Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

SEBI Launches Verified Label Google Play to Protect Investors from Fraudulent Apps1
నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లకు సెబీ చెక్‌

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ముందడుగు వేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ గూగుల్ ప్లే స్టోర్‌లోని స్టాక్ ట్రేడింగ్ యాప్‌ల కోసం ‘వెరిఫైడ్’ లేబుల్‌ను సెబీ అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రిటైల్ పెట్టుబడిదారులు నిజమైన, మోసపూరిత యాప్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.ముంచుకొస్తున్న ముప్పుఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను, లోగోలను పోలి ఉండేలా నకిలీ యాప్‌లను సృష్టించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ‘ఈ అక్రమ యాప్‌లు అచ్చం ఒరిజినల్ ప్లాట్‌ఫారమ్‌ల వలె కనిపిస్తూ తమ డబ్బు నియంత్రిత మార్కెట్‌కే వెళ్తోందని పెట్టుబడిదారులు నమ్మేలా చేస్తున్నాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు తీవ్ర ముప్పు’ అని సెబీ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సవాలును ఎదుర్కోవడానికి సెబీ గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్‌లకు మాత్రమే ‘వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌’ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం 600కి పైగా స్టాక్ ట్రేడింగ్ యాప్‌లను ఇప్పటికే వెరిఫై చేసినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల (Intermediaries) యాప్‌లకు కూడా ఈ ఫీచర్‌ను విస్తరించనున్నారు.‘ఫిన్‌ఫ్లుయెన్సర్ల’పై నిఘాఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సలహాలిచ్చే ఫిన్‌ఫ్లుయెన్సర్లను ఏరిపారేయడానికి కృత్రిమ మేధ సాధనాలను వాడాలని గూగుల్‌ను కోరినట్లు తెలిపారు. ‘డిజిటల్ ప్రపంచంలో సమాజానికి సమస్యగా మారుతున్న వ్యవస్థలను రూపుమాపడానికి చట్టాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది’ అని పాండే చెప్పారు.ఇదీ చదవండి: పెట్రోల్‌, డీజిల్‌ ఎ‍క్కడెంత వాడుతున్నారంటే..పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అసాధారణ లాభాలు వస్తాయని ఆశ చూపుతారు.సెబీ బ్రోకర్‌ను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపి డౌన్లోడ్ చేయిస్తారు.యాప్‌లో గ్రాఫ్‌లు, లాభాలు కనిపిస్తున్నా వాస్తవానికి ఆ డబ్బు నిందితుల ఖాతాలకు మళ్లుతుంది.పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే సమయానికి స్కామర్లు అదృశ్యమవుతారు.

Silver Prices Crash 44 Percent From Jan 2026 Know The Details Here2
గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!

2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.వెండి ధరలు తగ్గడానికి కారణం?సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.నిపుణుల అభిప్రాయంక్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.పెట్టుబడిదారులకు సూచనలుబంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Sukanya Samriddhi Yojana interest rate set to change, What Finance Ministry said?3
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారుతుందా?

ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు భరోసానిచ్చే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) గత దశాబ్ద కాలంలో భారతీయ కుటుంబాల నమ్మకమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. 2014లో ప్రారంభమైన ఈ పథకం, నేడు కోట్లాది మంది తల్లుల కలలకు అండగా నిలుస్తోంది. ఇటీవల ఈ పథకం వడ్డీ రేట్లపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.వడ్డీ రేటులో మార్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రంప్రస్తుతం అమలులో ఉన్న 8.2 శాతం వడ్డీ రేటును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 23న లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని పేర్కొన్నారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే సుకన్య సమృద్ధి యోజన అత్యంత ఆకర్షణీయమైన రిటర్న్స్‌ను అందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.దశాబ్ద కాలంలో 100 రెట్లు వృద్ధిగత పదేళ్లలో ఈ పథకం సాధించిన ప్రగతి అసాధారణం. గణాంకాలను పరిశీలిస్తే సామాన్యులకు ఈ పథకంపై ఉన్న నమ్మకం స్పష్టమవుతోంది. 2014-15లో కేవలం 4.2 లక్షలుగా ఉన్న ఖాతాలు, 2024-25 నాటికి 424.57 లక్షలకు చేరాయి. అంటే పదేళ్లలో 100 రెట్లు వృద్ధి నమోదైంది. ప్రారంభంలో రూ. 0.001 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు, ప్రస్తుతం రూ. 2.99 లక్షల కోట్లకు చేరడం విశేషం.వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి (Quarterly) సమీక్షిస్తుంది. ప్రధానంగా శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు, ప్రభుత్వ సెక్యూరిటీల (G-Secs)పై వచ్చే దిగుబడిని బట్టి ఈ రేట్లను ఖరారు చేస్తారు. 2014–16 ఆర్థిక సంవత్సరంలో 9% పైచిలుకు ఉన్న వడ్డీ రేటు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2020–23 సంవత్సరాల్లో 7.6 శాతానికి (అత్యల్పం) చేరింది. 2024 నుండి ఈ వడ్డ రేటు 8.2 శాతంగా కొనసాగుతోంది.

HDFC Bank Appoints Law Firm to Probe Allegations After Chairmans Resignation4
హెచ్‌డీఎఫ్‌సీపై ఆరోపణలు.. రంగంలోకి న్యాయ సంస్థ

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తూ అతాను చక్రవర్తి చేసిన ఆరోపణలపై స్వతంత్ర పరిశీలనకుగాను న్యాయ సంస్థలను బ్యాంక్‌ నియమించింది. వాస్తవాల ఆధారంగా ఆరోపణల నిగ్గు తేల్చేందుకు న్యాయ సంస్థలను నియమించినట్టు బ్యాంక్‌ అధికార ప్రతినిధి తెలిపారు. దశాబ్దాలుగా బ్యాంక్‌ పాటిస్తూ వచ్చిన అత్యున్నత పాలనా ప్రమాణాలకు అనుగుణంగా ఈ నియామకం చేసినట్టు చెప్పారు.నైతిక పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ అతాను చక్రవర్తి ఈ నెల 18న అర్ధంతరంగా హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ‘‘గత రెండేళ్లలో బ్యాంక్‌ పరిధిలో జరుగుతున్న పరిణామాలు, అనుసరిస్తున్న విధానాలను పరిశీలించగా, నా వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవు. నా రాజీనామాకు కారణాలు ఇవే’’అని చక్రవర్తి పేర్కొన్నారు.

Fuel Panic in Telugu States Oil Supply Fears Trigger Rush at Petrol Pumps5
పెట్రోల్‌, డీజిల్‌ ఎ‍క్కడెంత వాడుతున్నారంటే..

అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నిమిషాల్లోనే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), డీలర్ అసోసియేషన్లు మాత్రం ‘కంగారు వద్దు.. సరిపడా నిల్వలు ఉన్నాయి’ అని భరోసా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం బైకులు, కార్లకే కాకుండా.. అసలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ఏయే రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారో తెలుసుకుందాం.డీజిల్: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంభారతదేశంలో చమురు వినియోగంలో సింహభాగం డీజిల్‌దే. ఇది కేవలం లారీలు, బస్సులకే పరిమితం కాదు. దేశీయంగా రవాణా రంగంలో (సుమారు 70 శాతం) దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులను చేరవేసే భారీ ట్రక్కులు, గూడ్స్ వాహనాలు పూర్తిగా డీజిల్‌పైనే ఆధారపడి ఉన్నాయి. రైల్వే ఇంజిన్లలో కూడా గణనీయమైన భాగం ఇంకా డీజిల్‌తోనే నడుస్తున్నాయి.వ్యవసాయ రంగం (సుమారు 13%): రైతులకు డీజిలే ఆధారం. పొలం దున్నే ట్రాక్టర్లు, నీటిని తోడే పంపు సెట్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) పెట్రోల్ కంటే డీజిల్‌నే ఎక్కువగా వాడుతాయి. ముఖ్యంగా సాగు సీజన్‌లో ఈ వినియోగం రెట్టింపు అవుతుంది.పరిశ్రమలు, విద్యుత్ (సుమారు 10%): భారీ ఫ్యాక్టరీల్లోని జనరేటర్లు, విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ అయినప్పుడు వాడే బ్యాకప్ పవర్ ప్లాంట్లకు డీజిల్ కీలకం. ఐటీ కంపెనీలు, మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రుల్లోని పవర్ బ్యాకప్ వ్యవస్థలు దీనిపైనే నడుస్తాయి.పెట్రోల్: వ్యక్తిగత ప్రయాణాలకే పరిమితమా?ద్విచక్ర వాహనాలు (సుమారు 60%): భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో అత్యధిక వాటా టూ-వీలర్లదే. మధ్యతరగతి ప్రజల ప్రధాన రవాణా సాధనం కావడంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రైవేట్ కార్లు (సుమారు 35%): వ్యక్తిగత వినియోగం కోసం వాడే కార్లు పెట్రోల్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నాయి.ఇతర రంగాలు: చిన్నపాటి గార్డెనింగ్ పరికరాలు, కొన్ని రకాల పడవలు (ఫిషింగ్‌ బోట్లు), కొన్ని జనరేటర్లలో తక్కువ మొత్తంలో పెట్రోల్ వాడుతుంటారు.ప్రజలు ఏం చేయాలి?ప్రస్తుతానికి దేశంలో చమురు నిల్వలు పటిష్టంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. యుద్ధ భయంతో అవసరం లేకున్నా డబ్బాల్లో, బాటిళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంధనం పొదుపు చేయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే. అనవసర భయాందోళనలకు లోనై బంకుల వద్ద రద్దీ పెంచకుండా సంయమనం పాటించడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

Renault Discount March 2026 Up To Rs 80000 Off On Triber, Kiger, Kwid cars6
చిన్న కార్లపై భారీ డిస్కౌంట్లు.. మార్చి మారే లోపే ఛాన్స్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగింపు దశకు చేరుకోవడంతో, అమ్మకాల్లో జోరు పెంచేందుకు రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ మోడళ్లపై మార్చి 2026 నెలకు గానూ ఆకర్షణీయమైన కన్స్యూమర్ ఆఫర్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో ఈ ప్రయోజనాలను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 80,000 వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది.రెనాల్ట్ కీగర్ సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ విభాగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కీగర్ (Renault Kiger), ఈ నెలలో భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. స్టైలిష్ లుక్, టర్బో ఇంజన్ ఆప్షన్లతో లభించే ఈ కారుపై మార్చిలో రూ. 80,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 10.34 లక్షల మధ్య ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లు కోరుకునే వారికి ఈ తగ్గింపులు మంచి డీల్ అని చెప్పవచ్చు.రెనాల్ట్ ట్రైబర్ మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ ఎమ్‌పీవీ ట్రైబర్ (Renault Triber) కూడా ఈ నెలలో అత్యంత సరసమైన ధరకే లభించనుంది. ఫ్లెక్సిబుల్ సీటింగ్ అమరికతో వచ్చే ఈ కారుపై కూడా గరిష్టంగా రూ. 80,000 వరకు తగ్గింపు ప్రకటించారు. ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 8.60 లక్షల వరకు ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీ కోరుకునే కుటుంబాలకు ఇది ఉత్తమ ఎంపిక.రెనాల్ట్ క్విడ్ మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఆల్-టైమ్ ఫేవరెట్ అయిన క్విడ్ (Renault Kwid) హాచ్‌బ్యాక్‌పై రెనాల్ట్ రూ. 70,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే ఈ కారు 1.0-లీటర్ ఇంజన్, ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.30 లక్షల నుండి రూ. 5.99 లక్షల మధ్య ఉంది. సిటీ డ్రైవింగ్‌కు అనువైన ఈ కారుపై లభిస్తున్న రూ. 70 వేల తగ్గింపు దీని విలువను మరింత పెంచింది.

Advertisement
Advertisement
Advertisement