Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ferrari 849 Testarossa Debuts in India1
రూ.10 కోట్ల ఫెరారీ కారు: దీని గురించి తెలుసా?

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ.. భారతదేశంలో కొత్త ఫెరారీ 849 టెస్టరోస్సాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 10.37 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది గ్లోబల్ లైనప్‌లో ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్థానంలో ఉంటుంది.ఫెరారీ 849 టెస్టరోస్సా కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడిన 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది దాదాపు 1,050 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి ఈ కారు ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ఫెరారీగా నిలిచింది. 849 టెస్టరోస్సా 2.3 సెకన్ల కాలంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 330 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం ద్వారా 25 కిమీ పరిధి లభిస్తుంది.కొత్త మోడల్ క్లాసిక్ టెస్టరోస్సా నుంచి ప్రేరణ పొందటం వల్ల కొత్త ఫెరారీ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. లేటెస్ట్ ఏరోడైనమిక్ ఎలిమెంట్స్, షార్ప్ బాడీవర్క్‌తో వస్తుంది. ఛాసిస్ కూడా అప్‌గ్రేడ్‌లను పొందింది. ఈ కొత్త మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

The Rise of Landscaping and Co Working Spaces in Modern Communities2
ఆహ్లాదకర వాతావరణం.. ల్యాండ్‌ స్కేపింగ్‌ అనివార్యం!

వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్‌ స్కేపింగ్‌ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్‌ కమ్యూనిటీలోనే ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు.పురుగు మందులు, రసాయనాలతో గాలి, నేల కలుషితమవుతుంది. దీంతో సేంద్రీయ, సస్టయినబుల్‌ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. సువాసన, ఆకర్షణీయమైన పూలమొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్‌వేలు, డెక్‌లు, టెర్రస్‌ వంటి ప్రాంతాల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్‌ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్‌ ఈవెంట్లు, పార్టీలు చేసుకునేందుకు అనువైన వేదికగా ఉంటుంది.క్లబ్‌హౌస్‌లో కో-వర్కింగ్‌ ప్లేస్‌కరోనాతో మొదలైన వర్క్‌ ఫ్రం హోమ్‌ అక్కడక్కడా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇప్పటికీ ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్‌ ఆఫీస్‌ కోసం వినియోగిస్తే గృహ కొనుగోలుదారులు ఒప్పుకోవడం లేదు.ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్‌ స్పేస్‌ ఇస్తే ఇష్టపడటం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్‌ స్పేస్, హై నెట్‌వర్క్‌ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నాయి. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అంతా కలిసి ఒకే చోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసుకుంటున్నారు. పైగా అవసరమైనప్పుడు వెంటనే ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది.

Akasa Air Flight Ticket Charges Have Increased3
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్‌ ఫ్లయిట్‌ టికెట్ చార్జీలు

ఇతర విమానయాన సంస్థల బాటలోనే ఆకాశ ఎయిర్‌ కూడా తమ ఫ్లయిట్‌ టికెట్లపై ఇంధన సర్‌చార్జీ విధించనున్నట్లు ప్రకటించింది. దేశ, విదేశ రూట్లను బట్టి చార్జీలు రూ. 199 నుంచి రూ. 1,300 వరకు ఉంటాయి. ఇది మార్చి 15 (నేడు) నుంచి అమల్లోకి వస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇంధనాల రేట్లు భగ్గుమన్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్‌ ఈ చార్జీలు విధిస్తున్నాయి. సాధారణంగా విమానయాన సంస్థల వ్యయాల్లో ఇంధనం భారం 40 శాతం స్థాయిలో ఉంటుంది.

Employee Requests Sick Leave Founder Rejects It And Orders HR To Dock Pay4
సిక్ లీవ్ అడిగితే జీతం కోత!

ఇటీవల నోయిడాలోని ఒక SaaS స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్..చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా ఇండియన్ స్టార్టప్ కంపెనీలలో ఉన్న పనిసంస్కృతి గురించి పెద్ద చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. SaaS స్టార్టప్‌లో సపోర్ట్ ఉద్యోగిగా వ్యక్తికి.. ఒక రోజు అతని ప్రాంతంలో రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సరిగా నిద్రపట్టలేదు. నిద్రలేమి వల్ల అతను అలసటగా అనిపించింది. దీంతో ఆ రోజు పని చేయలేనని భావించి.. హెచ్ఆర్ విభాగానికి ఒక సిక్ లీవ్ కోసం ఈమెయిల్ పంపాడు. ఆ ఉద్యోగి చెప్పినట్టు, ఆరు నెలల్లో ఇది అతను తీసుకున్న రెండో సెలవు మాత్రమే.అయినప్పటికీ.. అతను ఊహించని విధంగా కంపెనీ ఫౌండర్ స్వయంగా ఆ ఈమెయిల్‌కు స్పందించారు. ఆ ఉద్యోగికి ఒకరోజు జీతం కోత పెట్టాలని HRకు సూచించారు. అదే రోజు సెలవు తీసుకోవడం కుదరదని కూడా చెప్పారు. అంతే కాకుండా.. ఫౌండర్ ఆ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యోగి తాను అస్వస్థంగా ఉన్నానని చెప్పినా, ఫౌండర్ 'నీ వాయిస్ చూస్తే నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది' అని చెప్పారు. ఇది ఆ ఉద్యోగికి చాలా బాధ కలిగించింది.ఇదీ చదవండి: మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు స్పందించారు. వ్యవస్థాపకులు చాలా సున్నితంగా వ్యవహరించాలి అని కొందరు చెబితే.. మరికొందరు ఆ ఉద్యోగిని వేరే ఉద్యోగం చూసుకోమని సలహా ఇచ్చారు. ఈ వ్యవస్థాపకులు లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏమి ఆలోచిస్తారో నాకు అర్థం కావడం లేదు. వారి ఉద్యోగులతో సరిగ్గా వ్యవహరించలేరు. వారు మనల్ని ఏమని భావిస్తారు? అని ఇంకొందరు అంటున్నారు.

India Passenger Vehicle Wholesale Sales Rise 10 6 Percent in February SIAM Report5
సియామ్‌ నివేదికలో కీలక అంశాలు: వాహన విక్రయాలు ఇలా..

దేశీయంగా ఫిబ్రవరిలో సానుకూల పరిస్థితులతో ప్యాసింజర్‌ వాహన టోకు అమ్మకాలు (కంపెనీల నుంచి డీలర్లకు) 4,17,705 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 3,77,689 యూనిట్లతో పోలిస్తే 10.6 శాతం పెరిగినట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది.ప్యాసింజర్‌ వాహనాలు, టూ–వీలర్లు, త్రీ–వీలర్ల అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయని, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా మార్చిలో పండుగలపరమైన సానుకూల అంచనాలు నెలకొన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధంతో తయారీ, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉందని పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ పరిణామాలను పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు.సియామ్‌ నివేదికలో మరిన్ని కీలకాంశాలు..➤యుటిలిటీ వాహనాల అమ్మకాలు 2,08,795 యూనిట్ల నుంచి 13.5 శాతం పెరిగి 2,36,957 యూనిట్లకు చేరాయి.➤ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 1,10,966 నుంచి 3.8 శాతం క్షీణించి 1,06,799 యూనిట్లకు పరిమితమయ్యాయి.➤వ్యాన్ల అమ్మకాలు 1.1 శాతం పెరిగి 11,493 యూనిట్ల నుంచి 11,620 యూనిట్లకు చేరాయి.➤ద్విచక్ర వాహన విక్రయాలు 13,84,605 యూనిట్ల నుంచి 35.2 శాతం వృద్ధితో 18,71,406కి పెరిగాయి. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 30.8 శాతం పెరిగి 10,96,537 యూనిట్లకు, స్కూటర్లు 42.3 శాతం వృద్ధితో 5,12,783 యూనిట్లకు చేరాయి.➤త్రీ–వీలర్ల విక్రయాలు 29 శాతం వృద్ధితో 57,788 యూనిట్ల నుంచి 74,573 యూనిట్లకు పెరిగాయి.

India pumps up Russia oil buy by 50 Percent in March6
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు

న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్‌ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్‌ బ్యారెళ్లు హర్మూజ్‌ జలసంధి నుంచే భారత్‌కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్‌పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్‌ఎన్‌జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్‌ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్‌ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్‌ అనలిస్ట్‌ సుమిత్‌ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్‌పీజీ వినియోగం ఒక మిలియన్‌ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్‌ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్‌పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement