Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Rate Drops Again Within Hours1
బంగారం ధరల్లో ఇంత మార్పా!: గంటల వ్యవధిలోనే..

బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 2) మరోమారు తగ్గాయి. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఉదయం రూ. 250 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 550 రూపాయలకు చేరింది. అంటే గంటల వ్యవధిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 1,19,050 (22 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 610 తగ్గింది (ఉదయం రూ. 280 మాత్రమే తగ్గింది). దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,29,870 వద్ద నిలిచింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత తగ్గాయి. సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 610 రూపాయలు తగ్గి రూ. 1,30,020 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 550 రూపాయలు తగ్గి రూ. 1,19,200 వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 320 రూపాయలు తగ్గి రూ. 1,31,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి రూ. 1,20,400 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Paytm CEO Gets His Tesla Model Y Delivered2
పేటీఎం సీఈఓ కొత్త కారు: ధర ఎంతో తెలుసా?

పేటీఎం ఫౌండర్ & సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు టెస్లా కారును డెలివరీ చేసుకున్నారు. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ & క్రికెటర్ రోహిత్ శర్మ తరువాత ఈ కారును కొనుగోలు చేసిన మూడో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.నిజానికి 2016లో, టెస్లా భారతదేశంలో తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ 'మోడల్ 3' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో బుక్ చేసుకున్నవారిలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. అయితే చాలాకాలం ఎదురు చూసినప్పటికీ.. కంపెనీ ఈ కారును మన దేశంలో లాంచ్ చేయలేదు. దీంతో సంస్థ బుక్ చేసుకున్నవారందరీ.. డబ్బును రీఫండ్ చేసింది.టెస్లా కంపెనీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు, కానీ భారతదేశంలో మోడల్ వై లాంచ్ చేసింది. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. టెస్లా ఇప్పటికే ముంబైలో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది, తరువాత ఢిల్లీలో ఒకటి, గురుగ్రామ్‌లో మరొకటి ప్లాన్ చేసింది.టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.

If Mukesh Ambani Spends Rs 5 Crore Every Single Day His Entire Wealth Will End 555 Years3
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు!

కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయనే మాట చాలామంది వినే ఉంటారు. కానీ అంబానీ సంపదను రోజుకు రూ. 5కోట్లు చొప్పున ఖర్చు చేస్తే.. కరిగిపోవడానికి ఏకంగా వందల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం.. వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే 16వ ధనవంతుడు. ఆయన నికర విలువ దాదాపు USD 113.5 బిలియన్లు, అంటే దాదాపు రూ. 1,01,40,00,00,00,000 కోట్లు. ఈ సంపదను రోజుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం కరిగిపోవడానికి 2,02,800 రోజులు అవుతుంది. సంవత్సరాల రూపంలో చెప్పాలంటే 555 ఏళ్లు (2,02,800 ÷ 365) పడుతుందన్నమాట.రిలయన్స్ ఆదాయం ఇలా..1966లో ధీరూభాయ్ సారథ్యంలో ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభమైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పుడు దాదాపు 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్.. పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, ముఖేష్ అంబానీ & అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు.

Pankaj Chaudhary Says 15 Fugitive Economic Offenders Including Vijay Mallya Nirav Modi Rs 58000 Crore to Banks4
రూ.58 వేలకోట్లు!.. విజయ్ మాల్యాతో సహా 15 మంది అప్పు

ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొంది.. అప్పులపాలై దేశాన్ని విడిచిపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15మంది ఆర్ధిక నేరస్థులు బ్యాంకులకు రూ. 58,082 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు, పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. మొత్తం 15మంది ఆర్ధిక నేరస్థులలో.. 9 మంది పెద్ద మొత్తంలో ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, ఇద్దరు మాత్రమే పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారని అన్నారు. 15మంది బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.26,645 కోట్లు. వడ్డీ మొత్తం రూ. 31,437 కోట్లు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 (FEOA) నిబంధనల ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 15మంది నుంచి ఇప్పటివరకు 33 శాతం (రూ. 19187 కోట్లు) రికవరీ చేసినట్లు పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా వెనక్కి రావాల్సిన మొత్తం రూ. 38,895 కోట్లు అని అన్నారు.అత్యధికంగా విజయ్ మాల్యావిజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ.6,848.28 కోట్లు అప్పు తీసుకోగా.. అది వడ్డీతో కలిపి రూ.11,960.05 కోట్లకు పెరిగింది. అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు సైతం ప్రకటనలు చేశాయి. నీరవ్ మోదీ ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ కంపెనీల ద్వారా మొత్తం రూ.7800 కోట్ల అప్పు తీసుకున్నారు. పీఎన్‌బీ వద్దే ఒకే మొత్తంలో రూ.6799.18 కోట్లు అప్పు తీసుకున్నారు.

Apple may refused to comply with an govt directive Sanchar Saathi app5
‘సంచార్ సాథీ’పై కలకలం

సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్‌ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్‌స్టాల్‌పై డాట్‌ పట్టుడిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్‌, శామ్‌సంగ్‌, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ల్లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్‌ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్‌లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్‌లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్‌ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్‌ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్‌ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్‌ ప్లాట్‌ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్‌కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్‌ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్‌సంగ్‌, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..

Apple New Vice President Of AI Who is Amar Subramanya6
యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్‌: ఎవరీ అమర్ సుబ్రమణ్య?

యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్‌ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేష‌న్ మోడ‌ల్స్‌, ఎంఎల్ రీస‌ర్చ్‌, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేష‌న్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.ఎవరీ అమర్ సుబ్రమణ్య?ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ పనిచేశారు.పీహెచ్‌డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్‌లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా మైక్రోసాఫ్ట్‌కు మారాడు. గూగుల్‌లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్‌లో సీపీవీగా చేరారు.

Advertisement
Advertisement
Advertisement