Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Centre Accelerates Green Port Initiative to Modernize Maritime Infrastructure1
గ్రీన్‌ పోర్ట్‌ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పర్యావరణహిత పోర్టుల (గ్రీన్‌ పోర్ట్‌లు) అభివృద్ధి, సముద్ర మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, వాటర్‌వేస్‌ శాఖ తెలిపింది. ’మారిటైమ్‌ ఇండియా విజన్‌ –2030’, ’హరిత సాగర్‌’ మార్గదర్శకాల కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.గ్రీన్‌ టగ్‌ ట్రాన్సిషన్‌ ప్రోగ్రాం ద్వారా డీజిల్‌ టగ్‌ల స్థానంలో ఎలక్ట్రిక్‌ / హైబ్రిడ్‌ టగ్‌ల వినియోగం, పోర్టుల్లో పునరుత్పాదక శక్తి వినియోగం పెంపు, పోర్ట్‌ పరికరాలు, వాహనాలు, రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ, జీరో ఎమిషన్‌ ట్రక్కుల వినియోగం, నౌకలకు తీర ప్రాంతం నుంచే విద్యుత్‌ సరఫరా చేసే ‘‘వన్‌షోర్‌ పవర్‌ సప్‌లై’’ వ్యవస్థలు’ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.అలాగే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లుగా ‘దీన్‌దయాల్‌ పోర్ట్‌ అథారిటీ, పారాదీప్‌ పోర్ట్‌ అథారిటీ, వీ.ఓ.చిదంబరనార్‌ పోర్ట్‌ అథారిటీ’లను నూతన, పునరుత్పాదక శక్తి శాఖ గుర్తించినట్లు వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023–24, 2024–25) ప్రధాన పోర్టుల అభివృద్ధికి సుమారు 180 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది.వీటిలో ప్రధానంగా ‘పోర్టుల ఆధునీకరణ, తీర ప్రాంత రవాణా (కోస్టల్‌ షిప్పింగ్‌) అభివృద్ధి, గ్రీన్‌ పోర్టుల రూపకల్పన’ ఉన్నాయి. 2030 నాటికి ‘60% పైగా పునరుత్పాదక శక్తి వినియోగం, 50% పోర్ట్‌ పరికరాల విద్యుదీకరణ, 20% గ్రీన్‌ బెల్ట్‌ విస్తీర్ణం, కర్బన ఉద్గారాల్లో 30% తగ్గింపు (టన్ను కార్గోకు), నీటి వినియోగం 20% తగ్గింపు’ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.

construction-costs-india-2026-telugu-states-analysis-​house-construction-tips2
ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు!

సొంతిల్లు అనేది ప్రతిఒక్కరికీ జీవిత కల. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆ కలను సాకారం చేసుకోవడంలో సవాలుగా మారుతున్నాయి. 2026 తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా నిర్మాణ ఖర్చులు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో..దేశంలో నిర్మాణ ఖర్చులు ఎక్కడ తక్కువ?భారతదేశంలో నిర్మాణ ఖర్చులు భౌగోళిక ప్రాంతం, రవాణా సౌకర్యాలు, కూలీల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అత్యంత సరసమైన ధరల్లో నిర్మాణాలు జరుగుతున్న నగరాలు ఇవే..అహ్మదాబాద్ (గుజరాత్): దేశంలోనే అత్యంత చౌకగా ఇల్లు నిర్మించుకోగలిగే నగరం ఇది. ఇక్కడ చదరపు అడుగుకి సగటున రూ.1,200 – రూ.1,600 ఖర్చు అవుతోంది.జైపూర్ (రాజస్థాన్): ఇక్కడ చదరపు అడుగుకి రూ.1,500 – రూ.2,200 మధ్య ధరలు ఉన్నాయి.విజయవాడ (ఆంధ్రప్రదేశ్): పెరుగుతున్న నగరమైనప్పటికీ, మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా (చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,200) నమోదవుతున్నాయి.కోల్‌కతా: మెట్రో నగరాల్లో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోగలిగే చోటుగా కోల్‌కతా నిలుస్తోంది (సుమారు రూ.1,500 – రూ.2,500).మరోవైపు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ ఖర్చు చదరపు అడుగుకి రూ.2,500 నుంచి రూ.5,000 పైమాటే.తెలుగు రాష్ట్రాల పరిస్థితితెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లలో నిర్మాణ ఖర్చులు 10-15% పెరిగాయి. ముఖ్యంగా కూలీల కొరత, రవాణా ఛార్జీలు పెరగడం దీనికి ప్రధాన కారణం. హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణానికి బేసిక్ క్వాలిటీలో ఒక చదరపు అడుగుకు రూ.1,700 – రూ.2,000, స్టాండర్డ్ క్వాలిటీ అయితే రూ.2,100 – రూ.2,500 ఖర్చవుతోంది. అదే ప్రీమియం/లగ్జరీ అయితే ఒక ఎస్‌ఎఫ్‌టీకి రూ.2,600 – రూ.3,800 ఖర్చు పెట్టాల్సి వస్తోంది.హైదరాబాద్ శివార్లలో (ఉదా: షాద్‌నగర్, ఆదిబట్ల) నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా ఉండగా, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో కూలీల రేట్లు అధికంగా ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో సగటున చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,300 ఖర్చు అవుతోంది. విశాఖపట్నం వంటి నగరాల్లో స్టీల్, సిమెంట్ రవాణా సౌకర్యం వల్ల మెటీరియల్ ధరలు ఇతర ప్రాంతాల కంటే స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.సగటు నిర్మాణ సామగ్రి ధరలు 2026 అంచనా ధరల ప్రకారం.. నిర్మాణ వ్యయంలో దాదాపు 60-70% ఖర్చు మెటీరియల్‌కే అవుతుంది. ప్రస్తుత మార్కెట్ రేట్లు ఇలా ఉన్నాయి..సామగ్రిసగటు ధరసిమెంట్ (50kg బ్యాగ్)₹350 – ₹450స్టీల్ (TMT Bars - టన్ను)₹60,000 – ₹75,000ఇసుక (రివర్ సాండ్ - టన్ను)₹1,200 – ₹2,500 (లభ్యతను బట్టి)ఎం-సాండ్ (M-Sand - టన్ను)₹900 – ₹1,500ఇటుకలు (ఒక్కోటి)₹7 – ₹12సిమెంట్ ఇటుకలు/బ్లాక్స్₹30 – ₹502026 బడ్జెట్‌లో సిమెంట్ పై జీఎస్టీని (GST) 28% నుంచి 18 శాతానికి, స్టీల్ పై 18% నుంచి 12శాతానికి తగ్గించడం వల్ల సామాన్యులకు కొంత ఊరట లభించింది.ఖర్చును ఎలా తగ్గించుకోవాలి?స్థానిక మెటీరియల్: రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి స్థానికంగా లభించే ఇటుకలు, కంకర వాడటం ఉత్తమం.ప్లానింగ్:నిర్మాణ సమయంలో ప్లాన్ మార్పులు చేయకుండా ముందుగానే పక్కాగా సిద్ధమవ్వాలి.టెక్నాలజీ: ప్రస్తుత కాలంలో ఏఏసీ బ్లాక్స్ వాడకం వల్ల ప్లాస్టరింగ్ ఖర్చు, సిమెంట్ వినియోగం తగ్గుతుంది.ఇదీ చదవండి: సిటీ రియల్‌ ఎస్టేట్‌కు గేమ్‌ ఛేంజర్‌!

Vivo Expands 5G Lineup in India with Launch of Y21 and Y113
వివో నుంచి రెండు కొత్త ఫోన్లు

న్యూఢిల్లీ: వివో ఇండియా కొత్తగా రెండు 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ని ఆవిష్కరించింది. వై21, వై11 వీటిలో ఉన్నా యి. వై 21 5జీ ధర రూ. 18,999 నుంచి, వై11 5జీ రేటు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. నిర్దిష్ట బ్యాంక్‌ కార్డులతో వై21పై రూ. 1,500 వరకు, వై11పై రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంటుంది.రెండు డివైజ్‌లలో 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీలు, 6.74 అంగుళాల స్క్రీన్లు, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్లు, ఆరిజిన్‌ ఓఎస్‌6 ఆపరేటింగ్‌ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వై21లో 50 ఎంపీ రియర్‌ కెమెరా, వై11లో 13 ఎంపీ రియర్‌ కెమెరా ఉంటాయి. వివో ఇండియా ఈ–స్టోర్, ఈకామర్స్‌ ప్లాట్‌ఫాంలు, పార్ట్‌నర్‌ రిటైల్‌ స్టోర్స్‌లో ఇవి లభిస్తాయి.

LGE India Partners with Hinduja and Sunsure for Solar Power Transition4
పునరుత్పాదక విద్యుత్‌పై ఎల్‌జీఈ ఇండియా ఫోకస్‌

న్యూఢిల్లీ: కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీఈ ఇండియా తమ తయారీ ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలతో దీర్ఘకాలిక సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంది. తమ పుణె ప్లాంటుకు 9.89 మెగావాట్స్‌ పీక్‌ (ఎండబ్ల్యూపీ) సోలార్‌ పవర్‌ కోసం హిందుజా రెన్యువబుల్స్‌ ఎనర్జీతో, అలాగే గ్రేటర్‌ నోయిడా ప్లాంటుకి సంబంధించి 11 ఎండబ్ల్యూపీ కోసం సన్‌ష్యూర్‌ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతో మొత్తం మీద ఏటా 50,000 గృహాల అవసరాలకు సరిపడేంతగా 3.2 కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్‌ జనరేట్‌ అవుతుందని సంస్థ వివరించింది.

Samsung Leads Indian Tablet PC Market Premium Segment Sees 7x Growth5
ట్యాబ్లెట్‌ పీసీల్లో శాంసంగ్‌ టాప్‌..

ముంబై: భారత ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌ 2025లో వార్షిక ప్రాతిపదికన 2% వృద్ధి సాధించింది. ముఖ్యంగా శాంసంగ్‌ 31% మార్కెట్‌ వాటాతో తొలి స్థానంలో నిలవగా.. యాపిల్‌ 20% వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లెనోవో (15%) మూడో స్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.‘‘ప్రముఖ బ్రాండ్లు చేపట్టిన వ్యూహాత్మక ఉత్పత్తి నవీకరణల కారణంగా భారత ట్యాబ్లెట్‌ మార్కెట్‌లో ప్రీమియం వైపు స్పష్టమైన మార్పు కనిపించింది. రూ.30,000–రూ.40,000 ధర విభాగం అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్‌గా మారింది. ఈ విభాగంలో షిప్‌మెంట్‌లు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇది అత్యాధునిక పనితీరు గల డివైస్‌లపై కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తి సూచిస్తుంది.’’ అని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రధాన అనలిస్ట్‌ అన్షికా జైన్‌ తెలిపారు. కొనసాగిన శాంసంగ్‌ హవా: భారత్‌ ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌లో గతేడాది కూడా శాంసంగ్‌ అగ్రస్థానంలోనే కొనసాగింది. ట్యాబ్లెట్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో మార్కెట్‌ వాటా 2024లో 27% నుంచి 2025లో 31 శాతానికి పెరిగింది. గెలాక్సీ ట్యాబ్‌ ఏ9 సిరీస్‌కు మంచి డిమాండ్‌ నెలకొనడం, తరువాత ఏ11 సిరీస్‌ ప్రవేశంతో వృద్ధి కొనసాగింది. రూ.15,000–రూ.30,000 విభాగంలో శాంసంగ్‌ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అలాగే గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌ సిరీస్‌ ద్వారా ప్రీమియం విభాగంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. యాపిల్‌ వాటా స్వల్ప తగ్గుదల: మార్కెట్‌ వాటా స్వల్పంగా రెండు శాతం క్షీణించినప్పటికీ యాపిల్‌ మొత్తం మీద 20 శాతం వాటాతో శాంసంగ్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. రూ.30,000– రూ.40,000 ధర విభాగంలో ఐప్యాడ్‌ (2025) 128జీబీ మోడల్‌కు మంచి డిమాండ్‌ ఉండటం గమనార్హం. ఐప్యాడ్‌ ప్రో సిరీస్‌లో ఓఎల్‌ఈడీ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రీమియం సెగ్మెంట్‌లో కంపెనీ స్థానం బలపడింది. లెనోవో 24% సప్లై వృద్ధితో 15 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోగా, షియోమీ 74% షిప్‌మెంట్‌ పెరు గుదలతో 11% మార్కెట్‌ వాటాను సాధించింది. మరోవైపు, ఏసర్‌ సప్లైలు 50% క్షీణించడంతో మార్కెట్‌ వాటా 2024లోని 21% నుంచి 2025లో 10 శాతానికి దిగివచి్చంది. ఎగుమతులు–తయారీ రంగాల్లో పురోగతి: 2025లో ట్యాబ్లెట్‌ ఎగుమతులు ఒక మిలియన్‌ యూనిట్లను దాటాయి. శాంసంగ్, లెనోవో ఆధ్వర్యంలో అమెరికా, యూరప్‌ మార్కెట్లకు సరఫరాలు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి మొత్తం షిప్‌మెంట్‌లో 50 శాతానికి చేరడం లోకలైజేషన్‌ వేగాన్ని సూచిస్తోంది. దీంతో భారత్‌ గ్లోబల్‌ ట్యాబ్లెట్‌ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.2026లో వృద్ధి అంచనాలు: బలమైన డిమాండ్‌ ఆధారంగా 2026లో మార్కెట్‌ మరింత వృద్ధి చెందనుందని అంచనా. మెమరీ ధరలు ఖర్చులు, లాభాలపై ప్రభావం చూపినా..., అధిక కాని్ఫగరేషన్‌లు, ప్రొడక్టివిటీ డివైజ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ వృద్ధికి దోహదం చేస్తాయి. లోకలైజేషన్, సరఫరా డైవర్సిఫికేషన్‌తో ఎగుమతులు కీలకంగా మారనున్నాయి. ఏఐ ఆధారిత టాబ్లెట్లు, డివైస్‌లోనే పనిచేసే ఏఐ ఫీచర్లు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, మార్కెట్‌ విస్తరణకు తదుపరి దశకు పునాది వేస్తాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది.

Paytm is dominant leader in Indian merchant payments6
మర్చంట్‌ చెల్లింపుల్లో పేటీఎం ఫస్ట్‌

న్యూఢిల్లీ: మర్చంట్‌ చెల్లింపుల్లో పేటీఎం ప్లాట్‌ఫామ్‌ దూసుకుపోతోంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ వ్యాపార వృద్ధిలో ఈ విభాగం కీలకంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ పేర్కొంది. కంపెనీకి ‘బై’ (కొనుగోలు) రేటింగ్‌ ఇస్తూ రూ.1,350 లక్ష్యాన్ని ప్రకటించింది. 2025–26 నుంచి 2027–28 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం ఏటా 22 % చొప్పున వృద్ధి చెందుతుందని (సీఏజీఆర్‌) అంచనా వేసింది. ఈ కాలంలో ఎబిట్డా మార్జిన్లు పెరుగుతాయని పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మర్చంట్‌ చెల్లింపుల్లో అతిపెద్ద సంస్థగా పేటీఎం ఎదుగుతున్నట్టు వివరించింది.అధిక చెల్లింపుల లావాదేవీలతోపాటు, వేగంగా రుణా ల మంజూరును ప్రస్తావించింది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై 4.5 కోట్ల వర్తకులు ఉన్నారని, డివైజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పెరుగుతున్న కొద్దీ పేటీఎం ఆదాయాలు మెరుగుపడనున్నట్టు జెఫరీస్‌ తన నివేదికలో పేర్కొంది. చెల్లింపుల గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ) ఏటా 23% చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2026 మార్చి నాటికి ఇది రూ.24 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. పేటీఎం మర్చంట్‌ లెండింగ్‌ (వర్తకులకు రుణాల మంజూరు) అన్నది రిటైల్‌ రుణాలను మించినట్టు తెలిపింది.యూపీఐ ద్వారా రుణ వితరణకు ఉన్న దీర్ఘకాల వృద్ధి అవకాశాలనూ ప్రస్తావించింది. ఆర్థిక సేవల ఆదాయం ఏటా 28 శాతం చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.12,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2028 మార్చి నాటికి రూ.1,700 కోట్ల నికర లాభాన్ని పేటీఎం ప్రకటించొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.574 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.

Advertisement
Advertisement
Advertisement