Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

New York Citys Two Budgets and Multi Stage Budget Process Explained1
న్యూయార్క్ బడ్జెట్.. ‘టూ’ డిఫరెంట్‌!

న్యూయార్క్ సిటీ బడ్జెట్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా, నగర మేయర్ జోహ్రాన్ క్వామే మమ్దానీ ప్రజలకు బడ్జెట్ ప్రాముఖ్యతను వివరించారు. నగర బడ్జెట్ అనేది కేవలం సంఖ్యల పట్టిక మాత్రమే కాదని, అది ప్రజల దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు.“బడ్జెట్ అనేది ఒక స్ప్రెడ్‌షీట్ కాదు. లైబ్రరీలు తెరిచి ఉంటాయా లేదా, కుటుంబాలు చైల్డ్‌కేర్‌ను భరించగలుగుతాయా అనే విషయాలను ఇది నిర్ణయిస్తుంది,” అని మమ్దానీ అన్నారు. “ఇది మన విలువల ప్రతిబింబం, మనం నిర్మించాలనుకుంటున్న నగరానికి ఒక ప్రకటన.”న్యూయార్క్ సిటీలో రెండు రకాల బడ్జెట్లు ఉన్నాయి. ‘క్యాపిటల్ బడ్జెట్’ ద్వారా పార్కులు, పాఠశాలలు వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. ‘ఎక్స్‌పెన్స్ బడ్జెట్’ ద్వారా అద్దె సహాయం, శానిటేషన్ సిబ్బంది నియామకం, ఇతర ముఖ్యమైన నగర సేవలకు ఖర్చు చేస్తారు. ఈ వివరణలో మమ్దానీ ప్రధానంగా ఎక్స్‌పెన్స్ బడ్జెట్‌పై దృష్టి పెట్టారు.ఇతర నగరాలతో పోలిస్తే, న్యూయార్క్ సిటీ బడ్జెట్ ప్రక్రియ ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక్క బడ్జెట్ మాత్రమే కాకుండా నాలుగు దశల్లో బడ్జెట్‌ను విడుదల చేస్తారు. మొదటగా ప్రిలిమినరీ బడ్జెట్ విడుదల అవుతుంది. ఇందులో నగరానికి అందుబాటులో ఉన్న ఆదాయం, రాబోయే సంవత్సరాల్లో చేయాల్సిన ఖర్చుల అంచనాలు ఉంటాయి. ఈ బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, తదుపరి సంవత్సరం, ఇంకా మూడు భవిష్యత్ సంవత్సరాల అంచనాలను కూడా కలిగి ఉండాలి. ఇది 1970ల ఆర్థిక సంక్షోభం తర్వాత తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం.ప్రిలిమినరీ బడ్జెట్ తర్వాత సిటీ కౌన్సిల్ విచారణలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి తమ ప్రాధాన్యాలను ప్రతిపాదిస్తుంది. మే నెలలో ‘ఎగ్జిక్యూటివ్ బడ్జెట్’ విడుదలవుతుంది. ఇందులో సవరించిన ఖర్చుల ప్రణాళిక ఉంటుంది. అనంతరం మరోసారి కౌన్సిల్ విచారణలు జరిగి, చర్చలు ప్రారంభమవుతాయి.జూన్ చివరికి సిటీ కౌన్సిల్ బడ్జెట్‌పై ఓటింగ్ నిర్వహిస్తుంది. మేయర్, కౌన్సిల్ మధ్య అధికారిక అంగీకారం తర్వాత బడ్జెట్ ఖరారవుతుంది.రాష్ట్ర బడ్జెట్ కూడా నగర బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందని మమ్దానీ గుర్తు చేశారు. ఆల్బనీ (రాష్ట్ర ప్రభుత్వం) తీసుకునే నిర్ణయాలు నగరం ఏం చేయగలదో నిర్ణయిస్తాయి. ఫెడరల్ ప్రభుత్వంలా కాకుండా, న్యూయార్క్ సిటీ లోటు బడ్జెట్ నడపడానికి చట్టపరంగా అనుమతి లేదు. అందువల్ల అన్ని ఖర్చులు అందుబాటులో ఉన్న ఆదాయంతోనే కప్పబడాలి.బడ్జెట్ ప్రక్రియలో పెద్ద లోటులు రాకుండా చూసుకోవడమే తమ లక్ష్యమని, సాధ్యం కాని హామీలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు.“ఈ బడ్జెట్ మీ భవిష్యత్.. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే హక్కు మీకు ఉంది” ” అంటూ న్యూయార్క్‌ నగరవాసులను ఉద్దేశించి మమ్దానీ పేర్కొన్నారు.The City’s budget is our future. And you deserve to know how it works. pic.twitter.com/W2GtYgRYFS— Mayor Zohran Kwame Mamdani (@NYCMayor) January 30, 2026

Sarees Worn By Nirmala Sitharaman During the Budget2
8 బడ్జెట్లు.. 8 చీరలు.. దేని స్పెషాలిటీ దానిదే!

కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున దేశమంతా వివిధ శాఖలకు కేటాయింపుల గురించి చర్చించుకుంటుంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు. ఏటా ఆమె ధరించే చీర భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా దేశీయ చేనేత కళాకారులకు ఇచ్చే గౌరవంలా కనిపిస్తుంది. ఈ కథనంలో గడిచిన ఎనిమిది బడ్జెట్ సెషన్లలో (2019 నుంచి 2025 వరకు) నిర్మలమ్మ ధరించిన చీరల ప్రత్యేకతలు తెలుసుకుందాం.2019: మంగళగిరి చేనేత వైభవంతొలి బడ్జెట్ ప్రసంగం కోసం నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగళగిరి చేనేత చీరను ఎంచుకున్నారు. బంగారు రంగు అంచు ఉన్న ఈ గులాబీ రంగు చీర ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.2020: కంచి పట్టు సంప్రదాయంరెండో బడ్జెట్ సమయంలో ఆమె దక్షిణ భారత దేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచి పట్టు చీరలో మెరిశారు. పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించి సభలో హుందాతనాన్ని చాటారు.2021: పోచంపల్లి ఇక్కత్ కళతెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను 2021 బడ్జెట్ సందర్భంగా ఆమె ధరించారు. ఎరుపు, ఆఫ్-వైట్ కలయికతో ఉన్న ఈ చీరపై ఉన్న ఆకర్షణీయమైన గ్రీన్ బోర్డర్ దేశీయ చేనేత కళాకారుల ప్రతిభను ప్రతిబింబించింది.2022: బొంకాయ్ సిల్క్ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ బొంకాయ్ శైలి చీరను 2022లో ఆమె ఎంచుకున్నారు. రస్ట్ బ్రౌన్ రంగులో ఉండి మెరూన్ బోర్డర్, సిల్వర్ జరీతో ఉన్న చీరను ధరించారు.2023: కసూతి ఎంబ్రాయిడరీ2023 బడ్జెట్ రోజున కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే కసూతి ఎంబ్రాయిడరీ చీరలో ఆమె కనిపించారు. ఎరుపు రంగు చీరపై నలుపు రంగు టెంపుల్ బోర్డర్, చేతితో అల్లిన ప్రత్యేకమైన కసూతి వర్క్ ఆకర్షణీయంగా నిలిచింది.2024 (మధ్యంతర బడ్జెట్): బెంగాల్ కాంతా వర్క్2024 ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కోసం ఆమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీ ఉన్న ఇండిగో బ్లూ రంగులో ఉన్న సిల్క్ చీరను ధరించారు. ‘రామా బ్లూ’గా పిలిచే ఈ రంగు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని సూచించింది.2024 (పూర్తి స్థాయి బడ్జెట్): మంగళగిరి పట్టు పునరావృతంమరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆమె మళ్లీ మంగళగిరి పట్టు చీరను ఎంచుకున్నారు. ఆఫ్-వైట్ రంగులో ఉండి పర్పుల్, గోల్డ్ బోర్డర్ ఉన్న చీరను ధరించారు.2025: మధుబని చిత్రకళా సౌరభం2025 బడ్జెట్ సెషన్‌లో బిహార్‌కు చెందిన సుప్రసిద్ధ మధుబని పెయింటింగ్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీమ్ కలర్ సిల్క్ చీరపై పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా వేసిన చిత్రకళతో ఈ చీర రూపొందించారు.

Will gold price rally continue in 2026 Economic Survey explains outlook?3
బంగారం ఇకపైనా ఇలాగేనా? ఆర్థిక సర్వే ఏం చె​ప్పింది?

గతేడాది (2025) బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు, ప్రపంచ విధాన అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ కారణంగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు ఔన్స్‌కు 2,607 డాలర్ల నుంచి 4,315 డాలర్ల వరకు పెరిగాయి.భారత మార్కెట్‌లో భారీ రాబడులుమల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధర 2025 జనవరిలో రూ.81,028గా ఉండగా, 2026 జనవరి నాటికి రూ.1,75,231కు చేరింది. దీంతో ఒక ఏడాది కాలంలోనే పెట్టుబడిదారులకు సుమారు 116 శాతం రాబడి లభించింది.2026లో ధరల్లో ఒడిదుడుకులుఅయితే, ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో స్వల్ప కరెక్షన్ కనిపించింది. 2026 జనవరి 30న ఎంసీఎక్స్‌ (MCX)లో స్పాట్ గోల్డ్ ధర రూ.1,75,231 నుంచి రూ.1,67,095కు తగ్గింది. దీని ప్రభావంతో పలు గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువలు కూడా సుమారు 10 శాతం వరకు పడిపోయాయి.కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెంపుఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. భారత్‌లో బంగారం నిల్వల విలువ 2025 మార్చి చివరిలో 78.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 జనవరి నాటికి 117.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది బంగారంపై కొనసాగుతున్న విశ్వాసాన్ని సూచిస్తోంది.2026పై ఆర్థిక సర్వే అంచనాలుప్రపంచ అనిశ్చితులు కొనసాగితే, వాణిజ్య యుద్ధాలు పరిష్కారం కాకపోతే బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ కొనసాగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, 2025లో కనిపించినంత భారీ ర్యాలీ 2026లో ఉండకపోవచ్చని, ధరల్లో ఒడిదుడుకులు సహజమని కూడా హెచ్చరించింది.సేఫ్ హేవన్‌గా బంగారంమొత్తానికి, తాత్కాలికంగా ధరల్లో మార్పులు వచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

Young Professional Caught Scrolling On Reddit During Overtime4
ఓవర్‌టైమ్ వర్క్.. మొబైల్ ఫోన్ చూస్తుండగా..

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామంది తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు అలాంటిదే.. మరొకటి ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.ఒక 21 ఏళ్ల యువకుడు కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ.. తనను తానే సరదాగా 'కార్పొరేట్ మజ్దూర్' (లేబర్) అని చెప్పుకున్నాడు. అతడికి కేటాయించిన పనులన్నింటినీ ఒక గంట ముందే పూర్తి చేశాడు. మేనేజర్ సాయంత్రం 6 గంటలకే వెళ్లిపోయారని భావించి, ఓవర్‌టైమ్ జీతం వస్తుందనే ఉద్దేశంతో ఆఫీసులోనే ఉండిపోయాడు. పని లేకపోవడంతో అతడు తన మొబైల్‌లో రెడిట్ నోటిఫికేషన్లు స్క్రోల్ చేస్తుండగా, రాత్రి 8 గంటల సమయంలో.. మేనేజర్ అతని డెస్క్ దగ్గర కనిపించాడు.మేనేజర్ అతన్ని చూసి ఎందుకు పని చేయడం లేదు? అని ప్రశ్నించాడు. తనకు అప్పగించిన పనులన్నీ పూర్తయ్యాయని చెప్పగానే.. అయితే ఇంకో పని అడుగు అని మేనేజర్ పేర్కొన్నారు. అక్కడితో ఆ విషయం ఆగలేదు. మేనేజర్.. సీనియర్ మేనేజ్‌మెంట్‌కి సమాచారం ఇచ్చి, ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తున్నారు అన్నది గమనించమని చెప్పాడట. ముఖ్యంగా తననే ఉదాహరణగా చూపిస్తూ, ఇలాగే ఖాళీగా ఉంటే ఓవర్‌టైమ్ జీతం కట్ చేస్తామని హెచ్చరించారు.జరిగిన సంఘటన ద్వారా.. తాను టార్గెట్ అయ్యానని ఆ యువకుడు బాధపడ్డాడు. అదే సమయంలో ఇతర ఉద్యోగులు కూడా మొబైల్ ఫోన్లు వాడుతుండగా, వారు మాత్రం మేనేజర్ కంట పడలేదు. సహోద్యోగులు ఈ పరిస్థితిని ఆఫీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాదిరిగా తీసుకుని, కొత్తగా వచ్చిన ఉద్యోగిని క్లాస్‌లో పిల్లాడిని మందలించినట్లు మందలించడాన్ని చూసి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?

Full Demand In UPVC Doors and Windows Know The Details Here5
మార్కెట్లో ఫుల్ డిమాండ్!.. అందుబాటు ధరలోనే..

