Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Wipro Launches 15000 Cr Share Buyback at Premium Amid Flat Q4 Profit1
విప్రో బంపర్‌ బైబ్యాక్‌!

ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో రూ. 15,000 కోట్లు వెచ్చించనుంది. మరోపక్క క్యూ4లో నికర లాభం 2 శాతం నీరసించి రూ.3,502 కోట్లకు చేరింది. సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రో భారీస్థాయిలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకీ రూ. 250 ధరలో 5 శాతానికిపైగా వాటా(దాదాపు 60 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనుంది. ఇందుకు ఏకంగా రూ. 15,000 కోట్లు కేటాయించింది. గురువారం మార్కెట్‌ ధర రూ. 210తో పోలిస్తే 18 శాతం ప్రీమియంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుంది. చెల్లించిన మూలధనంలో 5.7 శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు విప్రో సీఎఫ్‌వో అపర్ణ అయ్యర్‌ తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో బైబ్యాక్‌ పూర్తికాగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేశారు. బైబ్యాక్‌లో ప్రమోటర్, సంబంధిత గ్రూప్‌ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2026–27) తొలి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల బిజినెస్‌ నామమాత్ర క్షీణత(2 శాతం) లేదా యథాతథంగా 259.7–265.1 కోట్ల డాలర్లమధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా(గైడెన్స్‌) వేసింది. లాభం ఫ్లాట్‌గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో విప్రో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 2 శాతం నీరసించి రూ. 3,502 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2025–26) ఇదే కాలంలో రూ. 3,570 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 24,236 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,504 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. త్రైమాసికవారీగా క్యూ4లో విప్రో నికర లాభం 12 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున బలపడ్డాయి.ఇతర విశేషాలుక్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 2 శాతం వార్షిక వృద్ధితో 265.1 కోట్ల డాలర్లకు చేరింది.3 శాతం వృద్ధితో 345.5 కోట్ల డాలర్ల విలువైన బుకింగ్స్‌(డీల్స్‌) నమోదయ్యాయి.మార్చితో ముగిసిన 2025–26లో ఫ్లాట్‌గా రూ. 13,197 కోట్ల నికర లాభం ఆర్జించింది.మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 92,624 కోట్లను తాకింది.కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 నుంచి 2,42,156కు బలపడింది.మొత్తం 7,500 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. క్యూ4లో 3,000 మందికి చోటిచ్చింది.లాభాలకు సవాళ్లు...లాభాలపై రాజకీయ, భౌగోళిక, పాలసీ సంబంధ సవాళ్లు ప్రభావం చూపాయి. అయితే ఐటీ వ్యయాలు నిలకడగా నమోదవుతున్నాయి. సాధారణ రీతిలోనే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌–జూన్‌) ఫలితాలు బలహీనంగా వెలువడనున్నాయి. ఇందుకు యూఎస్‌ డీల్స్‌ ఆలస్యం, క్లయింట్‌ సమస్యలు ప్రభావం చూపనున్నాయి. – విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియాఐటీ దిగ్గజాల బైబ్యాక్‌ తీరిలావిప్రో తాజా బైబ్యాక్‌కు టెండర్‌ మార్గంలో తెరతీయనుంది. ఇంతక్రితం 2023లోనూ రూ. 12,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ చేపట్టింది. ఇక ఇన్ఫోసిస్‌ గతేడాది బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించింది. వెరసి అతి భారీ బైబ్యాక్‌ చేపట్టిన దేశీ కంపెనీగా రికార్డ్‌ నెలకొల్పింది. 2023 డిసెంబర్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ. 17,000 కోట్లతో బైబ్యాక్‌ను పూర్తి చేసింది. మరో ఐటీ కంపెనీ సైయెంట్‌ సైతం బైబ్యాక్‌ ప్రతిపాదన పరిశీలనకు ఈ నెల 23న బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం!ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Government Explores Ways to Keep 51percent Stake in PFC After REC Merger2
పీఎఫ్‌సీలో మెజారిటీ వాటాకు సై 

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ ఎన్‌బీఎఫ్‌సీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)లో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకునే యోచనలో ఉంది. విద్యుత్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజాలు పీఎఫ్‌సీతోపాటు.. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)లో పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం పీఎఫ్‌సీలో ఆర్‌ఈసీ విలీనాన్ని చేపట్టనుంది. అయితే అతిపెద్ద పీఎస్‌యూ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజంగా ఆవిర్భవించనున్న విలీన సంస్థలో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకోవాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు అనుగుణంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రమోటర్‌గా 51 శాతం వాటాను కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వానికి పీఎఫ్‌సీ ప్రిఫరెన్స్‌ షేర్ల జారీసహా.. వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకున్న మరో అవకాశం ప్రభుత్వానికి కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకాగా.. తద్వారా మెజారిటీ వాటాను నిలుపుకోవచ్చని తెలియజేశారు. ప్రభుత్వ వాటా ఇలా కంపెనీల చట్టం ప్రకారం పీఎస్‌యూగా గుర్తించేందుకు చెల్లించిన మూలధనంలో ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటా ఉండాలి. ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వ వాటా 55.99 శాతంకాగా.. ఆర్‌ఈసీలో 52.63 శాతం వాటా కలిగి ఉంది. రెండు సంస్థలలోనూ మిగిలిన వాటా సాధారణ వాటాదారుల(పబ్లిక్‌) వద్ద ఉంది. 2025 డిసెంబర్‌31కల్లా పీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్‌ లోన్‌ అసెట్‌ బుక్‌ రూ. 11.51 లక్షల కోట్లను తాకగా.. ఆర్‌ఈసీ రూ. 5.82 లక్షల కోట్ల అసెట్‌ బుక్‌ను కలిగి ఉంది. విద్యుత్‌ రంగ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్‌ సౌకర్యాలు కల్పించే పీఎఫ్‌సీ 20 శాతం మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తోంది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్‌ఈసీ ఫైనాన్సింగ్‌ సర్వీసులు అందించే సంగతి తెలిసిందే.

Edible oil imports down 9. 2percent in March3
భారీగా వంట నూనెల దిగుమతులు

న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు మార్చిలో భారీగా పెరిగాయి. 11,73,168 టన్నులుగా ఉన్నట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) తెలిపింది. గతేడాది మార్చి నెలలో దిగుమతులు 10,45,281 టన్నులతో పోల్చితే 12 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు (ఎడిబుల్‌ ఆయిల్‌) పెరగడం, రవాణా చార్జీలు కూడా అధికమైనందున, రానున్న నెలల్లో దిగుమతులు తగ్గొచ్చని ఎస్‌ఈఏ పేర్కొంది. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గుముఖం పట్టడం లేదంటే రూపాయి విలువ బలోపేతం అయ్యే వరకు దిగుమతులు పెరగకపోవచ్చని ఎస్‌ఈఏ అంచనా. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులను తటస్థం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించొచ్చని పేర్కొంది. → అత్యధికంగా ముడి పామాయిల్‌ (శుద్ధి చేయని) దిగుమతులు దాదాపు రెట్టింపు స్థాయిలో 6,73,965 టన్నులుగా ఉన్నాయి. 2025 మార్చిలో పామాయిల్‌ దిగుమతులు 3,43,949 టన్నులుగా ఉండడం గమనార్హం. → నాన్‌ ఎడిబుల్‌ నూనెల దిగుమతులు మాత్రం క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 27,742 టన్నుల నుంచి 13,401 టన్నులకు తగ్గాయి. నాన్‌ ఎడిబుల్‌ అంటే ఆహార వినియోగానికి పనికిరానివి. వీటిల్లో మలినాలు, హానికారకాలు ఎక్కువగా ఉంటుంటాయి. సబ్బుల్లో, లూబ్రికెంట్లలో, ఫార్మాస్యూటికల్స్‌ తయారీలో వీటిని వినియోగిస్తుంటారు. → వెజిటబుల్‌ నూనెల దిగుమతులు 11 శాతం పెరిగి 11,86,569 టన్నులుగా ఉన్నాయి. సోయా, సన్‌ఫ్లవర్, పీనట్, కార్న్, కనోలా ఇవన్నీ వెజిటుబల్‌ ఆయిల్స్‌ కిందకు వస్తాయి. వీటితో సహా వంటకు వినియోగించే అన్ని రకాల నూనెలను ఎడిబుల్‌ ఆయిల్స్‌గా పేర్కొంటారు. → 2025–26 మార్కెటింగ్‌ సంవత్సరంలో మొత్తం వెజిటబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 8 శాతం పెరిగి 65,72,131 టన్నులకు చేరాయి. ఏటా నవంబర్‌తో మొదలై మరుసటి సంవత్సరం అక్టోబర్‌తో ఇది ముగుస్తుంటుంది. నెలవారీగా తగ్గుముఖం.. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే మార్చిలో వంట నూనెల దిగుమతులు పెరిగినప్పటికీ.. అంతక్రితం నెలతో (ఈ ఏడాది ఫిబ్రవరి) పోల్చి చూస్తే మాత్రం దిగుమతులు 10 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో దిగుమతులు 12.92 లక్షల టన్నులుగా ఉన్నాయి. పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియా నుంచి.. సోయాబీన్‌ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి భారత్‌ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. మొత్తం అవసరాల్లో సగానికి పైనే దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

India Unemployment Rate Climbs to 5. 1percent in March4
పెరిగిన నిరుద్యోగం 

న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు మార్చి నెలలో స్వల్పంగా పెరిగి 5.1 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 4.9 శాతంగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా పెరిగింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్లు నిండిన పట్టణ జనాభాలో నిరుద్యోగం ఫిబ్రవరిలో ఉన్న 6.6 శాతం నుంచి మార్చిలో 6.8 శాతానికి చేరింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగగా, గ్రామీణ పురుషుల్లో స్వల్పంగా పెరిగింది. కార్మికుల భాగస్వామ్య రేటు మార్చి నెలకు 55.4 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 55.9 శాతంగా ఉండడం గమనార్హం. జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి మార్చిలో 52.6 శాతం వద్ద స్థిరంగా కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో 55.5 శాతం, పట్టణాల్లో 46.8 శాతంగా ఉండడం గమనార్హం.

West Asia tensions dampen India tourism inflows5
ఆతిథ్యం, ఎయిర్‌లైన్స్‌పై వార్‌ ఎఫెక్ట్‌ 

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 తర్వాత నుంచి చూస్తే 15–20 శాతం మేర విదేశీ పర్యాటకులు తగ్గిపోయారు. దీని ఫలితంగా ఒక్క ఎయిర్‌లైన్స్‌ రంగమే రూ.18,000 కోట్ల వ్యాపారాన్ని నష్టపోతుందన్నది అంచనా. అతిథ్య పరిశ్రమపైనా ప్రభావం ఉంటుందని తాజాగా విడుదలైన ఒక నివేదిక అంచనా వేసింది. విమాన ప్రయాణాలను రద్దు చేసుకోవడం, గగనతలంపై ఆంక్షలతో అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌ సర్వీసులు మార్గాలను మార్చుకుని వెళ్లాల్సి వస్తుండడం ఇవన్నీ ఎయిర్‌లైన్స్‌ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. దీని ఫలితంగా ప్రయాణ సమయం 2–4 గంటలు పెరుగుతోందని, ఇంధన, నిర్వహణ ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తోందని ఈ నివేదిక అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తతను అనుసరిస్తున్నారు. తమ పర్యటలను వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు సుదూర ప్రాంతాల కంటే థాయ్‌లాండ్, సింగపూర్, వియత్నాం వంటి తక్కువ దూరంలోని ప్రాంతాలకు వెళ్లి రావడానికే మొగ్గు చూపుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. రెస్టారెంట్లకూ కష్టాలు.. రెస్టారెంట్, ఫుడ్‌ సర్వీసెస్‌ (ఆహార విక్రయ సంస్థలు) సంస్థలు సైతం పశ్చిమాసియా యద్ధం తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా వీటి వ్యయాలు 10–15 శాతం మేర పెరిగాయి. దిగుమతి చేసుకుంటున్న ముడి పదార్థాలు, రవాణా, ఇంధన ధరలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అంచనా. ముఖ్యంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాలో సమస్యలు రెస్టారెంట్‌ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నట్టు ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్‌ సాగర్‌ దర్యాని తెలిపారు. 10 శాతం రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయని, 60–70 శాతం రెస్టారెంట్లు ఇండక్షన్‌ కుకింగ్, ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లినట్టు పేర్కొన్నారు. పరిమిత సరఫరా నేపథ్యంలో మెనూ తగ్గించుకుని, తక్కువ సమయం పాటు కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఉపాధిపైనా ప్రభావం.. రెస్టారెంట్ల రంగంలో రోజువారీ రూ.2,650 కోట్ల కార్యకలాపాలు కొనసాగుతుంటాయని ఈ నివేదిక పేర్కొంది. అంటే నెలవారీ రూ.79,000 కోట్లు. ఈ రంగంలో 85 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎక్కువ కాలం పాటు ఈ ప్రతికూలతలు కొనసాగితే 5–7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. అంతేకాదు రెస్టారెంట్ల విస్తరణపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. కాగా, ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు గాను.. మరిన్ని అంతర్జాతీయ మార్గాలకు ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను విస్తరించడంతోపాటు, ఎంఎస్‌ఎంఈలకు మరింత సులభంగా రుణాలు అందేలా చూడాలని ఈ నివేదిక సూచించింది. దేశీ పర్యాటకం మెరుగ్గానే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పర్యాటకం తిరిగి పూర్వపు స్థితికి రావడానికి మరో 6 నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Volvo Car India Announces Price Hike Of Up To Rs 1 Lakh From May 16
వోల్వో కీలక ప్రకటన: రూ.లక్ష వరకు పెరగనున్న ధరలు!

వోల్వో కార్ ఇండియా.. 2026 మే 1 నుంచి తమ కార్ల ధరలను లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు ధృవీకరించింది. ఇటీవల పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఆడి, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ఇతర లగ్జరీ బ్రాండ్‌లు కూడా ధరలను సర్దుబాటు చేయవలసి వస్తున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.వోల్వో భారత పోర్ట్‌ఫోలియోలో నాలుగు ప్రధాన మోడళ్లు ఉన్నాయి. అవి EX30, EC40, XC60, XC90. ప్రతి మోడల్‌కు సంబంధించిన నిర్దిష్ట ధరల పెంపులను కంపెనీ వెల్లడించనప్పటికీ, అన్ని వేరియంట్‌ల ధరలను గరిష్టంగా రూ.1 లక్షకు పరిమితం చేయనున్నట్లు సమాచారం.కొత్త ధరలు మే 1వ తేదీ నుంచి బుకింగ్‌లు, డెలివరీలకు వర్తిస్తాయి. అంటే అంతకు ముందు బుక్ చేసుకున్న లేదా కొనుగోలు చేసే కార్లకు పాత ధరలే వర్తిస్తాయి. కాగా వోల్వో కార్ ఇండియా దేశవ్యాప్తంగా 23 షోరూమ్‌లు మరియు 25 సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement