Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Good News for Gold Buyers as Prices Fall in Hyderabad, Delhi, and Chennai1
బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!

పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock Market Update May 5th 20262
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు!

మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 243.41 పాయింట్ల నష్టంతో 77,025.99 వద్ద, నిఫ్టీ 90.10 పాయింట్ల నష్టంతో 24,029.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్, డైనాకాన్స్ సిస్టమ్స్ & సొల్యూషన్స్ లిమిటెడ్, ఎంఎంపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అవ్రో ఇండియా లిమిటెడ్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్‌ప్లోరేషన్ లిమిటెడ్, నాథ్ బయో-జీన్స్ (ఇండియా) లిమిటెడ్, డి నోరా ఇండియా లిమిటెడ్, జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల్లో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Tata Curvv EV Series X Launch3
టాటా కర్వ్‌ ఈవీ కొత్త మోడల్ లాంచ్

టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, తన కర్వ్‌ ఈవీలో సరికొత్తగా ‘సిరీస్‌ ఎక్స్‌’ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌ ప్రారంభ ధరను రూ.16.99 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌ వద్ద) కంపెనీ నిర్ణయించింది.ఈ సిరీస్‌లో అకంప్లిష్డ్‌ ఎక్స్‌ 55, ఎంపవర్డ్‌ ఎక్స్‌ 55 అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. వీటిలోని 55 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఏకంగా 502 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. రియల్‌ వరల్డ్‌ కండిషన్స్‌ లో ఈ బ్యాటరీ సుమారు 400 కిలోమీటర్ల వరకు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.లెవెల్‌-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, పానోరామిక్‌ సన్‌రూఫ్, హర్మాన్‌ సినిమాటిక్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు బ్యాటరీపై 15 ఏళ్ల (లైఫ్‌–టైమ్‌) హెచ్‌వీ బ్యాటరీ వారంటీని టాటా మోటార్స్‌ అందిస్తోంది.మిడ్‌-ఎస్‌యూవీ విభాగంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సిరీస్‌ ఎక్స్‌’ శ్రేణి విడుదల చేసినట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీసీఓ వివేక్‌ శ్రీవత్స తెలిపారు. ఈ కారు ఐదు ఆకర్షణీయమైన రంగులతో పాటు ఐకానిక్‌ ‘డార్క్‌’ ఎడిషన్‌లోనూ లభించనుంది.

Middle East War Back On Global Markets Feel the Heat4
మళ్లీ మొదలైన యుద్ధం: గ్లోబల్ మార్కెట్‌పై ఎఫెక్ట్!

గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్‌ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

BJP Victory in Bengal: These Sectors Set to Get a Boost5
బెంగాల్‌లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. చాన్నాళ్ల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మార్పు ద్వారా ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణే ఎన్నికల కౌంటింగ్ రోజునే ఇక్కడున్న చాలా కంపెనీల షేర్స్ పెరగడం. దీన్ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారులు బెంగాల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (మౌలిక సదుపాయాలు), రైల్వేస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఎనర్జీ, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా.. రాష్ట్రం మరింత పురోగతి దిశగా అడుగులు వేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇకపోతే.. కొన్ని కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా మమతా బెనర్జీ హయాంలో గుత్తాధిపత్యం చెలాయించిన కంపెనీలు లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

BHEL jumps 10percent on strong Q4 profit beat estimates6
బీహెచ్‌ఈఎల్‌ లాభం హైజంప్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్, తయారీ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(బీహెచ్‌ఈఎల్‌) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 2.5 రెట్లు ఎగసి రూ. 1,290 కోట్లను అధిగమించింది. ప్రధానంగా విద్యుత్‌ ఉపకరణాల విభాగం జోరు ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 504 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 1.40 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 9,143 కోట్ల నుంచి రూ. 12,554 కోట్లకు జంప్‌చేసింది. దీనిలో విద్యుత్‌ విభాగం టర్నోవర్‌ రూ. 9,510 కోట్లకు బలపడింది. అంతక్రితం క్యూ4లో రూ. 6,192 కోట్లు మాత్రమే నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీహెచ్‌ఈఎల్‌ నిక ర లాభం మూడు రెట్లు వృద్ధిచెంది రూ. 1,600 కోట్లను దాటింది. 2024–25లో కేవలం రూ. 534 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 28,805 కోట్ల నుంచి రూ. 34,590 కోట్లకు పుంజుకుంది. దీనిలో విద్యుత్‌ ఉపకరణాల టర్నోవర్‌ రూ. 20,937 కోట్ల నుంచి రూ. 25,407 కోట్లకు పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌ షేరు బీఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 377 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 399కు దూసుకెళ్లి 52 వారాల గరిష్టాన్ని తాకింది.

Advertisement
Advertisement
Advertisement