Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why Hide Salaries Entrepreneur Ankur Warikoo Tweet Viral1
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్‌లో..

సాధారణంగా జీతాల విషయాలు ఎవరూ బయటపెట్టడానికి లేదా వెల్లడించడానికి ఇష్టపడరు. కానీ ఎందుకు జీతాలను దాచిపెట్టాలి? అని వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్, రచయిత అయిన 'అంకుర్ వారికూ' (Ankur Warikoo) తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.జీతానికి సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల.. మీరు పనిచేసే ప్రదేశంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇది కొందరిలో అభద్రతను పెంచుతుంది. కాబట్టి బయటకు వెల్లడించ వచ్చు. ఇది మీ క్రమశిక్షణను తెలియజేస్తుందని అంకుర్ వారికూ పేర్కొన్నారు.ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి కాదువ్యక్తిగత ఆర్థిక ప్రపంచంలో నాకు గుర్తింపు రావడానికి కూడా క్రమశిక్షణతో ఉండటం, డబ్బును ఎప్పుడూ వ్యక్తిగతంగా పరిగణించకపోవడమే అని అంకుర్ అన్నారు. నేను కేవలం జీతం మాత్రమే కాకుండా.. నా ఆదాయం, పెట్టుబడి, నేను చేసే పొరపాట్లను కూడా బహిరంగంగా చెబుతాను. ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి మాత్రం కాదు. మీరు కొన్ని విషయాలను దాచిపెట్టడం మానేస్తే.. స్పష్టత ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రమే.జీతాల విషయంలో కంపెనీలే పక్షపాతం చూపిస్తాయి. అలాంటప్పుడే చాలామంది తన జీతాల విషయాన్ని రహస్యంగా దాచేస్తారు. ఇలాంటిది నా స్టార్టప్‌లో జరగదు. అందరి జీతం పబ్లిక్‌గా ఉంటుందని ఆయన అన్నారు. జీతాల విషయంలో అందరికీ ఒక స్పష్టత ఇస్తామని కూడా వెల్లడించారు.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!పారదర్శకత పట్ల తన నిబద్ధతను హైలైట్ చేస్తూ.. వారికూ గతంలో తన డ్రైవర్ ఒక నెలలో ఎంత సంపాదిస్తాడో మరియు అతని జీతం ఎలా అభివృద్ధి చెందిందో వెల్లడించారు. మరో ఐదారు సంవత్సరాల్లో.. డ్రైవర్ జీతం నెలకు లక్ష రూపాయలకు చేరుకోవాలని కోరుకుంటున్నానని తన ట్వీట్ ముగించారు.There is a simple reason I found acceptance in the world of personal finance.Because I treated money as something that should never have been “personal” in the first place.So I put my own numbers on the table.My business income.My investments.My performance.My salary.My…— Ankur Warikoo (@warikoo) November 21, 2025

Dhirubhai Ambani International School Fee Structure2
అంబానీ స్కూల్‌లో ఫీజులు అన్ని లక్షలా?

అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన దాదాపు అందరికీ.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) గురించి తెలిసే ఉంటుంది. ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో దీనిని 2003లో నీతా అంబానీచే స్థాపించారు. ఇందులో చాలామంది సెలబ్రిటీల పిల్లలు చదువుకుంటున్నారు. అయితే ఈ కథనంలో ఇక్కడ ఫీజులు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS).. కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్), CAIE (కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) వంటి అనేక కార్యక్రమాలలో విద్యను అందిస్తుంది. అంతే కాకుండా ICSE (ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), IGCSE (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కోసం కూడా విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఈ స్కూల్ పిల్లలను బాధ్యతాయుతమైన, చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యా నైపుణ్యంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి విలువనిస్తూ.. ప్రోత్సహిస్తోంది.మొత్తం విద్యార్థులు & ఉపాధ్యాయులు11, 12 తరగతులకు, ఈ పాఠశాల IB (ఇంటర్నేషనల్ బాకలారియేట్) ద్వారా IB డిప్లొమా ప్రోగ్రామ్‌ను అందించడానికి అధికారం పొందింది. ఇందులో సుమారు 1,087 మంది విద్యార్థులు, 187 మంది ఉపాధ్యాయులు (వీరిలో 27 మంది ప్రవాసులు) ఉన్నారు.తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్ మరియు అబ్రామ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్ల పిల్లలు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS)లో చదువుకుంటున్నారు. కాబట్టి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కరీనా కపూర్, సైఫ్ అలీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ పిల్లల పెర్ఫార్మెన్స్ చూసేందుకు తరచుగా పాఠశాల నిర్వహించే వార్షిక కార్యక్రమంలో కనిపిస్తారు.ఫీజుల వివరాలు2023-2024 విద్యా సంవత్సరానికి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒకరిని కిండర్ గార్టెన్‌ నుంచి 12వ తరగతికి వరకు చదివించడానికి ఫీజులు రూ. 1,400,000 నుంచి రూ. 2,000,000 ఉంటాయని సమాచారం. పాఠశాల ఫీజులలో పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలు, రవాణా, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజు నిర్మాణం గ్రేడ్ స్థాయి ఆధారంగా మారుతుంది. కిండర్ గార్టెన్ నుంచి 7వ తరగతి వరకు ఫీజులు సంవత్సరానికి రూ. 1.70 లక్షలు లేదా నెలకు సగటున రూ. 14వేలు. 8వ తరగతి నుంచి 10వ తరగతులకు సంవత్సరానికి రూ. 5.9 లక్షలు. 11, 12 తరగతులకు ఏటా రూ. 9.65 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఫీజులు కేవలం అంచనా మాత్రమే.

IndiGo Approves Rs 7270 Cr Investment To Acquire Aircraft3
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో

దేశీ విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ విమానాల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఐఎఫ్‌ఎస్‌సీ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు 82 కోట్ల డాలర్లు (రూ. 7,270 కోట్లు) అందించనుంది.ఇండిగో బ్రాండ్‌ విమాన సర్వీసుల కంపెనీ ఈక్విటీ షేర్లు, నాన్‌క్యుములేటివ్‌ ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు(ఓసీఆర్‌పీఎస్‌) జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చనుంది. ఒకేసారి లేదా దశలవారీగా వీటి జారీని చేపట్టనున్నట్లు ఇండిగో తెలియజేసింది. నిధులను ప్రధానంగా విమానాల కొనుగోలుకి వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇప్పటికే 411 విమానాలను కలిగి ఉంది. వీటిలో 365 విమానాలు నిర్వహణలో ఉన్నట్లు విమాన ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ప్లేన్‌స్పాటర్‌.నెట్‌ పేర్కొంది.

Gold Price Hike Today Check The Reason Here4
పెరిగిన బంగారం ధరలు: ప్రధాన కారణం ఇదే!

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (నవంబర్ 22) గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే పెరిగింది. దీంతో పసిడి ధరలు పెరుగుదల దిశగా పరుగులు తీశాయి. ఇంతకీ ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అయింది. మన దేశంలో పెళ్లి అంటేనే చాలామంది ఆడంబరంగా జరుగుపుకుంటారు. ఇలాంటి సమయంలో గోల్డ్ కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14నాటికి సుమారు 48 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా.ఈ ఏడాది 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయంటే.. బిజినెస్ కూడా రూ. 6.5 లక్షల కోట్లు ఉంటుందని CAIT తన నివేదికలో వెల్లడించింది. ఇందులో 15 శాతం (సుమారు రూ. 97,500 కోట్లు) గోల్డ్ బిజినెస్ ఉంటుంది. అంటే ఈసారి రూ. 97,500 కోట్ల విలువైన బంగారం సేల్.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పసిడికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఈ రోజు ధరలు ఇలానిన్న (నవంబర్ 21) స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు సమంత పెరిగింది. దీంతో బంగారం ధర గరిష్టంగా.. 1,860 రూపాయలు పెరిగి, రూ. 125840 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి రేటు 1700 రూపాయలు పెరిగి.. రూ.115350 వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!

50/30/20 Budget Rule Explained With Examples5
50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!

డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు.. కానీ పొదుపు చేయడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెరిగిపోతున్న ధరల వల్ల ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతోంది. అయితే 50/30/20 ఫార్ములాను అనుసరిస్తే ఎవరైనా.. డబ్బు పొదుపు చేయవచ్చు. ఈ ఫార్ములా గురించి ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఒక వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే?, ఖర్చులు ఆటోమాటిక్‌గా పెరిగిపోతాయి. ఈ ఖర్చుల కోసం.. సంపాదించిన మొత్తం వెచ్చిస్తే?, భవిష్యత్ కోసం ఏమీ మిగలదు. కాబట్టి పొదుపు అవసరం.ఏమిటీ 50/30/20 ఫార్ములా?50/30/20 ఫార్ములా.. మీ ఆదాయాన్ని మూడు ఖర్చు భాగాలుగా విభజిస్తుంది. 50 శాతం అవసరాలకు, 30 శాతం కోరికలు (సరదా ఖర్చులు), 20 శాతం పొదుపు. ఈ ఫార్ములాను యూఎస్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ తన పుస్తకం "ఆల్ యువర్ వర్త్: ది అల్టిమేట్ లైఫ్‌టైమ్ మనీ ప్లాన్''లో వెల్లడించారు.వివరంగా చెప్పాలంటే.. మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో 50 శాతం లేదా రూ. 50వేలు అవసరాలకు, అంటే రూమ్ రెంట్, కిరాణా సామాగ్రి, బీమా & ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. 30 శాతం లేదా రూ. 30వేలు సరదా ఖర్చులకు, అంటే.. హ్యాండ్‌బ్యాగులు, గడియారాలు, నగలు వంటివన్న మాట. 20 శాతం లేదా రూ. 20వేలు పొదుపు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి, మీ నైపుణ్యాన్ని బట్టి) చేయాలి. ఇలా విభజించుకుంటే.. మీరు తప్పకుండా పొదుపు చేయొచ్చు.ఇదీ చదవండి: నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములామీరు సంపాదించే డబ్బులో ఇంకా కొంత ఎక్కువ పొదుపు చేయాలంటే.. అనవసరమైనవి కొనుగోలు చేయడం లేదా ఖర్చు పెట్టడం మానేయాలి. ఆలా మిగిలిన డబ్బును కూడా మీరు సేవింగ్స్ చేసుకుంటూ పోతే.. పొదుపు తప్పకుండా పెరుగుతుంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే.. దాని గురించి తప్పకుండా కొంత సమాచారం తెలుసుకుండాలి, అనుభవం కూడా ఉండాలి. లేకుంటే నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు.

Hyderabad Has The Highest Number of GCCs in The Country6
ఏ రంగమైనా.. హైదరాబాద్ టాప్‌!

ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌.. రంగమేదైనా సరే.. హైదరాబాదే టాప్‌ లీడర్‌. అవునండీ.. గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబైని దాటేసి బహుళ జాతి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీల ఏర్పాటుకు జై కొడుతున్నాయి. కొత్త జీసీసీల ఏర్పాటే గానీ ఇప్పటికే ఉన్న జీసీసీల విస్తీర్ణంలో గానీ భాగ్యనగరాన్నే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయి.అందుబాటు ధరలు, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య కార్మికుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి-నవంబర్‌ మధ్య కాలంలో దేశంలో 88 జీసీసీలు ఏర్పాటు, విస్తరణ కాగా.. ఇందులో 46 శాతం వాటాతో భాగ్యనగరం తొలి స్థానంలో నిలిచింది. మన తర్వాతే 33 శాతం వాటాతో బెంగళూరు నగరం రెండో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది ముగింపు నాటికి రాష్ట్రంలో 120 జీసీసీలు, 1.2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీసీసీ - ఉమెన్‌తెలంగాణలోని మొత్తం జీసీసీ నైపుణ్య కార్మికులలో 59 శాతం మంది, అంటే సుమారు 1.82 లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, తయారీ రంగాల జీసీసీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జీసీసీ నిపుణులలో మహిళలు 33 శాతం మంది ఉండగా.. 19 శాతం మంది నాయకత్వ ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రాష్ట్రంలోని మొత్తం జీసీసీ ఉపాధిలో ఇంజనీరింగ్, ఐటీ రంగాలు 57 శాతం వాటాతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement