Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Jaiprakash Gaur Backs Adani Group in Bid for Insolvent JAL Acquisition1
దివాలా తీసిన జేఏఎల్‌ కొనుగోలు.. అదానీకే ‘జై’!

న్యూఢిల్లీ: దివాలా తీసిన తమ సంస్థ జేఏఎల్‌ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్‌ వైపై జేపీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జైప్రకాశ్‌ గౌర్‌ మొగ్గు చూపారు. గౌతమ్‌ అదానీ సారథ్యంలో గ్రూప్‌ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్‌ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్‌ పేర్కొన్నారు.ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్‌ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్‌లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్‌ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ ఆరోపించిన నేపథ్యంలో గౌర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్‌లో జేఏఎల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్‌ బిడ్‌కు గతేడాది నవంబర్‌లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (అలహాబాద్‌ బెంచ్‌) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్‌ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్‌సీఎల్‌ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్‌సీఎల్‌టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది.

India's Forex Reserves Rebound to $697.12 Billion2
పసిడి, ఫారెక్స్‌ నిల్వలు పెరిగాయ్‌..

న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్‌ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్‌ డాలర్లు పెరిగి 697.121 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్‌ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్‌ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.ఏప్రిల్‌ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్‌ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్‌ డాలర్లు పెరిగి 120.742 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

ONGC Chief Warns of Risk in Heavy Dependence on West Asia for Fuel Supplies3
మన ఆయిల్, గ్యాస్‌.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం

న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన సరఫరాల కోసం పశ్చిమాసియా దేశాలపై అధికంగా ఆధారపడడంపై అప్రమత్తత అవసరమని ఓఎన్‌జీసీ చైర్మన్, సీఈవో అరుణ్‌ కుమార్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌ తన చమురు దిగుమతుల్లో సగం మేర, గ్యాస్‌ అవసరాల్లో 30 శాతం, ఎల్‌పీజీ అవసరాల్లో 85–90 శాతాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచి సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు.పశ్చిమాసియాలో సంఘర్షణల కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అరుణ్‌ కుమార్‌ సింగ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం నెలకొంది. పశ్చిమాసియా మనకు సమీపంలో ఉండడంతో అక్కడి వనరులను సులభంగా పొందొచ్చనుకోవడాన్ని కొంత సందేహంగానే చూడాలన్నారు. ఇంధన భద్రతపై పీఎన్‌జీఆర్‌బీ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ క్రమం మారుతోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన భద్రతపై దీర్ఘకాలం నుంచి ఉన్న అంచనాలు మారిపోతున్నాయంటూ హెచ్చరించారు. కనుక దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఆయిల్, గ్యాస్‌ ఉన్నా.. ఎంత ఖర్చు అయినా దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటూ.. సంక్షోభంలో మనకు ఎవరూ సాయం చేయరన్నారు. అలాగే, దేశంలో ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

Maruti Suzuki Plans Four More EVs by 20314
హైదరాబాద్‌లో ఒకే రోజు 108 ఈ-విటారా కార్లు డెలివరీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టనుంది. అప్పటికి బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహన (బీఈవీ) విభాగంలో అగ్రస్థానానికి చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్‌లో ఒకే రోజున 108 ఈ–విటారా వాహనాలను డెలివరీ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.కమోడిటీల ధరలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు వివరించారు. అయితే, పెంపు పరిమాణం ఎంత, ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 44 దేశాలకు 25,000 పైచిలుకు ఈ–విటారా వాహనాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలను ఇంకా మదింపు చేయాల్సి ఉందన్నారు. దేశీయంగా హైదరాబాద్‌లో అత్యధికంగా 14.5 శాతం స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఉంటోందని ఆయన చెప్పారు.తెలంగాణవ్యాప్తంగా 256 చార్జింగ్‌ పాయింట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 5 కి.మీ.కి ఒకటి చొప్పున 119 ఉన్నాయని వివరించారు. కస్టమర్లలో ముందుగా రేంజిపరమైన ఆందోళన తొలగించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాకే విద్యుత్‌ వాహనాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్‌ కార్‌ ఆవిష్కరణలో కొంత జాప్యం జరిగినట్లు పార్థో బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఎక్స్‌క్లూజివ్‌ చార్జింగ్‌ పాయింట్లు ఉండగా 2030 నాటికి లక్షకు పైగా పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్ల నెట్వర్క్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు.

Womens Loan Portfolio Hits Rs 76 Lakh Crore5
‘ఆమె’ తీసుకున్న లోన్లు రూ.76 లక్షల కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నపాటి అవసరాల కోసం రుణాలు తీసుకోవడానికే పరిమితమైన వనితలు .. ఇప్పుడు వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల రుణ పోర్ట్‌ఫోలియో అక్షరాలా రూ.76 లక్షల కోట్లకు చేరిందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో మహిళల వాటా ఏకంగా 26 శాతానికి ఎగబాకింది.నీతి ఆయోగ్‌ సీఈఓ నిధి చిబ్బర్‌ న్యూఢిల్లీలో విడుదల చేసిన ‘ఫ్రమ్‌ బారోవర్స్‌ టు బిల్డర్స్‌: ఉమెన్‌ అండ్‌ ఇండియాస్‌ ఎవాల్వింగ్‌ క్రెడిట్‌ మార్కెట్‌‘ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌ (డబ్ల్యూఈపీ), ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్, మైక్రోసేవ్‌ కన్సల్టింగ్‌ (ఎంఎస్‌సీ) సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2017 నుంచి చూస్తే మహిళలకు ఇచి్చన రుణాల పరిమాణం 4.8 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం రుణాలు పొందడం మాత్రమే కాకుండా, అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గుణాత్మకంగా మారుతోందని వెల్లడించింది.పరుగులు పెడుతున్న వృద్ధి .. 2017 డిసెంబర్‌ నుంచి 2025 డిసెంబర్‌ మధ్య కాలంలో క్రియాశీలక మహిళా రుణగ్రహీతల సంఖ్య 9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదు చేసింది. మహిళల్లో రుణ విస్తృతి 19 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం రుణ మార్కెట్‌లో 16 కోట్ల మంది యాక్టివ్‌ మహిళా రుణగ్రహీతలు ఉన్నారు. 2017లో రూ.16 లక్షల కోట్లుగా ఉన్న వీరి బకాయిలు, 2025 నాటికి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో రుణ అర్హత కలిగిన 45 కోట్ల మంది మహిళలు ఉండగా, భవిష్యత్తులో ఈ మార్కెట్‌ మరింతగా విస్తరించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.మైక్రోఫైనాన్స్‌ నుంచి అప్‌గ్రేడ్‌ .. చిన్నపాటి మైక్రోఫైనాన్స్‌ రుణాలతో మొదలుపెట్టిన మహిళలు ఆ తర్వాత మంచి క్రెడిట్‌ హిస్టరీ సాధించి క్రమంగా రిటైల్, కమర్షియల్‌ రుణాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న మైక్రోఫైనాన్స్‌ రుణగ్రహీతల్లో 19 శాతం మంది రిటైల్‌ లేదా కమర్షియల్‌ లోన్స్‌ కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ ’కస్టమర్‌ గ్రాడ్యుయేషన్‌’లోనూ దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధికంగా తమిళనాడులో 27 శాతం మంది మహిళలు పెద్ద రుణాల వైపు అప్‌గ్రేడ్‌ అవ్వగా, కర్ణాటకలో ఈ రేటు 20 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న బలమైన క్రెడిట్‌ వ్యవస్థకు ఇది నిదర్శనమని నివేదిక స్పష్టం చేసింది.డిజిటల్‌ అండతో సత్వర రుణాలు: కేరళ కేస్‌ స్టడీ డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ), అధికారిక రుణ వ్యవస్థల కలయికతో ఆర్థిక భాగస్వామ్యం సులభతరమైందని నీతి ఆయోగ్‌ సీఈఓ నిధి చిబ్బర్‌ పేర్కొన్నారు. గుర్తింపు, చెల్లింపులు, అండర్‌రైటింగ్, లోన్‌ సరీ్వసింగ్‌ వంటి అంశాల్లో డిజిటలైజేషన్‌ పెరగడం వల్ల మహిళలకు రుణాలు త్వరగా మంజూరవుతున్నాయి. ప్రధాన వినియోగ విభాగాల్లో అదే రోజు రుణం మంజూరు (సేమ్‌–డే అప్రూవల్స్‌) ఏకంగా 45 శాతానికి చేరింది. గ్రామీణ మహిళా వ్యాపారుల డిజిటల్‌ ప్రయాణంపై అధ్యయనం చేసిన బృందం.. కేరళలో పలు ఆసక్తికర విషయాలు గుర్తించింది.కేరళలోని గ్రామీణ మహిళా వ్యాపారుల్లో 38 శాతం మంది మహిళలు.. ’సమయాభావం’ తమ వ్యాపార వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని వెల్లడించారు. ఇంటి బాధ్యతలు, వ్యాపారం రెండింటినీ చూసుకోవాల్సి రావడం వల్ల డిజిటల్‌ టూల్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని వారు తెలిపారు. అయినా సరే కొందరు గ్రామీణ వ్యాపారులు వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, పింటెరెస్ట్‌ వంటి డిజిటల్‌ టూల్స్‌ ఉపయోగించి మార్కెటింగ్‌ చేసుకుంటున్న తీరును నివేదిక కేస్‌ స్టడీలుగా ప్రచురించింది. భవిష్యత్తులో ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళలు అధికారిక ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ వైపు మళ్లడం, వివిధ రుణ విభాగాల్లో చురుకుగా పాల్గొనడం భారత్‌ ఆర్థిక ముఖచిత్రంలో ఒక అర్థవంతమైన మార్పని డబ్ల్యూఈపీ మిషన్‌ డైరెక్టర్‌ అన్నా రాయ్‌ తెలిపారు. దాదాపు 16 కోట్ల మంది యాక్టివ్‌ మహిళా రుణగ్రహీతల డేటాతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 161 మంది మహిళా నానో–ఎంటర్‌ప్రెన్యూర్ల ప్రైమరీ రీసెర్చ్‌ ఆధారంగా ఈ నివేదికను సమగ్రంగా రూపొందించారు. వ్యాపార రుణాల్లో దక్షిణాది హవా .. వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2022–2025 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్‌ క్రెడిట్‌ వృద్ధి రేటు 17 శాతంగా ఉండగా, మహిళా వ్యాపారుల రుణాల వృద్ధి రేటు ఏకంగా 31 శాతంగా నమోదైంది. 2017 నుంచి చూస్తే వ్యాపార రుణాల బకాయిల పరిమాణం 7.5 రెట్లు పెరిగింది. ఈ విభాగంలో దక్షిణాది రాష్ట్రాలు బలమైన ముద్ర వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్‌ రుణాలు తీసుకున్న మహిళల్లో ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే 15 శాతం మంది ఉండగా, కర్ణాటక వాటా 9 శాతంగా ఉంది. అయితే వృద్ధి రేటు పరంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్‌ (59%), ఉత్తరప్రదేశ్‌ (42%) వేగంగా దూసుకెళ్తున్నాయని నివేదిక తెలిపింది.

India Online Retail Market Crosses 65 Billion Dollars in 20256
క్విక్‌–కామర్స్‌లో భారత్‌ హవా!

న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. 2025లో ఈ మాధ్యమం ద్వారా అమ్ముడైన ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 65–66 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని బెయిన్‌ అండ్‌ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. విలువపరంగా 19–21 శాతం వృద్ధి నమోదైందని రిపోర్టు పేర్కొంది. ఈ క్రమంలో క్విక్‌–కామర్స్‌ విభాగానికి సంబంధించి ప్రపంచంలోనే భారత్‌ అగ్రగామిగా ఎదిగినట్లు వివరించింది. ఈ–కామర్స్‌ జీఎంవీలో దాదాపు 16–17 శాతం ఈ క్విక్‌ కామర్స్‌ ద్వారానే వచి్చనట్లు తెలిపింది. ఇది చైనా సహా చాలా మార్కెట్లలో నమోదైన దానికంటే అధికమని వివరించింది. ఆన్‌లైన్‌ షాపింగ్, అందుకోసం చేసే వ్యయం పెరుగుతుండటంతో ఏటా 20 శాతం వృద్ధితో 2030 నాటికి భారత ఈ–రిటైల్‌ మార్కెట్‌ 170–180 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. → స్థూల ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో గతేడాది పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. జీఎస్‌టీ కోతలు, ఆదాయ పన్నుపరమైన ఊరట, నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర సానుకూలాంశాలతో ప్రైవేట్‌ వినియోగం పెరిగింది. 2022–24 మధ్య 8 శాతంగా ఉన్న ప్రైవేట్‌ వినియోగం 2025లో 10.5 శాతానికి చేరింది. 2026 తొలి త్రైమాసికంలోనూ ఇదే ఊపు కొనసాగడంతో 23–25 శాతం వృద్ధి చెందింది. → గత రెండేళ్లుగా క్విక్‌ కామర్స్‌ విభాగం రెట్టింపయ్యింది. 2025లో ఈ సెగ్మెంట్‌ జీఎంవీ 10–11 బిలియన్‌ డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో 2030 నాటికి ఇది 65–70 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అదనంగా నమోదయ్యే ఈ–రిటైల్‌ జీఎంవీలో దీని వాటా 45–50 శాతానికి చేరొచ్చు. అప్పటికి మొత్తం ఆన్‌లైన్‌ షాపింగ్‌లో సంప్రదాయ ఈ–రిటైల్‌ విభాగం వాటా 60–65 శాతంగా ఉండవచ్చు. → అంతర్జాతీయంగా వినియోగానికి భారత్‌ కీలక చోదకంగా నిలుస్తోంది. వచ్చే అయిదేళ్లలో వినియోగంపై అదనంగా వెచి్చంచే ప్రతి 8 డాలర్లలో భారత్‌ వాటా 1 డాలరుగా ఉండనుంది. → గతేడాది ఈ–రిటైల్‌ మార్కెట్‌ భారీగా వృద్ధి చెందినా, ఆఫ్‌లైన్‌ మాధ్యమాన్ని ప్రాధాన్యతను కొట్టిపారేసేందుకు వీలు లేదు. మెజారిటీ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికీ ఇది కీలకంగా ఉంటోంది. దీని దన్నుతోనే 2030 నాటికి మొత్తం రిటైల్‌ పరిశ్రమ 1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుంది. → గడిచిన అయిదేళ్లలో భారత్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్‌ రెట్టింపయ్యింది. షాపింగ్‌ చేసే వారి సంఖ్య 2025లో రెట్టింపయ్యి 29–30 కోట్లకు చేరింది. విక్రేతల వ్యవస్థ విస్తరించడం (గత అయిదేళ్లలో మూడు రెట్లు), భౌగోళికంగా మరిన్ని ప్రాంతాల్లోకి సేవలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడుతోంది. → జెన్‌ జెడ్‌ తరం కీలకంగా మారింది. ఈ–రిటైల్‌ షాపర్స్‌లో వీరి వాటా 40–45 శాతంగా ఉంటోంది. 2025లో అదనంగా వచ్చి ఈ–రిటైల్‌ ఆర్డర్లలో 50 శాతం ఈ వర్గం నుంచే వచ్చింది. లైఫ్‌స్టయిల్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్‌ తదితర కేటగిరీలవ్యాప్తంగా ఈ విభాగం కస్టమర్ల షాపింగ్‌ ప్రాధాన్యతలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. సోషల్‌ మీడియా, వీడియోలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం, సత్వర రుణ సదుపాయం వినియోగించుకోవడం ఎక్కువగా ఉంటోంది. → ఇంటర్నెట్‌ యూజర్లలో షాపింగ్‌ చేసే వారి సంఖ్య 25–30 శాతంగానే ఉన్నప్పటికీ (మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో ఇది 45–50 శాతంగా ఉంది), గతేడాది అదనంగా నమోదైన ఆన్‌లైన్‌ ఆర్డర్లలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 50 శాతంగా ఉంది. → పరిశ్రమ గణనీయంగా ఎదుగుతున్నప్పటికీ భారత్‌లో ఇప్పటికీ ఈ–రిటైల్‌ విస్తరణ చాలా తక్కువగానే జీడీపీలో 1.6 శాతం మాత్రమే ఉంది. అదే చైనాలో 13–14 శాతంగా, ఇండొనేషియాలో 4–4.5 శాతంగా ఉంది. ఇంటర్నెట్‌ యూజర్లలో 30 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. చైనాలో ఇది 92 శాతంగా, అమెరికాలో 74 శాతంగా ఉంది. ఇవన్నీ భారత్‌లో ఈ రంగం మరింత వృద్ధి చెందడానికి గల అవకాశాలను సూచిస్తున్నాయి. → వచ్చే అయిదేళ్లలో ఈ–రిటైల్‌ మార్కెట్‌ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టనుంది. క్యూ–కామర్స్‌ ఇందుకు దన్నుగా నిలవనుంది. నిత్యావసరాలు, అలాగే డిస్క్రెషనరీ ఉత్పత్తులకు సంబంధించి సౌకర్యవంతమైన మాధ్యమంగా క్యూ–కామర్స్‌ నిలుస్తోంది. ప్రస్తుతం 200 పైగా నగరాల్లో 7,000 పైగా మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్స్‌ పని చేస్తున్నాయి. భారీ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ వల్ల లాభదాయకత మెరుగుపడింది. అయితే, టాప్‌ మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో దీని వినియోగం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు.

Advertisement
Advertisement
Advertisement