ప్రధాన వార్తలు
500 సార్లు అప్లై చేసినా రాని ఉద్యోగం!: చివరికి ఏం చేసిందంటే?
చదువు పూర్తయిన తరువాత.. ఎవరైనా ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిందే. జాబ్ కోసం చాలా కంపెనీలకు అప్లై చేసుకుంటారు. ఇంటర్వ్యూలకు సైతం హాజరవుతారు. ఎవరైనా 500 కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారా?, వినడానికి బహుశా ఇది కొంచెం కొత్తగా అనిపించినా.. ఇది నిజం. ఇక కథనంలోకి వెళ్తే..చికాగోకు చెందిన ఒక మహిళ ఉర్బానా ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన కొద్దికాలానికే ఉద్యోగాల కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆలా దాదాపు రెండేళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది.దాదాపు 800 రోజులు.. ఆమె 500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. ఉద్యోగాలను వెతుక్కునే సమయంలో.. ఆమె తన భర్త ఆదాయంపై ఆధారపడింది. 2025 జులైలో నిరాశ చెంది.. ప్లీజ్ హైర్ మీ అనే ఫొటోలతో పాటు.. వ్యక్తిగత వివరాలను కలిగి ఉన్న ఒక 'గ్రాఫిక్ ఫోటో'ను ఫేస్బుక్లోని ఒక పెద్ద చికాగో కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అతి తక్కువ కాలంలోనే వైరల్ కావడంతో.. చాలామంది జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు.వచ్చిన జాబ్ ఆఫర్లతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో యజమాని కూడా ఉన్నారు, ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రశంసించారు. ఆమెను పార్ట్-టైమ్ స్టూడియో మేనేజర్గా నియమించారు. ఈ ఉద్యోగం తన డిగ్రీకి సంబంధించినది కానప్పటికీ, ఆమె సంతృప్తి చెందిందని & సహాయక పని వాతావరణాన్ని విలువైనదిగా చెబుతుంది.ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..
టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా?
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'మిరాయ్'ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పగించింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా పనిచేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వాహనాల్లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ & ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్య ద్వారా ఏర్పడిన విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది. నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇది సుమారు 650 కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే.. సాధారణ ఫ్యూయెల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లకు ఇది ప్రత్యామ్నాయమనే చెప్పాలి.కంపెనీ కూడా ఈ లేటెస్ట్ మిరాయ్ కారును.. ఇంధన సామర్థ్యం, పరిధి, డ్రైవింగ్ సామర్థ్యం, భారతదేశ విభిన్న భూభాగాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా తయారు చేసింది. ఈ కారు టెస్టింగ్ పూర్తయిన తరువాత.. అన్నింటా సక్సెస్ సాధిస్తే.. త్వరలోనే రోడ్డుపైకి వస్తుంది.ఇదీ చదవండి: నవంబర్లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లుభారతదేశ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ & కార్బన్-న్యూట్రాలిటీ లక్ష్యాలను బలోపేతం చేస్తూ.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని TKM & NISE మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. కారును టెస్టింగ్ కోసం అప్పగించడం జరిగింది.
రూ.3200 నుంచి.. రూ.లక్ష దాటిన గోల్డ్
బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని అలాగే చూస్తాయి. కానీ భారత్ దీనికి భిన్నం. ఎలా అంటే.. బంగారం అంటే విలువైన లోగా మాత్రమే కాకుండా.. పవిత్రం, ఒక ఆభరణం, లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ కారణంగా ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తుంటారు. దీంతో ధరలు కూడా అమాంతం పెరుగుతూ వచ్చేసాయి.ఉదాహరణకు 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,200. అంటే గ్రామ్ గోల్డ్ కొనాలంటే.. కేవలం రూ. 320 వెచ్చించాలన్నమాట. అయితే ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,30,750 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ కొనాలంటే రూ. 13075 ఖర్చు చేయాలి. దీన్నిబట్టి చూస్తే.. 35 సంవత్సరాల్లో గోల్డ్ రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.35 సంవత్సరాల్లో బంగారం ధరలు ఎందుకింతలా పెరిగాయి?, భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.బంగారం ధరలు ఎందుకిలా..ద్రవ్యోల్బణం: గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే. దేశంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల.. ఈ ప్రభావం బంగారంపై కూడా చూపించింది. రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధరలు అమాంతం పెరగడానికి కారణమైంది.భద్రమైన ఆస్తి: ప్రపంచంలోనే సంక్షోభం వచ్చినప్పుడల్లా.. ప్రజలు బంగారం వైపు పరుగెడతారు. 2001లో ఏర్పడిన ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, 2008 నాటి ఆర్ధిక సంక్షోభం, 2020లో వచ్చిన కోవిడ్ 19, 2022-25 వరకు రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సమస్యలు వంటివి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణమయ్యాయి. దీంతో రేట్లు రాకెట్లా దూసుకెళ్లాయి.కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: చైనా, రష్యా, టర్కీ, ఇండియా వంటి దేశాలు.. గత దశాబ్దంలో టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి. ఇది గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ను పెంచేసింది.డిమాండ్కు తగ్గ ఉత్పత్తి: ఎక్కడైనా డిమాండ్కు సరిపడా.. ఉత్పత్తి ఉన్నప్పడే ధరలు స్థిరంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో బంగారం కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి సరఫరా చేయడానికి కావలసినంత బంగారం ఉత్పత్తి జరగలేదు. దీంతో ఆటోమేటిక్గా ధర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది.డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు: సాధారణంగా.. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ఇదే వ్యతిరేఖ దిశలో జరిగితే.. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. గోల్డ్ రేట్ల పెరుగుదలపై.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపుతుంది.ఇతర కారణాలు: పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం కొనేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా పసిడి రేటు భారీగా పెరుగుతుంది.భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా?2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.
ఉన్నదొకటి.. చెబుతున్నది ఇంకొకటి: ఐఐఎఫ్ఎల్ రిపోర్ట్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాయి. వీఐ (వోడాఫోన్ ఐడియా), బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమదైన రీతిలో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా Vi యూజర్లలో ప్రతి ఐదు మందిలో ఒకరు కూడా యాక్టివ్గా లేరని ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో వెల్లడించింది.ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో.. పేర్కొన్న విషయాలు, కంపెనీ చెబుతున్న విషయాలు చూస్తుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎలా అంటే.. Vi చెబుతున్న యూజర్లు 197.2 మిలియన్స్. కానీ నిజంగా యాక్టివ్గా ఉన్న యూజర్లు 154.7 మిలియన్స్ మాత్రమే. దీన్నిబట్టి చూస్తే.. కంపెనీ చెబుతున్న రిపోర్ట్ వేరు, వాస్తవంగా నెట్వర్క్లో ఉన్న యూజర్లు వేరు, అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో కూడా 2జీ నెంబర్ యూజర్లను తీసేస్తే.. 4జీ ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది.యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ఏఆర్పీయూ) విషయానికి వస్తే.. కాగితంపై, Q2 FY26లో Vi ఏఆర్పీయూ రూ.167. ఇది ఎయిర్టెల్ (రూ. 256), జియో (రూ. 211.4) కంటే తక్కువ. కానీ నిజంగా Vi రీఛార్జ్ ప్లాన్ 209 రూపాయలు. అంతే కాకుండా Vi యాక్టివ్ సబ్స్క్రైబర్లు కూడా నెలకు 746 నిముషాలు మాట్లాడినట్లు, ఇది ఎయిర్టెల్ (1071 నిముషాలు), జియో (1105 నిముషాలు)లతో పోలిస్తే చాలా తక్కువ.సబ్స్క్రైబర్ల సంఖ్యను కూడా వోడాఫోన్ ఐడియా 20.83 లక్షలు కోల్పోయిందని ట్రాయ్ వెల్లడించింది. ఈ సమయంలో రిలయన్స్ జియో 2.7 మిలియన్ల 4G/5G వినియోగదారులను పొందగా.. భారతీ ఎయిర్టెల్ 2 మిలియన్లను పొందగలిగింది. మొత్తం మీద Vi ఉన్నదొకటైతే.. చెబుతున్నది మరొకటని స్పష్టంగా అర్థమవుతోంది.
బ్యాంకు పరీక్షల్లో భారీ మార్పులు!!
ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామక పరీక్షల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రిక్రూట్మెంట్ పరీక్షల కాలక్రమాన్ని క్రమబద్ధీకరించడం, వాటి ఫలితాల ప్రకటనకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు మార్పులను సూచించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) నియామకాలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.తాము సూచించిన మార్పులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించే పరీక్షలలో పారదర్శకతను పెంచడానికి దోహదపడతాయని పేర్కొంది. ఎస్బీఐలో ఉద్యోగాలకు నియామకాలకు తానే సొంతంగా రిక్రూట్మెంట్ చేపడుతుండగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆర్ఆర్బీలలో రిక్రూట్మెంట్ను ఆయా బ్యాంకుల ఆదేశాలకు అనుగుణంగా ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.సాధారణంగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఎస్బీఐలలో ఉద్యోగాల పరీక్షల కంటే ముందే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అంటే ఆర్ఆర్బీలకు నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలను కూడా ఇదే క్రమంలో ప్రకటిస్తున్నారు. "అయితే, కొత్తగా నియమితులైన అభ్యర్థులు తరచుగా ఆర్ఆర్బీల నుండి ఇతర ప్రభుత్వ బ్యాంకులకు, తరువాత ఎస్బీఐకి మారే ఒక ముఖ్యమైన ధోరణి ఉద్భవించింది. ఈ వలస బ్యాంకులలో గణనీయమైన అట్రిషన్ కు దారితీస్తూ కార్యాచరణ సవాళ్లను విసురుతోంది" అని ఆర్థిక సేవల విభాగం తెలిపింది.పై సమస్యను పరిగణనలోకి తీసుకున్న ఆర్థిక సేవల విభాగం బ్యాంకుల రిక్రూట్మెంట్ పరీక్షల సమగ్ర ప్రక్రియ, ఫలితాల ప్రకటనల నమూనాను సమీక్షించింది. మూడు రకాల బ్యాంకులలో నియామక ఫలితాలను ప్రకటించడానికి ప్రామాణిక, తార్కిక క్రమాన్ని అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు సూచించింది.పర్యవసానంగా, సవరించిన ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని ప్రకారం.. మొదట ఎస్బీఐ, అనంతరం ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆ తరువాత చివరగా ఆర్ఆర్బీలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాలి. ఈ కేటగిరీలలోని అన్ని ఆఫీసర్ స్థాయి పరీక్షల ఫలితాలను ప్రారంభంలో ప్రకటిస్తామని, క్లరికల్ స్థాయి పరీక్ష ఫలితాలను అదే క్రమంలో ప్రకటిస్తామని తెలిపింది.
E20 Petrol: రూ.1.40 లక్షల కోట్లు ఆదా!
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ-20 పెట్రోల్) వినియోగించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీనివల్ల పెట్రోల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ చర్య కారణంగా.. రూ. 1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని లోక్సభలో వెల్లడించారు.ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకంపై కొందరు ఆందోళనల చెందుతున్నారు. కానీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఉపయోగించే కార్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని, ఇప్పటికే.. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.ఈ-20 పెట్రోల్ తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్ కంటే కూడా ఉత్తమంగా ఉందని గడ్కరీ అన్నారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల, ఇథనాల్లో ఉపయోగించే ముడి పదార్థాలైన చెరకు, మొక్కజొన్న మొదలైన వాటి వినియోగం పెరుగుతుంది. ఇది రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేస్తుందని ఆయన అన్నారు.ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం అమలు తర్వాత.. గతంలో ముడి చమురు దిగుమతులకు ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు రైతులకు చేరుతోందని, దీంతో అన్నదాతలు.. ఊర్జాదాతలు(Energy Givers)గా మారారని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. గత 11 సంవత్సరాలలో.. ఇథనాల్ వినియోగం, సరఫరా కారణంగా 2014-15 నుంచి 2025 జూలై 2025 వరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.1,40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేశాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: నవంబర్లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లు
కార్పొరేట్
500 సార్లు అప్లై చేసినా రాని ఉద్యోగం!: చివరికి ఏం చేసిందంటే?
రెండు లక్షలపైగా సంస్థలకు స్టార్టప్ గుర్తింపు
ఉన్నదొకటి.. చెబుతున్నది ఇంకొకటి: ఐఐఎఫ్ఎల్ రిపోర్ట్
బ్యాంకు పరీక్షల్లో భారీ మార్పులు!!
ఆఫీస్కు అర్లీగా వస్తోందని ఉద్యోగిని తొలగింపు
కస్టమర్లకు అలర్ట్: హెచ్డీఎఫ్సీ సేవలు రెండు రోజులు బంద్!
పైలట్లకు ఎంత డిమాండో.. మరి జీతాలు?
దక్షిణాది మార్కెట్పై జియోహాట్స్టార్ మెగా ప్లాన్
ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం
5 కంపెనీలు లిస్టింగ్కు రెడీ
వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబం...
బంగారం తియ్యగా.. వెండి చేదుగా..!!
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి తారుమారయ్యాయి. ఇ...
Stock Market Updates: తీవ్ర నష్టాల్లో మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
పసిడి రుణాలకు భలే గిరాకీ: 2026 మార్చి నాటికి..
ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం ...
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్
అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్ ...
ఇదో అవకాశంగా చూడాలి.. ఆర్బీఐ గవర్నర్
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప...
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీల...
రష్యాకి మరిన్ని ఎగుమతులపై దృష్టి
వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతు...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్లను శాటిలైట్ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్ఫాంమ్లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?
చాట్జీపీటీలో ప్రకటనలు..?
ఓపెన్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దాంతో ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.ఇటీవలి వారాల్లో చాట్జీపీటీ సంభాషణల్లో యాడ్ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్లు నిజమైనవి కావు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్🚨 OpenAI has denied the rumors of testing advertisements inside its popular AI chatbot, ChatGPT. pic.twitter.com/vbs3vH8krz— Indian Tech & Infra (@IndianTechGuide) December 7, 2025
భారత్లో స్టార్లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్వేర్ కిట్లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
'టెంపుల్' వస్తోంది: దీపిందర్ గోయల్ ట్వీట్
జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఏమిటీ టెంపుల్?టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.నవంబర్ 15న చేసిన పోస్ట్లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.Coming soon. Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025
పర్సనల్ ఫైనాన్స్
అంత క్యాష్ కనిపించిందా.. కొరడానే!
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.కొత్త నిబంధనలు ఇవే..కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి.తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.వీటికి 100% జరిమానా తప్పదుకొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై 100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.ఈ జాగ్రత్తలు అవసరంప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరంపెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది.
Income Tax: అక్విజిషన్ డేటు V/S రిజిస్ట్రేషన్ డేటు
ఎన్నో స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో ఇదొక సమస్య. ఈ విషయంలో ఎన్నో వివాదాస్పదమైన చర్చలు, సంభాషణలు జరిగాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. చట్టరీత్యా చెయ్యాలి. అలా చేసిన తర్వాతే కొనుక్కునే వారికి హక్కు ఏర్పడుతుంది. అందుకని రిజిస్ట్రేషన్ డేటునే ప్రాతిపదికగా తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ తేదీ నాడే హక్కు సంక్రమిస్తుంది. హోల్డింగ్ పీరియడ్.. అంటే ఆ సదరు ఆస్తి ఎన్నాళ్ల నుంచి ఆ వ్యక్తి వద్ద ఉంది అనేది. కొన్న తేదీ అలాగే అమ్మిన తేదీ .. ఈ రెండూ కూడా ఒప్పందం/అగ్రిమెంట్/డీడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ తేదీలే. ఈ మధ్య వ్యవధిని హోల్డింగ్ పీరియడ్ అంటారు. ఇక కొనుగోలు తేదీ నుంచి అమ్మకపు తేదీల మధ్య వ్యవధి .. దీన్ని నిర్ణయించడానికి రిజిస్ట్రేషన్ తేదీనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ హోల్డింగ్ పీరియడ్.. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో 2 సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికం. రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే స్వల్పకాలికం అంటారు. దీర్ఘకాలికం అయితే ఒక రకమైన పన్ను రేటు ఉంటుంది. (రెసిడెంటుకి 20 శాతం, నాన్ రెసిడెంటుకి 12.5 శాతం) స్వల్పకాలికం అయితే, ఇతర ఆదాయాలతో కలిసి శ్లాబుల ప్రకారం రేట్లు విధిస్తారు. హోల్డింగ్ పీరియడ్ కాకుండా కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ లెక్కించడానికి అక్విజిషన్ డేటును ప్రాతిపదికగా తీసుకుంటారు.ఈ మేరకు ఎన్నో ట్రిబ్యునల్స్, కోర్టులు కూడా రూలింగ్ ఇచ్చాయి. వీటి సారాంశం ఏమిటంటే .. కొన్న వ్యక్తి మొత్తం ప్రతిఫలం చెల్లించి, ఆ ఆస్తిని తీసుకుని అనుభవిస్తున్నారు. అనుభవించడం అంటే తాను ఆ ఇంట్లో ఉండటం గానీ లేదా అద్దెకి ఇచ్చి.. ఆ అద్దెని ఇన్కం ట్యాక్స్ లెక్కల్లో చూపించినట్లయితే గానీ అని అర్థం. అయితే, ఏదో ఒక కారణం వల్ల రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడింది. అలాంటప్పుడు అలాట్మెంట్నే పరిగనలోకి తీసుకుంటారు. సుప్రీం కోర్టు: సీఐటీ వర్సెస్ ఘన్శ్యామ్ 2009 రాజస్తాన్ హైకోర్టు: సీఐటీ వర్సెస్ రుక్మిణీ దేవి 2010.పైన చెప్పిన కేసుల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. వీటి సారాంశం ఏమిటంటే ఏ తేదీన అయితే స్వాధీనపర్చుకున్నారో, అంటే డేట్ ఆఫ్ అక్విజిషన్, ఆ తేదీనే రిజి్రస్టేషన్ తేదీగా పరిగణిస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ అక్విజిషన్ ముఖ్యం. ఇక అలాట్మెంట్ డేట్ వేరు. ముఖ్యంగా సొసైటీల్లో, డెవలప్మెంట్ అథారిటీపరంగా ఎన్నెన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫలితంగా అలాట్మెంట్ జరుగుతుంది.. అక్విజిషన్ కూడా జరుగుతుంది.. కానీ న్యాయపరమైన చిక్కులు, కోర్టు లిటిగేషన్స్ వల్ల చట్టపరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ సంవత్సరాల తరబడి వాయిదా అవుతుంది. బేరసారాలు జరిగి, అగ్రిమెంటు ప్రకారం ప్రతిఫలం ఇచ్చి అక్వైర్ (acquire) చేసుకున్నా, రిజి్రస్టేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. పెండింగ్ పడిపోతుంది. ఇదొక సాంకేతిక సమస్య తప్ప న్యాయపరమైనది లేదా హక్కులపరమైన సమస్య కాదు.అందుకని హోల్డింగ్ పీరియడ్కి, కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్కి డేట్ ఆఫ్ అక్విజిషన్నే ప్రాతిపదికగా తీసుకుంటారు. క్రయవిక్రయాలు చేసే ముందు, లింక్ డాక్యుమెంట్లు, దస్తావేజులను క్షుణ్నంగా చదవాలి. అప్పుడే ముందడుగు వేయాలి. మరొక జాగ్రత్త. సేల్ డీడ్లో మార్కెట్ విలువను ప్రస్తావిస్తారు. ప్రతిఫలం కన్నా మార్కెట్ విలువ ఎక్కువ ఉంటే, మార్కెట్ విలువనే అమ్మకపు విలువగా తీసుకుంటారు. తగిన జాగ్రత్త వహించండి.
పసిడి ధర మరింత పెరుగుతుందా?
బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా? – శ్రావణి అద్దంకిబంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్ క్లాస్కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు. నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – దీపక్పెట్టుబడిలో తక్కువ రిస్క్ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
సంక్షోభం అంచున ప్రపంచం.. ముందే చెబుతున్నా మీ ఇష్టం
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుడు, ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే హెచ్చరిక చేశారు. 2026 నుంచి అతిపెద్ద మాంద్యం ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచే ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్లో పేర్కొన్నారు.ఉద్యోగ నష్టాలు.. ముందస్తు సంకేతాలుప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకుంటున్న ఉద్యోగ నష్టాలను రాబోయే మహా మాంద్యానికి ముందస్తు సంకేతాలుగా కియోసాకి పేర్కొన్నారు. ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ నివేదికను ఉటంకిస్తూ, నవంబర్లో అమెరికాలో దాదాపు 32,000 ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలతో పాటు, చిన్న వ్యాపారాలు 1,20,000 మంది ఉద్యోగులను తొలగించడం మరింత కలవరానికి గురిచేసిందని అన్నారు.‘2026లో భారీగా ఉద్యోగ తొలగింపులు మొదలవుతాయి. మీ ఉద్యోగం ప్రమాదంలో ఉంటే ఇప్పుడే నా పాఠం #4ని గుర్తుచేసుకోండి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి’ అని కియోసాకి ఉద్యోగులకు హితవు పలికారు.డబ్బు సంపాదించే మార్గాలుమాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. మాంద్యం సమయంలో అమ్మకం నైపుణ్యం అనేది జీవనాధారమవుతుందని, దురదృష్టవశాత్తూ చాలా మంది ఉద్యోగులకు ఈ నైపుణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.రియల్ ఎస్టేట్ క్రాష్2026లో ముఖ్యంగా రెసిడెన్షియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య) రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా క్రాష్ అవుతుందని కియోసాకి హెచ్చరించారు. ‘బేరసారాలు ఉండవు. లైఫ్టైమ్ ఒప్పందాలు మీ కోసం ఎదురుచూస్తాయి. పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండండి’ అని మాంద్యం సమయంలోనే అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉంటాయని ఆయన సూచించారు.కళాశాల డిగ్రీ కంటే నైపుణ్యాలు ఉత్తమంఉపయోగంలేని డిగ్రీల కోసం మళ్లీ కళాశాలకు వెళ్లి రుణాలు తీసుకోవద్దని, దానికి బదులుగా నర్సింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వృద్ధుల సంరక్షణ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నారు. ‘ప్రపంచానికి ఎప్పుడూ ఈ నైపుణ్యాలు కావాలి’ అని అన్నారు.Lesson #4: How to get richer when the economy crashes:ADP just announced 32,000 jobs were lost in November. Those job losses are from big businesses.The frightening news is small businesses laid off 120,000 workers.The bigger lay offs will begin in 2026 when the world…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 4, 2025బంగారం, వెండి, క్రిప్టో.. ఇవే భవిష్యత్తుప్రస్తుతం చెలామణిలో ఉన్న డాలర్ను కియోసాకి మళ్లీ నకిలీ డబ్బుగా అభివర్ణించారు. సంక్షోభ సమయంలో డబ్బును కాపాడుకోవడానికి నిజమైన ఆస్తుల్లో పొదుపు చేయాలని ఆయన సూచించారు. బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథేరియం వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఔన్సుకు 57 డాలర్లుగా ఉన్న వెండి ధర, జనవరి 2026 నాటికి 96 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇదీ చదవండి: విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం


