Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Inside Trisha Krishnan Chennai Home Tradition Modern Design Simplicity1
చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే..

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో రెండు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసి సౌత్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు నటి త్రిష కృష్ణన్. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ నిత్యం వెలుగు జిలుగుల మధ్య గడిపే సెలబ్రిటీల ఇళ్లు అంటే సాధారణంగా ఆడంబరాలకు నిలయంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, చెన్నైలోని త్రిష నివాసం ఇందుకు భిన్నం. ఆడంబరం కంటే అభిరుచికి, ప్రదర్శన కంటే ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ ఆమె తీర్చిదిద్దుకున్న ఈ ఇల్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.చెన్నైలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన తైనాంపేటలోని సెనోటాఫ్ రోడ్‌లో త్రిష నివాసం ఉంది. నగరంలోని వీవీఐపీలు, ఉన్నతాధికారులు నివసించే ఈ ప్రాంతం భద్రతకు, గోప్యతకు మారుపేరు. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా మలుచుకున్నారు. త్రిష నివాసంలో ప్రతి మూలా ఆమె అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఇంటి లోపల వాడిన రంగులు, అలంకరణ సామాగ్రి కళ్లకు ఇంపుగా ఉంటాయి. దక్షిణ భారత సంప్రదాయ కట్టడాల శైలిని విస్మరించకుండానే ఆధునిక ఆర్కిటెక్చర్‌ను ఇందులో జోడించారు. పెద్ద కిటికీలు సహజ సిద్ధమైన వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేస్తూ ఒక హైబ్రిడ్ లుక్ ఇస్తున్నాయి. భారీ అలంకరణల కంటే, కంఫర్ట్‌కే ప్రాధాన్యం ఇస్తూ గదులను డిజైన్ చేశారు.గతంలో ఈ ఇల్లు కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వల్ల పోలీసులు ఇక్కడ సోదాలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలాంటి ఆటంకాలు ఎదురైనా తన వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా త్రిష జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Domestic consumption is sustaining the growth momentum in the economy2
దేశీ వినియోగమే వృద్ధికి దన్ను 

పుణె: దేశీ వినియోగం వృద్ధి వేగాన్ని నిలబెడుతోందని, ఇక మీదటా జీడీపీ మెరుగ్గా వృద్ధి చెందేందుకు స్పష్టమైన విధానపర మద్దతు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రపంచంలోనే భారత్‌ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఎస్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. దేశీ తయారీ, వ్యవసాయ రంగం బలమైన పనితీరు, పర్యాటకం, ఐటీ, అనుబంధ సేవల రంగాల నుంచి స్థిరమైన, విధానపరమైన మద్దతు లేకపోతే భారత్‌ వృద్ధి ప్రయాణం క్లిష్టంగా మారుతుందన్నారు. ఎగుమతులు సైతం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియలో ఘర్షణలతో దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ప్రభుత్వం తనవంతు మెరుగ్గా ఏం చేయగలదో చూస్తుందని చెప్పారు. యూఎస్‌ టారిఫ్‌ల ప్రభావిత సంస్థలకు ప్యాకేజీని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. థర్డ్‌ పార్టీ (వేరే సంస్థకు చెందిన) ఉత్పత్తుల పంపిణీకి ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునేలా బ్యాంక్‌లను అనుమతించాలా? లేదా? అన్న దానిపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) పరిధిలోని కమిటీ అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన∙తరుణంలో కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలపై దృష్టి సారించాలని బ్యాంక్‌లకు సూచించారు. ఐడీబీఐలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐపై లోతైన అధ్యయనం.. ఆంథ్రోపిక్‌ సంస్థ తీసుకొచ్చిన ‘మైథోస్‌’ కృత్రిమ మేధ (ఏఐ) నమూనాపై ఆందోళనల నేపథ్యంలో.. గురువారం ఢిల్లీలో బ్యాంక్‌లతో సమావేశం నిర్వహించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ తెలిపారు. ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి నాయకత్వంలో (ఐబీఏ చైర్మన్‌ కూడా) పనిచేయాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను కోరినట్టు చెప్పారు.

Tanla Platforms declares second interim dividend of Rs 6 per share for FY263
తాన్లా లాభం రూ. 134 కోట్లు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ లాభం రూ. 134 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 117 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14.5 శాతం అధికం. అటు ఆదాయం రూ. 1,024 కోట్ల నుంచి సుమారు 15 శాతం వృద్ధితో రూ. 1,178 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 509 కోట్లగా, ఆదాయం రూ. 4,418 కోట్లుగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. దీనికి ఏప్రిల్‌ 30 రికార్డు తేదీగా ఉంటుంది. విశ్వసనీయమైన ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సవాళ్లను పరిష్కరిస్తూ, కస్టమర్ల వ్యాపార వృద్ధికి తోడ్పడుతున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ ఉదయ్‌ రెడ్డి తెలిపారు.

Reliance Q4 results decline in 13percent YoY to Rs 16971 crore in 20264
రిలయన్స్‌ లాభం డీలా

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 16,971 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్‌ యూనిట్లు పుంజుకున్నప్పటికీ ప్రపంచ ఇంధన సంక్షోభం కారణంగా చమురు, కెమికల్స్‌(ఓ2సీ) విభాగాలు నీరసించడం ప్రభావం చూపింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 19,407 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2.69 లక్షల కోట్ల నుంచి రూ. 3.03 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్‌ఐఎల్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 95,610 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 13 శాతం పుంజుకుని రూ. 2.07 లక్షల కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 11.75 లక్షల కోట్లకు చేరింది. వెరసి కంపెనీ చరిత్రలోనే అత్యధిక నికర లాభం, ఇబిటా, ఆదాయం అందుకుంది. క్యూ4లో విభాగాలవారీగా రిలయన్స్‌ రిటైల్‌ లాభం రూ. 3,563 కోట్లుకాగా.. క్యూ4లో 333 కొత్త స్టోర్లను తెరిచింది. అయితే ఓ2సీ బిజినెస్‌ ఇబిటా 4 శాతం క్షీణించి రూ. 14,520 కోట్లకు పరిమితమైంది. కాగా, వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది.జియో ప్లాట్‌ఫామ్స్‌ గుడ్‌ క్యూ4లో లాభం రూ. 7,935 కోట్లు ఆర్‌ఐఎల్‌ టెలికం, డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ క్యూ4లో పటిష్ట పనితీరు చూపింది. జనవరి–మార్చిలో నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 7,935 కోట్లను తాకింది. వినియోగదారుల సంఖ్య, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) తదితర అంశాలు ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 7,022 కోట్లు ఆర్జించింది. ఇబిటా 18 శాతం జంప్‌చేసి రూ. 20,060 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 38,259 కోట్లయ్యింది. ఏఆర్‌పీయూ 3.8 శాతం మెరుగై రూ. 214కు చేరింది. కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 52.44 కోట్లయ్యింది. కాగా, 2025–26 పూర్తి ఏడాదికి జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 30,053 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పెరిగి రూ. 1,46,885 కోట్లుగా నమోదైంది.లిస్టింగ్‌ బాటలో...జియో ప్లాట్‌ఫామ్స్‌ లిస్టింగ్‌వైపు స్థిరంగా ముందడుగు వేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాం. ఇది కంపెనీ ప్రయాణంలో మైలురాయిగా నిలవనుంది. సరికొత్త ఎత్తులకు చేరడంతోపాటు.. దేశీ డిజిటల్‌ భవిష్యత్‌కు మద్దతిస్తుంది. మరోపక్క రాజకీయ, భౌగోళిక సవాళ్లు, ఇంధన ధరల ఆటుపోట్లు, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల మధ్య ఆర్‌ఐఎల్‌ వృద్ధి పథంలో సాగుతోంది. ఇందుకు డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో, దేశీయంగా పటిష్ట బిజినెస్‌ తోడ్పాటునిస్తున్నాయి. – ముకేశ్‌ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ షేరు బీఎస్‌ఈలో 1.15 శాతం నష్టంతో రూ.1,328 వద్ద ముగిసింది.

Adani Overtakes Bill Gates as Net Worth Crosses 100 Billion Dollars5
బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టిన అదానీ

అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా స్టాక్ మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద మాత్రం గణనీయంగా పెరిగింది. గురువారం ఆయన నికర సంపద పెరగడంతో.. 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో తిరిగి ప్రవేశించడమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కూడా అధిగమించారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద ఒక్క రోజులోనే 7.16 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ పెరుగుదలతో, ఆయన మొత్తం సంపద 106 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకారు. అంటే 2026లో, గౌతమ్ అదానీ నికర సంపద 21.4 బిలియన్ డాలర్లు పెరిగింది.నికర సంపద పెరగడంతో అదానీ బిల్‌గేట్స్ (104 బిలియన్ డాలర్స్)ను అధిగమించారు. కాగా.. 90.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 20వ స్థానంలో ఉన్నారు.

Vodafone Idea CEO Says Ongoing Minor Tariff Corrections6
యూజర్లకు షాక్.. వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!

భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను సుమారు 4-5 శాతం పెంచినట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ.. యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది.వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. అన్ని ప్లాన్‌లకూ ఒకేసారి ధరలను పెంచే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. అయితే ఎంత పెంచనుంది?, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి అదనంగా ఎంత వెచ్చించాల్సి ఉంటుందనే విషయాలను సంస్థ వెల్లడించలేదు.ప్రస్తుతం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. భారీ పెంపు ఉండదు. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన వాటాదారుగా ప్రభుత్వం కంపెనీపై విశ్వాసం ఉంచిందని, కంపెనీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

Advertisement
Advertisement
Advertisement