Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Increased Competition for Jobs More Than 9 Crore Applications Apna Report1
ఉద్యోగాలకు పెరిగిన పోటీ!.. 9 కోట్లకు పైగా దరఖాస్తులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఉద్యోగ మార్కెట్‌ మంచి వృద్ధిని చూసినట్టు అప్నా డాట్‌ కో ప్లాట్‌ఫామ్‌ వెల్లడించింది. 9 కోట్లకు పైగా ఉద్యోగ దరఖాస్తులు తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైనట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 29 శాతం అధికమని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, ఫ్రెషర్స్‌ ఎక్కువగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్టు పేర్కొంది. సేవల రంగంలో ఉద్యోగాలు మెట్రో నగరాల నుంచి ద్వితీయ, తృతీయ (టైర్‌–2, 3) నగరాలకు విస్తరించినట్టు తెలిపింది.2025లో 14 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఆప్నా డాట్‌ కో ప్లాట్‌ఫామ్‌పై పోస్టింగ్‌లు నమో దయ్యాయి. 2024తో పోల్చితే 15% పెరిగాయి. చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు సంబంధించి 10 లక్షల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. పెద్ద కంపెనీలకు సంబంధించి 4 లక్షల ఉద్యోగాల పోస్టింగ్‌లు నమోదయ్యాయి.14 లక్షల ఉద్యోగాలకు గాను 9 కోట్ల మంది దరఖాస్తు పెట్టుకున్నారు.దరఖాస్తు దారుల్లో 3.8 కోట్ల మంది మహిళలే ఉండడం గమనార్హం. అంటే 40 శాతంపైన అభ్యర్థులు మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. 2024తో పోల్చితే మహిళా దరఖాస్తుదారులు 36 శాతం పెరిగాయి.మహిళ దరఖాస్తుల్లో టైర్‌ 1 నగరాల నుంచి 2 కోట్లు రాగా, టైర్‌ 2, 3 నగరాల నుంచి 1.8 కోట్ల దరఖాస్తులు దాఖలయ్యాయి.మేనేజర్, లీడర్‌షిప్‌ రోల్స్‌కు మహిళల దరఖాస్తులు 2024తో పోల్చి చూస్తే 35 శాతం పెరిగాయి. 1.1 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, రిటైల్‌ రంగాల్లో ఉద్యోగాల కోసం మహిళలు ఎక్కువగా పోటీపడ్డారు.ఫ్రెషర్స్‌ (ఉద్యోగానికి కొత్త) నుంచి 2.2 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయి. 2024తో పోల్చితే ఫ్రెషర్ల దరఖాస్తులు 10% పెరిగాయి.టైర్‌–2, 3 నగరాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.అడ్మినిస్టేషన్, కస్టమర్‌ సపోర్ట్, ఫైనాన్స్, డిజిటల్‌ ఉద్యోగాలకు ఎక్కువ స్పందన వచ్చింది.ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై 2025లో 73 లక్షల ఆర్టిఫీయల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంటర్వ్యూలు చోటు చేసుకున్నాయి.సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఉత్పత్తి అభివృద్ధి, డేటా అనలిస్ట్, అకౌంటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, సేల్స్‌ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల్లో సన్నద్ధత ఎక్కువగా కనిపించింది.గూగుల్, టెస్లా, స్విగ్గీ, మైక్రోసాఫ్ట్, జియో, ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగార్థులకు ప్రాధాన్య కంపెనీలుగా నిలిచాయి.

Mukesh Ambani Family At Somnath Temple and Donating Rs 5 Crore2
సోమనాథ్ ఆలయంలో అంబానీ కుటుంబం: విరాళంగా రూ. 5కోట్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ.. కుమారుడు అనంత్ అంబానీతో కలిసి శుక్రవారం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. ఆ కుటుంబం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2025లో తిరుమల, గురువాయూర్నవంబర్ 2025లో ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో.. భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను (కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సమయంలోనే కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆ దేవాలయానికి రూ. 15 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.Anant Ambani beginning the year at Somnath Temple with Mukesh and Nita and donating ₹5 crore says a lot about how he’s been raised 🙏 pic.twitter.com/QzzzR5KZQU— Manan Natani (@MananNatani1) January 2, 2026

Price Hike Season Begins BYD Sealion 7 Gets Dearer By Rs 500003
చెప్పినట్లే చేసిన చైనా దిగ్గజం: రూ. 50వేలు పెరిగిన కారు రేటు!

2026 జనవరి 1నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు చెప్పిన చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ SUV ధర సవరణను ప్రకటించింది. ఈ నెల ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన ధరల ప్రకారం.. సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ రేటు రూ. 50,000 పెరిగింది. అయితే పెర్ఫార్మెంట్ వేరియంట్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించింది.జనవరి 1న జరిగిన ధరల సర్దుబాటు తర్వాత.. 82.56 kWh బ్యాటరీని కలిగిన BYD సీలియన్ 7 ప్రీమియం మోడల్ ధర రూ. 48,90,000 నుంచి రూ. 49,40,000లకు పెరిగింది. సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ మోడల్ ధర రూ. 54,90,000వద్ద కొనసాగుతుంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి కంపెనీ 2,300 యూనిట్ల సీలియన్ కార్లను విక్రయించింది.ఇదీ చదవండి: హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?కంపెనీ ఈ కారులో సెల్-టు-బాడీ డిజైన్ & బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ వంటి వాటిని అందించింది. ఇది సేఫ్టీలో కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రీమియం వెర్షన్ 308 hp & 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 567 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారు.. 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్, నప్పా లెదర్ సీటింగ్, ఎలక్ట్రిక్ సన్‌షేడ్‌తో కూడిన పనోరమిక్ గ్లాస్ రూఫ్ & 12-స్పీకర్ డైనాడియో ఆడియో సిస్టమ్ పొందుతుంది. వీటితోపాటు.. ఇందులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సేఫ్టీ లభిస్తుంది.

Govt unveils Rs 7295 crore credit support Package4
ఎగుమతిదారులకు రూ.7,295 కోట్ల ప్యాకేజీ 

న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్లు రుణాలపై వడ్డీ రాయితీ పథకానికి, రూ.2,114 కోట్లు రుణ హామీల కోసం కేటాయించింది. తద్వారా ఎగుమతిదారులు సులభంగా రుణాలు పొందగలరని పేర్కొంది. 2025 నుంచి 2031 వరకు ఆరేళ్ల కాలానికి ఈ ప్యాకేజీని తీసుకొచి్చంది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న నిధుల సమస్యకు ఈ చర్యలు పరిష్కారం చూపిస్తాయని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌ బాడూ పేర్కొన్నారు. వడ్డీ రాయితీ పథకం కింద ఎగుమతిదారులు.. ఎగుమతులకు ముందు, తర్వాత తీసుకున్న రుణాలపై వడ్డీ రేటులో 2.75 శాతాన్ని సబ్సిడీ కింద పొందొచ్చు. ఏడాదిలో రూ.50 లక్షల వరకు వడ్డీ రాయితీకి ఒక ఎంఎస్‌ఎంఈకి అర్హత ఉంటుంది. ఒక్కో సంస్థకు రూ.10 కోట్ల వరకు రుణ హామీ కూడా ఈ పథకంలో భాగంగా లభిస్తుంది. 2025 నవంబర్‌లో కేంద్రం రూ.25,060 కోట్లతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ను ప్రకటించడం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగానే ఈ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచి్చంది. దీనికి సంబంధించి సవివర మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేయనుంది.

Center Approved 22 new proposals under its Electronics Components Manufacturing Scheme5
మేకిన్‌ ఇండియాకు మెగా పుష్‌ 

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీని ప్రోత్సహించే దిశగా ప్రవేశపెట్టిన ఈసీజీఎస్‌ స్కీము కింద కొత్తగా 22 ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల కింద రూ. 41,863 కోట్ల పెట్టుబడులు రానుండగా రూ. 2,58,152 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను కంపెనీలు తయారు చేయనున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ స్కీము (ఈసీజీఎస్‌) కింద ఆమోదించిన ప్రతిపాదనల్లో ఫాక్స్‌కాన్, డిక్సన్, టాటా ఎల్రక్టానిక్స్, శాంసంగ్‌ మొదలైన దిగ్గజ కంపెనీల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ స్కీము కింద ఆమోదం లభించిన ప్రాజెక్టుల జాబితాలో ఇది మూడోది. దీనితో కొత్తగా 33,791 ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, కీలకమైన ఎలక్ట్రానిక్‌ విడిభాగాలకు దిగుమతులపై ఆధారపడటం తగ్గనుండగా, దేశీయంగానే అత్యంత విలువైన ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలకు వీలవుతుంది. కొత్త పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో సింహభాగం వాటా అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌కి సంబంధించిన కొత్త వెండార్లదే ఉంటుంది. వీటిలో కొన్ని సంస్థలు, యాపిల్‌ ఉత్పత్తులను అంతర్జాతీయంగా కూడా సరఫరా చేయనున్నాయి. మదర్సన్‌ ఎలక్ట్రానిక్‌ కాంపొనెంట్స్, టాటా ఎల్రక్టానిక్స్, ఏటీఎల్‌ బ్యాటరీ టెక్నాలజీ ఇండియా, ఫాక్స్‌కాన్‌ (యుఝాన్‌ టెక్‌ ఇండియా), హిండాల్కో ఇండస్ట్రీస్‌ అనే అయిదు సంస్థలు యాపిల్‌కి వెండార్లుగా వ్యవహరిస్తున్నాయి. మరిన్ని విశేషాలు... → తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర తదితర 8 రాష్ట్రాల్లో రానున్నాయి. ప్రాంతాలవారీగా పారిశ్రామిక వృద్ధి సమతూకంతో ఉండేలా చూసేందుకు, ఎల్రక్టానిక్స్‌ తయారీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. → స్మార్ట్‌ఫోన్స్‌లాంటి వాటిల్లో ఉపయోగించే మొబైల్‌ ఎన్‌క్లోజర్స్‌ తయారు చేసే మూడు ప్రాజెక్టుల్లో అత్యధికంగా రూ. 27,166 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. → కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్‌ కంట్రోల్స్, ఆటోమోటివ్‌ సిస్టంలు మొదలైన వాటిలో ఉపయోగించే పీసీబీల విభాగంలో తొమ్మిది ప్రాజెక్టుల ద్వారా రూ. 7,377 కోట్ల పెట్టుబడులు రానుండగా, కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌కి పవర్‌ బ్యాకప్‌గా పని చేసే లిథియం అయాన్‌ సెల్స్‌ ప్రాజెక్టుపై రూ. 2,922 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ రానుంది. → తమిళనాడులో ఫాక్స్‌కాన్‌ (యుఝాన్‌ టెక్‌ ఇండియా) మొబైల్‌ ఫోన్‌ ఎన్‌క్లోజర్ల ప్రాజెక్టుతో అదనంగా 16,200 మందికి ఉపాధి లభించనుంది. ఇక అదే రాష్ట్రంలో టాటా ఎల్రక్టానిక్స్‌ తలపెట్టిన మొబైల్‌ ఫోన్‌ ఎన్‌క్లోజర్ల ప్రాజెక్టుతో మరో 1,500 మందికి ఉపాధి లభించనుంది. → ఈ విడతలో మొబైల్స్, టెలికం, ఆటోమోటివ్, ఐటీ హార్డ్‌వేర్‌ మొదలైన 11 సెగ్మెంట్ల ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. → 2025 నవంబర్‌లో ప్రకటించిన విడతలో రూ. 7,172 కోట్ల పెట్టుబడులు, 11,808 ప్రత్యక్ష ఉద్యోగాలు కలి్పంచే 17 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. → అక్టోబర్‌లో ప్రకటించిన తొలి విడతలో రూ. 5,532 కోట్ల విలువ చేసే ఏడు ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Strengthening India FDI Attractiveness6
దేశీ ఫైనాన్స్‌కు విదేశీ జోష్‌ 

దేశీ ప్రయివేట్‌ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ వ్యవస్థలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే పలు బ్యాంకులలో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్‌ చేయగా మరికొన్ని ఎన్‌బీఎఫ్‌సీలలోనూ వాటాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ బాటలో మార్చికల్లా ఐడీబీఐ బ్యాంక్‌లోనూ మెజారిటీ వాటా కొనుగోలు చేసే వీలుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ప్రయివేట్‌ ఫైనాన్షియల్‌ రంగం 6 బిలియన్‌ డాలర్ల(రూ. 54,000 కోట్లు) విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.. కొద్ది నెలలుగా దేశీ ఫైనాన్షియల్‌ రంగం విదేశీ పెట్టుబడులతో కళకళలాడుతోంది. ప్రయివేట్‌ రంగ బ్యాంకులతోపాటు ఎన్‌బీఎఫ్‌సీలు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. సానుకూల నిబంధనలు, నియంత్రణా వ్యవస్థలకుతోడు.. మొండిబకాయిల తగ్గుదలతో బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లు పటిష్టంకావడం, దేశ ఆర్థిక పురోభివృద్ధికున్న అవకాశాలు, దీర్ఘకాలంలో మధ్యస్థాయి బ్యాంకులు ఆకర్షణీయ పనితీరు చూపగలవన్న ధీమా తదితర అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లోనూ ఈ ట్రెండ్‌ కొనసాగవచ్చునని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. వెరసి దేశీ ప్రయివేట్‌ ఫైనాన్షియల్‌ రంగ సంస్థలు మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి దేశీ సంస్థలతో కెనడియన్‌ దిగ్గజం ఫెయిర్‌ఫాక్స్‌ పోటీపడే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. నిధుల ఆవశ్యకత దేశీయంగా పలు ప్రయివేట్‌ రంగ ఫైనాన్షియల్‌ సంస్థలు డిజిటల్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ తదితర ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు విదేశీ పెట్టుబడులు సహకరించగలవని తెలియజేశారు. దీంతో వాటా విక్రయానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇటు దేశీ సంస్థలకు, అటు విదేశీ ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు బ్యాంకింగ్‌ రంగ విశ్లేషకులు తెలియజేశారు. వాటా కొనుగోలుకి క్యూ → ప్రపంచ ఆల్టర్నేట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ బ్లాక్‌స్టోన్‌ ఇటీవల ఫెడరల్‌ బ్యాంక్‌లో 9.99 శాతం వాటా కొనుగోలుకి ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ. 6,192 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. → ఇప్ప టికే యస్‌ బ్యాంక్‌లో 24% పైగా వాటా కొనుగోలు చేసేందుకు జపనీస్‌ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంబీసీ) ముందడుగు వేసింది. ఇందుకు 1.6 బిలియన్‌ డాలర్లు(రూ. 14,400 కోట్లు)పైగా వెచి్చస్తోంది. → ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో యూఏఈ దిగ్గజం ఎన్‌బీడీ బ్యాంక్‌ 60 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు 3 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ. 27,000 కోట్లు) వినియోగించనుంది. ఇది దేశీ ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ రంగంలోనే అత్యధిక పెట్టుబడుల్లో ఒకటి కావడం విశేషం! → ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ(ఏడీఐఏ)తో కలసి యూఎస్‌ పీఈ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌ 14.58 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 7,500 కోట్లు వెచ్చించింది. రికార్డ్‌ ఎఫ్‌డీఐ.. → శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో డీల్‌ తదుపరి విస్తరించనున్న ఈక్విటీలో 20% వాటాను జపనీస్‌ దిగ్గజం ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌ సొంతం చేసుకుంటోంది. ఇందుకు ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ మార్గాన్ని ఎంచుకుంది. తద్వారా 4.4 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 39,618 కోట్లు) వెచి్చంచనుంది. ఇది దేశీ ఫైనాన్షియల్‌ రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)కావడం విశేషం! → అవెండస్‌ క్యాపిటల్‌లో 60% వాటాను జపనీస్‌ దిగ్గజం మిజుహో ఫైనాన్షియల్‌ గ్రూప్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు యూఎస్‌ పీఈ దిగ్గజం కేకేఆర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. → సమ్మాన్‌ క్యాపిటల్‌లో అబుధాబి దిగ్గజం ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ(ఐహెచ్‌సీ) 42% వాటా చేజిక్కించుకోనుంది. ఇందుకు బిలియన్‌ డాలర్లు్ల (రూ. 9,000 కోట్లు) వినియోగించనుంది.– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement