ప్రధాన వార్తలు
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకున్నాయి.గణనీయ పెరుగుదలనవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.తగ్గుముఖం పట్టే అవకాశంనవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..
ఇళ్ల ధరలు: మూడేళ్లలోనే ఎంత మార్పు?
దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థ అనరాక్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్ కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. ఈ విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 2022–2025 మధ్య లగ్జరీ సెగ్మెంట్లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఇలా..ప్రస్తుతం హైదరాబాద్లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది.
జీవిత బీమాతో మహిళలకు పన్నుల ఆదా
జీవిత బీమాను ఒకప్పు డు పురుషులు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికిమరియు పన్ను భారం తగ్గించుకోవడానికిఉపయోగించేసాధనంగా భావించేవారు. ఇప్పు డు మహిళలు కూడా అదే ప్రయోజనాలు పొందుతూ తమ ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తున్నారు.మహిళల కోసం జీవిత బీమా పన్ను ప్రయోజనాలు వారికిపన్ను కు వచ్చే ఆదాయాన్ని తగ్గించడంలో, పన్ను లేకుండా వచ్చే మొత్తాలను పొందడంలో, మరియు ఆర్థిక భదత్రను నిర్మించడంలో సహాయపడుతాయి. ఈ ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మహిళలకు సంపదను పెంచుకోవడంలో మరియు రక్షించుకోవడంలో జీవితబీమాను తెలివైన సాధనంగా మారుస్తుంది.జీవిత బీమాతో ఆదాయ పన్ను ప్రయోజనాలుజీవిత బీమా మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడమేకాదు, ఆదాయ పన్ను చట్టం పక్రారం మంచి పన్ను ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఇప్పు డు ఇవి ఏవో చూద్దాం.1. ప్రీమియంపైపన్ను తగ్గింపు (సెక్షన్ 80C)జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియంపైసెక్షన్ 80C పక్రారం పన్ను తగ్గింపు లభిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ₹1.5 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు . ఇదిమీకు, మీ జీవిత భాగస్వా మికిలేదా మీ పిల్లల కోసం తీసుకున్న పాలసీలకు వర్తిస్తుంది.2. పాలసీమెచ్యూ రిటీమొత్తం పన్ను నుండిమినహాయింపు (సెక్షన్ 10(10D))పాలసీమెచ్యూ రిటీసమయంలో లేదా బీమాదారుడిమరణ సమయంలో కుటుంబం పొందేమొత్తం సెక్షన్ 10(10D) ప్రకారం పూర్తిగా పన్ను రహితం. దీంతో మొత్తం మీ కుటుంబానికిఎలాంటిపన్ను భారంలేకుండా లభిస్తుంది. మహిళలు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించి పన్ను రహిత మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు .3. యూఎల్ఐపీలు (ULIPs) పైపన్ను ప్రయోజనాలు ULIPలకు చెల్లించిన ప్రీమియం కూడా సెక్షన్ 80C కింద తగ్గింపుకు అర్హం. కొన్ని షరతులు నెరవేరితేమెచ్యూరిటీ మొత్తం కూడా సెక్షన్ 10(10D) కింద పన్ను రహితం. ULIPs బీమాతో పాటు పెట్టుబడిఅవకాశం అందిస్తాయి. అందువల్లపన్ను ఆదా చేస్తూ సంపదను పెంచుకోవచ్చు .4. పెన్షన్ లేదా అన్న్యుటీ పాలసీలపై పన్ను లాభంపెన్షన్ లేదా అన్న్యు టీఅందించే జీవిత బీమా పాలసీతీసుకుంటే, చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80CCC కింద తగ్గింపునకు అర్హం. పదవీ విరమణ తర్వా త వచ్చే అన్న్యుటీపై పన్ను ఉంటుందేకానీ, పెట్టుబడికాలంలో మీరు ముందుగానే పన్ను ఆదా చేసుకోవచ్చు .పన్ను ప్రయోజనాల కోసం జీవిత బీమాను ఉపయోగించేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయంజీవిత బీమా ద్వా రా పన్ను ప్రయోజనాలు పొందేటప్పుడు ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయి.● సరైన పాలసీని ఎంచుకోండి: టర్మ్ ప్లాన్, ఎండోవ్మెంట్ ప్లాన్, ULIP వంటికొన్ని పాలసీలకేపన్ను ప్రయోజనాలు ఉంటాయి. రక్షణ, పెరుగుదల మరియు పన్ను ఆదా మధ్య సరైన సమతుల్యం కలిగిన పాలసీని తీసుకోండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్షన్ 80C కింద పూర్తిపన్ను తగ్గింపును ఇస్తుంది, ఇదిమహిళలకు మంచి ఎంపిక.● ప్రీమియం పరిమితులు మరియు సామర్థ్యాన్ని తెలుసుకోండి: సెక్షన్ 80C కింద సంవత్సరానికి₹1.5 లక్షల వరకు మాత్రమే తగ్గింపులు లభిస్తాయి. మీరు ప్రీమియంను ప్లాన్ చేసేటప్పు డు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. అలా చేస్తేమీరు గరిష్టపన్ను ప్రయోజనం పొందగలరు.● పన్ను రహిత చెల్లింపుల నియమాలను అర్థం చేసుకోండి: మెచ్యూ రిటీలేదా మరణ లాభాలు సెక్షన్ 10(10D) కింద పన్ను రహితంగా ఉండాలంటేపాలసీకొన్ని నిబంధనలను పాటించాలి. ఇందులో కనీస ప్రీమియం చెల్లింపులు మరియు అవసరమైన పాలసీవ్యవధిఉంటాయి.● లాక్-ఇన్ పీరియడ్ గురించి తెలుసుకోండి: కొన్ని పాలసీలకు, ముఖ్యంగా ULIPsకు, 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలానికి ముందే ఉపసంహరణ చేస్తే పన్ను ప్రయోజనాలు తగ్గవచ్చు.● రికార్డులను సరిగ్గా ఉంచండి: పన్ను తగ్గింపులు క్లెయిమ్ చేసేసమయంలో ప్రీమియం రసీదులు మరియు పాలసీపత్రాలు అవసరం అవుతాయి. అందువల్లవీటిని జాగత్ర్తగా భదప్రరచండి.మహిళలకు జీవిత బీమా రక్షణకన్నా ఎక్కు వని ఇస్తుంది. ఇదిఆర్థిక స్థిరత్వా న్ని మరియు నిజమైన పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. సెక్షన్ 80C తగ్గింపులు మరియు సెక్షన్ 10(10D) మినహాయింపులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వా రా మహిళలు తమ ఆర్థిక పణ్రాళికపైస్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలరు. సరైన నిర్ణయాలు మరియు జాగ్రత్తైన పణ్రాళికతో మహిళలు జీవిత బీమాతో ఉన్న అపోహలను తొలగించి మరింత భద్రమైన మరియు ఆర్థికంగా బలమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు.
వినూత్న ఉత్పత్తులపై ఫార్మా ఫోకస్ చేయాలి
ప్రపంచ ఫార్మసీగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టాలంటే వచ్చే అయిదేళ్లలో దేశీ ఫార్మా పరిశ్రమ క్రమంగా వినూత్నమైన, సంక్లిష్టమైన జనరిక్స్ తయారీ వైపు మళ్లాలని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి చెప్పారు. బయోసిమిలర్లు, బయోలాజిక్స్, పెప్టైడ్లు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.అంతర్జాతీయంగా పోటీ, భౌగోళిక–రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం పేటెంట్లు ముగిసిన ఉత్పత్తులనే తయారు చేయడం కాకుండా పరిశోధనల ఆధారిత ఆవిష్కరణలవైపు మళ్లాల్సిన అవసరం ఉందని జోషి చెప్పారు. జనరిక్ మార్కెట్ స్థాయిని దాటి ఇతర విభాగాల్లోనూ భారత్ స్థానాన్ని పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని సీపీహెచ్ఐ–పీఎంఈసీ ఇండియా 18వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.అమెరికా టారిఫ్ల ముప్పుపై ఆందోళన నెలకొన్నప్పటికీ ఈ ఏడాది ఎగుమతులు ఇప్పటివరకు వృద్ధి బాటలోనే ఉన్నాయని, 2.31 శాతం పెరిగాయని జోషి చెప్పారు. ఇక ఫార్మసీ బోధనాంశాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందని సదస్సులో పాల్గొన్న కంపెనీల ఎగ్జిక్యూటివ్లు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత సిలబస్ అనేది వాస్తవ పరిస్థితులను, నేటి ఫార్మా వ్యవస్థ అవసరాలను ప్రతిబింబించేలా ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ డిస్కవరీ, రీసెర్చ్ మెథడాలజీల నుంచి ముడి వస్తువుల సేకరణ, ఏఐ ఆధారిత ఫార్ములేషన్ డెవలప్మెంట్లాంటి అన్ని అంశాల గురించి విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని తెలిపారు.
నిఫ్టీకి ‘నూతన’ ఊపు.. 14 నెలలకు ఆల్-టైమ్ హై
భారత స్టాక్మార్కెట్లో గురువారం (నవంబర్ 27) కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రధాన బెంచ్మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 నూతన చరిత్ర సృష్టించింది. 14 నెలల తర్వాత కొత్త ఆల్–టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.సెషన్ ప్రారంభంలోనే నిఫ్టీ 50 సూచీ 26,295 పాయింట్లపైకి ఎగబాకి, 2024 సెప్టెంబర్ 27న నమోదైన పూర్వపు రికార్డు 26,277.35 పాయింట్లను అధిగమించింది. నిఫ్టీకి ఈ కొత్త మైలురాయిని చేరుకోవడానికి మొత్తం 287 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.రికార్డు హైకి దోహదం చేసిన అంశాలుస్టాక్ మార్కెట్లో కొనుగోలు ధోరణి పెరగడానికి అనేక కారకాలు దోహదం చేశాయి.దేశీయ, అంతర్జాతీయ వడ్డీ రేట్లు కోతపై మార్కెట్ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను గణనీయంగా పెంచాయి.కంపెనీల బలమైన క్యూ2 ఫలితాలు, అనేక రంగాల్లో ఆదాయ వృద్ధి ఊపందుకోవడం వల్ల సూచీకి శక్తి లభించింది.మ్యూచువల్ ఫండ్స్, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ ఇన్ఫ్లోలు కొనసాగాయి.మార్కెట్ వాల్యుయేషన్లు కొంత సడలించడంవల్ల కొనుగోలు ఆకర్షణ పెరిగింది.గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్, అంతర్జాతీయ ట్రేడ్ & మాక్రో డేటా మెరుగుదల కూడా ప్రభావం చూపాయి.నిఫ్టీ పరిణామ క్రమంనిఫ్టీ సూచీ తన ప్రారంభం (1995–96) నుంచి ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా పెరుగుతూ భారీ వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది.2007లో తొలిసారి 5,000 మార్క్ను దాటిన నిఫ్టీ 2017లో 10,000 మార్క్ను 2021లో 20,000 మైలురాయిని తాకింది. 2024లో 25,000 మార్క్ను అందుకున్న ఈ ఎన్ఎస్ఈ ఇండెక్స్ 2025లో 26,000 మైలురాయిని దాటింది.నిఫ్టీ సూచీకి 2024 సంవత్సరం అనేక రికార్డులు అందించింది. ఆ ఒక్క ఏడాదిలోనే నిఫ్టీ 59 కొత్త రికార్డు హైలు నమోదు చేసింది.ఏ స్టాక్స్ మెరిశాయంటే..తాజా ర్యాలీలో ముఖ్యంగా బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ మెరిశాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఇంజనీరింగ్ సెక్టార్లో లార్సెన్ & టూబ్రో, కన్స్యూమర్ & మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఏషియన్ పెయింట్స్ వంటి స్టాక్స్ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ఇతర బ్లూ–చిప్ కంపెనీలు కూడా సానుకూల త్రైమాసిక ఫలితాలు వెలువరించడంతో సూచీకి కొత్త ప్రాణం పోశాయి.నిపుణుల విశ్లేషణమార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుత ర్యాలీ పూర్తిగా ఫండమెంటల్స్ ఆధారిత స్థిరమైన వృద్ధిగా కనిపిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం, ఎఫ్ఐఐ రాకల్లో మెరుగుదల, దేశీయ డిమాండ్ పెరుగుదల.. ఇవన్నీ మార్కెట్కు మద్దతునిస్తున్నాయి.ఇకపోతే, అంతర్జాతీయ స్థూల అనిశ్చితులు, డాలర్ బలం, క్రూడ్ ధరల్లో మార్పులు వంటి అంశాలు వచ్చే రోజుల్లో మార్కెట్లో అస్థిరతకు దారితీయవచ్చు అని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం.. పాలసీ సడలింపులు, ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగితే నిఫ్టీ 2026 నాటికి 30,000 మార్క్ను తాకే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వామ్మో వెండి హ్యాట్రిక్.. బంగారమే నయం కదా!
దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు కాస్త శాంతించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కార్పొరేట్
వినూత్న ఉత్పత్తులపై ఫార్మా ఫోకస్ చేయాలి
డేటా సెంటర్లపై రూ. 60,000 కోట్లు
ఏఐతో ఉత్పాదకత పెరుగుతుంది
నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..
ఐరాస సంస్థ ‘సైట్స్’ మెచ్చిన వంతారా
ధనికులను వణికిస్తున్న వెల్త్ ట్యాక్స్!
హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాల రిపేరీ కేంద్రం
అసంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగాలు
అదానీ ఎంటర్ప్రైజెస్ రైట్స్ ఇష్యూ
ఎస్బీఐ వెంచర్స్ టార్గెట్ రూ. 2,000 కోట్లు
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్ తప్పదా?
బంగారం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. డిసెంబరులో యూఎ...
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ లూజర్..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశా...
బంగారం... ఎందుకీ హెచ్చుతగ్గులు?
బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. ...
ఇంతలా పెరిగితే కొనేదెలా?: లేటెస్ట్ గోల్డ్ రేట్స్ ఇలా..
నవంబర్ నెల ముగుస్తున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం ...
త్వరలో రూ.5000 నోట్లు!.. స్పందించిన కేంద్రం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.5000 నోట్లను వ...
రుణాలను చౌకగా అందిస్తే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందా?: అదెలా..
సరసమైన రుణాల లభ్యత దేశీయ మార్కెట్లను పెంచుతుంది. అ...
‘ఆహార వృధా అంత ఎక్కువేం లేదు’
ప్రజల్లో అనుకుంటున్నట్టు మన దేశంలో ఆహార వృధా అంత ఎ...
కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు: తక్షణమే అమల్లోకి
భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐఫోన్ 16పై రూ.13000 తగ్గింపు!
ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ఈ-కామర్స్ రిటైలర్లు ఐఫోన్ 16పై ఆఫర్స్ & డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే.. ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 సందర్భంగా ఈ మొబైల్ కొనుగోలుపై రూ. 13,000 తగ్గింపులను ప్రకటించింది.128జీబీ ఐఫోన్16 అసలు ధర రూ. 69900 (ఫ్లిప్కార్ట్). ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా.. దీనిని రూ. 13000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్లో అనేక ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు అన్ని బ్యాంక్ ఆధారిత ఆఫర్లు ఉంటాయి. HDFC, SBI కార్డ్ హోల్డర్లు రూ. 5,000 వరకు తక్షణ 10% క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 25000 వరకు తగ్గింపు (ఈ ధర మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ స్థితిని బట్టి ఉంటుంది) లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐలో భాగంగా.. 3-24 నెలల్లో చెల్లింపులు చేసుకోవచ్చు.ఫ్లిప్కార్ట్ ఇతర ఐఫోన్ మోడళ్లపై కూడా డీల్లను అందిస్తోంది. 6.7 ఇంచెస్ పెద్ద స్క్రీన్ & పెద్ద బ్యాటరీ కలిగిన ఐఫోన్ 16 ప్లస్ ధర, డిస్కౌంట్ తర్వాత రూ.69,999 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 15 రూ.49,999కి, ఐఫోన్ 15 ప్లస్ రూ.59,999కి, ఐఫోన్ 14 కేవలం రూ.44,499కే అందుబాటులో ఉంది.ఐఫోన్ 16ఐఫోన్ 16 శక్తివంతమైన A18 చిప్, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే కలిగిన యాపిల్ ఫోన్. ఇది 48MP ఫ్యూజన్ లెన్స్లతో కూడిన కెమెరా సిస్టమ్ పొందుతుంది. ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా యాక్సెస్ చేయగలదు. కొంత తక్కువ ధరతో ఐఫోన్ 16 కొనడానికి ఇది సరైన సమయం.ఇదీ చదవండి: రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!
బిలినీయర్స్ అంతా ఒక్కచోట!
అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.Trillion Squad assembled pic.twitter.com/tQMjRrfxx5— Ambuj Mishra (@Ambujmishra9090) November 22, 2025ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.Somewhere in a parallel universe: pic.twitter.com/SFlYRiUpcn— DogeDesigner (@cb_doge) November 22, 2025
బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్సైకిల్పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్స్క్రిప్షన్ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్సైట్లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,19,900. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఈ ఫోన్ కేవలం 54,900 రూపాయలకే లభించనుంది. అంటే.. రూ. 65,000 తగ్గుతుందన్నమాట.నవంబర్ 22 నుంచి ప్రారంభమైన నవంబర్ 30 వరకు సాగే బ్లాక్ ఫ్రైడే సేల్లో.. ఐఫోన్ ఎయిర్ మొబైల్ తక్కువ ధరలకు అందుబాటులో ఉండనుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఆఫర్స్, ఇతరత్రా ఆఫర్స్ పొందినట్లయితే మీకు రూ. 65000 తగ్గుతుందన్నమాట.ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్స్యాపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5 ఇంచెస్ OLED ప్యానెల్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ పొందిన ఈ ఫోన్ 3,000 నిట్స్ పీక్ అవుట్డోర్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో యాపిల్ ప్రత్యేక 7-లేయర్ యాంటీరిఫ్లెక్టివ్ కోటింగ్ అందించింది. ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్సెట్పై నడుస్తుంది, ఇది ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్లో ఉపయోగించిన అదే శక్తివంతమైన ప్రాసెసర్. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ రియర్ కెమెరా, ముందు భాగంలో, 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ & స్కై బ్లూ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
UPI: ఇదిగో యాప్.. యాడ్ చేశా.. ఖర్చు పెట్టుకోండి!
మనం ఖర్చు పెట్టుకోవడానికి ఇంట్లో పెద్దవారు కానీ, యజమానులు కానీ నగదు కాకుండా బ్లాంక్ చెక్లు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు ‘ఇదిగో యాప్.. ఖర్చు పెట్టుకోండి’ అని ఇచ్చే పరిస్థితి వచ్చింది.ఎన్పీసీఐ అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL).. తన భీమ్ పేమెంట్స్ యాప్ లో ‘యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్’ ఫీచర్ను ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా కావాల్సినవారిని సర్కిల్లోకి తీసుకుని మన అకౌంట్ నుంచి వాళ్లు డబ్బులు వాడుకునేలా చేయొచ్చు. నెలకు ఇంత అని రూ .15,000 వరకు ప్రీసెట్ చేస్తే ఇక వారు తమకు కావాల్సినప్పుడల్లా సలువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు వారికి సొంత యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతా కూడా అవసరం లేదు. ఇలా ఎన్నికాలం వాడుకోవచ్చు (1 నెల నుండి 5 సంవత్సరాల వరకు) అన్నది కూడా సెట్ చేయొచ్చు.ఎన్బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలిత నటరాజ్ మాట్లాడుతూ, ఈ ఫీచర్ సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తమ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, డిజిటల్ చెల్లింపులను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు.యూపీఐ సర్కిల్ను ఎలా ఉపయోగించాలంటే..భీమ్ యాప్లోకి వెళ్లి యూపీఐ సర్కిల్ ఓపెన్ చేయండి.'ఇన్వైట్ టు సర్కిల్'ను ఎంచుకుని కాంటాక్ట్ ని యాడ్ చేయండి.వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి లేదా క్యూఆర్ స్కాన్ చేయండి.'అప్రూవ్ ఎ మంత్లీ లిమిట్'ను ఎంచుకోండిరిలేషన్ షిప్ సెట్ చేసి గుర్తింపును (ఆధార్/ఇతర డాక్యుమెంట్ లు) వెరిఫై చేయండిఖర్చు పరిమితి (రూ.15,000 వరకు), వ్యాలిడిటీ (1 నెల నుంచి 5 సంవత్సరాలు) సెట్ చేయండి.ఖాతాను ఎంచుకుని యూపీఐ పిన్తో ప్రమాణీకరించండి.ఇప్పుడు అవతలివారు అంగీకరించిన తర్వాత కొద్దిసేవటికి చెల్లింపులను ప్రారంభించవచ్చు.
హోమ్ లోన్ అంటే ప్రభుత్వ బ్యాంకే.. ఎందుకు?
గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో జారీ అయిన మొత్తం గృహ రుణాల విలువలో 50 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ సంస్థ వెల్లడించింది. ప్రైవేటు రంగ బ్యాంక్లను ఈ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించినట్టు తెలిపింది.ఇక మొత్తం రుణాల్లో 40 శాతం రూ.75 లక్షలకు మించిన గృహ రుణాలే ఉన్నాయి. మొత్తం యాక్టివ్ రుణాలు (చెల్లింపులు కొనసాగుతున్నవి) 3.3 శాతం పెరిగి 2.29 కోట్లకు చేరాయి. రిటైల్ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాల మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో 11.1 శాతం పెరిగి రూ.42.1 లక్షల కోట్లకు చేరింది.కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో డిమాండ్ స్తబ్దుగా ఉందంటూ.. 10.2 శాతం వృద్ధి కనిపించినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. 31 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేని వినియోగ రుణాలు జూన్ చివరికి 3.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 3 శాతానికి తగ్గాయి.ప్రభుత్వ బ్యాంకుల వాటా ఎక్కువ ఉండటానికి కారణాలువడ్డీరేట్లు సాధారణంగా తక్కువగా ఉండటంప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే వారి ప్రాసెసింగ్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయి.ప్రభుత్వంపై నమ్మకంఇంటి కోసం తీసుకునే రుణం ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఉన్న భద్రతా భావం కారణంగా అక్కడి నుంచే రుణం తీసుకోవాలనే భావన బలంగా ఉంటుంది.ప్రభుత్వ హౌసింగ్ స్కీములుప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి పథకాలు సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో ఇస్తారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల హౌసింగ్ లోన్ డిమాండ్ పెరుగుతుంది.పెద్ద మొత్తాల రుణాలువినియోగదారులకు పెద్ద మొత్తాల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుంటాయి. గణాంకాల ప్రకారం.. మొత్తం రుణాల్లో 40% రూ.75 లక్షలకుపైబడినవే ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తాల రుణాలను ఇచ్చే ధైర్యం, ఫండింగ్ సామర్థ్యం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ.రిస్క్ తీసుకునే సామర్థ్యంప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం వంటి షరతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం మధ్య తరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ఆదాయం గలవారికి కూడా రుణాలు ఇవ్వడానికి ముందుంటాయి.బ్రాంచ్ నెట్వర్క్ భారీగా ఉండటంగ్రామీణ, పట్టణాల్లో ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఫలితంగా లోన్ యాక్సెస్ సులభంగా ఉంటుంది.
స్థిరమైన ఆదాయానికి ఏ ఫండ్ మంచిది..?
నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. స్థిరమైన ఆదాయం కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – నివేష్ పటేల్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్్కతో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్తో పోలి్చతే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. లిక్విడ్ ఫండ్స్పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. లిక్విడ్ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు.లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులను ఇన్స్టంట్గా అదే రోజు వెనక్కి తీసుకునేందుకు (నిరీ్ణత మొత్తం) కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. లేదంటే మరుసటి రోజు అయినా పెట్టుబడులు చేతికి అందుతాయి. వీటిల్లో రాబడి ఎంతన్నది ముందుగానే అంచనాకు రావొచ్చు. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి యూనిట్ నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ)లో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. కనుక ఇది నెలవారీ ఉపసంహరించుకునే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు హెల్త్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. అయినా, వ్యక్తిగతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆలోచనేనా? – రేణుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు హెల్త్ కవరేజీ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ఎంపానెల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు పరిహారం పొందొచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగా చికిత్సలకు సైతం రీయింబర్స్మెంట్ పొందొచ్చు. వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు కుడా పరిహారం వస్తుంది. కాకపోతే ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితం. అయితే, ప్రభుత్వ ఆమోదం పొందిన ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉందో, అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోండి.ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన, రోబోటిక్ వంటి అత్యాధునిక చికిత్సలను తమకు ఇష్టమైన ఆస్పత్రిలో పొందాలని కోరుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కనీసం రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవాలి. అది కూడా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి హెల్త్ ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో–పే షరతుకు అంగీకరించాల్సి వస్తుంది. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సదుపాయం అధిక శాతం చికిత్సలకు రీయింబర్స్మెంట్ రూపంలోనే ఉంటుంది. కనుక ముందుగా తాము చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వద్ద క్లెయిమ్ దాఖలు చేసి పొందగలరు. అదే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అవసరమైన సందర్భంలో నగదు రహిత చికత్సను దాని కింద పొందొచ్చు.ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
వ్యవసాయ ఆదాయం.. పన్ను భారం లెక్కింపు
గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్కంట్యాక్స్ పడదు. కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్ ఇన్కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం. ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000B. వ్యవసాయ ఆదాయం, బేసిక్ లిమిట్ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి. రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది. అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి. ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)చెల్లించాల్సిన పన్ను (5) – (6)దీనికి విద్యా సుంకం అదనంరూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది. పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది. మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్ ఇంటిగ్రేషన్ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి. ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్ ప్లానింగ్ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక.


