Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Top 10 Most Affordable RWD Cars in India Automobile1
టాప్ 10 రియర్-వీల్ డ్రైవ్ కార్లు: ధరలు

రియర్-వీల్ డ్రైవ్ (RWD) కార్లు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ కార్లతో పోలిస్తే వీటి ధర కొంత తక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఆర్‌డబ్ల్యుడీ మోడల్ కార్లు వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తాయి. కాబట్టి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆర్‌డబ్ల్యుడీ కార్లు ఏవి?, వాటి ధరలు ఎంత అనేది ఇక్కడ చూసేద్దాం.10) టయోటా ఫార్చ్యూనర్: రూ. 33.64 లక్షల నుంచి రూ. 41.54 లక్షలు09) మహీంద్రా XEV 9e: రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షలు08) ఇసుజు డీ-మ్యాక్స్: రూ. 20.34 లక్షల నుంచి రూ. 20.62 లక్షలు07) టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ 18.65 లక్షల నుంచి రూ. 25.36 లక్షలు06) మహీంద్రా బీఈ 6: రూ. 18.90 లక్షల నుంచి రూ. 27.65 లక్షలు05) మహీంద్రా స్కార్పియో: రూ. 12.98 లక్షల నుంచి రూ. 16.70 లక్షలు04) మహీంద్రా థార్: రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.99 లక్షలు03) మహీంద్రా బొలెరో: రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షలు02) ఎంజీ కామెట్: రూ. 7.49 లక్షల నుంచి రూ. 9.99 లక్షలు01) మారుతి ఈకో: రూ. 5.20 లక్షల నుంచి రూ. 6.35 లక్షలు (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..

Countries With The Highest Density of Cars in The World2
ప్రపంచంలో ఎక్కువ కార్లు ఉన్న దేశాలు

ఎద్దుల బండ్లు, గుర్రాలను ప్రయాణానికి ఉపయోగించిన మానవుడు.. నేడు విమానంలో ప్రయాణించేదాకా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో కార్లు, బైకులు లెక్కలేనన్ని అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఇంటికి ఒక వాహనం ఉండేది, కానీ నేడు ఒక్కక్కరికి ఒక్కో వాహనం అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. కొన్ని దేశాల్లో వాహనాలు దాదాపు జనాభా సంఖ్యకు దగ్గరగా ఉన్నాయి. ఈ కథనంలో ఎక్కువ కార్లు ఏ దేశాల్లో ఉన్నాయో చూసేద్దాం..➤న్యూజిలాండ్: సుమారు 869 కార్లు / 1000 మంది➤అమెరికా (USA): సుమారు 860 కార్లు / 1000 మంది➤పోలాండ్: సుమారు 761 కార్లు / 1000 మంది➤ఇటలీ: సుమారు 756 కార్లు / 1000 మంది➤ఆస్ట్రేలియా: సుమారు 737 కార్లు / 1000 మంది➤కెనడా: సుమారు 707 కార్లు / 1000 మంది➤ఫ్రాన్స్: సుమారు 704 కార్లు / 1000 మందిభారతదేశంలో 1000 మందికి సరాసరిగా 34 కార్లు & 1000 మందికి 185 ద్విచక్ర వాహనాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పైన వెల్లడించిన దేశాల వరుసలో చూస్తే.. ఇండియా చాలా దూరంలో ఉంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..

India Implements Four Labour Codes From November 21st 20253
కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు: తక్షణమే అమల్లోకి

భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు.. తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు.కొత్త చట్టాలువేతనాల కోడ్ (2019)పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020)సామాజిక భద్రత కోడ్ (2020)వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)కనీస వేతనానికి గ్యారెంటీ, గ్రాట్యూటీ, సామాజిక భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే ఈ కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఇప్పటికే ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో ఉంటాయి.వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్‌ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది.OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.ప్రయోజనాలుకొత్త కార్మిక కోడ్‌ల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు, కార్మికులందరికీ కనీస వేతనం గ్యారెంటీ, అపాయింట్మెంటు లెటర్ గ్యారెంటీ, సమాన పనికి సమాన వేతనం, మహిళల ఆమోదం, భద్రత చర్యలకు లోబడి రాత్రి వేళలో స్త్రీలు పని చేయడానికి అనుమతి, 40 కోట్ల మంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ, ఏడాది తర్వాత ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిస్‌‌‌‌కు గ్రాట్యూటీ, ఓవర్ టైంకు రెట్టింపు వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య రక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం వంటివి ఉన్నాయి.నరేంద్ర మోదీ ట్వీట్''శ్రమేవ్ జయతే! నేడు, మన ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్‌లను అమలులోకి తెచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలలో ఒకటి'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Shramev Jayate!Today, our Government has given effect to the Four Labour Codes. It is one of the most comprehensive and progressive labour-oriented reforms since Independence. It greatly empowers our workers. It also significantly simplifies compliance and promotes ‘Ease of…— Narendra Modi (@narendramodi) November 21, 2025

Gold prices Fluctuated In The Evening Today4
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..

బంగారం ధరలలో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (నవంబర్ 21) ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. అంటే గంటల వ్యవధిలో పసిడి ధరలు తారుమారయ్యాయి.విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో బంగారం ధరలు ఉదయం రూ. 1,14,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,24,480 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 1,13,800 (రూ. 250 తగ్గింది), రూ. 1,24,130 (రూ. 280 తగ్గింది) వద్దకు చేరాయి.ఢిల్లీలో కూడా ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గింది. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ. 200 (రూ. 1,24,630), 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 220 (రూ. 1,14,250) పెరిగింది. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 280 (రూ. 1,24,130), రూ. 250 (రూ. 1,13,800) తగ్గింది.చెన్నైలో బంగారం ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధరలు రూ. 1,14,600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,25,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!

OPPO Unveils Flagship Find X9 Series in India Starting at Rs 749995
ఒప్పో నుంచి సరికొత్త ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌

ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వేరియంట్‌ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్‌ 21 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఒప్పో ఈ–స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.హాసెల్‌బ్లాడ్‌తో కలిసి రూపొందించిన కొత్త తరం కెమెరా సిస్టం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన పనితీరు మొదలైన విశేషాలు ఇందులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే హాసెల్‌బ్లాడ్‌ టెలీకన్వర్టర్‌ కిట్‌ రూ. 29,999కి లభిస్తుంది. ఇక, లేటెస్ట్‌ టీడబ్ల్యూఎస్‌ ఎన్‌కో బడ్స్‌3 ప్రోప్లస్‌ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,899గా ఉంటుంది.హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యంఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ హాసెల్‌బ్లాడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్‌ జెన్‌ కెమెరా సిస్టమ్. ఇది ప్రొఫెషనల్‌ ఫోటోగ్రఫీ అనుభవానికి దగ్గరగా ఉండే రంగులు, కాంట్రాస్ట్‌, డైనమిక్‌ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా టెలిఫోటో ఫోటోగ్రఫీ కోసం హాసెల్‌బ్లాడ్‌ టెలీకన్వర్టర్‌ కిట్ కూడా పరిచయమైంది.మెరుగైన బ్యాటరీ, పనితీరుఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో బలమైన ప్రాసెసర్‌, ఆప్టిమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ వంటి అంశాలు ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, నిరంతర మల్టీటాస్కింగ్‌ సామర్థ్యం, హై–ఎండ్‌ గేమింగ్‌కు సరిపడే పనితీరు ఈ డివైస్‌లను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

RBI warns against 7 new forex trading platforms6
ట్రేడింగ్‌లో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ హెచ్చరిక

అనధికారిక ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా ఇన్వెస్టర్లను రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన ఆర్‌బీఐ కొత్తగా అలర్ట్‌ లిస్ట్‌లో 7 ప్లాట్‌ఫామ్స్‌ను జత చేసింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్‌నెట్‌ ఎఫ్‌ఎక్స్, క్యాప్‌ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్‌ మార్కెట్స్, ట్రైవ్, ఎన్‌ఎక్స్‌జీ మార్కెట్స్, నార్డ్‌ ఎఫ్‌ఎక్స్‌ చేరాయి.విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999(ఫెమా) ప్రకారం జాబితాలోని సంస్థలకు అధికారికంగా ఫారెక్స్‌ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతిలేకపోవడంతోపాటు.. ఎల్రక్టానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌(ఈటీపీలు)ను సైతం నిర్వహించేందుకు వీలులేదని కేంద్ర బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా జాబితాలోని సంస్థలు, ప్లాట్‌ఫామ్స్, వెబ్‌సైట్లు ప్రకటనల ద్వారా అనధికారిక ఈటీపీలను ప్రమోట్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. శిక్షణ, అడ్వయిజరీ సర్వీసులందిస్తున్నట్లు క్లెయిమ్‌ చేసుకుంటున్నాయని తెలియజేసింది.

Advertisement
Advertisement
Advertisement