Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Supreme Court Intervention Clears Uttarakhand Man Negative CIBIL Score1
తగ్గిన సిబిల్ స్కోర్.. సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తి

లోన్ తీసుకుని చెల్లించకపోవడం, క్రెడిట్ కార్డు బిల్స్ సరైన సమయంలో క్లియర్ చేసుకోక పోవడం వంటివి జరిగితే సిబిల్ స్కోర్ / క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం లేదా నెగటివ్‌లోకి వెళ్లడం జరిగే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ఎలాంటి లోన్ తీసుకోకపోయినా.. తన సిబిల్ స్కోర్ నెగటివ్‌గా చూపిస్తోందని కోర్టు మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వార్ అనే వ్యక్తి.. తాను 2020 నుంచి ఎలాంటి లోన్స్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ నెగటివ్‌గా చూపిస్తోందని, దీనివల్ల లోన్స్, క్రెడిట్ కార్డులు తీసుకోలేక పోతున్నాననే కారణంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. సంబంధిత బ్యాంకుల నుంచి వివరాలు కోరింది.కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత బ్యాంకులు రాజేంద్ర సింగ్ పన్వార్ లావాదేవీలు పరిశీలించి, తాను ఎలాంటి లోన్స్ తీసుకోలేదని నిర్దారించాయి. అయితే అతని సిబిల్ స్కోర్ నెగటివ్‌లోకి వెళ్లడానికి కారణం.. ఒకే పేరుతో ఉన్న ఇతర వ్యక్తులకు అదే పాన్‌ నంబర్ జారీ కావడం అని తెలిసింది. దీనివల్లనే స్కోర్ నెగటివ్‌గా చూపించిందని వివరణలో తెలుసుకున్నారు. బ్యాంకుల వివరణల తరువాత పన్వార్ సిబిల్ జారీచేసినట్లు సంబంధిత సంస్థలు స్పష్టం చేశాయి.సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్‌ స్కోర్‌ అంటారు.సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలు➤ క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.➤ లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది.➤ మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.➤ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.➤ సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు.ఇదీ చదవండి: డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?

Silver Prices Hit New Mark Sharp Movement Within Just a Week2
వెండి ధరలు కొత్త మార్క్.. కేవలం వారం రోజుల్లో!

బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో సిల్వర్ రేట్లలో కొంత మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.గత ఆదివారం అంటే.. మార్చి 29న కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ.2.50 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. శనివారం (ఏప్రిల్ 4) నాటికి రూ.2.55 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో ధర పెరుగుతూ.. తగ్గుతూ కొత్త మార్కుకు చేరిందన్నమాట. ఈ ధరలు గత నెలతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ఇదే ధరలు బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో మాత్రం వారం రోజుల్లో సిల్వర్ రేటు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు చేరింది. నిజానికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే రాజధాని నగరంలో కొంత తక్కువగానే ఉంటుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలుడిమాండ్ పెరగడం: వెండి నగలు (జ్యువెలరీ), ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశ్రమలలో వినియోగం పెరిగితే వెండి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి.సరఫరా తగ్గడం: గనుల్లో ఉత్పత్తి తగ్గడం లేదా సరఫరాలో అంతరాయం కలిగితే మార్కెట్‌లో వెండి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బును భద్ర పెట్టుబడులలో పెట్టాలని చూస్తారు. అప్పుడు వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతుంది.కరెన్సీ విలువ తగ్గడం: ముఖ్యంగా డాలర్ విలువ పడిపోతే, వెండి ధరలు పెరుగుతాయి.పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెండి వంటి ఆస్తులలో పెట్టుబడి పెడతారు.జియోపాలిటికల్ పరిస్థితులు: యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ప్రజలు సురక్షిత పెట్టుబడులను ఆశ్రయిస్తారు. కాబట్టి వెండి ధరలు పెరుగుతాయి.ప్రభుత్వ విధానాలు: దిగుమతి సుంకాలు, పన్నులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

The AI Shift How to Stay Relevant in a Changing Job Market3
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?

ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.AI సులభంగా చేసే పనులు➤డేటా ప్రాసెసింగ్➤ప్యాటర్న్ గుర్తింపు➤కంటెంట్ తయారీ➤నియమాల ప్రకారం పనిచేయడంవీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.AI చేయలేని పనులుAI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు➜హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు.

Oracle Layoffs Spark Outrage Amid Surge in H1B Hiring4
అందుకేనా 'ఒరాకిల్‌'లో ఉద్యోగుల తొలగింపు!

ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ వేలాది ఉద్యోగులను తొలగించిన విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన మరువకముందే.. కంపెనీ విదేశీ ఉద్యోగులను నియమించడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమైంది.యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు సంబంధించిన ఫెడరల్ డేటా ప్రకారం.. ఒరాకిల్ 2025-26 ఆర్థిక సంవత్సరాలలో H-1B కార్మికులను నియమించుకోవడానికి సుమారు 3,126 పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో 2026లో మాత్రమే 436 దరఖాస్తులు ఉన్నాయి.టెక్నాలజీ, రక్షణ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ ఉద్యోగులను కంపెనీ నియమించుకోవచ్చు. అయితే... అంతకంటే ముందు సంస్థలో అదే నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేరని సంస్థ నిరూపించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఒరాకిల్ భారీ లేఆఫ్స్ చేపట్టిందని చెబుతున్నారు.ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చాలామంది ఉద్యోగులు అకస్మాత్తుగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ పంపిన ఈమెయిల్‌లో సంస్థ అవసరాల దృష్ట్యా మీ ఉద్యోగాన్ని రద్దు చేస్తున్నామని తెలియజేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారికి కొంతమేర పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఒరాకిల్ కంపెనీ కంటే ముందు.. అమెజాన్ కూడా 16000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో 2675 H-1B పిటిషన్లు దాఖలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఇది పెద్ద కంపెనీలు అనుసరిస్తున్న ఒక సాధారణ ధోరణిగా కనిపిస్తోంది. దీనిని అమెరికాలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ ఉద్యోగులను ఎక్కువగా నియమించడం వల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతున్నాయని వారు భావిస్తున్నారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?

Myntra CEO Nandita Sinha to Leave5
మింత్రా సీఈఓ రాజీనామా!

ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ 'మింత్రా' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నందితా సిన్హా రాజీనామా చేయనున్నారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించేందుకు కంపెనీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో ఒక అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.దాదాపు 13 సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో అసోసియేట్ డైరెక్టర్‌గా చేరిన నందితా సిన్హా.. ఆ తరువాత కాలంలో ఫర్నీచర్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, హెల్త్ అండ్ బ్యూటీ వంటి టీమ్స్‌లో పనిచేశారు. మీషోను 2014లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన తరువాత.. 2022లో నందితా దానికి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈమె రాజీనామా చేయడానికి కారణం ఏమిటనే విషయం వెల్లడికాలేదు.ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఐపీఓకు వెళ్లడానికి ముందే తన పదవి నుంచి నందితా సిన్హా వైదొలగనున్నారు. తరువాత.. షారన్ పైస్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.ఎవరీ షారన్ పైస్?షారన్ పైస్ గతంలో మింత్రాలో లీడర్‌షిప్ బాధ్యతలు చేపట్టారు. దదాపు నాలుగు సంవత్సరాలు కంపెనీలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా పనిచేశారు. అంతే కాకుండా గత ఏడేళ్ల కాలంలో ఆయన సంస్థలో వివిధ పదవులలో కొనసాగారు. కంపెనీలో చేరడానికి కంటే ముందు.. అంటే 2014లో ప్రాక్టర్, గాంబుల్‌లో మేనేజర్ పదవుల్లో పనిచేశారు.

Maruti Suzuki 8000 Service Touchpoints At 2030 316
కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మారుతీ సుజుకీ టార్గెట్!

కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ సర్వీస్ నెట్‌వర్క్‌ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 502 సర్వీస్ టచ్‌పాయింట్స్‌ని ఏర్పాటు చేసింది. ఇవి ఎరీనా, నెక్సా వర్క్‌షాప్స్, మారుతీ సుజుకీ సేల్స్‌ అండ్‌ సర్వీస్ పాయింట్స్, సర్వీస్–ఆన్‌–వీల్స్, బాడీషాప్‌–ఆన్‌–వీల్స్‌ ఫార్మాట్లలో ఉన్నాయి.ప్రస్తుతం 5,926గా ఉన్న టచ్‌పాయింట్స్‌ని 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి 8,000కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ హిసాషి టకెయుచి తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే తమకు అవసరమైనప్పుడు స్పేర్‌ పార్ట్స్, సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయనేది కస్టమర్లకు ఒక భరోసాకల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే తమ నెట్‌వర్క్‌ని తీర్చిదిద్దుకుంటున్నట్లు వివరించారు.ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని కొత్త తయారీ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచుకునేందుకు రూ. 10,189 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ గత నెలలో వెల్లడించింది. 2030–31 నాటికి 40 లక్షల వార్షికోత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించుకుంది.

Advertisement
Advertisement
Advertisement