Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Union Budget 2026–27 introduced major reforms to boost India SEZs1
గ్లోబల్‌గా పోటీకి సెజ్‌ల దన్ను

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్‌ మరింతగా పోటీపడేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌) తోడ్పడుతున్నాయి. దీనితో వీటిని బలోపేతం చేసే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్‌లో సమగ్ర సంస్కరణలు ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్య మార్పులు, సరఫరా గొలుసు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సెజ్‌లను తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు కీలకమని పేర్కొన్నారు. వీటిలో తయారైన ఉత్పత్తులను పరిమితంగా దేశీయ మార్కెట్‌లో తక్కువ సుంకంతో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో సెజ్‌ల పురోగతిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశీయంగా నోటిఫై అయిన సెజ్‌ల సంఖ్య 368గా ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్‌ వరకు) రూ.11.70 లక్షల కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 32.02 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం పెట్టుబడులు రూ.7.86 లక్షల కోట్లకు చేరగా, 31.73 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. ఈ గణాంకాలు భారత ఆర్థిక వృద్ధికి ఎస్‌ఈజెడ్‌ల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పీఐబీ పేర్కొంది. సెజ్‌ల పరిణామక్రమం ఇలా: 1965లో కాండ్లాలో ఆసియాలోనే తొలి ఎగుమతి ప్రాసెసింగ్‌ జోన్‌ (ఈపీజెడ్‌)ని ఏర్పాటు చేసిన అనుభవంతో 2000లో సెజ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ చట్టం–2005 అమల్లోకి తెచ్చి, 2006 నుంచి అమలు ప్రారంభించారు. దీని కింద సింగిల్‌ విండో క్లియరెన్స్, సరళతరంగా నియంత్రణ, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించారు. వాణిజ్య, పెట్టుబడి వ్యవస్థకు మూల స్తంభాలైన సెజ్‌లు దేశీయంగా ప్రత్యేక డ్యూటీ–ఫ్రీ ప్రాంతాలుగా, కస్టమ్స్‌ పరిధి వెలుపల పని చేస్తున్నాయి. ఇక్కడి యూనిట్లలో ఉత్పత్తుల తయారీ, సేవలు, గిడ్డంగుల తదితర కార్యకలాపాలు ఉంటున్నాయి. 2026–27 బడ్జెట్‌లో కీలక నిర్ణయం సాధారణంగా సెజ్‌ల నుంచి దేశీ టారిఫ్‌ ప్రాంతానికి (డీటీఏ) సరఫరాను దిగుమతులుగా పరిగణించి పూర్తి సుంకాలు విధిస్తారు. అయితే తాజా పరి స్థితుల నేపథ్యంలో ఉత్పత్తిలో కొంత భాగాన్ని త క్కువ సుంకాలతో డీటీఏలో విక్రయించునేందుకు సర్కార్‌ వెసులుబాటు కల్పించింది. ఖర్చులు తగ్గి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, సెజ్‌లు బలోపేతం అయ్యేందుకు ఈ చర్యలు తోడ్పడనున్నాయి. మరో వైపు, టెక్నాలజీ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని సెజ్‌లలోని డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, గ్లోబల్‌ టెక్‌ కంపెనీలను ఆకర్షించేలా విధానాల్లో మార్పు లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ కోసం ప్రత్యేక సెజ్‌ల ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్‌లో సాణంద్, ధార్వాడ్‌ ప్రాంతాల్లో కొత్త సెజ్‌లను నొటిఫై చేసింది. పెట్టుబడులకు ఊతమిచ్చేలా డ్యూటీ ఫ్రీ దిగుమతులు, రాష్ట్ర పన్ను రాయితీలు, సింగిల్‌ విండో అనుమతులు మొదలైన చర్యలు ఉంటున్నాయి.

Sunflower oil demand in India may fall 10percent amid West Asia conflict2
సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాలకు దెబ్బ 

ముంబై: దేశీయంగా శుద్ధి చేసిన పొద్దుతిరుగుడుపువ్వు(సన్‌ఫ్లవర్‌) నూనె అమ్మకాల పరిమాణం 10 శాతం నీరసించనున్నట్లు రేటింగ్స్‌ దిగ్గజం క్రిసిల్‌ తాజా నివేదికలో అంచనా వేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సరఫరా సమస్యలకుతోడు.. పెరుగుతున్న ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. వెరసి వినియోగదారులు ఇతర చౌక నూనెలవైపు దృష్టి సారించనున్నట్లు నివేదికలో క్రిసిల్‌ తెలియజేసింది. దీంతో డిమాండ్‌ మందగించి ఈ ఏడాది సన్‌ప్లవర్‌ ఆయిల్‌ అమ్మకాల పరిమాణం 10 శాతం క్షీణించనున్నట్లు అభిప్రాయపడింది. లాజిస్టిక్స్‌ వ్యయాలు పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే సరఫరా సవాళ్లు తలెత్తగా.. పెరుగుతున్న లాజిస్టిక్స్‌ వ్యయాలు అధిక ధరలకు దారితీస్తున్నట్లు నివేదికలో క్రిసిల్‌ వివరించింది. ఫలితంగా వినియోగదారులు తవుడు నూనె, సోయాబీన్‌ ఆయిల్‌ తదితరాలవైపు మళ్లనున్నట్లు పేర్కొంది. అయితే సన్‌ఫ్లవర్‌ అమ్మకాల ఆదాయం మాత్రం యథాతథంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. అధిక ధరల కారణంగా అమ్మకాల పరిమాణం వెనకడుగు వేయనున్నట్లు తెలియజేసింది. కాగా.. తక్కువ వ్యయాలలో గతంలో కొనుగోలు చేసిన నిల్వల కారణంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రిఫైనరీల లాభదాయకత నిలకడను చూపనున్నట్లు విశ్లేషించింది. దీంతో అమ్మకాల పరిమాణం నీరసించినప్పటికీ చౌక వ్యయాల నిల్వలతో లాభాలపై ప్రభావం పడకపోవచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా 2.5–2.6 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 12–14 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు క్రిసిల్‌ వెల్లడించింది. వంట నూనెల పరిశ్రమ ముడిసన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో ప్రపంచ వాణిజ్య విఘాతాలు, రాజకీయ భౌగోళిక అంశాలు పరిశ్రమను ప్రభావితం చేయనున్నట్లు వివరించింది. ఉక్రెయిన్, రష్యా నుంచి అత్యధికంగా దిగుమతులు నమోదవుతుంటాయి. అయితే హ ర్ముజ్‌ జల రవాణాకు విఘాతం ఏర్పడితే కేప్‌ఆఫ్‌ గుడ్‌హోప్‌ తదితర దూర తీరాల నుంచి వీటిని సమకూర్చుకోవలసి వస్తుందని తెలియజేసింది.

India venture capital investments approximately 16 billion Dollers in 20253
వీసీ పెట్టుబడుల జోరు

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రైవేట్‌ క్యాపిటల్‌ మార్కెట్లు నెమ్మదించినప్పటికీ, భారత్‌లో వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) పెట్టుబడులు మాత్రం గతేడాది జోరుగానే వచ్చాయి. 2025లో 16 బిలియన్‌ డాలర్ల మేర వీసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికం. వివిధ స్థాయుల్లో 1,300 పైగా లావాదేవీలు జరిగాయి. గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ, ఇండియన్‌ వెంచర్‌ అండ్‌ ఆల్టర్నేట్‌ క్యాపిటల్‌ అసోసియేషన్‌ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఇండియా వెంచర్‌ క్యాపిటల్‌ రిపోర్ట్‌ 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, లిక్విడిటీ కఠినతరం కావడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులు వృద్ధి చెందడం గమనార్హం. 2023లో రీసెట్‌ అయిన తర్వాత దేశీ వెంచర్‌ క్యాపిటల్‌ వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టిందని బెయిన్‌ అండ్‌ కంపెనీ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ ఆదిత్య మురళీధర్‌ తెలిపారు. మెరుగైన గవర్నెన్స్, సమర్ధవంతంగా పెట్టుబడుల వినియోగం, నిష్క్రమించేందుకు అవకాశాల పునాదులతో ఈ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలకడగా వృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → 50 మిలియన్‌ డాలర్ల లోపు డీల్స్‌ గణనీయంగా నమోదయ్యాయి. → భారీ డీల్స్‌ కూడా పుంజుకున్నాయి. 250 మిలియన్‌ డాలర్లకు పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య నాలుగు నుంచి రెట్టింపై ఎనిమిదికి చేరింది. యూనిట్‌ ఎకనామిక్స్‌ పటిష్టంగా ఉండి, మానిటైజేషన్‌పై స్పష్టత ఉన్న కంపెనీల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. తీరుతెన్నూ లేని విస్తరణ కన్నా వ్యాపార నాణ్యతకే ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → కన్జూమర్‌ టెక్‌ సంస్థలకు నిధులు నెమ్మదించాయి. అయితే దీర్ఘకాలిక సత్తాను ప్రదర్శిస్తూ, ఈ విభాగంలోకి పెట్టుబడులు 2023 నుంచి వార్షికంగా 25 శాతం స్థాయిలో పెరిగాయి. → అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్ట ప్రోడక్టులను మాత్రమే సత్వరం డెలివరీ చేసే క్విక్‌ కామర్స్‌ సంస్థల్లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ బాగా వచ్చాయి. → టెక్నాలజీ ఆధారిత రంగాలు ఫండింగ్‌ రికవరీలో కీలక పాత్ర పోషించాయి. ఇందులో ఫిన్‌టెక్‌ రంగం ప్రత్యేకంగా నిల్చింది. ఈ విభాగంలో డీల్స్‌ విలువ వార్షికంగా సుమారు 2.2 రెట్లు పెరిగింది. పెట్టుబడుల్లో పేమెంట్స్‌ కేటగిరీ అత్యధిక వాటా దక్కించుకోగా, డిజిటల్‌ వినియోగం, కుటుంబాల పొదుపు మొత్తాల పెరుగుదలతో వెల్త్‌టెక్‌ డీల్స్‌ విలువ అయిదు రెట్లు పెరిగింది. → సాఫ్ట్‌వేర్, సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) ఫండింగ్‌ 1.5 రెట్లు పెరిగింది. ఓ స్థాయికి చేరుకున్న ప్రస్తుత సంస్థలు కూడా మళ్లీ నిధుల బాట పట్టాయి. ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), జనరేటివ్‌ ఏఐ–నేటివ్‌ బీ2బీ కంపెనీలకు, ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌ రంగాల్లో వాటికి ఆదరణ లభిస్తోంది. → దీర్ఘకాలిక ఇన్వెస్టర్లలో ధీమాని ప్రతిఫలిస్తూ, భారత్‌పై ఫోకస్‌ చేసే వీసీలు, గ్రోత్‌ ఈక్విటీ ఫండ్స్‌ సమీకరించిన నిధులు వార్షికంగా రెట్టింపై 5.4 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకుని వైదొలిగేందుకు కూడా గత ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. మొత్తం ఎగ్జిట్‌ విలువలో పబ్లిక్‌ మార్కెట్ల మార్గంలో జరిగినది 65 శాతంగా నమోదైంది.

Mahindra EV SUVs Cross 50000 Sales4
ఏడాదిలో 50వేలు.. మహీంద్రా సరికొత్త రికార్డ్!

మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే భారతదేశంలో దాని ఎలక్ట్రిక్ SUV శ్రేణి మొత్తం అమ్మకాలు 50,000 యూనిట్లను అధిగమించాయి.మార్చి 2025లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6లతో కూడిన ఎలక్ట్రిక్ వెహికల్స్ శ్రేణి అధిక ప్రజాదరణ పొందగలిగింది. INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ మోడళ్లు.. ఎలక్ట్రిక్ SUV రంగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నాయి.మహీంద్రా కంపెనీ మొదటి ఏడు నెలల్లో 30,000 యూనిట్లు, 10 నెలల కాలానికి 41000 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇప్పుడు తాజాగా 50000 యూనిట్ల మార్క్ చేరుకుంది. కంపెనీ సేల్స్ పెరగడానికి కారణం పండుగ సీజన్ అని తెలుస్తోంది. కాగా ఈ మోడల్స్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప అమ్మకాలను పొందగలవని సమాచారం.

Sundar Pichai Returns to Stanford for 2026 Commencement5
చదివిన కాలేజీకే మళ్లీ.. ఎందుకో తెలుసా?

ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక కంపెనీలలో ఒకటి అయిన గూగుల్, దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2026 జూన్‌లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారికంగా వెల్లడించింది.సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోనే మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసి 1995లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అంటే 31ఏళ్ల తరువాత సుందర్ తాను చదివిన కాలేజీకి ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు.సుందర్ పిచాయ్ భారతదేశంలో జన్మించారు. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ లో ఇంజనీరింగ్ చదివి ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ మెడల్ పొందారు. తరువాత వార్టన్ స్కూల్ నుండి MBA పూర్తి చేసి.. సీబెల్, పాల్మర్ స్కాలర్ అవార్డులు పొందారు.చదువు పూర్తయిన తరువాత గూగుల్ కంపెనీలో చేరి, గూగుల్ టూల్‌బార్, గూగుల్ క్రోమ్ వంటి ప్రధాన ప్రాజెక్టులలో పనిచేశారు. ఆ తరువాత ఇది క్రోమ్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్ అయింది. 2019లో గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ సీఈఓగా నియమితులు అయ్యారు.

Mumbai Resident Misses City Just 2 Months After Moving To Bengaluru6
రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే?

కొత్త నగరానికి వెళ్తే.. తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి ఇది ఒక స్వేచ్ఛని, కొత్త అవకాశాలను ఇవ్వడానికి ఒక అవకాశంలా అనిపించినా.. కష్టంగానే ఉంటుందని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.''బెంగళూరు వచ్చి రెండు నెలలైంది, నాకు ముంబై గుర్తొస్తోంది. అక్కడి మనుషులు గుర్తొస్తున్నారు. ఇక్కడ (బెంగళూరు) ప్రతి చిన్న సంభాషణ ఒక బేరమాడటంలా అనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు, ప్యాకర్లు, అద్దెదారులు అందరితోనూ కొంత కష్టమే. ప్రతి ఒక్కరూ మన నుంచి ఏదో ఒకటి పిండుకోవాలని చూస్తుంటారు. ముంబైలో క్యాబ్ డ్రైవర్ వేడిగా ఉందని చూసి ఏసీ వేసేస్తాడు. ఇక్కడ మాత్రం.. అదొక వ్యక్తిగత సహాయం అన్నట్టు అడగాలి. ఈ ఒక్క విషయం మీకు అన్ని విషయాలు చెబుతుంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు.2 months in Bangalore and I miss Mumbai. I miss the people.Every small interaction here feels like a negotiation. Auto drivers, packers, old tenants. Everyone’s trying to squeeze something out of you.In Mumbai a cab driver sees it’s hot and just turns on the AC. Here you have…— poobesh (@pbshgthm) April 3, 2026ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది ముంబై నివాసి అభిప్రాయాలతో ఏకీభవించగా, మరికొందరు ఇలాంటి అనుభవాలు చాలావరకు వ్యక్తిగతమైనవని అభిప్రాయపడ్డారు.నిజమే! ముంబై చాలా స్వాగతించేదిగా, ఆప్యాయంగా ఉంటుందని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు ఇలా అన్నారు.. ముంబైలో ఏ క్యాబ్ డ్రైవర్ అయినా అడగకుండా ఏసీ ఆన్ చేస్తాడా? అని అడిగాడు. నేను బెంగళూరు వాసిని, చాలా నగరాలు తిరిగాను, నేను పూర్తిగా ఈ విషయంలో ముంబై వాసికి సపోర్ట్ చేస్తున్నా.. అని అన్నాడు.

Advertisement
Advertisement
Advertisement