ప్రధాన వార్తలు
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. అయితే, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలిచే మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఈసారి రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు జీడీపీలో కేవలం 11.5% - 12.5% వద్దే స్థిరంగా ఉండటంతో (2004-2008లో ఇది 16% గా ఉండేది), ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పెట్టుబడులను పెంచాలని నిర్ణయించింది.అంకెలు పెరిగినా.. ఆందోళనలు?వ్యవసాయ శాఖకు కేటాయింపులు రూ.1.23 లక్షల కోట్లు నుంచి రూ. 1.30 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ప్రధానంగా.. పీఎం కిసాన్, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అయితే ఆర్థిక మంత్రి ప్రసంగంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య సంపద, వాల్నట్స్ వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించినప్పటికీ ప్రధాన పంటల రంగం, ఉద్యానవన రంగాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.దేశంలో విమానాశ్రయాలు, రహదారులు ప్రపంచ స్థాయికి చేరుకున్నా ఢిల్లీలోని ఆజాద్ పూర్ వంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధునీకరణకు బడ్జెట్ నుంచి ప్రత్యక్ష మద్దతు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిశోధన నిధుల్లో కోతవాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు, అధిక ఉత్పాదకత కోసం పరిశోధనలు అవసరమైన తరుణంలో వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్ఈ) నిధులు రూ.10280 కోట్ల నుంచి రూ.9967 కోట్లకు తగ్గాయి. ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’లో నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టత లేదు. మరోవైపు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) నిధులను రూ.1500 కోట్ల నుంచి రూ.2500 కోట్లుకు పెంచడం సానుకూల పరిణామం.ఇదీ చదవండి: పౌరుల గోప్యతను హరించకూడదు: సుప్రీంకోర్టు ఆగ్రహం
ఐఫోన్ క్రేజ్ అంతా ఇంతా కాదు!
దేశీయంగా ప్రీమియం ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ హవా కొనసాగుతోంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2025లో అమ్మకాల విలువపరంగా యాపిల్ మార్కెట్ వాటా 28 శాతానికి పెరిగింది. 2024లో ఇది 23 శాతంగా నమోదైంది. అమ్మకాల పరిమాణంపరంగా వృద్ధి స్థిరంగానే ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు ఖరీదైన మోడల్స్ కోసం ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే ధోరణి పెరుగుతుండటంతో విలువపరంగా మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.ఐఫోన్ 16 సిరీస్ విజయవంతం కావడం, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ స్కీములు, ఎక్సే్చంజ్ ఆఫర్లు మొదలైన అంశాల కారణంగా 2025లో 28 శాతం వాటాతో మార్కెట్పై యాపిల్ ఆధిపత్యం దక్కించుకుంది. పండుగల సందర్భంగా ప్రచార కార్యక్రమాలు, నెట్వర్క్ను భారీగా విస్తరించడం కూడా ఇందుకు దోహదపడ్డాయి. నివేదిక ప్రకారం 2025లో దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ పరిమాణంపరంగా 1 శాతం, విలువపరంగా 8 శాతం వృద్ధి చెందింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలుగతేడాది ఆఫ్లైన్ రిటైల్ మార్కెట్లో పరిమాణంపరంగా 40 శాతం స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఫైనాన్సింగ్ మార్గంలో జరిగాయి. రూ. 30,000కు పైన ఉండే ప్రీమియం సెగ్మెంట్లో మూడింట రెండొంతుల విక్రయాలు రుణాల రూపంలో నమోదయ్యాయి. కస్టమర్లు ఖరీదైన డివైజ్లకు అప్గ్రేడ్ కావడంలో ఈఎంఐ ఆప్షన్లు కీలక పాత్ర పోషిస్తుండటాన్ని ఇది సూచిస్తోంది. గతంలో దేశీ మార్కెట్ వృద్ధికి ఎంట్రీ, బడ్జెట్ సెగ్మెంట్ల ఫోన్లు ప్రధాన చోదకాలుగా ఉండేవి. కానీ ప్రీమియమైజేషన్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటంతో ప్రీమియం ఫోన్ల విభాగం ఈ రెండు సెగ్మెంట్లకు మించి వృద్ధి చెందుతోంది.గతేడాది రూ. 30,000 పైగా ఖరీదు చేసే ప్రీమియం సెగ్మెంట్ అత్యధికంగా వృద్ధి చెందింది. ఫోల్డబుల్ సెగ్మెంట్లో పరిమాణంపరంగా 88 శాతం మార్కెట్ వాటా, వార్షికంగా 28 శాతం వృద్ధితో శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది.వాల్యూమ్స్పరంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్గా మోటరోలా (54 శాతం వృద్ధి), సబ్–బ్రాండ్గా సీఎంఎఫ్ (83 శాతం వృద్ధి) నిల్చాయి.2026లో విలువపరంగా మార్కెట్ విస్తరణకు ప్రీమియం ఉత్పత్తులే దోహదపడనున్నాయి. ఎంట్రీ లెవెల్ విభాగంపై ఒత్తిడి కొనసాగనుంది.మెమొరీ, విడిభాగాల వ్యయాలు పెరిగి, డిమాండ్ తగ్గడం వల్ల 2026లో అమ్మకాల పరిమాణం నెమ్మదించనుంది. రూ. 15,000 లోపు సెగ్మెంట్లో ఇది ఎక్కువగా కనిపించవచ్చు. ధరలు సగటున 5–7 శాతం వృద్ధి చెందనున్నాయి.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
పౌరుల గోప్యతను హరించకూడదు: సుప్రీంకోర్టు ఆగ్రహం
సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది.సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గంవాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కేసు నేపథ్యం ఏమిటి?2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.కేసు పరిధి విస్తరణఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
పీఎఫ్, ఈఎస్ఐ విరాళాల చెల్లింపులో ఊరట
వ్యాపార యజమానులకు, సంస్థలకు భారీ ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్), ఈఎస్ఐ (ఈఎస్ఐ) వంటి సంక్షేమ నిధుల విరాళాల విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలిస్తూ ‘ఫైనాన్స్ బిల్లు 2025’లో కీలక ప్రతిపాదనలు చేసింది.ప్రస్తుత సవాలు.. సుప్రీంకోర్టు తీర్పుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం యజమానులు తమ ఉద్యోగుల నుంచి సేకరించిన పీఎఫ్, ఈఎస్ఐ చందాలను సంబంధిత చట్టాలు నిర్దేశించిన గడువులోపే (సాధారణంగా నెల ముగిసిన 15 రోజుల్లోపు) జమ చేయాలి. ఒకవేళ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్ చేసే అవకాశాన్ని యజమానులు కోల్పోతారు. దీనిపై సుదీర్ఘకాలం సాగిన వివాదానికి సుప్రీంకోర్టు గతంలో తీర్పునిస్తూ నిర్దేశిత గడువు దాటితే పన్ను ప్రయోజనం పొందేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఇది యజమానులకు ఆర్థికంగా అదనపు భారాన్ని కలిగిస్తోంది.ప్రతిపాదిత మార్పు.. సెక్షన్ 29 సవరణతాజాగా ఫైనాన్స్ బిల్లులో ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 29కి సవరణను ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ఇకపై ఉద్యోగుల విరాళాల తగ్గింపును క్లెయిమ్ చేయడానికి గడువు తేదీని, ఆయా సంస్థల ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే గడువు తేదీతో అనుసంధానిస్తారు. సంబంధిత సంక్షేమ చట్టాల ప్రకారం గడువు తేదీ దాటినప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే లోపు ఆ మొత్తాన్ని జమ చేస్తే యజమానులు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.నిపుణుల విశ్లేషణఈ మార్పుపై సుప్రీంకోర్టు న్యాయవాది దీపక్ జోషి స్పందిస్తూ ‘ప్రస్తుతం యజమానులు అత్యంత కఠినమైన ప్రమాణాలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఐటీ రిటర్న్ దాఖలు చేసేలోపు విరాళాలు చెల్లించినా మినహాయింపు దక్కేది కాదు. కానీ ఈ ప్రతిపాదిత సవరణ వల్ల కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ, రిటర్న్ ఫైలింగ్ లోపు చెల్లింపు పూర్తి చేస్తే యజమానులకు మినహాయింపు లభిస్తుంది’ అని వివరించారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనవసరమైన కోర్టు వ్యాజ్యాలు తగ్గడమే కాకుండా వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కానుంది. చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల లేదా నగదు కొరత వల్ల చెల్లింపులు ఆలస్యమైనా యజమానులు శాశ్వతంగా పన్ను ప్రయోజనాలు కోల్పోకుండా ఈ సవరణ రక్షణ కల్పిస్తుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
దిగొస్తున్న కనకం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
రెవెన్యూ గ్రాంట్ల ముగింపుతో రాష్ట్రాలపై ప్రభావం?
రాష్ట్రాలకు ఇంతకాలంగా అందిస్తున్న రెవెన్యూ లోటు గ్రాంట్లను నిలిపివేయాలంటూ 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపించదని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి వి.ఉల్నమ్ స్పష్టం చేశారు. కేవలం కొన్ని రాష్ట్రాలే ప్రస్తుతం ఈ గ్రాంట్ను అందుకుంటున్నాయంటూ, 2025–26లో రూ.13,000 కోట్లకు తగ్గిపోయినట్టు చెప్పారు.వాస్తవానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఇది 2025–26తో నిలిచిపోవాలన్నారు. రెవెన్యూలోటు గ్రాంట్ను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లాలని 15వ ఆర్థిక సంఘం సూచించినట్టు గుర్తు చేస్తూ ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.13 వేల కోట్లకు పరిమితం అవుతున్నట్టు చెప్పారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు కేంద్రం పన్నుల్లో 41 శాతాన్ని రాష్ట్రాలకు వాటా కింద పంపిణీ చేయాలంటూ అరవింద్ పనగరియా అధ్యక్షతన గల 16వ ఆర్థిక సంఘం సూచించడం తెలిసిందే.వికేంద్రీకరణ అనంతరం రెవెన్యూ లోటు గ్రాంట్లను ఎత్తివేసి, స్థానిక సంస్థలకు అందించే నిధులను రెట్టింపు చేయాలని సిఫారసు చేసింది.ఆర్థిక సంఘం వికేంద్రీకరణ సూత్రం ప్రకారం రాష్ట్రాల పన్నుల వాటా రూ.14 లక్షల కోట్లుగా ఉంటుందని ఉల్నమ్ తెలిపారు. గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా కూడా కలుపుకుంటే ఈ మొత్తం రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
కార్పొరేట్
ఐఫోన్ క్రేజ్ అంతా ఇంతా కాదు!
పీఎఫ్సీ, ఆర్ఈసీ విలీనం
ఫారిన్ నుంచి ఇక ఎక్కువ తెచ్చుకోవచ్చు..!
సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్
ఇక ఇండియన్ ఐటీ పరిశ్రమదే కీలక పాత్ర
ఈవీలపై గుడ్ న్యూస్.. తగ్గనున్న ధరలు
జియో-బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్
ఓవర్టైమ్ వర్క్.. మొబైల్ ఫోన్ చూస్తుండగా..
ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్..
ఎన్బీఎఫ్సీ బంగారం రుణాలు పెరుగుదల
ఎస్టీటీ పెంపు.. ఇన్వెస్టర్ల జేబుకు చిల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్ట...
15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొత్తం 15 సార్లు క...
బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన తరువాత.. బంగారం...
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా క...
న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం
దేశవ్యాప్తంగా ఉన్న కింది స్థాయి కోర్టులను (సబార్డి...
కొత్తగా రూ.17.2 లక్షల కోట్ల రుణాలు
రానున్న ఆర్థిక సంవత్సరానికి (2026–27) కేంద్ర సర్కా...
డిజిన్వెస్ట్మెంట్ @ రూ.80,000 కోట్లు
ఏప్రిల్1 నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్...
కూ.. చుక్చుక్! ష్.. గప్చుప్
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐపై నమ్మకం కల్పించమే ప్రధానం
భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థపై నమ్మకాన్ని అందించే సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ సంస్థ థింక్360.ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఇండియా డిజిటల్ రంగంలో ఇప్పటికే ఆధార్, యూపీఐ, డేటా షేరింగ్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అమిత్ దాస్ గుర్తు చేశారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. డిసెంబర్ 2025లోనే యూపీఐ ద్వారా 21.6 బిలియన్ లావాదేవీలు జరగడం, వాటి విలువ సుమారు రూ.28 లక్షల కోట్లకు చేరడం భారత్ సాధించిన డిజిటల్ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.ఈ విజయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో ఏఐపై నమ్మకాన్ని పెంపొందించే విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది ఏఐ వ్యవస్థలను ప్రామాణీకరించడం, ఆడిట్ చేయడం, ఫలితాలను పారదర్శకంగా పర్యవేక్షించడం ద్వారా వ్యవస్థాగత ప్రమాదాలను తగ్గిస్తుందని వివరించారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్వికసిత్ భారత్ 2047‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం పైలట్ ప్రాజెక్టులు సరిపోవని, ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థల మూలాల్లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని దాస్ స్పష్టం చేశారు. నవంబర్ 2025లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ నోటిఫై చేయడాన్ని ఆయన స్వాగతించారు. 18 నెలల అనుసరణ గడువు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 2026లో ఈ క్రింది అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు.డేటా గోప్యతను కాపాడే సాంకేతికత అభివృద్ధి.పౌరుల అనుమతితో కూడిన డేటా నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు.బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్) రంగంలో సంస్కరణలు.
బియ్యం అందించే ఏటీఎం: దీని గురించి తెలుసా?
ఏటీఎం అంటే అందరికీ తెలిసింది డబ్బులు విత్డ్రా చేసుకునే మెషిన్ అని మాత్రమే. కానీ ఇకపై ధాన్యం కూడా ఏటీఎం నుంచి వస్తాయి. ఇప్పటికే ఇలాంటి ఏటీఎంలను బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది. ఇందులో ఏమేమి వస్తాయి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ కింద, బీహార్ ప్రభుత్వం పాట్నాలో మూడు ధాన్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. నిజానికి మనదేశంలో మొట్టమొదటి ధాన్యం ATM.. 2024 ఆగస్టులో ఒడిశా రాజధాని భువనేశ్వర్లో మొదలైంది. ఇప్పుడు బీహార్లో కూడా ఈ ప్రయోగం ప్రారంభించనున్నారు.ధాన్యం ATM అనేది పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రం. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల ద్వారా తమను తాము ధృవీకరించుకుంటారు. ఆ తరువాత బియ్యం, గోధుమలు వంటి అవసరమైన ధాన్యం సెలక్ట్ చేసుకుంటారు. ఎంపిక చేసుకున్నదాన్ని బట్టి.. ఆ మెషిన్ ధాన్యం అందిస్తుంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా డిజిటల్గా పూర్తవుతాయి.ఒక ధాన్యం ATM ఐదు నిమిషాల్లో 50 కిలోల వరకు ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. గంటకు కేవలం 0.6 వాట్స్ విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. సోలార్ ఫలకాలు & ఇన్వర్టర్లతో కూడా నడిచే విధంగా వీటిని రూపొందించారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.బీహార్లో ప్రస్తుతం 8.5 కోట్లకు పైగా PDS లబ్ధిదారులు ఉన్నారు. 50,000కి పైగా రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ధాన్యం ATMలు ప్రవేశపెట్టడం వల్ల అక్రమ రవాణా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లు తక్కువ ధాన్యం ఇవ్వడం.. లేదా బ్లాక్ మార్కెట్లో అమ్మడం వంటి సమస్యలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని నిపుణుల అభిప్రాయం.
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్: 10,001 mAh బ్యాటరీతో..
స్మార్ట్ఫోన్ వినియోగదారులతో చాలామందికి ఎదురయ్యేది ఛార్జింగ్ సమస్యే. దీనికి చెక్ పెట్టడానికి రియల్మీ (Realme) లేటెస్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఏకంగా 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర ఎంత?, డెలివరీలు ఎప్పుడు అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.రియల్మీ లాంచ్ చేసిన ఎక్కువ బ్యాటరీ పవర్ కలిగిన స్మార్ట్ఫోన్ పేరు 'పీ4 పవర్ 5జీ'. ఇది 6.78 అంగుళాల 4డి కర్వ్⁺ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ & 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో 12 జిబి వరకు ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్తో లభించే ఈ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి 5 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.ట్రాన్స్ఆరెంజ్, ట్రాన్స్సిల్వర్, ట్రాన్స్బ్లూ ఎంపికలలో లభించే రియల్మీ పీ4 పవర్ 5జీ మొబైల్.. 8 జీబీ/ 128 జీబీ ధర రూ. 25,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ / 256 జీబీ ధర రూ. 27,999 &12 జీబీ / 256 జీబీ ధర రూ. 30,999. ఇది పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ.. 219 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!
భారతదేశంలోకి ప్రముఖ టెలికాం కంపెనీ 'ఎయిర్టెల్'.. ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా.. తన 36 కోట్ల వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్ఫామ్ అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium)ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం అనేది కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే కాకుండా.. బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్టెల్ యూజర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.. ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ అనేది.. అడోబ్ రూపొందించిన ఒక సులభమైన, వేగవంతమైన క్రియేట్ ఎనీథింగ్ యాప్. డిజైన్ అనుభవం లేకపోయినా, ఎవరికైనా ప్రొఫెషనల్ స్థాయి పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్, వీడియోలు, ఆహ్వాన పత్రికలు, మార్కెటింగ్ మెటీరియల్ రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న AI ఆధారిత ఫీచర్లు పనిని మరింత వేగంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ట్లో లాగిన్ అయి ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు తమ మాతృభాషలోనే డిజైన్ చేయగలుగుతారు. పండుగ శుభాకాంక్షలు, పెళ్లి ఆహ్వానాలు, వాట్సాప్ స్టేటస్లు, స్థానిక దుకాణాల ప్రమోషన్లు అన్నీ సులభంగా రూపొందించవచ్చు.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఅడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ద్వారా.. కంటెంట్ క్రియేటర్లు & ఇన్ఫ్లూయెన్సర్లు.. రీల్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, వైరల్ కంటెంట్ సులభంగా తయారు చేయవచ్చు. సాధారణ వినియోగదారులు పండుగ శుభాకాంక్షలు, వ్యక్తిగత ఆహ్వానాలు పంపుకోవచ్చు. విద్యార్థులు ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, పోర్ట్ఫోలియోలు రూపొందించవచ్చు. చిన్న వ్యాపారులు లోగోలు, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రకటనలు నిమిషాల్లో రూపొందించవచ్చు.You x Us x @adobeexpress - collab of the year!Casually unlocking the quick & easy design app worth ₹4000 for all of you.#EveryoneCanDesign #MadeWithAdobeExpress #AirtelXAdobe pic.twitter.com/JmCHG4tvgE— airtel India (@airtelindia) January 29, 2026
పర్సనల్ ఫైనాన్స్
Income Tax: బినామీ వ్యవహారాల జోలికెళ్లొద్దు..
బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు. అధికారుల అధికారాలు ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే... (1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం. ఇంకా ఏం చేస్తారు నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.ఆద్యులెవరు .. ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.నోటీసు ప్రక్రియ.. నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్ కోడ్ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్మెంట్ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.ఈ రెండు చట్టాలు–చుట్టాలు .. అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్కంటాక్స్ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్ చేయని ఆస్తులు.. డిక్లేర్ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్మెంట్ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్ చేస్తారు. వారి వలలో పడకండి!
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్కు, స్టాక్ మార్కెట్కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.


