Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

21st Edition of UXINDIA Conference set to take in Hyderabad1
హైదరాబాద్‌లో అంతర్జాతీయ యుఎక్స్ఇండియా సదస్సు

మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. 21వ అంతర్జాతీయ యూఎక్స్ఇండియా25 సదస్సు (UXINDIA 2025) ఈ నెల 18 నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరుగనుంది. ఈ సదస్సులో 1,400 మందికి పైగా ప్రతినిధులు, 80 మందికి పైగా నిపుణులు, 10 మంది ప్రధాన వక్తలు పాల్గొననున్నారు.బెంగళూరులో రెండు ఎడిషన్స్ తర్వాత, యుఎక్స్ఇండియా హైదరాబాద్‌ను డిజైన్ సంభాషణ, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం థీమ్, ‘డిజైన్: ఒక జీవన విధానం’ వ్యవస్థాపకత భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు, వెంచర్‌లను రూపొందించడంలో డిజైన్, కృత్రిమ మేధస్సుల శక్తివంతమైన కలయికను ఇది తెలియజేస్తుంది.ఈ కార్యక్రమంలో డిజైన్ ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో కొత్త ఆవిష్కరణలతో కూడిన వ్యాపార ఆలోచనలను యువ వ్యాపారవేత్తలు పెట్టుబడిదారుల ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రపంచ నాయకులు మాత్రమే పాల్గొనే ప్రత్యేక వేదికలో వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా 2030 నాటికి ఒక మిలియన్ మహిళలకు డిజైన్ విద్య అందించాలన్న యూఎంఓ లక్ష్యం దిశగా, మహిళా డిజైనర్ల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు.మైక్రోసాఫ్ట్, క్యాండెసెంట్, కాగ్నిజెంట్, ఫ్రెష్‌వర్క్స్, ఫిలిప్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు డిజైన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చర్చించనున్నారు. అలాగే, ఉత్పత్తులు, ఆవిష్కరణలలో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యం పొందనుంది. “ఈ ఏడాది యూఎక్స్ ఇండియా సదస్సు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు,” అని యూఎంఓ డిజైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాపు కలాధర్ అన్నారు.

Flipkart officially announced dates for The Big Billion Days 20252
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక అట్టహాసమైన షాపింగ్ ఫెస్టివల్ 'ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025' తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22న అంటే 24 గంటల ముందే ప్రత్యేక యాక్సెస్ లభించనుంది. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ‘అర్లీ బర్డ్ డీల్స్’ ఇప్పటికే బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉత్సాహాన్ని కలిగించాయి.ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్‌ను భారత్‌లోని అత్యంత వేగవంతమైన డెలివరీ సేవ అయిన ‘ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌’ కూడా భాగస్వామ్యం చేయనుంది. 19 నగరాల్లో 3,000 పిన్‌కోడ్లకు 10 నిమిషాల్లో డెలివరీ అందించనుంది. అదేవిధంగా, స్మార్ట్‌ఫోన్లు, ఏఐ ల్యాప్‌టాప్‌లు, 4కే టీవీలు, ​​కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ప్రీమియం ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకు లభించనున్నాయి.ఫ్లిప్‌కార్ట్ ఈ ఫెస్టివ్ సీజన్‌లో అభివృద్ధి చెందుతున్న నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ ద్వారా రూ.29/- నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100% సూపర్‌ కాయిన్ల రివార్డ్స్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, 400 కొత్త మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వేగవంతమైన డెలివరీకి మార్గం వేసింది.ఇతర బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్‌బ్యాక్‌, నో కాస్ట్‌ ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్లు మొదలైన వాటితో ఫ్లిప్‌కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేషస్‌ను ఇండియా డిజిటల్ ఫ్యూచర్‌కి దారితీసే వేడుకగా మార్చేందుకు సిద్ధమైంది.

Shafi Shoukath Builds Indias First Private Startup Ecosystem3
తొలి ప్రైవేట్ స్టార్టప్ పార్క్.. గ్రామీణ యువకుడి ప్రయత్నం

భారతదేశంలో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిత అవరోధాలను తొలగించేందుకు ఒక యువ పారిశ్రామికవేత్త ముందుకొచ్చాడు. గ్రామీణ కేరళకు చెందిన షఫీ షౌఖత్.. బెంగళూరులో రూ.600 కోట్లు విలువ చేసే స్టార్టప్ పార్క్‌ను స్థాపించి దేశవ్యాప్తంగా వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయగల నూతన వ్యవస్థను నిర్మిస్తున్నారు.గ్రామం నుంచి గ్లోబల్ దిశగా..స్టార్టప్‌లకు అవసరమైన మార్గనిర్దేశం, పెట్టుబడులు వంటి వనరులేవీ లేని కేరళలోని ఒక చిన్న గ్రామంలో షఫీ షౌఖత్ పెరిగారు. ఈ అనుభవం కారణంగా, తాను ఏర్పాటుచేసే స్టార్టప్ పార్క్‌లో ప్రతి సమస్యకు ప్రత్యేక పరిష్కార మార్గాలు ఉండేలా, “ప్రాబ్లం-ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్”ను రూపొందించారు.“సాధారణ ప్రోగ్రామ్స్ తో యూనిక్ సమస్యలు పరిష్కరించలేము” అని చెప్పే షౌఖత్ “ఎగ్జిక్యూషన్ ఆధారంగా, మెజరబుల్ ఇంపాక్ట్ వచ్చే విధంగా వ్యవస్థలు రూపొందించాలి” అంటున్నారు.స్టార్టప్ పార్క్ లక్ష్యాలుదేశవ్యాప్తంగా ఉన్న యువ వ్యవస్థాపకులను అనుసంధానించడంవ్యక్తిగత అవసరాలకు తగిన మెంటార్షిప్, పెట్టుబడి అవకాశం కల్పించడంప్రభుత్వాల కోసం పాలసీ ప్రయోగశాలగా పనిచేయడంపెట్టుబడిదారులకు డేటా ఆధారంగా దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించడంలో సహకారంనెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్షౌఖత్ ప్రారంభించిన నెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్‌కు ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది. ఇందులో హై-పొటెన్షియల్ వ్యక్తుల ఎంపిక, వారి ప్రతిభకు తగ్గ స్టార్టప్ అనుభవం, పరిశ్రమ ప్రముఖుల నుంచి స్రాటెజిక్ మార్గదర్శనం, పెట్టుబడిదారులు, పాలిసీ మేకర్లు ఉన్న నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవడం వంటివి ఉన్నాయి.భారత స్టార్టప్ భవిష్యత్తుకు కొత్త నమూనాసాధారణ ఇంక్యుబేటర్ల కన్నా షౌఖత్ రూపొందిస్తున్న ఈ మోడల్ ఒక కొత్త దిశను సూచిస్తుంది. ఇది సిద్ధాంతాల కంటే కార్యాచరణకు, వెయిన్ గణాంకాల కంటే నిజమైన ప్రభావానికి, పోటీ కంటే భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఈ మోడల్‌ను అధ్యయనం చేస్తుండటం గమనార్హం. భారతదేశం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్టార్టప్ ఆర్థికవ్యవస్థగా అభివృద్ధి చెందబోతున్న సమయంలో, షఫీ షౌఖత్ తీసుకుంటున్న అడుగులు దేశం భవిష్యత్తు పారిశ్రామికతకు ఒక శక్తివంతమైన బేస్‌గా నిలవవచ్చునన్న అంచనాలు ఉన్నాయి.

India Could Fill Global Labour Shortage Earn 300 Billion Year by 2030 GATI BCG Report4
ప్రపంచంలో కార్మిక కొరత.. భారత్‌కు మంచి అవకాశం

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్ గా ఎదగడానికి భారతదేశానికి సువర్ణ అవకాశం ఉందని గతి (GATI) ఫౌండేషన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక పేర్కొంది.ఈ నివేదిక ప్రకారం.. 2047 నాటికి, ప్రపంచ కార్మిక కొరత 200-250 మిలియన్లకు (20 కోట్ల నుంచి 25 కోట్లు) చేరుకుంటుందని అంచనా. అంటే అంత మంది కార్మికుల అవసరం ఏర్పడుతుందని అర్థం. యువ జనాభా, పెరుగుతున్న శ్రామిక శక్తితో భారతదేశం ఈ అంతరాన్ని పూరించడంలో సహాయపడటానికి బలమైన స్థితిలో ఉంది.5 కోట్ల ఉద్యోగ అవకాశాలు యూఎస్, యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు వృద్ధాప్య జనాభా కారణంగా తక్కువ మంది యువ కార్మికులను చూస్తున్నాయి. దీంతో ఇది మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. వాటిలో కనీసం కోటి ఉద్యోగాలను భారత్‌ భర్తీ చేయగలదు.భారత్‌కు పెద్ద అనుకూలతభారతదేశంలో 18-40 సంవత్సరాల వయస్సు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయస్సు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాలలో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు ఇంటికి పంపుతున్నారు.మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది.చేయాల్సిందిదే..ఈ అవకాశాన్ని భారత్‌ అందిపుచ్చుకోవాలంటే కొన్నింటిని మెరుగుపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేవిధంగా కార్మికుల నైపుణ్యాలు, శిక్షణను మెరుగుపరచడం.వేగవంతమైన, సురక్షితమైన, మరింత పారదర్శక వలస వ్యవస్థలను నిర్మించడం.ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ, తయారీ వంటి రంగాలపై దృష్టి పెట్టడం.విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం నైతిక, డిజిటల్-ఫస్ట్‌ ఉద్యోగ మార్గాలను సృష్టించడం.

nfo alert mutual funds5
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్‌లు

వివిధ మార్కెట్‌క్యాప్‌లవ్యాప్తంగా ఇన్వెస్ట్‌ చేసే ‘ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌’ను ది వెల్త్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) సెప్టెంబర్‌ 24న ప్రారంభమై అక్టోబర్‌ 8న ముగుస్తుంది. ఇది తమ తొలి ఫండ్‌ అని సంస్థ ఎండీ మధు లూనావత్‌ తెలిపారు. లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్‌ చేస్తుందని, నిఫ్టీ 500 టీఆర్‌ఐ దీనికి బెంచ్‌మార్క్‌గా ఉంటుందని పేర్కొన్నారు.ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థల తరహాలో కూలంకషంగా అధ్యయనం చేసి ఫండమెంటల్స్, వేల్యుయేషన్లు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని మధు వివరించారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పాంటోమత్‌ గ్రూప్‌లో ది వెల్త్‌ కంపెనీ భాగంగా ఉంది. పలు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌ (ఏఐఎఫ్‌)ను కూడా నిర్వహిస్తోంది.హెచ్‌డీఎఫ్‌సీ ‘డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఆల్‌ క్యాప్‌’ ఎఫ్‌వోఎఫ్‌ .. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఆల్‌ క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్‌ 24 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్‌క్యాప్‌లవ్యాప్తంగా దేశీయంగా ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.పలు ఫండ్‌ మేనేజర్ల అనుభవం, వివిధ రకాల పెట్టుబడుల ధోరణులు, క్రమశిక్షణతో కూడుకున్న రీబ్యాలెన్సింగ్‌ ప్రయోజనాలన్నింటినీ ఈ ఒక్క ఫండ్‌తో పొందవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నవ్‌నీత్‌ మునోట్‌ తెలిపారు. ఎన్‌ఎఫ్‌వో వ్యవధిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.ఇదీ చదవండి: జియో బ్లాక్‌రాక్‌ తొలి ఫండ్‌..

OPPO F31 series smartphones Launched in India6
ఒప్పో కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్ 31 సిరీస్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లన్నీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అన్నింటిలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లు చాలానే ఇచ్చారు. వాటి స్పెసిఫికేషన్‌లు ఏంటి.. ధరలు ఎంత.. ఎక్కడ కొనుక్కోవాలి.. తదితర వివరాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ ధరలు, లభ్యతఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.32,999. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999. హిమాలయన్ వైట్, జెమ్‌స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. అదే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.30,999. డెసెర్ట్‌ గోల్డ్‌, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.ఒప్పో ఎఫ్31 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. క్లౌడ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో ప్లస్ స్టార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 19 నుంచి ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒప్పో ఎఫ్ 31 5జీ మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.ఆఫర్లుఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకుల ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించుకుంటే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వినియోగించుకోవచ్చు. ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే 180 రోజుల ఉచిత కేర్‌ ఉంటుంది. ఇవి కాక ఆరు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్ లు, మొదటి రోజు ప్రీ-బుక్ లేదా కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన కార్డులు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లపై బ్యాంక్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి.స్పెసిఫికేషన్లుమూడు మోడళలోనూ కొన్ని ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రో ప్లస్ 6.8-అంగుళాల డిస్‌ప్లే, మిగిలిన రెండు 6.5-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ 120 హెడ్జ్‌ రీఫ్రెష్‌ రేటు ఉంటుంది. ప్రతి ఫోన్‌లోనూ 80వాట్ల సూపర్‌వోక్‌ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, రివర్స్ అండ్‌ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంది. అన్ని ఫోన్‌లూ క్వాల్‌కామ్‌ స్నాప్‌గ్రాడన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై పనిచేస్తాయి. ఇక కీలకమైన కెమెరా విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ ఫోన్‌లకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వగా ఒప్పో ఎఫ్31 5జీ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా మాత్రం అన్ని ఫోన్‌లకూ ఒకేలా 50ఎంపీ + 2ఎంపీ ఇచ్చారు.ఇదీ చదవండి: ఒప్పో కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. భారీ బ్యాటరీతో ప్రత్యేక ఫీచర్లు

Advertisement
Advertisement
Advertisement