Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BMW M440i Launched in India at Rs 1 09 crore1
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతో తెలుసా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్త M440iను భారతదేశంలో రూ.1.09 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా భిన్నంగా.. ఫోల్డబుల్ హార్డ్-టాప్ రూఫ్‌ పొందుతుంది.M440i కన్వర్టిబుల్‌ 3.0-లీటర్, ఆరు-సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా.. 369bhp పవర్, 500Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, బీఎండబ్ల్యూ xDrive ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ (AWD) పొందుతుంది. 4.9 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకునే ఈ కన్వర్టిబుల్ టాప్ స్పీడ్ 250 కిమీ/గం.డిజైన్ పరంగా.. ఈ మోడల్ పెద్ద కిడ్నీ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన బాడీవర్క్, స్పోర్టీ బంపర్‌లు పొందుతుంది. ఇది స్టాగర్డ్ సెటప్‌తో కూడిన 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, వెనుక భాగంలో వ్రాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.లోపల క్యాబిన్‌లో 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉన్నాయి. దీనికి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోల్స్టరీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది మెర్సిడెస్-బెంజ్ CLE క్యాబ్రియోలెట్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు NHAI హెచ్చరిక!

What Most People Get Completely Wrong About Passive Income Says Robert Kiyosaki2
'పాసివ్ ఇన్‌కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పాసివ్ ఇన్‌కమ్ గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాసివ్.. అంటే ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది ప్రారంభంలో చాలా శ్రమ, సమయం, జ్ఞానం అవసరమైన ప్రక్రియ. ముందుగా ఒక వ్యవస్థను నిర్మించాలి. ఆ తర్వాతే అది మనకు డబ్బు తీసుకువస్తుంది.పూర్తిగా యాక్టివ్ వర్క్ముందు పాసివ్ అనే పదం కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. ప్రారంభ దశలో.. ఇది పూర్తిగా యాక్టివ్ వర్క్. అంటే.. మీరు పెట్టుబడి పెట్టాలి, నేర్చుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఒక అద్దె ఇల్లు కొనాలంటే మీరు మార్కెట్, ఖర్చులు, లాభాలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు. కష్టపడి నిర్మించిన ఆస్తుల ద్వారా ఆదాయం!చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. పాసివ్ ఇన్‌కమ్ అంటే ''ఎటువంటి శ్రమ లేకుండా వచ్చే ఆదాయం'' అని భావించడం. నిజానికి అలాంటి ఆదాయం ఉండదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది లీవరేజ్ ఆధారంగా వస్తుంది. అంటే.. మీరు ఒకసారి కష్టపడి నిర్మించిన ఆస్తులు తరువాత మీకు ఆదాయం తీసుకువస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాయల్టీలు, లేదా డివిడెండ్లు కావచ్చు.పాసివ్ ఇన్‌కమ్ సాధించాలంటే మూడు ముఖ్యమైన దశలుమొదటిది, ఆర్థిక విద్య. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది విస్మరించే అంశం.రెండవది, నిజంగా డబ్బు తెచ్చే ఆస్తిని సృష్టించడం లేదా కొనుగోలు చేయడం. ఇది కేవలం భవిష్యత్తులో పెరుగుతుందని ఆశించే ఆస్తి కాకుండా, ప్రతి నెలా ఆదాయం తెచ్చే ఆస్తి కావాలి. మూడవది.. ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఆస్తిని రక్షించడం.మధ్యతరగతి ఎందుకు ఇక్కడే ఆగిపోతుంది అంటే, వారికి ఒకే మార్గం చూపించారు. మంచి ఉద్యోగం పొందాలి, డబ్బు సేవ్ చేయాలి, రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. కానీ ఇది పాసివ్ ఇన్‌కమ్ నిర్మించడానికి ఇది సరిపోదు. ఇది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.చివరగా, మనం తెలుసుకోవాల్సిన అంశం ''పాసివ్ ఇన్‌కమ్ ఎలా సంపాదించాలి?'' కాదు. దాన్ని సాధించడానికి నేను ఏమి నేర్చుకోవాలి?. పాసివ్ ఇన్‌కమ్ అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. ఇది మీరు సంపాదించిన జ్ఞానం, తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన ఆస్తుల ఫలితం.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

Global Shift to Gold May Drive Prices to 8000 Dollars by 2031 Deutsche Bank3
'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!

Cotton Shipment Decline Hits India Textile Exports4
డీలాపడ్డ టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు: కారణం ఇదే!

పత్తి వంటి కీలక ఉత్పత్తుల రవాణా (షిప్‌మెంట్‌లు)లో తగ్గుదల కారణంగా టెక్స్‌టైల్స్, గార్మెంట్‌ ఎగుమతులు 2025–26లో 2.2% తగ్గి 35.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌(జీటీఆర్‌ఐ) ఈ విషయాలు వెల్లడించింది. రూపాయిపరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2.1% తగ్గాయి.ఆర్థిక సంవత్సరంలో పత్తి టెక్స్‌టైల్స్‌ (–3.9%), రెడీమేడ్‌ దుస్తులు (–1.4%), కార్పెట్లు (–5.3%) వంటి ప్రధాన విభాగాల్లో తగ్గుదల ధోరణి కనిపించింది. అయితే హస్తకళల ఎగుమతులు మాత్రం స్వల్పంగా 1.5% పెరిగాయి. ‘‘రూపాయి, డాలర్‌ మారకం వృద్ధిలో వ్యత్యాసం ఒక వ్యవస్థాత్మక సమస్యకు సంకేతం.భారత్‌ విలువపరంగా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో తక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఉదాహరణకు, మ్యాన్‌–మేడ్‌ టెక్స్‌టైల్స్‌ రూపాయి పరంగా 3.6% పెరిగినా, డాలర్‌ పరంగా 0.8% తగ్గాయి. అలాగే, గార్మెంట్స్‌ ఎగుమతులు రూపాయి పరంగా 2.9% పెరిగినా, డాలర్‌ పరంగా 1.4% క్షీణించాయి’’ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.కరెన్సీ క్షీణత వల్లే వృద్ధి కనిపిస్తోందే తప్ప పోటీ సామర్థ్యాల వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కీలకమైన గ్లోబల్‌ మార్కెట్లలో భారత్‌ విస్తరించలేకపోవడమో, లేదా మార్కెట్‌ వాటాను కోల్పోవడమో జరుగుతోందని, ముఖ్యంగా కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాల్లో ఇది ప్రస్ఫుటంగా ఉంటోందని వివరించారు.

Fix Your FASTag or Risk Blacklisting NHAI Alerts Vehicle Owners5
ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు NHAI హెచ్చరిక!

భారతదేశంలో టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ ఫాస్ట్‌ట్యాగ్ (FASTag). ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నప్పుడు, FASTag లోని చిప్‌ను స్కాన్ చేసి టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా వాహన యజమాని ఖాతా నుంచి కట్ అవుతుంది. దీనివల్ల నగదు చెల్లింపుల అవసరం తగ్గి, ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది.అయితే.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా వాహనం ముందు విండ్‌స్క్రీన్‌పై అతికించాలి. కానీ కొందరు వాహనదారులు దాన్ని చేతిలో పట్టుకొని స్కాన్ చేయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.విండ్‌స్క్రీన్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ను అమర్చడం వల్ల.. టోల్ గేట్ల వద్ద సులభంగా స్కాన్ అవుతుంది. వాహనాలు ఆగకుండా ముందుకు సాగుతాయి. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ను పలు వాహనాల్లో ఉపయోగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ను సరిగ్గా అమర్చకపోతే దానిని బ్లాక్ చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది.For a smooth and hassle-free journey, ensure your FASTag is pasted on vehicle's windscreen firmly.Holding the FASTag instead of pasting it can lead to blacklisting.#NHAI pic.twitter.com/JdDq4DOJaQ— NHAI (@NHAI_Official) April 28, 2026ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ మోసం!ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ పాస్‌లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్‌లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను నమ్మకూడదని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

TVS Motor Sales in 2026 April6
అమ్మకాల్లో హవా.. టీవీఎస్‌ రికార్డ్!

టీవీఎస్‌ మోటార్‌ ఏప్రిల్‌లో 4,73,970 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 4,43,716 యూనిట్లతో పోలిస్తే ఇవి 7% అధికంగా ఉన్నాయి. టూ వీలర్స్‌ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 6% పెరిగి 4,30,150 నుంచి 4,55,333 యూనిట్లకు చేరాయి.దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో 8 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఏప్రిల్‌లో 3,23,647 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది 3,48,545 యూనిట్లకు చేరాయి. గతేడాది 1,69,741 యూనిట్లుగా ఉన్న స్కూటర్ల విక్రయా లు, ఈసారి 24 శాతం వృద్ధితో 2,11,158 యూనిట్లకు పెరిగాయి. అయితే.. మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో వేగం కొంత తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌లో 2,20,347 యూనిట్లు అమ్ముడవగా, గత నెలలో ఆ సంఖ్య 2,00,039 యూనిట్లకు పరిమితమైంది.

Advertisement
Advertisement
Advertisement