Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold rallies Rs 1300 to Rs 132900 per 10 grams1
పసిడి రూ. 1,300 అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్‌ గోల్డ్‌ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది.

 Bank Of Baroda Cut Repo-Linked Interest Rate and Others To Follow Suit2
రేట్ల తగ్గింపు బాటలో బ్యాంకులు

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ రేట్లను తగ్గించడంతో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించే పనిలో పడ్డాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) రెపో ఆధారిత రుణ రేటును 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది.అటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా తమ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌బీఎల్‌ఆర్‌)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ఇటీవలే ఏడాది కాలవ్యవధికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ని (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు) 5 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేసి 8.80 శాతానికి తగ్గించింది.

RBI Cuts Repo Rate by 25 bps to 5. 25 Percent3
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్‌

అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను తగ్గించింది. ఆరు నెలల తదుపరి పావు శాతం కోత పెట్టడంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. యూఎస్‌ టారిఫ్‌ల సవాళ్ల నేపథ్యంలో ఎకానమీకి జోష్‌నిస్తూ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీసింది. వివరాలు చూద్దాం..ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా మొగ్గు చూపింది. ఫలితంగా రెపో రేటులో 0.25 శాతం కోత పడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో తాజాగా 5.25 శాతానికి క్షీణించింది. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత దిగివచ్చేందుకు దారి ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల కొద్ది నెలలుగా యూఎస్‌ వాణిజ్య టారిఫ్‌లతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నునిస్తూ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం ఎంపీసీ వెసులుబాటు కల్పించింది. తాజా పరపతి సమీక్షలో తటస్థ విధానాలు అవలంబించడం ద్వారా భవిష్యత్‌లోనూ రేట్ల కోతకు వీలున్నట్లు సంకేతాలిచి్చంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్‌బీఐ నాలుగుసార్లు కోత విధించడం ద్వారా రెపో రేటును 5.25 శాతానికి చేర్చింది. అంటే 2025 ఫిబ్రవరి నుంచి 1.25 శాతంమేర దిగివచి్చంది. ప్రభుత్వ ప్రోత్సాహానికితోడుగా.. ఇప్పటికే యూఎస్‌ టారిఫ్‌లతో దేశీ ఎగుమతులు నీరసించగా.. వాణిజ్య లోటు పెరిగింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లకు చెక్‌ పెట్టే బాటలో మరింత లిక్విడిటీ ద్వారా రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్‌బీఐ సంకల్పించింది. తద్వారా సమర్థవంత ఆర్థిక పురోగతికి అండగా నిలిచే నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పటికే మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్‌టీ రేట్లలో సంస్కరణలు, కారి్మక చట్టాలు, ఫైనాన్షియల్‌ రంగ నిబంధనల సరళీకరణ ద్వారా జీడీపీకి జోష్‌నిచ్చే చర్యలను చేపట్టింది. వెరసి ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆర్‌బీఐ నిర్ణయాలు జత కలవనున్నాయి. రూ. లక్ష కోట్లు ఇలా ఓపెన్‌ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ తాజా పాలసీలో పేర్కొంది. రెండు దశలలో అంటే ఈ నెల 11న రూ. 50,000 కోట్లు, 18న మరో రూ. 50,000 కోట్లు విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దన్నుగా ఈ నెల 16కల్లా 5 బిలియన్‌ డాలర్ల విలువైన మూడేళ్ల డాలర్‌–రూపీ కొనుగోళ్లు–అమ్మకాల స్వాప్‌ను చేపట్టనుంది. సీజనల్‌గా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎదుర్కొంటున్న లిక్విడటీ సమస్యలకు ఈ చర్యలు పరిష్కారం చూపనున్నట్లు ఆర్‌బీఐ తెలియజేసింది. రూపాయిపై కల్పించుకోం..ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కదలికలపై ఎలాంటి ధరల శ్రేణినీ లక్ష్యంగా పెట్టబోమని మల్హోత్రా తెలియజేశారు. దేశీ కరెన్సీ దిద్దుబాటును అడ్డుకోబోమని స్పష్టం చేశారు. రూపాయికి సరైనస్థాయిని మార్కెట్టే నిర్ణయిస్తుందని తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి 90కు పతనమైన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.బ్యాలన్స్‌చేస్తూ ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. మరోపక్క అక్టోబర్‌ నుంచి ద్రవ్యోల్బణం భారీగా క్షీణిస్తోంది. దీంతో లక్ష్యానికంటే దిగువకు ధరలు జారుతున్నాయి. వెరసి వృద్ధి– ధరల సమతౌల్యానికి చర్యలు తీసుకుంటున్నాం. వృద్ధి పరిస్థితులను కొనసాగించేందుకు వీలుగా పాలసీ నిర్ణ యాలతో మద్దతిస్తున్నాం. బయటినుంచి సవాళ్లు ఎదు రవుతున్న నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తావించదగ్గస్థాయిలో నిలకడను చూపుతూ వృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. ధరలు వెనకడుగు వేయడంతో వృద్ధికి వీలైన చర్యలు తీసుకునేందుకు వీలు చిక్కుతోంది. – సంజయ్‌ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌ఈఎంఐలు తగ్గనున్నాయ్‌ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్‌బీఐ నాలుగుసార్లు కీలక వడ్డీ రేటును తగ్గించింది. దీంతో రెపో రేటు 1.25 శాతంమేర దిగివచి్చంది. ఇప్పటికే 1 శాతంవరకూ రెపో తగ్గడంతో ప్రధానంగా గృహ రుణ వినియోగదారులకు భారీగా కలసిరానుంది. ప్రామాణిక రుణ వడ్డీ రేటు(ఈబీఎల్‌ఆర్‌) ఆధారిత గృహ రుణాలపై ఈఎంఐ మొత్తం తగ్గనుంది. ఇప్పటికే గృహ రుణ రేట్లు సుమారుగా 9 శాతం నుంచి 7.5 శాతంవరకూ దిగివచ్చాయి. ఇదేస్థాయిలో రేట్లు కొనసాగితే ఉదాహరణకు రూ. 50 లక్షల రుణంపై రూ. 9 లక్షలవరకూ ఆదాకానున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేశాయి. 20 ఏళ్లకాలానికి 8.5 శాతం వడ్డీ రేటులో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకుంటే నెలకు రూ. 43,400 చొప్పున ఈఎంఐ చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే తాజా తగ్గింపు పూర్తిగా వర్తిస్తే అంటే 7.25 శాతానికి రుణ రేటులో కోతపడితే ఈఎంఐ చెల్లింపులో దాదాపు మరో రూ. 4,000 తగ్గే వీలుంది. ఇలాకాకుండా రూ. 43,400 చొప్పున చెల్లింపులు కొనసాగిస్తే.. 3 ఏళ్లకుపైగా వాయిదాల మొత్తం తగ్గవచ్చని అభిప్రాయపడ్డాయి.కార్పొరేట్లు సైతం ఖుషీరెపో రేటు దిగిరావడంతో వ్యక్తిగత రుణాలతోపాటు.. కార్పొరేట్‌ రంగానికీ లబ్ధి చేకూరనుంది. ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు రెపో. వెరసి రెపో తగ్గడంతో బ్యాంకులు ఆమేర తమ కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపును బదిలీ చేయవలసి ఉంటుంది. ఇది ఎంసీఎల్‌ఆర్, బేస్‌ రేటు తదితరాల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత, వాహన, గృహ, బిజినెస్‌ రుణాలన్నిటికీ వర్తించనుంది. వెరసి రుణాలు మరింత చౌకకానున్నాయి. ఇది రుణాలకు డిమాండ్‌ను పెంచడంతో వినియోగం ఊపందుకునే వీలుంది. ఇది ఇండ్రస్టియల్, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్, రియల్టీ రంగాల అమ్మకాలలో వృద్ధికి దారి చూపుతుందని, ఫలితంగా ఉపాధి కల్పన సైతం మెరుగుపడే వీలున్నదని ఆర్థికవేత్తలు వివరించారు. ఆటో రంగ జోరు వడ్డీ రేటు కోత ఇటీవల ఆటో రంగ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది. జీఎస్‌టీ సంస్కరణలతో వడ్డీ రేట్ల తగ్గింపు జత కలవడం ఇందుకు తోడ్పాటునిస్తుంది. అందుబాటులో రుణాలతో వినియోగం బలపడుతుంది. – శైలేష్‌ చంద్ర, ఆటో పరిశ్రమల అసోసియేషన్‌(సియామ్‌) ప్రెసిడెంట్‌ కొత్తవాళ్లకు పుష్‌ గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు మరింతమంది ప్రజలు సొంత ఇళ్లవైపు ఆలోచించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతవరకూ నిర్ణయం తీసుకోని వ్యక్తులు, కుటుంబాలు గృహ కొనుగోలుకి ముందడుగు వేసే వీలుంది. – రియల్టీ రంగ సమాఖ్యలు క్రెడాయ్, ఎన్‌ఏఆర్‌ఈడీసీవో(నరెడ్కో)లక్ష్యాలివీ ఈ ఏడాదికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఆర్‌బీఐ తాజాగా 2.6% నుంచి 2 శాతానికి కుదించింది. మరోపక్క జీడీపీ వృద్ధిపై గత అంచనా 6.8 శాతాన్ని 7.3 శాతానికి మెరుగుపరచింది. అరుదుగా ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పరిమితంకావడం.. దేశ జీడీపీ 8 శాతం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ఇలా అరుదుగా జరుగుతుందని తెలియజేశారు.

Geoffrey Hinton Godfather of AI praised Google recent advances ai4
ఓపెన్‌ఏఐని మించిపోనున్న గూగుల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్‌ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్‌ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్‌ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్‌ ఓపెన్‌ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్‌లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్‌లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్‌బాట్‌లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్‌ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం

Union Minister Nitin Gadkari showcased India first flex fuel car know details5
సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం

దేశ రాజధాని న్యూఢిల్లీలో 100 శాతం ఇథనాల్‌తో నడిచే పర్యావరణ అనుకూల ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ‍ప్రకటన చేశారు. ఈ సాంకేతికత భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కాలుష్యం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు, ఇంధన దిగుమతుల కోత.. వంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ‘ఈ కారు పూర్తిగా 100 శాతం ఇథనాల్‌పై నడుస్తుంది. ఇది పెట్రోల్ కంటే ఆర్థికంగా చాలా భరోసానిస్తుంది. ఇథనాల్ లీటరు ధర సుమారు రూ.65 ఉండగా, పెట్రోల్ ధర రూ.110గా వద్ద ఉంది’ అని తెలిపారు. తాను ప్రదర్శించిన కారు 60 శాతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని, తద్వారా వాస్తవ ఇంధన ఖర్చు లీటరుకు కేవలం రూ.25 మాత్రమే అవుతుందని చెప్పారు. ‘ఇది సరసమైనదైతేనే ప్రజలు ఇథనాల్‌ను కొనుగోలు చేస్తారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.రైతులకు లాభం, దేశానికి స్వయం సమృద్ధివ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని మంత్రి గుర్తు చేశారు. దీనివల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘విరిగిన బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, గడ్డి.. ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పూర్తిగా గ్రీన్‌ ఎనర్జీ, జీరో పొల్యూషన్‌’ అని గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని ‘వాహనాల్లో ఇథనాల్‌ వాడితే మన రైతులే లాభపడతారు. శిలాజ ఇంధనాల దిగుమతి ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. గ్రామీణ ఉపాధి పెరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.🚨 "Government-backed studies show no significant performance issues or component damage from using 20% ethanol-blended petrol"- Minister Nitin Gadkari. pic.twitter.com/kZdnmGC5Zl— Indian Tech & Infra (@IndianTechGuide) December 5, 2025ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. దేశంలో దాదాపు 550 ఇథనాల్ డిస్టిలరీలు పనిచేస్తున్నాయని, ఇండియన్ ఆయిల్ ఒక్కటే సుమారు 400 ఇథనాల్ పంపులను నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు.

Cloudflare down: Full list of websites impacted by global outage6
ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్తంభించిన‌ ప‌లు వెబ్‌సైట్‌లు

అమెరికన్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు వెబ్‌సైట్‌లు స్తంభించాయి. క్లౌడ్‌ఫ్లేర్ వినియోగదారులు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. భార‌త దేశానికి చెందిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లైన జెరోధా, గ్రో వెబ్‌సైట్లు కూడా ప‌నిచేయ‌లేదు. వీటితో పాటు కాన్వా, జూమ్, షాపిఫై, వాలరెంట్, లింక్డ్ఇన్, డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ల కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి.క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల్లో అంత‌రాయం కార‌ణంగా తాము సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నామ‌ని పేర్కొంటూ గ్రో (Groww) సంస్థ ఎక్స్ ద్వారా వెల్ల‌డించింది. “క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కారణంగా మేము ప్రస్తుతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా బహుళ యాప్‌లు, సేవలను ప్రభావితం చేస్తోంది. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. సేవలు పునరుద్ధరించబడిన వెంట‌నే మీకు తెలియ‌జేస్తాం. మీ స‌హ‌నానికి ధన్యవాదాలు,” అని ట్వీట్ చేసింది. త‌ర్వాత ప‌ది నిమిషాల‌కు త‌మ సేవ‌లను పున‌రుద్ధరించిన‌ట్టు ఎక్స్‌లో మ‌రో పోస్ట్ పెట్టింది.అసౌక‌ర్యానికి చింతిస్తున్నాంక్లౌడ్‌ఫ్లేర్‌లో క్రాస్-ప్లాట్‌ఫారమ్ డౌన్‌టైమ్ కారణంగా కైట్ యాప్‌ సేవ‌లు నిలిచిపోయాయ‌ని జెరోధా పేర్కొంది. ట్రేడింగ్ కోసం కైట్ వాట్సాప్ బ్యాకప్‌ను ఉపయోగించుకోవాల‌ని త‌మ వినియోగ‌దారుల‌కు ఎక్స్ ద్వారా సూచించింది. స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని, కైట్ యాప్‌ సేవలు పునరుద్ధరించబడ్డాయని కొంత సేప‌టి త‌ర్వాత ప్ర‌క‌టించింది. వినియోగ‌దారుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్టు తెలిపింది. జెరోధా కైట్ అనేది ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్, యాప్.క్లౌడ్‌ఫ్లేర్ ఏం చేస్తుంది?అమెరికా కేంద్రంగా ప‌నిచేస్తున్న క్లౌడ్‌ఫ్లేర్ అతిపెద్ద ఇంటర్నెట్ (Internet) నిర్వ‌హ‌ణ‌ కంపెనీల్లో ఒక‌టి. ఇంటర్నెట్‌కు సంబంధించిన అనేక ర‌కాల సేవ‌ల‌ను అందిస్తోంది. వెబ్‌సైట్‌లు, యాప్‌లు, నెట్‌వర్క్‌లను వేగంగా, సురక్షితంగా ఉంచ‌డానికి అవ‌స‌ర‌మైన స‌ర్వీసులు ఇస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 125 దేశాలల్లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న క్లౌడ్‌ఫ్లేర్‌కు 3 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. ఒక త్రైమాసికంలో దాదాపు $500 మిలియన్లను ఆర్జిస్తుంద‌ని ద గార్డియ‌న్ వెల్ల‌డించింది.చ‌ద‌వండి: ఇండిగో సంక్షోభానికి కార‌ణాలు ఇవేనా..కార‌ణాలు అన్వేషిస్తున్నాంసేవ‌ల్లో అంత‌రాయానికి గ‌ల కార‌ణాల‌ను క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) వెల్ల‌డించ‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ త‌మ వినియోగ‌దారుల వెబ్‌సైట్లు స్తంభించ‌డంతో స‌మ‌స్య‌ను వెంటనే ప‌రిష్క‌రించామ‌ని ప్ర‌క‌టించింది. స‌మ‌స్య‌ త‌లెత్త‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని వెల్ల‌డించింది. న‌వంబ‌ర్ 18న కూడా క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. దీంతో చాట్‌జీపీటీ, స్పాటిఫై, ఎక్స్ వెబ్‌సైట్లు స్తంభించాయి.త‌మ‌ డేటాబేస్‌లో చేసిన మార్పు వల్ల ఇది సంభవించిందని సీఈవో మాథ్యూ ప్రిన్స్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement