ప్రధాన వార్తలు
టాప్ 3 మార్కెట్లలో భారత్
చెన్నై: రాబోయే రోజుల్లో భారత్ తమ టాప్ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో గ్లోబల్ గ్రూప్ సీఈవో ఫ్రాంకోయిస్ ప్రొవోస్ట్ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్ఫోలియోని ఏడు మోడల్స్కి విస్తరిస్తామని వివరించారు.అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్ నుంచి ఏటా 2 బిలియన్ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్ వివరించారు. కాంపాక్ట్ ఎస్యూవీ ’బ్రిడ్జర్ కాన్సెప్ట్’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్లో రెనో గ్రూప్కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా, తమ విద్యుత్ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు.తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్ చెప్పారు.
మహిళలకు ‘లీడర్షిప్’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్
ముంబై: ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ఏబీసీఎల్), తన ఫిన్టెక్ విభాగం ఇన్ఫినైట్ కింద మహిళల కోసం మహిళలే నిర్వహించే ‘లీడర్షిప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సేవలు ఫిన్టెక్ రంగాల్లో ప్రారంభ దశలో ఉన్న మహిళా వ్యాపారవేత్తలకు దీని కింద మద్దతు ఇస్తుంది. అలాగే, వారికి అవసరమైన వనరులు అందించడంతోపాటు వేగంగా తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వ్యాపార విస్తరణకు స్థిరమైన అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రకటించింది.ఈ 'లీడర్షిప్' కార్యక్రమం ద్వారా ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదిత్య బిర్లా క్యాపిటల్లోని అగ్రశ్రేణి నిపుణుల నుండి ప్రత్యక్ష పర్యవేక్షణ (Mentorship) లభిస్తుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, మార్కెట్ యాక్సెస్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్కింగ్ అవకాశాలను కల్పించడం ద్వారా వారి స్టార్టప్లను విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ఫిన్టెక్ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో లింగ వివక్షను తొలగించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఏబీసీఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు.అంతేకాకుండా, ఈ వేదిక ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీలవుతుంది. వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడం ద్వారా వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా వారిని సిద్ధం చేస్తారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, సుస్థిరమైన, సమ్మిళిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ ముందడుగు వేసింది.
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. ఇప్పటి వరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆయన స్థానాన్ని అదానీ ఆక్రమించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన అత్యంత సంపన్నుల్లో ఆసియాలో అగ్ర స్థానానికి, ప్రపంచంలో 19 ప్లేస్కు చేరుకున్నారు.చాలా కాలం ఆసియా అత్యంత సంపన్నుడుగా కొనసాగిన ముఖేష్ అంబానీ 90.8 బిలయన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానానికి పరిమితమయ్యారు. వీరి సంపద మధ్య అంతరం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మార్పు ప్రపంచ సంపద కదలికల అస్థిర స్వభావాన్ని తెలియజేస్తోంది.అంబానీ vs అదానీ: లాభాలు.. నష్టాలుఈ సంవత్సరం తన గ్రూప్ స్టాక్ పనితీరులో స్థిరమైన లాభాలు అదానీ సంపద పెరుగుదలకు కలిసొచ్చాయి. సంపదకు 8.1 బిలియన్ డాలర్లు జత కలిశాయి. దీనికి విరుద్ధంగా, అంబానీ అదే కాలంలో తన నికర సంపదలో 16.9 బిలియన్ డాలర్లను కోల్పోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఫ్లాట్ మార్కెట్ పనితీరును కనబరిచింది. దీంతో అంబానీ సంపద 76.7 మిలియన్ డాలర్ల స్వల్ప పెరుగుదలను చూసింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. దీంతో కేవలం ఒక రోజులో అదానీ సంపదకు 3.56 బిలియన్ డాలర్లు జత కలిశాయి.ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే..ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లారీ పేజ్ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ 10 లో జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, మైఖేల్ డెల్, జెన్సన్ హువాంగ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జిమ్ వాల్టన్ ఉన్నారు.
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్’
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026
కారును మించిన ‘రేంజ్’లో కొత్త స్కూటర్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లోకి సంచలన మోడల్ను ప్రవేశపెట్టింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ అల్ట్రా' (Simple Dot One/Ultra)ను రూ. 2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 'జెన్ 2' లైనప్తో పాటు ఆవిష్కరించిన ఈ స్కూటర్, ఇప్పుడు బుకింగ్స్కు సిద్ధంగా ఉంది.ఒక్క ఛార్జ్తో 400 కిలోమీటర్లు!ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. సింగిల్ ఛార్జ్పై ఏకంగా 400 కిలోమీటర్ల (IDC) మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ద్విచక్ర వాహన రంగంలో ఇదే అత్యధికం. ఈ స్థాయి రేంజ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లకు కూడా లేదు.ఉదాహరణకు, భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ (ధర సుమారు రూ. 7.99 లక్షలు) ఒక్క ఛార్జ్పై 293 కిమీ మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కన చూస్తే, కారు కంటే సగం ధరలోనే అంతకంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్గా 'సింపుల్ అల్ట్రా' రికార్డు సృష్టించింది.పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ఈ స్కూటర్ 6.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రైడర్ భద్రత కోసం ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే, రైడింగ్ డేటా, కనెక్టివిటీ ఫీచర్ల కోసం 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.విలువ పరంగా చూస్తే.. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 2.35 లక్షలు ఖర్చు చేయడం ఎక్కువ అనిపించినా, అది ఇచ్చే 400 కిమీ రేంజ్ వాహనదారులకు భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 250 డ్యూక్ (రూ. 2.17 లక్షలు) వంటి స్పోర్ట్స్ బైక్ల ధరకు ఇంచుమించు సమానంగా ఉంది.
డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!
కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్సీఎల్టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగింది?హెచ్సీఎల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.సీన్ కట్ చేస్తే.. సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. View this post on Instagram A post shared by Prajjwal Bhatia (@prajjwal_bhatia)
కార్పొరేట్
మహిళలకు ‘లీడర్షిప్’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
ఇరాన్ వార్ : బడ్జెట్ ఎయిర్లైన్స్ దివాలా
29 ఏళ్ల తర్వాత నెట్ఫ్లిక్స్కు బైబై చెప్పిన కోఫౌండర్
వేదాంత ఛైర్మన్పై ఎఫ్ఐఆర్ నమోదు
విప్రో బంపర్ బైబ్యాక్!
ఆతిథ్యం, ఎయిర్లైన్స్పై వార్ ఎఫెక్ట్
పీఎఫ్సీలో మెజారిటీ వాటాకు సై
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!
విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగ...
ఎన్ఎస్ఈలో రికార్డు స్థాయిలో తగ్గిన యాక్టివ్ ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, అంతర్జాతీయ భౌగోళి...
బంగారం ధరలు సలసల!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కద...
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భ...
ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్!
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవ...
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత...
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
హైదరాబాద్ ఐకేపీ నాలెడ్జ్ పార్క్ కొత్త ప్రోగ్రామ్
హైదరాబాద్: భారతదేశాన్ని లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ ప్రోడక్ట్ లీడర్గా నిలబెట్టే లక్ష్యంతో, ప్రతిష్టాత్మకమైన ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (IKP Knowledge Park) ‘ఐకేపీ ఏఆర్కే’(IKP ARK) పేరుతో సరికొత్త వెంచర్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. లోతైన శాస్త్రీయ పరిశోధనలు (Deep-Science) చేసే స్టార్టప్లు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రోగ్రామ్ ఒక వారధిలా పనిచేయనుంది.చాలా స్టార్టప్లు అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పటికీ, సరైన సహకారం, రెగ్యులేటరీ నిబంధనలపై అవగాహన లేక మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, ఐకేపీ ఏఆర్కే ఒక వినూత్న నమూనాను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన నిపుణులు నేరుగా ఆయా కంపెనీలతో కలిసి పనిచేస్తూ, వ్యాపార విస్తరణలో వ్యవస్థాపకులకు వెన్నుదన్నుగా నిలుస్తారు.ఎంపికైన ప్రతి స్టార్టప్కు సుమారు రూ.2 కోట్ల వరకు విలువైన ప్రయోజనాలను ఐకేపీ కల్పిస్తోంది. ఇందులో ప్రాజెక్ట్ మైలురాళ్ల ఆధారిత నిధులతో పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సీడీఎస్సీవో, ఎఫ్డీఏ వంటి సంస్థల నుండి రెగ్యులేటరీ అనుమతులు పొందడంలో సాంకేతిక మద్దతు ఉంటుంది. ఐకేపీకి ఉన్న 20 ఏళ్ల సుదీర్ఘ పెట్టుబడిదారుల నెట్వర్క్ ద్వారా స్టార్టప్లు తమ వ్యాపార నమూనాలను మెరుగుపరుచుకుని నిధులు సేకరించుకునే అవకాశం కలుగుతుంది.ఈ ప్రోగ్రామ్ 12 నెలల కాలపరిమితితో మూడు దశల్లో సాగుతుంది. మొదటి దశలో వ్యాపార ప్రణాళిక (బ్లూప్రింట్) సిద్ధం చేయడం, రెండో దశలో నిర్వహణపరమైన ముప్పులను తగ్గించడం, చివరి ఎనిమిది నెలల్లో నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి సిరీస్-ఎ ఫండింగ్ సాధించడంపై దృష్టి సారిస్తారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా ప్రయోగశాలలోని ఆవిష్కరణలు వేగంగా ప్రజలకు చేరువవుతాయని ఐకేపీ సీఈఓ డాక్టర్ సత్య ప్రకాష్ డాష్ పేర్కొన్నారు.తొలి విడతలో భాగంగా మెడ్టెక్, హెల్త్టెక్ స్టార్టప్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (TRL 3+) కలిగి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. గత రెండు దశాబ్దాలుగా సుమారు 1,900 కంపెనీలకు అండగా నిలిచిన ఐకేపీ, ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా భారతీయ స్టార్టప్ వ్యవస్థలో మరో కీలక మైలురాయిని అధిగమించనుంది.
లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!
గడిచిన రెండేళ్లుగా ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక రంగాలను సునామీలా చుట్టుముట్టేసిన పదం ‘కృత్రిమ మేధ’ (ఏఐ). డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధి కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను వరదలా పారించాయి. అయితే, ఈ ఏఐ విప్లవం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. గతంలో ఉత్సాహంగా పెట్టిన పెట్టుబడులపై ఇన్వెస్టర్లు, కంపెనీల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. అసలు ఇంతటి భారీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వేధిస్తున్నాయి.పెరుగుతున్న ఉత్కంఠఏఐ రంగంలో మైలురాయిగా భావించే మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ కలయికగా మొదలైన ఈ బంధం వ్యయ నియంత్రణ వద్దకు వచ్చేసరికి అనిశ్చితి ఎదుర్కొంటోంది. అత్యున్నత స్థాయి ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు అసాధారణంగా ఉంటోంది. ఒకే మోడల్ను ఒక్కసారి ట్రైన్ చేయడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుండగా రోజువారీ మిలియన్ల కొద్దీ యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. టెక్ దిగ్గజాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వ్యయం దీర్ఘకాలంలో భారంగా మారుతుందన్న ఆందోళన మొదలైంది.మౌలిక సదుపాయాలు..ఏఐ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలు ఏటా మరింత శక్తివంతమైన చిప్స్ను విడుదల చేస్తున్నాయి. ఇది సాంకేతిక పురోగతికి శుభసూచకమే అయినా, పెట్టుబడి కోణంలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డేటా సెంటర్లు నేటి ఏఐ అవసరాలకు (విద్యుత్, కూలింగ్ వ్యవస్థ) సరిపోవడం లేదు. మౌలిక సదుపాయాలు అనేవి దీర్ఘకాలిక ఆస్తులు. కానీ ఏఐ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేగంతో మారిపోతోంది. దీనివల్ల భారీ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు త్వరగా వాడుకలో లేకుండా పోతున్నాయి.స్కేలింగ్ లాస్ Vs ఎకనామిక్ లాస్ఏఐ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అది ‘ఎక్కువ డేటా + ఎక్కువ గణన సామర్థ్యం = మెరుగైన ఫలితం’. దీనినే స్కేలింగ్ లాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆర్థిక పరిమితులు ఈ సూత్రాన్ని అడ్డుకుంటున్నాయి. నమూనాలు పెద్దవి అయ్యే కొద్దీ, వాటి పనితీరులో వచ్చే మెరుగుదల తగ్గుతూ ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు మోడల్ కంప్రెషన్, ప్రత్యేక అప్లికేషన్లపై దృష్టి సారిస్తున్నాయి.పెట్టుబడిపై రాబడి ఎప్పుడు?సాంప్రదాయ సాఫ్ట్వేర్ రంగంలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఎంతమంది వాడుకున్నా అదనపు ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ప్రతి సెర్చ్, ప్రతి ఇంటరాక్షన్ వెనుక భారీ ఖర్చు ఉంటుంది. దీనిని మానిటైజ్ చేయడం (డబ్బుగా మార్చుకోవడం) ఇంకా ఒక సవాలుగానే ఉంది. సంస్థలకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కనిపిస్తుండగా ఖర్చులు మాత్రం తక్షణమే చెల్లించాల్సి వస్తోంది.ఆగిపోని విప్లవంఏఐ విప్లవం ఆగిపోతుందని దీని అర్థం కాదు. కానీ, ఇది ‘అపరిమిత అవకాశాల’ దశ నుంచి ‘పరిమిత ఆప్టిమైజేషన్’ దశకు చేరుకుంటుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే చూడటం లేదు, లాభదాయకత కూడా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే?
నోవా సిరీస్లో భాగంగా తమ సరికొత్త డివైస్ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్ఫోన్ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్స్లో అందుబాటులో ఉంటుంది.Ai+ నోవా 2 ధరలు4జీబీ + 64 జీబీ: రూ.8,9996 జీబీ + 128 జీబీ: రూ.10,999మొదటిసారి అప్గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్ఫోన్ సీఈఓ, నెక్స్ట్ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్ అన్నారు.6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వినియోగదారులు కంటెంట్ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్, నిరంతరాయమైన స్క్రోలింగ్ అందిస్తుంది.ఈ స్మార్ట్ఫోన్లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది.
ఏళ్ల తరబడి ఉన్న యాప్ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.ఏమిటీ మార్పు? ఎందుకు?ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.వినియోగదారులపై ప్రభావం ఇలా..మే 25 తర్వాత మీ ఫోన్లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్లుక్ మొబైల్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఇప్పుడేం చేయాలి?అంతరాయం లేని అవుట్లుక్ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్లుక్ లైట్ యాప్లోనే అప్గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్లుక్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్మెంట్లు ఆటోమేటిక్గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్కు మారడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!
పర్సనల్ ఫైనాన్స్
అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్!
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.ఎవరి ఖాతాలు మూతపడతాయి?మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలు.కేవైసీ అప్డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.ఎందుకీ కఠిన నిర్ణయం?బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.ఖాతాను కాపాడుకోవాలంటే..మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:మీ సమీపంలోని పీఎన్బీ బ్రాంచ్కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.మీ అకౌంట్లో కొంత మొత్తాన్ని జమ చేయండి.కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్గా ఉందని నిర్ధారించుకోండి.తీసుకెళ్లాల్సిన పత్రాలుఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
దీర్ఘకాలిక ప్రణాళికలకు దక్షిణాది ఓటు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్పైనే..
ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఇన్వెస్టింగ్పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్ని అందిస్తున్నట్లు వివరించింది.2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్ 50 ఫండ్ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్ క్యాప్ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు.


