Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Key Highlights of RBI Integrated Ombudsman Scheme 20261
బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థల సేవలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 2026 నుంచి అమలులోకి రానున్న నూతన అంబుడ్స్‌మన్ పథకం ద్వారా బాధితులకు భారీ స్థాయిలో పరిహారం పొందే అవకాశం కల్పించింది.పరిమితి లేని వివాద పరిష్కారంకొత్తగా తీసుకువచ్చిన ‘రిజర్వ్ బ్యాంక్–ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (RB-IOS) 2026’ ప్రకారం.. వినియోగదారుల ఫిర్యాదులో ఉన్న వివాదాస్పద మొత్తంపై ఇకపై ఎటువంటి గరిష్ట పరిమితి ఉండదు. అంటే, వివాదంలో ఉన్న మొత్తం ఎంత పెద్దదైనా అంబుడ్స్‌మన్ దాన్ని విచారించవచ్చు. అయితే, ఫిర్యాదు వల్ల కలిగిన నష్టాలకు (Consequential Loss) సంబంధించి అంబుడ్స్‌మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కలిగి ఉంటుంది. 2021 పథకం ప్రకారం ఇది రూ.20 లక్షలుగా ఉంది.మానసిక వేదనకు అదనపు పరిహారంకేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఫిర్యాదుదారుడు అనుభవించిన మానసిక వేదన, సమయం వృథా, ఖర్చులకుగానూ ప్రత్యేకంగా గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం చెల్లించాలని అంబుడ్స్‌మన్ ఆదేశించవచ్చు. గతంలో ఇది రూ.1 లక్షగా ఉంది. కొత్త నిర్ణయం వినియోగదారుల పట్ల ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.కీలక మార్పులుఈ సవరించిన పథకం జులై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్రొవైడర్లు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఆర్‌బీఐ తన అధికారులను మూడు సంవత్సరాల కాలపరిమితితో అంబుడ్స్‌మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్‌మన్‌గా నియమిస్తుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (CRPC) ఏర్పాటు చేస్తారు.ఫిర్యాదు చేయడం ఎలా?వినియోగదారులు తమ ఫిర్యాదులను డిజిటల్ లేదా ఫిజికల్‌ రూపంలో నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా https://www.rbi.org.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్/నేరుగా సంబంధిత సెంట్రలైజ్డ్ సెంటర్‌కు పంపవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఆర్థిక రంగంలో పారదర్శకతను పెంచుతాయని, సామాన్య వినియోగదారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని కలిగిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు

When Buying a House Amenities Are the First Priority2
మారుతున్న ఇష్టాలు.. వసతులకే ప్రాధాన్యం!

ఇంటి కొనుగోలుదారుల ఇష్టాలు మారుతున్నాయి. మొన్నటి వరకు ధరకు ప్రాధాన్యం ఇచ్చిన గృహ కొనుగోలుదారులు ఇప్పుడు వసతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాజెక్ట్‌ వరకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా, వైద్యం వసతులు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి వెళ్లవచ్చు? ఎంత దగ్గరలో ఆరోగ్య సేవలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. పెరిగిన ఆరోగ్య జాగ్రత్తలలో భాగంగా ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇల్లు విశాలంగా ఉండటమే కాదు, కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి కస్టమర్ల డిమాండ్‌. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. నివాస ప్రాజెక్ట్‌లలో ఎక్కువ స్థలం ఖాళీ వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే అలాంటి కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనా పాలనా చూసే డే కేర్‌ సెంటర్లు ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతోంది.వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్ధతిలో ఇంటి నుంచే పనిచేస్తున్నా.. పిల్లలను చూసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. అందుకే కమ్యూనిటీలలో డే కేర్‌ సదుపాయాలను ఉండాలని కోరుకుంటున్నారు. వీకెండ్‌ వసతులు అవసరమే.. ఇంటి నుంచి ఆఫీసు ఎంత దూరంలో ఉందనేది గృహ కొనుగోలుదారులు ప్రధానంగా చూస్తున్నారు. సిటీ ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతోంది కాబట్టి.. దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి.అదే సమయంలో ప్రజారవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటున్నారు. వీకెండ్‌ వస్తే కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, రిక్రియేషన్‌ క్లబ్స్‌ వంటివి ఎంత దూరంలో ఉన్నాయనేవి సైతం ఇంటి కొనుగోలుదారులు చూస్తున్నారు.

Gold Price High in A Week Know The Latest Price3
వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!

బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,40,460 నుంచి రూ. 1,43,780లకు చేరుకుంది. వారం రోజుల్లో పసిడి ధరలు 3320 రూపాయలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,28,750 రూపాయల నుంచి 1,31,800 రూపాయల వద్దకు చేరింది. అంటే 3050 రూపాయలు పెరిగిందన్నమాట.చెన్నైలో జనవరి 11న 1,39,650 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 17వ తేదీ నాటికి 1,44,870 రూపాయల (రూ.5220 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 1,29,000 నుంచి రూ. 1,32,800 (రూ. 3800 పెరిగింది) వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 1,40,610 రూపాయల నుంచి వారం రోజుల్లో 1,43,930 రూపాయల (రూ. 3320 పెరిగింది) మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,900 వద్ద నుంచి రూ. 1,31,950 వద్దకు (3050 రూపాయలు పెరిగింది) చేరింది.

Maruti Victoris Global Exports Commence From India4
భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?

మారుతి సుజుకి కంపెనీ.. భారతదేశంలో తయారు చేసిన తన విక్టోరిస్ కారు ఎగుమతులను ప్రారంభించింది. 450 వాహనాల మొదటి బ్యాచ్ ఇటీవల ముంద్రా & పిపావావ్ ఓడరేవుల నుంచి రవాణా తరలించింది. అయితే సంస్థ ఈ కారును 'అక్రాస్' పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయించనుంది.మారుతి సుజుకి విక్టోరిస్ కారును లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా.. కంపెనీ ఎండీ & సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, ''మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'' అనే దార్శనికత ద్వారా ఎగుమతి చేస్తున్నాము. 2025లో దేశం నుంచి 3.9 లక్షల వాహనాలను ఎగుమతి చేసి.. వరుసగా ఐదవ సంవత్సరం భారతదేశపు నంబర్ వన్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా అవతరించామని అన్నారు. ఈ ఏడాది ఈ-విటారా ద్వారా ఎగుమతులను ప్రారంభించామని పేర్కొన్నారు.విక్టోరిస్ కారు గురించిమారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

54878 Houses for Sale in Hyderabad Know The Details5
54878 ఇళ్లు.. ఫర్ సేల్!

ఒకవైపు హైదరాబాద్‌లో గృహ విక్రయాలు వృద్ధి చెందుతున్నప్పటికీ.. మరోవైపు అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కూడా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ప్రారంభమైన అందుబాటు, మధ్యస్థ ధరల ఇళ్ల వాటా అధికంగా ఉండటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రస్తుతం నగరంలో 54,878 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. గతేడాదితో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం మేర పెరిగింది. ముంబై, ఎన్‌సీఆర్‌(ఢిల్లీ) ల తర్వాతే అత్యధికం మన దగ్గరే ఇన్వెంటరీ అధికంగా ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరోరూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్టాక్‌లో అధికంగా ఉన్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్లు ఏకంగా 20,069 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 7.4 త్రైమాసికాలు పడుతుంది. ఇక, రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు 5,638 ఉన్నాయి. వీటి అమ్మకానికి ఏకంగా 10.4 త్రైమాసికాలు పడుతుంది. అఫర్డబుల్‌ ఇళ్ల కొనుగోలుదారులు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉండే ఇళ్ల వాటా గణనీయంగా తగ్గాయి. 2024 హెచ్‌–2తో పోలిస్తే ఈ విభాగం వాటా 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గగా.. రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల లాంచింగ్స్‌ వాటా 25 శాతం నుంచి 23 శాతానికి క్షీణించాయి.ప్రీమియం యూనిట్లు తక్కువే..ఇన్వెంటరీలో ప్రీమియం ఇళ్ల వాటా కాస్త తక్కువగానే ఉన్నాయి. రూ.1.2 కోట్ల ధర ఉన్న గృహాలు 18,825 ఉన్నాయి. రూ.2.5 కోట్ల ధర ఉన్న యూనిట్లు 8,468, రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న ఇళ్లు 1,628, రూ.10 నుంచి రూ.20 కోట్ల ధర ఉన్నవి 92, రూ.20 నుంచి రూ.50 కోట్ల ధర ఉన్న యూనిట్లు 158 ఉన్నాయి.38,403 ఇళ్ల విక్రయం..2025లో నగర నివాస మార్కెట్‌ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్లలో నమ్మకం, ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. గతేడాది హైదరాబాద్‌లో 38,403 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాది 2024తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇక, 2025లో నగరంలో కొత్తగా 40,737 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. ప్రాజెక్ట్‌ లాచింగ్స్‌ కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడం, నియంత్రణ పరిమితుల కారణంగా 2024 హెచ్‌–2తో పోలిస్తే లాచింగ్స్‌ 7 శాతం మేర క్షీణించాయి.2025లో హైదరాబాద్‌ కార్యాలయ సముదాయాలు వార్షిక లావాదేవీలు 1.14 కోట్ల చ.అ.లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అయితే ఆఫీసు స్పేస్‌ సప్లై పరిమితంగా ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి రేటు కారణంగా లావాదేవీలు పెరిగాయి.

Do You Know Mukesh Ambani Antilia First Month Power Bill6
అంబానీ నెల కరెంట్‌ బిల్లు.. లగ్జరీ కారే కొనేయొచ్చు!

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం అంటిలియా (Antilia) గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. అయితే.. సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ భవనానికి నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.2010లో అంబానీ.. ముంబయిలోని ‘అంటిలియా’కు మారిన తరువాత, మొదటి నెలలో 637240 యూనిట్ల విద్యుత్తును వినియోగించినట్లు, దీనికోసం కరెంట్ బిల్ ఏకంగా రూ.70,69,488గా చెల్లించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ బిల్లును సకాలంలో చెల్లించడం వల్ల.. అంబానీకి రూ.48,354 డిస్కౌంట్‌ కూడా లభించిందని సమాచారం. అంటిలియా భవనం ఉపయోగించే కరెంట్ దాదాపు 7000 సగటు ముంబై గృహాల నెలవారీ విద్యుత్ వినియోగానికి సమానం.అంటిలియా ప్రత్యేకతలుముంబై నగరంలో నిర్మించిన.. ముఖేష్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్‌లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు.ఔట్ డోర్ ఏసీ లేదు!ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు.

Advertisement
Advertisement
Advertisement