Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold loan book doubles in 2 years1
గోల్డ్‌లోన్‌ సూపర్‌ రన్‌ 

ముంబై: బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండడం.. వాటి తనఖా రుణాల మార్కెట్‌ విస్తరణకు అనుకూలిస్తోంది. 2025 నవంబర్‌ నాటికి రెండేళ్లలో పసిడి రుణాలు రెట్టింపై రూ.15.6 లక్షల కోట్లకు చేరాయి. ధరల పెరుగుదలతో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు వాటిపై మరింత మొత్తంలో రుణాల మంజూరునకు వీలు కల్పిస్తోంది. 2025 నవంబర్‌ నాటికి ఏడాది కాలంలో బంగారం తనఖా రుణాలు 42 శాతం పెరిగాయి. 2024 నవంబర్‌ నాటికి ఏడాది కాలంలో పెరుగుదల 39 శాతంగా ఉంది. దీంతో 2023 నాటికి రుణాల మొత్తం రూ.7.9 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నవంబర్‌ చివరికి రూ.15.6 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం రిటైల్‌ రుణాల్లో పసిడి రుణాల వాటా 9.7 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇది 8.1 శాతంగా ఉంది. ఈ వివరాలను క్రెడిట్‌ బ్యూరో సంస్థ క్రిఫ్‌ హైమార్క్‌ విడుదల చేసింది. పసిడి రుణాల్లో రూ.2.5 లక్షలకు మించినవి మొత్తం రుణాల్లో సగం మేర ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఇవి 36.4 శాతంగా ఉన్నాయి. 36 శాతం రుణాలు పురుషులు తీసుకున్నవే. మరింత వేగవంతం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన బంగారం రుణాలు, వాటి విలువ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లోనే అధిగమించడం గమనార్హం. బంగారం రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు 60% వాటాతో ఆధిపత్యం చలాయిస్తున్నా యి. బంగారం రుణ ఆధారిత ఎన్‌బీఎఫ్‌సీల వాటా 8.1%గా ఉంది. బంగారం రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు క్రిఫ్‌ హైమార్క్‌ తెలిపింది.దక్షిణాదిలోనే అధికం.. బంగారం రుణాల మా ర్కెట్‌ దక్షిణాదిలోనే ఎక్కు వగా ఉంది. మూడింట రెండొంతుల బంగారం రుణా లు దక్షిణాది రాష్ట్రాలో ఉన్నాయి. ఇక పది రాష్ట్రా ల పరిధిలోనే 90% రుణాలు ఉండడం గమనార్హం. 2025 నవంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో బంగారం రుణాల్లో 67% వృద్ధి గుజరాత్‌లో నమోదైంది. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో 50% వృద్ధి కనిపించింది. బంగారం రుణాలు సకాలంలో చెల్లించని రాష్ట్రాల్లో ఎక్కువగా తమిళనాడు, యూపీ, మహారాష్ట్రలు ఉన్నాయి.

Gold and Silver prices surge to new record high on haven demand2
వెండి, పసిడి అదే పరుగు..

న్యూఢిల్లీ: వెండి, పసిడి రేట్లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. అమెరికన్‌ డాలరు బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్ల దన్నుతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా బుధవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి కిలో ధర మరో రూ. 15,000 పెరిగి ఇంకో కొత్త ఆల్‌ టైం గరిష్టం రూ. 3,85,000కి ఎగిసింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 5,000 మేర పెరిగి రూ. 1,71,000కు ఎగిసింది. బంగారం, వెండి రేట్లు పటిష్టంగా ర్యాలీ చేస్తున్నాయని, ప్రతీ రోజు కొత్త గరిష్టాలకు ఎగదోసేందుకు బుల్స్‌కి కొత్త కారణాలు లభిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరంగా అనిశ్చితులు మొదలైన అంశాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి రేట్లకు రెక్కలొస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 74.57 డాలరు పెరిగి 5,256.35 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో 130.13 డాలర్లు ఎగిసి 5,311.38 డాలర్ల స్థాయిని కూడా తాగింది. అటు సిల్వర్‌ ధర 0.12 శాతం పెరిగి 112.22 డాలర్లకు చేరింది. అటు ఫ్యూచర్స్‌ మార్కెట్‌ కామెక్స్‌లో గోల్డ్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఒక దశలో దాదాపు 200 డాలర్లు పైగా పెరిగి 5,344.70 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఇక సిల్వర్‌ సైతం సుమారు పది డాలర్లకు పైగా పెరిగి ఒక దశలో 116.11 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ. 1,75,848 వద్ద, సిల్వర్‌ మార్చి కాంట్రాక్టు రూ. 3,85,200 వద్ద ట్రేడయ్యింది. అనిశ్చితికి, టారిఫ్‌ బెదిరింపులు, ఫెడరల్‌ రిజర్వ్‌ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాల్లాంటివి భౌగోళిక–రాజకీయ అనిశ్చితికి దారితీస్తూ, సిల్వర్, గోల్డ్‌ ధరలను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.

Boeing forecasts that India and South Asia will require 3300 new planes by 20443
దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రాబోయే దాదాపు రెండు దశాబ్దాల్లో 2044 నాటికి దక్షిణాసియాలోని ఎయిర్‌లైన్స్‌కి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరం కానున్నాయి. ఇందులో భారత్‌ వాటా దాదాపు 90 శాతం ఉండనుంది. అమెరికన్‌ విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ తమ కమర్షియల్‌ మార్కెట్‌ ఔట్‌లుక్‌ (సీఎంవో)లో ఈ మేరకు అంచనాలు వేసింది. బుధవారమిక్కడ ఏవియేషన్‌ సదస్సు వింగ్స్‌ 2026 కార్యక్రమం సందర్భంగా బోయింగ్‌ ఎండీ (కమర్షియల్‌ మార్కెటింగ్, యురేషియా, ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌) అశ్విన్‌ నాయుడు ఈ విషయాలు తెలిపారు. 3,300 విమానాల డిమాండ్‌కి సంబంధించి 2,875 చిన్న విమానాలు, 395 పెద్ద విమానాలు ఉండవచ్చని చెప్పారు. ప్రాంతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో విమానాల సంఖ్య వచ్చే 20 ఏళ్లలో నాలుగు రెట్లు పెరగనుందని నాయుడు తెలిపారు. ఇదే సమయంలో భారత్, దక్షిణాసియాలో ప్యాసింజర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ సగటున 7 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి జనాభా, ఆర్థిక వృద్ధి, ఎయిర్‌పోర్టులు, కనెక్టివిటీ పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని వివరించారు. భారీగా సిబ్బంది .. వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రాంతీయంగా విమానయాన సంస్థలకు సుమారు 1,41,000 మంది సిబ్బంది అవసరమవుతారని నాయుడు తెలిపారు. ఇందులో 45,000 మంది పైలట్లు, 45,000 మంది టెక్నీషియన్లు, 51,000 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉంటారని వివరించారు. దక్షిణాసియాలో మెయింటెనెన్స్, రిపేర్, డిజిటల్‌ సర్వీసులు, శిక్షణ మొదలైన ఏవియేషన్‌ సరీ్వసులపై 195 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైటెక్‌ తయారీ రంగం, ఈకామర్స్‌ తదితర రంగాల దన్నుతో ఎయిర్‌ కార్గో మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందనుందని, ఈ నేపథ్యంలో కొత్తవి, కన్వర్ట్‌ చేసిన ఫ్రైటర్ల సంఖ్య ప్రస్తుత స్థాయి నుంచి అయిదు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

india emphasized EU pact opens opportunities US deal remains critical4
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై కేంద్రం స్పష్టత

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ తన పట్టును బిగిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు మంగళవారంతో ముగిశాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు స్పష్టతనిచ్చారు. భారత్ తన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిందని, యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌ పరంగా ఇప్పుడు ముందడుగు వేయాల్సింది అమెరికానే అని తేల్చి చెప్పారు.అమెరికా అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలోని కొందరు సభ్యులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలను ప్రస్తుత చర్చలతో ముడిపెట్టవద్దని అధికారులు హెచ్చరించారు. ‘భారత్ తన వైపు నుంచి ఇవ్వాల్సిన ఆఫర్లను ఇప్పటికే యూఎస్‌ ముందుంచింది. భారత్‌ వైపు నుంచి ప్రక్రియ పూర్తయింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది యూఎస్‌’ అని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందం అసలు వివరాలు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR), చర్చల బృందాలకు మాత్రమే తెలుసని పేర్కొన్నారు.భారత్-ఈయూ ఒప్పందం కీలకంఅమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ ఈయూతో ఒప్పందం వేగవంతం కావడం వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ప్రీమియం వస్తువులపై భారత్ సుంకాల తగ్గింపునకు అంగీకరించింది. ప్రతిగా భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలకు ఈయూ మార్కెట్‌లో భారీ రాయితీలు లభించనున్నాయి. ఇది దేశంలో ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది.వ్యూహాత్మకంగా..అమెరికాతో ఉన్న అనిశ్చితి వల్లే ఈయూతో భారత్ వేగంగా ఒప్పందం చేసుకుంటోందనే వాదనలను అధికారులు తోసిపుచ్చారు. ‘ప్రతి చర్చకు దాని సొంత పథం, వ్యూహాత్మక హేతుబద్ధత ఉంటుంది. ఈయూ చర్చలు అమెరికా చర్చల కంటే చాలా ముందు నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఇది సహజమైన పరిణామమే తప్పా ఒక దేశంపై ఆధారపడి తీసుకున్న నిర్ణయం కాదు’ అని అధికారులు వివరించారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!

KPMG India Pre-Budget Survey 2026-27 highlights5
బడ్జెట్ 2026పై పారిశ్రామిక వర్గాల అంచనాలు

కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ పారిశ్రామిక వర్గాల అంచనాలు, ఆశలపై కేపీఎంజీ ఇండియా సర్వే విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను చట్టం నేపథ్యంలో పన్ను విధానాల సరళీకరణ, ప్రోత్సాహకాలపై స్టేక్‌హోల్డర్లు ఏమనుకుంటున్నారో ఈ ప్రీ-బడ్జెట్ సర్వే స్పష్టం చేస్తోంది.జనవరి 2026లో నిర్వహించిన ఈ సర్వేలో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలకు చెందిన 100 మందికి పైగా పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ప్రధాన మార్పులు ఇవే..పన్ను ప్రోత్సాహకాల పునరుద్ధరణతయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో ఉన్న తక్కువ పన్ను రేటు విధానాన్ని మళ్లీ తీసుకురావాలని 34 శాతం మంది కోరుతుండగా, దాదాపు 50 శాతం మంది నిర్దిష్ట రంగాల వారీగా ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.కొత్త ఐటీ చట్టం - సరళీకరణకొత్త చట్టం దిశగా అడుగులు పడుతున్నా కొన్ని అంశాల్లో మరింత స్పష్టత, సరళీకరణ అవసరమని సర్వే నొక్కి చెప్పింది. అందులో..టీడీఎస్‌/టీసీఎస్‌ నిబంధనల అమలులో సరళత.క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానంలో మార్పులు.లిటిగేషన్ (న్యాయపరమైన వివాదాలు), అసెస్‌మెంట్ ప్రక్రియలో వేగం అవసరమనే అభిప్రాయాలున్నాయి.స్టాండర్డ్ డిడక్షన్మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని గణనీయంగా పెంచాలని 73 శాతం మంది కోరుతున్నారు.జీఎస్టీ, ఇతర సంస్కరణలుజీఎస్టీ ‘ఇన్వాయిస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌’లో ఉన్న లోపాల వల్ల క్రెడిట్ నోట్ల మిస్‌మ్యాచ్‌లు పెరుగుతున్నాయని, వీటిని సరిదిద్దాలని 82 శాతం మంది కోరుతున్నారు.ప్రస్తుత డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) వివాదాలను వేగంగా పరిష్కరించడంలో విఫలమవుతోందని సగం మంది ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ల (IFSC) కోసం దీర్ఘకాలిక నిబంధనలు కావాలని 51 శాతం మంది కోరారు.‘పరిశ్రమ వర్గాలు కేవలం పన్ను తగ్గింపులనే కాకుండా పారదర్శక వివాద పరిష్కార వ్యవస్థను, పన్ను నిబంధనల పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి రానున్న కొత్త చట్టం ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి’ అని కేపీఎంజీ ఇండియా, ట్యాక్స్ హెడ్ సునీల్ బడాలా అన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!

BASF will open Global Digital Hub in Hyderabad in the first quarter 20266
హైదరాబాద్‌లోకి మరో అంతర్జాతీయ కంపెనీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్‌ఎఫ్‌ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు.గ్లోబల్ నెట్‌వర్క్‌లో కీలకం..ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్‌హాఫెన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న బీఏఎస్‌ఎఫ్‌ డిజిటల్ హబ్‌ల్లో ఇప్పుడు హైదరాబాద్ చేరనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి.ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్‌కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్‌లో ఉన్నాయి’ అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్‌ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.నియామక ప్రక్రియ ప్రారంభంహైదరాబాద్ హబ్ నిర్వహణ కోసం ‘BASF Digital Solutions Private Limited’ అనే కొత్త భారతీయ చట్టపరమైన సంస్థను (Legal Entity) ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ, ఇతర సన్నాహక పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు డీట్రిచ్ స్పాండౌ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అత్యుత్తమ డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఒక ఆకర్షణీయమైన వర్క్‌ప్లేస్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఇప్పటికే ఉన్న తయారీ, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలకు ఈ డిజిటల్ హబ్ అదనపు మద్దతు ఇస్తుందని కంపెనీ ఇండియా గ్రూప్ కంపెనీల అధిపతి అలెగ్జాండర్ గెర్డింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!

Advertisement
Advertisement
Advertisement