ప్రధాన వార్తలు
సేమ్ ప్రాబ్లమ్: మొన్న మారుతి సుజుకి.. నేడు టయోటా!
మారుతి సుజుకి తన గ్రాండ్ విటారా కారుకు ఫ్యూయెల్ గేజ్ కారణంగా రీకాల్ ప్రకటించిన తరువాత.. టాయోటా కూడా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్కు రీకాల్ జారీ చేసింది. ఈ కారుకు రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం కూడా ఫ్యూయెల్ గేజ్ సమస్య కావడం గమనార్హం.2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన టయోటా అర్బన్ క్రూయిజర్ కార్లు రీకాల్కు ప్రభావితమయ్యాయి. ఫ్యూయెల్ గేజ్ సమస్య కారణంగా.. కారులో ఎంత ఇంధనం ఉందనే విషయాన్ని వాహన వినియోగదారుకు చూపించదు. దీనివల్ల దూర ప్రయాణం సమయంలో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే.. తక్కువ ఇంధనం ఉన్నప్పుడు కూడా ఇండికేటర్ చూపించకపోవడం వల్ల, డ్రైవర్ ఎప్పుడు ఫ్యూయెల్ ఫిల్ చేసుకోవాలో తెలియకుండా పోతుంది. ఇది అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురి చేస్తుంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫీజు: కొత్త ధరలు ఇలా..సమస్యకు ప్రభావితమైన కార్లను కంపెనీ గుర్తించి, యజమానులకు సందేశం (ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్) పంపిస్తుంది. తద్వారా ఓనర్ కారులోని సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
జియో కొత్త ఆఫర్.. 18 నెలలు ఉచితం!
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు తన అపరిమిత 5జీ వినియోగదారులందరికీ జెమిని ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తోంది. ఇంకా ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3 మోడల్ కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. గూగుల్ ఇటీవలే తన సరికొత్త, అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడల్.. జెమిని 3ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి జెమిని కంటే మెరుగ్గా ఉందని, ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-5.1ను అధిగమిస్తుందని గూగుల్ పేర్కొంది.రూ.35,100 విలువైన జెమినీ ప్రో ప్లాన్ ను జియో యూజర్లు ఉచితంగా పొందవచ్చు. గతంలో గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వియో 3.1 మోడళ్లతో ఫొటోలు, వీడియోలను సృష్టించడంలో పరిమితులు ఉండేవి. అయితే, ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. దీన్ని ఎలా పొందాలో చూద్దామా..?18 నెలలపాటు ఉచితంజియో అన్ లిమిటెడ్ 5G వినియోగదారులందరూ జెమిని ప్రో ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జెమిని ప్రో ప్లాన్కు సాధారణంగా రూ .35,100 ఖర్చు అవుతుంది. అంటే వినియోగదారులు ప్లాన్ లో చేర్చిన అన్ని ప్రయోజనాలను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు.ఈ జియో అప్ గ్రేడ్ ఆఫర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి వస్తుంది. గతంలో ఈ ఆఫర్ యువ కస్టమర్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ జియో దీన్ని ఇప్పుడు అపరిమిత 5G వినియోగదారులందరికీ విస్తరించింది.ఆఫర్ ఎలా పొందాలంటే.. ఈ ఆఫర్ ను పొందడానికి ఫోన్ లో మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5జీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్న జియో నంబర్ తో లాగిన్ అవ్వాలి. అప్పుడు యాప్లో జెమిని ప్రో ప్లాన్ ఆఫర్కు సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ క్లెయిమ్ నౌ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆఫర్ ను పొందవచ్చు.
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకిని కూడా తాకింది.డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్ ఫేక్ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్ చేశారు. ‘ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.‘నకిలీ రాబర్ట్ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.తనపై ఇలా డీక్ ఫేక్ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.PLEASE BE AWAREAI creates FAKE PEOPLE…just as the FED creates FAKE MONEY.Just saw a YOU TUBE video with me saying gold will drop by 50% in December.I did not say that.Why would some PERVERT waste so much time and effort creating a FAKE ROBERT KYOSAKI making a FAKE…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 19, 2025
Vreels: టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ను దాటిపోయే కొత్త డిజిటల్ విశ్వం
డజిటల్ ప్రపంచం ప్రతీ రోజూ మారుతోంది. నేడు మనం వీడియోల కోసం ఒక యాప్, మెసేజింగ్ కోసం మరో యాప్, షాపింగ్ కోసం ఇంకొకటి వాడుతున్నాం.ఈ మధ్యకాలంలో యూజర్లు ఒక ప్రశ్నను తరచూ అడుగుతున్నారు: “ఈ అన్నింటినీ ఒకే వేదికలో పొందలేమా?”ఇదే ప్రశ్న ఒక కొత్త ఆలోచనకు పుట్టుక ఇచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచానికి అందుతున్న – వీరీల్స్ (Vreels) (www.vreels.com).అమెరికాలో ఉండే మన తెలుగువారి ఆలోచన — ప్రపంచానికి కొత్త వేదిక టెక్ ప్రపంచంలో ముందడుగు వేస్తున్న యువతెలుగువారు. అమెరికాలో ఉండి, ప్రపంచం కోసం ఒక అద్భుతమైన యాప్ను రూపొందించారు."సురక్షితం, అందరికీ సులభం, ప్రపంచస్థాయి ఫీచర్లతో" భారతీయ సృజనకు కొత్త రూపం ఇచ్చిన మేధస్సు ఇది. వీరి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది — భారతీయులకు, ముఖ్యంగా క్రియేటర్లకు, యువతకు, ప్రపంచ స్థాయిలో ధైర్యంగా పోటీ ఇవ్వగల ఒక సరైన వేదికను అందించడం.వీరీల్స్ ఎందుకు ఇతర యాప్లను దాటిపోతోంది?1) వీడియోలు, చాట్, షాపింగ్ — అన్నీ ఒకే యాప్లో.. - మీరు రీల్స్ చేయాలంటే – Vreels - మిత్రులతో చాట్ చేయాలంటే - Vreels - ప్రోడక్ట్స్ కొనాలంటే - Vreels2) టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ కంటే సురక్షితం, స్పష్టత ఎక్కువ AI పెరుగుతున్న ఈ కాలంలో, యూజర్లు డేటా సేఫ్టీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో, Vreels ప్రతి డేటాను జాగ్రత్తగా, నిబంధనలకు లోబడి, ఎన్క్రిప్షన్తో రక్షిస్తుంది. ఇక్కడ యూజర్ డేటా అమ్మకం లేదు, లీక్ భయం లేదు. మీరు చూడమంటేనే, మీ డేటా కనిపిస్తుంది.3) Capsules — ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక ఫీచర్ Vreels లోని Capsules మీ జ్ఞాపకాలను భద్రంగా, సమయంతో తాళం వేసి ఉంచుతుంది. మీరు నిర్ణయించిన టైమ్ వచ్చినప్పుడు మాత్రమే అవి అన్లాక్ అవుతాయి.4) Vreels Shop/Bid — వినోదం దగ్గరే షాపింగ్ యూజర్లు వీడియో చూస్తూ ఉండగానే ప్రోడక్ట్స్ కొనొచ్చు లేదా బిడ్ చేయొచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను నమ్మకంతో విక్రయించొచ్చు.ఇది షాపింగ్ కాదు— భారతీయ డిజిటల్ వ్యాపారానికి ఒక కొత్త దారితీసే ఫీచర్.5) క్రియేటర్ల కోసం ప్రత్యేక అవకాశాలు రిచ్ ఫీచర్లు, వేగవంతమైన పెర్ఫార్మెన్స్, పారదర్శకత — ఇవి అన్ని కలిపి క్రియేటర్లకు TikTok & Instagram కన్నా మెరుగైన వేదికను ఇస్తాయి.22 దేశాల్లో విడుదల… ఇప్పుడు App Store & Play Store లో అందుబాటులోయువ తెలుగువారి ప్రతిభతో పుట్టిన ఈ యాప్ ఇప్పటికే 22 దేశాల్లో బీటా రిలీజ్ అయి, Google Play Store మరియు Apple App Store లో అందుబాటులో ఉంది.ఇది ప్రారంభం మాత్రమే — ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు రానున్నాయి.Vreels — మీ డిజిటల్ ప్రయాణానికి కొత్త స్వరూపం మీరు క్రియేటర్ అయినా, షాపింగ్ ప్రేమికుడైనా, లేదా కొత్త ఫీచర్లు ప్రయత్నించే టెక్-ఎన్తుజియాస్ట్ అయినా — Vreels మీ కోసం. మీ అనుభవం కోసం. మీ భవిష్యత్తు కోసం.ఇప్పుడే ప్రయత్నించండి Vreels — భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి:
వెండి, పసిడి ప్రియులకు రిలీఫ్! తులం బంగారం ఇప్పుడు..
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. క్రితం రోజున భారీగా పెరిగిన ధరలు దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తగ్గాయి. వెండి ధరలు కూడా గణనీయంగా దిగొచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో టెక్ షేర్లు పుంజుకున్న నేపథ్యంలో భారత స్టాక్ సూచీలు ఎగువన పయనిస్తున్నాయి. ఉదయం 9.26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 134.43 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 85,320.90 వద్ద, ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 38.65 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 26,091.30 వద్ద ట్రేడవుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మేజర్ ఎన్విడియా బలమైన త్రైమాసిక ఫలితాలను నివేదించింది. వాల్ స్ట్రీట్ ఆదాయాలు, ఆదాయ అంచనాలను అధిగమించింది. పర్యవసానంగా, ఆసియాలోని కీలక సూచీలు 4 శాతం వరకు పెరిగాయి. యూఎస్ బెంచ్ మార్క్ లు 0.1 శాతం నుండి 0.6 శాతం వరకు పెరిగాయి.దేశీయ మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు 0.3 శాతం పెరిగాయి.
కార్పొరేట్
ఆ రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఓకే..
హైదరాబాద్లో కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
సైబర్ ముప్పులపై కార్పొరేట్లలో ఆందోళన
జేపీ అసోసియేట్స్ టేకోవర్...అదానీకి లైన్ క్లియర్!
డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
ఎస్బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!
జీసీసీల్లో కొలువులు @ 34.6 లక్షలు!
పసిడి రూ. 3,900 డౌన్
ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లో రాజీనామా!
సోషల్ మీడియా ద్వారా వ్యాపారావకాశాలు
ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకే...
ఐదేళ్లలో ఇన్వెస్టర్లు రెట్టింపు!
ముంబై: రానున్న మూడు నుంచి ఐదేళ్లలో ఈక్విటీ మార్కెట...
ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ ర...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట...
ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు మన దేశ ఎగుమతులపై అక్...
ఆంక్షలతో భారత ఓఎంసీలకు రిస్కేమీ లేదు
న్యూఢిల్లీ: రష్యన్ ఆయిల్ కంపెనీలైన రోజ్నెఫ్ట్, ...
5.2% వద్దే నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్లో 5.2 శాతం వద...
రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తూ కేంద్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఇక్రిశాట్ వాటర్ హైసింత్ హార్వెస్టర్: దీని గురించి తెలుసా?
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT).. రూపొందించిన సౌరశక్తితో పనిచేసే ''వాటర్ హైసింత్ హార్వెస్టర్'' జాతీయ గుర్తింపు పొందుతుంది. కాగా ఇప్పుడు ఇండియా ఇన్నోవేటర్స్ అసోసియేషన్ ద్వారా 2025లో టాప్ 100 ఇండియన్ ఇన్నోవేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని నవంబర్ 13న గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్పో (INEX India)లో ప్రకటించారు.సాధారణంగా నీరు నిల్వ ఉండే చోట.. నీటి మొక్కలు పుడతాయి. వీటి సంఖ్య ఎక్కువై.. జలాశయాలను మొత్తం ఆవరించినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్రిశాట్ ఈ వాటర్ హైసింత్ హార్వెస్టర్ రూపొందించింది. వాటర్ హైసింత్ (ఒక రకమైన నీటిలో తేలియాడే మొక్కలు) జలమార్గాలకు ఆటంకాలను కలిగిస్తాయి. ఇవి జలచరాలకు సైతం ఊపిరాడకుండా.. నీటి నాణ్యతను కూడా దిగజారుస్తాయి. ఈ సమస్యలను వాటర్ హైసింత్ హార్వెస్టర్ పరిష్కరిస్తుంది.వాటర్ హైసింత్ హార్వెస్టర్ పనిచేయడానికి కేవలం సూర్యరశ్మి సరిపోతుంది. ఎందుకంటే.. ఇది సోలార్ ప్యానెల్స్ పొందుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా కలుపును తొలగించవచ్చు. మొత్తం మీద ఇది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు చాలా ఉపయోగపడుతుందని ఇక్రిశాట్ వెల్లడించింది.
X సేవల్లో అంతరాయం.. కారణం ఇదే!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X)లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్లను కూడా అప్లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం.క్లౌడ్ఫ్లేర్ సేవలను ఉపయోగించే వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు "క్లౌడ్ఫ్లేర్ నెట్వర్క్లో అంతర్గత సర్వర్ లోపం, దయచేసి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి" అనే సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను వేలమంది యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెళ్లదీస్తున్నారని డౌన్డెటెక్టర్ వెల్లడించింది. ఈ సమస్యపై కంపెనీ స్పందించలేదు.డౌన్డిటెక్టర్ ప్రకారం ఈ సమస్య భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటలకు మొదలైంది. క్లౌడ్ఫ్లేర్ డౌన్ అవ్వడం వల్ల కేవలం ఎక్స్ మాత్రమే కాకుండా.. ఓపెన్ ఏఐ సంస్థల సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే పనిలో మా బృందం నిమగ్నమై ఉందని.. క్లౌడ్ఫ్లేర్ టీమ్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
సైయెంట్ సెమీకండక్టర్స్.. ఇంటెలిజెంట్ ఎస్వోసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తొలి ఇంటెలిజెంట్ పవర్ చిప్ ప్లాట్ఫాం, సిస్టమ్ ఆన్ ఎ చిప్ (ఎస్వోసీ) అయిన ‘అర్క జీకేటీ–1’ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఆవిష్కరించారు. సైయెంట్ సెమీకండక్టర్స్, అజిముత్ ఏఐ కలిసి దీన్ని రూపొందించాయి. సెమీకండక్టర్ల డిజైన్, టెక్ ఆవిష్కరణలకు హబ్గా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా ఇదొక కీలక మైలురాయని వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ టెక్నాలజీలను డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడంలో భారత్ సామర్థ్యాలను ఇది తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. మలీ్ట–కోర్ కస్టమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ అనలాగ్ సెన్సింగ్, మెమొరీ, ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్మెంట్ మొదలైన వాటన్నింటిని సమగ్రపర్చి, విద్యుత్ ఆదా చేసే ఎస్వోసీగా దీన్ని రూపొందించినట్లు సైయెంట్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. ఇది అత్యధిక వృద్ధి అవకాశాలున్న స్మార్ట్ యుటిలిటీలు, అధునాతన మీటరింగ్, బ్యాటరీ మేనేజ్మెంట్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్ తదితర విభాగాల్లో ఉపయోగపడుతుందని అజిముత్ ఏఐ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వై తెలిపారు.
కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను కబళిస్తుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగులు పోతాయని భయపడుతున్న వైట్కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో(Skilled Trades) పని చేస్తున్న వారిపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆనంద్ మహీంద్రా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఏఐ వల్ల వైట్కాలర్ (సాఫ్ట్వేర్, డేటా ఎంట్రీ వంటి డెస్క్ ఉద్యోగాలు) ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్ ఉంటాయని భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కొన్ని అంశాలను పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా మనం డెస్క్ ఉద్యోగాలను ఉన్నత స్థానాల్లో ఉంచాం. అదే సమయంలో నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలను ఎక్కువగా ఎదగనివ్వలేదు. అయితే ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కాని ఉద్యోగాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగాలకు నైపుణ్యం చాలా అవసరం. రియల్టైమ్ అనుభవం ముఖ్యం. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు, ట్రక్కు డ్రైవర్లు వంటి నైపుణ్యం గల కార్మికులను ఏఐ భర్తీ చేయలేదు’ అని చెప్పారు.అమెరికాలో ఉద్యోగాల కొరతమహీంద్రా హెచ్చరికలకు బలం చేకూర్చేలా ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే కూడా ఇదే తరహా ప్రతిభ కొరతను ఎత్తి చూపారు. ఓ పాడ్కాస్ట్లో ఫార్లే మాట్లాడుతూ.. ఫోర్డ్లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 డాలర్లు (సుమారు కోటి రూపాయలు) వరకు చెల్లిస్తున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభించడం లేదని ఆయన తెలిపారు.We’re so busy fearing AI will wipe out white-collar jobs that we’re missing a far bigger crisis: the scarcity of skilled trades.Ford CEO @jimfarley98 made a startling revelation in a recent podcast: Ford has 5,000 mechanic jobs unfilled, many paying $120,000 a year, and still…— anand mahindra (@anandmahindra) November 17, 2025భారీ ఆర్థిక నష్టంఈ సంక్షోభం ఫోర్డ్కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అంతటా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ట్రక్కు డ్రైవింగ్, ఫ్యాక్టరీ ఆపరేషన్లతో సహా కీలకమైన రంగాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డెలాయిట్, ది మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి యూఎస్లో తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. దీని కారణంగా కలిగే మొత్తం ఆర్థిక నష్టం అప్పటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా.ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
పర్సనల్ ఫైనాన్స్
మెరుగైన రాబడి కోసం.. మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులపై మెరుగైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిల్లో రిస్క్ అధికం. రాబడి కూడా అధికంగానే ఉంటుంది. లార్జ్క్యాప్ కంటే దీర్ఘకాలంలో అదనపు రాబడి మిడ్క్యాప్ ఫండ్స్తో సాధ్యపడుతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో క్వాంట్ మిడ్క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. పదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుస్వల్పకాలం నుంచి దీర్ఘకాలంలోనూ ఈ పథకంలో పనితీరు మెరుగ్గా ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకం ఎలాంటి రాబడిని ఇవ్వలేదు. అదే సమయంలో నష్టాలను మిగల్చలేదు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే ఇది మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ రాబడులు పటిష్టంగా ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే ఏటా 18 శాతం చొప్పున డైరెక్ట్ ప్లాన్లో రాబడి నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 28 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఏడేళ్ల కాలంలో 23 శాతం, పదేళ్లలోనూ 18.34 శాతం చొప్పున రాబడి తెచి్చపెట్టింది. బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీతో పోల్చి చూస్తే ఐదేళ్లు, ఏడేళ్లలో అదనపు రాబడి ఇచి్చంది. పదేళ్ల కాలంలోనూ సూచీతో సమాన రాబడిని అందించింది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ ఏడాది కూడా ఈ పథకం నికరంగా నష్టాలను ఇవ్వలేదు.పెట్టుబడుల విధానంఇది యాక్టివ్ ఫండ్. అంటే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. మార్కెట్, రంగాల వారీ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోలో కొత్త స్టాక్స్ను చేర్చుకోవడం, ప్రస్తుత స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం వంటి బాధ్యలను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు చేస్తుంటుంది. ముఖ్యంగా ఏదో ఒక విధానానికి పరిమితం కాబోదు. మూమెంటమ్, వ్యాల్యూ, గ్రోత్ ఇలా అన్ని రకాల విధానాల్లోనూ పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం పరిశీలిస్తుంటుంది. అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.8,525 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90.52 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సెక్యూరిటీల్లో 2.8 శాతం పెట్టుబడులు పెట్టింది. 6.68 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ పోర్ట్ఫొలియోని గమనించినట్టయితే మొత్తం 29 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనే 58 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే.. మిడ్క్యాప్ కంపెనీల్లో 59 శాతం ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో 29 శాతం మేర లార్జ్క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేసింది. లార్జ్క్యాప్ పెట్టుబడులు రిస్క్ను తగ్గిస్తాయి. మిడ్క్యాప్ పెట్టుబడులు మెరుగైన రాబడులకు అవకాశం కలి్పస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 18 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 16.71 శాతం, హెల్త్ కేర్ కంపెనీలకు 15.30 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 11.22 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
తక్కువ పెట్టుబడి.. మెరుగైన రాబడులు: ఎంపిక విషయంలో..
నేను ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మంచి ఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ఏ అంశాలను చూడాలి? - కృష్ణ శర్మఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఇవి తక్కువ వ్యయాలకే మెరుగైన రాబడుల అవకాశాలను కల్పిస్తాయి. వీటి ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ఇండెక్స్ ఫండ్ ఏ సూచీలో అయితే పెట్టుబడులు పెడుతుందో గమనించి, ఆ ఇండెక్స్తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది చూడాలి. ఇండెక్స్తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇండెక్స్కు, ఆ ఇండెక్స్ అనుసరించే ఫండ్స్కు రాబడుల్లో అతి స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ వృద్ధి అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా ఉండొచ్చు.ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఎంతో కీలకమైన అంశం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్ సూచీలను అనుసరించే పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే ఇక్కడ ప్రామాణికం అవుతుంది.నెలవారీ సంపాదన నుంచి రిటైర్మెంట్, ఇతర జీవిత లక్ష్యాల కోసం ఏ మేరకు కేటాయించుకోవాలి. - విశేష్మీకు నెలవారీగా వస్తున్న ఆదాయం, జీవిత లక్ష్యాలు, వాటికి ఎంత కాలవ్యవధి ఉంది? తదితర అంశాల ఆధారంగా పొదుపు, పెట్టుబడులను నిర్ణయించుకోవాలి. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని అయినా పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎంత చొప్పున విభజించాలనే దానికి ఇదమిత్థమైన సూత్రం లేదు. ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత కాలంపాటు, ఎంత రాబడి కోరుకుంటున్నారనే దాని ఆధారంగా ఈ కేటాయింపులు ఆధారపడి ఉంటాయి. ముందు కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి.దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మెరుగైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల స్వల్ప కాల లక్ష్యాల కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న సమయంలో ఈక్విటీ పెట్టుబడులను కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకుని, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలో పతనాల రిస్క్ను అధిగమించొచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?
గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి. వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్ బుక్లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్ రికార్డు తదితర రికార్డులుండాలి. ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్ హౌస్ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్కి ఎంత? విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి. పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి. కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి. ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావుభూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ బకాయి అద్దెల మీద వడ్డీ కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం వడ్డీ కమీషన్ చేపల అమ్మకం ఫైనాన్సింగ్లోని రాయితీ వెన్న, చీజ్ అమ్మకం పౌల్ట్రీ ఆదాయం డెయిరీ మీద ఆదాయం తేనెటీగల పెంపకం చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం ఫామ్ హౌజ్ని టీవీ, సీరియల్స్ షూటింగ్లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం కాఫీలో 25%, (పండించి అమ్మితే) రబ్బర్ 95% కాఫీ... చికోరితో/లేదా చికోరి లేకుండా 40%చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే పన్నుభారం లేదు.
ఈ వారం బ్యాంకు సెలవులు ఎన్ని?
బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. పలు సేవల కోసం వినియోగదారులు బ్యాంకు శాఖలను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారం ప్రారంభం కాగానే బ్యాంకు శాఖలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. సెలవులేమైనా ఉన్నాయా అని చూస్తుంటారు.సాధారణ వారపు సెలవుల్లో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈ వారం నవంబర్ 22న శనివారం, నవంబర్ 23న ఆదివారం రెండు రోజులు మాత్రమే మూసి ఉంటాయి. ఈ షెడ్యూల్ సెలవులు కాకుండా, వారంలోని అన్ని ఇతర రోజులలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.సాధారణంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నెలలో రెండో, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా పాటిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 22న నెలలో నాల్గవ శనివారం వస్తుంది. కాబట్టి ఆ రోజన సెలవు ఉంటుంది.బ్యాంకులు ఎప్పుడు మూసిఉంటాయి?ఆర్బీఐ సెలవుదినాలు మినహా ఆదివారాలు, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.నవంబర్ నెలలో ఇప్పటివరకు, ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మొత్తం ఆరు రోజుల పాటు మూసి ఉన్నాయి.ఈ నెలలో సెలవులు ఏమైనా మిగిలి ఉన్నాయా?ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. అన్ని బ్యాంకు శాఖలు మూసిఉంచే ఆదివారాలు మినహా నవంబర్ నెలలో మిగిలిన రోజుల్లో అదనపు బ్యాంకు సెలవులు లేవు. జాబితా చేసిన బ్యాంక్ తదుపరి సెలవుదినం డిసెంబరులో మాత్రమే ఉంటుంది.దేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఆచారాలు, పండుగల సందర్భంగా సెలవులను నిర్ణయిస్తారు.


