Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Prices Hit Rs 1 6 Lakh For The First Time Know The Reasons This Historic Surge1
అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో.. తొలిసారిగా ఔన్స్‌కు 5,000 డాలర్లు దాటేసింది. ఇదే సమయంలో వెండి ధర కూడా ఔన్స్‌కు 100 డాలర్ల నుంచి 105 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతూ.. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో చీఫ్ ఎకనామిస్ట్ & గ్లోబల్ స్ట్రాటజిస్ట్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బంగారం ధర 100 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 5,085 డాలర్లు దాటేసింది. వెండి ధర 5 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 108.25 డాలర్లు క్రాస్ చేసింది. ఈ రెండూ కొత్త గరిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన అస్థిరతకు సంకేతం. ఇది రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విధంగా పీటర్ షిఫ్ పేర్కొన్నారు.Gold is up over $100, trading above $5,085. Silver is up over $5, trading above $108.25, both at new record highs. Most people are clueless about what this means and are in for quite a shock. Those of us who understand have been expecting the economic crisis that’s about to hit.— Peter Schiff (@PeterSchiff) January 26, 2026బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక & రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ విషయంలో.. అమెరికా & నాటో దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పాటు ఉక్రెయిన్, గాజా వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కూడా.. పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100% సుంకం విధిస్తామని ఆయన బెదిరించిన తర్వాత.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటివాటిపై పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇది వీటి ధరలను అమాంతం పెంచేసింది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఇదిలా ఉండగా.. విశ్లేషకులు బంగారం ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఔన్సుకు 6000 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గోల్డ్ & సిల్వర్ ధరల భారీ పెరుగుదల కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడాల్సిన విషయం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరతకు, అప్పుల భారానికి, రాజకీయ ఉద్రిక్తతలకు స్పష్టమైన హెచ్చరిక. కాబట్టి రాబోయే కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Axis Mutual Fund Launches BSE Sector Leaders Index Fund 2
యాక్సిస్‌ కొత్త మ్యూచువల్‌ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ బీఎస్‌ఈ సెక్టార్‌ లీడర్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6 వరకు ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో/కొత్త పథకం) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కార్తీక్‌ కుమార్‌ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.బీఎస్‌ఈ 500 సూచీలోని 21 రంగాల కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ప్రతీ రంగం నుంచి టాప్‌ 3 కంపెనీలను ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. దీంతో ఆయా రంగాల్లోని అగ్రగామి కంపెనీల్లో ఎక్స్‌పోజర్‌ లభిస్తుంది. శామ్కో మిడ్‌క్యాప్‌ ఫండ్‌ శామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌.. శామ్కో మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బలమైన ఆదాయం, లాభాలు, ధరల తీరు ఆధారంగా భవిష్యత్తులో బలంగా ఎదిగే మధ్యస్థాయి కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. ఇందుకు గాను ‘కేర్‌’ విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్‌ విలువ పరంగా 101 నుంచి 250వ స్థానం వరకు ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్‌ కిందకు వస్తాయి. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 4 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.

Gold Rates changes by Evening 26th january in Telugu States3
సాయంత్రానికి సగం ఊరట.. మారిపోయిన పసిడి ధరలు

బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి దాదాపు సగం ఊరటనిచ్చాయి.హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.2250 పెరిగి రూ. 1,49,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.1550లకే పరిమితమై రూ.1,48,450లకు దిగివచ్చింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.2450 ఎగిసి రూ. 1,62,710 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.1690 లకు నెమ్మదించి రూ.1,61,950లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Silver Price Why is silver cheaper in India compared to China4
చైనాలో చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు..

చైనాలో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 109 డాలర్లకుపైన ట్రేడ్ అవుతుండగా, ఒక్కరోజులోనే 3 శాతం పెరిగింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు 44 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో ఈ పెరుగుదల 250 శాతాన్ని దాటింది. అయితే చైనాలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అక్కడ వెండి ప్రీమియం కారణంగా స్థానిక ధరలు ఔన్సుకు సుమారు 125 డాలర్ల వరకు చేరాయి.భారత్–చైనా వెండి ధరల తేడావెండి ధరలు ఆల్‌టైమ్ హై వద్ద ఉన్నాయి. భారత్‌లో వెండి ధర గ్రాముకు సుమారు రూ.3.35గా ఉంది. చైనాతో పోలిస్తే ఇది సుమారు 17% తక్కువ. వివరంగా చూస్తే.. 1 ఔన్సు అంటే సుమారు 28.3 గ్రాములు. భారత్‌లో 1 ఔన్సు వెండి ధర సుమార రూ.9,984. అదే చైనాలో 1 ఔన్సు వెండి ధర 125 డాలర్లు.. భారత కరెన్సీలో రూ.11,450. అంటే భారత్–చైనా మధ్య ఒక్క ఔన్సుపై సుమారు రూ.1,969 (17%) ధర వ్యత్యాసం ఉంది.ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి?చైనాలో వెండికి భారీ డిమాండ్ ఉండటంతో పాటు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఈ ధర వ్యత్యాసాన్ని మరింత పెంచుతున్నాయి. వెండి బుల్ రన్ వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ప్రపంచ సరఫరా పరిమితులు. దీనికి తోడు, చైనా 2026 నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇకపై వెండి ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు అవసరం. ఈ విధానం 2027 వరకు అమల్లో ఉండనుంది.ఈ ఆంక్షలు ప్రకటించిన సమయంలో, ఎలాన్ మస్క్ కూడా స్పందిస్తూ, “ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అత్యవసరం” అని హెచ్చరించారు. ప్రస్తుతం వెండి ఇప్పటికే సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడు చైనా ఎగుమతులను పరిమితం చేయడంతో, ధరల అస్థిరత మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రపంచ వెండి మార్కెట్లో చైనా పాత్రప్రపంచ వెండి సరఫరాలో చైనా వాటా సుమారు 65%. సిల్వర్ ఫ్యూచర్స్, భౌతిక పెట్టుబడులు, పేపర్ ట్రేడింగ్‌లో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండవ అతిపెద్ద వెండి ఫ్యాబ్రికేటర్ కూడా చైనానే. చైనా ఎగుమతి పరిమితులు కొనసాగితే, ప్రపంచ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, గత ఐదేళ్లుగా వెండి మార్కెట్లో నిర్మాణాత్మక లోటు కొనసాగుతోంది. అంటే డిమాండ్ ఎప్పటికప్పుడు సరఫరాను మించిపోతూనే ఉంది.చైనాలో కొత్త నిబంధనలుజనవరి 1, 2026 నుంచి వెండి ఎగుమతిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు పొందాలి. కఠినమైన ఉత్పత్తి, ఆర్థిక ప్రమాణాలు పాటించే పెద్ద, ప్రభుత్వ-ఆమోదిత సంస్థలకే లైసెన్సులు ఇస్తున్నారు. చిన్న ఎగుమతిదారులు మార్కెట్ నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చైనా వెండి లభ్యత మరింత తగ్గే అవకాశముంది.

No Fastag Annual Pass For Three Row Cars NHAI Clarifies Know The Details5
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు.. స్పందించిన NHAI

ఇటీవల సోషల్ మీడియాలో 2026 జనవరి 1 నుంచి 3 రో కార్లు (6 లేదా 7 సీట్లున్న కార్లు) కోసం ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు చేశారని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో చాలామంది వాహనదారుల్లో ఒకింత అయోమయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారికంగా స్పందించింది.ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అదంతా తప్పుడు సమాచారం అని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న అన్ని వాణిజ్యేతర కార్లు / జీపులు / వ్యాన్లు యాన్యువల్ పాస్‌కు అర్హత కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది.#FactCheck: NHAI would like to clarify that all non-commercial Car/Jeep/Van with active FASTag, are eligible for the Annual Pass. Kindly refrain from spreading fake news. @MORTHIndia @PIBMoRTH @PIBFactCheck #NHAI #FASTagAnnualPass pic.twitter.com/KmTbuXLH0n— NHAI (@NHAI_Official) January 25, 2026ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్భారతదేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకొచ్చింది. దీనిని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌ను పరిచయం చేసింది. ఈ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే వ్యక్తిగత వాహనదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు!ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం ఒకేసారి రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా వాహనదారుడు గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్స్ చేయవచ్చు. ఈ పాస్ దేశవ్యాప్తంగా ఉన్న NHAI టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతుంది. రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ తేదీ నుంచి ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుతుంది.

Import Duty On Cars Likely To Be Slashed To 40 Percent Under India EU FTA6
కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు!

భారతదేశంలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటమే. అయితే ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదరబోయే ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ప్రీమియం కార్లు కొనాలనుకునే వినియోగదారులకు కొంత ఊరటను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే.. దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.ప్రస్తుతం యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లపై సుమారు 110 శాతం వరకు దిగుమతి సుంకం ఉంది. దీనివల్ల అక్కడ తక్కువ ధరకు లభించే కార్లు కూడా భారత్‌లో చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే కొత్త ఒప్పందం ప్రకారం ఈ దిగుమతి సుంకాన్ని నేరుగా 40 శాతానికి తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే.. ప్రీమియం కార్ల ధరలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువ గల అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ తక్కువ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.దిగుమతి సుంకాలను తగ్గిస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్‌లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది.

Advertisement
Advertisement
Advertisement