Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How Governments Seize Properties Built with Illegal Income House Construction Tips1
ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?

సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది వారి కష్టార్జితం లేదా బ్యాంకు రుణాల ద్వారా పొందిన సొమ్ము అయి ఉండాలి. కానీ, కొందరు నేరస్థులు డ్రగ్స్ రవాణా, అవినీతి లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెడుతుంటారు.రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడికి చెందిన కోటి రూపాయల విలువైన ఇంటిని అధికారులు సీజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, అక్రమ సంపాదనతో ఇళ్లు నిర్మిస్తే ఎదురయ్యే పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రత్యేక కథనం.ఆ ఇల్లు ఏ డబ్బుతో కట్టారు?నాగౌర్ కేసులో నిందితుడు గోవింద్ రామ్ అలియాస్ గోవింద్ జాట్, అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో తన నివాసాన్ని నిర్మించాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ ప్రకారం, ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా అక్రమమైనది. పోలీసులు జరిపిన విచారణలో, సదరు నిందితుడు తన నేరపూరిత ఆదాయాన్ని దాచడానికి ఆ ఆస్తిని భార్య పేరిట రిజిస్టర్ చేసినట్లు తేలింది.ఇంటి నిర్మాణ నిధులపై నిబంధనలు ఏమిటి?భారతదేశంలో ఆస్తుల కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. భారీ వ్యయంతో కూడిన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు చెల్లించి, మరొకరి పేరు మీద (భార్య, పిల్లలు లేదా ఇతరులు) ఆస్తిని కొనుగోలు చేస్తే, ఆ నిధులకు సరైన లెక్క లేని పక్షంలో దానిని 'బినామీ' ఆస్తిగా పరిగణిస్తారు. ఎన్‌డీపీఎస్‌ సెక్షన్ 68 (E) ప్రకారం.. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు తమ నేరాల ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్న ఆస్తులను గుర్తించి, వాటిని స్తంభింపజేసే అధికారం పోలీసులకు, కేంద్ర సంస్థలకు ఉంటుంది.భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటారా?అవును, అక్రమ సొమ్ముతో నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అలాంటి ఇళ్లను ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక ఆధారాలు లభించిన వెంటనే ఆ ఆస్తిని ఎవరికీ విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా పోలీసులు స్తంభింపజేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే, సదరు ఆస్తిని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. నాగౌర్ కేసులో కూడా ఎస్పీ రోషన్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, సదరు నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.కొన్ని రాష్ట్రాల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నేరస్థులు నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం గౌరవం. కానీ, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించిన 'సౌధాలు' ఎంతో కాలం నిలవవు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌.. ఇప్పుడు ఇక్కడే..

Akshaya Tritiya 2026 Digital Gold Emerges as a Preferred Choice for Investors2
డిజిటల్‌ గోల్డ్‌కు అక్షయ తృతీయ మెరుపులు

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి ఆభరణాలు, నాణేలతో పాటు డిజిటల్‌ రూపంలో కూడా బంగారం కొనుగోళ్లపై కూడా గణనీయంగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్‌ గోల్డ్‌ని మరింత సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీస్‌ విభాగం రీసెర్చ్‌ హెడ్‌ నవనీత్‌ దమానీ, అనలిస్ట్‌ మానవ్‌ మోదీ ఒక నివేదికలో తెలిపారు.పసిడి ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్‌ వృద్ధి మందగించడం, మానిటరీ పాలసీ అంచనాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా 2026లో బులియన్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనవుతోందని తెలిపారు. మధ్య మధ్యలో కరెక్షన్‌కి లోనైనప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్‌ నెలకొనడంతో పసిడి, వెండి వరుసగా 10, 5 శాతం మేర పెరిగాయని వివరించారు.

YES Bank Deposits Cross Rs3 Lakh Crore Milestone Bad Loans Shrink Sharply3
రూ.3 లక్షల కోట్లు దాటిన యస్‌ బ్యాంక్‌ డిపాజిట్లు

ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ నికర లాభం స్టాండెలోన్‌ ప్రాతిపదికన 45 శాతం ఎగిసి రూ.1 ,068 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 739 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 9,356 కోట్ల నుంచి రూ. 9,381 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 7,616 కోట్ల నుంచి రూ. 7,650 కోట్లకు పెరిగింది.మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ 41 శాతం తగ్గి రూ. 187 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్‌ రుణాల విభాగం దన్నుతో రుణ వృద్ధి 10.7 శాతం మేర పెరిగింది. నికర వడ్డీ మార్చిన్‌ 2.5 శాతం నుంచి 2.7 శాతానికి మెరుగుపడింది. డిపాజిట్లు రూ. 3 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) డిపాజిట్లు రూ. 1 లక్ష కోట్లకు చేరుకున్నాయి. కొత్త ఎండీ, సీఈవోగా వినయ్‌ ఎం టోన్సే బాధ్యతలు చేపట్టాక బ్యాంకు ఆర్థిక ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని గైడెన్స్‌కి అనుగుణంగా పటిష్టమైన ఫలితాలతో ముగించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండు, మూడేళ్లలో మార్జిన్లను 3.25 – 3.50 శాతం స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు.నికర వడ్డీ మార్జిన్లు 20 బేసిస్‌ పాయింట్ల మేర మెరుగుపడినట్లు చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరం మొండిపద్దులు అత్యంత కనిష్ట స్థాయికి నెమ్మదించాయని పేర్కొన్నారు. మరింత మెరుగైన వృద్ధిని సాధించడంపై ప్రధానంగా దృష్టి పెడుతూ ముందుకు సాగనున్నట్లు వివరించారు.

Mukesh Ambani Network18 Reports Q4 Net Loss of Rs 29 61 Crore4
అంబానీ మీడియా సంస్థకు భారీ నష్టాలు

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ 2025–26 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.29.61 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.29.09 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదిన కార్యకలాపాల ద్వారా ఆదాయం 9.7% పెరిగి రూ.561.32 కోట్ల నుంచి రూ.615.78 కోట్లు చేరింది.టీవీ న్యూస్‌ రంగంలో ప్రకటనల డిమాండ్‌ 10 శాతం తగ్గినా, కంపెనీ ప్రకటన ఇన్వెంటరీ 4.5 శాతం పెరగడం ద్వారా పరిశ్రమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఎబిటా రూ.30 కోట్లుగా ఉండగా, ఎబిటా మార్జిన్‌ 4.9 శాతంగా నమోదైంది. మొత్తం వ్యయాలు 6.47 శాతం పెరిగి రూ.670.89 కోట్లకు చేరాయి. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.155.20 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం సమీకృత ఆదాయం రూ.2,148.46 కోట్లుగా నమోదైంది.‘‘ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ నవంబర్‌ 14, 2024 నుంచి, స్టూడియో 18 మీడియా డిసెంబర్‌ 30, 2024 నుంచి అనుబంధ సంస్థల జాబితా నుంచి తప్పుకోవడంతో, 2024–25 ఆర్థిక సంవత్సర గణాంకాలను 2025–26 గణాంకాలతో నేరుగా పోల్చడం సాధ్యం కాదు’’ అని కంపెనీ తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లోనూ కంపెనీ మంచి ఫలితాలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించిందని కంపెనీ చైర్మన్‌ అదిల్‌ జైనుల్‌భాయ్‌ తెలిపారు. సంచలనాల కంటే నిజమైన వార్తలపై దృష్టి పెట్టామన్నారు. కొత్త వ్యాపారాలతో ఆదాయం విభిన్నంగా మారుతోందని, న్యూస్‌ వ్యాపారాన్ని బలోపేతం చేస్తూనే, విస్తరణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Gold Rate Today (April 19): Akshaya Tritiya Check 22 and 24 carat gold prices5
బంగారం ధరలు.. వారంలో రూ.3 వేలు..

పసిడి ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న పర్వదినం అక్షయ తృతీయ (Akshaya Tritiya) వచ్చేసింది. నేడు వారంతపు సెలవు కావడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (MCX) ట్రేడింగ్‌ ఉండదు. దీంతో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల్లో (ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 వరకు) బంగారం ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఏప్రిల్ 13న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460 ఉండగా, అది ఏప్రిల్ 19 నాటికి రూ.1,55,780కి చేరుకోవడంతో మొత్తం రూ.3,320 మేర పెరిగింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏప్రిల్ 13న రూ.1,39,750 ఉండగా, ఏప్రిల్ 19 నాటికి అది రూ.1,42,800కి చేరుకొని వారం రోజుల్లో మొత్తంగా రూ.3,050 మేర పెరుగుదలను నమోదు చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Oppo F33 5G Series Launched in India Check Price Specs6
కొత్త ఫోన్‌: ఒప్పో ఎఫ్‌33 సిరీస్‌ వచ్చేసింది..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్‌33 5జీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ‘ఒప్పో ఎఫ్‌33 5జీ’, ‘ఒప్పో ఎఫ్‌33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ (ఎఫ్‌హెచ్‌డీ+) రిజల్యూషన్‌తో పాటు 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ గల అమోలెడ్‌ డిస్‌ప్లేను ఉంది.రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్‌ లేటెస్ట్‌ అండ్‌ పవర్‌ ఫుల్‌ ఏఐ కెమెరా ఫీచర్స్‌ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జ్‌ సపోర్ట్‌ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌ సపోర్ట్‌లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏప్రిల్‌ 26 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఎఫ్‌33 5జీ ధర: 6జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 37,999గా ఉన్నాయి. ఒప్పో ఎఫ్‌33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ.40,999గా ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement