Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Office Market Boom India Defies Global Uncertainty with Record Leasing1
ఆఫీసులకు భలే డిమాండ్‌.. మూడు నెలల్లో కొత్త రికార్డులు

అంతర్జాతీయంగా అనిశ్చితులున్నప్పటికీ భారత ఆఫీస్‌ మార్కెట్‌ డిమాండ్‌కు కొత్త రికార్డులకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో 21.5 మిలియన్‌ చదరపు అడుగుల స్థూల(ఎస్‌ఎఫ్‌టీ) ఆఫీస్‌ వసతుల (ఆఫీస్‌ లీజ్‌/కార్యాలయ స్థలాలు) లీజింగ్‌ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్‌ 19.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగింది.ఇక నికర ఆఫీస్‌ లీజింగ్‌ (రెన్యువల్స్‌ కాకుండా) 7 శాతం పెరిగి 13.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా విడుదల చేసింది. ప్రధానంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు విదేశీ సంస్థల నుంచి బలమైన డిమాండ్‌ ఉన్నట్టు తెలిపింది.‘‘భారత్‌ ఆఫీస్‌ మార్కెట్‌ మొదటి త్రైమాసికంలో ఇప్పటి వరకు లేనంతటి బలమైన పనితీరును పనిచేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఇది చెప్పుకోతగ్గ పనితీరే. అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని వినియోగించుకునే విధానంలో వచి్చన మౌలిక మార్పు ఈ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోంది’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా ఆఫీస్‌ లీజింగ్‌ హెడ్‌ రాహుల్‌ అరోరా తెలిపారు. జీసీసీల జోరు.. విదేశీ సంస్థలు ఏర్పాటు చేసిన జీసీసీల లీజింగ్‌ 43 శాతం పెరిగి 9.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. మొత్తం లీజింగ్‌లో 45.5 శాతంగా ఉంది. ‘‘ఇవేవీ వ్యూహాత్మక బ్యాక్‌ ఆఫీస్‌లు కానేకావు. ఏఐ అభివృద్ధి, డిజిటల్‌ ఇంజనీరింగ్, ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఆవిష్కరణల కేంద్రాలు’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది. టాప్‌–7 నగరాల్లో బెంగళూరు ఆఫీస్‌ మార్కెట్‌ మెరుగైన పనితీరు చూపించింది.మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్‌ 25 శాతం పెరిగి 5.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్‌లో 9.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ దేశీ సంస్థలు తీసుకున్నవే. క్రితం ఏడాది మార్చి క్వార్టర్‌తో పోల్చితే 5 శాతం పెరిగింది. దేశీ సంస్థలు తీసుకున్న లీజింగ్‌లోనూ 57.8 శాతం ఫ్లెక్స్‌ ఆపరేటర్ల రూపంలోనే ఉన్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది.

Gold as an Asset Not Just an Ornament Investors Shift Focus from Jewellery to Bullion2
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి

పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్‌ సంస్థ కేర్‌ఎడ్జ్‌ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్‌ఎడ్జ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్‌ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్‌ గోయల్‌ తెలిపారు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల రూపంలో ఉంటున్నట్టు కేర్‌ఎడ్జ్‌ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్‌ అవసరాలు కాకుండా.. డిమాండ్‌ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్‌ఎడ్జ్‌ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్‌ఎడ్జ్‌ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్‌ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్‌ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది.

Tata Motors Delivers 101 New Sierra SUVs in Hyderabad3
హైదరాబాద్‌లో 101 టాటా సియెరా డెలివరీలు

హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ తాజాగా హైదరాబాద్‌లో 101 సరికొత్త టాటా సియెరా ఎస్‌యూవీలను డెలివరీ చేసింది. ఇందుకోసం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో జాస్పర్‌ ఇండస్ట్రీస్, మాలిక్‌ ఆటోవరల్డ్, ఆరెంజ్‌ ఆటో మొదలైనవి పాల్గొని, కస్టమర్లకు వాహనాలను అందించాయి. సియెరాకి దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా బుకింగ్స్‌ రావడమనేది దీనిపై కస్టమర్లకు గల ఆసక్తికి నిదర్శనమని సంస్థ తెలిపింది.

Sun Pharma has signed a definitive agreement to acquire Organon4
సన్‌ ఫార్మా మెగా డీల్‌..!

న్యూఢిల్లీ: దేశీ ఔషధ రంగ దిగ్గజం సన్‌ ఫార్మా మరో భారీ డీల్‌కి తెరతీసింది. అమెరికాకు చెందిన ఆర్గానాన్‌ అండ్‌ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సంస్థ విలువను 11.75 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ. 1.10 లక్షల కోట్లు) లెక్క కట్టారు. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లించి ఆర్గానాన్‌ను సన్‌ ఫార్మా కొనుగోలు చేయనుంది. ఇది పూర్తిగా నగదు రూపంలో ఉంటుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2027 తొలినాళ్లలో ఒప్పందం పూర్తవుతుందని అంచనా. దీనికి కావాల్సిన మొత్తాన్ని 2–2.5 బిలియన్‌ డాలర్లను అంతర్గతంగాను, మిగతా 9.25–9.75 బిలియన్‌ డాలర్లను రుణం రూపంలో సన్‌ ఫార్మా సమకూర్చుకోనుంది. కాస్త ఆనందం.. కాస్త ఉత్కంఠ.. ఇరు కంపెనీల కలయికతో మరింత శక్తివంతమైన సంస్థ ఏర్పడుతుందని సన్‌ ఫార్మా చైర్మన్‌ దిలీప్‌ సంఘ్వీ తెలిపారు. ‘ఈ డీల్‌ విషయంలో కాస్త ఆనందంగాను, ఉత్తేజంగాను, కాస్త ఉత్కంఠగాను ఉంది. ఇది చాలా భారీ ఒప్పందం కావడం, పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాల్సి రానుండటమే ఇందుకు కారణం. మేము రుణానికే తప్ప రిస్కుకు వ్యతిరేకం కాదు. అయితే, ఇప్పుడు తీసుకుబోయే రుణం భారీగానే ఉన్నప్పటికీ ఉమ్మడి సంస్థ ఎబిటాకు 2.3 రెట్లు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను బట్టి దీన్ని త్వరలోనే తగ్గించుకోగలమనే ధీమా ఉంది. గతంలో ర్యాన్‌బాక్సీ డీల్‌ని ఇది గుర్తు తెస్తోంది. అప్పట్లో మాది చిన్న కంపెనీ అయినప్పటికీ చాలా పెద్ద సంస్థను కొన్నాం. ఇప్పుడు అర్గానాన్‌ దాదాపు సన్‌ ఫార్మా స్థాయిదే అయినప్పటికీ సుమారు 25 శాతం తక్కువ వేల్యుయేషన్‌కే లభిస్తోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించిన మీదట నగదు రూపంలో ఉండే ఈ లావాదేవీ మా వాటాదారులకు గణనీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని బోర్డు నిర్ణయించింది. అంతర్జాతీయంగా మా వ్యాపారాలు, ఉద్యోగులు, పేషెంట్లకు సన్‌ ఫార్మా దన్నుగా ఉంటుందని ఆశిస్తున్నాం‘ అని ఆర్గానాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చెయిర్‌ క్యారీ కాక్స్‌ తెలిపారు. ఆర్గానాన్‌ కథ ఇదీ... 2021లో దిగ్గజ సంస్థ మెర్క్‌ నుంచి విడగొట్టడం ద్వారా ఏర్పాటైన గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ ఆర్గానాన్‌. మెర్క్‌ని అమెరికా, కెనడా వెలుపల ఎంఎస్‌డీగా వ్యవహరిస్తారు. ఆర్గానాన్‌కి యూరోపియన్‌ యూనియన్, వర్ధమాన మార్కెట్లలో ఆరు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల్లో గ్లోబల్‌ లీడరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. మహిళల హెల్త్, జనరల్‌ మెడిసిన్స్‌ విభాగాల్లో బయోసిమిలర్స్‌ సహా 70కి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. 140 దేశాల్లో విక్రయిస్తోంది. అమెరికా, యూరప్, చైన్, కెనడా, బ్రెజిల్‌ మొదలైనవి భారీ మార్కెట్లుగా ఉన్నాయి. 2025 డిసెంబర్‌ 31తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ 6.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 1.9 బిలియన్‌ డాలర్ల ఎబిటాను (సవరించిన) ఆర్జించింది. 8.6 బిలియన్‌ డాలర్ల రుణభారం, 574 మిలియన్‌ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇటీవలే ఒక ఉత్పత్తి విక్రయానికి గాను ముందస్తుగా 440 మిలియన్‌ డాలర్లు అందుకుంది. డీల్స్‌ కింగ్‌.. సన్‌ .. సన్‌ ఫార్మా గతంలో కూడా పలు భారీ స్థాయి కొనుగోళ్లు చేసింది. 2014లో ర్యాన్‌బాక్సీని 4 బిలియన్‌ డాలర్లకు దక్కించుకుంది. అలాగే 2007లో ఇజ్రాయెల్‌కి చెందిన టారో ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ని 454 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. దేశీ దిగ్గజాల భారీ షాపింగ్‌.. అంతర్జాతీయంగా మన కంపెనీల భారీ కొనుగోళ్ల ఒప్పందాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. 2007లో కోరస్‌ను టాటా స్టీల్‌ 12 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది. తర్వాత 2010లో కువైట్‌ దిగ్గజం జెయిన్‌ టెలికంనకు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని భారతి ఎయిర్‌టెల్‌ 10.7 బిలియన్‌ డాలర్లకు దక్కించుకుంది. సన్‌ ఫార్మాకు ప్రయోజనాలు.. → 12.4 బిలియన్‌ డాలర్ల ఉమ్మడి ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్‌ 25 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సంస్థ నిలుస్తుంది. → గ్లోబల్‌గా మహిళల ఆరోగ్య సంరక్షణ ఔషధాలకు సంబంధించి టాప్‌ 3 కంపెనీల్లో ఒకటిగా చోటు దక్కుతుంది. → బయోసిమిలర్స్‌ మార్కెట్లో 7వ పెద్ద సంస్థగా ఉంటుంది. → 150 దేశాలు, 18 భారీ మార్కెట్లలో కార్యకలాపాలు. ఒక్కో మార్కెట్‌ నుంచి 100 మిలియన్‌ డాలర్ల కు పైగా ఆదాయం లభిస్తుంది.షేరు 7 శాతం అప్‌.. సోమవారం బీఎస్‌ఈలో సన్‌ ఫార్మా షేరు 7 శాతం ఎగిసింది. రూ. 1,733.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ వేల్యుయేషన్‌ రూ. 27,307 కోట్లు పెరిగి రూ. 4,15,987 కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరుగా నిల్చింది. అమెజాన్‌ నౌ 100 నగరాల్లోకి విస్తరణలిస్టులో హైదరాబాద్, వైజాగ్‌ న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ అమెజాన్‌ నౌ క్విక్‌ కామర్స్‌ సరీ్వసులను దేశవ్యాప్తంగా 100 నగరాల్లోకి విస్తరించనుంది. హైదరాబాద్, వైజాగ్‌తో పాటు పుణే, చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూ రు, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో (నేషన ల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) అమెజాన్‌ నౌ సేవ లు లభిస్తున్నాయి. అమెజాన్‌ ఇండి యా ఇటీవల ప్రకటించిన రూ. 2,800 కోట్ల పెట్టుబడుల ప్రణాళికల్లో ఈ విస్తరణ భాగంగా ఉండనుంది. 1,000కి పైగా మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు తమ క్విక్‌ కామర్స్‌ కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఎవ్రీడే ఎజెన్షియల్స్‌) హర్‌‡్ష గోయెల్‌ తెలిపారు. క్విక్‌ కామర్స్‌ విస్తరణతో 16,000 మందికి పైగా రైతులు తమ టెక్నాలజీ, నెట్‌వర్క్‌ని ఉపయోగించుకుని, ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు.

Indian Origin OpenAI CTO Srinivas Narayanan Quits Plans To Spend Time With Parents In India5
అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!

ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్ విభాగపు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అయిన శ్రీనివాస్ నారాయణన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని వీడి భారతదేశానికి రానున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడు సంవత్సరాలు సంస్థలో పనిచేసిన తరువాత.. శ్రీనివాస్ నారాయణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వరుసగా కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ విషయాన్ని కంపెనీకి తెలియజేసి ఈ ప్రయాణాన్ని "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించారు.నారాయణన్ తన తదుపరి ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోకముందు భారత్‌కు వెళ్లి తన వృద్ధ తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మాన్‌లకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పారు. టెక్నాలజీ, సమాజంలో కీలక మార్పులు జరుగుతున్న ఈ కాలంలో సంస్థలో పని చేయడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు. మీ అందరికీ భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''ఎవరీ శ్రీనివాస్ నారాయణన్?శ్రీనివాస్ నారాయణన్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొంది, ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్‌లో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత మెటాలో దశాబ్దానికి పైగా పని చేసి, ఫేస్‌బుక్ ఫోటోస్ వంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఓపెన్ఏఐలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్లైడ్ ఇంజనీరింగ్ బృందాన్ని నిర్మించి, విస్తరించారు. ఈ బృందమే పరిశోధనను లక్షలాది మంది ఉపయోగించే ఉత్పత్తులుగా మారుస్తుంది.After 3 incredible years, I am leaving OpenAI at the end of next week.I shared my decision with the OpenAI leadership team at the start of the month and here is a shorter version of what I shared with my team earlier this week.===Hi Team,I have decided to leave OpenAI. The…— Srinivas Narayanan (@snsf) April 17, 2026

Bharat Mata Needs You Zoho Sridhar Vembu Tweet6
"దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''

జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. అమెరికాలో చదువు, అవకాశాలు పొందిన తర్వాత తాను భారత్‌లోనే టెక్ రంగంలో ఎదిగినట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులు పడుతున్న అవస్థలు కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా జరుగుతున్న అనేక వివాదాల్లో ప్రవాస భారతీయులు ఇరుక్కుపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.భారతీయుల గౌరవం ప్రపంచ స్థాయిలో పెరగాలంటే కేవలం విదేశాల్లో విజయాలు సాధించడం కాదు. మన దేశంలో స్వయంగా, ఆర్థికంగా ఎదగడం. భారత్‌లో తగినంత ప్రతిభ ఉన్నప్పటికీ, చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రతిభను తిరిగి దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని, భారత యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!ప్రపంచంలో గౌరవం, భద్రత, అభివృద్ధి అన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. దయచేసి ఇంటికి (ఇండియా) తిరిగి రండి. భారతమాతకు మీ ప్రతిభ అవసరం. మీలో చాలా మందికి దీని గురించి ఆలోచించడం కష్టమైనప్పటికీ, దేశంలోనే కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.Open letter to Indians in America.--Dear brothers and sisters from Bharat:Like I did 37 years ago, you arrived in America with no money but with a good education and cultural heritage from Bharat. You achieved outstanding success. America was good to us. For that we must…— Sridhar Vembu (@svembu) April 27, 2026

Advertisement
Advertisement
Advertisement