Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Agrochemical industry set for recovery Crisil1
ఆగ్రో కెమికల్స్‌కు డిమాండ్‌

ఆగ్రో కెమికల్స్‌కు (వ్యవసాయ సంబంధిత రసాయనాలు) డిమాండ్‌ అంతర్జాతీయంగా కోలుకుంటుండడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆదాయం 6–7 శాతం పెరగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అంతర్జాతీయంగా సాగుకు సంబంధించి నెలకొన్న సానుకూల సెంటిమెంట్‌తో ఎగుమతుల ఆదాయం 8–9 శాతం పెరుగుతుందని పేర్కొంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉత్పత్తులు వెనక్కి రావడం, సాగు సన్నద్ధత వంటి అంశాలు దేశీయ డిమాండ్‌కు సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది.‘‘రెండు సంవత్సరాల స్థిరీకరణ తర్వాత ఆగ్రో కెమికల్స్‌ రంగంలో ఆదాయం 2025–26లో 6–7 శాతం పెరగొచ్చు. ఇది కూడా ధరల పెంపు ద్వారా కాకుండా అధిక అమ్మకాల రూపంలో రానుంది’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేతి తెలిపారు. ఇన్వెంటరీలు (స్టాక్‌ నిల్వలు) కూడా సాధారణ స్థాయికి చేరడం ఆదాయం వృద్ధికి అనుకూలిస్తుందని చెప్పారు.ఇక ఆగ్రోకెమికల్స్‌ పరిశ్రమ తన దీర్ఘకాల వృద్ధి అయిన 8–10 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. అయితే, ఎగుమతులు స్థిరంగా కొనసాగడం, దేశీ డిమాండ్‌ పుంజుకోవడంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పరిశ్రమ ఆదాయంలో దేశీ, విదేశీ మార్కెట్లో చెరో సగం వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉండడం, అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక శ్రేణి పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.రుణ భారం నియంత్రణలోనే.. తక్కువ మూలధన వ్యయాలు, స్థిరమన మూలధన నిధులతో ఆగ్రో కెమికల్‌ కంపెనీల రుణభారం నియంత్రణల్లోనే ఉంటుందని, దీంతో రుణ పరపతిని మెరుగ్గా కొనసాగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం పేరుకున్న నిల్వలు తగ్గిపోవడంతో దేశీయంగా ఆగ్రోకెమికల్స్‌ ధరలు స్థిరపడినట్టు తెలిపింది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆగ్రో కెమికల్‌Šస్‌పై కిలోకి 5 డాలర్ల ప్రయోజనం ఒనగూరుతోందని, గతేడాది స్థాయిలోనే ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే కొనసాగొచ్చని అంచనా అంచనా వ్యక్తం చేసింది. నిల్వలు తగ్గడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో సరఫరాలు స్థిరపడతాయని పేర్కొంది.‘‘ఆగ్రో కెమికల్స్‌ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 12.5–13 శాతంగా ఉండొచ్చు. అయినప్పటికీ కరోనా ముందున్న 15 శాతం కంటే తక్కువే. 2024లో ప్రతికూలతల అనంతరం ఈ స్థిరత్వం నెలకొంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు ఇందుకు అనుకూలిస్తున్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఏటా రూ.5,500 కోట్ల పెట్టుబుడులు పెడుతుండడం, కొత్త ఉత్పత్తుల రిజి్రస్టేషన్లు, క్రమశిక్షణతో కూడిన మూలధన నిధుల నిర్వహణ వంటివి.. రుణ అవసరాలను తక్కువకు పరిమితం చేస్తాయి’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఉపాధ్యాయ వివరించారు.అయినప్పటికీ ఈ రంగం పనితీరుపై వాతావరణ మార్పులు, నియంత్రణలను కఠినతరం చేయడం, రూపాయి మారకం విలువల ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

India bankruptcy regime gains global boost2
భారత దివాలా చట్టం భేష్‌ 

న్యూఢిల్లీ: భారత్‌ దివాలా పరిష్కార చట్టానికి (ఐబీసీ) ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కితాబిచి్చంది. అధికారిక ర్యాంకింగ్‌ మదింపును సవరించింది. దివాలా పరిష్కార కార్యాచరణ రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉండడాన్ని గుర్తించింది. భారత్‌లో దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) రుణ క్రమశిక్షణను బలోపేతం చేసిందని, పరిష్కార ప్రక్రియను రుణదాతలకు అనుకూలంగా మార్చిందని ఎస్‌అండ్‌పీ తన నివేదికలో పేర్కొంది. గతంలో దివాలా పరిష్కార విధానాలకు భిన్నంగా ఐబీసీ కింద సంక్షోభంలోని కంపెనీల ప్రమోటర్లు తమ వ్యాపారాలపై నియంత్రణ కోల్పోతున్నట్టు వివరించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత దివాలా పరిష్కార చట్టానికి అధికారిక ర్యాంకింగ్‌ మదింపును గ్రూప్‌–సి నుంచి గ్రూప్‌–బికి మారుస్తున్నట్టు ప్రకటించింది. రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉన్న దివాలా పరిష్కార ప్రక్రియను బలహీనం నుంచి మధ్యస్థానికి మెరుగుపరిచిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఐబీసీ కింద రుణదాతల ఆధ్వర్యంలో విజయవంతమైన పరిష్కారాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. రుణాల వసూళ్లు, రికవరీ రేటు మెరుగుపడ్డాయని.. సగటు రుణ వసూలు గత చట్టం కింద ఉన్న 15–20 శాతం నుంచి ఐబీసీ కింద 30 శాతానికి పెరిగినట్టు తెలిపింది. గతంలో ఒక్కో కేసు పరిష్కారానికి ఆరు నుంచి ఎనిమిదేళ్ల సమయం తీసుకోగా, ఐబీసీ కింద రెండేళ్లకు తగ్గినట్టు ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అధికార ర్యాంకింగ్‌ మదింపు అన్నది.. ఒక దేశ దివాలా చట్టం కింద రుణదాతలకు ఉన్న భద్రతను సూచిస్తుంటుంది.

White collar hiring picks up pace in November 20253
నవంబర్‌లో హైరింగ్‌ జోరు 

ముంబై: దేశీయంగా నవంబర్‌లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు (మేనేజర్, అకౌంటెంట్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ మొదలైనవి) సంబంధించిన నియామకాలు పుంజుకున్నాయి. వార్షికంగా 23 శాతం పెరిగాయి. నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ముఖ్యంగా విద్య, రియల్‌ ఎస్టేట్, ఆతిథ్య, పర్యాటక, బీమా లాంటి ఐటీయేతర రంగాల్లో హైరింగ్‌ గణనీయంగా నమోదైంది. నౌకరీడాట్‌కామ్‌లో కొత్త జాబ్‌ లిస్టింగ్స్, రిక్రూటర్ల సెర్చ్‌లను విశ్లేíÙంచిన మీదట దేశీయంగా జాబ్‌ మార్కెట్‌ ధోరణులపై ఈ రిపోర్ట్‌ రూపొందింది. దీన్ని బట్టి చూస్తే గత నెల ఐటీ రంగంలో హైరింగ్‌ పెద్దగా పెరగలేదు. విద్య (44 శాతం), రియల్‌ ఎస్టేట్‌ (40 శాతం), ఆతిథ్య/పర్యాటకం (40 శాతం), బీమా (36 శాతం) రంగాల్లో అత్యధికంగా రిక్రూట్‌మెంట్‌ నమోదైంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → యూనికార్న్‌లలో (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ గల సంస్థలు) నియామకాలు 35 శాతం పెరిగాయి. అలాగే అధిక విలువ చేసే ప్యాకేజీలుండే (వార్షికంగా రూ. 20 లక్షలు) ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ 38 శాతం పెరిగింది. ఈ–కామర్స్‌ సంస్థల్లో 27 శాతం, ఐటీ యూనికార్న్‌లలో 16 శాతం వృద్ధి నమోదైంది. → ప్రాంతీయంగా చూస్తే చెన్నై (49 శాతం), హైదరాబాద్‌ (41 శాతం), ఢిల్లీ/ఎన్‌సీఆర్‌ (41 శాతం)లో అత్యధికంగా హైరింగ్‌ నమోదైంది. 13–16 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ల రిక్రూట్‌మెంట్‌ యూనికార్న్‌లలో 50 శాతం ఎగిసింది. → దేశవ్యాప్తంగా ఎంట్రీ–స్థాయి హైరింగ్‌ 30 శాతం పెరిగింది. మెట్రోయేతర నగరాలు దీనికి సారథ్యం వహించాయి. అహ్మదాబాద్‌ (41 శాతం) అగ్రస్థానంలో ఉండగా కోయంబత్తూర్‌ (32 శాతం), జైపూర్‌ (31 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరులాంటి కీలక మెట్రో హబ్‌లు వరుసగా 29 శాతం, 26 శాతం వృద్ధి కనపర్చాయి. → గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో హైరింగ్‌ 18 శాతం పెరిగింది. ముఖ్యంగా డేటా సైంటిస్టులు (49 శాతం), సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌లు (45 శాతం), ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లు (36 శాతం), డేటా ఇంజినీర్లకు (33 శాతం) డిమాండ్‌ నెలకొంది. స్ట్రాటెజీ, మేనేజ్‌మెంట్‌ కన్సలి్టంగ్‌ జీసీసీల్లో హైరింగ్‌ 50 శాతం, ఐటీ రంగ జీసీసీల్లో 9 శాతం మేర నియామకాలు పెరిగాయి. → చిన్న వ్యాపారాలు సైతం డిజిటల్‌ నిపుణులను నియమించుకునే ధోరణి పెరుగుతోంది.

RBI three days MPC review begins 3 Dec 20254
మొదలైన ఆర్‌బీఐ ఎంపీసీ 

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చన్న అంచనాల మధ్య కొనసాగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం కనిష్టాలకు చేరి, జీడీపీ వృద్ధి బలపడడం, రూపా యి మారకం విలువ ఆల్‌టైమ్‌ కనిష్టాలకు పతనమైన సమయంలో జరుగుతున్న ఎంపీసీ భేటీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. కొందరు విశ్లేషకులు పావు శాతం రేటు కోతను అంచనా వేస్తుంటే, యథాతథ స్థితినే కొనసాగించొచ్చని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను శుక్రవారం (5న) ఉదయం వెల్లడించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును 1% తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే. ‘‘డిసెంబర్‌లో రెపో రేటు 0.25% తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నాం. వృద్ధి బలంగా ఉంది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యో ల్బణం గణనీయంగా తగ్గింది. దీంతో రేట్ల కోతకు అదనపు వెసులుబాటు లభించింది’’అని క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు. వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సైతం గత నెలలో సంకేతం ఇచ్చారు.

Rupee hits record low, approaches 90 per dollar mark5
రూపాయి.. 90కి జారిపోయి..

దిగుమతులు, విదేశీ చదువులు, పర్యటనల భారాన్ని పెంచేస్తూ అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకీ కిందికి జారిపోతోంది. బుధవారం తొలిసారి ఏకంగా 90 స్థాయిని దాటేసి సెంచరీ దిశగా పతన పరుగును మరింత వేగం చేసింది. డాలరుతో రూపాయి విలువ ఈ ఏడాది అయిదు శాతం పడిపోయింది. 2030 నాటికి రూపాయి సెంచరీ కొట్టేసే అవకాశం ఉందంటూ కేంబ్రిడ్జ్‌ కరెన్సీస్‌లాంటి ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. రేపటి (శుక్రవారం) వెలువడే సమీక్షలో కీలక పాలసీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ తగ్గిస్తే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింత వెల్లువెత్తి రూపాయి పాతాళానికి పడిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న రూపాయి కారణంగా ఆర్‌బీఐ పని కష్టతరంగా మారిందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం రూపాయి పతనాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు, దీని గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని అంటున్నారు. రూపాయి పతనం ఎగుమతిదారులకు ప్రయోజనమే అయినప్పటికీ దిగుమతిదారులకు మాత్రం భారంగా మారుతోంది.ముంబై: అమెరికా డాలర్లకు దిగుమతిదార్ల నుంచి డిమాండ్‌ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే్చంజీలో రూపాయి మారకం విలువ బుధవారం ఒక దశలో ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 90.30ని తాకింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 19 పైసలు క్షీణించి 90.15 వద్ద క్లోజయ్యింది. మంగళవారం సైతం 43 పైసలు పతనమై 89.96 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెగకుండా విక్రయిస్తుండటం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, క్రూడాయిల్‌ రేట్లు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడం కూడా ఒత్తిడి పెంచింది. అయితే, డాలర్‌ ఇండెక్స్‌ కూడా బలహీనంగా ఉండటం వల్ల మరింత భారీగా పతనం కాకుండా కాస్త అడ్డుకట్ట పడింది. రాబోయే రోజుల్లో కూడా రూపాయి కొంత బలహీనంగానే ట్రేడ్‌ కావచ్చు. అయితే, డాలరు బలహీనపడి, డిసెంబర్‌లో ఫెడ్‌ రేట్ల కోత అవకాశాలు పెరిగితే రూపాయి కాస్త నిలదొక్కుకోవచ్చు’’ అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనుజ్‌ చౌదరి తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు రిస్కుల జోలికి వెళ్లకుండా, క్రూడాయిల్‌ రేట్లు అధిక స్థాయిలోనే తిరుగాడుతూ ఉంటే సమీప భవిష్యత్తులో రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని, 89.50–91.20 శ్రేణిలో తిరుగాడవచ్చని ఆషికా గ్రూప్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రాహుల్‌ గుప్తా తెలిపారు. సాధారణమే.. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం సాధారణ విషయంగా మారిపోయిందని కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ నీలేష్‌ షా చెప్పారు. ‘‘మన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. ఉత్పాదకత తక్కువగా ఉంది. ఈ అసమానతల కారణంగా 2–3 శాతం క్షీణించడం సహజమే’’ అని పేర్కొన్నారు. స్వల్పకాలికంగా పెట్టుబడుల ప్రవాహంలో హెచ్చుతగ్గులనేవి కరెన్సీ స్థాయిని ప్రభావితం చేసినప్పటికీ, శాశ్వత ప్రాతిపదికన రూపాయి పెరగడానికి అవకాశాలు లేవన్నారు. ఒకవేళ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినా ఇదే స్థాయిలో కొనసాగవచ్చని చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్‌ శక్తులకు విడిచిపెట్టి, తీవ్ర ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం సరైన విధానమేనని పేర్కొన్నారు.పతనానికి మరిన్ని కారణాలు.. → ముడి చమురు ధరలు అధిక స్థాయిలో తిరుగాడుతుండటం → ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం → కరెన్సీ క్షీణతను అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ప్రయత్నాలేమీ చేయకపోవడంఆందోళన అక్కర్లేదు: సీఈఏ రూపాయి క్షీణత విషయంలో ప్రభుత్వమేమీ ఆందోళన చెందడం లేదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. దీనివల్ల ద్రవ్యోల్బణం, ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ లేదన్నారు. వచ్చే ఏడాది రూపాయి కాస్త మెరుగుపడొచ్చని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది 100 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని నాగేశ్వరన్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇది 81.04 బిలియన్‌ డాలర్లుగా ఉంది.ప్రతికూలం విదేశీ చదువులు విదేశీ టూర్లు , దిగుమతులు (రత్నాభరణాలు, ఎల్రక్టానిక్స్, ముడిచమురు, ఫార్మా రంగానికి కావల్సిన ముడిపదార్థాలు మొదలైనవి) విదేశీ లగ్జరీ కార్లు సానుకూలం ఎగుమతి ఆధారిత రంగాలు (ఐటీ పరిశ్రమ, ఆటో ఎగుమతులు, ఫార్మా, టెక్స్‌టైల్స్‌) రెమిటెన్సులు

100X multibagger Abhishek Bachchan investment portfolio6
వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే, తెర వెనుక ఒక శక్తివంతమైన వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. తాజా అంచనాల ప్రకారం, క్రీడా ఫ్రాంఛైజీల యాజమాన్యం నుంచి గ్లోబల్ బ్రాండ్‌ల్లో వ్యూహాత్మక పెట్టుబడుల వరకు విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం నికర విలువ సుమారు రూ.280 కోట్లుగా ఉంది. హరూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అమితాబ్ బచ్చన్ నేతృత్వంలోని బచ్చన్ కుటుంబం మొత్తం విలువ రూ.1,630 కోట్లుగా ఉంది.జైపూర్ పింక్ పాంథర్స్ (JPP)అభిషేక్ బచ్చన్ 2014లో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్ పాంథర్స్ (జేపీపీ) జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ పెట్టుబడి విలువ 100 రెట్లు పెరిగిందని తానే స్వయంగా వెల్లడించారు. పీకేఎల్ ప్రారంభ సంవత్సరం (2014)లోనే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఈ జట్టు రెండో సీజన్ నుంచి ఆర్థికంగా లాభదాయకంగా మారింది. పీకేఎల్ సీజన్-12 ఆక్షన్‌లో జేపీపీ రైడర్ నితిన్ కుమార్ ధంఖర్‌ను రూ.1 కోటికి కొనుగోలు చేసింది.ఫుట్‌బాల్.. చెన్నైయిన్ ఎఫ్‌సీ (CFC)కబడ్డీతో పాటు అభిషేక్‌కు ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఆసక్తితో 2014లో ఎంఎస్ ధోనీతో కలిసి చెన్నైయిన్ ఎఫ్‌సీ (ఐఎస్‌ఎల్) సహ-యాజమానిగా మారారు. 2025-26 సీజన్‌లో కూడా జట్టు పోటీ పడుతోంది. ఇటీవల అక్టోబరు 2025లో జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్‌ సూపర్ కప్‌లో క్లిఫర్డ్ మిరాండా నేతృత్వంలో పాల్గొంది.రియల్ ఎస్టేట్, స్టార్టప్ పెట్టుబడులుఅభిషేక్ బచ్చన్ తన పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆహార బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టారు. 2020 నుంచి 2024 మధ్య బచ్చన్ కుటుంబం భారతదేశవ్యాప్తంగా రూ.220 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసింది. 2024లో ముంబైలోని ఒబెరాయ్ రియల్టీస్ ఎటర్నియాలో రూ.24.95 కోట్లకు 10 అపార్ట్‌మెంట్లను (అభిషేక్ 6, అమితాబ్ 4), బోరివలిలోని ఒబెరాయ్ స్కై సిటీలో రూ.15.42 కోట్లకు 6 అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు.2015లో సింగపూర్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ ‘జిడ్డు’లో చేసిన రూ.2 కోట్ల పెట్టుబడి 2017లో లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు సమయంలో బిట్‌కాయిన్ పెరుగుదల వల్ల రూ.112 కోట్ల భారీ లాభాన్ని ఇచ్చింది. ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు ఆమోదించిన వహ్దామ్‌ టీ లేబుల్‌లో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. జెప్టో, జీక్యూ‌ఐ వంటి స్టార్టప్‌లలో కూడా పెట్టుబడి పెట్టారు.నిర్మాతగా..అమితాబ్ బచ్చన్ యాజమాన్యంలోని ఏబీ కార్ప్ (AB Corp)లో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పా (2009), షమితాబ్ (2015), ఘూమర్ (2023) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. పా చిత్రం జాతీయ అవార్డులను గెలుచుకుంది.

Advertisement
Advertisement
Advertisement