ప్రధాన వార్తలు
డిస్నీలో లేఆఫ్స్?
ప్రపంచ వినోద రంగ దిగ్గజం ‘వాల్ట్ డిస్నీ’ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధానంగా కంపెనీలోని మార్కెటింగ్ విభాగంపై ఈ ప్రభావం అధికంగా ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.మార్కెటింగ్ విభాగమే లక్ష్యంగా..డిస్నీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగమని తెలుస్తోంది. కొత్తగా నియమితులైన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ) అసద్ అయాజ్ కంపెనీ మార్కెటింగ్ గ్రూపును ఏకీకృతం చేసే పనిలో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ ఇమాజిన్’ అనే రహస్య కోడ్ పేరుతో వ్యయ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన అయాజ్ సంస్థలోని అన్ని మార్కెటింగ్ కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త చేపట్టబోయే లేఆఫ్స్ డిస్నీ మొత్తం శ్రామిక శక్తిలో 1 శాతం కంటే తక్కువే. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోష్ డి అమారో డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం.స్పందించని డిస్నీ యాజమాన్యంఈ వార్తలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టత కోరగా, డిస్నీ యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఈ నివేదిక బయటకు రావడంతో కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి అందుబాటులోకి రాలేదు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ మెరుగు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–మార్చి త్రైమాసికంలో ఢీలాపడ్డాయి. హైదరాబాద్లో సానుకూల ధోరణి కనిపించింది. అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. మొత్తం మీద హైదరాబాద్ సహా టాప్–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి మూడు నెలల్లో అమ్మకాలు 88,361 యూనిట్లతో పోల్చితే 4 శాతం తగ్గాయి.అధిక ధరలకు తోడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితులు అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు బలమైన వృద్ధి అనంతరం మార్కెట్లో స్థిరీకరణ సహజమేనని నైట్ఫ్రాంక్ చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. ధరలు పెరుగుతూ ఉండడం, విక్రయాలు తగ్గడం అన్నది ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిళ్లను తెలియజేస్తున్నట్టు చెప్పారు. మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సైతం ఉన్నట్టు తెలిపారు.నగరాల వారీ డేటా..హైదరాబాద్లో 9,541 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలతో పోల్చి చూస్తే 1 శాతం పెరిగాయి.బెంగళూరులోనూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 13,092 యూనిట్లుగా ఉన్నాయి.చెన్నైలో 9 శాతం అధికంగా 4,763 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.అహ్మదాబాద్లో 2 శాతం అధికంగా 4,758 యూనిట్ల విక్రయాలు జరిగాయి.కోల్కతాలో 4,043 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 5 శాతం వృద్ధి నమోదైంది.ముంబైలో ఇళ్ల విక్రయాలు 7 శాతం పడిపోయి 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 12,711 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గాయి. పుణెలోనూ 11 శాతం తక్కువగా 12,711 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గి 94,855 యూనిట్లకు పరిమితమైంది.
స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు తగ్గి 23,970 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 పాయింట్లు నష్టపోయి 77,393 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.51 శాతం పెరిగింది.నాస్డాక్ 2.8 శాతం పుంజుకుంది.Today Nifty position 09-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను సమీక్షించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరా చేసే సహజ వాయువు కోటాను 95 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కేటాయింపులు గురువారం (ఏప్రిల్ 9, 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఇటీవల జరిగిన ఇతర మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ కేటాయింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.పెరిగిన కేటాయింపులుగత వారం (ఏప్రిల్ 6) ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాను 90 శాతానికి పెంచిన ప్రభుత్వం, తాజాగా అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ ప్రకారం వస్తున్న ఎల్ఎన్జీ కార్గోలను దృష్టిలో ఉంచుకుని మరో 5 శాతం పెంచి మొత్తం కోటాను 95 శాతానికి చేర్చింది. దేశ సగటు గ్యాస్ వినియోగం రోజుకు సుమారు 196 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్సీఎం). ఎరువుల రంగ అవసరం రోజుకు సుమారు 52 ఎంఎస్సీఎండీగా ఉంది. ఒక ఎంఎస్సీఎం గ్యాస్తో సుమారు 1,600 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎరువుల రంగం 9,753 ఎంఎస్సీఎంల గ్యాస్ను వినియోగించింది. ఇది దేశ మొత్తం వినియోగంలో 28 శాతానికి సమానం.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
రియల్టీకి ‘సీజ్ఫైర్’ ఊతం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడం అంతర్జాతీయ స్థిరాస్తి మార్కెట్పై సానుకూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కారణంగా గత కొన్ని వారాలుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వెనక్కి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఇరాన్, అమెరికా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణతో తిరిగి ఈ రంగం గాడిలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం అనిశ్చితి భయాలతో నిలిపివేసిన లావాదేవీలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.యుద్ధంతో వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులుఇరాన్-ఇజ్రాయెల్ వివాదం గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం దుబాయ్ రియల్టీ మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేయడంతో మార్చి నెలలో నివాస గృహాల అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లావాదేవీల విలువ, పరిమాణం గణనీయంగా క్షీణించాయి. దుబాయ్ రియల్టీలో దాదాపు 20 శాతం వాటా కలిగిన భారతీయ పెట్టుబడిదారులు కూడా తాత్కాలికంగా తమ కొనుగోలు ప్రయత్నాలను విరమించుకున్నారు.డిమాండ్ బౌన్స్బ్యాక్కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే మార్కెట్లో ఒక్కసారిగా చలనం మొదలైందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కొనుగోళ్లపరంగా వెనక్కి తగ్గిన క్లయింట్లు ఇప్పుడు తిరిగి బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. ‘గతంలో ఒప్పందం కుదుర్చుకుని హోల్డ్లో పెట్టిన వారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి వస్తున్నారు’ అని ప్రోయాక్ట్ లగ్జరీ రియల్ ఎస్టేట్ సీఈఓ రీతూ కాంత్ ఓజా తెలిపారు. వాయిదా పడిన లావాదేవీలన్నీ ఒక్కసారిగా కార్యరూపం దాల్చనుండటంతో ఏప్రిల్ నెలలో దుబాయ్ రియల్టీ రంగం భారీగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, రాబోయే 6 నుంచి 8 వారాలు మార్కెట్ స్థిరత్వానికి అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..పెట్టుబడిదారులకు నిపుణుల సూచనలుఅనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రాజెక్టుల కంటే వెంటనే అందుబాటులో ఉన్న ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.దుబాయ్ మెరీనా, డౌన్టౌన్ దుబాయ్, జుమేరా విలేజ్ సర్కిల్ (జేవీసీ) వంటి ప్రాంతాల్లో అద్దె ఆదాయం స్థిరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో దుబాయ్ మరోసారి గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘సేఫ్ హెవెన్’గా మారుతోంది. పెండింగ్లో ఉన్న డిమాండ్ అంతా ఒక్కసారిగా మార్కెట్లోకి రానుండటంతో ఈ వేసవిలో దుబాయ్ రియల్టీ సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్కి ప్రత్యేక వర్గీకరణ
నిర్వర్తించే విధులను బట్టి బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ని రెండు కేటగిరీలుగా వర్గీకరించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వారికి ఇచ్చే కమీషన్ లేదా రెమ్యూనరేషన్ ఒకే విధంగా ఉండేలా ప్రతిపాదించింది. బ్రాంచ్ ఆథరైజేషన్కి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం మూడు డెలివరీ పాయింట్లను ఆర్బీఐ ప్రతిపాదించింది.ఇందులో బ్యాంక్ శాఖలతో పాటు బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ అవుట్లెట్ (బీసీ–బీవో), బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ టచ్పాయింట్ (బీసీ–బీటీ) ఉన్నాయి. ప్రస్తుతమున్న బిజినెస్ ఫెసిలిటేటర్ల స్థానంలో, బీసీలని నియమించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ నిబంధనల ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు మే 5 నాటికి తమ అభిప్రాయాలను నియంత్రణ సంస్థకి తెలియజేయాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సేవలను విస్తరించే దిశగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు ..రిటైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
కార్పొరేట్
డిస్నీలో లేఆఫ్స్?
బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్కి ప్రత్యేక వర్గీకరణ
డిస్కౌంట్లకన్నా సౌకర్యానికే ఓటు
వార్ సీజ్.. బుల్స్ ఫైర్!
38 ఏళ్ల నాటి రికార్డ్.. ఆకాశంలో తపాలా సేవలు
విమానయాన రంగానికి భారీ ఊరట
ఎస్ఈసీ కేసు కొట్టేయండి
డిపాజిట్ల వేటలో ప్రైవేటు బ్యాంకులు టాప్
ఎయిరిండియా ప్రయాణికులకు ఏటీఎఫ్ సెగ
మంత్రిత్వ శాఖ ప్రకటన.. రికార్డు స్థాయిలో విండ్ ఎనర్జీ!
వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!
గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా, ...
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ...
యుద్ధం ఎఫెక్ట్.. దెబ్బతిన్న రంగాలకు కేంద్రం దన్ను!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో దేశీయంగా ...
ఈ–కామర్స్ @ 250 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2030 నాటికి ...
రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం సిద్ధం!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ...
రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే అంతే..
ఇరాన్లో చిక్కుకున్న ఇద్దరు అమెరికన్ వైమానిక దళ పై...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐతో హైరింగ్ ధోరణుల్లో మార్పులు
కృత్రిమ మేథ (ఏఐ)తో నియామకాల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వస్తున్నాయని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు అనేది ఆర్థికాంశాలతో కన్నా ఎక్కువగా టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యవహారమని పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుండటంతో కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం తగ్గుతోందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే విస్తృతంగా కార్యకలాపాలని నిర్వహించుకోవడంపై అవి దృష్టి పెడుతున్నాయని శర్మ వివరించారు.అంతేగాకుండా కోవిడ్ సమయంలో భారీ స్థాయిలో నియమించుకున్న ఉద్యోగులను కంపెనీలు ప్రస్తుతం వ్యాపార అవసరాలకు అనుగుణంగా తగ్గించుకుంటూ ఉండటం కూడా ఉద్వాసనలకు కారణమవుతోందని తెలిపారు. ఈ అంశాలన్నీ కలిసి ఉద్యోగుల్లో అభద్రత భావన పెరుగుతోందని, 60 శాతం మంది పైగా టెక్ వర్కర్లలో స్థిరత్వంపై ఆందోళన నెలకొందని తెలిపారు. గత కొన్నాళ్లుగా టెక్నాలజీ రంగంలో నిర్దాక్షిణ్యంగా కోతలు అమలవుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్వైఐ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయంగా 70 పైగా టెక్ కంపెనీలు ఏకంగా 40,480 మంది ఉద్యోగులను తొలగించాయి. ఉత్పాదకత 30 శాతం వరకు అప్..ఏఐతో కోడింగ్, సపోర్ట్లాంటి కార్యకలాపాల్లో ఉత్పాదకత 10–30 శాతం వరకు పెరిగిందని నీతి శర్మ చెప్పారు. ప్రొడక్టివిటీ కస్టమర్ సపోర్ట్లో 14–15 శాతం, కోడింగ్, టాస్క్ల రైటింగ్లాంటి కొన్ని విధుల్లో 40 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. దీనితో ఇలాంటి పనుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉండటం లేదని, తక్కువ మంది ఉద్యోగులు సరిపోతున్నారని వివరించారు. లేఆఫ్లతో మిగిలే నిధులను సంస్థలు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా రాబడులపై అనిశ్చితి నెలకొన్నా దీర్ఘకాలికంగా ఉపయోగపడే సామర్థ్యాలను పెంచుకోవడం వైపు మళ్లే విధంగా వ్యవస్థాగతంగా వస్తున్న మార్పులను ఇది సూచిస్తోందన్నారు. బడా టెక్ కంపెనీలు సైతం బ్యాలెన్స్ షీట్స్ పటిష్టంగా ఉన్నప్పటికీ ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, చాలా కంపెనీలు ఏఐని వినియోగించుకోవడంలో ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని వివరించారు. నిపుణులకే డిమాండ్..ఏఐ వల్ల రొటీన్ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతోందని, విశిష్ట నైపుణ్యాలున్న వారికి డిమాండ్ పెరుగుతోందని శర్మ చెప్పారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లో ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ నియామకాలు వార్షికంగా 18–27 శాతం పెరుగుతుండగా, ఐటీ సరీ్వసుల విభాగంలో 4–6 శాతం వృద్ధి ఉంటోందని తెలిపారు. అదే సమయంలో నిపుణుల కొరత 25–60 శాతం మేర ఉంటోందన్నారు. దీని వల్ల వేతన వృద్ధి 10–12 శాతం ఉంటోందని శర్మ వివరించారు. సీనియర్ హోదాలకు రూ. 60 లక్షల వరకు ప్రీమియం స్థాయిలో వేతనాలు ఉంటున్నాయన్నారు. అత్యధిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత ఉద్యోగాల వైపు పరిశ్రమ మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోందని శర్మ తెలిపారు.ఏఐ వల్ల ఉద్యోగ విధుల స్వరూపం మారుతోందని, ఇందుకోసం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెట్టడం కీలకమని ఆమె చెప్పారు. అధికారికంగా శిక్షణ పొందుతున్న ఉద్యోగుల సంఖ్య పాతిక శాతం లోపే ఉంటోందన్నారు. కాబట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణనివ్వడం, అంతర్గతంగా వేరే వేరే విభాగాల్లోకి మారే వెసులుబాట్లు కల్పించడంపై కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలని, విధాన నిర్ణేతలు కూడా భారీ స్థాయి శిక్షణ కార్యక్రమాలకు ప్రోత్సాహకాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని శర్మ చెప్పారు. ఇక ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను సంతరించుకోవడానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచనా ధోరణితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు
జియో కొత్త ప్లాన్.. ‘నెలంతా’ వ్యాలిడిటీ
జియో నుంచి అదిరిపోయే ప్లాన్! కేవలం రూ. 339లకే పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు) వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ను రిలయన్స్ జియో అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా 28 రోజుల ప్లాన్లతో విసిగిపోయిన కస్టమర్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఈ కొత్త ప్లాన్ విశేషాలేంటో తెలుసుకుందాం.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 349 ప్లాన్ కంటే ఇది రూ. 10 తక్కువ ధరకే లభించడం విశేషం. ఈ ప్లాన్ ద్వారా ఏడాదికి 13 సార్లు కాకుండా, కేవలం 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.రూ. 339 ప్లాన్ ప్రయోజనాలుపూర్తి 31 రోజుల క్యాలెండర్ నెల వ్యాలిడిటీ.రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటా.ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాల్స్.రోజుకు 100 SMSలు ఉచితం.అదనంగా రూ. 14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా లభిస్తుంది.సుమారు రూ. 35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో' సబ్స్క్రిప్షన్ను 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.ఏకంగా 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్తో పాటు నానో బనానా (Nano Banana) సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.5G వినియోగదారులకు గమనికఈ ప్లాన్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక చిన్న పరిమితి ఉంది. రూ. 349 ప్లాన్ మాదిరిగా ఇందులో అపరిమిత 5G డేటా సౌకర్యం లేదు. మీరు 5G నెట్వర్క్ను అపరిమితంగా వాడాలనుకుంటే మాత్రం రూ. 349 ప్లాన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?
ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.AI సులభంగా చేసే పనులు➤డేటా ప్రాసెసింగ్➤ప్యాటర్న్ గుర్తింపు➤కంటెంట్ తయారీ➤నియమాల ప్రకారం పనిచేయడంవీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.AI చేయలేని పనులుAI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు➜హెల్త్కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు.
వివో కొత్త ఫోన్ వచ్చేసింది.. 200 మెగాపిక్సెల్ కెమెరాతో..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో ‘వీ70 ఎఫ్ఈ’ పేరుతో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 6.83 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంది. వెనుక అల్ట్రా స్టెబిలైజేషన్ కలిగిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అ్రల్టావైడ్ డ్యూయల్ రియర్ కెమెరాలు కలిగి ఉంది.ముందు భాగంలో 50ఎంపీ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 90వాట్ల ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో వచి్చంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.37,999గా, 8జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.40,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.44,999 ఉంది. వివో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో పాటు, రిటైల్ స్టోర్లలో ఏప్రిల్ 9 నుంచి కొనుగోలు చేయొచ్చు.
పర్సనల్ ఫైనాన్స్
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?
సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి.
గ్రూప్ బీమా.. ఇస్తుందా ధీమా?
వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.కానీ, అసలు రిస్క్ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఇక రిటైర్మెంట్ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కనుక స్టాండెలోన్ హెల్త్ప్లాన్తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్వర్క్ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.రిటైర్మెంట్ వరకు మేల్కొనకపోతే..🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. 🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.ముందే ఎందుకు..? హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్ హెల్త్ ప్లాన్తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు.ఉదాహరణ.. 🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్ ప్లాన్కు ప్రీమియం రూ.8,000–12,000 🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే. 🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు. యథార్థమిదీ.. 🔸 హైదరాబాద్కు చెందిన రమేష్ వయసు 60 ఏళ్లు. 🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. 🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్ హెల్త్ ప్లాన్ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు. 🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ తప్పులకు దూరం దూరం..🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం. 🔸 ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోకపోవడం. 🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్ ఇన్సూర్డ్ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం. 🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం. 🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం. 🔸 హెల్త్ ఇన్సూరెన్స్ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం. 🔸 ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ప్లాన్ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం. రక్షణ అవసరమైన మేర..🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్. 🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్ తీసుకోవాలి. 🔸 టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్తో అదనపు రక్షణను కల్పించుకోవాలి. 🔸 బేస్ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్ టాపప్ ఎక్కువ ప్రయోజనకరం. 🔸 ఒకవేళ బేస్ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్ లేదా సూపర్ టాపప్ నుంచి చెల్లింపులు లభిస్తాయి. 🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 🔸 అందుకే తగినంత సమ్ ఇన్సూర్డ్తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి.
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?
ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు


