Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Rs 12 Trillion Wiped Out Today 5 Reasons1
స్టాక్ మార్కెట్‌ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచూశాయి! అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడిచమురు సెగలు దలాల్ స్ట్రీట్‌ను అతలాకుతలం చేశాయి. అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేస్తూ.. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈరోజు 2,196.89 పాయింట్లు (3.26%) పతనమై 74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26%) క్షీణించి 23,002.15 వద్ద స్థిరపడింది.మార్కెట్‌ను ముంచేసిన 5 ప్రధాన కారణాలుపతాక స్థాయికి చేరిన మధ్యప్రాచ్య సంక్షోభంఅమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయబ్రాంతులకు గురిచేసింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ LNG ప్లాంట్‌లతో పాటు సౌదీ, కువైట్ రిఫైనరీలపై దాడులు జరగడం గ్లోబల్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది.భగ్గుమన్న ముడిచమురుయుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 5-11% పెరిగి బ్యారెల్‌కు 119 డాలర్లకి చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం భారమై లాభాలు తగ్గుతాయన్న ఆందోళన పెరిగింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కుదుపుదేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. "విలువలు, నైతికత" విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 7-8% కుప్పకూలింది. ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ను భారీగా కిందకు లాగింది.అమెరికా ఫెడ్ 'హాకిష్' వైఖరిఅమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా, కఠిన వైఖరిని ప్రదర్శించింది. యుద్ధం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉన్నందున, 2026లో కేవలం ఒకే ఒక్క వడ్డీ రేటు కోత (25 bps) ఉండొచ్చని సూచించడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.రూపాయి పతనం- ఎఫ్‌ఐఐల అమ్మకాలుఅంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.63కి పడిపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు (FII) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అటు ఆసియా, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి.

India Holds Unique Position in AI Adoption says Cognizant Chief AI Officer2
ఏఐలో భారత్‌కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్‌ చీఫ్‌ ఏఐ ఆఫీసర్‌

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్‌కి విశిష్ట స్థానం ఉందని టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ చీఫ్‌ ఏఐ ఆఫీసర్‌ బాబక్‌ హోద్జాత్‌ తెలిపారు. డిజిటల్‌ సిస్టమ్‌లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్‌లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్‌ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్‌పుట్‌ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్‌కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్‌ ఇప్పుడు ఏఐ బిల్డర్‌ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్‌ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్‌ జనరేషన్‌లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు.

Stock Market Crash March 19 Sensex Nifty down as Brent surges3
స్టాక్‌ మార్కెట్‌ క్రాష్‌.. ముంచేసిన చమురు!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 11 శాతం పెరిగింది.

Tata Motors to Hike Commercial Vehicle Prices from April 14
టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు

న్యూడిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి అన్ని కమర్షియల్‌ వాహనాలపై 1.50 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు పరిధి మారుతుందని పేర్కొంది. ముడి సరుకుల ధరలు, ఇతర ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు చేపడుతున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 180 బిలియన్‌ డాలర్ల టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్, దేశంలో యుటిలిటీ వాహనాలు, పిక్‌అప్‌ వాహనాలు, ట్రక్కులు, బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థగా ఉంది.

Anil Ambani Appears Before CBI Rcomm Bank Fraud Case5
సీబీఐ ఎదుట హాజరైన అనిల్‌ అంబానీ

రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్‌) నిధుల మళ్లింపు కేసులో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన రూ.2929.05 కోట్ల బ్యాంకు మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది.నిధుల మళ్లింపుపైనే ప్రధాన దృష్టితెల్లవారుజామునే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని ఆర్‌కామ్‌కు కేటాయించిన రుణాల వినియోగంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కంపెనీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే ఆరోపణలున్నాయి. ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అనిల్ అంబానీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 19, 20 తేదీల్లో ఆయన దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరు అవుతున్నారు.ముగిసిన ‘జై అన్మోల్’ విచారణఇదే క్రమంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని కూడా సీబీఐ వదిలిపెట్టలేదు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌)లో జరిగిన రూ.228.06 కోట్ల ఆర్థిక అవకతవకలపై గత వారం (మార్చి 14, 2026) ఆయన్ను అధికారులు విచారించారు. ‘చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అనిల్ అంబానీ కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ విచారణకు హాజరవుతున్నారు’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి చెప్పారు.ఈ కేసులో మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, రిలయన్స్ గ్రూప్ మాజీ ఉన్నతాధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే జై అన్మోల్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Mumbai Rent Shock Viral Video Exposes 1 2 Lakh Monthly Burden in Andheri West6
నెలకు అద్దె @ రూ.1.2 లక్షలు!

కలల నగరం ముంబైలో అద్దె కోసం ఇల్లు దొరకడం ఒక ఎత్తయితే, దాని అద్దె చెల్లించడం మరో ఎత్తు. సామాన్యుడి నెల జీతం కంటే కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ అద్దెలే ఎక్కువగా ఉంటాయన్నది జీర్ణించుకోలేని వాస్తవం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ముంబై జీవన ప్రమాణాలు, అద్దె భారం గురించి చర్చకు తెరలేపింది.ప్రముఖ వ్లాగర్ ఆర్య కొఠారి తన ఇన్‌స్టాగ్రామ్ సిరీస్ ‘రెంట్ ఇన్ ముంబై - ఈపీ 4’ లో భాగంగా అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక యువతిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రాంతంలో ఒక 3బీహెచ్‌కే (మూడు పడకగదుల) ఫ్లాట్ కోసం ఆమె నెలకు ఏకంగా రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ విశాలమైన గది, ఆధునిక వంటగది చూస్తుంటే ముంబై వంటి నగరంలో అది ఎంత లగ్జరీనో అర్థమవుతుంది.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ‘ముంబైలో అద్దె కట్టడమే ఒక పూర్తిస్థాయి ఉద్యోగంలా మారిపోయింది’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘ఒకరికి రూ. 1.2 లక్షల అద్దె సౌకర్యం కావచ్చు, మరొకరికి రూ.80 వేల జీతంతో బతకడమే పెద్ద పోరాటం కావచ్చు’ అని మరికొరు అన్నారు. View this post on Instagram A post shared by Arya Kothari (@arya_kothari)

Advertisement
Advertisement
Advertisement