Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Best 5G Phones Under Rs 15000 In January 20261
రూ. 15వేలు కంటే తక్కువ ధరలో.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2026 మొదలైపోయింది.. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈ సమయంలో కొందరు ఓ మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఈ కథనంలో రూ. 15వేలు కంటే తక్కువ ధరలు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.పోకో ఎం7 ప్రో 5జీరూ.13,499 ధర వద్ద లభించే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్.. డ్యూయల్ 50MP కెమెరా 20MP సెల్ఫీ కెమెరా పొందుతుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ పొందుతుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్‌నెస్ & డాల్బీ విజన్‌తో 6.67 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110 mAh బ్యాటరీ ఇందులో చూడవచ్చు.ఒప్పో కే13ఎక్స్ఒప్పో కే13ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా & 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంటుంది. దీని ధర 12,499 రూపాయలు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్‌తో 6000 mAh బ్యాటరీతో వస్తుంది.రెడ్‌మీ 15సీ12,999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఒకటి. మీడియాటెక్ హెలియో జీ81 అల్ట్రాతో లభించే ఈ ఫోన్.. 8MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది 6.9 ఇంచెస్ IPS LCD & 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 33 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది.వివో T4 లైట్ 5జీవివో T4 లైట్ 5జీ మొబైల్.. 5MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 14,999. ఇది 15 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీని పొందుతుంది.మోటరోలా జీ57 పవర్ 5జీమోటరోలా G57 పవర్ 5జీ మొబైల్.. 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో.. 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను ప్రదర్శిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది 50MP + 8MP రియర్ కెమెరాను కలిగి ఉంది. దీని రేటు రూ. 14,999.ఇదీ చదవండి: బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు!

Nokia Phones Ordered In 2010 Reach Libyan Store After 16 Years2
2010లో పెట్టిన ఆర్డర్.. 2026లో వచ్చిన డెలివరీ

ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. డెలివరీ కావడానికి ఓ నాలుగైదు రోజులు లేదా వారం రోజులు అనుకుందాం. ఆర్డర్ పెట్టిన 16 ఏళ్ల తరువాత డెలివరీ అయితే?, ఇది వినడానికి వింతగా అనిపించినా.. లిబియాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో నోకియా ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. దీంతో కొత్తగా ఏ మోడల్ వచ్చిన సేల్స్ అద్భుతంగా జరిగేవి. ఇలాంటి సమయంలో లిబియాకు చెందిన ఓ షోరూమ్ ఓనర్ 2010లో ఎక్కువ సంఖ్యలో నోకియా ఫోన్స్ ఆర్డర్ పెట్టారు. అయితే అవి మాత్రం 2026లో డెలివరీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఒక వ్యక్తి నోకియా ఫోన్లను ఒక్కొక్కటిగా చూపించడం, అక్కడున్నవారంతా నవ్వుకోవడం చూడవచ్చు. ఇక్కడ వివిధ నోకియా మోడల్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?నిజానికి 2010లో నోకియా ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. అయితే కాలక్రమంలో ప్రత్యర్ధ కంపెనీలకు సరైన పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్లను డిమాండ్ ఉంది. ఇప్పుడు నోకియా ఫోన్స్ వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. డెలివరీకి 16ఏళ్ల సమయం పట్టడానికి కారణం.. అప్పట్లో లిబియాలో సివిల్ వార్ మొదలైంది. దీంతో దేశం మొత్తం అతలాకుతలం అయింది. ఈ కారణంగా షిప్‌మెంట్ ఆగిపోయింది. డెలివరీ చేయాల్సిన మొబైల్స్ వేర్ హౌస్‌లోనే ఉండిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో డెలివరీలు జరిగాయని తెలుస్తోంది.Une commande de Nokia arrive avec 16 ans de retardUn revendeur libyen, installé à Tripoli, avait commandé ces téléphones en 2010, mais n'a reçu sa livraison qu'en 2026. pic.twitter.com/0SoXaMCK7w— Renard Jean-Michel (@Renardpaty) January 8, 2026

Amazon asks Prove your worth why this making the workforce nervous3
కంపెనీ ఎందుకిలా అడుగుతోంది? అమెజాన్‌ ఉద్యోగుల్లో ఆందోళన

అమెజాన్ తన ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఏడాది కాలంలో తాము సాధించిన ముఖ్యమైన విజయాలు మూడు నుంచి ఐదు పేర్కొనడంపాటు, కంపెనీలో మరింత వృద్ధి సాధించడానికి తాము తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించాల్సిందిగా సంస్థ ఉద్యోగులను కోరుతోంది. అసలే లేఆఫ్‌లు కొనసాగుతున్న తరుణంలో కంపెనీ ఎందుకిలా అడుగుతోందని ఉద్యోగుల్లో ఆందోళన పట్టుకుంది.బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, ఉద్యోగులు ఇప్పుడు తమ ప్రభావాన్ని స్పష్టంగా చూపించే ప్రాజెక్టులు, లక్ష్యాలు లేదా కార్యక్రమాల నిర్దిష్ట ఉదాహరణలను వార్షిక సమీక్షలో భాగంగా సమర్పించాలి. “ఫోర్టే” (Forte)అనే ఈ కొత్త కార్యక్రమం ద్వారా, అమెజాన్ ఉద్యోగులు తమ విలువను నిరూపించుకునేలా తొలిసారిగా వ్యక్తిగత సాఫల్యాల జాబితాలను తప్పనిసరి చేసింది. ఇంతకుముందు అమెజాన్ పనితీరు సమీక్షలు మరింత ఓపెన్-ఎండెడ్‌గా ఉండేవి. ఉద్యోగులను వారి “సూపర్ పవర్స్” ఏమిటో, లేదా వారు అత్యుత్తమంగా పనిచేసే సమయంలో ఎలా వ్యవహరిస్తారో ప్రతిబింబించమని మాత్రమే అడిగేవారు. అయితే కొత్త విధానం స్పష్టమైన మార్పును సూచిస్తోంది.ఈ కొత్త వ్యవస్థతో అమెజాన్ కొలవదగిన ఫలితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అదే సమయంలో, ఉద్యోగులు తీసుకున్న రిస్కులు లేదా పూర్తిగా విజయవంతం కాకపోయిన ఆవిష్కరణల గురించి కూడా ప్రస్తావించమని అడుగుతోంది. “విజయాలు అనేవి మీ పని ప్రభావాన్ని చూపించే నిర్దిష్ట ప్రాజెక్టులు, లక్ష్యాలు, కార్యక్రమాలు లేదా ప్రక్రియలలో చేసిన మెరుగుదలలు. ఆశించిన ఫలితాలు రాకపోయినా, మీరు రిస్క్ తీసుకున్న లేదా ఆవిష్కరణ చేసిన సందర్భాలను పరిగణనలోకి తీసుకోండి” అంటూ అమెజాన్ అంతర్గత మార్గదర్శకాల్లో సూచించింది.ఆందోళన ఎందుకంటే..అమెజాన్‌లో ఫోర్టే సమీక్ష ప్రక్రియ వేతన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు జాబితా చేసిన వారి విజయాలు, సహోద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, అమెజాన్ నాయకత్వ సూత్రాలకు వారు ఎంతవరకు కట్టుబడి ఉన్నారు, అలాగే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాల ఆధారంగా వారి మేనేజర్లు అంచనా వేస్తారు. ఈ అంశాలన్నింటి ఆధారంగా ఉద్యోగికి “మొత్తం విలువ” (Overall Value) రేటింగ్ కేటాయిస్తారు. ఇది వార్షిక వేతనాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

New Cars Hit Indian Roads Latest Launches to Heat Up the Auto Market4
కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్‌.. లేటెస్ట్‌ లాంచింగ్‌లు

నూతన సంవత్సరంలో పలు కొత్త కార్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌(ఎస్‌యూవీ) విభాగపు కార్ల హడావిడి అధికంగా ఉండనుంది. ఇప్పటికే కొన్ని కార్లను ప్రవేశపెట్టగా మరికొన్నింటిపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలైన మహీంద్రా అండ్‌ మహీంద్రా, కియా ఇండియా, రెనో, నిస్సాన్‌ మొదలైనవి తమ ఎస్‌యూవీ మోడళ్లకు అప్‌డేటెడ్, ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లతో పాటు గతంలో ప్రజాదరణ పొందిన కార్లను మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎకానమీ నుంచి లగ్జరీ సెగ్మెంట్‌ వరకూ అన్ని ధరల రేంజ్‌లో లభించనున్నాయి. మొత్తంగా ఈ ఏడాది భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌ అత్యంత రద్దీగా ఉంటుందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.ఎస్‌యూవీల దూకుడుఎస్‌యూవీ కార్లకు డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, మల్టీ–పర్పస్‌ వెహికల్స్‌ (ఎమ్‌పీవీలు)ను అధిగమించి ఆటో మార్కెట్‌పై ఎస్‌యూవీ విభాగం ఆధిపత్యం చూపుతోంది. విస్తృతమైన ఇంటీరియర్స్, మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్, రోజువారీ వినియోగానికి పనికివచ్చే సౌకర్యాల కారణంగా ‘ఎస్‌యూవీ’లు కస్టమర్లకు తొలి ఎంపికగా మారుతోంది. ఆటో కంపెనీలు ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఎంట్రీ లెవల్‌ నుంచి ప్రీమియం ధరల శ్రేణిలో కొత్త మోడళ్లు, ప్రధాన ఫేస్‌లిఫ్ట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.మారుతీ సుజుకి ఈ–విటారామారుతీ సుజుకి ఈ–విటారా కూడా జనవరిలోనే లాంచ్‌ అవుతోంది. మారుతీ ఫస్ట్‌ ఫుల్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌ఈవీ కారుగా రానుంది. 49కేడబ్ల్యూహెచ్, 61కేడబ్ల్యూహెచ్‌ రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. 543 కిలోమీటర్ల వరకు రేంజ్‌ కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. డ్యూయల్‌ స్క్రీన్‌ సెటప్, 360–డిగ్రీ కెమెరా లెవల్‌ 2 ఏడీఎస్‌ వంటి ఫీచర్లు ఈ–విటారాను మరింత మోడ్రన్‌ ఈవీగా ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని అంచనా.టాటా సఫారీ, హ్యారియర్‌టాటా మోటార్స్‌ ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ తన ప్రసిద్ధ సఫారీ, హారియర్‌ ఎస్‌యూవీలకు పెట్రోల్‌ ఇంజిన్‌ వెర్షన్లను పరిచయం చేసింది. 1.5 లీటర్‌ సామర్థ్యంతో కొత్త టర్బో–పెట్రోల్‌ ఇంజిన్‌ను టాటా మోటార్స్‌ ఈ రెండు ఎస్‌యూవీలకు అందిస్తోంది. కొత్త టర్బో–పెట్రోల్‌ ఇంజిన్‌ స్మార్ట్‌ ట్రిమ్‌ నుంచి ప్రారంభమై సఫారీ, హారియర్‌లలో వరుసగా అకంప్లి‹Ù్డ అల్ట్రా, ఫియర్‌లెస్‌ అల్ట్రా వేరియంట్‌ల వరకు అందుబాటులో ఉంది. హ్యారియర్‌ పెట్రోల్‌ ధర రూ. 12.80 లక్షల నుంచి సఫారీ రేటు రూ. 13.29 లక్షల నుంచి (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ప్రారంభమవుతుంది.న్యూ–జెన్‌ సెల్టోస్‌కియా ఇండియా సెల్టోస్‌ కొత్త వెర్షన్‌గా ‘న్యూ–జెన్‌ సెల్టోస్‌’ పేరుతో అధికారంగా లాంచ్‌ అయ్యింది. హెచ్‌టీఈ నుంచి జీఎస్‌ఎక్స్‌(ఏ), ఎక్స్‌–లైన్‌ వరకు వివిధ వేరియంట్లలో ఇది లభిస్తుంది. అప్‌గ్రేడ్‌ చేసిన ఫీచర్లతో, పూర్తిగా రీడిజైన్‌ చేసిన ఇంటీరియర్స్‌ ఇందులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ జనవరి మధ్యలో లాంచ్‌ కానుంది. ఈ అప్‌డేట్‌లో ఫ్రంట్‌ గ్రిల్, బంపర్లు ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లను మరింత షార్ప్‌గా చేస్తున్నారు. పనోరమిక్‌ సన్‌రూఫ్, 360–డిగ్రీ కెమెరా, లెవెల్‌ 2 అడాస్‌ వంటి ఫీచర్లు క్యాబిన్‌ని మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓమహీంద్రా తన ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ700’ని పూర్తిగా రీబ్రాండ్‌ చేసి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ‘ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ’గా లాంచ్‌ చేసింది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్లు, టూ–స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పానోరమిక్‌ సన్‌రూఫ్, అంబియంట్‌ లైటింగ్, బాస్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.రెనో డస్టర్‌సబ్‌–కాంపాక్ట్‌ ఎస్‌యూవీ అయిన రెనో డస్టర్, భారత మార్కెట్లోకి రీ–ఎంట్రీ ఇస్తోంది. ఇది ఈ నెలలో (జనవరి) కొత్త మోడల్‌తో లాంచ్‌ అవుతోంది. కొత్త జనరేషన్‌ డస్టర్‌ సీఎంఎఫ్‌–బీ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే డస్టర్‌ .. లుక్‌ మరింత ప్రొఫెషనల్‌గా ఉంటుంది. లోపలి భాగంలో 10.1–అంగుళాల టచ్‌్రస్కీన్, ప్రీమియం ఇంటీరియర్‌ ఫుల్‌ అడాస్‌ ప్యాకేజీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Gold and Silver rates last week January 4 to 11 in Telugu states5
వెండి స్పీడు.. పసిడి దూకుడు.. భారీ ధరలు

బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త రేటును నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పసిడి, వెండి ధరలు గడిచిన వారం రోజుల్లో ఎలా మారాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. జనవరి 4 నుంచి జనవరి 11 వరకు బంగారం తో పాటు వెండి ధరల్లో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.బంగారం ధరల పెరుగుదల ఇలా..24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 4న రూ.1,35,820 ఉండగా జనవరి 11 నాటికి రూ.1,40,460 లకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4640 పెరిగింది. ఇక జనవరి 4న రూ.1,24,500 ఉన్న 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 11 నాటికి రూ.1,28,750 లను తాకింది. ఏడు రోజుల్లో రూ.4250 ఎగిసింది.వెండి దూకుడుఇక వెండి ధరలు అయితే బంగారాన్ని మించి అమిత వేగంతో దూసుకెళ్లాయి. వారం రోజుల్లో వెండి ధర కేజీకి ఏకంగా రూ.18 వేలు పెరిగింది. జనవరి 4న రూ.2,57,000 ఉన్న కేజీ వెండి ధర జనవరి 11 నాటికి రూ.2,75,000 లకు చేరింది.ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బలపడటం, డాలర్ మారకం విలువల్లో మార్పులు, అలాగే వివాహాలు, శుభకార్యాల నేపథ్యంలో నగలపై డిమాండ్ పెరగడం కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. వెండిపై పరిశ్రమల నుంచి కూడా డిమాండ్ పెరగడం ధరలపై ప్రభావం చూపిందని అంటున్నారు.

Poco M8 5G Launched in India Price Features and Specifications6
కొత్త ఫోన్‌: పోకో ఎం8 5జీ వచ్చేసింది..!

స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ‘పోకో’ భారత మార్కెట్లో ‘పోకో ఎం8 5జీ’ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. మిడ్‌రేంజ్‌ ధర విభాగపు కస్టమర్లే లక్ష్యంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌ను అమర్చారు. 6.77 అంగుళాల 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉంది. ఇది 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్, 240హెచ్‌జెడ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్, 3,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వెట్‌ టచ్‌ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో తడిచేతులతో ఉపయోగించినా, తేలికపాటి వర్షంలోనూ పనిచేస్తుంది. వెనుక భాగంలో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ లైట్‌ ఫ్యూజన్‌ 400 సెన్సర్‌ అందించారు.ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,520ఎంహెచ్‌ఏ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. ఇది 45డబ్యూ ఫాస్ట్‌ వైర్డ్‌ ఛార్జింగ్, అలాగే 18డబ్ల్యూ రివర్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఉంటాయి. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.6జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ ధర రూ.21,999గా.. 8జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌ ధర రూ. 21,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement
Advertisement
Advertisement