ప్రధాన వార్తలు
కమర్షియల్ విమానాలు మూడు రెట్లు వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్ వృద్ధి చెందే క్రమంలో దేశీయంగా 100 సీట్ల పైగా సామర్థ్యం ఉండే కమర్షియల్ విమానాల సంఖ్య వచ్చే దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరుగుతుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ అంచనా వేస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం 850గా ఉన్న సంఖ్య 2035 నాటికి 2,250కి పెరగనుంది. దేశీయంగా ఏవియేషన్ మార్కెట్ వృద్ధి చెందుతుండటం, అంతర్జాతీయ రూట్లలో కూడా కార్యకలాపాలను విస్తరించడంపై దేశీ విమానయాన సంస్థలు గణనీయంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎయిర్బస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ జర్జెన్ వెస్టర్మెయర్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం భారత ఎయిర్లైన్స్ నుంచి 1,250 విమానాలకు ఆర్డర్ల బ్యాక్లాగ్ ఉందని వివరించారు. ఏటా సగటున 120–150 వరకు విమానాలను అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.వచ్చే పదేళ్లలో భారత్లో ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి వార్షికంగా 8.9 శాతంగా ఉండొచ్చని, విమానాశ్రయాల సంఖ్య మరో 50 మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు వెస్టర్మెయర్ తెలిపారు. కమర్షియల్ విమానాల సంఖ్య పెరగడంతో పాటు వార్షికంగా సరుకు రవాణా సామర్థ్యం పెరిగేందుకు కూడా అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారతీయ విమానయాన సంస్థలు సుమారు 1,700 విమానాలకు ఆర్డర్లివ్వగా, ఎయిర్బస్ దగ్గర 72% బ్యాక్లాగ్ ఉందని వెస్టర్మెయర్ తెలిపారు. 35 వేల మంది పైలట్లు కావాలి.. విమానాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో 2035 నాటికి 35,000 మంది పైగా పైలట్లు అవసరమవుతారని, అలాగే సాంకేతిక సిబ్బంది సంఖ్య కూడా మూడు రెట్లు పెరిగి 34,000 స్థాయిలో కావాల్సి ఉంటుందని వెస్టర్మెయర్ చెప్పారు. ప్రస్తుతం పైలట్ల సంఖ్య 12,000గా, సాంకేతిక సిబ్బంది సంఖ్య సుమారు 11,000గా ఉన్నట్లు ఆయన తెలిపారు. విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగే క్రమంలో భారత్ వేగంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ కార్యకలాపాలకి హబ్గా ఎదుగుతుందని వెస్టర్మెయర్ చెప్పారు.ఎయిర్ఫ్రేమ్లు, ఇంజిన్లు, విడిభాగాల మార్కెట్ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి 9.5 బిలియన్ డాలర్లకు చేరగలదని పేర్కొన్నారు. ఇక ఫ్లయిట్, గ్రౌండ్, సాంకేతిక కార్యకలాపాల డిజిటలైజేషన్తో పాటు సైబర్ సెక్యూరిటీ మొదలైన వాటిపై భారతీయ ఎయిర్లైన్స్ 1 బిలియన్ డాలర్ల వరకు వెచ్చించే అవకాశం ఉందన్నారు.భారత్లో తొలిసారిగా రూపొందించి, అసెంబుల్ చేసిన ఎయిర్బస్ సీ–295 ట్విన్ ఇంజిన్ మీడియం మిలటరీ రవాణా విమానాన్ని 2026 మూడో త్రైమాసికంలో డెలివర్ చేయనున్నట్లు వెస్టర్మెయర్ వివరించారు. ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి డెలివరీలు ప్రారంభం కాగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ నుంచి 1.5 బిలియన్ డాలర్ల మేర కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
30 బోయింగ్ విమానాలకు ఎయిరిండియా ఆర్డరు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంధనం ఆదా చేసే 737 మ్యాక్స్ రకానికి చెందిన మరో 30 బోయింగ్ విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరిచ్చింది. దీనితో బోయింగ్కి మొత్తం కలిపి దాదాపు 200 విమానాలకు ఆర్డరిచ్చినట్లవుతుంది. మరోవైపు, ఏ321 రకానికి చెందిన 200 విమానాల కోసం ఎయిర్బస్కి ఇచ్చిన ఆర్డర్లో ఎయిరిండియా స్వల్ప మార్పులు చేసింది.ఇందులో 15 ఎయిర్క్రాఫ్ట్లను అధునాతన ఎ 321ఎక్స్ఎల్ఆర్ (ఎక్స్ట్రా లాంగ్ రేంజ్) వేరియంట్కి మార్చుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి 2029–2030 మధ్యలో డెలివర్ అ య్యే అవకాశం ఉందని వివరించింది. ఇంధనం ఆదా చేసే ఎ321 ఎక్స్ఎల్ఆర్ విమానా లకు దాదాపు 8,700 కి.మీ. రేంజి ఉంటుంది.
సవాళ్లున్నా ముందుకే
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధితో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రస్థానం కొనసాగుతుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) జీడీపీ 6.8–7.2 శాతం మధ్య వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.4 శాతం కంటే తగ్గించడం గమనార్హం. జీడీపీలో ద్రవ్యలోటు 2025–26లో 4.8 శాతం అంచనా కాగా, 2026–27లో 4.4 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య కాల వృద్ధిని 7 శాతానికి చేర్చుతాయి.కనుక ప్రపంచ అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధికి అవకాశం ఉంది. కావాల్సింది అప్రమత్తతే కానీ, నిరాశావాదం కాదు’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రక్షణాత్మక పెట్టుబడుల ధోరణితో బంగారం, వెండి ధరల మంటలు ఇప్పుడప్పుడే చల్లారకపోవచ్చని అభిప్రాయపడింది. 739 పేజీలతో కూడిన 2025–26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. సందర్భానుసారం వేదాలు, ఇతిహాసాల్లోని సూక్తులను సైతం ప్రస్తావించడం విశేషం. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ బృందం దీన్ని రూపొందించింది. ఏటా బడ్జెట్కు ముందు ఆవిష్కరించే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న రానున్న సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందన్నది తెలియజేస్తుంది.‘స్వదేశీ’ మంత్రం.. అంతర్జాతీయంగా వాణిజ్యం, ఇతర సమస్యల నుంచి గట్టెక్కేందుకు ‘స్వదేశీ’ మంత్రాన్ని ఆర్థిక సర్వే సూచించింది. ‘‘అన్నిరకాల దిగుమతులకు ప్రత్యామ్నాయం అన్నది ఆచరణ సాధ్యం కాబోదు. అలాగే, ఆమోదనీయం కూడా కాదు. అభివృద్ధి చెందిన దేశాలు ఎగుమతులపై నియంత్రణలు విధిస్తూ, టెక్నాలజీ బదిలీకి నిరాకరిస్తున్న తరుణంలో స్వదేశీ అన్నది తప్పనిసరే కాదు అవసరం కూడా’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఐరోపాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలను తొలగించడంపై దృష్టి సారించాలి. సర్వేలోని అంశాలు.. ⇒ 2026–27లో జీడీపీ వృద్ధి రేటు 6.8–7.2 శాతంగా ఉంటుంది. మధ్య కాలానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా కొనసాగొచ్చు. ⇒ 2026–27లో ద్రవ్యలోటు 4.4 శాతానికి దిగొస్తుంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువే ఉండొచ్చు. అయినప్పటికీ ఆర్బీఐ లకి్ష్యత స్థాయి 4 శాతం పరిధిలోనే ఉంటుంది. ⇒ అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఈ ఏడాదిలో ముగుస్తాయి. దీంతో విదేశీ వాణిజ్యం పరంగా అనిశ్చితులు తగ్గుతాయి. ⇒ కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ట్రిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్న నేపథ్యంలో.. ఈ పెట్టుబడులు ఆశించిన ప్రతిఫలం ఇవ్వకపోతే అది ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అధిక విలువలు కలిగిన అసెట్స్లో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చు. ⇒ రూపాయి విలువ పటిష్టమైన దేశ ఆర్థిక మూలాలను ప్రతిఫలించడం లేదు. అమెరికా టారిఫ్లతో రూపాయి విలువ 5 శాతం పతనమైంది. అయినప్పటికీ కరెన్సీ విలువ క్షీణించడం వల్ల మన ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్ల ప్రభావాన్ని కొంత వరకు తగ్గిస్తోంది. ⇒ దేశ వృద్ధిలో సేవల ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వస్తు ఎగుమతులపై టారిఫ్ల అనిశ్చితుల ప్రభావాన్ని ఇవి భర్తీ చేస్తున్నాయి. ⇒ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉంది. కంపెనీలు, గృహాల పద్దులు ఆరోగ్యంగా ఉన్నాయి. వినియోగం కూడా బలంగా ఉంది. ⇒ తదుపరి జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇ–వే బిల్లు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. ⇒ ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.8.1 లక్షల కోట్ల చెల్లింపుల్లో జాప్యం ఈ రంగం వృద్ధికి అవరోధంగా మారింది. నగదు ప్రవాహాల ఆధారితంగా రుణ సాయం అందించడం వంటి వినూత్నమైన చర్యలు అవసరం. ⇒ ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి పదార్థాలు, ఫార్మా ముడిసరుకులు (ఇంగ్రేడియెంట్స్), మ్యాగ్నెట్, బ్యాటరీ సెల్స్, నూనెలు, టెలికం ఎక్విప్మెంట్, వైద్య పరికరాల పరంగా స్వావలంబనను పెంచేందుకు బహుళ అంచల విధానం అవసరం. ⇒ ప్రస్తుతం ఏదైనా కంపెనీలో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పేర్కొంటుండగా, దీన్ని 26 శాతానికి తగ్గించాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవచ్చు. పూర్తిగా వైదొలగొచ్చు. ⇒ పీఎల్ఐ పథకం కింద రూ.13,759 కోట్ల ప్రోత్సాహకాలతో దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ 2025 సెప్టెంబర్ నాటికి రూ.9.34 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు రూ.5.12 లక్షల కోట్లుగా ఉన్నాయి. ⇒ డిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా యాప్ల వినియోగంలో వయసుల వారీ పరిమితులు తీసుకురావాలి. కరోనా సమయంలో మొదలైన ఆన్లైన్ బోధన టూల్స్పై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు అవసరం. పిల్లలకు బేసిక్ ఫోన్లు లేదా కంటెంట్ పరంగా ఫిల్టర్లతో విద్యా సంబంధిత సమాచారంతో కూడిన ట్యాబ్లను అనుమతించొచ్చు. ⇒ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మీడియాలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్పై ప్రచారాన్ని నిషేధించాలి. చంటి పిల్లలకు సంబంధించి పాలు, పానీయాల మార్కెటింగ్పై పరిమితులు విధించాలి. ⇒ దేశంలో స్థూలకాయం పెరిగిపోతుండడం ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. కనుక సరైన పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మహిళల్లో 24 శాతం, పురుషుల్లో 23 శాతం అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ⇒ ఐటీ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉండొచ్చు. కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుంది. దీనిపై దృష్టి సారించేందుకు ఏఐ ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలి.వికసిత్ భారత్కు మార్గసూచీభారతదేశ సంస్కరణల ప్రస్థానాన్ని ఆర్థిక సర్వే విశదీకరించింది.అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య స్థిరమైన పురోగతిని ప్రతిబింబించింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, స్థిరమైన వృద్ధితోపాటు దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, పారిశ్రామిక పాత్రను హైలైట్ చేస్తోంది. తయారీని బలోపేతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఈ సర్వే కార్యాచరణను కూడా వివరించింది’’ – ప్రధాని నరేంద్ర మోదీపటిష్ట స్థితిలో భారత్ దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా అధిగమించడం ద్వారా భారత్ను అధిక వృద్ధి పథంలో నిలిపాం. జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని 7 శాతానికి చేర్చాం. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం మధ్య భారత్ అంతర్జాతీయ ఆశాకిరణంగా నిలిచింది’’ – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎగుమతులు, వ్యవసాయంలో లోపాలు.. పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే 2025–26 దేశ ఎగుమతి విధానాలు.. ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయంలో లోపాలను ఎత్తి చూపించింది. విలువ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద వ్యవసాయ దేశంగా ఉన్న భారత్ నుంచి.. వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఆహారం, పానీయాల ఉత్పత్తుల ఎగుమతులు వచ్చే నాలుగేళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్లకు (రూ.9.2 లక్షల కోట్లు) చేరుకుంటాయని అంచనా వేసింది.2024–25లో ఇవి 51.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే విధానాల్లో తరచూ చేసే మార్పులతో సరఫరా వ్యవస్థలు దెబ్బతినొచ్చని, అనిశ్చితికి కారణమై.. విదేశీ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయించేందుకు దారితీయొచ్చంటూ హెచ్చరించింది. ఒక్కసారి ఎగుమతుల మార్కెట్లను కోల్పోతే తిరిగి పొందడం కష్టమవుతుందని పేర్కొంది.
బంగారం కొనొద్దు.. విలియం లీ హెచ్చరిక!
2025 జనవరిలో రూ. 78వేలు వద్ద ఉన్న బంగారం ధర 2026 జనవరికి రూ. 1.78లక్షలు క్రాస్ చేసింది. ఏడాది కాలంలో లక్ష రూపాయలు పెరిగిందన్నమాట. గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతున్న తీరు చూసి పసిడి ప్రియులలో కూడా ఒకింత భయం మొదలైంది. ఇది వరకు ఎప్పుడూ లేనంతగా.. పెరిగిపోతుండడంతో రాబోయే రోజుల్లో గోల్డ్ కొనడానికి సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నారు.బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.కొన్ని సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ కూడా ప్రజలను భయపెడుతున్నాయి. ఇదంతా ఒక ట్రాప్ అని విలియం లీ పేర్కొన్నారు. కొన్ని పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయించుకోవడానికి ఇలా చేస్తుంటారని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతుందో.. దాని ధర కచ్చితంగా పెరుగుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లోని కొన్ని పెద్ద బ్యాంకులు ఫిక్స్ చేస్తాయని ఆరోపించారు.ఇదీ చదవండి: ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!1980లో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరిగాయి. ఈ సమయంలో కూడా చాలామంది ప్రజలు గోల్డ్ కొనడానికి ఎగబడ్డారు. కొన్ని రోజుల తరువాత గోల్డ్ రేటు 57 శాతం పడిపోయింది. 2011లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు (2026) కూడా ఇదే రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. కాబట్టి రేటు పెరిగిందని కొనేయకండి. కొన్ని రోజులు వేచి చూడండి. తప్పకుండా.. బంగారం ధర తగ్గుతుందని చెప్పారు.
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్: 10,001 mAh బ్యాటరీతో..
స్మార్ట్ఫోన్ వినియోగదారులతో చాలామందికి ఎదురయ్యేది ఛార్జింగ్ సమస్యే. దీనికి చెక్ పెట్టడానికి రియల్మీ (Realme) లేటెస్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఏకంగా 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర ఎంత?, డెలివరీలు ఎప్పుడు అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.రియల్మీ లాంచ్ చేసిన ఎక్కువ బ్యాటరీ పవర్ కలిగిన స్మార్ట్ఫోన్ పేరు 'పీ4 పవర్ 5జీ'. ఇది 6.78 అంగుళాల 4డి కర్వ్⁺ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ & 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో 12 జిబి వరకు ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్తో లభించే ఈ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి 5 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.ట్రాన్స్ఆరెంజ్, ట్రాన్స్సిల్వర్, ట్రాన్స్బ్లూ ఎంపికలలో లభించే రియల్మీ పీ4 పవర్ 5జీ మొబైల్.. 8 జీబీ/ 128 జీబీ ధర రూ. 25,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ / 256 జీబీ ధర రూ. 27,999 &12 జీబీ / 256 జీబీ ధర రూ. 30,999. ఇది పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ.. 219 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!
భారతదేశంలోకి ప్రముఖ టెలికాం కంపెనీ 'ఎయిర్టెల్'.. ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా.. తన 36 కోట్ల వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్ఫామ్ అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium)ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం అనేది కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే కాకుండా.. బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్టెల్ యూజర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.. ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ అనేది.. అడోబ్ రూపొందించిన ఒక సులభమైన, వేగవంతమైన క్రియేట్ ఎనీథింగ్ యాప్. డిజైన్ అనుభవం లేకపోయినా, ఎవరికైనా ప్రొఫెషనల్ స్థాయి పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్, వీడియోలు, ఆహ్వాన పత్రికలు, మార్కెటింగ్ మెటీరియల్ రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న AI ఆధారిత ఫీచర్లు పనిని మరింత వేగంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ట్లో లాగిన్ అయి ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు తమ మాతృభాషలోనే డిజైన్ చేయగలుగుతారు. పండుగ శుభాకాంక్షలు, పెళ్లి ఆహ్వానాలు, వాట్సాప్ స్టేటస్లు, స్థానిక దుకాణాల ప్రమోషన్లు అన్నీ సులభంగా రూపొందించవచ్చు.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఅడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ద్వారా.. కంటెంట్ క్రియేటర్లు & ఇన్ఫ్లూయెన్సర్లు.. రీల్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, వైరల్ కంటెంట్ సులభంగా తయారు చేయవచ్చు. సాధారణ వినియోగదారులు పండుగ శుభాకాంక్షలు, వ్యక్తిగత ఆహ్వానాలు పంపుకోవచ్చు. విద్యార్థులు ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, పోర్ట్ఫోలియోలు రూపొందించవచ్చు. చిన్న వ్యాపారులు లోగోలు, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రకటనలు నిమిషాల్లో రూపొందించవచ్చు.You x Us x @adobeexpress - collab of the year!Casually unlocking the quick & easy design app worth ₹4000 for all of you.#EveryoneCanDesign #MadeWithAdobeExpress #AirtelXAdobe pic.twitter.com/JmCHG4tvgE— airtel India (@airtelindia) January 29, 2026
కార్పొరేట్
‘సెప్టెంబర్ నుంచి మేడిన్ ఇండియా సీ295ల డెలివరీ’
సివిల్ ఏవియేషన్పై హెచ్ఏఎల్ మరింతగా ఫోకస్
కొత్తగా 7 రూట్లపై ఎతిహాద్ ఎయిర్వేస్ దృష్టి
ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
గోల్డ్లోన్ సూపర్ రన్
దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం
బడ్జెట్ 2026పై పారిశ్రామిక వర్గాల అంచనాలు
హైదరాబాద్లోకి మరో అంతర్జాతీయ కంపెనీ
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు ఊరట
అదానీ గ్రూప్-ఎంబ్రేయర్ మధ్య ఒప్పందం
వెండి, పసిడి అదే పరుగు..
న్యూఢిల్లీ: వెండి, పసిడి రేట్లు ఆగకుండా పరుగులు తీ...
కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?
ప్రసిద్ద ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad)...
షాకింగ్ ధరలు.. కొత్త మార్క్లకు బంగారం, వెండి
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రో...
Stock Market Updates: లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్...
వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు
దేశవ్యాప్తంగా 2026-27 కేంద్ర బడ్జెట్ కోసం సన్నాహాల...
కేంద్ర బడ్జెట్ 2026: ‘మౌలిక’ మద్దతు మరింత పెరగాలి
2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమీపిస్...
తీపితో సీక్రెట్ లాక్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్కు ముందు కీలక సంప్రదాయ ...
'ముందు 50 శాతం డాడీ ట్యాక్స్ చెల్లించండి': ట్రంప్ పోస్ట్!
సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారత్ - యూరోపియన్ యూనియన్ ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త కండీషన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో అడుగుజాడల్లో నడుస్తూ మరో దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను కోరుకునే ఉద్యోగుల కోసం కొత్త షరతులను ప్రవేశపెట్టింది.బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్, ఇకపై ఒక్కో త్రైమాసికంలో గరిష్టంగా ఐదు అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) మినహాయింపులకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఉద్యోగి లేదా అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లిష్టమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ వెరిఫికేషన్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.ప్రస్తుతం జాబ్ లెవల్ 5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు, అదనంగా సహాయక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కోరే అభ్యర్థనలపై మరింత నియంత్రణకు ఉద్దేశించినవిగా కంపెనీ తెలిపింది.ఉద్యోగులకు మేనేజర్లు పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆమోదం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థన ఉంటే ఈమెయిల్ ద్వారా కాకుండా సిస్టమ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. “పాలసీ ప్రకారం అభ్యర్థన ఆమోదించబడకపోతే, మేనేజర్లుగా తాము చేయగలిగేదేమీ లేదు” అని పేర్కొన్నారు.ఇది చదివారా? ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్..దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ 2023 నవంబర్ 20న రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని 2024 మార్చి 10 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో కనీసం మూడు గంటలు గడపాల్సి ఉంటుంది.
ఈ-గేమింగ్ రంగంలో నియామకాలు భళా!
భారతీయ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. రియల్ మనీ గేమింగ్ (RMG)పై ఉన్న ఆంక్షలు సుమారు రెండు లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల మధ్య, ఈ-గేమింగ్ రంగం అనూహ్య రీతిలో పుంజుకుంటోంది. గడిచిన ఐదు నెలలుగా పరిశ్రమ తన వ్యూహాలను మార్చుకుంటూ, ప్రతిభను నిలుపుకోవడమే కాకుండా కొత్త విభాగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.కోర్ డెవలప్మెంట్కు క్రేజ్ప్రస్తుతం భారతీయ గేమింగ్ మార్కెట్ కేవలం వినోదం కోసమే కాకుండా హై-ఎండ్ గేమ్ డెవలప్మెంట్ హబ్గా మారుతోంది. ఇన్స్టాహైర్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఈ రంగంలో 50,000 నుంచి 60,000 వరకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. యూనిటీ (Unity), అన్రియల్ (Unreal) డెవలపర్లు, సీ++ ఇంజినీర్లు, 3డీ ఆర్టిస్టులు, గేమ్ డిజైనర్లకు గిరాకీ పెరిగింది. మొత్తం ఉద్యోగాల్లో వీటి వాటా 70-80 శాతంగా ఉంది. భారతీయ స్టూడియోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి AAA క్వాలిటీ టైటిల్స్ రూపొందించడంపై దృష్టి పెట్టాయి. టోర్నమెంట్ మేనేజర్లు, కంటెంట్ క్రియేటర్లు, అనలిస్ట్ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2026 చివరి నాటికి గేమింగ్ రంగంలో ఉపాధి 60-70 శాతం వృద్ధి చెందుతుందని ఇన్స్టాహైర్ అంచనా వేసింది.నియంత్రణలతో భరోసా‘ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం, 2025’ అమల్లోకి రావడం పరిశ్రమకు ఒక వరంలా మారిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్ఎంజీ, సాధారణ ఈ-గేమ్స్ మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పరిచినట్లు తెలుపుతున్నారు. ‘75 శాతం భారతీయ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు ఈ రంగాన్ని ఒక గౌరవప్రదమైన కెరీర్గా భావిస్తున్నారు. కేవలం ప్లేయర్లుగానే కాకుండా కోచ్లు, ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు 56 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు’ అని జెంట్సింథసిస్ సర్వే తెలిపింది.ప్రతిభను వదులుకోని కంపెనీలుఆర్ఎంజీ కంపెనీల్లో గతంలో నియామకాలు తాత్కాలికంగా నెమ్మదించినప్పటికీ అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఇతర గేమింగ్ విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ (Dream Sports) తమ వద్ద ఉన్న ప్రతిభను వదులుకోకుండా తమ గ్రూప్లోని ఇతర ఏడు ప్లాట్ఫారమ్ల్లో ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఫెలిసిటీ గేమ్స్ (Felicity Games) గతంలో ఆర్ఎంజీ విభాగాల్లో పనిచేసిన హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి కీలక నిపుణులను నియమించుకుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్ఎంజీపై ఆంక్షలు ఒక రకంగా ఇతర గేమింగ్ విభాగాలు గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు మార్గం సుగమం చేశాయి.ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
జియో మంత్లీ రీచార్జ్.. ఆల్ ఇన్ వన్ ప్లాన్!
మీరు జియో సిమ్ వాడుతున్నారా? ఎక్కువ ప్రయోజనాలున్న మంచి నెలవారీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. రిలయన్స్ జియో ఇటీవల ‘హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్’ పేరుతో రూ.500 ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ప్లాన్తో డేటా, అపరిమిత కాలింగ్, అలాగే ఉచిత యూట్యూబ్ ప్రీమియం సహా అనేక ఓటీటీ (OTT) సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.జియో రూ.500 ప్లాన్ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ .500. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం 56 జీబీ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ లో అదనపు ఛార్జీ లేకుండా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 100 SMSలు పంపుకోవచ్చు.ఈ ప్లాన్ లో అనేక ఓటీటీ యాప్స్ కు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఉంది.ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఇవే..యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్ స్టార్ (టీవీ/మొబైల్), సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్.. ఈ సబ్స్క్రిప్షన్లన్నీ ఈ ప్లాన్తో ఉచితంగా లభిస్తాయి.ఈ ఓటీటీలు మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. జియో హోమ్ 2 నెలల ఉచిత ట్రయల్, జియో ఏఐ క్లౌడ్లో 50 జీబీ స్టోరేజ్ కూడా కొత్త కనెక్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాన్ లో 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంది.
ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్..
హైబ్రిడ్ వర్క్ మోడల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ప్రయత్నాల్లో భాగంగా, ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులను వారి ఇంటి విద్యుత్ వినియోగ వివరాలను పంచుకోవాలని కోరుతోంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్కా నుంచి ఉద్యోగులకు ఒక అంతర్గత ఈమెయిల్ వెళ్లింది.అందులో కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విద్యుత్ వినియోగ సర్వేను పరిచయం చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ సర్వే హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే పరికరాల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ ప్రయత్నమని ఆ ఈమెయిల్లో పేర్కొన్నారు.“హైబ్రిడ్ పని విధానం మన కార్యకలాపాల్లో భాగమవడంతో, మన పర్యావరణ ప్రభావం ఇక కేవలం క్యాంపస్లకే పరిమితం కాదు. అది ఉద్యోగుల ఇళ్ల వరకూ విస్తరించింది. ఇంటి నుంచి పని చేసే సమయంలో వినియోగించే విద్యుత్తు కూడా ఇన్ఫోసిస్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతుంది. మన నివేదికలను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు, ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ విద్యుత్ వినియోగంపై సరైన డేటా అవసరం” అని సంఘరాజ్కా వివరించారు.ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ఉద్యోగులున్న ఇన్ఫోసిస్లో, ఎక్కువ మంది హైబ్రిడ్ మోడల్లో పనిచేస్తున్నారు. ఈ విధానం ప్రకారం, ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయానికి హాజరుకావాలి. గత 15 సంవత్సరాలుగా సంస్థ తన స్థిరత్వ ఫ్రేమ్వర్క్ను నిర్మించుకుంటూ వస్తూ, పర్యావరణ లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారిస్తోంది.పరికరాల వివరాలూ ఇవ్వాలిఈ సర్వేలో ఉద్యోగులను కేవలం విద్యుత్ వినియోగ వివరాలే కాకుండా, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే కంప్యూటర్లు, లైటింగ్, ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాల వివరాలు కూడా ఇవ్వాలని కోరుతోంది. అలాగే లైట్ల వాటేజీ, ఇంట్లో సౌర విద్యుత్ వినియోగం ఉందా లేదా వంటి అంశాలపై కూడా సమాచారం అందించాలని సూచించింది. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులు ఇళ్లలో శక్తి సమర్థవంతమైన చర్యలను అనుసరించాలని ప్రోత్సహిస్తోంది.
పర్సనల్ ఫైనాన్స్
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్కు, స్టాక్ మార్కెట్కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..


