Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

New Mutual Fund Launches LIC Baroda BNP Bajaj Life Wealth Company Funds1
మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘న్యూ ఆఫర్స్‌’..

ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ టెక్నాలజీ ఫండ్‌: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా టెక్నాలజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్‌ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్‌ ఆపరేటర్లు, డిజిటల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంలు, ఇంటర్నెట్‌ బిజినెస్‌లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనికి బీఎస్‌ఈ టెక్‌ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. సిప్‌ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్‌ దోషి, జైప్రకాశ్‌ తోషి్నవాల్‌ దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘బరోడా బీఎన్‌పీ’ ఈఎస్‌జీ స్ట్రాటజీ ఫండ్‌ పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్‌పీ పారిబా మ్యుచువల్‌ ఫండ్‌ తాజాగా ఈఎస్‌జీ బెస్ట్‌–ఇన్‌–క్లాస్‌ స్ట్రాటెజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్‌జీ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్‌ కంపెనీలు ఇచ్చే ఈఎస్‌జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్‌ రీసెర్చ్, అనాలిసిస్‌ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్‌ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్‌ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్‌జీ టీఆర్‌ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్‌ గ్రోవర్‌ తెలిపారు. బజాజ్‌ లైఫ్‌ బీఎస్‌ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ జీవిత బీమా సంస్థ బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా బీఎస్‌ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌లో (ఎన్‌ఎఫ్‌వో) ఇన్వెస్ట్‌ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పథకాలైన (యులిప్స్‌) బజాజ్‌ లైఫ్‌ స్మార్ట్‌ వెల్త్‌ గోల్, బజాజ్‌ లైఫ్‌ సుప్రీం, బజాజ్‌ లైఫ్‌ గెయిన్‌లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రావు రావూరి తెలిపారు.వెల్త్‌ కంపెనీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్‌ కంపెనీ మ్యుచువల్‌ ఫండ్‌ ..తాజాగా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్‌ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్‌ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్‌ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లోను ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనికి క్రిసిల్‌ హైబ్రిడ్‌ 50+50 మోడరేట్‌ ఇండెక్స్‌ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది.

Stock Market Closing Update 23rd Feb 20262
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.95 పాయింట్ల లాభంతో 83,294.66 వద్ద, నిఫ్టీ 132.70 పాయింట్ల లాభంతో 25,703.95 వద్ద నిలిచాయి.అక్మే ఫిన్‌ట్రేడ్ (ఇండియా) లిమిటెడ్, మోర్పెన్ లాబొరేటరీస్ లిమిటెడ్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇండో టెక్ ట్రాన్స్‌ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఈ2ఈ నెట్‌వర్క్స్ లిమిటెడ్, 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Corporate India To See 9 1 Percent Salary Hike In 20263
2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!

ఈవై ఇండియా విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ పే నివేదిక ప్రకారం.. ఈ ఏడాది (2026) కార్పొరేట్ ఇండియా సగటు జీతం 9.1 శాతం ఉంటుంది. ఇది ఉద్యోగ విఫణిలో చోటుచేసుకుంటున్న మార్పులను, ముఖ్యంగా నైపుణ్యాల ఆధారిత వేతన విధానాల పెరుగుదలను స్పష్టంగా తెలియజేస్తోంది.జీతాల పెరుగుదల విషయంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ముందంజలో ఉండనున్నాయి. ఇవి గరిష్టంగా 10.4 శాతం వరకు జీతాలను హైక్ చేయనున్నాయి. ఆ తరువాత ఆర్థిక సేవల రంగం సుమారు 10 శాతం, ఈ-కామర్స్ రంగంలో 9.9 శాతం, జీవవిజ్ఞాన శాస్త్రాలు & ఔషధ రంగాల్లో 9.7 శాతం వరకు జీతాల పెరుగుదల ఉంటుంది.ఉద్యోగాల తొలగింపులు విషయానికి వస్తే.. 2024లో ఇది 17.5 శాతం ఉంది, ఇది 2025కి 16.4 శాతానికి చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఉద్యోగలు తొలగింపులు సంఖ్య కొంత తగ్గినట్లు తెలుస్తోంది. కాగా ఉద్యోగాలను స్వచ్చందంగా వదిలిపెట్టి రాజీనామా చేస్తున్నవారి సంఖ్య 80 శాతం ఉందని నివేదిక చెబుతోంది. అంటే వీరు తొలగింపుల కారణంగా కాకుండా, మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలను మార్చుతున్నారు. ఉద్యోగులను ఎక్కువగా తొలగించిన రంగాల్లో ప్రొఫెషనల్ సర్వీసెస్ & ఐటీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి.నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని వేతనం చెల్లించడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి అదనపు వేతనం లభిస్తుంది. ఇదే సమయంలో వేరియబుల్ పే ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. 2025లో స్థిర వేతనంలో వేరియబుల్ పే వాటా 16.1 శాతానికి పెరిగింది. 2024లో ఇది 14.8 శాతం మాత్రమే ఉండేది. అంటే కంపెనీలు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి.

Why Government Deposits in Private Banks Spotlight on IDFC First Bank Fraud4
ప్రభుత్వ సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు?

భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.మోసం బయట పడిందిలా..ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్‌లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్‌లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్‌కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్‌బీఐ, ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్‌లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్‌సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్‌డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్‌బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్‌లో పీఎస్‌యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్‌షిప్‌లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్‌యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్‌పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్‌తో ఆకర్షిస్తాయి.మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్‌బీఐ లిక్విడిటీ మేనేజ్‌మెంట్, సీఆర్‌ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్‌యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్‌లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్‌యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.ఐడీఎఫ్‌సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్‌లను పరిశీలించాలి. ఆర్‌బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం.

IDFC First Bank concall by V. Vaidyanathan addressed Rs 590 crore fraud case5
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మోసం.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్!

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్‌లోని ఒక శాఖలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. హరియాణా ప్రభుత్వ రంగానికి చెందిన సుమారు రూ.590 కోట్ల నిధులకు సంబంధించి జరిగిన మోసపూరిత వ్యవహారంపై బ్యాంక్ యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఉదంతంపై స్పందించిన బ్యాంక్ ఎండీ, సీఈఓ వి.వైద్యనాథన్.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అసలేం జరిగింది?హరియాణా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న బ్యాలెన్స్‌కు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య రూ.590 కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో కొందరు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కుమ్మక్కై ఈ అనధికార లావాదేవీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.బ్యాంక్ తక్షణ చర్యలుఈ మోసంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు బ్యాంకు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, రికవరీ ప్రక్రియ ప్రారంభమైనట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ కుంభకోణం మూలాలను, పూర్తి స్థాయి దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి స్వతంత్ర సంస్థ కేపీఎంజీని ఫోరెన్సిక్ ఆడిటర్లుగా నియమించారు.అన్నీ తెలుసుకుంటాం: వి.వైద్యనాథన్సోమవారం ఉదయం జరిగిన కాన్‌కాల్‌లో వైద్యనాథన్ మాట్లాడుతూ.. బ్యాంక్ విలువలకు, పారదర్శకతకు కట్టుబడి ఉందన్నారు. ‘గత ఐదేళ్లలో 1,050 పైగా శాఖలను ప్రారంభించాం. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇది దురదృష్టకరం. వ్యవస్థలోని లోపాలను లేదా ఉద్యోగుల కుమ్మక్కును గుర్తించడానికి బ్యాంక్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. బోర్డు మార్గదర్శకత్వంలో ఈ సమస్యను అత్యంత నైతికంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరిస్తాం’ అని చెప్పారు.నిన్న రాత్రి దేశవ్యాప్తంగా తమ బ్యాంకు ఉద్యోగులతో మాట్లాడానని, బ్యాంక్ కార్యకలాపాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎవరికీ ఇందులో ప్రమేయం లేదని, సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఆర్థిక ప్రభావం అంచనాఈ మోసం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని నిర్ధారించే పనిలో బ్యాంక్ ఉంది. ఇతర బ్యాంకుల్లో ఉన్న మోసపూరిత లబ్ధిదారుల ఖాతాలను గుర్తించడం, చట్టపరమైన రికవరీల ద్వారా వచ్చే నిధుల ఆధారంగా తుది ప్రభావాన్ని నిర్ణయిస్తారు. ఈ నష్టాన్ని బ్యాంక్ తన ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఖాతా ద్వారా సర్దుబాటు చేయనుంది.డిసెంబర్ 2018లో క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం తర్వాత వి.వైద్యనాథన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బ్యాంక్ వేగంగా వృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ మోసం బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా చట్ట ప్రకారం బాధ్యులపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని బ్యాంక్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తేల్చి చెప్పింది.ఇదీ చదవండి: పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు

US Trade no country has signaled exit tariff agreements6
పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల విధానంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూఎస్‌ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఏ దేశమూ అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల నుంచి వైదొలగాలనుకోవడం లేదని చెప్పారు.నిర్మాణాత్మక చర్చలు - స్థిరమైన బంధాలుఓ కార్యక్రమంలో గ్రీర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములతో అమెరికా జరుపుతున్న చర్చలు అత్యంత నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని వెల్లడించారు. అమెరికా వాణిజ్య విధానాలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించినప్పటికీ దాని ప్రభావం వల్ల భాగస్వామ్య దేశాలు తమ ఒప్పందాల నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటివరకు ఏ దేశం కూడా మా వద్దకు వచ్చి ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని చెప్పలేదు’ అని గ్రీర్ పేర్కొన్నారు.ఈయూ, ఇతర దేశాలతో సమన్వయంప్రస్తుత వాణిజ్య ఒప్పందాలకు అమెరికా కట్టుబడి ఉందనే అంశాన్ని బలోపేతం చేయడానికి గ్రీర్ ఇప్పటికే ఈయూలోని తన సహచరులతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇతర కీలక దేశాల అధికారులతో కూడా ఇలాంటి చర్చలు జరపడానికి షెడ్యూల్ ఖరారైంది. అంతర్జాతీయ వాణిజ్య అంశాల్లో స్థిరత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ షెడ్యుల్‌ను రూపొందించినట్లు అమెరికా చెప్పింది.విశ్లేషకుల అభిప్రాయంఅమెరికాలోని అంతర్గత చట్టపరమైన మార్పులు లేదా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఒప్పందాలను ప్రభావితం చేయవనే నమ్మకం వాణిజ్య భాగస్వాముల్లో ఉందని గ్రీర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. యూఎస్‌ అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించడమే కాకుండా మిత్రదేశాల మధ్య విశ్వాసాన్ని పటిష్టం చేస్తుంది. వాణిజ్య విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అమెరికా తన గ్లోబల్ ట్రేడ్ లీడర్‌షిప్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్‌ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!

Advertisement
Advertisement
Advertisement