Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 11 February 2026 in Telugu states1
బంగారం ధరల్లో స్వల్ప ఊరట

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Why Salesforce layoffs nearly 1000 jobs globally2
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్‌ బాంబు!

క్లౌడ్ సర్వీసులందించే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ తమ సంస్థలో భారీ మార్పులు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచుతూ, పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఫిబ్రవరి ప్రారంభంలో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం ఈ లేఆఫ్స్ కేవలం సాధారణ విభాగాలకే పరిమితం కాలేదు. కంపెనీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏజెంట్ ఫోర్స్ ఏఐ ఉత్పత్తి విభాగంతో పాటు ఇతర విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం పడింది.కంపెనీలో పనిచేస్తున్న మార్కెటింగ్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లోనూ ఈ లేఆఫ్స్‌ ప్రభావం పడింది. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లు, కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం సంస్థ తన ఏఐ కార్యకలాపాలను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టెక్ పరిశ్రమలో లేఆఫ్స్ పరంపరఏఐ టూల్స్‌కు పెరుగుతున్న ఆదరణతో కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగ కోతలను విధిస్తున్నాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో అమెజాన్ ఏకంగా 16,000 కొలువులను తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ మాట్లాడుతూ.. ఏఐ ప్రభావం వల్ల కస్టమర్ సపోర్ట్ విభాగంలో తక్కువ మంది సిబ్బంది సరిపోతారని అందుకే అప్పట్లో 4,000 మంది ఉద్యోగులను తగ్గించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Stock market updates on 11 February 20263
26,000 మార్కు చేరువలో నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-02-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

RBI confirmed six NBFCs surrendered their licenses4
ఆరు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సుల సరెండర్‌

అనుబంధ సంస్థల్లో విలీనం కావడంతో టాటా మోటర్స్‌ ఫైనాన్స్, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తమ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్సులను రిజర్వ్‌ బ్యాంకుకి సరెండర్‌ చేశాయి. వీటితో పాటు మరో ఆరు సంస్థలు తమ లైసెన్సులను తిరిగి ఇచ్చేశాయి. ఏఏఆర్‌ శ్యామ్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, రామా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, శ్రీ రామచంద్ర ఎంటర్‌ప్రైజెస్, శ్రీ నిర్మాణ్, అంకిత ప్రతిష్టాన్, మయూఖ ఇన్వెస్ట్‌మెంట్‌ ఈ జాబితాలో ఉన్నాయి. టాటా క్యాపిటల్‌లో టాటా మోటర్స్‌ ఫైనాన్స్‌ గతేడాది మే 8న విలీనమైంది. 2025 సెప్టెంబర్‌లో పిరమాల్‌ ఫైనాన్స్‌లో పిరమాల్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలీనమైంది.మరోవైపు, నిర్దిష్ట ఎన్‌బీఎఫ్‌సీలకు రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు సంబంధించిన ముసాయిదా సవరణలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా సంబంధిత వర్గాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించింది. మార్చి 4 లోగా వీటిని ఆర్‌బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిపాదనల ప్రకారం ప్రజల నుంచి నిధులు స్వీకరించని, కస్టమర్లకోసం ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌ లేని, అసెట్స్‌ పరిమాణం రూ. 1,000 కోట్ల లోపు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ చేయించుకోనక్కరలేదు. చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు నో రిజిస్ట్రేషన్‌ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇకపై ఆర్‌బీఐ వద్ద నమోదు (రిజిస్టర్‌) చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా రూ.1,000 కోట్ల లోపు ఆస్తులున్న వాటికి రిజి్రస్టేషన్‌ నుంచి మినహాయింపును ఆర్‌బీఐ ప్రతిపాదించింది. వీటిని టైప్‌–ఐగా వర్గీకరించనుంది. ఈ మేరకు ముసాయి దా సర్క్యులర్‌ను జారీ చేసింది. వీటిల్లో రిస్క్‌ తక్కువగా ఉండడం వల్లే ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్‌ 45ఏఐ కింద ప్రతీ ఎన్‌బీఎఫ్‌సీ సేవలు అందించేందుకు రిజి్రస్టేషన్‌ పొందడం తప్పనిసరి. కాకపోతే రూ.1,000 కోట్లలోపున్నవి తమ సొంత నిధులనే పెట్టుబడులుగా వినియోగిస్తాయి కనుక, వాటితో వ్యవస్థాగత రిస్క్‌ తక్కువేనని ఆర్‌బీఐ పేర్కొంది. ఒకవేళ ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరిస్తున్నా లేదా కస్టమర్‌ ఇంటర్‌ఫేస్‌ (శాఖలు/యాప్‌/డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు) కలిగి ఉంటే ఇకమీదటా రిజిస్ట్రేషన్‌ తీసుకోవడం తప్పనిసరి అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Zscaler AI Security Report highlights India rapid rise in enterprise AI5
ఏఐ వినియోగంలో భారత్‌ జోరు

దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్‌ప్రైజ్‌ విభాగంలో ఏఐ/ఎంఎల్‌ (మెషిన్‌ లెర్నిగ్‌) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్‌ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్‌ పేర్కొంది. ఏజెంటిక్‌ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్‌ మధ్య జీస్కేలర్‌ జీరో ట్రస్ట్‌ ఎక్సే్చంజ్‌ ప్లాట్‌ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్‌ లెరి్నంగ్‌ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్‌ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్‌లో ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్, ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఆంథ్రోపిక్‌ సీఈవో డేరియో, క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో ఎమోన్‌ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్‌ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్‌ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్‌ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్‌–ఫస్ట్‌ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్‌ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్‌ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్‌–ఇన్సూరెన్స్‌ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్‌ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్‌ డిమాండ్‌కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్‌లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్‌ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్‌క్రిమినల్స్, నిఘా గ్రూప్‌లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్‌ వేగంతో, భారీ స్థాయిలో సైబర్‌ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్‌లోకి 18,000 టెరాబైట్స్‌ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్‌ ఫొటోలకు సమానం. ఏజెంటిక్‌ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్‌లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్‌ జీరో ట్రస్ట్‌ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

major developments NSE India and India Post have just been announced6
ఎన్‌ఎస్‌ఈ, ఇండియా పోస్ట్‌ జట్టు

మ్యుచువల్‌ ఫండ్స్‌ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా పోస్టల్‌ శాఖ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) జట్టు కట్టాయి. ఇందుకోసం ఇండియా పోస్ట్‌కి చెందిన 1.64 లక్షల పోస్టాఫీసుల విస్తృత నెట్‌వర్క్‌ని, ఎన్‌ఎస్‌ఈ ఎంఎఫ్‌ ఇన్వెస్ట్‌ ప్లాట్‌ఫాంని ఉపయోగించుకోనున్నాయి. తొలి దశలో చిన్న పథకాలతో మొదలుపెట్టి రెండో దశలో పూర్తి స్థాయి స్కీములు, పోర్ట్‌ఫోలియో అనలిటిక్స్, ప్రాంతీయ భాషల్లో సపోర్ట్, సలహా సేవలను అందుబాటులోకి తేనున్నాయి.గ్రామీణ, చిన్న పట్టణాల్లోని వారు తమ దగ్గరుండే పొదుపు మొత్తాలను, సంపద సృష్టికి ఉపయోగపడే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేలా ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం మ్యుచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం రూ.81 లక్షల కోట్లకు చేరింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Advertisement
Advertisement
Advertisement