Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Skoda Kodiaq Recalled Over Faulty Front Seat Frame1
స్కోడా రీకాల్.. 221 కార్లపై ఎఫెక్ట్!

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా.. తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన స్కోడా కోడియాక్‌కు రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 221 యూనిట్లపై పడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.స్కోడా కోడియాక్‌లోని ముందు సీట్ల లోపలి ఫ్రేమ్‌కు సంబంధించిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ జారీ చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం, మార్చి 10 నుండి డిసెంబర్ 8, 2025 మధ్య తయారైన మొత్తం 221 యూనిట్లు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఈ సమస్య ముందు సీట్ల లోపలి ఫ్రేమ్ అంచులో ఉంది. ఈ లోపం వల్ల.. సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నప్పుడు రక్షణ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు, ఇది సైడ్ ఎయిర్‌బ్యాగ్ సామర్థ్యాన్ని తగ్గించి, తద్వారా వాహనంలో ఉన్నవారికి గాయాలయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.రీకాల్ ప్రభావానికి ప్రభావితమైన కార్ల యజమానులను కంపెనీ సంప్రదించనుంది. రీకాల్ ప్రక్రియలో భాగంగా అవసరమైన తనిఖీలు, సమస్యలను పరిష్కరించనుంది.స్కోడా కొడియాక్రెండవ తరం కోడియాక్ గత సంవత్సరం ఏప్రిల్‌లో భారతదేశంలో విడుదలైంది. ఇది 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ల TSI టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 7-స్పీడ్ DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. పనితీరు పరంగా, ఈ SUV 201 bhp, 320 Nm గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.కోడియాక్ ధర వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను బట్టి మారుతుంది. ఈ ఎస్‌యూవీ ధర ప్రస్తుతం రూ. 39.99 లక్షల నుంచి రూ. 45.95 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. అదే సమయంలో, స్పోర్ట్‌లైన్ మరియు ఎల్&కె వేరియంట్ల వంటి నిర్దిష్ట ట్రిమ్‌ల ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

Gold May Not Match Past Returns Over Next 5 Years Says FundsIndia Akshay Sapru2
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్‌ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్‌లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.2030 నాటికి గోల్డ్ రేటుఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'

Pocket Juicer Bottle Bag Summer Gadgets3
జేబులో జ్యూసర్‌.. బాటిల్‌ బ్యాగ్‌!

మీ సమ్మర్‌ను రిఫ్రెషింగ్‌గా మార్చే ‘స్మార్ట్‌’ మ్యాజిక్‌ ఇదిగో! ఈ అదిరిపోయే గాడ్జెట్స్‌తో చెమటలకు గుడ్‌ బై చెప్పేసి, చిల్‌ అవ్వండి!జేబులో జ్యూసర్‌!ఆఫీసులో ఉన్నప్పుడైనా లేదా జిమ్‌ పూర్తి చేసొచ్చినా, బయట దొరికే షుగర్‌ డ్రింక్స్‌ తాగి విసిగిపోయారా? ఎక్కడున్నా సరే ‘ఫ్రెష్‌’గా జ్యూస్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసమే వచ్చేసింది ఈ రీచార్జబుల్‌ పోర్టబుల్‌ జ్యూసర్‌!ఇది మామూలు మిక్సీ కాదు, మీరు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లగలిగే ఒక మినీ మ్యాజిక్‌ బాటిల్‌! పైగా దీనికి వైర్లు లేదా ప్లగ్‌ పాయింట్లతో పనిలేదు. ఇందులో ఉన్న పవర్‌ఫుల్‌ బ్యాటరీని మీ మొబైల్‌ చార్జర్‌ లేదా పవర్‌ బ్యాంక్‌తో చార్జ్‌ చేసుకుంటే చాలు. ప్రయాణాల్లో ఉన్నా, క్యాంపింగ్‌లో ఉన్నా సెకన్లలో తాజా ఫ్రూట్‌ జ్యూస్‌లు, స్మూతీలు రెడీ అయిపోతాయి. జ్యూసర్‌ లీక్‌–ప్రూఫ్‌ డిజైన్‌తో వస్తుంది, కాబట్టి మీ బ్యాగ్‌లో పెట్టుకున్నా చిందుతుందనే భయం ఉండదు. ధర రూ. 570 మాత్రమే!బాటిల్‌ బ్యాగ్‌!బయటకి వెళ్ళినప్పుడు వాటర్‌ బాటిల్‌ను చేత్తో పట్టుకోలేక, బ్యాగ్‌లో పెడితే లోపల ఉన్న వస్తువులు తడిసిపోతాయని టెన్షన్‌ పడుతున్నారా? ఇకపై మీ బాటిల్‌ను స్టయిలిష్‌గా మోసుకెళ్లడానికి వచ్చేసింది ఈ వాటర్‌ బాటిల్‌ క్యారియర్‌ బ్యాగ్‌!ఇందులో బాటిల్‌తో పాటు మీ ఫోన్, డబ్బులు లేదా తాళాలు పెట్టుకోవడానికి ఒక జిప్పర్‌ పాకెట్‌ కూడా ఉంటుంది. పైగా దీనికి ఉన్న అడ్జస్టబుల్‌ షోల్డర్‌ స్ట్రాప్‌ వల్ల ఎవరికైనా ఇట్టే సెట్‌ అయిపోతుంది. వాటర్‌ ప్రూఫ్‌ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల వర్షం పడినా మీ ఫోన్, బాటిల్‌ సేఫ్‌గా ఉంటాయి! ఆఫీసుకైనా, జిమ్‌కైనా లేదా ట్రావెలింగ్‌కైనా ఈ బ్యాగ్‌ మీకు మంచి క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ధర రూ. 500 మాత్రమే!ఐస్‌ ముక్కల ‘మ్యాజిక్‌ కప్పు’!ఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌ ట్రే నుంచి ఐస్‌ ముక్కల్ని తీయడానికి కుస్తీ పడుతున్నారా? తీరా తీశాక అవి అక్కడక్కడా విరిగిపోయి చిరాకు తెప్పిస్తున్నాయా? అయితే మీకోసం వచ్చేసింది ఈ సిలికాన్‌ ఐస్‌ మేకర్‌ కప్పు!ఇది మామూలు ఐస్‌ ట్రే కాదు, ఒక స్మార్ట్‌ సిలికాన్‌ సిలిండర్‌. ఇందులో నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుని ఐస్‌ తయారు చేసుకోవచ్చు. దీనికున్న చిన్న బటన్‌ నొక్కితే చాలు, అరవై చిన్న చిన్న ఐస్‌ ముక్కలు టకటకా రాలిపోతాయి! చూడటానికి కప్పులా చాలా చిన్నగా ఉంటూ, మీ ఫ్రిజ్‌లో అస్సలు చోటు ఆక్రమించదు. ఫుడ్‌ గ్రేడ్‌ సిలికాన్ తో తయారవ్వడం వల్ల చాలా సేఫ్, పైగా దీనికి ఉన్న మూత వల్ల ఫ్రిజ్‌లోని ఇతర వాసనలు ఐస్‌కు అంటుకోవు. ధర కేవలం రూ. 400 మాత్రమే!

RBI Weighs E Cheques To Modernise Payment System4
ఈ-చెక్స్ వస్తున్నాయ్.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!

చెల్లింపు వ్యవస్థను మరింత కొత్తగా మార్చే ప్రక్రియలో భాగంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్తగా ఈ-చెక్స్ (ఎలక్ట్రానిక్ చెక్స్) ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ చర్యకు కారణం భద్రతను పెంచడం.. వ్యాపార, వినియోగదారుల అవసరాలను తీర్చడం.ఆర్‌బీఐ తన పేమెంట్స్ విజన్ 2028 నివేదికలో.. చెక్స్ డిజైన్, భద్రతా లక్షణాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సౌకర్యం, ఒక్కసారిగా అమలులో ఉండే విధానం, మోసాల నివారణ, కొత్త చెల్లింపు విధానాలతో సర్దుబాటు సాధ్యమవుతుందని వెల్లడించింది.ఈ-చెక్ అంటే?ఈ-చెక్ అనేది కాగితపు చెక్కుకు డిజిటల్ రూపం. అంటే దీనిని కాగితంపై కాకుండా ఆన్‌లైన్‌లో పంపుతారు. చెల్లింపుదారుడు వివరాలను నింపి, డిజిటల్ పద్ధతిని ఉపయోగించి సురక్షితంగా సంతకం చేసి, దానిని చెల్లింపు గ్రహీతకు లేదా బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ దీన్ని సాధారణ చెక్‌లా పరిశీలించి ప్రాసెస్ చేస్తుంది. ఇది వేగంగా, సురక్షితంగా, పేపర్ లెస్‌గా, ట్రాక్ చేయడానికి సులభంగా ఉంటుంది.ఇదీ చదవండి: భారత్‌లో దోహా బ్యాంక్ పూర్తిగా క్లోజ్!

Doha Bank Closes India Branches5
బిగ్ షాక్.. భారత్‌లో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్!

భారతదేశంలో పదేళ్లకు పైగా తన కార్యకలాపాలను సాగించిన దోహా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కటార్‌లోని దోహా బ్యాంక్ తన భారత్‌లోని రెండు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. కాగా ఇకపై కేవలం ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.దోహా బ్యాంక్ భారతదేశంలో తన కార్యకలాపాలను జూన్ 2014 లో ప్రారంభించింది. మొదటి శాఖ ముంబైలో, తరువాత కొచ్చిలో రెండవ శాఖ ప్రారంభించింది. ఆ తరువాత 2016లో ఈ బ్యాంక్ భారతీయ మార్కెట్‌లో వృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుని, గల్ఫ్ దేశం, భారతదేశం మధ్య రిమిటెన్స్ (ప్యారమిటెన్స్) అవకాశాలను లబ్ధిపరచడానికి ఇండియాలో సబ్సిడియరీ స్థాపించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి.ఇప్పుడు దోహా బ్యాంక్ వ్యూహం మార్పుతో.. భారతదేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గిస్తూ, ప్రతినిధి కార్యాలయం ద్వారా మాత్రమే తన ఉనికిని కొనసాగించనున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు జమ చేసుకోవడం విత్‌డ్రా చేయడం వంటివి ఇకపై ఉండదు. అయితే ఇది ఖతార్‌లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తుంది. అంటే వ్యాపార అవకాశాలను వెతకడం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'

Allianz Jio Reinsurance Operations Begin6
అలయంజ్‌ జియో రీఇన్సూరెన్స్‌ షురూ

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ (జేఎఫ్‌ఎస్‌ఎల్‌), అలయంజ్‌ గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన అలయంజ్‌ జియో రీఇన్సూరెన్స్‌ తాజాగా కార్యకలాపాలు ప్రారంభించింది. దీనికి సోనియా రావల్‌.. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారు. జేవీ ద్వారా దేశీ బీమా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు సంస్థ ఎండీ హితేష్‌ సేథియా తెలిపారు.బీమా కంపెనీలకు వినూత్నమైన, పటిష్టమైన రిస్క్‌ సొల్యూషన్స్‌ అందించనున్నట్లు అలయంజ్‌ ఎస్‌ఈ బోర్డు సభ్యుడు క్రిస్‌ టౌన్‌సెండ్‌ వివరించారు. అంతర్జాతీయంగా సాంకేతిక అనుభవం, దేశీయంగా డిజిటల్, ఆర్థిక వ్యవస్థలపై అవగాహన ఇందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement