Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sensex, Nifty Open Higher After Trump Tariffs Scrapped By US Supreme Court1
మార్కెట్‌కు ‘యూఎస్‌ సుప్రీం’ జోష్‌

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు(టారిఫ్‌లు) చెల్లవంటూ యూఎస్‌ సుప్రీం కోర్టు ఇచి్చన తీర్పు ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 25,713 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ లాభాల ముగింపు. ఉదయమే సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో ముందుకు కదిలాయి. స్థిరమైన డిమాండ్, ఆర్థిక పునరుద్ధరణపై ఆశావహ అంచనాలతో ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డి్రస్కేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్‌ 671 పాయింట్లు పెరిగి 83,486 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 25,771 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.ళీ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్స్‌ 1.4%, సరీ్వసెస్‌ 0.97%, హెల్త్‌కేర్‌ 0.89%, విద్యుత్‌ 0.76%, ఆటో 0.71%, ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ 0.65%, ఎఫ్‌ఎంసీజీ 0.54%, యుటిలిటి 0.52 శాతం పెరిగాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.41% లాభపడగా, మిడ్‌క్యాప్‌ సూచీ 1.56% నష్టపోయింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు డీలాహరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో 20% క్షీణించి రూ.66.85 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ తాకింది. చివరికి 16% నష్టంతో రూ.70 వద్ద స్థిరపడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్‌ షేరు 5.30% పతనమై రూ.974 వద్ద స్థిరపడింది.

Medicover Hospitals signs agreement with Evergreen Healthcare2
మెడికవర్‌ ఎయిర్‌ అంబులెన్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా, అంతర్జాతీయంగా పేషంట్ల బదిలీ కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ సరీ్వసులను అందుబాటులోకి తెచ్చేలా ఎవర్‌గ్రీన్‌ హెల్త్‌కేర్‌తో మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో కొత్త ఆసుపత్రిని ఇంకా అధికారికంగా ప్రారంభించేలోపే ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల, తొలి రోజు నుంచే ఎమర్జెన్సీ సమయాల్లో మరింత మెరుగ్గా స్పందించేందుకు వీలవుతుందని సంస్థ తెలిపింది. ప్రతి క్షణం విలువైనదిగా ఉండే క్రిటికల్‌ కేసుల్లో ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని హెడ్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ నయన్‌ శ్రీరాముల తెలిపారు. ప్రమాదాలు, గుండెపోటులాంటి క్రిటికల్‌ సందర్భాల్లో పేషంట్లను ఆసుపత్రికి తరలించే ప్రక్రియ నిపుణుల పర్యవేక్షణలో జరగడమనేది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.

Telangana orders 1,085 Olectra e-buses says TGSRTC3
ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పీఎం ఈ–డ్రైవ్‌ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ (టీజీఎస్‌ఆర్‌టీసీ) నుంచి 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డరు వచి్చనట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి తమ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ద్వారఫ్లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ లభించినట్లు వివరించింది. ఎలక్ట్రిక్‌ బస్సులను హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం వినియోగించనున్నట్లు సంస్థ ఎండీ మహేష్‌బాబు తెలిపారు. ఇక్కడి రహదారులకు అనుగుణంగా ఏసీ, నాన్‌ ఏసీ వేరియంట్లలో 12 మీటర్ల లో–ఫ్లోర్‌ కాని్ఫగరేషన్స్‌తో ఈ బస్సులను అందించనున్నట్లు వివరించారు. ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కి.మీ. మైలేజీనిచ్చే విధంగా ఇవి ఉంటాయని, సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్‌ చేసేందుకు వీలుంటుందని మహేష్‌బాబు తెలిపారు. ఇప్పటికే కంపెనీకి చెందిన 3,600 ఎలక్ట్రిక్‌ బస్సులు దేశవ్యాప్తంగా రహదారులపై తిరుగుతుండగా, 10,000 పైగా వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి.

Banks must focus on Core Banking, not Insurance Sales4
బ్యాంకులూ..మీ పని మీరు చూసుకోండి

న్యూఢిల్లీ: బ్యాంకులు తమ అసలు వ్యాపారం అయిన డిపాజిట్లు సమీకరించడం, రుణాలు ఇవ్వడం, తక్కువ వ్యయాలతో కూడిన కాసా డిపాజిట్లను పెంచుకోవడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. అంతేకానీ, బ్యాంకుకు సంబంధం లేని బీమా, ఇతర ఉత్పత్తులను అనుచిత మార్గాల్లో విక్రయించే (మిస్‌ సెల్లింగ్‌) చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ‘‘బ్యాంక్‌లు తమ ప్రధాన వ్యాపార సూత్రాలను దృష్టిలో పెట్టుకోకుండా, వారి రుణ అవసరాలను అర్థం చేసుకోకుండా, వారితో సంబంధాలను బలోపేతం చేసుకోకుండా, ఇతర కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అవసరం లేకపోయినప్పటికీ బీమా పాలసీల విక్రయాలపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాయి. దీంతో రెండు స్కూళ్ల పరిధిలోకి (ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ నియంత్రణలు) వచ్చి చేరుతున్నాయి. కస్టమర్లకు అప్పటికే బీమా రక్షణ ఉన్నప్పటికీ, మళ్లీ కొనుగోలు చేయాలని బ్యాంక్‌లు అడుగుతున్నాయి. బీమా ఐఆర్‌డీఏఐ పరిధిలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఈ తప్పుడు విక్రయాలను ఆర్‌బీఐ పర్యవేక్షించడం లేదు. బ్యాంక్‌లు ఆర్‌బీఐ పరిధిలోకి వస్తాయని ఐఆర్‌డీఏఐ ఊరుకుంటోంది. ఈ పర్యవేక్షణ అంతరాల వల్ల కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’అని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంత్రి సీతారామన్‌ వ్యాఖ్యానించారు. మిస్‌ సెల్లింగ్‌పై ఆర్‌బీఐ ఫిబ్రవరి 11న ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేయడం గమనార్హం. వీటి ప్రకారం కస్టమర్లకు అవసరం లేని ఉత్పత్తులను విక్రయించరాదు. అలా చేసినట్టు తేలితే కస్టమర్‌ చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా ఉత్పత్తి లేదా సేవను విక్రయించడం వల్ల కస్టమర్‌ నష్టపోయినట్టు తేలితే, ఆ మేరకు పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. మిస్‌సెల్లింగ్‌ ఆమోదయోగ్యం కాదంటూ ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ లేదని సీతారామన్‌ అన్నారు. బంగారం దిగుమతులపై కన్నేసి ఉంచాం.. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని.. దీనిపై ప్రభుత్వం, ఆర్‌బీఐ కన్నేసి ఉంచినట్టు మంత్రి సీతారామన్‌ చెప్పారు. అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంక్‌లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు బంగారం దిగుమతులు బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 50 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. బంగారం భారతీయ కుటుంబాలకు ఎల్లప్పుడూ అనుకూల పెట్టుబడి సాధనంగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సైతం ఈ సమావేశంలో భాగంగా మీడియాతో చెప్పారు.ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కే పరిమితం.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసపూరిత ఘటన వ్యవస్థాపరమైన సమస్య కాదన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా. పరిణామాలను గమనిస్తున్నట్టు చెప్పారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ చండీగఢ్‌ శాఖలో హరియాణా ప్రభుత్వ సంస్థల ఖాతాల నుంచి ఉద్యోగులు నిధులను దారి మళ్లించడం తెలిసిందే. 2024 బేస్‌ సంవత్సరం ఆధారంగా విడుదలయ్యే రిటైల్‌ ద్రవ్యోల్బణం.. కుటుంబాల వినియోగం తీరుతెన్నులను మరింత ప్రభావంతంగా ప్రతిఫలిస్తుందని మల్హోత్రా తెలిపారు.

Why Some Cars Have Blue Colour Number Plates in India Know The Details Here5
బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. వాళ్లకు మాత్రమే ఎందుకు?

సాధారణంగా రోడ్డుపై కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్స్ వైట్, ఎల్లో, గ్రీన్ గంగులలో ఉండటం చాలామంది గమనించి ఉంటారు. అయితే అరుదుగా బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ కూడా చూసి ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి కలర్ నెంబర్ ప్లేట్ ఎందుకు అరుదుగా కనిపిస్తుంది?, దీనిని ఎవరికి కేటాయిస్తారు? అని ఆలోచించారా.. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. ప్రధానంగా విదేశీ దౌత్యవేత్తలు & రాయబార కార్యాలయాలకు చెందిన వాహనాలకు కేటాయిస్తారు. నెంబర్ ప్లేట్ రంగును బట్టి దౌత్య సిబ్బందికి చెందిన వాహనాలు అని.. అధికారులు గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, అధికారిక ప్రయోజనానికి మాత్రమే.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం సభ్య దేశాలు దౌత్య సంబంధాల విషయంలో కొన్ని నియమాలను పాటిస్తాయి. భారతదేశం కూడా ఆ ఒప్పందానికి సభ్యదేశం కావడంతో ఈ విధానం అమలులో ఉంది.నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెలుపు అక్షరాలు ఉండటం వల్ల ఈ వాహనాలు సులభంగా గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తిగత వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్లు, కమర్షియల్ వాహనాలకు పసుపు నెంబర్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ పోలీసులు దౌత్య వాహనాలను త్వరగా గుర్తించగలుగుతారు.ఈ వాహనాల నెంబర్ ప్లేట్‌పై తెలుపు రంగులో అక్షరాలు & సంఖ్యలు ఉంటాయి. కొన్ని ప్లేట్లపై CD లేదా CC వంటి గుర్తులు కనిపిస్తాయి. CD అంటే దౌత్యవేత్తలకు చెందిన వాహనం, CC అంటే కాన్సులేట్ అధికారులకు చెందిన వాహనం.దౌత్యవేత్తలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక హక్కులు. వారికి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే సదుపాయం కూడా లభిస్తుంది. అయితే.. దీని అర్థం వారు చట్టానికి అతీతులు కాదు. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. సంబంధిత దేశం ఆ వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లమని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా తప్పకుండా రహదారి నియమాలు & భద్రతా ప్రమాణాలను పాటించాలి.ఇదీ చదవండి: 'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

Know The Reasons Of Gold Price Hike Says FM Sitharaman6
'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులే.. బంగారం ధర పెరుగుదలకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. ఫిబ్రవరి 23న ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారంలో ఎక్కువ భాగం కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరుగుదలకు కారణం అవుతోందని అన్నారు.ఇతర కారణాలుకేంద్ర బ్యాంకుల కొనుగోలు మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు & సుంకాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆసక్తి కూడా గోల్డ్ రేటు అమాంతం పెంచేస్తున్నాయి. డిమాండుకు తగ్గ సరఫరా ఉన్నప్పుడు ధరలు స్థిరంగా ఉంటాయి. సరఫరా తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు బంగారం ధరలు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో తెలుగు రాష్ట్రల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,61,350 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,47,900 వద్ద ఉంది.

Advertisement
Advertisement
Advertisement