Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Suzuki Marks 20 Years in India and Crosses 10 Million Production Milestone1
భారత్‌లో 20 ఏళ్లు.. ఉత్పత్తిలో కోటి!

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను పరిచయం చేయడం, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలపై నూతన దృష్టి సారించడం వంటివి చేయడం వల్ల కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ.. మొత్తం 10 మిలియన్ల ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మైలురాయిని దాటినట్లు అధికారికంగా ప్రకటించింది. స్థిరమైన వినియోగదారుల డిమాండ్.. నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణల మద్దతుతో, గత నాలుగేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని సంస్థ వెల్లడించింది.సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుతం పటిష్టమైన సరఫరాదారుల వ్యవస్థ మద్దతుతో, భారతదేశం అంతటా 1,200కు పైగా టచ్‌పాయింట్‌లతో కూడిన విస్తృత నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. భారతదేశంలో దీని ప్రయాణం 2006లో సుజుకి హీట్ 125 మరియు సుజుకి జీయస్ 125 వంటి మోటార్‌సైకిళ్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2007లో సుజుకి యాక్సెస్ 125ను విడుదల చేశారు. ఈ మోడల్ అమ్మకాలలో కీలక పాత్ర పోషించి, 125cc స్కూటర్ విభాగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సహాయపడింది.ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!కాలక్రమేణా..సుజుకి గిక్సర్ సిరీస్, సుజుకి వి-స్ట్రోమ్ SX వంటి మోటార్‌సైకిళ్లతో పాటు, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్, సుజుకి అవెనిస్ వంటి ఉత్పత్తులతో సుజుకి తన పోర్ట్‌ఫోలియోను మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. సుజుకి హయబుసా, సుజుకి GSX-8R వంటి దాని ప్రీమియం మోడళ్లు, వివిధ విభాగాలలో దాని ఉనికిని మరింత బలోపేతం చేశాయి.

Small but Smart Gadgets That Make Life Easier Every Day2
పరిమాణం కొంచెం.. పనులు ఘనం!

చూడటానికి చిన్నగా ఉంటాయి కాని, పని మొదలుపెడితే పెద్ద పెద్ద టెన్షన్లనే తగ్గిస్తాయి. చూడటానికి చిన్నగా ఉంటూ, ఎక్కువ సౌలభ్యం అందిస్తూ, మీ టైమ్‌ను సేవ్‌ చేసే స్మార్ట్‌ గాడ్జెట్లే ఇవి!చల్లని గాలి, మీతోనే ఎక్కడికైనా!వేసవిలో విపరీతమైన చెమటతో ఇబ్బంది పడుతున్నారా? చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరగడం కష్టంగా ఉందా? అయితే ఈ పోర్టబుల్‌ మినీ బ్లేడ్‌లెస్‌ ఫ్యాన్ ఒక స్మార్ట్‌ సొల్యూషన్! ఇది చిన్నదైనా, చల్లని గాలిని ఎప్పుడైనా, ఎక్కడైనా అందించేలా పనిచేస్తుంది. ఈ ఫ్యాన్‌లో మూడు స్పీడ్‌ సెట్టింగ్స్‌ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు. బ్లేడ్లు లేకుండా డిజైన్ చేసినందువల్ల జుట్టు చిక్కుకునే భయం ఉండదు. పైగా ఇది మెడకు లేదా నడుముకు క్లిప్‌ చేసుకునేలా ఉండటంతో చేతులు ఫ్రీగా ఉంటాయి. బయట పనులు చేసుకుంటున్నప్పుడు, ట్రావెల్‌లో లేదా ఆఫీసులో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ ఫ్యాన్ ఒకసారి చార్జ్‌ చేస్తే ఎనిమిది గంటల పాటు చల్లని గాలిని అందిస్తుంది. ధర రూ. 4,160.చిన్న ప్రింటర్‌! ప్రతి చిన్న ప్రింటౌట్‌ కోసం జిరాక్స్‌ షాపుకు వెళ్లకుండా.. మీ చేతిలోనే ఒక చిన్న స్మార్ట్‌ ప్రింటర్‌ ఉంటే ఎంత బాగుంటుంది! ఈ మినీ బ్లూటూత్‌ థర్మల్‌ ప్రింటర్‌ ఉంటే జిరాక్స్‌తో పని ఉండదు. స్టూడెంట్స్‌కు ఇంట్లో వాడుకోవడానికి, చిన్న చిన్న ప్రింటౌట్లు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్‌ చాయిస్‌. మొబైల్‌తో బ్లూటూత్‌ ద్వారా సులభంగా కనెక్ట్‌ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్, స్టిక్కర్స్‌ లేదా చిన్న ఫోటోలను కొన్ని సెకండ్లలోనే ప్రింట్‌ చేసుకోవచ్చు. ఇంక్‌ అవసరం లేకుండా థర్మల్‌ టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పైగా దీనిని జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చార్జ్‌ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చు. చదువుకునే పిల్లలకు, చిన్న నోట్స్‌ ప్రింట్‌ చేసుకునే వారికి లేదా రోజువారీ పనులను సులభం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక స్మార్ట్‌ హెల్పర్‌లా ఉంటుంది. ధర రూ. 1,799.చార్జ్‌ కూడా.. స్టాండ్‌ కూడా!మొబైల్‌ను చార్జ్‌ చేస్తూనే వీడియోలు, సీరియల్స్‌ చూడాలా? లేదా గేమ్స్‌ ఆడాలా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ టూ ఇన్‌ వన్ స్మార్ట్‌ చార్జర్‌ కేబుల్‌. ఇది కేవలం కేబుల్‌ మాత్రమే కాదు, చిన్న స్టాండ్‌లా కూడా పనిచేసే స్మార్ట్‌ ఐడియా. ఈ కేబుల్‌లో బిల్టిన్ ఫోల్డబుల్‌ స్టాండ్‌ ఉంటుంది. కేబుల్‌ పెట్టగానే మొబైల్‌ సూటిగా నిలబడేలా సౌకర్యంగా ఉంటుంది. పైగా దీనికున్న ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో మొబైల్, టాబ్లెట్‌ లేదా ఇతర పరికరాలను వేగంగా చార్జ్‌ చేయవచ్చు. బలమైన నైలాన్ మెటీరియల్‌తో తయారైన ఈ కేబుల్‌ ముడిపడకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఇంటి వద్ద, ఆఫీస్‌లో లేదా ట్రావెల్‌లో ఎక్కడైనా సులభంగా వాడుకోవచ్చు. ధర కేవలం రూ. 791 మాత్రమే!

ICF vs LHB Coaches Which Is Safer and Better for Passengers3
ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు: ఏది సేఫ్? ఏది బెస్ట్?

రైళ్ల గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ వీటి పరిణామ క్రమం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కథనంలో భారతీయ రైల్వేలోని కోచ్‌ల గురించి తెలుసుకుందాం.ఐసీఎఫ్ కోచ్‌లుభారతీయ రైల్వేలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లు పాత సాంకేతికతను ఉపయోగిస్తాయి. వీటిని 1952 నుంచి చెన్నైలోని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇవి నీలం రంగులో ఉంటాయి, స్టీల్‌తో నిర్మితమై ఉంటాయి. ఈ కారణంగా.. వీటి బరువు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు అధికం, ప్రయాణికుల సామర్థ్యం తక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు ఒకదానిపై ఒకటి టెలిస్కోప్‌లాగా ఎక్కేస్తాయి. దీనివల్ల ఊహకందని నష్టం జరుగుతుంది.ఐసీఎఫ్ కోచ్‌లలో.. స్లీపర్ క్లాస్‌లో 72 బెర్త్‌లు, థర్డ్ ఏసీ క్లాస్‌లో 64 బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. ఇవి LHB కోచ్‌ల కంటే 1.7 మీటర్లు పొట్టిగా ఉంటాయి. వీటిలో ప్రయాణీకుల సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి చాలా బరువుగా ఉండటం వల్ల.. రైలు వేగం కూడా తక్కువగా ఉంటుంది.ఐసీఎఫ్ కోచ్‌లకు ప్రతి 18 నెలలకు ఒకసారి పూర్తిస్థాయి మరమ్మత్తు అవసరం. కాబట్టి వీటికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం, ఐసీఎఫ్ రేక్‌లతో కూడిన 740 రైళ్లు నడుస్తున్నాయి, వీటన్నింటినీ 2029 నాటికి పూర్తిగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుఇక ఎల్‌హెచ్‌బీ (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు లేటెస్ట్ జర్మన్ సాంకేతికత ఆధారంగా నిర్మితమయ్యాయి. వీటిని 2000వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. పంజాబ్‌లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో వినియోగిస్తారు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితమై ఉండటం వల్ల.. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో.. స్లీపర్ క్లాస్‌లో 80 బెర్త్‌లను, థర్డ్ ఏసీ క్లాస్‌లో 72 బెర్త్‌లు ఉంటాయి. ఇవి ICF కోచ్‌ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలవు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్వహణ కూడా తక్కువే. వీటికి 24 నెలలకు ఒకసారి మరమత్తులు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు, LHB కోచ్‌లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవు. ప్రయాణికులకు భద్రతను అందిస్తుంది. కాబట్టి అన్ని విధాలా ఈ కోచ్‌లు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

Covacent Technologies Partners with Google Cloud4
గూగుల్‌ క్లౌడ్‌తో కోవాసెంట్‌ జట్టు

కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ తాజాగా గూగుల్‌ క్లౌడ్‌తో చేతులు కలిపింది. జెమిని ఎంటర్‌ప్రైజ్‌ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.తమ ఏజెంట్‌ మేనేజ్‌మెంట్‌ సూట్‌ని జెమిని ఎంటర్‌ప్రైజ్, గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ సీఈవో శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.

Why Has Russia Sold 22000 Kgs of Gold in 20265
భారీగా బంగారం అమ్మేసిన రష్యా!

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.పాశ్చాత్య దేశాల ఆంక్షలురష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.లోటు బడ్జెట్!2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తిప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

Pop Star Rihanna Joins the Ambani Family for an Intimate Cultural Lunch6
అంబానీ ఇంటికి పాప్ స్టార్ రిహన్నా..

ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రిహన్నా భారత పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ ఇంటికి వచ్చారు. తన బృందంతో కలిసి అంబానీ కుటుంబాన్ని వారి నివాసంలో కలిశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన మధ్యాహ్న విందులో ఆమె పాల్గొన్నారు.ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ దంపతులు స్వయంగా రిహన్నాకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రిహన్నాకు భారతీయ నృత్య రీతులు, సంప్రదాయ కళలు, మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను అంబానీ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విందులో రిహానా భారతీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఇక్కడి సంప్రదాయాల పట్ల తన ఆసక్తిని కనబరిచారు.రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో రిహానా తన సొంత బ్యూటీ బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ'(Fenty Beauty) ప్రమోషన్ కోసమే ఆమె భారత్‌కు వచ్చారు. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలో కేవలం తీరా (Tira) సెఫోరా (Sephora) స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. View this post on Instagram A post shared by Bollywood Bubble Television (@bollywoodbubbletelly)

Advertisement
Advertisement
Advertisement