ప్రధాన వార్తలు
భారత్లో 20 ఏళ్లు.. ఉత్పత్తిలో కోటి!
సుజుకి మోటార్సైకిల్ ఇండియా.. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను పరిచయం చేయడం, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలపై నూతన దృష్టి సారించడం వంటివి చేయడం వల్ల కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ.. మొత్తం 10 మిలియన్ల ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మైలురాయిని దాటినట్లు అధికారికంగా ప్రకటించింది. స్థిరమైన వినియోగదారుల డిమాండ్.. నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణల మద్దతుతో, గత నాలుగేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని సంస్థ వెల్లడించింది.సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రస్తుతం పటిష్టమైన సరఫరాదారుల వ్యవస్థ మద్దతుతో, భారతదేశం అంతటా 1,200కు పైగా టచ్పాయింట్లతో కూడిన విస్తృత నెట్వర్క్ను నిర్వహిస్తోంది. భారతదేశంలో దీని ప్రయాణం 2006లో సుజుకి హీట్ 125 మరియు సుజుకి జీయస్ 125 వంటి మోటార్సైకిళ్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2007లో సుజుకి యాక్సెస్ 125ను విడుదల చేశారు. ఈ మోడల్ అమ్మకాలలో కీలక పాత్ర పోషించి, 125cc స్కూటర్ విభాగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సహాయపడింది.ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!కాలక్రమేణా..సుజుకి గిక్సర్ సిరీస్, సుజుకి వి-స్ట్రోమ్ SX వంటి మోటార్సైకిళ్లతో పాటు, సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్, సుజుకి అవెనిస్ వంటి ఉత్పత్తులతో సుజుకి తన పోర్ట్ఫోలియోను మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. సుజుకి హయబుసా, సుజుకి GSX-8R వంటి దాని ప్రీమియం మోడళ్లు, వివిధ విభాగాలలో దాని ఉనికిని మరింత బలోపేతం చేశాయి.
పరిమాణం కొంచెం.. పనులు ఘనం!
చూడటానికి చిన్నగా ఉంటాయి కాని, పని మొదలుపెడితే పెద్ద పెద్ద టెన్షన్లనే తగ్గిస్తాయి. చూడటానికి చిన్నగా ఉంటూ, ఎక్కువ సౌలభ్యం అందిస్తూ, మీ టైమ్ను సేవ్ చేసే స్మార్ట్ గాడ్జెట్లే ఇవి!చల్లని గాలి, మీతోనే ఎక్కడికైనా!వేసవిలో విపరీతమైన చెమటతో ఇబ్బంది పడుతున్నారా? చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరగడం కష్టంగా ఉందా? అయితే ఈ పోర్టబుల్ మినీ బ్లేడ్లెస్ ఫ్యాన్ ఒక స్మార్ట్ సొల్యూషన్! ఇది చిన్నదైనా, చల్లని గాలిని ఎప్పుడైనా, ఎక్కడైనా అందించేలా పనిచేస్తుంది. ఈ ఫ్యాన్లో మూడు స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు. బ్లేడ్లు లేకుండా డిజైన్ చేసినందువల్ల జుట్టు చిక్కుకునే భయం ఉండదు. పైగా ఇది మెడకు లేదా నడుముకు క్లిప్ చేసుకునేలా ఉండటంతో చేతులు ఫ్రీగా ఉంటాయి. బయట పనులు చేసుకుంటున్నప్పుడు, ట్రావెల్లో లేదా ఆఫీసులో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ ఫ్యాన్ ఒకసారి చార్జ్ చేస్తే ఎనిమిది గంటల పాటు చల్లని గాలిని అందిస్తుంది. ధర రూ. 4,160.చిన్న ప్రింటర్! ప్రతి చిన్న ప్రింటౌట్ కోసం జిరాక్స్ షాపుకు వెళ్లకుండా.. మీ చేతిలోనే ఒక చిన్న స్మార్ట్ ప్రింటర్ ఉంటే ఎంత బాగుంటుంది! ఈ మినీ బ్లూటూత్ థర్మల్ ప్రింటర్ ఉంటే జిరాక్స్తో పని ఉండదు. స్టూడెంట్స్కు ఇంట్లో వాడుకోవడానికి, చిన్న చిన్న ప్రింటౌట్లు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. మొబైల్తో బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్, స్టిక్కర్స్ లేదా చిన్న ఫోటోలను కొన్ని సెకండ్లలోనే ప్రింట్ చేసుకోవచ్చు. ఇంక్ అవసరం లేకుండా థర్మల్ టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పైగా దీనిని జేబులో లేదా బ్యాగ్లో సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చార్జ్ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చు. చదువుకునే పిల్లలకు, చిన్న నోట్స్ ప్రింట్ చేసుకునే వారికి లేదా రోజువారీ పనులను సులభం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక స్మార్ట్ హెల్పర్లా ఉంటుంది. ధర రూ. 1,799.చార్జ్ కూడా.. స్టాండ్ కూడా!మొబైల్ను చార్జ్ చేస్తూనే వీడియోలు, సీరియల్స్ చూడాలా? లేదా గేమ్స్ ఆడాలా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ టూ ఇన్ వన్ స్మార్ట్ చార్జర్ కేబుల్. ఇది కేవలం కేబుల్ మాత్రమే కాదు, చిన్న స్టాండ్లా కూడా పనిచేసే స్మార్ట్ ఐడియా. ఈ కేబుల్లో బిల్టిన్ ఫోల్డబుల్ స్టాండ్ ఉంటుంది. కేబుల్ పెట్టగానే మొబైల్ సూటిగా నిలబడేలా సౌకర్యంగా ఉంటుంది. పైగా దీనికున్న ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో మొబైల్, టాబ్లెట్ లేదా ఇతర పరికరాలను వేగంగా చార్జ్ చేయవచ్చు. బలమైన నైలాన్ మెటీరియల్తో తయారైన ఈ కేబుల్ ముడిపడకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఇంటి వద్ద, ఆఫీస్లో లేదా ట్రావెల్లో ఎక్కడైనా సులభంగా వాడుకోవచ్చు. ధర కేవలం రూ. 791 మాత్రమే!
ఐసీఎఫ్, ఎల్హెచ్బీ కోచ్లు: ఏది సేఫ్? ఏది బెస్ట్?
రైళ్ల గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ వీటి పరిణామ క్రమం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కథనంలో భారతీయ రైల్వేలోని కోచ్ల గురించి తెలుసుకుందాం.ఐసీఎఫ్ కోచ్లుభారతీయ రైల్వేలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్లు పాత సాంకేతికతను ఉపయోగిస్తాయి. వీటిని 1952 నుంచి చెన్నైలోని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇవి నీలం రంగులో ఉంటాయి, స్టీల్తో నిర్మితమై ఉంటాయి. ఈ కారణంగా.. వీటి బరువు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు అధికం, ప్రయాణికుల సామర్థ్యం తక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్లు ఒకదానిపై ఒకటి టెలిస్కోప్లాగా ఎక్కేస్తాయి. దీనివల్ల ఊహకందని నష్టం జరుగుతుంది.ఐసీఎఫ్ కోచ్లలో.. స్లీపర్ క్లాస్లో 72 బెర్త్లు, థర్డ్ ఏసీ క్లాస్లో 64 బెర్త్లు మాత్రమే ఉంటాయి. ఇవి LHB కోచ్ల కంటే 1.7 మీటర్లు పొట్టిగా ఉంటాయి. వీటిలో ప్రయాణీకుల సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి చాలా బరువుగా ఉండటం వల్ల.. రైలు వేగం కూడా తక్కువగా ఉంటుంది.ఐసీఎఫ్ కోచ్లకు ప్రతి 18 నెలలకు ఒకసారి పూర్తిస్థాయి మరమ్మత్తు అవసరం. కాబట్టి వీటికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం, ఐసీఎఫ్ రేక్లతో కూడిన 740 రైళ్లు నడుస్తున్నాయి, వీటన్నింటినీ 2029 నాటికి పూర్తిగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.ఎల్హెచ్బీ కోచ్లుఇక ఎల్హెచ్బీ (లింకే హాఫ్మన్ బుష్) కోచ్లు లేటెస్ట్ జర్మన్ సాంకేతికత ఆధారంగా నిర్మితమయ్యాయి. వీటిని 2000వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. పంజాబ్లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. రాజధాని ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో వినియోగిస్తారు.ఎల్హెచ్బీ కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మితమై ఉండటం వల్ల.. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో.. స్లీపర్ క్లాస్లో 80 బెర్త్లను, థర్డ్ ఏసీ క్లాస్లో 72 బెర్త్లు ఉంటాయి. ఇవి ICF కోచ్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలవు.ఎల్హెచ్బీ కోచ్ల నిర్వహణ కూడా తక్కువే. వీటికి 24 నెలలకు ఒకసారి మరమత్తులు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు, LHB కోచ్లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవు. ప్రయాణికులకు భద్రతను అందిస్తుంది. కాబట్టి అన్ని విధాలా ఈ కోచ్లు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?
