Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IIIT-H researchers using AI to decode Indian meals1
భారతీయ భోజనాన్ని డీకోడ్ చేసే కృత్రిమమేధ

భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్‌ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్‌లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్‌ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.పరిశోధనలోని ముఖ్యాంశాలుసాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్‌హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్‌లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.బిర్యానీపై ప్రత్యేక దృష్టిభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్‌గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.వంట గదిలో ఏఐ అసిస్టెంట్ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్‌గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!

retirees in Hyderabad have lost crores of rupees to fraudsters2
ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!

హైదరాబాద్‌ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓలో పెట్టుబడుల పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు సుమారు రూ.2.54 కోట్లు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు.రిటైర్డ్ బ్యాంకర్‌కు రూ.1.25 కోట్ల నష్టంసికింద్రాబాద్‌కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ ఈ మోసానికి ప్రధాన బాధితురాలుగా ఉన్నారు. నేరగాళ్లు ముందుగా బాధితురాలిని ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అందులో సంస్థాగత ఐపీఓల ద్వారా వచ్చే భారీ లాభాల స్క్రీన్‌షాట్‌లను చూపి నమ్మించారు. ఒక యూఎస్ నంబర్ ద్వారా వచ్చిన లింక్ సహాయంతో బోగస్ ట్రేడింగ్ యాప్‌ను ఆమె డౌన్‌లోడ్ చేసుకునేలా చేశారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్య ఆమె తన మూడు వ్యక్తిగత ఖాతాల నుంచి 11 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు 15 దఫాలుగా రూ.1.25 కోట్లు బదిలీ చేశారు. యాప్‌లో ఆమె బ్యాలెన్స్ రూ.1.9 కోట్లుగా కనిపిస్తున్నప్పటికీ విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యం కాలేదు. పైగా ‘క్లియరింగ్ ఛార్జీల’ పేరుతో మరో రూ.58.58 లక్షలు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.మరో మూడు కేసులుజనవరి 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇలాంటివే మరికొన్ని ఫిర్యాదులు అందాయి.మణికొండకు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని స్టాక్ బ్రోకరేజ్ విశ్లేషకులుగా నటించిన స్కామర్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రలోభపెట్టారు. గత ఏడాది మార్చి-మే మధ్య ఆయన రూ.50.8 లక్షలు పోగొట్టుకున్నారు.76 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఐపీఓ ట్రేడింగ్ సలహాలను నమ్మి డిసెంబర్ 30 నుంచి జనవరి 5 మధ్య రూ.46.25 లక్షలు నష్టపోయారు.మియాపూర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యూఎస్ స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో నకిలీ యాప్ ద్వారా రూ.32.1 లక్షలు కోల్పోయారు.పోలీసుల హెచ్చరికలుఈ నాలుగు ఘటనలపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్‌ చేసి సమాచారం తెలియాజేయాలని సూచించారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..

PM Modi called on India startups to focus on manufacturing AI tech3
స్టార్టప్‌లు తయారీ, డీప్‌టెక్‌పై దృష్టి పెట్టాలి: ప్రధాని

భారతీయ స్టార్టప్‌లు కేవలం సేవా రంగానికే పరిమితం కాకుండా తయారీ, అత్యాధునిక సాంకేతికత రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘స్టార్టప్ ఇండియా మిషన్’ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన దేశంలోని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.గ్లోబల్ వాల్యూ చైన్‌లో భారత్ కీలకంగడిచిన పదేళ్లలో డిజిటల్, సర్వీస్‌ రంగాల్లో భారత స్టార్టప్‌లు అద్భుతమైన ప్రగతిని సాధించాయని ప్రధాని ప్రశంసించారు. అయితే, ఇకపై వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తయారీ రంగంలో దేశీయంగా ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో భారత్ కీలక భాగస్వామిగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. ‘కొత్త ఆలోచనలతో సమస్యలకు పరిష్కారాలు చూపాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతగల ఉత్పత్తులను స్టార్టప్‌లు రూపొందించాలి’ అని స్పష్టం చేశారు.ఏఐ, డీప్‌టెక్‌కు పెద్దపీటకృత్రిమ మేధ (AI) ఆవిష్కరణల్లో నాయకత్వం వహించే దేశాలకే భవిష్యత్తులో వ్యూహాత్మక ప్రయోజనం ఉంటుందని ప్రధాని విశ్లేషించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించేందుకు 38,000 జీపీయూలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, భారతీయ సర్వర్లపై అభివృద్ధి చేసిన స్వదేశీ ఏఐను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.గతంలో పరిమితులున్న రక్షణ, అంతరిక్ష, డ్రోన్ రంగాల్లో స్టార్టప్‌ల కోసం సడలింపులు ఇచ్చామన్నారు.మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌..2014లో కేవలం 500 కంటే తక్కువగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య నేడు రెండు లక్షలకు పైగా చేరడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఎదిగిందని, ఇందులో 125 యునికార్న్‌లు ఉన్నాయని గుర్తు చేశారు. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, స్పేస్ సీడ్ ఫండ్ వంటి పథకాల ద్వారా రూ.25,000 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..

gold and silver rates on 17th january 2026 in Telugu states4
పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు సెషన్‌ల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Transparency Needed in Gold Pricing5
‘ఇష్టానుసారంగా పసిడి ధరలు పెంపు’

బంగారం ధరల నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని పేర్కొంటూ, ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అశాస్త్రీయ ధోరణులపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా, స్పష్టమైన కారణం లేకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు.అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం ధర ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.అంతర్జాతీయ మార్కెట్ ధరలు బంగారం ట్రేడింగ్ రేట్లను ప్రభావితం చేస్తాయి.అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం రేటు కూడా బంగారం ధరను నిర్ణయిస్తుంది. రూపాయి విలువ పడితే పసిడి ధర కూడా అందుకు అనుగుణంగా మారుతుంది.ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ కూడా కనకం ధర పెరిగేందుకు కారణమవుతుంది.ప్రస్తుత సమస్య ఏమిటంటే..కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా, స్పష్టమైన కారణం లేకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారని అహ్మద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు బంగారం మార్కెట్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ఇది దీర్ఘకాలంలో పరిశ్రమకు నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. సాధారణంగా వాణిజ్య సంఘాలు ఉదయం 9:30 గంటలకే ధరలను నిర్ణయిస్తాయని, కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆకస్మిక మార్పులు వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయని తెలిపారు.వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్వినియోగదారుల ప్రయోజనాల కోసం మలబార్ గోల్డ్ అండ్‌ డైమండ్స్ ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని అమలు చేస్తోందని అహ్మద్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా పన్నులు ఒకేలా ఉన్నప్పుడు, బంగారం ధర కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలన్నారు. ధరల అసమానతలను తొలగించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పారదర్శకతను పాటించాలని చెప్పారు.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు?

Education loan cos in India are under strain tightened US visa rules6
అమెరికా దెబ్బకు విదేశీ విద్యా రుణ వ్యవస్థ డీలా

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. అమెరికా వీసా విధానంలో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ విద్యా రుణాల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్‌ఫారమ్‌ల గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో విదేశీ విద్యా రుణాలు 30 నుంచి 50 శాతం వరకు క్షీణించాయి.తగ్గుతున్న రుణాల పరిమాణంఅమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ దేశానికి సంబంధించిన రుణాల పరిమాణం ఏకంగా 60 శాతం పడిపోయింది. విద్యార్థులు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, తూర్పు యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అమెరికా యూనివర్సిటీల స్థాయిలో రుణాల పరిమాణం ఉండటం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆర్‌బీఐ డేటారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన విదేశీ రిమిటెన్సుల గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విదేశీ విద్య కోసం భారత్ నుంచి పంపే నిధుల ప్రవాహంలో (రిమిటెన్సులు) స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరిలో ప్రారంభమయ్యే ‘స్ప్రింగ్ అడ్మిషన్ సీజన్‌’ను పరిశీలిస్తే.. 2024 జనవరిలో 449 మిలియన్ డాలర్లుగా ఉన్న రిమిటెన్సులు 2025 జనవరి నాటికి 368 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే ఈ కాలంలో సుమారు 18 శాతం మేర తగ్గుదల నమోదైంది.అత్యధిక అడ్మిషన్లు జరిగే ఆగస్టు ‘ఫాల్ సీజన్‌’లో ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది. 2024 ఆగస్టులో విదేశీ విద్యా అవసరాల కోసం 416 మిలియన్ డాలర్లు భారత్ నుంచి వెళ్లగా, 2025 ఆగస్టు నాటికి ఆ మొత్తం 319 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఏకంగా 23 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఇది విదేశీ విద్యా రుణ మార్కెట్‌పై ఉన్న ఒత్తిడిని, విద్యార్థుల విదేశీ ప్రయాణాల్లో వచ్చిన మార్పును స్పష్టంగా సూచిస్తోంది.(గమనిక: పైన తెలిపిన గణాంకాల్లో విద్యార్థుల జీవన వ్యయం కూడా కలిసి ఉంది)నిపుణుల హెచ్చరికఅభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల సమీప భవిష్యత్తులో విద్యా రుణాల వృద్ధి మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇన్‌క్రెడ్ ఫైనాన్షియల్ తన ఆస్తుల నిర్వహణలో 24 శాతం విద్యా రుణాలు ఉండటంతో ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాపర్టీ లోన్ల వంటి ఇతర విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. విద్యా రుణాలిచ్చే బోర్డర్‌ప్లస్ కంపెనీ ఒకటి రెండు సంవత్సరాల వరకు కొత్త రుణాల మంజూరు బలహీనంగానే ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు.. అవాన్స్, క్రెడిలా వంటి ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నాయి. అమెరికా వీసా విధానాల్లో సానుకూల మార్పులు వచ్చే వరకు ఈ రంగంలో ఇదే రకమైన స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు?

Advertisement
Advertisement
Advertisement