ప్రధాన వార్తలు
వాట్సాప్ సబ్స్క్రిప్షన్ ప్లాన్.. ఫీచర్లు ఇవే..
వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ తరహాలోనే వాట్సాప్ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇకపై వాట్సాప్ వాడాలంటే డబ్బులు కట్టాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.కోర్ సర్వీసులు ఉచితంగానే..ముందుగా వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాట్సాప్ ప్లస్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీరు సాధారణంగా వాడుకునే వాట్సాప్ ఎప్పటికీ ఉచితంగానే ఉంటుంది. కంపెనీ తన ప్రధాన ఫంక్షనాలిటీలో ఎలాంటి మార్పులు చేయడం లేదు.మెసేజింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఫైల్ షేరింగ్, డాక్యుమెంట్లు, ఫొటోలు పంపడం వంటి సర్వీసులు యథాతథంగా ఉచితంగానే అందుతాయి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కేవలం ఫీచర్లు కావాలనుకునే వారి కోసం మాత్రమేనని కంపెనీ తెలిపింది.వాట్సాప్ ప్లస్లో స్పెషల్ ఫీచర్లుప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పెయిడ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు ఈ కింది ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు.ఫీచర్వివరణచాట్ పిన్సాధారణంగా 3 చాట్లు మాత్రమే పిన్ చేయగలం, కానీ ఇందులో 20 చాట్ల వరకు పిన్ చేయవచ్చు.కస్టమైజేషన్యాప్ ఐకాన్ రంగులు, ట్యాబ్లు, బటన్లు మార్చుకునే సౌలభ్యం.థీమ్స్, స్టిక్కర్స్ఎక్స్క్లూజివ్ థీమ్స్, స్పెషల్ స్టిక్కర్ ప్యాక్స్.రింగ్టోన్స్కాంటాక్ట్స్ కోసం కస్టమ్ రింగ్టోన్స్ సెట్ చేసుకునే ఆప్షన్.రియాక్షన్స్మెసేజ్ రియాక్షన్ల రంగులను మార్చుకునే వెసులుబాటు. ఎప్పుడు వస్తుంది? ధర ఎంత?ప్రస్తుతం ఈ వాట్సాప్ ప్లస్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. దీని ధర ఎంత ఉంటుంది లేదా ఏ తేదీన అధికారికంగా లాంచ్ చేస్తారు అనే విషయాలపై మెటా(వాట్సాప్ మాతృ సంస్థ) ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాబోయే కొద్ది రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
డిజిటల్ మోసాల బాధితులకు ఊరట
డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో శరవేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అనధికార లావాదేవీల వల్ల నష్టపోయే వినియోగదారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కస్టమర్ బాధ్యత (కస్టమర్ లయబిలిటీ) ఫ్రేమ్వర్క్లో సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్బీఐ ముసాయిదా జారీ చేసింది.ముసాయిదాలోని ప్రధానాంశాలుమోసపూరిత లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకులు స్పందించే సమయాన్ని భారీగా తగ్గించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న జాప్యాన్ని తగ్గించి నిర్ణీత కాలవ్యవధిలోగా సమస్యను పరిష్కరించేలా నిబంధనలను కఠినతరం చేశారు.2017లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నిబంధనలు అప్పటి డిజిటల్ వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మారిన టెక్నాలజీ నేపథ్యంలో కొత్త తరహా మోసాలను కూడా ఈ పరిధిలోకి చేర్చారు.తక్కువ విలువ గల మోసపూరిత లావాదేవీల విషయంలో వినియోగదారులకు వేగంగా నగదు వాపసు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రతిపాదించారు.భవిష్యత్తులో మోసాలకు సంబంధించి బ్యాంకులు భరించే పరిహారం వాటాను పెంచే దిశగా ఆర్బీఐ యోచిస్తోంది.ఎందుకు ఈ మార్పు?గత ఎనిమిదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు సైతం సరికొత్త పద్ధతుల్లో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. ఫిబ్రవరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రకటించిన విధంగానే ఆర్బీఐ ఈ సమీక్షా ప్రక్రియను చేపట్టింది. ‘2017 నుంచి డిజిటల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత సవరణలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా మారుస్తాయి’ అని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు.ఈ కొత్త మార్గదర్శకాలపై వాటాదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఏప్రిల్ 6, 2026 లోపు సమర్పించాలని ఆర్బీఐ కోరింది. కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పరిహార ఏర్పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా నిబంధనలను మరింత సమీక్షించనున్నారు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
ఈ-కామర్స్ సర్వీసులు అందిస్తున్న ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్ష తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాల్మార్ట్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ త్వరలో రానున్న పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఉద్యోగ కోతలపై ఫ్లిప్కార్ట్ అధికారికంగా స్పందిస్తూ, ఇది ఒక సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేసింది. ‘ఫ్లిప్కార్ట్లో స్పష్టంగా నిర్వచించిన అంచనాలకు అనుగుణంగా రెగ్యులర్ పనితీరు సమీక్షలను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియలో భాగంగా కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వెళ్లవచ్చు. ఇందులో ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తున్నాం’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్లో ఫ్లిప్కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేసింది.నష్టాలున్నా.. పెరిగిన ఆదాయంబిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ‘టోఫ్లర్’ డేటా ప్రకారం ఫ్లిప్కార్ట్ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.5,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.3 శాతం వృద్ధి చెంది రూ.82,787.3 కోట్లకు చేరింది (గత ఏడాది ఇది రూ.70,541.9 కోట్లు). మొత్తం ఖర్చులు 17.4 శాతం పెరిగి రూ.88,121.4 కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా స్టాక్ కొనుగోళ్ల వ్యయం పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ఇదీ చదవండి: రష్యా చమురు కొనుగోలుకు యూఎస్ ఓకే
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్ డిజిటల్ విధులను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్విస్ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ఫైనాన్షియల్..ఇన్వెస్ట్మెంట్ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది. మరోవైపు, వంటవాళ్లు, మోటార్సైకిల్ మెకానిక్లు, లైఫ్గార్డ్లు, బార్టెండర్లు, డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్స్లాంటి మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
చమురు సలసల.. మార్కెట్ విలవిల!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ భయాలు, ముడిచమురు ధరల సెగ కలగలసి మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దీంతో సెన్సెక్స్ 79,000 పాయింట్ల స్థాయిని కోల్పోగా.. నిఫ్టీ 24,500 పాయింట్ల దిగువన స్థిరపడింది. ముంబై: ముడిచమురు ధరలు మండుతుండటంతో దిగుమతుల బిల్లు పెరగడంతోపాటు.. రూపాయి బలహీనపడనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆపై యూరోపియన్ మార్కెట్ల క్షీణతతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 1,097 పాయింట్లు పతనమై 78,919 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్ల (ఫ్యూచర్స్) నష్టాలు, క్రూడ్ భగభగలు సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో మిడ్సెషన్ నుంచీ మార్కెట్లు మరింత నీరసించాయి. చివరి సెషన్లో సెన్సెక్స్ 78,812 వద్ద, నిఫ్టీ 24,416 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.బ్యాంకులు బోర్లా: ఎన్ఎస్ఈలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులుసహా రియల్టీ ఇండెక్స్ 2 శాతం క్షీణించింది. ఆటో 1 శాతం నీరసించగా.. కెమికల్స్, ఐటీ నామమాత్రంగా బలపడ్డాయి. ప్రయివేట్ బ్యాంకులలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఆర్బీఎల్, ఇండస్ఇండ్, కొటక్ 3–1.5 శాతం మధ్య నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఎస్బీఐ, బీవోబీ, కెనరా, మహారాష్ట్ర, ఐవోబీ 3–1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే బీఈఎల్, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ 2.5–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. షేర్లపై చమురు ఎఫెక్ట్: చమురు సెగ ప్రభావంతో ఇంధన మార్కెటింగ్ దిగ్గజాలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ 3–1.7% మధ్య నీరసించాయి. → పెయింట్ల విభాగంలో ఇండిగో, కన్సాయ్ నెరోలాక్, అక్సో నోబెల్ 3.4–2.5 శాతం మధ్య పతనమయ్యాయి. → ఏటీఎఫ్ భయాలతో విమానయాన దిగ్గజం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 2.4 శాతం నష్టపోయింది. → ముడిసరుకుల ధరల ఆందోళనతో టైర్ల కంపెనీలలో టీవీఎస్ శ్రీచక్ర, అపోలో, ఎంఆర్ఎఫ్ 3–1 శాతం మధ్య క్షీణించాయి.డిఫెన్స్ సేఫ్..: యుద్ధ భయాల నేపథ్యంలో రక్షణ రంగ షేర్లు.. భారత్ డైనమిక్స్(బీడీఎల్), గార్డెన్ రీచ్, మజ్గావ్ డాక్, పారస్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్, హెచ్ఏఎల్, డేటా ప్యాటర్న్స్, కొచిన్ షిప్, మిధానీ 6–3.3% మధ్య జంప్చేసింది. వెరసి ఎన్ఎస్ఈ డిఫెన్స్ ఇండెక్స్ 2.8% ఎగసింది. కారణాలివీ...: పశ్చిమాసియాలో దాడులతో చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం కలగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. క్రూడ్ మంటతో వాణిజ్య లోటు పెరగడంతోపాటు, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనున్నట్లు నిపుణులు తెలిపారు. దేశీ కరెన్సీ మరింత బలహీనపడనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ పరపతి విధానాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నట్లు వివరించారు. చమురు ధరలు పలు రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలున్నట్లు పేర్కొన్నారు.12 శాతం జంప్ చేసిన క్రూడ్రాత్రి 11.30 సమయంలో న్యూయార్క్లో నైమెక్స్ చమురు 14% జంప్చేసి 92.5 డాలర్లకు చేరింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 11 శాతం ఎగసి 94.5 డాలర్లను దాటింది. ఇవి మరింత బలపడితే ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై సోమవారం(9న) కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క యూఎస్ ఇండెక్సులు సైతం 1 శాతం పైగా క్షీణించి ట్రేడవుతున్నాయి.
రూపాయి, ఇంధన రేట్లపై పశ్చిమాసియా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నివేదికలో హెచ్చరించింది. పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంలాంటి అంశాలు కూడా దీనికి తోడైతే రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చని ఫిబ్రవరికి సంబంధించిన నెలవారీ ఆర్థిక సమీక్షలో తెలిపింది. అయితే, క్రూడాయిల్ కోసం దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్నప్పటికీ భారత్ వద్ద తగినంత స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు తక్కువ స్థాయిలో కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం మొదలైన సానుకూలాంశాలు, పెరిగే చమురు ధరల ప్రతికూల ప్రభావం నుంచి రక్షణ కల్పించగలవని ఆర్థిక శాఖ తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ పటిష్టమైన వృద్ధి బాటలోనే ముందుకు సాగిందని పేర్కొంది.
కార్పొరేట్
ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
పేటీఎం తర్వాత మరో భారీ ఐపీవో.. ఫోన్పే ప్లాన్ ఇదే!
బంగారానికి భారీ డిస్కౌంట్.. ఎక్కడ.. ఎందుకు?
ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
అదీ ‘ఆర్థిక’ యుద్ధమే: రాబర్ట్ కియోసాకి
నౌకలు నిల్చిపోతే కీలక రంగాలపై ఎఫెక్ట్
అనిల్ అంబానీకి ఈడీ షాక్
యుద్ధ భయం.. బీమా ప్రీమియం ప్రియం
పల్లె మహిళల్లోనూ యూపీఐ పరిమళాలు
ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం
భారతీయ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్త...
మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!
దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగ...
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో క...
దలాల్ స్ట్రీట్లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్ట...
కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడంతో భారత వాణిజ్యంపై తీవ...
పెరిగిన కరెంట్ ఖాతా లోటు
కరెంటు ఖాతా లోటు డిసెంబర్ త్రైమాసికంలో 13.2 బిలియ...
ఆతిథ్యం అదరహో
ఆతిథ్య పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన పన...
వార్ ఎఫెక్ట్.. భారత్కు తప్పని ఇబ్బందులు!
అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
చాట్జీపీటీని బాయ్కాట్ చేసిన 25 లక్షల మంది!
అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్జీపీటీని బాయ్కాట్ చేసినట్లు పేర్కొంది.900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్వర్క్లో ఏఐ మోడల్ను అమలు చేయడానికి అనుమతి లభించింది.ఈ డీల్తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్సైట్ పేర్కొంది.ఇదిలా ఉండగా, సెన్సార్ టవర్ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్బాట్ యాప్, అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ చార్టుల్లో చాట్జీపీటీ యాప్ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్క్రంచ్ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్జీపీటీ మొబైల్ యాప్ యూఎస్లో అన్ఇన్స్టాల్ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్కామ్, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.రుణదాతల ఆందోళనఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్కామ్ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్ఫాల్ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.టెలికాం రంగంపై ఒత్తిడిభారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.రాబడులుఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంమంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్ను తరచూ మార్చదు. ఒక కౌంటర్లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లలో (రీట్)నూ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల సిలిండర్ కొత్త రేటు..
మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలురాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.గృహ ఎల్పీజీ రేట్లు యథాతథంఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.
ఇన్సూరెన్స్తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్ ఈక్విటీ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్ గ్లోబల్ ఇన్వెస్ట్ లాంటి యూనిట్ లింక్డ్ పథకాల ద్వారా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.ట్రస్ట్ ఎంఎఫ్ మిడ్క్యాప్ ఫండ్ ప్రధానంగా మిడ్–క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మిడ్ క్యాప్ ఫండ్ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్క్యాప్ 150 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్–క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్ రికార్డుతో ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్కిడ్ అష్యూర్, స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్ ప్లస్) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్... జాగ్రత్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్మిట్ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్మెంట్ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్ పేరు, అడ్రస్, పాన్.. మీకు ఓనర్కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్ ఆదాయాన్ని ట్రాక్ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్ చేత రిటర్ను వేయించండి.


