Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AI vs Human Intelligence Will White Collar Jobs Survive the Next Tech Wave1
ఉద్యోగాలపై ఏఐ యుద్ధం!

కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో ఉద్యోగాలను మింగేస్తుందా? లేక మానవ మేధస్సుతో కలిసి కొత్త పుంతలు తొక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు, టెక్ నిపుణుల మధ్య ఒక మేధో యుద్ధానికి దారితీసింది. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది అంచనా వేస్తున్న ‘వైట్-కాలర్ జాబ్స్ కనుమరుగు’పై 2024 నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారోన్ అసెమోగ్లు తీవ్రంగా స్పందించారు. టెక్ నిపుణులు కార్యాలయాల్లోని పనుల సంక్లిష్టతను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన హెచ్చరించారు.వైట్-కాలర్‌ ఉద్యోగాల్లో భారీ కోతఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 1 నుంచి 5 ఏళ్లలో ఎంట్రీ లెవల్ టెక్నాలజీ, చట్టపరమైన సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయని అంచనా వేశారు. దీన్ని ఆయన ‘వైట్-కాలర్ బ్లడ్‌బాత్’(ఉద్యోగాల రక్తపాతం)గా అభివర్ణించారు.నోబెల్ గ్రహీత అభ్యంతరంఅమోది వ్యాఖ్యలను నోబెల్ గ్రహీత డారోన్ అసెమోగ్లు తోసిపుచ్చారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, టెక్ నిపుణులు తమ ఏఐ మోడల్స్ సామర్థ్యాలపై ఉన్న అతి విశ్వాసంతో వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘వైట్-కాలర్ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్‌తోపాటు సామాజిక స్పృహ, క్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటాయి. వీటిని ఏఐ అంత సులభంగా భర్తీ చేయలేదు. ఒకవేళ అమోది చెప్పినట్లు అమెరికా వంటి దేశాల్లో 20 శాతం ఉద్యోగాలు కోల్పోతే అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ సామాజిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.‘అమోదికి ఏమీ తెలియదు’ఈ వివాదంలోకి మెటా మాజీ చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరున్న యాన్ లెకున్ ప్రవేశించడం చర్చను మరింత వేడెక్కించింది. అమోదిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ‘లేబర్‌ మార్కెట్‌పై సాంకేతిక విప్లవాల ప్రభావం గురించి డారియోకు ఏమీ తెలియదు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు

E-Rupee for Welfare schemes Indias Smart Subsidy Revolution2
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’

దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం మొదలైంది. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడమే కాకుండా, ఆ నిధులు నిర్దేశించిన పనికే ఖర్చయ్యేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ 'ఈ-రూపాయి' (e-Rupee) అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహారాష్ట్రలోని ఫూలేనగర్‌కు చెందిన సమధన్ సోనావానే అనే రైతు కథే దీనికి నిదర్శనం.రైతులకు వరం.. డ్రిప్ ఇరిగేషన్‌కు ఊతంసాధారణంగా ప్రభుత్వ సబ్సిడీలు అందాలంటే రైతులు ముందుగా తమ జేబులోంచి డబ్బు ఖర్చు చేసి యంత్రాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది. కానీ, ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్ట్ కింద సోనావానేకు ప్రభుత్వం నేరుగా డిజిటల్ వాలెట్‌లోకి నిధులను బదిలీ చేసింది. రూ. 1,03,000 ఖరీదైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ కోసం 80% నిధులను ప్రభుత్వం ఈ-రూపాయి రూపంలో అందించింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వం అనుమతించిన విక్రేతల వద్ద, నిర్దేశించిన పరికరాల కోసమే వాడేలా 'ప్రోగ్రామ్' చేశారు. దీనివల్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు.చైనాకు ధీటుగా భారత్ అడుగులుప్రపంచవ్యాప్తంగా దాదాపు 49 దేశాలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే, కేవలం భారత్, చైనాలు మాత్రమే 'ప్రోగ్రామబుల్' (నిర్దిష్ట అవసరాలకే వాడేలా రూపొందించిన) డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్నాయి. చైనాలో 20 కోట్ల మంది ఈ-యువాన్ వాడుతుండగా, భారత్ తన 80 బిలియన్ డాలర్ల సంక్షేమ బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ టెక్నాలజీని వాడుతోంది. ప్రస్తుతం భారత్‌లో కోటి మంది ఈ పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నట్లు అంచనా.పైలట్ ప్రాజెక్టుల విస్తరణభారతదేశం అంతటా ప్రస్తుతం 10 రకాల ప్రయోగాత్మక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయ సబ్సిడీలు, సాగు నీటి పరికరాల కోసం ఈ-రూపాయి వినియోగిస్తున్నారు. గుజరాత్‌లో రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ఆహార పంపిణీ కోసం 15,000 మంది లబ్ధిదారులతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. జూన్ నాటికి దీన్ని 75 లక్షల కుటుంబాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.సవాళ్లు, విశ్లేషణలుఈ-రూపాయి భవిష్యత్తుపై నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. "నిధులు దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, అట్టడుగు వర్గాల రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు ఇది 'కిల్లర్ అప్లికేషన్' లాంటిది" అని డిజిటల్ కరెన్సీ సలహాదారు జాన్ కిఫ్ అభిప్రాయపడ్డారు. అయితే డబ్బును ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వం నియంత్రించడం వల్ల ప్రజలు దీని పట్ల ఆసక్తి చూపకపోవచ్చని ఎంఐటీ (MIT) నిపుణురాలు నేహా నరులా హెచ్చరించారు. ఇది వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు.

Bengaluru Cost of Living Shock Even High Paid IT Youth Struggle to Save3
టెక్కీ ఖర్చుల చిట్టా వైరల్‌!

దేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం చుక్కలు చూపిస్తోంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే ఈ మహానగరంలో భారీ జీతాలు తీసుకుంటున్న యువ నిపుణులు సైతం పొదుపు చేయడం గగనమైపోతోంది. తాజాగా, ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ చేజ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆరుషి గార్గ్ అనే 23 ఏళ్ల యువతి తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.నెలవారీ బడ్జెట్ ఇలా..ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరుషి పంచుకున్న లెక్కల ప్రకారం, ఆమె జీవనశైలికి నెలకు సుమారు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయంలో సింహభాగం ఇంటి అద్దెకే వెళ్తుండటం గమనార్హం. ఖర్చు వివరాలుఅంచనా మొత్తం (నెలవారీ.రూ ల్లో)ఇంటి అద్దె17,000కిరాణా సామాగ్రి5,000బయట భోజనం3,000 - 6,000షాపింగ్3,000 - 7,000మెడిసిన్స్‌, గిఫ్ట్స్‌2,000 - 6,000పని మనిషి2,000రవాణా1,000 - 2,000మొత్తం ఖర్చు30,000 - 35,000 ‘నేను మరీ ఎక్కువగా ఖర్చు చేస్తున్నానా?’ అంటూ ఆమె అడిగిన ప్రశ్న నెటిజన్లలో చర్చనీయాంశమైంది.నెటిజన్ల రియాక్షన్ఆరుషి పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె బడ్జెట్ చాలా పొదుపుగా ఉందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మెట్రో నగరాల్లోని ఆర్థిక ఒత్తిడిని ఏకరువు పెడుతున్నారు. ‘నేను రూ.50 వేలు సంపాదిస్తే.. అందులో రూ.48 వేలు ఖర్చులకే పోతున్నాయి. అసలు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో అర్థం కావడం లేదు’ అని ఒక యూజర్‌ చెప్పారు. ‘ఇది ఒక మెట్రో సిటీలో ఉండాల్సిన సాధారణ బడ్జెట్. బెంగళూరు వంటి నగరాల్లో ఇంతకంటే తక్కువ ఖర్చుతో జీవించడం కష్టం’ అని ఇంకొకరు చెప్పారు.ఆదాయం ఉన్నా ఆదా సున్నాఐటీ ఉద్యోగులతోపాటు అధిక జీతాలు తీసుకునే వారు కూడా ఆర్థికంగా ఎందుకు వెనుకబడుతున్నారో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ విశ్లేషించారు. లింక్డ్‌ఇన్‌లో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘నెలకు రూ.1.2 లక్షలు సంపాదిస్తున్నా రూపాయి కూడా పొదుపు చేయలేని వారిని నేను చూశాను. దీనికి కారణం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ (జీవనశైలి ద్రవ్యోల్బణం). ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా అనవసరమైన ఖర్చులు కూడా పెంచుకుంటూ పోవడమే పెద్ద సమస్య’ అని మీనాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు

Petrol diesel prices may rise by Rs 25-28 per litre after elections report4
పెట్రోల్‌ ధరలు పెరగొచ్చా..? స్పందించిన కేంద్రం

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రతిష్టంభన కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 104 డాలర్లకు చేరుకుంది.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ (KIE) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే (ఏప్రిల్ 29 తర్వాత) ఇంధన ధరల పెంపు తప్పకపోవచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం మార్కెట్‌లో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20%, భారత దిగుమతుల్లో 40% వాటా ఉన్న హోర్ముజ్ మార్గం మూతపడటంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం చమురు సంస్థలు నెలకు సుమారు రూ. 27,000 కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నాయని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా రిటైల్ ధరలను ప్రభుత్వం ఇప్పటివరకు పెంచలేదు. అయితే, రిఫైనర్ల నష్టాలను తగ్గించాలంటే ధరల పెంపు అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా, అది ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సరిపోవడం లేదని తెలుస్తోంది.ఒకవేళ పశ్చిమాసియాలో కాల్పుల విరమణ జరగని పక్షంలో, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుండి రూ. 28 వరకు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ హెచ్చరించింది. భారత ముడి చమురు బాస్కెట్ ధర 120 డాలర్లకు చేరితే, సామాన్యులపై ఈ భారం మరింత తీవ్రంగా ఉంటుంది.స్పందించిన ప్రభుత్వంపెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టత ఇచ్చింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.

Neeta Ambani Showcases India Jamdani Heritage at TIME 100 Summit New York5
నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు

అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంస్కృతిని, కళా వారసత్వాన్ని చాటిచెప్పడంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘టైమ్‌ 100’ శిఖరాగ్ర సదస్సులో ఆమె ధరించిన చేనేత వస్త్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారతీయ హస్తకళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచిన ఆ ‘జమ్దానీ’ చీర వెనుక రెండేళ్ల కష్టం దాగి ఉండటం విశేషం.పశ్చిమ బెంగాల్‌లోని ఫులియాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత బీరేన్ కుమార్ బసక్ ఈ చీరను రూపొందించారు. దీని తయారీకి దాదాపు 24 నెలల సమయం పట్టింది. భారతదేశంలోని అత్యంత పురాతనమైన, క్లిష్టమైన ‘జమ్దానీ’ నేత పద్ధతిలో దీన్ని తయారు చేశారు. మీనకారీ జమ్దానీ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ వస్త్రంపై విభిన్న రకాల డిజైన్‌లు చేశారు.కళాత్మకత - సంస్కృతీ చిహ్నాలుఈ చీర పల్లూ (కొంగు) ఒక దృశ్య కావ్యంగా కనిపిస్తుంది. ఇందులో భారతీయ జీవనశైలిని ప్రతిబింబించే ఉత్సవ దృశ్యాలు, మానవ ఆకృతులు, జంతువులు, ప్రకృతి సౌందర్యాన్ని చాటే పచ్చని ఆకులు అల్లారు. చీర అంచు వెంబడి ఉన్న చేపల ముద్రలు భారతీయ సంప్రదాయం ప్రకారం శుభానికి, శ్రేయస్సుకు చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ చీర రాజసానికి, హుందాతనానికి ప్రతీకగా నిలిచింది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online)నీతా అంబానీ సందేశంఏప్రిల్ 22న జరిగిన ఈ సదస్సులో టైమ్ మ్యాగజైన్ సీఈఓ జెస్సికా సిబ్లీ నీతా అంబానీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ భారతీయ విలువల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత ప్రపంచానికి హార్డ్‌ పవర్‌ కంటే, సున్నితమైన శక్తి(సాఫ్ట్‌ పవర్‌) ఎంతో అవసరం. భారతదేశం ఆ మృదువైన శక్తికి నిలువెత్తు ప్రతిరూపం’ అని ఆమె పేర్కొన్నారు.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Gold Rate Today (April 23): again fall Check 22 and 24 carat gold prices6
పసిడి, వెండి.. డబుల్‌ ధమాకా!

దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. క్రితం రోజున కాస్త తగ్గిన బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు రెట్టింపు స్థాయిలో క్షీణించాయి. గత ఐదు రోజులుగా పసిడి ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. మరోవైపు ఈరోజు వెండి ధరలు (Today Silver Rate) కూడా పతనమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

Advertisement
Advertisement
Advertisement