Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Axis Bank Q4 net profit slips marginally to Rs 7071 crore1
యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ. 7,071 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,071 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 7,118 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా 0.64 శాతం మేర తగ్గింది. సమీక్షాకాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం సుమారు 5 శాతం పెరిగి రూ. 14,457 కోట్లకు చేరింది.ఒక్కో షేరుపై రూ. 1 చొప్పున డివిడెండు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలో వన్‌ టైమ్‌ ప్రాతిపదికన అదనంగా రూ. 2,001 కోట్ల ప్రొవిజనింగ్‌ చేసినట్లు బ్యాంకు తెలిపింది. అనిశ్చితి పెరిగినప్పుడు రిస్క్‌ గవర్నెన్స్‌లో పారదర్శకత, క్రమశిక్షణ పాటిస్తూ బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉండేలా చూసుకోవడంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు వివరించింది.గత ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరును కనపర్చినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ అమితాబ్‌ చౌదరి తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి మరింత ఆశావహంగా అడుగుపెడుతున్నామని, సంస్థను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతామని చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనుబంధ సంస్థ యాక్సిస్‌ ఫైనాన్స్‌కి కేదారా క్యాపిటల్‌తో కలిసి రూ. 2,250 కోట్లు సమకూరుస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. ⇒ 4వ త్రైమాసికంలో మొండిపద్దుల్లాంటి వాటికి కేటాయింపులు రూ. 3,522 కోట్లుగా ఉన్నాయి. ⇒ మార్చి 31 నాటికి బ్యాలెన్స్‌ షీట్‌ 17 శాతం వృద్ధితో రూ. 18,86,850 కోట్లకు చేరింది. కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) డిపాజిట్లు 11 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్లు 11 శాతం, టర్మ్‌ డిపాజిట్లు 16 శాతం పెరిగాయి. ⇒ మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా క్యూ3లో 39 శాతంగా ఉండగా, క్యూ4లో స్వల్పంగా పెరిగి 40 శాతానికి చేరింది. ⇒ రుణాలు 19 శాతం పెరిగి రూ. 12,33,57 కోట్లకు చేరాయి. రూ. 6,73,468 కోట్లతో మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 55 శాతంగా ఉంది. ఇందులో గృహ రుణాలు 26 శాతంగా ఉన్నాయి. స్మాల్‌ బిజినెస్‌ బ్యాంకింగ్‌ 17 శాతం, ప్రాపరీ్టపై రుణాలు 16 శాతం, వ్యక్తిగత రుణాలు 6 శాతం మేర పెరిగాయి. కార్పొరేట్‌ రుణాలు 38 శాతం వృద్ధి చెందాయి. ⇒ స్థూల మొండిబాకీలు డిసెంబర్‌ త్రైమాసికం ఆఖర్లో 1.40%గా ఉండగా 1.23 శాతానికి, నికర మొండిబాకీలు 0.42% నుంచి 0.37 శాతానికి నెమ్మదించాయి. రైటాఫ్‌ చేసిన ఖాతాల నుంచి రూ. 1,197 కోట్లు రికవర్‌ అయ్యాయి. ⇒ నాలుగో త్రైమాసికంలో స్థూల స్లిపేజీలు రూ. 4,709 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి క్యూ3లో రూ. 6,007 కోట్లుగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 4,805 కోట్లుగా ఉన్నాయి. తాజా క్యూ4లో మొండిబాకీల రికవరీ, అప్‌గ్రేడింగ్‌ రూ. 2,696 కోట్లుగా ఉంది. ఈ వ్యవధిలో దాదాపు రూ. 3,096 కోట్ల ఎన్‌పీఏలను బ్యాంకు రైటాఫ్‌ చేసింది. ⇒ పూర్తి ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్య 3,000 తగ్గి, 1.01 లక్షలకు చేరింది. డిజిటల్, టెక్నాలజీపై పెట్టుబడులతో ఉత్పాదకత పెరగడం ఇందుకు కారణం.

 India Cements posted a standalone net profit of Rs 54. 75 crore in Q4 FY262
నాలుగు రెట్లు ఎగిసిన ఇండియా సిమెంట్స్‌ నికరలాభం

ముంబై: ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ 2025–26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నికర లాభం నాలుగు రెట్లకు పైగా పెరిగి రూ.59.5 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం (వాల్యూమ్‌) పెరగడం, అలాగే అమ్మకాల ద్వారా లభించే ఆదాయం (సేల్స్‌ రియలైజేషన్‌) మెరుగుపడడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.14.67 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు 10.5% తగ్గి రూ.1,174.79 కోట్లకు దిగివచ్చాయి. సమీక్షించిన త్రైమాసికంలో దేశీయ అమ్మకాల పరిమాణం 3.12 మిలియన్‌ టన్నులుగా నమోదై, వార్షిక ప్రాతిపదికన 18% పెరుగుదల సాధించింది.నికర రియలైజేషన్‌ (అమ్మకాల ద్వారా లభించే ఆదాయం) త్రైమాసిక ప్రాతిపదికన 3.5%, వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం వృద్ధి కనబరిచింది. మొత్తం ఆదాయం 2.57% పెరిగి రూ.1,254.50 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ నష్టాలు రూ.143.69 కోట్ల నుంచి రూ.67.25 కోట్లకు తగ్గాయి. మొత్తం ఆదాయం 5.33% పెరిగి రూ.4,572.35 కోట్లకు చేరాయి.వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల మూలధన వ్యయం (క్యాపెక్స్‌) ప్రణాళికను రూపొందించినట్లు తెలిపింది. ఈ నిధులను వృద్ధి అవకాశాలు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రముఖ సిమెంట్‌ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్‌ సిమెంట్, దక్షిణ భారతదేశానికి చెందిన ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌(ఐసీఎల్‌)లో ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసింది. దీంతో 2024 డిసెంబర్‌ 24 నుంచి ఐసీఎల్‌ అ్రల్టాటెక్‌ సిమెంట్‌కు అనుబంధ సంస్థగా మారింది.

pnb-launched-upi-credit-card-how-to-link-in-telugu3
కొత్త క్రెడిట్ కార్డు.. మొబైల్ ఫోన్ ఉంటే చాలు!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ ఫిన్‌టెక్‌ కంపెనీ కివితో కలిసి యూపీఐ క్రెడిట్ కార్డ్ (UPI Credit Card) సేవలను ప్రారంభించింది. రూపే (RuPay) నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు నేరుగా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలిగింది.సాధారణంగా క్రెడిట్ కార్డులను స్వైప్ మిషన్ల వద్ద మాత్రమే వాడతాము, కానీ ఈ కొత్త విధానంతో కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్‌ను భీమ్ (BHIM) లేదా ఇతర యూపీఐ యాప్‌లకు లింక్ చేసి, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు.ఈ సదుపాయం వల్ల కస్టమర్లకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా జేబులో భౌతికమైన కార్డు లేకపోయినా, మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్రెడిట్ లిమిట్‌ను వాడుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. చిన్న తరహా వ్యాపారుల వద్ద సైతం క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉండటంతో, కస్టమర్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని బ్యాంక్ వర్గాలు భావిస్తున్నాయి.సెటప్ చేసుకోవడం ఎలా?పీఎన్‌బీ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూపే క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌లో సెటప్ చేసుకోవడం చాలా సులభం.💸 ముందుగా మీ యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి 'Add Credit Card' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.💸అక్కడ 'PNB' బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి.💸ఆ తర్వాత మీ కార్డుకు సంబంధించిన ఆరు అంకెల పిన్ సెట్ చేసుకుంటే లావాదేవీలకు సిద్ధమైనట్లే.బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ మార్పులు సామాన్య వినియోగదారుడికి నగదు కొరత లేకుండా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఎంతో దోహదపడతాయి. పీఎన్‌బీ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

uae-to-automate-50-percent-govt-services-with-ai4
ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం AIతోనే.. యూఏఈ సంచలనం!

సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో కనీసం 50 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. (UAE AI Government Services) ఈ ఘనత సాధించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించనుంది.ఈ వినూత్న విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును వేగవంతం చేయడమే కాకుండా, పౌరులకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ వినియోగం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం, డేటా విశ్లేషణలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది.ఇప్పటికే పలు కీలక సంస్కరణలుయూఏఈ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031'లో భాగంగా పలు కీలక సంస్కరణలను చేపట్టింది. అందులో భాగంగానే ఈ సరికొత్త 2028 గడువును ఖరారు చేసింది. రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలక రంగాలలో ఏఐ అల్గారిథమ్స్‌ను అనుసంధానించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Under the directives of the President of the UAE, we launch a new government model. Within two years, 50% of government sectors, services, and operations will run on Agentic AI, making the UAE the first government globally to operate at this scale through autonomous systems.AI… pic.twitter.com/53OQLe7RXl— HH Sheikh Mohammed (@HHShkMohd) April 23, 2026

bangalore-couple-first-home-buying-journey-viral-story5
బెంగళూరులో ఇంటి ఓనర్స్‌ అయిపోయాం..

సొంత ఇల్లు.. సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. అదీ ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌గా (Real Estate Market) చెప్పే బెంగళూరు నగరంలో. ఆ సొంతింటి కలని నిజం చేసుకోవడం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయో వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ జంట పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.అడుగు ముందుకు వేయడమే అతిపెద్ద సాహసం!సుమారు 18 నెలల క్రితం జెనిత్ రాయ్ చక్రవర్తి, ఆమె భర్త బెంగళూరులోని ఒక ప్రైమ్‌ లొకేషన్‌లో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి అది కొంత భారము అయినా, ఆ రిస్క్ తీసుకోవడానికే వారు సిద్ధపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంపై కనీస అవగాహన గానీ, సరైన మార్గదర్శకులు గానీ లేకపోయినా.. ధైర్యమే పెట్టుబడిగా ముందుకెళ్లారు.నిద్రలేని రాత్రులు.. ఎన్నో సందేహాలుఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదని జెనిత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే.. ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గృహ రుణాలు (Home Loans), ప్రాపర్టీ మార్కెట్ నిబంధనలు అర్థం చేసుకోవడానికి సొంతంగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ‘మేము సరైన నిర్ణయమే తీసుకున్నామా?’ అనే భయం, నిద్రలేని రాత్రులు వారిని వెన్నెంటే ఉన్నాయి.‘మేము దాదాపు శూన్యం నుంచి మొదలుపెట్టాం. ప్రతి అడుగులోనూ భయం ఉన్నా, ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా కుటుంబ సభ్యుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని జెనిత్ భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Zenith Roy Chakraborty (@zenithroyofficial)నిర్మాణంతో పాటే.. ఆత్మవిశ్వాసం కూడా!వందల సార్లు సైట్ విజిట్లు చేయడం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇలా ప్రతి దశలోనూ వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇల్లు రూపుదిద్దుకుంటున్న కొద్దీ, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. చివరకు ఆ ఇల్లు పూర్తి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు..‘ఇది ఇతరులకు కేవలం ఒక ఆస్తిలా కనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇది మా కష్టానికి, పట్టుదలకు నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరైనా కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే తమ కలను ఎలా నిజం చేసుకోవచ్చో చెప్పడానికి ఈ జంట ప్రయాణమే ఒక నిదర్శనం.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

apartment-prices-may-increase6
అపార్ట్‌మెంట్ల ధరలు పెరిగే అవకాశం!

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో (Impact of West Asia War) నిర్మాణ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. అసలే మార్కెట్‌ లేక అయోమయంలో ఉన్న బిల్డర్లకు యుద్ధం రూపంలో మరో బాంబ్‌ పేలింది. దాంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కల చెదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ రంగంలో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ వంటి ముడి చమురు, సహజ వాయువు కొరత, సరుకు రవాణాకు అంతరాయం, తగ్గిన ముడి పదార్థాల దిగుమతులు నిర్మాణ రంగాన్ని షేక్‌ చేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోఇంధన వనరులపై ఆధారపడిన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో సిమెంట్, స్టీల్, (Cement and Steel rates) అల్యూమినియం, శానిటరీ, రంగులు, ప్లంబింగ్‌ పైపులు, యూపీవీసీ వంటి గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఆయా ఉత్పత్తుల ధరలు 20–50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, డెవలపర్లు హడలెత్తిపోతుండగా, వారు ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్పత్తుల తయారీలో చమురు కీలకం..నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్‌ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు. కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. కాగా టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్‌ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ అత్యంత కీలకం∙ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది.దీంతో పీవీసీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్‌లు, శానిటరీ వేర్‌ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. మొత్తం మీద నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు చివరిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయడం తప్పనిసరి. ఫలితంగా అపార్ట్‌మెంట్ల ధరలు (Apartment Prices) చదరపు అడుగు (చ.అ.)కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.ఎన్నికల ప్రభావంనిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయంతో పాటు నిర్మాణ రంగంపై ఎన్నికల ప్రభావం కూడా పడింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించాయి. నిర్మాణ వ్యయం, వినియోగ ఖర్చులు, వడ్డీల భారం డెవలపర్లపై పడుతోంది. దీంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లకు అధిక పెట్టుబడులు అవసరం అవుతాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు కుదేలవడంతో పాటు వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

Advertisement
Advertisement
Advertisement