ప్రధాన వార్తలు
గ్రీన్ పోర్ట్ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పర్యావరణహిత పోర్టుల (గ్రీన్ పోర్ట్లు) అభివృద్ధి, సముద్ర మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, వాటర్వేస్ శాఖ తెలిపింది. ’మారిటైమ్ ఇండియా విజన్ –2030’, ’హరిత సాగర్’ మార్గదర్శకాల కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రాం ద్వారా డీజిల్ టగ్ల స్థానంలో ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ టగ్ల వినియోగం, పోర్టుల్లో పునరుత్పాదక శక్తి వినియోగం పెంపు, పోర్ట్ పరికరాలు, వాహనాలు, రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ, జీరో ఎమిషన్ ట్రక్కుల వినియోగం, నౌకలకు తీర ప్రాంతం నుంచే విద్యుత్ సరఫరా చేసే ‘‘వన్షోర్ పవర్ సప్లై’’ వ్యవస్థలు’ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా ‘దీన్దయాల్ పోర్ట్ అథారిటీ, పారాదీప్ పోర్ట్ అథారిటీ, వీ.ఓ.చిదంబరనార్ పోర్ట్ అథారిటీ’లను నూతన, పునరుత్పాదక శక్తి శాఖ గుర్తించినట్లు వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023–24, 2024–25) ప్రధాన పోర్టుల అభివృద్ధికి సుమారు 180 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది.వీటిలో ప్రధానంగా ‘పోర్టుల ఆధునీకరణ, తీర ప్రాంత రవాణా (కోస్టల్ షిప్పింగ్) అభివృద్ధి, గ్రీన్ పోర్టుల రూపకల్పన’ ఉన్నాయి. 2030 నాటికి ‘60% పైగా పునరుత్పాదక శక్తి వినియోగం, 50% పోర్ట్ పరికరాల విద్యుదీకరణ, 20% గ్రీన్ బెల్ట్ విస్తీర్ణం, కర్బన ఉద్గారాల్లో 30% తగ్గింపు (టన్ను కార్గోకు), నీటి వినియోగం 20% తగ్గింపు’ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు!
సొంతిల్లు అనేది ప్రతిఒక్కరికీ జీవిత కల. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆ కలను సాకారం చేసుకోవడంలో సవాలుగా మారుతున్నాయి. 2026 తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా నిర్మాణ ఖర్చులు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో..దేశంలో నిర్మాణ ఖర్చులు ఎక్కడ తక్కువ?భారతదేశంలో నిర్మాణ ఖర్చులు భౌగోళిక ప్రాంతం, రవాణా సౌకర్యాలు, కూలీల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అత్యంత సరసమైన ధరల్లో నిర్మాణాలు జరుగుతున్న నగరాలు ఇవే..అహ్మదాబాద్ (గుజరాత్): దేశంలోనే అత్యంత చౌకగా ఇల్లు నిర్మించుకోగలిగే నగరం ఇది. ఇక్కడ చదరపు అడుగుకి సగటున రూ.1,200 – రూ.1,600 ఖర్చు అవుతోంది.జైపూర్ (రాజస్థాన్): ఇక్కడ చదరపు అడుగుకి రూ.1,500 – రూ.2,200 మధ్య ధరలు ఉన్నాయి.విజయవాడ (ఆంధ్రప్రదేశ్): పెరుగుతున్న నగరమైనప్పటికీ, మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా (చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,200) నమోదవుతున్నాయి.కోల్కతా: మెట్రో నగరాల్లో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోగలిగే చోటుగా కోల్కతా నిలుస్తోంది (సుమారు రూ.1,500 – రూ.2,500).మరోవైపు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ ఖర్చు చదరపు అడుగుకి రూ.2,500 నుంచి రూ.5,000 పైమాటే.తెలుగు రాష్ట్రాల పరిస్థితితెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లలో నిర్మాణ ఖర్చులు 10-15% పెరిగాయి. ముఖ్యంగా కూలీల కొరత, రవాణా ఛార్జీలు పెరగడం దీనికి ప్రధాన కారణం. హైదరాబాద్లో ఇంటి నిర్మాణానికి బేసిక్ క్వాలిటీలో ఒక చదరపు అడుగుకు రూ.1,700 – రూ.2,000, స్టాండర్డ్ క్వాలిటీ అయితే రూ.2,100 – రూ.2,500 ఖర్చవుతోంది. అదే ప్రీమియం/లగ్జరీ అయితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.2,600 – రూ.3,800 ఖర్చు పెట్టాల్సి వస్తోంది.హైదరాబాద్ శివార్లలో (ఉదా: షాద్నగర్, ఆదిబట్ల) నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా ఉండగా, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో కూలీల రేట్లు అధికంగా ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో సగటున చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,300 ఖర్చు అవుతోంది. విశాఖపట్నం వంటి నగరాల్లో స్టీల్, సిమెంట్ రవాణా సౌకర్యం వల్ల మెటీరియల్ ధరలు ఇతర ప్రాంతాల కంటే స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.సగటు నిర్మాణ సామగ్రి ధరలు 2026 అంచనా ధరల ప్రకారం.. నిర్మాణ వ్యయంలో దాదాపు 60-70% ఖర్చు మెటీరియల్కే అవుతుంది. ప్రస్తుత మార్కెట్ రేట్లు ఇలా ఉన్నాయి..సామగ్రిసగటు ధరసిమెంట్ (50kg బ్యాగ్)₹350 – ₹450స్టీల్ (TMT Bars - టన్ను)₹60,000 – ₹75,000ఇసుక (రివర్ సాండ్ - టన్ను)₹1,200 – ₹2,500 (లభ్యతను బట్టి)ఎం-సాండ్ (M-Sand - టన్ను)₹900 – ₹1,500ఇటుకలు (ఒక్కోటి)₹7 – ₹12సిమెంట్ ఇటుకలు/బ్లాక్స్₹30 – ₹502026 బడ్జెట్లో సిమెంట్ పై జీఎస్టీని (GST) 28% నుంచి 18 శాతానికి, స్టీల్ పై 18% నుంచి 12శాతానికి తగ్గించడం వల్ల సామాన్యులకు కొంత ఊరట లభించింది.ఖర్చును ఎలా తగ్గించుకోవాలి?స్థానిక మెటీరియల్: రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి స్థానికంగా లభించే ఇటుకలు, కంకర వాడటం ఉత్తమం.ప్లానింగ్:నిర్మాణ సమయంలో ప్లాన్ మార్పులు చేయకుండా ముందుగానే పక్కాగా సిద్ధమవ్వాలి.టెక్నాలజీ: ప్రస్తుత కాలంలో ఏఏసీ బ్లాక్స్ వాడకం వల్ల ప్లాస్టరింగ్ ఖర్చు, సిమెంట్ వినియోగం తగ్గుతుంది.ఇదీ చదవండి: సిటీ రియల్ ఎస్టేట్కు గేమ్ ఛేంజర్!
వివో నుంచి రెండు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ: వివో ఇండియా కొత్తగా రెండు 5జీ స్మార్ట్ ఫోన్స్ని ఆవిష్కరించింది. వై21, వై11 వీటిలో ఉన్నా యి. వై 21 5జీ ధర రూ. 18,999 నుంచి, వై11 5జీ రేటు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో వై21పై రూ. 1,500 వరకు, వై11పై రూ. 1,000 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ ఉంటుంది.రెండు డివైజ్లలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీలు, 6.74 అంగుళాల స్క్రీన్లు, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్లు, ఆరిజిన్ ఓఎస్6 ఆపరేటింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వై21లో 50 ఎంపీ రియర్ కెమెరా, వై11లో 13 ఎంపీ రియర్ కెమెరా ఉంటాయి. వివో ఇండియా ఈ–స్టోర్, ఈకామర్స్ ప్లాట్ఫాంలు, పార్ట్నర్ రిటైల్ స్టోర్స్లో ఇవి లభిస్తాయి.
పునరుత్పాదక విద్యుత్పై ఎల్జీఈ ఇండియా ఫోకస్
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీఈ ఇండియా తమ తయారీ ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలతో దీర్ఘకాలిక సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంది. తమ పుణె ప్లాంటుకు 9.89 మెగావాట్స్ పీక్ (ఎండబ్ల్యూపీ) సోలార్ పవర్ కోసం హిందుజా రెన్యువబుల్స్ ఎనర్జీతో, అలాగే గ్రేటర్ నోయిడా ప్లాంటుకి సంబంధించి 11 ఎండబ్ల్యూపీ కోసం సన్ష్యూర్ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతో మొత్తం మీద ఏటా 50,000 గృహాల అవసరాలకు సరిపడేంతగా 3.2 కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్ జనరేట్ అవుతుందని సంస్థ వివరించింది.
ట్యాబ్లెట్ పీసీల్లో శాంసంగ్ టాప్..
ముంబై: భారత ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ 2025లో వార్షిక ప్రాతిపదికన 2% వృద్ధి సాధించింది. ముఖ్యంగా శాంసంగ్ 31% మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలవగా.. యాపిల్ 20% వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లెనోవో (15%) మూడో స్థానంలో నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.‘‘ప్రముఖ బ్రాండ్లు చేపట్టిన వ్యూహాత్మక ఉత్పత్తి నవీకరణల కారణంగా భారత ట్యాబ్లెట్ మార్కెట్లో ప్రీమియం వైపు స్పష్టమైన మార్పు కనిపించింది. రూ.30,000–రూ.40,000 ధర విభాగం అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్గా మారింది. ఈ విభాగంలో షిప్మెంట్లు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇది అత్యాధునిక పనితీరు గల డివైస్లపై కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తి సూచిస్తుంది.’’ అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రధాన అనలిస్ట్ అన్షికా జైన్ తెలిపారు. కొనసాగిన శాంసంగ్ హవా: భారత్ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లో గతేడాది కూడా శాంసంగ్ అగ్రస్థానంలోనే కొనసాగింది. ట్యాబ్లెట్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో మార్కెట్ వాటా 2024లో 27% నుంచి 2025లో 31 శాతానికి పెరిగింది. గెలాక్సీ ట్యాబ్ ఏ9 సిరీస్కు మంచి డిమాండ్ నెలకొనడం, తరువాత ఏ11 సిరీస్ ప్రవేశంతో వృద్ధి కొనసాగింది. రూ.15,000–రూ.30,000 విభాగంలో శాంసంగ్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అలాగే గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ ద్వారా ప్రీమియం విభాగంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. యాపిల్ వాటా స్వల్ప తగ్గుదల: మార్కెట్ వాటా స్వల్పంగా రెండు శాతం క్షీణించినప్పటికీ యాపిల్ మొత్తం మీద 20 శాతం వాటాతో శాంసంగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. రూ.30,000– రూ.40,000 ధర విభాగంలో ఐప్యాడ్ (2025) 128జీబీ మోడల్కు మంచి డిమాండ్ ఉండటం గమనార్హం. ఐప్యాడ్ ప్రో సిరీస్లో ఓఎల్ఈడీ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రీమియం సెగ్మెంట్లో కంపెనీ స్థానం బలపడింది. లెనోవో 24% సప్లై వృద్ధితో 15 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోగా, షియోమీ 74% షిప్మెంట్ పెరు గుదలతో 11% మార్కెట్ వాటాను సాధించింది. మరోవైపు, ఏసర్ సప్లైలు 50% క్షీణించడంతో మార్కెట్ వాటా 2024లోని 21% నుంచి 2025లో 10 శాతానికి దిగివచి్చంది. ఎగుమతులు–తయారీ రంగాల్లో పురోగతి: 2025లో ట్యాబ్లెట్ ఎగుమతులు ఒక మిలియన్ యూనిట్లను దాటాయి. శాంసంగ్, లెనోవో ఆధ్వర్యంలో అమెరికా, యూరప్ మార్కెట్లకు సరఫరాలు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి మొత్తం షిప్మెంట్లో 50 శాతానికి చేరడం లోకలైజేషన్ వేగాన్ని సూచిస్తోంది. దీంతో భారత్ గ్లోబల్ ట్యాబ్లెట్ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.2026లో వృద్ధి అంచనాలు: బలమైన డిమాండ్ ఆధారంగా 2026లో మార్కెట్ మరింత వృద్ధి చెందనుందని అంచనా. మెమరీ ధరలు ఖర్చులు, లాభాలపై ప్రభావం చూపినా..., అధిక కాని్ఫగరేషన్లు, ప్రొడక్టివిటీ డివైజ్లకు పెరుగుతున్న డిమాండ్ వృద్ధికి దోహదం చేస్తాయి. లోకలైజేషన్, సరఫరా డైవర్సిఫికేషన్తో ఎగుమతులు కీలకంగా మారనున్నాయి. ఏఐ ఆధారిత టాబ్లెట్లు, డివైస్లోనే పనిచేసే ఏఐ ఫీచర్లు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, మార్కెట్ విస్తరణకు తదుపరి దశకు పునాది వేస్తాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అభిప్రాయపడింది.
మర్చంట్ చెల్లింపుల్లో పేటీఎం ఫస్ట్
న్యూఢిల్లీ: మర్చంట్ చెల్లింపుల్లో పేటీఎం ప్లాట్ఫామ్ దూసుకుపోతోంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ వ్యాపార వృద్ధిలో ఈ విభాగం కీలకంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ పేర్కొంది. కంపెనీకి ‘బై’ (కొనుగోలు) రేటింగ్ ఇస్తూ రూ.1,350 లక్ష్యాన్ని ప్రకటించింది. 2025–26 నుంచి 2027–28 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం ఏటా 22 % చొప్పున వృద్ధి చెందుతుందని (సీఏజీఆర్) అంచనా వేసింది. ఈ కాలంలో ఎబిట్డా మార్జిన్లు పెరుగుతాయని పేర్కొంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో మర్చంట్ చెల్లింపుల్లో అతిపెద్ద సంస్థగా పేటీఎం ఎదుగుతున్నట్టు వివరించింది.అధిక చెల్లింపుల లావాదేవీలతోపాటు, వేగంగా రుణా ల మంజూరును ప్రస్తావించింది. పేటీఎం ప్లాట్ఫామ్పై 4.5 కోట్ల వర్తకులు ఉన్నారని, డివైజ్ సబ్స్క్రిప్షన్ పెరుగుతున్న కొద్దీ పేటీఎం ఆదాయాలు మెరుగుపడనున్నట్టు జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. చెల్లింపుల గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) ఏటా 23% చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2026 మార్చి నాటికి ఇది రూ.24 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. పేటీఎం మర్చంట్ లెండింగ్ (వర్తకులకు రుణాల మంజూరు) అన్నది రిటైల్ రుణాలను మించినట్టు తెలిపింది.యూపీఐ ద్వారా రుణ వితరణకు ఉన్న దీర్ఘకాల వృద్ధి అవకాశాలనూ ప్రస్తావించింది. ఆర్థిక సేవల ఆదాయం ఏటా 28 శాతం చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.12,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2028 మార్చి నాటికి రూ.1,700 కోట్ల నికర లాభాన్ని పేటీఎం ప్రకటించొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.574 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.
కార్పొరేట్
గ్రీన్ పోర్ట్ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
పునరుత్పాదక విద్యుత్పై ఎల్జీఈ ఇండియా ఫోకస్
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఆ దేశంలో ఆఫీసులు.. స్వర్గాలు!
పెరగనున్న ఐఫోన్ ధరలు: కారణం ఇదే!
నోకియా 14,000 మందికి లేఆఫ్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి జెఫ్రీస్ నిష్క్రమణ
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!
ఇంటీరియో టార్గెట్.. మార్కెట్లో రూ.550 కోట్లు!
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ...
జియో ఐపీవో ఎప్పుడంటే?
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్...
పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో...
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?
భారత్కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబ...
నకిలీ ట్రేడింగ్ యాప్లకు సెబీ చెక్
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక...
పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..
అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే...
ఆర్బీఐ పాలసీ మీటింగుల షెడ్యూల్ వచ్చేసింది..
ముంబై: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
రవి అస్తమించినా సౌర కాంతులు!
సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్హువాంగ్ సోలార్ ప్లాంట్ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్పైకి కేంద్రీకరిస్తాయి.ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?ఈ ప్లాంట్లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.China’s solar plant in Dunhuang uses 12,000 mirrors to focus sunlight onto a central tower, heating molten salt to extreme temperatures.The real magic? It stores that heat so that power can be generated even after the sun goes down. pic.twitter.com/lDq0NB8jWl— Harsh Goenka (@hvgoenka) March 24, 2026భవిష్యత్తుకు మార్గదర్శిప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
రూ.1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ!
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సంవత్సరం పొడవునా ఫోన్ను యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్కు వెళ్లడం గానీ, ఆన్లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్ను పొందవచ్చు.గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు!
తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..
కృత్రిమ మేధ (ఏఐ) అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు క్లిష్టంగా భావించిన మ్యాసివ్ మల్టీ టాస్కింగ్ ల్యాంగ్వేజ్ అండర్స్టాండింగ్(ఎంఎంఎల్యూ) వంటి పరీక్షల్లో 90 శాతానికి పైగా స్కోరు సాధించి మనుషుల మేధస్సును సవాలు చేస్తోంది. అయితే, ఏఐ సామర్థ్యాన్ని కొలిచే పాత కొలమానాలు సరిపోవని భావించిన శాస్త్రవేత్తలు దానికి అత్యంత కఠినమైన పరీక్షలు సిద్ధం చేశారు. అదే ‘హ్యూమనిటీస్ లాస్ట్ ఎగ్జామ్(హెచ్ఎల్ఈ). ఎంఎంఎల్యూ అనేది ఏఐ మోడల్స్ తెలివితేటలను, విజ్ఞానాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్మార్క్ పరీక్ష. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన హెచ్ఎల్ఈ పరీక్ష వివరాలు, ఏఐ మోడల్స్ పనితీరుపై కథనం.ఏమిటీ హెచ్ఎల్ఈ? ఎందుకంత కఠినం?ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 500 సంస్థల నుంచి దాదాపు 1,000 మంది నిపుణులు సిద్ధం చేసిన 2,500 ప్రశ్నల సమాహారమే ఈ హెచ్ఎల్ఈ. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ, స్కేల్ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఏఐ మోడల్స్లోని లోపాలను ఎత్తిచూపడం, వాటి అసలు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. 100కు పైగా విభాగాల్లోని నిపుణులు పంపిన ప్రతి ప్రశ్న ప్రస్తుత ఏఐ మోడల్స్ను ఓడించడమే కాకుండా ఇద్దరు నిపుణుల సమీక్షను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆయా రంగాల్లోని నిపుణుల మధ్యే 15.4% నుంచి 18% వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే, ఏ ఒక్క మనిషి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం.గెలుపు ఎవరిది?ఈ పరీక్ష ప్రారంభమైనప్పుడు (జనవరిలో ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన సమయానికి) అత్యుత్తమ ఏఐ మోడల్స్ కూడా 10 శాతం కంటే తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. కానీ, గత కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది.ఏఐ మోడల్ప్రారంభ స్కోరు (%)ప్రస్తుత స్కోరు (%)GPT-4o2.7%-OpenAI o18.0%-DeepSeek-R18.5%-GPT-5-25.3%Gemini 2.5 Pro-21.6%Gemini 3 Pro (Live)-38.3% ఆందోళన కలిగిస్తున్న అంశాలుఈ పరీక్షలో బయటపడిన ప్రధాన లోపం ‘కాలిబ్రేషన్ ఎర్రర్’. సమాధానం తప్పు అని తెలిసినా ఏఐ మోడల్స్ అది 100% సరైనదని మొండిగా వాదిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగం లేదా ఆర్థిక రంగంలో ఏఐని వాడేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ‘ఒక తప్పు సమాధానాన్ని తప్పు అని ఏఐ గుర్తించలేకపోవడం అనేది సాంకేతిక లోపం కాదు, ప్రస్తుత ఏఐ డిజైన్ లోనే ఉన్న ఒక నిర్మాణాత్మక సమస్య’ అని నిపుణులు చెబుతున్నారు.కొలమానమే కరిగిపోతోందా?ఏఐ సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందంటే దాన్ని కొలిచే ‘యార్డ్స్టిక్’ కూడా సరిపోవడం లేదు. అందుకే పరిశోధకులు ‘హెచ్ఎల్ఈ రోలింగ్’ పేరుతో నిరంతరం అప్డేట్ అయ్యే డైనమిక్ టెస్టింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో అత్యుత్తమ స్కోరు సాధించినంత మాత్రాన దానికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు కాదని, కేవలం అకడమిక్ ప్రశ్నల్లో నిపుణత సాధించినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి సృష్టించిన పరీక్షను మనిషి కంటే వేగంగా ఏఐ ఛేదిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
పర్సనల్ ఫైనాన్స్
ఇక ఫింగర్ప్రింట్తోనే పేమెంట్స్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఫీచర్ ముఖ్యాంశాలురూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లోని బయోమెట్రిక్ ఫీచర్ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.యాక్టివేట్ చేసుకునే విధానంభీమ్ యాప్లో ఈ కొత్త ఫీచర్ను యాక్టివేట్ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్ఫారమ్లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది.
జియో.. జెరోధా.. కొత్త మ్యూచువల్ ఫండ్లు
జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ను కేదార్నాథ్ మిరాజ్కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 50:50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్ఈ 100 ఇండెక్స్ (టీఆర్ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026
బ్యాంకు సెలవులు.. వారంలో 4 రోజులు క్లోజ్!
మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సెలవుల వివరాలు ఇవే...మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఇతర సేవలు: ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు.మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.


