Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Upcoming Car Launches in 2026 April1
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు ఇవే..

2026 మొదలై మూడు నెలలు పూర్తయిపోయింది. ఈ కాలంలో లెక్కకు మించిన కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇంకొన్ని వాహనాలను లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కథనంలో ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 9న లాంచ్ కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సరికొత్త స్టైలింగ్‌తో వస్తుంది. ఇందులో అప్డేటెడ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, మెరుగైన ఇంటీరియర్స్ వంటివి ఉన్నాయి. అప్‌డేటెడ్ క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఇది బలమైన పోటీ ఇవ్వనుంది.టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందించే.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇది లేటెస్ట్ డిజైన్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. దీనిని కొనుగోలుదారులు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు సిటీ, హైవే డ్రైవ్‌ కోసం చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం.ఎంజీ మెజెస్టర్ఎంజీ మెజెస్టర్ కారు కూడా ఈ నెలలో లాంచ్ అయ్యే పాపులర్ కార్ల జాబితాలో ఒకటి. ఇది ఏడీఏఎస్, మసాజ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో పాటు.. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ పొందనుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది.2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కూడా లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా అప్డేటెడ్ స్టైలింగ్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో సరికొత్త డాష్‌బోర్డ్, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సేఫ్టీ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇది సాధారణ బ్రేజ్జా కంటే కూడా మంచి పనితీరును అందిస్తుందని సమాచారం.మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్.. లేటెస్ట్ టెక్నాలజీ, అప్‌గ్రేడ్ ఇంటీరియర్‌లను పొందుతుంది. ఇంజన్ ఆప్షన్లు దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఎస్‌యూవీ ప్రీమియం సౌకర్యం, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ ఉండనున్నాయి. కాబట్టి ఇది విలాసవంతమైన హంగులతో కూడిన.. గొప్ప పనితీరును ఇష్టపడే కొనుగోలుదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

Good News for Buyers Gold Silver Prices Drop Today2
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..

నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

47 Lakh Vehicles Sales in 2025 263
2025–26లో 47 లక్షల వెహికల్స్..

గత ఆర్థిక సంవత్సరం (2025–26) రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీల అత్యుత్తమ పనితీరుతో పాటు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో జీఎస్‌టీ 2.0 అమలు వాహన విక్రయాలను మరింత వేగవంతం చేసింది.కొత్త ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే పశి్చమాసియా యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెరిగితే డిమాండ్‌ తగ్గొచ్చని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 24,22,713 యూనిట్లను విక్రయించింది. 2024–25లో అమ్మకాలు 22,34,266గా ఉన్నాయి.

Airtel World Second Largest Telco Hits 650-Million Customer Milestone4
భారతి ఎయిర్‌టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ టెలికాం కంపెనీ.. భారతదేశంలో మాత్రమే కాకుండా, ఆఫ్రికా అంతటా బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. GSMA ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఒక్క ఇండియాలో ఎయిర్‌టెల్‌కు 368 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించి 13 మిలియన్ల గృహాలు, దాని డిజిటల్ టీవీ సేవలను ఉపయోగించే 15 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.Bharti Airtel, the world’s second largest telecom operator by customer base, has crossed 650 million customers globally.— Bharti Airtel (@airtelnews) April 2, 2026ఆఫ్రికాలో.. ఎయిర్‌టెల్ ఆఫ్రికా 14 దేశాలలో 179 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో కంపెనీ హై-స్పీడ్ డేటా, వాయిస్ సేవలు, మొబైల్ మనీ పరిష్కారాలను అందిస్తుండగా, 52 మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నారు.ఎయిర్‌టెల్ సాధించిన ఈ విజయాన్ని గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 65 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక పెద్ద బాధ్యత. కొత్త ఆవిష్కరణలు, విశ్వసనీయమైన సేవల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. టెలికాం పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడమే ఎయిర్‌టెల్ లక్ష్యమని ఆయన తెలిపారు.

Oracle India Layoffs And What Employees Say They Received as Severance5
ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇదేబాటలో దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా అడుగులువేసింది. ఈ ప్రభావం ఏకంగా 30వేలమంది ఎంప్లాయిస్ మీద పడుతుంది. ఇందులో 12000 ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వారికి లభించే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒరాకిల్ తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. లేఆఫ్స్ ప్రక్రియలో అనేక మంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ సిస్టమ్ యాక్సెస్ కోల్పోయి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జాబ్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. ఇందులోనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కూడా వివరించారు.''కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా.. వాడని సెలవుల మొత్తాన్ని నగదుగా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి తొలగింపు సమయంలో నోటీస్ పీరియడ్‌కు బదులుగా ఒక నెల జీతం కూడా అందజేస్తారు. ఉద్యోగి అర్హత ఉన్నట్లయితే గ్రాచ్యుటీ కూడా లభిస్తుంది. ఇంకా.. తొలగింపు తేదీ వరకు ఉన్న పెండింగ్ జీతం కూడా పూర్తిగా చెల్లిస్తారు'' అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.కంపెనీ నుండి రెండు నెలల అదనపు ఎక్స్‌గ్రేషియా (ప్రత్యేక పరిహారం) కూడా లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం పొందడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం అనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన షరతుగా కనిపిస్తోంది. అలాగే సుమారు రూ.20,000 వరకు ఇన్సూరెన్స్, ఒక నెల గార్డెనింగ్ లీవ్ జీతం లేదా దానికి సమానమైన పరిహారం కూడా ఇవ్వనున్నట్లు మరికొందరు ఉద్యోగులు వెల్లడించారు.ఇదీ చదవండి: ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్‌ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Jio Rs 349 Plan Check Data Validity and Unlimited Calling Details Here6
జియో హిట్‌ ప్లాన్‌: అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌!

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారి కోసం జియోలో ఓ పాపులర్‌ హిట్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. అదే రూ. 349 ప్లాన్‌.ప్లాన్ వివరాలుజియో అందిస్తున్న ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలను ఆస్వాదించవచ్చు.డేటా ధమాకాఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని డేటా ప్రయోజనాలే. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితిలో వినియోగదారులకు మొత్తం 56 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉంటుంది.అపరిమిత కాలింగ్, ఎస్‌ఎంఎస్డేటాతో పాటు, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ కాలింగ్స్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

Advertisement
Advertisement
Advertisement