ప్రధాన వార్తలు
కొత్త మార్క్కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.SILVER BREAKS $ 80.00$200 NEXt ?— Robert Kiyosaki (@theRealKiyosaki) December 28, 2025భారతదేశంలో వెండి రేటుహైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025
కారుణ్య నియామకం హక్కు కాదు.. తక్షణ భరోసా: ఉన్నత న్యాయస్థానం
ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కల్పించే కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కారుణ్య నియామక ప్రాతిపదికన ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత, తమకు అర్హత ఉన్నా అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.కేసు నేపథ్యంతమిళనాడు పట్టణ పంచాయతీల్లో స్వీపర్లుగా పనిచేస్తూ మరణించిన ఇద్దరు వేర్వేరు ఉద్యోగుల కుమారులకు (ఎం.జయబల్, ఎస్.వీరమణి) వారి తండ్రుల మరణానంతరం 2007, 2012 సంవత్సరాల్లో స్వీపర్లుగానే ఉద్యోగాలు లభించాయి. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ కొలువుల్లో చేరారు. అయితే, సుమారు 3 నుంచి 9 ఏళ్ల తర్వాత తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అప్పట్లో అవగాహన లేక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరామని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలుకారుణ్య నియామకం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు)కు ఒక మినహాయింపు మాత్రమే. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇది ఒక హక్కు కాదు లేదా కెరీర్ అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం కాదు. అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుంది. అర్హత ఉంది కదా అని ఉన్నత పదవిని డిమాండ్ చేసే హక్కు అభ్యర్థికి ఉండదు.ఉద్యోగంలో చేరిన చాలా ఏళ్ల తర్వాత (3-9 ఏళ్లు) కోర్టును ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘వేరే ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత పదవి ఇచ్చారు కాబట్టి, మాకూ ఇవ్వాలి’ అనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని కోర్టులు ఆదేశించలేవని చెప్పింది. తప్పును పునరావృతం చేయలేమని స్పష్టం చేసింది.న్యాయ నిపుణుల విశ్లేషణఈ తీర్పుపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు కేవలం మానవతా దృక్పథంతో చేసేవని, వీటిని సీనియారిటీ పెంచుకోవడానికి లేదా ఉన్నత పదవులు అనుభవించడానికి వాడుకోలేమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టివేస్తూ, పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కారుణ్య నియామకం పొందిన వారు భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం ఇలాంటి క్లెయిమ్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.ఇదీ చదవండి: మీరు బిజినెస్లో కింగ్ అవ్వాలంటే..
మీరు బిజినెస్లో కింగ్ అవ్వాలంటే..
వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి, అమ్మకాలు మాత్రమే అనుకుంటే పొరపాటే! ప్రస్తుత కాలంలో మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో బిజినెస్ రూపురేఖలే మారిపోయాయి. చాలా మంది పాత పద్ధతులతో నష్టపోతుంటే, కొందరు మాత్రం టెక్నాలజీని వాడుకుంటూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారు. ఇంతకీ ఆ సక్సెస్ మంత్ర ఏమిటో తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది. వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఐదు వ్యూహాలను కింద తెలియజేశాం.ఆర్థిక నిర్వహణవ్యాపారానికి క్యాష్ ఫ్లో, ఆర్థిక నిర్వహణ చాలా కీలకం. 2025లో గ్లోబల్ ఇన్ఫ్లేషన్ 3% వద్ద స్థిరపడినప్పటికీ అంతర్జాతీయ టారిఫ్లు, సప్లై చైన్ సమస్యల వల్ల ముడిసరుకుల ధరలలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సేల్స్ పెంచుకోవడం మీద కాకుండా, ప్రాఫిట్ మార్జిన్లపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ‘ప్రాఫిట్ ఫస్ట్’ పద్ధతిని అనుసరించడం ద్వారా ఆదాయం రాగానే లాభం, పన్నులు, వేతనాలను పక్కన పెట్టి, మిగిలిన మొత్తంతోనే ఖర్చులను నిర్వహించాలి. మార్కెట్లోని కొన్ని సాఫ్ట్వేర్లు ఇప్పుడు ఏఐ ఆధారిత అనలిటిక్స్ను అందిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో రాబోయే ఖర్చులను ముందే అంచనా వేసి, ఖర్చులను 20-30% తగ్గించడంలో సహాయపడుతున్నాయి.కస్టమర్ ఫోకస్కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ (కొత్త కస్టమర్ను ఆకర్షించే ఖర్చు) భారీగా పెరిగింది. అందుకే ఉన్న కస్టమర్లను నిలబెట్టుకోవడమే అత్యంత లాభదాయకమైన మార్గం. 80 శాతానికిపైగా చిన్న వ్యాపారాలు ఇప్పుడు జనరేటివ్ ఏఐను వాడుతూ కస్టమర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నాయి. వ్యాపారులు కస్టమర్ డేటాను విశ్లేషించి, వారి అవసరాలకు తగినట్లుగా లాయల్టీ ప్రోగ్రామ్లు రూపొందించడం వల్ల రిపీట్ సేల్స్ పెరుగుతాయి. తాజా సర్వేల ప్రకారం, కస్టమర్ రిటెన్షన్ రేటు(అధిక మార్జిన్లు వచ్చే వస్తువులను కొనేలా చేయడం) 5% పెరిగితే, ప్రాఫిట్ మార్జిన్లు 25% నుంచి 29% వరకు మెరుగుపడే అవకాశం ఉంది.ఖర్చుల నియంత్రణఖర్చు తగ్గించడం అంటే నాణ్యతను తగ్గించడం కాదు, వనరులను సమర్థవంతంగా వాడటం అని గుర్తుంచుకోవాలి. ఇంధన ధరలు, కార్మిక వ్యయాలు పెరిగిన తరుణంలో ఆటోమేషన్ ఒక వరంగా మారింది. క్లౌడ్ ఆధారిత టూల్స్, ఎనర్జీ-ఎఫిషియంట్ పరికరాలను వాడటం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చు. టెక్నాలజీ సాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ అవుట్పుట్ సాధించేలా ఆపరేషన్లను ఆప్టిమైజ్ చేయాలి. దీనివల్ల ఇన్ఫ్లేషన్, టారిఫ్ల ప్రభావం వ్యాపారంపై తక్కువగా ఉంటుంది.డిజిటల్ పరివర్తన‘ఏఐ వ్యాపారాలను భర్తీ చేయదు కానీ, ఏఐని వాడే వ్యాపారస్తులు దాన్ని వాడని వారిని వెనక్కి నెట్టేస్తారు’ అనేది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మౌలిక సదుపాయలపై 400 బిలియన్ డాలర్ల పెట్టుబడులు జరుగుతున్న తరుణంలో దీన్ని విస్మరించడం అసాధ్యం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్(వస్తు నిర్వహణ)లో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడటం ద్వారా స్టాక్ వృధాను అరికట్టవచ్చు. ఆటోమేటెడ్ ఇన్వాయిసింగ్(ఆటోమేటెడ్ బిల్లింగ్ విధానం) ద్వారా పేమెంట్స్ త్వరగా వచ్చేలా చూడవచ్చు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం ఏఐ బాట్లను వాడి 24/7 కస్టమర్ సపోర్ట్ అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి.మార్కెట్ ట్రెండ్స్మార్కెట్ మారుతున్న వేగానికి అనుగుణంగా వ్యాపార సరళి మారకపోతే ఎంతటి పెద్ద బిజినెస్ అయినా కుప్పకూలుతుంది. పర్యావరణ హితమైన పద్ధతులు పాటిస్తున్న బిజినెస్ల పట్ల కస్టమర్లు మక్కువ చూపుతున్నారు. ఇది బ్రాండ్ విలువను పెంచడమే కాకుండా దీర్ఘకాలంలో పన్ను రాయితీలకు కూడా దోహదపడుతుంది. డేటా అనలిటిక్స్ ద్వారా మార్కెట్ మూడ్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే బిజినెస్ మోడల్ను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.ఇదీ చదవండి: మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేది ప్రస్తుతం ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందుతున్న అంశం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే తక్కువ ధరకు ఈ కంపెనీల షేర్లు కొని, ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత అధిక లాభాలు సంపాదించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే, మెరిసేదంతా బంగారం కాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సెబీ సైతం అన్రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం అత్యవసరం.‘గ్రే మార్కెట్’ ఉచ్చులో పడకండి!అన్లిస్టెడ్ షేర్లు సాధారణంగా అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లభించవు. వీటిని ‘గ్రే మార్కెట్’ లేదా కొన్ని ప్రైవేట్ యాప్స్ ద్వారా విక్రయిస్తుంటారు. అయితే, వీటిలో ధరను పారదర్శకంగా నిర్ణయించరనే వాదనలున్నాయి. ఒక యాప్లో ఒక ధర ఉంటే, మరో చోట మరో ధర ఉండే అవకాశం ఉంది. సెబీ ఇప్పటికే ఇలాంటి అనధికారిక ప్లాట్ఫామ్ల పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే అన్లిస్టెడ్ కంపెనీల్లో ఎంత లాభం ఉందో అంతే రిస్క్ కూడా ఉందని గమనించాలి.అన్లిస్టెడ్ కంపెనీలు అంటే ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE)లో నమోదు కాని కంపెనీలను అన్లిస్టెడ్ కంపెనీలు అంటారు. ఇవి సాధారణంగా స్టార్టప్లు కావచ్చు లేదా పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న పెద్ద కంపెనీలు కావచ్చు. వీటి షేర్లను ‘ప్రీ-ఐపీఓ (Pre-IPO) షేర్లు’ అని కూడా అంటారు.ఎలా పెట్టుబడి పెడుతారంటే..అన్లిస్టెడ్ మార్కెట్లో షేర్లు కొనడానికి నేరుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉండవు. దీనికోసం కొన్ని మార్గాలను అనుసరిస్తారు. ప్రస్తుతం అన్లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ కోసం Precise, UnlistedZone, Altius Investech.. వంటి చాలా డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది స్టాక్ బ్రోకర్లు పర్సనలైజ్డ్ సర్వీసుల ద్వారా అన్లిస్టెడ్ షేర్లను విక్రయిస్తుంటారు. ఇంకో మార్గం ఏమిటంటే.. కంపెనీ ఉద్యోగులు తమకు వచ్చిన షేర్లను బయటి వ్యక్తులకు విక్రయించినప్పుడు వాటిని కొనుగోలు చేయవచ్చు.ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలులిస్టెడ్ షేర్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. కానీ అన్లిస్టెడ్ షేర్లకు కొనుగోలుదారులు దొరకడం కష్టం. మీరు అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు అవి అమ్ముడుపోకపోవచ్చు.లిస్టెడ్ కంపెనీల వలె ఇవి ప్రతి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కాబట్టి కంపెనీ ఫైనాన్షియల్ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత, అంతకుముందు కొన్న అన్లిస్టెడ్ షేర్లపై 6 నెలల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే లిస్ట్ అయిన వెంటనే మీరు వాటిని అమ్మలేరు.ఈ షేర్ల ధర డిమాండ్, సప్లై ఆధారంగా మారుతుంటుంది. అధికారిక ధర అంటూ ఏదీ ఉండదు కాబట్టి ఇతర ప్లాట్ఫామ్లతో ధరను సరిపోల్చుకోవాలి.లిస్టింగ్ అయ్యే విధానంఅన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అవ్వాలంటే సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాలి. కంపెనీ ముందుగా ఐపీఓ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించుకుంటుంది. కంపెనీ తన పూర్తి వివరాలతో కూడిన డీఆర్హెచ్పీను సెబీకి సమర్పిస్తుంది. సెబీ ఈ నివేదికను పరిశీలించి అన్నీ బాగున్నాయని భావిస్తే అనుమతి ఇస్తుంది. కంపెనీ తన షేర్ ధరను నిర్ణయించి పబ్లిక్ ఇష్యూ తేదీలను ప్రకటిస్తుంది. ఐపీఓ సక్సెస్ అయ్యాక షేర్లు ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్కు అందుబాటులోకి వస్తాయి. దాంతో అన్లిస్టెడ్గా ఉన్న షేర్లు లిస్టెడ్ కేటగిరీలోకి మారతాయి.ఇదీ చదవండి: ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం
ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం
భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఒకవైపు కృత్రిమ మేధ(ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంటే, మరోవైపు అదే వేగంతో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’(Layoffs.fyi) తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 551 టెక్ కంపెనీల నుంచి 1,22,549 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత కొన్ని వారాలుగా ఈ వేగం కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తున్నా, ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది.ప్రముఖ కంపెనీలు ఇలా..అమెజాన్.. అక్టోబర్లో కంపెనీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఉద్యోగాల కోత విధిస్తూ 14,000 కొలువులను తొలగించింది.మైక్రోసాఫ్ట్.. 2025 నాటికి మొత్తం 15,000 మందిని తొలగించే దిశగా అడుగులు వేసింది. జులైలోనే దాదాపు 9,000 మందిని పంపించివేసింది.ఇంటెల్.. చిప్ తయారీలో వెనుకబడటం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో ఏకంగా మొత్తం సిబ్బందిలో 15% (సుమారు 25,000 మంది) తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.సేల్స్ ఫోర్స్.. ఏఐ సహాయంతో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తగ్గించినట్లు సీఈఓ మార్క్ బెనియోఫ్ ధ్రువీకరించారు.టీసీఎస్.. భారత్లో దాదాపు 12,000 మందిని (మొత్తం ఉద్యోగుల్లో 2%) తొలగించి ఐటీ రంగంలో ఆందోళన కలిగించింది. అయితే ఇది ఏఐ వల్ల కాదని, నైపుణ్యాల అసమతుల్యత వల్లేనని సంస్థ స్పష్టం చేసింది.మెటా (600 మంది), గూగుల్ (100+), వెరిజోన్ (13,000), హెచ్పీ (4,000-6,000 మంది) వంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ఇచ్చాయి.లేఆఫ్స్కు దారితీసిన కారణాలుచాలా కంపెనీలు ఇప్పుడు ‘ఏఐ ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గతంలో వందలాది మంది చేసే పనులను (డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బేసిక్ కోడింగ్..) ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ ఖర్చుతో వేగంగా చేస్తున్నాయి. కంపెనీలు తమ బడ్జెట్ను మానవ వనరుల నుంచి ఏఐ మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి.ద్రవ్యోల్బణం పెరగడం, సుంకాల భారం పెరగడంతో కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడంపై యాజమాన్యాలు దృష్టి పెట్టాయి.కరోనా సమయంలో డిజిటల్ సేవల కోసం డిమాండ్ పెరగడంతో టెక్ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు డిమాండ్ సాధారణ స్థితికి రావడంతో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగిస్తున్నాయి.పాత ప్రాజెక్టులను మూసివేసి కేవలం క్లౌడ్, సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ వంటి భవిష్యత్తు అవసరాల మీదనే కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల పాత నైపుణ్యాలు కలిగిన వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు.టెక్ రంగం ప్రస్తుతం ఒక పరివర్తన దశలో ఉంది. ఉద్యోగాల కోత ఆందోళన కలిగించే విషయమే అయినా ఏఐ రంగంలో కొత్త రకమైన ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సిబ్బంది తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కార్పొరేట్
మీరు బిజినెస్లో కింగ్ అవ్వాలంటే..
‘సినిమా టికెట్ ధరలు భారం కావు’ సగటు ధర ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో ఈ రోజుల్లోనే..
ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ
రతన్ టాటా అప్పుడా పని చేసుంటే..
‘ప్రైవేట్ అప్పు’ ప్రమాదకరం: సెబీ మాజీ చీఫ్
బొగ్గు బ్లాక్ల వేలంలో టాప్.. యాక్సిస్ ఎనర్జీ, రిలయన్స్
నగరాల్లో రిటైల్ స్పేస్కు డిమాండ్
జెప్టో రూ.11వేల కోట్ల ఐపీఓ.. సెబీకి పత్రాలు
క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో ప్రతిపాదిత పబ్లిక్...
బంగారం ధరలు.. ఒక్క రోజూ తగ్గలేదు!
దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం చుక్కలు చూపించాయ...
ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!
2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ ర...
బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్
బంగారం, వెండి ధరలు నువ్వా నేనా అని పోటీపడుతున్న సమ...
పదేళ్లలో భారీగా పుంజుకున్న ఆవిష్కరణల సూచీ
గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశం ప్రపంచ ఆవిష్కరణల సూచ...
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఒక...
రూ.10 నోట్లకు గుడ్బై..!
సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న...
చెక్ పవర్ తగ్గిందా?
రెండు దశాబ్దాల క్రితం.. బ్యాంకుకి వెళితే పెద్ద క్య...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్గా స్క్రీనింగ్కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్డెస్క్
మెయిల్ ఐడీ నచ్చలేదా? మార్చుకుందురులే..!
మనలో చాలా మందికి ఈమెయిల్ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్ ఆటోమెటిక్గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్ అడ్రెస్గా సెట్ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.ఇప్పుడా అవకాశాన్ని గూగల్ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్ డాక్యుమెంటేషన్ను ఇటీవల అప్డేట్ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.ప్రసిద్ద ఫోర్బ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్ అడ్రస్ కూడా అలియాస్గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్లు, ఇమెయిల్లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్కు థర్డ్ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్ అడ్రెస్ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ అందిస్తున్న కొత్త ఫీచర్ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు.
భారత్లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే
న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధతో (ఏఐ) భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు తక్కువేనని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో వైట్ కాలర్ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫీసు ఉద్యోగాలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఆధారిత విభాగాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగులను పూర్తిగా తప్పించేసి, వారి స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి తలెత్తడం కన్నా, సిబ్బంది ఉత్పాదకత పెంపునకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు. ఏఐ కొన్ని సందర్భాల్లో డేటాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, తప్పుగా ఇస్తున్న వివరాలను సరిచేసేందుకు ఇప్పటికీ మానవ ప్రమేయం అవసరం ఉంటోందని ఆయన చెప్పారు. ఏఐతో నిర్దిష్ట రంగాలు, అవసరాలకు తగ్గ సొల్యూషన్స్ని రూపొందించేందుకు అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులు కావాల్సి ఉంటుందని కృష్ణన్ చెప్పారు. ఇలాంటి ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలను భారత్ అందిపుచ్చుకోవచ్చని వివరించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృత్రిమ మేధని ఉపయోగించుకోవడంతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూర్చగలిగే పటిష్టమైన స్థితిలో భారత్ ఉందని చెప్పారు.
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్లో మెటా Llama 4 మోడల్స్ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్లో ఏఐ మోడ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్లేట్లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా?
పర్సనల్ ఫైనాన్స్
2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!
2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.కృత్రిమ మేధభారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.ఈవీ చార్జింగ్ సదుపాయాలుఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.ఆఫీస్ వర్క్స్పేస్భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.లగ్జరీ, ప్రీమియం వస్తువులుపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్య కలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు అన్నింటికీ ఇదే ‘ఆధారం’. ఇంత కీలకమైన ఆధార్కు సంబంధించిన పలు ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2026లో నూతన నిబంధనలు అమలు కాబోతున్నాయి.ఆధార్ కార్డు కొత్త డిజైన్ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచే ఆధార్ కొత్త డిజైన్ను ప్రకటించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నంబర్ ఉండవు. మొత్తం కార్డుల డిజైన్ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయనుంది యూఐడీఏఐ.ఫోటోకాపీల వాడకంపై ఆంక్షలుకొత్త యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను (జిరాక్స్) ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆఫ్లైన్ ఆధార్ ఎక్స్ఎంఎల్, మాస్క్డ్ ఆధార్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధ్రువీకరణను ప్రాథమిక ఎంపికగా చేస్తున్నారు. ఫేస్ అథెంటికేషన్ను చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు.ఆధార్-పాన్ లింక్ గడువుఆధార్-పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ తేదీ నాటికి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే, అది 2026 జనవరి 1 నుండి ఇనాక్టివ్గా మారుతుంది. దీంతో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు కష్టమవుతాయి.10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డుల అప్డేట్ తప్పనిసరిమీడియా నివేదికల ప్రకారం.. 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ చేయించకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ధ్రువీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
పర్సనల్ లోన్ తీసుకుని ఏంచేశారు వీళ్లు..?
ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో పర్సనల్ లోన్స్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో పర్సనల్ లోన్స్ తీసుకున్న యువతరంలో 27 శాతం రుణాలు ‘ట్రావెల్’ కోసం తీసుకోబడ్డాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే మొదటిసారి.‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కనిపించిన భారీ మార్పు ఇది. యువతరం పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం...వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఇల్లు కొనడం...మొదలైనవి కాదు. ఒకే ఒక కారణం... ప్రయాణం’ అని చెప్పారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజ.ఈ మార్పుకు కారణం ఏమిటి?‘ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంత ఇల్లు అనే కల యువతరంలో చాలామందికి కలగానే మిగిలిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తక్షణం సంతృప్తిని ఇచ్చే విషయాలకు యువతరం ప్రాధాన్యత ఇస్తోంది. ట్రావెల్, లగ్జరీ వస్తువులు కొనుగోలు... మొదలైనవి అందులో ఉన్నాయి’ ఫిన్టెక్ ఇన్నోవేషన్తో అప్పుల కోసం పడే ఇబ్బందులు యువతరానికి తగ్గాయి. జీరో–కాస్ట్ ఇఎంఐలు, బై నౌ పే ల్యాటర్ (బిఎన్పీఎల్) స్కీమ్లు యువతరానికి స్పీడ్గా చేరువవుతున్నాయి.వాళ్ళు అలా... మనం ఇలా...చైనా యువతరం విషయానికి వస్తే...కోవిడ్ తరువాత ‘రివెంజ్ స్పెండింగ్’ నుంచి ‘రివెంజ్ సేవింగ్’కు మళ్లింది. ఎంతో కొంత అయినా సరే బంగారం మదుపు చేయడంపై మోజు పెరిగింది. బంగారాన్ని మదుపు చేయడం అనేది సరికొత్త స్టేటస్ సింబల్గా మారింది. ‘రేపు నేను సంపాదిస్తాను కాబట్టి ఈరోజు అప్పు చేయాలని మన యువతరం ఆలోచిస్తుంది. రేపు నా ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే ΄పొదుపు చేస్తాను అని చైనీస్ యువతరం అనుకుంటుంది’ అంటున్నారు అహుజ.ఇదీ చదవండి: బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
బ్రాంచ్ లేని బ్యాంక్ అకౌంట్లు..
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్లెస్, బ్రాంచ్లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.