గూగుల్ క్లౌడ్తో కోవాసెంట్ జట్టు
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా గూగుల్ క్లౌడ్తో చేతులు కలిపింది. జెమిని ఎంటర్ప్రైజ్ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.తమ ఏజెంట్ మేనేజ్మెంట్ సూట్ని జెమిని ఎంటర్ప్రైజ్, గూగుల్ క్లౌడ్ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్ టెక్నాలజీస్ సీఈవో శ్రీకాంత్ చక్కిలం తెలిపారు.
భారీగా బంగారం అమ్మేసిన రష్యా!
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.పాశ్చాత్య దేశాల ఆంక్షలురష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.లోటు బడ్జెట్!2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తిప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!
అంబానీ ఇంటికి పాప్ స్టార్ రిహన్నా..
ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రిహన్నా భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చారు. తన బృందంతో కలిసి అంబానీ కుటుంబాన్ని వారి నివాసంలో కలిశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన మధ్యాహ్న విందులో ఆమె పాల్గొన్నారు.ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ దంపతులు స్వయంగా రిహన్నాకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రిహన్నాకు భారతీయ నృత్య రీతులు, సంప్రదాయ కళలు, మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను అంబానీ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విందులో రిహానా భారతీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఇక్కడి సంప్రదాయాల పట్ల తన ఆసక్తిని కనబరిచారు.రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో రిహానా తన సొంత బ్యూటీ బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ'(Fenty Beauty) ప్రమోషన్ కోసమే ఆమె భారత్కు వచ్చారు. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలో కేవలం తీరా (Tira) సెఫోరా (Sephora) స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. View this post on Instagram A post shared by Bollywood Bubble Television (@bollywoodbubbletelly)
కార్పొరేట్
ఐసీఎఫ్, ఎల్హెచ్బీ కోచ్లు: ఏది సేఫ్? ఏది బెస్ట్?
గూగుల్ క్లౌడ్తో కోవాసెంట్ జట్టు
అంబానీ ఇంటికి పాప్ స్టార్ రిహన్నా..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్కు తగ్గని లాభాలు
ఆర్బీఎల్ బ్యాంక్ లాభం మూడు రెట్లు జంప్
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ. 7,071 కోట్లు
రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?
వీధి చివరి పానీపూరీ వాలా కనిపించట్లేదని..
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..
కండోమ్ ధరల పెంపు! ఎంతంటే..
హ్యాట్రిక్ డౌన్.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. ...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. డీలా పడ్డ బ్యాంక్ షేర్లు!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
పెట్రోల్ ధరలు పెరగొచ్చా..? స్పందించిన కేంద్రం
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజ...
గల్ఫ్ దేశాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరిం...
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’
దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్ ఆయిల్ షాక్’
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ...
ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో హవా.. జాతీయ స్థాయిలో ఆధిపత్యం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్లెస్ అండ్ బ్రాడ్బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్లో వైర్లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.జాతీయ స్థాయిలో ఆధిపత్యంప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్లైన్ కనెక్షన్లను జియో జోడించింది.
ఉద్యోగాలపై ఏఐ యుద్ధం!
కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో ఉద్యోగాలను మింగేస్తుందా? లేక మానవ మేధస్సుతో కలిసి కొత్త పుంతలు తొక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు, టెక్ నిపుణుల మధ్య ఒక మేధో యుద్ధానికి దారితీసింది. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది అంచనా వేస్తున్న ‘వైట్-కాలర్ జాబ్స్ కనుమరుగు’పై 2024 నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారోన్ అసెమోగ్లు తీవ్రంగా స్పందించారు. టెక్ నిపుణులు కార్యాలయాల్లోని పనుల సంక్లిష్టతను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన హెచ్చరించారు.వైట్-కాలర్ ఉద్యోగాల్లో భారీ కోతఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 1 నుంచి 5 ఏళ్లలో ఎంట్రీ లెవల్ టెక్నాలజీ, చట్టపరమైన సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయని అంచనా వేశారు. దీన్ని ఆయన ‘వైట్-కాలర్ బ్లడ్బాత్’(ఉద్యోగాల రక్తపాతం)గా అభివర్ణించారు.నోబెల్ గ్రహీత అభ్యంతరంఅమోది వ్యాఖ్యలను నోబెల్ గ్రహీత డారోన్ అసెమోగ్లు తోసిపుచ్చారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, టెక్ నిపుణులు తమ ఏఐ మోడల్స్ సామర్థ్యాలపై ఉన్న అతి విశ్వాసంతో వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘వైట్-కాలర్ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్తోపాటు సామాజిక స్పృహ, క్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటాయి. వీటిని ఏఐ అంత సులభంగా భర్తీ చేయలేదు. ఒకవేళ అమోది చెప్పినట్లు అమెరికా వంటి దేశాల్లో 20 శాతం ఉద్యోగాలు కోల్పోతే అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ సామాజిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.‘అమోదికి ఏమీ తెలియదు’ఈ వివాదంలోకి మెటా మాజీ చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ గాడ్ ఫాదర్గా పేరున్న యాన్ లెకున్ ప్రవేశించడం చర్చను మరింత వేడెక్కించింది. అమోదిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ‘లేబర్ మార్కెట్పై సాంకేతిక విప్లవాల ప్రభావం గురించి డారియోకు ఏమీ తెలియదు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
75 శాతం కోడింగ్ ఏఐతోనే!
టెక్నాలజీ ప్రపంచంలో ఏజెంటిక్ యుగం మొదలైందని, గూగుల్లో జరుగుతున్న భారీ మార్పులే దీనికి నిదర్శనమని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 26 వార్షిక సదస్సు సందర్భంగా ఆయన రాసిన ‘ది కీవర్డ్’ బ్లాగ్ పోస్ట్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం గూగుల్లో రాసే కొత్త కోడ్లో 75 శాతం ఏఐ ద్వారానే రూపొందుతోందని స్పష్టం చేశారు.ఏజెంటిక్ యుగంలోకి..గత ఏడాది ఇదే సమయానికి ఏఐ ద్వారా తయారయ్యే కోడ్ 50 శాతం ఉండగా ఇప్పుడు అది 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. కేవలం కోడ్ రాయడమే కాకుండా మన ఇంజినీర్లు దాన్ని సమీక్షించి ఆమోదిస్తున్నారని పిచాయ్ పేర్కొన్నారు. ‘మేము ఇప్పుడు రియలిస్టిక్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలకు మారుతున్నాం. మా ఇంజినీర్లు ఇప్పుడు పూర్తి స్వయంప్రతిపత్తి డిజిటల్ టాస్క్ ఫోర్స్లను నిర్వహిస్తున్నారు. ఊహించని పనులను సుసాధ్యం చేస్తున్నారు’ అని చెప్పారు.వేల సంఖ్యలో ఏజెంట్ల నిర్వహణగతంలో ‘మనం ఒక ఏఐ ఏజెంట్ను నిర్మించగలమా?’ అనే చర్చ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి ‘వేల సంఖ్యలో ఉన్న ఏజెంట్లను ఎలా నిర్వహించాలి?’ అనే స్థాయికి చేరుకుందని పిచాయ్ తెలిపారు. దీనికోసం గూగుల్ జెమిని ఎంటర్ప్రైజ్ ఏజెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిందని చెప్పారు.ఆరు రెట్లు వేగంగా పనులుగూగుల్ తన సొంత ఎకోసిస్టమ్లో ఏఐని వినియోగించడం వల్ల వచ్చిన మార్పులను ఆయన ఉదాహరణలతో వివరించారు.గతంలో ఇంజినీర్లు మాత్రమే చేసిన పని కంటే ఇప్పుడు ఏజెంట్లు, ఇంజినీర్లు కలిసి చేయడం వల్ల కోడ్ మైగ్రేషన్ ప్రక్రియ 6 రెట్లు వేగంగా పూర్తయింది.మాక్ఓఎస్ (macOS)లోని జెమిని యాప్ను గూగుల్ సొంత ‘ఏజెంట్-ఫస్ట్’ ప్లాట్ఫామ్ ‘యాంటీ గ్రావిటీ’ని ఉపయోగించి తయారు చేసినట్లు చెప్పారు. ఇందులో అటానమస్ ఏఐ ఏజెంట్లు మానవ జోక్యం లేకుండానే బ్రౌజర్లో అప్లికేషన్లను ప్లాన్ చేయడం, కోడ్ రాయడం, పరీక్షించడం వంటి పనులు పూర్తి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్లో గూగుల్ ప్రవేశపెట్టిన ఈ నూతన ఆవిష్కరణలు టెక్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
అక్రమంగా అధిక ఛార్జీ వసూలు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీ సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై యూకేలో దాఖలైన ‘క్లాస్ యాక్షన్’ దావాను విచారించేందుకు లండన్ కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోతే సుమారు 1.7 బిలియన్ యూరోలు (సుమారు రూ.18,700 కోట్లు) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఏమిటీ వివాదం?మైక్రోసాఫ్ట్ తన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. తన మార్కెట్ శక్తిని ఉపయోగించుకుని ఇతర క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లకుండా వినియోగదారులను నియంత్రించిందని హక్కుదారులు వాదిస్తున్నారు.సుమారు 59,000 బ్రిటీష్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దావా పరిధిలోకి వస్తాయి. లండన్లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు ఈ దావాలో పిటిషన్దారుల విజయానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.నియంత్రణ సంస్థల నిఘా నీడలో..కేవలం ఈ ప్రైవేట్ దావా మాత్రమే కాకుండా యూకే యాంటీట్రస్ట్ సీఎంఏ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యాపార పద్ధతులపై లోతైన దర్యాప్తు చేస్తోంది. వర్డ్, ఎక్సెల్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లతో పాటు ఏఐ ఆధారిత కోపైలట్ వంటి ఉత్పత్తుల లైసెన్సింగ్ నిబంధనలు పోటీని అణచివేస్తున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సీఏంఏ దర్యాప్తులో సాక్ష్యాలు మైక్రోసాఫ్ట్ తన లైసెన్సింగ్ విధానాల ద్వారా పోటీని వక్రీకరించిందని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.మైక్రోసాఫ్ట్ వాదనఈ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసహనం వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మాట్లాడుతూ, తాము ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వెలువడిన నిర్ణయం కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తుది తీర్పు కాదని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
పర్సనల్ ఫైనాన్స్
EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది బ్యాంకుల నుంచి గృహ రుణాలు (Home Loans) తీసుకుంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో ఒకటి రెండు ఈఎంఐలు (EMI) చెల్లించలేకపోతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. ఆ పరిస్థితి అలాగే కొనసాగితే మాత్రం మీ కలల సౌధం వేలం దాకా వెళ్లే ప్రమాదం ఉంది. అసలు ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటాయి? 'సర్ఫేసీ' చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు మీకోసం..ఎన్పీఏ అంటే ఏమిటి.. ఎప్పుడు ప్రకటిస్తారు?మీరు మొదటి నెల ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు ఫోన్ కాల్స్ లేదా ఎస్సెమ్మెస్ల ద్వారా గుర్తు చేస్తాయి. రెండో నెలలో కూడా అదే పరిస్థితి ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ వరుసగా మూడు నెలల పాటు మీరు ఈఎంఐ చెల్లించనట్లయితే, బ్యాంక్ మీ రుణ ఖాతాను ఎన్పీఏ (NPA- నిరర్థక ఆస్తి)గా మారుస్తుంది. ఇక్కడి నుంచే అసలు చట్టపరమైన ప్రక్రియ మొదలవుతుంది.సర్ఫేసీ చట్టం.. బ్యాంకుల అస్త్రంరుణగ్రహీత మొండి బకాయిదారుగా మారినప్పుడు బ్యాంకులు సర్ఫేసీ చట్టం, 2002 (SARFAESI act)ని ప్రయోగిస్తాయి. లోన్ ఖాతా ఎన్పీఏ మారిన తర్వాత, బ్యాంక్ రుణగ్రహీతకు 60 రోజుల గడువుతో డిమాండ్ నోటీసు ఇస్తుంది. బకాయి ఉన్న మొత్తాన్ని ఈ గడువులోగా చెల్లించాలని కోరుతుంది. ఈ 60 రోజుల వ్యవధిలో మీరు బ్యాంకును సంప్రదించి, మీ ఇబ్బందులను వివరించి చెల్లింపు గడువును పొడిగించుకునే లేదా రీ-స్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇంటిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?డిమాండ్ నోటీసు ఇచ్చిన 60 రోజుల తర్వాత కూడా రుణగ్రహీత స్పందించకపోతే, బ్యాంక్ సదరు ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ దశలో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు అంటించి, ఇంటిని సీల్ చేసే అధికారం కలిగి ఉంటారు.వేలం ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది?ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ దానికి మార్కెట్ విలువను నిర్ధారిస్తుంది. ఆపై బకాయిలను వసూలు చేసుకోవడానికి బహిరంగ వేలం నిర్వహిస్తుంది. సాధారణంగా ఈఎంఐ నిలిచిపోయిన నాటి నుండి వేలం దాకా వెళ్లడానికి 5 నెలల నుండి 12 నెలల సమయం పడుతుంది. వేలానికి ముందు కూడా రుణగ్రహీతకు తన బకాయిలను పూర్తిగా చెల్లించి ఇంటిని కాపాడుకోవడానికి చివరి అవకాశం ఉంటుంది.గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలుఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకు నుండి వచ్చే కాల్స్ లేదా నోటీసులను విస్మరించవద్దు. నేరుగా బ్యాంకు అధికారులను కలిసి మీ పరిస్థితిని వివరిస్తే, వారు ఏదైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. ఈఎంఐలు చెల్లించకపోతే మీ సిబిల్ (CIBIL) స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు మరెక్కడా రుణాలు లభించవు. బ్యాంకు వేలం వేసే ముందు ఆస్తి విలువను సరిగ్గా లెక్కించిందో లేదో తనిఖీ చేసుకునే హక్కు మీకు ఉంటుంది.ఇది చదివారా? ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?
ఆటోమెటిక్గా కట్ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్డేట్
డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.


