Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Global Craze for Indian Motorcycles From Africa to America1
ఆ దేశాల్లో ఇండియన్‌ బైక్‌లకు యమా క్రేజ్‌..!

సమాజంలో ఓ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇంపోర్టెడ్ బైకులు, కార్లు వాడడం తెలిసిందే..! అయితే.. ఆఫ్రికాలోని పేదదేశాలతోపాటు.. లాటిన్ అమెరికా వంటి దేశాల్లో సాధారణ ప్రజలు కూడా ఇంపోర్టెడ్ బైకులు వాడుతారంటే మీరు నమ్ముతారా? పేదరికం ఎక్కువగా ఉండే బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాల్లో ఇంపోర్టెడ్ బైకులకు క్రేజ్ చాలా ఎక్కువ. సెకండ్ హ్యాండ్ బైక్‌లైనా.. విదేశీవే వాడుతారు. అయితే.. ఆ దేశాలకు బైక్‌లను ఎగుమతి చేసేది మాత్రం మన దేశమే..! నైజీరియా, కొలంబియా, బ్రెజిల్‌లోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.43 లక్షల బైక్‌ల ఎగుమతిభారత్‌లో ఎకానమీ ద్విచక్రవాహనాలు ఏ బ్రాండ్‌లో ఎక్కువగా ఉంటాయంటే.. ఠక్కున వచ్చే సమాధానాలు బజాజ్, హీరో, టీవీఎస్ అనే..! ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాహనాలకే అత్యధిక క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల ద్విచక్ర వాహనాలను భారత్ ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ 10 బైకుల్లో.. ఏడు మన దేశానికి చెందినవే..! నిజానికి ఒకప్పుడు ఈ ఘనతను జపాన్, చైనా తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే.. గడిచిన 15 ఏళ్లుగా భారత్ ఆ రికార్డులను తారుమారు చేస్తూ వస్తోంది.వాస్తవానికి భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతికి పెద్ద చరిత్రే ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఉండేది. అంతకు ముందు జపాన్ బైకులకు క్రేజ్ ఉండేది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా ఆలోచించి, ఆఫ్రికన్ దేశాలకు బైకుల ఎగుమతిని ప్రారంభించింది. క్రమంగా ఈ ఎగుమతులను లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నా.. భారత్ దాన్ని కూడా క్రమంగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ బైకుల రేట్లు పెరిగాయి. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉంటున్నాయి. కానీ, భారత బైకులు మాత్రం అటు నాణ్యతాపరంగా.. ఇటు ధరలపరంగా ఆయా దేశాల పౌరుల మన్ననలు అందుకుంటున్నాయి. నిజానికి ఆయా దేశాల్లో జపాన్ బైకుల ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు.. చైనా బైకుల ధరలు 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల ఉన్నాయి. భారత్ మధ్యేమార్గంగా.. ఈ రెండిటికీ మధ్యలో 900 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ధరలను నిర్ణయించి, ఆయా మార్కెట్లలోకి ప్రవేశించింది. నాణ్యత విషయంలో జపాన్ బైకులకు సమానంగా ఉండడంతో.. వీటికి ఆదరణ పెరిగింది.ఆకట్టుకుంటున్న మోడల్స్ఇక బైకుల మోడల్స్ విషయంలోనూ భారత్ ద్విచక్ర వాహనాలు ఆయా దేశాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జపాన్ హోండా మాదిరి మోడళ్లను మన హీరో కంపెనీ తయారు చేస్తుండగా.. సుజికీ వంటి మోడళ్లను టీవీఎస్ రూపొందిస్తోంది. దీంతో.. జపాన్ బైకుల స్థానాన్ని భారత్ ఆక్రమించింది. చైనా బైకుల విషయానికి వస్తే.. చూడ్డానికి బాగానే ఉన్నా.. ఊరూపేరూ లేని కంపెనీలు కావడం.. విడిభాగాల సపోర్టు లేకపోవడంతో కొన్న ఏడాదికే అవి తుక్కుగా మారుతున్నాయనే విమర్శలు ఆయా దేశాల వినియోగదారుల నుంచి ఎదురవుతున్నాయి. దాంతో.. భారత్‌కు చెందిన హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీలు విదేశాలకు బైకుల ఎగుమతిలో ఆధిపత్యాన్ని సాధించాయి.భారత బైకుల పట్ల మోజు పెరగడానికి కారణాల్లో అత్యంత కీలకమైనది సపోర్టింగ్..! మన కంపెనీలు ఆయా దేశాలకు నిరంతరాయంగా.. డిమాండ్‌ని బట్టి ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ లైనర్లు, డిస్కులు, క్లట్చ్, గేర్ వైర్లు, కేబుళ్లను సరఫరా చేస్తాయి. అంతేకాదు.. అక్కడి డీలర్లకు నిరంతర సపోర్ట్‌ని అందజేస్తాయి. ఆయా దేశాల మెకానిక్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అందుకే అక్కడి డీలర్లు భారతీయ బైకులను ఆదరిస్తారు. ఒక్క పేద దేశాలే కాదు.. అమెరికాలో మన ఎన్‌ఫీల్డ్‌కు చాలా క్రేజ్ ఉంది. హార్లే-డేవిడ్సన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఎన్‌ఫీల్డ్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో ఎన్‌ఫీల్డ్‌కు 152 డీలర్‌షిప్‌లు ఉండడం ఇందుకు నిదర్శనం. క్లాసిక్-350, హిమాలయన్-45, ఇంటర్‌సెప్టార్-650, కాంటినెంటల్ జీటీ-650, సూపర్ మెటియోర్-650 వంటి మోడళ్లను అమెరికన్లు ఆదరిస్తున్నారు. ఐరోపాలో కూడా హార్లే-డేవిడ్సన్‌కు మన బుల్లెట్ గట్టి పోటీని ఇస్తోంది. చూశారా.. విదేశీ మార్కెట్లలో భారత బైకుల హవా??

New Passport Rules to Take Effect February 152
పాస్‌పోర్ట్‌ కొత్త రూల్స్‌.. ఇంక పది రోజుల్లో అమల్లోకి!

భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త పాస్‌పోర్ట్ నిబంధనలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళంగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం, అలాగే దేశవ్యాప్తంగా సేవలను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 15 తర్వాత ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి.దీంతో పాస్‌పోర్ట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడం మరింత సమర్థవంతంగా మారనుంది. చివరి నిమిషంలో దరఖాస్తు తిరస్కరణలు లేదా ఆలస్యాలు ఎదురుకాకుండా ఉండేందుకు, దరఖాస్తుదారులు ముందుగానే కొత్త నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సరళీకృత పత్రాలు, వేగవంతమైన ధ్రువీకరణకొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. పాస్‌పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితాను క్రమబద్ధీకరించారు. పేపర్‌వర్క్‌ను తగ్గించేందుకు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తక్కువ సర్టిఫికెట్లతోనే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో పాస్‌పోర్ట్ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.అయితే అసంపూర్ణం లేదా తప్పుగా అప్‌లోడ్ చేసిన పత్రాలతో చేసే దరఖాస్తులు మాత్రం పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో పత్రాలు అప్‌లోడ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం.పోలీస్ వెరిఫికేషన్‌లో కీలక మార్పులుపాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే పోలీస్ ధ్రువీకరణను కూడా సవరించారు. ఇకపై ఇది ప్రధానంగా డిజిటల్ మార్గాల్లోనే జరగనుంది. సమన్వయ వ్యవస్థల ద్వారా అనేక సందర్భాల్లో వారాల పాటు పట్టే ధ్రువీకరణను కొన్ని రోజుల్లోనే పూర్తిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్‌పోర్ట్ ముందుగా జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ చేసే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.మరింత సులభమైన ఆన్‌లైన్ సేవలుప్రభుత్వ పాస్‌పోర్ట్ పోర్టల్‌ను యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు లేకుండానే ఫారమ్‌లు పూరించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, అపాయింట్‌మెంట్ స్లాట్‌లను బుక్ చేయడం చేయవచ్చు. రియల్ టైమ్ నోటిఫికేషన్లతో దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది.మైనర్లకు సంబంధించి తల్లిదండ్రుల సమ్మతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలను సులభంగా అంగీకరించేలా నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. దీని వల్ల పిల్లల పాస్‌పోర్ట్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువగా సేవలుదేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పాస్‌పోర్ట్ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

SBI Focus on New Age Sectors Launches Chakra Centre of Excellence3
కొత్త రుణాలపై ఎస్‌బీఐ ఫోకస్‌

దేశ ఆర్థిక పరివర్తనలో కీలక పాత్ర పోషించే కొత్త తరం రంగాలకి రుణ లభ్యతను పెంచే దిశగా చక్ర–సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ని (సీవోఈ) ప్రారంభించినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ప్రధానంగా రెన్యువబుల్‌ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్‌ సెల్‌ కెమిస్ట్రీ–బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, సెమీకండక్టర్లులాంటి ఎనిమిది వర్ధమాన రంగాలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.2030 నాటికి ఈ ఎనిమిది రంగాలు దాదాపు రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంచనాలు ఉన్నట్లు తెలిపింది. రాబోయే దశాబ్దాల్లో కొత్త ఆవిష్కరణలు, అధునాతన తయారీ సామర్థ్యాల దన్నుతో భారత్‌ వృద్ధి చెందుతుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.శ్వేతపత్రాలు, సెక్టార్‌ రిపోర్టులు, పరిశ్రమ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల నిర్వహణ మొదలైన మార్గాల్లో క్లయింట్లు, ఇన్వెస్టర్లు, విధాననిర్ణేతలు నిర్ణయాలు తీసుకునేందుకు చక్ర సెంటర్‌ తోడ్పడుతుందని వివరించారు. డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు, బహుళపక్ష ఏజెన్సీలు, పరిశ్రమ సమాఖ్యలు, స్టార్టప్‌ల మధ్య సంప్రదింపులకు ఇది సహాయకరంగా ఉంటుందన్నారు.

Gold Rates changes by Evening 4th February in Telugu States4
మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట!

బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి కాస్త ఊరటనిచ్చాయి.హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.6050 పెరిగి రూ. 1,47,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.5050లకే పరిమితమై రూ.1,46,150లకు దిగివచ్చింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.6600 ఎగిసి రూ. 1,60,530 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.5510 లకు నెమ్మదించి రూ.1,59,440లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Jio BlackRock Can Turn Indias Savings Into Investments Mukesh Ambani 5
ఇంటి పొదుపును ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుస్తాం: అంబానీ

భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న దీర్ఘకాలిక పొదుపు సంస్కృతి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు ఉత్పాదక సంపద సృష్టిగా పూర్తిగా మారలేదన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. గృహ పొదుపులను పెట్టుబడుల వైపు మళ్లించడంలో జియో–బ్లాక్‌రాక్ కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్‌రాక్ ఫైర్‌సైడ్ చాట్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్‌తో సంభాషిస్తూ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు గత ఐదు నుంచి ఆరు దశాబ్దాలుగా క్రమంగా పొదుపు చేస్తున్నప్పటికీ, ఆ మూలధనం ఎక్కువగా దీర్ఘకాలిక రాబడులు అందించే విధంగా ఉపయోగించబడలేదని ఆయన తెలిపారు. రాబోయే 20-30 ఏళ్లలో భారతదేశం 25 నుండి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని, ఈ కాలం దేశంలోని యువ తరానికి అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. పొదుపుదారులను పెట్టుబడిదారులుగా మారుస్తూ, పనికిరాని పొదుపును ఆదాయం తీసుకొచ్చే ఆస్తులుగా మార్చే మార్గాలను అందించడంలో జియో–బ్లాక్‌రాక్‌కు పెద్ద అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. “భారతీయులను కేవలం పొదుపు చేయడానికే కాదు, ఆ పొదుపులను సంపాదనగా మార్చుకునే ఎంపికలు అందించడమే మా లక్ష్యం” అని అంబానీ చెప్పారు.రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్లాక్‌రాక్ మధ్య ఉన్న భాగస్వామ్య తత్వాన్ని కూడా అంబానీ ప్రస్తావించారు. మూలధన కేటాయింపునకు సంబంధించిన విస్తృత దృష్టికోణంపై లారీ ఫింక్‌తో జరిగిన చర్చను గుర్తు చేస్తూ, “బ్లాక్‌రాక్ లక్ష్యం కేవలం స్వల్పకాలిక లాభాలు లేదా పెట్టుబడిదారులకు రాబడులు ఇవ్వడం మాత్రమే కాదు. ఆ మూలధనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడితేనే ఆ లక్ష్యం పూర్తైనట్టుగా భావిస్తారు. అదే తత్వం రిలయన్స్‌లో కూడా ఉంది” అని అంబానీ అన్నారు.

Olectra Greentech Sets New Milestone with Blade Battery Electric Buses6
బ్లేడ్‌ బ్యాటరీతో కొత్త బస్సులు

అధునాతన బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల ఉత్పత్తిని వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రిక్‌ బస్సుల రంగంలో తొలిసారిగా తాము రూపొందించిన ఈ ప్యాక్‌కి సర్టిఫికేషన్‌ లభించడం కంపెనీ ప్రస్థానంలో కీలక మైలురాయని సంస్థ ఎండీ మహేష్‌ బాబు చెప్పారు.మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 663.60 కోట్లకు చేరుకుంది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఫలితాలను సాధించినట్లు మహేష్‌ బాబు తెలిపారు.ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్‌ వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,639 వాహనాలను డెలివరీ చేయగా, 9,439 వాహనాలకు ఆర్డర్‌ బుక్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement