Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

RBI MPC decided to keep the repo rate unchanged at 5. 25percent1
రేట్లకు బ్రేక్‌.. వృద్ధే టార్గెట్‌ రెపోరేటు యథాతథం

ముంబై: అంచనాలకు అనుగుణంగా కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకు వెళ్లకుండా, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ యథాతథ స్థితినే కొనసాగించింది. బడ్జెట్‌లో మూలధన వ్యయాలు పెంచడంతో వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉంటుందన్న అంచనాలు వ్యక్తం చేస్తూ.. అంతర్జాతీయంగా అనిశి్చతుల నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు చేపట్టకుండా తటస్థ వైఖరిని కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను పెంచింది. బ్యాంకు కస్టమర్లు మోసపోతే తక్షణ పరిహారం కింద రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించడం ఖాతాదారులకు ఊరటనిచ్చేది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు (రీట్‌లు) సైతం బ్యాంక్‌ల నుంచి రుణ వితరణకు పచ్చజెండా ఊపింది. ఎంఎస్‌ఈలకు పూచీకత్తులేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం మరో కీలక నిర్ణయం. అలాగే, కొన్ని రకాల ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించింది.పాలసీలోని ముఖ్యాంశాలు..→ రెపో రేటును (ఆర్‌బీఐ నుంచి బ్యాంక్‌లు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత డిసెంబర్‌ సమీక్షలో రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం తగ్గించడం తెలిసిందే. అంతేకాదు 2025 ఫిబ్రవరి నుంచి మొత్తం మీద రెపో రేటును 125 బేసిస్‌ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడం గమనార్హం. రివర్స్‌ రెపో (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే నిధులపై చెల్లించే రేటు) రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌) 5 శాతం, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌) 5.50 శాతం రేట్లలోనూ మార్పు చేయలేదు.→ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో 2.1 శాతంగా (గత అంచనా 2 శాతం) కొనసాగుతుందని ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది. 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. 2025–26 క్యూ4లో 3.2 శాతం (గత అంచనా 2.9 శాతం), 2026–27 క్యూ1లో 4 శాతానికి, 2026–27 క్యూ2లో 4.2 శాతానికి పెరుగుతుందని అంచనాలకు వచి్చంది. 2026–27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను తదుపరి ఏప్రిల్‌ సమీక్ష సందర్భంగా ప్రకటిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా తెలిపారు.→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి ఆర్‌బీఐ ఎంపీసీ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) క్యూ1 (ఏప్రిల్‌–జూన్‌), క్యూ2 (జూలై–సెప్టెంబర్‌) వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. రియల్‌ జీడీపీ సిరీస్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయనుండడంతో పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏప్రిల్‌లో ప్రకటిస్తామని మల్హోత్రా పేర్కొన్నారు. → సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఈ) ఆర్థిక భరోసా కల్పిస్తూ పూచీకత్తు లేని రుణ పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా తీసుకునే రుణాలతోపాటు గత రుణాల పునరుద్ధరణలకూ ఇది వర్తిస్తుంది.→ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు (రీట్‌లు) బ్యాంకుల రుణ వితరణను అనుమతించే ప్రతిపాదనను ఆర్‌బీఐ ఎంపీసీ తీసుకొచి్చంది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మరింత రుణ వితరణను ప్రోత్సహించేందుకు వీలుగా కొన్ని రక్షణ చర్యలతో రీట్‌లకు బ్యాంకుల రుణాలను అనుమతించే ప్రతిపాదన చేసింది. → కార్పొరేట్‌ బాండ్ల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా.. 2026–27 బడ్జెట్‌ ప్రకటనకు అనుగుణంగా, కార్పొరేట్‌ బాండ్‌ సూచీల డెరివేటివ్స్‌కు నియంత్రణ పరమైన కార్యాచరణను ఆర్‌బీఐ విడుదల చేయనుంది. → తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ఏప్రిల్‌ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు వెన్నుదన్నురూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ప్రజల నుంచి నిధులు సమీకరించని వాటిని కొన్ని షరతుల మేరకు తప్పనిసరి రిజి్రస్టేషన్‌ నుంచి మినహాయింపు కల్పించాలని ఆబీఐ ఎంపీసీ ప్రతిపాదించింది. బంగారంపై రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీలు–ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ క్రెడిట్‌ కంపెనీలు (ఐసీసీలు), 1,000 శాఖలకు మించి ఉన్నవి కొత్త శాఖల విస్తరణకు ఇకపై ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక బంగారం రుణాల విషయంలో ఎంలాంటి ఆందోళనల్లేవని, సౌకర్యంగానే ఉన్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా స్పష్టం చేశారు. ఆస్తుల లోన్‌ టు వ్యాల్యూ (ఎల్‌టీవీ/ బంగారం ధరపై రుణ వితరణ) తాము నిర్దేశించిన పరిమితులకు దిగువనే ఉన్నట్టు చెప్పారు. బంగారంపై రుణాలు సహా ఎన్‌బీఎఫ్‌సీల రుణాల పోర్ట్‌ఫోలియోలను ఆర్‌బీఐ సమీక్షించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2026–27లో రుణ సమీకరణను రూ.17.2 లక్షల కోట్లకు పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. నికర రుణ సమీకరణను చూడాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.20,000 కోట్లే ఎక్కువన్నారు.డిజిటల్‌ మోసాలకు పరిహారంబ్యాంక్‌ కస్టమర్‌ ప్రమేయంతో, ఓటీపీ తెలుసుకుని లేదా కస్టమర్‌ ప్రమేయం లేకుండా జరిగే డిజిటల్‌ మోసాల్లో ఎలాంటి ప్రశ్నలు లేకుండా బ్యాంక్‌ రూ.25,000ను పరిహారం కింద చెల్లిస్తుంది. కాకపోతే కస్టమర్‌ ఉద్దేశపూర్వక పాత్ర ఉండకూడదు. కస్టమర్‌ తన వంతుగా 15 శాతం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక విలువ కలిగిన మోసాల్లో పరిహారం రూ.25 వేలకు పరిమితం అవుతుంది. డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌ నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.

Gold Price in India Know The Latest Rates Here2
బంగారం ధరల్లో మార్పు!.. స్వల్ప వ్యవధిలోనే..

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ.. పసిడి ప్రియులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కనిపించిన రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ. 1,39,650 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,900 రూపాయల వద్దకు చేరింది. అదే విధంగా రూ. 1,53,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 1,53,710 రూపాయల వద్ద నిలిచింది. దీన్ని బట్టి చూస్తే.. గంటల వ్యవధిలో బంగారం రేటు ఎలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. 1,39,800 రూపాయల నుంచి 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ. 1,41,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల పసిడి కూడా రూ. 1,52,500 నుంచి 1,53,860 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు మారింది. ఉదయం 1,41,200 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం పసిడి ధర సాయంత్రానికి రూ. 1,42,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,040 రూపాయల వద్ద నుంచి రూ. 1,55,460కు చేరింది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 2.80 లక్షల వద్ద ఉంది.

How to Check if Silver is Real or Fake at Home3
మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..

వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్‌ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.వెండికి హాల్ మార్క్భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్‌మార్క్ సంఖ్యతో హాల్‌మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్‌మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్‌మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.

Amazon To Invest 200 Billion Dollars In AI After Washington Post Layoffs4
అందుకే.. అమెజాన్ 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి!

కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, కస్టమ్ చిప్స్, లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వంటి సాంకేతిక రంగాల్లో.. అమెజాన్ దాదాపు 200 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఖర్చు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 50 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని.. ది వాషింగ్టన్ పోస్ట్ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మందిని తొలగించాలని తన నిర్ణయాన్ని వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కాగా సంస్థ నాల్గవ త్రైమాసిక ఆదాయం 14 శాతం పెరిగినట్లు వెల్లడించింది.పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి.. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ఈ ఖర్చు ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కోసం ఉపయోగిస్తామని తెలిపారు. AWS అనేది సంస్థలు, ప్రభుత్వాలు, మొబైల్ యాప్స్‌కు క్లౌడ్ సేవలు అందించే విభాగం. ఇది సంస్థను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబడటానికి ఉపయోగపడుతుందని అన్నారు.ఇదే సమయంలో, ది వాషింగ్టన్ పోస్ట్ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పత్రిక మొత్తం ఉద్యోగుల్లో సుమారు 30 శాతం.. అంటే 300 మందికి పైగా జర్నలిస్టులను తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మ్యాట్ ముర్రే ప్రకారం.. పత్రిక చాలాకాలంగా నష్టాల్లో నడుస్తోంది. అందుకే ఈ ఉద్యోగాల తొలగింపు తప్పనిసరి అయిందని ఆయన చెప్పారు.భవిష్యత్తులో పత్రిక జాతీయ వార్తలు, రాజకీయాలు, వ్యాపారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. కాగా క్రీడలు, పుస్తకాలు వంటి విభాగాలను పూర్తిగా మూసివేయనుంది.. రోజువారీ పాడ్‌కాస్ట్ 'పోస్ట్ రిపోర్ట్స్' కూడా నిలిపివేయనుంది.

Stock Market Closing Update 06 Feb 20265
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 266.47 శాతం లాభంతో.. 83,580.40 వద్ద, నిఫ్టీ 50.90 పాయింట్ల లాభంతో 25,693.70 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐజెడ్ఎంఓ లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్‌టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

RBI Acts on Fraud Customers to Get up to Rs 25000 compensation Know The Details6
ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వారికి పరిహారంగా రూ.25 వేలు!

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్యూరెన్స్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.వినియోగదారుల రక్షణలో భాగంగా.. డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయంగా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి సమయాల్లో పరిహారం..బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టం లోపల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే.. రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది. అంతే కాకుండా.. చిన్న మొత్తంలో నష్టపోయినవారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు.. ఈ పరిహారం లభించదు.ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ సీఎఫ్ఓ రాహుల్ శర్మ.. చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆన్నారు. వెల్స్ ఫార్గో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ బ్యాంకింగ్ లీడర్ సంతాను సెంగుప్తా కూడా ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement