ప్రధాన వార్తలు
విప్రో బంపర్ బైబ్యాక్!
ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో రూ. 15,000 కోట్లు వెచ్చించనుంది. మరోపక్క క్యూ4లో నికర లాభం 2 శాతం నీరసించి రూ.3,502 కోట్లకు చేరింది. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో భారీస్థాయిలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. ఒక్కో షేరుకీ రూ. 250 ధరలో 5 శాతానికిపైగా వాటా(దాదాపు 60 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనుంది. ఇందుకు ఏకంగా రూ. 15,000 కోట్లు కేటాయించింది. గురువారం మార్కెట్ ధర రూ. 210తో పోలిస్తే 18 శాతం ప్రీమియంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టనుంది. చెల్లించిన మూలధనంలో 5.7 శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు విప్రో సీఎఫ్వో అపర్ణ అయ్యర్ తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో బైబ్యాక్ పూర్తికాగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేశారు. బైబ్యాక్లో ప్రమోటర్, సంబంధిత గ్రూప్ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2026–27) తొలి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల బిజినెస్ నామమాత్ర క్షీణత(2 శాతం) లేదా యథాతథంగా 259.7–265.1 కోట్ల డాలర్లమధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. లాభం ఫ్లాట్గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో విప్రో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 2 శాతం నీరసించి రూ. 3,502 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2025–26) ఇదే కాలంలో రూ. 3,570 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 24,236 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,504 కోట్ల టర్నోవర్ అందుకుంది. త్రైమాసికవారీగా క్యూ4లో విప్రో నికర లాభం 12 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున బలపడ్డాయి.ఇతర విశేషాలుక్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 2 శాతం వార్షిక వృద్ధితో 265.1 కోట్ల డాలర్లకు చేరింది.3 శాతం వృద్ధితో 345.5 కోట్ల డాలర్ల విలువైన బుకింగ్స్(డీల్స్) నమోదయ్యాయి.మార్చితో ముగిసిన 2025–26లో ఫ్లాట్గా రూ. 13,197 కోట్ల నికర లాభం ఆర్జించింది.మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 92,624 కోట్లను తాకింది.కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 నుంచి 2,42,156కు బలపడింది.మొత్తం 7,500 మంది ఫ్రెషర్స్ను నియమించుకుంది. క్యూ4లో 3,000 మందికి చోటిచ్చింది.లాభాలకు సవాళ్లు...లాభాలపై రాజకీయ, భౌగోళిక, పాలసీ సంబంధ సవాళ్లు ప్రభావం చూపాయి. అయితే ఐటీ వ్యయాలు నిలకడగా నమోదవుతున్నాయి. సాధారణ రీతిలోనే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్) ఫలితాలు బలహీనంగా వెలువడనున్నాయి. ఇందుకు యూఎస్ డీల్స్ ఆలస్యం, క్లయింట్ సమస్యలు ప్రభావం చూపనున్నాయి. – విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియాఐటీ దిగ్గజాల బైబ్యాక్ తీరిలావిప్రో తాజా బైబ్యాక్కు టెండర్ మార్గంలో తెరతీయనుంది. ఇంతక్రితం 2023లోనూ రూ. 12,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ చేపట్టింది. ఇక ఇన్ఫోసిస్ గతేడాది బైబ్యాక్కు రూ. 18,000 కోట్లు వెచ్చించింది. వెరసి అతి భారీ బైబ్యాక్ చేపట్టిన దేశీ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. 2023 డిసెంబర్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 17,000 కోట్లతో బైబ్యాక్ను పూర్తి చేసింది. మరో ఐటీ కంపెనీ సైయెంట్ సైతం బైబ్యాక్ ప్రతిపాదన పరిశీలనకు ఈ నెల 23న బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం!ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
పీఎఫ్సీలో మెజారిటీ వాటాకు సై
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ఎన్బీఎఫ్సీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ)లో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకునే యోచనలో ఉంది. విద్యుత్ రంగ పీఎస్యూ దిగ్గజాలు పీఎఫ్సీతోపాటు.. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)లో పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం పీఎఫ్సీలో ఆర్ఈసీ విలీనాన్ని చేపట్టనుంది. అయితే అతిపెద్ద పీఎస్యూ ఎన్బీఎఫ్సీ దిగ్గజంగా ఆవిర్భవించనున్న విలీన సంస్థలో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకోవాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు అనుగుణంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రమోటర్గా 51 శాతం వాటాను కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వానికి పీఎఫ్సీ ప్రిఫరెన్స్ షేర్ల జారీసహా.. వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకున్న మరో అవకాశం ప్రభుత్వానికి కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకాగా.. తద్వారా మెజారిటీ వాటాను నిలుపుకోవచ్చని తెలియజేశారు. ప్రభుత్వ వాటా ఇలా కంపెనీల చట్టం ప్రకారం పీఎస్యూగా గుర్తించేందుకు చెల్లించిన మూలధనంలో ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటా ఉండాలి. ప్రస్తుతం పీఎఫ్సీలో ప్రభుత్వ వాటా 55.99 శాతంకాగా.. ఆర్ఈసీలో 52.63 శాతం వాటా కలిగి ఉంది. రెండు సంస్థలలోనూ మిగిలిన వాటా సాధారణ వాటాదారుల(పబ్లిక్) వద్ద ఉంది. 2025 డిసెంబర్31కల్లా పీఎఫ్సీ కన్సాలిడేటెడ్ లోన్ అసెట్ బుక్ రూ. 11.51 లక్షల కోట్లను తాకగా.. ఆర్ఈసీ రూ. 5.82 లక్షల కోట్ల అసెట్ బుక్ను కలిగి ఉంది. విద్యుత్ రంగ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ సౌకర్యాలు కల్పించే పీఎఫ్సీ 20 శాతం మార్కెట్ వాటాను ఆక్రమిస్తోంది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్ఈసీ ఫైనాన్సింగ్ సర్వీసులు అందించే సంగతి తెలిసిందే.
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు మార్చిలో భారీగా పెరిగాయి. 11,73,168 టన్నులుగా ఉన్నట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) తెలిపింది. గతేడాది మార్చి నెలలో దిగుమతులు 10,45,281 టన్నులతో పోల్చితే 12 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు (ఎడిబుల్ ఆయిల్) పెరగడం, రవాణా చార్జీలు కూడా అధికమైనందున, రానున్న నెలల్లో దిగుమతులు తగ్గొచ్చని ఎస్ఈఏ పేర్కొంది. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గుముఖం పట్టడం లేదంటే రూపాయి విలువ బలోపేతం అయ్యే వరకు దిగుమతులు పెరగకపోవచ్చని ఎస్ఈఏ అంచనా. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులను తటస్థం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించొచ్చని పేర్కొంది. → అత్యధికంగా ముడి పామాయిల్ (శుద్ధి చేయని) దిగుమతులు దాదాపు రెట్టింపు స్థాయిలో 6,73,965 టన్నులుగా ఉన్నాయి. 2025 మార్చిలో పామాయిల్ దిగుమతులు 3,43,949 టన్నులుగా ఉండడం గమనార్హం. → నాన్ ఎడిబుల్ నూనెల దిగుమతులు మాత్రం క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 27,742 టన్నుల నుంచి 13,401 టన్నులకు తగ్గాయి. నాన్ ఎడిబుల్ అంటే ఆహార వినియోగానికి పనికిరానివి. వీటిల్లో మలినాలు, హానికారకాలు ఎక్కువగా ఉంటుంటాయి. సబ్బుల్లో, లూబ్రికెంట్లలో, ఫార్మాస్యూటికల్స్ తయారీలో వీటిని వినియోగిస్తుంటారు. → వెజిటబుల్ నూనెల దిగుమతులు 11 శాతం పెరిగి 11,86,569 టన్నులుగా ఉన్నాయి. సోయా, సన్ఫ్లవర్, పీనట్, కార్న్, కనోలా ఇవన్నీ వెజిటుబల్ ఆయిల్స్ కిందకు వస్తాయి. వీటితో సహా వంటకు వినియోగించే అన్ని రకాల నూనెలను ఎడిబుల్ ఆయిల్స్గా పేర్కొంటారు. → 2025–26 మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 8 శాతం పెరిగి 65,72,131 టన్నులకు చేరాయి. ఏటా నవంబర్తో మొదలై మరుసటి సంవత్సరం అక్టోబర్తో ఇది ముగుస్తుంటుంది. నెలవారీగా తగ్గుముఖం.. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే మార్చిలో వంట నూనెల దిగుమతులు పెరిగినప్పటికీ.. అంతక్రితం నెలతో (ఈ ఏడాది ఫిబ్రవరి) పోల్చి చూస్తే మాత్రం దిగుమతులు 10 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో దిగుమతులు 12.92 లక్షల టన్నులుగా ఉన్నాయి. పామాయిల్ను ఇండోనేషియా, మలేషియా నుంచి.. సోయాబీన్ ఆయిల్ను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. మొత్తం అవసరాల్లో సగానికి పైనే దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
పెరిగిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు మార్చి నెలలో స్వల్పంగా పెరిగి 5.1 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 4.9 శాతంగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా పెరిగింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్లు నిండిన పట్టణ జనాభాలో నిరుద్యోగం ఫిబ్రవరిలో ఉన్న 6.6 శాతం నుంచి మార్చిలో 6.8 శాతానికి చేరింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగగా, గ్రామీణ పురుషుల్లో స్వల్పంగా పెరిగింది. కార్మికుల భాగస్వామ్య రేటు మార్చి నెలకు 55.4 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 55.9 శాతంగా ఉండడం గమనార్హం. జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి మార్చిలో 52.6 శాతం వద్ద స్థిరంగా కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో 55.5 శాతం, పట్టణాల్లో 46.8 శాతంగా ఉండడం గమనార్హం.
ఆతిథ్యం, ఎయిర్లైన్స్పై వార్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 తర్వాత నుంచి చూస్తే 15–20 శాతం మేర విదేశీ పర్యాటకులు తగ్గిపోయారు. దీని ఫలితంగా ఒక్క ఎయిర్లైన్స్ రంగమే రూ.18,000 కోట్ల వ్యాపారాన్ని నష్టపోతుందన్నది అంచనా. అతిథ్య పరిశ్రమపైనా ప్రభావం ఉంటుందని తాజాగా విడుదలైన ఒక నివేదిక అంచనా వేసింది. విమాన ప్రయాణాలను రద్దు చేసుకోవడం, గగనతలంపై ఆంక్షలతో అంతర్జాతీయ ఎయిర్లైన్ సర్వీసులు మార్గాలను మార్చుకుని వెళ్లాల్సి వస్తుండడం ఇవన్నీ ఎయిర్లైన్స్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. దీని ఫలితంగా ప్రయాణ సమయం 2–4 గంటలు పెరుగుతోందని, ఇంధన, నిర్వహణ ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తోందని ఈ నివేదిక అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తతను అనుసరిస్తున్నారు. తమ పర్యటలను వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు సుదూర ప్రాంతాల కంటే థాయ్లాండ్, సింగపూర్, వియత్నాం వంటి తక్కువ దూరంలోని ప్రాంతాలకు వెళ్లి రావడానికే మొగ్గు చూపుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. రెస్టారెంట్లకూ కష్టాలు.. రెస్టారెంట్, ఫుడ్ సర్వీసెస్ (ఆహార విక్రయ సంస్థలు) సంస్థలు సైతం పశ్చిమాసియా యద్ధం తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా వీటి వ్యయాలు 10–15 శాతం మేర పెరిగాయి. దిగుమతి చేసుకుంటున్న ముడి పదార్థాలు, రవాణా, ఇంధన ధరలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అంచనా. ముఖ్యంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో సమస్యలు రెస్టారెంట్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నట్టు ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ సాగర్ దర్యాని తెలిపారు. 10 శాతం రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయని, 60–70 శాతం రెస్టారెంట్లు ఇండక్షన్ కుకింగ్, ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లినట్టు పేర్కొన్నారు. పరిమిత సరఫరా నేపథ్యంలో మెనూ తగ్గించుకుని, తక్కువ సమయం పాటు కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఉపాధిపైనా ప్రభావం.. రెస్టారెంట్ల రంగంలో రోజువారీ రూ.2,650 కోట్ల కార్యకలాపాలు కొనసాగుతుంటాయని ఈ నివేదిక పేర్కొంది. అంటే నెలవారీ రూ.79,000 కోట్లు. ఈ రంగంలో 85 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎక్కువ కాలం పాటు ఈ ప్రతికూలతలు కొనసాగితే 5–7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. అంతేకాదు రెస్టారెంట్ల విస్తరణపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. కాగా, ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు గాను.. మరిన్ని అంతర్జాతీయ మార్గాలకు ఎయిర్లైన్స్ కార్యకలాపాలను విస్తరించడంతోపాటు, ఎంఎస్ఎంఈలకు మరింత సులభంగా రుణాలు అందేలా చూడాలని ఈ నివేదిక సూచించింది. దేశీ పర్యాటకం మెరుగ్గానే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పర్యాటకం తిరిగి పూర్వపు స్థితికి రావడానికి మరో 6 నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వోల్వో కీలక ప్రకటన: రూ.లక్ష వరకు పెరగనున్న ధరలు!
వోల్వో కార్ ఇండియా.. 2026 మే 1 నుంచి తమ కార్ల ధరలను లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు ధృవీకరించింది. ఇటీవల పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఆడి, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ఇతర లగ్జరీ బ్రాండ్లు కూడా ధరలను సర్దుబాటు చేయవలసి వస్తున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.వోల్వో భారత పోర్ట్ఫోలియోలో నాలుగు ప్రధాన మోడళ్లు ఉన్నాయి. అవి EX30, EC40, XC60, XC90. ప్రతి మోడల్కు సంబంధించిన నిర్దిష్ట ధరల పెంపులను కంపెనీ వెల్లడించనప్పటికీ, అన్ని వేరియంట్ల ధరలను గరిష్టంగా రూ.1 లక్షకు పరిమితం చేయనున్నట్లు సమాచారం.కొత్త ధరలు మే 1వ తేదీ నుంచి బుకింగ్లు, డెలివరీలకు వర్తిస్తాయి. అంటే అంతకు ముందు బుక్ చేసుకున్న లేదా కొనుగోలు చేసే కార్లకు పాత ధరలే వర్తిస్తాయి. కాగా వోల్వో కార్ ఇండియా దేశవ్యాప్తంగా 23 షోరూమ్లు మరియు 25 సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ను నిర్వహిస్తోంది.
కార్పొరేట్
విప్రో బంపర్ బైబ్యాక్!
ఆతిథ్యం, ఎయిర్లైన్స్పై వార్ ఎఫెక్ట్
పీఎఫ్సీలో మెజారిటీ వాటాకు సై
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!
విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్
ఇన్ఫోసిస్కు బ్రాండ్ అంబాసిడర్గా అల్కరాజ్
కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
టీసీఎస్ నాసిక్ కేసు : మరో కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్.. సీఈఓ వివరణ
బీబీసీలో 2,000 మంది ఉద్యోగులపై వేటు!
1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కద...
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గ...
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ఇరాన్ - అమెరికా యుద్ధం ఎ...
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత...
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ...
డ్రాగన్కు యుద్ధం దెబ్బ!
ప్రపంచ ఆర్థిక గమనానికి దిక్సూచిగా భావించే చైనా వాణ...
‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే క...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏళ్ల తరబడి ఉన్న యాప్ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.ఏమిటీ మార్పు? ఎందుకు?ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.వినియోగదారులపై ప్రభావం ఇలా..మే 25 తర్వాత మీ ఫోన్లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్లుక్ మొబైల్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఇప్పుడేం చేయాలి?అంతరాయం లేని అవుట్లుక్ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్లుక్ లైట్ యాప్లోనే అప్గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్లుక్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్మెంట్లు ఆటోమేటిక్గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్కు మారడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!
మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..
సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డీయాక్టివేట్ చేయడం ఇలా.. ➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్కు వెళ్లండి➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.Reporting death and deactivation of Aadhaar of a deceased family member helps in preventing the misuse of their Aadhaar.Report death on myAadhaar Portal: https://t.co/4k2YjTw4BM#Aadhaar #UIDAI #ReportDeath #AadhaarDeactivation pic.twitter.com/jELeDN2EIu— Aadhaar (@UIDAI) April 10, 2026
వంటగది కోసం.. ప్రత్యేక గ్యాడ్జెట్స్!
వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్లో, తక్కువ శ్రమతో స్టయిలిష్గా పూర్తి చేసే గాడ్జెట్లు మీకోసం!స్ప్రే టచ్! మీ కిచెన్లో టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా కంట్రోల్లో ఉండాలంటే ఈ స్మార్ట్ ఆయిల్ స్ప్రేయర్ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్ మ్యాజిక్ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్ ఫ్రయ్యర్లో చికెన్ రోస్ట్ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్ కూడా తగ్గుతుంది! సలాడ్స్ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!వంటింట్లో ఆర్గానిక్ ఫామ్!బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్ మేకర్! ఇందులో ఉన్న స్మార్ట్ ‘నాబ్’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్మెంట్ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!స్నాక్ పార్ట్నర్!సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్ డిష్ నట్ బౌల్!ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్ టైమ్ను క్లీన్గా, స్టయిలిష్గా మార్చే చిన్న మ్యాజిక్ బౌల్! ఇందులో డబుల్ డిష్ బౌల్స్ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్ నట్స్ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే!
గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై భారీ తగ్గింపు!
ఖరీదైన స్మార్ట్ఫోన్లు ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తాయా?.. అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పిక్సెల్ 10 మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 55వేల కంటే తక్కువ ధరకు లభించనుంది.ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999 ఉండగా.. దానిని తగ్గింపుతో రూ. 74,999కు అందుబాటులో ఉంచింది. అంటే ప్రారంభంలోనే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది కాకుండా.. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే వెంటనే రూ. 4,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా భారీ తగ్గింపు పొందవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా గరిష్టంగా రూ.52,000 వరకు తగ్గింపు పొందవచ్చు.ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత పిక్సెల్ 7 ఎక్స్చేంజ్ చేసుకుంటే.. 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ లభించవచ్చు. అదనంగా మరో 5000 ఇతర డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ రూ. 55,000 కంటే కూడా తక్కువకు లభించే అవకాశం ఉంది.గూగుల్ పిక్సెల్ 10గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజిని పొందుతుంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ లభిస్తుంది. ఏఐ బేస్డ్ పనులను నిర్వహించడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. డిస్ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్తో వస్తుంది, ఇది మంచి క్లారిటీ ఇస్తుంది. అలాగే 4970 యాంపియర్ బ్యాటరీ ఉండటం వల్ల సాధారణ వినియోగంలో ఒక రోజు మొత్తం సులభంగా పనిచేస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
దీర్ఘకాలిక ప్రణాళికలకు దక్షిణాది ఓటు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్పైనే..
ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఇన్వెస్టింగ్పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్ని అందిస్తున్నట్లు వివరించింది.2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్ 50 ఫండ్ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్ క్యాప్ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు.
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి.
సక్సెస్కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.డైవర్సిఫికేషన్ ప్రధానం పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.ఒడిదుడుకులు.. వ్యూహాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం సాధారణంగా సరైన ఫండ్ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు.


