Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

High-value home sales surge in new markets1
ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశంలోని 15 ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4% పెరిగి రూ.37,409 కోట్లకు చేరినట్లు స్థిరాస్తి డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. వార్షిక ప్రాతిపదికన గృహ విక్రయాల సంఖ్య (వాల్యూమ్స్‌ పరంగా) 4% తగ్గి 39,201 యూనిట్లకు పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది. ఇక కొత్తగా మార్కెట్‌లోకి వచి్చన హౌసింగ్‌ యూనిట్ల సంఖ్య(కొత్త సప్లై) 10% క్షీణించి 28,721కు దిగివచి్చంది. ⇒ అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదర, జైపూర్, నాసిక్, నాగ్‌పూర్, మొహాలి, భువనేశ్వర్, లక్నో, భూపాల్, కొయంబత్తూర్, గోవా త్రివేండ్రం, కొచి్చ.... ఈ 15 నగరాల్లో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అహ్మదాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 6% తగ్గి 13,021 యూనిట్లకు పరిమితమయ్యాయి. సూరత్‌లో విక్రయాలు 8% క్షీణించి 4,936 యూనిట్లకు దిగివచ్చాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ, అమ్మకాల్లో 60% గుజరాత్‌లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదరల్లో నమోదయ్యాయి. ⇒ భారత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన శక్తి కేంద్రాలుగా టైర్‌–2 నగరాలు ఎదుగుతున్నాయని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్‌ జసుజా తెలిపారు. ఉద్యోగ అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతాల మధ్య మెరుగుతున్న అనుసంధానం(కనెక్టివిటీ) అంశాలు రియల్‌ ఎస్టేట్‌ విభాగాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ⇒ సెప్టెంబర్‌ త్రైమాసికంలో కొత్త గృహ ప్రాజెక్టుల లాంచింగ్‌ క్షీణించడమనేది మందగమనానికి సంకేతంగా కాకుండా, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్టోన్‌క్రాఫ్ట్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు కీర్తి చిలుకూరి తెలిపారు.

FM Nirmala Sitharaman says Finance Ministry does not advise LIC on investments2
ఎల్‌ఐసీ స్టాక్స్‌ కొనుగోళ్లపై సలహాలివ్వం

న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులపై తమ శాఖ ఎలాంటి సలహాలివ్వదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో మార్గనిర్దేశం సైతం చేయదని తెలియజేశారు. అదానీ గ్రూప్‌ కంపెనీలలో ప్రామాణిక నిర్వహణా సంబంధ నిబంధనల (ఎస్‌వోపీ)మేరకే ఎల్‌ఐసీ వాటాల కొనుగోళ్లు చేపట్టినట్లు ఒక ప్రశ్నకు గాను లోక్‌సభకి ఇచి్చన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. టాప్‌ ర్యాంక్‌ బీమా దిగ్గజం అనేక సంవత్సరాలుగా ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు (ఫండమెంటల్స్‌) ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీలపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక మాత్రమే స్టాక్స్‌ కొనుగోళ్లు చేపడుతుందని వివరించారు. వెరసి ఎస్‌వోపీల ప్రకారం తగిన పరిశీలనతోపాటు.. రిసు్కలపై అధ్యయనం చేశాక అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీలలో ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్‌ కంపెనీల పుస్తక విలువ రూ. 38,659 కోట్లుకాగా.. సంబంధిత కంపెనీల రుణ పత్రాలలోనూ మరో రూ. 9,626 కోట్లవరకూ పెట్టుబడులు చేపట్టినట్లు తెలియజేశారు. ఎల్‌ఐసీ ఫండ్‌ చేపట్టే పెట్టుబడి నిర్ణయాలపై ఆర్థిక శాఖ ఎలాంటి సూచనలు లేదా సలహాలు ఇవ్వబోదని, స్టాక్‌ కొనుగోళ్లలో ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చట్టాల ప్రకారమే ... ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు ఎప్పటికప్పుడు 1938 బీమా చట్టం, ఐఆర్‌డీఏఐ నియంత్రణలు, ఆర్‌బీఐసహా.. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్‌ వివరించారు. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులకు వీలుగా ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించినట్లు అక్టోబర్‌లో వాషింగ్టన్‌ పోస్ట్‌లోని ఒక నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో రుణభారంతోపాటు.. యూఎస్‌లో నిశిత పరిశీలనను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులకు ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను అమలు చేసినట్లు నివేదిక ఆరోపించింది. 2025 మే నెలలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో ఎల్‌ఐసీ 57 కోట్ల డాలర్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్‌వోపీలు, బోర్డు అనుమతులతో 2025 మేలో ఎల్‌ఐసీ.. అదానీ పోర్ట్స్‌ జారీ చేసిన ఎన్‌సీడీలలో రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టయిన టాప్‌–500 కంపెనీలలో ఎల్‌ఐసీ పెట్టుబడులు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం పెట్టుబడుల్లో ప్రధాన వాటా భారీ కంపెనీలలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 50 కంపెనీలలో ఎల్‌ఐసీ పెట్టుబడుల పుస్తక విలువ 2025 సెపె్టంబర్‌ 30 కల్లా రూ. 4,30,777 కోట్లుగా పేర్కొన్నారు.

Meesho, Vidya Wires, and Aequs are launching their IPOs next week3
మీషో ఐపీవో @ రూ. 5,421 కోట్లు

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం మీషో ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) రేపు (డిసెంబర్‌ 3న) ప్రారంభమై 5న ముగుస్తుంది. దీని ద్వారా కంపెనీ రూ. 5,421 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 105–111గా ఉంటుంది. దీని ప్రకారం మీషో వేల్యుయేషన్‌ గరిష్టంగా రూ. 50,096 కోట్లుగా ఉంటుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 4,250 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో రూ. 1,171 కోట్ల విలువ చేసే 10.55 కోట్ల షేర్లను విక్రయించనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు డిసెంబర్‌ 2 బిడ్డింగ్‌ తేదీగా ఉంటుంది. డిసెంబర్‌ 12న స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, బ్రాండ్‌ ప్రచారం, వేరే సంస్థల కొనుగోళ్లు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. వినియోగదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్‌ భాగస్వాములు, కంటెంట్‌ క్రియేటర్లను అనుసంధానించే ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంగా మీషో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రతి రోజు కొనుగోలుదారులకు తక్కువ ధరల్లో ఉత్పత్తులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కంపెనీ ఎండీ విదిత్‌ ఆత్రే తెలిపారు. మీషో ఈ ఏడాది జూలైలో కాని్ఫడెన్షియల్‌ విధానంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించగా, ఐపీవోకి అక్టోబర్‌లో అనుమతులు లభించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయాలు రూ. 5,577 కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది రూ. 4,311 కోట్లుగా నమోదైంది. రూ. 922 కోట్ల ఈక్వస్‌ ఇష్యూకన్జూమర్‌ డ్యూరబుల్‌ గూడ్స్, ఏరోస్పేస్‌ భాగాల కాంట్రాక్ట్‌ తయారీ సంస్థ ఈక్వస్‌ ఐపీవో ద్వారా రూ. 922 కోట్లు సమీకరించనుంది. ఇది కూడా డిసెంబర్‌ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూ ప్రకారం ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 118–124గా ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ. 670 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్‌ఎస్‌ కింద రూ. 252 కోట్ల విలువ చేసే 2.03 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. రెండు అనుబంధ సంస్థలైన ఏరోస్ట్రక్చర్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇండియా, ఈక్వస్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ తీసుకున్న రుణాలను తీర్చివేసేందుకు, మెషినరీ కొనుగోలుకు, ఇతర సంస్థల కొనుగోళ్లకు ఐపీవో నిధులను కంపెనీ ఉపయోగించుకోనుంది. ఐపీవో కోసం జూన్‌లో సెబీకి దరఖాస్తు చేసుకోగా సెపె్టంబర్‌లో అనుమతులు వచ్చాయి. ప్రధానంగా ఏరోస్పేస్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈక్వస్‌ ఇతరత్రా కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ మొదలైన విభాగాల్లోకి కూడా విస్తరించింది. ఇన్ఫీ నారాయణ మూర్తి ఫ్యామిలీ ఆఫీస్‌ అయిన కాటమారన్, ఎమికస్‌ క్యాపిటల్‌ మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్‌ చేశాయి. ఎయిర్‌బస్, బోయింగ్, హనీవెల్‌ హాస్‌బ్రో, వండర్‌òÙఫ్‌లాంటి సంస్థలు ఈక్వస్‌కి క్లయింట్లుగా ఉన్నాయి. పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఓయోట్రావెల్‌ టెక్‌ ప్లాట్‌ఫాం ఓయో మాతృ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారుల అనుమతిని పొందడం కోసం డిసెంబర్‌ 20న అసాధారణ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్‌హోల్డర్లకు ఇచి్చన సమాచారం ప్రకారం అర్హులైన షేర్‌హోల్డర్లకు ప్రతి 19 ఈక్విటీ షేర్లకు గాను 1 ఈక్విటీ షేరును బోనస్‌గా జారీ చేసే ప్రతిపాదనపై ఓటింగ్‌ ఉంటుంది. దీనికి డిసెంబర్‌ 5 రికార్డు తేదీగా ఉంటుంది. బోనస్‌ ఇష్యూ, ఐపీవో సంబంధిత తదుపరి నిధుల అవసరాలరీత్యా అ«దీకృత మూలధనాన్ని రూ. 2,431 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనపైనా షేర్‌హోల్డర్లు ఓటింగ్‌లో పాల్గొంటారు.అదే బాటలో విద్యా వైర్స్‌ .. వైండింగ్, కండక్టివిటీ ఉత్పత్తుల తయారీ సంస్థ విద్యా వైర్స్‌ తమ ఐపీవోకి సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణిని రూ. 48–52గా నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ గరిష్ట విలువ రూ. 1,100 కోట్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విద్యా వైర్స్‌ రూ. 300 కోట్లు సమీకరిస్తోంది. ఐపీవో డిసెంబర్‌ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా రూ. 274 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా రూ. 26 కోట్ల విలువ చేసే 50.01 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు, రుణాల చెల్లింపునకు, కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. విద్యా వైర్స్‌ ప్రధానంగా పేపర్‌ ఇన్సులేటెడ్‌ కాపర్‌ కండక్టర్లు, స్పెషలైజ్డ్‌ వైండింగ్‌ వైర్లు, పేపర్‌ ఇన్సులేటెడ్‌ కాపర్‌ కండక్టర్స్‌ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. డిసెంబర్‌ 9న స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేర్లు లిస్టవుతాయి.

GST collections slip on rate cuts to Rs 1. 7 lakh cr in November 20254
జీఎస్‌టీ వసూళ్లు డీలా

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం ఏడాది కనిష్టానికి పడిపోయింది. నవంబర్‌లో రూ.1,70,276 కోట్లు జీఎస్‌టీ రూపంలో వసూలైంది. 2024 నవంబర్‌లో ఆదాయం రూ.1.69 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 0.7 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్‌లో మాత్రం స్థూల జీఎస్‌టీ వసూళ్లు అంతక్రితం ఏడాది ఇదే నెలతో (రూ.1.87 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 4.6 శాతం అధికంగా రూ.1.95 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం తెలిసిందే. జీఎస్‌టీలో శ్లాబులను కుదించడంతోపాటు, 375 వరకు ఉత్పత్తులను తక్కువ పన్ను శ్లాబులోకి మార్చడం తెలిసిందే. కొత్త రేట్లు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అక్టోబర్‌లో మెరుగైన ఆదాయానికి పండుగల సమయంలో కొనుగోళ్లు దోహదపడినట్టు, నవంబర్‌ నెల గణాంకాల్లో రేట్ల సవరణ ప్రభావం కనిపించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు జీఎస్‌టీ వసూళ్లు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 8.9 శాతం పెరిగి రూ.14,75,488 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లు 4 శాతం తగ్గి రూ.18,196 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లను మినహాయించి చూస్తే నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.52 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.

Gold Rate Big Jump In Indian Market  5
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్‌ నడుస్తుండడంతో డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్‌ మార్కెట్‌) ఔన్స్‌కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్‌ 31న ఔన్స్‌ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్‌ డాలర్‌ బలహీనపడడం, యూఎస్‌ ఫెడ్‌ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్‌ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.

Indian Passenger Lauds TDR System For Refund After 7 Hour Train Delay6
ట్రైన్ ఆలస్యమైందా?: ఇలా చేస్తే డబ్బు మొత్తం రీఫండ్..

కొన్ని సందర్భాల్లో.. అనేక కారణాల వల్ల రైలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు లేదా రైలు రావడం ఆలస్యం కావొచ్చు. AC యూనిట్లు పనిచేయకపోవచ్చు, కోచ్ కాన్ఫిగరేషన్‌లు మారవచ్చు, రైలును పూర్తిగా దారి మళ్లించనూవచ్చు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు టీడీఆర్ లేదా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ఉపయోగించుకోవడం ద్వారా.. మొత్తం డబ్బు రీఫండ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు.టీడీఆర్ సేవను ఉపయోగించడం వల్ల.. తన డబ్బు మొత్తం రీఫండ్ అయిందని.. ఒక ఎక్స్ యూజర్ తన అనుభవాన్ని పేర్కొన్నారు.ఎక్స్ యూజర్, తన భార్య రైలులో సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారని, అయితే ట్రైన్ ఏడు గంటలు ఆలస్యమైందని IRCTC నుంచి మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. ట్రైన్ ఆలస్యం కావడంతో బస్సులో ప్రయాణించాలనుకున్నాము. అయితే ట్రైన్ టికెట్ కోసం పెట్టిన డబ్బును రీఫండ్ పొందడానికి.. TDR దాఖలు చేసి, రైలు 3 గంటలకు పైగా ఆలస్యం అయిందని.. నేను రైలులో ప్రయాణం చేయలేదనే రీజన్ ఎంచుకున్నాను. రీఫండ్ కూడా త్వరగానే ప్రారంభమైంది, డిసెంబర్ 1న వచేశాయని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తోటి ప్రయాణీకులను కూడా కోరారు.ఇదీ చదవండి: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్‌గా..టీడీఆర్ గురించినిజానికి TDR అనేది కొత్త సర్వీస్ కాదు. అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రైల్వే శాఖ రైలును రద్దు చేసినప్పుడు, ట్రైన్ మూడు గంటలు ఆలస్యమైనప్పుడు, సరైన టికెట్ ఉన్నప్పటికీ.. ప్రయాణం చేయలేనప్పుడు, ప్రయాణం సమయంలో ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. టీడీఆర్‌ను తప్పనిసరిగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫైల్ చేయాలి. రైలు బయలుదేరిన నాలుగు గంటల్లోగా టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.Received Message from IRCTC that Train was 7 hours late. Booked a Bus Ticket to the Destination.Instead of Cancelling Train Ticket, Filed TDR on Nov 30th 2025.Refund initiated on Dec 1st 2025.Super Fast. Credit where due for timely communication from Railways 👍… pic.twitter.com/weZiQNuenT— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) December 1, 2025

Advertisement
Advertisement
Advertisement