Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Maruti Suzuki, Hyundai, Kia post record sales in April 20261
కారు.. టాప్‌ గేరు!

ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా వంటి సంస్థల రికార్డు స్థాయి విక్రయాల కారణంగా, ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో 4.5 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది(2025) ఇదే నెల అమ్ముడైన 3.54 లక్షల ప్యాసింజర్‌ వాహనాలతో పోలిస్తే ఇవి 27% అధికంగా ఉన్నాయి. జీఎస్‌టీ 2.0 అమలుతో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఆర్‌బీఐ రెపో రేట్ల తగ్గింపు, ఆదాయ పన్ను రాయితీ అంశాలతో వాహన పరిశ్రమకు ప్రయోజనం చేకూరిందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. → మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది డిసెంబర్‌ నాటి 1,82,165 యూనిట్ల గరిష్ట స్థాయి అధిగమిస్తూ.. ఈ ఏప్రిల్‌లో 1,91,122 వాహనాలను విక్రయించింది. గత ఏప్రిల్‌తో (1,42,053 యూనిట్లు) పోలిస్తే వృద్ధి 34.54 శాతంగా నమోదైంది. ప్రస్తుతం మారుతీ వద్ద 1.65 లక్షల బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. → మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం) ఏప్రిల్‌లో దేశీయంగా 56,331 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 52,330 వాహనాలతో పోలిస్తే ఇవి 8% అధికంగా ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026–27) ‘సానుకూల దృక్పథం’తో ప్రారంభమైందని సంస్థ ఆటోమోటివ్‌ విభాగం సీఈఓ నళినీకాంత్‌ గొల్లగుంట తెలిపారు. → టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌(టీఎంపీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 30.5% పెరిగి 45,199 నుంచి 59,000 యూనిట్లకు చేరాయి. → ప్రభుత్వ పాలసీ మద్దతుతో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్‌ 2026లో 17% వార్షిక వృద్ధితో దేశీయంగా 51,902 యూనిట్ల విక్రయాలు జరిపింది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్‌ నెలలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే. → కియా ఇండియా ఏప్రిల్‌లో 16% వృద్ధితో అదరగొట్టింది. గతేడాది ఏప్రిల్‌లో 23,623 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 27,286 వాహనాలతో సంస్థ చరిత్రలోనే అత్యధిక ఏప్రిల్‌ విక్రయాలను నమోదు చేసింది.→ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ 21 శాతం వృద్ధితో సత్తా చాటింది. గతేడాది ఏప్రిల్‌లో 24,833 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 30,159కి చేరింది. → జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా ఈ ఏప్రిల్‌లో 3 శాతం వృద్ధితో 6,018 వాహనాలను డీలర్లకు పంపింది. → రెనో ఇండియా అమ్మకాల్లో ఏకంగా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గతేడాది 2,602 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 5,413కి చేరింది. → నిస్సాన్‌ మోటార్‌ ఇండియా దేశీయ విక్రయాలు 3,203 యూనిట్లుగా నమోదయ్యాయి.

Indian Railways Coach Codes Explained H1 A1 B1 and More2
ట్రైన్ టికెట్‌లపై H1, A1 కోడ్‌లు: వీటి అర్థం ఏంటో తెలుసా?

ట్రైన్లలో ప్రయాణించే చాలామందికి.. రైల్వే వ్యవస్థ గురించి బహుశా తెలిసి ఉండక పోవచ్చు. ట్రైన్‌పై ఉండే బోర్డుల దగ్గర నుంచి నెంబర్ల వరకు అనేక విషయాలు వెనుక ఒక సరైన అర్థం ఉంటుంది. అయితే టికెట్స్ మీద కూడా మీరు గమనించినట్లయితే.. ఇక్కడ కూడా H1, H2, A1, B1 అని ఉండటం కనిపిస్తుంది. ఈ కథనంలో వీటి గురించి తెలుసుకుందాం.టికెట్ మీద H1, H2అని ఉంటే.. అది ఏసీ ఫస్ట్ క్లాస్ అని అర్థం. దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ కోచ్ మీద ఇలాంటి గుర్తు ఉంటుంది. ఇందులో చాలా సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ టికెట్ ధర విమానం టికెట్ ధరకు సమానంగా ఉంటుంది. భోజన సదుపాయం, ఛార్జింగ్ పాయింట్లు, బెల్ సిస్టం, బెడ్ షీట్స్ మొదలవునవి ఉంటాయి. H1, H2 అంటే రెండు కోచ్‌లు అన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచుల్లో కూపే, క్యాబిన్ అనేవి ఉంటాయి. కూపే అంటే ఇద్దరు ప్రయాణికులకు ప్రత్యేకంగా కంపార్ల్‌మెంట్ ఉంటుంది. ఇక క్యాబిన్ అంటే నలుగురు ప్రయాణికులు ఉంటారు.మీ టికెట్ మీద A1, B1 అని ఉంటే.. టూ టైర్ ఏసీ కోచ్‌లని అర్థం. ఇందులో కర్టెన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో 6 బెర్త్‌ల వరకు ఉంటాయి. ఇక B1, B2, B3 అని ఉంటే అవి ఏసీ త్రీ టైర్ కోచ్‌లని అర్థం. S1, S2 అంటే సాధారణ స్లీపర్ కోచ్‌లన్నమాట. CC అంటే ఏసీ చైర్ కార్. ఏసీ సౌకర్యం ఉంటుంది, కూర్చుని ప్రయాణించాలి.ఇదీ చదవండి: భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!

Gold Price Drop in India Check Updated Rates in Hyderabad Mumbai and Delhi3
భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!

గత కొన్నిరోజులు బెంబేలెత్తించిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూ, ఒక్కసారిగా భారీ పతనం చవిచూశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.2,350 తగ్గి, రూ.1,50,380 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 2,150 రూపాయలు తగ్గి, రూ.1,37,850 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రేటు 2450 రూపాయలు తగ్గింది. దీంతో దేశ రాజధాని నగరంలో తులం పసిడి ధర రూ.1,50,430 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 2150 రూపాయలు తగ్గి, 1,38,000 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం రేటు రూ.1,51,860 (రూ.1960 తగ్గింది) వద్ద, 22 క్యారెట్ల తులం ధర రూ. 1,39,200 (రూ.1800 తగ్గింది) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!

Oben Rorr EVO Electric Motorcycle Launched At Rs 99,9994
సరికొత్త రోర్ లాంచ్: ధర రూ.లక్ష!

ప్రముఖ స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన ఓబెన్ ఎలక్ట్రిక్.. సరికొత్త రోర్ ఈవీఓ లాంచ్ చేసింది. మొదటి 10,000 మంది కస్టమర్లు దీనిని రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. తరువాత దీని ధర రూ. 1,24,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.కేవలం రూ. 777తో బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి, దేశవ్యాప్తంగా ఉన్న 150 షోరూమ్‌లలో టెస్ట్ రైడ్‌లు, కస్టమర్ డెలివరీలు జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా.. మంచి డిజైన్ కలిగిన ఈ ఓబెన్ రోర్ ఈవీఓ ముందు భాగంలో సిగ్నేచర్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది.రోర్ ఈవీఓ గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ రేంజ్ 180 కిమీ (సింగిల్ ఛార్జ్). రియల్ వరల్డ్ రేంజ్ కొంత తక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 90 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ అవుతుంది. రోజువారీ ఛార్జింగ్ కోసం ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉపయోగపడుతుంది.ఈ మోటార్‌సైకిల్‌కు IP68-రేటెడ్ మోటార్ శక్తిని అందిస్తుంది. రోర్ ఈవీఓలో ఓబెన్ వారి సొంత 3.4 kWh అధిక-పనితీరు గల LFP బ్యాటరీని అమర్చారు. ఇది సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే 50% అధిక ఉష్ణ నిరోధకతను కలిగి ఉండటమే కాకుండా.. రెండు రెట్లు జీవితకాలాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్!రోర్ ఈవీఓ 5 ఇంచెస్ కలర్ TFT డిస్‌ప్లేతో వస్తుంది. ఇది నావిగేషన్, రైడ్ డేటా, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ కోసం స్మార్ట్ అలర్ట్‌లను అందిస్తుంది. Oben Electric యాప్ ద్వారా, రైడర్‌లు రైడ్ హిస్టరీ, జియో ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, 'ఫైండ్ మై Rorr', 24x7 సర్వీస్ సపోర్ట్‌ను పొందవచ్చు. దీనితో పాటు 68,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ కూడా లభిస్తుంది.

PhonePe Surpasses 700 Million Registered Users5
70 కోట్లు దాటిన ఫోన్‌పే యూజర్లు!

ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే యూజర్లు గణనీయంగా పెరుగుతున్నారు. 2026 ఏప్రిల్‌ 29 నాటికి తమ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్‌ చేసుకున్న వారి సంఖ్య 70 కోట్లు దాటినట్లు సంస్థ తెలిపింది. తొలి 10 లక్షల మంది యూజర్ల స్థాయిని చేరడానికి 136 రోజులు పట్టగా, ప్రస్తుతం ప్రతి 6 రోజులకు ఈ మైలురాయిని దాటేస్తున్నామని పేర్కొంది. 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో యూజర్ల సంఖ్య వార్షికంగా 56.25 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ నిగమ్‌ తెలిపారు. మరిన్ని ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.700 Million 💜A number this big only happens because of the trust you place in us every single day.To our users, merchants and partners across every corner of India thank you for making us 700 Mn strong! 🙏Read More: https://t.co/e9vyvz9uI4#PhonePeFamily #Milestone… pic.twitter.com/mcgjBlEzzR— PhonePe (@PhonePe) April 29, 2026

Fired by Elon Musk, Now Boss for a Rs 19000 Crore Company6
నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!

మాజీ ట్విట్టర్‌ సీఈఓ పరాగ్ అగర్వాల్.. టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ట్విటర్ (ఎక్స్)లో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. ఆయన స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్‌ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోంది. తాజా నిధుల సమీకరణ తర్వాత 2 బిలియన్ డాలర్ల (రూ. 19,020 కోట్లు) విలువను చేరుకుంది.సీక్వోయా క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన సిరీస్ బీ రౌండ్‌లో.. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ 100 మిలియన్ డాలర్లు (రూ. 951 కోట్లు) సమీకరించింది. ఈ రౌండ్‌లో క్లైనర్ పెర్కిన్స్, ఇండెక్స్ వెంచర్స్, ఖోస్లా వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, స్పార్క్ క్యాపిటల్, టెర్రైన్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.ఐదు నెలల క్రితం, ఈ స్టార్టప్ 740 మిలియన్ డాలర్ల (రూ.7,037 కోట్లు) వాల్యుయేషన్‌తో సిరీస్ ఎ ఫండింగ్‌లో 100 మిలియన్ డాలర్ల (రూ.951 కోట్లు) నిధులను సమీకరించింది. కాగా తాజా పెట్టుబడితో, కంపెనీ సమీకరించిన మొత్తం నిధులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు (రూ.2,187 కోట్లు) చేరాయి.ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది AI ఏజెంట్ల కోసం రూపొందించిన సాధనాలను నిర్మిస్తుంది, ఆటోమేటెడ్ సిస్టమ్‌లకు అనుగుణంగా వెబ్ సెర్చ్‌, రీసెర్చ్‌ APIలను అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే నోషన్, ఓపెన్‌డోర్, క్లే, హార్వే వంటి ప్రముఖ క్లయింట్లను ఆకర్షించింది. ఇది బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లకు కూడా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే నిర్దిష్ట పేర్లను వెల్లడించలేదు.తమ ప్లాట్‌ఫామ్‌ను లక్షకు పైగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో.. ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ2022లో ట్విటర్ (ఎక్స్) సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత.. పరాగ్ అగర్వాల్ తన సీఈఓ పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనతో పాటు ఇతర మాజీ అధికారులు 128 మిలియన్‌ డాలర్ల పరిహారం కోసం కేసు వేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇది గోప్యంగా పరిష్కారమైంది. కాగా.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీతో పరాగ్ దూసుకెళ్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement