Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Nokia Global Layoffs Signal Deepening Crisis 14000 Jobs Cut1
నోకియా 14,000 మందికి లేఆఫ్‌

ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని శాసించిన నోకియా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు, తగ్గుతున్న ఆదాయ వనరుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించగా ఆ ప్రభావం ఇప్పుడు భారత విభాగంపై కూడా పడనుంది.కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం, నోకియా తన భారత కార్యకలాపాల్లో కీలక మార్పులు చేపట్టింది. కంపెనీ తన భారత నాయకత్వ బాధ్యతలను కొత్త వ్యక్తులకు అప్పగించింది. సమర్ మిట్టల్ కంపెనీ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్‌గా నియమితులయ్యారు. ఈయనకు మునుపటి కంటే ఎక్కువ కార్యాచరణ నియంత్రణ ఇచ్చారు. విభా మెహ్రా, ఇండియా కంట్రీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిద్దరూ 2026 ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనుండగా ప్రస్తుతం ఇండియాలో కంపెనీ చీఫ్‌గా ఉన్న తరుణ్ ఛబ్రా పదవి నుంచి తప్పుకున్నారు.ఆదాయంలో భారీ క్షీణతభారత మార్కెట్‌లో నోకియా పనితీరు గణనీయంగా పడిపోయింది. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం.. 2025 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు 15 శాతం తగ్గి 393 మిలియన్ యూరోలకు (సుమారు రూ.4,290 కోట్లు) పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నికర అమ్మకాలు 463 మిలియన్ యూరోలుగా (సుమారు రూ.5,000 కోట్లు) నమోదయ్యాయి. అమ్మకాల్లో ఈ క్షీణత వల్ల లాభదాయకతను పెంచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపు ఒక్కటే మార్గమని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా 2023లో జరిగిన మొబైల్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ సేవల విలీనం వల్ల ఏర్పడిన ‘డూప్లికేషన్’ ఉద్యోగాలను తొలగించడంపై దృష్టి సారించింది.టెలికాం రంగంలో సంక్షోభం?నోకియా మాత్రమే కాదు దాని ప్రధాన ప్రత్యర్థి ఎరిక్సన్ కూడా గత ఏడాది దాదాపు 5,000 మందిని తొలగించింది. టెక్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపగా మెటా కూడా 15,000 మంది తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

Gold and Silver rates on 28th March 2026 in Telugu States2
పసిడి కెరటం.. పైకి లేచిన ధరలు

దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

TDR Hike A Strategic Game Changer for Hyderabad Real Estate3
సిటీ రియల్‌ ఎస్టేట్‌కు గేమ్‌ ఛేంజర్‌!

సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అస్థిరత, స్థిరమైన వడ్డీ రేట్ల కొనసాగింపు, ప్రతికూల విధానాలు.. తదితర కారణాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేసింది. దీంతో భూయజమానులు, డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రణాళికాబద్ధమైన, స్థిరమైన పట్టణాభివృద్ధికి వీలవుతుంది. మొత్తంగా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి టీడీఆర్‌ గేమ్‌ చేంజర్‌గా మారనుంది.టీడీఆర్‌ అంటే? రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతుల నిర్మాణ సమయంలో ప్రభుత్వానికి భూసేకరణ తప్పనిసరి. భూములు కోల్పోయే పట్టాదారులకు ప్రభుత్వం నగదు రూపంలో పరిహారం అందిస్తుంది. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా కొత్తగా టీడీఆర్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో నగదు బదులుగా మార్కెట్‌ రేటుకు సమానంగా టీడీఆర్‌ బాండ్లను అందజేస్తారు. వీటితో యజమానికి ఇతర ప్రాంతంలో స్థలం ఉంటే అక్కడ అనుమతించే అంతస్తుల కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు. ఒకవేళ స్థలం లేకపోతే టీడీఆర్‌ను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్‌టీఎల్‌), గరిష్ట వరద మట్టం(ఎంఎఫ్‌ఎల్‌), నీటి వనరులు, నాలాలకు బఫర్‌ జోన్ల పరిధిలోకి వచ్చే పట్టా భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసినప్పుడు టీడీఆర్‌లను జారీ చేస్తుంది. టీడీఆర్‌ హక్కులను స్థిరాస్తి వ్యాపారులు, వ్యక్తులు కొనుగోలు చేసి అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్‌లో ఆ విస్తీర్ణం మేరకు మినహాయింపులు పొందవచ్చు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌) దాకా విస్తరించిన జీహెచ్‌ఎంసీ వరకూ.., తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌(టీసీయూఆర్‌) పరిధి వరకూ ఇది వర్తిస్తుంది.చిన్న, మధ్య తరహా బిల్డర్లకు ప్రయోజనం తాజా టీడీఆర్‌ సవరణతో చిన్న, మధ్యతరహా బిల్డర్లకు ఈ నిర్ణయం గొప్ప ఊతం ఇస్తుంది. 40 అడుగుల రహదారిలో ఇది వరకు జీ+8 అంతస్తులతో పాటు టీడీఆర్‌తో అదనంగా రెండు అంతస్తులకు అనుమతి ఇచ్చేవారు. తాజాగా 11 అంతస్తుల వరకు వేసుకోవచ్చు. అదనపు అంతస్తుల వెసులుబాటుతో ధరలను నియంత్రించడానికి, స్థిరీకరించడానికి సహాయపడతాయి.కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్, ముషీరాబాద్, నారాయణగూడ, తార్నాక, సికింద్రాబాద్, కాచిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ప్రగతీనగర్, బాచుపల్లి వంటి ప్రాంతాలలో భవన నిర్మాణాలు చేపట్టే చిన్న, మధ్యతరహా డెవలపర్లకు ఇది వరంగా మారుతుంది. గతంలో సరైన డిమాండ్‌ లేక మార్కెట్‌ విలువలో టీడీఆర్‌ 25 శాతానికే అమ్ముడుపోయేవి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి 50–70 శాతానికి పెరుగుతుంది. టీడీఆర్‌ విలువ పెరగడంతో భూ యజమానులు తమ భూమిని రహదారుల విస్తరణకు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు. రహదారుల విస్తరణలో వేగం పెరుగుతుంది.ఆరు అంతస్తులు దాటితేనే హైరైజ్‌ భవన నిర్మాణ నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు, ప్లాటు విస్తీర్ణం ఆధారంగా అనుమతించిన ఎత్తు వరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్లాటు విస్తీర్ణం 1,000 చ.మీ. దాటితేనే గరిష్టంగా 18 మీటర్ల ఎత్తు వరకు (జీ+5 అంతస్తులు) భవన నిర్మాణానికి అనుమతి ఉండేది. టీడీఆర్‌ను కొనుగోలు చేసినా అదనపు అంతస్తులు కట్టుకునేందుకు వెసులుబాటు లేదు. తాజా సవరణల్లో టీడీఆర్‌ వినియోగిస్తూ నిర్మాణం 21 మీటర్ల ఎత్తు వరకు(జీ+6 అంతస్తులు) నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే ఇక నుంచి 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను మాత్రమే ఆకాశహర్మ్యాలుగా పరిగణిస్తారు. అలాగే ఈ నిర్మాణానికి ప్లాటు కనీస విస్తీర్ణాన్ని 750 చ.మీ.కు తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం.. టీడీఆర్‌ వినియోగిస్తూ 750–2,000 చ.మీ. వరకు ప్లాటు విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని 21 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించుకోవచ్చు. అయితే పార్కింగ్, ఇతర నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.40 అడుగుల రోడ్లలోనూ భారీ భవనాలు ప్లాటు విస్తీర్ణం 2 వేల చ.మీ.లకు మించి ఉంటే ఆ స్థలంలో టీడీఆర్‌ ద్వారా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. రోడ్డు కనీస వెడల్పు 40 అడుగులకు మించి ఉంటే.. ఆ ప్లాటులో జీ+5 అంతస్తులకు మించి అదనంగా మరో 3 అంతస్తులు నిర్మించుకోవచ్చు. రోడ్డు వెడల్పు 60 అడుగులు ఉంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులకు మించి ఉంటే అదనంగా 5 అంతస్తులు కట్టుకోవచ్చు. అయితే అగ్నిమాపక, ఎయిర్‌పోర్టు, ఇతర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.50:50 విధానంలో.. క్యూర్‌ పరిధిలో 10 అంతస్తులకు మించిన హైరైజ్‌లలో పదో అంతస్తు తర్వాత చేపట్టే అదనపు అంతస్తుల నిర్మిత స్థలంలో 10 శాతానికి టీడీఆర్‌ను వినియోగించాలని గతేడాది ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ప్రభుత్వం టీడీఆర్‌ వినియోగాన్ని తగ్గించింది. 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3 శాతం నిర్మిత స్థలానికి సమాంతరమైన, అలాగే 20 అంతస్తులకు మించితే ఆ మొత్తం నిర్మిత స్థలంలో 5 శాతం నిర్మిత స్థలానికి సమానమైన టీడీఆర్‌ను వినియోగించాలని తెలిపింది. భవన నిర్మాణ దరఖాస్తు సమయంలో 50 శాతం టీడీఆర్‌ వినియోగిస్తున్నట్లు పత్రాలు సమర్పించాలి. మిగతా 50 శాతం టీడీఆర్‌ పత్రాలను నివాస యోగ్యత పత్రం(ఎన్‌ఓసీ) జారీ సమయంలో అందజేయాల్సి ఉంటుంది. దీంతో డెవలపర్లకు ప్రారంభ మూలధన ఒత్తిడి తగ్గుతుంది.నియంత్రణ అవసరం ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు రూ.10 వేల కోట్లకు పైగా విలువైన టీడీఆర్‌ సర్టిఫికెట్లు ఉన్నాయని పరిశ్రమ నిపుణుల అంచనా. అయితే కొంతమంది మధ్యవర్తులు టీడీఆర్‌ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో నిజమైన నిర్మాణదారులు, డెవలపర్లు టీడీఆర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకురావడం లేదు.సరఫరా, డిమాండ్‌ను సమతుల్య పరచాలంటే టీడీఆర్‌లపై ప్రభుత్వ నియంత్రణ అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే టీడీఆర్‌లను కొనుగోలు చేయడానికి, వినియోగించుకోవడానికి అగ్ని మాపక శాఖ నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తప్పనిసరి అనేది ప్రధాన అడ్డంకిగా మారిందని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Maruti Suzuki Manesar Plant Launches India First All Women Assembly Line4
కార్ల తయారీలో మహారాణులు

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మానెసర్ ప్లాంట్‌లో కీలకమైన మైలురాయిని అధిగమించింది. తయారీ రంగం అంటే కేవలం పురుషులకే పరిమితం అనే పాత ఆలోచనలను చెరిపివేస్తూ తొలిసారిగా 200 మంది మహిళా ఉద్యోగులతో కూడిన ప్రత్యేక అసెంబ్లీ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది.మహిళల చేతుల్లోనే కార్ల తయారీసాధారణంగా భారీ యంత్రాలు, విడిభాగాలతో కూడిన కార్ల తయారీ కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, మారుతీ సుజుకి ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. కంపెనీ మానెసర్ ప్లాంట్‌లోని ప్రత్యేక అసెంబ్లీ లైన్‌లో కార్ల విడిభాగాలను అమర్చడం నుంచి తుది మెరుగులు దిద్దే వరకు ప్రతి పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒకే రకమైన కారు కాకుండా సంస్థకు చెందిన వివిధ పాపులర్ మోడళ్లను ఈ మహిళా బృందం తయారు చేస్తోంది. ఈ 200 మంది మహిళా టెక్నీషియన్లకు సాంకేతిక శిక్షణను అందించిన తర్వాతే అసెంబ్లీ లైన్‌లోకి తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.VIDEO | Manesar: Maruti Suzuki deploys first batch of 200 women employees on car manufacturing assembly line at Manesar plant.India’s largest carmaker has introduced a fully women-run assembly line for producing multiple models, marking a significant step towards inclusion in… pic.twitter.com/OGOzZRs4Wh— Press Trust of India (@PTI_News) March 27, 2026తయారీ రంగంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని కంపెనీ అధికారులు చెప్పారు. ‘తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పని సంస్కృతి మెరుగుపడటమే కాకుండా నైపుణ్య వనరులు మరింత విస్తృతమవుతాయి’ అని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

Global Internet at Risk Iran Threatens Undersea Data Cables West Asia Tensions5
సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

ప్రపంచ దేశాలను మరో భారీ సంక్షోభం ముంచెత్తబోతోందా? పశ్చిమ ఆసియాలో ముదిరిన యుద్ధ భయాలు ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘డిజిటల్ కేబుళ్ల’ను తెంచేలా కనిపిస్తున్నాయా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సముద్ర గర్భంలోని డేటా కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.ఏమిటీ వివాదం?ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా రవాణాలో దాదాపు 95% నుంచి 97% వరకు సముద్ర గర్భంలో అమర్చిన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం (రెడ్‌ సీ), హార్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను అనుసంధానిస్తున్నాయి. ఇరాన్ తాజా హెచ్చరికలతో ఈ కేబుళ్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు ఈ హెచ్చరికలు?2026 ఫిబ్రవరి చివర్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా నేతృత్వంలోని దళాలకు గల్ఫ్ దేశాలు ఆశ్రయం కల్పిస్తే ప్రతిచర్యగా ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ‘గ్రే జోన్ వార్‌ఫేర్’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎవరు ప్రభావితమవుతారు?ఒకవేళ ఇరాన్‌ అనుకున్న పనిచేస్తే ఈ ముప్పు కేవలం ఒక దేశానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. భారత్ నుంచి అమెరికా, యూరప్‌లకు వెళ్లే డేటా ట్రాఫిక్‌లో దాదాపు మూడో వంతు ఈ మార్గాల ద్వారానే వెళ్తుంది. ఇది ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూఏఈ, సౌదీ అరేబియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌లు, డేటా సెంటర్లు నేరుగా ప్రభావితమవుతాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు ఇప్పటికే తమ కేబుల్ ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ‘2ఆఫ్రికా పర్ల్స్’ వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే నిలిచిపోయాయి.ఎలాంటి ప్రభావం ఉంటుంది?ఒకవేళ ఈ కేబుళ్లు తెగిపోతే అది కేవలం ఇంటర్నెట్‌లో అవాంతరం కలగడమే కాకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు స్తంభిస్తాయి. క్లౌడ్ సర్వీసులు, వీడియో కాల్స్, అంతర్జాతీయ సమాచార మార్పిడి నిలిచిపోతుంది. యుద్ధ ప్రాతిపదికన వీటిని బాగు చేయడం చాలా కష్టంతో కూడుకుంది. సముద్ర గర్భంలో వీటిని సరిచేయడానికి ప్రత్యేక నౌకలు కావాలి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఆ నౌకలు అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.భారత ప్రభుత్వం అప్రమత్తంఈ పరిణామాల నేపథ్యంలో భారత టెలికాం శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్ వంటి సంస్థలతో అత్యవసర సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ‘సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు ఆధునిక ప్రపంచానికి ప్రాణధారలు. వీటిపై దాడి జరిగితే అది కేవలం ఒక భౌగోళిక దాడి కాదు, ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై జరిగే అతిపెద్ద దాడి అవుతుంది. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ ముప్పును నివారించడం ఒక్కటే ప్రస్తుతానికి మార్గం’ అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు

Jefferies Exits HDFC Bank Leadership Shake Up Cuts Key Portfolio Exposure6
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి జెఫ్రీస్‌ నిష్క్రమణ

ప్రైవేట్‌ రంగం బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ జెఫ్రీస్‌ నిష్క్రమించింది. బ్యాంకులో తమ పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్‌ అతాను చక్రవర్తి ఇటీవలే అకస్మాత్తుగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ మూడు కీలక పోర్ట్‌ఫోలియోల్లో బ్యాంక్‌ షేర్లను విక్రయించి, ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకున్నట్లు తాజా గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ నివేదికలో జెఫ్రీస్‌ వ్యూహకర్త క్రిస్‌ ఉడ్స్‌ తెలిపారు.జపాన్‌ మినహా ఏషియా లాంగ్‌–ఓన్లీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో, గ్లోబల్‌ లాంగ్‌–ఓన్లీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో, అమెరికా మినహా ఇంటర్నేషనల్‌ లాంగ్‌–ఓన్లీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో వీటిలో ఉన్నాయి. అయితే, ఈ నిర్ణయం వెనుక కారణాన్ని ఉడ్స్‌ తెలపలేదు. అన్ని పోర్ట్‌ఫోలియోల్లోనూ 4 శాతం వెయిటేజ్‌తో హెచ్‌ఎస్‌బీసీని చేర్చింది. జపాన్‌ మినహా ఏషియా పసిఫిక్‌ రిలేటివ్‌–రిటర్న్‌ పోర్ట్‌ఫోలియోలో భారత్, ఆ్రస్టేలియా వెయిటేజీని రెండు పర్సంటేజీ పాయింట్లు తగ్గించి తైవాన్‌ వెయిటేజీని నాలుగు పర్సంటేజీ పాయింట్ల మేర పెంచనున్నట్లు నివేదిక తెలిపింది. తన నైతిక ప్రమాణాలకు, వ్యక్తిగత విలువలకు భంగం కలిగేలా బ్యాంకులో గత రెండేళ్లుగా పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు

Advertisement
Advertisement
Advertisement