Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Bumper Guards Banned In India and What Penalties You Could Face1
కారుకు బంపర్ గార్డ్.. ఫైన్ కట్టాల్సిందే!

భారతదేశంలో చాలామంది వాహనదారులు కారు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ఉపకరణాలను జోడించుకుంటూ ఉంటారు. అదులో ఒకటి బంపర్ గార్డ్. దీనినే సాధారణంగా బుల్ బార్ లేదా క్రాష్ గార్డ్ అని పిలుస్తారు. ఈ మెటల్ బార్‌లు వాహనం యొక్క ముందు లేదా వెనుక బంపర్‌పై అమర్చబడి ఉంటాయి. ఇవి సాధారణంగా SUVలు లేదా పెద్ద కార్లలో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటివి ఇండియాలో చట్ట విరుద్ధం అని తెలుసా?, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2017లో అధికారికంగా బుల్ బార్‌లను నిషేధించింది. ఈ నియమం దాదాపు అన్ని వాహనాలను వర్తిస్తుంది.ఎయిర్‌బ్యాగ్‌లపై ప్రభావం!చూడటానికి బంపర్ గార్డ్‌లు వాహనానికి అదనపు రక్షణను అందిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ భద్రతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వాహనం లోపల ఉన్నవాళ్లకు కూడా ప్రమాదం కలిగిస్తాయి. కారులోని సెన్సార్లు ఢీకొనే శక్తిని గుర్తించి ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యేలా చేస్తాయి. కానీ కారు ముంచు భాగంలో ఉన్న బుల్ బార్‌లు ఈ సెన్సార్‌లపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పనిచేయకుండా చేస్తాయి.బుల్ బార్‌లు పాదచారులకు కూడా హాని కలిగిస్తాయి. ఇవి దృఢంగా ఉండటం వల్ల.. అనుకోని సమయంలో ప్రయాణికులను ఢీ కొంటే తీవ్రమైన గాయలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవి వాహనంలో ప్రయాణించేవారికి మాత్రమే కాకుండా ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.జరిమానా ఇలా..బుల్ బార్‌ను ఏర్పాటు చేయడం అనేది మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, ముఖ్యంగా సెక్షన్ 190, 191 కింద నేరం. కాబట్టి వాహనదారులకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. బంపర్ గార్డును ఏర్పాటు చేసుకుని డ్రైవర్ లేదా వాహన యజమాని పట్టుబడితే, జరిమానాలు రూ. 1000 - రూ. 5000 వరకు ఉంటాయి. పబ్లిక్ రోడ్లపై వాహనం బుల్ బార్‌ను ఉపయోగిస్తుంటే అక్కడికక్కడే తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంది.

Man Quits Rs 26 Lakh Job Know The Details Here2
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!

సాధారణంగా ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏడాదికి రూ. 26 లక్షలు వేతనం వచ్చే జాబ్ తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వెబ్‌సైట్ డిజైనర్ అయిన పుష్కర్ సోషల్ మీడియా పోస్ట్‌లో, ఉద్యోగంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని, జీతం కంటే వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం అని వెల్లడించారు.ఉద్యోగం వదులుకోవాలనుకున్నప్పుడు.. చాలాసార్లు ఆలోచించాను. ఒక వైపు నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? అనే సందేహం, మరోవైపు ఉద్యోగంలో నేను చిక్కుకోకూడదనుకుంటున్నాను అనే భావన. మొత్తానికి ఫ్రీలాన్సింగ్ కోసం ఉద్యోగం వదులుకున్నాను. ఇది కూడా అంత స్థిరంగా ఉండదు. ఇందులో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఉద్యోగంలో ఉంటే.. ప్రతిరోజూ పశ్చాత్తాపపడేవాడిని. కాబట్టి నేను నా మనసును నమ్ముకుని బయటకు వచ్చేశాను.ముఖ్యంగా పెద్ద నగరాల్లో, నెలకు చేతికి వచ్చే జీతం తన జీవితాన్ని మార్చేది కాకపోవచ్చు, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినందున ఏడాదికి రూ. 26 లక్షలు చాలాపెద్ద మొత్తం అని పుష్కర్ అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.మీ మీద నమ్మకం ఉంచండి, మీకు ప్రతిఫలం లభిస్తుందని కొందరు చెబుతుంటే.. వ్యక్తి విలువలకు అనుగుణంగా ఉన్నంత వరకు రెండు ఎంపికలు మంచివేనని ఇంకొందరు చెబుతున్నారు. ''మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సామ్రాజ్య నిర్మాణంలో రిస్క్ తీసుకోవడం ప్రధానం'' అని మరికొందరు చెబుతున్నారు.A few days ago, I walked away from a ₹26 LPA job right at the time of onboarding.Since then I’ve had very mixed feelings.One side of me says I made the right decision. I didn’t want to get trapped in a job.The other side keeps asking… what if this was a huge mistake?…— Pushkar @ Website Designer (@in_pushkar) March 5, 2026

Robert Kiyosaki Says War Is Profitable Reflects on the Vietnam War and Warns About the Military Industrial Complex3
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఈ సమయంలో ఎప్పడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు యుద్ధం వల్ల ఏమి జరుగుతుందో?, శాంతి స్థాపన ఎలా జరుగుతుందో? అనే విషయాలను వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను వియత్నాంలో రెండుసార్లు ఉన్నాను. ఒకసారి 1966-67లో విద్యార్థిగా, ఆ తరువాత 1971-72లో యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్‌గా. అయితే 2026లోనూ వియత్నాంతో ఎందుకు పోరాడామో నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సమాధానం దొరకలేదు. యుద్ధం వల్ల దాదాపు అందరికీ నష్టమే.ఇప్పుడు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌పైకి వెళ్తున్న ప్రతి రాకెట్ లోపల నాలుగు ఫౌండ్స్ వరకు వెండి ఉంటుంది. రాకెట్ పేలిపోయినప్పుడు సిల్వర్ విచ్చిన్నమవుతుంది. ఇది వెండి సేకరించేవారికి మాత్రమే లాభం. యుద్ధంలో పాల్గొనేవారికి మిగిలేది కన్నీళ్లు, ధన నష్టం మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనంయుద్ధ ఆయుధాలను బంగారంతో తయారుచేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు యుద్ధం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయుధాలు ఖరీదైనప్పుడు కొనుగోలు చేయడం తగ్గవచ్చు. కాబట్టి ఇలా శాంతి స్థాపనకు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ రోజు యుద్ధం కోసం కాదు, శాంతి & నిజమైన ఆర్థిక విద్య కోసం పోరాడుతున్నాను అని కియోసాకి వెల్లడించారు.TRAGICALLY: War is profitable.Still in Vietnam seeking personal answers to a war we should never have entered.FYI: I served in Vietnam twice, once in 1966-67 as a student and 71-72 as a US Marine Corps pilot. In 2026 I still do not know why we fought in Vietnam.I know…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 7, 2026

Affordable Homes Slip Out of Reach in Hyderabad4
ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్‌లో ఇల్లు కొనలేమా?

నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్‌లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్‌ హౌసింగ్‌ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. రీ–డెవలప్‌మెంట్‌ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు.

Google Sundar Pichai Total Pay Hiked5
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం

ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ గూగుల్.. సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ డాలర్లకు (రూ. 63,61,79,82,000) పెంచింది. దీంతో ఈయన ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు.సీఈఓ సుందర్ పిచాయ్ మొత్తం ప్యాకేజీలో ఎక్కువ భాగం (126 మిలియన్ డాలర్లు) పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ ద్వారా వస్తుంది. అదనంగా పిచాయ్ మూడేళ్లలో నెలవారీగా 84 మిలియన్ డాలర్ల రిస్ట్రిక్టెడ్ స్టాక్ పొందతారు. వీటితో పాటు ఆయన యాన్యువల్ సాలరీ 2 మిలియన్ డాలర్లను కూడా పొందుతారుగూగుల్.. వేమో & వింగ్ ఏవియేషన్ వంటి ఆటోనమస్ విభాగాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి కొత్త స్టాక్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది. దీనిద్వారా మొత్తం 350 మిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.2015 ఆగష్టులో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఆయన నాయకత్వంలో గూగుల్ మార్కెట్ కాపిటలైజేషన్ 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. కొన్నిసార్లు నాలుగు ట్రిలియన్ డాలర్లను సైతం అధిగమించింది. పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2004లో గూగుల్ కంపెనీలో చేరిన తరువాత క్రోమ్‌ను అభివృద్ధి చేయడం & ఆండ్రాయిడ్‌ను నడిపించడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగారు.

Why Buying a Home in a Gated Community Is the Smart Choice Real estate6
ఇల్లు కొంటే.. గేటెడ్‌ కమ్యూనిటీలోనే కొనాలి!

పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిన ఉద్యోగికి ప్రశాంతమైన వాతావరణం.. నడిచి వెళ్లి వచ్చేంత దూరంలోనే అందుబాటులో ఉండే నిత్యావసరాలు.. పిల్లలు హాయిగా ఆకుడునేలా భద్రత.. వృద్ధుల కాలక్షేపం కోసం లైబ్రరీ.. కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడిపేలా పచ్చటి పార్కులు.. ఎలాంటి పొల్యూషన్‌ లేని ప్రాంతం.. ప్రస్తుతం నగరవాసులు కోరుకుంటున్నవి ఇవే.. ముఖ్యంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లే విధంగా వాతావరణం ఉంటుంది. అలాంటి అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టే ‘గేటెడ్‌ కమ్యూనిటీ’లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక వసతులు మాత్రమేæకాదు.. మెరుగైన జీవనశైలి, ఆరోగ్యకర వాతావరణం, మనశ్శాంతిని అందించే కేంద్రాలే గేటెడ్‌ కమ్యూనిటీలు.. – సాక్షి, సిటీబ్యూరోభార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండటం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్ల నుంచి గేటెడ్‌ కమ్యూనిటీలకు షిఫ్ట్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటి ధర అధికంగా ఉన్నా ఏమాత్రం ఆలోచించడం లేదు. 24/7 భద్రత, నిఘా, ఆధునిక వసతులు, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఈ తరహా ప్రాజెక్ట్‌ల లో అపార్ట్‌మెంట్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.తొలి ప్రాధాన్యత భద్రతకే.. ఎవరైనా సరే ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాధాన్యత ఇచ్చేది భద్రతకే. కమ్యూనిటీ లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే కచి్చతమైన సమాచారం ఉంటుంది. గేటెడ్‌ కమ్యూనిటీ గేట్ల వద్ద 24/7 భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా పిల్లలు, పెద్దలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు. అలాగే గేటెడ్‌లో జిమ్, స్విమ్మింగ్‌ పూల్, మల్టీపర్పస్‌ హాల్, ఇండోర్‌ గేమ్స్, వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్, పార్క్, యాంఫీ థియేటర్, ల్యాండ్‌స్కేప్‌ గార్డెనింగ్, స్పోర్ట్స్‌ కోర్ట్‌ క్లబ్‌హౌస్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. రిటైల్‌ దుకాణం, ఫార్మసీ, వెల్‌నెస్‌ సెంటర్‌ కూడా ఉంటాయి.సామాజిక బంధాలు.. సాధారణంగా నగరాలలో పక్కింటి వాళ్లెవరో కూడా తెలియదు అనే భావన ఉంటుంది. కానీ, గేటెడ్‌ కమ్యూనిటీలలో అలా కాదు. నివాసితులందర్నీ ఒక చోట చేరుస్తుంది. వాకింగ్, వ్యాయామం వంటి వేళల్లో ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. పిల్లలు వారి వయస్సు స్నేహితులతో ఆడుకుంటారు. పండుగల సందర్భాలలో కమ్యూనిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. కమ్యూనిటీ లోపల ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. దీంతో నివాసితులు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం ఉండే వీలు కలుగుతుంది.మౌలిక సదుపాయాలు.. గేటెడ్‌ కమ్యూనిటీలలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు ఉండటం వీటి అదనపు ఆకర్షణ. వెడల్పాటి రోడ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు, వృద్ధులు, పిల్లలు సేదతీరేందుకు అక్కడక్కడ బెంచ్‌లు, కుర్చీలు ఉంటాయి. పరిశుభ్రమైన నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్‌ లైన్లు, మురుగు నీటి వ్యవస్థ ఉంటాయి. ప్రజారవాణా, మెరుగైన మౌలిక వసతులకు చేరువలో ఉంటాయి. నేటి అవసరాలకు తగినట్లు సౌర విద్యుత్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.అవసరాలు తీరేలా.. గేటెడ్‌ కమ్యూనిటీ లే–అవుట్లు కూడా ప్రతి ఇంటికీ మెరుగైన సూర్యరశి్మ, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేస్తారు. అందుకే గేటెడ్‌లో ఎక్కువ స్థలం గ్రీనరీకి కేటాయిస్తారు. కమ్యూనిటీలోని వసతుల నిర్వహణకు క్రమశిక్షణ కలిగిన సిబ్బంది ఉంటారు. నేటి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీల్లోనే కో–వర్కింగ్‌ స్పేస్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, సౌర విద్యుత్‌ వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి యువతరం అభిరుచులు, అవసరాలకు తగ్గట్లు గేటెడ్‌ కమ్యూనిటీలను పలువురు బిల్డర్లు ఐటీ పార్క్‌లు, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు సమీప దూరంలో గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సాధారణంగా గేటెడ్‌ కమ్యూనిటీలలో అపార్ట్‌మెంట్ల విస్తీర్ణం 1,300 చ.అ. నుంచి ప్రారంభమవుతాయి. ఆ పరిమాణంలో ఉంటే కనీస వసతులు, జీవనశైలి కల్పించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.నగరం నలువైపులా.. కూకట్‌పల్లి, మదీనాగూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం, కొంపల్లి, శామీర్‌పేటతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలలో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన స్థలం, వసతులు, నిర్వహణ చార్జీల నేపథ్యంలో గేటెడ్‌ కమ్యూనిటీలో అపార్ట్‌మెంట్ల ధర 20–25 శాతం ఎక్కువగా ఉంటుంది. స్టాండ్‌ ఎలోన్‌ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే గేటెడ్‌ కమ్యూనిటీలలో ప్రాపర్టీల విలువ 30–35 శాతం అధికంగా ఉంటుంది. డిమాండ్‌ కారణంగా వీటిల్లో అద్దెలు బాగానే గిట్టుబాటవుతాయి.

Advertisement
Advertisement
Advertisement