Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Hospitality industry raises single-window clearance for licences1
పర్యాటక రంగానికి జాతీయ బోర్డు ఉండాలి 

న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి కోసం నేషనల్‌ టూరిజం బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను పరిశ్రమల ప్రతినిధులు కోరారు. అలాగే, మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు నిధుల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. బడ్జెట్‌కు ముందు పర్యాటకం, ఆతిథ్య రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పర్యాటకం–ఆతిథ్యానికి అన్ని రాష్ట్రాలూ పరిశ్రమ హోదా కలి్పంచేందుకు సహకరించాలని.. దీనివల్ల అందుబాటు ధరలపై రుణాలను పొందడం సాధ్యపడుతుందని ఈ రంగాల ప్రతినిధులు కోరారు. కొన్ని రాష్ట్రాలు పరిశ్రమ హోదా ఇవ్వగా, మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండంతో పరిశ్రమ ప్రతినిధులు కేంద్రం సహకారాన్ని ఆశించారు. పరిశ్రమ హోదా లేకపోవడం, సమన్వయం లేని నియంత్రణలు వృద్ధికి అడ్డు పడుతున్నట్టు చెప్పారు. లైసెన్స్‌ల మంజూరు, హోటళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) దాఖలుకు వీలుగా సింగిల్‌ విండో అనుమతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, అసోసియేషన్‌ ఆఫ్‌ డొమెస్టిక్‌ టూర్‌ ఆపరేటర్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్, ఇండియా ఫుడ్‌ టూరిజం ఆర్గనైజేషన్, టూరిస్ట్‌ గైడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అడ్వెంచర్‌ టూర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, తదితర సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

5G subscriptions in India likely to cross one billion mark by 20312
100 కోట్లకు 5జీ కనెక్షన్లు 

న్యూఢిల్లీ: భారత్‌లో 2031 నాటికి 5జీ సబ్‌స్క్రిప్షన్స్‌ సంఖ్య 100 కోట్లకు చేరవచ్చని ఎరిక్సన్‌ మొబిలిటీ ఒక నివేదికలో అంచనా వేసింది. స్మార్ట్‌ఫోన్లలో డేటా వినియోగం గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా నెలకు 36 జీబీగా ఉన్న డేటా వినియోగం 2031 నాటికి 65 జీబీకి చేరనుందని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో 2025 ఆఖరు నాటికి 5జీ సబ్‌స్క్రిప్షన్లు 39.4 కోట్లకు చేరవచ్చని వివరించింది. మొత్తం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్స్‌లో వీటి వాటా 32 శాతంగా ఉంటుందని పేర్కొంది. అటు అంతర్జాతీయంగా కూడా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరతాయని, మొత్తం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్లలో వీటి వాటా మూడింట రెండొంతులుగా ఉంటుందని నివేదిక వివరించింది. భారత్‌లో డిజిటలీకరణను వేగవంతం చేసే దిశగా 5జీ ఇప్పటికే కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తోందని పేర్కొంది. అందుబాటు ధరలో 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సీపీఈ (ఫిక్సిడ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ కస్టమర్‌ ప్రిమిసెస్‌ ఎక్విప్‌మెంట్‌) లభ్యత, ఎఫ్‌డబ్ల్యూఏ యూజర్లు అత్యధికంగా డేటాను వినియోగిస్తుండటంలాంటి అంశాలు భారత్‌లో డేటా ట్రాఫిక్‌ వృద్ధికి దోహదపడుతున్నట్లు వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు... → 2031 నాటికి అంతర్జాతీయంగా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరనున్నాయి. ఇందులో 410 కోట్ల కనెక్షన్లు, ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలతో సంబంధం లేకుండా కేవలం 5జీ నెట్‌వర్క్‌పైనే పని చేస్తాయి. → 2024 మూడో త్రైమాసికం నుంచి 2025 మూడో త్రైమాసికం మధ్య కాలంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ డేటా ట్రాఫిక్‌ 20 శాతం పెరిగింది. 2031 వరకు ఇది వార్షిక ప్రాతిపదికన సగటున 16 శాతం మేర వృద్ధి చెందుతుంది. → 2024 ఆఖరు నాటికి గణాంకాలతో పోలిస్తే మొత్తం మొబైల్‌ డేటా వినియోగంలో 5జీ నెట్‌వర్క్‌ వాటా 34 శాతం నుంచి పెరిగి 43 శాతానికి చేరుతుంది. 2031 నాటికి ఇది 83 శాతానికి చేరుతుంది. → ఎఫ్‌డబ్ల్యూఏ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను వినియోగించుకునే వరి సంఖ్య 2031 ఆఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకి చేరుతుంది. → అంతర్జాతీయంగా 6జీ సబ్ర్‌స్కిప్షన్లు 2031 ఆఖరు నాటికి 18 కోట్లకు చేరతాయి. ఒకవేళ 6జీ ఆవిష్కరణలను మరింత ముందుగా తీసుకొస్తే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.

India TCS, TPG partner to invest 2 billion dollers in AI data centre joint venture3
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్‌

ముంబై: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం టీసీఎస్, పీఈ దిగ్గజం టీపీజీ డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు సంస్థల భాగస్వామ్యంలో ఇందుకు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. హైపర్‌వాల్ట్‌ పేరుతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు టీపీజీ బిలియన్‌ డాలర్లు(రూ. 8,870 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా భాగస్వామ్య వెంచర్‌లో 27.5–49 శాతం మధ్య వాటాను పొందనుంది. టీపీజీని వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వాటాదారులకు పటిష్ట రిటర్నులందించేందుకు వీలుంటుందని టీసీఎస్‌ పేర్కొంది. అంతేకాకుండా పెట్టుబడి అవసరాలు తగ్గడంతోపాటు.. డేటా సెంటర్‌ ప్లాట్‌ఫామ్‌కు దీర్ఘకాలిక విలువ చేకూరుతుందని తెలియజేసింది. డేటా సెంటర్లలోకి భారీస్థాయిలో ప్రవేశించనున్నట్లు గత నెలలో టీసీఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 6.5 బిలియన్‌ డాలర్లు దేశీయంగా 1 గిగావాట్‌ సామర్థ్య ఏర్పాటుకు 6.5 బిలియన్‌ డాలర్లు(రూ. 57,650 కోట్లు) వెచి్చంచనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది. వేగంగా పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా దేశంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు టీపీజీ భాగస్వామికావడం సంతోషకరమని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. దీంతో హైపర్‌స్కేలర్స్, ఏఐ కంపెనీలతో తమ భాగస్వామ్యం మరింత పటిష్టంకానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్‌M >గా.. 2030కల్లా 10 గిగావాట్లకు బలపడనున్నట్లు అంచనా. ఇప్పటివరకూ డేటా సెంటర్ల బిజినెస్‌ 94 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! టీసీఎస్‌ షేరు యథాతథంగా రూ. 3,146 వద్ద ముగిసింది.

India core infrastructure sector posted zero growth in October 20254
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌ 

న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్‌లో ఫ్లాట్‌గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది. ఎనిమిది కీలక రంగాలకు గాను పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌లో ఉత్పత్తి విస్తరించగా, బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గడంతో మొత్తం మీద పనితీరు ఫ్లాట్‌గా ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 3.3 శాతం పెరగ్గా, 2024 అక్టోబర్‌లోనూ 3.8 శాతం వృద్ధి కనిపించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. → అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం తగ్గింది. → విద్యుదుత్పత్తి సైతం 7.6%, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం మేర తక్కువ నమోదైంది. → ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం తగ్గింది. → పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 4.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. → ఎరువుల ఉత్పత్తి 7.4%, స్టీల్‌ ఉత్పత్తి 6.7%, సిమెంట్‌ ఉత్పత్తి 5.3 శాతం చొప్పున పెరిగింది. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి 2.5%కి పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.3%గా ఉండడం గమనార్హం. వర్షాల వల్లే..: అధిక వర్షాలతో మైనింగ్‌ కార్యకలాపాలపై, విద్యుత్‌ డిమాండ్‌పై అక్టోబర్‌లో ప్రభావం పడినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు. మౌలిక రంగంలో ఫ్లాట్‌ పనితీరు నేపథ్యంలో అక్టోబర్‌ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2.5–3.5% మధ్య పరిమితం కావొచ్చన్నారు.

Fujiyama Power Systems shares made a disappointing in share price 5
నిరాశపరిచిన ఫుజియామా పవర్‌ సిస్టమ్స్‌

ఇంటి పై కప్పు సౌర ఉత్పత్తుల తయారీ సంస్థ ఫుజియామా పవర్‌ సిస్టమ్స్‌ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.228)తో పోలిస్తే బీఎస్‌ఈలో 4% డిస్కౌంటుతో రూ.218 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% క్షీణించి రూ.205 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 9% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6,384 కోట్లుగా ఉంది.

Indian banks will feature in the top 100 global banks list says RBI Governor 6
గ్లోబల్‌ టాప్‌ 100లో...  మరిన్ని భారతీయ బ్యాంకులు 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టాప్‌ 100 బ్యాంకుల జాబితాలో త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు చోటు దక్కించుకోగలవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సేవలు విస్తరిస్తుండటం, బ్యాంకింగ్‌ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో చాలా బ్యాంకులు వేగంగా ఎదుగుతున్నాయి. వాటిలో నుంచి కొన్ని బ్యాంకులు కొద్ది కాలంలోనే ప్రపంచంలో టాప్‌ వంద బ్యాంకుల్లో చోటు దక్కించుకోగలవని భావిస్తున్నాను‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ (43వ ర్యాంకు), ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (73వ ర్యాంకు) మాత్రమే టాప్‌ 100 బ్యాంకుల్లో ఉన్నాయి. దేశానికి మరిన్ని భారీ స్థాయి బ్యాంకులు అవసరమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే చెప్పిన నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, డిజిటల్‌ మోసాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన మ్యూల్‌ హంటర్‌ సాధనం చాలా మంచి ఫలితాలను ఇస్తోందని మల్హోత్రా చెప్పారు. ఇది ప్రతి నెలా 20,000కు పైగా మ్యూల్‌ అకౌంట్లను గుర్తిస్తోందని వివరించారు. మోసపూరితంగా కాజేసిన నిధులను మళ్లించేందుకు ఉపయోగించే ఖాతాలను మ్యూల్‌ అకౌంట్లుగా వ్యవహరిస్తారు. వీటిని గుర్తించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌) మ్యూల్‌హంటర్‌డాట్‌ఏఐ పేరిట ఏఐ ఆధారిత సాధనాన్ని రూపొందించింది. డిజిటల్‌ మోసాలను అరికట్టడానికి హోంశాఖలో భాగమైన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)తో కలిసి పని చేయడంతో పాటు ఇతరత్రా పలు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. మనం చేయాల్సింది చేయాలి.. అంతే.. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ఫలితం గురించి ఆలోచించకుండా, మనం చేయాల్సినది చేయాలని, ఫలాలు వాటంతటవే లభిస్తాయని విద్యార్థులకు మల్హోత్రా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికన్‌ టెక్‌ దిగ్గజం, దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా ఎదగాలంటే ’కొన్ని చిట్కాలు’ చెప్పాలంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా ఈ మేరకు సమాధానమిచ్చారు. తాను విద్యాభ్యాసం చేసిన కాన్పూర్‌ ఐఐటీకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నే వచి్చందని, కర్మ సిద్ధాంతం గురించే చెప్పినట్లు ఆయన వివరించారు. అనిశ్చితే రూపాయి క్షీణతకు కారణం.. ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడానికి అమెరికా టారిఫ్‌ల వడ్డనతో నెలకొన్న వాణిజ్య అనిశి్చతులే కారణమని మల్హోత్రా చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్‌ వర్గాలే నిర్దేశిస్తాయి తప్ప దాన్ని నిర్దిష్ట స్థాయిలో నిలపాలని ఆర్‌బీఐ టార్గెట్‌ ఏదీ పెట్టుకోదని ఆయన తెలిపారు. డాలర్లకు డిమాండ్‌ పెరిగితే రూపాయి తగ్గుతుందని, అలాగే రూపాయికి డిమాండ్‌ పెరిగితే డాలర్లకు డిమాండ్‌ తగ్గుతుందని పేర్కొన్నారు. అమెరికాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, కరెంట్‌ అకౌంట్‌పై నెలకొన్న ఒత్తిడి తొలగిపోతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement