Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Anant Ambani Appeals To Colombia To Save 80 Hippos1
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ

కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో.. ఒక పర్యావరణ సమస్య తలెత్తింది. ఇక్కడ సుమారు 200 వరకు హిప్పోపొటమస్‌లు జీవిస్తున్నాయి. వీటి వల్ల స్థానిక జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతపై ప్రభావం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆపాలని అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వంతారా స్థాపకులు అయిన అనంత్ అంబానీ.. హిప్పోలను చంపాలనే నిర్ణయం సరికాదని వెల్లడించారు. జంతువులను చంపడం కంటే, వాటిని సురక్షితంగా మరో ప్రదేశానికి తరలించడం ఒక మంచి పరిష్కారం అని అన్నారు. ఈ విషయంపై కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్‌కు ఒక లేఖ రాశారు.అనంత్ అంబానీ రాసిన లేఖలో.. 80 హిప్పోపొటమస్‌లను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారాకు తరలించవచ్చని, ఇక్కడ జంతువులకు అనుకూలమైన సహజ వాతావరణం, వైద్య సదుపాయాలు, శాశ్వత సంరక్షణ అందుబాటులో ఉంటాయని చెప్పారు. జంతువులను చంపడం కంటే.. ఇది సరైన ప్రత్యామ్నాయం అని అన్నారు.''ఆ ఎనభై హిప్పోలు తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేదు, అలాగే తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా సృష్టించుకోలేదు'' కాబట్టి వాటిని చంపడం తగదు. సురక్షితమైన పరిష్కారం ద్వారా వాటిని కాపాడే సామర్థ్యం మనకు ఉంటే, ప్రయత్నించాల్సిన బాధ్యత మనపై ఉందని అనంత్ అంబానీ అన్నారు.వంతారా గురించిగుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా, ప్రపంచంలోనే అతిపెద్ద. అత్యంత అధునాతన వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ.. పరిరక్షణ కేంద్రాలలో ఒకటి. అనంత్ అంబానీ దీనిని 3000 ఎకరాల్లో (కృత్రిమ అడవి) ఏర్పాటు చేసి.. జంతువులకు రక్షిస్తున్నారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

Stock Market Closing Update 28th April 20262
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 416.73 పాయింట్లు లేదా 0.54 శాతం నష్టంతో 76,886.91 వద్ద, నిఫ్టీ 97.00 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,995.70 వద్ద నిలిచాయి.అబాన్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్, వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఊర్జా గ్లోబల్ లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎమామి రియల్టీ లిమిటెడ్, యూనికామర్స్ ఇ-సొల్యూషన్స్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విసాగర్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

NSE Sells 1 Percent Stake In Indian Gas Exchange To Comply With Regulatory Norm3
ఐజీఎక్స్‌లో 1 శాతం వాటా విక్రయం!

స్టాక్‌ ఎక్స్చేంజీ దిగ్గజం.. ఎన్‌ఎస్‌ఈ తాజాగా ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్చేంజీ(ఐజీఎక్స్‌)లో 1 శాతం వాటా విక్రయించింది. నేచురల్‌ గ్యాస్‌ డెలివరీ ఆధారిత ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐజీఎక్స్‌లో వాటాను నియంత్రణ సంస్థల నిబంధలనమేరకు అమ్మినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఐజీఎక్స్‌లో ఏ ఒక్క సంస్థ 25 శాతానికి మించి వాటాను కలిగి ఉండటాన్ని పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ నియంత్రణ సంస్థ(పీఎన్‌జీఆర్‌బీ) మార్గదర్శకాలు అనుమతించవు. నేచురల్‌ గ్యాస్‌లో స్పాట్, ఫార్వార్డ్, డెలివరీ ఆధారిత కాంట్రాక్టులకు ఐజీఎక్స్‌ నిర్వహించే ఎల్రక్టానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వీలు కల్పించే సంగతి తెలిసిందే. కాగా.. తాజా వాటా విక్రయం తదుపరి ఐజీఎక్స్‌లో ఎన్‌ఎస్‌ఈ వాటా 25 శాతానికి పరిమితమైంది.2021 మార్చిలో ఎన్‌ఎస్‌ఈ రూ. 19 కోట్లకు ఐజీఎక్స్‌లో 26 శాతం వాటాను సొంతం చేసుకుంది. పీఎన్‌జీఆర్‌బీ నుంచి అనుమతులు పొందడం ద్వారా ఐజీఎక్స్‌కు సహప్రమోటర్‌గా అవతరించింది. దేశీ నేచురల్‌ గ్యాస్‌ ధరల ఆధారంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్‌ డెరివేటివ్స్‌కు తెరతీసేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ఈ నెల మొదట్లో ఐజీఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం విదితమే.వెరసి ఐజీఎక్స్‌ ప్రామాణిక ధరల ఇండెక్స్‌ జీక్సీ ఆధారంగా గ్యాస్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టులకు శ్రీకారం చుట్టనుంది. ఇక మరోపక్క ఐజీఎక్స్‌ ఈ జనవరిలో పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఐపీవో చేపట్టాలని భావిస్తోంది. 2026 జూన్‌లోగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసే వీలున్నట్లు ఎండీ, సీఈవో రాజేష్‌ కుమార్‌ ఎం. పేర్కొన్నారు.

Rich Dad Poor Dad Robert Kiyosaki Giant Crash Prediction for 2026 274
వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్‌

ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన పేరు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad)పుస్తకంతో ఆర్థిక పాఠాలు నేర్పిన ఆయన, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026-27 మధ్య కాలంలో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని, బహుశా ఒక గొప్ప ఆర్థిక మాంద్యాన్ని (Great Depression) ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు.సంక్షోభంలో చిక్కుకుంటారా.. లాభపడతారా?తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' (ట్విట్టర్) వేదికగా కియోసాకి స్పందిస్తూ.. రాబోయే ఈ భారీ క్రాష్‌లో ప్రజలు రెండు రకాలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఒక వర్గం వారు ఆర్థికంగా చితికిపోతే, మరో వర్గం వారు అదృష్టవంతులుగా మారి భారీగా లాభపడతారని ఆయన విశ్లేషించారు.సంక్షోభాల్లోనే ధనవంతుడినయ్యాను..గతంలో జరిగిన ఆర్థిక పతనాలను గుర్తు చేసుకుంటూ.. "1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల్లో వచ్చిన సంక్షోభాల్లో నేను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడిని అయ్యాను. రాబోయే 2026-27 క్రాష్‌లో కూడా నేను మరింత సంపదను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాను" అని కియోసాకి ధీమా వ్యక్తం చేశారు.ఆస్తులు చౌకగా దొరికే సమయం ఇదే!ఆర్థిక మాంద్యం సమయంలో సామాన్యులు భయపడి ఆస్తులు అమ్ముకుంటే, తెలివైన వారు పెట్టుబడులు పెడతారని కియోసాకి సూచించారు. "మార్కెట్ పతనం (Crash) అయినప్పుడు, గొప్ప ఆస్తులన్నీ తక్కువ ధరకే 'సేల్'లో లభిస్తాయి. ఆ సమయంలో వాటిని కొనుగోలు చేయడం ద్వారానే ధనవంతులు కావచ్చు" అని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు.అయితే కియోసాకి అంచనాలు భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక వంటివి. ఒకవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉండగా, మరోవైపు బంగారం (Gold), వెండి (Silver) లేదా రియల్ ఎస్టేట్ (Real Estate) వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది గొప్ప అవకాశంగా మారవచ్చు. కానీ, తగిన ఆర్థిక ప్రణాళిక లేకుండా మార్కెట్లోకి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్‌లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’IN THIS COMING CRASh possibly a Grest Drpression…. Will you be “FU’CD UP or LU’CD UP.”So far….in the crashes of 1987, 2000, 2008, 2015, 2019, 2022 I got richer not poorer.And again in coming giant crash of 2026-27….I plan on growing richer not poorer.I wish the same for…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 28, 2026

Real Estate Land Acquisitions Fall in FY26 Anarock5
రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టుల ల్యాండ్‌ డీల్స్‌ తగ్గాయ్‌..

రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం స్థలాల కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొంత నీరసించాయి. 2,994 ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇందులో సగం మేర లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలు కొనుగోలు చేసినవే కావడం గమనార్హం.రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2025–26లో దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి కోసం గాను, 2,994 ఎకరాలకు సంబంధించి 111 భూముల కొనుగోలు లావాదేవీలు నమోదయ్యాయి. 2024–25లో 3,071 ఎకరాలకు సంబంధించి 143 లావాదేవీలు జరగడం గమనార్హం. ప్రతి రెండు లావాదేవీల్లో ఒకటి లిస్టెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ రూపంలోనే ఉన్నట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు.1,433 ఎకరాలకు సంబంధించి 54 కొనుగోలు లావాదేవీలు లిస్టెడ్‌ కంపెనీల రూపంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వడోదర, అమృత్‌సర్, నాగ్‌పూర్, పానిపట్, మైసూర్, రాయిపూర్, కోయింబత్తూర్‌ తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో భూములను సమీకరించాయి. గోద్రేజ్‌ ప్రాపర్టీస్, లోధా డెవలపర్స్, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చురుగ్గా వ్యవహరించాయి.‘‘లిస్టెడ్‌ సంస్థలు క్రమంగా మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. కస్టమర్లు బ్రాండెడ్‌ డెవలపర్ల ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండడం వీటికి డిమాండ్‌ను పెంచుతోంది. భూముల కొనగోలు అన్నది భారీ పెట్టుబడి నియంత్రణలతో ముడిపడిన అంశం. అందుకే అసంఘటిత రంగంలోని సంస్థలు, చిన్న డెవలపర్ల కంటే లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలకు సానుకూలత ఎక్కువగా ఉంటోంది’’అని అనుజ్‌ పురి వివరించారు.

Tata AIA Shubh Flexi Pension Plan Game-Changer in Retirement Planning6
టాటా ఏఐఏలో సరికొత్త పెన్షన్ ప్లాన్

నేటి కాలంలో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం నిధిని సమకూర్చుకోవడమే కాదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలకడగా ఆదాయం పొందే మార్గాన్ని వెతుక్కోవడం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటీవల 'శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్'ను తీసుకువచ్చింది. ఇది జీవితకాలం పాటు స్థిరమైన గ్యారంటీడ్ ఆదాయాన్ని అందిస్తూనే, మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను (నిఫ్టీ 50 పనితీరుకు అనుగుణంగా) మేళవించిన ఒక వినూత్న హైబ్రిడ్ రిటైర్మెంట్ సొల్యూషన్.ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత దాని ఫ్లెక్సిబిలిటీ. పాలసీదారులు తమ అవసరానికి తగ్గట్టుగా 60% నుండి 90% వరకు గ్యారంటీడ్ ఆదాయాన్ని, మిగిలిన 10% నుండి 40% వరకు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, పెన్షన్ వెంటనే ప్రారంభమయ్యే లేదా గరిష్టంగా 20 ఏళ్ల వరకు వాయిదా వేసుకునే సదుపాయం ఉంది. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని నామినీలకు తిరిగి ఇచ్చే 'రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్' ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ప్రీమియం చెల్లింపుల విషయంలో కూడా కస్టమర్లకు వెసులుబాటు కల్పించారు. ఏకమొత్తంగా లేదా 2 నుండి 12 ఏళ్ల కాలపరిమితితో ప్రీమియం చెల్లించవచ్చు. 35 ఏళ్ల వయస్సు నుంచే ఈ ప్లానింగ్ ప్రారంభించే అవకాశం ఉండటం వల్ల, యువ ప్రొఫెషనల్స్ నుండి రిటైర్మెంట్ ముంగిట్లో ఉన్న వారి వరకు అందరికీ ఇది అనువుగా ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement