Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Engineering Students Developed an AI Interface to Prevent Deepfake and Morphed Content Before it Uploads in Social Media1
డీప్‌ఫేక్‌కు చెక్‌ పెట్టే టెక్నాలజీ!

సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ వ్యాప్తి కూడా అంతే జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని ఉపయోగింగి యూజర్ల అనుమతి లేకుండానే.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, వారిని అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇది ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోంది.ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ భారిన పడిన ప్రముఖుల జాబితాలో రష్మికా మందన, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మొదలైనవారు ఉన్నారు. చాలామంది ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినప్పటికీ.. మార్ఫింగ్ ఫోటోలు, ఇతర తప్పుడు సమాచారాలను ప్రచారం వంటివి ఇప్పటికీ ఎదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ఓ ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులైన ''జీ. వెంకట కార్తికేయ ఆర్యన్ & బి. లోకేష్'' ఎనిమిది నెలలు శ్రమించి అపరిక్స్ (APARYX) పేరుతో కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు. నష్టం జరగక ముందే అరికట్టడం మంచిది.. అనే సిద్ధాంతం ఆధారంగా దీనిని డెవలప్ చేశారు.అపరిక్స్ అనేది.. ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా.. కంటెంట్ అప్లోడ్ అవ్వడానికి ముందే దానిని పరిశీలిస్తుంది. సెల్ఫ్ అడాప్టివ్ ఏఐ ఇంజిన్, అడ్వాన్స్డ్ డీప్‌ఫేక్ డిటెక్షన్ మోడల్స్ ఉపయోగించి.. ప్రతి ఫైల్‌నూ చెక్ చేస్తుంది. కంటెంట్‌ను మూడు విధాలుగా (లెవెల్స్‌) విభజిస్తుంది.➤0 నుంచి 0.35 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది➤0.35 నుంచి 0.75 వరకు: వార్నింగ్ ఇస్తుంది➤0.75 నుంచి 1 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతించదు / అప్లోడ్ బ్లాక్ చేస్తుందిడీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ క్రియేట్ న్యూడ్ కంటెంట్, లేదా అనుమతిని పొందని ఎక్స్‌ప్లిసిట్ మెటీరియల్ గుర్తించినప్పుడు అపరిక్స్ ఆటోమేటిక్‌గా అప్లోడ్ చేయడాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే కొంత తక్కువ మార్పులు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేయకపోతే.. అప్లోడ్ చేయడానికి అనుమతించదు.అపరిక్స్ పేరును సంస్కృత పదమైన అపరిజిత నుంచి తీసుకున్నారు. దీని అర్థం అదృశ్య రక్షకుడు (కనిపించకుండా రక్షించేవాడు). పేరుకు తగిన విధంగా.. ఈ సిస్టం (అపరిక్స్) డీప్‌ఫేక్ వంటి వాటి నుంచి కాపాడుతుంది. దీనిని రూపొందించిన విద్యార్థులు ప్రస్తుతం పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు.

Polish Central Bank Approves Plan to Buy 150 Tons of Gold Next Target Is2
ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..

ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అంచనా వేయలేరు. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోవచ్చు, కరెన్సీ విలువ అమాంతం తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ తరుణంలో పోలాండ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్ధిక రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు అయిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్.. మరో 150 టన్నుల విలువైన బంగారం కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం పోలాండ్ వద్ద ఉన్న బంగారం నిల్వల పరిమితిని 550 టన్నులకు చేరింది. 2026 డిసెంబర్ 31 నాటికి దీనిని 700 టన్నులకు పెంచాలని సెంట్రల్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ బోర్డును కోరుతున్నట్లు గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్‌కీ గత వారం ప్రకటించారు.పోలాండ్ వద్ద ఉన్న బంగారం.. ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉందని సమాచారం. గోల్డ్ అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక దేశాన్ని ఆర్థికంగా రక్షించే కవచం అని ఆడమ్ గ్లాపిన్స్‌కీ పేర్కొన్నారు. పసిడి విలువ ఎప్పటికీ దాదాపు పడిపోయే అవకాశం లేదు. ఆర్ధిక అస్థిరత్వం లేదా ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని. ఇతర దేశాల ద్రవ్య విధానంతో సంబంధం లేకుండా.. ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవచ్చు.విదేశీ మారక నిల్వల్లో పోలాండ్ వాటా 2024 నాటికి 16.86 శాతంగా ఉండేది. 2025 నాటికి ఇది 28.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి బంగారం పోగు చేసుకోవాలనే ఉద్దేశం ఒక్క పోలాండ్ దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.బంగారం ధరలు ఇలా..భారతదేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు (గురువారం) రూ.1,54,310 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,450 రూపాయల వద్ద ఉంది. గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా.ఇదీ చదవండి: బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్!

Post Office scheme How a Rs 200 deposit can grow into Rs 10 lakh 3
రోజుకో రూ.200.. అవుతాయి రూ.10 లక్షలు!

సంపద నిర్మించుకోవడానికి ఎప్పుడూ అధిక రిస్క్ పెట్టుబడులు లేదా స్టాక్ మార్కెట్‌పై లోతైన అవగాహనే అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే చిన్నపాటి రోజువారీ పొదుపు కూడా కాలక్రమేణా బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది. అలాంటి నమ్మదగిన పథకమే ‘పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్’ (RD). రోజుకు కేవలం రూ.200 పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చు.చిన్న పొదుపు.. పెద్ద ఫలితంఈ పథకంలోని అసలైన బలం స్థిరత్వం. రోజుకు రూ.200 అంటే నెలకు రూ.6,000 మాత్రమే. ఇది చాలా కుటుంబాలకు సులభంగా నిర్వహించగలిగే మొత్తమే. ఈ చిన్న మొత్తాలు మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి లేకుండా, క్రమంగా పెద్ద మొత్తంగా మారతాయి.పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. పోస్టాఫీస్ భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో, ఈ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపిక.ఖాతా ప్రారంభం సులభంకేవలం రూ.100తోనే పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు తమ సమీప పోస్టాఫీసులో ఈ ఖాతాను సులభంగా తెరవవచ్చు. నెలవారీ డిపాజిట్లు వెంటనే ప్రారంభించవచ్చు.రికరింగ్ డిపాజిట్‌కు ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ అనంతరం, ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పొడిగింపు వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పెరిగి, సంపద మరింత వేగంగా పెరుగుతుంది.అత్యవసర అవసరాలకు రుణ సదుపాయంఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ, ఆర్‌డీ వడ్డీ రేటు కంటే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.కొన్ని షరతుల మేరకు ప్రీ-మెచ్యూరిటీ విత్‌డ్రాయల్‌కు కూడా అవకాశం ఉంటుంది. అనివార్య కారణాలతో ఖాతాదారు మరణించినప్పుడు, డిపాజిట్‌ మొత్తాన్ని నామినీ సులభంగా పొందవచ్చు.రోజుకు రూ.200.. రూ.10 లక్షలు ఎలా అవుతాయంటే?➕రోజుకు రూ.200 ➕నెలకు రూ.6,000➕5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే➕మొత్తం డిపాజిట్: రూ.3.60 లక్షలు➕వడ్డీ: సుమారు రూ.68,197➕మెచ్యూరిటీ మొత్తం: రూ.4.28 లక్షలు➕అదే ఖాతాను మరో 5 ఏళ్లు పొడిగిస్తే➕మొత్తం డిపాజిట్: రూ.7.20 లక్షలు➕మొత్తం వడ్డీ: సుమారు రూ.2.05 లక్షలు➕తుది మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ.10.25 లక్షలుసున్నా మార్కెట్ రిస్క్, ప్రభుత్వ హామీ, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా చిన్నపాటి రోజువారీ పొదుపులు కూడా గొప్ప ఆర్థిక మైలురాయిగా మారతాయని పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం నిరూపిస్తోంది.

Kia Sonet 5 Lakh Sales Milestone In India4
మార్కెట్లో ఫుల్ డిమాండ్: ఈ కారు ధర ఎంతో తెలుసా?

కియా ఇండియా.. తన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'సోనెట్'ను లాంచ్ చేసినప్పటినుంచి 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 35 శాతం. మార్కెట్లో స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ.. వరుసగా రెండో సంవత్సరం లక్ష యూనిట్ల వార్షిక సేల్స్ సాధించింది.ప్రీమియం ఫీచర్లు & కనెక్టెడ్ మొబిలిటీ ఎంపికల కారణంగా ఈ కారు గొప్ప అమ్మకాలను పొందగలిగిందని కంపెనీ వెల్లడించింది. కియా సోనెట్ ప్రారంభ ధర రూ. 7.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.కియా సోనెట్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దాదాపు 70 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇందులో మధ్యప్రాచ్యం & ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా - పసిఫిక్ ప్రాంతాలు ఉన్నాయి. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష కంటే యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ & ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.

Rich Dad Poor Dad Robert Kiyosaki tweet Silver Iron5
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..

ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.“వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్‌కు సుమారు 5 డాలర్లు ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్‌కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.WHY SILVER is SUPERIORGold and silver have been money for thousands of years.But…in today’s Technology Age….silver is elevated into an economic structural metal…. much like iron was the structural metal of the Industrial Age.In 1990…silver was approximately $ 5.00 an…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 22, 2026

RBI Bulletin Signals Continued Strong Growth for Indian Economy6
ఇండియా ఇక ముందూ ఇదే స్పీడు..

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తోందని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఇక ముందూ భారత్‌ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 సంవత్సరం ఆరంభమైంది. వెనెజువెలాలో యూఎస్‌ జోక్యం చేసుకోవడం, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందంపై అస్పష్టత నెలకొనడం, గ్రీన్‌లాండ్‌పై వివాదం ఇవన్నీ భౌగోళిక ఆర్థిక సమస్యలను, విధానపరమైన అనిశ్చితిని పెంచేవే. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు బలంగా ఉండడం రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తున్నాయి. 2025–26 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సూచిస్తున్నాయి’’అని పేర్కొంది. అనిశ్చితుల మధ్య కూడా అంతర్జాతీయ వృద్ధి 2025లో స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. డిమాండ్‌ బలంగా.. డిసెంబర్‌ నెలకు సంబంధించి ముఖ్యమైన సూచికలు డిమాండ్‌ బలంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని, ఇది వృద్ధికి ప్రేరణనిస్తుందని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో కొంత పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ కనిష్ట లక్ష్యానికి దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వాణిజ్య రంగానికి బ్యాంక్‌లు, బ్యాంకింగేతర మార్గాల (కార్పొరేట్‌ బాండ్లు, ఎఫ్‌డీఐ తదితర) ద్వారా గడిచిన ఏడాది కాలంలో రుణ వితరణ పెరిగినట్టు తెలిపింది. ఏడాది క్రితం ఉన్న రూ.21.3 లక్షల కోట్ల నుంచి రూ.30.8 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది.ఎగుమతుల వైవిధ్యానికి, బలోపేతానికి గాను భారత్‌ గణనీయమైన కృషి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాలు, సమాఖ్యలతో (మొత్తం 50 దేశాలకు ప్రాతినిధ్యం వహించే) వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని గుర్తు చేసింది. న్యూజిలాండ్, ఒమన్‌తో చర్చలు ముగిసిపోగా, ఐరోపా సమాఖ్యతోనూ త్వరలో ముగింపునకు రానుండడం గమనార్హం. 2025లో జీఎస్‌టీ శ్లాబులను క్రమబద్దీకరించడం, ఆదాయపన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల్లో మార్పులు వంటివి వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని ఆర్‌బీఐ బులెటిన్‌ అభిప్రాయపడింది. రూపాయి క్షీణతకు ఎన్నో కారణాలు.. ఇక నుంచి ఆవిష్కరణలు – స్థిరత్వం, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యంపై విధాపరమైన దృష్టి ఉండాలని ఆర్‌బీఐ బులెటిన్‌ సూచించింది. నియంత్రణలు, పర్యవేక్షణ పట్ల వివేకవంతమైన విధానం ఉత్పాదకత పెంపునకు, దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి సాయపడుతుందని పేర్కొంది. తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం డిసెంబర్‌లో రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్టు వివరించింది.అలాగే, భారత్‌–యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమైనట్టు తెలిపింది. రూపాయిలో ఆటుపోట్లన్నవి.. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. 2025 ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని ఎఫ్‌డీఐ కంటే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. నవంబర్‌లో నికర ఎఫ్‌డీఐ వరుసగా మూడో నెలలోనూ ప్రతికూలంగా ఉందని, స్వదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు వెళ్లడమే కారణమని తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement