Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 02 March 20261
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.8బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 77.3 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.98 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.43 శాతం నష్టపోయింది.నాస్‌డాక్‌ 1.18 శాతం దిగజారింది.ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్‌అరబ్‌ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.హుర్ముజ్‌ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్‌లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.Today Nifty position 02-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Amazon Removes Referral Fee on Products Under 1000 to from March 162
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!

దేశీయ ఈ-కామర్స్ మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు అమెజాన్ ఇండియా భారీ మార్పులు చేస్తోంది. చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.1,000 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై అమ్మకందారుల నుంచి వసూలు చేసే రిఫరల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.ఏమిటీ రిఫరల్ ఫీజు?అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో వస్తువులను విక్రయించినందుకు గానూ ప్రతి అమ్మకంపై సెల్లర్‌ నుంచి కంపెనీ కొంత శాతం కమీషన్‌ను వసూలు చేస్తుంది. దీనినే రిఫరల్ ఫీజు అంటారు. సాధారణంగా ఇది ఉత్పత్తి కేటగిరీని బట్టి 2% నుంచి 16.5% వరకు ఉంటుంది. తాజా నిర్ణయంతో దాదాపు 1,800 కేటగిరీల్లో రూ.300 నుంచి రూ.1,000 మధ్య ధర ఉన్న ఉత్పత్తులకు ఈ కమీషన్ భారం ఉండదు.కీలక మార్పులు ఇవే..గతంలో (ఏప్రిల్ 2025) కేవలం రూ.300 లోపు వస్తువులకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు రూ.1,000 వరకు విస్తరించారు. దీనివల్ల లబ్ధి పొందే ఉత్పత్తుల సంఖ్య 1.2 కోట్ల నుంచి ఏకంగా 12.5 కోట్లకు పెరగనుంది. దాంతోపాటు రూ.300 కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల విక్రేతలకు షిప్పింగ్ ఫీజులో 20% రాయితీ ప్రకటించింది. అమ్మకందారులు తమ వద్దే స్టాక్ ఉంచుకుని కేవలం డెలివరీ బాధ్యతను అమెజాన్‌కు అప్పగించే ‘ఈజీ షిప్’ పద్ధతిలో కూడా ఈ 20% ఫీజు తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.‘ఈ నిర్ణయం వల్ల విక్రేతలకు అమ్మకం ఖర్చులో దాదాపు 70% వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న వ్యాపారవేత్తలకు అమెజాన్ ప్లాట్‌ఫారమ్ మరింత లాభదాయకంగా మారుతుంది’ అని అమిత్ నందా, డైరెక్టర్, అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్ట్నర్ సర్వీసెస్ అన్నారు.తీవ్రమవుతున్న ఈ-కామర్స్ పోటీ..మీషో 2022లోనే జీరో కమీషన్ మోడల్‌ను ప్రవేశపెట్టి చిన్న వ్యాపారులను భారీగా ఆకర్షించింది. ఫ్లిప్ కార్ట్ గతేడాది నవంబర్‌లో రూ.1,000 లోపు ఉత్పత్తులపై కమీషన్ రద్దు చేయడమే కాకుండా, తన ‘షాప్సీ’ ప్లాట్‌ఫారమ్‌లో పూర్తిగా జీరో కమీషన్ అమలు చేస్తోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని విక్రేతలను తమ ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం. అమ్మకందారులపై భారం తగ్గడం వల్ల వినియోగదారులకు కూడా తక్కువ ధరకే వస్తువులు అందే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

AI Double Edged Sword Harsh Goenka Warns of Job Losses by 2028-20333
2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొ​ందరికి శాపంగా మారుతోంది. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..సాఫ్ట్‌వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.బోధన రంగం (2029): క్లాస్‌రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్‌కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.2033 (రక్షణ రంగం)గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.భవిష్యత్తు మంత్రంమారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్‌కు కారణం ఇదే..

India GST collections 1. 83 lakh crore in February 20264
మెరుగ్గా జీఎస్‌టీ వసూళ్లు 

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రూపంలో ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లు స్థూలంగా వసూలైంది. దేశీ విక్రయాలపై ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.1.36 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతులపై జీఎస్‌టీ 17.2 శాతం పెరిగి రూ.47,837 కోట్లుగా నమోదైంది. రిఫండ్‌లు 10.2 శాతం పెరిగి రూ.22,595 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర పన్ను వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 7.9 శాతం పెరిగాయి. సెస్సు రూపంలో ఆదాయం రూ.13,481 కోట్ల నుంచి రూ.5,063 కోట్లకు తగ్గింది. గతేడాది సెప్టెంబర్‌ 26 నుంచి జీఎస్‌టీలో కీలక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. 5, 12, 18, 28 శ్లాబులను విలీనం చేసి.. 5, 18, 40 శాతం (పొగాకు, విలాస ఉత్పత్తులు) ఖరారు చేశారు. దీంతో 375 ఉత్పత్తులపై పన్ను రేట్లు దిగొచ్చాయి. అనంతరం నవంబర్‌లో వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్‌లో రూ.1.74 లక్షల కోట్లు, 2026 జనవరిలో రూ.1.93 లక్షల కోట్లకు పెరిగింది. పొగాకు ఉత్పత్తులపై అంతకుముందు కాంపన్సేషన్‌ ఉండగా, దాన్ని తొలగించి అధిక పన్ను రేటు పరిధిలోకి చేర్చారు. దీంతో ఈ పన్ను ఆదాయం తగ్గుతూ వస్తోంది. వినియోగం పెరిగినట్టు జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలు తెలియజేస్తున్నాయని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఎంఎస్‌ మణి పేర్కొన్నారు. తమిళనాడులో మైనస్‌ 6 శాతం, మధ్యప్రదేశ్‌లో మైనస్‌ 8 శాతం, రాజస్థాన్‌లో మైనస్‌ 1% చొప్పున ఆదాయం తగ్గిందని.. పశి్చమబెంగాల్‌లో ఒక శాతం, హరియాణాలో 2 శాతం, యూపీలో 5 శాతం, మహారాష్ట్రలో 6% చొప్పున ఆదాయం వచి్చనట్టు చెప్పారు. ఇది జాతీయ సగటు ఆదాయం 8 శాతం కంటే తక్కువని చెప్పారు.

Difference between Top-up and Super Top-up Health Plans5
హెల్త్‌కు సూపర్‌ టాపప్‌!

పదేళ్ల కిందట హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్‌ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్‌. ఆ వివరాలే ఈ ‘వెల్త్‌ స్టోరీ’అవసరానికి పనికిరాకుంటే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్‌ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. ఎందుకంటే కేన్సర్‌ చికిత్సకు దాని స్టేజ్‌ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్‌ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి. ప్రీమియం భారం..? వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్‌లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్‌ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్‌ టాపప్‌ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి. టాపప్‌ ప్లాన్లు.. పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్‌ టాపప్‌లు అందిస్తుంటాయి. బేస్‌ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్‌ టాపప్‌ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్‌ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్‌’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్‌ అయినా, సూపర్‌ టాపప్‌ అయినా కనీస డిడక్టబుల్‌తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలకు టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్‌ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్‌ టాపప్‌తో పని ఉండదు. బేస్‌ పాలసీలోనే క్లెయిమ్‌ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్‌గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్‌ పాలసీ రూ.5 లక్షలు, టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ రూ.3 లక్షలు చెల్లిస్తాయి. రెండూ వేర్వేరు.. ఇక్కడ టాపప్, సూపర్‌ టాపప్‌ రెండూ డిడక్టబుల్‌తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్‌ టాపప్‌ రెండూ ‘డిడక్టబుల్‌’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్‌ ప్లాన్‌ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్‌ మొత్తం డిడక్టబుల్‌ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్‌ టాపప్‌ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్‌ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్‌ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్‌ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది. పాలసీ కవరేజీబేస్‌ ప్లాన్‌ రూ.10 లక్షలు టాపప్‌ రూ.20 లక్షలు సూపర్‌ టాపప్‌ రూ.20 లక్షలు డిడక్టబుల్‌ రూ.10 లక్షలుఒక ఏడాదిలో క్లెయిమ్‌లు మొదటి క్లెయిమ్‌ 4 లక్షలు రెండో క్లెయిమ్‌ 3.50 లక్షలు మూడో క్లెయిమ్‌ 4.50 లక్షలు మొత్తం రూ.12 లక్షలు → ఇందులో టాపప్‌ ప్లాన్‌ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్‌ డిడక్టబుల్‌ రూ.10 లక్షలుమించలేదు. → సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ మాత్రం విడిగా ఒక క్లెయిమ్‌ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్‌లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్‌ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్‌ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్‌ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.20 లక్షలకు సూపర్‌ టాపప్‌ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు. → టాపప్‌లో ఈ ఫీచర్‌ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్‌ దాటినప్పుడే యాక్టివేట్‌ అవుతుంది. → ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్‌ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్‌ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు. ఏది తీసుకోవాలి..? → వివాహం కాని వారు, ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తోపాటు టాపప్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. → కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ తీసుకునే వారికి సూపర్‌ టాపప్‌ అనుకూలం. → బేసిక్‌ ఇండెమ్నిటీ హెల్త్‌ ప్లాన్‌ కంపెనీ నుంచే టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ తీసుకోవాలని లేదు. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. → ఒకే కంపెనీ నుంచి బేసిక్‌ ప్లాన్, టాపప్‌/సూపర్‌ టాపప్‌ ఉంటే క్లెయిమ్‌లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్‌–సూపర్‌ టాపప్‌ క్లెయిమ్‌ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. → టాపప్‌– సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. → బేసిక్‌ ప్లాన్, టాపప్‌/సూపర్‌ టాపప్‌ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.వీటిపై ఫోకస్‌ చేయండి.. → బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్‌వర్క్‌లో ఉంటే నయం. → ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్‌ ప్రొసీజర్స్‌) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి. → ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి. → అత్యాధునిక రోబోటిక్, లేజర్‌ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు. → ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్‌ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి. → ముఖ్యంగా రీసోర్టేషన్‌ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్‌ అష్యూర్డ్‌ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది. → ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. తగినంత కవరేజీ.. → చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్‌ అష్యూర్డ్‌) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది. → కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. → కనీసం రూ.10 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో బేసిక్‌ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది.

West Asia War Fears to Tighten Bears Grip on Stock Markets6
పశ్చిమాసియా పైనే మార్కెట్‌ ఫోకస్‌

పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆందోళనలు ఉపశమించే వరకూ సెంటిమెంటు బలహీనపడనున్నట్లు అంచనా వేశారు. వీటికితోడు చమురు ధరలకు రెక్కలువస్తే అటు వాణిజ్య లోటు, ఇటు రూపాయి బలహీనపడవచ్చని తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్‌అరబ్‌ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి. హుర్ముజ్‌ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్‌లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది. వెరసి తాజా పరిస్థితులు దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తవచ్చని, దీంతో ఆర్‌బీఐ పరపతి విధానాలపై ప్రభావం పడవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా, జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్‌ పేర్కొ న్నారు. టెక్నాలజీ స్టాక్స్‌లో బలహీనతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా ప్రస్తావించారు. ఆటో అమ్మకాల ఎఫెక్ట్‌ రేపు(3న) హోలీ పండుగ సందర్భంగా స్టాక్‌ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఫిబ్రవరి నెలకు ఆటో రంగ(వాహన) అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా నేడు(2న) ఆటో కౌంటర్లు వెలుగులో నిలచే వీలుంది. వారాంతాన ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కొత్త సిరీస్‌ ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఈ బాటలో ఈ వారం పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. మరోపక్క యూఎస్, చైనా గణాంకాలు సైతం విడుదలకానున్నాయని, వీటి ఆధారంగా ఈ వారం మార్కెట్లలో యాక్టివిటీ నమోదుకానున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. సాంకేతికంగా చూస్తే..గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులుగా మారి రూ. 22,615 కోట్ల విలువైన దేశీ స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధభయాలు ఇండెక్సులను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి అంచనాల ప్రకారం.. → ఈ వారం నిఫ్టీ 25,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. 24,800–24,700 స్థాయిలో సపోర్ట్‌ లభించే వీలుంది. ఇక్కడినుంచి బౌన్స్‌ అయితే 25,500–25,700 పాయింట్లవరకూ బలపడవచ్చు. → సెన్సెక్స్‌ 81,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. ఆపై 80,500–80,100 పాయింట్లస్థాయిలో మద్దతు కనిపించే వీలుంది. ఇక్కడి నుంచి పుంజుకుంటే 82,000– 82,500 పాయింట్లవరకూ పురోగమించే అవకాశముంది. గత వారమిలా ఆటుపోట్ల మధ్య గత వారం(ఫిబ్రవరి 23–27) దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్‌ 1,528 పాయింట్లు(2 శాతం) పతనమై 81,287 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 393 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,179 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement