Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indian households are anticipating a notable softening in inflation expectations1
దేశంలో ధరలు తగ్గుతాయ్‌..!

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నిత్యావసరాలు, ఇతర వస్తువులు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయట. ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులు, గృహోపకరణాలు, సేవల రంగాల్లో ధరలు గణనీయంగా తగ్గుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెపుతోంది. గత అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (కన్సూ్యమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌–సీపీఐ) కనిష్టంగా 0.25 శాతానికి పడిపోవడమే అందుకు ప్రధాన కారణం. ఆహార ధరల్లో భారీ తగ్గుదల, జీఎస్‌టీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు, ద్రవ్య విధానంలో ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి ద్రవ్యోల్బణాన్ని తగ్గించాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన ‘హౌస్‌హోల్డ్‌ ఇన్‌ఫ్లుయేషన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ సర్వే’ కూడా ఇదే విషయాన్ని చెపుతోంది. నవంబర్‌ 1–10 వరకు 19 నగరాల్లో 6,061 కుటుంబాలపై చేసిన ఈ సర్వేలో భవిష్యత్తులో వినియోగదారులపై ధరల ఒత్తిడి మరింత తగ్గుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత ద్రవ్యోల్బణంపై కుటుంబాల మధ్యస్థ అంచనా సెప్టెంబర్‌తో పోలిస్తే 80 బేసిస్‌ పాయింట్లు తగ్గి 6.6 శాతానికి చేరింది. రాబోయే మూడు నెలలలో ధరలు పెరుగుతాయన్న భావన 7.6 శాతానికి, ఒక సంవత్సర అంచనా 8 శాతానికి పడిపోయింది. సర్వే సందర్భంగా భిన్న వయసు్కలు, వివిధ ఆదాయ స్థాయి, వృత్తులకు సంబంధించిన వర్గాల్లో కూడా ధరలపై ఒత్తిడి తగ్గిన భావన స్పష్టంగా కనిపించిందని ఆర్‌బీఐ పేర్కొంది. ధరల పట్ల ఎక్కువ సున్నితంగా స్పందించే గృహిణులు, పింఛనుదారుల్లోనూ ఇదే ధోరణి కనిపించడం విశేషం. ఇది వినియోగదారుల విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా ఆర్‌బీఐ పేర్కొంది. ఆహార ధరలే సీపీఐ తగ్గుదలకి కారణం అక్టోబర్‌ నెలలో ఆహార ద్రవ్యోల్బణం సుమారు –5% వరకు పడిపోవడం సీపీఐ తగ్గుదలకి ప్రధాన కారకంగా నిలిచింది. కూరగాయలు, ఉల్లిపాయలు, పప్పులు, ధాన్యాలు, నిత్యావసర పదార్థాల ధరలు మార్కెట్‌లో గణనీయంగా తగ్గాయి. సరఫరా మెరుగుదల, రవాణా ఖర్చుల తగ్గుదల, వరుసగా మంచి పంటలు రావడం వంటి అంశాలు ఈ తగ్గుదలకి దోహదపడ్డాయి. అలాగే సెపె్టంబర్‌ చివరి వారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ రేట్ల సవరణలు వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందించాయి. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్, దినసరి వినియోగ వస్తువులు, గృహోపకరణాలపై పన్ను రేట్లు తగ్గించడంతో మార్కెట్లో ధరలు తగ్గాయి. జీఎస్‌టీ స్లాబ్‌ సులభతరం చేయడం వల్ల వ్యాపారులపై ఉండే పన్ను భారం తక్కువై, దాని ప్రభావం రిటైల్‌ ధరలపై పడింది.ఆర్‌బీఐ–ఎంపీసీ చర్యలతో వృద్ధికి ఊపిరిద్రవ్యోల్బణం కనిష్టానికి తగ్గడంతో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకువచి్చంది. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తక్కువ వడ్డీకి నిధులు పొందగలుగుతాయి. ఫలితంగా, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలు కూడా తక్కువ వడ్డీకి లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేట్ల స్థాయిలు తగ్గడం ఆర్థిక వృద్ధికి అవసరమైన వినియోగ వ్యయాలను పెంచుతుందని ఆర్‌బీఐ అభిప్రాయపడుతోంది. 2 శాతం నుంచి 3 శాతం మధ్యలో ద్రవ్యోల్బణం ఉండడం, 8 శాతం వృద్ధి సాధ్యమవుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు అరుదైన బంగారు దశగా చెపుతోంది. కనిష్ట ద్రవ్యోల్బణం మరిన్ని విధాన సడలింపులకు వీలు కల్పిస్తుందని పేర్కొంది.పట్టణ, గ్రామీణ వినియోగదారుల్లో ఆశావాదం .. ఆర్‌బీఐ నిర్వహించిన ‘కన్సూ్యమర్‌ కాని్ఫడెన్స్‌ సర్వే’ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ‘ప్రస్తుత పరిస్థితి సూచీ’ కూడా 96.9 నుంచి 98.4కి మెరుగుపడినట్లు ఆర్‌బీఐ తెలిపింది. భవిష్యత్తులో ధరలు పెద్దగా పెరగవని భావించే కుటుంబాల సంఖ్య పెరగడంతో ‘ఫ్యూచర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఇండెక్స్‌’ కూడా స్వల్పంగా పైకి రాగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ భవిష్యత్తుపై వినియోగదారుల నమ్మకం పెరిగిందని తెలిపింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గడం, జీఎస్‌టీ ప్రభావం, సరఫరా పరిస్థితుల మెరుగుదల, ఆర్‌బీఐ విధానాలు... ఇలా అన్నీ కలిసి రాబోయే నెలల్లో ధరలు మరింత తగ్గుతాయన్న సంకేతాలనిస్తున్నాయి. దేశంలోని సగటు కుటుంబాలు కూడా ఇదే అంచనాతో ముందుకు సాగుతున్నట్లు ఆర్‌బీఐ చెపుతోంది. ఆహార వస్తువుల సరఫరా స్థిరంగా కొనసాగితే, నిత్యావసరాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

EU Hits Elon Musk X with 120 Million Euro Fine Know The Details Here2
'ఎక్స్‌'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్‌కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి.

JSW MG Motor India launched Midnight Carnival offering prizes3
మిడ్‌నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్‌

వాహన కొనుగోలుదారుల కోసం ఎంజీ మోటార్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చినట్లు చెప్పింది. ‘మిడ్‌నైట్ కార్నివాల్’ పేరుతో డిసెంబర్ 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న పరిమితకాల ప్రమోషన్‌లో దేశవ్యాప్తంగా ఎంజీ షోరూమ్‌లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని చెప్పింది. వినియోగదారులు సౌకర్యవంతమైన సమయాల్లో తమకు నచ్చిన ఎంజీ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి కొనుగోలు చేయవచ్చని చెప్పింది.ఈ మూడు రోజుల ఈవెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఇంటర్నల్ కంబర్షన్‌ ఇంజిన్ (ICE) మోడల్స్‌పై భారీ తగ్గింపులు, ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కొనుగోలుదారుల కోసం రూ.11 కోట్ల విలువైన బహుమతుల పూల్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇందులో అర్హత కలిగిన ఇద్దరు కొనుగోలుదారులు లండన్‌కు ఉచిత ట్రిప్ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.మోడల్ వారీగా గరిష్ట ప్రయోజనాలు(ఐసీఈ మోడల్స్‌పై)మోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)గ్లోస్టర్ (Gloster)రూ. 4 లక్షల వరకురూ. 38.33 లక్షలుహెక్టర్ / హెక్టర్ ప్లస్ (Hector / Hector Plus)రూ. 90,000 వరకురూ. 14.00 లక్షలుఆస్టర్ (Astor)రూ. 50,000 వరకురూ. 9.65 లక్షలు ఈవీ మోడల్స్‌పై ప్రయోజనాలుమోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)ZS EVరూ. 1.25 లక్షల వరకురూ. 17.99 లక్షలుకామెట్ EVరూ. 1 లక్ష వరకురూ. 7.50 లక్షలువిండ్సర్ EVరూ. 50,000 వరకురూ. 14.00 లక్షలు

IndiGo founded by two friends know about indigo monopoly4
విమానయానంలో ఇండిగో ఆధిపత్యం

భారతీయ విమానయాన మార్కెట్‌లో 64 శాతం పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్‌డీటీఎల్‌) నిబంధనల అమలులో జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. డిసెంబర్ 2 నుండి 5 వరకు 1,200కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 5న ఒక్కరోజే 1,000కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇది ఇండిగో 20 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద ఆపరేషనల్ సవాలుగా నిలిచింది.ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనల్లో ఏముంది?జనవరి 2024లో డీజీసీఏ నూతన ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను ప్రకటించింది. వీటిని నవంబర్ 1, 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు..డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.తాత్కాలిక రిలాక్సేషన్‌పరిస్థితి చేయిదాటిపోవడంతో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకుని డిసెంబర్ 5న డీజీసీఏ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఇండిగో A320 ఫ్లీట్‌కు మాత్రమే వర్తించేలా ఫిబ్రవరి 10, 2026 వరకు రిలాక్సేషన్లు మంజూరు చేశారు.ఇండిగో ఆధిపత్యంమార్కెట్ షేర్: ఆగస్టు 2025 నాటికి 64.2 శాతం డొమెస్టిక్ మార్కెట్ వాటాతో దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికులలో 6 మంది ఇండిగోలో ప్రయాణిస్తున్నారు.అంతర్జాతీయంగా ఆసియాలో 2వ అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా నిలిచింది. ప్రపంచంలో 9వ అతిపెద్ద ప్యాసింజర్ క్యారియర్‌గా ఉంది.నవంబర్ 2025 నాటికి రోజుకు 2,700కి పైగా సర్వీసులు నడుపుతోంది.ఇదీ చదవండి: విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ

indigo ceo pieter elbers expects full normalisation likely by december 10 15 5
విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ

అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం వరకు సుమారు 1,000 పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది.

Weaker rupee is not entirely negative says Finance Minister Nirmala Sitharaman6
‘రూపాయి’ని అలా చూడొద్దు: నిర్మలా సీతారామన్‌

కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు స్పందన వచ్చింది. యూఎస్ డాలర్‌తో రూపాయి మారక విలువ కొన్ని రోజులుగా రికార్డ్‌ కనిష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇటీవల ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ .90.43కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రూపాయి ఇటీవలి కదలికలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ మొదటి స్పందనను అందించారు.హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోకుండా మార్కెట్ శక్తులకు వదిలివేయాలన్నారు. మారకం రేట్లు "చాలా సున్నితమైనవి" అన్నారు. కరెన్సీ కదలికలను అతిగా రాజకీయం చేయడం లేదా అతిగా నిర్వహించడం గురించి ఆమె హెచ్చరించారు. అవి ప్రపంచ ఒత్తిళ్లకు త్వరగా స్పందిస్తాయని పేర్కొన్నారు.ఆర్థిక ప్రాథమికాంశాలు ముఖ్యంనేటి రూపాయి స్థాయిలను గత పరిస్థితులతో పోల్చకుండా 2026 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ అంచనా వేసిన భారతదేశ ప్రస్తుత వృద్ధి పథంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ పరిశీలకులను కోరారు.పూర్తిగా ప్రతికూలం కాదురూపాయి బలహీనమైనప్పుడల్లా పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. రూపాయి విలువ క్షీణించినప్పుడు ఎగుమతిదారులు తరచుగా ప్రయోజనం పొందుతారని, ఎందుకంటే ఇది భారతీయ వస్తువులను విదేశాలలో మరింత పోటీగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement