Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Best 5 locations in Hyderabad offering affordable apartments1
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్లు!

హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పరంగా దూసుకుపోతోంది. ఐటీ కారిడార్‌లోని పశ్చిమ హైదరాబాద్‌లో గజం ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తక్కువ ధరలో అనువైన ఇళ్లు లభించే ఇతర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు కాస్తంత తక్కువలో దొరికే ఓ ఐదు ప్రాంతాలను ఈ కథనంలో పరిశీలిద్దాం..పటాన్‌చెరుపటాన్‌చెరు ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ముంబై హైవేకు సమీపంలో ఉండటం దీనికి పెద్ద ప్లస్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,800 – రూ.7,200రూ.55 - రూ.75 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్‌ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: ఐటీ కారిడార్‌కు (గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) కేవలం 20-30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.ఉప్పల్ - పోచారంతూర్పు హైదరాబాద్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఉప్పల్ ఐటీ పార్క్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడ ధరలు చాలా తక్కువ.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,500 – రూ.6,500ఇక్కడ రూ.45 - రూ.60 లక్షల మధ్య 2BHK ఫ్లాట్‌ లభిస్తుంది.అనుకూలతలు: మెట్రో రైల్ కనెక్టివిటీ, ఇన్ఫోసిస్ వంటి పెద్ద ఐటీ కంపెనీల క్యాంపస్‌లు ఉండటం వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు ఇది సరైన ఎంపిక.కొంపల్లినార్త్ హైదరాబాద్‌లో కొంపల్లి ప్రశాంతమైన, కాస్త త​‍క్కువ ధరలో ఇళ్లకు నిలయంగా మారింది. ఇది రిటైల్ హబ్‌గా కూడా ఎదుగుతోంది.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.5,000 – రూ.6,500రూ.40 - రూ.55 లక్షల లోపే ఇక్కడ అన్ని సౌకర్యాలతో 2BHK ఫ్లాట్‌ వస్తుంది.అనుకూలతలు: తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, నాణ్యమైన విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది ఫ్యామిలీస్ ఉండటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.నిజాంపేట్ - బాచుపల్లిఐటీ నిపుణులకు సమీపంలో, తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలనుకునే వారికి నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాలు హాట్ ఫేవరెట్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,200 – రూ.5,800రూ.50 - రూ.70 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్‌ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: మియాపూర్ మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.ఆదిభట్లవిమానాశ్రయం, టీసీఎస్ (TCS), ఏరోస్పేస్ పార్క్‌లకు సమీపంలో ఉండటం ఆదిభట్ల ప్రత్యేకత. పెట్టుబడి కోణంలో చూస్తే ఇది అద్భుతమైన ప్రాంతం.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.3,800 – రూ.4,800ఈ ప్రాంతంలో రూ.55 - రూ.75 లక్షలు పెడితే 2BHK ఫ్లాట్‌ కొనవచ్చు.అనుకూలతలు: ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వల్ల నగరం నలుమూలలకూ సులభంగా చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఇక్కడ ప్రాపర్టీ విలువలు బాగా పెరిగే అవకాశం ఉంది.పైన పేర్కొన్న ధరలు కొనుగోలుదారుల అవగాహన కోసం మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా ఇచ్చిన సగటు అంచనా ధరలు మాత్రమే. బిల్డర్, ఫ్లోర్, ఎంచుకునే సౌకర్యాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.

How to Migrate Your Group Medical Cover to a Personal Health Policy2
వ్యక్తిగత హెల్త్‌ పాలసీకి మైగ్రేషన్‌ ఇలా..

ప్రస్తుతం చాలా మటుకు సంస్థలు తమ ఎంప్లాయీ బెనిఫిట్‌ ప్యాకేజీలో భాగంగా గ్రూప్‌ మెడికల్‌ కవరేజ్‌ (జీఎంసీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు అందించే వేతన ప్యాకేజీలలో ఇది ఇప్పుడు ఒక కీలక భాగంగా మారింది. ఉద్యోగులకు ప్రాథమిక ఆరోగ్య బీమా రక్షణను అందించే ఈ జీఎంసీ పాలసీ, మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే వర్తిస్తుంది. 2020లో లాక్‌–డౌన్‌ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా కల్పించాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.అయితే, ఇది కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ తదుపరి కంపెనీలో ఇటువంటి బీమా సౌకర్యం లేకపోయినా లేదా కవరేజీ తక్కువగా ఉన్నా పరిస్థితి ఏమిటి? కెరీర్‌ నుంచి విరామం తీసుకున్నప్పుడో లేదా ఫ్రీలాన్సర్‌గానో, వ్యాపారవేత్తగానో మారినప్పుడో ఆరోగ్య బీమాను ఎలా మేనేజ్‌ చేసుకోవాలి? ఇక ఇప్పుడు ఇలాంటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. మీ జీఎంసీ పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే ‘కంటిన్యుటీ బెనిఫిట్‌’ అంటారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.పాలసీని ఎలా మార్చుకోవాలంటే ముందుగా, మీ జీఎంసీ పాలసీలో మీ కుటుంబ సభ్యులకు కూడా కవరేజీ ఉంటే, మీరు దాన్ని ’ఫ్యామిలీ ఫ్లోటర్‌’ ప్లాన్‌గా మార్చుకోవచ్చు. కేవలం మీకు మాత్రమే కవరేజీ ఉంటే, ’ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌’ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, మీ ప్రస్తుత గ్రూప్‌ పాలసీని అందిస్తున్న బీమా సంస్థకి మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. పాలసీ గడువు ముగియడానికి లేదా రెన్యువల్‌కి కనీసం 30 రోజుల ముందే బీమా సంస్థకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.వారి వద్ద ఉన్న వివిధ రిటైల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లను పరిశీలించి, మీ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకోండి. సరైన ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత, దానికి సంబంధించిన ప్రపోజల్‌ ఫామ్, మైగ్రేషన్‌ ఫామ్‌ వంటి పత్రాలను అడగండి. వాటిలో మీ ప్రస్తుత పాలసీ వివరాలు, ఆరోగ్య చరిత్ర, క్లెయిమ్‌ వివరాలను నింపి సమర్పించాలి. బీమా సంస్థ మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత, డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్, నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిబంధనల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.మైగ్రేషన్‌తో ప్రయోజనాలు దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ’వెయిటింగ్‌ పీరియడ్‌’. జీఎంసీ పాలసీలో మీరు ఇప్పటికే పూర్తి చేసిన వెయిటింగ్‌ పీరియడ్‌ కాలం, కొత్త రిటైల్‌ పాలసీలో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, కొత్త పాలసీలో ఒక నిర్దిష్ట వ్యాధికి 4 ఏళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండి, మీరు పాత జీఎంసీ 3 ఏళ్లు పూర్తి చేసి ఉంటే, కొత్త పాలసీలో మీరు కేవలం ఒక ఏడాది నిరీక్షిస్తే సరిపోతుంది.గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు అదే బీమా కంపెనీ: మీరు జీఎంసీని అదే బీమా సంస్థకు చెందిన రిటైల్‌ ప్లాన్‌లోకి మాత్రమే మర్చుకోగలరు. వైద్య పరీక్షలు: గ్రూప్‌ పాలసీలో సాధారణంగా మెడికల్‌ టెస్టులు ఉండవు. కానీ రిటైల్‌ పాలసీకి మారేటప్పుడు బీమా సంస్థ నిబంధల ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు. బీమా మొత్తం పెంపు: మీరు బీమా కవరేజీని పెంచుకున్నా, వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రయోజనం పాత పాలసీలో ఉన్న మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. అదనంగా పెంచుకున్న మొత్తానికి కొత్తగా వెయిటింగ్‌ పీరియడ్‌ వర్తిస్తుంది ఉదాహరణకు జీఎంసీ సమ్‌ ఇన్సూర్డ్‌ రూ.3 లక్షలు కాగా, కొత్త పాలసీలో దాన్ని రూ.5 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం. అలాంటప్పుడు వెయిటింగ్‌ పీరియడ్‌ బెనిఫిట్‌ అనేది రూ.3 లక్షలకే వర్తిస్తుంది. మిగతా రూ.2 లక్షలకు వెయిటింగ్‌ పీరియడ్‌ యథాప్రకారంగానే వర్తిస్తుంది.పాలసీ నిబంధనలు: కొత్త పాలసీలోని మినహాయింపులు, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. సమయానికి పాలసీని పునరుద్ధరించుకోవడం మర్చిపోవద్దు. మొత్తానికి, మీ జీఎంసీ పాలసీని రిటైల్‌ పాలసీగా మార్చుకోవడం వల్ల మీకు మెరుగైన రక్షణ, సౌలభ్యం లభిస్తాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటే మైగ్రేషన్‌ ప్రక్రియ సజావుగా ఉంటుంది, అలాగే అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది.

Amazon India brings farm fresh mangoes to your doorstep3
అమెజాన్‌లో మామిడి జాతర.. ఏఐతో నచ్చిన పండు

వేసవి కాలం రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్ల మధురమైన రుచి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమెజాన్ ఇండియా 'ఆమ్-ఎజింగ్' పేరిట ప్రత్యేక మామిడి పండ్ల విక్రయాలను ప్రారంభించింది. పొలాల నుండి నేరుగా సేకరించిన అల్ఫోన్సో, కేసర్, సఫేదా, తోతాపురి వంటి మేలైన రకాలను అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ ద్వారా అందిస్తోంది. పండ్లతో పాటు మామిడి ఐస్ క్రీములు, ఆమ్రస్, ఊరగాయలు, పానీయాలపై 30% నుండి 70% వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే లేదా గరిష్టంగా 2 గంటల్లోపు డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించింది.ఈ సీజన్ షాపింగ్‌లో ప్రధాన ఆకర్షణ అమెజాన్ వారి ఏఐ-ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ 'రూఫస్' (Rufus). వినియోగదారులు తమ మూడ్‌కు తగిన మామిడి పండును ఎంచుకోవడానికి రూఫస్ సహాయపడుతుంది. "రూ. 500 లోపు అల్ఫోన్సో చూపించు" లేదా "స్మూతీకి ఏ రకం బాగుంటుంది?" వంటి ప్రశ్నలకు ఇది తక్షణమే సమాధానాలిస్తుంది. అంతేకాకుండా, గత 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను విశ్లేషించి, వినియోగదారులు సరైన డీల్ పొందుతున్నారో లేదో తెలియజేస్తుంది. ధర తగ్గినప్పుడు అలర్ట్‌లు పంపడం, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు చేయడం ద్వారా ఈ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తోంది.ప్రతి వినియోగదారుని అవసరానికి తగినట్లుగా ఐదు రకాల కేటగిరీలను అమెజాన్ రూపొందించింది. తీపి కోరికలను తీర్చుకోవడానికి అల్ఫోన్సో రకాలు, వంటల కోసం తోతాపురి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఆమ్రస్, క్యాండీలు, ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం ఫ్రీజ్ డ్రైడ్ చిప్స్, ప్రోటీన్ షేక్ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.

Gold and Silver Rates Today (April 27): Check 22 and 24 carat gold prices4
మారిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు

దేశంలో బంగారం ధరలు మారిపోయాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో (Today Silver Rate) మాత్రం ఎలాంటి మార్పు లేదు. వరుసగా రెండో రోజూ నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

New Tax Rules for Salary Arrears Transitioning from Form 10E to Form 395
ఎరియర్స్‌ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..

కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు. సులభతరం అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్‌ త్వరగా అవుతుంది. అటు చట్టం, ఇటు రూల్స్‌లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది. పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు. ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ జీతాల ఎరియర్స్‌ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్‌ లెక్కించాలి.కొత్త సెక్షన్‌ 157 (1), కొత్త రూల్స్‌ 97, కొత్త ఫారం 39 కొత్త సెక్షన్‌ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్‌ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు. కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్‌ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్‌ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్‌మెంట్‌ పరిహారం, పెన్షన్‌..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్‌లో అన్నీ ఆటో పాపులేట్‌ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్‌ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్‌) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్‌ ఎంతో లెక్కించి వస్తుంది.ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్‌గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్‌లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.ఏయే డాక్యుమెంట్లు అవసరం.. మీ పాన్‌ కార్డు, మీ టీడీఎస్‌ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్‌ ఫారం, వచి్చన ఎరియర్స్‌ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్‌ వివరాలు కాగితాల రూపంలో కావాలి.అంతా ఆన్‌లైన్‌లోనే .. ఇది డిజిటల్‌ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్‌లైన్‌లో వేయకూడదు. పోర్టల్‌లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్‌ చేయండి. బేసిక్‌ డేటా, ఎంపిక చేసిన కాలమ్‌లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్‌ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్‌ చేయండి. అక్నాలెడ్జ్‌మెంట్‌ వస్తుంది. ఇక తరువాత.. రిటర్ను వేయడమే! రిలీఫ్‌ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు. అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్‌ మొదలుపెట్టండి.మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి.. ఉద్యోగులకు వర్తిస్తుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్‌ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు. గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి ఈ ఎరియర్స్‌ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు. అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది. ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్‌ అంటారు. ఆల్‌ ది బెస్ట్‌.

Stock Market April 27 Nifty tops 24,0006
లాభాల్లో స్టాక్‌ మార్కెట్.. 24,000 దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు పెరిగి 24,016 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 378 పాయింట్ల లాభంతో 77,042 వద్ద ట్రేడవుతోంది.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.16 శాతం, 1.05 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement