ప్రధాన వార్తలు
సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు భారత్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. యునైటెడ్ స్టేట్స్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాకుండా భారతీయులు రోజువారీ వాడే ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు కొరతతో ప్యాకేజింగ్ ఖర్చులు భారమవడంవల్ల కంపెనీలు ధరల పెంపు లేదా పరిమాణం తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్నాయి.పశ్చిమాసియా ప్రాంతం ప్యాకేజింగ్ పరిశ్రమకు కీలకంగా ఉంది. సబ్బులు, బిస్కెట్లు, డిటర్జెంట్ల ప్యాకింగ్కు వాడే పాలిమర్లు (పాలీప్రొపైలిన్, పాలిథిలిన్) నేరుగా ముడి చమురు నుంచే తయారవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా గొలుసు దెబ్బతింది.ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి 50% పాలిమర్లను దిగుమతి చేసుకున్న భారత కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చైనా, థాయ్లాండ్, సింగపూర్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ముడి చమురు ధరలు పెరగడంతో రవాణా, ముడిసరుకు సేకరణ ఖరీదైన వ్యవహారంగా మారింది.ధర పెంపు లేదా క్వాంటిటీలో కోత?వ్యాపార నిర్వహణ భారమవడంతో దిగ్గజ సంస్థలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా దీనిపై స్పందిస్తూ.. తమ మొత్తం ఖర్చులో ప్యాకేజింగ్ వాటా 15-20 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. ‘చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే చిన్న ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించడం, పెద్ద ప్యాకెట్ల ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదు’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తుల తయారీలో కీలకమైన లీనియర్ ఆల్కైల్ బెంజీన్ (ఎల్ఏబీ) ధరలు కూడా చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. డిటర్జెంట్ ముడి పదార్థాల ఖర్చులో దీని వాటా దాదాపు 50% ఉండటం గమనార్హం.జీఎస్టీ లాభాలకు గండిఈ ధరల పెంపు నిర్ణయం సామాన్య వినియోగదారుడికి భారంగా మారనుంది. గత సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సవరణల వల్ల కంపెనీలు ప్యాకెట్ల పరిమాణాన్ని పెంచి, ధరలను తగ్గించాయి. తద్వారా లభించిన ఉపశమనాన్ని ప్రస్తుత యుద్ధ వాతావరణం పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
కరుగుతోన్న ఇన్వెస్టర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు తగ్గి 23,422 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 694 పాయింట్లు దిగజారి 75,357 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.52 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.78 శాతం నష్టపోయింది.Today Nifty position 13-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
చిన్న చిట్కాలతో ప్రయోజనాలెన్నో!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ప్రభావం దేశీయంగా ఎల్పీజీ సరఫరాపై పడుతోంది. దాంతో పలు ప్రాంతాల్లో సిలిండర్ల కొరత తలెత్తుతోంది. ఈ తరుణంలో సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే గ్యాస్ పొదుపు ఒక్కటే మార్గమని కొందరు చెబుతున్నారు.వంట పద్ధతుల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా 25 శాతం వరకు గ్యాస్ ఆదా చేయవచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సూచిస్తున్నాయి. నిపుణులు చెబుతున్న స్మార్ట్ చిట్కాలు కింద చూద్దాం.మంటను తగ్గించండి..చాలామంది నీళ్లు మరిగే వరకు లేదా వంట పూర్తయ్యే వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోనే ఉంచుతారు. కానీ, నీరు ఒకసారి మరిగిన తర్వాత వేడిని తగ్గించడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. దాంతో గ్యాస్ వృధా కాదు. ఇలా సిమ్లో వండటం వల్ల 25 శాతం వరకు గ్యాస్ ఆదా అవుతుందని ఇండియన్ ఆయిల్ తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.ప్రెజర్ కుక్కర్..సాంప్రదాయ పాత్రలతో పోలిస్తే ప్రెజర్ కుక్కర్ వాడకం వల్ల చాలా సమయం, గ్యాస్ కలిసొస్తుంది. బియ్యంతో అన్నం వండేప్పుడు 20% ఆదా, పప్పు ధాన్యాలు.. 46% ఆదా, మాంసాహారం.. 41.5% ఆదా అవుతుంది.నానబెట్టడం మర్చిపోవద్దుపప్పులు, బియ్యం లేదా శనగలు వంటి గట్టి పదార్థాలను వండే ముందు కనీసం గంట సేపు నానబెట్టాలి. ఉదాహరణకు, శనగలను రాత్రిపూట నానబెట్టడం వల్ల వండేటప్పుడు 22 శాతం గ్యాస్ వినియోగం తగ్గుతుంది.మీ గ్యాస్ బర్నర్ మంట నీలి రంగులో ఉంటే అది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. ఒకవేళ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే బర్నర్ రంధ్రాల్లో చెత్త లేదా కార్బన్ పేరుకుపోయిందని అర్థం. వెంటనే వాటిని శుభ్రం చేయాలి.పాత్రలను కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే పొయ్యి మీద పెట్టకండి. ముందుగా పొడి గుడ్డతో పాత్రలు తుడిచి ఆ తర్వాతే స్టవ్ మీద పెట్టండి. ఆ నీటిని ఆవిరి చేయడానికి కూడా గ్యాస్ వృధా అవుతుందని గుర్తుంచుకోండి.చిన్న పాత్రలకు పెద్ద బర్నర్ వాడటం వల్ల వేడి పక్కల నుంచి వృధాగా పోతుంది. చిన్న బర్నర్లను ఉపయోగించడం వల్ల పెద్ద వాటితో పోలిస్తే 6% నుంచి 10% తక్కువ గ్యాస్ ఖర్చవుతుంది.పొయ్యి వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం, మసాలాలు వెతుక్కోవడం వంటివి చేయకండి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే స్టవ్ వెలిగిస్తే అనవసరపు వేచి చూసే సమయం తగ్గుతుంది.అంతర్జాతీయ పరిణామాలు గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతున్న తరుణంలో బుకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో ఇంటి బడ్జెట్ను కాపాడుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.582 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు
రూ.582 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు
రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ బ్యాంక్ మోసాలు, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి చర్యలు చేపట్టింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)లకు చెందిన రూ.581.65 కోట్ల విలువైన 31 స్థిరాస్తులను ఏజెన్సీ తాజాగా జప్తు చేసింది. తాజా చర్యతో ఈ గ్రూపునకు సంబంధించి ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.16,310 కోట్లకు చేరింది.దేశవ్యాప్తంగా విస్తరించిన ఆస్తులుతాజాగా జప్తు చేసిన 31 ఆస్తులు కేవలం ఒకట్రెండు ప్రాంతాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ భూములున్నాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు ఉత్తరాదిలో ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. రిలయన్స్ పవర్ లిమిటెడ్పై నమోదైన ఫెమా కేసు దర్యాప్తులో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.దర్యాప్తులో అంశాలుయస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రముఖ బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 2025 జులై 22న ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ విచారణలో వెలుగుచూసిన ప్రధానాంశాలు కింది విధంగా ఉన్నాయి.ఆర్హెచ్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ఎల్ సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన ప్రజా నిధుల్లో దాదాపు రూ.11,000 కోట్లకు పైగా నిధులు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారాయి.ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేని, ఆర్థిక బలం లేని డమ్మీ/షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.సేకరించిన నిధులను గ్రూపులోని ఇతర సంస్థలైన రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్ వంటి కంపెనీలకు అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయి.గ్రూప్ ప్రమోటర్లు, కీలక వ్యక్తులు దురుద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను తమ సొంత ప్రయోజనాల కోసం మళ్లించినట్లు దర్యాప్తులో స్పష్టమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.నగదు, డిపాజిట్లపై వేటుకేవలం స్థిరాస్తులే కాకుండా నగదు రూపంలో ఉన్న ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. పీఎంఎల్ఏ, ఫెమా కింద జరిపిన దాడుల్లో రూ.2.48 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ సీజ్ చేశారు. ఫెమా సెక్షన్ 37ఏ కింద రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన 13 బ్యాంకు ఖాతాల్లోని రూ.77.86 కోట్ల బ్యాలెన్స్ను ఈడీ అటాచ్ చేసింది. గతంలోనే ఆర్కామ్ సహా ఇతర సంస్థలకు చెందిన రూ.15,729 కోట్ల ఆస్తులను ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా?
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కార్పొరేట్
సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు
రూ.582 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు
ఫ్లిప్కార్ట్లో మోటోరోలా ఏసీలు
వార్ ఎఫెక్ట్: లేటెస్ట్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్.. ఐలైన్ స్టూడియో ప్రారంభం
గ్యాస్ కష్టాలు.. ఆఫీసుకు రాకండి!
ఇండిగో, ఎయిరిండియాపై ఫిర్యాదు కొట్టివేత
భారత కుబేరుల సంపద రూ.92 లక్షల కోట్లు
గ్యాస్ షార్టేజీ.. ఇండక్షన్ స్టవ్లకు గిరాకీ..
ఆయిల్ రిటైల్ కంపెనీలకు గడ్డుకాలం!
డబుల్ రిలీఫ్.. పసిడి, వెండి ప్రియులకు ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
మార్కెట్ సూచీలు నేల చూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టా...
మళ్లీ ఫోకస్లోకి ఈక్విటీ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఫిబ్రవరిలో మెరిశాయి. అం...
ఆసియా మార్కెట్లు ఢమాల్..
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడు భ...
రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు?
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా ఇ...
జీడీపీకి చిల్లు.. నెలకు 8 బిలియన్ డాలర్లు!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలతో ఇంధనాల ...
గ్యాస్ కష్టాలు.. మూతపడుతున్న రెస్టారెంట్లు!
అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణం...
బంగ్లాదేశ్కు భారత్ ఆపన్నహస్తం
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుత...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐటీ కంపెనీలూ...పారాహుషార్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళికరాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కార్యకలాపాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హెచ్చరించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా ఆపరేషనల్ సన్నద్ధతను పెంచుకోవాలని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచిస్తూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు నిలకడగానే ఉన్నప్పటికీ పరిస్థితులు దిగజారితే ఎదురయ్యే అవరోధాలను అదిగమించేందుకు కంపెనీలు క్రియాశీలకంగా తమ అత్యవసర ప్రణాళికలను పునఃసమీక్షించుకుంటున్నాయని, పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని నాస్కామ్ పేర్కొంది. కీలకమైన సరీ్వసులు దెబ్బతినకుండా సిస్టంలు పటిష్టంగా ఉండేందుకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ రూటింగ్ ఆప్షన్లను కూడా పరిశీలించాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశిచంగా పరిశీలిస్తున్నాయని వివరించింది. అనిశ్చితితో సైబర్ దాడుల ముప్పులు సాధారణంగా భౌగోళికరాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు మూకుమ్మడి సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయని నాస్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ని అమల్లోకి తేవడం, పశి్చమాసియా దేశాల్లో కార్యకలాపాలున్న థర్డ్ పార్టీ వెండార్లతో లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించింది.యుద్ధ పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అలర్టుల్లాగా మభ్యపెట్టే థీమ్లతో జరిగే సోషల్ ఇంజినీరింగ్ దాడులపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నాస్కామ్ పేర్కొంది. పశ్చిమాసియాలో పరిణామాలను తాము కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన మద్దతును అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని వివరించింది.
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే వారి కోసం రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు వినియోగదారులపై అనవసరమైన డేటా భారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.చాలా కాలంగా టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్ను డేటాతో కలిపి విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడకం లేని వారు కూడా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ‘వినియోగదారులకు తమకు నచ్చిన సర్వీసులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి’ అన్న ట్రాయ్ సూచనతో జియో రూ.1,178, రూ.448 ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది.రూ.1,178 ప్లాన్..దీర్ఘకాలిక వాలిడిటీని కోరుకునే వారికోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగమని కంపెనీ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, కేవలం కాల్స్ కోసం ఫోన్ వాడే వారికి ఇది సరైన ఎంపికని తెలిపింది. దీని వాలిడిటీ 336 రోజులు. ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం వాలిడిటీ కాలానికి 3,600 ఎస్ఎంఎస్లు పొందవచ్చు.రూ.448 ప్లాన్..మూడు నెలల కాలపరిమితితో తక్కువ బడ్జెట్లో కాలింగ్ సేవలు పొందాలనుకునే వారికి ఇది అనుకూలమని కంపెనీ చెప్పింది. వాలిడిటీ 84 రోజులు. అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అందులో ఇందులో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి యాడ్ ఆన్ సేవలకు యాక్సెస్ ఉంటుంది.డేటా కావాలంటే ఏం చేయాలి?ఈ ప్లాన్లలో ప్రాథమికంగా డేటా ఉండదు. అయితే, ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైతే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జియో తెలిపింది. నేరుగా కంపెనీ అందిస్తున్న డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!
టీమిండియా విజయం.. టెక్ దిగ్గజాల రియాక్షన్ ఇలా..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో.. న్యూజిలాండ్ను టీమిండియా ఓడించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా 255/5 భారీ స్కోరును నమోదు చేసి.. న్యూజిలాండ్ను 159 పరుగులకు ఆలౌట్ చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత.. ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జస్ప్రీత్ బుమ్రా & సంజు శాంసన్ ప్రదర్శనలను హైలైట్ చేశారు. "టీ20 ప్రపంచ కప్లో అద్భుతమైన విజయం సాధించిన టీం ఇండియాకు అభినందనలు, న్యూజిలాండ్కు ఈ రోజు అదృష్టం కలిసిరాలేదు'' అని ట్వీట్ చేశారు.Congratulations to Team India on a fantastic T20 World Cup win 🇮🇳 Tough luck today, New Zealand. @Jaspritbumrah93, once again a match winner when it mattered most. @IamSanjuSamson, what a tournament and what an impact. Absolutely incredible.— Satya Nadella (@satyanadella) March 8, 2026టీమిండియా విజయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు అభినందనలు. సెమీఫైనల్ వరకు చేరిన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీములను కూడా ప్రశంసించారు. క్రికెట్ ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరిస్తుండటం చాలా ఆనందంగా ఉందంటూ.. మంచి టోర్నమెంట్ నిర్వహించినందుకు ఐసీసీను కూడా అభినందించారు.Congrats India on winning the ICC Men's T20 World Cup! chose the wrong game to go watch:) what a stadium and atmosphere. Well played to the other semi finalists, SA, Eng and Nz!! Also so exciting to see the game expand to so many countries and congrats to ICC for a great…— Sundar Pichai (@sundarpichai) March 8, 2026
ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే!
ప్రముఖ ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో రోబోటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కైట్లిన్ కలినోవ్స్కీ (Caitlin Kalinowski) తన పదవికి రాజీనామా చేసారు.కైట్లిన్ కలినోవ్స్కీ కంపెనీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఓపెన్ఏఐ అమెరికా రక్షణ శాఖతో చేసుకున్న కొత్త ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ రూపొందించిన ఏఐ మోడళ్లను అమెరికా సైన్యానికి చెందిన రహస్య నెట్వర్క్లలో ఉపయోగించడానికి అనుమతిస్తారు.కైలిన్ కలినోవ్స్కీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జాతీయ భద్రతలో AIకి ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రజలపై న్యాయపరమైన అనుమతి లేకుండా నిఘా పెట్టడం లేదా మానవ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల అభివృద్ధి వంటి అంశాలు తగిన చర్చ లేకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని వెల్లడించారు.ఇదీ చదవండి: మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!కలినోవ్స్కీ రాజీనామాను ఓపెన్ఏఐ కంపెనీ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా కొత్త ఒప్పందం ప్రకారం.. జాతీయ భద్రత కోసం బాధ్యతాయుతంగా AIని ఉపయోగించే మార్గం ఏర్పడుతుందని, సంస్థకు కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయని కూడా వెల్లడించింది.
పర్సనల్ ఫైనాన్స్
ఎన్పీఎస్ నుంచి విత్డ్రా ఇలా..
ఆర్థికంగా ఏదైనా అవసరం వస్తే గట్టెక్కేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతాం. చివరికి ఏదో ఒక రుణమైనా తీసుకుని బయటపడదామని అనుకుంటాం. కానీ, అధిక వడ్డీ రేట్లపై అప్పులు తెచి్చ, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టే బదులు.. ఏవైనా పెట్టుబడులుంటే, వాటిని వినియోగించుకోవడం మంచిది. అలాంటి సందర్భాల్లో జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) నుంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు!. కాకపోతే దీన్ని విచక్షణ మేరకు వినియోగించుకోవాలి. ఎంత అవసరం అయినా... భవిష్యత్తు కోసం ఉద్దేశించినది కనుక వివేకంతో వ్యవహరించాలి.ఎలా వెనక్కి తీసుకోవచ్చు?ఆన్లైన్లో అయితే ప్రొటీన్ ఈగోవ్ పోర్టల్కు వెళ్లాలి. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్), పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ ఆప్షన్తో రీసెట్ చేసుకోవచ్చు.లాగిన్ అనంతరం ‘విత్డ్రాయల్’ సెక్షన్కు వెళ్లాలి. అందులో ట్రాన్సాక్ట్ ఆన్లైన్ సెక్షన్లో విత్డ్రాయల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.విత్డ్రాయల్ రకాన్ని ఎంపిక చేసుకోవాలి. రిటైర్మెంట్ లేదా పాక్షిక ఉపసంహరణ లేదా ముందస్తుగా వైదొలగడంలో ఒకదాన్ని ఎంచుకోవాలి.ఫారమ్లోని వివరాలను పూర్తిచేయాలి. ప్రాన్ను ధ్రువీకరించి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.ఈ అభ్యర్థన ఆమోదం పొందితే రెండు పనిదినాల్లో సభ్యుడి ఖాతాలో నిబంధనల మేరకు రావాల్సిన మొత్తం జమ అవుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు సమర్పణకు వీలుగా సీఆర్ఏ వెబ్సైట్ నుంచి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీ) నుంచి కూడా తీసుకోవచ్చు.పత్రంలో పాన్ వివరాలు, వ్యక్తిగత వివరాలు న మోదు చేసి, కేవైసీ డాక్యుమెంట్లు జత చేయాలి.ఈ పత్రాన్ని తీసుకెళ్లి ఏదేనీ పీవోపీలో సమరి్పంచొచ్చు. ఎన్పీఎస్ పీవోపీ మీకు సమీపంలో ఎక్క డ ఉన్నదీ గూగుల్ సెర్చ్ద్వారా తెలుసుకోవచ్చు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్ ఇలా పీవోపీలు చాలానే ఉన్నాయి.పాక్షిక ఉపసంహరణఎన్పీఎస్లో టైర్–1 ఖాతా ప్రారంభించిన మూడేళ్ల అనంతరం, మూసివేయాల్సిన అవసరం లేకుండా పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అర్హత లభిస్తుంది.సొంత చందాల మొత్తం... అంటే తాను చెల్లించిన దాని నుంచి 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యాజమాన్యం జమ చేసిన మొత్తాన్ని గానీ, పెట్టుబడులపై వృద్ధి రూపంలో పెరిగిన మొత్తాన్ని గానీ పరిగణనలోకి తీసుకోరు.జీవిత కాలంలో నాలుగు పర్యాయాలు ఇలా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఒక సారి ఉపసంహరించుకున్నాక మరో నాలుగేళ్ల తరవాత గానీ మళ్లీ ఉపసంహరించుకోలేరు.పిల్లల ఉన్నత విద్య లేదా వివాహ అవసరాల కోసం పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు.ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సైతం తీసుకోవచ్చు. అప్పటికే సొంతంగా ఇల్లు కలిగి ఉండకూడదు.సభ్యులు లేదా సభ్యుడిపై ఆధారపడిన కుటుంబీకులు తీవ్ర అనారోగ్యానికి గురై... వారి చికిత్స కోసం డబ్బు అవసరమైతే పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఖాతాపై రుణం తీసుకుని, దాన్ని తీర్చేయాలనుకున్నా కూడా పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.ఈ విషయాలను గమనించాలి..60 ఏళ్ల నాటికి లేదా 15 ఏళ్ల పాటు చందాలు జమ చేసిన తర్వాత మొత్తం నిధి రూ.8లక్షలు మించకుండా ఉంటే అందులో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి.ఎన్పీఎస్ సభ్యుడు/సభ్యురాలు మరణించినట్టయితే వారి పేరిట ఉన్న ఫండ్ను నామినీకి బదిలీ చేస్తారు.ఎన్పీఎస్ కింద గరిష్ట వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు ఇటీవలే పెంచారు. దీని ప్రకారం సభ్యులు రిటైర్మెంట్ అనంతరం తప్పుకోకుండా.. అప్పటి వరకు సమకూరిన నిధిని ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో కావాల్సినంత నెలవారీ తీసుకోవచ్చు.60 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఎన్పీఎస్లో కొనసాగే వారు సైతం పాక్షిక ఉపసంహరణ ఎంపిక చేసుకోవచ్చు. అయితే రెండు ఉపసంహరణల మధ్య కనీసం మూడేళ్ల విరామం ఉండాలి.తప్పుకోవడంసభ్యులకు 60 ఏళ్లు నిండగానే నిబంధనల ప్రకారం వారు పూర్తిగా ఈ పథకం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.ఎన్పీఎస్ నిధి అప్పటికి రూ.12 లక్షలకు మించి ఉంటే ఎలాంటి పన్ను చెల్లించకుండా మొత్తం నిధిలో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను ఇచ్చేది) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఎన్పీఎస్ నిధి ఒకవేళ రూ.8–12లక్షల్లోపు ఉంటే రూ.6 లక్షలను ఒకే విడత వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయటం... లేదంటే కనీసం ఆరేళ్ల కాలానికి సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ (ప్రతి నెలా నిరీ్ణత మొత్తం) పద్ధతిని, లేదంటే రెండింటి మిశ్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఫండ్ విలువ రూ.8 లక్షల్లోపు ఉంటే 100 శాతాన్ని ఒకే విడత ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు.సిస్టమ్యాటిక్ లంప్సమ్ విత్డ్రాయల్ (ఎస్ఎల్డబ్ల్యూ)ను సైతం ఎంపిక చేసుకోవచ్చు. 80 శాతాన్ని ఒకే విడత కాకుండా క్రమానుగతంగా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు.ముందస్తుగా వైదొలగడంఎన్పీఎస్లో 60 ఏళ్లకు ముందుగా కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా వైదొలిగే అవకాశం ఉంది.ఎన్పీఎస్ ప్రారంభించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి.ఆ సమయానికి ఉన్న నిధి నుంచి 20 శాతాన్నే ఉపసంహరించుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సిందే.మొత్తం నిధి రూ.5 లక్షలు లేదా అంత కంటే తక్కువే ఉన్న సందర్భాల్లో నూరు శాతం వెనక్కి తీసుకుని గుడ్బై కొట్టేయొచ్చు.టైర్–2 అకౌంట్ నుంచి ఉపసంహరణఈ ఖాతాలో ఉన్న నిధి మొత్తాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వేచ్ఛగా వెనక్కి తీసుకోవచ్చు.టైర్– 1 మాదిరి ఈ ఖాతా నుంచి నిధి ఉపసంహరణకు ఎలాంటి షరతులూ లేవు.టైర్ –2 ఖాతా నుంచి ఉపసంహరించుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.
ఇన్వెస్ట్ చేస్తేనే ఇంకా ముందుకు..
దేశీయంగా మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత, సంపద సృష్టి అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని ఫిన్టెక్ ప్లాట్ఫాం ఎల్ఎక్స్ఎంఈ ఫౌండర్ ప్రీతి రాఠీ గుప్తా తెలిపారు. చాలా మంది మహిళల్లో పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ మ్యుచువల్ ఫండ్స్, ఈక్విటీలు, పెన్షన్లు, లేదా బీమాలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోందని వివరించారు.చాలా మంది బంగారం, నగదు, చిట్ఫండ్స్పైనే ఆధారపడుతుంటారని, వీటిపై దీర్ఘకాలంలో రాబడులు అంతంత మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి సంబంధించి ఎల్ఎక్స్ఎంఈ–ఈవై ఉమెన్స్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఇండెక్స్ (2026) అధ్యయనం ప్రకారం భారత్కి 100కి 28.1 స్కోరు మాత్రమే లభించిందని గుప్తా చెప్పారు. బీమా లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉద్యోగం, వేతనజీవులకు మాత్రమే రూపొందించబడిన సిస్టంలు మొదలైనవి మహిళల పురోగతికి ఆటంకాలుగా ఉంటున్నాయని వివరించారు.అయితే, మహిళలు క్రమంగా ఆర్థిక భద్రతపై మరింతగా దృష్టి పెట్టే ధోరణి పెరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ నిధి, బీమా కవరేజీ, ఆర్థిక పరిజ్ఞానం, కమ్యూనిటీ మద్దతు మొదలైనవి మహిళలు పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించేందుకు, క్రమంగా సంపద నిర్మించుకునేందుకు తోడ్పడతాయని ఆమె చెప్పారు. పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 40 లక్షల కోట్ల మేర జత కాగలదని గుప్తా పేర్కొన్నారు.
PF ఖాతాలో రూ.లక్ష ఉంటే.. ఎంత వడ్డీ వస్తుందంటే?
2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును మునుపటి మాదిరిగానే 8.25 శాతం వద్దనే ఉంచారు. ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత.. వడ్డీ రేటు చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉన్నప్పుడు.. పీఎఫ్ ఖాతాలో ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత మొత్తం ఎంత వడ్డీ వస్తుందనే విషయాన్ని గమనిస్తే.. 2026 మార్చి 31 నాటికి ఖాతాలో రూ. 1 లక్ష ఉంటే రూ. 8250 (8.25 శాతం) వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 1,08,250 అవుతుంది. ఆ తరువాత ఏడాది కూడా ఇదే వడ్డీ ఉంటే.. ఆ మొత్తంపై కూడా వడ్డీ పెరుగుతుంది.ఒకవేళా రూ. 5 లక్షలు పీఎఫ్ ఖాతాలో ఉంటే.. వడ్డీ రూ.41250 జమ అవుతుంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే రూ. 82500 వడ్డీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే ఏడాది మధ్యలో అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకుంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ జమ అవుతుంది.పీఎఫ్ వడ్డీ రేటు గతంలో..నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భారీ సబ్సిడీ స్కీమ్.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆదాయ వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50 లక్షల వరకు మూలధన సబ్సిడీ పొందే అవకాశం ఉంది.సగం సబ్సిడీకేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు వ్యయంపై 50 శాతం వరకు మూలధన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.50 లక్షలుగా నిర్ణయించారు.అర్హులెవరు?ఈ పథకానికి వ్యక్తిగత రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG), సహకార సంఘాలు, సెక్షన్-8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎన్ని గాడిదలు ఉండాలంటే..గాడిదల పెంపక యూనిట్కు అర్హత పొందాలంటే కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలతో ప్రాజెక్టు ఉండాలి. స్థానిక జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేస్తోంది.సబ్సిడీ విడుదల ఇలా..ఈ సబ్సిడీని రెండు విడతలుగా విడుదల చేస్తారు. ప్రాజెక్టుకు బ్యాంకు రుణం ఆమోదం పొందిన తర్వాత మొదటి విడతను విడుదల చేస్తారు. అనంతరం గాడిదల పెంపక కేంద్రం పూర్తయి, అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీని అందిస్తారు.దేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2019లో జరిగిన 20వ పశు జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. 2012తో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు.ఒకప్పుడు గ్రామీణ రవాణా, నిర్మాణ పనుల్లో విస్తృతంగా ఉపయోగించిన గాడిదలకు యాంత్రీకరణ పెరగడంతో డిమాండ్ తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు, స్థానిక జాతులను సంరక్షించేందుకు గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


