Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Titan Q3 results: Net profit surges 61 percent to Rs 1684 crore: revenue jumps 43 percent1
టైటాన్‌ లాభం హైజంప్‌

న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ టాటా గ్రూప్‌ దిగ్గజం టైటాన్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 61 శాతం జంప్‌చేసి రూ. 1,684 కోట్లను తాకింది. దేశీయంగా జ్యువెలరీ అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1,047 కోట్లు ఆర్జించింది. అమ్మకాలు సైతం 42 శాతం ఎగసి రూ. 24,915 కోట్లను తాకాయి. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 23,192 కోట్లకు చేరాయి. కాగా.. ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్‌ 43 శాతం బలపడి రూ. 25,567 కోట్లకు చేరింది. తనిక, మియా, జోయా, కేరట్‌లేన్‌ బ్రాండ్ల జ్యువెలరీ బిజినెస్‌ ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 23,492 కోట్లయ్యింది. వీటిపై 11 శాతం మార్జిన్లు సాధించింది. అంతర్జాతీయ అమ్మకాలు 83 శాతం దూసుకెళ్లి రూ. 1,058 కోట్లను తాకాయి. జ్యువెలరీ బిజినెస్‌లో 49 స్టోర్లను కొత్తగా జత కలుపుకోగా.. వీటిలో 24 కేరట్‌లేన్‌ విభాగానివే. 22 కొత్త స్టోర్లను జత చేసుకున్న వాచీలు తదితరాల విభాగం 14 శాతం అధికంగా రూ. 1,295 కోట్ల ఆదాయం అందుకుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.25 శాతం బలపడి రూ. 4,267 వద్ద ముగిసింది.

Gold ETFs alone accounted for approximately  Rs 24040 crore2
బంగారమే బిగ్‌ బాస్‌

న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్‌లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్‌లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్‌కు మించి బంగారం ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్‌ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్‌లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్‌ఆర్‌కే క్యాపిటల్‌ డైరెక్టర్‌ స్వప్నిల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌/ పన్ను ఆదా ఫండ్స్‌) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్‌లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్‌ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్‌ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్‌.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్‌ల్లోకి డిసెంబర్‌లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్‌లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి.

Pet Friendship: Growing craze for AI animal breeding3
బిలియన్‌ డాలర్ల...భావోద్వేగాల బిజినెస్‌

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: భారత్‌లో ఇప్పుడు కొత్త తరహా డిజిటల్‌ స్నేహితులు అడుగుపెడుతున్నారు. ఏఐ ఆధారిత వర్చువల్‌ పెట్స్‌ (ఏఐ పెట్స్‌) యువతలో వేగంగా ఆదరణ పొందుతున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒంటరితనం, నిజమైన పెంపుడు జంతువుల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితుల్లో ఏఐ పెట్స్‌ ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భావోద్వేగంగా స్పందించడం, మాటలతో ఆదుకోవడం వంటి లక్షణాల వల్ల ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. వీటితో యూజర్లు నిజమైన జంతువును పెంచుకుంటున్న అనుభూతి పొందుతారు.వీటితో కూడా రోజువారీ రొటీన్‌ను ఫాలో అవచ్చు. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, నిద్ర షెడ్యూల్‌ చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిజమైన పెంపుడు జంతువును ఆడించినట్లే ఆనందిస్తారు. ఈ పెట్‌ అప్లికేషన్లలో వినియోగదారులు తమ పెంపుడు జంతువుకు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. నెలకు సగటున రూ. 30 నుంచి రూ. 60 వరకు ఖర్చు చేస్తూ, ఆ ఏఐ పెట్‌ను సంరక్షించడం, శిక్షణ ఇవ్వడం, భావోద్వేగంగా స్పందించేలా నేరి్పంచడం చేస్తున్నారు. పెరుగుతున్న మార్కెట్‌ వర్చువల్‌ పెట్స్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతం సుమారు 150 మిలియన్‌ డాలర్లని అంచనా. వెంచర్‌ క్యాపిటలిస్టులు ఈ రంగం 35–40 శాతం వార్షిక వృద్ధితో బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఊహిస్తూ అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ యాప్‌లు ప్రధానంగా సబ్ర్‌స్కిప్షన్లు,ఇన్‌–యాప్‌ కొనుగోళ్లు, పెట్‌ యాక్సెసరీస్‌ ద్వారా ఆదాయం పొందుతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాయిస్‌ ఆధారిత ఇంటరాక్షన్, మల్టీప్లేయర్‌ ఫీచర్లు, వివిధ లొకేషన్లలో పెట్స్‌ను కలుసుకునే అవకాశాలతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. అయితే ఏఐ పెట్స్‌ టెక్నాలజీ నిజమైన మానవ సంబంధాల నుంచి మనుషులను దూరం చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.టమాగోచ్చి నుంచి ఏఐ వరకువాస్తవానికి డిజిటల్‌ పెట్స్‌ కాన్సెప్ట్‌ కొత్తది కాదు. జపాన్‌లో 1990లలో వచి్చన టమాగోచ్చి వీడియో గేమ్‌ వర్చువల్‌ పెట్స్‌కు బాట వేసింది. ఆ తర్వాత 2000లలో టాకింగ్‌ టామ్, ఫ్రెండ్స్‌ యాప్స్, విడ్జెట్స్‌ వంటి అప్లికేషన్లు పాపులర్‌ అయ్యాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ వర్చువల్‌ పెట్స్‌ మరింత అడ్వాన్స్‌డ్‌గా మారాయి. పాకెట్‌ పెట్, క్రిప్టో కిట్టీస్, జూమీ వంటి యాప్‌లు యూజర్లు తమ ఊహలకు అనుగుణంగా పెంపుడు జంతువులను సృష్టించుకునే అవకాశం ఇస్తున్నాయి.

Silver dips Rs 7500 to Rs 2. 64 lakh per kg and gold rises by Rs 22004
తడబడిన వెండి ఎగసిన పసిడి

న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్‌కు ఒక డాలర్‌కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్‌ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్‌ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్‌ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జతీన్‌ త్రివేది తెలిపారు.

Today Gold and Silver Price In India Know The Latest Rates5
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..

భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.వెండి ధరలుఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట.

Hero Vida Ubex Electric Bike Design Patented in India6
ఈవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. వచ్చేస్తోంది విడా ఉబెక్స్!

హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని.. ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా, భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఉబెక్స్ పేరుతో విడుదల కానున్న ఈ బైక్ డిజైన్‌కు భారతదేశంలో పేటెంట్ కూడా లభించింది.విడా ఉబెక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొదటిసారి EICMA 2025లో కనిపించింది. ఆ సమయంలో ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ చిత్రాలు.. బైక్ సాధారణ వినియోగదారులకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు చూపిస్తున్నాయి.సాధారణ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కలిగిన విడా ఉబెక్స్ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్, విశాలంగా కనిపించే సింగిల్ పీస్ స్టెప్ సీటును పొందినట్లు స్పష్టమవుతోంది. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌, అల్లాయ్ వీల్స్, చిన్నగా రూపొందించిన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ బైక్ కొత్తగా కనిపించినప్పటికీ.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ బైకులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వెల్లడించలేదు. కానీ ఇందులో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో సహా కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?హీరో మోటోకార్ప్ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే దీనిని ఇండియన్ రోడ్ల మీద టెస్ట్ చేసిన తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ అయిన తరువాత హీరో ప్రీమియం డీలర్‌షిప్‌లు, విడా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement