ప్రధాన వార్తలు

యూట్యూబ్ డౌన్!.. స్పందించిన కంపెనీ
బుధవారం సాయంత్రం యూట్యూబ్ (Youtube) వినియోగించడంలో అంతరాయం ఏర్పడింది. సుమారు 3,20,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు డౌన్డెటెక్టర్ (Downdetector) వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వేలాది మంది యూట్యూబ్ మ్యూజిక్, టీవీ సేవలలో సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. 'ఎర్రర్ సంభవించింది, దయచేసి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి' వంటి ఎర్రర్ సందేశాలను చూసినట్లు లేదా డెస్క్టాప్ & మొబైల్ యాప్లు రెండింటిలోనూ ఖాళీ బ్లాక్ స్క్రీన్లను చూసినట్లు వినియోగదారులు నివేదించారు.''మీరు ప్రస్తుతం YouTubeలో వీడియోలను ప్లే చేయలేకపోతే, మేము దాన్ని పరిష్కరిస్తున్నాము! మీ ఓర్పుకు ధన్యవాదాలు'' అంటూ టీమ్ యూట్యూబ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.యూట్యూబ్ అంతరాయానికి కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ వెల్లడించేలేదు. అయితే దీని పరిష్కారానికి టీమ్ యూట్యూబ్ చురుగ్గా పనిచేస్తోంది. యూట్యూబ్ అంతరాయం యునైటెడ్ స్టేట్స్ అంతటా వినియోగదారులను ప్రభావితం చేసింది. డౌన్డెటెక్టర్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, ఫీనిక్స్, చికాగో, వాషింగ్టన్, డెట్రాయిట్ వంటి పట్టణ కేంద్రాల నుంచి అత్యధిక సంఖ్యలో నివేదికలు వస్తున్నాయి. ఈ సమస్య అమెరికాలో మాత్రమే కాకుండా.. భారత్, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కూడా తలెత్తిందని సమాచారం.If you’re not able to play videos on YouTube right now – we’re on it! Thanks for your patience, and you can follow along here for updates: https://t.co/EcPxm09f77— TeamYouTube (@TeamYouTube) October 16, 2025

జీసీసీల్లో హైరింగ్ జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీక్వెన్షియల్గా జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో హైరింగ్ 5–7 శాతం పెరగడం దీనికి నిదర్శనం. ఏఐ–డేటా, ప్లాట్ఫాం ఇంజినీరింగ్, క్లౌడ్, ఫిన్ఆప్స్, సైబర్సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ నెలకొంది. క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), తయారీ, ఆటోమోటివ్, ఎనర్జీ, టెక్నాలజీ, హార్డ్వేర్ మొదలైన రంగాలు జీసీసీల వృద్ధికి కీలకంగా ఉంటున్నాయి. భారత్లో జీసీసీల పరిణామక్రమం ప్రస్తుతం అత్యంత వ్యూహాత్మక దశలోకి ప్రవేశిస్తోందని క్వెస్ కార్ప్ సీఈవో (ఐటీ స్టాఫింగ్) కపిల్ జోషి తెలిపారు. నియామకాలకు కేటాయించే బడ్జెట్లు ప్రధానంగా ఆదాయార్జన, సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టే విధంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో సుమారు 1,850 జీసీసీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 20 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 25 లక్షలకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. నివేదికలో మరిన్ని విశేషాలు .. → ఏఐ, డేటా సైన్స్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు ఎనిమిది శాతం పెరగ్గా, ఫిన్ఆప్స్ ఆధారిత క్లౌడ్ సేవల విభాగంలో హైరింగ్ 6 శాతం పెరిగింది. → హైదరాబాద్, బెంగళూరులాంటి ప్రథమ శ్రేణి మెట్రో నగరాలు ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు కీలకంగా నిలుస్తున్నాయి. ఇక కోయంబత్తూరు, కొచ్చి, అహ్మదాబాద్లాంటి ద్వితీయ శ్రేణి హబ్లలో త్రైమాసికాలవారీగా నియామకాలు 8–9 శాతం పెరిగాయి. తక్కువ వ్యయాలతో సరీ్వసులను అందించేందుకు తోడ్పడే కేంద్రాలుగా ఇలాంటి నగరాలు ఎదుగుతున్నాయి. → ఏఐ–డేటాలో అత్యధికంగా 41 శాతం స్థాయిలో నిపుణుల కొరత ఉంది. ప్లాట్ఫాం ఇంజినీరింగ్ (39 శాతం), క్లౌడ్–ఇన్ఫ్రాస్ట్రక్చర్ (25 శాతం), సైబర్సెక్యూరిటీ (18 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దీనితో, హైరింగ్ ప్రక్రియలో, ముఖ్యంగా ప్రథమ శ్రేణి నగరాల వెలుపల, మిడ్–సీనియర్ హోదాల్లో నియామకాల్లో జాప్యం జరుగుతోంది. → జూలై–సెప్టెంబర్ వ్యవధిలో జీసీసీల్లో నియామకాలకు సంబంధించి దక్షిణాది మెట్రో నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. 26 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిలి్చంది. తర్వాత స్థానాల్లో హైదరాబాద్ (22 శాతం), పుణె (15 శాతం), చెన్నై (12 శాతం) ఉన్నాయి. → బెంగళూరులో ఎక్కువగా అడ్వాన్స్డ్ ఏఐ, ఫిన్ఆప్స్ ఉద్యోగాలకు, హైదరాబాద్లో మలీ్ట–క్లౌడ్ ఇంటిగ్రేషన్ సంబంధ కొలువులకు డిమాండ్ నెలకొంది. పుణె, చెన్నైలో ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ప్లాట్ఫాం ఇంటిగ్రేషన్ మొదలైన విభాగాల్లో నిపుణులకు డిమాండ్ ఉంది.

బంగారం @ 1,31,800
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో పసిడి ధరలు మరో సరికొత్త రికార్డును సృష్టించాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి బుధవారం మరో రూ.1,000 పెరిగి రూ.1,31,800 (పన్నులు సహా) స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కాస్తంత దిగొచ్చింది. కిలోకి రూ.3,000 తగ్గి రూ.1,82,000 (పన్నులు సహా) వద్ద స్థిరపడింది. మంగళవారం వెండి కిలోకి రూ.6,000 పెరిగి ఆల్టైమ్ గరిష్ట ధర రూ.1,85,000ను నమోదు చేయడం తెలిసిందే. పండుగల సీజన్ కావడంతో రిటైలర్లు, జ్యుయలర్ల కొనుగోళ్లతో పసిడి ధరలు పెరిగినట్టు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా బలమైన ర్యాలీ, దేశీయంగా భౌతిక బంగారం కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ తోడవడంతో బంగారం ధర మరో నూతన రికార్డు గరిష్టానికి చేరింది. రూపాయి బలపడడం ధరల ర్యాలీకి కీలక అవరోధంగా వ్యవహరించింది. దీంతో దేశీ మార్కెట్లో ధరల పెరుగుదల పరిమితమైంది. మొత్తం మీద బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. పండుగల కొనుగోళ్లతో ఇదే ధోరణి కొనసాగుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు.

హ్యుందాయ్ పెట్టుబడుల ధమాకా!
ముంబై: కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్) దేశీయంగా భారీ పెట్టుబడులకు తెరతీస్తోంది. దక్షిణ కొరియా మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ కో ప్రెసిడెంట్, సీఈవో జోస్ మునోజ్ 2030కల్లా దేశీ యూనిట్ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా హ్యుందాయ్ కార్ల తయారీ, అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా రెండోపెద్ద కేంద్రంగా భారత్ నిలవనున్నట్లు తెలియజేశారు. భారత్లో తొలిసారి పర్యటిస్తున్న మునోజ్ ఎగుమతుల్లో హెచ్ఎంఐఎల్ వాటా 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా వృద్ధి లక్ష్యాలలో భాగంగా కంపెనీ ఆదాయాన్ని సైతం 1.5 రెట్లు పెంచుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించే ప్రణాళికల్లో ఉన్నట్లు హెచ్ఎంఐఎల్ ఎండీ అన్సూ కిమ్ తెలియజేశారు. ఇందుకు వీలుగా 2030కల్లా 26 ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. వీటిలో 7 కొత్త ప్రొడక్టులకు కంపెనీ తెరతీయనుంది. తద్వారా ఎంపీవీ, ఆఫ్రోడ్ ఎస్యూవీ విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటితోపాటు 2027కల్లా స్థానికంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీని దేశీ మార్కెట్కోసం తయారు చేసే లక్ష్యంతో ఉంది. ఈ బాటలో లగ్జరీ విభాగ బ్రాండ్ జెనిసిస్ను దేశీయంగా 2027కల్లా విడుదల చేయాలని ఆశిస్తోంది. మూడు దశాబ్దాలు దేశీయంగా మూడు దశాబ్దాల విజయం తరువాత గతేడాది ఐపీవో ద్వారా కంపెనీ లిస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి దశ వృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నట్లు మునోజ్ కంపెనీ తొలిసారి నిర్వహించిన ఇన్వెస్టర్ డే సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 2030కల్లా రూ. 45,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల్లో 60 శాతం ప్రొడక్ట్, ఆర్అండ్డీపైనా.. మిగిలిన 40 శాతం సామర్థ్య విస్తరణ, అప్గ్రెడేషన్ కోసం వినియోగించనున్నట్లు వివరించారు. అమ్మకాలరీత్యా ప్రస్తుతం హ్యుందాయ్కు భారత్ మూడో పెద్ద మార్కెట్గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా విజన్కు అనుగుణంగా ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా భారత్ను అభివృద్ధి చేయనున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. కాగా.. కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ 2026 జనవరి 1నుంచి ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలిసారి భారతీయ వ్యక్తికి సారథ్యం అప్పగించడమనేది మాతృ సంస్థకు దేశీ కార్యకలాపాలపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. హ్యుందాయ్ క్యాపిటల్ దేశీయంగా 2026 రెండో త్రైమాసికం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు.చిన్న కార్లు వీడేదిలేదు దేశీయంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఉన్నదని మునోజ్ పేర్కొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అప్గ్రేడ్ కావడానికి వీలయ్యే చిన్న కార్ల విభాగాన్ని వీడబోమని స్పష్టం చేశారు. ఎంట్రీలెవల్ కస్టమర్లు తదుపరి దశలో అప్గ్రేడ్ అయ్యేందుకు వీలయ్యే ప్రొడక్టులపైనా దృష్టి కొనసాగించనున్నట్లు తెలియజేశారు. భారత్ను రెండు మార్కెట్లుగా పేర్కొనవచ్చని, గ్లోబల్ మార్కెట్ల తరహాలో మరిన్ని ఎస్యూవీలు, ఆఫ్రోడ్ వాహనాలకు వీలున్నట్లే మరోపక్క ఎంట్రీలెవల్ కార్లకు డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి ప్రీపెయిడ్ కార్డులు
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఆర్బీఎల్ బ్యాంక్ (RBL Bank), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో భాగస్వామ్యంలో ‘హమ్ సఫర్’ పేరుతో రూపే ప్రీపెయిడ్ కార్డులు ప్రారంభించింది. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ (GFF)లో ఈ ప్రీపెయిడ్ కార్డును ఆవిష్కరించింది.ఈ కార్డ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) అనుభవాన్ని అందించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను సమన్వయపరచడంలో దోహదపడుతుంది. వినియోగదారులు తమ ‘హమ్ సఫర్’ కార్డును తక్షణమే, సురక్షితంగా రీచార్జ్ చేసుకోవచ్చు.ఈ కార్డు ద్వారా వినియోగదారులు ప్రయాణం, ఆహారం, ఇంధనం, షాపింగ్, వినోదం వంటి అనేక అవసరాల కోసం సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది వాడటానికి సులభమైన ప్రీపెయిడ్ పరిష్కారంగా నిలుస్తుంది.హమ్ సఫర్ రూపే కార్డు ముఖ్య ప్రయోజనాలు🔹సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం: మెట్రో, బస్సుల్లో పొడవైన క్యూలను తప్పించుకుని వేగంగా ప్రయాణించవచ్చు.🔹నిరవధిక లావాదేవీలు: రూపే ప్లాట్ఫామ్ ఆధారంగా సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీల అనుభవం.🔹స్మార్ట్ ఖర్చు నిర్వహణ: అవసరమైనంత మొత్తాన్ని ముందుగానే లోడ్ చేసుకొని, ఎక్కువ కార్డులు లేదా నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉపయోగించవచ్చు.🔹మెరుగైన నియంత్రణ: ఖర్చులపై స్పష్టత, బడ్జెట్పై నియంత్రణ సాధ్యమవుతుంది.

ఈ కంపెనీల్లో కెరియర్కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్
ప్రపంచపు అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ (LinkedIn).. 2025 లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా జాబితాను (2025 LinkedIn Top Startups India List) ప్రకటించింది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగ ఆసక్తి, ఎంగేజ్మెంట్, అగ్రశ్రేణి ప్రతిభ ఆకర్షణ వంటి సూచకాలపై ఆధారపడి రూపొందించిన ఈ జాబితా.. వేగంగా ఎదుగుతున్న, అభివృద్ధికి అనుకూలమైన స్టార్టప్లను హైలైట్ చేస్తుంది.అగ్రస్థానాల్లో నిలిచిన స్టార్టప్స్క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో (Zepto) వరుసగా మూడవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఎంటర్ప్రైజ్ క్లౌడ్ స్టోరేజ్ సంస్థ లూసిడిటీ రెండో స్థానంలో, బెంగళూరుకు చెందిన 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే ప్లాట్ఫామ్ స్విష్ మూడో స్థానాన్ని పొందాయి. ఈ సంస్థలు విభిన్న రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, వేగవంతమైన వృద్ధి, టెక్నాలజీలో లోతు, కేటగిరీ సృష్టిలో చురుకుదనంతో నిలిచాయి.ప్రాంతీయ ప్రాముఖ్యతబెంగళూరుకు చెందిన 9 స్టార్టప్స్ టాప్ 20లో చోటు దక్కించుకోగా, ఢిల్లీ, ముంబై ఆధారిత అంకుర సంస్థలు చెరో 2 జాబితాలో చేరాయి. ఇక పుణె(EMotorad), హైదరాబాద్ (Bhanzu) వంటి నగరాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.2025 టాప్ 20 స్టార్టప్స్ జాబితాజెప్టోస్విష్వీక్డేజార్కాన్విన్భాన్జురిఫైన్ ఇండియాఈమోటోరాడ్అట్లిస్ఇంటర్వ్యూ.ఐఓబ్లిస్ క్లబ్ఫస్ట్ క్లబ్స్నాబిట్గోక్విక్డెజెర్వ్న్యూమెకార్డు 91లైమ్ చాట్యాప్స్ ఫర్ భారత్ఉద్యోగ అవకాశాల కోసం చిట్కాలు ఈ జాబితా యువతకు కెరీర్ ఎంపికల్లో స్పష్టతనిచ్చే గైడ్గా నిలుస్తోంది. వేగంగా ఎదుగుతున్న సంస్థలను ఎలా ఎంచుకోవాలో, వాటిలో ఎలా ఉద్యోగం పొందాలో కొన్ని చిట్కాలను లింక్డ్ఇన్ ఇండియా సీనియర్ ఎడిటర్ నిరజితా బెనర్జీ అందించారు. అవి.. * స్టార్టప్ స్కేలింగ్ ట్రెండ్లను గమనించండి* వ్యవస్థాపకుల పట్ల విశ్వాసం, వ్యూహాలను పరిశీలించండి* ఆవిష్కరణతో పాటు కార్యాచరణలో నైపుణ్యం ఉన్న కంపెనీలను ఎంచుకోండి* మార్కెట్ విస్తరణ, ప్రొడక్ట్-మార్కెట్ ఫిట్ను అంచనా వేయండి
కార్పొరేట్

జీసీసీల్లో హైరింగ్ జోరు

యాక్సిస్ బ్యాంక్ లాభం డౌన్

హ్యుందాయ్ పెట్టుబడుల ధమాకా!

ఈ కంపెనీల్లో కెరియర్కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్

వాళ్లు ఇస్తున్న సబ్సిడీలు అన్యాయం: భారత్పై చైనా ఫిర్యాదు

‘ఐయామ్ సారీ.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటా..’

మూడోసారి చంద్రశేఖరన్కే ఓటు

టెక్ దిద్దే కొలువులు!

పసిడి పండుగ..

గూగుల్తో జతకట్టిన ఎయిర్టెల్: ఎందుకంటే?

రూ.1.50 లక్షలకు బంగారం!: నిపుణుల అంచనా..
బంగారం ధరల పెరుగుదల తగ్గే సూచనలు కనిపించడం లేదు. 2...

లాభాలకు బ్రేక్.. మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార...

ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట...

180 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...

‘ఫిషింగ్’ వసతులు మెరుగుపరచాలి
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వీలుగా నీతి ఆయోగ్ కీలక...

ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు ప్రత్...

ఎనిమిదేళ్ల కనిష్టానికి తగ్గిన ధరల దూకుడు
కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు నెమ్మదించడంతో...

త్వరలో అమెరికాతో ఒప్పందం!
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొ...
ఆటోమొబైల్
టెక్నాలజీ

ఐఆర్ఈఈ 2025లో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రదర్శన
భారతీయ రైల్వేల ఆధునికీకరణ నేపథ్యంలో త్వరలో ప్రారంభించబోయే వందే భారత్ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బోగీలు ప్రముఖ ఎగ్జిబిషన్లో దర్శనమివ్వనున్నాయి. అక్టోబర్ 15న ఢిల్లీలో ప్రారంభం కానున్న ఇండియన్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ (ఐఆర్ఈఈ) 2025లో ఈ ఏసీ స్లీపర్ కోచ్ను ప్రదర్శించనున్నారు.సుదూర, మధ్యస్థ ప్రయాణాలకు విమానం లాంటి సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైళ్లను ఆటోమేటిక్ డోర్లు, వైఫై సదుపాయం, విమానం (ఎయిర్ క్రాఫ్ట్)లాంటి డిజైనింగ్లో రూపొందించారు.ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఈవెంట్భారతీయ రైల్వేల సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహిస్తున్న ఐఆర్ఈఈ 2025 ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఎగ్జిబిషన్గా గుర్తింపు పొందింది. కాగా రైల్వేలు, రవాణా రంగంలో ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద ఈవెంట్.ఇతర కోచ్ల ప్రదర్శనఐఆర్ఈఈ 2025లో వందే భారత్ స్లీపర్ కోచ్లతో పాటు చైర్ కార్ కోచ్లు, అమృత్ భారత్ కోచ్లు, తేజస్ భారత్, హమ్సఫర్ కోచ్లు, నమో భారత్ రైళ్లు, మెయిన్లైన్ కోచ్లు కూడా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వే బోర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ధ్రువీకరించారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలకు టీసీఎస్ సన్నద్ధం

బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలకు టీసీఎస్ సన్నద్ధం
ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో అందుకు టెక్నాలజీ సపోర్ట్ అందించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 5జీ కనెక్టివిటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. దాంతో టెలికాం పరికరాల విభాగంలో టీసీఎస్ ఎదిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. గ్లోబల్ టెలికాం కంపెనీలు ఇప్పటికే భారతదేశ టెలికాం రంగంపై ఆసక్తి చూపుతున్నాయని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సక్సరియా చెప్పారు.ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. ‘బీఎస్ఎన్ఎల్కు అందించిన టెక్నాలజీ మౌలిక సదుపాయాలు నాణ్యత పరంగా పరిశ్రమ బెంచ్మార్క్లను మించి ఉన్నాయి. భారత్తోపాటు ఇతర దేశాల్లో కంపెనీ ఈ విభాగంలో విస్తరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బీఎస్ఎన్ఎల్ తదుపరి కనెక్టివిటీ కార్యకలాపాల్లోనూ పాల్గొంటాం. బీఎస్ఎన్ల్ 4జీ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా భారత్లో మాత్రమే కాకుండా 5జీ, ప్రపంచవ్యాప్తంగా 4జీ కోసం ఇలాంటి సర్వీస్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులను చేపట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ కనెక్టివిటీని అందించేందుకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో ఇటీవల ప్రధాని చేతుల మీదుగా దేశంలోని అన్ని టవర్ల పరిధిలో బీఎస్ఎన్ఎల్ 4జీని ప్రారంభించింది. గత మే నెలలో 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి రూ.2,903.22 కోట్ల ఆర్డర్ను అందుకున్నట్లు టీసీఎస్ గతంలో తెలిపింది.ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు..

హెచ్సీఎల్ క్యూ2 ఫ్లాట్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 4,235 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం పుంజుకుని రూ. 31,942 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా(క్యూ1లో రూ. 3,843 కోట్లతో పోలిస్తే) నికర లాభం 10 శాతం ఎగసింది. పూర్తి ఏడాదికి సరీ్వసుల ఆదాయం 4–5 శాతం స్థాయిలో పురోగమించగలదని కంపెనీ తాజాగా అంచనాల(గైడెన్స్)ను సవరించింది. ఇంతక్రితం 3–5 శాతం ఆదాయ అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులందరికీ వేరియబుల్ పే అమలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ నుంచి ఇంక్రిమెంట్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఈ కాలంలో 3,489 మందికి ఉపాధి కల్పించడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,26,440కు చేరింది. ఫ్రెషర్స్తో కలిపి 5,1196 మందిని విధుల్లోకి తీసుకుంది. షేరుకి రూ. 12 డివిడెండ్ వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున హెచ్సీఎల్ టెక్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 17 రికార్డ్ డేట్. క్యూ2లో అడ్వాన్స్డ్ ఏఐ ఆదాయం 10 కోట్ల డాలర్లను(రూ. 876 కోట్లు) అధిగమించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. నిర్వహణ లాభ మార్జిన్ 17.5 శాతంగా నమోదైంది. మార్జిన్లు త్రైమాసికవారీగా 1.16 శాతం బలపడగా.. 16 శాతం అధికంగా 2.6 బిలియన్ డాలర్ల(రూ. 22,500 కోట్లు) విలువైన కాంట్రాక్టులు అందుకుంది. ఎలాంటి భారీ డీల్ లేకుండానే తొలిసారి ఆర్డర్లు 2.5 బిలియన్ డాలర్లను తాకినట్లు విజయకుమార్ పేర్కొన్నారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో గ్లోబల్ డెలివరీ మోడల్ 5 ద్వారా వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్స్ను అధికంగా తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి స్వల్పంగా తగ్గింది. కాగా.. ఆదాయంలో 56 శాతం వాటాగల యూఎస్ బిజినెస్ 2.4 శాతం పుంజుకోగా.. యూరప్ 7.6 శాతం బలపడింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో రూ. 1,495 వద్ద యథాతథంగా ముగిసింది.

జియో ఫ్యామిలీ ప్లాన్.. ఒకేసారి 4 సిమ్లకు..
ప్రీపెయిడ్ వినియోగదారుల తరహాలోనే, జియో తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు కూడా అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు డేటా, అపరిమిత కాలింగ్తో పాటు, పలు ప్రముఖ OTT ప్లాట్ఫారమ్లకు ఉచిత సబ్స్క్రిప్షన్లను కలిగి ఉంటాయి. అందులో ఒకటి రూ.749 పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్. వినియోగదారులకు మెరుగైన డేటా, కాలింగ్, వినోద అనుభవాన్ని అందించే ప్లాన్ ఇది.ప్లాన్ ప్రయోజనాలుఈ పోస్ట్పెయిడ్ ప్లాన్ ధర నెలకు రూ.749. ఇందులో 100 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అదనపు డేటా అవసరమైతే ఒక జీబీకి రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.ఫ్యామిలీ సిమ్ కార్డులుమొత్తం 4 మంది వరకు ప్లాన్ను పంచుకోవచ్చు (ప్రధాన సిమ్తో పాటు 3 అదనపు ఫ్యామిలీ సిమ్స్). ప్రతి అదనపు సిమ్కు 5GB డేటా లభిస్తుంది. ఒక్కో ఫ్యామిలీ సిమ్ కోసం నెలకు రూ.150 అదనంగా చెల్లించాలి.ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్లు* నెట్ఫ్లిక్స్ (మొబైల్ ప్లాన్)* అమెజాన్ ప్రైమ్ లైట్ – 2 సంవత్సరాల ఉచిత సబ్స్క్రిప్షన్* జియో సినిమా, జియో టీవీ – ఉచిత యాక్సెస్* డిస్నీ+ హాట్స్టార్ (మొబైల్)– 3 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్* జియోక్లౌడ్ స్టోరేజ్ – 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ఈ ప్లాన్ కుటుంబ వినియోగదారులకు, ఓటీటీ వినోదాన్ని ఆస్వాదించే వారికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకే ప్లాన్ను కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటే ఇది అద్భుతమైన ఎంపిక.
పర్సనల్ ఫైనాన్స్

అన్ని ఎస్ఎంఎస్లు ఇక రావా? ఆర్బీఐని ఆశ్రయించిన బ్యాంకులు
కొన్ని ఆన్లైన్ లావాదేవీలకు (Digital transactions) సంబంధించిన ఎస్ఎంఎస్ సందేశాలను (SMS Alerts) వినియోగదారులకు పంపడాన్ని బ్యాంకులు భవిష్యత్తులో నిలిపేయవచ్చు. రూ.100 లోపు లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్టులు పంపడాన్ని నిలిపివేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ బ్యాంకులు ఆర్బీఐ (RBI) ని ఆశ్రయించాయి.ఆన్ లైన్లో ముఖ్యంగా యూపీఐ ద్వారా పదీ.. ఇరవై.. ఇలా చిల్లర పేమెంట్లు పెరిగిపోయాయి. వీటికి సంబంధించిన ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. దీంతో అలర్ట్ వ్యవస్థ మందగమనానికి దారితీసిందని, దీంతో కొన్నిసార్లు, కస్టమర్లు పెద్ద లావాదేవీలకు సంబంధించిన సందేశాలను కూడా కోల్పోతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో అంతర్గత సంప్రదింపులు జరిపిన తరువాత గత నెలలో ఆర్బీఐకి ఈ విజ్ఞప్తి చేశామని ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఎస్ఎంఎస్లు నిలిపేసిన పక్షంలో ప్రతిపాదిత ప్రత్యామ్నాయ రక్షణలు ఇంకా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉందని మరొక బ్యాంకింగ్ అధికారి తెలిపారు. ఒక వేళ రూ.100 పరిమితి ఉన్న తక్కువ విలువ లావాదేవీల అలర్టులు కావాలంటే ఎస్ఎంఎస్లు కాకుండా బ్యాంకింగ్ యాప్లు లేదా ఈమెయిల్స్ లో నోటిఫికేషన్ల ద్వారా వాటిని పొందవచ్చని వివరించారు.ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్డుల కోసం కస్టమర్లతో నుంచి నమోదు చేయించుకోవాలి. అయితే ఈమెయిల్ అలర్టులు ఐచ్ఛికం. అంటే ఎస్ఎంఎస్లు ఆటోమేటిక్గా వెళ్తాయి. కానీ ఈమెయిల్ అలర్ట్ లు ఎంచుకున్న వారికి మాత్రమే వెళతాయి.ఒక్క ఎస్ఎంఎస్ పంపడానికి సుమారు 20 పైసలు ఖర్చవుతుంది. ఇది సాధారణంగా వినియోగదారుల మీదే పడుతుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఈ ఖర్చును తామే భరిస్తున్నాయి. అదే ఈమెయిల్ అలర్టులకు అయితే పెద్దగా ఖర్చు ఉండదు.

బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే..
బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ (Street Smarts: Adventures on the Road and in the Markets) చాలా ప్రసిద్ధి చెందింది.ఇటీవల జిమ్ రోజర్స్ (Jim Rogers) బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా కొనుగోలు చేసే ఆలోచన తనకు లేకపోయినా, ధరలు తగ్గితే మరింత కొనడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.రోజర్స్ పెట్టుబడి తత్వం ఇదే..తాను మార్కెట్ భవిష్యత్తు గురించి లెక్కలు వేస్తూ కూర్చోనని, ఎప్పుడైతే వస్తువుల ధరలు పడిపోతాయో అప్పుడే ఎక్కువగా కొనుగోలు చేస్తానని జిమ్ రోజర్స్ చెప్పుకొచ్చారు. బంగారం (gold), వెండి (silver) వంటి విలువైన లోహాలు తన వద్ద ఉన్నాయని, అవి తన పిల్లలకు మిగలాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఇటీవల వెండి ధరలు దూసుకుపోతున్న తరుణంలో తానూ కొంత వెండి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.ప్రపంచంలోని చాలా దేశాలు భారీగా డబ్బును ముద్రిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం వంటి లోహాలు కరెన్సీ డీ-వాల్యుయేషన్ నుండి తమను తాము రక్షించుకునేందుకు మంచి మార్గమని రోజర్స్ చెప్పారు. ‘భారతీయ మహిళలు శతాబ్దాలుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. వారికి ఉన్న తెలివితేటలు నేనూ నేర్చుకుంటున్నాను’ అని ఉదహరించారు.మార్కెట్లపై దృష్టిచైనా మార్కెట్లో కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ, తన ఇతర పోర్ట్ఫోలియోలో చాలా భాగం విక్రయించానన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లు బలంగా ఉండటాన్ని చూస్తే, తన అభిప్రాయం ప్రకారం ఇది అమ్మే సమయం అని చెప్పారు. జిమ్ రోజర్స్ తరచూ మార్కెట్లో వేచి చూసే పెట్టుబడిదారుల సరసన నిలబడతారు. వారు చెబుతున్నది స్పష్టం.. ధరలు పడితేనే కొనండి, ఎప్పుడూ ట్రెండ్ను అనుసరించవద్దు. బంగారం, వెండిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలన్నది ఆయన సలహా.ఇదీ చదవండి: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ నుంచి 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు

టీడీఎస్ రూల్స్.. కొత్త సెక్షన్: రూ. 20వేలు దాటితే..
2025 బడ్జెట్లో ప్రవేశ పెట్టుబడి, చట్టంలో చోటు చేసుకున్న టీడీఎస్కి సంబంధించిన అంశాల రూల్స్ గురించి ఈ వారం తెలుసుకుందాం. ఇవన్నీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంటే నడుస్తున్న సంవత్సరానికి అమల్లోకి వచ్చాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లో పెట్టారు. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములకు జీతం లేదా పారితోషికం మొదలైనవి ఇవ్వడం పరిపాటి. సెక్షన్ 194 క్యూ కొత్తగా వచ్చింది. సంస్థ చేసే చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది.ముఖ్యమైన అంశాలు..2025 ఏప్రిల్ 1 నుంచి అమలుచెల్లింపులు అంటే జీతం, పారితోషికం, వడ్డీ, కమీషన్, బోనస్. సంస్థ నుంచి పార్ట్నర్స్ ఇలా డ్రా చేస్తుంటారు. ఒకప్పుడు వీటిని టీడీఎస్ పరిధిలోకి తీసుకురాలేదు. 2025 ఏప్రిల్ 1 నుంచి వీటన్నింటినీ టీడీఎస్ పరిధిలోకి తెచ్చారు.భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లకు వర్తిస్తుంది.దీనివల్ల కాంప్లయెన్స్, పారదర్శకత పెరుగుతుందని అంటున్నారు. నిజానికి పిలక ముందే దొరుకుతుంది. ముందర కాళ్లకు బంధం.పైన చెప్పిన ఐదు చెల్లింపులు వెరసి .. ఒక్కొక్కటి కాదు.. అన్నీ జాయింటుగా కలిపి సంవత్సరకాలంలో రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. ఎన్నో విషయాల్లో ఒక్కొక్క చెల్లింపునకు ఒక్కొక్క పరిమితి ఉంది. కానీ ఇక్కడ అన్నీ కలిపి రూ. 20,000 దాటితే, టీడీఎస్ అని అంటున్నారు. ఇది ఇటువంటి చెల్లింపుల మీద ఒక కన్నేసి చూడటమా లేదా కన్నెర్ర చేయడమా తెలియడం లేదు.పార్ట్నర్స్ సాధారణంగా విత్డ్రా చేస్తుంటారు. దీన్నే సొంత వాడకాలని అంటారు. ఇటువంటి విత్డ్రాయల్స్ మీద ఎటువంటి టీడీఎస్ లేదు. ఇక నుంచి ట్యాక్స్ ప్లానింగ్పరంగా ఆలోచించి, విత్డ్రాయల్స్ చేయండి.చెల్లింపులు చేతికి రావడం, లేదా అకౌంటుకి క్రెడిట్ చేయడం.. ఈ రెండు పద్ధతుల్లో ఏది ముందు జరిగితే అప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది.టీడీఎస్ రేటు ఎంత అంటే 10 శాతం. వెరసి చెల్లింపులు రూ. 20,000 దాటితే 10 శాతం చొప్పున టీడీఎస్ చేసి, గవర్నమెంట్ ఖాతాలో జమ చేయాల్సిందే.వెరసి చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటకపోతే టీడీఎస్ రూల్స్ వర్తించవు.సెక్షన్ 194 క్యూ ప్రకారం.. జీతాలు, పారితోషికం, కమీషన్, బోనస్, వడ్డీ మొదలైన చెల్లింపులు టీడీఎస్ పరిధిలోకి వస్తాయి.పార్ట్నర్స్కి వారి మూలధనం మీద లేదా అప్పు మీద వడ్డీ ఇచ్చే సంప్రదాయం ఉంది. అందరు పార్ట్నర్స్ ఒక సమాన మొత్తం క్యాపిటల్గా పెట్టలేరు. అలాగే, అందరూ అప్పు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు. అదనంగా పెట్టుబడి చేసినందుకు.. ఆదనపు రాబడే ఈ వడ్డీ.పని చేసినందుకు జీతం ఉంటుంది. స్లీపింగ్ పార్ట్నర్స్కి జీతం ఉండదు.అలాగే పారితోషికం లాభాల ఆర్జనను బట్టి ఉంటుంది. అలాగే బోనస్సు.. అలాగే కమీషనూ. అంటే బుక్స్ క్లోజ్ చేసి లాభాల్ని తేల్చాలి. మార్చి 31వి వెంటనే తేల్చాలి. గడువుతేదీ ఏప్రిల్ 30. అందుకే బుక్స్ వెంటనే రాయాలి. ఈ కొత్త అంశాల వల్ల బుక్ రాసే ప్రక్రియ సజావుగా, కరెక్టుగా, సకాలంలో పూర్తవ్వాలి. ఎప్పుడో రిటర్ను వేసే ముందు తీరిగ్గా అకౌంట్లు రాయడం, ఫైనలైజ్ చేయడం కుదరదు.టీడీఎస్ రికవరీ, చెల్లింపులు.. బుక్స్లో కనిపిస్తాయి.రిటర్నులు దాఖలు చేయాలి. చివరిగా, పార్ట్నర్స్కి చెల్లింపులు టీడీఎస్ మేరకు తగ్గుతాయి. క్యాష్ఫ్లోలు తగ్గుతాయి. సంస్థలో టీడీఎస్ బాధ్యతలు పెరుగుతాయి. ఈ మేరకు సంస్థలు సిద్ధం కావాలి.

లాభాన్ని నష్టంతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నాకు రూ.1.25 లక్షలకు పైగా దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) వచ్చింది. అదే సమయంలో స్వల్పకాల మూలధన నష్టం కూడా ఎదురైంది. ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుని తక్కువ పన్ను చెల్లించడం సాధ్యపడుతుందా? – సత్యనారాయణ గొట్టిపాటిఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాల మూలధన లాభం వచ్చినట్లయితే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాల మూలధన నష్టం (ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చే మొత్తం/ఎస్టీసీఎల్)) ఎదురైతే.. అప్పుడు ఎల్టీసీజీ నుంచి ఎస్టీసీఎల్ను మినహాయించుకోవచ్చు. దీనివల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను భారం తగ్గిపోతుంది. ఈక్విటీ పెట్టుబడిని కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండిన తర్వాత విక్రయించనప్పుడు వచ్చే లాభం/నష్టాన్ని దీర్ఘకాలంగా, ఏడాది నిండకుండా విక్రయించినప్పుడు వచ్చే మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం/నష్టం కింద పరిగణిస్తారు.ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రూ.2 లక్షల దీర్ఘకాల లాభం వచ్చిందని అనుకుందాం. రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు. అప్పుడు మిగిలిన రూ.75,000పై 12.5 శాతం చొప్పున రూ.9,375 పన్ను చెల్లించాలి. ఒకవేళ అదే ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 స్వల్పకాల నష్టం వచ్చిందనుకోండి. నికర దీర్ఘకాల లాభం రూ.75వేలలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. అప్పుడు నికర దీర్ఘకాల మూలధన లాభం రూ.25,000కు తగ్గుతుంది. దీనిపై 12.5 శాతం రేటు ప్రకారం రూ.3,125 పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులపై వచ్చిన నష్టం దీర్ఘకాలానికి సంబంధించి అయితే.. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు. అదే స్వల్పకాల మూలధన నష్టాన్ని స్వల్పకాల మూలధన లాభం, దీర్ఘకాల మూలధన లాభంతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్వల్పకాల నష్టం అన్నది స్వల్పకాల లాభం/దీర్ఘకాల మూలధన లాభం మించి ఉంటే.. అప్పుడు సర్దుబాటు చేసుకోగా మిగిలిన నికర నష్టాన్ని ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు) చేసుకోవచ్చు. ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇంటి లోన్ ఉంది. మరో 5 ఏళ్లకు పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో వచ్చే మొత్తంతో గృహ రుణాన్ని ముందుగానే తీర్చివేయాలా లేక మెరుగైన రాబడి వచ్చే చోట ఇన్వెస్ట్ చేసుకోవాలా? – జ్యోతిర్మయిగృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. గృహ రుణం కాకుండా ఇతర రుణాలు ఉంటే, పెట్టుబడుల కంటే ముందు వాటిని తీర్చేయడం మంచి నిర్ణయం అవుతుంది. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. ఈ రుణం రేటుతో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయి. కనుక గృహ రుణం లాభదాయకమే. ఒకవేళ గృహ రుణాన్ని పూర్తిగా తీర్చివేయడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చని భావిస్తే లేదా భవిష్యత్తు ఆదాయం విషయంలో అనిశ్చితిగా ఉంటే అలాగే ముందుకెళ్లొచ్చు. గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు.