Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US leaves India-headquartered International Solar Alliance after Trump order1
అమెరికా తప్పుకున్నా భారత్‌ ముందుకే 

న్యూఢిల్లీ: అమెరికా వైదొలిగినప్పటికీ, మిగిలిన 125 దేశాలతో కలసి భారత్‌ అంతర్జాతీయ సోలార్‌ కూటమిని ముందుకు నడిపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌(ఐఎస్‌ఏ) అన్నది భారత్, ఫ్రాన్స్‌ సంయుక్త సహకారంతో ఏర్పడిన కూటమి. సౌర ఇంధన పరిష్కారాలతో వాతావరణ మార్పులపై పోరాటం కోసం ఏర్పాటైన సంస్థ. 2015లో పారిస్‌లో కాప్‌21 సదస్సు సందర్భంగా దీనికి బీజం పడింది. ఐక్యరాజ్యసమితిలోని అన్ని దేశాలూ ఇందులో చేరేందుకు అనుమతి ఉంది. ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. వీటిల్లో భాగస్వామ్యం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. ఐఎస్‌ఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు వచి్చన మీడియా నివేదికలు ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టు అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన దేశాలతో కూటమి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశాయి. సౌర విద్యుత్‌ అభివృద్ధి, నిధుల సమీకరణ, సామర్థ్యం ఏర్పాటుపై కృషి కొనసాగుతుందని చెప్పాయి. భారత్‌ అధ్యక్షత వహిస్తున్న ఐఎస్‌ఏలో ఇప్పుడు 125 సభ్య దేశాలుగా ఉన్నాయి. సోలార్‌ ఇంధన సామర్థ్యం విస్తరణలో సభ్య దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కూటమి దృష్టి సారిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఎస్‌ఏ ఏర్పాటైన నాటి నుంచి సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే విషయంలో ఎంతో కృషి జరగడం గమనార్హం.

Women apprenticeships rise as structured training expands2
అప్రెంటిస్‌షిప్‌ పట్ల మహిళల్లో ఆసక్తి 

న్యూఢిల్లీ: అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన రెండేళ్ల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టు టీమ్‌లీజ్‌ – గాన్‌ గ్లోబల్‌ నివేదిక వెల్లడించింది. లింగపరమైన అంతరాలను తగ్గించడంలో నిర్మాణాత్మక శిక్షణా కార్యక్రమాలు పోషిస్తున్న పాత్రను ఈ నివేదిక గుర్తు చేసింది. అలాగే, నైపుణ్యాలను పొందడంలో, దేశవ్యాప్తంగా సమ్మిళిత శ్రామికశక్తి భాగస్వామ్యానికి అనుకూలిస్తున్నట్టు తెలిపింది. 2021–22లో మహిళా అప్రెంటిస్‌లు (శిక్షణార్థులు) 1,24,000 మంది ఉంటే, 2023–24 నాటికి 1,96,914కు పెరిగారు. గత దశాబ్ద కాలంలో వెయ్యికి పైగా సంస్థల్లో 10 లక్షల మందికి పైగా అప్రెంటిస్‌ల డేటాను ఈ నివేదిక పరిశీలించింది. అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాలు సంఘటిత శ్రామికశక్తిలో మహిళలు పాల్గొనే చేస్తున్నాయని.. ఐటీ, బీపీఎం, రిటైల్, ఆటోమోటివ్, ఎల్రక్టానిక్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, పర్యాటకం, ఆతిథ్యం, ఆహార శుద్ధి, లైఫ్‌ సైన్సెస్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్‌ రంగాల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌ టాప్‌ మహిళా అప్రెంటిస్‌లలో 2024లో 42 శాతం మందికి హైదరాబాద్‌ కేంద్రంగా నిలిచింది. ఆ తర్వాత కోల్‌కతా, చెన్నైలోనూ వీరి భాగస్వామ్యం పెరిగింది. అయితే అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనే విషయమై కొన్ని సంస్థలు సవాళ్లను చూస్తున్నాయి. 38 శాతం సంస్థల్లో అసలు మహిళా అప్రెంటిస్‌లే లేరు. మరో 26 శాతం సంస్థల్లో వీరి భాగస్వామ్యం 1–10 శాతం మించి లేదని టీమ్‌లీజ్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. కేవలం 2 శాతం సంస్థల్లోనే మహిళల ప్రాతినిధ్యం 50 శాతాన్ని మించడం గమనార్హం. కనుక మహిళలు మరింత పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లకి‡్ష్యత కార్యక్రమాలు, స్థిరమైన దృష్టి అవసరమని ఈ నివేదిక అభిప్రాయపడింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ జీడీపీలో వారి వాటా 18 శాతంగానే ఉందని, అందులోనూ అధిక శాతం మహిళలు సంఘటిత ఉపాధికి బయట ఉన్నట్టు ఈ నివేదిక ఎత్తి చూపింది. పైగా పనిచేసే వయసులోని మహిళల్లో 60 శాతం మంది అసలు పాలు పంచుకోవడం లేదు. 15–29 ఏళ్ల వయసు మహిళల్లో శ్రామిక భాగస్వామ్య రేటు 29 శాతంగానే ఉంది. అదే 15–59 ఏళ్ల వయసు వారిలో ఇది 45 శాతంగా, మొత్తం మీద అన్ని వయసుల్లోని మహిళల్లో 31.7 శాతం మించిలేదు. 2047 నాటికి మహిళ కారి్మకుల సంఖ్య 25.5 కోట్లకు చేరుకుంటుందని.. వీరి భాగస్వామ్యం 45 శాతానికి పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ‘‘అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాల్లో మహిళలు చేరడం గత మూడేళ్లలో 58 శాతం పెరిగింది. అయినప్పటికీ మొత్తం అప్రెంటిస్‌లలో వీరి వాటా 20 శాతంకంటే తక్కువగానే ఉంది. అంటే గణనీయమైన శక్తి సామర్థ్యాలను ఇంకా వెలుగుతీయాల్సి ఉంది’’అని టీమ్‌లీజ్‌ డిగ్రీ అప్రెంటిస్‌షిప్‌ సీఈవో నిపున్‌ శర్మ తెలిపారు.

Reliance Jio Rs 91 Recharge Plan Details3
జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!

దేశీయ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.కంపెనీ పరిచయం చేసిన ఈ లేటెస్ట్ రూ. 91 ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 50 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశ్యంతో.. జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది.ఇతర రీఛార్జ్ ప్లాన్స్!రూ.3,599 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్‌ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్: లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.

Water Costs More Than Milk And Petrol in Venezuela Know The Reason4
పెట్రోల్ కంటే.. పాలు, నీళ్ల ధరలే ఎక్కువ!.. ఎక్కడంటే?

ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలుగొందిన వెనెజువెలా.. నికోలస్ మదురో అరెస్టు తర్వాత తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరిపోయాయి. పెట్రోల్ ధరల కంటే.. వాటర్ బాటిల్, పాలు ధరలు ఎక్కువైపోయాయి.ధరలు ఇలా..ఒక లీటరు పెట్రల్: రూ. 45.10ఒక లీటరు పాలు: రూ. 160.60ఒక లీటరు వాటర్ బాటిల్: రూ. 223.70ఒక లీటరు వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాగు నీరు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ కరెన్సీకి విలువ తగ్గిపోవడం వల్ల.. లావాదేవీలు కూడా కష్టతరం అయిపోయింది.వెనెజువెలా ఆర్ధిక పతనానికి కారణాలు➤వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి.. ఎక్కువగా చమురుపైనే ఆధారపడటం.➤నైపుణ్యం లేనివారికి పదవులు కట్టబెట్టడం వల్ల, నిర్వహణ లోపాలు తలెత్తాయి.➤ఆదాయం లేకపోవడంతో.. ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించింది. దీనివల్ల దేశ కరెన్సీ ఎక్కువైంది. విలువ పెరిగిపోయింది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

Nitin Gadkari Says About India 3rd Economy Country5
మూడో ‘ఆర్థిక శక్తి’గా భారత్‌ ఎదగాలంటే..

భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులను పెంచుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. సీఎస్‌ఐఆర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కారణంగా వెలువడే కాలుష్యాన్ని నిరోధించొచ్చన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 15 శాతం కలపడం ద్వారా ఏడాదిలో 4,500 కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చని చెప్పారు.ఇటీవలే జపాన్‌ను దాటేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం తెలిసిందే. రహదారుల నిర్మాణంలో బయో బిటుమన్‌ను (పెట్రోలియం రహిత) వినియోగించడం 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దిశగా పరివర్తనాత్మక అడుగుగా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్య పరంగా బయో బిటుమన్‌ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం భారత్‌ అని చెప్పారు. ఇది రైతుల జీవితాలను మార్చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందన్నారు.వ్యవసాయం, నిర్మాణ రంగ సామగ్రి తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లెక్స్‌ ఇంజన్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించాలని కోరారు. హైడ్రోజన్‌ రవాణా అన్నది పెద్ద సమస్యగా పేర్కొంటూ.. ఈ విషయంలో భారత్‌ ఇంధన ఎగుమతిదారుగా అవతరించాలన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్‌ రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

How To Get Discounts On Train Tickets Know The Details Here6
ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

సంక్రాంతి పండుగ వచ్చేసింది. నగరాల్లో ఉండేవారంతా దాదాపు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ..రైల్‌వన్ యాప్ (RailOne) ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపు మోడ్‌లను ఉపయోగించి RailOne యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లపై మాత్రమే తగ్గింపు పొందవచ్చు.రైల్‌వన్ యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఎలా➤గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా ఈ సూపర్‌ యాప్‌ ‘Railone’ను డౌన్‌లోడ్‌ చేయాలి.➤యాప్‌ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్‌ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్‌ చేసుకోవాలి.➤యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత లాగిన్‌, న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌, గెస్ట్‌ అనే ఆప్షన్లు వస్తాయి.➤కొత్తగా రిజిస్టర్‌ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేస్తే.. రైల్‌ కనెక్ట్‌, యూటీఎస్‌ అని రెండు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో లాగిన్‌ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్‌ కావొచ్చు. లేదంటే ➤కొత్తంగా వివరాలు ఎంటర్‌ చేసి సైనప్‌ చేయాల్సి ఉంటుంది.➤సైనప్‌ కోసం మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేయాల్సి.➤మీ పూర్తి పేరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.➤ఓటీపీ, ఎంపిన్‌ ఇచ్చి అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్‌ వెరిఫికేషన్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ లేదా డివైజ్‌ లాగిన్‌ వివరాలు ఇవ్వాలి.మూడు శాతం డిస్కౌంట్ కోసం..👉🏻ఇప్పటికే మీరు ఇన్‌స్టాల్‌ చేసుకున్న RailOne యాప్.. లాగిన్ అవ్వాలి. 👉🏻ప్రాథమిక వివరాలు (పేరు, ఇతర వివరాలు) నమోదు చేసుకోవాలి.👉🏻అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కోసం ఎంపికను సెలక్ట్ చేసుకుని.. ప్రయాణ తేదీని, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఆ స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 👉🏻డిజిటల్ మోడ్‌ (యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీకు డిస్కౌంట్ లభిస్తుంది.👉🏻చెల్లింపు పూర్తయిన తరువాత.. టికెట్ యాప్‌లోనే జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల కోసం దాన్ని మీ ఫోన్‌లో చూపించవచ్చు.రైల్‌వన్‌ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్‌, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement
Advertisement