Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why Term Insurance Matters know the reasons1
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్‌!

‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్‌లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్‌ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్‌ ప్రొఫెషనల్స్‌), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్‌ జెడ్‌) తప్పనిసరిగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అంటే ఏమిటి?టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్‌ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్‌ ప్లాన్‌ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్‌లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.1980 తర్వాత పుట్టిన వారికి..1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.ఆరోగ్య సమస్యలువయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్‌నెస్‌) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్‌ ప్లాన్‌తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.1997-2007 మధ్య పుట్టిన యువతఈ జనరేషన్‌ జీ/మిలీనియల్స్‌కు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.ఆర్థిక బాధ్యతలుఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.దీర్ఘకాలిక రక్షణతక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం

Indian Cyber Force group announced leaked sensitive data of Pakistani govt2
పాకిస్థాన్‌ వ్యవస్థలకు డిజిటల్ షాక్!

సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ, భారత్‌పై పదే పదే విషం చిమ్మే పాకిస్థాన్‌కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ‘ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌’ (Indian Cyber Force) అనే హ్యాకింగ్‌ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్థాన్‌ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లోలం అవుతోంది.ఏమేమి లీక్ అయ్యాయి?‘ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌’(ICF) అందించిన వివరాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావడం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడి.పోలీసు రికార్డులు, పాస్‌పోర్ట్‌ డేటా: పౌరుల వ్యక్తిగత, గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా (2.2 జీబీ), పాస్‌పోర్ట్‌ వివరాలు బహిర్గతమయ్యాయి.Pakistan Railway Employee Data (name, father name, mother name, employee, cnic, address ) & Land Management(name, father name, mother name, shop name, cnic, address ) Data Breached! (Maintenance system)Remember the name "Indian Cyber Force" #PakistanRailwayHacked… pic.twitter.com/kWR1eF5srZ— Indian Cyber Force (@CyberForceX) November 20, 2025ఆర్థిక డేటా: ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల CNIC (జాతీయ ఐడీలు), పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్‌ రికార్డులు ఉన్నాయి.Police Record Verification Data OF Pakistan Breached! 2.2 GB Data Le*akedIncluded: Passports, Electricity Bills etc Greetz to: solveig#IndianCyberForce#OperationHuntDownPorkies pic.twitter.com/Z4NtYVl2ZB— Indian Cyber Force (@CyberForceX) November 19, 2025రైల్వే: పాకిస్థాన్‌ రైల్వే ఉద్యోగుల వివరాలు (పేరు, తల్లిదండ్రుల పేర్లు, CNIC, చిరునామా), ల్యాండ్ మేనేజ్‌మెంట్ (భూమి నిర్వహణ) డేటా లీక్ అయ్యింది.విద్యుత్తు, ఫార్మసీ: విద్యుత్ బిల్లుల సమాచారం, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ఫార్మసీ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా సున్నితమైన డేటా (బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్‌వర్డ్‌లు) బహిర్గతమైంది.We have breached Pakistan Pharmacy Company, Next Pharmaceutical pk 24 GB+ data exfiltrated. Exposes: Company name, Bank Account, Private Emails, Passwords, Documents Check: https://t.co/fL4C6GJPNW#IndianCyberForce pic.twitter.com/TqXG4Ag4KR— Indian Cyber Force (@CyberForceX) November 5, 2025విద్య: టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ట్రైనింగ్ అథారిటీ (TEVTA) సైట్ కూడా హ్యాక్ చేశారు.ఆపరేషన్ సింధూర్-ర్యాన్సమ్‌వేర్ దాడి: ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌ అధికారిక వెబ్‌సైట్ల సర్వర్లపై రాన్సమ్‌వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్‌లను ఎన్‌క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది.వ్యవస్థల నిర్లక్ష్యం: పాకిస్థాన్ వైఫల్యంఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. CNICలు(జాతీయ ఐడీలు), పన్ను రికార్డులు, పోలీసు డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్నది బహిరంగ రహస్యం.ఆర్థిక అనిశ్చితి ప్రభావంఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్‌డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి.పౌరుల గోప్యతకు ప్రమాదంఈ లీక్‌ల ద్వారా పాకిస్థాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్‌, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే, సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా దీటైన సమాధానం ఇవ్వగలదని ఈ సంఘటన రుజువు చేసింది.ఈ ఆపరేషన్ పాకిస్థాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్‌పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్.. తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవడం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా, డిజిటల్ రంగంలో కూడా గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని పంపుతుంది.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం

Data of 815M people reportedly on sale Sabeer Bhatia alleges Aadhaar breach3
ఆధార్‌ డేటాపై హాట్‌మెయిల్‌ కోఫౌండర్‌ సంచలన ఆరోపణలు

భారత పౌరుల ఆధార్‌ డేటా భద్రతపై హాట్‌ మెయిల్‌ కోఫౌండర్‌ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్‌ డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు ఈ డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.‘మొత్తం ఆధార్ డేటాబేస్‌ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు ఓ కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించింది’ భాటియా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.భారత ఆధార్‌ డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం​ చేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.సబీర్ భాటియా ఆధార్‌ వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్‌ డిజైన్‌, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో ఓ పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్‌ నిర్మాణానికి 1.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్‌ డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్‌ కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్‌పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్‌ ఆథెంటికేషన్‌ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు. There’s a story doing the rounds that the entire Aadhaar database has been stolen by crypto criminals, with data of 815M people reportedly on sale for $80,000. I can’t confirm if this is true… but it does highlight the risks of designing complex systems without deep technical…— Sabeer Bhatia (@sabeer) November 19, 2025

Gold and Silver rates on 21 November 2025 in Telugu states4
బంగారం ధరలు రివర్స్‌.. వెండి భారీ క్రాష్

దేశంలో బంగారం ధరలు రివర్స్‌ అయ్యాయి. పసిడి ధరలు చెన్నైలో మాత్రం దిగువకు రాగా మిగిలిన ప్రాంతాల్లో మళ్లీ ఎగువకు వచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on November 21st 20255
వరుస లాభాలకు బ్రేక్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు సెషన్ల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్‌ సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 26,145కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 120 పాయింట్లు నష్టపోయి 85,518 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 21-11-2025(time:9:25am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Yann LeCun Meta Chief AI Scientist departure from Meta to launch startup6
మెటాకు బైబై చెప్పిన ఏఐ గాడ్ ఫాదర్

ఆధునిక కృత్రిమ మేధ(AI) గాడ్ ఫాదర్‌ల్లో ఒకరిగా పరిగణించబడే ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్‌ యాన్ లెకున్ మెటా (Meta) నుంచి తప్పుకుంటున్నట్లు ధ్రువీకరించారు. తన సొంత ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించేందుకు 12 ఏళ్ల అనుబంధం తర్వాత లెకున్ మెటాకు వీడ్కోలు పలుకుతున్నారు. 65 ఏళ్ల లెకున్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.‘మీలో చాలా మంది ఇటీవలి మీడియా కథనాల్లో విన్నట్లుగా నేను 12 సంవత్సరాల తర్వాత మెటాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. FAIR (ఫేస్‌బుక్ AI రీసెర్చ్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా 5 సంవత్సరాలు, చీఫ్ AI సైంటిస్ట్‌గా 7 సంవత్సరాలు అందులో పని చేశాను’ అని ప్రకటించారు. లెకున్ 2013లో మెటాలో (అప్పటి ఫేస్‌బుక్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా చేరారు.లెకున్ నిష్క్రమణ గురించి చాలా కాలంగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కంపెనీలో ఇటీవలి అంతర్గత మార్పులు AI భవిష్యత్తుపై లెకున్ దృష్టికి మధ్య తేడాలున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏఐ ఉత్పత్తులు, వాణిజ్య ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి మెటా ఇటీవల తన ఏఐ బృందాలను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలో సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగం సృష్టించారు. ఈ మార్పు కారణంగా గతంలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్‌కు రిపోర్ట్‌ చేసిన లెకున్, ఇప్పుడు 28 ఏళ్ల వాంగ్‌కు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ద్వారా ఒకప్పుడు మెటాలో ప్రధాన ఏఐ శాస్త్రవేత్తగా లెకున్ అనుభవించిన స్వాతంత్య్రం తగ్గిపోయిందనే వాదనలున్నాయి. అక్టోబర్‌లో మెటా 600 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు ప్రభావితమైన వారిలో చాలా మంది లెకున్ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ ఏఐ రీసెర్చ్‌(FAIR) నుంచే ఉన్నారు. ప్రస్తుతం లెకున్ అడ్వాన్స్‌డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ (AMI) స్టార్టప్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం

Advertisement
Advertisement
Advertisement