Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How to Get Richer as The World Economies Crash Robert Kiyosaki Tweet1
వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా'' అనే విషయం వెల్లడించారు.ధనవంతుడిని $లో కొలుస్తారు.సంపన్నుడిని TIMEలో కొలుస్తారు.ఉదాహరణకు ఒక ధనవంతుడు ఇలా అనవచ్చు: “నా దగ్గర బ్యాంకులో $1 మిలియన్ ఉంది.ఒక సంపన్నుడు ఇలా అనవచ్చు: “నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవించగలను.ఇప్పుడు చెప్పు.. నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి పనిచేస్తున్నావా?, లేక దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకుని నిజమైన ధనవంతుడు కావడానికి పనిచేస్తున్నావా?. ధనవంతుడు డబ్బు సంపాదించాలి, సంపన్నుడి కోసం డబ్బు పనిచేస్తుందని కియోసాకి పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.ఆర్థిక సంక్షోభం సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?. ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కఠినమైన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అని కియోసాకి ట్వీట్ ముగించారు.LESSON # 7:: How to get richer as the world economies crash:Are you working to get rich or are you working to get wealthy?Definitions: Rich is measured in $.Wealth is measured in TIME.For example a rich person might say: “I have $1 million in the bank.”A wealthy…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 8, 2025

US tariffs Have Had No Impact on Chinese Trade2
అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..!

అమెరికా టారిఫ్‌లు చైనా వాణిజ్య జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోండన్నట్టుగా.. డ్రాగన్‌ వాణిజ్య మిగులును అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.90 లక్షల కోట్లు) వాణిజ్య మిగులును సాధించిన తొలి దేశంగా చైనా చరిత్రను సృష్టించింది.ఈ ఏడాది చైనా 3.6 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఇదే సమయంలో 2.6 ట్రిలియన్‌ డాలర్ల దిగుమతులు చేసుకుంది. 2010లో ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్య మిగులు 0.18 ట్రిలియన్‌ డాలర్లుగానే ఉంది. 2015 నాటికి 0.59 ట్రిలియన్‌ డాలర్లు, 2025 నాటికి 1.08 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుకోవడం ద్వారా తయారీలో సూపర్‌ పవర్‌గా కొనసాగుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగానే చైనాపై టారిఫ్‌లు బాదేయడం తెలిసిందే. ఈ టారిఫ్‌ల కారణంగా అమెరికాకు చైనా వస్తు ఎగుమతులు నవంబర్‌లో 29 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో నెల చైనా నుంచి యూఎస్‌కు ఎగుమతులు క్షీణతను చూశాయి. అమెరికా బెదిరింపులకు డ్రాగన్‌ ఏమాత్రం బెదరలేదు. సరికదా తన వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

Microsoft Mega Investment In India Sundar Pichai Tweet3
భారత్‌లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.When it comes to AI, the world is optimistic about India! Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest-ever investment in Asia. The youth of India will harness this opportunity to innovate… https://t.co/fMFcGQ8ctK— Narendra Modi (@narendramodi) December 9, 2025

Australia first country in world ban children using social media full details4
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 10, 2025 నుంచి అమలులోకి రానుంది.ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్‌ (సోషల్ మీడియా మినిమం ఏజ్‌) బిల్లు’ ను 2024 నవంబర్‌లో ఆమోదించింది. ఈ చట్టం ఆన్‌లైన్ సేఫ్టీ చట్టం 2021 (Online Safety Act 2021)కు సవరణగా ఉంది.ఈ నియమంలోని కీలక అంశాలు ఏమిటి?ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పిల్లలపై కాకుండా సోషల్ మీడియా సంస్థలపై బాధ్యతను మోపుతుందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని నిర్దిష్ట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా నిరోధించడానికి సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా కూడా 16 ఏళ్ల లోపు వారు ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడానికి అనుమతి లేదు.ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించే ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, టిక్‌టాక్‌, ఎక్స్‌, రెడ్డిట్‌, థ్రెడ్స్‌, ట్విచ్‌, కిక్‌.ప్రధానంగా మెసేజింగ్ లేదా గేమింగ్ కోసం ఉపయోగించే WhatsApp, Discord, Roblox వంటి సర్వీసులను ప్రస్తుతానికి మినహాయించారు. అయినప్పటికీ, సేఫ్టీ కమీషనర్ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఈ జాబితాను మార్చే అవకాశం ఉంది.ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలు చేయనున్నారు.సంస్థలు వయస్సు ధ్రువీకరణ కోసం ప్రభుత్వ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా కోరకూడదు. అయితే ఫొటో లేదా వీడియో ఆధారిత వయస్సు అంచనా లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించే అవకాశం ఉంది.అనుసరించకపోతే జరిమానాలుఈ నిబంధనలను పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్‌ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.270 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానాలు ఉండవు. ఈ చట్టం బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపై మాత్రమే ఉంటుంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలుఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న తీవ్ర ఆందోళనలే కారణం. సోషల్ మీడియా అధిక వినియోగంతో కౌమార దశలో ఉన్నవారిలో ఆందోళన, నిరాశ, ఒంటరితనం పెరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. నిరంతర పోలికలు, లైక్‌ల కోసం ఎదురుచూడటం, సైబర్‌బుల్లింగ్‌ (Cyberbullying-డిజిటల్ వేదికల ద్వారా ఇతరులను అవమానించడం, బెదిరించడం, వేధించడం లేదా హింసించడం) వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రమాదకరమైన కంటెంట్ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ‘ప్రెడేటరీ అల్గారిథమ్స్’ కారణంగా పిల్లలు హింస, ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు, అసభ్యకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం వంటి ప్రమాదకరమైన కంటెంట్‌ బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ దీన్ని ‘బిహేవియరల్ కొకైన్‌’తో పోల్చారు.సోషల్ మీడియా వేదికలు పిల్లల మధ్య తోటివారి ఒత్తిడికి, ఆన్‌లైన్ వేధింపులకు వాహకంగా మారుతున్నాయి. మోసగాళ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి సులువైన మార్గాలుగా మారుతున్నాయి.సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లలు చదువు, నిద్ర, ఆటలు వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు దూరం అవుతున్నారు.కంపెనీలపై ప్రభావం ఇలా..ఈ నియమం వల్ల సోషల్ మీడియా కంపెనీలు ముఖ్యంగా ఆదాయం, మార్కెట్ పరిమాణం పరంగా నష్టాలను ఎదుర్కొంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న వినియోగదారులను తొలగించడం లేదా వారిని చేర్చుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో మొత్తం యూజర్ బేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ వయస్సు సమూహం తరచుగా అత్యంత చురుకైన వినియోగదారులలో ఒకటిగా ఉంటుంది.ప్రకటనల ఆదాయంపై ప్రభావంసోషల్ మీడియా కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. యూజర్ల సంఖ్య తగ్గితే ప్రకటనలను చేరుకునే అవకాశం ఉన్న జనాభా (Ad Reach) కూడా తగ్గుతుంది. ఫలితంగా ప్రకటనదారులకు ప్లాట్‌ఫామ్ ఆకర్షణ తగ్గి ప్రకటనల ఆదాయం తగ్గుతుంది.నియంత్రణ అమలు ఖర్చులువయస్సు ధ్రువీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని అమలు చేయడానికి టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాలి. ఈ కొత్త సాంకేతికతలను కొనసాగించడం, డేటా భద్రతను నిర్ధారించడం, స్థానిక చట్టాలను నిరంతరం పర్యవేక్షించడం అనేది అదనపు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది.సాంకేతిక సవాళ్లువయస్సు ధ్రువీకరణ అనేది సాంకేతికంగా చాలా క్లిష్టమైన విషయం. కొన్ని పద్ధతులు (ముఖ ధ్రువీకరణ వంటివి) గోప్యత సమస్యలను పెంచుతాయి. ఏఐ ఆధారిత వయస్సు అంచనా (AI-based Age Estimation) వంటి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సవాళ్లు ఎదురుకావొచ్చు. అందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. వయస్సు ధ్రువీకరణ కోసం వినియోగదారుల నుంచి అదనపు వ్యక్తిగత సమాచారం సేకరించాల్సి వస్తుంది. దీని వల్ల డేటా ఉల్లంఘనలు, ప్రైవసీ ఉల్లంఘనల ప్రమాదం పెరుగుతుంది. ప్లాట్‌ఫామ్‌లు తమ కంటెంట్ సిఫార్సు అల్గారిథమ్‌లను మార్చాలి. తద్వారా 16 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే సరియైన కంటెంట్ చేరుకునేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్‌.. ఎందుకంటే..

Developers of The Cascades Neopolis Win Second Highest Land Bid Ever5
హైదరాబాద్‌లో ఎకరా రూ.151.25 కోట్లు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ డెవలపర్లు చారిత్రక విజయాన్ని సాధించారు. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాల్టీ కన్సార్టియం తెలంగాణలో రెండో అత్యధిక ల్యాండ్‌ బిడ్‌ను గెలుచుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన 3వ ఫేజ్‌ వేలంలో ఈ కన్సార్టియం నియోపోలిస్ ప్లాట్ 15ను దక్కించుకుంది. ఈ మేరకు 4.03 ఎకరాల కోసం డెవలపర్లు ఎకరానికి రూ.151.25 కోట్లు రికార్డు స్థాయిలో బిడ్ వేశారు.ఇది తెలంగాణలో ఇప్పటివరకు ఎకరాకు నమోదైన రెండో అత్యధిక వేలంగా నిలిచింది. రాష్ట్రంలో అత్యధిక బిడ్ అక్టోబర్ 2025లో రాయదుర్గ్‌లోని నాలెడ్జ్ సిటీలో నమోదైంది. అక్కడ భూమి ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. ఈ భారీ పెట్టుబడి నియోపోలిస్‌ను హైదరాబాద్ అత్యంత ప్రతిష్టాత్మక, వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలప్‌మెంట్‌ కారిడార్‌గా సూచిస్తుంది.నియోపోలిస్‌లో కన్సార్టియం దృష్టిఈ తాజా బిడ్‌ నియోపోలిస్‌లో కన్సార్టియం ప్రాబల్యాన్ని బలోపేతం చేస్తుంది. ది కాస్కేడ్స్ నియోపోలిస్‌ను జూన్ 2025లో ఆవిష్కరించారు. ఇది రూ.3169 కోట్ల లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇందులో 217 మీటర్ల వరకు ఎత్తు ఉన్న ఐదు 63 అంతస్తుల టవర్లు ఉంటాయని కన్సార్టియం తెలిసింది.ఇదీ చదవండి: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్‌.. ఎందుకంటే..

Key Reasons Behind IPL Market Decline check details6
క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్‌.. ఎందుకంటే..

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టీ20 టోర్నమెంట్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ లీగ్ 2024లో సాధించిన 12 బిలియన్ డాలర్ల అపారమైన బ్రాండ్ విలువ 2025లో అనూహ్యంగా 20% పతనమై 9.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం ఈ పతనం 2020లో కొవిడ్-19 సమయంలో ఎదురైన పతనానికి దాదాపు సమానంగా ఉంది. ఈ పరిస్థితి కేవలం ఆర్థిక ఒత్తిడులనే కాకుండా కార్పొరేట్ దిగ్గజాల స్పాన్సర్‌షిప్ వ్యూహాలు, మీడియా రైట్స్ డైనమిక్స్, రెగ్యులేటరీ మార్పుల ప్రభావంతో ముడిపడి ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై ప్రభుత్వ నిషేధం, మీడియా కన్సాలిడేషన్ వంటి కీలకమైన కార్పొరేట్ అంశాలు లీగ్‌ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.భౌగోళిక ఒత్తిడులు2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు భారత్-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఆపరేషన్ సిందూర్), భారత క్రికెట్ బోర్డు (BCCI) భద్రతా కారణాల వల్ల ప్లేఆఫ్‌లతో సహా అనేక మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. ఐపీఎల్‌ ఆదాయాలపై, కార్పొరేట్ విశ్వాసంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ అంతరాయం కారణంగా స్పాన్సర్‌షిప్ డీల్స్‌లో 15-20% తగ్గుదల కనిపించింది.దీనికి తోడు మెగా-ఆక్షన్ కారణంగా ఫ్రాంచైజీల స్క్వాడ్‌ల్లో వచ్చిన గణనీయమైన మార్పులు టీమ్ పెర్ఫార్మెన్స్‌లను దెబ్బతీశాయి. ఉదాహరణకు, గతంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 24 శాతం తగ్గి 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అనిశ్చితి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ROI) ఆధారంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ ఇన్వెస్టర్లను లీగ్‌కు దూరం చేసింది.రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లుఐపీఎల్‌ ఆర్థిక వ్యవస్థలో స్పాన్సర్‌షిప్‌లు కీలకం. అయితే, 2025లో ప్రభుత్వం అమలు చేసిన రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం లీగ్‌కు అతిపెద్ద దెబ్బగా మారింది. ఈ బ్యాన్ వల్ల ఐపీఎల్‌కు రూ.1,500–రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు అంచనా.రియల్-మనీ గేమింగ్ కంపెనీలైన డ్రీమ్11, మై11సర్కిల్ వంటి కంపెనీలు ఐపీఎల్‌ జెర్సీలు, మ్యాచ్ స్పాన్సర్‌షిప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టేవి. ఉదాహరణకు, డ్రీమ్11 జెర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి రూ.350 కోట్లను ఉపసంహరించుకుంది. ఇది కేవలం ఐపీఎల్‌కే కాకుండా మొత్తం భారత క్రికెట్ పరిశ్రమపై ప్రభావం చూపింది.ఈ నిషేధం కారణంగా ఇతర కార్పొరేట్ బ్రాండ్‌లు (ఆటో, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్) కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, బడ్జెట్ కోతలు, ఆర్‌ఓఐ ఒత్తిడి నేపథ్యంలో స్పాన్సర్‌లు దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ వంటి అగ్ర ఫ్రాంచైజీలు కూడా 9% తగ్గుదలను చూశాయి.బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌లో పోటీ లోపంకార్పొరేట్ ప్రభావం ఐపీఎల్‌ బ్రాండ్ విలువను ప్రభావితం చేసిన మరో కీలక అంశం మీడియా రైట్స్. 2023-2027 సీజన్‌లకు రూ.48,390 కోట్లతో విక్రయించిన మీడియా రైట్స్‌లో డిస్నీ స్టార్, వియాకామ్18 మెర్జర్ (జియోస్టార్) వల్ల మోనోపాలీ ఏర్పడింది. ఇది గతంలో ఉన్న ఆక్షన్‌ను అంతం చేసి బిడ్డింగ్ పోటీని తగ్గించింది. ఫలితంగా ప్రతి మ్యాచ్ విలువ సుమారు రూ.115 కోట్లకు పరిమితమై ఐపీఎల్‌ మొత్తం విలువను దెబ్బతీసింది.ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వ్యూయర్‌షిప్‌ను పెంచినప్పటికీ, మోనిటైజేషన్ సామర్థ్యాన్ని తగ్గించాయి. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఈ మెర్జర్ వల్ల ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ ఐపీఎల్‌ ఎకోసిస్టమ్ మొత్తంగా నష్టపోయింది.పునరుద్ధరణకు మార్గాలురియల్-మనీ గేమింగ్‌పై ఆధారపడకుండా ఈస్పోర్ట్స్, హెల్త్‌కేర్, గ్లోబల్ టెక్ వంటి కొత్త రంగాల నుంచి స్పాన్సర్‌షిప్‌లను ఆకర్షించాలి.ఫ్రీ స్ట్రీమింగ్ మోడల్‌తో పాటు ప్రత్యేకమైన కంటెంట్, ప్రీమియం ఫీచర్‌ల ద్వారా మోనిటైజేషన్ మార్గాలను అన్వేషించాలి.భవిష్యత్ సీజన్‌ల్లో మీడియా రైట్స్ కోసం పోటీని పెంచడానికి బీసీసీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ

Advertisement
Advertisement
Advertisement