ప్రధాన వార్తలు
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ముంబై ఈస్ట్ కమిషనరేట్కు చెందిన సీజీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఏకంగా రూ.769 కోట్ల డిమాండ్ నోటీసులను జారీ చేశారు.డిమాండ్ మొత్తం రూ.384,33,53,972 (సుమారు రూ.384 కోట్లు)గా ఉన్నా పెనాల్టీ రూపంలో పన్ను మొత్తంతో పాటు దానికి సమానమైన జరిమానా, వడ్డీని కూడా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో మొత్తంగా రూ.769 కోట్లు అయింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 లోని సెక్షన్ 74 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.వివాదం నేపథ్యం ఏమిటి?సాధారణంగా బ్యాంకులు తమ వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, ఈ ఉచిత సేవలకు కూడా ప్రతిఫలం ఉంటుందని, దానిపై పన్ను చెల్లించాలని జీఎస్టీ విభాగం వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా షోకాజ్ నోటీసులు అందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ‘గతంలోనూ ఇలాంటి అంశాలపై బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే ప్రస్తుత డిమాండ్ మొత్తం పరిమితిని మించి ఉన్నందున నిబంధనల ప్రకారం దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదిస్తున్నాం’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.తదుపరి కార్యాచరణఈ నోటీసులపై ఐసీఐసీఐ బ్యాంక్ వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత గడువులోగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక వ్యవహారంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!
అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు (Today Gold Rate) అంతలోనే ధర పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం తగ్గుముఖంలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కేఫ్-2 నిబంధనల అమలుపై అనిశ్చితి
దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం’ (కేఫ్-2) నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయంలో దీనికి సంబందించి జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో బ్యూరోక్రాటిక్ అంశాలు, బాధ్యతల నుంచి తప్పించుకునే ధోరణిపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే, వివిధ ఆటోమొబైల్ సంస్థలపై విధించిన సుమారు రూ.8,800 కోట్ల భారీ జరిమానాలను ఎవరు వసూలు చేయాలనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.కేఫ్-2 అంటే..కేఫ్-2(కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ ఫేజ్ 2) అంటే కార్ల తయారీ కంపెనీలు విక్రయించే అన్ని వాహనాల సగటు ఇంధన సామర్థ్యాన్ని నియంత్రించే నిబంధనలు. దీని ముఖ్య ఉద్దేశం వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం. ఒకవేళ ఏదైనా కంపెనీ అమ్మిన కార్ల సగటు ఉద్గారాలు నిర్ణీత పరిమితి దాటితే ఆ కంపెనీకి భారీగా జరిమానాలు విధిస్తారు. ఈ నిబంధనల వల్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ ఇంజిన్లు, సీఎన్జీ వాహనాల తయారీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.బాధ్యత ఎవరిది?ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, కీలక అధికారుల సమక్షంలో చర్చ జరిగింది. ‘ఈ జరిమానాలను ఎవరు నిర్ణయించారు? వీటిని ఎవరు ఆమోదించారు? వీటన్నింటికీ మించి రూ.8,000 కోట్లకు పైగా ఉన్న బకాయిలను రికవరీ చేసే బాధ్యత ఎవరిది?’ అని పీఎంఓ ప్రతినిధులు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమావేశంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, పెట్రోలియం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నప్పటికీ జవాబుదారీతనంపై ఏ ఒక్కరూ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు.మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయలోపంవిద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కేఫ్ నిబంధనలను నిర్దేశిస్తుంది. అయితే, జరిమానాల వసూలు తమ పరిధిలోకి రాదని ఇది స్పష్టం చేస్తోంది. రోడ్డు రవాణా శాఖ స్పందిస్తూ తాము కేవలం మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తామని, ఇంధన సామర్థ్య జరిమానాల రికవరీ తమ బాధ్యత కాదని తేల్చి చెప్పింది. నిబంధనలు రూపొందించింది బీఈఈ కాబట్టి వసూలు బాధ్యత కూడా వారిదే అని రవాణా శాఖ వాదిస్తోంది.జరిమానాలు ఇలా..ఈ సమావేశంలో సమర్పించిన గణాంకాల ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంనాటికి కేఫ్-2 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనందుకు 10 ప్రధాన కంపెనీలకు నోటీసులు అందాయి. అందులో ప్రధానంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.2,800 కోట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా రూ.1,788 కోట్లు, కియా ఇండియా రూ.1,346 కోట్లు చెల్లాంచాల్సి ఉంది. మరోవైపు మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎమ్డబ్ల్యూ వంటి కంపెనీలు నిబంధనలను సక్రమంగా పాటించినట్లు ప్రభుత్వం గుర్తించింది.కేఫ్-3 భవితవ్యంపై ప్రభావంఏప్రిల్ 1, 2027 నుంచి మరింత కఠినమైన కేఫ్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, ప్రస్తుత గందరగోళాన్ని పరిష్కరించకుండా ముందడుగు వేయడం సాధ్యం కాదని పీఎంఓ స్పష్టం చేసింది. పాత జరిమానాల రికవరీపై ఏకాభిప్రాయ యంత్రాంగం రూపొందించుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీని అమలు, రికవరీకి సంబంధించిన స్పష్టమైన ఫ్రేమ్ వర్క్తో తదుపరి సమావేశానికి హాజరుకావాలని మంత్రిత్వ శాఖలకు తుది హెచ్చరికలు జారీ అయ్యాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 260 పాయింట్లు పెరిగి 23,259 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 811 పాయింట్లు పుంజుకొని 75,019 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.27 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.28 శాతం నష్టపోయింది.Today Nifty position 20-03-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
విమాన ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. పారదర్శకతను పెంచడం, ప్రయాణీకుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలను విడుదల చేసింది.ఖర్చు లేకుండా సీట్ల కేటాయింపుప్రస్తుతం చాలా విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ లేదా టికెట్ బుకింగ్ సమయంలో ‘ప్రిఫర్డ్ సీట్’ పేరుతో ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు టికెట్ ధర కంటే ఈ ఫీజుకే ఎక్కువే చెల్లించాల్సి వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి విమానంలో 60 శాతం సీట్లు కచ్చితంగా ఉచిత ఎంపిక కేటగిరీలో ఉండాలి. ఒకే పీఎన్ఆర్పై టికెట్ బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కలిసి కూర్చునేలా విమానయాన సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పక్కపక్క సీట్ల కోసం అదనంగా చెల్లించే అవసరం తప్పుతుంది.బ్యాగేజీపై డీజీసీఏ సూచించిన స్పష్టమైన విధానాలుస్పోర్ట్స్ కిట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు తీసుకెళ్లడంపై స్పష్టమైన, సులభతరమైన నిబంధనలు ఉండాలి.విమానాల్లో పెంపుడు జంతువుల రవాణాపై ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ విమానయాన సంస్థలు తమ వెబ్సైట్లలో కచ్చితమైన పాలసీని ప్రదర్శించాలి.ప్రయాణికుల హక్కులు, విమాన ఆలస్యం లేదా రద్దు సమయంలో లభించే పరిహారం గురించి వెబ్సైట్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.భారత విమానయాన రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్గా ఎదుగుతోంది. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న తరుణంలో ప్రయాణికుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!
చమురు భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం జంప్చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్ నైమెక్స్లోనూ లైట్ స్వీట్ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. హార్మూజ్ మూసివేతకుతోడు.. ఖతార్లోని గ్యాస్ సౌకర్యాలు, కువైట్లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్ చమురు బాస్కెట్ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి.
కార్పొరేట్
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భారీ కుదుపు..
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ అంబానీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా
సిరామిక్ టైల్స్పై యుద్ధం ఎఫెక్ట్
సవాళ్ల నుంచి అవకాశాలదాకా.. కెమికల్స్ రంగం బూమ్
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు
సెమీకాన్ మార్కెట్ @ 300 బిలియన్ డాలర్లు
రైల్వే టికెట్ బుకింగ్లో భారీ మార్పులు.. త్వరలోనే!
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయ...
బిగ్రిలీఫ్.. పండగపూట బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
మళ్లీ నేలకరిచిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
ఐటీ, రియల్టీ స్టాక్స్ అండతో భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగి...
గ్యాస్ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం
ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లకు ప్రాధాన్య ప్రాతిపదిక...
పేపర్ పరిశ్రమకు ‘పశ్చిమాసియా’ సెగ
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్ పరిశ్రమను సమస్య...
దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు
దేశంలో బ్యాంకులకు టాప్–10 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మె...
ఆటోమొబైల్
టెక్నాలజీ
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంటి అద్దె: ఆఫీస్కు సమీపంలోని చిన్న అపార్ట్మెంట్కు సుమారు రూ.36,000కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000ఇతర ఖర్చులు: ఆన్లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000ఇవి కాకుండా సబ్స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు.
అంతర్జాతీయ చెల్లింపుల్లో ఫిన్టెక్ స్టార్టప్ల దూకుడు
భారతీయ సాఫ్ట్వేర్ సర్వీసులు, ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ఈ తరుణంలో నగదు లావాదేవీలు సులభతరం చేసే ప్రక్రియ వేగవంతం అవుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థల స్థానంలో స్వదేశీ ఫిన్టెక్ స్టార్టప్లు అత్యంత సులభమైన, పారదర్శకమైన సాంకేతిక వేదికలను అందుబాటులోకి తెస్తున్నాయి.పాత పద్ధతులకు స్వస్తి..గతంలో అంతర్జాతీయ చెల్లింపులంటే స్విఫ్ట్ వంటి సాంకేతికతపై ఆధారపడాల్సి వచ్చేది. నగదు చేరడానికి అనేక మధ్యవర్తిత్వ బ్యాంకుల గుండా ప్రయాణించాల్సి రావడం వల్ల రోజుల కొద్దీ సమయం పట్టడమే కాకుండా, భారీగా చార్జీలు వసూలయ్యేవి. ఇది పెద్ద కంపెనీలకు భారంగా అనిపించకపోయినా చిన్న ఎగుమతిదారులు, ఫ్రీలాన్సర్లు, ఎస్ఎంఈలకు పెద్ద సవాలుగా ఉండేది.ప్రస్తుతం ఫిన్టెక్ సంస్థలు సాఫ్ట్వేర్ ఆధారిత మౌలిక సదుపాయాలను రూపొందించడం ద్వారా ఈ అంతరాన్ని పూడుస్తున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిర్వహణ, నియంత్రణ సంస్థల నిబంధనల అమలు ఆటోమేషన్ ద్వారా సులభతరం అవుతున్నాయి.గ్లోబల్ మార్కెట్లో భారతీయ ముద్ర‘అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు కేవలం కార్పొరేట్ దిగ్గజాలకే పరిమితం కాలేదు. ఈ విభాగంలో స్టార్టప్ కంపెనీలు సులభంగా సర్వీసులు అందిస్తున్నాయి’ అని రేజర్పే సీఓఓ రాహుల్ కొఠారి విశ్లేషించారు. సాస్ సంస్థల నుంచి ఇ-కామర్స్ బ్రాండ్ల వరకు అన్నీ అంతర్జాతీయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెప్పారు. రేజర్పే ప్రస్తుతం 130కి పైగా కరెన్సీల్లో చెల్లింపులను అనుమతిస్తోందన్నారు.ఎయిర్బీఎన్బీ, షాపిఫై వంటి గ్లోబల్ బ్రాండ్లతో పాటు ఆకాశా ఎయిర్, హౌస్ ఆఫ్ మసాబా వంటి భారతీయ బ్రాండ్లు కూడా వీటి సేవలను వినియోగిస్తున్నాయి. క్రాస్-బోర్డర్(విదేశాలు) విభాగంలో లావాదేవీలు జరిపే వినియోగదారుల సంఖ్య రెట్టింపు అవుతోంది.నమ్మకమే పెట్టుబడి..విదేశీ కస్టమర్లు తమకు అలవాటైన యాపిల్ పే లేదా అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం వల్ల వ్యాపారాలు మెరుగుపడుతున్నాయని క్యాష్ఫ్రీ సీఈఓ ఆకాష్ సిన్హా తెలిపారు. ‘భారతదేశంలో అంతర్జాతీయ కార్డు లావాదేవీలు విఫలమయ్యే రేటు 35-40% వరకు ఉంటుంది. కానీ యూపీఐ, రూపే వంటి స్థానిక పద్ధతులను అనుసంధానించడం ద్వారా సక్సెస్ రేటును పెంచగలిగాం’ అని చెప్పారు.ఎగుమతిదారులకు భరోసాఫ్రీలాన్సర్లు, చిన్న ఎగుమతిదారుల కోసం స్కైడో సంస్థ ప్రత్యేక సేవలను అందిస్తోంది. ఎగుమతి చేసిన తర్వాత బ్యాంకుల నుంచి పొందాల్సిన ఫిరా(ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ అడ్వైజ్) వంటి పత్రాల సేకరణను ఈ సంస్థ సులభతరం చేస్తోంది. ప్రస్తుతం స్కైడో ఏడాదికి సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను నిర్వహిస్తోంది. వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, గృహాలంకరణ వస్తువుల ఎగుమతిదారులు ఈ ప్లాట్ఫామ్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఆర్బీఐ వెన్నుదన్నుభారత రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పేమెంట్ అగ్రిగేటర్–క్రాస్ బోర్డర్ నిబంధనలు ఈ రంగానికి కొత్త ఊపిరి పోశాయి. ఈ ఫ్రేమ్వర్క్ వల్ల ఫిన్టెక్ సంస్థలకు స్పష్టమైన గుర్తింపు లభించడమే కాకుండా బ్యాంకులపై పూర్తిస్థాయి ఆధారపడటం తగ్గింది. భవిష్యత్తులో ఈ సంస్థలు కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా గ్లోబల్ బిజినెస్లకు అవసరమైన పూర్తిస్థాయి ఫైనాన్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదగాలని ప్లాన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
‘అసలుకు అచ్చుగుద్దినట్లు చేస్తే ఊరుకోం’
ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్, క్యాప్కట్ వంటి యాప్లతో సంచలనం సృష్టించిన చైనా కంపెనీ ‘బైట్డ్యాన్స్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రతిష్టాత్మకమైన ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ‘సీడ్యాన్స్ 2.0’ గ్లోబల్ లాంచ్ను కంపెనీ నిరవధికంగా నిలిపివేసింది. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల నుంచి కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.వివాదానికి కారణం ఇదే..సీడ్యాన్స్ 2.0 సృష్టించే వీడియోలు అచ్చం హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను తలపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని క్లిప్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి. అందులో హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు రియలిస్టిక్గా ఉన్నాయి. ఐకానిక్ క్యారెక్టర్లుగా పేరున్న స్పైడర్ మ్యాన్, వెనమ్ వంటి సూపర్ హీరోలతో పాటు ప్రముఖ యానిమేషన్ క్లిప్లను ఈ ఏఐ మోడల్ అత్యంత నాణ్యతతో సృష్టించింది.దాంతో తమ మేధో సంపత్తిని అనుమతి లేకుండా ఈ మోడల్కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించారని హాలీవుడ్ స్టూడియోలు మండిపడుతున్నాయి.హాలీవుడ్ దిగ్గజాల ధ్వజంప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ గత నెలలోనే బైట్డ్యాన్స్కు ‘సీజ్ అండ్ డెసిస్ట్’ (నిలిపివేత) లేఖను పంపింది. తమ కంటెంట్ను అనుమతి లేకుండా వాడుకున్నారని డిస్నీ ఆరోపించింది. మరోవైపు, పారామౌంట్ స్కైడాన్స్ సైతం రంగంలోకి దిగింది. ‘స్టార్ ట్రెక్, ది గాడ్ ఫాదర్, సౌత్ పార్క్ వంటి మా ఐకానిక్ చిత్రాల హక్కులను బైట్డ్యాన్స్ ఉల్లంఘించింది’ అని పారామౌంట్ స్పష్టం చేసింది.సీడ్యాన్స్ 2.0 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ఫామ్ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, ఇ-కామర్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం రూపొందించారు. ఒకవేళ ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తే హాలీవుడ్ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
ఏసీ క్లీనింగ్ ఇలా ఈజీ!
మార్చి నెల.. ఎండ... ఉక్కపోతను తట్టుకోవాలంటే ఏసీ ఆన్ చేయాల్సిందే. అయితే నెలల తరబడి వాడకుండా వదిలేసిన ఏసీని ఇప్పుడు సడెన్గా ఆన్ చేస్తే గది త్వరగా చల్లబడదు. పోనీ సర్వీసింగ్ కోసం టెక్నీషియన్ను పిలుద్దామంటే బోలెడంత ఖర్చు. అయితే ఎలాంటి ప్రొఫెషనల్ టూల్స్ అవసరం లేకుండానే, కేవలం ఓ పాత టూత్ బ్రష్, కొద్దిగా నీళ్లతో మీ ఏసీని మీ చేతులతోనే కొత్తదానిలా క్లీన్ చేసుకోవచ్చు.క్లీనింగ్ మొదలుపెట్టే ముందు ఏసీ పవర్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసేయడం మరచిపోవద్దు. కరెంట్, నీళ్లు కలిస్తే చాలా ప్రమాదం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.స్టెప్ 1: ఫిల్టర్లతో మొదలుపెట్టాలి. విండో ఏసీ అయినా, స్ప్లిట్ ఏసీ అయినా ఫ్రంట్ కవర్ ఓపెన్ చేయగానే మెష్ ఫిల్టర్లు కనిపిస్తాయి. గదిలోని దుమ్ము, చెత్తాచెదారాన్ని ఇవే ఆపుతాయి. వీటిని బయటకు తీసి ట్యాప్ కింద పెట్టి ఫోర్స్గా వచ్చే నీటితో శుభ్రంగా కడగాలి. డస్ట్ అంతా పోయి ఫిల్టర్లు పారదర్శకంగా కనిపించేలా కడిగాక పక్కన ఆరబెట్టాలి. ఈ ఒక్క పనితోనే సగం గాలి ఫ్రీగా వస్తుంది.స్టెప్ 2: కాయిల్స్ క్లీనింగ్: ఫిల్టర్ల వెనుక అల్యూమినియంతో చేసిన సన్నటి కూలింగ్ కాయిల్స్ (ఫిన్స్) ఉంటాయి. చల్లటి గాలి వచ్చేది అక్కడి నుంచే కాబట్టి వీటి క్లీనింగ్ జాగ్రత్తగా చేయాలి. ఇందుకోసం పాత టూత్బ్రష్ను నీళ్లలో ముంచి, ఈ కాయిల్స్పై పైనుంచి కిందకు సున్నితంగా రుద్దాలి. బ్రష్ను మధ్యమధ్యలో నీళ్లలో కడుగుతూ మురికిని తొలగించాలి. గట్టిగా రుద్దితే ఆ సన్నటి కాయిల్స్ వంగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి పైపైన మెల్లగా క్లీన్ చేయాలి.స్టెప్ 3: విండో, ఔట్డోర్ యూనిట్ క్లీనింగ్: మీది విండో ఏసీ అయితే, వెనుక వైపు కూడా కాయిల్స్ ఉంటాయి. వాటర్ పైపుతో ఆ కాయిల్స్పై నీళ్లు కొడుతూ మురికిని కడిగేయాలి. లోపలి మోటార్పై నీళ్లు పడకుండా జాగ్రత్త పడాలి. స్ప్లిట్ ఏసీ (Splict AC) అయితే.. బయట డాబా మీద లేదా గోడకు ఉండే ఔట్డోర్ యూనిట్ను క్లీన్ చేయాలి. దీని చుట్టూ పేరుకుపోయిన దుమ్ము, బూజును వాటర్ పైపుతో ఫోర్స్గా కొట్టి క్లీన్ చేయాలి. ఇది శుభ్రంగా ఉంటే ఏసీ వేడిని ఈజీగా బయటకు పంపుతుంది.స్టెప్ 4: ఆరేదాకా వెయిట్ చేయాలి: క్లీనింగ్ అంతా అయిపోయిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదు. ఎందుకంటే లోపల నీటి తడి అలాగే ఉంటుంది కాబట్టి కనీసం గంటన్నర పాటు దాన్ని గాలికి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాతే ప్లగ్ పెట్టి ఆన్ చేయాలి. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తే... గాలి ఫ్లో, కూలింగ్ ఎఫెక్ట్ మీకే అర్థమవుతుంది. ఈ సాఫ్ట్ సర్వీసింగ్తో ఏసీ కూలింగ్ పెరగడం ఖాయం. అయితే ఇది టెక్నీషియన్ చేసే పనికి ప్రత్యామ్నాయం కాదు. ఏసీలో గ్యాస్, ఇతరత్రా ఏమైనా పార్టులు పోతే టెక్నీషియన్ రావలసిందే! చదవండి: ఇల్లు కొనాలంటే ఈ వసతులు ఉండాల్సిందే
పర్సనల్ ఫైనాన్స్
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.
గోల్డ్ లోన్లో.. రిస్కులూ ఉంటాయి!
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... రుణ పరిమితులు.. ⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్టీవీ)గా చెబుతుంటారు. ⇒ ఎల్టీవీకి సంబంధించి ఆర్బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది. ⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు. ⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్టీవీ అమలవుతుంది. ⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్టీవీ 75 శాతం మించకూడదు. అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు. ఉన్నట్టుండి ధరలు పతనమైతే..? ⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు. ⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది. ⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్బీఐ విధించిన ఎల్టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే. ⇒ లేదంటే ఎల్టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది. ⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది. ⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు. బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది. ⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది. ⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు. ⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్ అప్రైజర్ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ కోరుతుంది. వడ్డీ రేట్లు – చార్జీలు⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్బీఎఫ్సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి. ⇒ ఎన్బీఎఫ్సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్లు– ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ, గోల్డ్ అప్రైజర్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తుంటాయి. ⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు. ⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉంటుంది. ⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తీసుకుంటాయి. బంగారం విలువ మదింపు ఎలా..?‘లోయర్ ఆఫ్ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు. బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్టీవీని నిర్ణయిస్తారు.ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.ఇలా చేస్తే బెటర్..⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి. ⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్లు, ప్రముఖ ఎన్బీఎఫ్సీలను పరిశీలించొచ్చు. రుణ కాల వ్యవధులు..⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్లు, ముత్తూట్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి. ⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు.
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!
ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక


