Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

if Income Tax dept sends notice appropriate reaction check details1
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌)ను దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారుల బాధ్యత. అయితే, తెలియక చేసిన తప్పులు, ముఖ్యంగా విదేశీ ఆస్తుల వంటి కీలక వివరాలను వెల్లడించకపోవడం వంటి అంశాల్లో ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు (లేదా ఎస్‌ఎంఎస్‌/ఈ-మెయిల్స్) అందుకునే అవకాశం ఉంది. 2025–26 అసెస్‌మెంట్‌ ఇయర్‌ (ఏవై)కి సంబంధించిన ఐటీఆర్‌ల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని పన్నుదారులకు ఇలాంటి నోటీసులు పంపబోతున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.ఐటీ డిపార్ట్‌మెంట్ అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ సమాచార మార్పిడి ఒప్పందాల (ఆటోమేటిక్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ - ఏఈఓఐ) ద్వారా పన్నుదారుల ఆర్థిక లావాదేవీల గురించి సులభంగా తెలుసుకోగలుగుతోంది. విదేశీ జ్యూరిస్‌డిక్షన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి కూడా ఐటీఆర్‌లో ఆ వివరాలను పేర్కొనని వారికి ఐటీ శాఖ ఎస్‌ఎంఎస్‌లు/ఈ-మెయిల్స్‌ పంపడానికి సిద్ధమైంది.‘హై–రిస్క్‌’ కేసులుతొలి దశలో భాగంగా దాదాపు 25,000 ‘హై–రిస్క్‌’ కేసులుగా పరిగణిస్తున్న వారికి త్వరలో ఎస్‌ఎంఎస్‌లు/ఈ–మెయిల్స్‌ పంపనున్నారు. చట్టపరమైన చర్యలను నివారించడానికి వీరు 2025 డిసెంబర్‌ 31లోగా సవరించిన ఐటీఆర్‌ (Revised ITR)ను దాఖలు చేయాలని సూచించారు. గత ఏడాది కూడా ఇలాగే నోటీసులు పంపినప్పుడు మొత్తం 24,678 మంది పన్నుదారులు రూ.29,208 కోట్ల విలువైన విదేశీ అసెట్స్‌ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్‌లను దాఖలు చేశారు. ఇది పన్ను ఎగవేతదారులను గుర్తించే విషయంలో డిపార్ట్‌మెంట్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.ఐటీ శాఖ ఇప్పటికే జూన్‌ వరకు 1,080 కేసులను మదింపు చేసి రూ.40,000 కోట్లకు సంబంధించి డిమాండ్‌ నోటీసులు పంపింది. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో సోదాలు కూడా నిర్వహించారు.నోటీసులకు ఎలా స్పందించాలి?ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ లేదా అధికారిక నోటీసు అందుకున్నప్పుడు పన్ను చెల్లింపుదారుడు భయాందోళనకు గురికాకుండా చట్టబద్ధంగా స్పందించాలి. నోటీసులు ఏ సెక్షన్ కింద వచ్చింది? (ఉదాహరణకు, సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమని తెలిపే సమాచార మెయిల్ కావచ్చు, లేదా సెక్షన్‌ 143(2) కింద మదింపు నోటీసు కావచ్చు.) అనే వివరాలు తెలుసుకోవాలి. నోటీసు దేని గురించి.. ఆదాయం తక్కువగా చూపడం, ఖర్చులను ఎక్కువగా చూపడం లేదా విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం వంటివాటిలో ఏది? అనే దాన్ని పరిశీలించాలి. నోటీసుకు స్పందించడానికి నిర్దిష్టంగా ఇచ్చిన గడువును గుర్తించాలి.సవరించిన ఐటీఆర్‌ దాఖలువిదేశీ ఆస్తుల వెల్లడి విషయంలో డిపార్ట్‌మెంట్ స్నేహపూర్వకంగా సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమంటూ ఎస్‌ఎంఎస్/ఈ-మెయిల్ పంపినట్లయితే అది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ఇచ్చిన ఒక అవకాశంగా భావించాలి. పన్ను చెల్లింపుదారు తక్షణమే తన ఐటీఆర్‌ను సమీక్షించి విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, మూలధన లాభాలు లేదా ఇతర విదేశీ ఆదాయాల వివరాలను తప్పనిసరిగా చేర్చి సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. సవరించిన రిటర్న్ ద్వారా అదనపు పన్ను చెల్లించాల్సి వస్తే ఆలస్య రుసుముతో సహా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఈ చర్య చట్టపరమైన చర్యలను (పెనాల్టీలు, ప్రాసిక్యూషన్ వంటివి) నివారించడానికి ఉపకరిస్తుంది.చట్టపరమైన చిక్కుల నివారణసమయానికి స్పందించడం అనేది జరిమానాలు, ప్రాసిక్యూషన్ వంటి తీవ్ర పరిణామాలను నివారించడానికి దోహదం చేస్తుంది. నోటీసులో పేర్కొన్న గడువులోగా స్పందించడం అత్యంత ముఖ్యం. గడువు దాటితే డిపార్ట్‌మెంట్ ఏకపక్షంగా మదింపును పూర్తి చేసే అవకాశం ఉంది. నోటీసులు క్లిష్టంగా లేదా పెద్ద మొత్తాలకు సంబంధించినవైతే పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్‌ల (సీఏ) సహాయం తీసుకోవడం ఉత్తమం. వారు నోటీసును విశ్లేషించి చట్ట ప్రకారం సరైన స్పందనను సిద్ధం చేయడంలో సహాయపడతారు. ఐటీ డిపార్ట్‌మెంట్ విచారణలో పూర్తి సహకారం అందించాలి. అడిగిన అన్ని పత్రాలను, వివరాలను ఆలస్యం చేయకుండా సమర్పించాలి.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

Gold and Silver rates on 28 November 2025 in Telugu states2
ఒక్కసారిగా మారిపోయిన బంగారం ధరలు..

దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు తారుమారై పెరుగుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ChatGPT, Kingfisher, Drinking Water Bisleri signed new sponsors for WPL 43
మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లు

భారత్‌ ఇటీవల ఐసీసీ ఉమెన్‌ ప్రపంచ కప్‌ టోర్నీలో విజయం సాధించిన తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం అంచనాలను మించిపోయింది. ఆటగాళ్లకు కోట్ల రూపాయాలు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతోపాటు చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ వంటి ప్రముఖ సంస్థలు లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లుగా చేరడం గమనార్హం. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు షెడ్యూల్ చేసిన నాలుగో ఎడిషన్ డబ్ల్యూపీఎల్‌ టోర్నమెంట్‌కు పెరుగుతున్న కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని ఇది హైలైట్‌ చేస్తుంది.ఐసీసీ ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను గెలుచుకున్న టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రూ.3.2 కోట్లతో ఈ వేలంలో అత్యధిక ధర సాధించారు. వేలం పూల్‌లో 73 స్లాట్‌ల కోసం 277 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. వేలంలో అధిక ధర సాధించిన కొందరు ఆటగాళ్ల వివరాలు కింది విధంగా ఉంది.అమెలియా కెర్ (న్యూజిలాండ్): ముంబై ఇండియన్స్‌కు రూ.3 కోట్లుశిఖా పాండే (భారత్): యూపీ వారియర్జ్‌ రూ.2.4 కోట్లుసోఫీ డివైన్ (న్యూజిలాండ్): గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లుమెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా): యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లుశ్రీచరణి (భారత్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుచినెల్లె హెన్రీ (వెస్టిండీస్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుఆశా శోభన (భారత్): యూపీ వారియర్జ్ రూ.1.1 కోట్లుస్పాన్సర్‌షిప్‌లు..కొత్తగా చేరిన చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ లీగ్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. బీసీసీఐ ప్రకటన ప్రకారం ఈ మూడు సంస్థల ఒప్పందాల విలువ రూ.48 కోట్లు. ఇది 2026, 2027 సీజన్లలో కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న అగ్రశ్రేణి భాగస్వాముల వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ (టైటిల్ పార్టనర్)సింటెక్స్, హెర్బాలైఫ్ (ప్రీమియర్ భాగస్వాములు)సియట్ (స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్)ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

Stock Market November 28 Sensex Nifty open lower4
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్లు లేదా 0.04 శాతం నష్టపోయి 85,683 వద్ద ఉండగా, నిఫ్టీ 25 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 26,190 వద్ద ఉంది.బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండు సూచీలు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్ లో తాజా ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. మొదటిసారిగా సెన్సెక్స్‌ 86,000, నిఫ్టీ 26,300 స్థాయిలను అధిగమించాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం పడిపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

mahindra launched 7 seater electric suv mahindra xev9s5
కొత్త ఎలక్ట్రిక్ కారు.. సింగిల్‌ ఛార్జ్‌తో 679 కిలోమీటర్లు!

ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్తగా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎక్స్‌ఈవీ9ఎస్‌ని ప్రవేశపెట్టింది. ఈ సెవెన్‌ సీటర్‌ ధర రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల వరకు (ఎక్స్‌–షోరూం) ఉంటుంది. 2027, 2028 క్యాలెండర్‌ సంవత్సరాల నాటికి తమ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటాని 25 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ జెజూరికర్‌ వివరించారు.ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 8,000 ఈవీల స్థాయికి పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రతినెలా 4,000–5,000 ఈవీలను విక్రయిస్తుండగా, దీన్ని 7,000కు పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయన్నారు. గత ఏడు నెలల్లో 30,000 పైగా ఈవీలను (బీఈ 6, ఎక్స్‌ఈవీ 9) విక్రయించామని, రూ. 8,000 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు.2027 కల్లా 1,000 చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమ బీఈ6 వాహనాల తయారీకి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) స్కీము కోసం దరఖాస్తు చేసుకుంటున్నామని రాజేష్‌ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 14 సంక్రాంతి నుంచి ఎక్స్‌ఈవీ9ఎస్‌ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. జనవరి 23 నుంచి డెలివరీలు మొదలవుతాయని వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు 59 kWh (కిలోవాట్ హవర్), 70 kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 175 కిలోవాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.కంపెనీ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ వేరియంట్లను బట్టి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 521 కిలోమీటర్ల నుంచి 679 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. వీటిలో 79 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ సింగిల్ ఛార్జ్‌కు గరిష్ఠంగా 679 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది.ఇక ఈ 7 సీటర్ ఎక్స్‌ఈవీలో 527 లీటర్ల బూట్ స్పేస్, డ్యాష్ బోర్డుపై మూడు డిజిటల్ స్క్రీన్లు, రెండో వరుసలో ప్రయాణికుల కోసం రెండు అదనపు స్క్రీన్లు ఇచ్చారు. ఏడు ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్ వ్యవస్థ, ఆటో పార్కింగ్, డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Piramal Finance to enter in Gold loans6
త్వరలో పసిడి రుణాల్లోకి పిరమల్‌ ఫైనాన్స్‌

2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1.5 లక్షల కోట్ల ఏయూఎంని (నిర్వహణలోని అసెట్స్‌) లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పిరమల్‌ ఫైనాన్స్‌ రిటైల్‌ లెండింగ్‌ సీఈవో జగదీప్‌ మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రిటైల్‌ ఏయూఎం రూ. 75,000 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇది సుమారు రూ. 8,300 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.తమ వ్యాపారంలో సుమారు 11–12 శాతం వాటా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింత దృష్టి పెడుతున్నామని ఆయన పేర్కొ న్నారు. ప్రధాన నగరాల్లో 59 శాఖలు ఉన్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50–75 శాఖలు ప్రారంభించనున్నామని, వీటిలో కొన్ని ఇక్కడ కూడా ఉంటాయని జగదీప్‌ పేర్కొన్నారు.ప్రస్తుత గృహ, ఎస్‌ఎంఈ, వ్యక్తిగత, వాహన రుణాలందిస్తున్న తమ సంస్థ త్వరలో పసిడి రుణాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ పండుగ సీజన్‌లో సెమీ అర్బన్‌ మార్కెట్లలో డిమాండ్‌ నెలకొనడంతో రిటైల్‌ రుణాల మంజూరు 45 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement