Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Disney Plans 1000 Job Cuts New CMO Reshapes Marketing Under Project Imagine1
డిస్నీలో లేఆఫ్స్?

ప్రపంచ వినోద రంగ దిగ్గజం ‘వాల్ట్ డిస్నీ’ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధానంగా కంపెనీలోని మార్కెటింగ్ విభాగంపై ఈ ప్రభావం అధికంగా ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.మార్కెటింగ్ విభాగమే లక్ష్యంగా..డిస్నీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు సంస్థ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణలో భాగమని తెలుస్తోంది. కొత్తగా నియమితులైన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ) అసద్ అయాజ్ కంపెనీ మార్కెటింగ్ గ్రూపును ఏకీకృతం చేసే పనిలో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ ఇమాజిన్’ అనే రహస్య కోడ్ పేరుతో వ్యయ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన అయాజ్ సంస్థలోని అన్ని మార్కెటింగ్ కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త చేపట్టబోయే లేఆఫ్స్‌ డిస్నీ మొత్తం శ్రామిక శక్తిలో 1 శాతం కంటే తక్కువే. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోష్ డి అమారో డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం.స్పందించని డిస్నీ యాజమాన్యంఈ వార్తలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టత కోరగా, డిస్నీ యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆఫీస్‌ పనివేళలు ముగిసిన తర్వాత ఈ నివేదిక బయటకు రావడంతో కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి అందుబాటులోకి రాలేదు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Hyderabad Sees Growth in Home Sales2
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ మెరుగు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–మార్చి త్రైమాసికంలో ఢీలాపడ్డాయి. హైదరాబాద్‌లో సానుకూల ధోరణి కనిపించింది. అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. మొత్తం మీద హైదరాబాద్‌ సహా టాప్‌–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి మూడు నెలల్లో అమ్మకాలు 88,361 యూనిట్లతో పోల్చితే 4 శాతం తగ్గాయి.అధిక ధరలకు తోడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితులు అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు బలమైన వృద్ధి అనంతరం మార్కెట్‌లో స్థిరీకరణ సహజమేనని నైట్‌ఫ్రాంక్‌ చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు. ధరలు పెరుగుతూ ఉండడం, విక్రయాలు తగ్గడం అన్నది ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిళ్లను తెలియజేస్తున్నట్టు చెప్పారు. మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సైతం ఉన్నట్టు తెలిపారు.నగరాల వారీ డేటా..హైదరాబాద్‌లో 9,541 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలతో పోల్చి చూస్తే 1 శాతం పెరిగాయి.బెంగళూరులోనూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 13,092 యూనిట్లుగా ఉన్నాయి.చెన్నైలో 9 శాతం అధికంగా 4,763 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.అహ్మదాబాద్‌లో 2 శాతం అధికంగా 4,758 యూనిట్ల విక్రయాలు జరిగాయి.కోల్‌కతాలో 4,043 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 5 శాతం వృద్ధి నమోదైంది.ముంబైలో ఇళ్ల విక్రయాలు 7 శాతం పడిపోయి 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 12,711 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గాయి. పుణెలోనూ 11 శాతం తక్కువగా 12,711 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గి 94,855 యూనిట్లకు పరిమితమైంది.

Stock market updates on 09 April 20263
స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు తగ్గి 23,970 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 172 పాయింట్లు నష్టపోయి 77,393 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.05బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 96.6 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 2.51 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 2.8 శాతం పుంజుకుంది.Today Nifty position 09-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

India Boosts Fertilizer Sector with 95 Gas Allocation Amid West Asia Tensions4
సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు

దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను సమీక్షించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరా చేసే సహజ వాయువు కోటాను 95 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కేటాయింపులు గురువారం (ఏప్రిల్ 9, 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఇటీవల జరిగిన ఇతర మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ కేటాయింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.పెరిగిన కేటాయింపులుగత వారం (ఏప్రిల్ 6) ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాను 90 శాతానికి పెంచిన ప్రభుత్వం, తాజాగా అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ ప్రకారం వస్తున్న ఎల్‌ఎన్‌జీ కార్గోలను దృష్టిలో ఉంచుకుని మరో 5 శాతం పెంచి మొత్తం కోటాను 95 శాతానికి చేర్చింది. దేశ సగటు గ్యాస్ వినియోగం రోజుకు సుమారు 196 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్‌సీఎం). ఎరువుల రంగ అవసరం రోజుకు సుమారు 52 ఎంఎస్‌సీఎండీగా ఉంది. ఒక ఎంఎస్‌సీఎం గ్యాస్‌తో సుమారు 1,600 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎరువుల రంగం 9,753 ఎంఎస్‌సీఎంల గ్యాస్‌ను వినియోగించింది. ఇది దేశ మొత్తం వినియోగంలో 28 శాతానికి సమానం.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Ceasefire in West Asia Sparks Dubai Real Estate Revival as Investors Return5
రియల్టీకి ‘సీజ్‌ఫైర్‌’ ఊతం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడం అంతర్జాతీయ స్థిరాస్తి మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కారణంగా గత కొన్ని వారాలుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వెనక్కి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఇరాన్‌, అమెరికా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణతో తిరిగి ఈ రంగం గాడిలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం అనిశ్చితి భయాలతో నిలిపివేసిన లావాదేవీలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.యుద్ధంతో వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులుఇరాన్-ఇజ్రాయెల్ వివాదం గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం దుబాయ్ రియల్టీ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేయడంతో మార్చి నెలలో నివాస గృహాల అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లావాదేవీల విలువ, పరిమాణం గణనీయంగా క్షీణించాయి. దుబాయ్ రియల్టీలో దాదాపు 20 శాతం వాటా కలిగిన భారతీయ పెట్టుబడిదారులు కూడా తాత్కాలికంగా తమ కొనుగోలు ప్రయత్నాలను విరమించుకున్నారు.డిమాండ్ బౌన్స్‌బ్యాక్‌కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే మార్కెట్‌లో ఒక్కసారిగా చలనం మొదలైందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కొనుగోళ్లపరంగా వెనక్కి తగ్గిన క్లయింట్లు ఇప్పుడు తిరిగి బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. ‘గతంలో ఒప్పందం కుదుర్చుకుని హోల్డ్‌లో పెట్టిన వారు ఇప్పుడు తిరిగి మార్కెట్‌లోకి వస్తున్నారు’ అని ప్రోయాక్ట్ లగ్జరీ రియల్ ఎస్టేట్ సీఈఓ రీతూ కాంత్ ఓజా తెలిపారు. వాయిదా పడిన లావాదేవీలన్నీ ఒక్కసారిగా కార్యరూపం దాల్చనుండటంతో ఏప్రిల్ నెలలో దుబాయ్ రియల్టీ రంగం భారీగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, రాబోయే 6 నుంచి 8 వారాలు మార్కెట్ స్థిరత్వానికి అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..పెట్టుబడిదారులకు నిపుణుల సూచనలుఅనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రాజెక్టుల కంటే వెంటనే అందుబాటులో ఉన్న ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.దుబాయ్ మెరీనా, డౌన్‌టౌన్ దుబాయ్, జుమేరా విలేజ్ సర్కిల్ (జేవీసీ) వంటి ప్రాంతాల్లో అద్దె ఆదాయం స్థిరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో దుబాయ్ మరోసారి గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘సేఫ్ హెవెన్’గా మారుతోంది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అంతా ఒక్కసారిగా మార్కెట్‌లోకి రానుండటంతో ఈ వేసవిలో దుబాయ్ రియల్టీ సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.

RBI Draft Rules to Standardize Business Correspondent Categories6
బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్స్‌కి ప్రత్యేక వర్గీకరణ

నిర్వర్తించే విధులను బట్టి బ్యాంకింగ్‌ బిజినెస్‌ కరెస్పాండెంట్స్‌ని రెండు కేటగిరీలుగా వర్గీకరించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వారికి ఇచ్చే కమీషన్‌ లేదా రెమ్యూనరేషన్‌ ఒకే విధంగా ఉండేలా ప్రతిపాదించింది. బ్రాంచ్‌ ఆథరైజేషన్‌కి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం మూడు డెలివరీ పాయింట్లను ఆర్‌బీఐ ప్రతిపాదించింది.ఇందులో బ్యాంక్‌ శాఖలతో పాటు బిజినెస్‌ కరెస్పాండెంట్‌–బ్యాంకింగ్‌ అవుట్‌లెట్‌ (బీసీ–బీవో), బిజినెస్‌ కరెస్పాండెంట్‌–బ్యాంకింగ్‌ టచ్‌పాయింట్‌ (బీసీ–బీటీ) ఉన్నాయి. ప్రస్తుతమున్న బిజినెస్‌ ఫెసిలిటేటర్ల స్థానంలో, బీసీలని నియమించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ నిబంధనల ఉద్దేశమని ఆర్‌బీఐ పేర్కొంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు మే 5 నాటికి తమ అభిప్రాయాలను నియంత్రణ సంస్థకి తెలియజేయాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సేవలను విస్తరించే దిశగా బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్లు ..రిటైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తుంటారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement