Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PhonePe revenue hits Rs 7115 million in FY25: compound annual growth rate of 56 Percent1
ఫోన్‌పే పనితీరు ఓకే..

న్యూఢిల్లీ: ఐపీవో బాటలో సాగుతున్న ఫిన్‌టెక్‌ దిగ్గజం ఫోన్‌పే పనితీరు మెరుగుపడుతున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ ప్రకారం చూస్తే.. గత మూడేళ్లలో ఆదాయం, లాభదాయకత, నగదు ఆర్జన పుంజుకున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ ఆదాయం గతేడాది(2024–25) రూ. 7,115 కోట్లకు చేరింది. 2022–23లో నమోదైన రూ. 2,914 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 56 శాతం జంప్‌చేసింది. వివిధ బిజినెస్‌ విభాగాల మానిటైజేషన్‌ సైతం ఇందుకు సహకరించింది.వీటిలో మర్చంట్‌ చెల్లింపులు, రుణాలు, బీమా పంపిణీ కలగలసి ఉన్నాయి. ఆదాయంలో మర్చంట్‌ పేమెంట్ల బిజినెస్‌ 15 శాతం నుంచి 2025కల్లా 28 శాతానికి బలపడగా.. 2025 సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల్లో 31 శాతానికి ఎగసింది. రుణాలు, బీమా పంపిణీ విభాగం సైతం 2023లో నామమాత్ర వృద్ధి కనబరచగా.. 2025కల్లా 8 శాతానికి, తదుపరి ఆరు నెలల్లో 12 శాతానికి పుంజుకుంది. ఇది కంపెనీకి కీలకమైన చెల్లింపుల బిజినెస్‌ నుంచి డైవర్సిఫికేషన్‌ను సూచిస్తోంది. నష్టాలకు చెక్‌ పలు అంశాలలో నిర్వహణా పనితీరు మెరుగుపడిన నేపథ్యంలో ఫిన్‌టెక్‌ కంపెనీ ఫోన్‌పే నష్టాలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది రూ. 1,727 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే రూ. 1,069 కోట్లమేర రికవర్‌ అయ్యాయి. ఇదే కాలంలో నష్టాల మార్జిన్‌ 90.68 శాతం నుంచి 22.64 శాతానికి మెరుగుపడ్డాయి. గత రెండేళ్ల(2024, 2025)లో సర్దుబాటు తదుపరి నిర్వహణ లాభం(ఇబిటా) సానుకూలస్థాయికి చేరింది.నిర్వహణ సామర్థ్యం, కఠిన వ్యయ నియంత్రణలు ఇందుకు సహకరించాయి. ఇక 2024–25లో రూ. 190 కోట్లకుపైగా ఫ్రీ క్యాష్‌ఫ్లో సాధించగా.. తదుపరి 6 నెలల్లో రూ. 250 కోట్లు అందుకుంది. ప్రధానంగా కార్యకలాపాల ద్వారానే నగదు ఆర్జన సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు 2025 సెప్టెంబర్ లో సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

India tech to hit Rs 315B in FY26 and add 135000 jobs2
సవాళ్లున్నా సాఫ్ట్‌వేర్‌దే హవా

ముంబై: భౌగోళిక–రాజకీయ అంశాల కారణంగా ఒడిదుడుకులు నెలకొని, కృత్రిమ మేథతో (ఏఐ) పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ టెక్నాలజీ రంగం ఆదాయం 315 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందనుంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వార్షిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు జత కావడం ద్వారా ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 58.15 లక్షల నుంచి పెరిగి 59.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.33 లక్షల కొత్త కొలువులు జత కాగా, ఈసారి 2,000 మాత్రమే పెరగడమనేది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ స్థాయి వృద్ధిగా నమోదు కానుంది. ఆదాయం వృద్ధి చెందినంత స్థాయిలో కొలువులు పెరగకపోయినప్పటికీ, నికరంగా ఉద్యోగాలు పెరుగుతుండటమనేది సానుకూలాంశమని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. టెక్నాలజీలో పరిస్థితులు మారే కొద్దీ రాబోయే రోజుల్లోనూ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తుననట్లు వివరించారు. 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో 20 లక్షల మంది ఏఐ శిక్షణ పొందగా, వీరిలో 3 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ ఏఐ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే కొత్త విభాగాల్లో టెక్నాలజీపై ఖర్చు చేయడం పెరుగుతుండటం సానుకూలమైన విషయమన్నారు. నివేదిక ప్రకారం.. ⇒ ప్రధాన ఐటీ సరీ్వసుల ఆదాయం 143 బిలియన్‌ డాలర్ల నుంచి 149 బిలియన్‌ డాలర్లకు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ రెవెన్యూ 55 బిలియన్‌ డాలర్ల నుంచి 59 బిలియన్‌ డాలర్లకు, సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల ఆదాయం 21 బిలియన్‌ డాలర్ల నుంచి 23 బిలియన్‌ డాలర్లకు పెరగనుంది. ⇒ ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ ఆదాయాలు 59 బిలియన్‌ డాలర్ల నుంచి 63 బిలియన్‌ డాలర్లకు, హార్డ్‌వేర్‌ కంపెనీల ఆదాయాలు 19 బిలియన్‌ డాలర్ల నుంచి 21 బిలియన్‌ డాలర్లకు పెరగనున్నాయి. ⇒ గతంలో అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం ఆసియా–పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీ మార్కెట్లో ఆదాయాలు అత్యధికంగా 7.9 శాతం మేర వృద్ధి చెందనుండటం ఆసక్తికరమైన అంశం. ⇒ విభాగాలవారీగా చూస్తే ఆరోగ్య సంరక్షణ, ట్రావెల్, రవాణా సెగ్మెంట్ల ఆదాయాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ⇒ చాలా మటుకు కంపెనీలు ఏఐ ఆదాయాలను వెల్లడించవు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కృత్రిమ మేథపరమైన ఆదాయాలు 10–12 బిలియన్‌ డాలర్లుగా ఉంటాయని అంచనా.

IT industry in for a painful transformation: HCLTech CEO Vijayakumar3
ఏఐతో ఐటీకి ఇబ్బందే...

ముంబై: పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున కృత్రిమ మేధకు (ఏఐ) మారడం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమకు బాధాకరమైన ప్రక్రియగానే ఉంటుందని హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయకుమార్‌ చెప్పారు. అయితే, గతంలో వై2కే సవాళ్లు వచ్చినప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లుగానే, పరిశ్రమ తిరిగి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యాలు పరిశ్రమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారన్నారు.ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ నిర్వహించిన టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఏఐ మోడల్స్‌ రాకతో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు టెక్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కుమార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశీ ఐటీ రంగం కీలక దశలో ఉందని, వచ్చే 5–10 ఏళ్లలో పరిశ్రమ సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోడింగ్‌ విషయంలో ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ అత్యద్భుతంగా పని చేసినప్పటికీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో కోడింగ్‌ వాటా 30 శాతమే ఉంటుంది కాబట్టి పరిశ్రమలో అవకాశాలు మెరుగ్గానే ఉండొచ్చన్నారు. ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్‌ రాబోయే రోజుల్లో ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని కుమార్‌ చెప్పారు. క్లయింట్లకు భారీగా బిల్లింగ్‌ వేస్తూ, గణనీయంగా వృద్ధి చెందిన సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) కంపెనీలకు, ఇకపై అదే స్థాయిలో చార్జీలు విధించడం సాధ్యపడదు కాబట్టి అవి సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులకు తగ్గ స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశాలు లేనందున విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై భారీగా ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలకు సమస్యలు ఎదురుకావొచ్చన్నారు.

Stock Market: Sensex fell 1069 points to close at 82226 while the Nifty declined 288 points to settle at 254254
కోబాల్‌ షాక్‌

ముంబై: అమెరికా ఏఐ స్టార్టప్‌ ఆంథ్రోపిక్‌ కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చినప్పుడల్లా ‘ఐటీ మార్కెట్‌’ వణికిపోతోంది. తాజాగా కోబాల్‌ వంటి పాత ప్రోగ్రామింగ్‌ భాషలతో పనిచేస్తున్న సిస్టమ్‌లు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చేందుకు తమ ‘క్లాడ్‌ కోడ్‌’ టూల్‌ ఉపయోగపడుతుందని ప్రకటించింది. ఈ కోడింగ్‌ టూల్స్‌తో ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గి, కంపెనీల ఆదాయాల పరిమితం కావొచ్చని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఐటీ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం ఒకశాతానికి పైగా పతనమైంది.అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత అనిశి్చతులు, క్రూడాయిల్‌ ధరలు, అమెరికా–ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 1069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,425 వద్ద నిలిచింది. ఒక్కరోజే రూ.2.85 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.466 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా డాలర్‌ పుంజుకోవడం, క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలహీనపడి 90.95 వద్ద స్థిరపడింది. బలహీనంగా మొదలై.. భారీ నష్టాల్లోకి..అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్‌ గడిచే కొద్ది మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఏఐ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేయటంతో ఐటీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడితో చిత్తు అయ్యాయి. రియల్టీ, మీడియా స్టాక్స్‌ కూడా భారీగానే నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,360 పాయింట్లు క్షీణించి 82 వేల స్థాయి దిగువన 81,934 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పతనమై 25,328 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అలాగే మంగళవారం నిఫ్టీ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్‌పైరీ కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మార్పు, చేర్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. ⇒ ఆంథ్రోపిక్‌ తాజా అప్‌డేట్‌ ప్రకటనతో భారత ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్‌టీఐఎం 6.50%, టెక్‌ మహీంద్రా 6.17%, పెర్సిస్టెంట్‌ 6%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 5.83%, కోఫోర్జ్‌ 5.24% క్షీణించాయి. ఎంఫసిస్‌ 3.67%, టీసీఎస్‌ 3.56%, ఇన్ఫోసిస్‌ 3.56%, విప్రో 3% పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్సు 4.8% నష్టపోయింది. కృత్రిమ మేధ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్సు ఈ ఫిబ్రవరిలో ఏకంగా 21% కుప్పకూలింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2008) తర్వాత ఈ సూచీ ఒక నెలలో ఆ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ⇒ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 5%, రియల్టీ 2.61%, టెలీకమ్యూనికేషన్‌ 1.79%, కన్జూమర్‌ డి్రస్కేషనరీ 1.12%, ఇండ్రస్టియల్స్‌ 0.91%, క్షీణించాయి. స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు 0.68%, 0.54% చొప్పున క్షీణించాయి. ⇒ ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన సుంకాలు చెల్లవంటూ యూఎస్‌ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ఇతర చట్టాల ద్వారా టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్‌ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండోనేíÙయా 1.4%, హాంగ్‌కాంగ్‌ 1.85%, సింగపూర్‌ 0.4% పతనమయ్యాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు అరశాతం వరకు పతనమయ్యాయి. అమెరికా స్టాక్‌ సూచీలు ఆరంభంలో భారీగా పడి, వెంటనే కోలుకుని లాభాలతో ట్రేడవుతున్నాయి.ఐబీఎంకు ఆంథ్రోపిక్‌ భయంఐబీఎం సిస్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కోబాల్‌ను తమ ‘క్లాడ్‌ కోడ్‌ టూల్‌ ఆధునికీకరించగలదంటూ ఆంథ్రోపిక్‌ చేసిన ప్రకటనతో ఐబీఎం షేరు కుప్పకూలింది. సోమవారం ఏకంగా 13.2% క్షీణించి 223.35 డాలర్ల వద్ద ముగిసింది. 2000 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్‌ విలువకు ఒక్కరోజే 40 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.టెక్‌ నిపుణులు నెలల పాటు శ్రమించి రూపొందించే కోడ్‌ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేసే కోబాల్‌ క్లాడ్‌ కోడ్‌ టూల్‌ ఆవిష్కరణతో ఐబీఎంతో పాటు అంతర్జాతీయంగా సైబర్‌ సెక్యురిటీ, సాఫ్ట్‌వేర్‌ యాస్‌ ఏ సర్వీస్‌ (సాస్‌) రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లు భారీ నష్టపోయాయి. ఈ ప్రభావమూ దేశీయ ఐటీ సంస్థల షేర్లపై పడింది. సోమవారం భారీ నష్టం నుంచి తేరుకున్న ఐబీఎం షేరు మంగళవారం ఇంట్రాడేలో 4.27% లాభంతో 232.88 డాలర్లను తాకింది.

Billionaire Reuben Singh Owns 15 Rolls Royces Match Of His Turbans5
తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఒకటి. చాలామంది వాహన ప్రియులకు ఈ కార్లలో ఒక్కసారైనా తిరగాలని ఉంటుంది. కానీ వీటి ధర కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు. ధనవంతులు సైతం రోల్స్ రాయిస్ కారు కొనాలంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ (Reuben Singh) యూకేకు చెందిన వ్యాపారవేత్త, ఇషర్ క్యాపిటల్ సీఈఓ. తలపాగా ధరించడం వల్ల ఈయన ఒకప్పుడు జాతి వివక్షను, ఆంగ్లేయుల నుంచి అవమానాలను ఎదుర్కున్నారు. సిక్కులు పవిత్రంగా చూసే తలపాగాను అవమానించడంతో.. సింగ్ తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు.టర్బన్ ఛాలెంజ్ పేరుతో ప్రతి వారం ఆయన ధరించిన తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి.. దానితో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తం 15 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయనను అవమానించినవారే అవాక్కయ్యారు.ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. ఈయన వద్ద పోర్స్చే 918 స్పైడర్, బుగట్టి వెయ్రాన్, పగని హుయారా, లంబోర్గిని హురాకాన్, లిమిటెడ్ ఎడిషన్ ఫెరారీ F12 బెర్లినెట్టా కార్లను కూడా కలిగి ఉన్నారు.ఎవరీ రూబెన్ సింగ్?బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రూబెన్ సింగ్. తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు.

Best Mileage Cars Under Rs 10 Lakh in India6
బెస్ట్ మైలేజ్ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువ!

కార్లు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకుంటారు. ఇందులో కూడా కొంత తక్కువ ధరలో లభించే కార్లు అయితే బెస్ట్ అని భావిస్తారు. కాబట్టి ఈ కథనంలో అత్యుత్తమ మైలేజ్ (ఏఆర్ఏఐ) ఇచ్చే రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 కార్ల గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి సెలెరియో (రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.73 లక్షలు): 25-26 కిమీ/లీ పెట్రోల్ & 35 కిమీ/కేజీ సీఎన్‌జీమారుతి సుజుకి స్విఫ్ట్ (రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షలు): 24.8 కిమీ/లీ పెట్రోల్ & 32.85 కిమీ/కేజీ సీఎన్‌జీమారుతి సుజుకి డిజైర్ (రూ. 6.26 లక్షల నుంచి రూ. 8.031 లక్షలు): 24.8 కి.మీ/లీ పెట్రోల్ & 33.73 కి.మీ/కేజీ సీఎన్‌జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.84 లక్షలు): 25.19 కి.మీ/లీ పెట్రోల్ & 33.47 కి.మీ/కేజీ సీఎన్‌జీమారుతి సుజుకి ఆల్టో కే10 (రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షలు): 24.9 కిమీ/లీ పెట్రోల్ & 33.40 కిమీ/కేజీ సీఎన్‌జీమారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షలు): 25.30 కిమీ/లీ పెట్రోల్ & 32.73 కిమీ/కేజీ సీఎన్‌జీమారుతి సుజుకి బాలెనో (రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షలు): 22.35 కిమీ/లీ పెట్రోల్ & 30.61 కిమీ/కేజీ సీఎన్‌జీటాటా టియాగో (రూ. 4.57 లక్షల నుంచి రూ. 7.82 లక్షలు): రూ. 19 కి.మీ./లీటర్ పెట్రోల్హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ (రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.92 లక్షలు): 16-18 కి.మీ/లీ పెట్రోల్రెనాల్ట్ క్విడ్ (రూ. 4.30 లక్షల నుంచి రూ. 6.45 లక్షలు): 22 కి.మీ/లీ పెట్రోల్

Advertisement
Advertisement
Advertisement