Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why Some Cars Have Blue Colour Number Plates in India Know The Details Here1
బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. వాళ్లకు మాత్రమే ఎందుకు?

సాధారణంగా రోడ్డుపై కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్స్ వైట్, ఎల్లో, గ్రీన్ గంగులలో ఉండటం చాలామంది గమనించి ఉంటారు. అయితే అరుదుగా బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ కూడా చూసి ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి కలర్ నెంబర్ ప్లేట్ ఎందుకు అరుదుగా కనిపిస్తుంది?, దీనిని ఎవరికి కేటాయిస్తారు? అని ఆలోచించారా.. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. ప్రధానంగా విదేశీ దౌత్యవేత్తలు & రాయబార కార్యాలయాలకు చెందిన వాహనాలకు కేటాయిస్తారు. నెంబర్ ప్లేట్ రంగును బట్టి దౌత్య సిబ్బందికి చెందిన వాహనాలు అని.. అధికారులు గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, అధికారిక ప్రయోజనానికి మాత్రమే.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం సభ్య దేశాలు దౌత్య సంబంధాల విషయంలో కొన్ని నియమాలను పాటిస్తాయి. భారతదేశం కూడా ఆ ఒప్పందానికి సభ్యదేశం కావడంతో ఈ విధానం అమలులో ఉంది.నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెలుపు అక్షరాలు ఉండటం వల్ల ఈ వాహనాలు సులభంగా గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తిగత వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్లు, కమర్షియల్ వాహనాలకు పసుపు నెంబర్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ పోలీసులు దౌత్య వాహనాలను త్వరగా గుర్తించగలుగుతారు.ఈ వాహనాల నెంబర్ ప్లేట్‌పై తెలుపు రంగులో అక్షరాలు & సంఖ్యలు ఉంటాయి. కొన్ని ప్లేట్లపై CD లేదా CC వంటి గుర్తులు కనిపిస్తాయి. CD అంటే దౌత్యవేత్తలకు చెందిన వాహనం, CC అంటే కాన్సులేట్ అధికారులకు చెందిన వాహనం.దౌత్యవేత్తలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక హక్కులు. వారికి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే సదుపాయం కూడా లభిస్తుంది. అయితే.. దీని అర్థం వారు చట్టానికి అతీతులు కాదు. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. సంబంధిత దేశం ఆ వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లమని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా తప్పకుండా రహదారి నియమాలు & భద్రతా ప్రమాణాలను పాటించాలి.ఇదీ చదవండి: 'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

Know The Reasons Of Gold Price Hike Says FM Sitharaman2
'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులే.. బంగారం ధర పెరుగుదలకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. ఫిబ్రవరి 23న ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారంలో ఎక్కువ భాగం కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరుగుదలకు కారణం అవుతోందని అన్నారు.ఇతర కారణాలుకేంద్ర బ్యాంకుల కొనుగోలు మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు & సుంకాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆసక్తి కూడా గోల్డ్ రేటు అమాంతం పెంచేస్తున్నాయి. డిమాండుకు తగ్గ సరఫరా ఉన్నప్పుడు ధరలు స్థిరంగా ఉంటాయి. సరఫరా తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు బంగారం ధరలు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో తెలుగు రాష్ట్రల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,61,350 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,47,900 వద్ద ఉంది.

2026 Isuzu D Max V Cross Launched3
రూ.25 లక్షల ఇసుజు కారు: దీని గురించి తెలుసా?

2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధరలు రూ. 25.50 లక్షల నుంచి రూ. 30.28 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ 4x2 ఆప్షన్ నిలిపివేయడంతో.. ఈ పికప్ ట్రక్ 4x4 ఎంపికలో మాత్రమే లభిస్తుంది. టయోటా హైలక్స్ ప్రత్యర్థిగా నిలిచే ఈ కారు 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 161 bhp & 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.పరిమాణంలో పెద్దగా ఉండే ఈ పికప్ ట్రక్ డిజైన్ గంభీరంగా ఉంటుంది. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్ ఉంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండటం చూడవచ్చు. అయితే ఇందులో బ్లాక్ వీల్ ఆర్చ్ & సైడ్ క్లాడింగ్ లేదు. లోపలి భాగంలో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ స్థానంలో పెద్ద 10.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. రూఫ్-మౌంటెడ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్‌ కూడా ఉన్నాయి.360-డిగ్రీల కెమెరా సెటప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఇసుజు వీ-క్రాస్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్ ప్రెస్టీజ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏటీ జెడ్ ప్రెస్టీజ్.

Amazon second largest office in Asia opens in Bengaluru4
అమెజాన్‌ అతిపెద్ద ఆఫీస్‌.. ఇక్కడే..

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon) ఆసియాలో రెండవ అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయంగా నిలిచే తన కొత్త క్యాంపస్‌ను బెంగళూరులో అధికారికంగా ప్రారంభించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రధాన కార్యాలయం ఈ-కామర్స్, ఆపరేషన్స్, చెల్లింపులు, సాంకేతికత, విక్రేత సేవల విభాగాల్లో 7,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలు కల్పించనుంది.గతంలో అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగళూరులోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించేది. వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ఆ కార్యాలయాన్ని మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. “భారత్‌ అమెజాన్‌కు దీర్ఘకాలిక ప్రాధాన్యతగల మార్కెట్. మా ప్రయాణంలో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలోనే సాంకేతిక, వ్యాపార బృందాలకు ఈ నగరం నిలయమైంది. నేడు ఇది ఆవిష్కరణ, ప్రతిభకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది” అని తెలిపారు.ఆర్థిక ఫలితాల పరంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ ఇండియా మార్కెట్‌ప్లేస్ సంస్థ ‘అమెజాన్ సెల్లర్ సర్వీసెస్’ కార్యకలాపాల ద్వారా సాధించిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.30,139 కోట్లకు చేరుకుంది. వ్యయాలు నెమ్మదిగా పెరగడంతో నష్టాలు 89 శాతం తగ్గి రూ.374 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే, కోవిడ్ కాలంతో పోలిస్తే ఆదాయ వృద్ధి మోస్తరు స్థాయిలోనే నమోదైనట్లు వెల్లడైంది.

Be Careful with Your Bank Account Bengaluru Eng Student stuck in 7 crore fraud5
రూ.7 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి

స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోందిబెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్‌లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్‌తో పాటు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్‌లో ధ్రువీకరించాడు కూడా.అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్‌తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఓ హెచ్చరికే!స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్‌లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్‌ ద్వారా అడగవు."తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్‌లే!స్ట్రాంగ్ పాస్‌వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని రెగ్యులర్‌గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.అన్‌నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్‌సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.ఖాతా స్టేట్‌మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.

US to Stop Collecting Trump Tariffs From Tomorrow After Supreme Court Ruling6
ట్రంప్ సుంకాలు రేపటి నుంచి బంద్

అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల (టారిఫ్స్)కు బ్రేక్ పడింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆ దేశ సుప్రీంకోర్టు సంచనల తీర్పునిచ్చింది. దీంతో టారిఫ్స్ వసూళ్లు రేపటి (మంగళవారం) నుంచి నిలిపివేస్తున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా వెల్లడించింది.ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ (IEEPA) కింద విధించిన సుంకాలను, వసూలు చేయడాన్ని అమెరికా మంగళవారం ఉదయం 12:01 EST (0501 GMT) నుంచి నిలిపివేయనుంది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని US సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. దీంతో సంబంధిత కోడ్లు సాఫ్ట్‌వేర్‌ నుంచి డియాక్టివేట్ చేయనున్నారు.అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎలాగైనా 15 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారికంగా వెలువడలేదు. రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు సమాచారం. అయితే.. ఆదేశాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు, వాటిని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.యూఎస్ సుప్రీంకోర్టు తీర్పుటారిఫ్‌లను విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై పూర్తి అధికారం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకూ వసూలు చేసిన వందల బిలియన్‌ డాలర్ల సుంకాలను.. దిగుమతి దారులకు తిరిగి ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది.ట్రంప్ అసంతృప్తిగ్లోబల్ టారిఫ్ విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను తీవ్ర నిరాశ‌ప‌రిచింద‌ని ఆయ‌న అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్ర‌భావానికి లోన‌య్యార‌ని ట్రంప్ ఆరోపించారు.ఇదీ చదవండి: 2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!

Advertisement
Advertisement
Advertisement