ప్రధాన వార్తలు
డైలీ సిప్తో పెట్టుబడులు మరింత సులభతరం
మొదటిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారికి, చిన్న మొత్తాలతో పెట్టుబడుల ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే వారికి మైక్రో, డైలీ సిప్లు అనువైన సాధనాలుగా ఉంటున్నాయని షేర్.మార్కెట్ (ఫోన్పే వెల్త్) ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ హెడ్ నీలేష్ డి నాయక్ తెలిపారు. రోజువారీ ప్రాతిపదికన నగదు రూపంలో ఆదాయాలు ఉండేవారికి, స్వయం ఉపాధి పొందే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయని చెప్పారు. క్రమంగా వారు పెట్టుబడుల పరిమాణాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లేందుకు తోడ్పడుతున్నాయని వివరించారు.ఈక్విటీ ఫండ్స్లో సిప్లనేవి దీర్ఘకాలిక పెట్టుబడులనే విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలని నాయక్ సూచించారు. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి గురించి ఆందోళన చెందరాదన్నారు. తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లను కూడబెట్టుకునే అవకాశంగా దీన్ని పరిగణించాలని సూచించారు. స్వల్పకాలిక హెచ్చుతగ్గులపై స్పందించడం కంటే, సిప్లను కొనసాగించడం శ్రేయస్కరమన్నారు. వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ విభాగాల్లో స్టాక్స్, ఈటీఎఫ్లు, ఐపీవోలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అధునాతన ఫీచర్లు, ఇంటెలిజెంట్ టూల్స్ మొదలైనవి అందిస్తున్నామని నాయక్ చెప్పారు. మైక్రో సిప్ల ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టే యూజర్లకు యాప్లోని కంటెంట్తో పాటు సోషల్ మీడియా సహా పలు టచ్పాయింట్ల మాధ్యమాల ద్వారా అవగాహన కలి్పస్తున్నామని ఆయన తెలిపారు. మార్కెట్లపై నమ్మకాన్ని, పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇవి ఇన్వెస్టర్లకు తోడ్పడుతున్నాయన్నారు.ఏఐ దన్నుడిజిటల్ వినియోగం పెరిగే కొద్దీ వెల్త్టెక్ ప్లాట్ఫామ్లు పెట్టుబడులు, ట్రేడింగ్ని అన్ని వర్గాల ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చాయని నాయక్ చెప్పారు. పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో కృత్రిమ మేధ, డేటా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడంలో తమకు, సజావుగా మార్కెట్ యాక్సెస్ లభించేలా ఇన్వెస్టర్లకు ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నామని నాయక్ తెలిపారు. ప్రత్యేకంగా సరళమైన, ఇంటరాక్టివ్ యాప్ని కూడా తాము రూపొందించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్కు రెడీనా?
రిటైర్మెంట్కు రెడీనా?
రిటైర్మెంట్ అంటే... 60 ఏళ్లకు కదా! అనుకుంటారంతా. ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించటమెందుకని రోజులు గడిపేస్తూ ఉంటారు. దాదాపు 70 శాతం మంది వేతన జీవులది ఇదే పరిస్థితి. కాకపోతే ఆ మిగిలిన 30 శాతం మందీ మరోరకంగా ఆలోచిస్తుంటారు. వారి దృష్టిలో రిటైర్మెంట్ అంటే ఉద్యోగానికి గుడ్బై చెప్పటం కాదు. తప్పనిసరి పనికి స్వస్తి చెప్పి... నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛను సంపాదించుకోవటం. ఆ స్వేచ్ఛను ఎంత త్వరగా సంపాదించుకోగలిగితే... అంత త్వరగా తప్పనిసరి పనికి గుడ్బై కొట్టేయటం. చాలామందికి 60 ఏళ్లు దాటినా కూడా ఈ తరహా స్వేచ్ఛ సాధ్యం కాదు. కొందరు మాత్రం 40లు, 50లలోనే సాధ్యం చేసుకోగలుగుతున్నారు. ఎలా? దీనికి ఏం చేయాలి? ఇదే ఈ వెల్త్ స్టోరీ...క్యాంపస్లోనో, కాలేజీ నుంచి బయటకు వచ్చాకో మంచి జాబ్ కొడితే సెటిలైపోయినట్లేనని భావిస్తారు చాలామంది. ఆదాయాన్ని బట్టి ఖరీదైన ఫోన్లు, కారు, ప్రీమియం హౌస్... ఇలా ఖర్చు చేసుకుంటూ వెళుతుంటారు. భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఈఎంఐల రూపంలో ఇప్పుడే ఖర్చు చేసేస్తుంటారు. వారికప్పుడు రిటైర్మెంట్ గుర్తుకే రాదు. కొందరికి గుర్తుకు వచ్చినా ప్రాధాన్యంగా తీసుకోరు. 40 ఏళ్లు దాటాక మెల్లగా ఆలోచించటం మొదలుపెడతారు. అక్కడి నుంచి మరో 15–20 ఏళ్లే ఉండడంతో, ఇక తప్పదులే అనుకుని ఆదాయంలో కొంత పక్కన పెట్టడం ఆరంభిస్తారు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఈ వాయిదానే పెద్ద ప్రతికూలమన్నది చాలా మంది తెలుసుకోరు. 20–30ల నుంచి పెట్టుబడి ఆరంభిస్తేనే అది పెద్ద నిధిగా మారుతుంది. వాస్తవానికి రిటైర్మెంట్ ప్రణాళిక ఫెయిలవటానికి ప్రధాన కారణం పెట్టుబడిని ఆలస్యంగా మొదలు పెట్టడమే. త్వరగా మొదలు పెడితే చక్ర వడ్డీ ఫలితంగా (కాంపౌండింగ్) అది పెద్ద మొత్తమవుతుందన్నది గుర్తించకపోవటమే.అవగాహన లేమి..ప్రైవేటు రంగంతోపాటు, అసంఘటిత రంగంలోని వారికి సామాజిక భద్రత తక్కువే. ఉద్యోగుల భవిష్యనిధి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి 7–8 శాతమే. ఇందులో 6 శాతం ద్రవ్యోల్బణం తీసివేస్తే మిగిలేది ఎంత? కొంత మంది బీమా పాలసీల్లో (ఎండోమెంట్, యులిప్) ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎండోమెంట్ ప్లాన్లలో దీర్ఘకాల రాబడి 4–5 శాతం మించదు. యూనిట్ లింక్డ్ ప్లాన్లలోనూ (యులిప్) రాబడి 8–9 శాతమే. తమకున్న ప్రాపర్టీ ఆదుకుంటుందిలే? అన్నది కూడా అవగాహన లేమే. ఒక్క చిన్న వివాదంతో ప్రాపర్టీ ఏళ్ల కొద్దీ అపరిష్కృతంగా ఉండిపోగలదు.వృద్థాప్యంలో తమ అవసరాలను చూసుకోవడానికి పిల్లలు ఉన్నారుగా? ఇలాంటి ఆలోచనలు.. 60 తర్వాత 20–30 ఏళ్ల ప్రశాంత జీవనానికి సోపానాలు కానే కావు.అత్యాధునిక వైద్య విధానాలతో ఆయుర్దాయం (జీవనకాలం) పెరుగుతోంది. వైద్య వ్యయాలు కూడా ఏటేటా రెండంకెల స్థాయిలో పెరుగుతుండడం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తమే ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షల పొదుపు కరిగిపోవచ్చు. ఇక మనలో కొంత మంది అయితే విశ్రాంత జీవన నిధిని పిల్లల విద్యావసరాలకు ఖర్చు పెట్టేస్తుంటారు. ఇది చేయరాని తప్పు. ఆలస్యం అమృతం విషం..25 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవచ్చు. కానీ సంపద సమకూర్చుకోవడంలో ఎంతో తేడా వస్తుంది. నెలకు రూ.15,000 చొప్పున 25 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 60వ ఏట వరకు 10 శాతం వార్షిక రాబడి (సగటు) వచ్చే ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 35 ఏళ్లలో రూ.5.14 కోట్లు (రూ.514 లక్షలు) సమకూరుతుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.60 లక్షలే.ఐదేళ్లు ఆలస్యంగా 30వ ఏట నుంచి మొదలు పెట్టి 60 వరకు 30 ఏళ్ల పాటు ఇంతే మేర పొదుపు చేస్తే సమకూరేది రూ.3.12 కోట్లు. ఐదేళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.2 కోట్ల నిధిని కోల్పోయినట్టు అవుతుంది. ఇంకో పదేళ్లు ఆలస్యంగా 40 ఏళ్లలో మొదలు పెడితే.. 20 ఏళ్లలో ఇదే రూ.15,000తో సమకూరేది కోటీ ఎనిమిది లక్షల రూపాయలు. ఎంత కావాలి..?ఒక వ్యక్తికి నేడు నెలవారీ రూ.50,000 ఖర్చు అవుతుంటే.. 25 ఏళ్ల తర్వాత అదే మాదిరి జీవన అవసరాలకు నెలకు రూ.2 లక్షలు అవసరమవుతుంది. ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన అంచనా ఇది. నెలకు రూ.2 లక్షల ఆదాయం రూ.4–5 కోట్ల నిధిపైనే సాధ్యం. మరి రూ.5 కోట్ల నిధిని సమకూర్చుకోవడం మధ్య తరగతి వారికి ఐదు, పదేళ్లలో సాధ్యమేనా..? కనీసం ఇంత అవసరం..ఆర్జన ఆరంభించిన మొదటి నెల నుంచే 20–25 శాతాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఈక్విటీ ఫండ్స్లో ప్రతినెలా సిస్టమ్యాటిక్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏటా ఆదాయ వృద్ధికి సమానంగా రిటైర్మెంట్ ఫండ్ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రతి నెలా ఇంటి అద్దె, గ్రోసరీ, యుటిలిటీ (బ్రాడ్బ్యాండ్, మొబైల్, విద్యుత్) కేటాయింపులు ఎలా తప్పనిసరో.. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ నిధి కోసం నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం కూడా అంత అవసరం. లేదంటే ఒక లక్ష్యం కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది.రిటైర్మెంట్ నాటికి సమకూర్చుకున్న నిధిని మూడు భాగాలు చేసుకోవాలిస్వల్పకాల అవసరాలు, ఆరోగ్య అత్యవసరాల్లో వెంటనే తీసుకునేందుకు వీలుగా (రెండేళ్ల అవసరాలకు సరిపడా) ఒక భాగం ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం లిక్విడిటీ (వెంటనే నగదుగా మార్చుకునే) ఎక్కువగా ఉండే లిక్విడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.3–10 ఏళ్ల అవసరాల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక పదేళ్లకు మించిన అవసరాల కోసం మరో భాగం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పెట్టుబడుల విషయంలో కొంత రిస్క్ తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాల నిధి ద్రవ్యోల్బణాన్ని మించి ఎక్కువగా కాంపౌండ్ అవుతుంది.వాస్తవాలు ఇవీ..రిటైర్మెంట్ కోసం తాము మరింత ముందు నుంచే ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు? అని 50 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మంది ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది.రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారు 2025 నాటికి 37 శాతమే. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ విషయంలో ప్రణాళికలేమితో ఉన్నట్టు తెలుస్తోంది.తమ పొదుపు నిధి రిటైర్మెంట్ తర్వాత పట్టుమని పదేళ్లు అయినా చాలుతుందో, లేదోనని 63 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.పట్టణాల్లో సగం మంది రిటైర్మెంట్ కోసం ముందు నుంచే పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. కానీ, 40 శాతం మంది విశ్రాంత జీవనం కోసం అసలు పెట్టుబడే మొదలు పెట్టలేదు.ప్రణాళిక మొదలు పెట్టిన వారిలోనూ కేవలం 37 శాతమే సమకూర్చుకోవాల్సిన నిధిలో పావు శాతం లక్ష్యానికి చేరారు. రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న వారిలో జీవిత బీమానూ పరిగణనలోకి తీసుకుంటున్నవారు 95 శాతంగా ఉన్నారు.అత్యంత ముఖ్యమైన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకం గురించి 64 శాతం మందికి తెలిసినా.. అందులో ఇన్వెస్ట్ చేస్తున్న వారు 16–25 శాతం మించిలేరు.ఇక రిటైర్మెంట్ కోసం పక్కన పెడుతున్న వారిలో కూడా జీవించినంత కాలం ఆ నిధి సరిపోతుందన్న నమ్మకంతో ఉన్నవారు 19 శాతం మందే.ఈ ఫలితాలు విశ్రాంత జీవన అవసరాలకు చాలా ముందుగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
మార్కెట్లకు టఫ్ టెస్ట్
ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం 24 న నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ, కీలక మాక్రో డేటా విడుదల, గ్లోబల్ ట్రేడ్ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు మార్కెట్ దిశను నిర్ధేశించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ బాదుడు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బకొట్టింది. ఈవారం మార్కెట్లు అప్రమత్తంగా కదులుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సమీప కాలంలో మార్కెట్లు రేంజ్బౌండ్ ట్రేడింగ్లోనే కొనసాగే అవకాశముందని, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్, మాక్రో డేటా గణాంకాలు మార్కెట్కు ప్రధాన ట్రిగ్గర్లుగా ఉండనున్నాయి. ప్రతి గ్లోబల్ న్యూస్, ఎకనామిక్ డేటాకు మార్కెట్ తక్షణ ప్రతిస్పందన చూపే ‘‘ఈవెంట్డ్రివెన్ ట్రేడింగ్ఙ్ జరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీతో పెరిగే ఒడిదుడుకులు ఫిబ్రవరి నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కారణంగా మార్కెట్లలో షార్ట్టర్మ్ వోలాటిలిటీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ట్రేడర్లు పొజిషన్ రోల్ఓవర్స్, షార్ట్ కవరింగ్, ప్రాఫిట్ బుకింగ్ వంటి చర్యలకు దిగుతారు. దీంతో సూచీలు అకస్మాత్తుగా పెరగడం ,ఊహించని విధంగా పతనం కావడం సాధారణం. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, హెవీ వెయిట్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశముంది. మాక్రో డేటాపై పెట్టుబడిదారుల ఫోకస్ ఈవారం విడుదలయ్యే కీలక ఆర్థిక గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయనున్నాయి. జీడీపీ గణాంకాలు, విదేశీ మారక నిల్వలు తదితర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు దేశ ఆర్థిక వృద్ధి జోరు, కార్పొరేట్ ఎరి్నంగ్స్ ట్రెండ్పై స్పష్టత ఇవ్వనున్నాయి. జీడీపీ గణాంకాలు బలంగా ఉంటే మార్కెట్కు సపోర్ట్ లభించే అవకాశం ఉంది, బలహీన గణాంకాలు వస్తే షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ పెరిగే అవకాశముంది. ట్రంప్ టారిఫ్ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం అమెరికా తాజా టారిఫ్ నిర్ణయం గ్లోబల్ ట్రేడ్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోంది. టారిఫ్ల పెంపు ట్రేడ్ టెన్షన్ను మళ్లీ పెంచే అవకాశముండటంతో ఎమర్జింగ్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ సరఫరా వ్యవస్థ, ఎగుమతులపై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూడ్ ఆయిల్, అమెరికాఇరాన్ పరిణామాలు కీలకం క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు భారత మార్కెట్లకు కీలక సూచికగా మారనున్నాయి. అంతర్జాతీయ జియోపాలిటికల్ టెన్షన్స్, ముఖ్యంగా అమెరికాఇరాన్ సంబంధాల పరిణామాలు ఆయిల్ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆయిల్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగి మార్కెట్లపై నెగటివ్ ప్రభావం పడే అవకాశముంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, గ్లోబల్ లిక్విడిటీపై కన్ను విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాల ధోరణి మార్కెట్ ట్రెండ్ను నిర్ణయించే మరో కీలక అంశం. గ్లోబల్ వడ్డీ రేట్ల సంకేతాలు, డాలర్ బలం, రిస్క్ సెంటిమెంట్ ఆధారంగా ఎఫ్ఐఐలు తమ పెట్టుబడి వ్యూహాలను మార్చే అవకాశం ఉంది. గత వారమిలా..గత వారం(16–20) దేశీ స్టాక్ మార్కెట్లు చాలావరకూ సానుకూలంగానే కదిలాయి. దేశీయంగా ఏఐ సదస్సు, యూఎస్తో ట్రేడ్ డీల్పై అంచనాలు తదితర అంశాలు ఇన్వెస్టర్లకు తొలుత జోష్నిచ్చాయి. అయితే ఏఐ కారణంగా దేశీ టెక్నాలజీ రంగంలో పెనుమార్పులకు తెరలేవనున్న అంచనాలు సాఫ్ట్వేర్ సేవల రంగ కౌంటర్లలో భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. ఇది సెంటిమెంటును దెబ్బతీయగా.. గత గురువారం అన్ని రంగాలలోనూ భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. వెరసి గత వారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్వల్ప లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు(0.25 శాతం) బలపడి 82,815 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) జమ చేసుకుని 25,571 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.35 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.3 శాతం నీరసించింది.టెక్నికల్గా చూస్తే.. ఈ వారం వారాంతాన(27న) దేశ క్యూ3 జీడీపీ, జనవరి మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. క్యూ2(జూలై–సెపె్టంబర్)లో ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇక అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో జీడీపీ 7 శాతం పురోగమించనున్నట్లు ఆర్బీఐ అంచనా వేయగా.. ఇతర ఫైనాన్షియల్ సంస్థలు 7.4 శాతం వృద్ధిని ఊహిస్తున్నాయి. కాగా.. ఈ వారం యూఎస్ ప్రభుత్వ టారిఫ్లను ఆ దేశ సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ తిరిగి 15 శాతం టారిఫ్లను తాజాగా ప్రకటించడంతో అయోమయం నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ వారం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్ కావచ్చని తెలియజేశారు. → గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాయిని అధిగమించడంలో తడబడింది. అయితే 25,200–24,800 పాయింట్ల వద్ద ఈ వారం మద్దతు కనిపించే వీలుంది. ఈ స్థాయిల నుంచి బలపడి 26,000 పాయింట్లను దాటితే మరింత జోరు చూపే అవకాశముంది. 26,400 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. → బీఎస్ఈ సెన్సెక్స్ మొదట 82,200–82,000 పాయింట్ల వద్ద సపోర్ట్ తీసుకునే అవకాశముంది. ఇక్కడి నుంచి పురోగమిస్తే 84,000 పాయింట్ల మైలురాయికి చేరుకోవచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత బలపడేందుకు వీలుంది. సాక్షి, బిజినెస్ డెస్క్
ఖర్చులకు కళ్లెం వేద్దాం!
ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్ఫోన్లు, కార్లు, లాప్టాప్లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్మెంట్’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్టాప్లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్గ్రేడెడ్ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్ స్టోరీ చూడండి...మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్స్టయిల్ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. ద్రవ్యోల్బణం.. సైలెంట్ కిల్లర్ ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్స్టయిల్పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. → మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె → కారును అప్గ్రేడ్ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. → మరింత తరచుగా బయట తినటం, ఫుడ్ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. → జిమ్తో పాటు అనేక ఓటీటీలు, యాప్లు సబ్స్క్రయిబ్ చెయ్యటం. వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. ‘అవసర ఖర్చుల’ భ్రమ .. అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్ఫోన్ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. ఏం చేయాలంటే.. జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. → పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్ రూల్ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్స్టయిల్ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. → పొదుపును ఆటోమేట్ చేయాలి ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్స్టయిల్ ఖర్చులు ఆటోమేటిక్గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. → ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్గ్రేడ్ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. → సబ్్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది. మూడు కేటగిరీలు.. వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్స్టయిల్ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేíÙంచి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది. లైఫ్స్టయిల్ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. → బయట హోటళ్లలో తినడం → విహార యాత్రలు → సబ్్రస్కిప్షన్లు ∙అప్గ్రేడెడ్ గ్యాడ్జెట్లు ∙తరచుగా వాహనాలను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండటంతప్పనిసరైన ఖర్చులు ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. → విద్య → ఆరోగ్య సంరక్షణ → ప్రాథమిక హౌసింగ్ → బీమా → నిత్యావసరాలులీకేజీలు అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్ కిందికి వస్తాయి. → ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్లైన్లో షాపింగ్ → క్రెడిట్ కార్డ్ బాకీలను రోలోవర్ చేస్తుండటం. → ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కనీ్వనియెంట్గా చేసే వ్యయాలురియాలిటీ చెక్ లైఫ్స్టయిల్కి సంబంధించి అప్గ్రేడ్స్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్స్టయిల్ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశి్చంతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్ సూత్రం ఒకటి ఉంది. → 50%– తప్పనిసరి అవసరాలు → 30% – లైఫ్స్టయిల్, కోరికలు → 20% – పొదుపు, పెట్టుబడులు. లైఫ్స్టయిల్ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్గా పడిపోతాయి.
ఆ ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో ఫుల్ జోష్..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో (TCS) పనిచేసే ఉద్యోగుల్లో ఫుల్ జోష్లో ఉన్నారు. కారణం.. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్ పేను మూడో త్రైమాసికంలో గరిష్ఠంగా 80 శాతం వరకు పెంచింది. దాదాపు రెండేళ్లుగా తక్కువ స్థాయిలో కొనసాగిన చెల్లింపుల తరువాత ఇది గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు.రెండేళ్ల తర్వాత గణనీయమైన పెంపుఇటీవలి కాలంలో మధ్య, సీనియర్ స్థాయి సిబ్బందికి వేరియబుల్ పే 20–50 శాతం మధ్యకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చాలామంది మధ్యస్థాయి ఉద్యోగులు సుమారు 80 శాతం వేరియబుల్ చెల్లింపులు పొందినట్లు సమాచారం. సీనియర్ స్థాయి ఉద్యోగులకు 40–80 శాతం మధ్య చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. ‘మనీ కంట్రోల్’ కథనం ప్రకారం.. ఉద్యోగులకు జనవరిలో ఈ మొత్తాలు జమయ్యాయి.కంపెనీ వర్గాల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి పైగా తమ త్రైమాసిక వేరియబుల్ వేతనంలో 100 శాతం అందుతోంది. అయితే, పూర్తి చెల్లింపులు ఎక్కువగా జూనియర్ స్థాయి ఉద్యోగులకే పరిమితమై ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్లోనూ బలమైన చెల్లింపులుఇక మరో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కూడా డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి (Q3FY26) సగటున 85 శాతం పనితీరు బోనస్ చెల్లింపులు విడుదల చేసింది. గత మూడున్నరేళ్లలో ఇది బలమైన వేరియబుల్ పే ఫలితంగా నిలిచింది.ఇదీ చదవండి: కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరల్లో కొత్త స్మార్ట్ ఫోన్
చైనా మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ బడ్జెట్ ధరల్లో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది.‘ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999గా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999గా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999గా నిర్ణయించారు.లాంచ్ ఆఫర్లో భాగంగా 12 నెలల సాధారణ వారెంటీతో పాటు 12 నెలల ఎక్స్టెండెడ్ వారెంటీ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. వన్టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ను కూడా అందిస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్తో పాటు కంపెనీ వెబ్సైట్, ఆఫ్ లైన్ స్టోర్స్లో ఈ ఫిబ్రవరి 25నుంచి సేల్ అందుబాటులో ఉండనుంది.సిల్క్ ఫైబర్ ఫినిష్, స్టెల్లర్ బ్లూ, లూనార్ టైటానియం కలర్స్లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే త్రీడీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది.ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తోంది. 5జీ, డ్యూయల్ 4జీ వీఓఎల్ఈటీ కనెక్టివిటీ సపోర్టులున్నాయి. వై–ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి. యూఎస్బీ టైప్–సీ పోర్ట్, ఐఆర్ సెన్సార్ ఉన్నాయి. ఇన్–డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లున్నాయి.
కార్పొరేట్
ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్..
బీమా వృద్ధికి ఎఫ్డీఐల దన్ను
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు!
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు
ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాకు టీసీ‘ఎస్’
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్ట...
బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
25,480 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ము...
యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా స...
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించ...
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులక...
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్ కోల్ దిగుమతి పట్ల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
గ్లోబల్ జాబ్స్కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు. ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలుఇండియాపై ప్రశంసలుపన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే..
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్నగర్లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్లోడ్లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు.
రూ.10 లక్షల కోట్లు.. ముఖేష్ అంబానీ భారీ ప్రకటన
భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.జియోతో కలిసి రిలయన్స్ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.ఈ లక్ష్యంతో రిలయన్స్ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్నగర్లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
పర్సనల్ ఫైనాన్స్
పీఎఫ్పై లోన్ తీసుకోవచ్చా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఇందులో ప్రతి నెలా భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. సాధారంగా ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత ఉపయోగించుకోవాలి. కానీ ఉద్యోగికి అత్యవసర సమయంలో.. డబ్బు అందించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ తీసుకోవచ్చా? అని కొందరికి సందేహం కలుగవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నిజానికి ఈపీఎఫ్ఓ నుంచి లోన్ తీసుకోలేరు. అయితే మీ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత అడ్వాన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే.. దాన్ని తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ పీఎఫ్ విత్డ్రా చేసుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇల్లు కొనుగోలు చేయడం, పెళ్లి చేసుకోవడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంత శాతం తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. అయితే ఖాతాలో ఉన్న మొత్తం తీసుకోలేరు. దీనిని గుర్తుంచుకోవాలి.యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.
ఎక్కువ జీతాలొచ్చేవారికి ఐటీ నోటీసులు!!
భారీ జీతాలు పొందుతున్న కొంతమంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘నడ్జ్’ నోటీసులు అందుతున్నాయి. వెల్లడించని ఆస్తి ఆదాయం, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆదాయం వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు వీటిని జారీ చేస్తున్నారు. కఠిన చర్యలకు ముందుగా స్వచ్ఛందంగా తప్పులు సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు పన్ను చెల్లింపుదారులు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు వినియోగిస్తున్న నమూనాను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.బహుళజాతి సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ సూచనలు పంపినట్లు తెలిసింది. జరిమానాలు విధించే ముందు లోపాలను సవరించుకోవాలని శాఖ కోరుతోంది.ఈ అంశాల్లో వ్యత్యాసాలువిదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని ప్రకటించకపోవడం, స్టాక్-లింక్డ్ ప్రోత్సాహకాలను తక్కువగా చూపించడం, గృహ, ప్రయాణ భత్యాలను పెంచి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ క్లయింట్ల నుంచి క్రిప్టో రూపంలో ద్వితీయ వేతనాలు పొందడం, గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇవ్వడం వంటి వ్యత్యాసాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.డేటా విశ్లేషణతో గుర్తింపుప్రస్తుత అసెస్మెంట్ సైకిల్లో అధిక ఆదాయ వర్గాల ఐటీఆర్లను తీవ్రంగా సమీక్షించినప్పుడు ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ‘గైడ్ అండ్ ఎనేబుల్’ (నడ్జ్) ప్రచారంలో భాగంగా సవరించిన ఐటీఆర్లు దాఖలు చేయాలని శాఖ సూచిస్తోంది.ఆటోమేటెడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లు, పాన్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా విదేశీ లావాదేవీల సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున తక్కువగా నివేదించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.నడ్జ్ నోటీసు అంటే ఏమిటి?ఇది డీఐఎన్ నంబర్తో కూడిన అధికారిక నోటీసు కాదు. కేవలం లోపాలు ఉన్నాయేమో పరిశీలించమనే సూచన మాత్రమే. ఐటీఆర్లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనని నమ్మకం ఉంటే, డీఐఎన్ నంబర్తో అధికారిక నోటీసు అందే వరకు ఆందోళన అవసరం లేదు.డేటా అనలిటిక్స్ ఆధారంగా ఐటీఆర్లో చూపిన ఆదాయం, టీడీఎస్ వివరాలు, ఇతర లావాదేవీ డేటా మధ్య వ్యత్యాసాలు గుర్తించబడుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా చెబుతున్నారు.ట్యాక్స్ పేయర్స్ ఏం చేయాలంటే..సంబంధిత ఆర్థిక సంవత్సరాల రిటర్నులను సమీక్షించాలిపూర్తి లావాదేవీ వివరాలు సేకరించాలిఅవసరమైతే సెక్షన్ 139(8A) కింద నవీకరించిన రిటర్న్ (ఐటీఆర్-యు) దాఖలు చేయాలివడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాలిఇలా చేయడం ద్వారా తదుపరి విచారణ, జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?
ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మెరుగైన రాబడులకు మార్గం
ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్ ఫండ్స్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఒకటి.రాబడులుఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పెట్టుబడుల విధానంఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్క్యాప్స్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్ (ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. రియల్ ఎస్టెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్ చేయగా, రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.


