ప్రధాన వార్తలు
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్కమ్మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 76,631.65 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 23,775.10 వద్ద నిలిచాయి.ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రీతి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అక్షర్ స్పిన్టెక్స్ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, రుషిల్ డెకార్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
కొత్త లుక్లో టైగన్ ఫేస్లిఫ్ట్: డిజైన్, ఫీచర్స్ ఇలా..
ఫోక్స్వ్యాగన్ కంపెనీ భారత మార్కెట్లో ఎట్టకేలకు టైగన్ ఫేస్లిఫ్ట్ ఆవిష్కరించింది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటేస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్లిఫ్ట్ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీలోని కొత్త హెడ్లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది. అల్లాయ్ వీల్స్కు కూడా ఒక కొత్త డిజైన్ ఉంది.కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ను కూడా అందిస్తుంది.వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్లిఫ్ట్ 'హలో వోక్స్వ్యాగన్' వాయిస్ అసిస్ట్ను కూడా పొందుతుంది, ఇది ఏసీ కంట్రోల్స్, మ్యూజిక్ మరియు మరిన్ని ప్రాథమిక ఫంక్షన్లను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. 6 ఎయిర్బ్యాగ్లు, మల్టీ-కొలిజన్ బ్రేక్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాగా ఈ ఎస్యూవీ ధరలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్లో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ల మధ్య ఎంపికలను అందిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ వచ్చేసింది..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తాజాగా తన పాపులర్ ఎస్యూవీ క్రెటాలో 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition)ను లాంచ్ చేసింది. వేసవి కాలానికి సరికొత్త హంగులతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.వేరియంట్లు, ధరల వివరాలుఈ సమ్మర్ ఎడిషన్ ప్రధానంగా ఎంట్రీ లెవల్ EX ట్రిమ్ నుండి టాప్-ఎండ్ SX ట్రిమ్ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ. 12.06 లక్షలు (EX వేరియంట్) కాగా టాప్-ఎండ్ ధర రూ. 17.89 లక్షలు (SX ట్రిమ్). ఇవే కాకుండా S(O), S(O) నైట్ (Knight) ట్రిమ్లలో కూడా ఈ సమ్మర్ ఎడిషన్ లభిస్తుంది.కొత్తగా చేరిన ఫీచర్లు ఇవే!డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్ను పోలి ఉన్నప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడానికి హ్యుందాయ్ ఇందులో పలు అదనపు ఫీచర్లను జోడించింది.EX (O) వేరియంట్: ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ స్టీల్ వీల్స్, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, పొజిషనింగ్ ల్యాంప్లు ఉన్నాయి. అదనంగా రియర్ విండో సన్షేడ్, డైనమిక్ గైడ్లైన్స్తో కూడిన రియర్ కెమెరా సౌకర్యం ఉంది.S(O) & S(O) నైట్ ఎడిషన్: ఈ వేరియంట్లలో భద్రత కోసం డాష్ క్యామ్ (Dashcam)ను ప్రత్యేకంగా అందించారు. అలాగే 10.25 అంగుళాల మల్టీ-డిస్ప్లే డిజిటల్ క్లస్టర్ కూడా ఆకర్షణగా నిలుస్తుంది.SX ప్రీమియం: టాప్ వేరియంట్లో సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.ఇంజిన్, పెర్ఫార్మెన్స్హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.5-లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్లో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ను కంపెనీ అందించడం లేదు. ట్రాన్స్మిషన్ పరంగా చూస్తే, కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా MT (మాన్యువల్), iVT, AT (ఆటోమేటిక్) గేర్బాక్స్ ఎంపికలను ఎంచుకోవచ్చు.
వజ్రాల మెరుపు వెనుక అసలు కథ
వజ్రాల వ్యాపారులు, వినియోగదారులు నిన్న(ఏప్రిల్ 8, 2026) తొలి ‘ప్రపంచ వజ్రాల దినోత్సవం’ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నేచురల్ డైమండ్ కౌన్సిల్ (ఎన్డీసీ) పిలుపు మేరకు జరిగిన ఈ వేడుకల్లో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో సహజ వజ్రాలకు ధీటుగా ‘ల్యాబ్గ్రోన్ డైమండ్లు’ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వీటి భవిష్యత్తు వినియోగం ఎలా ఉండబోతోంది? అనే అంశాలను విశ్లేషిద్దాం.సహజ వజ్రం.. ల్యాబ్గ్రోన్ డైమండ్ మధ్య తేడా..చాలామంది ల్యాబ్గ్రోన్ డైమండ్లను నకిలీ వజ్రాలు అనుకుంటారు, కానీ అది తప్పు. ఇవి భౌతికంగా, రసాయనికంగా, ఆప్టికల్గా దాదాపు సహజ వజ్రాల మన్నికనే పోలి ఉంటాయి. సహజ వజ్రాలు భూమి అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత, పీడనం వల్ల ఏర్పడతాయి. ల్యాబ్గ్రోన్ డైమండ్లు ప్రయోగశాలల్లో కేవలం కొన్ని వారాల్లోనే తయారవుతాయి. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్గ్రోన్ వజ్రాలు 60% నుంచి 80% వరకు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని భూమిని తవ్వి ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం లేనందున ‘ఎకో-ఫ్రెండ్లీ’ డైమండ్లుగా పిలుస్తారు.కృత్రిమంగా ఎలా తయారు చేస్తారు?ల్యాబ్లో వజ్రాలను సృష్టించడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి.హెచ్పీహెచ్టీ(హై ప్రెషర్ హై టెంపరేచర్): భూమి పొరల్లో ఉండే సహజ వాతావరణాన్ని (అధిక పీడనం, ఉష్ణోగ్రత) యంత్రాల ద్వారా సృష్టించి కార్బనైజేషన్ ద్వారా వజ్రాన్ని అభివృద్ధి చేస్తారు.సీవీడీ (కెమికల్ వేపర్ డెపొజిషన్): ఒక ఛాంబర్లో కార్బన్ వాయువులను నింపి ప్లాస్మా సాంకేతికతతో కార్బన్ పరమాణువులను పొరలు పొరలుగా పేరుకుపోయేలా చేస్తారు. ప్రస్తుతం అత్యుత్తమ నాణ్యత గల వజ్రాల కోసం భారత్లో ఈ పద్ధతినే ఎక్కువగా వాడుతున్నారు.వినియోగదారులు తేడాను ఎలా గుర్తించాలి?సాధారణంగా సహజ వజ్రానికి, ల్యాబ్గ్రోన్ వజ్రానికి మధ్య తేడాను కనిపెట్టడం అసాధ్యం. అనుభవజ్ఞులైన వ్యాపారులు కూడా వీటిని కొన్నిసార్లు గుర్తుపట్టలేరు. కాబట్టి వినియోగదారులు వజ్రాలు కొనేముందు కొన్ని అంశాలు గమనించాలి. వజ్రాభరణాలు కొనేటప్పుడు జీఐఏ(జెమొలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా) లేదా ఐజీఐ వంటి సంస్థల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అడగాలి. అందులో అది ‘నేచురల్’ లేదా ‘లేబొరేటరీ గ్రోన్’ అని స్పష్టంగా ఉంటుంది. ల్యాబ్ వజ్రాల గర్డిల్ (అంచు)పై మైక్రోస్కోపిక్ లేజర్ మార్కింగ్ ఉంటుంది.ఈ విభాగంలో ఉపాధి అవకాశాలువజ్రాల తయారీ రంగంలో భారత్లోని సూరత్ గ్లోబల్ హబ్గా మారింది. దాంతో స్థానికంగా సీవీడీ మిషన్ల నిర్వహణకు ఇంజినీర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల అవసరం పెరుగుతోంది. వజ్రాలను సానబెట్టే (పాలిషింగ్) నైపుణ్యం ఉన్నవారికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. తక్కువ ధర వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా వజ్రాల వైపు మొగ్గు చూపుతుండటంతో సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి.భవిష్యత్తు ఎటువైపు?సహజ వజ్రాలు పెట్టుబడిగా, వారసత్వ సంపదగా వాటి విలువను కాపాడుకుంటున్నాయి. కొన్ని పెళ్లిళ్లు, భావోద్వేగ సందర్భాల కోసం వీటిని వాడుతున్నారు. ల్యాబ్గ్రోన్ డైమండ్లు ఫ్యాషన్ జ్యువెలరీ, రోజువారీ వాడకానికి ఇవి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. వీటి పర్యావరణ హితం, తక్కువ ధర కారణంగా యువత, జెన్జీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
అనంత్ అంబానీ బర్త్డే స్పెషల్.. గజరాజులకు విందు..
వన్యప్రాణుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను అనంత్ అంబానీ మరోసారి చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలోని హాథీ గావ్లో జరిగాయి. మూగజీవాల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా స్థానిక ‘హాథీ గావ్ వికాస్ సమితి’ ఈ వినూత్న వేడుకను నిర్వహించింది.ఈ వేడుకలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన భారీ ‘ఫ్రూట్ బఫే’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 3,000 కిలోల బరువున్న వివిధ రకాల పండ్లను ఏనుగులకు విందుగా వడ్డించారు. ఈ బఫేలో అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయ, బొప్పాయి, నారింజ వంటి కాలానుగుణ ఫలాలతో పాటు ఏనుగులకు ఇష్టమైన చెరకు, బెల్లం, పచ్చి పశుగ్రాసాన్ని భారీగా సిద్ధం చేశారు. రాజస్థానీ సాంప్రదాయ శైలిలో అలంకరించిన గజరాజులు ఈ విందును ఆస్వాదించాయి.మావత్ కుటుంబాలకు అండగా..వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే మావత్ (ఏనుగుల సంరక్షకులు)లను ఈ సందర్భంగా సమితి గౌరవించింది. ఏనుగుల సంక్షేమం కోసం శ్రమించే వారికి నిత్యావసర వస్తువులతో కూడిన రేషన్ కిట్లు, దుస్తులు, టోపీలు, పాదరక్షలు, రోజువారీ వినియోగ వస్తువులను పంపిణీ చేశారు.అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారాను స్థాపించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన, అనారోగ్యంతో ఉన్న సుమారు 200 జాతులకు చెందిన జంతువులకు వంతారాలో ఆశ్రయం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని ఏనుగుల సంరక్షణకు ఆయన అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల స్ఫూర్తి పొంది ఈ వేడుకను నిర్వహించినట్లు హాథీ గావ్ వికాస్ సమితి అధ్యక్షుడు షఫీక్ బల్లు ఖాన్ తెలిపారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
కార్పొరేట్
అనంత్ అంబానీ బర్త్డే స్పెషల్.. గజరాజులకు విందు..
డిస్నీలో లేఆఫ్స్?
బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్కి ప్రత్యేక వర్గీకరణ
డిస్కౌంట్లకన్నా సౌకర్యానికే ఓటు
వార్ సీజ్.. బుల్స్ ఫైర్!
38 ఏళ్ల నాటి రికార్డ్.. ఆకాశంలో తపాలా సేవలు
విమానయాన రంగానికి భారీ ఊరట
ఎస్ఈసీ కేసు కొట్టేయండి
డిపాజిట్ల వేటలో ప్రైవేటు బ్యాంకులు టాప్
ఎయిరిండియా ప్రయాణికులకు ఏటీఎఫ్ సెగ
మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
బుల్రన్.. 2600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్...
వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!
గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా, ...
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
టెక్స్టైల్స్ పీఎల్ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు
టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం...
యథాతథంగా కీలక వడ్డీరేట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట...
అమెరికా ఇన్ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా?
అగ్రరాజ్యం అమెరికాలోని కీలక మౌలిక సదుపాయాల నెట్వర...
యుద్ధం ఎఫెక్ట్.. దెబ్బతిన్న రంగాలకు కేంద్రం దన్ను!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో దేశీయంగా ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
భారత్వైపు టెక్ కంపెనీల చూపు..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం ప్రపంచ ఐటీ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ డేటా భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో భౌగోళికంగా, ఆర్థికంగా సురక్షితమైన స్థావరంగా భావిస్తున్న భారతదేశం ప్రపంచ డేటా సెంటర్ హబ్గా అవతరించేందుకు సిద్ధమవుతోంది.గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం భారత్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాల కోసం కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్లయిన CtrlS, Sify, NTT, CapitaLand, Airtel Nxtraలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పశ్చిమాసియా క్లయింట్లు సైతం తమ డేటాను భారత్కు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు.భారత్ ఎందుకు అత్యుత్తమ ఎంపిక?అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ వర్క్లోడ్ను యూరప్ లేదా అమెరికాకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ధరల ప్రయోజనం. నిపుణులు విశ్లేషణ ప్రకారం, భారత్లో ఒక డేటా సెంటర్ నిర్మించే ఖర్చుతో పోలిస్తే సింగపూర్ వంటి దేశాల్లో రెండింతలు ఖర్చవుతుంది. అంటే భారత్లో పెట్టుబడి పెడితే మిగిలిన సొమ్ముతో మరో అదనపు కేంద్రాన్ని ఉచితంగా నిర్మించుకున్నంత లాభం చేకూరుతుంది.జీపీయూలకు భారీ డిమాండ్కేవలం డేటా స్టోరేజ్ మాత్రమే కాకుండా కృత్రిమ మేధ ప్రాసెసింగ్కు అవసరమైన జీపీయూ(గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) కోసం కూడా అంతర్జాతీయ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘యొట్టా’ డేటా సర్వీసెస్ ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలతో 16 మిలియన్ డాలర్ల నుంచి 1.3 బిలియన్ డాలర్ల విలువైన భారీ జీపీయూ ఒప్పందాలను కుదుర్చుకుంది. పెరిగిన డిమాండ్ను తట్టుకోవడానికి రాబోయే నాలుగు నెలల్లో సుమారు 30,000 అదనపు B300/B200 జీపీయూలను సిద్ధం చేయాలని యొట్టా భావిస్తోంది.సాధారణ కార్యాలయాల వలె డేటా సెంటర్లను తక్షణమే మార్చడం సాధ్యం కాదు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు దీర్ఘకాలికంగా భారత్కు మేలు చేయనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, గల్ఫ్ దేశాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్.. భారత్ను గ్లోబల్ క్లౌడ్ కారిడార్లో ఒక శక్తివంతమైన సెకండరీ హబ్గా నిలబెడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్లోబల్ టెక్ రంగంలో ఇదొక నిర్మాణాత్మక మార్పు. భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే డిజిటల్ ఎకానమీలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
ఏఐతో హైరింగ్ ధోరణుల్లో మార్పులు
కృత్రిమ మేథ (ఏఐ)తో నియామకాల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వస్తున్నాయని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు అనేది ఆర్థికాంశాలతో కన్నా ఎక్కువగా టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యవహారమని పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుండటంతో కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం తగ్గుతోందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే విస్తృతంగా కార్యకలాపాలని నిర్వహించుకోవడంపై అవి దృష్టి పెడుతున్నాయని శర్మ వివరించారు.అంతేగాకుండా కోవిడ్ సమయంలో భారీ స్థాయిలో నియమించుకున్న ఉద్యోగులను కంపెనీలు ప్రస్తుతం వ్యాపార అవసరాలకు అనుగుణంగా తగ్గించుకుంటూ ఉండటం కూడా ఉద్వాసనలకు కారణమవుతోందని తెలిపారు. ఈ అంశాలన్నీ కలిసి ఉద్యోగుల్లో అభద్రత భావన పెరుగుతోందని, 60 శాతం మంది పైగా టెక్ వర్కర్లలో స్థిరత్వంపై ఆందోళన నెలకొందని తెలిపారు. గత కొన్నాళ్లుగా టెక్నాలజీ రంగంలో నిర్దాక్షిణ్యంగా కోతలు అమలవుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్వైఐ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయంగా 70 పైగా టెక్ కంపెనీలు ఏకంగా 40,480 మంది ఉద్యోగులను తొలగించాయి. ఉత్పాదకత 30 శాతం వరకు అప్..ఏఐతో కోడింగ్, సపోర్ట్లాంటి కార్యకలాపాల్లో ఉత్పాదకత 10–30 శాతం వరకు పెరిగిందని నీతి శర్మ చెప్పారు. ప్రొడక్టివిటీ కస్టమర్ సపోర్ట్లో 14–15 శాతం, కోడింగ్, టాస్క్ల రైటింగ్లాంటి కొన్ని విధుల్లో 40 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. దీనితో ఇలాంటి పనుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉండటం లేదని, తక్కువ మంది ఉద్యోగులు సరిపోతున్నారని వివరించారు. లేఆఫ్లతో మిగిలే నిధులను సంస్థలు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా రాబడులపై అనిశ్చితి నెలకొన్నా దీర్ఘకాలికంగా ఉపయోగపడే సామర్థ్యాలను పెంచుకోవడం వైపు మళ్లే విధంగా వ్యవస్థాగతంగా వస్తున్న మార్పులను ఇది సూచిస్తోందన్నారు. బడా టెక్ కంపెనీలు సైతం బ్యాలెన్స్ షీట్స్ పటిష్టంగా ఉన్నప్పటికీ ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, చాలా కంపెనీలు ఏఐని వినియోగించుకోవడంలో ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని వివరించారు. నిపుణులకే డిమాండ్..ఏఐ వల్ల రొటీన్ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతోందని, విశిష్ట నైపుణ్యాలున్న వారికి డిమాండ్ పెరుగుతోందని శర్మ చెప్పారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లో ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ నియామకాలు వార్షికంగా 18–27 శాతం పెరుగుతుండగా, ఐటీ సరీ్వసుల విభాగంలో 4–6 శాతం వృద్ధి ఉంటోందని తెలిపారు. అదే సమయంలో నిపుణుల కొరత 25–60 శాతం మేర ఉంటోందన్నారు. దీని వల్ల వేతన వృద్ధి 10–12 శాతం ఉంటోందని శర్మ వివరించారు. సీనియర్ హోదాలకు రూ. 60 లక్షల వరకు ప్రీమియం స్థాయిలో వేతనాలు ఉంటున్నాయన్నారు. అత్యధిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత ఉద్యోగాల వైపు పరిశ్రమ మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోందని శర్మ తెలిపారు.ఏఐ వల్ల ఉద్యోగ విధుల స్వరూపం మారుతోందని, ఇందుకోసం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెట్టడం కీలకమని ఆమె చెప్పారు. అధికారికంగా శిక్షణ పొందుతున్న ఉద్యోగుల సంఖ్య పాతిక శాతం లోపే ఉంటోందన్నారు. కాబట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణనివ్వడం, అంతర్గతంగా వేరే వేరే విభాగాల్లోకి మారే వెసులుబాట్లు కల్పించడంపై కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలని, విధాన నిర్ణేతలు కూడా భారీ స్థాయి శిక్షణ కార్యక్రమాలకు ప్రోత్సాహకాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని శర్మ చెప్పారు. ఇక ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను సంతరించుకోవడానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచనా ధోరణితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు
జియో కొత్త ప్లాన్.. ‘నెలంతా’ వ్యాలిడిటీ
జియో నుంచి అదిరిపోయే ప్లాన్! కేవలం రూ. 339లకే పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు) వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ను రిలయన్స్ జియో అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా 28 రోజుల ప్లాన్లతో విసిగిపోయిన కస్టమర్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఈ కొత్త ప్లాన్ విశేషాలేంటో తెలుసుకుందాం.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 349 ప్లాన్ కంటే ఇది రూ. 10 తక్కువ ధరకే లభించడం విశేషం. ఈ ప్లాన్ ద్వారా ఏడాదికి 13 సార్లు కాకుండా, కేవలం 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.రూ. 339 ప్లాన్ ప్రయోజనాలుపూర్తి 31 రోజుల క్యాలెండర్ నెల వ్యాలిడిటీ.రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటా.ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాల్స్.రోజుకు 100 SMSలు ఉచితం.అదనంగా రూ. 14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా లభిస్తుంది.సుమారు రూ. 35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో' సబ్స్క్రిప్షన్ను 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.ఏకంగా 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్తో పాటు నానో బనానా (Nano Banana) సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.5G వినియోగదారులకు గమనికఈ ప్లాన్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక చిన్న పరిమితి ఉంది. రూ. 349 ప్లాన్ మాదిరిగా ఇందులో అపరిమిత 5G డేటా సౌకర్యం లేదు. మీరు 5G నెట్వర్క్ను అపరిమితంగా వాడాలనుకుంటే మాత్రం రూ. 349 ప్లాన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?
ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.AI సులభంగా చేసే పనులు➤డేటా ప్రాసెసింగ్➤ప్యాటర్న్ గుర్తింపు➤కంటెంట్ తయారీ➤నియమాల ప్రకారం పనిచేయడంవీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.AI చేయలేని పనులుAI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు➜హెల్త్కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు.
పర్సనల్ ఫైనాన్స్
నూతన సంవత్సరంలో కొత్త మార్పులతో ముందుకు..
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఇంచుమించుగా కొత్త తెలుగు సంవత్సరమైన పరాభవ కూడా మొదలు.. కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త నియమాలు.. కొత్త దేవుడొచ్చాడు. దేవుడు మారాడు కానీ మన బాధ్యతలు మారలేదు. కర్తవ్యం యథాతథం. పూజా యథాతథమే. సకాలంలో కర్తవ్యం పూర్తి చేస్తే అనుగ్రహం, శాంతి కలుగుతాయి. లేదంటే ఆగ్రహం, అశాంతి.ఆదాయ పన్ను చట్టం 2025లో సాంకేతికంగా చూస్తే సెక్షన్లు, చాప్టర్లు తగ్గాయి. అక్షరమాల పోయి, అంకెల మాల అయ్యింది. చాలా విషయాల్లో హేతుబద్ధీకరణ జరిగింది. మాటిమాటికీ బ్రాకెట్లు వాడేవారు. ఇప్పుడవి లేవు. క్లాజులు, సబ్క్లాజులు తగ్గాయి. వివరణలు తగ్గాయి. సులభంగా, అర్థమయ్యేలా ఉంది. కొత్త చట్టం, నియమాలు అమలయ్యే వేళ, మార్పుల గురించి తెలుసుకుందాం. ఇక నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు సంవత్సరం, పన్ను సంవత్సరం అంటారు. మొన్నటి వరకు రెండు పదాలు.. అంటే ఒకటి ఆదాయపు సంవత్సరం, రెండోది మదింపు సంవత్సరంగా ఉండేవి. ఇప్పుడు ఒకే పదం.. ఒకే సంవత్సరం. ప్రస్తుతం మనం 2026–27 పన్ను సంవత్సరంలో ఉన్నాం.జీతం రూపంలోని ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క నిర్వచనం. ‘జీతం’ అంటే ఏమిటనేది ఉండేది. ఇప్పుడు ఏ అంశమైనా ఒకే నిర్వచనం. దీని వల్ల ఎటువంటి తికమక ఉండదు. తప్పుడు లెక్కలకు ఆస్కారం లేదు.మనం ఫైల్ చేసిన ఐటీఆర్ తప్ప మిగతా అన్నింటి నంబర్లు మారిపోయాయి. దశాబ్దాల చరిత్ర గల ఫారం 16 మారిపోతోంది. కొత్త నంబరు 130. ఈ మార్పుకంటే అందులోని అంశాల్లో మార్పులు మరింత ముఖ్యమైనవి. ఇన్నాళ్లు, కేవలం ఆదాయం, పన్ను భారం, టీడీఎస్ వివరాలకే పరిమితం అయింది. ఇప్పుడు ఫోకస్ మారింది. కొత్త చట్టంలోని నియమాల ప్రకారం ‘పన్ను సంవత్సరం’ అని ప్రస్తావిస్తారు. ఉద్యోగి వివరాలను అటు యజమాని తెలియజేస్తారు. పన్ను భారమే కాకుండా ఏ రేటు ప్రకారం ఎంతెంత అనేది చెప్పాలి. అంతే కాకుండా ఈ సమాచారం టీడీఎస్ రిపోర్టింగ్లోని అంశాలకు సరిపోలి ఉండాలి. అప్డేటెడ్ సిస్టంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫారం 130లోని అంశాలు యజమాని బాధ్యత అయినప్పటికీ, మీరు 130లోని ప్రతి అంశాన్ని చెక్ చేసుకోండి.అలాగే 26ఏఎస్/ఏఐఎస్కి స్వస్తి పలికారు. కొత్త నంబరు 168. పేరులో చిన్న మార్పు..నంబరులో మార్పు. 26ఏఎస్ కేవలం టీడీఎస్, టీసీఎస్, ట్యాక్స్ చెల్లింపుల వరకే పరిమితం. కానీ 168లో ఫోకస్ అంతా విశ్వమయం. అన్ని ఆర్థిక వ్యవహారాల సమాచారం, ట్రాకింగ్ ఉంటుంది. ట్యాక్స్ పద్దులకే 26ఏఎస్ పరిమితం కాగా, ఫారం 168లో పన్ను పద్దులతో పాటు షేర్లు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే ఫారం 130 అనేది యజమాని బాధ్యత. ఫారం 168 డిపార్టుమెంటు వారి బాధ్యత. కానీ ఈ రెండింటి వల్ల ప్రభావితం అయ్యేది మీరు. మీ ప్రమేయం లేకపోయినా ఇవి మిమ్మల్ని శాసిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.మరో ఫారం 16ఏ కాస్తా ఫారం 131గా అవతారం ఎత్తుతోంది. జీతం కాని ఆదాయాలన్నింటి మీద టీడీఎస్లు ఇందులో ఉంటాయి. ఫారం 131 కూడా కొత్త చట్టానికి, కొత్త రూల్స్కి అనుసంధానంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి.ఉద్యోగస్తులకు శుభవార్త. విద్య అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, గిఫ్ట్ ఓచర్ లిమిట్, భోజన కూపన్ అలవెన్స్ మొదలైన వాటి మీద పరిమితిని గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో సమంజసంగా, సమయోచితంగా ఆచరణాత్మకమైన విధంగా ఈ పరిమితులు పెంచారు.ఇక హెచ్ఆర్ఏ విషయంలో గతంలో 50 శాతం పరిమితిని కేవలం నాలుగు ప్రధాన నగరాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు మరికొన్ని నగరాలకు విస్తరింపచేశారు. అందులో హైదరాబాద్ ఉంది.పాన్ నంబరుని కంపల్సరీగా తెలియజేసే పరిమితులను పెంచారు. ఇన్కం ట్యాక్స్తో సంబంధం లేకపోయినా, రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. వివరాలు రాబోయే రోజుల్లో మరింతగా తెలుసుకుందాం.
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?
సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి.
గ్రూప్ బీమా.. ఇస్తుందా ధీమా?
వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.కానీ, అసలు రిస్క్ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఇక రిటైర్మెంట్ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కనుక స్టాండెలోన్ హెల్త్ప్లాన్తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్వర్క్ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.రిటైర్మెంట్ వరకు మేల్కొనకపోతే..🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. 🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.ముందే ఎందుకు..? హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్ హెల్త్ ప్లాన్తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు.ఉదాహరణ.. 🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్ ప్లాన్కు ప్రీమియం రూ.8,000–12,000 🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే. 🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు. యథార్థమిదీ.. 🔸 హైదరాబాద్కు చెందిన రమేష్ వయసు 60 ఏళ్లు. 🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. 🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్ హెల్త్ ప్లాన్ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు. 🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ తప్పులకు దూరం దూరం..🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం. 🔸 ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోకపోవడం. 🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్ ఇన్సూర్డ్ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం. 🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం. 🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం. 🔸 హెల్త్ ఇన్సూరెన్స్ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం. 🔸 ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ప్లాన్ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం. రక్షణ అవసరమైన మేర..🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్. 🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్ తీసుకోవాలి. 🔸 టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్తో అదనపు రక్షణను కల్పించుకోవాలి. 🔸 బేస్ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్ టాపప్ ఎక్కువ ప్రయోజనకరం. 🔸 ఒకవేళ బేస్ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్ లేదా సూపర్ టాపప్ నుంచి చెల్లింపులు లభిస్తాయి. 🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 🔸 అందుకే తగినంత సమ్ ఇన్సూర్డ్తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి.
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026


