ప్రధాన వార్తలు
కొత్త ఫోన్: పోకో ఎం8 5జీ వచ్చేసింది..!
స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘పోకో’ భారత మార్కెట్లో ‘పోకో ఎం8 5జీ’ పేరుతో 5జీ స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. మిడ్రేంజ్ ధర విభాగపు కస్టమర్లే లక్ష్యంగా వచ్చిన ఈ స్మార్ట్ఫోన్లో శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ను అమర్చారు. 6.77 అంగుళాల 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇది 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. వెట్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో తడిచేతులతో ఉపయోగించినా, తేలికపాటి వర్షంలోనూ పనిచేస్తుంది. వెనుక భాగంలో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ లైట్ ఫ్యూజన్ 400 సెన్సర్ అందించారు.ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 5,520ఎంహెచ్ఏ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. ఇది 45డబ్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, అలాగే 18డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లు ఉంటాయి. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.21,999గా.. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ. 21,999గా ఉంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
బ్యాంకులకు వారమంతా సెలవులే!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల షెడ్యూల్ను ప్రకటించింది. స్వామి వివేకానంద జయంతి, మకర సంక్రాంతి, తిరువళ్లువర్ దినోత్సవం, ఉళవర్ తిరునాళ్ వంటి పండుగల నేపథ్యంలో వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు వారపు సెలవులుగా పాటిస్తాయి. ఇదే క్రమంలో ఈ జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు (వారాంతాలు కలుపుకొని) ఉంటాయి.ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా సెలవులు మారవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందువల్ల ఖాతాదారులు తమ స్థానిక బ్యాంకు శాఖ సెలవు షెడ్యూల్ను ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం అవసరం.వచ్చే వారం బ్యాంకు సెలవులు ఇవే..జనవరి 12: స్వామి వివేకానంద జయంతి – పశ్చిమ బెంగాల్జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు – గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోంజనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాళం / పొంగల్ / మాఘే సంక్రాంతి / మకర సంక్రాంతి – తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కింజనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం – తమిళనాడుజనవరి 17: ఉళవర్ తిరునాళ్ – తమిళనాడుజనవరి 18: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవుబ్యాంకులు మూసివున్నా ఇవి పనిచేస్తాయిబ్యాంకు సెలవు దినాల్లో కూడా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఏటీఎం నగదు ఉపసంహరణ వంటి సేవలను సాధారణంగానే వినియోగించుకోవచ్చు. అయితే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం చెక్కులు, ప్రామిసరీ నోట్లకు సంబంధించిన లావాదేవీలు సెలవు రోజుల్లో జరగవు.
ఆయిల్ పామ్ సాగుపై పెరుగుతున్న ఆసక్తి
వంటనూనెల పంటలతో పోలిస్తే అయిదు రెట్లు అధిక దిగుబడి, దాదాపు 30 ఏళ్ల వరకు ఉత్పాదకత ఉండే ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈవో (ఆయిల్ పామ్ బిజినెస్) సౌగత నియోగి తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీలు, ధరలకు హామీ, ప్రోత్సాహకాలను ఇస్తుండటం తదితర చర్యలు దీనికి సానుకూలంగా ఉంటున్నాయని చెప్పారు.దీనికి సంబంధించిన జాతీయ మిషన్ కింద 2019–20లో 3.5 లక్షల హెక్టార్లుగా ఉన్న ఆయిల్ పామ్ సాగును 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచుకోవాలని లక్ష్యాలు ఉన్నాయని నియోగి తెలిపారు. అయితే, గతేడాది నవంబర్ నాటికి ఇది లక్ష్యానికన్నా తక్కువగా 6.20 లక్షల హెక్టార్లకు మాత్రమే చేరినప్పటికీ, సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతుండటం సానుకూల అంశమన్నారు.విస్తరణకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, పర్యావరణహితమైన సాగు విధానాల్లాంటివి అమలైతే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నియోగి చెప్పారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన, లాభదాయకమైన పంటగానే కాకుండా దేశీయంగా వంటనూనెల భద్రత సాధనకు కూడా ఉపయోగపడగలదని వివరించారు.
ఇంటికి లగ్జరీ లుక్.. కిటికీలోనే ఉంది కిటుకు!
ఇంటీరియర్లో అద్దాలు భాగమైపోయాయి. రంగులు, మొక్కలు, ఫర్నీచర్ మాత్రమే కాదు విండోలతోనూ ఇంటికి లగ్జరీ లుక్ వస్తుంది. ఇన్సులేషన్ కిటికీలతో ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించే గుణం ఉండటమే వీటి ప్రత్యేకత అని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు. దుమ్ము, ధూళిలతో పాటు శబ్ధాబ్దాలను ఇంటి లోపలికి రాకుండా ఈ కిటికీలు అడ్డుకుంటాయని చెబుతున్నారు.కాలుష్యం, రణగొణ ధ్వనులతో బిజీబిజీగా ఉంటే మెట్రో నగరాలలో నిశ్శబ్ద, ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకోవడం సహజమే. అందుకే గృహ కొనుగోలుదారులు హరిత భవనాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే గృహ నిర్మాణ ప్రాజెక్ట్లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో బిల్డర్లు అపార్ట్మెంట్ల డిజైనింగ్ దశ నుంచే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లగ్జరీ లుక్తో పాటు ఆహ్లాదభరిత వాతావరణం కల్పించేందుకు పెద్ద కిటికీలను ఎంపిక చేస్తున్నారు. గ్లేజింగ్, సీలింగ్ సాంకేతికతలతో తయారైన కిటికీలు మార్కెట్లో హాట్ ఫేవరేట్గా మారాయి.సంప్రదాయ సింగిల్ గ్లేజ్ విండోలతో బయటి నుంచి శబ్దాలు, దుమ్ముధూళి వంటివి సులభంగా ఇంటి లోపలికి వస్తాయి. అలాగే అపార్ట్మెంట్లలో పైఅంతస్తులలోని నివాసితుల హడావుడి, పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్, నిర్మాణ సంబంధిత ధ్వనులు కిటికీ ఫ్రేమ్ల చుట్టూ ఉన్న చిన్న ఓపెనింగ్ల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో నివాసితులకు చికాకు, ఒత్తిడి వంటివి కలుగుతాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది కస్టమర్లు మెరుగైన ఉష్ణోగ్రతలను నిర్వహించే ఇన్సులేటింగ్ గ్లాస్ కిటికీలను ఎంచుకుంటున్నారు.రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు షీట్లతో తయారైన ఈ విండోల మధ్యలో గాలి లేదా ఇతర వాయువుతో నిండి ఉంటుంది. దీంతో వేసవి కాలంలో ఇంటి లోపల వాతావరణం వెచ్చగా ఉండకుండా శీతాకాలంలో వేడిని బయటకు వెళ్లకుండా ఇన్సులేషన్ను అందిస్తాయి. ఫలితంగా ఇన్సులేటింగ్ గ్లాస్ కిటికీలు ఉన్న ఇంట్లో ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది.లామినేటెడ్ గ్లాస్ కిటికీలకు ధ్వనిని నియంత్రించే గుణం ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు పొరలతో తయారయ్యేదే లామినేటెడ్ గ్లాస్లు. ఇవి హానికారక యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. ఇంటి లోపల అధిక వేడిని తగ్గిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కోసం టెంపర్డ్ గ్లాస్ ఉత్తమమైంది. దీనికి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉంటుంది. వీటిని ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలలో వినియోగిస్తుంటారు.ఇది చదివారా? ఇళ్లు మారేవారికి.. ఇదో మంచి మార్గం!మీ ఇల్లు అధిక ధ్వనులు విడుదలయ్యే ప్రాంతాలైన విమానాశ్రయం, పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వీధులకు చేరువలో ఉంటే.. మీ ఇంట్లో తప్పనిసరిగా అకౌస్టిక్ విండోలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అదనపు సౌండ్ ఫ్రూఫింగ్ వీటి సొంతం. బహుళ గాజులు, ఇతరత్రా పదార్థాలతో తయారైన ఈ కిటికీలు బయటి శబ్దాలను ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీంతో ఎళ్లవేళలా ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
పెర్ఫ్యూమ్ బ్రాండ్లకు నిధుల పరిమళం
సాక్షి, బిజినెస్ డెస్క్: కొంతకాలంగా దేశీ ఫ్రాగ్రెన్స్ మార్కెట్పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త తరం లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్లు పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఫ్రాగానోట్స్ గతేడాది ఆగస్టులో రుకమ్ క్యాపిటల్ నుంచి ప్రీ–సిరీస్ ఫండింగ్ కింద 1 మిలియన్ డాలర్లు సమీకరించింది. అటు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిరా ఫ్రాగ్రెన్సెస్ మాతృ సంస్థ మియోలా గతేడాది అక్టోబర్లో ప్రీ–సిరీస్ ఎ రౌండ్ కింద 6 మిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. ఇక ఇండోర్కి చెందిన హౌస్ ఆఫ్ ఈఎం5 సంస్థ బోట్ సహవ్యవస్థాపకుడు అన్ గుప్తా నుంచి నిధులు సేకరించింది. ఇప్పటివరకు రూ. 5–6 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరోవైపు, గుజరాత్కి చెందిన అదిల్ ఖాద్రి బ్రాండ్.. షార్క్ ట్యాంక్ ఇండియా షోలో రూ. 50 లక్షల ఫండింగ్ దక్కించుకుంది. 2023లో ఏర్పాటైన గుడ్మెల్ట్స్ అనే బ్రాండ్ కూడా ఆనికట్ క్యాపిట్ల నుంచి ప్రీ–సీడ్ ఫండింగ్ని సమకూర్చుకుంది. భారీగా కార్యకలాపాల విస్తరణ.. శశాంక్ చౌరీ ప్రారంభించిన హౌస్ ఆఫ్ ఈఎం5 తొలి ఏడాదిలో (2022–23) కేవలం 900 ఆన్లైన్ ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం రోజుకు 2,000 ఆర్డర్లు, నెలకు దాదాపు 80,000 పైగా బాటిల్స్ని విక్రయిస్తోంది. కంపెనీ కస్టమర్లలో అత్యధిక శాతం వాటా 28–45 ఏళ్ల వారిదే ఉంటోంది. గత మూడేళ్లలో హౌస్ ఆఫ్ ఈఎం5 సుమారు రూ. 200 కోట్ల టర్నోవరు సాధించింది. వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆఫ్లైన్లో కూడా కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఆ తర్వాత అమెజాన్ ఫస్ట్ ద్వారా గ్లోబల్గా కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. తమ కంపెనీ లాభాల్లోనే కొనసాగుతోందని, ఇన్వెస్టర్లు ఆసక్తిగానే ఉన్నా, ప్రస్తుతం మరిన్ని నిధులు సమీకరించాల్సిన తక్షణ అవసరమేమీ లేదని శశాంక్ తెలిపారు. మరోవైపు, 2018లో ప్రారంభమైన ఆదిల్ ఖాద్రి ప్రీమియం సెగ్మెంట్పై ప్రధానంగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ప్రతి నెలా రూ. 11–12 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. థర్డ్ పార్టీ తయారీ సంస్థ భాగస్వామ్యంతో నాలుగైదు నెలలకు సరిపడ నిల్వలను ఉత్పత్తి చేసి పెట్టుకుంటోంది. అంతర్గతంగా నిధులతోనే విస్తరణ చేపడుతోంది. హైదరాబాద్తో పాటు ముంబై, లక్నో, జైపూర్, సూరత్, అహ్మదాబాద్ తదితర నగరాల్లో దాదాపు 50 స్టోర్స్ నిర్వహిస్తోంది. వచ్చే రెండున్నర–మూడేళ్లలో స్టోర్స్ సంఖ్యను 111కి పెంచుకునే యోచనలో ఉంది. 2 బిలియన డాలర్ల మార్కెట్.. దేశీఫ్రాగ్రెన్స్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం సుమారు 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఓ నివేదికలో తెలిపింది. ఇది 2030 నాటికి 4.08 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పెర్ఫ్యూమ్ బ్రాండ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2022లో గరిమా కక్కర్ ప్రారంభించిన ఫ్రాగానోట్ వచ్చే రెండేళ్లలో మెట్రోల్లో ఆఫ్లైన్ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అలాగే వారణాసి, సోలన్లాంటి ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లపైనా దృష్టి పెడుతోంది. ప్రధానంగా వచ్చే మూడేళ్లలో ప్రీమియం అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అటు హీరా ఫ్రాగ్రెన్సెస్ మాతృ సంస్థ మియోలా కూడా వచ్చే 12–18 నెలల్లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది. ఇటీవలే సమీకరించిన నిధుల్లో నుంచి సుమారు 2–2.2 మిలియన్ డాలర్లను ఇందుకోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది.
మళ్లీ మొబైల్ చార్జీల మోత
న్యూఢిల్లీ: టెలికం చార్జీల మోతకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి టారిఫ్లను టెల్కోలు సుమారు 15 శాతం పెంచే అవకాశం ఉంది. దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి రెట్టింపు కానుంది. ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ఒక నివేదికలో ఈ విషయాలు పేర్కొంది. 2026 ప్రథమార్ధంలో జియో ప్రతిపాదిత ఐపీవోతో టెలికం పరిశ్రమ వేల్యుయేషన్ పెరుగుతుందని రిపోర్టును రూపొందించిన ఈక్విటీ అనలిస్ట్ అక్షత్ అగర్వాల్ పేర్కొన్నారు. గతంలో ధోరణులకు తగ్గట్లుగా దాదాపు రెండేళ్ల తర్వాత దేశీయంగా జూన్లో మొబైల్ టారిఫ్లు 15 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 16 శాతానికి చేరొచ్చని తెలిపారు. డేటా, పోస్ట్పెయిడ్ వినియోగం పెరుగుతుండటంతో మొబైల్ ఏఆర్పీయూ (యూజరుపై సగటున వచ్చే ఆదాయం) పెరుగుతోందని నివేదిక తెలిపింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఇన్వెస్టర్లకు రెండంకెల స్థాయిలో రాబడిని ఇచ్చేందుకు, భారతి ఎయిర్టెల్కి దాదాపు సరిసమానమైన వేల్యుయేషన్ని పొందేందుకు జియో సుమారు 10–20 శాతం మేర మొబైల్ టారిఫ్లు పెంచవచ్చు. → ఏజీఆర్ బాకీలపై ప్రభుత్వం 5 ఏళ్ల మారటోరియం ఇవ్వడం వల్ల 2026–30 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన మొత్తం.. 35–85 శాతం మేర తగ్గుతుంది. అయినప్పటికీ చెల్లింపులు జరిపేందుకు 2027–2030 ఆర్థిక సంవత్సరాల మధ్య మొబైల్ సరీ్వసుల రేట్లు 45 శాతం మేర పెంచాల్సి ఉంటుంది. → పెట్టుబడి వ్యయాలు తగ్గడం వల్ల టెల్కోల మార్జిన్లు పెరగవచ్చు. 5జీ నెట్వర్క్ విస్తరణ దాదాపు పూర్తయ్యింది. 2025 ఆర్థిక సంవత్సరం నుంచే పెట్టుబడి వ్యయాలు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశం ఉంది.
కార్పొరేట్
ఆయిల్ పామ్ సాగుపై పెరుగుతున్న ఆసక్తి
మళ్లీ మొబైల్ చార్జీల మోత
ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఎప్పటినుంచంటే?
జోహో ఫౌండర్ విడాకులు: తెరపైకి రూ.15వేల కోట్ల వివాదం!
ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?
H-1B వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమల్లోకి!
ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్
కొత్త ఏడాదిలో ఐటీ ఉద్యోగాలు ఇలా..
చిక్కుముడిలో రూ.1.52 లక్షల కోట్లు.. ప్రభుత్వం క్షమాభిక్ష?
అప్రెంటిస్షిప్ పట్ల మహిళల్లో ఆసక్తి
భారత్ కోకింగ్ కోల్కు యాంకర్ నిధులు
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ పీఎస్యూ దిగ్గజం కోల్ ఇం...
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్
వరుస నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ల...
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్
బీఎస్ఈ ఎక్స్ఛేంజ్లోని బెంచ్మార్క్ ఇండెక్స్ సె...
పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. గంటల వ్యవధిలో...
విదేశీ కాసుల గలగల.. పెరిగిన ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు డిసెంబర్ 26తో ముగిసిన వారంలో...
ఆర్ధిక వ్యవస్థలో భారత్.. జర్మనీని అధిగమించాలంటే?
2025 చివరి నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి.. ప్...
చెక్కుల తక్షణ క్లియరెన్స్ రెండో దశ వాయిదా
చెక్కుల చెల్లింపులను వేగవంతం చేసే రెండో దశ అమలును ...
న్యూజిలాండ్ ఎఫ్టీఏతో ఎగుమతులకు దన్ను
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంత...
ఆటోమొబైల్
టెక్నాలజీ
శాంసంగ్ కొత్త టెలివిజన్.. ఇలాంటిది ఇదే తొలి టీవీ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్ టెలివిజన్ను తీసుకొచ్చింది. ‘సీఈఎస్ 2026’లో ప్రపంచంలోనే మొట్టమొదటి 130-అంగుళాల మైక్రో ఆర్జీబీ టీవీ (R95H మోడల్)ను ఆవిష్కరించింది. ఇది శాంసంగ్ ఇప్పటివరకు రూపొందించిన అతిపెద్ద మైక్రో ఆర్జీబీ డిస్ప్లే మాత్రమే కాదు, అల్ట్రా-ప్రీమియం టీవీల డిజైన్, టెక్నాలజీలో ఒక కొత్త దిశను సూచిస్తోంది.“మైక్రో ఆర్జీబీ మా పిక్చర్ క్వాలిటీ ఆవిష్కరణలో అత్యున్నత స్థాయి. ఈ 130-అంగుళాల మోడల్ ఆ దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్తుంది” అని శాంసంగ్ విజువల్ డిస్ప్లే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హన్ లీ తెలిపారు. “టెక్నాలజీని కళగా మలిచే మా ఒరిజినల్ డిజైన్ తత్వాన్ని ఆధునిక ఇంజనీరింగ్తో మళ్లీ పరిచయం చేస్తున్నాం” అన్నారు.టీవీ ఫీచర్లుఈ మైక్రో ఆర్జీబీ టీవీ భారీ పరిమాణం, నెక్స్ట్-జనరేషన్ కలర్ టెక్నాలజీ, ప్రీమియం డిజైన్ల సమ్మేళనం. ‘టైమ్లెస్ ఫ్రేమ్’ డిజైన్తో రూపొందిన ఈ టీవీ, గదిలో ఒక సాధారణ స్క్రీన్లా కాకుండా ఒక విశాలమైన, లీనమయ్యే కళాఖండంలా కనిపిస్తుంది.130-అంగుళాల మోడల్లో మైక్రో ఆర్జీబీ ఏఐ ఇంజిన్ ప్రో, కలర్ బూస్టర్ ప్రో, హెచ్డీఆర్ ప్రో వంటి అధునాతన టెక్నాలజీలు ఉన్నాయి. ఇవి ఏఐ సహాయంతో రంగుల స్పష్టత, కాంట్రాస్ట్, వివరాలను మెరుగుపరుస్తాయి.మైక్రో ఆర్జీబీ ప్రెసిషన్ కలర్ 100 ద్వారా 100% బీటీ.2020 వైడ్ కలర్ గ్యామట్ను అందిస్తుంది. వీడీఈ సర్టిఫికేషన్తో, నిజ జీవితానికి దగ్గరగా రంగులను ప్రదర్శిస్తుంది. శాంసంగ్ గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ ప్రతిబింబాలను తగ్గించి అన్ని లైటింగ్ పరిస్థితుల్లో స్పష్టమైన వీక్షణను ఇస్తుంది.ఈ టీవీ హెచ్డీఆర్10+ అడ్వాన్స్డ్, ఎక్లిప్సా ఆడియో, అలాగే మెరుగైన విజన్ ఏఐ కంపానియన్కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ ఫుట్బాల్ మోడ్ ప్రో, ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రో, లైవ్ ట్రాన్స్లేట్, జనరేటివ్ వాల్పేపర్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్ప్లెక్సిటీ వంటి ఫీచర్లతో స్మార్ట్ అనుభవాన్ని అందిస్తుంది.
జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!
దేశీయ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.కంపెనీ పరిచయం చేసిన ఈ లేటెస్ట్ రూ. 91 ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 50 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వర్తించదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశ్యంతో.. జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది.ఇతర రీఛార్జ్ ప్లాన్స్!రూ.3,599 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్: లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.
ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!
ఐటీ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు, వెసులుబాటులూ ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు రోజుకో కొత్త కఠిన నియమాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పూర్తిగా తొలగించాయి. ఆఫీస్కు హాజరును తప్పనిసరి చేశాయి.దేశీ సాఫ్గ్వేర్ దిగ్గజం విప్రో.. తన హైబ్రిడ్ పని విధానాలకు మరింత పదునుపెట్టింది. కఠినమైన కార్యాలయ హాజరు నిబంధనలను ప్రవేశపెట్టింది. వారానికి మూడు రోజులు ఆఫీస్కు వస్తున్న ఉద్యోగులు ఏదో సమయంలో వచ్చి వెళ్లేవారు. కానీ ఇకపై అలా కుదరదు. ఆఫీస్కు వచ్చిన ఉద్యోగులు కనీసం ఆరు గంటలు విధుల్లో ఉండాల్సిందే.ఎకనామిక్ టైమ్స్ కథనం నివేదిక ప్రకారం.. జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు ఆఫీస్కు వచ్చినప్పుడు వేసే మొదటి "ఇన్" పంచ్కు, వెళ్లేటప్పుడు ఇచ్చే "అవుట్" పంచ్కు మధ్య ఈ సమయాన్ని లెక్కిస్తారు. ఈ హాజరు సమయాన్ని సిస్టమ్ నేరుగా లీవ్స్ బ్యాలెన్స్తో అనుసంధానిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగికి వారంలో అవసమైనంత మేర హాజరు సమయం లేకపోతే వారి లీవ్స్ బ్యాలెన్స్లో కోత విధిస్తారు.అయితే ఈ ఆరు గంటల వర్క్ అవర్స్ కార్యాలయంలో గడిపే సమయానికి మాత్రమే వర్తిస్తుందని విప్రో స్పష్టం చేసింది. మొత్తం రోజువారీ 9.5 పని గంటల్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు.ఇదీ చదవండి: పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్
అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!
ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లింక్పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్తసోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸Sounds too good to be true? Think again! A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck🚫 This is a SCAM!🚫… pic.twitter.com/FcmmBU56LS— PIB Fact Check (@PIBFactCheck) January 5, 2026
పర్సనల్ ఫైనాన్స్
పర్సనల్ లోన్ vs టాప్-అప్ లోన్: ఏది బెస్ట్?
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసే వారైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో లోన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. పర్సనల్ లోన్ & టాప్-అప్ లోన్లలో ఏది బెస్ట్. మీ సందేహానికి.. ఈ కథనమే సమాధానం.పర్సనల్ లోన్పర్సనల్ లోన్ గురించి దాదాపు అందరికీ తెలుసు. విద్య, పెళ్లి, వైద్య ఖర్చులు, ట్రావెల్ వంటి వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువమంది ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్కు అప్రూవల్ ప్రక్రియ కొంత వేగంగా ఉంటుంది. అంతే కాకుండా డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా కొంత తక్కువే.పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కూడా కొంత ఎక్కువే. మొత్తం మీద మీరు తీసుకున్న లోన్ మీద కొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.టాప్ అప్ లోన్టాప్ అప్ లోన్ విషయానికి వస్తే.. ఇది మీరు ఇప్పటికే తీసుకున్న లోన్పైనే అదనంగా ఇచ్చే లోన్ అన్నమాట. ఒక వ్యక్తి లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్న సమయంలో.. బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.టాప్ అప్ లోన్ తీసుకోవడం వల్ల.. వడ్డీ రేటు కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమ్ లోన్ మీద తీసుకునే టాప్-అప్ లోన్కు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈఎంఐ కూడా పర్సనల్ లోన్తో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టాప్ అప్ లోన్ కావాలంటే.. మీరు ఇప్పటికే లోన్ తీసుకుని ఉండాలి. సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.పర్సనల్ లోన్ అనేది అత్యవసరంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది. టాప్ అప్ లోన్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు. లోన్ తీసుకుని, సమయానికి చెల్లించేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి.. మీ సౌలభ్యం, అవసరాన్ని బట్టి.. ఏ లోన్ తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి.
అవీవా లైఫ్ నుంచి కొత్త టర్మ్ ప్లాన్
అవీవా ఇండియా ‘అవీవా స్మార్ట్ వైటల్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే జీవిత బీమాకు రణ కల్పించే అచ్చమైన స్థిర ప్రయోజన పాలసీ. కనీసం రూ.10 లక్షల నుంచి బీమా రక్షణ మొదలవుతుంది. 49 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడి, 15 రోజుల పాటు జీవించి ఉంటే ఈ ప్లాన్లో రూ.10/15/20 లక్షలు ఒకే విడత ప్రయోజనం అందిస్తారు.పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. రోజువారీ నడక ద్వారా ఇందులో రివార్డులు జమ చేసుకోవచ్చు. వీటి ద్వారా బీమా రక్షణను రెండు రెట్లకు పెంచుకోవచ్చు. రూ.20–50 ఏళ్ల మధ్య వయసు వారు పాలసీని 10–15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఇందులో ప్రీమియం చెల్లింపునకు వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ వంటి సౌకర్యవంతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ కాలంలో బీమాదారు మరణిస్తే నామినీకి ముందుగా నిర్ణయించిన సమ్ అష్యూర్డ్ను చెల్లిస్తారు. అవసరమైతే అదనపు రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని వయసు, బీమా కాలం, ఎంచుకున్న కవరేజ్ ఆధారంగా నిర్ణయిస్తారు.పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రీమియంపై మినహాయింపులు, క్లెయిమ్ మొత్తంపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రమాదాలకు రక్షణ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైన ఎంపికగా అవీవా ఇండియా పేర్కొంది.
యాక్సిస్ బ్యాంక్ యాప్లో ‘సేఫ్టీ సెంటర్’
డిజిటల్ మోసాల బారిన పడకుండా కస్టమర్లు తమ ఖాతాలను స్వయంగా నియంత్రించుకునే వీలు కల్పిస్తూ యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్ ‘ఓపెన్’లో ‘సేఫ్టీ సెంటర్’ ఫీచరును ప్రవేశపెట్టింది. సందేహాస్పద సందర్భాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్కి యాక్సెస్ని డిసేబుల్ చేసేందుకు, ఫండ్ ట్రాన్స్ఫర్లను బ్లాక్ చేసేందుకు, యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు, పరిమితులను సెట్ చేసేందుకు, కొత్త పేయీలను జోడించకుండా నివారించేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.దీనితో కస్టమర్ కేర్ సెంటర్ లేదా బ్రాంచీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖాతాను స్వయంగా నియంత్రించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అలాగే, బ్యాంకు మెసేజీల ప్రామాణికతను ధృవీకరించేలా ఎస్ఎంఎస్ షీల్డ్ సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, కళలు, సాహిత్యానికి సంబంధించిన ష్ల్పాష్ 2025 పోటీలను నిర్వహించినట్లు వివరించింది.ఇందులో దేశవ్యాప్తంగా 995 పాఠశాలల నుంచి 2.66 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు బ్యాంకు పేర్కొంది. దక్షిణాదిలో హైదరాబాద్, వైజాగ్ సహా 308 స్కూళ్ల నుంచి 1.01 లక్షల మంది పాల్గొన్నట్లు వివరించింది. ఇందులో ఆరుగురు విజేతలకు రూ. 1 లక్ష చొప్పున, ఆరుగురు రన్నర్స్ అప్లకు తలో రూ. 50,000 చొప్పున బహుమతి ఉంటుంది.
బీమా అనైతిక విక్రయాలకు చెక్!.. ఐఆర్డీఏఐ
బీమా రంగంలో ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడం (అనైతిక మార్గాల్లో) ఆందోళన కలిగిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్ఈఏఐ) వార్షిక నివేదిక పేర్కొంది. అసలు దీనికి గల కారణాలను గుర్తించేందుకు బీమా సంస్థలు లోతైన విశ్లేషణ చేయాలని సూచించింది.2023–24లో జీవిత బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,20,726 ఫిర్యాదులు రాగా, 2024–25లోనూ ఇదే స్థాయిలో 1,20,429 ఫిర్యాదులు దాఖలైనట్టు తెలిపింది. అనైతిక వ్యాపార విధానాలపై మాత్రం ఫిర్యాదులు 23,335 నుంచి 26,667కు పెరిగినట్టు వెల్లడించింది. మొత్తం ఫిర్యాదుల్లో అనైతిక వ్యాపార పద్ధతులకు సంబంధించినవి 19.33 శాతం నుంచి 22.14 శాతానికి పెరిగినట్టు పేర్కొంది.వ్యక్తుల అవసరాలకు సరిపడని, నియమ, నిబంధనలు, షరతులు గురించి పూర్తిగా తెలియజేయకుండా, కేవలం ప్రయోజనాల గురించే చెబుతూ పాలసీలను విక్రయించడాన్ని మిస్ సెల్లింగ్గా చెబుతుంటారు. బ్యాంక్లు, బీమా ఏజెంట్ల రూపంలో ఈ తరహా విక్రయాలు సాగుతుంటాయి. ‘‘మిస్ సెల్లింగ్ను నిరోధించేందుకు గాను తగిన విధానాలను అమలు చేయాలని బీమా సంస్థలకు సూచించాం. ఉత్పత్తి అనుకూలతను అంచనా వేయడం (పాలసీదారునకు అనుకూలమైనా), పంపిణీ ఛానల్ వ్యాప్తంగా కొన్ని నియంత్రణలు అమలు చేయడం, మిస్ సెల్లింగ్పై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించడం, మూల కారణాలను గుర్తించేందుకు అధ్యయనం చేయాలని సూచించడమైంది’’అని ఐఆర్డీఏఐ తన 2024–25 నివేదికలో వివరించింది.తప్పుడు మార్గాల్లో బీమా ఉత్పత్తుల విక్రయంపై కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంక్లు, బీమా సంస్థలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండడం గమనార్హం. అనుకూలం కాని పాలసీలను విక్రయించడం పాలసీదారులు తర్వాత రెన్యువల్ చేసుకోరని, దాంతో పాలసీల రద్దునకు దారితీస్తున్నట్టు పేర్కొంది.బీమా విస్తరణ 3.7 శాతందేశంలో బీమా విస్తరణ 2024–25 సంవత్సరానికి జీడీపీలో 3.7 శాతంగా ఉన్నట్టు ఐఆర్డీఏఐ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు 7.3 శాతం కంటే సగమే. జీవిత బీమా రంగంలో విస్తరణ రేటు 2023–24లో ఉన్న 2.8 శాతం నుంచి 2024–25లో 2.7 శాతానికి తగ్గినట్టు తెలిపింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు మాత్రం యథాతథంగా ఒక శాతం వద్దే ఉంది.ఇదీ చదవండి: బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!


