Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Holidays in March 2026 No Trading on these Days Investor Tips1
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్‌

భారత స్టాక్ మార్కెట్లకు (ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ) మార్చి నెలలో వారాంతాలతోపాటు మూడు ప్రధాన సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు హోలీ, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి పండుగలకు సంబంధించినవి. మార్చి 3 (మంగళవారం) హోలీ సెలవు, మార్చి 26 (గురువారం) శ్రీరామ నవమి సెలవు, మార్చి 31 (మంగళవారం) మహావీర్ జయంతి సెలవుగా ప్రకటించారు. ఈ రోజుల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ సెగ్మెంట్లలో ట్రేడింగ్ పూర్తిగా అందుబాటులో ఉండదు.ట్రేడింగ్‌ ఏయే రోజుల్లో..మార్చి నెలలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు, శని, ఆదివారాలు,పైన పేర్కొన్న సెలవులు మినహా అందుబాటులో ఉంటుంది. మార్చిలో మొత్తం 31 రోజులు ఉండగా, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు, మార్చి 7, 14, 21, 28 తారీఖుల్లో శనివారాలు వస్తాయి. వీటితోపాటు పండుగల సెలవులు పోగా మిగిలిన 19 రోజులు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమార్కెట్ రీసెర్చ్: ఏదైనా స్టాక్ లేదా సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు పూర్తి అధ్యయనం చేయండి. కంపెనీ ఫండమెంటల్స్, మార్కెట్ ట్రెండ్స్, ఆర్థిక సూచికలను పరిశీలించండి.రిస్క్ మేనేజ్‌మెంట్: మొత్తం మూలధనాన్ని ఒకే స్టాక్‌లో పెట్టకుండా, డైవర్సిఫికేషన్ చేయండి. స్టాప్-లాస్ ఆర్డర్లు ఉపయోగించి నష్టాలను నియంత్రించండి.ఎమోషనల్ డెసిషన్స్ వద్దు: మార్కెట్ హెచ్చుతగ్గులకు భావోద్వేగాలతో స్పందించకుండా, లాంగ్-టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO) లాంటి భావనలను నివారించండి.ట్యాక్స్, రెగ్యులేటరీ అవగాహన: షార్ట్-టర్మ్, లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి. సెబీ రెగ్యులేషన్లకు అనుగుణంగా ట్రేడ్ చేయండి.సెలవుల సమయంలో ప్లానింగ్: సెలవుల ముందు లేదా తర్వాత మార్కెట్ వాల్యూమ్ తక్కువగా ఉండవచ్చు, దీంతో వోలటాలిటీ పెరగవచ్చు. అందువల్ల ముందుగానే పొజిషన్లను అడ్జస్ట్ చేయండి.ఈ సెలవులు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వెబ్‌సైట్లను చెక్ చేయాలి.

AIPlus Expands into AIoT Segment Launches NovaPods and Nova Watch2
ఏఐప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ నుంచి నోవాపాడ్స్‌

న్యూఢిల్లీ: ఏఐప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ తాజాగా ఏఐఓటీ విభాగంలోకి కార్యకలాపాలు విస్తరించింది. నోవాపాడ్స్, నోవావాచ్‌ని ప్రవేశపెట్టింది. ఇవి ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. నోవాపాడ్స్‌ ధర రూ. 699 నుంచి, నోవా వాచ్‌ ధర రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుంది.అలాగే కొత్త తరం స్మార్ట్‌ఫోన్లయిన పల్స్‌ 2, నోవా 2 సిరీస్‌ని కూడా కంపెనీ ప్రకటించింది. మార్చ్‌ 2న పల్స్‌ 2ని, ఆ తర్వాత నోవా 2 సిరీస్‌ని ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. పల్స్‌ 2లో 50 ఎంపీ ఏఐ డ్యుయల్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 16 తదితర ఫీచర్లు ఉంటాయని పేర్కొంది.

Fiscal Deficit Reaches Rs 9 8 Lakh Crore by January End3
ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జనవరి చివరికి (10 నెలల్లో) రూ.9.8 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సం బడ్జెట్‌ అంచనాలో ఇది 63 శాతానికి సమానం. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి చివరికి ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 74.5 శాతంగా ఉండడం గమనార్హం. 2025–26 సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది బడ్జెట్‌ అంచనా. ఈ వివరాలను కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ప్రకటించింది. జనవరి చివరికి ప్రభుత్వానికి రూ.27.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.20.94 లక్షల కోట్లు పన్ను ఆదాయం కాగా, పన్నేతర రూపంలో రూ.5.57 లక్షల కోట్లు, రుణేతర మార్గాల్లో రూ.57,129 కోట్ల ఆదాయం సమకూరింది.

Affordable Home Interior Tips Middle Class Families house construction tips4
బడ్జెట్‌లో మెరిసే ఇంటీరియర్..

మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక భావోద్వేగం. అయితే, మారుతున్న కాలంతో పాటు నిర్మాణ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఇల్లు కట్టడమే కాకుండా, నివసించడానికి యోగ్యంగా మార్చే ఇంటీరియర్ డెకరేషన్ కోసం అదనంగా లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన ప్రణాళిక, మెటీరియల్ ఎంపికలో మెలకువలు పాటిస్తే.. తక్కువ బడ్జెట్‌లోనే మీ ఇంటిని ఒక ప్యాలెస్‌లా మార్చుకోవచ్చని ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటీరియర్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..హాల్ (లివింగ్ రూమ్)ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేది హాల్. ఇక్కడ ఖర్చు తగ్గించి లుక్ పెంచడానికి మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్ ఉత్తమ మార్గం. గోడలకు ఖరీదైన టెక్స్చర్ పెయింట్‌లకు బదులుగా ఒక గోడకు మాత్రమే యాక్సెంట్ కలర్ లేదా తక్కువ ధరలో దొరికే పీవీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ వాడవచ్చు. లైటింగ్‌కు సంబంధించి ఫాల్స్ సీలింగ్ కోసం భారీగా ఖర్చు చేసే బదులు కోవ్ లైటింగ్ లేదా స్టైలిష్ ఎల్‌ఈడీ స్ట్రిప్స్‌తో మంచి లుక్ తీసుకురావచ్చు.వంటగదివంటగదిలో మాడ్యులర్ కిచెన్ పేరుతో భారీగా ఖర్చు అవుతుంది. ఖరీదైన ప్లైవుడ్‌కు బదులుగా డబ్ల్యూపీసీ (Wood Polymer Composite) బోర్డులను వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా చెదలు పట్టకుండా ఉంటుంది. స్టోరేజ్ కోసం పైన ఉండే క్యాబినెట్లకు తలుపులు పెట్టకుండా ఓపెన్ షెల్వింగ్ పద్ధతిని పాటిస్తే మెటీరియల్ ఖర్చు తగ్గుతుంది. ఇది వంటగది విశాలంగా కనిపించేలా చేస్తుంది.బెడ్‌రూమ్అల్యూమినియం సెక్షన్లతో కూడిన వార్డ్‌రోబ్స్ లేదా స్లైడింగ్ డోర్ కబోర్డులు స్థలాన్ని ఆదా చేస్తాయి. లామినేట్ షీట్ల ఎంపికలో లేటెస్ట్ మ్యాట్ ఫినిష్ ఎంచుకుంటే తక్కువ ధరలో లగ్జరీ లుక్ వస్తుంది. స్టోరేజ్ సౌకర్యం ఉన్న బెడ్స్ ఎంచుకోవడం వల్ల అదనపు అల్మారాల అవసరం ఉండదు.వాష్‌రూమ్, క్యారిడార్బాత్రూమ్ గోడల మొత్తానికి టైల్స్ వేయకుండా కేవలం 7 అడుగుల ఎత్తు వరకు వేసి పైన పెయింట్ వేయడం ద్వారా 20 శాతం వరకు ఖర్చు తగ్గించవచ్చు. బ్రాండెడ్ ఫిట్టింగ్స్‌లో ఎంట్రీ లెవల్ సిరీస్‌లను ఎంచుకోండి. ఇవి క్వాలిటీతో పాటు వారంటీని ఇస్తాయి. క్యారిడార్‌లో రేయిలింగ్‌ కోసం అద్దాలను అమర్చడం వల్ల ఇరుకైన క్యారిడార్లు కూడా విశాలంగా కనిపిస్తాయి.బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే..ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందే ఇంటీరియర్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. వైరింగ్, ప్లంబింగ్ పాయింట్లు ముందుగానే నిర్ణయించుకుంటే తర్వాత చేసే మార్పుల వల్ల అయ్యే వృధా ఖర్చును నివారించవచ్చు.ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..

India FDI rises 18percent, US investments nearly double5
తొలి 9 నెలల్లో ఎఫ్‌డీఐలు జూమ్‌

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 9 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 18 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్‌–డిసెంబర్‌లో 47.87 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వీటిలో యూఎస్‌ నుంచి పెట్టుబడులు రెట్టింపై 7.8 బిలియన్‌ డాలర్లను తాకాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఇదే కాలంలో ఇవి 40.67 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో ఎఫ్‌డీఐలు 17 శాతం పుంజుకుని12.69 బిలియన్‌ డాలర్లకు చేరాయి. కాగా.. తొలి 9 నెలల్లో ఈక్విటీ పెట్టుబడులు, ఇతర మూలధనం, రిటర్నులను తిరిగి ఇన్వెస్ట్‌చేయడం తదితరాలు 17 శాతంపైగా బలపడి 73.31 బిలియన్‌ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 62.48 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో యూఎస్‌ నుంచి పెట్టుబడులు రెట్టింపై 7.8 బిలియన్‌ డాలర్లను తాకాయి. గతేడాది 9 నెలల్లో ఇవి 3.73 బిలియన్‌ డాలర్లు మాత్రమే. సింగపూర్‌ 17.65 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి ర్యాంకులలో యూఎస్‌(4.83 బి.డా), మారిషస్‌(4.83 బి.డా), జపాన్‌(3.2 బి.డా), యూఏఈ(2.45 బి.డా), నెదర్లాండ్స్‌(2.29 బి.డా), కేమన్‌ ఐలాండ్స్‌(1.97 బి.డా), సైప్రస్‌(1.4 బి.డా) నిలిచాయి.

Indian aviation industry to reduce to Rs 110-120 billion in 2026-276
తగ్గనున్న ఎయిర్‌లైన్స్‌ నష్టాలు

ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీ విమానయాన సంస్థల నష్టాలు గణనీయంగా తగ్గొచ్చని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 17,000–18,000 కోట్ల స్థాయిలో నష్టాలు ఉండొచ్చని, ఇవి 2026–27లో రూ. 11,000–12,000 కోట్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది. సమీప భవిష్యత్తులో సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటం, విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంలాంటి సానుకూల అంశాల కారణంగా ఏవియేషన్‌ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్‌ కొనసాగిస్తున్నట్లు ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. 2026–27లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 6–8 శాతం పెరిగి 17.5–17.9 కోట్లకు చేరొచ్చని తెలిపింది. ఇటీవలే ఈ ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల రద్దీ అంచనాలను 4–6 శాతం స్థాయి నుంచి 0–3 శాతానికి ఇక్రా సవరించింది. ‘‘భారత ఏవియేషన్‌ పరిశ్రమ 2024–25లో రూ. 5,500 కోట్లు, 2025–26లో అంతకన్నా అధికంగా రూ. 17,000–18,000 కోట్లకు నష్టాలు పెరగనున్నాయి. అయితే, పెరిగే విమాన ప్రయాణికుల సంఖ్య దన్నుతో 2026–27లో ఇవి రూ. 11,000–12,000 కోట్లకు తగ్గొచ్చు. అలాగే 2025–2026లో ఫ్లయిట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి రాగలవు’’ అని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కింజల్‌ షా తెలిపారు. నివేదిక ప్రకారం.. → సీమాంతర ఉద్రిక్తతలు, విమాన దుర్ఘటన, డిసెంబర్‌లో ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయాలు తదితర అంశాల కారణంగా వార్షిక ప్రాతిపదికన 2025–26 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో పరిశ్రమ రాబడులు క్షీణించాయి. కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావం, ఫ్లయిట్ల రద్దు.. జాప్యాలవల్ల నిర్వహణ వ్యయాలు పెరగడంలాంటి సవాళ్ల మధ్య కూడా కంపెనీలు రాబడి స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయడంతో ఆదాయం తీవ్ర స్థాయిలో క్షీణించలేదు. → తాత్కాలిక అంతరాయాలు నెమ్మదించే కొద్దీ సమీప భవిష్యత్తులో రాబడులు మెరుగుపడొచ్చు. అయితే, విమాన ఇంధనం ధరలు, డాలరు–రూపాయి మారకం రేటును నిశితంగా గమనించాల్సి ఉంటుంది. → 2025 క్యాలెండర్‌ సంవత్సరంలో కొత్తగా విమానాల సంఖ్య 4 శాతం పెరగడంతో 2025 డిసెంబర్‌ 31 నాటికి మొత్తం విమానాల సంఖ్య 865కి చేరింది. వివిధ విమానయాన సంస్థలు భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. 2026 జనవరి 31 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మొత్తం 1,700 పైచిలుకు విమానాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే 10 ఏళ్లలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఇందులో ఎక్కువ శాతం విమానాలు పాతబడిన వాటి స్థానాన్ని భర్తీ చేసేవిగానే ఉండనున్నాయి. → వివిధ కారణాల రీత్య పలు విమానాలను పక్కన పెట్టాల్సి రావడమనేది గత కొన్నేళ్లుగా పరిశ్రమకు సమస్యాత్మకంగా మారింది. ఇంజిన్ల వైఫల్యం, సరఫరా వ్యవస్థపరమై సవాళ్లతో 2023 సెపె్టంబర్‌ నాటికి పక్కన పెట్టిన విమానాల సంఖ్య పరిశ్రమలోని మొత్తం విమానాల్లో 20–22 శాతంగా నమోదైంది. ఇది 2026 ఫిబ్రవరి నాటికి 13–15 శాతానికి (సుమారు 117 ఎయిర్‌క్రాఫ్ట్‌లు) దిగి వచి్చంది. ఇలా పక్కన పెట్టిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య తగ్గుతూ, కొత్త విమానాలు అందుబాటులోకి వచ్చే కొద్దీ పెరిగే విమాన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా కూడా మరింత మెరుగుపడనుంది.

Advertisement
Advertisement
Advertisement