Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Laid Off but Not Worried Oracle Techie Finds Stability Driving Uber1
'ఒరాకిల్‌'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?

ఓ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. చాలామంది ఉద్యోగులు భయపడతారు, బాధపడతారు. కానీ ఒరాకిల్ కంపెనీ తొలగించిన ఒక ఉద్యోగి మాత్రం ఇందుకు భిన్నం. ఉబెర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నా సన్నిహితులలో ఒకరిని ఒరాకిల్ బెంగళూరు సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించింది. అతడు ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి లోను కాకపోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆ విషయాలను వెల్లడించలేదు. జాబ్ కోల్పోయిన తరువాత వెంటనే తన సొంత ఊరైన భువనేశ్వర్‌కు తిరిగి వచ్చేశాడు.అయితే.. అతనికి రెండు జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో.. ఒక్కొక్కదానిలో రూ.15 లక్షల చొప్పున పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకున్నాడు. ఒకటి అతని తల్లిదండ్రుల పేరు మీద, మరొకటి అతని, అతని భార్య పేరు మీద ఉంది. అతని పిల్లల ఖాతాలో కూడా ఒకటి ఉంది. వీటన్నింటి ద్వారా అతనికి ప్రతి నెలా దాదాపు రూ.28,000 వడ్డీ వస్తుంది.పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాకుండా.. అతనికి కొన్ని బ్యాంకులలో దాదాపు రూ.30 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వీటి ద్వారా అతనికి నెలకు మరో రూ.15,000 వస్తుంది. అతను ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ వచ్చు, కాబట్టి అతను వెంటనే తనకు వీలైనప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మంచి సంపాదన పొందుతున్నాడు.ఇదీ చదవండి: ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే!అతనికి ఈఎంఐలు లేవు, ఏ మెట్రో నగర ఫ్లాట్‌కు లోన్స్ లేవు. అదే సమయంలో, అతను తన తల్లిదండ్రుల సహాయంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రశాంతంగా ప్రణాళిక వేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరించలేదు, SIPలు చేయలేదు, ఆర్థిక హడావుడికలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా పాత పద్ధతుల మనస్తత్వం, స్థిరమైన ప్రక్రియ, క్రమశిక్షణ.కాబట్టి.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. జాబ్ ఉన్నా.. లేకున్నా మీ ఆర్ధిక క్రమ శిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో సిద్ధంగా ఉండటమే నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం అని నాయక్ సత్య అనే ట్విటర్ యూజర్ ఈ విషయాలు షేర్ చేశారు.One of my close friends was fired from Oracle Bangalore.No panic, no stress, and no crying on social media. He straight away came back to his hometown Bhubaneswar He had postal fixed deposits in two joint accounts ₹15 lakh each. One with his parents, and the other in his…— Nayak Satya (@NayakSatya_SG) April 5, 2026

Gold Prices Surge Within Hours Sharp Rise Seen Across Major Indian Cities2
గంటల వ్యవధిలో.. మారిపోయిన గోల్డ్, సిల్వర్ రేటు!

బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లలో చాలా మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం రూ.1,36,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,38,100 రూపాయల వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,130 నుంచి రూ.1,50,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో బంగారం ఉదయం అమాంతం తగ్గి.. సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,50,660 రూపాయల దగ్గర నుంచి 1,52,620 రూపాయల వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,100 నుంచి రూ.1,39,900 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150810 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,38,250 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఉదయం ధరలు స్థిరంగా ఉండటం చేత రూ.2.55 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు మళ్లీ దూసుకెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది.

Small Savings Scheme Interest Rates Remain Unchanged for April June 2026 Quarter3
స్మాల్‌ సేవింగ్స్‌ వడ్డీ రేట్లు ఇలా..

చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–27 సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వివిధ స్కీమ్‌లపై ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం..➤ సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం➤ పీపీఎఫ్‌: 7.1 శాతం➤ సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు: 4 శాతం➤ కిసాన్‌ వికాస్‌ పత్ర: 7.5 శాతం➤ నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్: 7.7 శాతం➤ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌: 7.4 శాతం➤ సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌: 8.2 శాతం➤ ఏడాది టైమ్‌ డిపాజిట్‌: 6.9 శాతం➤ రెండేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7 శాతం➤ మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7.1 శాతం➤ ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7.5 శాతం➤ ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ): 6.70 శాతం

Take A Photo Get Your Reward MoRTH Tweet4
పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!

కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు వస్తుండటంతో.. భారతదేశ రాహదారి వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే జాతీయ రహదారులలో పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి.. రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ట్వీట్‌లో.. MoRTH 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్'ను ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల గురించి తెలియజేయమని ప్రయాణికులను కోరింది. ఒకవేళ వినియోగదారుడు అపరిశుభ్రమైన మరుగుదొడ్లను గమనిస్తే.. దాని ఫోటోను రాజమార్గయాత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఇలా చేస్తే.. వారికి రూ. 1,000 ఫాస్ట్‌ట్యాగ్ క్రెడిట్ లభిస్తుంది. ప్రజా మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో భాగంగా.. జాతీయ రహదారులపై పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం.If you come across an unclean toilet at a toll plaza, upload its photograph on the Rajmargyatra app. On verification, you will receive a reward of ₹1,000 FASTag credit. The Clean Toilet Picture Challenge is genuine and officially supported. Your participation helps improve… pic.twitter.com/vLFSs2qcAu— MORTHINDIA (@MORTHIndia) April 6, 2026

Strait of Hormuz Sees Record Ship Traffic Amid West Asia War5
ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు

పశ్చిమాసియాలో యుద్ధ భయాల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి వద్ద అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్ వంటి ఇంధన అవసరాలు అధికంగా ఉన్న దేశాలు ఇరాన్‌తో జరిపిన చర్చలు సఫలం కావడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.రెండు రోజుల్లో 21 నౌకల ప్రయాణంగత వారాంతంలో ఈ జలమార్గం గుండా ఏకంగా 21 నౌకలు ప్రయాణించాయి. మార్చి మొదటి వారంలో ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ 21 నౌకలలో 13 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రంలోకి చేరుకున్నాయి. ఇరాన్ నౌకల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ మిత్రదేశం అనే కారణంతో ఇరాక్ ముడి చమురు ట్యాంకర్లకు టెహ్రాన్ ప్రత్యేక మినహాయింపునిచ్చింది. భారతదేశం ఇరాన్‌తో జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఎనిమిది ఎల్‌పీజీ ట్యాంకర్లు ఈ మార్గం ద్వారా సురక్షితంగా బయటపడ్డాయి.అగ్రరాజ్యం హెచ్చరికలుయుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని, ఆ దేశానికి నరకం చూపిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. నౌకల ప్రయాణంపై టోల్ వసూలు చేసే ప్రక్రియను చట్టబద్ధం చేస్తూ కొత్త నిబంధనలను తీసుకువస్తామని చెప్పింది. యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఈ రుసుములతోనే భర్తీ చేస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారత్, చైనా, గ్రీస్‌, టర్కీ, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన నౌకలు ఇరాన్ సూచించిన తీర ప్రాంత మార్గాల గుండా ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. అయినప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య రంగాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

Unique Indian Railway Station Requires Passport and Visa Know The Details6
ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే!

ఇండియన్ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 8,500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సాధారణంగా.. ఈ స్టేషన్లలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం చేస్తారు. అయితే.. ఒక రైల్వే స్టేషన్ మాత్రం.. అక్కడికి వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్ట్, వీసా అవసరం. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇది నిజం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ సమీపంలో 'అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్'.. భారతదేశంలో చివరి రైల్వే స్టేషన్‌గా పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ స్టేషన్ ద్వారా పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్తారు. అందువల్ల.. ఈ స్టేషన్‌లో ప్రవేశించాలంటే భారతీయ పౌరులు కూడా తప్పనిసరిగా పాకిస్తాన్ వీసా కలిగి ఉండాలి.ఇక్కడ రూల్స్ అన్నీ కూడా చాలా కఠినంగా అమలు చేస్తారు. ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ స్టేషన్‌లోకి ప్రవేశిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫారిన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించినవారికి జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేషన్‌ను సందర్శించాలనుకునే వారు ముందుగానే అన్ని అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!ఈ స్టేషన్ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తుంది. ఇది భారతదేశం, పాకిస్తాన్ మధ్య ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అయితే, కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ రైలు కొన్ని సందర్భాల్లో నిలిపివేయడం కూడా జరిగింది. అటారి స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి. ఇక్కడ కూలీలు కూడా ఉండరు. కాబట్టి ప్రయాణికులు తమ లగేజ్ తామే మోసుకోవాల్సి ఉంటుంది. అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ చిన్నదే అయినప్పటికీ.. మంచి సౌకర్యాలతో ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement