Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Today Gold and Silver Price 25th November 20251
ఇంతలా పెరిగితే కొనేదెలా?: లేటెస్ట్ గోల్డ్ రేట్స్ ఇలా..

నవంబర్ నెల ముగుస్తున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఈ రోజు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2190 పెరిగింది. దీంతో దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

What is Black Friend and When its Starting Know The Sales Date2
బ్లాక్‌ఫ్రైడే గురించి తెలుసా.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే?

ఆఫర్స్ ఎప్పుడెప్పడు వస్తాయా?, నచ్చిన వస్తువులను తక్కువ ధరలో ఎప్పుడు కొనేద్దామా.. అని చాలామంది ఎదురు చూస్తుంటారు. మన దేశంలో కొన్ని సంస్థలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తారు. అలాంటి బ్లాక్‌ఫ్రైడే నవంబర్ 28న వస్తోంది. ఇంతకీ ఈ బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది? నిజంగానే అనుకున్నంత డిస్కౌంట్స్ లభిస్తాయా?.. అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చిందంటే?ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుస్తారు. అమెరికాలో అయితే.. బ్లాక్‌ఫ్రైడే ముందు రోజును థాంక్స్ గివింగ్ డే పేరుతో సెలబ్రేట్స్ చేసుకుంటారు. బ్లాక్‌ఫ్రైడే ఎలా వచ్చింది? అనటానికి చాలా సంఘటనలను ఉదాహరణలుగా చెబుతారు.నిజానికి బ్లాక్‌ఫ్రైడే అనే పదానికి.. షాపింగ్‌కు సంబంధమే లేదు. 1969 ఆర్ధిక సంక్షోభం సమయంలో ఒక శుక్రవారం రోజు బంగారం ధరలు భారీ పడిపోవడంతో.. దాన్నే బ్లాక్‌ఫ్రైడేగా పిలుచుకున్నారు.20వ శతాబ్దంలో.. ఒకసారి అమెరికాలో కార్మికుల సెలవు రోజుల తరువాత విధులకు లేటుగా వెళ్లారు.. దీన్ని కూడా బ్లాక్‌ఫ్రైడే అని పిలిచారు.ఫిలడెల్ఫియాలో శుక్రవారం రోజు షాపింగ్ వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడటంతో.. పోలీసులు దాన్ని బ్లాక్‌ఫ్రైడేగా పిలిచారు. ఆ తరువాత బ్లాక్‌ఫ్రైడే అనేది ఆన్‌లైన్ కొనుగోళ్ళకు.. డిస్కౌంట్లకు పర్యాయపదంగా మారిపోయింది.శుక్రవారం రోజు మొదలయ్యే వ్యాపారం.. వారాంతంలో కూడా బాగా సాగుతుంది. ఇలా బ్లాక్‌ఫ్రైడేను వ్యాపారానికి ఆపాదించేసారు. ఆ తరువాత సోషల్ మీడియా / ఇంటర్‌నెట్ కారణంగా.. బ్లాక్‌ఫ్రైడే అనే పదం ప్రపంచానికి పరిచయమైంది.2025 బ్లాక్‌ఫ్రైడే సేల్2023 బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచంలోని వినియోగదారులు ఏకంగా రూ. 75,000 కోట్లకంటే ఎక్కువ విలువైన షాపింగ్, 2024లో ఇది రూ. లక్ష కోట్లకు చేరింది. అయితే ఈ ఏడాది బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా.. రూ.1.50 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా.గొప్ప ఆఫర్స్ ఉంటాయా?మంచి ఆఫర్స్ ఉంటాయా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రకటించే ఏడు ఆఫర్లతో ఒకటి మాత్రమే నిజమైందని బ్రెటర్ వినియోగదారుల బృందం 2022లో వెల్లడించింది. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కంటే క్రిస్మస్ షాపింగ్ ఉత్తమం అని తెలిపారు.కొన్ని దేశాల్లో అయితే బ్లాక్‌ఫ్రైడే వస్తోందని ముందుగానే ధరలను పెంచేసి.. ఆ రోజు తగ్గించినట్లు ప్రకటిస్తాయి. దీనిని కొందరు బ్లాక్‌ ఫ్రాడ్ అని విమర్శించారు. కాబట్టి బ్లాక్‌ఫ్రైడే సమయంలో ఆఫర్స్ ఉపయోగించే ఉత్పత్తులను కొనాలని చూసేవారు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. స్కామర్లు కూడా దీనిని అదనుగా చూసుకుని.. మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఆదమరిస్తే మోసపోవడం ఖాయం.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు

S and P Pegs India FY26 GDP Growth at 6 5 Percent3
టారిఫ్‌ల ప్రభావం ఉన్నప్పటికీ.. భారత్ వృద్ధి

న్యూఢిల్లీ: భారత్‌ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) వృద్ధి రేటు 6.7 శాతం పుంజుకుంటుందని తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమిస్తుందని, దీంతో వృద్ధి రేటు బలపడుతుందని వివరించింది.అమెరికా టారిఫ్‌ల ప్రభావం నెలకొన్నప్పటికీ.. బలమైన వినియోగంతో దేశీ వృద్ధి పటిష్టంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. సెపె్టంబర్‌ త్రైమాసికం జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి.అమెరికాతో ఒప్పందంఅమెరికాతో భారత్‌ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అది అనిశ్చితులు తగ్గేందుకు, విశ్వాసం పెరుగుదలకు దారితీస్తుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఇది కార్మికుల ఆధారిత రంగాలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ‘‘జీఎస్‌టీ రేట్లు తగ్గించడం మధ్య తరగతి వినియోగానికి మద్దతునిస్తుంది. దీనికి ఆదాయపన్ను తగ్గింపు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా తోడవుతుంది. ఈ మార్పులతో పెట్టుబడుల కంటే వినియోగం వృద్ధిని బలంగా నడిపిస్తుంది’’అని పేర్కొంది.గత బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు (కొత్త పన్ను విధానం కింద) కలి్పంచడం తెలిసిందే. ఇక ఆర్‌బీఐ వరుస వడ్డీ రేట్ల తగ్గింపుతో రెపో రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.5 శాతానికి దిగిరావడం గమనార్హం. అలాగే, సెప్టెంబర్‌ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్‌టీ తగ్గడం తెలిసిందే. భారత ఎగుమతుల విస్తరణపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఉందంటూ.. అంతిమంగా భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా తగ్గించే అవకాశాలున్నట్టు అభిప్రాయపడింది.

How to Grow in Your Career Using Warren Buffett Investing Strategy4
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ విలువ పెట్టుబడిదారుడుగా ప్రసిద్ధి చెందిన వారెన్ బఫెట్ కేవలం స్టాక్ మార్కెట్లను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు. ఎలాంటి రిస్క్ తీసుకోవాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, భావోద్వేగాలను ఎల్ నియంత్రించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని మారుస్తాయంటారు బఫెట్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..➤సమయం, శక్తి, నైపుణ్యం అనేవి జీవితంలో నిజమైన ఆస్తులు. సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు?, దేని గురించి రోజూ ఆలోచిస్తుంటారు?, అనే విషయాలను గమనించండి. మీ డబ్బును లేదా మూలధనాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నారనే విషయం మీద చాలా జాగ్రత్త వహించాలి. సమయం మీకు వ్యతిరేకంగా కాకుండా.. మీ కోసం పనిచేయనివ్వండి. మీ కెరియర్ గురించి ఆలోచించండి అని బఫెట్ చెబుతారు.➤పెట్టుబడిలో.. భద్రత మార్జిన్ అనేది ధర & విలువల మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో రెండు పాటించాల్సి ఉంటుంది. ఒకటి.. మీకు ఆర్థిక మార్జిన్ అవసరం, కొన్ని నెలల ఖర్చులను కవర్ చేసే అత్యవసర నిధి & ప్రాథమిక ఆరోగ్య బీమా. రెండవది.. ఖర్చు మార్జిన్, అధిక EMIలు లేదా విలాసవంతమైన జీవనశైలిని నివారించడం. ఈ రెండింటిని పాటిస్తే.. మీరు త్వరగా ఆర్థికంగా ఎదుగుతారు.➤గాసిప్‌లు, సోషల్ మీడియా పోస్టులు, ఆఫీస్ పోలికలను పూర్తిగా నివారించుకోవాలి. తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. కోపంతో వెళ్లిపోవడం, విమర్శలకు అతిగా స్పందించడం వంటివి మానుకోవాలి. దీనికి బదులు పెట్టుబడుల విషయంలో తెలివిగా ఆలోచించండి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.➤మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. వేరేవాళ్లను కాపీ చేయడం మానుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక దృఢమైన సంకల్పం చేసుకోండి. దానికోసం ప్రయత్నించండి.➤సమయం దొరికినప్పుడు చదువుతూ ఉండండి, నిరంతరం ఎదో ఒకటి నేర్చుకోవడం పట్ల అభిరుచి కలిగి ఉండాలని బఫెట్ చెబుతారు. రోజుకు కనీసం 30 నిమిషాలు చదవండి. పుస్తకాలు మాత్రమే కాకుండా, న్యూస్ పేపర్, ఆర్థిక నివేదికలు కూడా చదువుకోవచ్చు. ప్రతి నెలా, మీరు నేర్చుకున్న వాటిని ఎక్కడ ఉపయోగించారో ఆలోచించండి.ఇదీ చదవండి: యూకే వీడిన లక్ష్మీ మిట్టల్: కారణం ఇదే..

NBFC AUM to grow at 19percent, cross Rs 50 lakh crore next fiscal Year5
ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 18% వృద్ధి

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) తమ నిర్వహణ ఆస్తుల్లో 18 శాతం వృద్ధిని కొనసాగిస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. కొన్ని విభాగాల్లో రుణపరమైన ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈమేరకు వృద్ధి సాధ్యమేనని పేర్కొంది. మొత్తం మీద ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2027 మార్చి నాటికి రూ.50 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. కస్టమర్‌ లెవరేజ్‌ అధికమైన నేపథ్యంలో (సామర్థ్యానికి మించి రుణ భారం) ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ, అన్‌సెక్యూర్డ్‌ రుణ విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీలు రిస్క్‌ను సమతుల్యం చేస్తూ వృద్ధిని సాధించడంపై దృష్టి సారిస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు. వ్యక్తిగత రుణాల్లో 25 శాతం వృద్ధి.. → వ్యక్తిగత రుణాలలో (ఎన్‌బీఎఫ్‌సీ ఏయూఎంలో 11 శాతం) వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 18 శాతం నుంచి 22–25 శాతానికి పెరుగుతుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2023–24లో నమోదైన 37 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. → జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో ఉండడం రిటైల్‌ రుణాల డిమాండ్‌ను పెంచుతుందని తెలిపింది. → ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో అన్‌సెక్యూర్డ్‌ ఎంఎస్‌ఎంఈ రుణాలు 6 శాతంగా ఉంటాయంటూ, ఇందులో సకాలంలో చెల్లింపులు చేయని రుణాలు పెరుగుతున్నట్టు పేర్కొంది. దీని ఫలితంగా ఏయూఎంలో వృద్ధి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఉన్న 31 శాతం నుంచి 13–14 శాతానికి తగ్గనున్నట్టు వెల్లడించింది. → ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 15 శాతం వాటా కలిగిన లోన్‌ ఎగైనెస్ట్‌ ప్రాపర్టీ (ప్రాపర్టీ తనఖాపై రుణం) రుణాల్లో 26–27 శాతం వృద్ధి ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో నమోదు అవుతుందని అంచనా వేసింది. – బంగారం రుణ విభాగం (ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 6 శాతం) ఇక ముందూ బలమైన వృద్ధిని కొనసాగిస్తుందని తెలిపింది. బంగారం రుణ మార్కెట్‌ అసంఘటిత రంగం నుంచి సంఘటితం వైపు మళ్లుతుండడం, ఈ విభాగం విస్తరణకు మద్దతునిస్తుందని పేర్కొంది.

December As Eight IPOs Line Up to Raise Over Rs30,000 Crore in India6
లిస్టింగ్‌కు 3 కంపెనీలు రెడీ

న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ ఈ క్యాలండర్‌ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు దూసుకెళుతున్నాయి. నిజానికి 2024లో 76 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా ఉమ్మడిగా రూ. 1.53 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే మెయిన్‌బోర్డులో 93 కంపెనీలు రూ. 1.54 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో మరో మూడు కంపెనీలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం. ఏఐ సొల్యూషన్స్‌ ఎండ్‌టు ఎండ్‌ ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సొల్యూషన్లు అందించే ఫ్రాక్టల్‌ అనలిటిక్స్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 1,279 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 3,621 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 4,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో క్వినాగ్‌ బిడ్కో రూ. 1,463 కోట్లు, టీపీజీ హోల్డింగ్స్‌ రూ. 2,000 కోట్లు, జీఎల్‌ఎమ్‌ కుటుంబ ట్రస్ట్‌ రూ. 129 కోట్లు విలువైన షేర్లను ఆఫర్‌ ఆఫర్‌ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ కంపెనీ ఫ్రాక్టల్‌ యూఎస్‌ఏలో పెట్టుబడులు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, ఆర్‌అండ్‌డీ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వెచి్చంచనుంది. సాస్‌ కంపెనీ సాస్‌ సర్వీసులందించే అమాగీ మీడియా ల్యాబ్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 1,020 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రస్తుత వాటాదారులు 3.41 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 667 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. కార్డియాక్‌ స్టెంట్స్‌ 2001లో ఏర్పాటైన మెడికల్‌ పరికరాల తయారీ కంపెనీ సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు రానుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.76 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేర్లు ఆఫర్‌ చేయనున్న సంస్థలలో శ్రీ హరి ట్రస్ట్, సమారా క్యాపిటల్‌ మార్కెట్స్‌ హోల్డింగ్, కొటక్‌ ప్రీఐపీవో అపార్చునిటీస్‌ ఫండ్‌ తదితరాలున్నాయి. కంపెనీ ప్రధానంగా కార్డియాక్‌ స్టెంట్స్‌ను తయారు చేస్తోంది. కంపెనీ భారత్, థాయ్‌లాండ్‌లలో రెండు ఆర్‌అండ్‌డీ కేంద్రాలను నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement