Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

West Asia crisis hits travel industry hard1
ట్రావెల్‌.. క్యాన్సిల్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులతో అటువైపు వెళ్లాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఫ్లయిట్లను డైవర్ట్‌ చేసే రిసు్కలు ఉండటం, ప్రయాణాలకు పట్టే వ్యవధిపై అనిశ్చితి నెలకొనడం, బీమా నిబంధనలపై సందేహాలు మొదలైన అంశాలు ట్రావెలర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనితో 20–25% బుకింగ్స్‌ రద్దు లేదా రీషెడ్యూల్‌ అవుతున్నాయని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ (ఐఏటీవో) వెల్లడించింది. గల్ఫ్‌ ట్రాన్సిట్‌ హబ్‌లు, సమీప ప్రాంతాల్లోని రూట్లకు ఇవి పరిమితమైనట్లు వివరించింది. గగనతలంపై ఆంక్షలు కొనసాగినా, పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చినా వేసవి సీజన్‌లో ప్రయాణాలపై కూడా ప్రభావం పడొచ్చని ఐఏటీవో ప్రెసిడెంట్‌ రవి గొసెయిన్‌ తెలిపారు. సమీప భవిష్యత్తులో పశ్చిమాసియా దేశాలకు, లేదా ఆ ప్రాంతం మీదుగా ఇతర దేశాలకు బుక్‌ చేసుకున్న వారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నట్లు ట్రావెల్‌ బుకింగ్‌ అగ్రిగేటర్‌ మేక్‌మైట్రిప్‌ తెలిపింది. ఆయా ఎయిర్‌లైన్స్‌ పాలసీల ప్రకారం తేదీలను మార్చుకునే విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించింది. అలాగే, అబుదాబి, దుబాయ్‌లో ప్రస్తుతం ఉన్న ట్రావెలర్లకు స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ల ఆధారంగా అప్‌డేట్స్‌ని అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్‌ పిట్టీ తెలిపారు. ప్రభావిత ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఒమన్‌ నుండి భారత్‌కి చార్టర్‌ ఫ్లయిట్స్‌ నడిపే యోచనలో ఉన్నట్లు వివరించారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను బట్టి అంతర్జాతీయ ట్రావెల్‌కి స్వల్పకాలిక సవాళ్లు ఎదురైనా, దేశీయంగా మాత్రం టూరిజానికి డిమాండ్‌ పటిష్టంగానే కొనసాగవచ్చన్నారు.చమురు భగ్గు.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల దెబ్బతో ముడిచమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడ్‌ రేటు బ్యారెల్‌కి 8.6 శాతం ఎగిసి 79.11 డాలర్లకు, నైమెక్స్‌ ఆయిల్‌ ధర 7.6 శాతం పెరిగి 72.12 డాలర్లకు ఎగిసింది. ప్రధాన సరఫరాదారైన ఖతర్‌ ఉత్పత్తి నిలిపివేయడంతో యూరప్‌లో సహజ వాయువు ధర 40 శాతం పైగా పెరిగింది. క్రూడాయిల్, గ్యాస్‌ రవాణాకు కీలకమైన హార్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో రేట్లు మరింత భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. హార్ముజ్‌ని పూర్తిగా మూసివేస్తే ఆయిల్‌ ధర 90 డాలర్లు, అటు పైన 100 డాలర్లకి కూడా ఎగియొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అమెరికా సహా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు. ముడిచమురు ధరలు స్థిరంగా 15 డాలర్లు పెరిగితే, యూరప్‌లో ద్రవ్యోల్బణం అర శాతం మేర పెరుగుతుందని బెరెన్‌బర్గ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ వృద్ధిని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే, అమెరికాలో నవంబర్‌లో మిడ్‌–టర్మ్‌ ఎన్నికల ముందు ప్రతికూల పరిస్థితులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఇంధన రేట్లను మళ్లీ కిందికి దింపేందుకు ప్రయతి్నంచవచ్చని తెలిపింది.

Israel and Iran War Effect Gold Price Changing2
గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!

బంగారం ధరలు ఎప్పుడు, ఎలా? మారిపోతున్నాయో.. ఊహకందకుండా పోతోంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఏ నగరం ఎక్కువగా ఉన్నాయి?, ఏ నగరంలో కొంత తక్కువగా ఉంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,69,880 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు సాయంత్రానికి 1,70,510 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,55,650 రూపాయల దగ్గర నుంచి రూ. 1,56,300 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో ఉదయం 156660 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి అదే రేటు వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు (రూ.170840) విషయంలో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఈ రోజు ఉదయం 155880 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 156450 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు 1,69,950 రూపాయల వద్ద నుంచి 1,70,660 వద్ద నిలిచింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా.. బంగారం ధరల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం చెబుతున్నారు.

10 Things You Should Always Keep In Your Car Know The Details Here3
కారులో ఈ 10 వస్తువులుంటే.. మీరు సేఫ్!

కారు ఉపయోగించే చాలామంది.. లోపల అవసరం ఉన్న వస్తువుల కంటే, అనవసరమైన వస్తువులనే ఎక్కువ ఉంచుకుంటున్నారు. అయితే కారులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ముఖ్యమైన 10 వస్తువులు ఏవి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జంపర్ కేబుల్స్: వాతావరణంలో జరిగే మార్పులు లేదా ఇతర పొరపాట్ల కారణంగా లైట్లు ఆఫ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో వదిలేస్తారు. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ డెడ్ కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో జంపర్ కేబుల్స్ ఉంటే సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చు.జాక్ & స్పేర్ టైర్: అనుకోని సందర్భాల్లో టైర్ పంక్చర్ అయితే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పేర్ టైర్ & జాక్ వంటి వాటిని కారులోనే ఉంచుకోవడం వల్ల.. టైర్ పంక్చర్ సమయంలో మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు.ఫస్ట్ ఎయిడ్ కిట్: కేవలం కారులో మాత్రమే కాకుండా.. ప్రతి వాహనంలో తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అందులో బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ వైప్స్, ట్వీజర్స్, పెయిన్ రిలీవర్స్ వంటి అవసరమైన వస్తువులు ఉండాలి.టైర్ ప్రెజర్ గేజ్: టైర్లు బయటికి సరిగానే కనిపించినా, లోపల గాలి ఒత్తిడి సరైన స్థాయిలో లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.అదనపు బ్యాటరీలతో ఫ్లాష్‌లైట్: కారులో తప్పకుండా ఫ్లాష్‌లైట్ ఉండాలి. దీనికి అదనపు బ్యాటరీలు కూడా చాలా అవసరం. రాత్రివేళల్లో లేదా చీకటి ప్రదేశాల్లో ఫ్లాష్‌లైట్ ఉపయోగపడుతుంది. కారు బానెట్ క్రింద పరిశీలించాల్సినప్పుడు కూడా ఇది సహాయపడుతుంది.ఎమర్జెన్సీ బ్లాంకెట్: చలికాలంలో లేదా వాహనం ఆగిపోయినప్పుడు ఒక బ్లాంకెట్ తప్పకుండా అవసరం అవుతుంది. ఇది అత్యవసర సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది.మల్టీటూల్ (స్విస్ ఆర్మీ నైఫ్): చిన్న చిన్న పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చిన్నదే అయినా.. చాలా సందర్భాల్లో పనికొస్తుంది. దీనిని మీరు గ్లోవ్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు.వాటర్ బాటిల్: వాటర్ బాటిల్ కేవలం నీళ్లు తాగడానికి మాత్రమే కాదు. అనుకోని సందర్భాల్లో గాయాలైనప్పుడు, వాటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు కూడా నీళ్లు అవసరమవుతాయి. సీల్ చేసిన బాటిల్స్ ఉంచుకోవడం మంచిది.ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్: ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ ఉండడం వల్ల మీ ఫోన్ ఎప్పుడూ ఆఫ్ కాకుండా ఉంటుంది. కొన్నిసార్లు జీపీఎస్ న్యావిగేషన్ లేదా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి ఫోన్ చాలా అవసరం. కాబట్టి మీ దగ్గర ఉన్న ఫోన్ ఎప్పుడూ స్విచాఫ్ కాకుండా ఉంచడానికి ఫోన్ ఛార్జర్ & పవర్ బ్యాంక్ తప్పనిసరిగా మీతో ఉంచుకోవాలి.వెహికల్ రిజిస్ట్రేషన్ & ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్: కారుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా కారులో ఉంచుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారులు మీ కారును చెక్ చేసే సమయంలో వెంటనే చూపించడానికి ఇవి పనికొస్తాయి.

LPG cylinder becomes costlier check the new price4
పెరిగిన గ్యాస్‌ ధరలు.. 19 కిలోల సిలిండర్‌ కొత్త రేటు..

మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలురాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్‌లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి.గృహ ఎల్పీజీ రేట్లు యథాతథంఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.

Provident Fund Body EPFO Retains 8 25 Percent Interest For 2025 265
EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే?

ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతుందా.. అని ఎదురు చూసేవారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే.. 2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగానే నిర్ణయించారు. అంటే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదన్నమాట.ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. సీబీటీ నిర్ణయం తర్వాత.. 2025-26 సంవత్సరానికి EPF డిపాజిట్లపై వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతారు. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత, 2025-26 సంవత్సరానికి వడ్డీ రేటు ఏడు కోట్ల చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!

New Fund Offers from Tata AIA Trust MF ICICI Prudential6
ఇన్సూరెన్స్‌తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవే..

అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్‌ ఈక్విటీ ఫండ్‌’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్‌ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ లాంటి యూనిట్‌ లింక్డ్‌ పథకాల ద్వారా ఈ ఫండ్‌ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్‌ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్‌ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు.ట్రస్ట్‌ ఎంఎఫ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ప్రధానంగా మిడ్‌–క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ట్రస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్‌ క్యాప్‌ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్‌–క్యాప్‌ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్‌ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్‌ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ డివిడెండ్‌ లీడర్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యులిప్‌) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా డివిడెండ్‌ లీడర్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్‌ రికార్డుతో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్‌ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్‌ని ఇది ట్రాక్‌ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్‌ అష్యూర్, స్మార్ట్‌కిడ్‌ అష్యూర్, స్మార్ట్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ప్లస్‌ (సిప్‌ ప్లస్‌) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.

Advertisement
Advertisement
Advertisement