Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indian Origin OpenAI CTO Srinivas Narayanan Quits Plans To Spend Time With Parents In India1
అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!

ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్ విభాగపు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అయిన శ్రీనివాస్ నారాయణన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని వీడి భారతదేశానికి రానున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడు సంవత్సరాలు సంస్థలో పనిచేసిన తరువాత.. శ్రీనివాస్ నారాయణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వరుసగా కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ విషయాన్ని కంపెనీకి తెలియజేసి ఈ ప్రయాణాన్ని "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించారు.నారాయణన్ తన తదుపరి ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోకముందు భారత్‌కు వెళ్లి తన వృద్ధ తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మాన్‌లకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పారు. టెక్నాలజీ, సమాజంలో కీలక మార్పులు జరుగుతున్న ఈ కాలంలో సంస్థలో పని చేయడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు. మీ అందరికీ భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''ఎవరీ శ్రీనివాస్ నారాయణన్?శ్రీనివాస్ నారాయణన్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొంది, ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్‌లో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత మెటాలో దశాబ్దానికి పైగా పని చేసి, ఫేస్‌బుక్ ఫోటోస్ వంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఓపెన్ఏఐలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్లైడ్ ఇంజనీరింగ్ బృందాన్ని నిర్మించి, విస్తరించారు. ఈ బృందమే పరిశోధనను లక్షలాది మంది ఉపయోగించే ఉత్పత్తులుగా మారుస్తుంది.After 3 incredible years, I am leaving OpenAI at the end of next week.I shared my decision with the OpenAI leadership team at the start of the month and here is a shorter version of what I shared with my team earlier this week.===Hi Team,I have decided to leave OpenAI. The…— Srinivas Narayanan (@snsf) April 17, 2026

Bharat Mata Needs You Zoho Sridhar Vembu Tweet2
"దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''

జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. అమెరికాలో చదువు, అవకాశాలు పొందిన తర్వాత తాను భారత్‌లోనే టెక్ రంగంలో ఎదిగినట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులు పడుతున్న అవస్థలు కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా జరుగుతున్న అనేక వివాదాల్లో ప్రవాస భారతీయులు ఇరుక్కుపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.భారతీయుల గౌరవం ప్రపంచ స్థాయిలో పెరగాలంటే కేవలం విదేశాల్లో విజయాలు సాధించడం కాదు. మన దేశంలో స్వయంగా, ఆర్థికంగా ఎదగడం. భారత్‌లో తగినంత ప్రతిభ ఉన్నప్పటికీ, చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రతిభను తిరిగి దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని, భారత యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!ప్రపంచంలో గౌరవం, భద్రత, అభివృద్ధి అన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. దయచేసి ఇంటికి (ఇండియా) తిరిగి రండి. భారతమాతకు మీ ప్రతిభ అవసరం. మీలో చాలా మందికి దీని గురించి ఆలోచించడం కష్టమైనప్పటికీ, దేశంలోనే కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.Open letter to Indians in America.--Dear brothers and sisters from Bharat:Like I did 37 years ago, you arrived in America with no money but with a good education and cultural heritage from Bharat. You achieved outstanding success. America was good to us. For that we must…— Sridhar Vembu (@svembu) April 27, 2026

BYD New Denza Z Details3
బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్!

చైనా కార్ల తయారీ దిగ్గజం బీవైడీ సరికొత్త కారు 'డెంజా జెడ్' (Denza Z)ను ఆవిష్కరించింది. మసెరటి గ్రాన్‌కాబ్రియో ఫోల్గోర్‌కు గట్టి పోటీని ఇచ్చే విధంగా రూపు దిద్దుకున్న ఈ కారును కంపెనీ 2026 బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో ఆవిష్కరించింది.బీవైడీ కంపెనీ ప్రధానంగా.. ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని దీనిని విఫణిలో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. డెంజా జెడ్ ఆకట్టుకునే స్టైల్ కలిగి.. అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. ఇది కూపే, కన్వర్టిబుల్, ట్రాక్-ఫోకస్డ్ వేరియంట్లలో లభించనుంది.2026 బీజింగ్ ఆటో షోలో కనిపించిన డెంజా జెడ్ ఎలక్ట్రిక్ కారు సరికొత్త రంగులో ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి మసెరటి కారు మాదిరిగా కనిపించే ఈ వాహనం.. ఎక్కువ ఫ్యాబ్రిక్ పొందునట్లు తెలుస్తోంది.డెంజా జెడ్ సిరీస్ మూడు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇవి ఏడబ్ల్యుడీ సామర్థ్యాలను కలిగి సుమారు 1,000 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేలా తయారైంది. ఇది కేవలం రెండు సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ కారు.ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!కంపెనీ దీనిని చైనా షోరూమ్‌లలోకి చేర్చడానికి ముందే.. యూరప్, ఇతర దేశాల్లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర 400,000-500,000 యెన్ల (58,600-73,200 డాలర్లు) వరకు ఉంటుందని అంచనా. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కావాల్సి ఉంది.🇨🇳🔥El 24 de abril, BYD presentó en Pekín un superdeportivo totalmente nuevo y puramente eléctrico.Cuenta con una potencia superior a los 1.000 caballos de fuerza;Acelera de 0 a 100 km/h en menos de 2 segundos;Está equipado con tecnología de carga ultrarrápida...#China #BYD pic.twitter.com/DbRdET6L5M— Hermosa China(Beautiful China) (@90Hercost) April 24, 2026

Axis Bank Lays Off 3000 Employees As Tech Investments Boost Productivity4
బ్యాంకింగ్ రంగంలో ఏఐ: 3000 ఉద్యోగాల కోత!

యాక్సిస్ బ్యాంక్ ఇటీవల తన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రకటనలో బ్యాంక్‌ ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. గత సంవత్సరం 1.04 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 1.01 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 3,000 మంది ఉద్యోగులు తగ్గారు.బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాభ్ చౌదరీ తెలిపిన ప్రకారం.. ఈ తగ్గింపు ప్రత్యేకంగా ఏ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని జరగలేదు. ఇది మొత్తం సంస్థలో సాధారణంగా జరిగిన మార్పు మాత్రమే. ముఖ్యంగా.. డిజిటల్ టెక్నాలజీపై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.గత మూడు, నాలుగు సంవత్సరాలుగా యాక్సిస్ బ్యాంక్ తన ఆపరేటింగ్ ఖర్చులలో 9% నుంచి 10% వరకు టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల వల్ల ఇప్పుడు పనితీరు మెరుగుపడి, ఉత్పాదకత కూడా పెరిగింది. కొంతమంది ఉద్యోగులు తమ పనులను ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా వేగంగా చేయగలుగుతున్నారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!పెద్ద స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరగలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు (AI) కూడా ఇంకా ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించలేదని, అది కేవలం ప్రక్రియలను వేగవంతం చేయడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగపడుతోందని తెలిపింది. ఇదే సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన భౌతిక విస్తరణను కూడా కొనసాగిస్తోంది. గత సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించింది. అంటే ఒకవైపు టెక్నాలజీ ద్వారా సామర్థ్యం పెంచుకుంటూ, మరోవైపు కస్టమర్ల కోసం శాఖలను కూడా పెంచుతోంది.

Oracle To Cut Over 20000 Jobs Is AI Hitting Senior Employees First5
వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!

టెక్ దిగ్గజం ఒరాకిల్.. ఇటీవలి భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుంచి 30,000 మందిని తొలగించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులకు.. తెల్లవారుజామున పంపిన ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఈ కోతలు అమెరికా, భారతదేశం, కెనడా, లాటిన్ అమెరికా దేశాలలో జరిగాయి.దిగ్గజ కంపెనీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో.. టెక్ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. తొలగింపులు ప్రభావం సీనియర్ ఉద్యోగుల మీద కూడా పడింది. అంటే చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఒరాకిల్ తొలగించిందన్నమాట.దీనికి ఉదాహరణ.. ఒరాకిల్‌లో 33 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ సెక్యూరిటీ నిపుణురాలు నీనా లూయిస్‌ను కూడా తొలగించడం. ఈమె డేటాబేస్, సెక్యూరిటీ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ నిర్ణయం తనకు షాక్‌గా అనిపించిందని తెలిపారు.ఇలాంటి షాకింగ్ లేఆఫ్స్ కేవలం ఒరాకిల్‌లో మాత్రమే జరగలేదు. ఎందుకంటే మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దిగ్గజ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం అని తెలుస్తోంది.ఏఐ టెక్నాలజీతో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. దీని వల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతో.. ఎక్కువ పనిని చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా, ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. ముఖ్యంగా సాధారణ కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి పనులు AI చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఇది ఉద్యోగ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపుతోంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?మరోవైపు.. ఎక్కువ జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీలకు భారంగా మారుతున్నారు. అందువల్ల, కంపెనీలు తక్కువ జీతంతో పనిచేసే యువ ఉద్యోగులను లేదా AI టూల్స్‌ను ఉపయోగించడం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిస్థితులు ఉద్యోగులలో భయాన్ని రేకెత్తించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులు కూడా తమ పనితీరును AIతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Stock Market Closing Update 27th April 20266
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 639.42 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో 77,303.63 వద్ద, నిఫ్టీ 194.75 పాయింట్లు లేదా 0.81 శాతం లాభంతో 24,092.70 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, తాన్లా ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏబీ కాట్‌స్పిన్ ఇండియా లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్ వంటివి నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement