Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Shines Venice Biennale Neeta Ambani Leads Cultural Revival World Stage1
ప్రపంచ వేదికపై భారతీయ కళా వైభవం

ప్రపంచ కళా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వెనిస్‌ బినాలే’ వేదికపై భారతీయ ప్రాభవం మెరవనుంది. భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఏసీసీ) భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ‘ఇండియా పెవిలియన్‌’ను తిరిగి వెనిస్‌ బినాలేకు తీసుకువెళ్లడంతోపాటు మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళలను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నారు.సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే వేదికకళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ముందుండే రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ముందడుగుపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే అద్భుత ఘట్టమని చెబుతున్నారు. ‘ప్రపంచంలోని గొప్ప వేదికల్లో ఒకటైన వెనిస్‌లో మన దేశ కళ, సంస్కృతి, హస్తకళలను వేడుకగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని ఓ సీనియర్ ఆర్ట్ క్రిటిక్ అన్నారు.కళాత్మక హొయలతో నీతా అంబానీఈ చారిత్రాత్మక క్షణాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ తన వస్త్రధారణతో భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన షిఫాన్-జార్జెట్ చీరలో ఆమె మెరిసిపోయారు. దీనికి జతగా బనారసీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేస్ బ్లౌజ్ ధరించారు. మన నేత కళకు నిదర్శనమైన ‘స్వదేశ్’ రూపొందించిన, చేతితో నేసిన బుటిదార్ సోజ్ని శాలువా ఆమె రాజసాన్ని మరింత పెంచింది. ప్రఖ్యాత జ్యువెలరీ ఆర్టిస్ట్ వాలెస్ చాన్ రూపొందించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

GCC NRIs shift investments from real estate to Indian stocks2
భారత్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రవాసుల ఆసక్తి

న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో (రెమిటెన్స్‌లు) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపాదనలో మిగులు నిధులను మాతృదేశానికి పంపడాన్ని ఒక తప్పనిసరి బాధ్యతగా వారి ఇప్పుడు చూడడం లేదు. వ్యూహాత్మకంగా సంపద సృష్టించుకోవాలన్న ప్రణాళికతో స్వదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడుల దృష్టితో మాతృదేశానికి నిధులు పంపిస్తున్నట్టు ఈక్విరస్‌ వెల్త్‌ సర్వే నివేదిక వెల్లడించింది. గల్ఫ్‌ ప్రాంతంలోని (జీసీసీ) 8,300 మంది ఎన్‌ఆర్‌ఐల అభిప్రాయాల ఆధారంగా ఈక్విరస్‌ ఈ వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గల్ఫ్‌ ప్రాంత ఎన్‌ఆర్‌ఐలకు సంపద సృష్టి కేంద్రంగా భారత్‌ స్థానం స్థిరపడుతోంది. అక్కడి వారు భారత్‌కు పంపిస్తున్న నిధుల్లో సగం పెట్టుబడులు, రిటైర్మెంట్‌ ప్రణాళికల కోసమే ఉంటున్నాయి. సర్వే అంశాలు.. → జీసీసీ దేశాల ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు పంపిస్తున్న మొత్తం నిధుల్లో 27 శాతం పెట్టుబడుల కోసం ఉద్దేశించినవే. → ఆ తర్వాత 22 శాతం రెమిటెన్స్‌లు రిటైర్మెంట్‌ ప్రణాళిక కోసం ఉంటున్నాయి. → ఇక 26 శాతం మేర నిధులు భారత్‌లోని తమ కుటుంబాల జీవన అవసరాల కోసం పంపిస్తున్నారు. → ప్రవాస భారతీయుల పెట్టుబడి ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో భూములు, ఇళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపించగా, ఇప్పుడు ఆర్థిక సాధనాల వైపు ఆకర్షితులవుతున్నారు. → 40% మంది రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్తి) నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. → 73% మంది భారత స్టాక్‌ మార్కెట్లలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటున్నారు. → 75% మంది దీర్ఘకాల చురుకైన ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం ప్రాంతీయ అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ప్రవాస భారతీయులు తమ పొదుపు మొత్తాలను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టు ఈక్విరస్‌ వెల్త్‌ నివేదిక వెల్లడించింది. 83 శాతం మంది భౌగోళిక రాజకీయ పరిస్థితులు తమ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయని అంగీకరించారు. ప్రాంతీయ అస్థిరతలపై 41 శాతం మంది ఆందోళన చెందుతుండగా.. 23 శాతం మంది ద్రవ్యోల్బణంపై, 13 శాతం మంది అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రకంగా గల్ఫ్‌ ప్రాంత ఎన్‌ఆర్‌ఐలకు ఉద్యోగ భద్రత, వీసా ప్రాధాన అంశాలుగా ఉంటుండగా.. ఇప్పుడు ఈ అంశాలపై కేవలం 12 శాతం మందే ఆందోళన చెందుతున్నారు. తమ ఆదాయ స్థిరత్వంపై వారిలో పెరిగిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తున్నట్టు ఈక్విరస్‌ వెల్త్‌ నివేదిక పేర్కొంది.

Record 20 5 Billion Dollars Investments in the United States by Indian Companies Announced at SelectUSA Summit3
అమెరికాలో భారత్ కంపెనీలు: ఒక్కరోజే భారీ పెట్టుబడులు!

అమెరికాలో జరిగిన 2026 సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భారతదేశం నుంచి వచ్చిన భారీ పెట్టుబడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వివిధ కంపెనీలు.. మొత్తం సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యూఎస్‌లో పెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.''అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. భారతీయ కంపెనీలు టెక్, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి వివిధ రంగాలలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక వేస్తున్నాయి. ఇందులో, ఈరోజే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన 12 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు అందరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం'' అని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.Under President Trump’s leadership investment is flowing back into the United States at record levels! Indian companies plan to invest over $20.5 billion in various sectors including tech, manufacturing, and pharmaceuticals. This includes the 12 Indian companies who announced…— Ambassador Sergio Gor (@USAmbIndia) May 6, 2026ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత ఫార్మా రంగం నుంచే వచ్చింది. సుమారు 19.1 బిలియన్ డాలర్లు.. అమెరికాలో తయారీ యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, కొత్త ఫ్యాక్టరీల కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇది ఔషధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలపరుస్తుంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఇంధన సరఫరా వ్యవస్థలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయి.సెర్జియో గోర్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా రెండు దేశాలకు సమానంగా లాభం కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Gold Climbs Over 3 Percent As Middle East Peace Hopes Drag Down Dollar and Oil4
అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్‌లో బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

Elon Musk Reacts to PM Modi Post on GalaxEye Mission Drishti Launch5
భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: మస్క్ ట్వీట్!

బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.కాలిఫోర్నియా నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్‌గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల కలయికతో రూపొందింది.EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.Congratulations! 🇮🇳— Elon Musk (@elonmusk) May 5, 2026ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్‌ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

Rural Boom Fuels Record Auto Sales in India Says FADA6
అమ్మకాల్లో రికార్డ్‌.. ఒక్క నెలలో 26 లక్షల వాహనాలు!

భారత ఆటోమొబైల్‌ రంగం 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. దేశీయంగా వాహన రిటైల్‌ విక్రయాలు ఈ ఏప్రిల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించాయి. గత నెలలో మొత్తం 26,11,317 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025) ఇదే నెలలో నమోదైన 23,12,221 యూనిట్లతో పోలిస్తే ఇది 12.94 శాతం వృద్ధి అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఫాడా) మంగళవారం వెల్లడించింది. జీఎస్టీ 2.0 అమలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, రబీ పంటల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నగదు లభ్యత, వివాహాల సీజన్‌ వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ఫాడా వివరించింది.రికార్డుల జోరుతో ఆటో రంగం బోణీ: ఫాడా ఉపాధ్యక్షుడుభారత ఆటో రిటైల్‌ రంగం 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభించిందని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్‌ తెలిపారు. 2026 ఏప్రిల్‌లో మునుపెన్నడూ లేని విధంగా 26,11,317 యూనిట్ల విక్రయాలతో దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషమన్నారు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావని, భారత వినియోగ మార్కెట్‌లో వస్తున్న కీలక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత కొన్నాళ్లుగా మెట్రో నగరాలకే పరిమితమైన వాహనాల జోరు ఇప్పుడు పల్లెలకు పాకింది. పట్టణ ప్రాంతాల్లో 7.11 శాతం వృద్ధి నమోదైతే, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 20.40 శాతం వృద్ధి కనిపించడం విశేషం. ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, చిన్న కార్ల విభాగంలో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ‘వ్యక్తిగత మొబిలిటీ’ విభాగం పుంజుకుంది. వినియోగదారులు కేవలం పెట్రోల్, డీజిల్‌పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. విక్రయాల్లో సీఎన్‌జీ (సీఎన్‌జీ) వాటా 22.62% ఉండగా, ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాటా 5.77 శాతానికి మెరుగుపడటం సానుకూల పరిణామం’’ అని వెల్లడించారు.అప్రమత్తతతో కూడిన ఆశావాదం: ఫాడా అంచనాలురాబోయే మూడు నెలల్లో వాహన విక్రయాల వృద్ధిపై సగానికి పైగా (50.90 శాతం) డీలర్లు ధీమాతో ఉన్నారని ఫాడా తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు లభ్యత, ఖరీఫ్‌ సీజన్‌ సానుకూలతలు ద్విచక్ర వాహన విభాగానికి ఊతమిస్తాయని అంచనా వేసింది. మే నెలలో వివాహాల సీజన్‌ కారణంగా ప్యాసింజర్‌ వాహనాల బుకింగ్‌లు బలంగా ఉంటాయని, జూన్‌–జూలై నెలల్లో విక్రయాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని పేర్కొంది. అయితే, తీవ్రమైన వడగాల్పులు, పశి్చమ ఆసియా ఉద్రిక్తతల వల్ల పెరిగే ఇంధన ధరలు మరియు వాణిజ్య వాహనాల విభాగంలో నగదు లభ్యత (లిక్విడిటీ) వంటి సవాళ్లను నిశితంగా గమనించాల్సి ఉంటుందని ఫాడా స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
Advertisement