ప్రధాన వార్తలు
సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు
భారతీయ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులకు సమయం ఆసన్నమైందని, సంప్రదాయ కనీస మద్దతు ధర విధానం నుంచి మార్కెట్ ఆధారిత ధరల వైపు మళ్లడం ద్వారానే రైతులకు శాశ్వత ఆర్థిక భరోసా లభిస్తుందని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజీ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘అగ్రి, కమోడిటీ సమ్మిట్ 2026’లో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా, సామాజికంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను వివరించారు.ఖజానాపై భారం తగ్గేలా.. రైతుకు లాభం కలిగేలా..ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోందని షాజీ విశ్లేషించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైసెస్’ (మార్కెట్ నిర్ణయించిన ధరలు) విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ‘ఎంఎస్పీ నుంచి మార్కెట్ ఆధారిత మద్దతు ధరలకు మళ్లాలి. ఇందులో కమోడిటీ డెరివేటివ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందుకోసం మేము ఎన్సీడీఈఎక్స్తో కలిసి పని చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.రైతులకు ధరల రక్షణ కవచంరైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్పీఓ) ద్వారా రైతులకు ‘పుట్ ఆప్షన్స్’ అనే సరికొత్త ఆర్థిక సాధనాన్ని పరిచయం చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. రైతులు స్వల్ప రుసుము చెల్లించి తమ పంట ధరకు ముందే లాక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ధరలు పెరిగితే ఆ పెరిగిన ధరల ప్రయోజనాన్ని రైతులు పొందవచ్చు. ఒకవేళ మార్కెట్ పడిపోతే రైతుకు కేవలం తాను చెల్లించిన రుసుము మాత్రమే నష్టం తప్ప, పంటపై కనీస ధర గ్యారెంటీగా ఉంటుంది.ఇది ఎలా పనిచేస్తుంది?ఉదాహరణకు ఒక రైతు క్వింటాల్ మిర్చిని రూ.10,000కు అమ్ముకోవాలని అనుకున్నాడనుకుందాం. రైతు కొంత రుసుము (ఉదాహరణకు రూ.200) చెల్లించి రూ.10,000 వద్ద ఎన్సీడీఈఎక్స్లో పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తారు. అంటే తన ధరను రూ.10,000 వద్ద లాక్ చేశారు.ధరలు పడిపోతే.. పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ధర రూ.8,000 కి పడిపోయింది. అప్పుడు రైతు ఆందోళన చెందక్కర్లేదు. అతను ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం తన పంటను రూ.10,000కే అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు రూ.2,000 నష్టం తప్పుతుంది.ధరలు పెరిగితే.. ఒకవేళ మార్కెట్లో ధర రూ.12,000కి పెరిగింది. అప్పుడు రైతు తన ‘ఆప్షన్’ను వదులుకుని నేరుగా మార్కెట్లోనే రూ.12,000కి అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు పెరిగిన ధర ప్రయోజనం లభిస్తుంది. అతను నష్టపోయేది కేవలం తను కట్టిన రూ.200 రుసుము మాత్రమే. మార్కెట్ కుప్పకూలినా రైతుకు కనీస గ్యారెంటీ ధర లభిస్తుంది. ఇది ఎంఎస్పీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఎంఎస్పీలో ధర స్థిరంగా ఉంటుంది. కానీ పుట్ ఆప్షన్లో మార్కెట్ ధరలు పెరిగితే ఆ అదనపు లాభం రైతుకే చెందుతుంది.నాబార్డ్, ఎన్సీడీఈఎక్స్ సహకారంఈ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి నాబార్డ్, ఎన్సీడీఈఎక్స్తో కలిసి పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. గిడ్డంగులను ఈ మార్కెట్ ప్లాట్ఫారమ్లతో అనుసంధానించడం ద్వారా రైతులు తమ పంటను వేర్హౌజ్లో పెట్టి అక్కడి నుంచే ఈ ఆప్షన్ల ద్వారా ధరను లాక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా రైతులు మార్కెట్ ట్రేడింగ్ చేయడం కష్టం కాబట్టి, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ) రైతుల తరపున ఈ లావాదేవీలు నిర్వహిస్తాయి. దీనివల్ల రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో పనిలేకుండా భరోసా లభిస్తుంది.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్!
ఒక్కసారిగా ఇంత రేటా.. భారీగా ఎగిసిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈరోజు పసిడి కొనుగోలుదారులకు భారీగా పెరిగిన ధరలు షాకిచ్చాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు గణనీయ పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
రూ.58 వేల కోట్లతో 15 మంది ఆర్థిక నేరగాళ్లు పరారు!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన బ్యాంకింగ్ రంగాన్ని కొందరు బడా బాబులు కుప్పకూల్చుతున్నారు. సామాన్యుడు తీసుకున్న చిన్నపాటి రుణానికి వడ్డీ మీద వడ్డీ వేసి వసూలు చేసే బ్యాంకులు, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో మాత్రం నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 31 నాటికి అందిన గణాంకాల ప్రకారం దేశంలో 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా గుర్తించగా, అందులో 9 మంది బ్యాంకింగ్ వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీశారు.గణాంకాలు ఏం చెబుతున్నాయి?విదేశాలకు పారిపోయిన ఈ నేరగాళ్ల నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం అక్షరాలా రూ.58,082 కోట్లు. అయితే, ఇప్పటి వరకు రికవరీ అయింది కేవలం రూ.19,187 కోట్లు మాత్రమే. అంటే సుమారు 67% నిధులు ఇంకా ఎగ్గొట్టిన వారి చేతుల్లోనే ఉన్నాయి.బ్యాంకుల వారీగా బకాయిలు - వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో)బ్యాంక్రావాల్సింది (వడ్డీతో)వసూలైందిఎస్బీఐ22,06711,412పంజాబ్ నేషనల్ బ్యాంక్10,9281,619బ్యాంక్ ఆఫ్ ఇండియా5,5891,450యూనియన్ బ్యాంక్4,9511,316ఇండియన్ బ్యాంక్3,062453బ్యాంక్ ఆఫ్ బరోడా3,0501,167కెనరా బ్యాంక్2,43547యూకో బ్యాంక్2,346882ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్2,219581 మోసగాళ్ల మాస్టర్ ప్లాన్బ్యాంకుల నుంచి భారీ రుణాలు పొందేందుకు, ఆపై వాటిని ఎగ్గొట్టేందుకు నేరగాళ్లు ప్రధానంగా కొన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. షెల్ కంపెనీలు(కాగితాల మీద మాత్రమే ఉండే కంపెనీలు) సృష్టించి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి నిధులను మళ్లించడం ద్వారా అసలు డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా మనీ లాండరింగ్ చేస్తున్నారు.నాసిరకం భూములు లేదా తక్కువ విలువ గల ఆస్తులను బ్యాంకులకు కుదువ పెట్టి అధికారుల అండదండలతో వాటి విలువను భారీగా చూపి వందల కోట్ల రుణాలు పొందుతున్నారు.దిగుమతుల పేరుతో బ్యాంకులను గ్యారెంటీగా ఉంచి విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు(లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ దుర్వినియోగం). పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ తరహాలో ఈ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు.బ్యాంకులు, ప్రభుత్వం ఏం చేస్తోంది?పరారీలో ఉన్న నేరగాళ్లపై పట్టు బిగించేందుకు కేంద్రం ‘ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018’ని తీసుకువచ్చింది. నేరగాళ్లకు సంబంధించిన దేశీ, విదేశీ ఆస్తులను అటాచ్ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా విదేశాల్లో ఉన్న ఆస్తుల జప్తు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి సంబంధిత దేశాల నుంచి వారి అప్పగింత కోసం దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు.మరింత సమర్థంగా వసూళ్లు జరగాలంటే..?కేవలం చట్టాలు ఉంటే సరిపోదు.. వాటి అమలులో వేగం పెరగాలి. ఫోరెన్సిక్ ఆడిట్ విధిగా నిర్వహించాలి. రుణం తీసుకున్న కంపెనీ నిధులు మళ్లిస్తుందనే అనుమానం రాగానే ముందస్తుగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం వల్ల వారు దేశం విడిచి పారిపోకముందే అడ్డుకోవచ్చు. పన్ను ఎగ్గొట్టి తలదాచుకునేందుకు వెళ్లే విదేశాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవాలి. తద్వారా నిందితులు దాచుకున్న రహస్య ఖాతాల సమాచారం త్వరగా లభిస్తుంది. ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ ఏళ్ల తరబడి సాగకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలి. లోపభూయిష్టమైన డాక్యుమెంట్లతో రుణాలు మంజూరు చేసిన బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.సామాన్యుడి సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆర్థిక నేరగాళ్ల విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, బ్యాంకింగ్ రంగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ బకాయిల వసూలు సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్!
బ్యాంకులకు వరుస సెలవులు.. ఇదే చివరి నెల!
మార్చి నెలలో అడుగు పెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు చాలానే ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు కస్టమర్లు ఈ మార్చి నెలలో తమ బ్యాంకు బ్రాంచ్ల సందర్శనలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక సెలవులు, అలాగే సాధారణ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ముందస్తుగా షెడ్యూల్ను చూసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణలు, చెక్ క్లియరెన్సులు వంటి ఇతర బ్రాంచ్ సేవలలో ఆలస్యాలను నివారించవచ్చు.మార్చిలో బ్యాంకు సెలవులు» మార్చి 1 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.» మార్చి 2: హోలికా దహన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 3: హోలి, డోల్జాతర తదితర పండుగల సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు. మార్చి 4: యోసాంగ్ (రెండవ రోజు)తో పాటు హోలీ వేడుకల నేపథ్యంలో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 8 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 13: చాప్కార్ కత్ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేత.» మార్చి 14 (రెండో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 15 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 17: షాబ్ ఈ ఖదర్ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 19: ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా వేడుకల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కాశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.మార్చి 20: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 21: రంజాన్-ఈద్, సర్హుల్ తదితర పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 22 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 26: శ్రీ రామ నవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 29 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 31: మహవీర్ జయంతి సందర్భంగా ఆర్బీఐ సెలవుగా గుర్తించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరాంత లావాదేవీల దృష్ట్యా ప్రభుత్వ వ్యాపారం నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు ఆ రోజున తెరిచి ఉంటాయి.యథావిధిగా డిజిటల్ సేవలుబ్యాంకు బ్రాంచీలకు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు కొనసాగుతాయి. నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి డిజిటల్ లావాదేవీలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయి.
లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: లగ్జరీ గృహాలకు ఇండియన్ మార్కెట్లో ఏనాడూ డిమాండ్ తగ్గలేదు. ఏటా లగ్జరీ హౌసింగ్ గణనీయంగా విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లు, ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్ లైఫ్స్టైల్ సౌకర్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో వీటి సరఫరా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఇళ్ల సప్లయిలో లగ్జరీ యూనిట్ల వాటా 27 శాతంగా ఉంది. 2021లో ఈ విభాగం వాటా 16 శాతంగా ఉండేది. అద్భుతమైన డిజైన్, సౌలభ్యం, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకున్నాయి.విస్తరిస్తున్న మార్కెట్భారత లగ్జరీ మార్కెట్ గతేడాది 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి మరింత పెరుగుతుందని మ్యాజిక్ బ్రిక్స్ అంచనా వేసింది. ప్రీమియం వ్యయాలకు కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్ పరిపక్వ దశకు చేరుకుందని, సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ మార్కెట్ విస్తరిస్తోందని పేర్కొంది. టౌన్షిప్ల అభివృద్ధితో.. ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్ ఇండెక్స్ (ఎల్పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే కాలంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్పీఐ 1.00 నుంచి 1.44కి పెరగడమే దీనికి సూచన అని వివరించింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, పెద్ద ఎత్తున టౌన్íÙప్ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ గృహాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబైలో అత్యధికంగా రూ.9.66 కోట్లుగా ఉండగా.. గూర్గావ్లో రూ.5.46 కోట్లు, బెంగళూరులో రూ.2.91 కోట్లు, హైదరాబాద్లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ.2 కోట్లు, పుణెలో రూ.1.97 కోట్లు, కోల్కతాలో రూ.1.50 కోట్లుగా ఉన్నాయి.
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు ట్రూజాన్ సోలార్ పేరిట సౌర విద్యుదుత్పత్తుల సేవలందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు సీహెచ్ భవానీ సురేష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 300–350 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి రెట్టింపు స్థాయిలో రూ. 600–650 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో 10,000కు పైగా రూఫ్టాప్ ఇన్స్టాలేషన్స్ చేసినట్లు ఆయన చెప్పారు.ప్రస్తుతం 600 మంది పైగా సిబ్బందితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని సురేష్ తెలిపారు. వచ్చే నాలుగైదు నెలల్లో తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర 4 రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్లు ఇన్వెస్ట్ చేశామన్నారు.
కార్పొరేట్
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
టీసీఎస్ కోడ్విటా ఛాంపియన్ 2026 విజేతలు
యస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్
ఐపీఓ రివర్స్ గేర్!
ఘనంగా జాతీయ ఆరోగ్య మేళా 2026 ప్రారంభం
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్
ఏసీ ధరలు అప్! కారణం ఇదే..
ఐఆర్ఎఫ్సీ వాటా ఆఫర్.. స్పందించని ఇన్వెస్టర్స్
కోల్ ఇండియా రేర్ ఎర్త్ మైనింగ్
ఏఐకి భయపడం
ట్రేడింగ్కు కనీస అర్హత ఉండాలి
డెరివేటివ్స్(ఎఫ్అండ్వో)లో పాలుపంచుకునే ఇన్వెస్ట...
కొత్తగా లైఫ్ సైకిల్ ఫండ్స్
న్యూఢిల్లీ: సొల్యూషన్స్ ఓరియెంటెడ్ ఫండ్స్ విభాగ...
సాయంత్రానికే మారిన బంగారం ధరలు..
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉద...
‘అది ఇన్వెస్టర్ల ఓవర్ రియాక్షన్’
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) భయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నా...
అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు...
సెమీకండక్టర్లకు దశాబ్దాలపాటు మద్దతు
సంపన్న దేశాల తరహాలోనే వచ్చే 20–25 ఏళ్ల పాటు సెమీకం...
సోలార్పై సుంకాల మోత
న్యూఢిల్లీ: భారత సోలార్ ఉత్పత్తులపై అమెరికా చర్యల...
వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
వినియోగంలో లేని (ఇనాపరేటివ్) దాదాపు ఏడు లక్షల ప్ర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్!
షాపింగ్ మాల్స్ ఎంట్రీ వద్ద.. రిటైల్ స్టోర్లలో బిల్లింగ్ దగ్గర మొబైల్ ఫోన్ నంబర్ అడుగుతున్నారా..? వారు అడిగిన వెంటనే చెప్పేస్తున్నారా..? అవసరం లేదు. వ్యక్తిగత మొబైల్ నంబర్ను వాణిజ్య కేంద్రాల వద్ద ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఈ విషయాన్ని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్లకు ఈ విషయమై ప్రభుత్వం ఏవైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అంటూ లోక్సభ ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ లోక్సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా లెవనెత్తగా.. కేంద్రం బదులు ఇచ్చింది.రిటైలర్లకు వాటి అసోసియేషన్ల ద్వారా ఈ విషయంలో 2023 మే 26న సూచలను జారీ చేసినట్టు చెప్పారు. వీటి ప్రకారం.. వినియోగదారుల అభీష్టం మేరకే మొబైల్ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ వెల్లడించాలని ఏ నిబంధన కూడా నిర్దేశించడం లేదు. నంబర్ వెల్లడించేందుకు వినియోగదారులు తిరస్కరించొచ్చు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 అన్నవి పౌరుల వ్యక్తిగత డేటా (మొబైల్ నంబర్లు సహా) దుర్వినియోగం కాకుండా, తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయినట్టు గురిస్తే కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు కూడా చేయొచ్చు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
ఏఐ యుగం.. సముద్రంలో కేబుళ్లు కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్ సీ) వేసే కేబుల్ నెట్వర్క్ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.సబ్మెరీన్ కేబుల్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్ సీ కేబుల్, డిజిటల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు డిజిటల్ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. దేశీయంగా డిజిటల్ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు.
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
నేటి డిజిటల్ యుగంలో ఓ పూట ఫుడ్ లేకపోయినా ఉండగలరేమో కానీ, ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఇళ్లలో వై-ఫై రౌటర్లు ఇప్పుడు నిత్యావసర వస్తువులైపోయాయి. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో కూడా మీ రౌటర్ ఆన్ చేసే ఉంటుందా? అలా అయితే అది మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మీ నిద్రపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభనష్టాలపై విశ్లేషణ మీకోసం..నిద్రలేమికి రౌటర్ కారణమా?చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే నీరసంగా, అలసటగా ఉన్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి గదిలో ఉండే వై-ఫై రౌటర్ నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు ఒక కారణం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.ఆర్ఎంఐటీ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) రిపోర్ట్: 2024లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం వై-ఫై రౌటర్ సమీపంలో నిద్రించే వారిలో 27 శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. 2.4 గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ గల వై-ఫై సిగ్నల్స్ మానవుల గాఢ నిద్రను తగ్గిస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్-అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ వంటి సంస్థలు.. వై-ఫై రేడియేషన్ చాలా స్వల్పమని, ఇది మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపదని అంటున్నాయి.రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలురేడియేషన్ ప్రభావం పక్కన పెడితే రౌటర్ ఆఫ్ చేయడం వల్ల డిజిటల్ ప్రపంచం నుంచి మన మెదడుకు విరామం దొరుకుతుంది. ఇది మానసిక ప్రశాంతతో గాఢ నిద్రకు ఉపకరిస్తుంది.రౌటర్ నిరంతరం ఆన్ చేసి ఉంచడం వల్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. రాత్రిపూట ఆఫ్ చేయడం ద్వారా ఏడాదికి కొంత మేర విద్యుత్ ఆదా చేయవచ్చు.రాత్రిపూట ఇంటర్నెట్ వాడనప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం వల్ల హ్యాకింగ్ ముప్పు తగ్గుతుంది. అలాగే అనవసరమైన బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ ఆగిపోయి డేటా మిగులుతుంది.నిరంతరం ఆన్లో ఉంటే వేడి వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యం తగ్గుతుంది. రాత్రి పూట పవర్ ఆఫ్ చేయడం వల్ల రౌటర్ జీవితకాలం పెరుగుతుంది.ఎప్పుడు ఆఫ్ చేయకూడదు?మీరు స్మార్ట్ హోమ్ టెక్నాలజీని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని పరిస్థితుల్లో వై-ఫై ఆఫ్ చేయకపోవడమే మంచిది. అందులో..మీ ఇంట్లో సీసీ కెమెరాలు వై-ఫై ద్వారా పని చేస్తున్నప్పుడు.స్మార్ట్ డోర్ లాక్స్, వాయిస్ అసిస్టెంట్లు వాడుతున్నప్పుడు.సెక్యూరిటీ అలారమ్స్ యాక్టివ్గా ఉండాల్సినప్పుడు.ఒకవేళ మీరు వై-ఫై ఆఫ్ చేయలేని పరిస్థితులుంటే రౌటర్ను మీ బెడ్రూమ్లో కాకుండా హాలులో లేదా బెడ్కు కనీసం 10-15 అడుగుల దూరంలో అమర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
ఏఐతో ఐటీకి ఇబ్బందే...
ముంబై: పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున కృత్రిమ మేధకు (ఏఐ) మారడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు బాధాకరమైన ప్రక్రియగానే ఉంటుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ చెప్పారు. అయితే, గతంలో వై2కే సవాళ్లు వచ్చినప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లుగానే, పరిశ్రమ తిరిగి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యాలు పరిశ్రమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారన్నారు.ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఏఐ మోడల్స్ రాకతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశీ ఐటీ రంగం కీలక దశలో ఉందని, వచ్చే 5–10 ఏళ్లలో పరిశ్రమ సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోడింగ్ విషయంలో ఆంథ్రోపిక్ క్లాడ్ అత్యద్భుతంగా పని చేసినప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కోడింగ్ వాటా 30 శాతమే ఉంటుంది కాబట్టి పరిశ్రమలో అవకాశాలు మెరుగ్గానే ఉండొచ్చన్నారు. ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ రాబోయే రోజుల్లో ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని కుమార్ చెప్పారు. క్లయింట్లకు భారీగా బిల్లింగ్ వేస్తూ, గణనీయంగా వృద్ధి చెందిన సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) కంపెనీలకు, ఇకపై అదే స్థాయిలో చార్జీలు విధించడం సాధ్యపడదు కాబట్టి అవి సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులకు తగ్గ స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశాలు లేనందున విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు సమస్యలు ఎదురుకావొచ్చన్నారు.
పర్సనల్ ఫైనాన్స్
రూ.7 కోట్ల ఫ్రాడ్లో ఇరుక్కున్న ఇంజినీరింగ్ విద్యార్థి
స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోందిబెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్తో పాటు ఎయిర్టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్లో ధ్రువీకరించాడు కూడా.అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఓ హెచ్చరికే!స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్ ద్వారా అడగవు."తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్లే!స్ట్రాంగ్ పాస్వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.అన్నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.ఖాతా స్టేట్మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.
మ్యూచువల్ ఫండ్స్.. ‘న్యూ ఆఫర్స్’..
ఎల్ఐసీ ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా టెక్నాలజీ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫాంలు, ఇంటర్నెట్ బిజినెస్లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి బీఎస్ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్ దోషి, జైప్రకాశ్ తోషి్నవాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘బరోడా బీఎన్పీ’ ఈఎస్జీ స్ట్రాటజీ ఫండ్ పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ తాజాగా ఈఎస్జీ బెస్ట్–ఇన్–క్లాస్ స్ట్రాటెజీ ఫండ్ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్జీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్ కంపెనీలు ఇచ్చే ఈఎస్జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్జీ టీఆర్ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్ గ్రోవర్ తెలిపారు. బజాజ్ లైఫ్ బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ జీవిత బీమా సంస్థ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలైన (యులిప్స్) బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, బజాజ్ లైఫ్ సుప్రీం, బజాజ్ లైఫ్ గెయిన్లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.వెల్త్ కంపెనీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ ..తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి క్రిసిల్ హైబ్రిడ్ 50+50 మోడరేట్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది.
ప్రభుత్వ సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు?
భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.మోసం బయట పడిందిలా..ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్బీఐ, ఎస్బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్లో పీఎస్యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్షిప్లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్తో ఆకర్షిస్తాయి.మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్బీఐ లిక్విడిటీ మేనేజ్మెంట్, సీఆర్ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.ఐడీఎఫ్సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్లను పరిశీలించాలి. ఆర్బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం.
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!
నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు ‘స్కాన్అండ్పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్ ఎస్టేట్లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్.. ఇన్కమ్టాక్స్.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్కమ్ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్మెంట్ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.


