ప్రధాన వార్తలు
ఐరాస సంస్థ ‘సైట్స్’ మెచ్చిన వంతారా
జంతు సంరక్షణలో ఇండియాలోని రిలయన్స్ ఆధ్వర్యంలో ఉన్న వంతారా వండి సంస్థలు చూపుతున్న నిబద్ధతను ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వంతారా కాంప్లెక్స్లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్లో విస్తృత పరిశీలన జరిపి 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతోంది. సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. "ఈ కేంద్రాలు జంతువులను సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు" అని తెలిపింది.వంతారా అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ తెలిపింది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ కీలకంగా ప్రస్తావించిన అంశం. భారత్కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది. జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు లేవని తెలిపింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్లను వాడేందుకు బిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టీపీయూలుపరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్లను సరఫరా చేస్తోంది.గూగుల్ టెన్సర్ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.ఎన్వీడియా చిప్స్ఎన్వీడియా బ్లాక్వెల్ వంటి చిప్లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్లకు కీలకంగా ఉండేవి. లార్జ్ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
ట్యాక్స్ రీఫండ్.. ఆలస్యానికి కారణం ఇదే..
ఆదాయపు పన్ను (ఐటీ) రీఫండ్ల జారీలో జరుగుతున్న జాప్యంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ కీలక అప్డేట్ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులు (Incorrect Deductions) లేదా అధిక విలువ గల క్లెయిమ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నందున రీఫండ్ల ఆలస్యం జరుగుతోందని స్పష్టం చేశారు.ఈ ఏడాది ఐటీఆర్ (ITR) దాఖలు గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఛైర్మన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో పన్ను చెల్లింపుదారుల లాంజ్ను ప్రారంభించిన అనంతరం అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు.‘తక్కువ విలువ కలిగిన రీఫండ్లను ఇప్పటికే విడుదల చేస్తున్నాం. మిగిలిన రీఫండ్లను ఈ నెలలో లేదా డిసెంబర్ నాటికి విడుదల చేస్తాం. పన్ను శాఖ కొన్ని తప్పుడు తగ్గింపులు, అధిక విలువ గల రీఫండ్ క్లెయిమ్లను గుర్తించింది. వాటిని ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్లెయిమ్లను సిస్టమ్ ద్వారా రెడ్-ఫ్లాగ్ చేశాం. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులపై విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఇది రీఫండ్ల జారీలో జాప్యానికి కారణం అవుతుంది’ అని అగర్వాల్ పేర్కొన్నారు.మరోవైపు, ఏదైనా తగ్గింపులను మర్చిపోయిన పన్ను చెల్లింపుదారులు సవరించిన రిటర్న్ (Revised Return) దాఖలు చేయాలని కోరుతూ వారికి లేఖలు రాసినట్లు కూడా ఆయన వెల్లడించారు. టీడీఎస్ (మూలం వద్ద పన్ను తగ్గింపు) రేట్లు హేతుబద్ధీకరించబడటం వల్ల రీఫండ్ క్లెయిమ్ల్లో కూడా తేడాలుంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య రీఫండ్లు రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి.వ్యాజ్యాల తగ్గింపుపై దృష్టిప్రత్యక్ష పన్ను కేసులకు సంబంధించిన వ్యాజ్యాలను తగ్గించడానికి డిపార్ట్మెంట్, బోర్డు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. అప్పీలేట్ అధికారులు ఓవర్ టైమ్ పని చేస్తున్నారని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతానికి పైగా అప్పీళ్లు పరిష్కరించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాపై తగ్గని మోజు!
అమెరికాపై తగ్గని మోజు!
అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్పుర్.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.వినియోగదారులకు ఉపయోగాలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.ఛార్జీలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం2. సీఎస్బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్
రైలు పట్టాలపై సవారీ చేసే బస్సు
సాధారణంగా మనం ఊహించని పనులను చేసే కొన్ని వాహనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఒక వినూత్న వాహనాన్ని జపాన్లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV)గా రికార్డు సృష్టించింది. ఇది బస్సు మాదిరిగా సాధారణ రోడ్లపై, రైలులాగా రైల్వే ట్రాక్పై పరుగులు పెడుతుంది.చిన్న బస్సు రూపంలో కనిపించే ఈ డ్యూయల్ మోడ్ వాహనం దాని డిజైన్, ప్రత్యేకతలతో వాహనదారులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రత్యేకమైన పేరు లేనప్పటికీ దీని పనితీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వాహనం జపాన్లోని షికోకు ద్వీపంలోని కొచ్చిని టోకుషిమా మధ్య నడుస్తోంది. ఈ డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆసా కోస్ట్ రైల్వే అనే ఒక ప్రైవేట్ పబ్లిక్ రైల్వే సంస్థ నిర్వహిస్తోంది.15 సెకన్లలో మోడ్ ఛేంజ్..ఈ వాహనం రోడ్డు మోడ్ (బస్సు) నుంచి రైలు మోడ్కు లేదా రైలు మోడ్ నుంచి రోడ్డు మోడ్కు చాలా త్వరగా మారగలదు. మోడ్ల మధ్య సెటప్ను మార్చుకోవడానికి డీఎంవీకి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.ఈ వాహనం 21 మందిని మోసుకెళ్లగలదు.రోడ్డుపై వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు చేరుకోగలదు.రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. View this post on Instagram A post shared by Japan Journeys: Culture, Cuisine, and Adventure 🎌 (@vibeinjapan)ఈ డీఎంవీ జపాన్లో అవాకైనాన్, కైఫు, షిషికుయి, కన్నోరా, ఉమినోకి టోయో టౌన్, మిచినోకి షిషికుయి ఒన్సెన్ను కలుపుతూ నడుస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు 200 యెన్ల నుంచి 800 యెన్ల వరకు (సుమారు రూ.100 నుంచి రూ.450) ఉంటాయి.ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్
కార్పొరేట్
ఐరాస సంస్థ ‘సైట్స్’ మెచ్చిన వంతారా
ధనికులను వణికిస్తున్న వెల్త్ ట్యాక్స్!
హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాల రిపేరీ కేంద్రం
అసంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగాలు
అదానీ ఎంటర్ప్రైజెస్ రైట్స్ ఇష్యూ
ఎస్బీఐ వెంచర్స్ టార్గెట్ రూ. 2,000 కోట్లు
క్రాష్ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మరో కొత్త సదుపాయం
జీసీసీ దేశాల్లోకి విస్తరించనున్న ఆర్ఎన్ఐటీ
సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్ కోర్సులకు ఆన్లైన్ ట్రైనింగ్
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు....
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ విలువ పెట్టుబడిదారుడుగ...
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్...
గోల్డెన్ న్యూస్: పసిడి ప్రియులకు ఆనందమే..
దేశంలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పసిడి ధరలు క...
‘ఆహార వృధా అంత ఎక్కువేం లేదు’
ప్రజల్లో అనుకుంటున్నట్టు మన దేశంలో ఆహార వృధా అంత ఎ...
కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు: తక్షణమే అమల్లోకి
భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట...
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్
న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్లో ఫ్లాట్...
పర్యాటక రంగానికి జాతీయ బోర్డు ఉండాలి
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి...
ఆటోమొబైల్
టెక్నాలజీ
బిలినీయర్స్ అంతా ఒక్కచోట!
అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.Trillion Squad assembled pic.twitter.com/tQMjRrfxx5— Ambuj Mishra (@Ambujmishra9090) November 22, 2025ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.Somewhere in a parallel universe: pic.twitter.com/SFlYRiUpcn— DogeDesigner (@cb_doge) November 22, 2025
బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్సైకిల్పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్స్క్రిప్షన్ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్సైట్లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,19,900. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఈ ఫోన్ కేవలం 54,900 రూపాయలకే లభించనుంది. అంటే.. రూ. 65,000 తగ్గుతుందన్నమాట.నవంబర్ 22 నుంచి ప్రారంభమైన నవంబర్ 30 వరకు సాగే బ్లాక్ ఫ్రైడే సేల్లో.. ఐఫోన్ ఎయిర్ మొబైల్ తక్కువ ధరలకు అందుబాటులో ఉండనుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఆఫర్స్, ఇతరత్రా ఆఫర్స్ పొందినట్లయితే మీకు రూ. 65000 తగ్గుతుందన్నమాట.ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్స్యాపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5 ఇంచెస్ OLED ప్యానెల్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ పొందిన ఈ ఫోన్ 3,000 నిట్స్ పీక్ అవుట్డోర్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో యాపిల్ ప్రత్యేక 7-లేయర్ యాంటీరిఫ్లెక్టివ్ కోటింగ్ అందించింది. ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్సెట్పై నడుస్తుంది, ఇది ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్లో ఉపయోగించిన అదే శక్తివంతమైన ప్రాసెసర్. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ రియర్ కెమెరా, ముందు భాగంలో, 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ & స్కై బ్లూ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.BSNL పోర్ట్ఫోలియోలో అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ. 500 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని సంస్థ తెలిపింది.రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన ఈ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. యూజర్ అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్/రోజుకు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 72 రోజులు మాత్రమే.72 Days of Smart Savings in One Recharge!BSNL’s ₹485 Plan gives you 72 days of unlimited calls, 2GB/day data & 100 SMS/day.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNL #BSNLRecharge #BSNL4G pic.twitter.com/t6IyOzc0cA— BSNL India (@BSNLCorporate) November 23, 2025ఇప్పటికే రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు
పర్సనల్ ఫైనాన్స్
స్థిరమైన ఆదాయానికి ఏ ఫండ్ మంచిది..?
నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. స్థిరమైన ఆదాయం కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – నివేష్ పటేల్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్్కతో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్తో పోలి్చతే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. లిక్విడ్ ఫండ్స్పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. లిక్విడ్ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు.లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులను ఇన్స్టంట్గా అదే రోజు వెనక్కి తీసుకునేందుకు (నిరీ్ణత మొత్తం) కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. లేదంటే మరుసటి రోజు అయినా పెట్టుబడులు చేతికి అందుతాయి. వీటిల్లో రాబడి ఎంతన్నది ముందుగానే అంచనాకు రావొచ్చు. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి యూనిట్ నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ)లో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. కనుక ఇది నెలవారీ ఉపసంహరించుకునే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు హెల్త్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. అయినా, వ్యక్తిగతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆలోచనేనా? – రేణుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు హెల్త్ కవరేజీ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ఎంపానెల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు పరిహారం పొందొచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగా చికిత్సలకు సైతం రీయింబర్స్మెంట్ పొందొచ్చు. వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు కుడా పరిహారం వస్తుంది. కాకపోతే ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితం. అయితే, ప్రభుత్వ ఆమోదం పొందిన ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉందో, అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోండి.ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన, రోబోటిక్ వంటి అత్యాధునిక చికిత్సలను తమకు ఇష్టమైన ఆస్పత్రిలో పొందాలని కోరుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కనీసం రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవాలి. అది కూడా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి హెల్త్ ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో–పే షరతుకు అంగీకరించాల్సి వస్తుంది. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సదుపాయం అధిక శాతం చికిత్సలకు రీయింబర్స్మెంట్ రూపంలోనే ఉంటుంది. కనుక ముందుగా తాము చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వద్ద క్లెయిమ్ దాఖలు చేసి పొందగలరు. అదే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అవసరమైన సందర్భంలో నగదు రహిత చికత్సను దాని కింద పొందొచ్చు.ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
వ్యవసాయ ఆదాయం.. పన్ను భారం లెక్కింపు
గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్కంట్యాక్స్ పడదు. కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్ ఇన్కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం. ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000B. వ్యవసాయ ఆదాయం, బేసిక్ లిమిట్ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి. రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది. అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి. ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)చెల్లించాల్సిన పన్ను (5) – (6)దీనికి విద్యా సుంకం అదనంరూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది. పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది. మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్ ఇంటిగ్రేషన్ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి. ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్ ప్లానింగ్ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక.
అప్పు ఎంత చేయొచ్చు..? తెలిసినవారు అధిక సంపన్నులు!
"అప్పులేని వాడే అధిక సంపన్నుడు" అన్నాడు కవి వేమన. కానీ ఆధునిక అవసరాలు అనివార్యమైన నేటి రోజుల్లో "అప్పు ఎంత చేయొచ్చో తెలిసినవారు అధిక సంపన్నులు" అంటున్నారు ఆర్థిక నిపుణులు. పేదవారి నుంచి సంపన్నుల వరకూ అప్పు చేయనిదే పూట గడవదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారు ఏదో ఒక రూపంలో అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక సగటు మధ్యతరగతి జీవితంలో అప్పు నిత్యకృత్యమే.నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అప్పుల తిప్పలు తప్పడం లేదు. అయితే జీవన శైలిలో మార్పుల కారణంగా కొన్ని అప్పులు అనవరంగా వచ్చి మీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి రుణ బాధ్యతలను మరింత దగ్గరగా పర్యవేక్షించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అస్సలు అప్పు లేకుండా ఉండటం మంచిదే. అయితే, కొన్నిసార్లు ముఖ్యంగా ఇల్లు, వాహనాల కొనుగోలు లేదా ఉన్నత విద్య వంటి వాటి కోసం అప్పు ఆచరణాత్మక అవసరం.తు.చ.తప్పకూడని అప్పు సూత్రంఆర్థికంగా ఆరోగ్యంగా ఉండటానికి, నిపుణులు ఒక క్లిష్టమైన నియమాన్ని నొక్కి చెబుతారు. అదే ఒక నెలలో ఈఎంఐలు (EMI), చేబదుళ్లు వంటివాటి కోసం వెళ్లే మొత్తం ఒక వ్యక్తి స్థూల నెలవారీ ఆదాయంలో 36 శాతానికి మించకూడదు. రుణం-ఆదాయ నిష్పత్తి అని పిలిచే ఈ పరిమితిని తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని కొలవడానికి బ్యాంకులు విస్తృతంగా ఉపయోగిస్తాయి. అప్పు దీన్ని మించితే రుణగ్రహీత బడ్జెట్ ను ఒత్తిడి చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.ముఖ్యంగా యువతకు..ఈ అప్పు సూత్రం యువతకు ముఖ్యమైంది. సులభమైన క్రెడిట్ ఆప్షన్లు, ఒక్క స్క్రీన్ ట్యాప్తో అందుబాటులో ఉన్న తక్షణ రుణాలతో నిండిన ఆర్థిక దృశ్యంలోకి దేశ యువత ప్రవేశిస్తున్నారు. సామాజిక ఒత్తిళ్లు, ఆన్ లైన్ షాపింగ్, దూకుడు మార్కెటింగ్ తరచుగా ఆదాయానికి మించి ఖర్చు చేయిస్తుంటాయి. ఫలితంగా, చాలా మంది యువ సంపాదనాపరులు జీవితం ప్రారంభంలోనే అధిక వడ్డీ రుణాల ఉచ్చులో పడతారు. వయసు 20, 30ల ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన రుణ అలవాట్లను అలవరచుకోవడం దీర్ఘకాలికంగా సంపద సృష్టిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?అప్పునకు దూరంగా ఉండటానికి మార్గాలుమీ మొదటి ఉద్యోగం ప్రారంభం నుంచే ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని ట్రాక్ చేయండి. ఆదాయం పెరిగినప్పటికీ, ఈఎంఐలు మీ స్థూల జీతంలో 36% మించకుండా చూసుకోండి.లైఫ్ స్టైల్ అప్ గ్రేడ్ చేయడానికి ముందు అత్యవసర నిధిని నిర్మించుకోండి.యువత తరచుగా ఖర్చు చేయడానికి అనుకూలంగా పొదుపును దాటవేస్తారు. సంక్షోభ సమయంలో ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండటానికి ఈ ఎమెర్జెన్సీ ఫండ్ అవసరం.క్రెడిట్ కార్డులు లేదా ఇప్పుడు కొని తర్వాత చెల్లించే యాప్ల ద్వారా హఠాత్తు కొనుగోళ్లను నివారించండి. బై-నౌ-పే-లేటర్ సర్వీసులు యువ వినియోగదారులలో ప్రాచుర్యం పొందాయి. కానీ ఊహించని రుణ ఉచ్చులను సృష్టించగలవు.విద్యా రుణాలను తెలివిగా ఎంచుకోండి. సైన్ అప్ చేయడానికి ముందు వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే ఎంపికలు, మారటోరియం కాలాలను పోల్చి చూసుకోండి.బడ్జెట్ను రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి. కొన్ని యాప్లు ఖర్చులను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఒక సాధారణ నెలవారీ బడ్జెట్ అధిక ఖర్చును నిరోధిస్తుంది. పొదుపును ప్రోత్సహిస్తుంది.అధిక వడ్డీ రుణంపై దృష్టి పెట్టండి. వడ్డీని నివారించడానికి మొదట క్రెడిట్ కార్డు బకాయిలను క్లియర్ చేయండిఅదనపు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోండి. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ వర్క్ లేదా డిజిటల్ గిగ్ లు ఆరోగ్యకరమైన రుణ-ఆదాయ నిష్పత్తిని నిర్వహించడంలో సహాయపడతాయి.ప్రతిదానికీ ఫైనాన్స్ చేయడానికి బదులుగా పెద్ద కొనుగోళ్లను ప్లాన్ చేయండి. అది బైక్, ఫోన్ లేదా విహారం అయినా. మొదట పొదుపు చేయడం ఈఎంఐలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?
కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను (New Labour Code) అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల (Wages) నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం (టేక్-హోమ్) తగ్గుతుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.ఎక్కువ బేసిక్ పే.. తక్కువ టేక్ హోమ్వేతనాలలో కనీసం 50 శాతం భాగం ప్రాథమిక వేతనం + కరువు భత్యం (డీఏ) + నిలుపుదల భత్యం (రిటైనింగ్ అలవెన్స్) రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సీటీసీ (CTC)లో తక్కువగా ఉంచి, మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్ (ఉద్యోగి 12%, యజమాన్యం 12%), గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల, తక్కువ బేసిక్ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు (కటింగ్స్) పోయి ఎక్కువ జీతం చేతికందేది.రిటైనింగ్ అలవెన్స్ అంటే..రిటైనింగ్ అలవెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు. దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యాజమాన్యాలు చూసుకుంటాయి. అయితే కొత్త లేబర్ కోడ్లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50 శాతాన్ని మినహాయింపుల కసం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్& అసోసియేట్స్కు చెందిన అలయ్ రజ్వీ ప్రకారం.. ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్/గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందనీ, కానీ టేక్-హోమ్ పై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.


