Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

sakshi special story about health insurance policies1
హెల్త్‌ ఇన్సూరెన్స్‌.. మీ ‘ప్లాన్‌’ ఏంటి?

చందన (38) ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమె భర్త (44) ఓ చిన్న వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. వీరి కుటుంబానికి రూ.5 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌తో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉంది. చందన ఆటో ఇమ్యూన్‌ (లూపస్‌) వ్యాధిని ఎదుర్కొంటోంది. ఆమె భర్తకు మధుమేహం, బీపీ, స్థూలకాయం సమస్యలున్నాయి. వివేక్‌ (40) ఓ బ్యాంకులో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాడు. ఆయన భార్య (35) గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి కూడా రూ.5 లక్షల కవరేజీతో బేసిక్‌ ఇండెమ్నిటీ హెల్త్‌ప్లాన్‌ ఉంది. చూడ్డానికి హెల్త్‌ కవరేజీ సమానమే. కానీ ఇక్కడి రెండు కుటుంబాల ఆరోగ్య చరిత్ర వేరు. కుటుంబ సభ్యుల సంఖ్య వేరు. మనలో చాలా మంది బీమా విషయంలో ఒకే ధోరణిని అనుసరిస్తుండడాన్ని గమనించొచ్చు. కానీ, అందరికీ ఒకే తరహా ప్లాన్, అందరికీ ఒకే విధమైన రక్షణ కవరేజీ అన్నది ఎంత మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని గుర్తించాలి. 25 ఏళ్లు, 60 ఏళ్ల వయసులో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారి మధ్య ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, రిస్క్‌ ఒకే విధంగా ఉండవు. అందుకే ప్రతీ కుటుంబం కూడా తమ ఆరోగ్య చరిత్ర, వయసు, సభ్యుల సంఖ్య ఆధారంగా మెరుగైన కవరేజీతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ఏం చేయాలన్నది ఈ వెల్త్‌ స్టోరీలో చూద్దాం. వయసు కీలకం..→ ఒకే తరహా బీమా పాలసీ అందరికీ అనుకూలమని చెప్పలేం. → వైద్య విభాగంలో ద్రవ్యోల్బణం 10–12 శాతంగా ఉంటోంది. అంటే ఏటా చికిత్సలు, ఔషధాలు ఇలా మొత్తం మీద వాటి వ్యయాలు ఈ మేరకు పెరుగుతున్నాయి. → మారిన ఆహార నియమాలు, పని వేళలు, తక్కువ శ్రమ కారణంగా జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోయింది. 30 ఏళ్ల నుంచే మధుమేహం, బీపీ, థైరాయిడ్‌ సమస్యలు సాధారణమయ్యాయి. కేన్సర్ల రిస్క్‌ మన దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. → హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ సమగ్రంగా లేకపోతే పొదుపు, పెట్టుబడులన్నీ కరిగిపోయే రిస్క్‌ ఎదురవుతుంది. → కనుక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కేవలం రక్షణ సాధనమే కాదు. ఆర్థిక ప్రణాళికలో ఇదొక భాగం. ఆర్థిక సంక్షోభ నివారణ సాధనం.25–35 ఏళ్ల వారికి.. ప్రధాన లక్ష్యం→ తక్కువ ప్రీమియంపై అధిక కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ఎంపిక → అవివాహితులు అయితే వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్, వివాహితులు అయితే కుటుంబం అంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ ఎంపిక చేసుకోవచ్చు. → కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌తో బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌ తీసుకోవాలి. → బేసిక్‌ ప్లాన్‌ కవరేజీలో తీసుకున్నంత మేర (రూ.5–10 లక్షలు) డిడక్టబుల్‌ పెట్టుకుని, రూ.20–25 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కొనుగోలు చేయాలి. → ఇలా చేయడం వల్ల ఒక ఏడాదిలో ఆస్పత్రి బిల్లు బేసిక్‌ ప్లాన్‌ కవరేజీని మించినప్పుడు, సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ నుంచి చెల్లింపులు లభిస్తాయి.వీటిపై దృష్టి పెట్టాలి→ నో క్లెయిమ్‌ బోనస్‌ (ఎన్‌సీబీ) ఉండేలా చూసుకోవాలి. → బీమా సంస్థ హాస్పిటల్‌ నెట్‌వర్క్‌ను పరిశీలించాలి. ఎన్ని ఎక్కువ ఆస్పత్రులు జాబితాలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా తాము నివసించే ప్రాంతంలోని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల వైద్యం అవసరమైనప్పుడు సులభంగా క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ పొందడం వీలు పడుతుంది. → చిన్న వయసు వల్ల తక్కువ ప్రీమియంతోపాటు ఎలాంటి వ్యాధుల్లేకపోవడం అనుకూలం. అన్ని వెయిటింగ్‌ పీరియడ్‌ (కొన్ని వ్యాధులకు కవరేజీ)లను ఈజీగా అధిగమించొచ్చు. ఈ తప్పులు వద్దు.. → నేను ఆరోగ్యవంతుడిని కదా, ఇంత చిన్న వయసులో నాకు ఆరోగ్య బీమా ఎందుకు? అన్న ఆలోచన తప్పు. ఆరోగ్య సమస్యలే రానక్కర్లేదు. ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలై క్లిష్టమైన చికిత్సలు అవసరమైతే బిల్లు వాచిపోవచ్చు. → పనిచేసే సంస్థ నుంచి గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది కదా చాలులే అనుకోవద్దు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా లేదా సంస్థను వీడినా సొంతంగా బీమా రక్షణ ఉండదు.30–50 ఏళ్ల వయసు..ప్రధాన లక్ష్యం→ కుటుంబం అంతటికీ సరైన రక్షణ కల్పించుకోవడం ఈ వయసు వారికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కవరేజీ–ప్రీమియం మధ్య సమతూకం ఉండాలి.ఏది అనుకూలం? → ఈ వయసులో దాదాపు అధిక శాతం వివాహం చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కనుక వీరికి ఫ్యామిలీ ఫ్లోటర్‌ సరైనది. అవివాహితులైతే ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. → కుటుంబం మొత్తానికి కవరేజీ బేసిక్‌ ప్లాన్‌లో రూ.10–25 లక్షలు ఉండేలా చూసుకోవాలి. అదే ఇండివిడ్యువల్‌ ప్లాన్‌లో రూ.5–10 లక్షలు సరిపోతుంది. → రూ.25–50 లక్షలతో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. బేసిక్‌ ప్లాన్‌లో కవరేజీ మేర డిడక్టబుల్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఒక్కరికైనా, కుటుంబానికైనా సూపర్‌ టాపప్‌తో అదనపు రక్షణ అనేది ఈ రోజుల్లో ఎంతో అవసరం.కీలక ప్రాధాన్యతలు వీటికి.. → పెళ్లై పిల్లల కోసం ప్లాన్‌ చేసుకునే వారు తాము తీసుకునే హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో మెటరి్నటీ (ప్రసవ సంబంధిత) కవరేజీ తప్పక ఉండేలా చూసుకోవాలి. → మధ్య వయసు దృష్ట్యా డే కేర్‌ ప్రొసీజర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. → హాస్పిటల్‌లో చేరక ముందు, డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా అదే సమస్యకు సంబంధించి తీసుకునే చికిత్సకు కవరేజీ ఉండాలి. ఇప్పుడు చాలా ప్లాన్లు 90–120 రోజుల వరకు చేరక ముందు, డిశ్చార్జ్‌ అయిన తర్వాత కవరేజీని ఇస్తున్నాయి. → రూమ్‌ రెంట్‌కు సంబంధించి ఎలాంటి పరిమితులు లేకపోతే మేలు. → వ్యాధులకు సంబంధించి ఉప పరిమితులు (చెల్లింపుల్లో) ఉండకూడదు. → కో–పేమెంట్‌ విషయంలో (ప్రతీ క్లెయిమ్‌లో పాలసీ దారు తన వంతు చెల్లించాల్సిన మొత్తం) దూరంగా ఉండాలి. → బేసిక్‌ ప్లాన్, సూపర్‌ టాపప్‌తో తక్కువ ప్రీమియానికి మెరుగైన కవరేజీ లభిస్తుంది. 50 ఏళ్లు దాటిన వారికి.. వీటికి ప్రాధాన్యం..→ అప్పటికే ఉన్న వ్యాధులతోపాటు అన్ని రకాల కవరేజీలు ఉన్న ప్లాన్‌ అవసరం. → ఈ వయసులో ఫ్యామిలీ ఫ్లోటర్‌ కంటే కూడా ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ప్లాన్‌ మేలు. → బేసిక్‌ ప్లాన్స్‌లో రూ.10లక్షల కవరేజీకి అదనంగా 50 లక్షలతో సూపర్‌ టాపప్‌ తీసుకోవాలి.వీటిని చూడాలి..→ ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీని ఆఫర్‌ చేసే ప్లాన్‌ తీసుకోవాలి. సాధారణంగా పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు సంబంధించి కవరేజీ పొందాలంటే కనీసం 3–4 ఏళ్లు ఆగాలి. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి వ్యయాలకు పాలసీదారు సొంతంగా ఖర్చు చేసుకోవాలి. కొన్ని సంస్థలు కాస్త అదనపు ప్రీమియంతో వెయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించేందుకు/మాఫీ చేసేందుకు అనుమతిస్తున్నాయి. → ఒకవేళ వెయిటింగ్‌ పీరియడ్‌ క్లాజు ఉన్నా, సాధ్యమైనంత తక్కువ ప్లాన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. → క్లెయిమ్‌ చెల్లింపుల రేషియో ఎక్కువ ఉన్న బీమా సంస్థ అయితే నయం. అదే సమయంలో ఆయా బీమా సంస్థ సేవలు బాగున్నాయేమో చూసుకోవాలి.రిస్క్‌లు..→ ఈ వయసులో పాలసీలకు కంపెనీలు అధిక ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. → అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్ని బీమా సంస్థలు పాలసీ ఇవ్వడానికి నిరాకరించొచ్చు. ఇవి అందరికీ.. → వయసు ఏదైనప్పటికీ అధిక కవరేజీ ఉంటే ఎంతో మంచిది. కనీసం రూ.20 లక్షలు అంతకంటే అధికం (సూపర్‌ టాపప్‌) ఉండేలా చూసుకోవాలి. → ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను ప్రధానంగా చూడాలి. ఎక్కువ ఆస్పత్రుల్లో, అందులోనూ పేరున్న ఆస్పత్రులు అన్నీ ఉంటే మంచిది. → రూమ్‌ రెంట్‌లకు సంబంధించి పరిమితులు, కో–పేమెంట్, వ్యాధుల వారీ పరిమితులు ఏవీ లేకుండా చూసుకోవాలి. → పాలసీ తీసుకునే ముందు పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌ ఆసాంతం చదివి.. అందులో సదుపాయాలు, మినహాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. → గడువులోపు పాలసీని తప్పక రెన్యూ చేసుకోవాలి. దీనికి ఆటో డెబిట్‌ యాక్టివేట్‌ చేసుకోవాలి.– సాక్షి, వెల్త్‌

Employees Being Investigated Have Been Suspended TCS on Nashik Sexual Harassment Probe2
TCSలో కలకలం.. రంగంలోకి పోలీసులు

ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ.. తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఏ రూపంలోనైనా వేధింపులు, బలవంతం పట్ల తమకు ‘జీరో-టాలరెన్స్’ విధానం ఉందని టీసీఎస్ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టయిన ఆరుగురితో సహా, విచారణలో ఉన్న ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే సస్పెండ్ చేసింది.దీనిపై టీసీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ.. “నాసిక్‌లో ఈ విషయం మా దృష్టికి రాగానే, మేము తక్షణ చర్యలు తీసుకున్నాము. విచారణలో ఉన్న ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశాము. మేము అధికారులకు సహకరిస్తున్నాము, ఈ విచారణ ముగింపు ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఈ ఘటన "చాలా తీవ్రమైనది" అని అభివర్ణించారు. అంతే కాకుండా త్వరితగతిన స్పందించిన నాసిక్ పోలీసులను ప్రశంసించారు.ఇదీ చదవండి: టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నాసిక్ పోలీసులు ప్రస్తుతం పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ హెచ్‌ఆర్ అధికారిని విచారిస్తున్నారు, ఇప్పటివరకు, కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.

Simplest Way to Deactivate Your Deceased Family Member Aadhaar3
మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..

సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డీయాక్టివేట్‌ చేయడం ఇలా.. ➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్‌కు వెళ్లండి➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్‌ నెంబర్ ఎంటర్ చేయాలి.➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.Reporting death and deactivation of Aadhaar of a deceased family member helps in preventing the misuse of their Aadhaar.Report death on myAadhaar Portal: https://t.co/4k2YjTw4BM#Aadhaar #UIDAI #ReportDeath #AadhaarDeactivation pic.twitter.com/jELeDN2EIu— Aadhaar (@UIDAI) April 10, 2026

Smart Kitchen Gadgets That Make Cooking Effortless and Stylish4
వంటగది కోసం.. ప్రత్యేక గ్యాడ్జెట్స్!

వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్‌లో, తక్కువ శ్రమతో స్టయిలిష్‌గా పూర్తి చేసే గాడ్జెట్లు మీకోసం!స్ప్రే టచ్‌! మీ కిచెన్‌లో టేస్ట్‌ మాత్రమే కాదు, హెల్త్‌ కూడా కంట్రోల్‌లో ఉండాలంటే ఈ స్మార్ట్‌ ఆయిల్‌ స్ప్రేయర్‌ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్‌ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్‌ మ్యాజిక్‌ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్‌తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్‌ ఫ్రయ్యర్‌లో చికెన్‌ రోస్ట్‌ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్‌ కూడా తగ్గుతుంది! సలాడ్స్‌ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్‌ ఫినిషింగ్‌ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!వంటింట్లో ఆర్గానిక్‌ ఫామ్‌!బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్‌ మేకర్‌! ఇందులో ఉన్న స్మార్ట్‌ ‘నాబ్‌’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్‌మెంట్‌ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్‌ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!స్నాక్‌ పార్ట్నర్‌!సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్‌ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్‌ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్‌ డిష్‌ నట్‌ బౌల్‌!ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్‌ టైమ్‌ను క్లీన్‌గా, స్టయిలిష్‌గా మార్చే చిన్న మ్యాజిక్‌ బౌల్‌! ఇందులో డబుల్‌ డిష్‌ బౌల్స్‌ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్‌ నట్స్‌ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్‌లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే!

TCS Makes Only 25000 Fresher Offers This Fiscal Know The Details Here5
టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!

Mercedes Benz EQA EQB A Class Sedan And EQE SUV Discontinued In India Market6
బెంజ్ కీలక నిర్ణయం: నాలుగు మోడల్స్‌కు గుడ్‌బై!

ప్రముఖ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. ఇండియన్ మార్కెట్ నుంచి A-క్లాస్ సెడాన్, EQA, EQB, EQE SUVలను నిలిపివేసింది. కంపెనీ ఈ నాలుగు మోడళ్లను తన అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది.మెర్సిడెస్ బెంజ్.. కొత్త ప్రీమియం కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాలుగు మోడల్స్ నిలిపివేసింది. కాగా సంస్థ ఏప్రిల్ 24న మూడవతరం సీఎల్ఏ కారును లాంచ్ చేయనుంది.మార్చి 2021లో ప్రారంభమైన ఏ-క్లాస్ లిమౌసిన్, గతంలో భారతదేశంలో అత్యంత సరసమైన మెర్సిడెస్-బెంజ్‌గా ఉండేది, దీని ధరలు రూ. 44.46 లక్షల నుంచి రూ. 45.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. దాని ఉత్పత్తి నిలిపివేయడంతో, ఇప్పుడు GLA SUV ఈ స్థానంలోకి చేరనుంది. ఈ కారు ధరలు సుమారు రూ. 51.80 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీన్నిబట్టి చూస్తే బెంజ్ కారు ప్రారంభ ధర పెరిగినట్లు స్పష్టమవుతోంది.జీఎల్ఏ కారుకు ఎలక్ట్రిక్ ప్రతిరూపంగా నిలిచిన EQA, భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ యొక్క అత్యంత సరసమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, దీని ప్రారంభ ధర సుమారు రూ. 66 లక్షలు.మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు CLA EV 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో లాంచ్ కానున్న దీని ఎంట్రీ-లెవల్ 85kWh 250+ వెర్షన్, WLTP సైకిల్ ప్రకారం.. సుమారుగా 792 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 272 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల సీఎల్ఏ A 250+ కేవలం 6.7 సెకన్లలో పూర్తిగా ఆగి ఉన్న స్థితి నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

Advertisement
Advertisement
Advertisement