ఎవరు ఇంటికొచ్చినా స్వాగతం పలికేవి ఇంటి తలుపులే.. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించినవి వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో అన్‌ప్లాస్టిసైజ్డ్‌ పాలీవినైల్‌ క్లోరైడ్‌(యూపీవీసీ) తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. – సాక్షి, సిటీబ్యూరోసౌకర్యాలెన్నో..యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం.సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీలు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారు 30 ఏళ్లు.యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పుపట్టడం వంటివి ఉండవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు.అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. నష్టం చాలా వరకు తగ్గుతుంది.యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఇంట్లో విద్యుత్‌ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది.సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అదే యూపీవీసీ పర్యావరణహితమైనవి. అంతేకాకుండా వీటికి ఉండే స్కూలు, గ్రిల్స్‌ బయటకు కనిపించవు.

Hyderabad Tops GCC Office Leasing with 6 5 Million Sq Ft in Just 12 Months6
రియల్‌ఎస్టేట్‌: 12 నెలలు.. 65 లక్షల చదరపు అడుగులు

హెచ్‌–1బీ వీసాపై ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్‌ హాట్‌ ఫేవరెట్‌గా మారుతోంది. – సాక్షి, సిటీబ్యూరో గత ఏడాది హైదరాబాద్‌లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో 51 శాతం వాటా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ (జీసీసీ) విభాగానిదే.. 2025లో నగరంలో జీసీసీలు 65 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. 2024లో 58 లక్షల చ.అ.లావాదేవీలతో పోలిస్తే ఇది అధికం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని జీసీసీ లావాదేవీల్లో భాగ్యనగరం వాటా ఏకంగా 19 శాతంగా ఉందని వెస్టియాన్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 7.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఇక, కొత్తగా మార్కెట్‌లోకి 5.55 కోట్ల చ.అ. ఆఫీసు స్థలం అందుబాటులోకి వచి్చంది. గతేడాది ఆఫీసు స్పేస్‌ లీజులలో జీసీసీల వాటా ఏకంగా 45 శాతంగా ఉంది. 2025లో 3.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. 2024లోని 2.92 కోట్ల జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఏడాదిలో 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.వేకెన్సీ 18.2 శాతం.. ఏటేటా హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల మార్కెట్‌ సరికొత్త రికార్డ్‌లను అధిగమిస్తోంది. గత ఏడాది నాల్గో త్రైమాసికం(క్యూ4)లో ఏకంగా 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లీజులు పూర్తయ్యాయి. అంతకు క్రితం క్వార్టర్‌ తో పోలిస్తే ఇది ఏకంగా 55 శాతం అధికం. ఇక, నగరంలో లాస్ట్‌ క్వార్టర్‌లో కొత్తగా 60 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల నిర్మాణాలు పూర్తయి, మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఆఫీసు స్పేస్‌ వేకెన్సీ 18.2 శాతంగా ఉంది.నివాసాలకే కాదు ఆఫీసు విభాగానికీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) విభాగమే కీలకం. టెకీలతో గృహాలకు, ఐటీ సంస్థలతో కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది నగరంలో నమోదైన ఆఫీసు స్పేస్‌ లీజులలో 39.9 శాతం ఐటీ, ఐటీఈఎస్‌ విభాగానిదే కావడం ఇందుకు ఉదాహరణ. అయితే అంతకు క్రితం ఏడాదిలో ఈ విభాగం వాటా 41.9 శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌సైన్సెస్‌ 11.5 శాతం, ఫ్లెక్సీ స్పేస్‌ విభాగం 7.8 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.97 శాతం ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి (పెరిఫెరల్‌ బిజినెస్ట్‌ డిస్ట్రిక్ట్‌) పీబీడీ–వెస్ట్‌ హైదరాబాద్‌ ప్రాంతాల్లోనే జరిగాయి. నగరంలో హరిత కార్యాలయ భవనాల వాటా క్రమంగా పెరుగుతోంది. నిరుడు నగరంలో గ్రీన్‌ సర్టిఫైడ్‌ ఆఫీసు స్పేస్‌ లావాదేవీల వాటా 77 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఈ విభాగం వాటా 76 శాతం. దేశంలోని గ్రీన్‌ స్పేస్‌ ఆఫీసులలో హైదరాబాద్‌ వాటా 16 శాతంగా ఉంది.

Advertisement
Advertisement
Advertisement