Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Increasing Female Employment in India1
మహిళే మహారాణి

న్యూఢిల్లీ: మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర కార్మీక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఉపాధి కల్పన రేటు 2017లో ఉన్న 22 శాతం నుంచి 2025లో 39 శాతానికి పెరిగినట్టు చెప్పారు. మహిళా కార్మీకుల భాగస్వామ్య రేటు 2017–18లో 23.3 శాతంగా ఉంటే, 2025లో 40 శాతానికి చేరినట్టు వెల్లడించారు.మహిళల నిరుద్యోగ రేటు ఇదే కాలంలో 5.6 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గిందని.. ఉపాధి కోరుకుంటున్న మహిళలు నేడు ఆ దిశగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలూ భాగస్వాములు కావడం అత్యావశ్యకమే కాకుండా.. ఆర్థికంగానూ తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మహిళా సాధికారతను కేంద్రబిందువుగా పేర్కొన్నారు. మెరుగైన సామాజిక భద్రత సామాజిక భద్రత కవరేజీ గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు మంత్రి మాండవీయ తెలిపారు. 2015లో ఉన్న 19 శాతం నుంచి 2025లో 64.3 శాతానికి చేరినట్టు చెప్పారు. కార్మీక సంస్కరణలు, డిజిటల్‌ సేవలు, లకిష్యత సంక్షేమ ఫలాల బదిలీ కోసం చేపట్టిన స్థిరమైన విధానాలు ఇందుకు దోహదం చేసినట్టు తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫామ్‌ కార్మీకులను అధికారికంగా గుర్తిస్తూ 2020లో కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ (సీవోఎస్‌ఎస్‌)ను ప్రవేశపెట్టినట్టు మంత్రి మాండవీయ గుర్తు చేశారు.వీరిలో ఇప్పుడు చాలా మంది మహిళలు ఉన్నారని.. వారికి చట్టపరమైన గుర్తింపుతోపాటు సామాజిక భద్రత ఏర్పడినట్టు చెప్పారు. మహిళా డెలివరీ కార్మీకులు వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడమే కాకుండా, సామాజిక పురోగతికి పాటుపడుతున్నట్టు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోనే స్విగ్గీ ఫుడ్, ఇన్‌స్టామార్ట్‌ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన మహిళా డెలివరీ పార్ట్‌నర్‌లను మంత్రి సన్మానించారు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో శ్రీహర్ష మాజేటి, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Maruti Suzuki Q4 net profit fell 6. 5 percent to Rs 3659 crore2
మారుతీ క్యూ4 రికార్డులు

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 6 శాతం నీరసించి రూ. 3,659 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,911 కోట్లు ఆర్జించింది. అయితే వాహన విక్రయాలు 12 శాతం ఎగసి 6,76,209 యూనిట్లను తాకాయి. ఒక త్రైమాసికంలో ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. దేశీ అమ్మకాలు 5,38,994 యూనిట్లను తాకగా, ఎగుమతులు రికార్డ్‌ సృష్టిస్తూ 1,37,215 యూనిట్లకు చేరాయి.మార్క్‌టు మార్కెట్‌(ఎంటూఎం)తోపాటు.. నిర్వహణేతర ఆదాయం తగ్గడం, బాండ్‌ ఈల్డ్స్‌లో మార్పు కారణంగా నష్టం నమోదు చేయడం(తదుపరి దశలో రికవరీకి వీలుంది) ఈ క్యూ4 లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 140 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. ఇది అత్యధికంకాగా 2024–25లో రూ. 135 డివిడెండ్‌ చెల్లించింది. మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం ఎగసి రూ. 52,462 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 40,920 కోట్ల టర్నోవర్‌ మాత్రమే అందుకుంది. వెరసి కంపెనీ చరిత్రలోనే తొలిసారి ఒక క్వార్టర్‌లో రూ. 50,000 కోట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,556 కోట్ల నుంచి రూ. 48,125 కోట్లకు పెరిగాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 14,680 కోట్లకు చేరింది. 2024–25లో రూ. 14,500 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,52,913 కోట్ల నుంచి రూ. 1,83,316 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం వాహన అమ్మకాలు 22,34,266 యూనిట్ల నుంచి 24,22,713 యూనిట్లకు బలపడ్డాయి. దేశీయంగా 19,74,939 యూనిట్ల అమ్మకాలు సాధించగా.. 4,47,774 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది ద్వితీయార్ధంలో జీఎస్‌టీ రేట్ల సవరణల కారణంగా దేశీ మార్కెట్లో అమ్మకాలు పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడాది చివరికల్లా 1.9 లక్షల పెండింగ్‌ ఆర్డర్లు నమోదైనట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్‌ఈలో 2.5% క్షీణించి రూ. 12,892 వద్ద ముగిసింది.ఇక పెట్టుబడుల జోరు..సామర్థ్య విస్తరణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో మారుతీ సుజుకీ రూ. 14,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఖార్ఖోడా(హరియాణా), హన్సల్‌పూర్‌ (గుజరాత్‌)లో రెండు లైన్లను జత చేయనున్నట్లు కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్య వినియోగం 100 శాతానికి చేరిన నేపథ్యంలో కొత్తగా 5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని జత చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియ జేశారు.

Gold Prices Crash in India Today Sharp Drop in Hyderabad Delhi Chennai More3
పసిడి ధరల పతనం.. ఊహకందని రీతిలో ఇలా!

భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఈ రోజు భారీ పతనాన్ని చవి చూసింది. దీంతో ఒక్కసారిగా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, సిల్వర్ ధరల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2780 తగ్గి 1,50,930 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2550 రూపాయలు తగ్గి రూ.1,38,350 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ.1420, రూ.1300 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 153820 రూపాయల వద్ద, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.141000 వద్ద నిలిచాయి. ఈ ధరలు నిన్నటి (మంగళవారం)తో పోలిస్తే చాలా తక్కువ.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,080 (రూ.2780 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,38,500 (రూ.2550 తగ్గింది) వద్ద ఉంది.వెండి ధరలు ఇలాబంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేటు రూ.2.65 లక్షలు (రూ.5000 తగ్గింది) వద్ద, ఢిల్లీలో రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!

RBI Approves Mobikwik NBFC License4
ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్‌.. మొబిక్విక్‌కు NBFC లైసెన్స్‌!

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా సేవలు అందించేందుకు వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ చేసుకున్న దరఖాస్తుకు ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ జారీ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో రుణ విభాగం ‘మొబిక్విక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌’ను ఆరంభించేందుకు అవకాశం లభించిందని, తమ రుణ వ్యాపార అవకాశాల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.వర్తకులు, వినియోదారులకు మరింత విస్తృతమైన సేవలకు వీలు కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నాలుగు నెలల్లోనే తమ దరఖాస్తుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని, తమ గ్రూప్‌ విశ్వసనీయతకు ఇది నిదర్శనమని మొబిక్విక్‌ సహ వ్యవస్థాపకురాలు, ఈడీ ఉపాసనా టకు పేర్కొన్నారు. తమ గ్రూప్‌నకు ఉన్న 18.6 కోట్ల యూజర్ల బేస్, బలమైన టెక్నాలజీ వసతులు, వసూలు సామర్థ్యాల పునాదులపై ఎన్‌బీఎఫ్‌సీని నిర్మించనున్నట్టు చెప్పారు.

UK Student Spends Over Rs 1 Crore On Degree But Fails To Land Job After 500 Applications5
డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!

బ్రిటన్‌లో యువ ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ ఖాలెద్ షరీఫ్ వెల్లడించారు. లండన్ శివార్లలోని కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ మీడియా టెక్నాలజీలో డిస్టింక్షన్‌తో పట్టభద్రుడైనప్పటికీ, అతనికి ఉద్యోగం దొరకలేదు.ఖాలెద్ షరీఫ్ సుమారు 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటి కూడా సాధించలేకపోవడం అతని నిరాశను పెంచింది. 100,000 పౌండ్లకు (రూ. కోటి కంటే ఎక్కువ) పైగా ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా అవకాశాలు లభించకపోవడం.. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే భావన కలిగించింది.ఈజిప్టులో జన్మించి, ఖతార్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో లండన్‌కు వెళ్లిన షరీఫ్, బ్రిటిష్ రాజధాని తనకు వృత్తిపరంగా అవకాశాలను కల్పిస్తుందని ఆశించాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కోవిడ్19 ప్రభావం, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాల తగ్గుదలకు కారణమని అతను అభిప్రాయపడ్డాడు.కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగులను నియమించడాన్ని తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకోవడం కంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖాలెద్ వెనుకడుగు వేయలేదు. ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన సృజనాత్మకతను కొనసాగిస్తున్నాడు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''అంతే కాకుండా.. ''జోక్'' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి, తన ఆసక్తులను వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం.. యూనివర్సిటీలో నేర్చుకున్నదానికంటే.. స్వయంగా నేర్చుకున్న నైపుణ్యాలే వృత్తిలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి.

Anant Ambani Appeals To Colombia To Save 80 Hippos6
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ

కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో.. ఒక పర్యావరణ సమస్య తలెత్తింది. ఇక్కడ సుమారు 200 వరకు హిప్పోపొటమస్‌లు జీవిస్తున్నాయి. వీటి వల్ల స్థానిక జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతపై ప్రభావం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆపాలని అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వంతారా స్థాపకులు అయిన అనంత్ అంబానీ.. హిప్పోలను చంపాలనే నిర్ణయం సరికాదని వెల్లడించారు. జంతువులను చంపడం కంటే, వాటిని సురక్షితంగా మరో ప్రదేశానికి తరలించడం ఒక మంచి పరిష్కారం అని అన్నారు. ఈ విషయంపై కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్‌కు ఒక లేఖ రాశారు.అనంత్ అంబానీ రాసిన లేఖలో.. 80 హిప్పోపొటమస్‌లను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారాకు తరలించవచ్చని, ఇక్కడ జంతువులకు అనుకూలమైన సహజ వాతావరణం, వైద్య సదుపాయాలు, శాశ్వత సంరక్షణ అందుబాటులో ఉంటాయని చెప్పారు. జంతువులను చంపడం కంటే.. ఇది సరైన ప్రత్యామ్నాయం అని అన్నారు.''ఆ ఎనభై హిప్పోలు తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేదు, అలాగే తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా సృష్టించుకోలేదు'' కాబట్టి వాటిని చంపడం తగదు. సురక్షితమైన పరిష్కారం ద్వారా వాటిని కాపాడే సామర్థ్యం మనకు ఉంటే, ప్రయత్నించాల్సిన బాధ్యత మనపై ఉందని అనంత్ అంబానీ అన్నారు.వంతారా గురించిగుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా, ప్రపంచంలోనే అతిపెద్ద. అత్యంత అధునాతన వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ.. పరిరక్షణ కేంద్రాలలో ఒకటి. అనంత్ అంబానీ దీనిని 3000 ఎకరాల్లో (కృత్రిమ అడవి) ఏర్పాటు చేసి.. జంతువులకు రక్షిస్తున్నారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement