Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cabinet Clears Package for Vodafone Idea Freezes AGR Dues at Rs 87695 Crore1
కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!

రుణభారంతో సతమతమవుతున్న 'వొడాఫోన్ ఐడియా'కు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలు రూ. 87,695 కోట్లను ఫ్రీజ్ చేసింది. అంతే కాకుండా.. 2032 ఆర్థిక సంవత్సరం నుంచి 2041 ఆర్థిక సంవత్సరం వరకు.. 10 సంవత్సరాల కాలంలో వారి తిరిగి చెల్లించేలా వెసులుబాటు కల్పించింది.ఏజీఆర్ సంబంధిత అంశాలు.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ మద్దతు కోసం వేచిచూస్తున్న వొడాఫోన్ ఐడియాకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించింది.వోడాఫోన్ ఐడియాలో.. ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి బకాయిల చెల్లింపును క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించడమే కాకుండా.. కంపెనీకి చెందిన 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది.

Passenger Forgets iPad On Train To Bhopal Recovers It Using RailMadad2
ఒక్క యాప్: రైల్లో పోయిన ఐప్యాడ్ దొరికిందిలా..

రైల్లో ప్రయాణించేటప్పుడు.. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ఇతరత్రా మరిచిపోయే అవకాశం ఉంది. వాటిని తిరిగి పొందటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి అదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.డిసెంబర్ 27న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో భోపాల్‌కు వెళుతున్నప్పుడు తన ఐప్యాడ్‌ను మర్చిపోయానని ఎక్స్ యూజర్ 'దియా' వెల్లడించారు. ట్రైన్ దిగిన ఒక గంట తరువాత మరిచిపోయిన విషయం గ్రహించి, చాలా బాధపడినట్లు ఆమె వెల్లడించారు. రైల్లో మరిచిపోయిన తన ఐప్యాడ్ తిరిగిపొండటానికి.. రైల్వే హెల్ప్‌లైన్ (#139)కు కాల్ చేసి, RailMadad యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన సిబ్బంది.. ట్రైన్ వివరాలు, కోచ్ నెంబర్ ఆధారంగా ఆమె ఐప్యాడ్ గుర్తించారు. ఆ తరువాత ఆమెకు కాల్ చేసి దానిని అప్పగించారు. ఈ విషయాన్ని దియా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐప్యాడ్ తిరిగి పొండటంతో దియా చాలా సంతోషించింది. సిబ్బందికి కృతజ్ఞత చెబుతూ.. మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకు ఎదురైన సంఘటనల గురించి కూడా వెల్లడించారు.LORE UPDATE: I forgot my IPAD on a train to bhopal (Dakshin Express, 28.12.25)Realised an hour later,between all the chaos (and lots of crying 😭) we called #139 and registered a report on #RailMadad app. Amazingly, within minutes we got a call from the helpline, a quick…— Diya (@diyaatwt) December 30, 2025

Stock Market Closing Update 31st January 20253
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 544.66 పాయింట్లు లేదా 0.64 శాతం లాభంతో 85,219.74 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 26,136.35 వద్ద నిలిచింది.కేఎస్ఆర్ ఫుట్‌వేర్ లిమిటెడ్, ఆస్పిన్‌వాల్ అండ్ కంపెనీ, కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్, కిరి ఇండస్ట్రీస్, ఓరియంట్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్, వోడాఫోన్ ఐడియా, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Premium Metal Credit Card by IDFC FIRST Bank4
‘గజ్’ క్రెడిట్‌ కార్డు గురించి తెలుసా?

ముంబై: సంపన్న కస్టమర్ల కోసం ప్రైవేట్‌ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తాజాగా గజ్ (Gaj) పేరిట ప్రీమియం మెటల్‌ కార్డును ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ కస్టమర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్డుపై జాయినింగ్, వార్షిక ఫీజు రూ. 12,500గా (జీఎస్‌టీ అదనం) ఉంటుంది.12,500 ఇన్విటేషన్ రివార్డు పాయింట్లతో ఇది లభిస్తుంది. 1 రివార్డు పాయింటు రూ. 1కి సమానంగా ఉంటుంది. వీటిని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ యాప్‌ ద్వారా ట్రావెల్‌ బుకింగ్స్‌పై వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు. వార్షికంగా రూ. 10 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.జీరో ఫారెక్స్‌ మార్కప్, గ్లోబల్‌ ఏటీఎంలలో వడ్డీరహితంగా నగదు లభ్యత, రూ. 50,000 వరకు విలువ చేసే ట్రిప్‌ క్యాన్సిలేషన్‌ కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ప్రీమియం మెటల్‌ క్రెడిట్‌ కార్డుల త్రయం ’అశ్వ–మయూర–గజ’లో భాగంగా ఇది ఉంటుందని బ్యాంకు పేర్కొంది.ఇదీ చదవండి: దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!

Chrome Enduring Legacy Beyond AI Competition5
గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం

ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్‌ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.భారత మార్కెట్‌లో క్రోమ్ ప్రభంజనంభారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్‌కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్‌ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.ఈ లెగసీకి కారణం..కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..జీమెయిల్, గూగుల్‌ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్‌లోకి ఎంబెడ్ చేసింది.సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్‌లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్‌వర్డ్‌లు, హిస్టరీ, బుక్‌మార్క్‌లను వదులుకుని కొత్త బ్రౌజర్‌కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్‌టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.ఏఐ ఏజెంట్ వైపు..ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్‌గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్‌కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్‌గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?

Warren Buffett retires from Berkshire Hathaway after six decades service6
గ్రెగ్ అబెల్‌ చేతికి బెర్క్‌షైర్ హాత్వే పగ్గాలు

ప్రపంచ పెట్టుబడి రంగంలో ఒక శకం ముగియబోతోంది. లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నుంచి బెర్క్‌షైర్ హాత్వే బాధ్యతలను గ్రెగ్ అబెల్ ఈ వారం చివరలో అధికారికంగా చేపట్టనున్నారు. 1962లో కేవలం ఒక చిన్న టెక్స్‌టైల్‌ మిల్లుగా ప్రారంభమైన బెర్క్‌షైర్‌ను నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు బఫెట్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో బఫెట్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అబెల్ ముందున్న అతిపెద్ద సవాలు.అసాధారణ ప్రస్థానం: బఫెట్ వారసత్వంగత ఆరు దశాబ్దాల్లో బఫెట్ బెర్క్‌షైర్‌ను ఒక సామ్రాజ్యంగా మార్చారు. గీకో (Geico), నేషనల్ ఇండెమ్నిటీ వంటి బీమా సంస్థలు, డెయిరీ క్వీన్, బీఎన్‌ఎస్‌ఎఫ్‌(BNSF) రైల్ రోడ్ వంటి దిగ్గజ కంపెనీలను కొనుగోలు చేశారు. యాపిల్, కోకాకోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థల్లో వారెన్‌ బఫెట్‌ చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు అపారమైన లాభాలను తెచ్చిపెట్టాయి. గత 20 ఏళ్లలో 60 బిలియన్‌ డాలర్లకు పైగా దానం చేసినప్పటికీ, బఫెట్ వ్యక్తిగత సంపద నేడు సుమారు 150 బిలియన్‌ డాలర్లుగా ఉంది.గ్రెగ్ అబెల్.. కొత్త నాయకత్వం2018 నుంచి బెర్క్‌షైర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న 62 ఏళ్ల గ్రెగ్ అబెల్, బఫెట్ కంటే భిన్నమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అబెల్ ఇటీవల నెట్ జెట్స్ సీఈఓ ఆడమ్ జాన్సన్‌ను కంపెనీ సర్వీస్, రిటైల్ విభాగాలకు హెడ్‌గా నియమిస్తూ సంస్థలో మూడో విభాగాన్ని సృష్టించారు. టాడ్ కాంబ్స్ (గీకో సీఈఓ) నిష్క్రమణ, సీఎఫ్ఓ మార్క్ హాంబర్గ్ పదవీ విరమణ నేపథ్యంలో అబెల్ కంపెనీలో కీలకంగా మారారు. సంస్థలో నాయకత్వ మార్పులు ఉన్నప్పటికీ బెర్క్‌షైర్ ప్రధాన సూత్రమైన ‘వికేంద్రీకరణ’ (Decentralization) మారదని విశ్లేషకులు భావిస్తున్నారు.ముందున్న సవాళ్లుబెర్క్‌షైర్ ప్రస్తుతం 382 బిలియన్‌ డాలర్ల భారీ నగదు నిల్వ కలిగి ఉంది. ఇంత భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశాలు దొరకకపోవడం అబెల్ ముందున్న ప్రధాన సమస్య అని కొందరు చెబుతున్నారు. ఒకవేళ కొత్త కొనుగోళ్లు చేయలేకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాటాదారులకు డివిడెండ్లు చెల్లించాలని లేదా స్టాక్ బైబ్యాక్ చేయాలని పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అయితే, బఫెట్ వద్ద ఉన్న 30 శాతం ఓటింగ్ పవర్ కారణంగా అబెల్‌కు ప్రస్తుతం ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చు. బఫెట్ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగుతూ, రోజూ కార్యాలయానికి వస్తూ సలహాలు ఇస్తానని ప్రకటించడం వాటాదారులకు ఊరటనిచ్చే అంశం.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?

Advertisement
Advertisement
Advertisement