ప్రధాన వార్తలు
2026లో పెరగనున్న వేతనాలు!
భారతీయ కార్పొరేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రానున్న ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందనుంది. 2025లో నమోదైన 8.9 శాతం వేతన పెంపు 2026లో 9.1 శాతానికి చేరుకోనుందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా విడుదలైన ‘32వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2025-26’ ప్రకారం.. దేశంలోని 45 పరిశ్రమలకు చెందిన సుమారు 1,400 సంస్థల గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించారు.రంగాల వారీగా వేతనాల జోరుఈ ఏడాది వేతన పెంపులో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలు) రంగాలు అగ్రస్థానంలో నిలవనున్నాయి. సాంకేతికత, ఇంజినీరింగ్, కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం సంస్థలు పోటీ పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో చెప్పారు.ప్రధాన రంగాల అంచనాలుపరిశ్రమ2025 వాస్తవ పెంపు (%)2026 అంచనా (%)ఎన్బీఎఫ్సీ9.710.1రియల్టీ / ఇన్ఫ్రా10.510.2ఆటోమోటివ్9.89.9రిటైల్9.09.5టెక్నాలజీ7.06.6 తగ్గిన వలసలుగడిచిన మూడేళ్లుగా ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్-ఉద్యోగ మార్పు) క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం.2023: 18.7%2024: 17.7%2025: 16.2%ప్రస్తుతం ఈ రేటు కొవిడ్ పూర్వపు స్థాయికి చేరుకుంది. కంపెనీలు అనుసరిస్తున్న మెరుగైన నియామక ప్రక్రియలు, ఉద్యోగుల నిలుపుదల కోసం చేపడుతున్న కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు ఈ సానుకూల మార్పుకు కారణమని నివేదిక పేర్కొంది.ఈ సందర్భంగా ఏయాన్ ఇండియా పార్టనర్ రూపాంక్ చౌదరి మాట్లాడుతూ..‘భారతదేశం ప్రస్తుతం బలమైన స్థూల ఆర్థిక పునాదులతో వృద్ధి పథంలో ఉంది. దేశీయ గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల కంపెనీలు ప్రతిభావంతులపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు. దేశంలో కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తుండటంతో కంపెనీలు తమ వేతన నిర్మాణాలను మారుస్తున్నాయని ఏయాన్ అసోసియేట్ పార్టనర్ అమిత్ కుమార్ ఓత్వానీ తెలిపారు.ఇదీ చదవండి: రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
నేటి డిజిటల్ యుగంలో ఓ పూట ఫుడ్ లేకపోయినా ఉండగలరేమో కానీ, ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఇళ్లలో వై-ఫై రౌటర్లు ఇప్పుడు నిత్యావసర వస్తువులైపోయాయి. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో కూడా మీ రౌటర్ ఆన్ చేసే ఉంటుందా? అలా అయితే అది మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మీ నిద్రపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభనష్టాలపై విశ్లేషణ మీకోసం..నిద్రలేమికి రౌటర్ కారణమా?చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే నీరసంగా, అలసటగా ఉన్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి గదిలో ఉండే వై-ఫై రౌటర్ నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు ఒక కారణం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.ఆర్ఎంఐటీ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) రిపోర్ట్: 2024లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం వై-ఫై రౌటర్ సమీపంలో నిద్రించే వారిలో 27 శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. 2.4 గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ గల వై-ఫై సిగ్నల్స్ మానవుల గాఢ నిద్రను తగ్గిస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్-అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ వంటి సంస్థలు.. వై-ఫై రేడియేషన్ చాలా స్వల్పమని, ఇది మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపదని అంటున్నాయి.రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలురేడియేషన్ ప్రభావం పక్కన పెడితే రౌటర్ ఆఫ్ చేయడం వల్ల డిజిటల్ ప్రపంచం నుంచి మన మెదడుకు విరామం దొరుకుతుంది. ఇది మానసిక ప్రశాంతతో గాఢ నిద్రకు ఉపకరిస్తుంది.రౌటర్ నిరంతరం ఆన్ చేసి ఉంచడం వల్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. రాత్రిపూట ఆఫ్ చేయడం ద్వారా ఏడాదికి కొంత మేర విద్యుత్ ఆదా చేయవచ్చు.రాత్రిపూట ఇంటర్నెట్ వాడనప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం వల్ల హ్యాకింగ్ ముప్పు తగ్గుతుంది. అలాగే అనవసరమైన బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ ఆగిపోయి డేటా మిగులుతుంది.నిరంతరం ఆన్లో ఉంటే వేడి వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యం తగ్గుతుంది. రాత్రి పూట పవర్ ఆఫ్ చేయడం వల్ల రౌటర్ జీవితకాలం పెరుగుతుంది.ఎప్పుడు ఆఫ్ చేయకూడదు?మీరు స్మార్ట్ హోమ్ టెక్నాలజీని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని పరిస్థితుల్లో వై-ఫై ఆఫ్ చేయకపోవడమే మంచిది. అందులో..మీ ఇంట్లో సీసీ కెమెరాలు వై-ఫై ద్వారా పని చేస్తున్నప్పుడు.స్మార్ట్ డోర్ లాక్స్, వాయిస్ అసిస్టెంట్లు వాడుతున్నప్పుడు.సెక్యూరిటీ అలారమ్స్ యాక్టివ్గా ఉండాల్సినప్పుడు.ఒకవేళ మీరు వై-ఫై ఆఫ్ చేయలేని పరిస్థితులుంటే రౌటర్ను మీ బెడ్రూమ్లో కాకుండా హాలులో లేదా బెడ్కు కనీసం 10-15 అడుగుల దూరంలో అమర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
వినియోగంలో లేని (ఇనాపరేటివ్) దాదాపు ఏడు లక్షల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లోని సుమారు రూ.30.52 కోట్ల మొత్తాన్ని రిఫండ్ చేయడంపై ఈపీఎఫ్వో దృష్టి పెడుతోంది. సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలను సెటిల్ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.ఉద్యోగి లేదా కంపెనీ నుంచి 36 నెలలకు పైగా ఎలాంటి జమ లేని పీఎఫ్ ఖాతాలను ఇనాపరేటివ్గా పరిగణిస్తారు. సంబంధిత వర్గాల ప్రకారం 31.86 లక్షల ఇనాపరేటివ్ ఖాతాల్లో మొత్తం రూ. 10,903 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 1,000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లు ఏడు లక్షలు ఉన్నాయి. ఆధార్తో అనుసంధానమైన ఈపీఎఫ్ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నారు. ఖాతాదారు చనిపోతే..ఒకవేళ ఖాతాదారు మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులకు చెల్లిస్తారు. అటు, సభ్యులు, సంస్థలకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఈపీఎఫ్వో 3.0 ప్రాజెక్టుపై కేంద్రం కసరత్తు చేస్తోంది.ఇదీ చదవండి: మార్కెట్ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
స్వల్పంగా పెరిగిన బంగార ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
చంద్రశేఖరన్ ఎంపిక వాయిదా
దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ బోర్డ్ తాజాగా నిర్వహించిన సమావేశంలో 62 ఏళ్ల నజరాజన్ చంద్రశేఖరన్ ఎంపికపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. గ్రూప్ చైర్మన్గా మూడోసారి పదవీ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు హోల్డింగ్ కంపెనీలో విభేదాలు కారణమని తెలుస్తోంది. 2027 ఫిబ్రవరితో చంద్రశేఖరన్ పదవీ కాలం ముగియనుంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్న నోయెల్ టాటా గ్రూప్లోని కొన్ని కంపెనీలకు వాటిల్లుతున్న నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా టాటా సన్స్ లిస్టింగ్పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నాయి. వెరసి చంద్రశేఖరన్ బాధ్యతల పొడిగింపుపై నిర్ణయం వాయిదాపడినట్లు తెలియజేశాయి.టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కు 66 శాతం వాటా ఉంది. అయితే సమావేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ వెలువడకపోవడం గమనార్హం! కాగా.. గ్రూప్లోని ఒక కంపెనీ నష్టాలు నమోదు చేస్తున్నంతమాత్రాన మొత్తం గ్రూప్తోపాటు.. కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైర్మన్ పనితీరును తప్పుపట్టడం సరికాదని బోర్డు సభ్యులు పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కొంతమంది డైరెక్టర్లు ఈ అంశంపై ఓటింగ్కు ప్రతిపాదించినప్పటికీ చంద్రశేఖరన్ వాయిదాకు ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 నుంచి..1987లో టాటా గ్రూప్లో చేరిన చంద్రశేఖరన్ తదుపరి కాలంలో ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆపై 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్గా ఎంపికయ్యారు. విభిన్న బిజినెస్లుగల కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ పునర్వ్యవస్థీకరణ, కన్సాలిడేషన్ సమయంలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రూప్లోని 15 భారీ లిస్టెడ్ కంపెనీల ఆదాయం, నికర లాభాలు రెట్టింపయ్యాయి.ఇదీ చదవండి: మార్కెట్ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 152 పాయింట్లు పెరిగి 25,573 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 501 పాయింట్లు పుంజుకొని 82,722 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.82బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.77 శాతం పెరిగింది.నాస్డాక్ 1.05 శాతం పుంజుకుంది.Today Nifty position 25-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్పొరేట్
2026లో పెరగనున్న వేతనాలు!
చంద్రశేఖరన్ ఎంపిక వాయిదా
ఐటీలో పెను మార్పులు
సవాళ్లున్నా సాఫ్ట్వేర్దే హవా
ఫోన్పే పనితీరు ఓకే..
తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!
రూ.20 వేలకోట్ల పెట్టుబడి: ఎయిర్టెల్ ప్లాన్ ఏంటి?
25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన బుక్
తెలంగాణలో త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’
‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్ఫామ్ ప్రారంభం
పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో...
4 కంపెనీల లిస్టింగ్కు ఓకే
రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట...
మార్కెట్కు ‘యూఎస్ సుప్రీం’ జోష్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ...
ఏప్రిల్ 2026 నుంచి ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’తో తగ్గుదల!
భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా...
ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు
దేశంలో ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప...
భారత ఆర్థిక భవిష్యత్తుకు పెన్షన్లు కీలకం
భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించి చర్చ వచ్చినప్పుడల్...
‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వివో నుంచి ప్రీమియం ఫోన్లు.. ‘జీస్’ ట్రిపుల్ కెమెరాతో..
న్యూఢిల్లీ: వివో ఇండియా తన ‘వీ’ సిరీస్ నుంచి ‘వివో వీ70’, ‘వివో వీ70 ఎలైట్’ పేర్లతో రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ‘వివో’ ఈసారి కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘జీస్’ సంస్థతో ప్రతేక్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండు ఫోన్లలోనూ జీస్ పార్ట్నర్షిప్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.50 మెగా పిక్సెల్(ఎంపీ) ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ టెలి ఫొటోలెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఉత్తమ సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 ఎంపీ జీస్ ఫ్రంట్ కెమెరా ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్లతో ప్రీమియం లుక్ ఇచ్చారు. వీటికి ఐపీ68, ఐపీ69 రేటింగ్ ఉండడంతో నీరు, దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. 6.59 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేటుకు, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తాయి.ఈ రెండూ ఆండ్రాయిడ్ 16తో కూడిన ఆరిజన్ ఓఎస్6తో పనిచేస్తాయి. వీటికి ఆరేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్ ప్రకటించింది. రెండు ఫోన్లలో భారీ 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫ్లాష్ఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 11 గంటల నావిగేషన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. హీట్ తగ్గించడానికి ‘బైపాస్ ఛార్జింగ్’ సౌకర్యం కూడా ఉంది.వివో వీ70 ఇందులో స్నాప్డ్రాగన్ 7 జెన్4 ప్రాసెసర్ను అందించారు. రోజువారీ పనులు, గేమింగ్కు అనుకూలంగా ఉంటుంది. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.49,999కు లభిస్తుందివివో వీ70 ఎలైట్ ఇందులో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్జెన్3 చిప్సెట్తో వస్తుంది. ఇది గేమింగ్, అధిక పనితీరుకు అనువుగా ఉంటుంది. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధరను రూ.51,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.56,999, 12జీబీ+ 512 జీబీ వేరియంట్ ధర రూ.61,999గా నిర్ణయించింది.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్ కార్డులపై 10% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.1,499 వివో ఇయర్ బడ్స్ ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, వివో ఆన్లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి.
ఆంథ్రోపిక్ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!
అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..ఆంథ్రోపిక్ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్స్ట్రయిక్ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్ 9% పైగా క్షీణించింది. క్లౌడ్ఫ్లేర్ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్స్కేలర్ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్ల్యాబ్, జేఫ్రాడ్ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఎక్స్ సైబర్సెక్యూరిటీ ఈటీఎఫ్ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.మార్కెట్ ఎందుకు షేక్ అయిందంటే..సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి వర్క్ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది.
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్: 25 జేబీ డేటా..
ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేసే రిలయన్స్ జియో.. తాజాగా రూ. 365 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?, డేటా, ఎస్ఎమ్ఎస్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ. 365 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. కస్టమర్లు 25 జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇవి కాకుండా.. యూజర్లు మూడు నెలల పాటు జియో హాట్స్టార్ మొబైల్ & టీవీ యాక్సెస్ను పొందవచ్చు.జియోఏఐ క్లౌడ్ కింద 50 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్ను కూడా అందిస్తోంది. అంతే కాకుండా.. రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్లాన్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే, దీనిని యాక్టివేట్ చేయాలి. ఈ ప్లాన్ను ఉపయోగించడానికి మీరు 18 ఏళ్లు పైబడి ఉండాలని గుర్తుంచుకోండి.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం
కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్ గవర్నెన్స్లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
పర్సనల్ ఫైనాన్స్
ప్రభుత్వ సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు?
భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.మోసం బయట పడిందిలా..ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్బీఐ, ఎస్బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్లో పీఎస్యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్షిప్లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్తో ఆకర్షిస్తాయి.మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్బీఐ లిక్విడిటీ మేనేజ్మెంట్, సీఆర్ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.ఐడీఎఫ్సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్లను పరిశీలించాలి. ఆర్బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం.
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!
నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు ‘స్కాన్అండ్పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్ ఎస్టేట్లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్.. ఇన్కమ్టాక్స్.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్కమ్ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్మెంట్ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.
రిటైర్మెంట్కు రెడీనా?
రిటైర్మెంట్ అంటే... 60 ఏళ్లకు కదా! అనుకుంటారంతా. ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించటమెందుకని రోజులు గడిపేస్తూ ఉంటారు. దాదాపు 70 శాతం మంది వేతన జీవులది ఇదే పరిస్థితి. కాకపోతే ఆ మిగిలిన 30 శాతం మందీ మరోరకంగా ఆలోచిస్తుంటారు. వారి దృష్టిలో రిటైర్మెంట్ అంటే ఉద్యోగానికి గుడ్బై చెప్పటం కాదు. తప్పనిసరి పనికి స్వస్తి చెప్పి... నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛను సంపాదించుకోవటం. ఆ స్వేచ్ఛను ఎంత త్వరగా సంపాదించుకోగలిగితే... అంత త్వరగా తప్పనిసరి పనికి గుడ్బై కొట్టేయటం. చాలామందికి 60 ఏళ్లు దాటినా కూడా ఈ తరహా స్వేచ్ఛ సాధ్యం కాదు. కొందరు మాత్రం 40లు, 50లలోనే సాధ్యం చేసుకోగలుగుతున్నారు. ఎలా? దీనికి ఏం చేయాలి? ఇదే ఈ వెల్త్ స్టోరీ...క్యాంపస్లోనో, కాలేజీ నుంచి బయటకు వచ్చాకో మంచి జాబ్ కొడితే సెటిలైపోయినట్లేనని భావిస్తారు చాలామంది. ఆదాయాన్ని బట్టి ఖరీదైన ఫోన్లు, కారు, ప్రీమియం హౌస్... ఇలా ఖర్చు చేసుకుంటూ వెళుతుంటారు. భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఈఎంఐల రూపంలో ఇప్పుడే ఖర్చు చేసేస్తుంటారు. వారికప్పుడు రిటైర్మెంట్ గుర్తుకే రాదు. కొందరికి గుర్తుకు వచ్చినా ప్రాధాన్యంగా తీసుకోరు. 40 ఏళ్లు దాటాక మెల్లగా ఆలోచించటం మొదలుపెడతారు. అక్కడి నుంచి మరో 15–20 ఏళ్లే ఉండడంతో, ఇక తప్పదులే అనుకుని ఆదాయంలో కొంత పక్కన పెట్టడం ఆరంభిస్తారు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఈ వాయిదానే పెద్ద ప్రతికూలమన్నది చాలా మంది తెలుసుకోరు. 20–30ల నుంచి పెట్టుబడి ఆరంభిస్తేనే అది పెద్ద నిధిగా మారుతుంది. వాస్తవానికి రిటైర్మెంట్ ప్రణాళిక ఫెయిలవటానికి ప్రధాన కారణం పెట్టుబడిని ఆలస్యంగా మొదలు పెట్టడమే. త్వరగా మొదలు పెడితే చక్ర వడ్డీ ఫలితంగా (కాంపౌండింగ్) అది పెద్ద మొత్తమవుతుందన్నది గుర్తించకపోవటమే.అవగాహన లేమి..ప్రైవేటు రంగంతోపాటు, అసంఘటిత రంగంలోని వారికి సామాజిక భద్రత తక్కువే. ఉద్యోగుల భవిష్యనిధి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి 7–8 శాతమే. ఇందులో 6 శాతం ద్రవ్యోల్బణం తీసివేస్తే మిగిలేది ఎంత? కొంత మంది బీమా పాలసీల్లో (ఎండోమెంట్, యులిప్) ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎండోమెంట్ ప్లాన్లలో దీర్ఘకాల రాబడి 4–5 శాతం మించదు. యూనిట్ లింక్డ్ ప్లాన్లలోనూ (యులిప్) రాబడి 8–9 శాతమే. తమకున్న ప్రాపర్టీ ఆదుకుంటుందిలే? అన్నది కూడా అవగాహన లేమే. ఒక్క చిన్న వివాదంతో ప్రాపర్టీ ఏళ్ల కొద్దీ అపరిష్కృతంగా ఉండిపోగలదు.వృద్థాప్యంలో తమ అవసరాలను చూసుకోవడానికి పిల్లలు ఉన్నారుగా? ఇలాంటి ఆలోచనలు.. 60 తర్వాత 20–30 ఏళ్ల ప్రశాంత జీవనానికి సోపానాలు కానే కావు.అత్యాధునిక వైద్య విధానాలతో ఆయుర్దాయం (జీవనకాలం) పెరుగుతోంది. వైద్య వ్యయాలు కూడా ఏటేటా రెండంకెల స్థాయిలో పెరుగుతుండడం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తమే ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షల పొదుపు కరిగిపోవచ్చు. ఇక మనలో కొంత మంది అయితే విశ్రాంత జీవన నిధిని పిల్లల విద్యావసరాలకు ఖర్చు పెట్టేస్తుంటారు. ఇది చేయరాని తప్పు. ఆలస్యం అమృతం విషం..25 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవచ్చు. కానీ సంపద సమకూర్చుకోవడంలో ఎంతో తేడా వస్తుంది. నెలకు రూ.15,000 చొప్పున 25 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 60వ ఏట వరకు 10 శాతం వార్షిక రాబడి (సగటు) వచ్చే ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 35 ఏళ్లలో రూ.5.14 కోట్లు (రూ.514 లక్షలు) సమకూరుతుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.60 లక్షలే.ఐదేళ్లు ఆలస్యంగా 30వ ఏట నుంచి మొదలు పెట్టి 60 వరకు 30 ఏళ్ల పాటు ఇంతే మేర పొదుపు చేస్తే సమకూరేది రూ.3.12 కోట్లు. ఐదేళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.2 కోట్ల నిధిని కోల్పోయినట్టు అవుతుంది. ఇంకో పదేళ్లు ఆలస్యంగా 40 ఏళ్లలో మొదలు పెడితే.. 20 ఏళ్లలో ఇదే రూ.15,000తో సమకూరేది కోటీ ఎనిమిది లక్షల రూపాయలు. ఎంత కావాలి..?ఒక వ్యక్తికి నేడు నెలవారీ రూ.50,000 ఖర్చు అవుతుంటే.. 25 ఏళ్ల తర్వాత అదే మాదిరి జీవన అవసరాలకు నెలకు రూ.2 లక్షలు అవసరమవుతుంది. ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన అంచనా ఇది. నెలకు రూ.2 లక్షల ఆదాయం రూ.4–5 కోట్ల నిధిపైనే సాధ్యం. మరి రూ.5 కోట్ల నిధిని సమకూర్చుకోవడం మధ్య తరగతి వారికి ఐదు, పదేళ్లలో సాధ్యమేనా..? కనీసం ఇంత అవసరం..ఆర్జన ఆరంభించిన మొదటి నెల నుంచే 20–25 శాతాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఈక్విటీ ఫండ్స్లో ప్రతినెలా సిస్టమ్యాటిక్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏటా ఆదాయ వృద్ధికి సమానంగా రిటైర్మెంట్ ఫండ్ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రతి నెలా ఇంటి అద్దె, గ్రోసరీ, యుటిలిటీ (బ్రాడ్బ్యాండ్, మొబైల్, విద్యుత్) కేటాయింపులు ఎలా తప్పనిసరో.. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ నిధి కోసం నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం కూడా అంత అవసరం. లేదంటే ఒక లక్ష్యం కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది.రిటైర్మెంట్ నాటికి సమకూర్చుకున్న నిధిని మూడు భాగాలు చేసుకోవాలిస్వల్పకాల అవసరాలు, ఆరోగ్య అత్యవసరాల్లో వెంటనే తీసుకునేందుకు వీలుగా (రెండేళ్ల అవసరాలకు సరిపడా) ఒక భాగం ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం లిక్విడిటీ (వెంటనే నగదుగా మార్చుకునే) ఎక్కువగా ఉండే లిక్విడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.3–10 ఏళ్ల అవసరాల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక పదేళ్లకు మించిన అవసరాల కోసం మరో భాగం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పెట్టుబడుల విషయంలో కొంత రిస్క్ తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాల నిధి ద్రవ్యోల్బణాన్ని మించి ఎక్కువగా కాంపౌండ్ అవుతుంది.వాస్తవాలు ఇవీ..రిటైర్మెంట్ కోసం తాము మరింత ముందు నుంచే ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు? అని 50 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మంది ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది.రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారు 2025 నాటికి 37 శాతమే. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ విషయంలో ప్రణాళికలేమితో ఉన్నట్టు తెలుస్తోంది.తమ పొదుపు నిధి రిటైర్మెంట్ తర్వాత పట్టుమని పదేళ్లు అయినా చాలుతుందో, లేదోనని 63 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.పట్టణాల్లో సగం మంది రిటైర్మెంట్ కోసం ముందు నుంచే పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. కానీ, 40 శాతం మంది విశ్రాంత జీవనం కోసం అసలు పెట్టుబడే మొదలు పెట్టలేదు.ప్రణాళిక మొదలు పెట్టిన వారిలోనూ కేవలం 37 శాతమే సమకూర్చుకోవాల్సిన నిధిలో పావు శాతం లక్ష్యానికి చేరారు. రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న వారిలో జీవిత బీమానూ పరిగణనలోకి తీసుకుంటున్నవారు 95 శాతంగా ఉన్నారు.అత్యంత ముఖ్యమైన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకం గురించి 64 శాతం మందికి తెలిసినా.. అందులో ఇన్వెస్ట్ చేస్తున్న వారు 16–25 శాతం మించిలేరు.ఇక రిటైర్మెంట్ కోసం పక్కన పెడుతున్న వారిలో కూడా జీవించినంత కాలం ఆ నిధి సరిపోతుందన్న నమ్మకంతో ఉన్నవారు 19 శాతం మందే.ఈ ఫలితాలు విశ్రాంత జీవన అవసరాలకు చాలా ముందుగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
ఖర్చులకు కళ్లెం వేద్దాం!
ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్ఫోన్లు, కార్లు, లాప్టాప్లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్మెంట్’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్టాప్లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్గ్రేడెడ్ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్ స్టోరీ చూడండి...మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్స్టయిల్ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. ద్రవ్యోల్బణం.. సైలెంట్ కిల్లర్ ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్స్టయిల్పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. → మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె → కారును అప్గ్రేడ్ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. → మరింత తరచుగా బయట తినటం, ఫుడ్ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. → జిమ్తో పాటు అనేక ఓటీటీలు, యాప్లు సబ్స్క్రయిబ్ చెయ్యటం. వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. ‘అవసర ఖర్చుల’ భ్రమ .. అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్ఫోన్ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. ఏం చేయాలంటే.. జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. → పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్ రూల్ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్స్టయిల్ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. → పొదుపును ఆటోమేట్ చేయాలి ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్స్టయిల్ ఖర్చులు ఆటోమేటిక్గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. → ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్గ్రేడ్ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. → సబ్్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది. మూడు కేటగిరీలు.. వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్స్టయిల్ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది. లైఫ్స్టయిల్ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. → బయట హోటళ్లలో తినడం → విహార యాత్రలు → సబ్స్క్రిప్షన్లు→ అప్గ్రేడెడ్ గ్యాడ్జెట్లు → తరచుగా వాహనాలను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండటంతప్పనిసరైన ఖర్చులు ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. → విద్య → ఆరోగ్య సంరక్షణ → ప్రాథమిక హౌసింగ్ → బీమా → నిత్యావసరాలులీకేజీలు అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్ కిందికి వస్తాయి. → ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్లైన్లో షాపింగ్ → క్రెడిట్ కార్డ్ బాకీలను రోలోవర్ చేస్తుండటం. → ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కన్వీనియెంట్గా చేసే వ్యయాలురియాలిటీ చెక్ లైఫ్స్టయిల్కి సంబంధించి అప్గ్రేడ్స్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్స్టయిల్ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశ్చింతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్ సూత్రం ఒకటి ఉంది. → 50%– తప్పనిసరి అవసరాలు → 30% – లైఫ్స్టయిల్, కోరికలు → 20% – పొదుపు, పెట్టుబడులు. లైఫ్స్టయిల్ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్గా పడిపోతాయి.


