Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indo‑American Discontent with Trump Preference for Biden Policy1
ఏడాది కాలంలోనే సీన్‌ రివర్స్‌!

అమెరికా రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న భారత సంతతి ప్రజలు (ఇండో అమెరికన్లు) డొనాల్డ్‌ ట్రంప్‌ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? భారత్‌తో సంబంధాలను నెరపడంలో ట్రంప్ కంటే అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాలు మెరుగని భావిస్తున్నారా? అంటే అవుననే అంటోంది ప్రతిష్టాత్మక ‘కార్నెగీ ఎండోమెంట్’ సర్వే. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇండో-అమెరికన్లలో ఆయనపై వ్యతిరేకత పెరగడం చర్చనీయాంశమైంది.సర్వే ఏం చెబుతోంది?‘ఇండియన్‌–అమెరికన్‌ యాటిట్యూడ్‌ సర్వే’ పేరుతో ‘కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌’ చేసిన ఈ సర్వేలో ఫలితాల ప్రకారం.. దాదాపు 71 శాతం మంది భారత సంతతి ప్రజలు ట్రంప్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో సంబంధాల విషయంలోనూ 55 శాతం మంది ఆయన తీరును తప్పుబడుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ట్రంప్ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తుండటం గమనార్హం.బైడెన్ ఎందుకు మెరుగనిపిస్తున్నారు?జో బైడెన్ తన పదవీ కాలంలో భారత్‌తో సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా చూశారని మెజారిటీ ఇండో-అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐ-సీఈటీ) ద్వారా రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్‌కు బైడెన్ అండగా నిలిచారు. బైడెన్ హయాంలో వీసా విధానాలు (హెచ్‌1బీ), కమలాహారిస్ వంటి వారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం ద్వారా భారత సంతతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.ట్రంప్ 2.0.. పెరిగిన ఆందోళనలుట్రంప్ మొదటి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండో-అమెరికన్లలో అసహనాన్ని పెంచుతున్నాయి.భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై భారత్‌ను హెచ్చరించడం వంటి అంశాలు కేవలం ఇచ్చిపుచ్చుకోవడమనే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.ట్రంప్ హయాంలో ఆన్‌లైన్ విద్వేషం, వర్ణ వివక్ష పెరిగిందని సగం మందికి పైగా భారత సంతతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: డబుల్‌ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు

Gold and Silver rates on 10 March 2026 in Telugu states2
డబుల్‌ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 10 March 20263
నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 92 పాయింట్లు పెరిగి 24,127 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 334 పాయింట్లు ఎగబాకి 77,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.91బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 93.87 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.83 శాతం పుంజుకుంది.నాస్‌డాక్‌ 1.38 శాతం పెరిగింది.Today Nifty position 10-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Women Workforce Participation Key to Viksit Bharat 2047 Axis Bank Study4
‘ఆమె’తోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని యాక్సిస్‌ బ్యాంక్‌ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా చెల్లింపు పనుల్లో కార్మికుల భాగస్వామ్యం ప్రస్తుతమున్న 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాలని సూచిస్తూ, ఈ విషయంలో మహిళల పాత్ర ఎంతో అవసరమని సూచించింది. జీ–20 దేశాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు భారత్‌లోనే చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. అందులోనూ వ్యవసాయం, స్వయం ఉపాధి లేదా చెల్లింపుల్లేని పనుల్లోనే మహిళలు ఎక్కువగా భాగస్వాములై ఉన్నట్టు తెలిపింది.దేశవ్యాప్తంగా 42 పట్టణాల్లో కాలేజీ విద్య అర్హత కలిగిన 11,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను యాక్సిస్‌ బ్యాంక్‌ విడుదల చేసింది. చదువుకున్న 12.5 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని, 60 శాతం పట్టభద్రులు పారితోíÙకంతో కూడిన పనుల్లో పాలు పంచుకోవడం లేదని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. భద్రతా సవాళ్లు..ఉద్యోగాలకు వెళ్లకపోవడానికి భద్రత, రవాణా పరమైన సవాళ్లను మహిళలు ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘వచ్చే 25 ఏళ్ల పాటు జీడీపీ వృద్ధి రేటును 7 శాతం స్థాయిలో కొనసాగేందుకు వీలుగా పారితోíÙకం ఇచ్చే పనుల్లో కారి్మకుల భాగస్వామ్యం తప్పనిసరిగా 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాల్సిందే. ఇందుకు గాను మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం’’అని ఈ నివేదిక వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో వృద్ధి అన్నది మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరే విధంగా కెరీర్‌లను తీర్చిదిద్దే సంస్థలకే చెందుతుందని యాక్సిస్‌ బ్యాంక్‌ మానవ వనరుల విభాగం గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజ్‌కమల్‌ వెంపటి పేర్కొన్నారు. 22 శాతం మహిళా కారి్మకుల భాగస్వామ్యం అన్నది సామాజిక లక్ష్యమే కాదని, అత్యంత కీలకమైన ఆర్థిక చోదకమన్నారు.వివాహం, తల్లికావడం వల్ల మహిళలు కెరీర్‌ అవకాశాలను కోల్పోతున్నారని, ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ సమస్యలకు పరిష్కారంగా ఉద్యోగాలను రూపొందించాలని సూచించింది. పిల్లల సంరక్షణ విషయంలో మద్దతునిస్తూ, తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు వీలుగా వారిని ప్రోత్సహించాలని అభిప్రాయపడింది. ‘‘ఉద్యోగాలకు డిమాండ్‌ను పెంచాలి. పట్టణ మౌలిక వసతులను మెరుగుపరచాలి. కాలం చెల్లిన చట్టపరమైన అవరోధాలను తొలగించాలి. పిల్లల సంరక్షణ వసతులు, పని ప్రదేశాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలం’’అని యాక్సిస్‌ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికేవత్త నీలకాంత్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. మహిళలు మరింతగా పనిచేయగలిగిన రంగాల్లో వారికి అవకాశాలు పెంచాలని, పార్ట్‌టైమ్‌ అవకాశాలు కలి్పంచాలని ఈ నివేదిక సూచించింది.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్‌!?

IIFCL Targets 1 Lakh Crore Loan Book by FY 2026 27 Doubling in Three Years5
రూ.లక్ష కోట్లకు లోన్‌ బుక్‌..

ప్రభుత్వరంగ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సీఎల్‌) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (రూ.2026–27) రూ.లక్ష కోట్ల రుణ మార్క్‌ను అధిగమించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ‘‘2025 డిసెంబర్‌ 31 నాటికి రుణ పుస్తకం రూ.80,515 కోట్లుగా ఉంది. ప్రస్తుత ధోరణి, వివిధ రంగాల్లో ప్రస్తుత ప్రాజెక్టుల ఆధారంగా చూస్తే మా రుణ పుస్తకం విలువ 2027 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు దాటనుంది’’అని ఐఐఎఫ్‌సీఎల్‌ ఎండీ రోహిత్‌ రిషి తెలిపారు. అంతేకాదు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో రుణ పుస్తకాన్ని రెట్టింపు చేసుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.క్రమశిక్షణతో కూడిన మదింపు ప్రమాణాలు, మెరుగైన ఆస్తుల నాణ్యత, నిధుల సమీకరణ వ్యూహాలు వృద్ధికి దోహదం చేస్తున్నట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్‌ షీటును విస్తరించుకోవడమే కాకుండా, అధిక నాణ్యతతో, వైవిధ్యమైన, జాతీయ మౌలిక ప్రయోజనాలకు అనుగుణంగా పటిష్ట రుణ పోర్ట్‌ఫోలియో నిర్మాణంపైనే మా ప్రధాన దృష్టి’’అని వివరించారు. మౌలిక రంగ అవసరాలకు అనుగుణంగా, తక్కువ వ్యయాలతో దీర్ఘకాలం కోసం దేశ, విదేశీ మార్కెట్ల నుంచి సైతం నిధులను సమీకరించుకోనున్నట్టు చెప్పారు.లోగడ ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, జికా, ఈఐబీ, ప్రపంచ బ్యాంక్‌ తదితర సంస్థల నుంచి నిధులను పొందినట్టు తెలిపారు. ఎంఐజీఏ (ప్రపంచ బ్యాంక్‌ సంస్థ) సహకారంతో సావరీన్‌ గ్యారంటీ లేకుండా దీర్ఘకాలానికి బిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించనున్నట్టు రోహత్‌ రిషి తెలిపారు. ఐఐఎఫ్‌సీఎల్‌లో కేంద్రానికి నూరు శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్‌!?

Summer AC Prices Surge Daikin Voltas LG Others Announce Hike Ahead Heat6
వేసవిలో ఏసీ ధరల మంటలు

వేసవి ఎండలు అప్పుడే తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్‌ కండీషనర్‌ (ఏసీ) కొనుగోలు చేద్దామనుకుంటున్న వారు.. కాస్తంత అదనంగా సమకూర్చుకోక తప్పదు. ఎందుకంటే సరిగ్గా సీజన్‌ ఆరంభానికి ముందు ఎసీ తయారీ సంస్థలు 5–15 శాతం మధ్య ధరల పెంపును అమలు చేస్తున్నాయి. ముడి సరుకుల ధరలు ప్రియంగా మారడం, సరఫరా చైన్‌ వ్యయాలు తగ్గించుకునేందుకు ధరల పెంపు బాటలో పయనిస్తున్నాయి. డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ఎల్‌జీ, హైయర్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ పలు మోడళ్ల ఏసీల ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి.ఏసీల తయారీలోకి వినియోగించే రాగి తదితర ముడి సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు, అధిక రవాణా చార్జీలను కారణాలుగా కంపెనీలు పేర్కొంటున్నాయి. ధరలు పెంచినప్పటికీ.. అధిక ఉష్ణోగ్రతల అంచనాలతో ఈ ఏడాది అమ్మకాలు బలంగానే నమోదవుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. గతేడాది సెపె్టంబర్‌లో జీఎస్‌టీ రేట్ల సవరణ ఫలితంగా ఏసీల ధరలు దిగిరాగా.. తాజా పెంపుతో ఆ ప్రయోజనం పూర్తిగా ఆవిరికానుంది. అప్పుడు రూమ్‌ ఏసీలపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడం గమనార్హం. డైకిన్‌ 12 శాతం పెంపు..జపనీస్‌ సంస్థ డైకిన్‌ ఏప్రిల్‌ నుంచి తన ఏసీ ధరలను 12 శాతం పెంచనున్నట్టు ప్రకటించింది. మోడళ్లను బట్టి ధరల పెంపు మారుతుందని డైకిన్‌ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్‌జిత్‌ జావా తెలిపారు. ‘‘కొత్త ఇంధన నిబంధనలతో ఉత్పత్తుల సామర్థ్యం పెరగనుంది. కాపర్‌ వంటి ముడి సరుకుల ధరలు పెరిగాయి. రూపాయితో డాలర్‌ ఆల్‌టైమ్‌ గరిష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నాయి. రవాణా చార్జీలు కూడా పెరిగాయి. దీంతో దిగుమతులు (విడిభాగాలు) వ్యయంగా మారాయి. కనుక కంపెనీలకు ధరలు పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు’’అని జావా వివరించారు. ఈ సీజన్‌లో అమ్మకాలు 2024 స్థాయిలో ఉంటాయంటూ.. కనీసం 15 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తాము ఫిబ్రవరి మధ్య నుంచే 8–10 శాతం మేర ధరలను పెంచినట్టు బ్లాస్టార్‌ ఎండీ బి.త్యాగరాజన్‌ తెలిపారు. ‘‘ధరల పెంపునకు ముందుగానే డీలర్లు అదనపు నిల్వలను సమకూర్చుకున్నారు. పెరిగిన ధరలతో కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. గతేడాది జీఎస్‌టీ రేటు తగ్గింపు.. ఇప్పుడు ధరల పెరుగుదల ప్రభావాన్ని భర్తీ చేయనుందన్నారు. డిసెంబర్‌ నుంచి కాకుండా, గతేడాది వేసవి సీజన్‌తో పోలి్చతే ధరల పెరుగుదల పెద్దగా ఉండదని త్యాగరాజన్‌ పేర్కొన్నారు. గతేడాది వేసవిలో అసాధారణ వర్షాలు, ముందుగానే నైరుతి సీజన్‌ రావడం ఏసీ అమ్మకాలను ప్రభావితం చేయడం గమనార్హం.పోటీ తీవ్రతరంఈ ఏడాది రూమ్‌ ఏసీల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నది మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. గతేడాది సీజన్‌ ఆశించిన మేర లేకపోవడంతో ఈ ఏడాది అధిక విక్రయాల ద్వారా మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు కంపెనీలు పోటీపడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాటా గ్రూప్‌ సంస్థ వోల్టాస్‌ సైతం తన ఏసీల ధరలను 5–15 శాతం మధ్య పెంచనున్నట్టు ప్రకటించింది. తయారీ వ్యయాలు పెరగడం, రూపాయి విలువ క్షీణత, మెరుగైన ఇంధన సామర్థ్యాలతో కూడిన నాణ్యమైన ఏసీలను వినియోగదారులకు అందించాలంటే ధరలను పెంచక తప్పదని వోల్టాస్‌ ఎండీ ముకుందన్‌ మీనన్‌ తెలిపారు. ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ 3 స్టార్‌ ఏసీల ధరలను 7 శాతం మేర, 5 స్టార్‌ ఏసీలను 9–10 శాతం మేర పెంచినట్టు ప్రకటించింది.కొత్త ఇంధన సామర్థ్యాలతో కూడిన ఏసీలతో వినియోగదారులకు 11 శాతం మేర ఇంధనం అదా అవుతుందని.. దీనివల్ల విద్యుత్‌ బిల్లు రూపంలో గణనీయంగా ఆదా అవుతుందని ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ డైరెక్టర్‌ సంజయ్‌ చిట్కర తెలిపారు. హైయర్‌ ఇండియా తన ఏసీ ధరలను 5–8 శాతం వరకు పెంచగా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ 5 శాతం పెంచినట్టు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ కొత్త స్టార్‌ రేటింగ్‌ ప్రమాణాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం 5 స్టార్‌ ఏసీలు 10 శాతం మేర మరింత ఇంధనాన్ని ఆదా చేయనున్నాయి.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్‌!?

Advertisement
Advertisement
Advertisement