Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Manager Asks Employee To Work From Hospital During Wife Labour1
తండ్రి అయ్యే వేళ.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమన్న మేనేజర్

కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా.. వర్క్ చేయాలని పట్టుబడుతున్నాయి. తాజాగా ఒక ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మేనేజర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.నా భార్య ప్రసవ వేదనలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా.. మేనేజర్ వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమని అన్నారు. ఉద్యోగి ఆ విషయాన్ని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. ''నా భార్య మా మొదటి బిడ్డ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. నేను మేనేజర్‌కు ఈ విషయం గురించి చెప్పి రెండు రోజులు మాత్రమే సెలవు అడిగాను. అయితే మేనేజర్ సానుభూతి చూపించడానికి బదులు, ఆసుపత్రి నుంచే వర్క్ చేయమని అన్నారు. మా బిడ్డపై ద్రుష్టి పెట్టాల్సిన సమయంలో నేను ఆసుపత్రి గదిలో నా ల్యాప్‌టాప్‌తో కూర్చోవడం సరైంది కాదు. నేను ఉద్యోగాన్ని వదులుకోలేను, ఎందుకంటే.. నా బాధ్యతలు పెరుగుతూనే ఉన్నాయి, నేను వాళ్లకు వ్యతిరేఖంగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారేమో అని భయంగా ఉందని'' అన్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మేనేజర్‌పై ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ పని ఉంటుంది. ముందు మీ భార్యను చూడండి అని ఒకరు, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. నేను ఇండియాలో పనిచేయకపోవడం మంచిది అయిందని ఇంకొకరు అన్నారు. భార్య, బిడ్డ జీవితంలో చాలా కీలకం.. ఆ దిశగా ఆలోచించు అని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!

Gold Price Change in last week2
బంగారం ధరలు: వారంలో ఎంత మార్పు?

దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒక రోజు పెరగడం, మరో తగ్గడం ఇలా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పసిడి ధరలు (Gold Price) ఎలా ఉన్నాయి.. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరల్లో మార్పు ఎంత.. పెరిగాయా.. తగ్గాయా.. అన్నది ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజుల్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్, 24 క్యారెట్ల బంగారం ధరలు దాదాపు ఒకే శాతం పెరుగుదలను నమోదు చేశాయి. నవంబర్ 17 నుంచి నవంబర్ 23 మధ్య ట్రాక్ చేసిన మార్కెట్ డేటా ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 870 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 800 రూపాయలు పెరిగింది.24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,24,970 రూపాయల నుండి 1,25,840 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ .1,14,550 నుండి రూ .1,15,350 కు పెరిగింది.ఈ నెల ప్రారంభంలో భారీ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఈ వారం మొత్తం ధరల కదలిక స్థిరంగా ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక సంకేతాల మధ్య స్థిరమైన పెట్టుబడిదారుల ఆసక్తిని సూచిస్తుంది. రెండు స్వచ్ఛతలలో సమాంతర పెరుగుదల దేశీయ బులియన్ సెంటిమెంట్ లో ఏకరీతి మార్పును సూచిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

CDSL launches Reimagine Ideathon for students3
సీడీఎస్‌ఎల్‌ ఐడియాథాన్‌కి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

విద్యార్థుల కోసం తొలిసారిగా రీఇమేజిన్‌ ఐడియాథాన్‌ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ ఇండియా (సీడీఎస్‌ఎల్‌) వెల్లడించింది. మార్కెట్లలో పెట్టుబడుల గురించి తెలుసుకోవడంలోను, ఇన్వెస్ట్‌ చేయడంపైన అవగాహన పెంచే సొల్యూషన్స్‌ను రూపొందించేలా ప్రోత్సహించేందుకు తమ 3వ వార్షిక రీఇమేజిన్‌ సింపోజియం కింద దీన్ని చేపట్టినట్లు వివరించింది.ఒక్కో సంస్థ నుంచి నలుగురు విద్యార్థులు, ఒక మెంటార్‌ కలిసి బృందంగా ఏర్పడి, ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం రూ. 11.5 లక్షల ప్రైజ్‌ మనీ ఉంటుంది. విజేతగా నిల్చే ఐడియాకి రూ. 5 లక్షలు, రన్నర్స్‌ అప్‌కి రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల చొప్పున బహుమతులు ఉంటాయి. గేమిఫికేషన్, డిజైన్, టెక్నాలజీ మొదలైన విభాగాల్లో విద్యార్థులు సొల్యూషన్స్‌ని రూపొందించవచ్చు.స్టాన్‌లో హైదరాబాద్‌ ఏంజెల్స్‌ పెట్టుబడులుసోషల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫాం స్టాన్‌లో సిరీస్‌ ఏ కింద 8.5 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు హైదరాబాద్‌ ఏంజెల్స్‌ ఫండ్‌ (హెచ్‌ఏఎఫ్‌) వెల్లడించింది. (Hyderabad Angels Fund invests in STAN) గేమింగ్, క్రియేటర్‌ ఎకానమీ విభాగంలో ఇది తమకు తొలి పెట్టుబడి అని వివరించింది. సిరీస్‌ ఏ కింద స్క్వేర్‌ ఎనిక్స్, రీజొన్‌ హోల్డింగ్స్, సోనీ గ్రూప్‌కి చెందిన సోనీ ఇన్నోవేషన్‌ ఫండ్‌ మొదలైనవి కూడా ఇన్వెస్ట్‌ చేసినట్లు పేర్కొంది.పార్థ్‌ చడ్ఢా, రాహుల్‌ సింగ్, నౌమాన్‌ ముల్లా ప్రారంభించిన స్టాన్‌.. దాదాపు 2.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. 2023లో హైదరాబాద్‌ ఏంజెల్స్‌ నెట్‌వర్క్‌ (హెచ్‌ఏఎన్‌) విభాగంగా ప్రారంభమైన హెచ్‌ఏఎఫ్‌ సుమారు రూ. 100 కోట్ల ఫండ్‌ ద్వారా ప్రారంభ దశలో, వృద్ధి దశలో ఉన్న అంకురాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఒక్కో స్టార్టప్‌లో రూ. 2–4 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. ప్రధానంగా అధిక వృద్ధి అవకాశాలు గల 10–15 సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించింది.

Rich Dad Poor Dad Robert Kiyosaki Warns Biggest Crash Urges to Buy gold silver4
‘క్రాష్‌ మొదలైంది.. బంగారం, వెండి కొనుగోలుకిదే సమయం’

పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై ఎప్పకప్పుడు వ్యాఖ్యానించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. "చరిత్రలో అతిపెద్ద క్రాష్" ప్రారంభమైందంటూ సోషల్ ప్లాట్ ఫామ్ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.2013లో తాను ప్రచురించిన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రొఫెసీని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం తాను అంచనా వేసిన ప్రపంచ మాంద్యం ఇప్పుడు బయటపడుతోందని, ఇది ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా యూరప్, ఆసియాను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతి ఉద్యోగాలను ఊడ్చేస్తుందని, ఇది జరిగితే వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ భారీ పతనం తప్పదని రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) నమ్ముతున్నారు.బంగారం, వెండి.. కొనాల్సిందిప్పుడే.. తన దీర్ఘకాల పెట్టుబడి అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తూ, కియోసాకి బంగారం (Gold), వెండి, బిట్ కాయిన్, ఎథేరియం హోల్డింగ్స్ ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన ఫాలోవర్లకు సూచించారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో వెండి కొనడం ఉత్తమం, సురక్షితమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్‌కు 50 డాలర్ల వద్ద ఉన్న వెండి (Silver Price) త్వరలో 70 డాలర్లకి పెరుగుతుందని, 2026 నాటికి అయితే 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇది చదివారా? బిట్‌కాయిన్‌ క్రాష్‌: కియోసాకి షాకింగ్‌ ప్రకటనధనవంతులవుతారు!"శుభవార్త ఏమిటంటే, లక్షలాది మంది తమ సంపదను పోగుట్టుకుంటున్నా... మీరు సిద్ధంగా ఉంటే... ఈ క్రాష్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది"అని కియోసాకి రాసుకొచ్చారు. ఈ క్రాష్‌ నుంచి సంపన్నులు అయ్యేందుకు మరిన్ని మార్గాలను రానున్న ట్వీట్‌లలో వివరిస్తానన్నారు.BIGGEST CRASH IN HISTORY STARTINGIn 2013 I published RICH DADs PROPHECY predicting the biggest crash in history was coming.Unfortunately that crash has arrived.It’s not just the US. Europe and Asia are crashing.AI will wipe out jobs and when jobs crash office and…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 23, 2025

adani bondada groups sign mou for five year partnership5
ప్రముఖ సంస్థలతో చేతులు కలిపిన హైదరాబాద్‌ కంపెనీలు

సౌర విద్యుత్‌ విభాగంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌)తో దీర్ఘకాలిక వ్యూహాత్మక డిజైన్, కన్‌స్ట్రక్షన్‌ భాగస్వామ్యానికి సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బొండాడ ఇంజినీరింగ్‌ (బీఈఎల్‌) తెలిపింది. ఇది అయిదేళ్ల పాటు అమల్లో ఉంటుందని వివరించింది.దీని కింద తొలుత 650 మెగావాట్ల సౌర విద్యుత్‌ పనులకు సంబంధించిన భారీ ప్రాజెక్టు లభించినట్లు సంస్థ పేర్కొంది. దేశ పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాల సాధన దిశగా ఇరు కంపెనీల భాగస్వామ్యం తోడ్పడుతుందని సంస్థ సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు తెలిపారు. మెట్రోకెమ్‌తో హెచ్‌ఆర్‌వీ ఫార్మా జట్టుఏపీఐ డెవలప్‌మెంట్, తయారీ సంస్థ మెట్రోకెమ్‌ ఏపీఐతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌కి చెందిన హెచ్‌ఆర్‌వీ గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ (హెచ్‌ఆర్‌వీ ఫార్మా) తెలిపింది. నియంత్రిత మార్కెట్ల కోసం పలు ఎన్‌సీఈ–1 (న్యూ కెమికల్‌ ఎంటిటీ), సంక్లిష్టమైన ఏపీఐలను వేగంగా అభివృద్ధి చేసేందుకు, తయారీ చేసేందుకు ఈ సీడీఎంవో (కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్, తయారీ) ఒప్పందం ఉపయోగపడుతుందని వివరించింది. దేశీయంగా తయారయ్యే వినూత్న ఆవిష్కరణలను అంతర్జాతీయంగా విస్తరించాలన్న లక్ష్యానికి ఇది సహాయకరంగా ఉంటుందని సీఈవో హరి కిరణ్‌ చేరెడ్డి తెలిపారు.

Vodafone Idea Strengthens Network in Sabarimala Route6
శబరిమలలో నెట్‌వర్క్‌ను పెంచిన వొడాఫోన్‌ ఐడియా

భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్‌ బ్యాండ్స్‌ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్‌ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్‌ టవర్‌లను ఏర్పాటు చేసింది.యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్‌డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్‌ బ్యాండ్స్‌కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్‌తో పాటు కేరళవ్యాప్తంగా 25 వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్‌ మొదలైన వాటిల్లో రిజిస్టర్‌ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్‌ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది.

Advertisement
Advertisement
Advertisement