Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Maruti Victoris Global Exports Commence From India1
భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?

మారుతి సుజుకి కంపెనీ.. భారతదేశంలో తయారు చేసిన తన విక్టోరిస్ కారు ఎగుమతులను ప్రారంభించింది. 450 వాహనాల మొదటి బ్యాచ్ ఇటీవల ముంద్రా & పిపావావ్ ఓడరేవుల నుంచి రవాణా తరలించింది. అయితే సంస్థ ఈ కారును 'అక్రాస్' పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయించనుంది.మారుతి సుజుకి విక్టోరిస్ కారును లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా.. కంపెనీ ఎండీ & సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, ''మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'' అనే దార్శనికత ద్వారా ఎగుమతి చేస్తున్నాము. 2025లో దేశం నుంచి 3.9 లక్షల వాహనాలను ఎగుమతి చేసి.. వరుసగా ఐదవ సంవత్సరం భారతదేశపు నంబర్ వన్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా అవతరించామని అన్నారు. ఈ ఏడాది ఈ-విటారా ద్వారా ఎగుమతులను ప్రారంభించామని పేర్కొన్నారు.విక్టోరిస్ కారు గురించిమారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

54878 Houses for Sale in Hyderabad Know The Details2
54878 ఇళ్లు.. ఫర్ సేల్!

ఒకవైపు హైదరాబాద్‌లో గృహ విక్రయాలు వృద్ధి చెందుతున్నప్పటికీ.. మరోవైపు అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కూడా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ప్రారంభమైన అందుబాటు, మధ్యస్థ ధరల ఇళ్ల వాటా అధికంగా ఉండటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రస్తుతం నగరంలో 54,878 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. గతేడాదితో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం మేర పెరిగింది. ముంబై, ఎన్‌సీఆర్‌(ఢిల్లీ) ల తర్వాతే అత్యధికం మన దగ్గరే ఇన్వెంటరీ అధికంగా ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరోరూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్టాక్‌లో అధికంగా ఉన్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్లు ఏకంగా 20,069 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 7.4 త్రైమాసికాలు పడుతుంది. ఇక, రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు 5,638 ఉన్నాయి. వీటి అమ్మకానికి ఏకంగా 10.4 త్రైమాసికాలు పడుతుంది. అఫర్డబుల్‌ ఇళ్ల కొనుగోలుదారులు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉండే ఇళ్ల వాటా గణనీయంగా తగ్గాయి. 2024 హెచ్‌–2తో పోలిస్తే ఈ విభాగం వాటా 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గగా.. రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల లాంచింగ్స్‌ వాటా 25 శాతం నుంచి 23 శాతానికి క్షీణించాయి.ప్రీమియం యూనిట్లు తక్కువే..ఇన్వెంటరీలో ప్రీమియం ఇళ్ల వాటా కాస్త తక్కువగానే ఉన్నాయి. రూ.1.2 కోట్ల ధర ఉన్న గృహాలు 18,825 ఉన్నాయి. రూ.2.5 కోట్ల ధర ఉన్న యూనిట్లు 8,468, రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న ఇళ్లు 1,628, రూ.10 నుంచి రూ.20 కోట్ల ధర ఉన్నవి 92, రూ.20 నుంచి రూ.50 కోట్ల ధర ఉన్న యూనిట్లు 158 ఉన్నాయి.38,403 ఇళ్ల విక్రయం..2025లో నగర నివాస మార్కెట్‌ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్లలో నమ్మకం, ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. గతేడాది హైదరాబాద్‌లో 38,403 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాది 2024తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇక, 2025లో నగరంలో కొత్తగా 40,737 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. ప్రాజెక్ట్‌ లాచింగ్స్‌ కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడం, నియంత్రణ పరిమితుల కారణంగా 2024 హెచ్‌–2తో పోలిస్తే లాచింగ్స్‌ 7 శాతం మేర క్షీణించాయి.2025లో హైదరాబాద్‌ కార్యాలయ సముదాయాలు వార్షిక లావాదేవీలు 1.14 కోట్ల చ.అ.లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అయితే ఆఫీసు స్పేస్‌ సప్లై పరిమితంగా ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి రేటు కారణంగా లావాదేవీలు పెరిగాయి.

Do You Know Mukesh Ambani Antilia First Month Power Bill3
అంబానీ నెల కరెంట్‌ బిల్లు.. లగ్జరీ కారే కొనేయొచ్చు!

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం అంటిలియా (Antilia) గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. అయితే.. సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ భవనానికి నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.2010లో అంబానీ.. ముంబయిలోని ‘అంటిలియా’కు మారిన తరువాత, మొదటి నెలలో 637240 యూనిట్ల విద్యుత్తును వినియోగించినట్లు, దీనికోసం కరెంట్ బిల్ ఏకంగా రూ.70,69,488గా చెల్లించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ బిల్లును సకాలంలో చెల్లించడం వల్ల.. అంబానీకి రూ.48,354 డిస్కౌంట్‌ కూడా లభించిందని సమాచారం. అంటిలియా భవనం ఉపయోగించే కరెంట్ దాదాపు 7000 సగటు ముంబై గృహాల నెలవారీ విద్యుత్ వినియోగానికి సమానం.అంటిలియా ప్రత్యేకతలుముంబై నగరంలో నిర్మించిన.. ముఖేష్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్‌లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు.ఔట్ డోర్ ఏసీ లేదు!ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు.

Apartment Area Calculation Explained For Homebuyers4
ఇల్లు కొనే సమయంలో వచ్చే సందేహాలు..

అపార్ట్‌మెంట్, గేటెడ్‌ కమ్యూనిటీలలో ఇల్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబంధించి చాలా అయోమయం ఉంటుంది. డెవలపర్లు కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియా అనే చెబుతుంటే.. చాలా మందికి వీటిపై అవగాహన ఉండదు. బిల్డర్‌ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏయే ఏరియాలు కలిసుంటాయి? మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్‌ ఏరియా పోనూ మనకు వచ్చే ఏరియా ఎంత? మనం ఇంటి కోసం వెచ్చించే డబ్బులకు మన ఫ్లాట్‌లో ఎంత ఏరియా వస్తుంది? ఇలాంటి సందేహాలను ఈ కథనంతో నివృత్తి చేసుకుందాం.. -సాక్షి, సిటీబ్యూరోసాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్‌ తర్వాత అందరూ చూసేది ఇంటికి సంబంధించిన విస్తీర్ణాన్నే. వారి అవసరాలకు అనుగుణంగా ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటారు. అయితే ఇల్లు కొనుగోలు చేసేందుకు వెళ్తే వారికి కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియాలపై అవగాహన ఉంటే తమ కుటుంబ అవసరాలకు ఆయా విస్తీర్ణం సరిపోతుందో లేదో నిర్ణయించుకునే వీలుంటుంది. అలాగే మనం వెచి్చంచే ఇంటికి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు వస్తుందనే అంశంపై స్పష్టత వస్తుంది.మామూలుగా గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ను కొనుగోలు చేసే సమయంలో కార్పెట్‌ ఏరియా ప్రధానమైనది. ఇంటికి సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం మొత్తం కార్పెట్‌ ఏరియా కిందికి వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్, పడక గదులు, వంట గది, స్నానాల గదులు వరకు కార్పెట్‌ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్‌ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవచ్చు.ఆ తర్వాత ఇంటికి సంబంధించి ప్రధానమైంది బిల్టప్‌ ఏరియా. కార్పెట్‌ ఏరియాతో పాటు ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్టప్‌ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే బిల్టప్‌ ఏరియాతో పాటు మిగిలిన ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్లు, మెట్లు, లిఫ్ట్‌ మార్గాలు, క్లబ్‌ హౌస్‌ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్‌ వాటా కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు ఫైనల్‌గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్‌ లేదా సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా పరిగణిస్తుంటారు. అంటే మనం బిల్డర్‌ నుంచి కొనే మొత్తం ఇంటి విస్తీర్ణంలో మన ఇంటి విస్తీర్ణానికి సంబంధించిన కార్పెట్‌ ఏరియా సుమారుగా 70 శాతంగా వస్తుంది.ఇలా లెక్కించండి..ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీలలో డెవలపర్లు వసతులకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సహజంగానే 30 శాతం విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. అంటే మనం బిల్డర్‌ నుంచి కొనుగోలు చేసే మొత్తం ఇంటి విస్తీర్ణంలో 30 శాతం కామన్‌ ఏరియా కలుపుకొని సూపర్‌ బిల్టప్‌ ఏరియాను లెక్కేసుకోవాలి. ఉదాహరణకు బిల్డర్‌ దగ్గర 2,000 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్‌ తీసుకుంటే.. ఇంటి లోపల వచ్చే కార్పెట్‌ ఏరియా సుమారుగా 1,400 చ.అ.లు మాత్రమే ఉంటుందన్నమాట.ఉదాహరణకు మనం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుందాం. ఈ లెక్కన మనం వ్యక్తిగతంగా వినియోగించే 1,400 చ.అ. కార్పెట్‌ ఏరియాకు మనం చెల్లించాల్సిన సొమ్ము మొత్తం రూ.1.40 కోట్లు. కానీ, మనం బిల్డర్‌కు చెల్లించేది మాత్రం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌కు రూ.2 కోట్లు చెల్లిస్తాం. అంటే మన కార్పెట్‌ ఏరియాకు మనం చెల్లించే సొమ్ము చ.అ.కు రూ.14,285లకు పెరిగిందన్నమాట.మిగిలిన సొమ్ము బిల్టప్, కామన్‌ ఏరియాలకు చెల్లించామన్నమాట. కాబట్టి అపార్ట్‌మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనం చెల్లించే సొమ్ముకు, మనకు వచ్చే విస్తీర్ణం ఎంతనేది డెవలపర్ల నుంచి స్పష్టత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Keep 1 KG Gold And Wait Till  2040 You May Be Able To Buy Private Jet5
అవునా.. నిజమా!.. ఇది సాధ్యమా?

బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,780 వద్ద ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.''1990లో ఒక కేజీ బంగారంతో.. మారుతి 800 వచ్చేది. 2000లో మారుతి ఎస్టీమ్, 2005లో ఇన్నోవా, 2010లో ఫార్చ్యూనర్, 2019లో బీఎండబ్ల్యు ఎక్స్1, 2025లో డిఫెండర్, 2030 నాటికి రోల్స్ రాయిస్ కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఒక కేజీ బంగారం కొని 2040 వరకు వేచి ఉండండి.. మీరు ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేయగలుగుతారు'' అని వివరించారు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఈ రోజు రేటు ప్రకారం.. ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ బంగారం విలువ రూ. 1,43,78,000. ఈ ధరలో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. ధరలు ఇలాగే కొనసాగితే.. 2040 నాటికి ఒక కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఒకవేళా గోల్డ్ రేటు తగ్గితే.. అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది.Interesting Economics & Observation:1990 .....1KG gold = Maruti 8002000......1KG gold = Esteem2005......1KG Gold = Innova2010......1KG Gold = Fortuner2019.....1KG Gold = BMW X12025…..1Kg #Gold = Defender2030….. 1kg #Gold = Rolls RoyceKeep 1 KG #gold & wait till…— A K Mandhan (@A_K_Mandhan) January 15, 2026

Animal rights activists suspect magnesium sulphate used in mass killing6
తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధికుక్కల పట్ల అత్యంత క్రూరమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. జంతు సంక్షేమ నిబంధనలను తుంగలో తొక్కి మెగ్నీషియం సల్ఫేట్ వంటి రసాయనాలను ఉపయోగించి కుక్కలను సామూహికంగా హతమారుస్తున్నట్లు జంతు పరిరక్షణ కార్యకర్తలు, పశువైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విషప్రయోగం - అత్యంత బాధాకరమైన మరణంసాధారణంగా వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే మెగ్నీషియం సల్ఫేట్ మార్కెట్‌లో తక్కువ ధరకు సులభంగా లభిస్తుంది. దీన్ని ద్రవ రూపంలోకి మార్చి నిపుణుల ద్వారా కుక్కల గుండెకు నేరుగా ఇంజెక్ట్ చేస్తున్నారని సమాచారం. ‘ఇది చాలా పాత, క్రూరమైన పద్ధతి. మెగ్నీషియం సల్ఫేట్‌ను నేరుగా గుండెకు ఇంజెక్ట్ చేయడం వల్ల జంతువులకు తక్షణమే అత్యంత బాధాకరమైన మరణం సంభవిస్తుంది. ఇది సాధారణ వ్యక్తులు చేసే పని కాదు, శిక్షణ పొందిన వారే ఇలా చేస్తున్నారు’ అని ఒక సీనియర్ పశువైద్యుడు వెల్లడించారు.విచ్చలవిడిగా రసాయనాల వాడకంకుక్కలను చంపడానికి కేవలం మెగ్నీషియం సల్ఫేట్ మాత్రమే కాకుండా ‘స్ట్రిక్‌నైన్‌ హైడ్రోక్లోరైడ్’ వంటి ప్రమాదకర రసాయనాలను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 5 గ్రాముల స్ట్రిక్‌నైన్‌ హైడ్రోక్లోరైడ్ పొడితో వందలాది కుక్కలను చంపవచ్చు. దీన్ని మాంసంలో కలిపి ఎరగా వేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు సైనైడ్ ఉపయోగించి కూడా కుక్కలను చంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘కొంగ మందు’ అని పిలిచే సాంప్రదాయ మందులను కూడా ఆహారంలో కలిపి ఇచ్చి కుక్కల ప్రాణాలు తీస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI) నిబంధనల ప్రకారం, వీధికుక్కలను చంపడం నేరం. కేవలం నయం చేయలేని వ్యాధులు ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక గాయాలైనప్పుడు మాత్రమే శాంతియుత మరణానికి ప్రత్యేక పద్ధతులు అనుసరించాలి. ఇందుకోసం ప్రభుత్వం, జంతు సంక్షేమ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాయి.దీని ప్రకారం, ప్రాణాంతక వ్యాధులు లేదా తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న కుక్కలకు మాత్రమే అనుమతుల మేరకు పెంటనాల్ సోడియం, సోడియం థియోపెన్టోన్ వంటి మందులను ఉపయోగించి శాంతియుత మరణం ప్రసాదించాలి. అయితే, ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా మెగ్నీషియం సల్ఫేట్, సైనైడ్, స్ట్రిక్‌నైన్‌ హైడ్రోక్లోరైడ్‌ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కుక్కలను అక్రమంగా హతమారుస్తున్నారు.సులభంగా అందుబాటులో..ఈ మందుల లభ్యత విషయంలో కూడా చాలా అనుమానాలున్నాయి. పెంటనాల్ సోడియం వంటి మందులు కేవలం అధికారిక ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే లభిస్తాయి. వీటి వినియోగంపై కఠినమైన నిఘా ఉంటుంది. దీనికి భిన్నంగా కుక్కలను చంపడానికి వాడుతున్న ఇతర రసాయనాలు సాధారణ రిటైల్ దుకాణాల్లో ఎటువంటి పరిమితులు లేకుండా ఎవరికైనా సులభంగా దొరుకుతున్నాయి. ఇది అసాంఘిక శక్తులకు, నిబంధనలు ఉల్లంఘించే వారికి వరంగా మారింది.నిబంధనల ప్రకారం, ఏదైనా జంతువుకు ప్రాణాపాయ స్థితిలో మందు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా అర్హత కలిగిన వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిపుణులు కాని వారిని నియమించి ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండా సామూహికంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం. ఇలాంటి అక్రమ పద్ధతులు జంతు హింసను ప్రోత్సహించడమే కాకుండా చట్టంలోని నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లేనని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విష రసాయనాల విక్రయాలపై నియంత్రణ విధించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!

Advertisement
Advertisement
Advertisement