్వేర్ వ్యవస్థలను మార్చుకోవడానికి, వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఆర్బీఐ ఈ గడువును ఇచ్చింది.ఇదీ చదవండి: వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
టాటా ఏఐఏలో సరికొత్త పెన్షన్ ప్లాన్
నేటి కాలంలో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం నిధిని సమకూర్చుకోవడమే కాదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలకడగా ఆదాయం పొందే మార్గాన్ని వెతుక్కోవడం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటీవల 'శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్'ను తీసుకువచ్చింది. ఇది జీవితకాలం పాటు స్థిరమైన గ్యారంటీడ్ ఆదాయాన్ని అందిస్తూనే, మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను (నిఫ్టీ 50 పనితీరుకు అనుగుణంగా) మేళవించిన ఒక వినూత్న హైబ్రిడ్ రిటైర్మెంట్ సొల్యూషన్.ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత దాని ఫ్లెక్సిబిలిటీ. పాలసీదారులు తమ అవసరానికి తగ్గట్టుగా 60% నుండి 90% వరకు గ్యారంటీడ్ ఆదాయాన్ని, మిగిలిన 10% నుండి 40% వరకు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, పెన్షన్ వెంటనే ప్రారంభమయ్యే లేదా గరిష్టంగా 20 ఏళ్ల వరకు వాయిదా వేసుకునే సదుపాయం ఉంది. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని నామినీలకు తిరిగి ఇచ్చే 'రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్' ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ప్రీమియం చెల్లింపుల విషయంలో కూడా కస్టమర్లకు వెసులుబాటు కల్పించారు. ఏకమొత్తంగా లేదా 2 నుండి 12 ఏళ్ల కాలపరిమితితో ప్రీమియం చెల్లించవచ్చు. 35 ఏళ్ల వయస్సు నుంచే ఈ ప్లానింగ్ ప్రారంభించే అవకాశం ఉండటం వల్ల, యువ ప్రొఫెషనల్స్ నుండి రిటైర్మెంట్ ముంగిట్లో ఉన్న వారి వరకు అందరికీ ఇది అనువుగా ఉంటుంది.
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి
పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్ గోయల్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో ఉంటున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్ అవసరాలు కాకుండా.. డిమాండ్ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది.


