Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Experts Views and Advice1
కోటి ఆశలతో కొత్త ఏడాది

కొత్త కేలండర్‌ ఏడాదిలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ దౌడు తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు యూటర్న్‌ తీసుకోవచ్చనే అంచనాలు, క్యూ3 ఫలితాలపై ఆశలు, ఊపందుకుంటున్న వినియోగం ఇందుకు దోహదపడచ్చని అంచనా. గత వారం సాంకేతిక అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం దీనిని బలపరుస్తోంది! వివరాలు చూద్దాం.. ఈ వారం ప్రధానంగా భారత్‌సహా యూఎస్, చైనా పీఎంఐ ఇండెక్సుల గణాంకాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆశావహ ఆటోరంగ విక్రయాలు, జోరుమీదున్న ఆర్థిక పురోగతి, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి బలహీనతలు, వాణిజ్య టారిఫ్‌లు కొంతమేర ప్రతికూల ప్రభావానికి కారణంకాన‡ున్నాయి. దేశీయంగా చూస్తే → గత నెల హెచ్‌ఎస్‌బీసీ సరీ్వసుల పీఎంఐ, కాంపోజిట్‌(తయారీ) పీఎంఐ తుది గణాంకాలు వెలువడనున్నాయి. → వచ్చే వారం ప్రారంభంకానున్న క్యూ3 కార్పొ రేట్‌ ఫలితాల సీజన్‌పై ఆశావహఅంచనాలున్నాయి. 12న ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) పనితీరును వెల్లడించనున్నాయి. → 2025లో దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా విదేశీ ఇన్వెస్టర్లు 18.9 బిలియన్‌ డాలర్ల(రూ. 1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి రెండు రోజుల్లో సైతం నికరంగా రూ. 7,608 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే గతంలో ఇలా జరిగిన తదుపరి ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్న అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. విదేశీ అంశాలు ఇలా → ఈ వారం 2025 డిసెంబర్‌ నెలకు చైనా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సుల వివరాలు విడుదలకానున్నాయి. విదేశీ నిల్వలు, ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. మరోవైపు వివిధ యూఎస్‌ గణాంకాలు వెలువడనున్నాయి. సరికొత్త రికార్డ్‌ గత వారం నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 పాయింట్లను తాకింది. సరికొత్త గరిష్టానికి చేరి రికార్డ్‌ నెలకొల్పింది. గత వారం నికరంగా సెన్సెక్స్‌ 721 పాయింట్లు(0.84%) పుంజుకుని 85,762 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు(1.1%) ఎగసి 26,329 వద్ద స్థిరపడింది.బుల్లిష్‌ వేవ్‌లో.. యూఎస్‌ వెనెజువెలా ప్రెసిడెంట్‌ను బందీగా పట్టుకుని స్వదేశానికి తరలించిన నేపథ్యంలో ఈ వారం అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం సైతం స్టాక్‌ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే జీడీపీ వృద్ధి, క్యూ3 ఫలితాలపై అంచనాలు, ప్రభుత్వ వ్యయాలు వంటి అంశాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు చెబుతున్నారు. వెరసి మార్కెట్లు బలాన్ని పుంజుకునేందుకే అధికంగా వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,000 స్థాయికి ఎగువన నిలుస్తూ 26,340 వద్ద కొత్త గరిష్టాన్ని అందుకుంది. దీంతో ఈ వారం నిఫ్టీ 26,720– 26,900 పాయింట్ల వరకూ బలపడవచ్చు. ఒకవేళ బలహీనపడితే 26,000– 25,750 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించే వీలుంది. → గత వారం 85,350 పాయింట్లను దాటి 85,762కు ఎగసింది. వెరసి ఈ వారం 86,800, 87,200 పాయింట్లవరకూ పురోగమించవచ్చు. ఇలాకాకుండా నీరసిస్తే 84,800– 84,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్‌ కనిపించే అవకాశముంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Explanation of ULIP vs Term Insurance, special story2
మీ ‘లైఫ్‌’ పాలసీ సరైనదేనా..?

గుడ్డివాళ్లు ఏనుగును తాకితే...? తోక పట్టుకున్నవారికి అదో తాడులా... తొండం తాకిన వారికి అదో పాములా... నడుము భాగాన్ని తాకినవారికి అదో గోడలా అనిపించింది. అంతేతప్ప ఎవ్వరికీ అదో ఏనుగులా అనిపించలేదు. దేన్నయినా సమగ్రంగా చూడాలి తప్ప ఒకే కోణంలో చూడొద్దని చెప్పేటపుడు పురాణాల్లోని ఈ తత్వాన్ని గుర్తు చేస్తుంటారు. ప్రస్తుతం మనవాళ్లు కొంటున్న బీమా పాలసీలకూ ఇదే తత్వం వర్తిస్తోంది. ఎందుకంటే నూటికి 90 శాతం మంది బీమా అవసరాన్ని అర్థం చేసుకుని కొనటం లేదు. రకరకాల కోణాల్లో దాన్ని చూసి డబ్బులు వృథా చేస్తున్నారన్నది తాజా సర్వేల సారాంశం. ఈ సర్వేల ప్రకారం... కొందరేమో బంధుమిత్రులు బలవంతపెట్టారనో, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేకో మొహమాటానికి బీమా పాలసీ తీసుకుంటున్నారు. మరికొందరేమో దీన్నో పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా చేసే పాలసీగా భావించి కొంటున్నారు. ఇంకొందరేమో గడువు తీరిన తరువాత తమ చేతికి ఎంత వస్తుందన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఈ మూడూ సరికాదు. బీమా అవసరాన్ని అర్థం చేసుకుని, ఆ అవసరం కోసమే దాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరిగా ఉండాలి కూడా. అసలు బీమా అవసరమేంటో... డబ్బులు ఎలా వృథా అవుతున్నాయో... వీటినెలా నివారించాలో వివరించే ‘వెల్త్‌’ స్టోరీ ఇది... ‘ఎండోమెంట్‌’ ఇష్టమైతే... కష్టమే జీవిత బీమా తీసుకోవాలనుకున్నవారు ఎక్కువగా ఎండోమెంట్‌ ప్లాన్‌లను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇందులో లో పాలసీదారు మరణించినట్టయితే ఎంపిక చేసుకున్న కవరేజీ (సమ్‌ అష్యూర్డ్‌) మేర పరిహారం లభిస్తుంది. అలాకాకుండా పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా సరే... ఈ ప్లాన్‌లో ఇస్తామని చెప్పిన అంతిమ ప్రయోజనాన్ని అందిస్తారు. చాలా మందికి నచ్చేది ఇదే. ఎందుకంటే భారతీయ భావనలో ‘మనం లేకపోతే’ అనే పదం చాలామందికి నచ్చదు. మనం జీవించి ఉంటామన్న ఆశే అందరికీ ఉంటుంది. దానివల్లే... జీవించి ఉంటే ఇంత మొత్తం వస్తుందని ఎండోమెంట్‌ ప్లాన్లలో చెబుతుంటారు. చాలామంది దీన్ని చూసే కొంటుంటారు. కానీ ఇది సరికాదన్నది నిపుణుల మాట.తప్పనిసరిగా ‘టర్మ్‌’ ఉండాలి... అసలు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనే పేరులోనే ఉంది కదా... అది జీవితానికిచ్చే బీమా అని. మరి జీవితానికి బీమా చేసుకుంటే చాలు కదా! ఆ బీమా మొత్తం నుంచి కూడా పెట్టుబడి తరహాలో లాభాన్ని ఆశించటమెందుకు? లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్‌ ప్లాన్లు అన్నవి కేవలం రక్షణ కల్పించడానికే పనికొస్తాయి. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే ఇవి పరిహారాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ పాలసీ గడువు తీరాక కూడా పాలసీదారు జీవించి ఉంటే చేతికి రూపాయి కూడా రాదు. చాలా మందికి ఇదే నచ్చదు. ఒక్కసారి తేడా చూద్దాం!. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏడాదికి రూ.10–12 వేల ప్రీమియాన్ని చెల్లిచండానికి సిద్ధపడతే... ఎండోమెంట్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న సందర్భంలో రూ.2 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో కవరేజీ లభిస్తుంది. కాకపోతే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అయితే ఇంతే ప్రీమియానికి రూ.50 లక్షల వరకూ కవరేజీ లభిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షలు సరిపోతుందా? రూ.50 లక్షలయితే కొన్నాళ్లయినా ఆ కుటుంబం నిలదొక్కుకోగలదు కదా? పాలసీ గడువు ముగిశాక కూడా బతికి ఉంటే ఆ 2 లక్షలు వెనక్కి వస్తాయన్న ఉద్దేశంతో కంటే ఎండోమెంట్‌ పాలసీ మంచిదా? లేక పాలసీ గడువు ముగిశాక రూపాయి రాకపోయినా... ఈ మధ్యలో ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకోగల రూ.50 లక్షల పాలసీ మంచిదా? ఇదిగో... ఈ కోణంలో సమగ్రంగా ఆలోచిస్తే బీమా విషయంలో డబ్బులు వృథా కావు. తక్కువ కాలం... తక్కువ కవరేజీ వద్దు కొంతమంది జీవిత బీమా పాలసీలను 5 ఏళ్ల కాలానికి, పదేళ్ల కాలానికి, 15 ఏళ్ల కాలానికి కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు వీటినే అంటగట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి పాలసీలు అమ్మితే వారికి వచ్చే లాభం ఎక్కువ. ఎందుకంటే ఐదేళ్లు తిరిగేసరికి మీరు మళ్లీ ఇంకో పాలసీ తీసుకోక తప్పదు కదా... అందుకని!. ఇది కూడా డబ్బు వృథా చేయటమే. ఎందుకంటే పాలసీదారుకు కనీసం 70 ఏళ్లు వచ్చేవరకైనా కవరేజీ ఉండాలి. అది 30 ఏళ్ల వయసులో తీసుకున్నా... లేక 40 ఏళ్ల వయసులో తీసుకున్నా సరే!. ఎందుకంటే సాధారణ అంచనాల ప్రకారం పాలసీదారుకు , 70 ఏళ్లు వచ్చేసరికి తన పిల్లలు కూడా పెద్దవాళ్లయి ఉంటారు. 70లోగా ఏమైనా జరిగితే... బీమా కవరేజీ మొత్తం కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఒకవేళ 70 ఏళ్లు పూర్తయినా తను జీవించి ఉంటే పాలసీగడువు ముగిసిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అప్పటికే కుటుంబం ఎంతో కొంత సెటిలై ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి దీర్ఘకాలానికి జీవితబీమా తీసుకోవాలి తప్ప... స్వల్ప కాలానికి తీసుకుంటే అది డబ్బులు వృథా చేయటమే. దీనికితోడు చిన్నచిన్న కవరేజీ కుటుంబానికి సరిపోదని గుర్తుంచుకోవాలి. కుటుంబ పెద్ద వార్షిక సంపాదనకు కనీసం 10 నుంచి 20 రెట్ల వరకు కవరేజీ ఉంటే మంచిది. ఈ స్థాయి కవరేజీకి ప్రీమియం కట్టడం కేవలం టర్మ్‌ ప్లాన్లలోనే సాధ్యం.యులిప్‌లూ ఎండోమెంట్‌ లాంటివే... యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యులిప్స్‌) కూడా ఒక రకంగా ఎండోమెంట్‌ లాంటివే. ఎండోమెంట్‌లో బీమా చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసి, వచ్చిన రాబడిని పాలసీదారులకు చెల్లిస్తారు. యులిప్‌లలో మోరా్టలిటీ, ప్రీమియం అలోకేషన్‌ తదితర చార్జీలు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. దీంతో ఎండోమెంట్‌ కంటే యులిప్‌లలో కొంచెం అదనపు రాబడి (8 శాతం వరకు) ఆశించొచ్చు. కానీ, వీటిల్లో మొదటి ఐదేళ్లు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. బీమా సంస్థలు చార్జీల రూపంలో ఎక్కువ మినహాయించుకుంటూ ఉంటాయి. పైగా ఇది కూడా బీమా, పెట్టుబడి కలిపిన సాధనం. కనుక కవరేజీ మెరుగ్గా ఉండదు. పన్ను మినహాయింపు చూడొద్దుఎండోమెంట్‌ ప్లాన్లలో మెచ్యూరిటీ గడువు తీరాక చేతికి అందే మొత్తంపై ఆదాయపు పన్ను ఉండదు. పైపెచ్చు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్‌ 80సీ కింద (పాత పన్ను విధానం) చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. చాలా మంది ఈ ప్రయోజనం కోసం ఎండోమెంట్‌ ప్లాన్‌ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి టర్మ్‌ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియంపైనా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే ఎండోమెంట్‌ ప్లాన్లతో చివర్లో వచ్చే మొత్తాన్ని చూసుకుంటే అది మనం చెల్లించిన ప్రీమియానికి సరిపడా ఉంటుంది. దీనికి బదులు తక్కువ ప్రీమియంతో వచ్చే టర్మ్‌ ప్లాన్‌ తీసుకుని, మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పన్ను పోను నికర రాబడి.. ఎండోమెంట్‌ ప్లాన్లలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంకా పెరుగుతుంది. రైడర్లూ అవసరమే.. → జీవిత బీమాలో అదనపు రైడర్లూ మంచివే. ఎందుకంటే దేశంలో జీవిత బీమా క్లెయిమ్‌లలో 70 శాతం ప్రమాద మరణాలు లేదా ప్రమాదం కారణంగా వైకల్యానికి సంబంధించినవే ఉంటున్నాయి. అయినాసరే చాలామంది ఈ రైడర్లను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయక్కర్లేదు. ఏటా రూ.200 నుంచి 1,000కే రైడర్‌లను పొందొచ్చు. → యాక్సిడెంటల్‌ డెత్, యాక్సిడెంటల్‌ టోటల్‌ అండ్‌ పర్మనెంట్‌ డిజేబిలిటీ (ప్రమాద మరణం లేదా అంగ వైక ల్యం) రైడర్‌ల ను తప్పకుండా జోడించుకోవాలి. → వేవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడర్‌ కూడా అవసరమే. దీనికి ప్రీమియం రూ.100–200 వరకే ఉంటుంది. ప్రమాదాల్లో వైకల్యం పాలైన సందర్భాల్లో భవిష్యత్తు ప్రీమియం చెల్లించాల్సిన అవసరాన్ని ఈ రైడర్‌ తప్పిస్తుంది. → జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా, చివరికి హోమ్‌ ఇన్సూరెన్స్‌ అయినా.. కనీసం రెండేళ్లకోసారి సమీక్షించుకోవాలి. ఆదాయంతోపాటు కుటుంబ బాధ్యతలూ పెరుగుతుంటాయి. తీసుకున్న కవరేజీ, అందులోని సదుపాయాలు తమ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే, అదనపు కవరేజీ తీసుకోవాలి.

Now Aadhaar Card Will Download on WhatsApp Know The Details Here3
వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్‌: ఇంత సింపులా..

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు చాలా అవసరం. ఇది కేవలం మనకు గుర్తింపుగా మాత్రమే కాకుండా.. అనేక వ్యవహారాల్లో ఉపయోగపడుతుంది. అయితే దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. కొన్నిసార్లు ఆధార్ సెంటర్లకు లేదా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి.. వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.ఇదివరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్‌తో వాట్సాప్‌లోనే ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే.. ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్‌తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. మైగవ్ హెల్ప్‌డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్➤ముందుగా మీ మొబైల్‌లో మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబరు +91-9013151515 ను సేవ్ చేయండి➤నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత.. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు "హాయ్" లేదా "నమస్తే" వంటి మెసేజ్‌ పంపండి.➤చాట్‌బాట్ అందించే ఎంపికల నుంచి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి➤మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి.. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.➤వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయాలి.➤వెరిఫికేషన్‌ పూర్తియన తర్వాత, చాట్‌బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.➤అందులో నుంచి ఆధార్ కార్డును ఎంచుకుంటే.. అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో వాట్సాప్‌లో కనిపిస్తుంది.యూజర్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందవచ్చు. ఆధార్ ఇప్పటికే డిజిలాకర్‌లో లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకపోతే వాట్సాప్ ఎంపికను ఉపయోగించే ముందు డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలి.ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!

Maruti Suzuki Victoris Hits 70000 Bookings4
70వేల మంది కొన్న కారు ఇది..

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి మారుతి సుజుకి.. తన విక్టోరిస్ కారు కోసం 70,000 బుకింగ్స్ అందుకుంది. కాగా అందులో 35వేలు కంటే ఎక్కువ డెలివరీలు పూర్తి చేసింది.గత ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మారుతి సుజుకి విక్టోరిస్.. అరీనా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. దీని ధరలు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి విక్టోరిస్ చూడటానికి కొంత.. గ్రాండ్ విటారా మాదిరిగా ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే రకమైన ఛాసిస్ & ఇంజిన్ ఎంపికలను పొందుతాయి. కాబట్టి విక్టోరిస్ 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ &1.5L స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలలో అమ్మకానికి ఉంది.ఇదీ చదవండి: ఇన్నోవా క్రిస్టాకు కౌంట్‌డౌన్!.. నిలిపివేతా?విక్టోరిస్ కారులో.. గ్రాండ్ విటారాలో అందుబాటులో లేని అనేక ఫీచర్స్ ఉన్నాయి. అందులో లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్‌తో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు.. హ్యాండ్స్-ఫ్రీ జెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్, 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

BSNL New Year Smart Annual Plan Rs 2799 Full Details5
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అన్‌లిమిటెడ్‌ కాల్స్

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పుడు తాజాగా 365 రోజుల ప్లాన్ ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.Start the New Year the smart way with #BSNL.Enjoy 365 days of worry-free connectivity at just ₹2799.Wherever the journey takes you, BSNL keeps you connected with 3GB/day data, unlimited calls, and reliable coverage all year long.Recharge smart via #BReX 👉… pic.twitter.com/T6at7LDTUU— BSNL India (@BSNLCorporate) January 4, 2026

Do You Know About 70 10 10 10 Rule and How To Money Management6
70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!

డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన విధంగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 70/10/10/10 ఫార్ములా ప్రకారం.. మీరు డబ్బును ఖర్చు చేస్తే.. తప్పకుండా ఆర్ధిక ఇబ్బందుల నుంచి భయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు వివరంగా..ఏమిటీ 70/10/10/10 ఫార్ములామీరు సంపాదించే డబ్బు లేదా నెలవారీ సంపాదనను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఎంత డబ్బు దేనికి ఖర్చు చేయాలనే విషయాన్ని ముంచుగానే ఊహించాలి. అప్పుడే.. నెల చివరలో కూడా డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.70 శాతం: మీ నెల జీతంలో 70 శాతం డబ్బును.. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కోసం, ప్రయాణ ఖర్చులకు, పిల్లల ఖర్చులు, బీమా వంటి వాటికోసం కేటాయించాలి. అంటే.. ప్రస్తుత జీవన విధానం కోసం ఆ డబ్బును వెచ్చించాలన్నమాట.10 శాతం: మీ నెల జీతంలో 10 శాతాన్ని పొదుపు (సేవింగ్స్) చేయడానికి కేటాయించాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే.. భవిష్యత్తు కోసం కూడా తప్పకుండా కొంత డబ్బు పొదుపు చేయాల్సిందే.10 శాతం: మీ నెల సంపాదనలో మరో 10 శాతం.. అత్యవసర నిధి మాదిరిగా.. అంటే ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక వైద్యం కోసం.. కొన్ని గృహోపకరణాల కోసం కూడా దీనిని కేటాయించుకోవచ్చన్నమాట.10 శాతం: మిగిలిన 10 శాతం.. ఈఎంఐ, లేదా అప్పులు వంటివి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేలా అప్పు లేదా ఈఎంఐ లేకపోతే.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విదేశీ విద్య కోసం కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.మీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకుంటే.. అందులో రూ. 70వేలు (70 శాతం) ఇంటి అద్దె మొదలైనవాటికి, మిగిలిన 30 శాతాన్ని ఫార్ములా ప్రకారం కేటాయించుకోవాలి. ఈ ఫార్ములా మీరు పాటిస్తే.. ఉన్న డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement
Advertisement
Advertisement