Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Company rewards employees with Rs 236 crore year end bonus1
రూ. 237 కోట్లు.. అంతా ఉద్యోగులకే..

చైనాలోని ప్రముఖ క్రేన్ తయారీ సంస్థ హెనాన్ కువాంగ్షాన్ క్రేన్ కో, లిమిటెడ్ (Henan Kuangshan Crane Co., Ltd) తమ ఉద్యోగుల పట్ల చూపిన అపూర్వ ఉదారత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 270 మిలియన్ యువాన్ల నికర లాభాల్లో 180 మిలియన్ యువాన్లు (సుమారు 26 మిలియన్ డాలర్లు లేదా రూ.237 కోట్లు) ఉద్యోగులకు వార్షిక బోనస్‌లుగా పంచి అందరి దృష్టిని ఆకర్షించింది.వార్షిక వేడుకలో నగదు వర్షంసౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 13న నిర్వహించిన కంపెనీ వార్షిక గాలా వేడుకలోనే 60 మిలియన్ యువాన్లు (సుమారు 8.7 మిలియన్ డాలర్లు) నగదును అక్కడికక్కడే పంపిణీ చేశారు. సుమారు 7,000 మంది ఉద్యోగులు హాజరైన ఈ కార్యక్రమానికి 800 విందు టేబుళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో పొడవైన టేబుళ్లపై నోట్ల కట్టలు పేర్చిన దృశ్యాలు కనిపించాయి. ఉద్యోగులను వేదికపైకి ఆహ్వానించి, వారు లెక్కించగలిగినంత మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించారు. కొందరు చేతుల్లో భారీ నోట్ల కట్టలతో కనిపించగా, మరికొందరు నగదు కుప్పలను ఎత్తుకునేందుకు కష్టపడిన దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి.లాభాల్లో 70 శాతం ఉద్యోగులకే..ఆన్‌లైన్ పంపిణీతో కలిపి మొత్తం బోనస్ చెల్లింపులు 180 మిలియన్ యువాన్లను మించాయి. 2025లో కంపెనీ సంపాదించిన 270 మిలియన్ యువాన్ల లాభంలో దాదాపు 70 శాతం మొత్తాన్ని సిబ్బందితో పంచుకోవడం విశేషం.‘డబ్బు ఇవ్వడానికి ఇష్టపడే బాస్’సంస్థ చైర్మన్ కుయి పీజున్ (Cui Peijun) ఈ కార్యక్రమంలో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రణాళికాబద్ధంగా ఇవ్వాల్సిన ఉపకరణ బహుమతులను రద్దు చేస్తూ, “వాషింగ్ మెషీన్లు ఎందుకు? గతంలో బంగారు ఆభరణాలు ఇచ్చాం. ఈసారి ప్రతి ఉద్యోగికి అదనంగా 20,000 యువాన్లు నగదు ఇవ్వండి,” అని ఆర్థిక విభాగాన్ని ఆదేశించారు.2002 సెప్టెంబర్‌లో స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం 130 దేశాల్లో క్రేన్లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాల తయారీ, సర్వీసులు అందిస్తోంది. ఉద్యోగులకు భారీ రివార్డులు ఇవ్వడంలో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ, 2024లో 260 మిలియన్ యువాన్ల లాభాల్లో 170 మిలియన్ యువాన్లను సిబ్బందికి పంచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా 2,000 మంది మహిళా ఉద్యోగులకు సుమారు 1.6 మిలియన్ యువాన్ల బోనస్ ప్రకటించారు.“నేను డబ్బు ఇవ్వడం ఇష్టపడతానని కాదు. యువత కారు రుణాలు, గృహ రుణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మేము చేయగల సహాయం చేస్తే వారికి ఉపశమనం లభిస్తుంది,” అని కుయి వ్యాఖ్యానించారు.

ADB Approves Rs 983 Crore Loan to Aavas Financiers2
50 శాతం గృహ రుణాలు మహిళలకే..

న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్లు, ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణ వితరణకు వీలుగా ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌తో ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ చేతులు కలిపింది. 108 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.983 కోట్లు) సీనియర్‌ సెక్యూర్డ్‌ డెట్‌ ఫైనాన్సింగ్‌ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.తక్కువ ఆదాయ వర్గాలు కొనుగోలు చేసే ఇళ్లు, రుణ సాయం అంతగా విస్తరించని రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈలు) సంస్థలకు రుణ వితరణ కోసం ఈ నిధులను ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ వినియోగించనుందని ఏడీబీ ప్రకటించింది. సొంతంగా నిర్మించుకునే ఇళ్లు, పర్యావరణ అనుకూల ఆమోదిత ఇళ్లు, ఇంధన ఆదా పరిష్కారాలతో నిర్మించిన ఇళ్ల కోసం రుణాలను అందించనుంది.మహిళలకు ప్రాధాన్యంగృహ రుణాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యంగా ఏడీబీ అందించే సాయంలో 70 శాతం మేర తక్కువ ఆదాయ వర్గాల ఇళ్ల కొనుగోళ్లకు రుణాలుగా అందించనున్నారు. 50 శాతం మేర రుణాలను మహిళలకే ఇవ్వనున్నారు. మిగిలిన 30 శాతం నిధులను ఎంఎస్‌ఎంఈలకు అందించనున్నారు. 8 మిలియన్‌ డాలర్లను రాయితీ రేటుపై అందించడం కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది.

Bill Gates admits affairs with Russian women apologises for Epstein ties3
తప్పు చేశా.. క్షమించండి 

న్యూయార్క్‌: సెక్స్‌ కుంభకోణం సూత్రధారి, అమెరికా ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలున్న మాట నిజమేనని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఎట్టకేలకు అంగీకరించారు. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే, చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌ నేరాల్లో తాను పాలుపంచుకోలేదని స్పష్టంచేశారు. అయినప్పటికీ తన వల్ల ‘గేట్స్‌ ఫౌండేషన్‌’కు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్‌స్టీన్‌ను కలవడం తప్పేనని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ఫౌండేషన్‌ సిబ్బందికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఫౌండేషన్‌ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఒక నివేదికను తాజాగా బహిర్గతం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలపై మంగళవారం జరిగిన టౌన్‌హాల్‌ సమావేశంలో బిల్‌ గేట్స్‌ వివరణ ఇచ్చారని పేర్కొంది. ‘‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫొటోల్లో మహిళలతో నేను ఉన్నట్లు చూపించారు. ఆ ఫొటోల్లో మహిళల ముఖాలను తారుమారు చేశారు. నిజానికి ఎప్‌స్టీన్‌ సహాయకులతో ఫొటో దిగాను. ఎప్‌స్టీన్‌ వినతి వల్లే దిగాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్న మహిళలతో ఏనాడూ నేను కాలం గడపలేదు. ఎప్‌స్టీన్‌ బారిన పడిన బాధిత మహిళలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్‌స్టీన్‌ను కలవడం ద్వారా పెద్ద తప్పు చేశా. అతడితో సమావేశాలకు గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులను కూడా తీసుకెళ్లడం ఇంకా పెద్ద తప్పు. మైనర్లతో వ్యభిచారం కేసులో ఎప్‌స్టీన్‌ 2008లో దోషిగా తేలాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో అతడిని కలిశా. అతడి నేపథ్యం గురించి సరిగ్గా తనిఖీ చేసుకోలేదు. ఎప్‌స్టీన్‌తో సంబంధాల గురించి 2013లో నా భార్య మెలిండా ఆందోళన వ్యక్తంచేసింది. అయినప్పటికీ 2014 దాకా అతడిని పలుమార్లు కలిశా. ఎప్‌స్టీన్‌తో కలిసి ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో ప్రయాణించా. జర్మనీ, ఫ్రాన్స్, న్యూయార్క్, వాషింగ్టన్‌లో అతడితో సమావేశమయ్యా. కానీ, ఎప్‌స్టీన్‌ ఐలాండ్‌లో ఏనాడూ ఒక్కరాత్రి కూడా గడపలేదు. నా వల్ల గేట్స్‌ ఫౌండేషన్‌కు మచ్చ రావడం బాధగా ఉంది. నా వ్యవహార శైలి, ప్రవర్తన ఫౌండేషన్‌ విలువలకు, లక్ష్యాలకు విరుద్ధంగానే ఉన్నాయి. చివరిసారిగా 2014లో ఎప్‌స్టీన్‌ను కలిశా. ఎప్‌స్టీన్‌ విషయంలో నా భార్య మెలిండాకు మొదటినుంచీ అనుమానాలున్నాయి. ఎప్‌స్టీన్‌తో సంబంధాల వల్ల నా పేరు ప్రతిష్టలు మంట గలుస్తున్నాయని చివరికి గ్రహించా. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించిన సంగతి నిజమే. వారిలో ఒకరు బ్రిడ్జ్‌ ప్లేయర్‌. బ్రిడ్స్‌ ఈవెంట్లలో ఆమె నన్ను కలిశారు. మరొకరు న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌. బిజినెస్‌ కార్యక్రమాల్లో భాగంగా మేము కలుసుకున్నాం’’అని బిల్‌ గేట్స్‌ వ్యాఖ్యానించిట్లు వార్తా సంస్థ స్పష్టంచేసింది. లక్షలాది పత్రాలు విడుదల ఎప్‌స్టీప్‌ ఫైళ్లను అమెరికా న్యాయ శాఖ గత నెలలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా మెలిగారని తెలియజేసింది. ఎప్‌స్టీన్‌తో బిల్‌ గేట్స్‌కు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈ దస్త్రాల్లో తేలడంతో సంచలనాత్మకంగా మారింది. ఇదీ చదవండి: భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’.. 126% టారిఫ్‌!

Anil Ambani Rs 3716 crore Mumbai home attached in money laundering case4
అనిల్‌ అంబానీ ఖరీదైన ఇల్లు జప్తు!

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ముంబై నివాసం ‘అబోడ్’ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ (Enforcement Directorate) బుధవారం (ఫిబ్రవరి 25) వెల్లడించింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే రూ.473.17 కోట్ల విలువైన ఆస్తులపై అమల్లో ఉన్న తాత్కాలిక అటాచ్‌మెంట్‌కు కొనసాగింపుగా తాజా ఉత్తర్వు జారీ అయ్యింది.సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భారత శిక్షాస్మృతి సెక్షన్లు 120-బి, 406, 420తో పాటు అవినీతి నిరోధక చట్టం, 1989 నిబంధనల కింద రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (Reliance Communications (ఆర్‌కామ్)), అనిల్ అంబానీ, ఇతరులపై కేసులు నమోదు అయ్యాయి.దర్యాప్తులో ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ రుణదాతల నుండి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు, అందులో సుమారు రూ.40,185 కోట్లు బకాయి ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. అలాగే ముంబై పాలి హిల్‌లోని ఆస్తితో పాటు ఇతర ఆస్తులను అనిల్ అంబానీ కుటుంబ సభ్యుల ప్రైవేట్ ట్రస్ట్ అయిన రైజ్‌ ఈ ట్రస్ట్‌లో సమీకరించినట్లు గుర్తించింది. కుటుంబ సంపదను రక్షించుకునేందుకు, బ్యాంకుల రికవరీ చర్యల నుంచి తప్పించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానం వ్యక్తం చేసింది.ముంబైలోని ప్రముఖ పాలి హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 216 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ భవనం నగరంలో అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజా ఉత్తర్వుతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.15,700 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది.

US imposes 126pc initial duty on Indian solar imports5
భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’.. 126% టారిఫ్‌!

భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’ ఇచ్చింది. ఇండియా నుంచి దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. భారత్‌తోపాటు ఇండోనేషియా, లావోస్‌ దేశాల సౌర ఉత్పత్తులపైనా టారిఫ్‌లను విధిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది విదేశీ తయారీదారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ, మార్కెట్ ధరల కంటే తక్కువకు సౌర పరికరాలను అమెరికాలో విక్రయిస్తున్నారన్న దర్యాప్తు నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.భారత్‌కు 126% సుంకాలుభారతీయ సౌర ఉత్పత్తులపై సుమారు 126 శాతం ప్రాథమిక సుంకం విధించనుంది అమెరికా. ఇక ఇండోనేషియా నుంచి వచ్చే దిగుమతులపై 86 శాతం నుంచి 143 శాతం వరకు, లావోస్ ఉత్పత్తులపై సుమారు 81 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ప్రభుత్వ మద్దతు వంటి ప్రయోజనాల వల్ల ఎగుమతిదారులు పొందుతున్న అన్యాయ లాభాలను సమతుల్యం చేయడమే ఈ చర్యల లక్ష్యమని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సుంకాలు ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా వీటిపై రానున్న నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.అమెరికా మార్కెట్లో కీలక భాగస్వామ్యంయూఎస్ గణాంకాల ప్రకారం.. 2025 ప్రథమార్ధంలో అమెరికాలోకి దిగుమతి అయిన మొత్తం సోలార్‌ మాడ్యూల్స్‌లో భారత్, ఇండోనేషియా, లావోస్.. మూడు దేశాల వాటా 57 శాతం. ఇందులో భారత ఎగుమతుల విలువ సుమారు 790 మిలియన్ డాలర్లుగా అంచనా. దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సౌర మార్కెట్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.(ఇదీ చదవండి: అఫైర్లు నిజమే.. అంగీకరించిన బిల్‌గేట్స్‌)భారత ఎగుమతిదారుల్లో ఆందోళనఅమెరికా ప్రధాన మార్కెట్‌గా మారిన నేపథ్యంలో భారత సౌర తయారీదారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య భారత సోలార్‌ మాడ్యూల్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం యునైటెడ్ స్టేట్స్‌కే వెళ్లినట్లు అంచనాలు చెబుతున్నాయి. తాజా సుంకాల వల్ల ధరల పోటీ సామర్థ్యం, ఎగుమతి పరిమాణాలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Submarine Cable Network Security Critical in the AI Era TRAI Chairman6
ఏఐ యుగం.. సముద్రంలో కేబుళ్లు కాపాడుకోవడమే కీలకం

న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్‌ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్‌ సీ) వేసే కేబుల్‌ నెట్‌వర్క్‌ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్‌ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్‌ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.సబ్‌మెరీన్‌ కేబుల్‌ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్‌ సీ కేబుల్, డిజిటల్‌ క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు డిజిటల్‌ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్‌ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లౌడ్‌ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. దేశీయంగా డిజిటల్‌ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్‌ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్‌ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థలకు డిమాండ్‌ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement