ప్రధాన వార్తలు
నైట్క్లబ్లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు
గోవా నైట్క్లబ్లో ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్తో నైట్లైఫ్ ఇండస్ట్రీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, దాని ఆర్థిక వ్యవస్థలోని అంశాలు చర్చకు వస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే లైట్లు, డీజే సంగీతం ఉండే నైట్క్లబ్ల్లో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. భారతదేశంలో కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి నగరాలు ఈ రాత్రిపూట వినోద రంగంలో ఏటా సుమారు 10% వృద్ధిని నమోదు చేస్తున్నాయి.నైట్క్లబ్ వ్యాపార నమూనానైట్క్లబ్లు ప్రధానంగా అధిక మార్జిన్ కలిగిన ఉత్పత్తులు, సర్వీసులను విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జిస్తాయి. నైట్క్లబ్ ఆదాయంలో అత్యంత కీలకమైన భాగం ఆల్కహాల్, ఇతర పానీయాల విక్రయం. పానీయాలపై లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ టేబుల్స్ లేదా ప్రత్యేక విభాగాల్లో ‘బాటిల్ సర్వీస్’ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇందులో కస్టమర్లు అధిక ధరలకు ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తారు. దీనికి ప్రత్యేక సర్వీస్ అందిస్తుండడంతో నైట్క్లబ్లు ఆదాయం సంపాదిస్తాయి.ప్రవేశ రుసుము, కవర్ ఛార్జీలువారాంతాల్లో లేదా ప్రత్యేక ఈవెంట్ల సమయంలో కస్టమర్ల సంఖ్యను నియంత్రించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ రుసుము లేదా కవర్ ఛార్జ్ (దీనిలో కొంత మొత్తం పానీయాలకు లెక్కిస్తారు) వసూలు చేస్తారు.ప్రత్యేక ఈవెంట్లు, స్పాన్సర్షిప్లుప్రముఖ జాతీయ/ అంతర్జాతీయ డీజేలు, కళాకారులతో ఈవెంట్లను నిర్వహించడం ద్వారా టికెట్ ధరలను పెంచుతుంటారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.కార్పొరేట్ ఈవెంట్లుప్రైవేట్ పార్టీలు, కార్పొరేట్ ఫంక్షన్లు, ప్రొడక్ట్ లాంచ్ల కోసం క్లబ్ను అద్దెకు ఇస్తుంటారు.బ్రాండ్ స్పాన్సర్షిప్లుమద్యం, సాఫ్ట్డ్రింక్స్ లేదా ఇతర లైఫ్స్టైల్ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.నిర్వహణ, సవాళ్లునైట్క్లబ్ను విజయవంతంగా నడపడం కేవలం సంగీతం, డ్రింక్స్కు సంబంధించినది మాత్రమే కాదు. ఇది సంక్లిష్టమైన నిర్వహణ సవాళ్లతో కూడుకుంది. మద్యం లైసెన్స్, అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ, మ్యూజిక్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి అనేక రకాల అనుమతులను పొందాలి. వాటిని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. గోవాలో జరిగిన సంఘటన వంటి వాటి నేపథ్యంలో నైట్క్లబ్ల భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వాల నుంచి పర్యవేక్షణ, నియంత్రణ మరింత కఠినతరం కావాల్సి ఉంది.భద్రతా వాతావరణంనాణ్యమైన ధ్వని, లైటింగ్ సిస్టమ్, విభిన్న వాతావరణం (Ambiance), ప్రముఖ డీజేల ఎంపిక క్లబ్ పేరును, ప్రజాదరణను పెంచుతాయి. తాగుబోతుల నియంత్రణ, గొడవలు, ముఖ్యంగా మహిళా కస్టమర్ల భద్రత కోసం బలమైన భద్రతా సిబ్బంది అవసరం.ఖర్చుల నిర్వహణక్లబ్ల ఏర్పాటు కోసం స్థలం అద్దె, విద్యుత్, నీరు, బీమా వంటి స్థిర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. క్లబ్లో స్టాక్ను నిర్వహించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, పానీయాల నాణ్యతను కాపాడటం లాభాలకు కీలకం. డీజేలు, బార్ అటెండర్లు, వెయిటర్లు, భద్రతా సిబ్బందికి అయ్యే వేతనాలుంటాయి.భద్రతా ప్రమాణాల ఉల్లంఘనల పర్యవసానంక్లబ్ల్లో కిటికీలు లేని చీకటి ప్రదేశాలు, ఇరుకైన మెట్లు, మూసివేసిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం లేదా ఉన్నా పని చేయకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను పెంచుతాయి. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన క్లబ్ యజమానులు, నిర్వాహకులు భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులను ఎదుర్కోవలసి వస్తుంది. భద్రతా వైఫల్యాలు క్లబ్ బ్రాండ్కు, నైట్లైఫ్ పరిశ్రమ ప్రతిష్టకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఇప్పుడేం చేయాలంటే..భారతదేశంలో నైట్క్లబ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. అయితే, ఇది నిలకడగా, సురక్షితంగా మనుగడ సాగించాలంటే కేవలం లాభాలపైనే కాకుండా.. భద్రతా ప్రమాణాలపై, చట్టపరమైన నిబంధనల అమలుపై నిర్వాహకులు, ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలి. గోవా సంఘటన లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వ్యాపార లాభాలతో పాటు కస్టమర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తక్షణ అవసరం.ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం
పైలట్లకు ఎంత డిమాండో.. మరి జీతాలు?
విమాన పైలట్ అన్నది అత్యుత్తమ కెరియర్లలో ఒకటి. పైలట్ అవ్వాలని చాలా మంది చిన్నప్పటి నుంచే కల కంటుంటారు. తాజాగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో (Indigo Crisis) పైలట్లకు, విమాన సిబ్బందికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం.. ఈ క్రమంలో వారికి జీత భత్యాలు ఎలా ఉంటాయన్న ఉత్సుకత చాలామందిలో ఉంటుంది.. ఇక్కడ తెలుసుకుందామా..భారతదేశ విమానయాన రంగం ఆకాశాన్నే తాకుతున్నట్టుగా వృద్ధి చెందుతోంది. టూరిజం బూమ్, ఇతర కారణాలతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఎయిర్లైన్స్ ఎప్పటికప్పుడు కొత్త విమానాలు ఆర్డర్ చేస్తున్నాయి. దీంతో పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి అసాధారణ డిమాండ్ ఏర్పడింది.దేశంలో ప్రస్తుతం సుమారు 20 వేల మంది పైలట్లు, దాదాపు 35 వేల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు. మరో 10 సంవత్సరాల్లో 30,000 మంది పైలట్లు, 6.78 లక్షల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది అవసరమవుతారని అంతర్జాతీయ అవియేషన్ అంచనాలు సూచిస్తున్నాయి.22,400 మంది అవసరంవిమానయాన శాఖ డేటా ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విమానయాన మార్కెట్గా మారింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ వంటి పెద్ద ఎయిర్లైన్లు రోజువారీ 2,000కి పైగా ఫ్లైట్లు నడుపుతున్నాయి. "2026 నాటికి 7,000 మంది కొత్త పైలట్లు, 2028 నాటికి మొత్తం 22,400 మంది అవసరం" అని ఇండియన్ ఎయిర్లైన్స్ అసోసియేషన్ (IAA) ఓ నివేదికలో పేర్కొంది.ఆకర్షణీయ జీత భత్యాలుపైలట్ల జీతభత్యాలు ఎయిర్లైన్ ప్రాతిపదికన, అనుభవం, విమాన రకం (A320, A321, ATR) వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.ట్రైనీ పైలట్లు మొదటి సంవత్సరంలోనే నెలకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు జీతం పొందుతారు.ఫస్ట్ ఆఫీసర్ (కో-పైలట్) పదవిలో ₹1.5 లక్షలు నుంచి ₹3 లక్షల వరకు, కెప్టెన్లకు ₹3 లక్షలు నుంచి ₹15 లక్షల వరకు (కొందరు ₹25 లక్షల వరకు) ఆదాయం ఉంటుంది.సీనియర్ పైలట్లు రూ.12 లక్షల వరకు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.జీతాలతో పాటు ఫ్లయింగ్ అలవెన్స్, నైట్ అలవెన్స్, స్టే అలవెన్స్, ఇన్స్యూరెన్స్, హోటల్ & ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.ఇక క్యాబిన్ క్రూ సిబ్బంది విషయానికి వస్తే ఫ్రెషర్లకు జీతం రూ.25,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ రూ.1 లక్షకుపైగా చేరుకుంటుంది.ఎయిర్ ఇండియాలో ఫ్రెషర్లు రూ.59,000 నుంచి రూ.61,000 వరకు పొందుతున్నారు. సీనియర్లు రూ.1.5 లక్షలు నుంచి రూ.2.5 లక్షల వరకు అందుకుంటున్నారు.ఈ జీతాలతో పాటు, ఉచిత ఫ్లైట్ టికెట్లు, హౌసింగ్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటి భత్యాలు ఉన్నాయి.
దక్షిణాది మార్కెట్పై జియోహాట్స్టార్ మెగా ప్లాన్
దక్షిణాది మీడియా, వినోద పరిశ్రమలో జియోహాట్స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. మాతృ సంస్థ జియోస్టార్ (JioStar) రాబోయే ఐదేళ్లలో రూ.4,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి దక్షిణాది క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చెన్నైలో ఇటీవల జరిగిన ‘సౌత్ అన్బౌండ్ (South Unbound)’ అనే ఈవెంట్లో వివిధ 25 కొత్త ప్రసార ప్రకటనలను ఆవిష్కరించారు.భారీ పెట్టుబడి లక్ష్యం ఏమిటి?జియోహాట్స్టార్కు దక్షిణాది ప్రాంతం ఒక కీలక వృద్ధి కేంద్రంగా మారిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల వినియోగదారులతో పోలిస్తే దక్షిణాది వీక్షకులు తమ ప్లాట్ఫామ్పై 70% ఎక్కువ సమయం గడుపుతున్నారని, 50% ఎక్కువ కంటెంట్ విభాగాలను చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్ను మరింత బలోపేతం చేయడానికి దక్షిణాది ప్రేక్షకులకు మరింత వైవిధ్యభరితమైన, నాణ్యత కలిగిన కంటెంట్ను అందించాలనే లక్ష్యంతో రూ.4,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలిపారు.ఈ నిధులను రచయితలు, దర్శకులు, నూతన డిజిటల్ కథా రచయితల అభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లు, రైటింగ్ ల్యాబ్ల కోసం ఉపయోగించనున్నారు. కంటెంట్ నిర్మాణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక నిర్మాణ సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిధులు ఎంతో తోడ్పడుతాయని కంపెనీ చెప్పింది. దీని ద్వారా 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 15,000 పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.ఐపీఎల్ హక్కుల నష్టాన్ని భర్తీ చేస్తుందా?జియోహాట్స్టార్ ఐపీఎల్ మీడియా హక్కులను కోల్పోవడం, ఆ తర్వాత దక్షిణాదిలో ఈ భారీ పెట్టుబడి ప్రకటనకు మధ్య ఉన్న సంబంధంపై మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జియోహాట్స్టార్ దక్షిణాది ప్రేక్షకులకు ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఉద్దేశించిన కంటెంట్ను అందించాలని నిర్ణయించింది. ఐపీఎల్ అనేది క్రీడా విభాగానికి చెందింది. దక్షిణాదిలో ఓటీటీ వీక్షణలు తగ్గి, నిలుపుదల రేటు (Retention Rate) ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున జియోహాట్స్టార్ ఈ పెట్టుబడిని కేవలం ఐపీఎల్ లోటును భర్తీ చేయడానికి కాకుండా ప్రాంతీయ మార్కెట్లో ప్రజలకు వినోదాన్ని పంచుతూ తాను ఆర్థికంగా వృద్ధి చెందే అంశంగా చూడాలని కొందరు చెబుతున్నారు. ప్రాంతీయ కంటెంట్ సృష్టికర్తలు, స్థానిక కథనాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ప్లాట్ఫామ్ సబ్స్క్రైబర్ల సంఖ్య పెంచుకోవాలని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం
ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం
ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 2 నుంచి 5000 విమాన సర్వీసులు వరకు రద్దయ్యాయని తెలుస్తుంది. ఇటీవల ఇండిగో సీఈఓ పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరించినట్లు చెప్పారు. కానీ విమానాల రద్దు, సర్వీసుల్లో అంతరాయం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు బెంగళూరులో 60 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో చెప్పింది. దాంతోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని తాజా పరిణామాలు కింద చూద్దాం.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం మొత్తం 18 ఇండిగో విమానాలను రద్దు చేశారు. వీటిలో తొమ్మిది రావాల్సినవి, మరో తొమ్మిది బయలుదేరాల్సిన సర్వీసులు ఉన్నాయి.మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు సకాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం ఉదయం 60 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. రావాల్సినవి-32, బయలుదేరాల్సినవి-28.ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈ రోజు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు హాజరుకానున్నారు. ఇటీవలి కార్యాచరణ అంతరాయాలపై డేటా, అప్డేట్లతో సహా సమగ్ర నివేదికను సమర్పించడానికి డీజీసీఏ ఆయనను పిలిచింది.ఇటీవల విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఒక వీడియో సందేశంలో ప్రయాణికులకు క్షమాపణలు కోరారు. వేలాది మంది ప్రయాణికులు ఈ సంఘటన వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు.Message from Vikram Singh Mehta, Chairman and Non-Executive Independent Director of IndiGo pic.twitter.com/sySacxlFq0— IndiGo (@IndiGo6E) December 10, 2025ఇండిగో నిన్న 220 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.సామూహిక విమానాల రద్దు కారణంగా మూడో త్రైమాసికంలో దేశీయ వింటర్ షెడ్యూల్లో 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: సవాళ్లపై భారత్ నజర్ వేయాల్సిందే!
పసిడి ఊరట.. వెండి మంట!
దేశంలో వెండి ధరల మంటలు కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు మాత్రం ఊరటనిచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం అలాగే వరుసగా నాలుగో రోజూ ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు తగ్గి 25,736కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 పాయింట్లు నష్టపోయి 84,332 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-12-2025(time: 9:20 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్పొరేట్
పైలట్లకు ఎంత డిమాండో.. మరి జీతాలు?
దక్షిణాది మార్కెట్పై జియోహాట్స్టార్ మెగా ప్లాన్
ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం
5 కంపెనీలు లిస్టింగ్కు రెడీ
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
భారతదేశంలో ‘ఫినో’ టెకిలా ఆవిష్కరణ
65,000 మంది ఉద్యోగుల సహకారం!
భారత్ ఏఐ భవిష్యత్తుకు 360 డిగ్రీల భాగస్వామ్యం
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
Stock Market Updates: తీవ్ర నష్టాల్లో మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
పసిడి రుణాలకు భలే గిరాకీ: 2026 మార్చి నాటికి..
ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం ...
తారుమారైన బంగారం, వెండి ధరలు..
దేశంలో బంగారం, వెండి ధరలు తారుమారయ్యాయి. మళ్లీ పెర...
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్
అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్ ...
ఇదో అవకాశంగా చూడాలి.. ఆర్బీఐ గవర్నర్
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప...
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీల...
రష్యాకి మరిన్ని ఎగుమతులపై దృష్టి
వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతు...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్లను శాటిలైట్ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్ఫాంమ్లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?
చాట్జీపీటీలో ప్రకటనలు..?
ఓపెన్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దాంతో ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.ఇటీవలి వారాల్లో చాట్జీపీటీ సంభాషణల్లో యాడ్ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్లు నిజమైనవి కావు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్🚨 OpenAI has denied the rumors of testing advertisements inside its popular AI chatbot, ChatGPT. pic.twitter.com/vbs3vH8krz— Indian Tech & Infra (@IndianTechGuide) December 7, 2025
భారత్లో స్టార్లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్వేర్ కిట్లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
'టెంపుల్' వస్తోంది: దీపిందర్ గోయల్ ట్వీట్
జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఏమిటీ టెంపుల్?టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.నవంబర్ 15న చేసిన పోస్ట్లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.Coming soon. Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025
పర్సనల్ ఫైనాన్స్
పసిడి ధర మరింత పెరుగుతుందా?
బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా? – శ్రావణి అద్దంకిబంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్ క్లాస్కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు. నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – దీపక్పెట్టుబడిలో తక్కువ రిస్క్ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
సంక్షోభం అంచున ప్రపంచం.. ముందే చెబుతున్నా మీ ఇష్టం
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుడు, ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే హెచ్చరిక చేశారు. 2026 నుంచి అతిపెద్ద మాంద్యం ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచే ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్లో పేర్కొన్నారు.ఉద్యోగ నష్టాలు.. ముందస్తు సంకేతాలుప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకుంటున్న ఉద్యోగ నష్టాలను రాబోయే మహా మాంద్యానికి ముందస్తు సంకేతాలుగా కియోసాకి పేర్కొన్నారు. ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ నివేదికను ఉటంకిస్తూ, నవంబర్లో అమెరికాలో దాదాపు 32,000 ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలతో పాటు, చిన్న వ్యాపారాలు 1,20,000 మంది ఉద్యోగులను తొలగించడం మరింత కలవరానికి గురిచేసిందని అన్నారు.‘2026లో భారీగా ఉద్యోగ తొలగింపులు మొదలవుతాయి. మీ ఉద్యోగం ప్రమాదంలో ఉంటే ఇప్పుడే నా పాఠం #4ని గుర్తుచేసుకోండి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి’ అని కియోసాకి ఉద్యోగులకు హితవు పలికారు.డబ్బు సంపాదించే మార్గాలుమాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. మాంద్యం సమయంలో అమ్మకం నైపుణ్యం అనేది జీవనాధారమవుతుందని, దురదృష్టవశాత్తూ చాలా మంది ఉద్యోగులకు ఈ నైపుణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.రియల్ ఎస్టేట్ క్రాష్2026లో ముఖ్యంగా రెసిడెన్షియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య) రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా క్రాష్ అవుతుందని కియోసాకి హెచ్చరించారు. ‘బేరసారాలు ఉండవు. లైఫ్టైమ్ ఒప్పందాలు మీ కోసం ఎదురుచూస్తాయి. పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండండి’ అని మాంద్యం సమయంలోనే అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉంటాయని ఆయన సూచించారు.కళాశాల డిగ్రీ కంటే నైపుణ్యాలు ఉత్తమంఉపయోగంలేని డిగ్రీల కోసం మళ్లీ కళాశాలకు వెళ్లి రుణాలు తీసుకోవద్దని, దానికి బదులుగా నర్సింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వృద్ధుల సంరక్షణ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నారు. ‘ప్రపంచానికి ఎప్పుడూ ఈ నైపుణ్యాలు కావాలి’ అని అన్నారు.Lesson #4: How to get richer when the economy crashes:ADP just announced 32,000 jobs were lost in November. Those job losses are from big businesses.The frightening news is small businesses laid off 120,000 workers.The bigger lay offs will begin in 2026 when the world…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 4, 2025బంగారం, వెండి, క్రిప్టో.. ఇవే భవిష్యత్తుప్రస్తుతం చెలామణిలో ఉన్న డాలర్ను కియోసాకి మళ్లీ నకిలీ డబ్బుగా అభివర్ణించారు. సంక్షోభ సమయంలో డబ్బును కాపాడుకోవడానికి నిజమైన ఆస్తుల్లో పొదుపు చేయాలని ఆయన సూచించారు. బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథేరియం వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఔన్సుకు 57 డాలర్లుగా ఉన్న వెండి ధర, జనవరి 2026 నాటికి 96 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇదీ చదవండి: విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం
ఉచితంగా క్రెడిట్ స్కోరు.. యస్ బ్యాంక్ మైక్రోసైట్
ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా ’స్కోర్క్యాహువా.బ్యాంక్.ఇన్’ పేరిట మైక్రోసైట్ని ప్రవేశపెట్టింది. క్రెడిట్ స్కోర్ను ఉచితంగా చెక్ చేసుకునేందుకు, రుణాల సంబంధ అంశాలు, క్రెడిట్ ప్రొఫైల్ ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.క్రెడిట్ స్కోర్పై అవగాహన పెంచేందుకు, రుణాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేసేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద దీన్ని రూపొందించినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.ఇందులో ఆర్థిక అంశాల సంబంధిత బ్లాగ్లు, వీడియోలు క్రెడిట్ స్కోరుపై అపోహలు తొలగించే సమాచారం మొదలైనవి ఉంటాయి. ఈ సందర్భంగా నాలుగు టీవీ ప్రకటనలను కూడా బ్యాంకు ఆవిష్కరించింది.
ఇది నేర్చుకుంటేనే బయటపడతారు: కియోసాకి
ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న రాబర్ట్ కియోసాకి.. దాన్నుంచి బయటపడి ధనవంతులు కావాలంటే ఏం చేయాలో 10 సూచనలు ఇస్తానన్నారు. వాటిలో మూడోది ఇప్పుడు వెల్లడించారు. ఈ మేరకు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.కృత్రిమ మేధస్సు త్వరలో మిలియన్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఇటీవలి ట్వీట్లలో వాదించారు. ఇందులో సాంప్రదాయకంగా స్థిరంగా పరిగణించబడే లేదా చట్టం, వైద్యం, వినోదం వంటి విస్తృతమైన విద్య అవసరమయ్యే వృత్తులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ మార్పు చాలా మందిని స్వయం ఉపాధి, ప్రత్యామ్నాయ ఆదాయ నమూనాల వైపు నెట్టివేస్తుంది.అల్లకల్లోలమైన ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడానికి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) అని కూడా పిలువబడే నెట్ వర్క్ మార్కెటింగ్ ఒక మార్గంగా నిలుస్తుందని కియోసాకి వర్ణిస్తున్నారు. అటువంటి వ్యాపారాలు అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.LESSON # 3: How to get richer as global economy crashes.Join a network marketing business.Reasons why a network marketing business will make you richer.AI (Artificial Intelligence) will wipe out millions of jobs even jobs that required lots of schooling like lawyers,…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 3, 2025


