Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 19 March 20261
మళ్లీ నేలకరిచిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన మూడు సెషన్లలో లాభాల్లోకి చేరిన మార్కెట్లు ఈరోజు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 459 పాయింట్లు తగ్గి 23,312 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1526 పాయింట్లు దిగజారి 75,201 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.09బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 111.37 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.36 శాతం పడిపోయింది.నాస్‌డాక్‌ 1.46 శాతం నష్టపోయింది.Today Nifty position 19-03-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

West Asia Conflict Hit India Ceramic Tiles Industry Crisil Warns Revenue Decline2
సిరామిక్‌ టైల్స్‌పై యుద్ధం ఎఫెక్ట్‌

దేశీ సిరామిక్‌ టైల్స్‌ పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధం ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు రేటింగ్స్‌ దిగ్గజం క్రిసిల్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో పరిశ్రమ ఆదాయం 1–2 శాతంస్థాయిలో నీరసించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వరుసగా రెండో ఏడాది ఆదాయంలో క్షీణత నమోదుకానున్నట్లు తెలియజేసింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా సిరామిక్‌ టైల్స్‌ ఉత్పత్తి, ఎగుమతులు, సరఫరాలకు విఘాతం కలగనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 53,000 కోట్ల విలువైన దేశీ సిరామిక్‌ టైల్స్‌ పరిశ్రమపై యుద్ధం రెండు విధాల ప్రభావం చూపనున్నట్లు వివరించింది.మధ్యప్రాచ్య దేశాలకు లాజిస్టిక్స్‌పరంగా సవాళ్లు ఎదురవుతుండటంతో సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంకావడంతోపాటు ఎగుమతులు దెబ్బతినే వీలున్నట్లు క్రిసిల్‌ పేర్కొంది. సిరామిక్‌ టైల్స్‌ ఆదాయంలో ప్రధానంగా ఎగుమతులు 40 శాతం వాటా ఆక్రమిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా 15 శాతంగా తెలియజేసింది. హార్ముజ్‌ ద్వారా జల రవాణాకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ఎగుమతుల ఆదాయం 6–7 శాతం క్షీణించనున్నట్లు అంచనా వేసింది. డెలివరీలు నిలిచిపోవడంతోపాటు.. బీమా వ్యయాలు పెరిగిపోనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు చేపట్టే ఎగుమతి వ్యయాలు సైతం పెరగనున్నట్లు వెల్లడించింది.ఎల్‌ఎన్‌జీ సెగతయారీ వ్యయాల్లో 35 శాతం వాటా ఆక్రమించే కీలక ముడిసరుకులు లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌(ఎల్‌ఎన్‌జీ), ప్రొపేన్‌ సరఫరాలు తగ్గడంతో దేశీయంగా పలు సిరామిక్‌ టైల్స్‌ తయారీ కంపెనీల కార్యకలాపాలు మూతపడటం లేదా ఉత్పత్తి నిలిచిపోవడం లేదా ఉత్పత్తిలో భారీ క్షీణతకు అవకాశమున్నట్లు క్రిసిల్‌ నివేదికలో వివరించింది. ఈ నెల(మార్చి)లో టైల్స్‌ ఉత్పత్తి దాదాపు నిలిచిపోగా.. దేశీ వినియోగ వ్యయాలు సైతం మందగించనున్నట్లు తెలియజేసింది. ఫలితంగా దేశీ టైల్స్‌ మార్కెట్‌ వృద్ధి గతంలో వేసిన 7–8% అంచనాలస్థానే 4–5 శాతానికి పరిమితంకానున్నట్లు పేర్కొంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే కంపెనీల దీర్ఘకాలిక మూసివేతలు, భారీ నష్టాలకు కారణంకావచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ కన్సల్‌ తెలియజేశారు. దీంతో నెలవారీ ఆదాయంలో 7–8 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేశారు. ఈ అంశాలన్నీ కంపెనీల నిర్వహణ లాభదాయకతను 1.3–1.5%మేర దెబ్బతీయవచ్చని నివే దిక పేర్కొంది. వెరసి ఐదేళ్ల కనిష్టం 9.3–9.5%నికి మార్జిన్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Maruti Suzuki to Launch 7 New SUVs in India as Segment Share Surges3
ఎస్‌యూవీలపై మారుతీ సుజుకీ ఫోకస్‌

దేశీయ ప్యాసింజర్‌ వాహన మార్కెట్లో శరవేగంగా విస్తరిస్తున్న స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) విభాగంపై మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే 5–6 ఏళ్లలో 7 కొత్త ఎస్‌యూవీ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు ఎండీ హిశాషి టెకుచి తెలిపారు. ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడుతూ, భారతీయ వాహన మార్కెట్‌లో ఎస్‌యూవీల వాటా వేగంగా పెరుగుతోందన్నారు. 2019లో 26.5 శాతంగా ఉన్న ఎస్‌యూవీ వాటా 2024 నాటికి 54.7 శాతానికి చేరిందన్నారు.అదే విధంగా, కంపెనీ ఎస్‌యూవీ మార్కెట్‌ వాటా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 16.8 శాతం ఉండగా, 2025–26 కాలంలో 19.6 శాతానికి పెరిగిందని తెలిపారు. గత నాలుగేళ్లలో ఈ విటారా, విక్టోరిస్, జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్‌ విటారా వంటి మోడళ్లను విడుదల చేయడంతో పాటు బ్రెజ్జా మోడల్‌ను పూర్తిగా ఆధునీకరించడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని మధ్యస్థ, భారీ ఎస్‌యూవీ/ఎంపీవీ మోడళ్ల శ్రేణిని విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే మిడ్‌–ఎస్‌యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి కార్లు కొనుగోలు చేసే వినియోగదారులను ఆకర్షించేందుకు ‘‘సుజుకికి ప్రత్యేకమైన’’ ఎంట్రీ లెవల్‌ కారును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గ్లోబల్‌ తయారీ కేంద్రంగా భారత్‌‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం ద్వారా ఆటోమొబైళ్లు, ద్విచక్ర వాహనాల తయారీలో భారత్‌ను గ్లోబల్‌ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న పేరెంట్‌ సంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ లక్ష్యాన్ని టెకుచి పునరుద్ఘాటించారు. దేశీయ డిమాండ్‌ను తీర్చడంతో పాటు భారత్‌ను గ్లోబల్‌ ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 40 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తూ, తగిన సమయంలో దశలవారీగా ఈ సామర్థ్యాన్ని పెంచుతామని పేర్కొన్నారు. కార్బన్‌ న్యూట్రాలిటీ లక్ష్యాల సాధనలో భాగంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాలతో పాటు సీఎన్‌జీ, బయోఫ్యూయెల్‌ వంటి బహుళ ఇంధన విధానాలను అనుసరించనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

India Chemical Industry Set to Outpace Economic Growth McKinsey Report4
సవాళ్ల నుంచి అవకాశాలదాకా.. కెమికల్స్‌ రంగం బూమ్‌

దేశీ కెమికల్స్‌ పరిశ్రమ ఆర్థిక వృద్ధిని మించి పరుగుతీయనున్నట్లు కన్సల్టింగ్‌ దిగ్గజం మెకిన్సీ అండ్‌ కంపెనీ తాజా నివేదికలో పేర్కొంది. దీంతో 2030కల్లా కెమికల్స్‌ రంగం 230–255 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు అధిక వృద్ధిలో ఉన్న విభాగాలు దోహదం చేయనున్నట్లు ‘ప్రపంచ అవరోధాలమధ్య సవాళ్ల నుంచి అవకాశాలలోకి దేశీ కెమికల్‌ పరిశ్రమ’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది.ప్రస్తుతం 155–165 బిలియన్‌ డాలర్లుగా ఉన్న కెమికల్స్‌ పరిశ్రమ అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైనప్పటికీ వార్షిక ప్రాతిపదికన 8–9 శాతం పురోగతిని సాధించనున్నట్లు అభిప్రాయపడింది. ఈ రంగంలో ప్రధానంగా 8 విభాగాలు అధిక వృద్ధిని అందుకోనున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్‌ వాహనాలు– బ్యాటరీలు, రెనెవబుల్స్, కన్‌స్ట్రక్షన్, ఏరోస్పేస్‌– డిఫెన్స్, ఆటో విడిభాగాలు, బయో– ఎక్స్, ఈకామర్స్‌ను ప్రస్తావించింది. ఈ విభాగాలు 16 శాతం వార్షిక వృద్ధితో 2030కల్లా 30–35 బిలియన్‌ డాలర్ల అదనపు డిమాండుకు తెరతీయనున్నట్లు అంచనా వేసింది. ఈ కాలంలో నిర్మాణ సంబంధ కెమికల్స్‌ రెట్టింపై 28 బిలియన్‌ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. ఇందుకు మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది.17 శాతం రిటర్నులుగత దశాబ్ద కాలంలో వార్షిక ప్రాతిపదికన మొత్తం వాటాదారులకు 17 శాతం రాబడిని అందించినట్లు మెకిన్సీ నివేదిక పేర్కొంది. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు, విదేశీ కంపెనీలను అధిగమించినట్లు వెల్లడించింది. అయితే కెమికల్స్‌ రంగంలో 31 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ ప్రధానంగా ఇనార్గానిక్స్‌(12 బిలియన్‌ డాలర్లు), పాలిమర్స్‌(13 బిలియన్‌ డాలర్లు)లో దిగుమతి ప్రత్యామ్నాయాలకు వీలున్నట్లు వివరించింది. ఇందుకు ఉదాహరణగా స్టైరీన్, ఎసెటిక్‌ యాసిడ్, పాలియోల్స్‌ తదితర వేల్యూ చైన్స్‌లో ప్రపంచస్థాయి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వృద్ధిని అందుకునేందుకు వీలుగా కంపెనీలు అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించవలసి ఉన్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడం, ఇతర సంస్థల కొనుగోళ్లు, పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)పై వ్యయాల పెంపు, ఏఐ ఆధారిత సామర్థ్యాలను అమలు చేయడం తదితరాలను ప్రస్తావించింది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేందుకు సరఫరా చైన్, బ్యాలన్స్‌షీట్లను పటిష్టపరచుకోవడంతోపాటు.. విలువ ఆధారిత వృద్ధిపై దృష్టిపెట్టవలసి ఉన్నట్లు తెలియజేసింది. వెరసి కెమికల్స్‌ పరిశ్రమ నిర్వచనా దశాబ్దంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది. వాటా స్వల్పమేగత దశాబ్ద కాలంలో దేశీ కెమికల్స్‌ పరిశ్రమ పటిష్ట వృద్ధిని సాధించినప్పటికీ అంతర్జాతీయ కెమికల్స్‌ వాణిజ్యంలో వాటా 3 శాతమే. చైనా 20 శాతం వాటాను ఆక్రమిస్తుంటే.. యూరోపియన్‌ యూనియన్‌ 15 శాతం, యూఎస్‌ 10 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. దేశీయంగా ఈ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల వాటా 0.9 శాతమేకాగా.. జాతీయ సగటు 2.5 శాతంగా ఉంది. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోర్ట్‌ఫోలియో క్రమబద్ధీకరణకు తెరలేవడంతోపాటు.. యూరప్‌లో ఆస్తుల విలువ పునర్‌నిర్మితమవుతున్న నేపథ్యంలో ఇతర సంస్థల కొనుగోళ్లు, టెక్నాలజీ అందుకునేందుకు దేశీ కంపెనీలకు అవకాశాలున్నట్లు నివేదిక పేర్కొంది. జపాన్, యూఎస్, ఈయూలతో పోలిస్తే దేశీ కంపెనీలు చాల స్వల్ప స్థాయిలో అంటే ఆదాయంలో 0.5 శాతమే ఆర్‌అండ్‌డీపై వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ఈ రంగంలో ఆర్‌అండ్‌డీ కీలకమని పేర్కొంది. ఏఐ, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌ వినియోగంతో ప్రొక్యూర్‌మెంట్, సరఫరా చైన్‌ నిర్వహణ తదితరాలలో భారీ పెట్టుబడులు చేపట్టకుండానే ఇబిటాను 8–12 శాతంమేర మెరుగుపరచుకోవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

DGCA has directed airlines to allocate at least 60percent of seats without charges5
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు 

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్‌లైన్స్‌కి పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపునకు సంబంధించి కనీసం 60 శాతం సీట్లపై అదనపు చార్జీలు విధించొద్దని సూచించింది. ప్రస్తుతం 20 శాతం సీట్లను ఉచితంగా బుక్‌ చేసుకోవడానికి ఉండగా మిగతా సీట్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. ఇక ఒకే పీఎన్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఒకే దగ్గర కూర్చునే విధంగా చూడాలని కూడా డీజీసీఏ సూచించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దేశీ రూట్లలోని ఫ్లయిట్స్‌కి ఇవి వర్తిస్తాయి. ప్యాసింజర్లకు మరింత వెసులుబాటు కలి్పంచేలా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్‌ నాయుడు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామన్నారు. దేశీ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగి 17.5–18.1 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య సెపె్టంబర్‌ 2025 నాటికి 162కి చేరింది. దేశ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్‌–అక్టోబర్‌ 2025 మధ్య కాలంలో 23.74 కోట్లకు చేరింది. మార్గదర్శకాల ప్రకారం.. → స్పోర్ట్స్‌ పరికరాలు, సంగీత సాధనాలను పారదర్శకమైన విధంగా, సురక్షితంగా చేర్చాలి. → అలాగే, పెంపుడు జంతువుల విషయంలోను స్పష్టమైన, పారదర్శకమైన విధానాలు ఉండాలి. → ఫ్లయిట్స్‌ జాప్యం, రద్దు, బోర్డింగ్‌కి నిరాకరించడం తదితర కేసుల్లో ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనలను కచి్చతంగా పాటించాలి. → ప్రయాణికుల హక్కులను ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్స్, మొబైల్‌ యాప్స్, బుకింగ్‌ ప్లాట్‌ఫాంలు, ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్లలో స్పష్టంగా డిస్‌ప్లే చేయాలి. → ప్రాంతీయ భాషల్లో కూడా ప్రయాణికుల హక్కులను తెలియజేయాలి.

India semiconductor market to reach 300 billion dollers by 20356
సెమీకాన్‌ మార్కెట్‌ @ 300 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: దేశీ సెమీకండక్టర్ల మార్కెట్‌ 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అలాగే 2035 నాటికి 300 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటం, ఆటోమోటివ్‌ పరిశ్రమ వృద్ధి చెందుతుండటం, డేటా సెంటర్లు విస్తరిస్తుండటం తదితర అంశాలు ఇందుకు దన్నుగా నిలవనున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్‌ భవిష్యత్తుపై డెలాయిట్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 90 శాతం సెమీకండక్టర్లను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. అయితే, 2035 ఆఖరు నాటికి దేశీ డిమాండ్‌లో 60 శాతం చిప్స్‌ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోనుంది. ‘భారత్‌లో సెమీకండక్టర్‌ మార్కెట్‌ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45–50 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, గత మూడేళ్లుగా వార్షికంగా 20 శాతం మేర వృద్ధి చెందుతోందని అంచనా. ఈ నేపథ్యంలో ఏఐ, ఆటోమోటివ్స్, డేటా సెంటర్స్, ఎల్రక్టానిక్స్‌ తయారీ ఊతంతో 2030 నాటికల్లా 120 బిలియన్‌ డాలర్లకు, 2035 నాటికి 300 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చు‘ అని డెలాయిట్‌ పేర్కొంది. దేశీయంగా సెమీకండక్టర్ల డిమాండ్‌లో మొబైల్‌ ఫోన్లు, ఆటోమోటివ్, కంప్యూటింగ్, డేటా సెంటర్లలాంటి సెగ్మెంట్ల వాటా 70 శాతం పైగా ఉండనుంది. ఐదేళ్లలో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు .. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం) కింద ఇప్పటికే 10 ప్రాజెక్టుల్లోకి 19 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎనిమిది ఔట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ ..టెస్ట్‌ (ఓఎస్‌ఏటీ) ప్లాంట్లు, ఒక సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ ఉన్నాయి. సుమారు 20–25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో మరో 18–20 ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో భారత్‌లో సెమీకండక్టర్‌ పరిశ్రమలోకి మరో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రావొచ్చు. అలాగే 2030–2035 మధ్య ఇంకో 75–80 బిలియన్‌ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవస్థ మరింతగా విస్తరిస్తుంది‘ అని నివేదిక వివరించింది. భారీగా ఉద్యోగాలు.. సెమీకండక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. 2035 నాటికి పరిశ్రమలో సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందులో 30% ఉద్యోగాలు తయారీ కార్యకలాపాల్లో, 30% డిజైన్‌ సర్వీసుల్లో, మిగతా 40 శాతం ఇతరత్రా విభాగాల్లోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏటా 4,00,000–5,00,000 మందికి పరిశ్రమ సంబంధిత కోర్సులు, నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. అయితే, ఈ సానుకూల పరిణామాలన్నీ కూడా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని వివరించింది. స్థలం, యుటిలిటీలు, మౌలిక సదుపాయాలకు సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, వార్షికంగా బడ్జెట్లో కేటాయింపులు, నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్న ప్రోత్సాహక స్కీములకే పరిమితం కాకుండా నిధుల లభ్యతపరంగా కచ్చితత్వం ఉండేలా జాతీయ స్థాయి ప్రోగ్రాంను రూపొందించాలని సూచించింది.

Advertisement
Advertisement
Advertisement