breaking news
Chittoor
-
ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి.. కేంద్రం సానుకూలం
ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్ ఏర్పాటు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వకంగా ఎంపీ గురుమూర్తికి సమాధానమిచ్చారు.ఈ ఏడాది మే నెలలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను నెలకొల్పాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని నైలెట్కు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్ అందిన వెంటనే కేంద్ర మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.అదే విధంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అందిందని, ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిని సమాచార సాంకేతిక, సైబర్ భద్రతా విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేసిన ఎంపీ, ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే తిరుపతి యువతకు ఉన్నత స్థాయి సాంకేతిక విద్య, శిక్షణ అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా అరెస్ట్
పలమనేరు: కేరళ పోలీసులమంటూ పలమనేరు సమీపంలో హల్చ్ల్ చేసి ఆన్లైన్ ఇంటర్నేషనల్ ట్రేడర్ ఎంసీ రవి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన ముఠాను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంగవరానికి చెందిన ఎంసీ రవి పలుదేశాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. బెంగళూరులో ఉంటూ తరచూ ఇక్కడికి వచ్చి వెళుతుంటాడు. ఈనేపథ్యంలో ఈ నెల 7న తన స్వగ్రామంలో జరిగిన గంగజాతరకు వచ్చి స్నేహితులతో కలిసి పలమనేరు మండలంలోని ఓ మామిడి తోటలో విందు పెట్టుకున్నారు. కొందరు పలమనేరు పట్టణ సమీపంలోని టి.వడ్డూరు వద్ద అతని కారును అడ్డగించి కేరళ పోలీసులమంటూ కారులోకి ఎక్కించుకుని బేడీలు వేసి తీసుకెళ్లారు. అతని సెల్ఫోన్లోని సిమ్ను తీసేశారు. రూ.రెండు కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. కుటుంబ సభ్యులకు వేరే ఫోన్ల తో మాట్లాడించారు. ఈ నెల 8న చిక్బళ్లాపూ ర్ హైవేలో బాధితుని బంధువు నుంచి రూ. కోటి నగదు తీసుకున్నారు. బాధితుడు మెడలో ఉన్న 900 గ్రాము ల బంగారు చైన్లను లాక్కుని అతన్ని వదిలిపెట్టి కార్లలో ఉడాయించారు. దీనిపై బాధితుడు ఈ నెల 12న స్థానిక పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారా లు, సీసీటీవీ పుటేజీలు, కాల్డేటా, వాహనా ల కదలికల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే కారణం కేరళ రాష్ట్రానికి చెందిన రోషన్ గ్యాంగ్ ఏపీ, తెలంగాణా వారితో కలిసి కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. పలమనేరు కోర్టులో ఓ ఐపీ కేసుకు సంబందించి రవికి, సంకరి మహేష్ నాయుడుకు మధ్య వివాదం ఉంది. ఈ క్రమంలో మహేష్నాయుడు ఏలూరు జిల్లా ద్వారక తిరుమలకు చెందిన భానుప్రకాష్ను సంప్రదించాడు. అతను కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాఽగేశ్వర్రెడ్డి (ప్రైవేట్ డిటెక్టివ్గా చెప్పుకొనే) కలిసి రవి కిడ్నాప్నకు పథకం వేసినట్టు తేలింది. దీంతో నాగేశ్వర్రెడ్డి కేరళకు చెందిన రోషన్ వర్గీస్ ముఠాను సంప్రదించి సొంతూరులో పండక్కి వచ్చిన రవిని కేరళ పోలీసులమంటూ ఆరు కార్లలో వచ్చిన 25 మంది రోడ్డుపైనే పట్టపగలే కిడ్నాప్ చేశారు. 11 మంది నిందితుల అరెస్ట్ ఈ కేసులో కేరళకు చెందిన అప్పు అరుణ్, ఎడ్విన్ థామస్, దీపుమోన్, నితిన్జానీ, అభయ్, రతీష్, లిబిన్, కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాగేశ్వర్రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన పందేళ్లపల్లి రామిరెడ్డి, గుండ్రా మహేశ్వర్రెడ్డి, తెలంగాణ రాష్ట్రం పనపర్తి జిల్లాకు చెందిన సుంకరి మహేష్ నాయుడును అరెస్ట్ చేశారు. వీరినుంచి మూడు కార్లు, రూ.22 లక్షల నగదు రికవరి చేశారు. పోలీసుల హ్యాండ్ కప్స్, 12 మొబైల్ ఫోన్లు, పోలీసుల నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న కేరళకు చెందిన రోషన్ వర్గీస్, సచూ, అనూప్, నికిల్మోహన్, స్వాజి, అరుణ్, సామ్, అమీన్, ద్వారకా తిరుమలకు చెందిన భానుప్రకాష్, పులివెందులకు చెందిన ప్రణీత్రెడ్డి, జస్వంత్, అనిల్, కృష్ణారెడ్డి, మరో వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రవి ఇక్కడే ఉన్నాడనే సమాచారం ఇచ్చిన వారిపై కూడా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ తెలిపారు. కిడ్నాప్ కేసులోని ప్రధాన నిందితుడు రోషన్పై కేరళలో హత్యాయత్నాలు, దాడులు, బెదిరింపులు, పేలుడు పదార్థాల సరఫరా, ఎస్డీపీఎస్ తదితర 21 కేసులు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక సింహాద్రిపురం నాగేశ్వర్రెడ్డిపై ఏపీలోని పలుచోట్ల 15 క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా కేసును ఛేదించిన పలమనేరు సీఐ మోహన్రెడ్డి టీమ్లోని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ లోకేష్రెడ్డి, పీసీలు గణేష్, నరేష్, భాస్కర్, శశికుమార్ను డీఎస్పీ అభినందించారు. కేరళ పోలీసులమంటూ కిడ్నాప్ చేశారు -
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గొచ్చు
పలమనేరు : ఈదఫా ఎల్నినో కారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా వర్షాలు తగ్గే అవకాశం ఉందని, రైతులు బిందు, తుంపర్ల సేద్యంపై మక్కువ పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ రైతులకు సూచించారు. ఆయన బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పలమనేరు మండలం టి.వడ్డూరు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయం తదితరాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. తక్కువ నీటితో పంటలను పండించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. ఇందుకోసం ప్రస్తుతం పండిస్తున్న పంటలకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్స్ పంటను సాగుచేసుకోవాలని సూచించారు. ఇది కూడా వేరుశనగ పంటలాగే తక్కువ నీటితో తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుందని తెలిపారు. సెరికల్చర్ జేడీ పద్మమ్మ మాట్లాడుతూ మల్బరీ సాగులో యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలన్నారు. పశుసరంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ నాణ్యమైన పోషకాహారం అందజేయడం ద్వారా పాడిపశువుల్లో కొవ్వుశాతం పెరుగుతుందన్నారు. అనంతరం అధికారులు స్థానిక నాయకులతో కలిసి రైతులకు సోయాబీన్సు విత్తనాలను పంపిణీ చేసి సాగు విధానాన్ని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పీఎండీఎస్ కిట్ల ద్వారా పేలైజేషన్ ఎలా చేయాలో తెలిపారు. ఇందులో జిల్లా ఫిషరీష్ విభాగం అధికారులు ప్రకృతి వ్యవసాయశాఖ, స్థానిక వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
రక్త బంధం..
సహాయక చర్యల్లో పోలీసులు, స్థానికులు ఆ నలుగురూ రక్త సంబంధీకులే. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. బంధువుల పెళ్లికని సంతోషంగా ఆటోలో బయల్దేరారు. అందరికన్నా ముందు తామే ఉండాలని ఉబలాట పడ్డారు. కానీ వారి ఆనందం ఆవిరయ్యింది. మార్గ మధ్యంలో లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని పొట్టనబెట్టుకుంది. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలింది. ఈ ఘటన పాకాల మండలం, గుంతగాందంకి వద్ద బుధవారం చోటుచేసుకుంది. దారి కాచిన మృత్యువు ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా సిగ్నల్ ఇవ్వకుండా ఆగిపోవడంతో వెనుక వస్తున్న ఆటో లారీని బలంగా ఢీకొట్టింది. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ పక్కన కూర్చున్న రాజశేఖర్ చనిపోగా.. సూర్యబాబు ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే వెనుక కూర్చున్న మాధవి, మేఘన, బేబి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో ఉన్న వ్యక్తులు మాత్రం రక్తగాయాలతో బయటపడ్డారు. లారీ ఢీకొట్టిన సమయంలో ఆటోలో ఇరుక్కపోయి ఇద్దరు..విగతజీవులు కనిపించారు. క్షత్రగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మృతదేహాలు, క్షత్రగాత్రులను తిరుపతి రుయాకు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రెండు గ్రామాల ప్రజలు హుటహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి పరుగులు పెట్టారు. పెళ్లి బాజాలు చూడకనే..! పెళ్లి వేడుకకు వెళ్లేందుకు మాధవి తమ్ముడు ఆటోను ఏర్పాటు చేశాడు. మాధవి కొడుకు, కూతురిని తీసుకుని తమ్ముడి పిలుపు మేరకు పెరుమాళ్లపల్లి గ్రామానికి చేరకుంది. అక్కడి నుంచి మాధవి తమ్ముడు, తల్లి, తండ్రితో పాటు బంధువులు కలిసి గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం ఆటోలో పెళ్లి వేడుకకు బయలుదేరారు. మాధవి భర్తను ఇంటివద్దే వదిలేసి, పిల్లలు, బంధువులతో కలిసి బయల్దేరింది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారి ప్రయాణం శాశ్వతంగా ఆగిపోయింది. నుజ్జునుజ్జు అయిన ఆటోకాణిపాకం: దారి కాచిన మృత్యువు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మృత్యుఒడికి చేర్చింది. పాకాల మండలం, గుంతగాదంకి ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన యాదమరి, చిత్తూరు రూరల్ మండలాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు.. చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన మాధవి బావ కొడుకుకి తిరుపతి జిల్లా, రామచంద్రాపుర మండలంలో గురువారం ఉదయం 5–6గంటల మధ్య పెళ్లి జరనుంది. ఈ పెళ్లికి మాధవి, కుమార్తె, కుమారుడుతో పాటు మాధవి తల్లి, తమ్ముడు, తండ్రితో పాటు బంధువులు బయలు దేరారు. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో గుంత గాదంకి సమీపంలో మృత్యువు కబలించింది. పొట్టన పెట్టుకున్న లారీ చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబం కూలినులతో జీవనం సాగిస్తోంది. కన్నయ్య భార్య మాధవి (37) దినసరి కూలీ. వారి కుమార్తె మేఘన (15) పలమనేరులోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాధవి తల్లి యాదమరి మండలం, పెరుమాళ్లపల్లి గ్రామానికి చెందిన బేబి(54), అలాగే ఆమె కుమారుడు రాజశేఖర్ (22) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. మాధవి కుమారుడు సూర్యబాబు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను పీలేరు సంక్షేమ హాస్టల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మరికొందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆర్థిక కష్టాల మధ్య విషాదం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని మాధవి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కుమార్తెను వెంట తీసుకెళ్లి పెళ్లిలో పాల్గొనాలన్న ఆ తల్లి ఆశ.. చివరకు విషాదంగా ముగిసింది. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న మాధవి మరణంతో భర్త కన్నయ్య, కుమారుడు సూర్యబాబు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజశేఖర్కు తన అక్క కూతురిని కట్టబెట్టాలని చూసిన తల్లి బేబి కల నెరవేరకుండానే పోయింది. రఘు గ్రామంలో విషాదం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని గ్రామస్తులు కోరుతున్నారు. దహన సంస్కారాలపై కూడా గ్రామస్తులు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి జరగాలా లేదా అన్నది కూడా ఇంకా అనిశ్చితంగానే ఉంది. పెళ్లి ఆనందం కోసం బయలుదేరిన ఆ కుటుంబం చివరకు శవాలుగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబ్రమణ్యంపాకాల మండలం గుంతగాదంకి వద్ద ఘోర ప్రమాదం -
డీఈవో నియామకమెన్నడో..?
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, నాణ్యమై న విద్య అంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. తండ్రి సీఎం, కుమారుడు విద్యాశాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమైన ప్రజాప్రతినిధుల సొంత జిల్లాలో కీలకమైన డీఈవో పోస్టును భర్తీ చేయకుండా అలసత్వం వహిస్తున్నారు. కనీసం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడానికి కూడా జిల్లాపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా విద్యాశాఖలో ఇలాంటి దౌర్భాగ్య దుస్థితి నెలకొనడంపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జోరుగా లాబీయింగ్ డీఈవో పోస్టింగ్ కోసం తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు మాజీ డీఈవోలు (ఇందులో ఒకరు ఏడీ కేడర్) ఈ కీలకమైన పోస్టును దక్కించుకోవడానికి తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. వారిలో ఒకరికి బీజేపీ రాష్ట్ర నేతల మద్దతు ఉండగా, మరొకరికి జనసేన పార్టీ ముఖ్యనేతల మద్దతు ఉన్నట్లు సమాచారం. కూటమిలోని మిత్రపక్షాలు ఇద్దరు వేర్వేరు అధికారుల కోసం పట్టుబడుతుండడంతో, సొంత జిల్లా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చలేక తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ నియామకం వారాల తరబడి పెండింగ్లో పడిందని విద్యాశాఖ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. అలాగే ఇద్దరు డైట్ లెక్చరర్లు సైతం పోస్టు కోసం పోటీ పడుతున్నారు. డీఈవో పోస్టు భర్తీపై ఏఐఎస్ఎఫ్ నాయకులు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో విద్యాశాఖ పర్యవేక్షణ కరువవడాన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు రెచ్చిపోతున్నాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, కనీస వసతు లు లేని ప్రైవేట్ పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే విద్యావ్యవస్థ ను గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా రాజకీయ లాబీయింగ్లను పక్కనబెట్టి, జిల్లాకు తక్షణమే సమర్థుడైన రెగ్యులర్ డీఈవోను నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టడంలో డీఈవో పాత్ర కీలకం. విద్యాసంవత్సరం ప్రారంభంలో సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు, మధ్యాహ్న భోజనం అమలు తీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల కట్టడి, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు, కొత్త పాఠశాలలకు అనుమతులు తదితర ముఖ్యమైన పనులు డీఈవో చేయాల్సి ఉంటుంది. మే 31వ తేదీన గత డీఈవో రాజేంద్రప్రసాద్ ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి డీఈవో పోస్టును భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. పెండింగ్లో ఫైళ్లు.. పర్యవేక్షణ శూన్యం జిల్లా విద్యాశాఖకు అత్యంత కీలకమైన డీఈవో పోస్టు ఖాళీగా ఉండడంతో విద్యా పరిపాలన పడకేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లు, ఉద్యోగోన్నతులు, టీచ ర్ల పర్యవేక్షణ, అడ్మిషన్ల పెంపు, పాఠశాలల నిర్వహణ నిధులు, విద్యార్థుల సంక్షేమ పథకాలకు సంబంధించిన వందలాది ఫైళ్లు డీఈవో కార్యాలయంలో మూలనపడ్డాయి. క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. -
కుళ్లుతున్న మామిడి
కాణిపాకం: జిల్లాలోని జీడీనెల్లూరు, గుడి పాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, కార్వేటినగరం ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వద్ద సిఫార్సుల దందా కొనసాగుతోంది. ఒక్కొ ఫ్యాక్టరీ వద్ద రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు సిఫార్సు వాహనాలకు ప్రాధా న్యం ఇస్తున్నాయి. తద్వారా సాధారణ రైతుల ట్రాక్టర్లు నాలుగు రోజులకుపైగా అన్లోడింగ్ కోసం వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ గేట్ల వద్ద ఎవరి రాజ్యం? కొన్ని ఫ్యాక్టరీల వద్ద సెక్యూరిటీ సిబ్బందే పవ ర్ సెంటర్గా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి వాహనం ముందుగా లోపలికి వెళ్లాలో వారే నిర్ణయిస్తున్నారని, కూటమి నేతల సిఫార్సు ఉంటే వారికి తక్షణమే గేట్లు తెరుచుకుంటున్నాయని రైతులు మండిపడుతున్నారు. ప్రధానంగా గంగాధర నెల్లూరులో ని ఓ ఫ్యాక్టరీ వద్ద సెక్యూరిటీ సిబ్బంది వరుస నంబర్లు ఇచ్చే క్రమంలో చేతివాటం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామా న్య రైతులను మాత్రం క్యూ కట్టించి నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సిఫార్సుల ప్రభావం తగ్గలేదని అంటున్నారు. తమిళనాడు కాయల ప్రవాహం గుడిపాల సరిహద్దు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వద్ద తమిళనాడు నుంచి వచ్చే మామిడి కాయ లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని మరో ఫ్యాక్టరీ వద్ద సెక్యూరిటీ సిబ్బంది రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాయ లు కొనుగోలు చేయకుండా నేరుగా జీడీనెల్లూరుకు వెళ్లమని సూచించడంతో వందలాది ట్రాక్టర్లు అక్కడికి తరలివెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు కాయలు 50పైగా లారీలు క్యూకడుతున్నాయి. ఇదీ ఫ్యాక్టరీలకు..అక్కడి వ్యా పారులకు సర్దుబాటు ఉందని, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని పలు పల్ప్ ఫ్యాక్టరీల్లో సిఫార్సులు రాజ్యమేలుతున్నాయి. కొందరు కూటమి నేతలు సిఫార్సుల దందాను దర్జాగా నడిపిస్తున్నారు. నేరుగా ట్రాక్టర్లను ఫ్యాక్టరీ లోపలికి పంపించి అన్లోడింగ్ చేయిస్తున్నారు. వారికి ఫ్యాక్టరీల సెక్యూరిటీ సిబ్బంది సహకరిస్తున్నారు. సామాన్య రైతుల కాయలను రోడ్డుపైనే నిలబెడుతున్నారు. ట్రాక్టర్లలోనే కాయలు కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిత్తూరు నగరంలోని పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ కాయలు కొనుగోలుకు పంగనామాలు పెడుతోందని రైతులు గుర్రుమంటున్నారు. తవణంపల్లిలోని ఓ ఫ్యాక్టరీలో అన్లోడింగ్ ఆలస్యమవ్వడంతో ట్రాక్టర్లలోనే నిలిచిపోతున్నాయి. తవణంపల్లిలోని మరో ఫ్యాక్టరీ టోకన్లు, వరుస నంబర్లు ఇవ్వకుండా గందరగోళం నడుమ కాయలను అన్లోడింగ్ చేయిస్తోంది. టీడీపీ నేతల సిఫార్సులుంటే ఆ బండ్లను ముందు వరుసలో నిలబెడుతోంది. చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని ఫ్యాక్టరీ గత ఏడాది బిల్లులు ఇవ్వలేదని, ఈసారి కొనుగోలుకు బ్రేకు వేసిందని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలో సిఫార్సుల వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని, ప్రతి రైతుకు సమాన అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శక విధానం అమలు చేయకపోతే ఐక్యంగా ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. -
పాఠశాల స్థాయిలోనే ఐచ్ఛిక సెలవులు అమలవ్వాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే 2026–27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఐచ్ఛిక (ఆప్షనల్ సెలవులు) అమలు కావాలని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో ఒక యూనిట్గా సెలవుల ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఏ ఉపాధ్యాయుడు కూడా ఐచ్ఛిక సెలవులను వ్యక్తిగత కారణాల కోసం విడిగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఐచ్ఛిక సెలవును పాఠశాల స్థాయిలో అమలు చేయాలనుకుంటే పర్యవేక్షణ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని డీవైఈవో, ఎంఈవోలు తమ పరిధిలోని పాఠ శాలలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించకుండా క్షేత్రస్థాయిలో తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలి – సర్వే, భూరికార్డుల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ నగరి : రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలని, రీ సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని సర్వే, భూరికార్డుల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ టి.జయరాజ్ తెలిపారు. ఆయన బుధవారం మాంగాడు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆయన రీసర్వే చేస్తున్న విధానంపై రైతులను ఆరాతీశారు. రికార్డులను పరిశీలించారు. ఈకేవైసీని స్వయంగా తనిఖీ చేసి గ్రామ సర్వేయరు, రెవెన్యూ అధికారి, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం నిండ్ర, నగరి మండలాలకు సంబందించిన పీజీఆర్ఎస్, ఎఫ్లైన్ పిటీషన్లను పరిశీలించా రు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సర్వే స ర్టిఫికెట్లను వెంటనే రైతులకు అందజేయాలని సూచించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, మండల సర్వేయర్ సురేష్, గ్రామ సర్వేయర్, వీఆర్వో, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 95 శాతం సర్ ఫారాలు పంపిణీ శాంతిపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం–2 పంపిణీని 95 శాతం పూర్తి చేశారు. మొత్తం 2,30,474 మంది ఓటర్లలో బుధవారం సాయంత్రం వరకూ 2,18,807 మందికి ఫారాలను బీఎల్వోలు, బీఎల్ఏలు అందజేసినట్టు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వాటిని సరైన వివరాలతో నింపిన తర్వాత మళ్లీ బీఎల్వోలకు అందజేయడం ద్వారా తమ ఓటును కోల్పోకుండా చూడవచ్చని పేర్కొన్నారు. శాంతిపురం మండలంలో 48,760 మంది ఓటర్లలో 45,854 మంది, కుప్పం ఆర్బన్లో 39,984 మందికి గాను 39,898 మంది, కుప్పం రూరల్లో 58,904 మందిలో 55,232 మంది, గుడుపల్లిలో 36,015 మందిలో 34,776 మంది, రామకుప్పం మండలంలో 46,811 మంది ఓటర్లలో 43,047 మందికి ఎన్యూమరేషన్ ఫారం–2లను అందజేశారు. రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్ స్టేషన్ల వారి గా నియమించిన బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు ఆయా ఫారాలను నింపడంలో సాయంగా నిలుస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలాలు మంజూరు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం మంజూరు చేసిందని ఆశాఖ ఐజీ అంబేడ్కర్ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిత్తూరు రూరల్, నగరి, బంగారుపాళ్యం, కార్వేటినగరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవ నాల్లో ఉందన్నారు. సొంత భవనాల్లో వాటిని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం మంజూరైనట్టు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్– జూన్ వరకు మొత్తం రూ.57.72 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు రూ.44.32 కోట్లు వసూలైందన్నారు. ఏప్రిల్, మే నెలల్లో కంటే జూన్లో ఆదాయం పెరిగిందన్నారు. -
ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది, ఇంటర్ అడ్మిషన్లకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవా రం డీఈవో కార్యాలయంలో ఓపెన్ స్కూల్ 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్ల పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన వారు ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదివేందుకు అర్హులన్నారు. అభ్యర్థులకు సమీపంలో స్టడీ సెంటర్లలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, ఏపీ ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత చదువులకు చెల్లుబాటు అవుతాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జూలై 30, అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు జూలై 31వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. పదవ తరగతికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 (అందరికీ), అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీ పురుషులకు రూ.1300, సీ్త్రలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు) రూ.900, పాఠ్యపుస్తకాలు, సర్టిఫికెట్లు ఇంటి చిరునామాకు పంపేందుకు పోస్టల్ చార్జీలు రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 (అందరికీ), ఫీజు జనరల్ పురుషులకు రూ.1400, సీ్త్రలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులకు) రూ.1100, పాఠ్యపుస్తకాలు, సర్టిఫికెట్లు ఇంటి చిరునామాకు పంపేందుకు పోస్టల్ చార్జీలు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ హేమాద్రి, జీడీనెల్లూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సుబ్బరామయ్య, సీనియర్ అసిస్టెంట్ సల్లార్ ఖాన్, సిబ్బంది లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయలకు చుక్కెదురు
పలమనేరు: పలమనేరు ప్రాంతంలో ఎక్కువగా హైబ్రిడ్ టమాటా, బీన్సు, పొటాటో, వంగ, క్యారెట్, నిమ్మ, దోస, క్యాప్సికం, చిక్కుడు, కాకర, బీర, గుమ్మడి, కాలీఫ్లవర్, ముళ్లంగి, సొరకాయ, కరివేపాకు, బీట్రూట్ తదితర కూరగాయల పంటల సాగు చేస్తున్నారు. వీటి సాధారణ సాగు 3 వేల హెక్టార్లు. ఈ ప్రాంత వాతావరణం వీటి సాగుకు అనుకూలంగా ఉండడంతో సీజన్తో సంబందం లేకుండా రైతులు సాగు చేస్తుంటారు. ఈ సరుకు బయటి రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇటీవల రైతులు ఎక్కువగా పురుగు మందులు వినియోగిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా 270 రకాల సస్యరక్షణ మందులను నిర్దేశించిన మోతాదులో పంటలకు వాడాలనే నిబంధన ఉంది. రైతులు అధిక దిగుబడుల కోసం విచక్షణారహితంగా పురుగు మందులను వాడుతున్నారు. దీంతో మన కూరగాయలు విదేశాల నుంచి వెనక్కి వస్తున్నాయి. పాడవుతున్న భూమి మరోవైపు మితిమీరిన రసాయనిక ఎరువులతో భూములు నిస్సారం అవుతున్నాయి. ముఖ్యంగా మట్టిలో సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. ఇలాంటి పొలాల్లో సాగైన పంట ఉత్పత్తులను వినియోగించేవారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందనే మాట గట్టిగా వినిపిస్తోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోనే కూరగాయల సాగులో పలమనేరు హార్టికల్చర్ డివిజన్ ముందంజంలో ఉంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇప్పటికే కూరగాయల సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్న రైతుల స్పూర్తితో ఇక్కడి రైతులు పలు రకాల కూరగాయలను ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే కూరగాయల్లో ఫర్టిలైజర్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు లేవని చెబుతూ వెనక్కి పంపేస్తున్నారు. దీంతో వ్యాపారులు సరుకును కొనేందుకు ముందుకు రావడంలేదు. ఫలితంగా కూరగాయల ధరలపై ప్రభావం పడుతోంది. -
ఆగిన వి‘భజన’..!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇప్పటి వరకు ఉన్న 50 వార్డులను పునర్విభజన చేసి 60 డివిజన్లుగా మార్చాలని మూడు నెలల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు రెక్కలు కట్టుకుని అధికార పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ వార్డుల వి‘భజన’ చేశారు. వైఎస్సార్ సీపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఎక్కడా భావించలేదు. ప్రతిపక్ష పార్టీ నేతలు జ్ఞానజగదీష్, ఆను, లోకనాథం, ఇమ్రాన్, నారాయణమూర్తి తదితరులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, అది పూర్తికాకముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2027 జనగణన నిబంధనల ప్రకారం 2025 డిసెంబర్ 31 లోపు ఎన్నికల సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 2026 జనవరి 1 నుంచి 2027 ఏప్రిల్ 1 వరకు జనగణన నిర్వహించనున్న నేపథ్యంలో మొత్తం ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందన్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ వార్డుల విభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో హైకోర్టు వార్డుల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించింది. ఆగని సిఫార్సుల దందా..! ఇష్ట్రపకారం సరిహద్దులు నిర్ణయించారు. కొన్ని వార్డుల్లో కొన్ని సామాజిక వర్గాలు కనిపించనేలేదు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో అధికారులు రూపొందించిన 60 వార్డుల పునర్విభజన ప్రక్రియకు హైకోర్టు బ్రేకులు వేసింది. న్యాయపోరాటం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు సరిహద్దులు మార్చేసిన అధికారులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆర్టీసీలో పీపీపీ..?
● ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలి ● డిపోలు, ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దు ● జిల్లాలో రెండో రోజూ ఎర్ర బ్యాడ్జీలతో నిరసనలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని నాలుగు డిపోల వద్ద రెండు రోజులుగా ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని, విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పేరిట ఆర్టీసీ డిపోలు, విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని నిలిపివేయాలని మండిపడుతున్నాయి. ఈ మేరకు జి.ఓ. నెం.88ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీ్త్ర–శక్తి పథకం కోసం 4 వేల కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని కోరాయి. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు కొత్త డీఏలు, ఐఆర్ ప్రకటించాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషనన్ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్కు బదులు పాత విధానాన్ని కొనసాగించాలని సూచించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. చిత్తూరు టూ డిపో గేటు ఎదుట నిర్వహించిన నిరసనలో నాయకులు వినోద్కుమార్, సీవీ మురళీధర్, సతీష్, అన్బు, జేఎం బాలాజీ పాల్గొన్నారు. ఎంఈవోపై దాడి శ్రీరంగరాజపురం : మండల విద్యాధికారి అరుణాచలంరెడ్డి, అతని కుటుంబ సభ్యులను అడ్డగించి దాడిచేసిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏంఈవో అరుణాచలంరెడ్డి కుటుంబంతో కలిసి స్వగ్రామం 49 కొత్తపల్లి నుంచి చిత్తూరుకు వస్తుండగా మార్గమధ్యంలో 49 కొత్తపల్లిమిట్ట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అకారణంగా వారిని అడ్డగించి దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
● డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, సీఐ ప్రసాద్, తహసీల్దార్ పరిశీలన ● రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న వైనం గంగాధర నెల్లూరు: మామిడి రైతుల సమస్యలను త్వరితగతన పరిష్కరిస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి హామీ ఇచ్చారు. తెలిపారు. జీడీ నెల్లూరులోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అలాగే మామిడి రైతుల దుస్థితిపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాల మేరకు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, జీడీ నెల్లూరు సీఐ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్ గౌడ్ బుధవారం జీడీనెల్లూరు చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఐ ప్రసాద్ ఫ్యాక్టరీ సిబ్బందితో మాట్లాడారు. సీరియల్ నంబర్ల గోల్మాల్కు సంబందించి రికార్డులను పరిశీలించారు. యూనిట్ వన్కు జీడీ నెల్లూరు తహసీల్దారు, యూనిట్ టూకు ఎంపీడీవోను అధికారులుగా నియమిస్తూ సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జరిచేశారు. మండల స్థాయి అధికారులు ఫ్యాక్టరీ వద్ద క్యూలో నిలుచున్న ఉన్న రైతులకు స్వయంగా సీరియల్ నంబర్లు కేటాయించారు. 34 మందికి పదోన్నతులు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 34 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభించింది. ఈ మేరకు అమరావతిలో బుధవారం గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రేడ్–1గా పదోన్నతి పొందిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరికి పంచాయతీరాజ్ కమిషనర్ జోన్–4 పరిధిలోని జిల్లాలను కేటాయించగా సంబంధిత కలెక్టర్లు పంచాయతీలకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు
● విచ్ఛలవిడిగా గ్రావెల్ తరలింపు ● అధికార పార్టీ అండతోనే అక్రమ రవాణా పుత్తూరు: తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్లు మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు అంటూ కొండలను గుల్ల చేస్తూ గ్రావెల్ను విచ్ఛలవిడిగా తరలించేస్తున్నారు. పుత్తూరు మున్సిపల్ పరిధి 12వ వార్డు వినాయకపురం నుంచి కార్వేటినగరం మార్గంలో ఉన్న చలమేశ్వరి స్వామి ఆలయ దారిలో ఉన్న గుట్ట అక్రమ గ్రావెల్కు తవ్వకాలకు అడ్డాగా మారింది. ప్రతి రోజూ వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు మట్టిని లోడు చేసుకుని కార్వేటినగరం మార్గంలో తమిళనాడుకు తరలిస్తున్నాయి. మన ప్రకృతి సంపద ఎడాపెడా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల గ్రామస్తులు పుత్తూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ గుట్టలు పుత్తూరును ఆనుకుని ఉన్న కార్వేటినగరం లెక్కదాఖలాలోకి రావడంతో ఆయన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గుట్ట పుత్తూరు మున్సిపాలిటీలో, రెవెన్యూ పరిధి కార్వేటినగరం మండలంలో ఉండడంతో అక్రమార్కులకు బాగా కలిసి వస్తోంది. భారీ వాహనాల సాయంతో గుట్టను తవ్వి సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే గుట్ట మాయమవడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతోనే ఈ తరలింపు జరుగుతోందని ఆరోపిస్తున్నారు. నెలరోజులుగా అక్రమరవాణా జరుగుతోందని, దీనిపై ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియడం లేదని వినాయకపురం, కుందిమాకుల గుంట, చిన్నబ్బనాయుడు కండ్రిగ, ఉత్తరపు కండ్రిగ గ్రామస్తులు కోరుతున్నారు. యువకుడిపై కత్తితో దాడి శ్రీరంగరాజపురం : మండలంలోని పొదలపల్లి గ్రామంలో మంగళవారం యువకుడిపై కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోదలపల్లి గ్రామంలో మంగళవారం గంగజాతర నిర్వహించారు. ఈ జతరలో గంగయ్యకు బాబుకు మధ్య స్వల్ప గొడవ జరిగింది. గంగయ్య కుమారుడు ప్రకాష్ తన తండ్రిని ఎందుకు దూషిస్తున్నావు అని బాబును అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బాబు, అతని కుమారుడు స్టాలిన్ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి ప్రకాష్ కడుపుపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ప్రకాష్ను స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విష మంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాబు, అతని కుమారుడు స్టాలిన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం రూ.15వేల కోట్లు చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యం రూ.15వేల కోట్లుగా నిర్ణయించామని ఆ శాఖ ఐజీ అంబేడ్కర్ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 295 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా తిరుపతి జిల్లా తిరుచానూరులో కొత్త కార్యాలయం ప్రారంభించామన్నారు. మహరాష్ట్ర తరహాలో ఫైలట్ ప్రాజెక్టుగా పీపీపీ విధానంలో మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల విధానం రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నమన్నారు. ఆర్ఎస్కే (రిజిస్ట్రేషన్ సేవ కేంద్రం)కు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. జిల్లా కేంద్రంలో కార్యాలయం పెడతామని సబ్రిజిస్ట్రార్ మినహాయించి మిగిలినవారు ప్రైవేటు సిబ్బంది అక్కడ ఉంటారన్నారు. అక్కడ డ్యాకుమెంట్ సిద్ధం చేసి చలాన్ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోనే అవకాశం ఉంటుందన్నారు. డ్యాకుమెంట్ ఫీజు కింద రూ.2వేలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్ఆర్ నుంచి డీఆర్గా 18 మందికి, గ్రేడ్–2 ఎస్ఆర్ నుంచి గ్రేడ్–1 ఎస్ఆర్గా 52 మందికి పదోన్నతులు ఇచ్చామన్నారు. పంచాయతీలకు చెల్లించాల్సిన టీడీలు ఇవ్వనున్నమన్నారు. కార్యక్రమంలో డీఐజీ గిరిబాబు, డీఆర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అన్యాయం జరగకూడదనే..
వార్డుల పునర్విభజనపై వచ్చిన 20 అభ్యంతరాలు సహేతుకంగా లేవని అధికారులు పట్టించుకోలేదు. ప్రతిపాదిత వార్డుల విస్తరణస్థానికుల భౌగోళిక పరిస్థితులు లెక్కచేయలేయకపోగా, డివిజన్లలో పౌరుల–ప్రజల భాగస్వామ్యాన్ని బలహీనపరచేలా ఉంది. పైగా విభిన్న సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సంప్రదింపులు జరపలేదు. కొత్త జనాభా లెక్కలే తీయకుండా బీసీ ఓటర్లను ఎలా గుర్తిస్తారు. 60 డివిజన్లుగా ఇష్టానుసారంగా మార్చేస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు మారిపోతాయి. అందుకే మా పార్టీ తరపున పోరాటం చేశాం. విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది. – ఎంసి.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త -
మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వద్ద యువరైతు ఆత్మహత్యాయత్నం
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దుస్థితి దారుణంగా తయారైంది. సీరియల్ నంబర్ కోసం నాలుగు రోజులుగా గుజ్జు ఫ్యాక్టరీ వద్ద వేచి చూసిన ఓ యువరైతు చివరికి ఫ్యాక్టరీ గేటు వద్దే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం బొమ్మవారిపల్లికి చెందిన యువరైతు లోకేశ్ నాయుడు నాలుగు రోజుల క్రితం మామిడి లోడుతో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సీరియల్ నంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫారసులతో వచ్చిన వాహనాలను వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండటంతో ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది, దళారులు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అవమానంతో కుంగిపోయిన లోకేశ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న రైతులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాక్టరీ లోపల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మోహన్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు చేపడుతామన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 12వ పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్స్ చెల్లింపులు పై చర్చించారు. ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్, మహిళా ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు కోరారు. సమావేశంలో ఆపస్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవులు, కార్యదర్శి రమేష్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల గళం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలెక్టరేట్లో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లాలోని 19 గుర్తింపు పొందిన సభ్య సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరై ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై గళమెత్తారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ కౌన్సిల్ పునరుద్ధరించినందుకు కలెక్టర్కు సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. -
● వి.కోట విలేకరికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిక ● న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు డాక్యుమెంట్ రైటర్ వినతి
డాక్యుమెంట్ రైటర్కు టీడీపీ నేత బెదిరింపులు తిరుపతి అన్నమయ్యసర్కిల్: కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సుమారు 14 సంవత్సరాలుగా డాక్యుమెంట్ రైటర్ గా జీవనోపాధి చేసుకుంటున్న తనకు పొంచి ఉన్న ప్రాణహాని నుంచి కాపాడాలని డాక్యుమెంట్ రైటర్ ఏఎస్ మహ బూబ్ ఉన్నతాధికారులకు విజ్ఞ ప్తి చేశారు. మంగళవారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. స్థానిక వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత జాకీర్ ఈ నెల 15న తన వద్దకు వచ్చరన్నారు. తనకు ఒక డాక్యుమెంట్ చేసి పెట్టమని చేప్పాడన్నారు. కాగా అదే రోజు 11.30 గంటలకు బుక్ చేసి ఇచ్చానన్నారు. చలనా విషయంలో జరిగిన వాదనపై జాకీర్ దుర్భాషలాడి తన ఎడమ చెంపపై కొట్టి ‘నాతో పెట్టుకుంటే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా. నా సెటిల్మెంట్లకు అడ్డు వస్తే వి కోటలో విలే కరికి పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరూ తీసుకోరు. నీ మీదే రిటర్న్ కంప్లైంట్ ఇస్తా, నీ భార్య బిడ్డలను బతకనివ్వను’ అని హెచ్చరించాడని ఆరోపించారు. వార్డు కౌన్సిలర్ జాకీర్, అతని అనుచరుల నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని, తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబా బు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు లేఖ ద్వారా కోరారు. వేరుశనగ 4,200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇప్పటి వరకు జిల్లాకు వేరుశనగ విత్తనం 4200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. ఏప్రిల్లో వ్యవసాయశాఖ అధికారులు జిల్లాకు 27 వేల క్వింటాళ్ల కాయలు కేటాయించారు. ఈ మేరకు కుప్పం, పలమనేరు మండలాలకు మాత్రం 4,200 క్వింటాళ్ల కాయలొచ్చాయి. మిగిలిన మండలాలకు మొండిచేయి మిగిలింది. జూన్ నెల ముగుస్తున్నా కాయలు ఇవ్వకపోవడం ఏమి టని మండిపడుతున్నారు. -
21 రోజుల్లో రూ.1.74 కోట్లు కాణిపాకం :ఆలయంలో 21 రోజుల హుండీ లెక్కింపులో రూ.1.74 కోట్లు వచ్చిందని ఈఓ పెంచల కిషోర్ చెప్పారు.
సాయికృష్ణ కేసులో పలు అనుమానాలు నగరి : సాయికృష్ణ కేసులో మొదటి రోజు నుంచే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణలంక పోలీస్స్టేషన్లో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ మాయం అయిందనే వార్తలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు. సాక్ష్యాలే మాయం అయితే నిజం ఎలా బయటకు తీస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలన్నారు. సీసీటీవీ ఫుటేజి మాయం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందన్నారు. ఫుటేజీ మాయంపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదో తెలపాలన్నారు. లాకప్ డెత్లో నిజానిజాలు బయటపడే వరకు వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. -
ఆత్మహత్యలు చేసుకుంటుంటే..పాలాభిషేకాలా?
గంగాధర నెల్లూరు: మండల కేంద్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మంగళవారం ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. యువరైతు లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నం ఘటనపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకోలేదని , రైతులు రాత్రింభవళ్లు కిలోమీటర్ల మేర రోడ్లపై పడికాపులు కాస్తుంటే కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. గంగాధర నెల్లూరు మండలం జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బొమ్మవారిపల్లి గ్రామానికి చెందిన యువరైతు లోకేష్ నాయుడు తన ఎనిమిదెకరాల పొలంలో పండించిన మామిడి పంటను ట్రాక్టర్లలో నింపి నాలుగు రోజుల క్రితం పరిశ్రమ వద్దకు తీసుకురాగా మంగళవారం వరకు ఎలాంటి సీరియల్ నంబరు కేటాయించకపోవడంపై మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రతి ఒక్కరినీ కలిసి వేసిందన్నారు. మామిడి రైతులు అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటేపో ఓ పక్క కూటమి నేతలు మాత్రం పాలాభిషేకాలు చేస్తుండడంపై తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కష్టాలు పూర్తిగా నెరవేర్చిన తరువాత సంబరాలు చేసుకుంటే మంచిదన్నారు. రైతులు అవస్థలు పడుతూ కన్నీరు కారుస్తుంటే కూటమి నేతలకు పట్టడం లేదన్నారు. అదేవిధంగా విజయవాడలో సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర నెల్లూరు పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, సీనియర్ నేత రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గుణశేఖర్ రెడ్డి , ఏకాంబరం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
● సీఎం సొంత జిల్లాలో గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు ● రూ.4 ధర ప్రకటించి చేతులు దులిపేసుకున్న కూటమి ప్రభుత్వం ● ఫల్ప్ ఫ్యాక్టరీల వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు ● ప్రభుత్వ తీరుపై భూమన ఆగ్రహం
మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమా? తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయమే దండగ, విద్యుత్ వైర్లపై బట్టలు ఆరేసుకోండి అంటూ రైతులను హేళన చేసిన ఘనుడు చంద్రబాబు అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా మామిడి పంటకు పెట్టింది పేరన్నారు. అలాంటి జిల్లాలో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కిలోకు రూ.15 ఇవ్వాల్సిందే కిలోకి రూ.15 ఇస్తే కానీ గిట్టుబాటు కాదని మామిడి రైతులు చెబుతుంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.4 ప్రకటించి చేతులు దులిపేసుకుందని భూమన మండిపడ్డారు. జిల్లాలో 25 ఫల్ప్ ఫ్యాక్టరీలు కిలో రూ.5కు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. రోజుల కొద్దీ ఫల్ప్ ఫ్యాక్టరీల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడు లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తే అందులో గిట్టుబాటు ధర లేక రెండు లక్షల టన్నుల కాయలను రైతులు చెట్లల్లోనే వదిలేశారన్నారు. ఆత్మహత్యాయత్నం బాధాకరం గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో టీడీపీ సానుభూతిపరుడైన మామిడి రైతు గిట్టుబాటు ధర లేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని భూమన వాపోయారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలోనే రైతు రాజుగా బతికాడని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఆ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులంతా తోపులను నరికేసి మామిడి కట్టెలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుంటే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
దర్జాగా అక్రమ రవాణా
కుప్పం మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతం. ఇది అక్రమ రవానాకు కేంద్రంగా మారింది. గతంలో సరిహద్దుల్లో అక్రమ రవాణా నియంత్రణ కోసం చెక్ పోస్టులు ఉండేవి. వాటిని ప్రస్తుతం మూసివేయడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొంతమంది తమిళనాడు రాష్ట్రం నుంచి బియ్యం కర్ణాటకలోని బంగారుపేటకు, అలాగే కుప్పం నుంచి గ్రానైట్ను తమిళనాడుకు తరలిస్తున్నారు. అలాగే ఉప్పు నుంచి పప్పు వరకు నిత్యావసర సరుకులను కర్ణాటక నుంచి కుప్పానికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడు బియ్యం పట్టుకున్న పోలీసులు (ఫైల్) మూతపడిన బిసానత్తం చెక్ పోస్టు కుప్పం: తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డులకు ఇచ్చే బియ్యాన్ని వ్యాపారులు కిలో రూ.15లకు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత వాటిని కర్ణాటకలోని బంగారుపేటలో ఉన్న రైస్ మిల్లులకు కేజీ రూ.30 నుంచి రూ.40లకు విక్రయిస్తున్నారు. రైస్ మిల్లుల యాజమాన్యం వాటిని పాలీష్ పట్టి అధిక ధరలు అమ్ముతున్నారు. అక్రమార్కులకు కూటమి నాయకులు అండదండలు మెండుగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక కూటమి నాయకుల టిప్పర్లు, కంటైనర్ల ద్వారానే బియ్యం రవాణా చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. కుప్పం మండలంలోని ఇద్దరు మల్లానూరు చెందిన నాయకులు, శాంతిపురం మండలంలో ఇద్దరు, రామకుప్పంలో ఇద్దరు ముఠాగా ఏర్పడి బియ్యం స్మగ్లింగ్ను దర్జాగా సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు సరిహద్దులోని రామకుప్పం మండలం ఆరిమాను పెంట, శాంతిపురం మండలం విజలాపురం, కుప్పం మండలం మల్లానూను, అడవిబూదుగూరు గ్రామాల మీదుగా కర్ణాటకకు బియ్యం తరలిస్తున్నట్టు పేర్కొంటున్నారు. నిత్యం అర్ధరాత్రి వేళల్లో టిప్పర్లు, లారీల్లో బియ్యం తరలిపోతోందని చెబుతున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఓ గ్రామంలో బియ్యం గోడౌన్ ఏర్పాటు చేసుకుని శాంతిపురానికి చెందిన నాయకులు దర్జాగా బియ్యం రవాణా సాగిస్తున్నారు. తమిళనాడు గ్రానైట్ తరలింపు కుప్పం ప్రాంతంలో గ్రానైట్ ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడి క్వారీల్లో రాతి దిమ్మెలను గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని బరుగూరు, జగదేవి, హోసూర్, చైన్నె నగరాలకు తరిలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విష యం తెలిసినా అధికారులు కూటమి నేతలకు భయపడి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుట్టగొడుగుల్లా క్వారీలు కుప్పం నియోజకవర్గంలో రెండేళ్లుగా అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అధికార పార్టీ నేతలు నిర్ణయించిన రేటు చెల్లిస్తే ఎన్ని హెక్టార్లలోనైనా తవ్వకాలు చేసుకోవచ్చు. వారు ఆ జాబితాను సంబందిత శాఖ అధికారులు, పోలీసులకు పంపిస్తారు.దీంతో అధికారుల నుంచి క్వారీ పనులకు ఆంటంకాలు ఉండవు. దీంతో పాటు రాతి బ్లాక్ రవాణాకు సైతం అనుమతులు అందినట్లే. కర్ణాటక నుంచి నిత్యావసర సరుకుల దిగుబడి కుప్పానికి కర్ణాటకలోని బంగారుపేట 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి కుప్పానికి ప్రతి రోజూ అక్రమంగా నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సరుకులను పట్టణంలోని వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నారు. మూతపడిన చెక్ పోస్టులు అక్రమ రవాణాను అరికట్టేందుకు గతంలో సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్టులు ఉండేవి. తమిళనాడు సరిహద్దులోని గాంధీనగర్, వేపనపల్లి, ఆరిమానుపెంట, మెట్లచేను, నడుమూరు, కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం, కెంపాపురం, సాతు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఉండేవి. సిబ్బంది నిరంతరం కాపలా కాస్తూ అక్రమ రవాణాను అరికట్టేవారు. ప్రస్తుతం ఆ చెక్ పోస్టులు మూతపడడంతో అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. -
తీరని శోకం
దాము కుటుంబం సభ్యులు(ఫైల్)తనలా కాకూడదని.. తాను చిన్నప్పుడు అనుభవించిన తల్లిలేని బాధను తన బిడ్డలు అనుభవించాల్సి వస్తుందన్న భయం, ఆలోచనలే దామును తీవ్ర మనోవేదనలోకి నెట్టాయి. బయటకు కనిపించని ఆ మౌన యుద్ధంలో అత్యంత విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా భార్య నిర్మల (28), కుమారుడు దిలీప్ (14), కుమార్తె శ్రీవిద్య (12)కు విషమిచ్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకే కనిపించే దాము ఆ రోజు ఇంటి వద్దకు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన అక్క చిన్ని ఇంటి వద్దకు వెళ్లింది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులను పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): పలమనేరు మండలం మండీపేటకోటూరుకు చెందిన మునెప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మకు మార్కొండ, పండు, చిన్ని, దాము సంతానం. రెండో భార్య సుబ్బమ్మ. దాము వయసు నాలుగేళ్లు కూడా నిండకముందే తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. పెరుగుతున్న కొద్దీ తల్లి లేని లోటు దామును తీవ్రంగా వేధించింది. అక్క చెంత కొత్త జీవితం అక్క చిన్ని వివాహం చేసుకుని చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లికి వచ్చింది. దాము కూడా జీడీనెల్లూరు మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. వారికి దిలీప్, శ్రీవిద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. బంగారెడ్డిపల్లెలో స్థిరపడ్డాడు. డబ్బు కూడబెట్టి స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. వారి జీవితం సంతోషంగా సాగుతోంది. ఇంతలోనే విధి వక్రించింది. భార్యకు పక్షవాతం పదేళ్ల క్రితం నిర్మలకు పక్షవాతం వచ్చింది. మొదట చికిత్సతో కొంత కోలుకున్నా, తర్వాత ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాము జీవితం ఆస్పత్రుల చుట్టూ తిరిగే ప్రయాణంగా మారింది. చిత్తూరు, వేలూరు, రాణిపేట, చైన్నెలోని ఆస్పత్రులకు భార్యను తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో అప్పులు చేశాడు. రాణిపేటలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్సకు రూ.3 లక్షలు అవసరమని చెప్పారు. ముందుగా రూ.50 వేల వరకు చెల్లించాడు. మిగిలిన డబ్బు సమకూర్చుకుని వస్తానని చెప్పి ఇంటికి చేరాడు. ఆ తర్వాత తిరుపతిలోని మరో ఆస్పత్రిలో చూపించాడు. అక్కడి వైద్యులు చిన్న మెదడుకు శస్త్రచికిత్స చేస్తే ప్రాణాపాయం తప్పదని స్పష్టం చేశారు. ఇక చేసేదేమీ లేదని చేతులెత్తేశారు. ఆ మాటలు దాము ఆశలపై చివరి దెబ్బగా మారాయి. కుమార్తెతో పాటు దాము మృతదేహం, నిర్మల మృతదేహం , విగతజీవిగా పడివున్న దిలీప్ గ్రామాన్నే కంటతడి పెట్టించింది సంఘటన స్థలంలో టీవీపై ఉంచిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ అంత్యక్రియలను ప్రభుత్వ ఖర్చుతో కాకుండా, తన సొంత నిధులతో నిర్వహించాలని అందులో రాసి ఉంది. ఆ లేఖ చదివిన వారందరూ ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. చివరి క్షణాల్లో కూడా తన కుటుంబ గౌరవం గురించి ఆలోచించిన దాము పరిస్థితి ఎంత దయనీయంగా ఉండి ఉంటుందోనని చర్చించుకున్నారు. తల్లి లేని చిన్ననాటి బాధను జీవితాంతం మోసిన దాము భార్య అనారోగ్యాన్ని తట్టుకోలేక, పిల్లల భవిష్యత్తుపై భయంతో చివరకు తీసుకున్న నిర్ణయం నలుగురు ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు ఆ ఇంటి ముందు మిగిలింది నాలుగు చితులు... గ్రామం గుండెల్లో మిగిలింది చెరగని విషాదం మాత్రమే. అతను చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. అనాథలా పెరిగాడు. పెళ్లి చేసుకుని జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలకు ఏ లోటూ రాకుండూ చూసుకుంటున్నాడు. విధి అతడిని వదల్లేదు. భార్య అనారోగ్యం పాలవడం.. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కుమిలిపోయాడు. ఖరీదైన వైద్యం చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ లేక మనోవ్యథ చెందాడు. ఇంక బతకడం వృథా అనుకున్నాడు. తాను చిన్నప్పుడు పడిన తల్లిలేని బిడ్డ అనే ఆవేదన తన పిల్లలకు రాకూడదని భావించాడు. పిల్లలు, భార్యకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. చిన్ననాటి గాయం.. నలుగురిని మింగేసింది..! నా తమ్ముడు చివరగా ఏమన్నాడంటే.. ‘‘మనం తల్లి లేని బిడ్డలం కదా. మనం పడిన కష్టాలు తెలుసు కదా. నా బిడ్డలు కూడా తల్లిలేని బిడ్డలైపోతున్నారు’’ అని నా తమ్ముడు బాధపడేవాడు. తల్లి అయినా.. అత్త అయినా నేను ఉంటానని చెప్పాను. చేతిలో చేయి వేసి నేనుండానని చెప్పాను. ఆదివారం రాత్రి కూడా సంగటి, చికెన్ వండిపెడితే భార్యాభర్తలు తిన్నారు. నేను ఇక్కడే పడుకుంటాను అంటే వద్దన్నాడు. ఇంటికెళ్లు మామ ఒక్కడే ఉంటాడు అని చెప్పి నన్ను పంపించాడు. తెల్లారేకల్లా నా తమ్ముడు ఇలా విగతజీవిగా మారాడు. భార్య బతకాలని మొక్కని దేవుళ్లు లేరు. – చిన్ని, దాము సోదరి -
ఆ సీఐ వెనుక బిగ్బాస్ ఎవరు?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని, ఆ సీఐ వెనుక ఉన్న బిగ్బాస్ ఎవరో బయటపెట్టాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ మృతి, దళిత యువకుడు క్రాంతికుమార్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ మరణం వెనుక ఉన్న అసలు బాధ్యులను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. కేసులో మర్డర్ సెక్షన్లు నమోదు చేసినప్పటికీ సంబంధిత సీఐపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ‘ఆ సీఐ వెనుక ఉన్న బిగ్బాస్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో జరిగిన తూత్తుకుడి లాకప్ డెత్ కేసులో సాక్ష్యాలు ఆధారంగా తొమ్మిది మంది పోలీసులకు కఠిన శిక్షలు పడిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో చట్టం తన పని చేసిందని, మన రాష్ట్రంలో మాత్రం నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దళిత కుటుంబానికి చెందిన యువకుడు క్రాంతికుమార్ సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటనపైనా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాలలు, మాదిగలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు ఆగకపోవడం బాధాకరమన్నారు. గతంలో మాల, మాదిగలు ఐక్యంగా ఉన్నారని, అనంతరం రాజకీయ ప్రయోజనాల కోసం వారిని విడదీసి దళితుల ఐక్యతను బలహీనపరిచారని దుయ్యబట్టారు. దళితులపై అన్యాయం జరుగుతున్నా కొందరు నాయకులు, సంఘాల ప్రతినిధులు మౌనం పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు లోకేష్రెడ్డి, ఇరుగమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. ఆయన సోమ వారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో లోఓల్టేజీ, వ్యవసాయ సర్వీసుల మంజూరు, ట్రాన్స్ఫార్మర్ల సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలు ఉన్నారు. అనంతరం ఎస్ఈ అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేయరాదని ఆదేశించారు. డీసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి కార్వేటినగరం: 2026–27లో డీఈడీ కోర్సు చేసేందుకు ఏపీ డీసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టౌన్లోడ్ చేసుకోవాలని డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దామోదర రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 1న ప్రవేశ పరీక్ష జరగనుందని తెలిపారు. హాల్టికెట్లను వెబ్సైట్ apdeecet.apcfss.in సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈమేరకు డీసెట్ చైర్మన్, డైరెక్టర్ పాఠశాల విద్య అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు పేర్కొన్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు చిత్తూరు అర్బన్: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో వగళ్ల మోహన్ రెడ్డి (37) అనే ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహ న కుమారి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. సదుం మండలం గుట్టమీదపల్లె బస్టాప్ వద్ద 2014 మే 24వ తేదీన 17 ఏళ్ల బాలిక బస్సు కోసం వేచి ఉంది. ఆ సమయంలో గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్రెడ్డి తన ఆటోలో ఆమెను ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక, ఆటోను పక్కకు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అదేరోజు బాలికను హైదరాబాద్కు తీసుకెళ్లాడు. బాలికను వదిలేయాలని మోహన్రెడ్డి స్నేహితుడు చెప్పగా, అక్కడే వదిలేశాడు. ఆపై బాలిక తన స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీనిపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సదుం పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో సహా నేరం రుజువుకావడంతో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తిగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం తరఫున అందజేయాలని జిల్లా కలెక్టర్ను కోర్టు ఆదేశించింది. టిప్పర్ను ఢీకొన్న కారు – ఒకరి మృతి – మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గుడిపాల: మండలంలోని వసంతాపురం వద్ద సోమవారం టిప్పర్ను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రామ్మోహన్ కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వందవాసికి చెందిన నారాయణస్వామి(60), దివ్య(16), బాలసుబ్రమణ్యం(50), విజయలక్ష్మి, చారులత, కావ్య, విజయలక్ష్మి కారులో శ్రీకాళహస్తి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వసంతాపురం వద్ద ముందు వెళుతున్న టిప్పర్ను కారు ఢీకొంది. దీంతో నారాయణస్వామి, దివ్య, బాలసుబ్రమణ్యం(50) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రమణ్యం మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. విజయలక్ష్మి, చారులత, కావ్యకు స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.10,700 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీన్కుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుతున్న 11 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.10,700 కోట్ల బకాయిలను ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజులు విడుదల చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా రూ.2,200 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా తొక్కిపెట్టిందన్నారు. ప్రతి ఏటా ఫీజుల పథకానికి రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉండగా, 2026–27 బడ్జెట్లో రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లో రూ.1200 కోట్లు చూపి, రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. గతంలో వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్కు రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు అందేవన్నారు. ప్రస్తుత కూటమి సర్కారు నిధుల కోతతో 11 లక్షల మంది విద్యార్థులను పథకాలకు దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే బకాయిలతో సంబంధం లేకుండా కాలేజీల నుండి విద్యార్థుల సర్టిఫికెట్లు తక్షణమే ఇప్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ధర్నాలో నాయకులు లిఖిత్, వివేక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
నేతన్నల ధర్నా
చిత్తూరు కలెక్టరేట్: చేనేత కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగ దని రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యా చరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగవర్మ మండిపడ్డారు. చేనేత కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు పెండింగ్లో ఉన్న రూ.203 కోట్ల బకాయిలు ఇవ్వాలన్నారు. గత ఏడాది ఆగస్టు 7న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా నేతన్న భరోసా కింద రూ.25 వేలు విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లను కేటాయించాలన్నారు. చేనేతలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరహాలోనే చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. చేనేత అనుబంధ ఉపవృత్తి కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు కె.వి.కుప్పయ్యశెట్టి, గౌరవాధ్యక్షుడు నీలా పండరి, జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు చల్లా బాలాజీ, నాయకులు చల్లా మురగయ్యశెట్టి, చల్లా లోకనాథంశెట్టి, కందల బాలాజీ, నీల శంకర్, కోటేశ్వరి పాల్గొన్నారు. ప్రశాంతంగా ముగిసిన కౌన్సెలింగ్ – 490 మంది టీచర్ల బదిలీలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. చిత్తూరు ఇన్చార్జ్ డీఈవో వెంకటేశ్వరరావు, తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్ సంయుక్తంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌన్సెలింగ్ను పకడ్బందీగా చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 490 మంది ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ కోసం విద్యాశాఖ అధికారులు 868 ఖాళీలను ప్రదర్శించారు. ఈ బదిలీల్లో పాల్గొన్న వారిలో 1998 డీఎస్సీ టీచర్లు 316 మంది ఉండగా, 2008 డీఎస్సీకి చెందిన వారు 174 మంది ఉన్నారు. సీనియారిటీ, నిబంధనల ప్రకారం పారదర్శకంగా స్థానాలను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పర్యవేక్షణలో చిత్తూరు, తిరుపతి జిల్లాల విద్యాశాఖ సూపరింటెండెంట్లు రమేష్, నాగరాజు, గుడిపాల ఎంఈవో హస్సన్బాషా, ఏఎస్వో ఆనంద్, ఏపీవో జయప్రకాష్, ఉపాధ్యాయ సంఘం నేతలు గంటా మోహన్, కన్నన్, విజయ భాస్కర్, ప్రకాష్, మదన్ మోహన్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని బాలుడి మృతి
గంగవరం: బైక్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెద్దఉగిణి గ్రామంలో మహమ్మద్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతని మొదటి కుమారుడు అమిద్(10) ఇదే గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో 4వ తర గతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ట్యూషన్ ముగించుకుని చికెన్ సెంటర్లో ఉంటున్న తన తండ్రి దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్న బైక్ ఢీకొంది. బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పెద్దఉగిణి గ్రామానికి సమీపంలో ఉన్న హైవే నుంచి గ్రామంలోకి రావాలంటే నానా తప్పలు పడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు క్రాస్ చేసే క్రమంలో వాహనాలు ఢీకొని ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు పేర్కొంటున్నారు. అక్కడ స్కై వాకర్ ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు వెలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆలకించి దయచూపండయ్యా..!
చిత్తూరు కలెక్టరేట్ : అధికారుల తప్పిదాలు, కొందరి అక్రమాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. ‘ఆలకించి దయచూపండయ్యా.. అని పలువురు ప్రజలు వాపోయారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో తమ గోడును కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఎదుట వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ వినతులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 238 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ అధికారు లు వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శ్ రా జేంద్రన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జీవితంలో యోగా భాగం కావాలి
చిత్తూరులో యోగాసనాలు వేస్తున్న అధికారులు, ప్రజలుకాణిపాకంలో యోగాసనాలు వేస్తున్న ఆలయ సిబ్బంది, ఉద్యోగులు చిత్తూరు కార్పొరేషన్/కాణిపాకం: నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చుడా చైర్పర్సన్ హేమలత, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్వో ఉదయభాస్కర్, ఆయుష్ నోడల్ అధికారి గోవిందప్ప, యోగా గురువులు శ్రీనివాసులునాయుడు, బాబునాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు, డీఈవో సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనపాల్, తదితరులు పాల్గొన్నారు. -
కాపుల ఆత్మగౌరవానికి ఇది పరీక్ష
కాపు యువకుడికి ఇంత పెద్ద అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం, మా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మౌనం వహించడం బాధాక రం. ఎన్నికల సమయంలో కాపుల గురించి మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? సమాజం ఈ ప్రశ్నకు సమాధానం కోరుతోంది. మాటలు కాదు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – జైకుమార్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు పవన్కల్యాణ్ స్పందించాలి ఎవరు నేరం చేసినా చట్టం ప్రకారం శిక్ష ఉండాలి.. చట్టం ముందు ప్రతి ఒక్కరికీ సమాన రక్షణ లభించాలి. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి రావాలి. లేకుంటే బలిజ సోదరులంతా ఏకమవుతాం. దీనిపై మా పవన్ కల్యాణ్ కూడా స్పందించాలి. జరిగిన అన్యాయంపై నిలదీయాలి. – దళవాయి బాబు ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సంఘం, యూత్ ప్రెసిడెంట్, కాజూరు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి... సాయికృష్ణ ప్రాణం తిరిగి రాదు. అతని కుటుంబానికి న్యాయం జరగాలి. అసలు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. బాధ్యులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాలి. ఈ ఘటనను కాలగర్భంలో కలిపేయకుండా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. – దళవాయి సురేష్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సంఘం సభ్యులు, కాజూరు -
టమాటాలను మేమే అమ్ముకుంటాం
పలమనేరు: రైతులను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఇలాగే చేస్తే తామే బాక్సులు తెప్పించి సరుకును విక్రయిస్తామంటూ టమాటా రైతులు స్థానిక మండీ వ్యాపారులకు అల్టిమేటం జారీ చేశారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని కోలారు మార్కెట్కు, ఇక్కడికి ధరల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. వారు ఆదివారం మార్కెట్ వద్ద ఆందోళనకు దిగారు. ఆపై మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్నను పిలిపించి స్థానిక మండీ వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ పొరుగునే ఉన్న కోలారులో టక్పట్టీ ద్వారా తక్కువ కమీషన్తో రైతుకు మేలు కలిగేలా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. దీంతో గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయన్నారు. ఇక్కడ 15 కిలోల బాక్సు అంటూ 17 కేజీల బాక్సుల్లో కాయలు నొక్కేస్తున్నారని నిరూపించారు. వ్యాపారులు తమ మండీల వద్ద సరుకును ఎక్కువగా ఉంచుతుండడంతో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మార్కెట్కు వచ్చే ఇతర కూరగాయలను ఎక్కడ పెట్టుకోవాలో, ఎక్కడ వేలం వేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు. దీనిపై స్పందించిన చైర్మన్ రాజన్న మార్కెట్లోని దక్షిణం వైపు కూరగాయల వేలంపాట నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు కూరగాయల వేలాన్ని ఇకపై ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల లోపు పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారు. చుట్టుపక్కలున్న మార్కెట్లతో పాటే ఇక్కడ కూడా వేలం పాటలు నిర్వహించేలా చూడాలన్నారు. రైతులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోకుంటే తామే బాక్సులు తెచ్చి వ్యాపారులతో మాట్లాడి సరుకు నేరుగా అమ్ముకుంటామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో రైతులు కూర్మాయి రవి, బేరుపల్లి గోవిందు రెడ్డి, బాలాజీ, దేవా, ఉమాపతి, నరేష్, రామాపురం హరి తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎస్పీ తుషార్డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజ లు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చిత్తూరు అర్బన్: చిత్తూరు అర్బన్ పరిధిలో నాలుగు బెల్ట్ దుకాణాలను గుర్తించి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రవి తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన ఓ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి 32 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. బైక్ను ఢీకొన్న కారు పూతలపట్టు(యాదమరి) : పూతలపట్టు మండలంలోని రంగంపేట క్రాస్ సమీపంలో చిత్తూరు–పూతలపట్టు జాతీయ రహదారిపై ఆదివారం బైక్ను కారు ఢీకొంది. దీంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని గొడుగుచింత గ్రామానికి చెందిన దాము పూతలపట్టులో ఫొటో స్టూడియో నడుపుతున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనుల నిమిత్తం పి.కొత్తకోట వైపు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అదేసమయంలో చిత్తూరు వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దామును తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి నగరి : మున్సిపల్ పరిధి కొండచుట్టు మండపం సమీపంలో ఆదివారం గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహా న్ని పోలీసులు గుర్తించారు. సీఐ మల్లికార్జున్రావ్ మాట్లాడుతూ అనారోగ్యం పాలైన వ్యక్తిని ఇంటి వద్ద ఉంచుకోలేక ఎవరికీ తెలియకుండా కొండచుట్టు మండపం సమీపంలో వది లేసి ఉంటారని తెలిపారు. అతను శనివారం రాత్రి మృతిచెంది ఉంటారని పేర్కొన్నారు. అతని ఆచూకీ తెలిసిన వారు 9440796723 నంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని మూ డు రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచుతామన్నారు. గాయపడిన వ్యక్తి మృతి బైరెడ్డిపల్లె : మండలంలోని బైరెడ్డిపల్లె–పుంగనూరు రహదారి లోని ట్రాన్స్కో కార్యాలయం వద్ద నాలుగు రోజుల క్రితం బొలేరో వాహనం ఢీకొనడంతో బైరెడ్డిపల్లెకు చెందిన నజీర్ (70) తీవ్రంగా గాయపడ్డాడు. అత న్ని కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నా రు. వాహనదారులు మద్యం సేవించడంతోపాటు అతివేగంగా వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతకు ఉరి!
జిల్లాలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. కష్టాన్నే నమ్ముకుని .. చెమటను అమ్ముకుంటున్న రైతు పరిస్థితి గందరగోళంగా మారింది. చెరుకు పంటకు ఊపిరిగా నిలిచిన చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది. మామిడికి గిట్టుబాటు ధర లేదు. ఖరీఫ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం వరి సాగుపై చేస్తున్న వ్యాఖ్యలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ ప్రభుత్వం వ్యవసాయంలో పెడుతున్న కోతలతోపాటు ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయినా పరిహారం అందకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.కాణిపాకం: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 20 ఏళ్ల క్రితం చెరుకు సాగు 28 వేల హెక్టార్లకు పైగా ఉండేది. సుమారు 30 వేల మంది రైతులు చక్కెర ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు, గాజులమండ్యం చెరుకు ఫ్యాక్టరీల మూసివేతతో ఆ రైతు కుటుంబాలు వీధిన పడ్డాయి. కొంతమంది రైతులు బెల్లం తయారీ వైపు మొగ్గుచూపారు. బెల్లం తయారీపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో చెరుకు సాగు క్షీణించింది. ప్రస్తుతం సాధారణ సాగు విస్తీర్ణం 6 వేల హెక్టార్లు కాగా 2,500 హెక్టార్లకే పరిమితమైంది. ఎక్కువ మంది రైతులు మామిడి వైపు అడుగులు వేశారు. వేరుశనగ పంటకూ కోత జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం. ఈ సారి 27 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. వాటిలోనూ ఇప్పటి వరకు 3 వేల క్వింటాళ్లు మాత్రమే రైతుల చేతికి చేరాయి. సాధారణంగా మే చివరి వారంలోనే విత్తనాలు పంపిణీ చేయా ల్సి ఉండగా జూన్ చివరికి కూడా పూర్తిస్థాయిలో అందకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో వర్షాలను సాకుగా చూపుతూ వేరుశనగకు బదులు సోయా బీన్స్ సాగు చేయాలని అధికారులు సూచించడం రైతులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. వరి వద్దంటున్నారు పంటలకు మార్కెట్ కల్పించడంతోపాటు గిట్టుబాటు ధరలు ప్రకటించాల్సిన ప్రభుత్వం ఆ పంటే వేయొద్దని చెబుతోంది. వరి సాగు లాభదాయకం కాదని, బియ్యానికి డిమాండ్ ఉండదని, ప్రత్యామ్నాయంగా పామాయిల్, కోకో వంటి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. దీంతో ఏ పంట సాగు చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఖరీఫ్లో జిల్లాలో 10 వేల హెక్టార్లు, రబీలో 30 వేల హెక్టార్లకు పైగా వరి సాగవుతుండగా, మంత్రి చేసిన వ్యాఖ్యలు రైతుల్లో తీవ్ర నిరాశను నింపాయని రైతు సంఘాలు అంటున్నాయి. ‘వరి వేయొద్దు... ఎవరు కొనరు‘ అనే సంకేతం రైతు భవిష్యత్తుపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టేనని నాయకులు విమర్శిస్తున్నారు. పరిహారం మాటల్లోనే... 2024లో కరువు కారణంగా జిల్లాలో సుమారు 9 వేల హెక్టార్లలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులు రూ.15 కోట్ల నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బృందం కూడా పర్యటించింది. నేటికీ రైతులకు పరిహారం అందలేదు. 2025లో వరుస తుపాన్లతో వరి, టమాటా, ఉద్యాన పంటలు భారీగా నష్టపోయాయి. రూ.1.20 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వ యంత్రాంగమే నివేదికలు సమర్పించినా పరిహారం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం జిల్లాలో ప్రధాన పంటలన్నింటిపైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిందిపోయి ప్రత్యామ్నాయ పంటల పేరుతో బాధ్యతలను రైతుపైనే నెట్టేస్తోందని మండిపడుతున్నాయి. అన్నం పెట్టే రైతు భరోసా కోల్పోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని హెచ్చరిస్తున్నాయి. రైతు ఆశలపై కూటమి కత్తి మామిడిపైనా దెబ్బ జిల్లలో 59 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగయ్యాయి. తోతాపురి రకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఏడాదికేడాది కాయల ధరలు పతనమవుతుండడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. సాధారణంగా తోతా పురి రకం కేజీ మామిడి పండించేందుకు రైతుకు రూ.14 వరకు ఖర్చవుతోంది. మార్కెట్లో రూ.3 నుంచి రూ.6 మాత్రమే ధర లభిస్తోంది. కనీస మద్దతు ధర ప్రకటించాల్సిన ప్రభుత్వం కేజీకి రూ.4 ప్రోత్సా హకం ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. ఈ కారణంగా మామిడి తోటల తొలగింపుకు రైతులు సిద్ధమవుతున్నారు. చిల్లిగవ్వ కూడా సాయం లేదు నాకు 4 ఎకరాల పొలం ఉంది. రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. రెండేళ్లుగా వరుస తుపాన్లతో పంట మొత్తం నేలమట్టమైంది. నష్టం అంచనా వేసి ఏళ్లు గడుస్తోంది. ఇంత వరకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదు. మరో రెండు ఎకరాల దాకా మామిడి ఉంది. పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. వ్యవసాయంలో జరిగే నష్టాలను చెబితే ప్రభుత్వం ఆ పంటలు వద్దు..ఈ పంటలు వద్దు అని చెబుతోంది. – మదివానన్, ఆముదాల, పాలసముద్రం మండలం -
పవన్కళ్యాణ్ పొలిటికల్ బఫూన్
నగరి : సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ ఎన్నికల్లో హంగామా చేసి, నేడు ఆ కేసులో ఆధారాలను వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చెరిపేశారంటూ చేతులెత్తేసిన పవన్కళ్యాణ్ పొలిటిల్ బఫూన్ అయిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆమె ఆదివారం వడమాలపేట తిరుమణ్యంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంపై పవన్కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. సుగాలి ప్రీతి చనిపోయింది 2017 చంద్రబాబు పాలనలో అని తెలిపారు. 2019 ఎన్నికల వరకు ఆ కేసు గురించే పవన్ మాట్లాడలేదన్నారు. గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యడం కోసమే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారన్నారు. నేడు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సుగాలి ప్రీతికి ఆయన ఎందకు న్యా యం చెయ్యలేదని ప్రశ్నించారు. పైగా జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలను చెరిపేశారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనసున్న మారాజు జగనన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కర్నూలు పర్యటనకు వెళ్లిన సమయంలో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమ బాధను చెప్పుకున్నారని తెలిపారు. దీంతో చలించిన ఆయన ఆమె తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం ఇవ్వడంతో పాటు కేసును సీబీఐ విచారించాలని కోరారని రోజా అన్నారు. మోదీతోను, అమిత్షాతోను సత్సంబంధాలు పెట్టుకున్న పవన్కళ్యాణ్ సీబీఐ విచారణను ఎందుకు కోరలేదన్నారు. విచారిస్తే పట్టుబడేది టీడీపీ, జనసేన నేతలే కనుక దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఏం సమాధానం చెబుతావు పవన్? జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళకు లోబరచుకొని ఐదు సార్లు అబార్షన్ చేయించి, రోడ్డుపై కొట్టిస్తే పవన్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జనసేన పార్టీకి చెందిన కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు చంపి బూడిద చేస్తే మాట్లాడడం లేదన్నారు, క్రాంతి అనే దళిత బిడ్డ కనిపించకుండాపోతే పట్టించుకోలేదన్నారు. ఆయన నియోజకవర్గంలో ఒక చిన్నారి రెండు వారాలుగా కనిపించకుంటే పట్టించుకోలేదన్నారు. జనసేన జెండాలు మోసిన వారికీ న్యాయం చెయ్యలేకపోయారని, కాపులకూ న్యాయం చెయ్యలేకపోయారని, దళితులకు న్యాయం చెయ్యలేదని, ప్రజలను పట్టించుకోలేదన్నారు. రాజకీయాలకు పవన్ పనికిరారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని మాజీ మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని విషయాలపై అవగాహన ఉన్నట్లు ఊగిపోయిన పవన్ నేడు ప్రతి దానిపైనా అవగాహన లేదని తప్పించుకుంటున్నారన్నారు. చంద్రబాబు స్క్రిఫ్ట్ చదవడం మాత్రమే ఆయనకు తెలిసిన పని అన్నారు. ప్యాకేజీల కోసం చంద్రబాబు పల్లకీని మోస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కాలు కదిపే వరకు ప్రభుత్వంలో కదలికలు రావడం లేదన్నారు. సాయికృష్ణ తల్లిని జగనన్న వెళ్లి చూస్తే వెంటనే చంద్రబాబు ఇంటికి పిలిపించుకున్నారన్నారు. ఆమెకు ఎలాంటి భరోసా ఇచ్చారో మీడియా ముందు చెప్పడం లేదన్నారు. పవన్ను గెలిపించడానికి కష్టపడిన యువకుడు చనిపోతే అతనిపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి పవన్ చేతులు దులుపుకుంటున్నారని, తాను హోంమంత్రి కాదంటూ తప్పించుకుంటున్నారన్నారు. క్రిమినల్ కేసులు ఉంటే చట్టపరంగా శిక్షించాలని లాకప్లో కొట్టి చంపేయడం ఏంటన్నారు. అనిత హోమ్ మంత్రిగా పనికిరాదని ఆయనే చెప్పారని, ఎందుకు పవన్ హమ్ మంత్రిత్వశాఖ తీసుకోకూడదన్నారు. చదువులు అటకెక్కాయి మరోవైపు ప్రైవేటు పాఠశాలల, కళాశాలలపై మోజుతో ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయి, పాఠశాలలకు స్కూలు బుక్కులు, బ్యాగులు ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితి ఉందంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నదెందుకని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో మాత్రమే పవన్, లోకేష్లు చంద్రబాబును మించిపోయారన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత పరిపాలనలో ఉండటంతో రాష్ట్రానికి శనిపట్టిందన్నారు. బిడ్డలు కనిపంచకుండా పోతే ఆ తల్లులు ఎలా బాధపడతారో తమకు తెలుసన్నారు. సీబీఐ ఎంక్వయిరీ వేసి వారికి న్యాయం జరిగేంత వరకు వదలిపెట్టమన్నారు. -
నిరంతర అధ్యయనంతోనే మెరుగైన వైద్య సేవలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మనోవైద్య రంగంలో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలు సుకుంటూ నిరంతర అధ్యయనం చేయ డం ద్వారానే రోగులకు అత్యుత్తమ వైద్య సేవ లు అందించగలమని ది అపోలో యూనివర్సి టీ వైస్ ఛాన్స్లర్ హెచ్.వినోద్ భట్ తెలిపారు. చిత్తూరు నగరంలోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్ఆర్) సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాప్ప్స్–2026 (రాపిడ్ అపోలో సైకి యాట్రీ ప్రిపరేషన్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్) కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి శాసీ్త్రయ సదస్సులు భవిష్యత్ వైద్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అలాగే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు దోహద పడతాయన్నారు. ఏఐఎంఎస్ఆర్ అసోసియేట్ డీన్ రమ్య రామకృష్ణన మాట్లాడుతూ వైద్య విద్యలో నాణ్యతను పెంచేందుకు ఏఐఎంఎస్ఆర్ ఆధునిక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో అపోలో నాలెడ్జ్ సిటీ యూనిట్ హెడ్ బాలరాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ చిత్తూరు కార్పొరేషన్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నా రు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్ను సంప్రదించి కూడా ఫిర్యాదులను తెలియజేయవచ్చని వివరించారు. ఆర్యావర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్పై శిక్షణ చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 29వ తేదీ (సోమవారం) నుంచి 31 రోజుల పాటు మహిళలకు ఆర్యవర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్పై పూర్తి ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్ , రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా నీట్ పరీక్షలు చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులో ఆదివారం నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్టు నీట్ సిటీ కో ఆర్డినేటర్ జీవనజ్యోతి తెలిపారు. నగరంలోని పీవీకేఎన్, సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలు, లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలోని పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1,111 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 133 మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడీ తనిఖీ చేశారు. మానవత్వం చాటుకున్న పోలీసులు పోలీసులు ఆదివారం నీట్ పరీక్షల్లో విద్యార్థికి సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. పుంగనూరు మండలం బర్నేపల్లెకు చెందిన శోభన్ పరీక్ష రాయడానికి సావిత్రమ్మ కళాశాలకు వచ్చాడు. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువచ్చాడు. ఒరిజినల్ ఉంటేనే లోనికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన అతడిని గమనించిన పోలీసులు వెంటనే పోలీసు వాహనంలో నెట్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ ఆధార్కార్డు డౌన్లోడ్ చేయించి సరైన సమయానికి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టారు. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేవు. -
అపోలో యూనివర్సిటీ డీన్కు జాతీయ అవార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ది అపోలో యూనివర్సిటీకి చెందిన అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్ రెడ్డికి జాతీయ అవార్డు దక్కింది. ఆయన ఔషధ శాస్త్ర పరిశోధన, విద్యా రంగంలో విశిష్ట సేవలకు గాను అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా (ఏపీటీఐ) – తమిళనాడు శాఖ ప్రతిష్టాత్మక రిసెర్చర్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అవార్డు–2026ను ప్రదానం చేసింది. చైన్నెలోని రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్వహించిన ‘‘ఎంపవరింగ్ ఫ్యూచర్ ఫార్మసిస్టిస్ త్రూ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ జాతీయ సదస్సులో అవార్డు అందజేశారు. ఈ ఘనతపై ది అపోలో యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని మృతి పలమనేరు: రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఇంటర్ విద్యార్థిని చికి త్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసు ల కథనం మేరకు.. బైరెడ్డిపల్లి మండలం చిన్నపురానికి చెందిన భాస్కర్రెడ్డి కుమార్తె హర్షిత(17) పలమనేరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏమి జరిగిందోకాని రెండు రోజుల క్రితం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
సంక్షోభంలో చేనేత పరిశ్రమ
నగరి : జిల్లాలో చేనేతపై ఆధారపడి సుమారు 5 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, 15 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారికి గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి ఏటా రూ.24 వేలు ఇచ్చి ఆదుకుంది. ప్రభుత్వం మారడంతో నేతన్న నేస్తం అటకెక్కింది. ప్రతి ఏటా రూ.25 వేలు ఇస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. ఇటీవల ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో రోజంతా పనిచేసినా రూ.400 సంపాదించలేకపోతున్నామని నేతన్నలు అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించినా అది కంటితుడుపుగా మారింది. చేనేతపై ఆధారపడిన అనుబంధ రంగాల వారికి దానిని వర్తింపజేయలేదు. దీంతో చేసేదేమీ లేక న్యాయం కోసం చేనేతన్నలు పోరాటానికి దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట చేనేత ఐక్యపోరాట సమితి పేరిట ధర్నా చేపట్టనున్నారు. జిల్లాలోని 16 సంఘాల వారు ఈ కార్యక్రమంలో కలుసుకోవాలని పిలుపునిచ్చారు. చేనేతల ధర్నాలో ప్రధాన డిమాండ్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన చేనేత పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ముడి సరుకులైన నూలు, రంగులు, జరీ, పట్టు, రసాయనాలు, రవాణా ఖర్చులు పెరగడంతో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ, మార్కెటింగ్, ప్రచారం లేకపోవడం, చేనేత సహకార సంఘాల నిర్వీర్యం తదితర కారణాలతో చేనేత వస్త్రాల తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో చేనేత పరిశ్రమ ముందడుగు వేయలేకపోతోంది. భావితరం సైతం చేనేత వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. -
కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం
బంగారుపాళెం : మండలంలోని బలిజపల్లె వద్ద ఉన్న చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం కారును ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనదారుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కుప్పం మండలం పైపాళెంకు చెందిన మురుగన్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను ద్విచక్ర వాహనంపై బంగారుపాళెం నుంచి పలమనేరు వైపు వెళుతూ బలిజపల్లె వద్ద ముందు వెళ్తున్న కారును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలో అసస్మారక స్థితిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతన్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది నిజాయితీ అతని వద్ద ఉన్న రూ.55 వేల నగదును ఆస్పత్రి డాక్టర్ స్వరూప్ సమక్షంలో మురుగన్ తమ్ముడు సుధీర్కు అందజేశారు. 108 సిబ్బంది నిజాయితీని పలు వురు అభినందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్లలోనే కుళ్లుతున్న మామిడి
● ఫ్యాక్టరీ వద్ద కిలోమీటర్ల మేర నిలిచి పోయిన వాహనాలు ● అన్లోడ్ చేయడానికి రోజుల తరబడి నిరీక్షణ ● గిట్టుబాటు ధర రూ.15 ఇవ్వాలి ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధర నెల్లూరు: ఫ్యాక్టరీ నిర్వాహకులు సకాలంలో మామిడి కాయలను అన్లోడ్ చేయకపోవడంతో ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. మామిడి కాయలను తీసుకువచ్చిన ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆయన ఆదివారం జీడీ నెల్లూరు మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద వందలాదిగా వేచి ఉన్న మామిడి ట్రాక్టర్లను చూసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మోతరంగనపల్లి మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద దాదాపు 350 ట్రాక్టర్లు, అబ్బాస్ నగర్ కాలనీ వద్దగల పరిశ్రమ వద్ద దాదాపు 400 ట్రాక్టర్లు అన్లోడింగ్ కోసం వేచి ఉన్నాయ ని తెలిపారు. సీరియల్ నంబర్ కోసం రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. నంబర్ పొందాక అన్లోడింగ్ చేయడానికి లోడుకు వారం రోజులు పడుతోందని తెలిపారు. ఈ లోపు కాయలు సగానికి సగం కుళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల బాధను గుర్తించి రూ.15ల గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
చట్టం ప్రకారం జరిగి ఉంటే భయమెందుకు?
పోలీసులు చట్టప్రకారమే వ్యవ హరించి ఉంటే పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలి. అరెస్ట్ ఎప్పుడు చేశారు? ఏ పరిస్థితుల్లో ఉంచారు? ఎలా మృతి చెందాడు? ప్రతి ప్రశ్నకు ప్రభు త్వం సమాధానం చెప్పాలి. నిజం ప్రభుత్వ వైపే ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం ఏముంది? సాయికృష్ణ తల్లిదండ్రు లు తన కొడుకు మృతదేహమైనా.. లేకుంటే బూడిదైనా ఇవ్వండి అంటున్నారు. దీనిపై ప్రభు త్వం నోరు తెరవాలి. – విశ్వనాథ్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు పవన్ కల్యాణ్ స్పందించాల్సిన సమయం ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగితే ముందుండి పోరాడిన పవన్ కల్యాణ్ ఇప్పు డు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక కాపు యువకుడి కుటుంబం న్యాయం కోరుతున్న వేళ ఆయ న మౌనం ప్రజలను బాధిస్తోంది. రాజకీయాలకు అతీతంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలి. ఈ ఘటనపై అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హైకోర్టు పర్యవేక్షణ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. – మల్లేల గౌతమ్రాజ్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు -
సాయికృష్ణ ఆచూకీ ఏదీ!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనలో పూర్తి వాస్తవాలను వెలికితీసి, బాధ్యులెవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చిత్తూరు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయుల బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, వాటిపై ప్రభుత్వం, పోలీసు శాఖ సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. అతని అరెస్ట్ ప్రక్రియ నుంచి మృతి వరకు జరిగిన పరిణామాలపై స్వతంత్ర విచారణ జరిపి, నిజానిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టంపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే పారదర్శక దర్యాప్తు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు. వారి మాటాల్లోనే చూద్దాం.. -
చెరువు కాదు రోడ్డు
గాంధీ రోడ్డులో నిర్మించిన చిన్నపాటి కాలువ (ఫైల్) గతేడాది ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డులో రోడ్డు, కాలువను ప్రారంభించి పది రోజులు కూడా కాలేదు. చిన్నపాటి వర్షానికే గాంధీ రోడ్డు ఓడరేవులా మారిపోయింది. రూ.కోట్లు ప్రజాధనం వెచ్చించి కార్పొరేషన్ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఈ రోడ్డు, కాలువ పనులు చేపట్టారు. గతంలో ఇక్కడ నాలుగు అడుగుల వెడల్పుతో కాలువ ఉండేది. దాని స్థానంలో రెండు అడుగుల కాలువ నిర్మించారు. శనివారం కురిసిన మోస్తరు వర్షానికే కాలువలోని మురుగు మొత్తం రోడ్డుపైకి వచ్చింది. కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడే ‘సాక్షి’ దినపత్రికలో అధికారుల తీరును హెచ్చరించింది. వారు పట్టించుకోలేదు. చిన్నపాటి వర్షానికే కాలువలు పొంగుతూ కొత్తగా నిర్మించిన రోడ్డును కోసేస్తున్నాయి. వర్షాకాలంలో పెద్ద వర్షం పడితే రూ.కోట్ల ప్రజాధనం వర్షార్పణం. – చిత్తూరు అర్బన్ -
కనీస వేతనం రూ.34 వేలు ఇవ్వాలి
చిత్తూరు అర్బన్: ఎన్నికల హామీ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు కనీసం వేతనం రూ.34 వేలు ఇవ్వాలని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.నాగరాజన్ డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శనివారం చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ కార్మికులను దశలవారిగా పర్మినెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేయాలని, అప్పటి వరకు కనీస వేతనంగా రూ.34 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. 50 డివిజన్లను 60గా మార్పు చేస్తున్న సమయంలో కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపీనాథ్, కోదండన్, కార్మిక సంఘం నాయకులు వాసు, వినాయక, సురేష్, జయశంకర్, సుగుణ, సుకన్య, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టెంపో బోల్తాపడి ఆరుగురికి తీవ్ర గాయాలు
బైరెడ్డిపల్లె : మండలంలోని పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలో ఉన్న జాలారిపల్లె వద్ద శనివారం టెంపో బోల్తా పడి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా యోగా కోసం మ్యాట్లను వేసేందుకు చిత్తూరు నుంచి కుప్పానికి టెంపో వెళుతోంది. జాలారిపల్లె వద్ద టైర్ పగలడంతో వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న ఆదామ్ (49), విజయరాజు (37), వినోద్ (29), మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108లో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ చందన ప్రియ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి చిత్తూరు అర్బన్: పరిసరాలను, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటా లని చిత్తూరు ఏఎస్పీ షాను అన్నారు. ఆమె శనివారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పర్యావరణ సంరక్షణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి నాగభూషణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. నవోదయ ఫలితాల్లో సత్తా చాటిన విశ్వం తిరుపతి అర్బన్: జాతీయస్థాయిలో 2026–27కి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యా సంస్థలు సత్తా చాటాయని ఆ సంస్థ అధినేత విశ్వనాథ్రెడ్డి వెల్లడించారు. శనివారం మూడో విడత ఫలితాలు విడుదల చేశారని, తమ వద్ద శిక్షణ పొందిన పద్మిని, చైతన్యనాయక్, ఇందు, బద్రీనాథ్, శాంతికుమారి ఇ. గోమతి, హర్ష, నవనీష్, భావన, సుహాన్ ఉత్తమ ర్యాంకులు సాధించారని వెల్లడించారు. మూడో విడత ఫలితాలతోపాటు 1, 2 విడతల ఫలితాలను కలుపుకుంటే మొత్తం 69 మంది నవోదయ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. దశాబ్దాలుగా విశ్వం విద్యా సంస్థలు నవోదయతోపాటు సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఏటా ర్యాంకులు సాధిస్తుందని చెప్పారు. నవోదయ, సైనిక్ స్కూళ్ల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కోరుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
చైన్స్నాచింగ్ కేసులో దొంగ అరెస్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ద్వారకానగర్లో చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఎస్.దొరైరాజ్ (45) అనే నిందితుడిని అరెస్టు చేసినట్టు సీఐ నెట్టింకటయ్య తెలిపారు. ఆయన శనివారం చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలను వెల్లడించారు. గతనెల 27వ తేదీన ద్వారకానగర్లో ఓ వృద్ధురాలు ముగ్గువేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడన్నారు. దీనిపై కేసు నమోదుచేసి సాంకేతిక ఆధారాలతో తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన దొరైరాజ్ను అరెస్టు చేసినట్టు తెలిపారు. అతని నుంచి రూ.39 గ్రాముల బంగారు చైను, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐ మారెప్ప, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక పైరవీలదే హవా
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 1,750 సీట్లకు గాను ఇప్పటి వరకు 718 మంది ప్రవేశాలు పొందారు. పద్మావతి మహిళా జూని యర్ కళాశాలలో తొలి విడతలో 252 మంది, రెండో విడతలో 191 మంది అడ్మిషన్లు పొందగా మిగిలిన 525 సీట్లును మూడో విడతలో భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఎస్వీ జూనియర్ కళాశాలలో తొలి విడతలో 172 మంది, రెండో విడతలో 103మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా మూడో విడతలో మరో 517 సీట్లు భర్తీ చేయనున్నారు. 24 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ మిగిలి ఉన్న సుమారు 1,032 సీట్లకు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న మూడో విడ త కౌన్సెలింగ్ ప్రక్రియ లో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మెరిట్ లిస్ట్ను 21, 22 తేదీలలో విడుదల చేసి విద్యార్థులకు సమాచారం అందించనున్నారు. వంద సీట్లకంటే ఎక్కువ భర్తీకాకపోవచ్చు రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా కనీసం రెండు కళాశాలల్లో 50 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. మూడో విడతలో మరో వంద సీట్లు కంటే ఎక్కువ భర్తీ కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అనంతరం జరిగే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో అడ్మిషన్లు భారీ స్థాయిలో పెరుగుతాయని అంచానా. స్పాట్ ప్రవేశాలలో మెరిట్ను తుంగలో తొక్కి పైరవీలదే హావా కొనసాగనుంది. -
ఈ అబ్బాయి ఎవరో..?
బంగారుపాళెం: ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిపేరు దిలీప్ అని చెబుతున్నాడు. శుక్రవారం రాత్రి మండలంలోని మొగిలి ఘాట్లోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే స్థానికులు అబ్బాయి వివరాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పేరు దిలీప్ అని చెబుతున్నాడనిని, తల్లిదండ్రుల పేరు, ఊరు పేరు వంటి వివరాలు తెలియదని చెబుతున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో అ అబ్బాయిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అప్పగించారు. పోలీసులు అ అబ్బాయి చిరునామా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అబ్బాయి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసులకు తెలపాలని కోరారు. -
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి
తిరుపతి కల్చరల్: మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు వైఎస్సార్సీపీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చిత్తూ రు జిల్లా వాసి అయ్యి ఉండి కూడా మామిడి రైతు లకు అన్యాయం చేస్తున్నారన్నారు. మామిడి కేజీకి రూ.15 నుంచి రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కూటమి నేతలు కలిసి మామిడికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి సాయి కృష్ణ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చారణ జరిపించాలని, అలాగే సీబీఐతో విచారణ చేపట్టాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఏబీసీడీ వర్గీకరణతో మాదిగలు, మాలలను విడదీసి చంద్రబాబు నాయుడు ఎవరికి మేలు చేశారో చెప్పాలన్నారు. తమిళనాడు తూతుకుడి పోలీస్ స్టేషన్లో తండ్రీ కొడుకులను హింసించిన కేసులో అదే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యం మేరకు 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష ఇదించారని గుర్తుచేశారు. కృష్ణలంక ఘటనలోనూ అదేవిధంగా విచారణ చేపట్టాలని కోరారు. అరే అజయ్కుమార్, వెంకటే ష్, తాళ్లపాక మహేష్, నాగేంద్ర పాల్గొన్నారు. -
బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ
బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా థర్డ్ డిగ్రీ పద్ధతులు కొనసాగుతున్నాయి. సాయికృష్ణ బతి కున్నాడా? లేక ఏమైనా జరిగిందా? ఏది నిజమో ప్రభుత్వం చెప్పాలి. కనీసం అతని ఆచూకీ తెలియజేయాలి. సాయికృష్ణ కుటుంబ సభ్యులు కోరిక మేరకు మృతదేహాన్ని అప్పగించాలి. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాలి. న్యాయంగా దర్యాప్తు చేపట్టాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమష్టిగా ఆందోళనలు చేపడతాం. – జయపాల్, బలిజ సంఘం నేత, చిత్తూరు దురదృష్టకరం సామాన్య పౌరుడైన ఒక కాపు యువకుడికి ఇంతటి అన్యాయం జరుగుతున్నా, సీఎం చంద్రబాబు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తాం. ఆయన ఒక సామాన్య పౌరుడికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థ కావడంలేదు. ఈ విషయంలో పట్టించుకోకుంటే బలిజ సంఘ నేతలంతా ఏకమవుతాం. – ఎన్వీ రమణ, సంఘ నేత, చిత్తూరు -
పవన్ స్పందించకపోవడం బాధాకరం
సాయికృష్ణ ఘట నలో బాధ్యులైన పోలీసు అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణదేవరాయుల బలి జ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర డీజీపీ, సంబంధిత ఐజీ, ఎస్పీ, ఏసీపీతో పాటు ప్రభుత్వ పెద్దల బాధ్యతను కూడా విచారించాలి. ఒక వ్యక్తి కనిపించకుండా పోయినప్పుడు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సింది. ఆలస్యం ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలి. సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీకి మద్దతుదారులేనని, అలాంటి కుటుంబానికి ఇంత పెద్ద కష్టం వచ్చినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. – అప్పొజి, శ్రీకృష్ణదేవరాయల బలిజసంఘ అధ్యక్షుడు, చిత్తూరు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు సాయికృష్ణను పోలీ సులు స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు పలుమార్లు సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆచూకీ అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అక్కడ సీఐ, ఎస్ఐతో పాటు ఇతర సిబ్బంది కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. సాయికృష్ణ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పిటిషన్న్ విచారణకు స్వీకరించినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన కనిపించడం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. – మధురాయల్, శ్రీకృష్ణదేవరాయల బలిజసంఘ సంఘ అధికార ప్రతినిధి -
ఏబీహెచ్ఏ, టీబీ సేవల్లో అలసత్వం వద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అర్హుడికీ ఏబీహెచ్ఏ ఖాతా సృష్టించడంతోపాటు ప్రతి టీబీ రోగిని నిక్షయ్ పోర్టల్లో నమోదు చేసి, చికిత్స పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా అదనపు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకట ప్రసాద్ ఆదేశించారు. చిత్తూరులోని సత్యనారాయణ పురం, టెలిఫోన్ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ను ఆయన శుక్రవారం సందర్శించి, వైద్య సేవల అమలును సమీక్షించారు. సత్యనారాయణపురం యూపీహెచ్సీలో ఓపీ సేవలు, టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా అందిస్తున్న డిజిటల్ ఆరోగ్య సేవలు, ఏబీహెచ్ ఏ నమోదులు, డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. రోగులతో మాట్లాడి మందుల లభ్య త, వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకుని, అర్హులందరికీ ఏబీహెచ్ఏ ఖాతాలు సృష్టించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం టెలిఫోన్ కాలనీ యూపీహెచ్సీలో ప్రయోగశాల సేవలు, టీబీ నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసుల నిర్వహణ, నిక్షయ్ పోర్టల్ న మోదులు, రోగుల ఫాలోఅప్, పోషకాహార సహాయం అమలును సమీక్షించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య, ఆరోగ్య సిబ్బందికి సూచించారు. -
సాయికృష్ణ ఎక్కడ?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సాయికృష్ణ ఎక్కడ? అని కాపు సంఘాల నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజికవర్గంపై వేధింపులు, లక్ష్యంగా చేసుకునే ఘటనలు పెరుగుతున్నాయని బలిజ సంఘ నాయకులు ఆరోపించారు. చిత్తూరు నగరం గంగినేనిపార్కులోని శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వద్ద శుక్రవారం శ్రీకృష్ణదేవరాయుల బలిజ సంఘ ఆధ్వర్యంలో సాయికృష్ణ మృతికి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ పోలీసుల కస్టడీలోకి వెళ్లిన తర్వాత దాదాపు నెల రోజులైనా అతని ఆచూకీ లభించలేదని, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కాపు సమాజాన్ని కలవరపెడుతోందని పేర్కొన్నారు. సాయికృష్ణ ఆచూకీని వెంటనే వెల్లడించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అప్పోజి, ఉపాధ్యక్షులు ఎన్వీ రమణ, అధికార ప్రతినిధి మధురాయల్, నాయకులు జయపాల్, జనార్థన్, శ్రీనివాసులు, చల్లా గిరి పాల్గొన్నారు. మరికొంత మంది నాయకులేమన్నారంటే.. వారి మాటాల్లోనే.. కాపు యువకుడి అదృశ్యంపై ఆందోళన -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,703 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. నోటీసులు ఇవ్వాల్సింది మీకే –వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ద్రాక్షాయణి పెనుమూరు(కార్వేటినగరం): గుడివాడ అమర్నాధ్కు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ అయితే, ముందు గా కేసులు పెట్టాల్సింది.. నోటీసులు ఇవ్వాల్సింది మీకేనని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ద్రాక్షాయణి మండిపడ్డారు. శుక్రవారం పెనుమూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే తిమ్మి ని బొమ్మను చేసినట్లు ఉందన్నారు. అధికార పక్షానికి ఒక చట్టం..ప్రతి పక్షానికి ఒక చట్టం ఉందా? అని ప్రశ్నించారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివార అమర్నాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమెన్ కమిషన్ నోటీలు ఇచ్చిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి ఎంతో హుందాతనంగా వ్యవహరించాలన్నారు. అలాంటిది ఒక మాజీ మంత్రిని ఒక కీలకమైన శాఖలో ఉన్న మీరు.. వాడు, వీడు అని అమర్యాదకరంగా మాట్లా డడం సమంజసమేనా అన్నారు. మీరు ఇప్పుడు కూడా ఉపాధ్యాయురాలిగా ఉండి ఉంటే పిల్లలకు ఇలాంటి మాటలే నేర్పేవారా? ప్రశ్నించారు. అలాగే జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి మేకప్ వేసుకుని తిరుగుతుందని, ప్రస్తుత ఎమ్మెల్యే థామస్ విమర్శించినప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసిన మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నా.. ఒక మహిళ హోంమంత్రిగా ఉంటూ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
● రూ 27.80 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● చొరీకి ఉపయోగించిన వాహనలు సీజ్ బంగారుపాళెం: పగటిపూట ఇళ్లల్లో చోరీలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను శుక్రవారం అరెస్టు చేసినట్టు పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్, బంగారుపాళెం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పలమనేరు, బంగారుపాళెం మండలాల్లోని ఇళ్లల్లో జరిగిన చోరీలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంగారుపాళెం సీఐ కత్తి శ్రీనివాసుల పర్యవేక్షణలో పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పక్కాగా అందిన సమాచారం మేరకు బంగారుపాళెం మండలం పాలేరు అండర్ బ్రిడ్జి సమీపంలో ఎస్ఐ ప్రసాద్, సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లోని గ్రామాల్లో పగటిపూట సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారరు. బంగారుపాళెం మండలంలోనిగౌరీపురం,వెలుతురుచేను, రాగిమానుపెంట, పలమనేరు మండలంలో కరిడిమడుగు, చిన్నకుంట, కాలువపల్లె గ్రామాల్లో జరిగిన ఆరు చోరీ కేసులు ఛేదించినట్లు డీఎస్పీ, సీఐ తెలి పారు. తమిళనాడు రాష్ట్రం వాణియంబాడికి చెందిన గాడ్విన్మోసెస్, మురుగన్, విఘ్నేష్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 181.5 గ్రాముల బంగారు ఆభరణా లు, 307 గ్రాములు వెండి ఆభరణాలు, చోరీలకు విని యోగించిన కారు, స్కూటీలను స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు. కేసు ఛేదించిన పోలీసులను ఎస్సీ అభినందించి, నగదు రివార్డును ప్రకటించినట్లు చెప్పారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి.కిలోకి రూ.18 చెల్లించాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతులకు ప్ర భుత్వం ప్రకటించిన రూ.4 గిట్టుబాటు ధరతోపాటు, గుజ్జు ఫ్యాక్టరీల నుంచి తాము డిమాండ్ చేస్తున్న రూ.14 ధరను కలిపి మొత్తం రూ.18 చెల్లించేలా చర్య లు చేపట్టాలని మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షు డు మునీశ్వర్రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘ నాయకులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2026 సంవత్సరానికిగాను తోతాపురి మామిడి రైతులకు కిలోకి రూ.4 చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీలు, ర్యాంపులు అధికారికంగా ఏ ధరకు కొంటున్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. గ త ఏడాది తప్పులు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. 2025లో ప్రభుత్వం రూ.4 ప్రకటించినప్పటికీ, గుజ్జు ఫ్యాక్టరీలు కనీస ధర రూ.8 అమలు చేయకుండా రైతులను నష్టపరిచాయన్నారు. ఆయా ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 50 నుంచి 60 శాతం తోతాపురి మామిడికాయలు ఫ్యాక్టరీలకు, ర్యాంపులకు సరఫరా అయిపోయాయన్నారు. ఇ ప్పుడు ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడంతో రూ.4 సబ్సిడీ కోసం ఫ్యాక్టరీల డేటాపైనే ఆధారపడాల్సి వ స్తుందన్నారు. ఆ డేటాను ఎలా ప్రామాణికంగా తీసుకుంటారో స్పష్టం చేసి, నిజమైన రైతు నష్టపోకుండా చూడాలన్నారు. మామిడి పంటను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తే కూలీల ఖర్చుల రూపంలో రైతులకు జరిగే నష్టాన్ని కొంతవరకై నా తగ్గించాలని కోరారు. నెల రోజులుగా రైతులు టోకెన్లు దొరక్క గు జ్జు ఫ్యాక్టరీల వద్ద, ర్యాంపుల వద్ద నానా అవస్థలు ప డుతుంటే జిల్లాలోని ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోలేదని చెప్పారు. మామిడి రైతు సంఘం ప్రతినిధులు హేమలత, త్యాగరాజ రెడ్డి, చంగల్ రాయ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాయం అందక.. సాగు సాగక..!
కాణిపాకం: ఆర్థిక భారం పేరుతో కూటమి ప్రభు త్వం అన్నదాత సుఖీభవ పథకంలో భారీగా కోత లు పెట్టింది. గత మూడు విడతల్లో రెండున్నర లక్షలకు చేరువలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారి గా జిల్లాలో 29,462 మంది తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత మూడు విడతల వరకు 2,05,753 మంది రైతులు పథకం ప్రయోజనం పొందగా.. 2026 మొదటి విడతలో ఆ సంఖ్య 1,78,622కు పడిపోయింది. దీంతో వేలాది మంది రైతులు తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలే ఎక్కువగా రైతులను అనర్హులుగా మార్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.5 వేల చొప్పున అందజేస్తోంది. 2026 మొదటి విడతలో జిల్లాలో అర్హులైన 1,78,622 మంది రైతులకు రూ.89.311 కోట్లు జమ కానున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద 1,42,109 మంది రైతులకు రూ.2 వేల చొప్పున రూ.28.422 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే జిల్లాలో వేలాది మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సర్వేనే ప్రధాన అడ్డంకి అనర్హుల జాబితాలో అత్యధికంగా 11,714 మంది కుటుంబ సర్వేలో వివరాలు లేకపోవడం వల్ల బయటపడటం గమనార్హం. ఆ తర్వాత తహసీల్దార్ ఽధ్రువీకరణ పెండింగ్లో ఉన్న 8,615 మంది, ఈకేవైసీ తిరస్కరణ పొందిన 6,940 మంది రైతులు ఉన్నా రు. రైతులు ప్రభుత్వానికి అవసరమైన వివరాలను సమయానికి నమోదు చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. రైతుల్లో ఆందోళన గత మూడు విడతల్లో పథకం ప్రయోజనం పొందిన వేలాది మంది రైతులకు ఈసారి డబ్బులు జమ కాకపోవడంతో వారు మండల వ్యవసాయ కార్యాలయా లు, రైతు సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆరా తీస్తున్నారు. తమ పేర్లు ఎందుకు తొలగించారో తెలియక అయోమయంలో ఉన్నారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో జాబితా నుంచి తప్పించారని పలువురు రైతులు వాపోతున్నారు. విడతల వారీగా లబ్ధిదారులు దశ అర్హుల సంఖ్య జమ చేసిన/ చేయనున్న మొత్తం (రూ.కోట్లు) మొదటి విడత 2,05,753 102.88 రెండో విడత 2,05,753 102.88 మూడో విడత 2,05,753 82.30 నాలుగో విడత 1,78,622 89.311 స్వేదాన్ని చిందించి..ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసే కర్షకుడికి కష్టమొచ్చింది. సహకరించని ప్రకృతి..వర్షాభావం..అకాల వర్షాలు..గిట్టుబాటుగాని ధరలు..వెరసి రైతన్న నష్టపోతున్నాడు. పంట సాగుకు అప్పులు చేస్తాడు.. పంట చేతికందక కుంగిపోతున్నాడు.. చేయూత నివ్వాల్సిన సర్కారు సాయం అందించడలో మీనమేషాలు లెక్కిస్తోంది. సాంకేతిక కారణాలు చూపి కోతలు విధిస్తోంది. ఫలితంగా అన్నదాత పుడమికి దూరమవుతున్నాడు.. వలసలు పోతున్నాడు. ఇదీ చంద్రబాబు సర్కారులో దుస్థితి. అన్నదాత సుఖీభవలో భారీ కోతలు! సాంకేతిక కారణాలతోనే కోతలు అనర్హుల జాబితాను పరిశీలిస్తే ఎక్కువ మంది రైతులు సాంకేతిక కారణాలతోనే పథకానికి దూర మయ్యారు. బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ లేకపోవడం, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, కుటుంబ సర్వేలో వివరాలు నమోదు కాకపోవడం, తహసీల్దార్ స్థాయిలో ధ్రువీకరణ పెండింగ్లో ఉండడం తదితర కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎన్పీసీఐ ఇన్యాక్టివ్ సమస్యతో 963 మంది, ఎన్పీసీఐ లింక్ కానివారు 1,213 మంది, ఈకేవైసీ పెండింగ్ 17 మంది, ఈకేవైసీ తిరస్కరణ 6,940 మంది, తహసీల్దార్ పరిశీలనలో 8,615 మంది, కుటుంబ సర్వేలో పేరు లేనివారు 11,714 మందికాగా మొత్తం అనర్హులు 29,462 మందిగా తేలారు. -
జగనన్న కాలు కదిలితేనే.. సమస్యల్లో కదలిక
నగరి: జగనన్న కాలు కదిలితేనే..రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్లో కదలిక వస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ కేసుకు సంబంధించి సీఐని సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం తప్పు జరిగి నట్లు అంగీకరించిందన్నారు. ‘కోర్టు తీర్పు వెలువడకముందే పోలీస్ స్టేషన్లోనే శిక్షలు అమలు అవుతున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? దీనిపై ప్రజలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?’ అని నిలదీశారు. అలాగే ఆక్వా రైతుల సమస్యలపై స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక చేసిన తరువాతే ప్రభుత్వం స్పందించిందని ఫీడ్ యాజమాన్యాల తో చర్చలు జరిపేందుకు సిద్ధమైందన్నారు. జగనన్న కాలుకదపకపోతే రాష్ట్రంలో ప్రజల సమస్య లు పరిష్కారమయ్యేలా లేవన్నారు. ఆయన మా ట్లాడకపోతే ఈ రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కా రంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ప్రతిపక్షం ఒత్తిడి చేసిన తరువాత మాత్రమే స్పందించడం సరైన విధానం కాదన్నారు. సాయికృష్ణ మరణం కస్టడీ హింస అనుమానాలకు తావిస్తోందని పోలీ సు కస్టడీలో తమ బిడ్డ హింసకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్పడం చూస్తుంటే ఈ అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అరెస్ట్, నిర్బంధం, వైద్య పరీక్షలు, సీసీటీవీ దృశ్యాలు, పోస్టుమార్టం నివేదికలు తదితర అన్ని ఆధారాలను పరిశీలించి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశా రు. విజయవాడలో చోటుచేసుకున్న గడే సాయి కృష్ణ అనుమానాస్పద మరణం, పి.క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణం జోక్యం చేసుకుని స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ చేపట్టాలని కోరారు. -
గవర్నర్తో ద్రవిడ వర్సిటీ వీసీ భేటీ
కుప్పం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్నజీర్ను ద్రవి డ వర్సిటీ వైస్ చాన్సలర్ మల్లయ్య శుక్రవారం విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న పట్టాల పంపిణీకి స్నాతకోత్సవం నిర్వహణకు ఆయనను ఆహ్వానించారు. అంతేకాకుండా వర్సిటీ చేపడుతున్న అకడమిక్, వర్సిటీ, పరిశోధనల విష యాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కిరణ కుమార్ పాల్గొన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీగా షాను బాధ్యతల స్వీకారం చిత్తూరు అర్బన్: రాష్ట్ర పోలీసు శాఖ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా అడిషనల్ ఎస్పీగా బదిలీపై వచ్చిన ఎస్.షాను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ తుషా ర్ డూడిను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్ఛం అందజేశారు. ఎస్.షాను 2007లో బీటెక్ పూర్తి చేసి, 2018 బ్యాచ్ డీఎస్పీగా పోలీసు శాఖ లో చేరారు. విధి నిర్వహణలో భాగంగా నార్త్ విజయవాడ ఏసీపీగా, తిరుపతి రైల్వే డీఎస్పీగా పనిచేసి పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ఇటీవల డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీగా పదో న్నతి పొందిన ఆమె, చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. -
బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
రొంపిచెర్ల : వైఎస్సార్ సీపీ బాధితులకు అండగా ఉంటుందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రొంపిచెర్ల, బొమ్మయ్యగారిపల్లె, చల్లావారిపల్లె గ్రామా ల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. కూ టమి బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవస రం లేదన్నారు. తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గెర్లపల్లెలో వైఎస్సార్సీపీ నేత మోహన్రెడ్డి ద్విచక్ర వాహనాన్ని దుండగులు ఎలా దగ్ధం చేశారని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాజారెడ్డిని పరామర్శించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. పాళ్యెంవీధిలో మృతి చెందిన సాయిపీర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పెద్దకురవపల్లెలో శంకర్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సలీంబాషా, కరీముల్లా, బి.మోహన్రెడ్డి, కోటా వెంకటరమణ, బావాజీ, మహబుబ్బాషా, ప్రశాంత్రెడ్డి, గురు, ఓబులేసు, యర్రంరెడ్డి, దుర్గప్రసాద్ రెడ్డి, జగదీష్, ఆనంద్, సుబ్బన్న, కరుణాకర్, శంకర్, కిషోర్, నాగయ్య, హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా భూమిని మార్చేశారని ఫిర్యాదు ‘మా పేరుతో ఉన్న భూమిని తహసీల్దార్ ఇతరుల పేర్లతో మార్చేశారు’ అని బాధితుడు సోమశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గానుగచింత పంచాయతీ జగడంవారిపల్లె కు చెందిన రెడ్డెప్పరెడ్డి పేరుతో సర్వే నంబర్ 658–2లో 50 సెంట్ల భూమికి 2014లో పట్టా మంజూరు చేశారు. అలాగే 665లో 23 సెంట్లు భూమి తమ తాత చిన్న రెడ్డెప్ప రెడ్డి పేరుతో ఉందన్నారు. ఈ రెండు సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఇన్చార్జి తహసీల్దార్ డబ్బు తీసుకుని గ్రామానికి చెందిన కొందరి పేరుతో ఆన్లైన్ చేసి ఇచ్చారని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కలెక్టర్, ఆర్డీఓ తహసీల్దార్ను ఆదేశించినా ఖాతారు చేయడం లేదన్నారు. భూమి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. భూమి వద్దకు వెళ్లితే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. దీనిపై విచారణ జరి పి, న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. పేదలకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించిన రెవెన్యూ, పోలీసు అధికారులను వదిలే ప్రపక్తే లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఏకపక్షంగా పని చేసిన అధికారులు రాబోవు కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. -
మామిడి కాయల లోడుతో వెళ్తూ..
పూతలపట్టు(యాదమరి): చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాధంలో గుంటూరు జిల్లాకు చెందిన మామిడి కాయల వ్యాపారి దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు..గుంటూరు జిల్లా నీడుముక్కల గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కుమారుడు జి.నరసింహారావు(53) బంగారుపాళ్యం మామిడి యార్డులో వ్యాపారం నిమిత్తం కొంత మందితో కలిసి రెండు రోజులు క్రితం వచ్చారు. వ్యాపారం ముగించుకుని మామిడికాయల లోడుతో గుంటూరుకు బుధవారం రాత్రి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం, వేపనపల్లి గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం మరమ్మతుకు గురైంది. డ్రైవర్ గోపి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. అనంతరం డ్రైవరుతో పాటు వాహనంలోని నలుగురు వ్యక్తులు ట్రాలీ ముందు భాగంలో కూర్చుని సేదతీరుతున్నారు. అయితే అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో తిరుపతి వైపుగా ప్రయాణిస్తున్న ప్రయివేటు సంస్థకు చెందిన బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు కూర్చున్న నరసింహారావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర గోపి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పి.కొత్తకోట సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మామిడి కష్టాలపై వైఎస్సార్సీపీ పోరుబాట కదం తొక్కిన రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు
● జైన్ ఫ్యాక్టరీ ఎదుట మిన్నంటిన నిరసనలు ● మద్దతు ధర ఇచ్చేవరకు ఉద్యమిస్తూనే ఉంటాం ● చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన, మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మామిడి మద్దతు ధర కోసం వైఎస్సార్సీపీ నేతలు కదం తొక్కారు. క్షేత్ర స్థాయిలో తోటల్లోకి వెళ్లి పంట పరిస్థితి పరిశీలించారు. చెట్లల్లోనే మామిడి పండ్లు పండి.. రాలిపోయి కుళ్లిపోతున్న వైనాన్ని చూసి చలించిపోయారు. గిట్టుబాటు ధరలేక.. ఒకటికి సగానికి తెగనమ్ముకోలేక.. రోడ్లపక్కన పారబోయడాన్ని చూసి ఆవేదనకు లోనయ్యారు. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతుల గోస కూటమి నేతలకు పట్టడం లేదని నిప్పులు చెరిగారు. మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చేవరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని రైతులకు భరోసానిచ్చారు. అడుగడుగునా ఆంక్షలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మామిడి పోరుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. ఫ్యాక్టరీ వద్ద డీఎస్పీ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసింది. రోడ్లపై ఉన్న ట్రాక్టర్లను బలవంతంగా ఖాళీ చేయించింది. రైతులు గుంపులుగా ఉండరాదని హుకుం జారీ చేయించింది. గంగాధర నెల్లూరు: వైఎస్సార్సీపీ మామిడి పోరుబాటకు విశేష స్పందన లభించింది. జీడీనెల్లూరులోని జైన్ మ్యాంగో ఫ్యాక్టరీ ఎదుట బుధవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. తొలుత ఎట్టేరి ప్రాంతంలోని మామిడి తోటను పరిశీలించారు. అక్కడ చెట్ల నుంచి రాలి.. కుళ్లిపోయిన కాయలను చూసి చలించిపోయారు. రోడ్లకు ఇరువైపులా కాయల పారబోతను గమనించారు. అనంతరం ప్లకార్డులతో ర్యాలీగా జైన్ మామిడి ఫ్యాక్టరీ వద్దకు బయల్దేరారు. మార్గమధ్యంలో క్యూకట్టిన మామిడి ట్రాక్టర్లను పరిశీలించారు. రైతులనడిగి మామిడి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఎదుట రైతులతో కలిసి బైఠాయించారు. మామిడికి మద్దతు ధర ఇవ్వాలంటూ నినాదాలు మిన్నంటించారు. మామిడి రైతును ఆదుకునేవారకు నిరసనలు ఆపేది లేదని తేల్చిచెప్పారు. -
మీరు భయపడాల్సిన పనిలేదు!
బీఎల్వోలు నిజాయితీగా విధులు నిర్వహించండి చిత్తూరు కలెక్టరేట్ : సర్ ప్రక్రియలో బీఎల్వోలు నిజాయితీగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని 11వ వార్డులో ఓ పీఏ సర్ ప్రక్రియ విధుల్లో ఉన్న బీఎల్వోలను బెదిరించిన విషయం పై కలెక్టర్ స్పందించారు. బీఎల్వోలు ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. చిత్తూరు నగరంలోని 11వ వార్డు సమస్య పై బీఎల్వోలు తనకు నేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానన్నారు. బీఎల్వోలకు ఏవైనా సమస్యలుంటే నేరు గా తనకు చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం.. ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందజేసి, వారి ద్వారా పూర్తి చేయించిన తర్వాతే ఆన్న్లైనన్లో వివరాలను అప్డేట్ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 13.4 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 4.5 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని చెప్పారు. ప్రతి ఇంటికి బీఎల్ఓలు కనీసం మూడుసార్లు వెళ్తారని, ఒకవేళ ఇల్లు తాళం వేసి ఉంటే ఫారం కాపీని ఇంటి లోపల వేసి వస్తారన్నారు. బీఎల్ఓలు రాజకీయ పార్టీల కార్యాలయా ల్లో ఫారాలు పంపిణీ చేయడం తీవ్రమైన తప్పు అని కలెక్టర్ మండిపడ్డారు. తాజాగా పలమనేరులో జరిగిన ఘటనలపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలై 14 లోపు ఆన్లైన్ అప్డేట్ ఓటర్లు తమ ఫారాల్లో వివరాలన్నీ నింపి తిరిగి బీఎల్ఓలకు అందజేయాలని కలెక్టర్ వెల్లడించారు. జూ లై 14వ తేదీ లోపు ఈ వివరాలన్నింటినీ బీఎల్ఓ యాప్లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి సోమవారం సమావేశాలు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రతి సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కలెక్ట ర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఉన్నా రాజకీయ పార్టీల నాయకులు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వంద శాతం పారదర్శకంగా ప్రక్రియ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను 100 శాతం పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) తరహాలోనే ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు. 2002 ఓటర్ల జాబితాతో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుపుతున్నా మని తెలిపారు. ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ లోపు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. జూలై 14 వ తేదీన పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లైములు, ఆక్షేపణలు స్వీకరణ ఉంటుందన్నారు. జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు క్లైమ్లు, ఆక్షేపణలపై విచార ణ చేయడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ఉంటుందని వెల్లడించారు. -
రవి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్!
● కిడ్నాప్ చేసింది కడప టీడీపీ బ్యాచ్ ● కర్ణాటకలో ప్రధాన నిందితుడి అరెస్ట్ పలమనేరు: గంగవరానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడింగ్ వ్యాపారి రవి కిడ్నాప్ కేసులో అనేక టిస్టులు వెలుగుచూస్తున్నాయి. ఈ కిడ్నాప్ కేసులో వెఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉప్పలూరు గోవిందరెడ్డి కుమారుడు నాగేశ్వర్రెడ్డి, అతని అనుచరుల హస్తం ఉన్నట్టు తెలిసింది. అదే గ్రామానికి చెందిన పలువురు అతనిపై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. గంగవరానికి చెందిన రవి గత ఆదివారం గ్రామంలో జరిగిన గంగజాతరకు వచ్చి కిడ్నాప్నకు గురైన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇతను టీడీపీ నేత కుమారుడు కాబట్టి ఎలాగైనా ఇతన్ని తప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. బిగ్ ట్విస్ట్ ఇలా ఉండగా రవిని కిడ్నాప్ చేసింది వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రి పురానికి చెందిన నాగేశ్వరరెడ్డిగా సమాచారం. ఇక్కడ జరిగిన కిడ్నాప్ విషయం తెలిసి ఆ గ్రామానికి చెందిన కొందరు అక్కడి పోలీసులకు నిందితుని నేరచరిత్రను తెలిపినట్టు తెలిసింది. దీంతో అతని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో దేవనహళ్లిలో ఇతను పట్టుబడడంతో కిడ్నాప్ విషయంలో అసలు వాస్తవాలు బయటపడనున్నాయి. ఏటీఎం ట్యాంపరింగ్లపై 20 కేసులు గతంలో నాగేశ్వరరెడ్డి ఏటీఎం ట్యాంపరింగ్లు, హ్యాకింగ్ ద్వారా కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టు సమాచారం. అంతెందుకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి బంధువుల ఖాతా నుంచి భారీగా డబ్బులు కొట్టేసినట్టు తెలిసింది. ఇతన్ని ఓ కేసులో ఎలాగైనా పట్టుకోవాలని పులివెందుల ఎస్ఐ గోపీనాథ్రెడ్డి ప్రయత్నించగా ఎస్ఐ కారునే గుద్ది చంపాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి టీడీపీ నాయకుని కుమారుడు కావడంతో రవి కిడ్నాప్ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనే విస్మయం కలుగుతోంది. -
మామిడి పంటకు గిట్టుబాటు ధర.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మామిడి రైతులతో కలిసి పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మామిడి రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, గత ఏడాది మామిడి పంటకు కిలో 12 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది మామిడి పంటను తక్కువ ధరకే కిలో 4 నుంచి 5 రూపాయలకు మించి జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీల యజమాన్యాలు సిండికేట్గా మారి మామిడి రైతులను నిలువు దోపిడి చేస్తున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోతాపురి మామిడి పంటకు కిలో 15-20 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మామిడి రైతులకు మద్దతుగా నిలవడంతో ముందుగా మామిడి లోడు ట్రాక్టర్లను పోలీసులు లోపలికి పంపించారు. జైన్ ఫ్యాక్టరీ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక, మూడు నుంచి నాలుగు రోజుల పాటు మామిడి రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. -
ప్రయాణికుడిపై రైల్వే మహిళా అధికారి దాడి
చిత్తూరు కార్పొరేషన్: టికెట్ రిజర్వేషన్ కోసం వచ్చిన ప్రయాణికుడికి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, ప్రశ్నించిన ప్రయాణికుడిపై మహిళా రైల్వే అధికారి దాడి చేసిన ఘటన చిత్తూరు రైల్వే స్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఉదయం 8.45 గంటలకు చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లె పంచాయతీకి చెందిన ఓ ప్రయాణికుడు చిత్తూరు రైల్వేస్టేషన్కు శేషాద్రి ఎక్స్ప్రెస్లో గుడివాడకు వెళ్లడానికి టికెటు రిజర్వ్ చేసుకోవడానికి వచ్చాడు. ఆ సమయంలో టికెటు కౌంటర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రిజర్వేషన్ సూపర్వైజర్ జ్యోతిని సమాచారం అడగ్గా కాసేపు వేచి ఉండాలని చెప్పారు. 45 నిమిషాలు వేచి చూసిన ప్రయాణికుడు రైల్వే అధికారి రీల్స్ చూస్తూ కాలయాపన చేస్తుండటంతో ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె కౌంటర్ నుంచి బయటకు వచ్చి నానా దుర్భాషలాడుతూ తనపై దాడి చేశారని ప్రయాణికుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియో ఆధారాలను, ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ కమర్షియల్ కంట్రోలర్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఫోర్జరీ ముఠా అరెస్ట్
శ్రీరంరాజుపురం: రెవెన్యూ అధికారుల పేరుతో నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రాలు, తహసీల్దారు, పంచాయతీ కార్యదర్శుల నకిలీ సీళ్లతో భూముల రిజిస్ట్రేషన్లు జరిపిస్తున్న ఫోర్జరీ ముఠాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. శ్రీరంగరాజపురం మండలంలో బుధవారం వెలుగుచూసిన ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, వారి వద్ద నుంచి 18 నకిలీ సీళ్లు, ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్పురానికి చెందిన మహేష్కు సంబంధించిన ఇంటిని అదే ప్రాంతానికి చెందిన త్యాగరాజు పేరుతో నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయాన్ని గుర్తించిన మహేష్ స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో.. కార్వేటినగరం మండలానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ లవ్కుమార్, ఎస్ఆర్పురం మండలం వడ్డిపల్లికి చెందిన యోగానంద్ అలియాస్ ఉమాపతిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వివిధ మండలాల తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శుల పేర్లతో తయారు చేసిన మొత్తం 18 నకిలీ సీళ్లు, ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మరిన్ని నకిలీలు కూడా! ఈ కేసులో లవ్కుమార్ పాత్రపై స్థానికంగా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఆర్పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల్లో ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీకి ఇతడే కేంద్రబిందువని బాధితులు ఆరోపిస్తున్నారు. గత ఆరు నెలలుగా అతని ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మరిన్ని నకిలీ పత్రాల వ్యవహారాలు బయటపడే అవకాశముందని సమాచారం. అమాయకులే టార్గెట్ రెవెన్యూ అధికారుల ధ్రువీకరణను ఆసరాగా చేసుకుని కొందరు డాక్యుమెంట్ రైటర్లు నకిలీ సంతకాలు, సీళ్లు తయారు చేసి ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫోర్జరీ దందా ద్వారా భారీగా అక్రమంగా సంపాదించి కార్వేటినగరం, తిరుపతి, పుత్తూరు, బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు, ప్లాట్లు, భూములు కొనుగోలు చేశారని సమాచారం. ఈ కోణంలోనూ సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫోర్జరీ పత్రాలు, నకిలీ సీళ్లు, సంతకాల తయారీలో ఎవరైనా పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని కార్వేటినగరం సీఐ హెచ్చరించారు. -
టీడీపీ కార్యాలయాల్లో బీఎల్ఓలకు ఏం పని?
● అధికార పార్టీ బీఎల్ఏల వద్దకు కలర్ జిరాక్స్లా? ● బీఎల్ఓలకు ‘సర్’ గురించి అవగాహన లేదా? ● ఓటర్లకు ముందస్తు అవగాహన ఎందుకు కల్పించలేదు? ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ‘సర్’పై ఎన్నో అనుమానాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘సర్’ ప్రక్రియపై ఓటర్లలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులంతా స్థానిక టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మ్యాపింగ్ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా పారదర్శకమైన, సమగ్రమైన ఓటర్ల జాబితా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఏం జరుగుతోందనే ఆందోళన అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు ఓటర్లలో మొదలైంది. అంతా మా ఇష్టం ‘సర్’ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బీఎల్ఓలు రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి. ఆ తరువాత ఓటరు ఉన్నారా? లేదా? విచారించాలి. అనంతరం మ్యాపింగ్ చేయాల్సి ఉంది. అయితే బీఎల్ఓలు 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితాను పట్టుకుని ఇంటి పేర్లతో సరిపోయినవి, వారికి బంధుత్వం ఉన్నవి, టీడీపీ బీఎల్ఏలు చెప్పినవి మ్యాపింగ్ చేసేస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 65 శాతానికి పైగా మ్యాపింగ్ జరిగిపోయినట్టు సమాచారం. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో స్థానికంగా ఉన్న అనేక మంది ఓట్లు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవగాహన లేదు ‘సర్’ ‘సర్’ ప్రకియపై తమకు అవగాహనే లేదని కొందరు బీఎల్ఓలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీఎల్ఓలకు అవగాహన కల్పించాల్సి ఉందని చెబుతున్నారు. ఆ తరువాత ఓటర్లకు కూడా ‘సర్’పై అవగాహన కోసం గ్రామాలు, వీధుల్లో ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. అయితే ఇవేమీ లేకుండానే ఏకంగా ‘సర్’ ప్రకియ మొదలు పెట్టేశారని బీఎల్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అవగాహన లేకపోవడం వల్లే అనేక తప్పులు దొర్లుతున్నాయని, మరి కొద్ది రోజులు గడిస్తే గానీ ‘సర్’ పై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ముస్లిం మైనారిటీల్లో కలకలం ముస్లిం, మైనారిటీ ఓట్లు తమకు పడవనే ఉద్దేశంతో కూటమి నేతలు వారి ఓట్లను తొలిగించేస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాపింగ్ కోసం వివరాలు ఇవ్వొద్దని, ఇస్తే.. బయట తరమిస్తారనే భయం పుటించినట్లు తెలిసింది. అందులో భాగంగానే కొందరు ముస్లిం, మైనారిటీలు బీఎల్ఓలకు వివరాలు ఇవ్వడం లేదని సమాచారం. పుంగనూరు, వీ కోట, పలమనేరు, తిరుపతిలో ఇటువంటి ప్రచారం చేస్తున్నట్లు ముస్లిం, మైనారిటీలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మామిడికి ఉరే!
కాణిపాకం: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 90వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి రకాన్ని అత్యధికంగా సాగు చేస్తుంటారు. ఈ పంటపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే గత రెండేళ్లుగా మామిడి రైతులను వరుసగా నష్టాలే వెంటాడుతున్నాయి. గత ఏడాది తోతాపురి మామిడి కిలోకు రూ.3, రూ.4 మాత్రమే చెల్లించగా.. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి దాపురించింది. పంటను అమ్మేందుకు ర్యాంపుల వద్ద రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. చివరకు చెప్పిన ధరకు అమ్మక తప్పడం లేదు. గతేడాది నుంచే నరికివేత గత ఏడాది తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వందల హెక్టార్ల మామిడి తోటలు నేలమట్టమయ్యాయి. చిత్తూరు, తవణంపల్లి, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, పూతలపట్టు మండలాలతో పాటు తిరుపతి జిల్లాలోని పాకాల, చంద్రగిరి, భాకరపేట, చిన్నగొట్టికల్లు, ఎరవ్రారిపాళ్లెం ప్రాంతాల్లో రైతులు భారీ ఎత్తున తోటలను తొలగించారు. ఈ ఏడాది కూడా తోతాపురి కోతలు పూర్తయిన వెంటనే మరిన్ని తోటలను నరికేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరుసగా నష్టాలు వస్తుండడంతో మామిడి సాగును పూర్తిగా వదిలేసి పనస, కొబ్బరి, బొప్పాయి, అరటి, కూరగాయలు, పూలు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. సిండికేట్తోనే నష్టం జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలు సిండికేట్గా మారి మామిడి ధరలను తమకు అనుకూలంగా నిర్ణయిస్తున్నాయి. పోటీ లేకపోవడంతో రైతు చేతిలో బేరసారాల శక్తి లేకుండా పోతోంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, ఫ్యాక్టరీలపై నియంత్రణ లేకపోవడం, మార్కెట్లో జోక్యం చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు. తొలగిస్తే.. కేసులట! మామిడి తోటలను తొలగిస్తున్న రైతులపై కొన్నిచోట్ల అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. సొంత భూమిలో తాము సాగు చేసిన చెట్లను తొలగించుకుంటే అది ఎలా నేరమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం, ఇప్పుడు తోటలు తొలగించుకుంటే కేసులు పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. కొందరు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రైతులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడుతున్నారు. మామిడి రైతుకు గడ్డుకాలం దాపురించింది. చెమటోడ్చి పండించిన కాయలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తోంది. కాయలు అమ్ముకుని వచ్చే డబ్బుకంటే చెట్లను నరికి కట్టెలుగా అమ్ముకుంటేనే ఎక్కువ ఆదాయం వస్తోందన్న చేదు వాస్తవం జిల్లాలో వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న మామిడి తోటలపై రైతులే గొడ్డలి వేస్తున్న దృశ్యాలు గ్రామాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మద్దతు ధర ఇవ్వాలి రెండేళ్లుగా పంట పుష్కలంగా ఉంది. కానీ ధరలు లేవ్. ఫ్యాక్టరీల వద్ద పంట అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నాం. ఈ బాధలు పడలేక.. ప్రత్యామ్నాయం చూస్తున్నాం. మామిడి చెట్లను తొలగించి.. పనస పెడదామనకుంటే అటవీశాఖ అధికారులు కేసులు పెట్టించి జరిమానా వేశారు. కాయలు అమ్ముకోలేక రైతులు అల్లాడుతున్నారు. –కుమార్, తుమ్మింద, చిత్తూరు మండలం అటవీశాఖ అనుమతులెందుకు? మామిడికి ధరలు లేక నిండా మునిగిపోయాం. ప్రత్యామ్నాయం చూసుకుందామనుకుంటే.. అటవీశాఖ అధికారులు మామిడి చెట్లు నరకూడదంటున్నారు. మామిడి అనేది ఓ పంట. ఆ పంట పండకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటాం. ఇది రైతు ఇష్టం. అలాంటప్పుడు మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. –కొత్తూరు బాబునాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు -
జీతాల పెంపునకు ఆమోదం
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పాలకమండలి ఊరటనిచ్చింది. వారి జీతభత్యాల పెంపునకు ఆమోదం తెలిపింది. బుధవారం దేవస్థానం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను సమావేశంలో చర్చించి, వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిత్యాన్నదాన విభాగం, ఇటీవల ప్రారంభించిన వినాయక సదన్న్లో సిబ్బంది కొరత ఉన్నందున అదనపు సిబ్బందిని నియమించే అంశంపై కూడా చర్చించారు. ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం, వార్షిక టెండర్ల నిర్వహణ, లడ్డూపోటులో తయారయ్యే లడ్డూల నాణ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఈవోలు ప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, సీఎఫ్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
● మా ఓటు ఉందా?
మా ఓటు ఉందా లేదా..? అంటూ ఓటర్లు తమ ఓటు హక్కును ఆతృతగా చూసుకున్న ఘటన గుడిపాల మండలంలో చోటు చేసుకుంది. బుధవారం మండలంలోని 197రామాపురంలో చాలామంది ఓటర్లు తమ ఓటుహక్కు ఉందా, తమకు ఎన్యుమరేషన్ పత్రాలు వచ్చాయా లేదా..? అని బీఎల్ఓల వద్ద సరి చూసుకోవడం కనిపిచింది. టీడీపీ మైయాప్ ద్వారా ఓటర్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందని భావిమచిన ఓటర్లు అప్రమత్తమయ్యారు. దీనికితోడు ప్రతి బూత్స్థాయిలో వైఎస్సార్సీపీకి సంబంధించిన బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి బీఎల్ఓల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలను అందజేస్తున్నారు. – గుడిపాల -
కూటమి కనుసన్నల్లోనే సర్
●యాదమరి: మండలంలో నిర్వహిస్తున్న ‘సర్’ కార్యక్రమం గాడితప్పుతోంది. క్షేత్ర స్థాయిలో నిస్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన కొందరు బూత్ స్థాయి అధికారులు పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కొందరు అధికార కూటమి నేతల అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులకు, అన్ని రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇక్కడి అధికారులు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులకు మాత్రమే కనీస సమాచారం ఇవ్వడం లేదు. కూటమి నాయకులకు ఏకపక్షంగా లబ్ధి చేకూర్చడానికి ఈ దొంగచాటు తతంగం నడుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిలదీసిన వైఎస్సార్సీపీ అధికారుల ఏకపక్ష పోకడలపై మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానికులు తిరగబడ్డారు. మంగళవారం మండలంలోని గాంధీపురం, బుధవారం కాశీరాళ్ల సమీపంలోని కొండమిట్ట గ్రామంలో ఓ మహిళా అధికారిణి కొందరు కూటమి నాయకులతో కలసి రహస్యంగా ‘సర్’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారని ఎంపీటీసీ దూర్వాశులు ఆరోపించారు. ఈ చీకటి వ్యవహారాన్ని గుర్తించిన వైఎస్సాసీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్ర స్థాయికి చేరుకుని సంబంధిత బీఎల్వోని నిలదీశారు. ముందస్తు సమాచారం తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయితే విపక్ష నేతల నిలదీతకు సమాధానం చెప్పలేక సదరు బీఎల్ఓ నీళ్లు నమిలారు. స్థానికుల నుంచి నిరసన తీవ్రం కావడంతో దిక్కుచోచని అధికారులు చేసేదేమీ లేక ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు.సమాచారం ఎందుకివ్వరు? క్షేత్ర స్థాయిలోకి వచ్చే బీఎల్ఓలు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ముందస్తు సమాచారం ఎందుకువ్వడం లేదు. అధికార పార్టీ నాయకులతో కుమ్మకయ్యి మీ ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. కేవలం కోందరి నాయకులకు లబ్ధి చేకూర్చేలా ఉన్న ఈ సర్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. –దూర్వాశులు, ఎంపీటీసీ, కాశిరాళ్ల చర్యలు తీసుకుంటాం మండలంలో ‘సర్’ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. నిష్పక్ష పాతంగా నిర్వహించేలా బీఎల్ఓలకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని అత్యంత పారదర్శకంగా చేపడుతాం. క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ప్రజలకు ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. –పార్థసారథి, తహసీల్దార్, యాదమరి -
ఇదెక్కడి న్యాయం?
కార్వేటినగరం : కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్వేషపూరితమైన కుట్రపై గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పి కొట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీడీపీకి చెందిన వారే మహిళలుగా కనిపిస్తున్నారని మండిపడ్డారు. మిగిలిన పార్టీల వాళ్లు మనుషులు కాదా..? అని నిలదీశారు. ఎనిమిది నెలల క్రితం తాను నియోజకవర్గంలో కరెంటు పోరుపై ఉద్యమం చేస్తే స్థానిక ఎమ్మెల్యే థామస్ చేసిన అనుచిత వ్యాఖ్యలు గుర్తులేవా..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కుమార్తె అని కూడా చూడకుండా కట్టు, బొట్టుపై అనరాని మాటలన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను హోంమంత్రి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడితే అవి తప్పైపోయాయా..? అని నిలదీశారు. -
చిత్తూరుకు ఇద్దరు ఏఎస్పీలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు జిల్లాకు ఇద్దరు అదనపు ఏఎస్పీలను నియమిస్తూ బుధవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలో పనిచేస్తున్న కె రవిమనోహరాచారిని చిత్తూరు పరిపాలన విభాగానికి, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న షానుషేక్ను చిత్తూరు ఆపరేషను్ుస్క బదిలీ చేశారు. స్టాంప్ పేపర్స్ లేక తిప్పలు చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు అర్బన్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ పేపర్స్ కోసం కోనుగోలుదారులు పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల స్టాంప్ కౌంటర్ విభాగం సీనియర్ సహాయకులు ఆర్యోగం సరిలేక సెలవు పెట్టారు. ఆ స్థానంలో ఇన్చార్జి ఉద్యోగులకు విషయ పరిజ్ఞానం లేక వినియోగదారులతో అమర్యాదగా మాట్లాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సమయపాలన పాటించక స్టాంప్ కౌంటర్ను ఆలస్యంగా తెరుస్తున్నారు. దీనికి తోడు సకాలంలో వేగంగా సేవలందించకపోవడంతో క్యూలైన్ ఏర్పడుతోంది. బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం చిత్తూరు కలెక్టరేట్ : బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు వెంకట పద్మలత చెప్పారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రంలోని సంజయ్గాంధీ నగర్లో ఉన్న అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ బాలలు, మహిళలకు నాణ్యమైన సేవలందించడంలో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, అంబేడ్కర్ గురుకుల పాఠశాలల డీసీవో పద్మజ, డీవైఈవో ఇందిరా పాల్గొన్నారు. 20న జిల్లాకు రాష్ట్ర బీసీ అంకితభావ కమిషన్ రాక చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి అంకితభావ కమిషన్ ఈ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్ (రిటైర్డ్) అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి బృందం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఈ కమిషన్ వినతులు, అభ్యర్థనలను స్వీకరించనుందన్నారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుపై ఈ కమిషన్ క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నట్టు వెల్లడించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనంలో బహిరంగ విచారణ, ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని బీసీ వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. విధి నిర్వహణలో అవకతవకలు చిత్తూరు కలెక్టరేట్ :జిల్లాలోని వి.కోట మండలంలో అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా ఆమోదాలు, సిఫార్సులు చేశారనే ఆరోపణలపై నలుగురు రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణాధికారిగా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో ప్రెజెంటింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. అప్పటి వీకోట తహసీల్దార్ చిట్టిబాబు, వీ కోట మండలం, మద్దిమాకులపల్లి వీఆర్ఓ యామిని, పాముగానిపల్లి వీఆర్ఓ నారాయణ, బైరెడ్డిపల్లి మండలం, వీఆర్వో భరణికుమార్లకు నోటీసులు జారీచేశారు. 19న వ్యక్తిగత హాజరుకు ఆదేశం ఈ ఆరోపణలకు సంబంధించి నలుగురు అధికారులు ఈ నెల 19న కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఆ సమయంలో తమపై వచ్చిన చార్జీలకు సంబంధించి లిఖితపూర్వక వివరణను సమర్పించాల్సి ఉంటుందన్నారు. విచారణకు హాజరుకానిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని నోటీసులో హెచ్చరించారు. -
పంటలపై ఏనుగుల బీభత్సం
గుడిపాల: పంటలపై ఏనుగుల బీభత్సం సృష్టించాయి. అటవీశాఖ అధికారులు బుధవారం తెల్లవారుజామున ఏనుగల మందను తమిళనాడు అటవీ ప్రాంతానికి తరలించారు. తుమ్మిందపాళ్యం ఫారెస్ట్ నుంచి తమిళనాడు అటవీ ప్రాంతానికి తరలించారు. వాటిని తరలించే సమయంలో రామభద్రాపురం, క్రిష్ణాపురం సమీపంలోని వరి, అరటి, మామిడి పంటలను ధ్వంసం చేసి వెళ్లాయి. అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఏనుగులను తరలించారు. షుగర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం శ్రీరంగరాజపురం : మండలంలోని నెలవాయి వద్ద ఉన్న ఎస్.ఎన్.జే షుగర్ ఫ్యాక్టరీలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గిరి కథనం.. ఫ్యాక్టరీ అవసరాల కోసం నల్లబొగ్గును నిల్వ చేశారు. ఆ బొగ్గుకు డంపింగ్ పక్కన ఉన్న లెదర్ అంటుకోవడంతో మంటలు వ్యాప్తించాయి. సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక, ఫ్యాక్టరీ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ తెలిపారు. చోరీ కేసులో ఇద్దరికి జైలు బద్వేలు అర్బన్ : బద్వేలు అర్బన్ పోలీసు స్టేషన్లో గతేడాది నమోదైన ఓ చోరీ కేసులో ఇద్దరు నిందితులకు బుధవారం 15 నెలలు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్కుమార్ తీర్పు ఇచ్చినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా సీఎస్.పురం మండలం కొండరాజుపల్లె గ్రామానికి చెందిన కొండరాజు సురేష్, చిత్తూరులోని కామరాజనగర్కు చెందిన షేక్మస్తాన్ బద్వేలులోని విద్యానగర్లో రాయల్ బుల్లెట్ వాహనాన్ని చోరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. సూర్యఘర్ పనుల్లో వేగం పెంచాలి చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ సూర్యఘర్ పనుల్లో వేగం పెంచాలని ట్రాన్స్కో ప్రాజెక్టు డైరెక్టర్ ఆయూబ్ఖాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయం లోపు పీఎం సూర్యఘర్ ప్యానల్స్ ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. అలాగే జనరల్ కేటగిరిలో బిగించే సూర్యఘర్ సోలార్ ప్యానళ్ల అమరిక కూడా మందకొడిగా సాగుతోందన్నారు. 300 యూనిట్లు వచ్చే సర్వీసులకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేవిధంగా వారికి అవగాహన కల్పిం చాలన్నారు. అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. పెండింగ్ కరెంటు బిల్లులు, వసూళ్ల పై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఓఎస్డీ జానకీరామ్, ఈఈలు మునిచంద్ర, భాస్కర్నాయుడు పాల్గొన్నారు. అత్తారింటికొచ్చి..! చిత్తూరు రూరల్ (కాణిపాకం): అత్తారింటికి వచ్చిన ఓ వ్యక్తి తిరుగు ప్రయాణంలో కారులోనే మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చిత్తూరు నగర శివారులోని పెనుమూరు క్రాస్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన సూర్యనారాయణ (47) రెండు రోజులకు క్రితం మురకంబట్టులోని అత్తారింటికి వచ్చాడు. బుధవారం తిరిగి తిరుపతి బయలుదేరాడు. ఈ క్రమంలో పెనుమూరు క్రాస్ వద్ద బండి పార్క్ చేశాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వ్యక్తి కారులోనే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు గుండె పోటుతో చనిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
వాత్సల్య మిషన్.. నీరుగారెన్!
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం క్షేత్ర స్థాయిలో నీరుగారుతోంది. ఐసీడీఎస్ అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం చేరనంటోంది. అనాథలుగా మారుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఈ పథకం పై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కనీస అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రకటనలు, కార్యాలయాలకే పరిమితమవుతూ సమీక్షల హడావుడి తప్ప, నిజమైన లబ్ధిదారులను గుర్తించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయిలో శూన్యం పథకం అమలులో ఏటా వందల సంఖ్యలో చిన్నారులు లబ్ధిపొందుతున్నారని అధికారులు కాగితాల్లో లెక్కలు చూపిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువు మధ్యలో ఆగిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు లేని నిస్సహాయ చిన్నారులు ఎందరో ఉన్నప్పటికీ తమకు నెలకు ఆర్థిక సహాయం అందించే మిషన్ వాత్సల్య లాంటి పథకం ఒకటి ఉందనే విషయమే బాధితులకు తెలియడం లేదు. అసలు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏయే రికార్డులు సమర్పించాలి? అనే వివరాలు అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐసీడీఎస్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫొటోలకే పరిమితం ఐసీడీఎస్ అధికారులు అప్పుడప్పుడూ మండల కేంద్రాల్లో నిర్వహించే అవగాహన సదస్సులు కేవలం ఉన్నతాధికారులకు నివేదికలు పంపేందుకు, ఫొటోలు దిగడానికే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా ఎవరికై తే ఈ పథకం అవసరమో, ఆ అనాథ చిన్నారుల ఇళ్లకు వెళ్లి, వారి సంరక్షులతో మాట్లాడి దరఖాస్తులు చేయించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరిస్తున్నారు. ఇప్పటికై నా ఐసీడీఎస్ అధికారులు స్పందించి కేవలం కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్ర స్థాయిలోమిషన్ వాత్సల్యపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అర్హులైన ప్రతి అనాథ చిన్నారికి ఆసరా దక్కేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
జాతరలో హైడ్రామా!
జంతుబలిని అడ్డుకున్న అధికారులు పూతలపట్టు(యాదమరి): మండల పరిధి తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం నిర్వహించ తలపెట్టిన జంతు బలిని పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం.. గ్రామంలో మంగళవారం నుంచి గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం అమ్మవారికి సుమారు రూ.50 వేల విలువైన దున్నపోతును బలిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయమై అదే గ్రామానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరుకు రహస్యంగా సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ రెవెన్యూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరు ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకున్న అధికారులు జాతర నిర్వహకులు, గ్రామ పెద్దలతో మాట్లాడి జంతు బలి ఇవ్వకుండా అడ్డుకున్నారు. -
ఖైదీలకు రూ.100, హాస్టల్ విద్యార్థులకు రూ.53?
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల విద్యార్థులపై చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూడడం తగదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జైళ్లలో ఉన్న ఖైదీల భోజన వసతులకు రోజుకు రూ.100కు పైగా బడ్జెట్ కేటాయిస్తున్న ప్రభుత్వం.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే హాస్టల్ విద్యార్థులకు మాత్రం రూ.53 కేటాయించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల, కేజీబీవీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.1,200, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నెలకు రూ.1600 బడ్జెట్ కేటాయిస్తున్నారని, దీన్ని తక్షణమే రూ.2,500 నుంచి రూ.3000కు పెంచాలన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలను, విద్యార్థుల కాస్మొటిక్ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. పాతబడిన హాస్టల్ భవనాలను మార్చాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని సూచించారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్ (వంట మనుషులు), అటెండర్, కామాటి, ట్యూటర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు గౌరవ్, లలిత్, లిఖిత్ పాల్గొన్నారు. -
ప్రతి నీటి బొట్టునీ ఒడిసిపట్టేద్దాం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి నీటి బొట్టునీ ఒడిసి పట్టడమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ స్పష్టం చేశారు. మంగళ వారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారు లతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న 100 శాతం రుణ లక్ష్యాలను బ్యాంకర్లు తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. జిల్లా లోని డెయిరీలు, రైతులతో సమన్వయం చేసుకొని ఈ విభాగంలో రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2026–27) సంబంధించి జిల్లాలోని 13,444 స్వయం సహాయక సంఘాలకు రూ.2066.45 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయడానికి వివిధ బ్యాంకులు ఆమోదం తెలపడం శుభపరిణామమన్నారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ షేక్ ఇనూస్, ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ మేనేజర్ హేమమాలతి, ఆర్బీఐ ఎల్బీఓ రోహిత్ అగర్వాల్, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, వివిధ బ్యాంకుల రీజినల్ మేనేజర్లు పాల్గొన్నారు. ఆ అర్జీలను తిరస్కరించొద్దు సివిల్ వివాదం పేరుతో అర్జీలను తిరస్కరించకూడదని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ నుంచి సీసీఎల్ఏ అధికారులు నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా పీజీఆర్ఎస్లో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి సోమవారం అందుతున్న పిటిషన్లలో 75 నుంచి 80 శాతం వరకు కుటుంబ సభ్యుల మధ్య భూ హక్కులు, వారసత్వ హక్కులు, సరిహద్దు వివాదాలు వంటి వ్యక్తిగత సమస్యలే ఉంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇది సివిల్ వివాదం.. కోర్టుకు వెళ్లండి అని చెపుతూ అర్జీలను సింపుల్గా తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. జలధార పనులు పూర్తిచేయండి జిల్లాలో భూగర్భ జలాల పెంపుదల, వర్షపు నీటి సంరక్షణ కోసం చేపట్టిన జలధార–నీటి భద్రత కార్యక్రమ పనులను ఈనెల 25లోపు వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, డ్వామా, పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో భూగర్భ జలాల మట్టం దాదాపు ఆరు మీటర్ల మేర పడిపోవడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో జలధార పథకంలో ఇప్పటివరకు 1,482 పనులను గుర్తించగా, 1,355 పనులను ప్రభుత్వం మంజూరు చేసిందని, అందులో 546 చెరువు పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు, అగ్రికల్చర్ జేడీ మురళి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఓ కార్యాలయం ఆరా
గుడిపాల: విద్యార్థుల తల్లిదండ్రులు చిత్తూరు జిల్లాలో రెండు పాఠశాలలకు తాళాలు వేయడంతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, సీఎంఓ కార్యాలయం నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై చిత్తూరు డీఈఓ గుడిపాల మండల విద్యాశాఖాధికారులైన హసన్బాషా, గణపతిని పిలిపించుకొని వివరణ తీసుకున్నారు. గత మంగళవారం ‘మా గ్రామాల్లోనే స్కూళ్లు ఉండాలి’ శీర్షికన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్, సీఎంఓ కార్యాలయ అధికారులు ఆరా తీశారు. ఎందుకు తాళాలు వేశారంటే? గత సంవత్సరం గుడిపాల మండలంలోని వెంగంపల్లె, సీఎం ఖండిగ ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులను ఏఎల్పురం మోడల్ స్కూల్లో విలీనం చేశారు. దీనిపై విద్యార్థు ల తల్లిదండ్రులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లోనే సుమారు 32 మంది విద్యార్థులను చదివించారు. ఈ ఏడాది కూడా అదే పాఠశాలల్లో చదువుకోవాలంటే విద్యాశాఖాధికారు లు ఒప్పుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు తాళం వేశారు. దీనిపై ఎంఈఓలు, డీఈఓకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అమ్మకు వందనం కట్ రెండు పాఠశాలల్లో చదువుతున్న 32 మంది విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించిన తల్లికి వందనం నిలిపేస్తున్నట్టు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బైరెడ్డిపల్లె: మండల పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైరెడ్డిపల్లె– కుప్పం జాతీయ రహదారిలోని ఆయిమాత ఆలయం వద్ద ద్విచక్ర వాహనంపై వికోట వైపు వెళ్తున్న సంజయ్కి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తా పడ్డాడు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని 108 సిబ్బంది బైరెడ్డిపల్లె ఆస్పత్రికి తరలించారు. అలాగే బైరెడ్డిపల్లె–పుంగనూరు రహదారిలోని నల్లగుట్టపల్లె క్రాస్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమబెంగాల్ నుంచి కోళ్లపారంలో పనిచేయడానికి వచ్చిన సైముద్దీన్, అతని స్నేహితుడు లక్కనపల్లెలో ఇంటి సరుకులు తీసుకొని వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఎస్సీ యువతకు సువర్ణావకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్సీ యువతకు సువర్ణావకాశం లభించిందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మంచి అవకాశం కల్పిస్తున్నారన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకంలో జిల్లాలో ప్రత్యేక స్కిల్ ఎంప్లాయ్మెంట్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్డీఏ మీటింగ్ హాల్లో ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు మేళా ఉంటుందన్నారు. మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థల ప్రతినిధులు, తదితర సంస్థల నిర్వాహకులు పాల్గొంటారన్నారు. యువతకు వారి విద్యార్హతలకు అనుగుణంగా ఏయే రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఏయే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి? అనే అంశాలపై ఉచిత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సొంతంగా వ్యాపారాలు, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు ప్రభుత్వ సబ్సిడీ సంక్షేమ పథకాల వివరాలను అందిస్తారన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, ఆధార్కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు తీసుకురావాలని ఈడీ కోరారు. -
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ
ఐరాల: ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ కొన్న ఘటన సోమవారం రాత్రి మండలంలోని గాజులపల్లెలో చోటుచేసుకుంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో పెనుప్రమాదం తప్పింది. తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కాణిపాకం నుంచి తిరుపతికి ప్రయాణికులతో వెళుతోంది. ఈ క్రమంలో గాజులపల్లె వద్ద సింగిల్ లైట్తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను బస్సు ఢీకొట్టింది. బస్సు రోడ్డు పక్కన ఉన్న మామిడి తోటలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వాస్రత్రికి తరలించారు. యమడేంజర్ పలమనేరు: పట్టణ సమీపంలోని నాగమంగళం ఫ్లైవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వేగంగా వేళ్లే వాహనాల నడుమ ఇదేమార్గంలో పలమనేరు పట్టణానికి వచ్చే వాహనాలు, బైక్లు ఇక్కడి ఫ్లైవర్ కింద దూరి పట్టణంలోకి రావాలి. రోడ్డుపై ఎలాంటి స్పీడ్బ్రేకర్లు, సూచిక బోర్డులు లేకపోవడంతో ఏమాత్రం ఆదమరిచినా వెనుక వేగంగా వచ్చే వాహనాలు రోడ్డు క్రాస్ చేసే వారిని ఢీకొట్టేస్తున్నాయి. దీనిపై హైవే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. తిరుపతిలో ఉద్యోగ మేళా రేపు తిరుపతి అర్బన్: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి లోకనాథం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి తిమ్మినాయుడుపాళెం, ఆటోనగర్లోని భార్గ వి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లివిడెట్ కంపెనీలో ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఐటీఐ చదువుకున్న వారు అర్హులుగా పేర్కొ న్నారు. సేల్స్ జనరల్ మేనేజర్, టీఎం లీడర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ తదితర ఉద్యోగుల పొందవచ్చన్నారు. అదనపు సమాచారం కోసం 81435 76866 నంబర్లో సంప్రదించాలని సూచించారు. లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు తిరుపతి రూరల్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వివాహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన గోపీచంద్కు ఇప్పటికే వివాహమైనప్పటికీ మరో బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ డీఎస్పీ బేతపూడి ప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
కార్పొరేటుబడి!
బతుకు క్లోజ్! అభాగ్యుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కొత్త పింఛన్లు ఇవ్వక పోగా..ఉన్న పింఛన్లను తీసేస్తోంది. జిల్లా సమాచారంప్రయివేటు ఇంటర్మీడియెట్ కళాశాలల్లో అడ్డగోలు దోపిడీ బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026మధ్య తరగతి తండ్రి రామయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. చేతిలో ఉన్న కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీ ఫీజు స్ట్రక్చర్ పేపర్ వైపు చూస్తుంటే ఆయనకు కళ్లు తిరుగుతున్నాయ్. ట్యూషన్ ఫీజు, ఏసీ, స్టడీ మెటీరియల్, స్పెషల్ కోచింగ్, హాస్టల్, బస్సు ఫీజు చివరకు ల్యాబ్ ఫీజు ఇలా ఒకటేమిటి, ఒకే ఒక్క ఏడాదికి రెండులక్షల రూపాయాలు!. పదో తరగతిలో కొడుకు మంచి మార్కులతో పాసయ్యాడని సంబరపడాలో.. లేక ఈ ఫీజుల భారాన్ని మోయలేక చేతులెత్తేయాలో అర్థంగాక రామయ్య నెత్తిన చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ...ఇది కేవలం ఒక్క రామయ్య బాధే కాదు. జిల్లాలోని లక్షలాది మంది పేద తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోశం. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విద్య బలోపేతం కాగా.. ఈ కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్కు కొమ్ముకాస్తోంది. ఫీజుల నిబంధనలు కఠినతరం చేయకుండా చోద్యం చూస్తోంది. ఇదే అదునుగా ప్రయివేటు ఇంటర్మీడియెట్ కళాశాలలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ఈ ఏడాది అధికంగా 30 శాతం వరకు అధిక ఫీజులు వసూలు చేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఫీజుల దోపిడీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రసాయన ఎరువులు వద్దు పలమనేరు: పంటలకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని కలికిరి కృషి విజ్ఞానకేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మీప్రసన్న సూచించారు. మండలంలోని కూర్మాయి గ్రామంలో కేత్ బచావో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకంతో భూములు నిస్సారంగా మారిపోతాయన్నారు. వీటకి ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులైన జీలుగ, జనుము, పచ్చరొట్ట ఎరువులను వాడాలన్నారు. అనంతరం అజిటోబక్టర్, రైజోబియం, నానో ఎరువులపై ఆమె రైతులకు వివరించారు. స్థానిక ఏవో సంధ్య మాట్లాడుతూ ఇకపై రైతులకు ఎరువులు కావాలంటే ఏపీఏఎంఎస్ యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సైంటిస్ట్ నీలిమ సాహేబ్, మాధవి, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 91,478 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,376 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటా యించిన సమయానికంటే ముందు వెళ్లిన వారి ని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. మహిళా వర్సిటీలో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి రూరల్: శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత గల అభ్యర్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు ఇన్ పల్లియేటివ్ కేర్, పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డిప్లొమా ఇన్ యోగా, పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థినులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 15 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య పి. సువర్ణలతా దేవి తెలిపారు. కోర్సుల అర్హతలు, ఫీజు వివరాలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి సమాచారాన్ని విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలు 29 ఏపీ మోడల్ స్కూల్స్ 07 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 77 ఏపీఆర్జేసీ, ఏపీఎస్డబ్ల్యూఆర్ 05 హైస్కూల్ ప్లస్ 29 ప్రభుత్వ, ప్రైవేట్ ఒకేషనల్ 12 కేజీబీవీ 08చిత్తూరు కలెక్టరేట్ : విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కళాశాల ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, బస్ ఫీజులు వంటివి తడిసి మోపెడవడంతో ఎలా చదివించాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం మరిన్ని విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో తగిన వసతులు, ఆటస్థలాలు లేకపోయినా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. నిబంధనలు తూచ్ ప్రభుత్వాలు, విద్యాశాఖలు ఫీజుల నియంత్రణకు ఎన్ని జీవోలు తెచ్చినా.. హెచ్చరికలు జారీ చేసినా కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే నాలుగైదు రెట్లు అదనంగా వసూలు చేయడం రివాజుగా మారుతోంది. ఈ సారి ప్రతి తరగతికి దాదాపు 30 శాతం వరకు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫీజులకు సంబంధించిన రశీదుల్లో సగం మొత్తమే చూపిస్తూ, మిగిలిన మొత్తాన్ని ఇతర ఫీజుల పేరిట నల్లధనంగా మార్చడం చేస్తున్నారు. వెనుకబడుతున్న ప్రభుత్వ కళాశాలలు జిల్లాలోని 29 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు, ల్యాబ్స్, లెక్చరర్లు లేరు. అరకొర వసతులు, అన్ని సబ్జెక్ట్లు బోధించే అధ్యాపకులు లేరు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదునుగా జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లో సైతం ప్రైవేట్ కళాశాలలు వెలుస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, నీట్ పేరుతో దోచుకుంటున్నాయి. ఇలా ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.80 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు గుంజుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్న్మోహన్ రెడ్డి హయాంలో మనబడి నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం మానేసింది. విపత్తు! పీఎం కుసుమ్ పనులకు శ్రీకారం చుట్టాలి చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో పీఎం కుసుమ్ పనులను ప్రారంభించాలని ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయానంద్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి ట్రాన్స్కో ఎస్ఈలతో సమావేశమయ్యారు. జిల్లా లో జరుగుతున్న పనుల గురించి ఎస్ఈ అమర్బాబు వివరాలను వెల్లడించారు. చిత్తూరు అర్బన్, రూరల్ డివిజన్ల పరిధిలో 80 మెగావాట్ల సోలార్ కేంద్రం కోసం 295 ఎకరాలను గుర్తించామన్నారు. బంగారుపాళ్యం, ఆవులకొండ, యాద మరి, చిత్తూరు మండలాల్లో మొత్తం 18 ప్రాంతాలు గుర్తించామన్నారు. కుప్పం నియోజకవర్గంలో 141 మెగావాట్ల సోలార్ యూనిట్ల ఉత్పత్తి కేంద్రం కోసం 520 ఎకరాలు గుర్తించినట్టు పేర్కొన్నారు. దీనికోసం ఐదు మండలాల్లో 26 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. చిత్తూరు అర్బన్, రూరల్స్ డివిజన్ల పరంగా సోలార్ యూనిట్ కోసం టెండర్ పనులు పూర్తయ్యాయని, ఒక మెగావాట్ సోలార్ కేంద్రం ఏర్పాటుకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈనెల 21న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21వ తేదీన (ఆదివారం) జరగనున్న నీట్ – 2026 ప్రవేశ పరీక్షకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పరీక్షకు 1,111 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. వీరి కోసం జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలు (పీవీకేఎన్, సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలు, లిటిల్ ప్లవర్ పాఠశాలను) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి స్థాయిలో వీడియో గ్రఫీ, ఫొటోగ్రఫీ చేయనున్నట్లు తెలిపారు. నోడల్ అధికారి డా.జీవనజ్యోతి, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, డీఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. హాజరైన అధికారులు మాట్లాడుతున్న డీఆర్వో మోహన్కుమార్ ఎడాపెడా ఫీజుల మోతనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయ్. అనుమతించిన ఫీజులకంటే అదనంగా వసూ లు చేసే కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. అపార్ట్మెంట్, కనీస భద్రతా ప్రమాణాలు లేని భవనాల్లో కాలేజీలు నడిపితే యాజమాన్యాలకు నోటీసులు జారీచేస్తాం. ఫీజుల దోపిడీపై తల్లుదండ్రులు ధైర్యంగా మా కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – రఘుపతి, డీఐఈవో, ఇంటర్మీడియెట్ శాఖ జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పలు రకాలుగా ఉన్నాయి. కళాశాలకు ఉన్న పేరును బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి వంటి పట్టణాల్లో పేరున్న కళాశాలలు ఏడాదికి ఫీజు రూపంలో రూ.90 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే హాస్టల్కు రూ.లక్ష, బస్ చార్జీలు దూరాన్ని బట్టి రూ.30 వేలు, బుక్స్కు రూ.20 వేలు, యూనిఫామ్ రెండు జతలకు రూ.10 వేలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ఫీజు రూ.60 వేలు, బస్ ఫీజు రూ.18 వేలు, యూనిఫామ్ రూ.2,500, బుక్స్కు రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. -
డిగ్రీ అడ్మిషన్లలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ మధుసూదన్వర్మ ఆదేశించారు. ఆయన మంగళవారం పలు డిగ్రీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్తో సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ మాట్లాడుతూ డిగ్రీ అడ్మిషన్ల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లను ముమ్మరంగా చేపట్టాలని స్పష్టం చేశారు. గత ఏడాది నమోదైన అడ్మిషన్ల సంఖ్య కంటే ఈసారి కచ్చితంగా ఎక్కువ అడ్మిషన్లు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులను ఆకర్షించడంలో ప్రిన్సిపల్స్, అధ్యాపకులు చొరవ చూపాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. న్యాక్ గ్రేడింగ్పై ప్రత్యేక దృష్టి ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ అంచనా, గుర్తింపు మండలి (న్యాక్)లో ఉత్తమ గ్రేడ్ తెచ్చుకునేందుకు గట్టిగా కృషి చేయాలని ఆర్జేడీ అన్నారు. న్యాక్ గ్రేడింగ్ మెరుగుపడితేనే కళాశాలలకు జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఒక ఉత్తమ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత వచ్చేలా ప్రతి అధ్యాపకుడు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారి, పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 19 డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. -
త్వరలో రోడ్డు విస్తరణ పనులు
కుప్పం: పట్టణ నడిబోడ్డున అర్ధతరంగా ఆగపోయిన రెండవ రీచ్ విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని జేసీ ఆదర్శ రాజేంద్రన్ స్పష్టం చేశారు. మంగళవారం కడా కార్యాలయంలో రోడ్డు విస్తరణ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. పట్టణంలోని ఎంఆర్రెడ్డి సర్కిల్ నుంచి రైల్వే గేటు వరుకు రోడ్డు విస్తరణ పనులు సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. భవనాలు నష్టపోతున్న బాధితులకు అడుగుకు రూ.3,200 చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం తీర్మానించిందన్నారు. ఈ లెక్క న 124 మంది బాధితులు నష్టపోతుండగా.. ఇందులో 40 మంది రోడ్డు విస్తరణకు ఒప్పుకున్నారని చెప్పారు. వీరికి త్వరలో నష్టపరిహారం అందజేస్తామన్నారు. గతంలో నిర్ణయించిన 80 అడుగుల నుంచి ఇప్పుడు 60 అడుగులకు రోడ్డు విస్తరణ కుదించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో కడా పీడీ వికాస్ మరమ్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, రెస్కో చైర్మన్ ప్రతాప్, రాజ్కుమార్ పాల్గొన్నారు. గంజాయిపై సమాచారం ఇవ్వండి చిత్తూరు అర్బన్: మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా గంజాయిపై జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుషా ర్ డూడీ తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.28 లక్షల విలువైన 151 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 18 కేసులు నమోదుచేసి, 36 మందిని అరెస్టు చేశామ న్నారు. ఇక డ్రగ్ డిటెన్షన్ టెస్టింగ్ కిట్ల ద్వారా కూడా మాదకద్రవ్యాలు సేవించిన వాళ్లను గుర్తించి, కౌన్సెలింగ్.. కొన్నిచోట్ల అరెస్టులు కూడా ప్రారంభించామన్నారు. జిల్లాలో ఎక్కడై నా గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు జరిగితే డయల్–112, ఈగల్–1972, సెల్–9490617896 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
జిల్లా సమాచారం
ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 44,268 హెక్టార్లు వేరుశనగ సాధారణ విస్తీర్ణం 21,903 హెక్టార్లు జిల్లాకు కేటాయించిన వేరుశనగ విత్తనాలు 27,000 క్వింటాళ్లు ఇప్పటి వరకు జిల్లాకు చేరింది 2,600 క్వింటాళ్లు పంపిణీ జరిగిన ప్రాంతాలు: కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో మాత్రమే చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఖరీఫ్నకు వేరుశనగ విత్తనం దొరకనంటోంది. ఏరువాక పౌర్ణమి సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి విత్తనాలు అందకపోవ డంతో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సీజనన్లో వర్షాధార వ్యవసాయం ఎక్కువ. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,268 హెక్టార్లు కాగా, అందులో 21,903 హెక్టార్లలో వేరుశనగ సాగు చేయనున్నారు. గతేడాది 7వేల హెక్టార్లకే సాగు పరిమితమైంది. దీనికారణంగా గతేడాది కూడా విత్తనాల పంపిణీ ఆలస్యమైంది. ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తుతోంది. కేటాయింపులు ఘనం.. పంపిణీ నామమాత్రం ఖరీఫ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించారు. కానీ ఇప్పటివరకు జిల్లాకు చేరింది 2,600 క్వింటాళ్లు మాత్రమే. మిగిలిన విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. జిల్లాకు వచ్చిన కొద్దిపాటి విత్తనం కూడా అన్ని మండలాలకు చేరలేదు. ప్రధానంగా కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకే పరిమితమైంది. చిత్తూరు, గంగాధరనెల్లూరు, నగరి, పూతలపట్టు నియోజకర్గాలకు ఇంతవరకు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం స్పందించాలి ఖరీఫ్ సీజనన్ ప్రారంభంలోనే విత్తనాల కొరత తలెత్తడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జిల్లాకు కేటాయించిన మొత్తం 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
బతుకు క్లోజ్!
‘అర్హులైన వారందరికీ నెలకు రూ.4 వేలు పింఛన్లు మంజూరు చేస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు రూ.10 వేలు. నేను మారాను.. నన్ను నమ్మండి’ అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు కల్లబొల్లిమాటలు ఒలకబోశారు. ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా రెండేళ్లు కావస్తున్నా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు ఎలా తొలగించాలోనని సమయోచనలో పడ్డారు. ఇందులో భాగంగానే సవాలక్ష సాకులు.. సర్వేలు.. వెరిఫికేషన్ల పేరుతో పింఛన్లు కోత పెడుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పింఛన్ వెబ్సైట్నే క్లోజ్ చేసి పేదల జీవితాలతో ఆటలాడుతున్నారు. దీనిపై అభాగ్యులు రగిలిపోతున్నారు. పింఛన్ల కోత..వెబ్సైట్ క్లోజ్పై ప్రత్యేక కథనం.. చిత్తూరు కలెక్టరేట్ : కొత్త పింఛన్ల మంజూరు దేవుడెరుగు ఉన్న పింఛన్లను ఊడబెరుకుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అర్హులైన పేద లు, నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్ల ను సైతం వెరిఫికేషన్న్ సాకుతో తీసేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు మూడు వేల మంది దివ్యాంగుల పింఛన్లను నిలిపివేసింది. అర్హులైన దివ్యాంగ పింఛన్దారులకు నోటీసులు ఇస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని సదరం క్యాంపులకు తిరగలేక నయకయాతన అనుభవిస్తున్నారు. గతంలో నిరంతరం.. నేడు గగనం! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియలా సాగేది. అప్పట్లో పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి గ్రామ వలంటీర్లే నేరుగా దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సచివాలయాల్లో ఆన్న్లైనన్ చేసేవారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి ఆరు నెలలకోసారి (జూన్, డిసెంబర్లో) క్రమం తప్పకుండా కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్సైట్ను పూర్తిగా నిలిపివేయడంతో అర్హులైన వారు నిత్యం సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్త అర్జీలకు తాళం! గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ పింఛన్ల అధికారిక వెబ్సైట్ను పూర్తిగా మూసివేశారు. పింఛన్ల పెంపు, కొత్త అర్హుల గుర్తింపు పై ఊదరగొట్టిన పాలకులు ఇప్పుడు వెబ్సైట్నే ఆఫ్లైన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మంజూరు చేసినవే జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,72,223 పింఛన్లు అందుతున్నాయి. ఈ పింఛన్లన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. ప్రస్తుతం సచివాలయాల్లో కేవలం ఒకే ఒక రకమైన పింఛన్న్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే పింఛనన్ పొందుతున్న భర్త మరణిస్తే, అతడి వారసత్వంగా ఆ పింఛన్్ ను భార్యకు బదిలీ చేసి ఇస్తున్నారు అంతే. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన కీలక హామీ ఇంతవరకు అమలు కాలేదు. రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ లేదు కొత్త పింఛన్ ఇవ్వరా? నా భర్త చనిపోయి సంవత్సరాలు అవుతోంది. ఆయన పోయాక నాకు ఎటువంటి ఆధారం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడదు. వయసు పైబడడంతో ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతున్నా. వితంతు పింఛన్ కోసం సచివాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. ఇంతవరకు నాకు ఒక్క రూపాయి పింఛన్ మంజూరు కాలేదు. నా లాంటి దిక్కులేని వాళ్లను ప్రభుత్వమే ఆదుకోకపోతే మేం ఎలా బతకాలి?. – బుజ్జమ్మ, బాధితురాలు, చిత్తూరు భూమి వేరేవాళ్లకు రాసిచ్చినా..! నాకు 60 ఏళ్లు దాటాయి. వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నా పేరు మీద భూమి ఉన్నట్టు చూపిస్తోందని, అందుకే పింఛన్ రాదని తిరస్కరించారు. నిజానికి నా పేరు మీద ఉన్న భూమిని ఎప్పుడో వేరే వాళ్ల పేరు మీదకు మార్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఎలాంటి భూమి లేదు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇంకా నా పేరే చూపిస్తోంది. అధికారుల తప్పునకు నాకు పింఛన్ లేకుండా చేస్తారా?. – కనకమ్మ, బాధితురాలు, తవణంపల్లి -
పండు పతనం!
●కాణిపాకం: జిల్లాలో మామిడి రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన తోతాపురి పంటకు ర్యాంపుల్లో రూ.3, ఫ్యాక్టరీల్లో రూ.5 మాత్రమే చెల్లిస్తుండడం వారిని మరింత కుంగదీస్తోంది. జిల్లా లోని పల్ప్ ఫ్యాక్టరీలు, కొనుగోలు ర్యాంపులు కుమ్మకై ్క రైతును నిండా ముంచేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచే రైతుకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. బేనిషా, కాదర్, మల్లిక వంటి టేబుల్ రకాల మామిడికి ధర అంతతమాత్రంగా నే ఉంటోంది. చివరికి ‘తోతాపురి’ పరిస్థితి దారుణంగా తయారైంది. కొద్ది రోజుల కిందట కేజీ రూ.7 వరకు పలికిన తోతాపురి ఇప్పుడు అమాంతం పడిపోయింది. సోమవారం రాత్రి వరకు ఫ్యా క్టరీల్లో కేజీ రూ.6, ర్యాంపుల్లో రూ.4లుగా ఉన్న మామిడి మంగళవారం ఉదయానికి ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో రూ.3–5కు పడిపోయింది. ఫ్యాక్టరీల సిండికేట్ జిల్లాలో ఉన్న పల్ప్ ఫ్యాక్టరీలు పోటీపడి కొనుగో లు చేయాల్సింది పోయి ఒకే ధరను అమలు చేస్తున్నాయి. ఏ ఫ్యాక్టరీకి వెళ్లినా అదే ధర. ఏ ర్యాంపుకెళ్లినా అదే ధర. రైతుకు ప్రత్యామ్నాయం లేకపోతోంది. ‘మేము పండించిన పంటకు ధర నిర్ణయించేది మార్కెట్ కాదు.. ఫ్యాక్టరీలే. వాళ్లు చెప్పిందే రేటు. ఇవ్వకపోతే పంట కుళ్లిపోతుందటూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. క్రిష్ణగిరి పేరు చెప్పి..! ధరలు ఎందుకు తగ్గించారని అడిగితే ఫ్యాక్టరీలు ఒకే సమాధానం చెబుతున్నాయి. ‘తమిళనాడులోని క్రిష్ణగిరిలో ధరలు పడిపోయంటూ సాకులు చెబుతున్నారు. అక్కడ కాయలు కొనుగోలు చేసేవారు లేరని, పండిన పంటను కాలువలు, రోడ్లపైనే పడేస్తున్నారని, ఫ్యాక్టరీలు కేజీ రూ.5కు కొంటున్నారని సమాధానం ఇస్తున్నారు. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రిష్ణగిరిలో ధరలు పెరిగినప్పుడు చిత్తూరులో ఎందుకు పెంచలేదని నిలదీస్తున్నారు. కొనుగోళ్లు అంతంత మాత్రమే ధరలు తగ్గించడమే కాకుండా కొనుగోళ్లు కూడా పరిమితం చేశారు. ఫ్యాక్టరీలు ధరలను దెబ్బతీయడానికి అవసరమైన మేర కొనుగోలు చేస్తున్నామనే సాకులు చెబుతున్నాయి. దీంతో ఫ్యాక్టరీ చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం తమిళనాడు నుంచి వచ్చే లారీలను మాత్రమే ఫ్యాక్టరీ లోపలికి అనుమతిస్తున్నారు. నేడు కిలో మామిడిని తోట నుంచి ర్యాంపునకు తీసుకురావడానికి అయ్యే ఖర్చే రూ.2 నుంచి రూ.3 వరకు ఉంటోంది. ఎన్నికల సమయంలో రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తోతాపురి రైతు గొంతు కోస్తున్న ధరల దందా మా పరిస్థితి దారుణం కేజీ రూ.6 నుంచి రూ.5కు పడిపో యింది. తగ్గిన ధర తో ఫ్యాక్టరీ ఎదుట నోటీసులు అతికిస్తే చించేశాం. ఇలాగైతే మా బతుకులు ఎలా...?. మా బాధలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదిపోను సామాన్య రైతుల బండ్లు రోజుల తరబడి రోడ్లపైనే ఉంటున్నాయి. సిఫార్సు వస్తే ఠక్కుమని లోపలికి పంపించేస్తున్నారు. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. – రమేష్, జీడీనెల్లూరు మండలం ధరలు తగ్గిస్తే ఎలా? ఇష్టానుసారంగా ధరలు తగ్గించుకుంటూ పోతే ఎలా..?. ఈ రోజు తోతాపురి కేజీ రూ.5కు తగ్గించేశారు. ఇది పెద్ద మోసం. ఈ రకంగా రైతుల కడుపు కొట్టడం సరికాదు. ఇదేవిధంగా కొనసాగితే కచ్చితంగా రైతులంతా రోడ్డుపైకి రావడం ఖాయం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మామిడి రైతులను ఆదుకోవాలి. – బాల, దిగువమాసాపల్లి, చిత్తూరు మండలం -
ప్రొబేషన్పై నిర్లక్ష్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రొబేషన్ ప్రకటన కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు తదితర ఉద్యోగులు పడరానిపాట్లు పడుతున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ప్రొబేషనన్ ప్రకటించాల్సి ఉంది. అయితే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటి వరకు ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా నిర్వహించిన నియామకాల్లో మెరిట్ ఆధారంగా ఎంపికై న అభ్యర్థులకు రెగ్యులర్ నియామకాలు కల్పించారు. జిల్లాలో ఫార్మసిస్టులు 22, ల్యాబ్టెక్నీషియన్ 18, హెల్త్ అసిస్టెంట్ 94 మంది అప్పట్లో రెగ్యూలరయ్యారు. నియామకాల సమయంలోనే విద్యార్హతల ధృవీకరణ, పోలీసు వెరిఫికేషన్న్, ఇతర అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాతే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ప్రొబేషన్ ప్రకటించే దశకు వచ్చేసరికి సర్టిఫికెట్ల ధృవీకరణ అంశాన్ని కారణంగా చూపుతూ అధికారులు ఫైళ్లను పెండింగ్లో ఉంచుతున్నారు. కొంతమంది ఉద్యోగులు చదివిన విద్యాసంస్థలు ప్రస్తుతం మూతపడ్డాయి. వాటి రికార్డులు గతంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల వెరిఫికేషన్లో జాప్యం జరుగుతోందని సమాచారం. అయితే ఆ పరిస్థితికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వమే అన్ని ధృవీకరణలు పూర్తిచేసి ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే అంశాన్ని అడ్డంకిగా చూపడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ఇంటెలిజెనన్స్ నుంచి సంబంధిత అధికారులకు అవసరమైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. బెనిఫిట్లు దూరం ప్రొబేషన్న్ ప్రకటించకపోవడంతో ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, ఉన్నత ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశాలు, ఇతర సర్వీస్ ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ భవిష్యత్తు, ఉద్యోగ భద్రత రెండూ ప్రశ్నార్థకంగా మారాయని వాపోతున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పెండింగ్లో ఉన్న సర్టిఫికెట్ ధవీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అర్హులైన ఉద్యోగుల ప్రొబేషనన్ను వెంటనే ప్రకటించాలని బాధిత ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆవేదనలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు -
జూన్.. టెన్షన్.. టెన్షన్
నగరి: స్కూల్ ఫీజుల నుంచి రవాణా ఖర్చుల వరకు భారీగా పెరిగిపోవడం భారంగా పరిణమిస్తోంది. పుస్తకాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. వీటికి అదనంగా యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, షూస్ ధరలు మార్కెట్లో మండిపోతున్నాయి. దీంతో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి చదువుల కోసం భారీగా జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చుక్కలు చూపిస్తున్న రవాణా ఖర్చులు ఇక స్కూల్ వ్యాన్లు, బస్సు చార్జీలు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ రవాణా చార్జీలను భారీగా పెంచేశారు. స్కూలుకు, ఇంటికి మధ్య దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. స్కూల్ ఫీజులకు తోడు ఈ రవాణా ఖర్చు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ నియంత్రణ శూన్యం ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులను పెంచుకుంటూ పోతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఫీజుల నియంత్రణపై కనీసం దృష్టి సారించడం లేదు. జిల్లా విద్యా శాఖ అధికారులు సైతం ప్రైవేటు యాజమాన్యాల దోపిడీని అరికట్టలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేటు స్కూల్స్ ఫీజులపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జూన్ నెల రానే వచ్చింది. సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు.. కళాశాలలు ప్రారంభోత్సవాల్లో ఉంటే తల్లిదండ్రుల్లో మాత్రం ఫీజుల దడ మొదలైంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు కార్పొరేట్ చదువులు పెద్ద గండంలా మారుతోంది. అడ్మిషన్లు, ఫీజులు, బడి సామగ్రి కొనుగోళ్లు అంటూ కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అడ్మిషన్లు తల్లిదండ్రులకు గుబులు రేపుతున్నాయి. భారీగా పెరిగిన ఫీజులు కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు లు, బిల్డింగ్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు.. ఇలా అనేక పేర్లతో తల్లి దండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేశాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి స్కూల్ ఫీజులను ఏకంగా 30 నుంచి 50 శాతం వరకు పెంచేయడం గమనార్హం. కొత్తగా పాఠశాలలో చేర్పించడానికే రూ.40 వేలకు పైగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పిల్లలను చదివించడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని తల్లిదండ్రులు తెలుపుతున్నారు. -
జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో నాన్ టీచింగ్ కేడర్ నుంచి జూనియర్ లెక్చరర్లుగా పలువురు ఉద్యోగోన్నతులు పొందారని నాన్టీచింగ్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షు లు కందాటి విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. సోమ వా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మ డి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అర్హత, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులు ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతి పొందారన్నా రు. పార్వతి, దీప్తి, శిరీష, అపర్ణ, అశ్విని, భా స్కర్, కిషోర్, శివకుమార్ తదితరులకు జూని యర్ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతి లభించిందన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. సీనియార్టీ జాబితా ప్రదర్శన చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో వ్యవసాయ సర్వీసుల సీనియార్టీ జాబితాను సంబంధిత ఏఈ కార్యాలయాలల్లో ప్రదర్శించాలని ట్రాన్స్కో సీఎండీ శివశంకర్ ఆదేశించారు. సోమవారం కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎస్ఈ, ఈఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సకాలంలో వ్యవసాయ సర్వీసులు విడుదల చేయాలన్నారు. అందులో జాప్యం చూపితే చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నివాసాల పై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దశల వారీగా అందరికీ సోలార్ ప్యానల్స్ పెడతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ అమర్బాబు, ఈఈలు మునిచంద్ర, సురేష్ పాల్గొన్నారు. మొరంలో భారీ చోరీ పలమనేరు: మండలంలోని మొరం గ్రామంలో పట్టపగలే డోర్లాక్ చేసిన ఇంట్లో దొంగలు పడి భారీ చోరీకి పాల్పడిన ఘటన సోమవారం కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. మొరం గ్రామానికి చెందిన దంపతులు దేవి, పురుషోత్తంరెడ్డి గ్రామ సమీపంలోని హ్యాచరీలో పనికి వెళ్తుంటారు. ఆ మేరకు సోమ వారం పొద్దున పనికెళ్లారు. వీరిద్దరు పిల్లలు బడికెళ్లా. ఇంటికి తాళం వేసి ఉండగా దొంగలు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి ముందున్న గేట్ను తీసుకొని తాళం వేసిన తలుపును రాడ్తో తీసి లోనికెళ్లారు. ఇంట్లోని బీరువాను పగులగొట్టి అందులోని 35 గ్రాముల బంగారు, 600 గ్రాముల వెండి ఆభరణాలను చోరీ చేసి ఇంటి వెనుక వైపున్న తలుపు తీసుకొని ఉడాయించారు. చోరీ చేసిన సొత్తు విలువ రూ.5.7 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. కాగా చోరీ జరిగినప్పుడు ఇంటి వెనుక ఇద్దరు యువకులు ఉన్నట్టు కొందరు గ్రామస్తులు తెలిపారు. చోరీపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరు, వేలిముద్రల సేకరణ కార్యక్రమాలను చేపట్టారు. మద్యం సేవించడానికి డబ్బుల్లేవని.. – చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య తవణంపల్లె : మద్యం సేవించడానికి డబ్బులు లేవని మనస్తాపానికి గురై చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మ హత్య చేసుకు న్న ఘటన తెల్లగుండ్లపల్లె దళితవాడలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్బాబు కథనం మేరకు.. మండలంలోని తెల్లగుండ్లపల్లె దళితవాడకు చెందిన రవి (52) మద్యం సేవించేవాడు. మద్యం సేవించడానికి డబ్బులు కావాలని తండ్రి మునస్వామి ని అడిగాడు. తండ్రి డబ్బులు లేవని చెప్పడంతో తెల్లగుండ్లపల్లెలోని కొండప్పనాయిని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని భార్య దీప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఓటర్ల జాబితాను మరింత కచ్చితంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా రూపొందించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సోమవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమైందన్నారు. జూలై 14 వరకు ఈ సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. అన్ని సవరణల అనంతరం సెప్టెంబర్లో తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని తెలిపారు. బీఎల్ఏలు చురుగ్గా పాల్గొనాలి ఈ ప్రక్రియ పూర్తిగా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్, బాలసుబ్రమణ్యం, సురేంద్రబాబు, అట్లూరి శ్రీనివాస్, వాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పీఎన్ జీ ప్రణాళిక సిద్ధం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : మూడు రోజుల్లో పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ల విస్తరణ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆద ర్శ్ రాజేంద్రన్ సిబ్బందిని ఆదేశించారు. సోమ వారం ఆయన కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడు తూ జిల్లాలో వాణిజ్య, గృహ అవసరాలకు పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలన్నారు. మూడు రోజుల్లోగా సమగ్రమైన కార్యాచరణ ప్రణా ళికను సమర్పించాలని మున్సిపల్, గ్యాస్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఉచిత ప్రవేశాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని శారీరక విభిన్న ప్రతిభావంతులు, బధిరులు (చెవిటి), అంధులైన బాలికలకు బాలికల వసతి గృహంలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3 నుంచి డిగ్రీ వరకు చదువుకుంటున్న దివ్యాంగ బాలికల నూతన ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్డిగుంట బైపాస్ రోడ్డులో, కుటుంబ ఆరోగ్య సంక్షేమ భవనానికి ఎదురుగా నిర్మించిన నూతన భవనంలో ఈ ప్రత్యేక వసతి గృహంలో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు 9440990698, 08572–296506 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. నిధులు విడుదల చిత్తూరు కలెక్టరేట్: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా మొదటి దశ నివాసాల లెక్కింపు పరంగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, గౌరవ వేతనాల పరంగా జిల్లాలోని చిత్తూరు నగరపాలక సంస్థకు రూ.42.35 లక్షలు, 28 మండలాలకు రూ.3.16 కోట్లు మంజూరైంది. -
మ్యాపింగ్ కాని ఓటర్లు 9,33,387 మంది
ఓటు వజ్రాయుధం.. పాశుపతాస్త్రం.. భారత రాజ్యాంగం మనిషికి కల్పించిన గొప్ప హక్కు. అలాంటి ఓటును కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఓ కార్యక్రమం మొదలైంది. ప్రతి ఓటరూ మేల్కొని తమ వివరాలను బీఎల్వోలకు అందజేసి, ఓటుహక్కును కాపాడుకోవాల్సి ఉంది. చిత్తూరు జిల్లా.. నియోజక వర్గం పేరు మొత్తం ఓటర్లు మ్యాపింగ్ మ్యాపింగ్ అయిన ఓటర్లు కాని ఓటర్లుచిత్తూరు 2,03,536 1,37,304 66,232 పూతలపట్టు 2,22,755 1,78,925 43,830 పలమనేరు 2,72,326 2,20,132 52,194 పుంగనూరు 2,41,106 1,87,627 53,479 నగరి 2,03,745 1,66,681 37,064 గంగాధరనెల్లూరు 2,06,670 1,67,931 38,739 కుప్పం 2,30,474 1,79,534 50,940సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రతి పౌరునికి అతి ముఖ్యమైన ఓటు హక్కుని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓటరు కాస్త నిర్లక్ష్యం చేస్తే.. ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ‘సర్’ హెచ్చరిస్తోంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా విధిగా ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాలి. సకాలంలో ఆ ఫారాలు ఇచ్చిన వారి ఓట్లు మాత్రమే భద్రంగా ఉంటాయి. లేదంటే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన పేరుతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) మ్యాపింగ్ ప్రక్రియ కీలకంగా మారింది. సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. సర్లో ప్రధానంగా మూడు రకాల మ్యాంపింగ్ల గురించి ప్రతి ఓటరు అవగాహన ఉండాలనే విషయం స్పష్టమైంది. ఓటు భద్రంగా ఉండాలంటే వచ్చే నెల 14వ తేదీ లోపు మ్యాపింగ్ పూర్తి చేసుకోవాలి. అందుకోసం ప్రతి ఓటరు పుట్టిన గ్రామానికి వెళ్లాలి. 2002 ఓటరు జాబితాలో మీ తల్లి దండ్రుల పేరు, సీరియల్ నంబర్ తెలుసుకుని.. ఆ నంబర్ని బీఎల్వోలకు ఇవ్వాలి. వారు ఆ నంబర్తో ఓటరు జాబితాలో మ్యాపింగ్ ద్వారా చేరుస్తారు. 2002 ఓటరు లిస్టులో పేరు ఉండి, 2025 జాబితాలో కూడా పేరు ఉన్న వారు బీఎల్వో దగ్గరకు వెళ్లి సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ‘సర్’ స్పష్టం చేస్తోంది.సర్ ప్రక్రియ ప్రారంభం తిరుపతి, చిత్తూరు జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లు 9,33,387 మంది ఉన్నారు. ఇందులో తిరుపతి జిల్లాలోనే 5,90,909 మంది ఉంటే.. చిత్తూరు జిల్లాలో 3,42,478 మంది ఓటర్లు ఉన్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాల పరిధిలో ఎక్కువ మంది మ్యాపింగ్ చేయని ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో శ్రీకాళహస్తి, వెంకటగిరి, రైల్వేకోడూరు, చిత్తూరు నియోజక వర్గాలున్నాయి. నెల రోజుల్లోపు ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేకపోతే ఓటుహక్కు కోల్పోయే ప్రమాదమే అధికంగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటింటా సర్వే పూర్తయిన తరువాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బీఎల్వో వద్ద ఉంటుంది. ఆ జాబితాలో ఓటు ఉందో లేదోనని ప్రతి ఒక్కరు విధిగా సరిచూసుకోవాల్సి ఉంది. జాబితాలో పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఆ అభ్యంతరాలను ఆగస్టు 20వ తేదీలోపే స్వీకరిస్తారు. అలా ఇచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18వ తేదీలోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. జూలై ఒకటో తేదీ లోగా 18 ఏళ్లు పూర్తి అయినా కొత్త్తగా ఓటరు నమోదు కాకపోతే ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చు. జాబితాలో ఓటు లేకపోతే ఫారం–7.. వేరే చోటుకు ఓటు బదలాయించడానికి ఫారం–8ని వినియోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. -
అర్జీదారులా..ఖైదీలా?
కలెక్టరేట్ వద్ద ఖైదీల తరహా తనిఖీలు సాక్షి, టాస్క్ఫోర్స్ : సమస్యలు తట్టుకోలేక, స్థానిక అధికారులు న్యాయం చేయకపోతే సామాన్య ప్రజలు ఆశ్రయించే చివరి వేదిక కలెక్టరేట్. కానీ నేడు కలెక్టరేట్ ఒక ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంలా లేదు. అదొక హై–సెక్యూరిటీ జైలును తలపిస్తోంది. సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కు వచ్చే అర్జీదారులను కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్దే పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేసి, అవమానకర రీతిలో లోపలికి పంపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో కలెక్టరేట్ ప్రాంగణంలో వరుసగా కొందరు అర్జీదారులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడాన్ని సాకుగా చూపిస్తూ యంత్రాంగం ఈ ముమ్మర తనిఖీలకు తెరలేపింది. బ్యాగులు విప్పడం, జేబులు తడమడం, అనుమానంగా చూడడం.. ఇదీ సోమవారం కలెక్టరేట్ గేట్ వద్ద కనిపించిన దృశ్యాలు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే... సామాన్యులు పెట్రోల్ బాటిళ్లతో కలెక్టరేట్ మెట్లెక్కాల్సిన దుస్థితి ఎందుకు వస్తోంది?.. మండల స్థాయిల్లో, గ్రామ సచివాలయాల్లో అర్జీదారుల సమస్యలు పరిష్కారమైతే వారు చిత్తూరు వరకు ఎందుకు వస్తారు?.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి తహసీల్దార్లు ‘నేనేం చేయలేను’ అని చేతులెత్తేస్తుంటే, బాధితులకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం ఏం కనిపిస్తుంది?.. వ్యవస్థలోని లోపాలను, కిందిస్థాయి అధికారుల చేతకానితనాన్ని సవరించాల్సిన పాలకులు.. దాన్ని వదిలేసి, బాధితులనే అనుమానితులుగా చూడడం నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది. సమస్యను చంపేయడమే పరిష్కారమా?అర్జీదారులను గేటు వద్దే ఆపి, తనిఖీలు చేసి లోపలికి పంపడం ద్వారా ఆత్మహత్యలను ఆపగలరేమో కానీ, వారి గుండెల్లో రగులుతున్న ఆవేదనను, ఆక్రోశాన్ని ఆపగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పెట్రోల్ బాటిల్ తనిఖీల్లో దొరికిపోవచ్చు.. కానీ ఆ నిరుపేద అర్జీదారుడి కడుపు కోతను ఏ తనిఖీలతో గుర్తిస్తారో అర్థంగాని పరిస్థితి. పోలీసుల పహారా నడుమ, కంచెలు దాటుకుంటూ వెళ్లి కలెక్టర్కు అర్జీ ఇచ్చుకునే ఈ అప్రజాస్వామిక విధా నం కూటమి ప్రభుత్వ ప్రజాపాలన నినాదానికే గొడ్డ లిపెట్టు అని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు తనిఖీల పేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఆపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పుష్పాభిషేకం!
కార్వేటినగరం: రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారికి సోమవారం పుష్పయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి సంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం వంటి ఆరు రకాల పత్రాలు కలిపి టన్ను పుష్పాలతో పుష్పాభిషేకం చేశారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులతోపాటు స్థానికులు పుష్పాలను విరాళంగా సమర్పించారు. జూన్ 6 నుంచి 14వ తేదీ వరకు వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెల్సిందే. ఈ సమయంలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, అనధికారులు, భక్తుల కారణంగా జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం కంకణబట్టు మురళీకృష్ణ ఆధ్వర్యంలో పుష్పయాగం చేపట్టారు. తదనంతరం స్వామివారు తిరుచి వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి స్వామివారి ఏకాంత సేవ నేత్రపర్వంగా సాగింది. డెప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, ఆలయ అధికారి చంగల్రాజు పాల్గొన్నారు. డయేరియా నివారణే లక్ష్యం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో డయేరియా నివారణే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డయేరియా నివారణపై అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. చిన్నపిల్లల్లో డయేరియా ప్రాణాంతకంగా మారకుండా చూసేందుకు ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది జూన్ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య–వెల్నెస్ కేంద్రాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలలో ప్రత్యేకంగా ఓఆర్ఎస్–జింక్ కార్నర్లను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఆహారం తినే ముందు, పిల్లలకు తినిపించే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. డీఎంహెచ్వో నాగశశిభూషన్రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి హనుమంతరావు, డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి పాల్గొన్నారు. -
మానవత్వం మిగిలే ఉంది
తోడబుట్టిన వాడు మానసిక వికలాంగుడిగా మారాడు. తన సంరక్షణ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతగా భావించాను. నా తమ్ముడు మళ్లీ ఆరోగ్యవంతుడు అవుతాడనే నమ్మకం ఉంది. వాడిని కాపాడుకోవడంలో నాకు ఎంతో మంది సాయం చేస్తున్నారు. వారిని చూస్తే మానవత్వం ఇంకా మిగిలే ఉందని తెలుస్తుంది. వాళ్ల సాయాన్ని జన్మలో మరువలేను. కుప్పం ప్రాంతంలోని మానసిక వికలాంగులు, వికలాంగుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియన్ స్కూలు లాగా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – జి. వెంకటేష్, కర్లగట్ట ● -
అయ్యో.. కొడుకా!
శ్రీరంగరాజపురం : రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. దంపతులిద్దరూ రోజూ పనికెళ్లితేగానీ ఐదేళ్లూ నోటికందవు. రోజూలాగే భార్య కూలిపనికెళ్లిగా.. భర్త వెల్డింగ్ పనికెళ్లాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పదో తరగతి చదువుతున్న కొడుకు కూలి పని చేస్తున్న తల్లి వద్దకెళ్లాడు. పక్కనే ఉన్న మామిడితోటలో మామిడి పండ్లు తిని చేయి కడుక్కునేందుకు అక్కడున్న ఓ గుంతలో దిగాడు. అంతే..! కాలుజారి పడిపోయాడు. గమనించిన తల్లి కొడుకుని రక్షించేందుకు తనూ గుంతలో దిగేసింది. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన ఎస్సార్పురం మండలం నెలవాయిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. నెలవాయి గ్రామానికి చెందిన సోమశేఖర్(చిట్టీ), రేవతి(35) దంపతులకు ఆస్తిపాస్తులు లేవు. చిట్టీ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య రేవతి రోజువారీ కూలిపనులకెళ్తూ తోడ్పాటునందిస్తోంది. రోజూ మాదిరిగానే రేవతి ఆదివారం నెలవాయి గ్రామానికి చెందిన రఘుపతినాయు డు పొలంలో కూలి పనికెళ్లింది. సెలవు దినం కావడంతో కొడుకు సిద్ధూ తల్లివద్దకెళ్లాడు. పక్కనే ఉన్న మామిడి తోట లో మామిడి పండ్లు తిని.. చేయి కడుక్కునేందుకు అక్కడే ఉన్న ఓ గుంతలో దిగబోయాడు. కాలు జారడంతో నీటిలో పడిపోయాడు. గమనించిన తల్లి పరుగున వచ్చి కొడుకుని రక్షించేందుకు గుంతలోకి దిగింది. ఆ గుంత సుమారు 15 అడుగుల లోతు వరకు ఉండడంతో ఇద్దరూ ఊపిరాడక మృత్యుఒడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు గుంత వద్దకు చేరుకుని తల్లీకొడుకుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుమన్ పేర్కొన్నారు. అంతులేని విషాదం కార్వేటినగరం మండలం, డీఎంపురం గ్రామానికి చెందిన రేవతిని 16 ఏళ్ల క్రితం చిట్టీ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి కుమారుడు సిద్ధూ, కుమార్తె సౌమ్యశ్రీ ఉన్నారు. గుంతలోకి దిగి తల్లీకొడుకు మృతిచెందగా.. చిట్టీ, కుమార్తె సౌమ్యశ్రీ దిక్కులేనివారిగా మిగిలారు. ‘నేను ఎలా బతికేదమ్మా..! నాకు దిక్కెవరు తల్లీ..?.. అంటూ ఆ కుమార్తె గుండెలవిసేలా రోదించడం చూపరులకు కన్నీళ్లు తెప్పించింది.పెనవేసుకున్న పేగు బంధం కళ్లెదుటే నీటిలో పడి అల్లా డుతుంటే తట్టుకోలేకపోయింది. ప్రాణాలకు తెగించి గుంతలో దిగి కొడుకుని రక్షించేందుకు యత్నించింది. ఊపిరి పోతున్నా ఎలాగైనా కుమారుడ్ని కాపాడాలని పోరాడింది. కానీ చివరకు మృత్యువే జయించింది. తల్లీకొడుకులిద్దర్నీ పొట్టనబెట్టుకుని కన్నీళ్లు మిగిల్చింది. కుమార్తెను అనాథను చేయగా.. భర్తను వీధిన పడేలా చేసింది. ఈ ఘటన ఎస్సార్పురం మండలం, నెలవాయి గ్రామంలో పెను విషాదాన్ని మిగిల్చింది. తల్లీకొడుకుని మింగేసిన గుంత -
ఎరువు.. బరువు!
●ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నా యి. పంటలకు అవసరమైన ఎరువులు తీసుకోవాలంటే ముందుగా యాప్లో నమోదు చేసుకోవాలని కొత్త నిబంధన తీసుకువచ్చింది. దానిపై అవగాహన లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ ఈ పరిస్థితి లేదని, ఇప్పుడు ప్రభుత్వం లేనిపోని నిబంధనలు తీసుకువచ్చి ఇబ్బంది పెడుతోందని రైతులు వాపోతున్నారు.బైరెడ్డిపల్లె : ఎరువులు కావాలంటే రైతులు ముందుగా ఏపీఏఐఎంఎస్ యాప్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రైతులకు ఇబ్బందికరంగా తయారైంది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగానే ఉన్నాయి. దీనికితోడు ఇక మీదట సాగు చేసే పంటలను ముందస్తుగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించాలని, తర్వాతే ఎంత మేర ఎరువులు ఇవ్వాలో నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా భూములు వెబ్ల్యాండ్లో ఉంటేనే ఎరువులు ఇస్తామని, లేకుంటే ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. యాప్ ద్వారానే అమ్మకాలు ఇక నుంచి యాప్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేయనున్నారు. ఈనెల 8 నుంచి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు ప్రారంభించారు. అధిక మోతాదులో ఎరువుల వేస్తే భూమికి ముప్పుతో పాటు పర్యావరణానికి కూడా ఇబ్బందే. – గీతాకుమారి, వ్యవసాయశాఖ అధికారి -
చిల్లర దుకాణంలో చోరీ
బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లె చెక్పోస్టు కూడలిలోని నాగరాజునాయుడు దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణానికి ఏర్పాటు చేసిన రేకులను తొలగించి లోనికి ప్రవేశించి వస్తువులతో పాటు సిగిరేట్లు ఎత్తుకెళ్లారు. బాధితుడు ఆదివారం ఉదయం దుకాణం వద్దకు వెళ్లగానే చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం డీకొని వైద్యుడి మృతి పూతలపట్టు(యాదమరి): గుర్తుతెలియని వాహ నం డీకొని ఓ యువ వైద్యుడు మృతిచెందిన ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. పాకాల మండలం, పచ్చిపాలపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అభిషేక్(29) భార్యతో కలసి చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులుగా విధులు నిర్వర్తిస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఆయన సొంత గ్రామం పచ్చిపాలపల్లిలోని స్వగృహంలో ఇటీవల చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం పాకాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి ద్విచక్ర వాహనంలో చిత్తూరుకు తిరుగు పయనమయ్యాడు. మండల పరిధి కిచ్చన్నగారిపల్లి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం డీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ బోల్తా కుప్పం రూరల్ : మండలంలోని కుప్పం – క్రిష్ణగిరి జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం లారీ బోల్తాపడి డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. లారీ పత్తి లోడుతో గుర్గావ్ నుంచి తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు వెళ్తోంది. మార్గమధ్యంలో కుప్పం మండలం నడుమూరు మోడల్ పాఠశాల వద్ద ఉన్న మలుపులో ఆదివారం ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ మాధవ్కు తలపై స్వల్ప గాయమైంది. క్లీనర్కు గాయాలు కాలేదు. స్థానికులు డ్రైవర్ మాధవ్ను చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మలుపు వద్ద నెలలో నాలుగు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు తవణంపల్లె : మండలంలోని చిత్తూరు– అరగొండ ప్రధాన రహదారిలో ఉన్న షికారీ కాలనీ వద్దనున్న మలుపులో ఆదివారం రెండు స్కూటర్లు ఢీన్నాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ రమేష్బాబు కథనం మేరకు.. చిత్తూరు పట్టణం కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన వి.రాజశేఖరన్, అతని తమ్ముడు వి.శ్రీనివాసన్ ద్విచక్ర వాహనంలో అరగొండ నుంచి చిత్తూరు బయలుదేరారు. అదేసమయంలో గంగనపల్లెకు చెందిన మహిళ స్కూటర్లో వస్తోంది. షికారీ కాలనీ వద్దనున్న మలుపులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో రాజశేఖరన్, శ్రీనివాసన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజశేఖరన్కు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వేలూరులో ని నర్వీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. రాజశేఖరన్ అల్లుడు పవన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఎక్కడున్నారు సారూ! చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో ఉండి మ్యాపింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు. కొన్ని కేంద్రాల్లో బీఎల్ఓలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నారు. తర్వాత పత్తాలేకుండా పోయారు. చిత్తూరులోని దొడ్డిపల్లె, రాంనగర్కాలనీ, కట్టమంచి, కొంగారెడ్డిపల్లె ప్రాంతాల్లో పలువురు బీఎల్ఓలు గైర్హాజరయ్యారు. నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు ప్రాంతాల్లో కొన్ని పాఠశాలల తలుపులు తెరుచుకోనేలేదు. ఎలాగూ ఇంటింటికి వెళ్తాం కదా.. అన్నధోరణిలో పలువురు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్ఓల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన సూపర్వైజర్లు సైతం అటు వైపు తొంగిచూడలేదు. చివరికి పలువురు ఓటర్లు నిరీక్షించి చేసేదేమిలేక వెనుదిరిగారు. -
నత్తనడకన మ్యాపింగ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రాథమి క, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2845 ఉన్నాయి. వీటిలో 2,30,042 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి తల్లికి వందనం పథకం వర్తింపజేయడానికి చేపట్టిన మ్యాపింగ్ మందకొడిగా సాగుతోంది. దీంతో విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గదర్శకాలు లేకపోవడం, అవగాహన కల్పించకపోవడమే జాప్యానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేయడమే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్డంకులెన్నో... గత వైఎస్సార్ సీపీ సర్కారు అమ్మఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేసింది. కూటమి ప్రభు త్వం పథకానికి పేరు మార్చి అమలులో ఘోరంగా విఫలమైంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించలేకపోతోంది. పథకానికి అర్హత సాధించాలంటే నిబంధనలు, సాంకేతిక కారణాలు సాధారణ పేద కుటుంబాలకు శాపాలుగా మారాయి. కూటమి సర్కారు ఉదాసీనత వల్ల ప్రతి ఏటా అర్హులైన వేలాది మంది విద్యార్థులు పథకానికి దూరమవుతున్నారు. ఆర్భాటపు మాటలు ఎన్నికల ప్రచారంలో బడికి వెళ్లే ప్రతి బడ్డ కూ తల్లికి వందనం వర్తింపజేస్తామని కూట మి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు పథకానికి నిధుల కేటాయింపులో కోత పెట్టడానికే మ్యాపింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు పెట్టి ఆలస్యం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ లబ్ధి చేకూరుస్తామని చెప్పి, ప్రస్తుతం రకరకాల కారణాలతో వడపోత కార్యక్రమానికి తెరలేపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయిలో అవగాహన కరువు పథకం అమలు బాధ్యతలను విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ, సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మ్యాపింగ్ యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం, సర్వర్ డౌన్తో డేటా నమోదు నిలిచిపోతోంది. జిల్లాలో మ్యా పింగ్ ప్రక్రియ 50 శాతం కూడా కాలేదు. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ, బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్ వంటి అంశాలపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు. తల్లిదండ్రులు సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తిరుగుతున్నా రు. అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతోనే మ్యాపింగ్ నత్తనడకన సాగుతోంది. తల్లికి వందనం పథకానికి అడ్డంకులెన్నో -
ఎరువు.. బరువు!
ఎరువుల కోసం ముందుగా ఏపీఏఐఎంఎస్ యాప్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మామిడి..అన్లోడ్ లేదు మరి తవణంపల్లె: మండలంలోని గుజ్జు ఫ్యాక్టరీల వద్ద మామిడి కాయల లోడ్డుతో ఉన్న ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. సకాలంలో అన్లోడ్ కాకపోవడంతో రోజుల తరబడి రైతులు అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. మండలంలోని గుజ్జు ఫ్యాక్టరీల్లో కొంత మంది టోకెన్లు ఇస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీల్లో సీరియల్ ప్రకారం అన్లోడ్డు చేయిస్తామని ట్రాక్టర్లను అనుమతిస్తున్నారు. ఎఫ్–3 ఫ్యాక్టరీలో చాంబర్ల ఖాళీ కావడంలేదని అన్లోడ్డు ఆపివేశారు. దీంతో సుమారు వంద ట్రాక్టర్లు అన్లోడ్డు కోసం వేచి ఉన్నాయి. రైతులు అక్కడే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఓటరు సేవలకు కాల్ బుకింగ్ చిత్తూరు కలెక్టరేట్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో ఓటర్ల మ్యాపింగ్కు సంబంధించి బీఎల్వో ఓటర్లను సంప్రదించకుంటే వారినే నేరుగా ఇంటికి పిలిపించుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ మేరకు బీఎల్వోలతో కాల్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇందుకు ఓటర్లు ఈసీఐనెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే voters.eci.gov.in వెబ్సైట్లో బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో ఆప్షన్ను ఎంచుకోవాలి. కాల్ బుకింగ్ చేసుకున్న 48 గంటల్లోగా బీఎల్వోలు సదరు ఓటరును సంప్రదిస్తారు. ఓటరు సేవలకు సంబంధించి సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు. కాల్ బుకింగ్ లు ఎన్ని జరిగాయి? ఏ సేవలపై వివరాలను ఓటర్లు అడిగారు? చూపిన పరిష్కారం ఏమిటి? అనే వివరాలను ముఖ్య ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తుంటారు. సర్ ప్రక్రియలో ఈ నెల 14వ తేదీలోపు ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసి, 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితాలను ప్రచురిస్తారు. ఓటరు సేవలకు కాల్ బుకింగ్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు ప్రజలను కోరుతున్నారు. -
ఫీజుల గుక్క
అక్షరం ముక్క.. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. తమ పిల్లలను కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనుకునే తల్లిదండ్రుల నుంచి ఫీజుల దగ్గర నుంచి పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ, బస్సు చార్జీల పేర్లతో అందిన కాడికి దోచుకుంటున్నారు. పుస్తకా లు, యూనిఫాం, స్టేషనరీ తదితరాలను పాఠశాలల్లోనే నేరుగా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. హైటెక్ పేర్లతో కనిపించే పాఠశాలల్లో కనీసం మౌలి క సదుపాయాలు ఉండడం లేదు. అపార్ట్మెంట్ భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభు త్వ నిబంధనలను అతిక్రమిస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయా పాఠశాలలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.20 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 431 కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇవి కాకుండా అనుమతులు లేని మరో 50 పాఠశాలలున్నట్లు విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. వీటిలో ఎల్కేజీ నుంచి 10 వ తరగతి వరకు విద్యాబోధనకు పాఠశాలను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజులో 50 శాతం స్కూల్లో చేరినప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ఫీజు రెండు దఫాలుగా చెల్లించాలి. ఫీజుల స్ట్రక్చర్ను నోటీసు బోర్డులో ఉంచాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. పేరెంట్స్ కమిటీలు ఉండడం లేదు. ఫీజులకు తగ్గ వసతులు కనిపించవు. విద్యార్థులను గాలి, వెలుతురు లేని గదుల్లో ఉంచి బోధన చేస్తున్న దుస్థితి. ఇష్టానుసారంగా ప్రత్యేక ఫీజులు విద్యార్థుల నుంచి ట్రాన్స్ఫోర్ట్ పేరుతో మరో వ్యాపారానికి తెరతీశారు. తక్కువ దూరానికి సైతం రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు వసూలు చేస్తున్నారు. విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ, పాఠశాల వార్షికోత్సవ వేడుకల పేరుతో అదనంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని పాఠశాలల వివరాలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు 431 చదువుతున్న విద్యార్థులు 2 లక్షల మంది పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ రూ.15 వేలు (ఒక్కో విద్యార్థికి సగటున) మొత్తం వ్యాపారం రూ.400 కోట్లు 12 శాతం జీఎస్టీ వసూలైతే రూ.48 కోట్లు జీవో నంబర్ 1 అనుసరించడం లేదు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జీవో నంబర్ 1ని అనుసరించడం లేదు. ఫీజుల వివరాలు నోటీసు బోర్డుల్లో పెట్టడం లేదు. పుస్తకాలు, యూనిఫాం, ఇతర విద్యాసామగ్రిని పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. ఫీజులు ఇష్టానుసారం పెంచేసి తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు సైతం తెలుసు. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదు. అధిక ఫీజులు కట్టడి చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం. – ప్రవీణ్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యల పై వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొ న్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 10.30 గంటల నుంచి నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు – మద్యం నిల్వలపై కేసుల నమోదు చిత్తూరు అర్బన్: ఆపరేషన్ ఫ్లష్–అవుట్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలను నిర్మూలించడానికి ఆదివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఇందులో పలు అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో కేసులు నమోదు చేశామ న్నారు. డ్రగ్ డిటెన్షన్ కిట్స్ సహాయంతో 60 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎన్ఆర్.పేటలో ఇద్దరు, తవణంపల్లెలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్వేటినగరం పరిధిలో సారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల బెల్లం ఊట, పెద్దపంజాణి పరిధిలో 300 లీటర్ల ఊటను ధ్వంసం చేశామన్నారు. యాదమరి స్టేషన్ పరిధిలో సరైన పత్రాలులేని రెండు స్కూటర్లను సీజ్ చేశామని తెలిపారు. బెల్టు దుకాణాల్లో విక్రయించడానికి నిల్వ ఉంచిన డ్యూటీ పెయిడ్ లిక్కర్ను (డీపీఎల్) గుడిపాలలో 120 మద్యం బాటిళ్లు, పెనుమూరు లో 16, రొంపిచెర్లలో 10, కల్లూరులో 10, జీడీ నెల్లూరులో 24, కాణిపాకంలో 15 బాటిళ్లు, రాళ్లబుదుగూరులో 22 లీటర్లు, గుడుపల్లెలో 27 లీటర్ల డీపీఎల్ సీజ్ చేశామని వెల్లడించారు. రామకుప్పంలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మొత్తం ఘటనలపై 15 కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగిస్తున్నట్టు తెలిస్తే 9490617896, ఈగల్ టీం–1972, డయల్–112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
తమిళనాడు కాయలపైనే మోజు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని కొన్ని మామిడి ర్యాంపులు గుడిపాల పల్ప్ ఫ్యాక్టరీలతో కుమ్మకై ్క పనిచేస్తున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైతుల నుంచి కేజీ రూ.4లకే తోతాపురి మామిడిని కొనుగోలు చేసి, అదే కాయలను ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు తమిళనాడు నుంచి వచ్చే మామిడిని కేజీ రూ.5 నుంచి రూ.5.50 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక రైతుల కాయలకు నిరాకరిస్తూ బయటి రాష్ట్రాల కాయలకు ప్రాధాన్యం ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు తమ పంటను ట్రాక్టర్లలో తీసుకువచ్చి రోజుల తరబడి వేచి ఉన్నా పట్టించుకోవడం లేదు. రేపు రండి అంటూ తిరిగి పంపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలను నేరుగా ఫ్యాక్టరీ లోపలికి పంపించి అన్లోడ్ చేసుకుంటున్నట్టు వాపోతున్నారు. పలు ఫ్యాక్టరీల వద్ద టోకెన్ల జారీని నిలిపివేస్తూ నోటీసులు అంటించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో చాలామంది రైతులు కోతలను తాత్కాలికంగా ఆపివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాయలను తోటల్లోనే వదిలేయాల్సి వస్తుందని, లేకుంటే రోడ్ల పక్కన పారబోయాల్సి ఉంటుందని చెబుతున్నారు. గుడిపాలలో కిక్కిరిసిన లారీలు గుడిపాల ప్రాంతంలోని ఫ్యాక్టరీల ముందు రోజూ భారీ సంఖ్యలో లారీలు నిలుస్తున్నా యి. తమిళనాడు నుంచి కాయల రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు మా త్రం పరిశీలనలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, లారీల రాకపోకలపై కఠిన చర్యలు కనిపించడం లేదని అంటున్నారు. గుడిపాల మండలంలోని పల్ప్ ఫ్యాక్టరీలు ర్యాంపులతో కుమ్మక్కయ్యాయి. తమిళనాడు నుంచి వచ్చిన లారీల్లోని మామిడి కాయలను అన్లోడ్ చేస్తూ జిల్లాలోని రైతుల కాయలను కొనుగోలు చేయడం లేదు. టోకెన్ల జారీని సైతం ఆపేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మామిడి కాయలను రోడ్ల పక్కన పారబోయాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను పిప్పి చేస్తున్నారు నాకు 15 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ కాయ లు అమ్ముకోవడం కష్టతరంగా మారింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫ్యాక్టరీకి కాయలు తోలికెళితే దింపేందుకు మూ డు రోజులు అవుతోంది. అదే సిఫార్సు ఉంటే గంటల్లో అయిపోతున్నాయి. గుడిపాలలో కొనుగోలు పూర్తిగా నిలిపేశారు. లారీల్లో వచ్చే కాయలను మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. – సుబ్రమణ్యం నాయుడు, ఎగువ కండ్రిగ, చిత్తూరు -
సరిపడా అందించాలి
రైతులు సాగు చేసిన పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా అందించాలి. ప్రస్తుతం సాగు ఖర్చు ఎక్కువైంది. కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి తరుణంలో యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తే రైతులకు మరింత భారంగా మారుతుంది. పెట్టుబడి కూడా భారీగానే పెరుగుతుంది. – శివ, మిట్టకుర్రపల్లె కౌలు రైతుల మాటేంటి రైతులకు ఎరువులను యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్న వ్యవసాయశాఖ కౌలు రైతులకు ఎలా ఇస్తారో చెప్పడం లేదు. కౌలు రైతులకు కార్డులు కూడా ఇవ్వలేదు. కౌలుకు తీసుకుని సాగు చేసే భూమికి ఎరువులు ఎలా ఇస్తారో తెలియజేయాలి. పంటకు ధరలు లేకుంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. – మురళి, తీర్థం అరకొరగానే.. సేంద్రియ ఎరువులు ఎంత వాడినా రసాయన ఎరువులు కాస్తా పంటల కు వేస్తేనే దిగుబడి బాగా వస్తుంది. యాప్ ద్వారా ప్రభుత్వం అరకొరగానే ఎరువులు ఇస్తోంది. ప్రస్తు తం ఉన్న ఖర్చులతో పాటు ఎరువుల వ్యయం భా రంగా మారితే వ్యవసాయం మరింత కష్టంగా మారుతుంది. – సుబ్రమణ్యం, నాగిరెడ్డిపల్లె -
తమ్ముడికి అన్నీ తానై!
నేడు అన్ని సంబంధాలు ఆర్థికంగా మారి పోయాయి. మానవ సంబంధాలు, మానవ విలువలు దిగజారిపోతున్నాయి. ఆదాయం వస్తుందంటేనే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక అన్న తన తమ్ముడికి అన్నీతానై నిలిచాడు. కాంట్రాక్టు ఉద్యోగిగా తక్కువ జీతం వస్తున్నా నాకెందుకులే అని అనుకోలేదు. మానసిక వికలాంగుడని చీదరించుకోలేదు. బిడ్డలా సేవ చేస్తున్నాడు. కన్నబిడ్డలకంటే మిన్నగా చూసుకుంటున్నాడు. శాంతిపురం: మండలంలోని కర్లగట్టకు చెందిన అబ్బయ్య, ఎల్లమ్మ దంపతులకు ముగ్గు రు కొడుకులు. ఒక కుమార్తె సంతానం. పెద్ద కొడుకు జి.వెంకటేష్ కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండవ వాడు వెంకటముని వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. మూడో వాడు చిన్నకుట్టి అలియాస్ విజయ్కుమార్(33) చిన్నతనం నుంచి అమాయకుడిగా ఉండేవాడు. ఏడో తరగతి వరకు చదివాడు. దండికుప్పంలోని బ్రిడ్జి స్కూలులో చేర్పించినా చదువు ముందుకు సాగలేదు. 2006లో తల్లి మరణం తర్వాత చిన్నకుట్టి మానసికంగా బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు గమనించి వైద్యం చేయించడం మొదలు పెట్టా రు. 2020లో తండ్రి మరణం తర్వాత అతని ఆరోగ్యం మరింత దిగజారింది. కుటుంబ సభ్యుల మాట పట్టించుకోకుండా, ఇంటి పట్టున ఉండకుండా ఇరుగుపొరుగు గ్రామాల్లో తిరిగేవాడు. అన్న వెంకటేష్ అతని బాగోగులు చూసుకోవడం ప్రారంభించాడు. 2023లో అతన్ని పలమనేరులో ఓ ఎన్జీవో సంస్థ నడుపుతున్న మానసిక వికలాంగుల కేర్ హోమ్లో చేర్పించాడు. అక్కడ కూడా ఉండకుండా చిన్నకుట్టి తప్పించుకున్నాడు. తర్వాత తనను పట్టుకుని బెంగళూరులోని నిమ్హాన్స్, కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో వైద్యం కొనసాగిస్తున్నారు. సాయం చేస్తున్న దయామయులు: తమ్ముడి పట్ల వెంకటేష్ చూపుతున్న బాధ్యతను గమనించిన స్థానికులు కొందరు అతనికి సహకరిస్తున్నారు. చిన్నకుట్టి ఉనికిని ఎప్పటికప్పుడు అన్నకు తెలియజేయడం, ఆ రోజు మాత్రలు వేసుకున్నాడా? లేదా అని తెలుసుకుని మాత్రలు మింగించడం చేస్తున్నారు. చిన్నకుట్టి ఎక్కువగా ఏడోమైలు ప్రాంతంలోనే ఉండడంతో అక్కడ హోటళ్ల యజమానులు భోజనం పెడుతూ తర్వాత బిల్లు తీసుకుంటున్నారు. చంటి బిడ్డలా సేవలు ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతున్న తమ్ముడి ఉనికిని వెంకటేష్ గ్రామస్తుల సహకారంతో తెలుసుకుంటూ ఏ గ్రామంలో ఉన్నా మాత్రలు ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. దీనికోసం ఆయా గ్రామాలకు చెందిన వారి వద్ద మాత్రలు సిద్ధంగా ఉంచాడు. తమ్ముడు రాత్రి పూట ఏడవమైలు, కాలిగానూరు, కడపల్లి గ్రామాలకు వస్తే అక్కడ ఉండేందుకు అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేశాడు. ఆఫీసు నుంచి త్వరగా వచ్చిన రోజు స్థానికుల సమాచారంతో తమ్ముడిని వెతికి కలిసి యోగక్షేమాలు విచారిస్తున్నాడు. ఆదివారం వస్తే తమ్ముడికి షేవింగ్ చేయించడం, జుట్టు కత్తిరించడం, స్నానం చేయించడం వ్యాపకంగా పెట్టుకున్నాడు. డాక్టర్లు చెప్పిన రోజున తమ్ముడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేస్తున్నాడు. వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలు పొరుగున ఉన్న కర్ణాటకలో ఉంటుంటే తమ్ముడి బాధ్యతల తర్వాతే వారికి సమ యం కేటాయిస్తున్నాడు. -
రైతుల నడ్డివిరుస్తున్న ప్రభుత్వం
● పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల అవస్థలు ● హేళగా మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెదురుకుప్పం: పంట లకు గిట్టుబాటు ధర కల్పించకుండా కూట మి ప్రభుత్వం రైతుల నడ్డివిరుస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆరోపించారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. ధరలు లేక వరి పంటను రైతులు కల్లాల్లోనే వదిలేశారని, చెరుకు, మామిడి, వేరుశనగ, మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులు ఆనందంగా ఉన్నారని, కావాలనే వైఎస్సార్ సీపీ రాద్దాంతం చేస్తోందంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని గమనించకుండా ఇంట్లో కూర్చుకుని తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లా డడం తగదన్నారు. ఇంత వరకూ వేరుశనగ విత్తనాలు అందించలేదని తెలిపారు. మామిడి రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మామిడి రైతులకు కిలోకు రూ.16 నుంచి రూ.21 వరకు ధర కల్పించినట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిలోకు రూ.6లు దాటడం లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతి సారీ రైతులను అన్ని విధాలా ముంచేస్తాడని విమర్శించారు. రైతుల కన్నీరు రాష్ట్రానికి అరిష్టమన్నారు. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది చంద్రబాబేనని నారాయణస్వామి స్పష్టం చేశారు. అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచారని తెలిపారు. వైఎస్ రాజారెడ్డి, వంగవీటి రంగా, వైఎస్ వివేకానందరెడ్డి ఎవరి హయాంలో హత్యకు గురయ్యారో ప్రజలకు తెలుసన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, ప్రజలకు గొడ్డలి వేటు, వెన్నుపోటు, మోసం, అబద్దాలు ఆయనకు అలవాటేనన్నారు. మహిళలకు రక్షణ ఏదీ..? రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, చంద్రబాబునాయుడు దిశా చట్టాన్ని నిర్వీర్యం చేశారని నారాయణస్వామి ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతున్న దుండగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మండి పడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని లోకేష్ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తానని చెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలవడంతో భయపడి వైఎస్సార్ సీపీపై ఎదురుదాడికి దిగుతోందని చెప్పారు. ఈసారీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. -
శాస్త్రోక్తంగా చక్రస్నానం
● వేడుకగా స్నపన తిరుమంజనం ● ముగిసిన వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు కార్వేటినగరం: కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం ఉదయం చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేశారు. చూర్ణాభిషేకం చేపట్టారు. అనంతరం రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని ఊరేగింపుగా స్కంధపుష్కరణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ ఉత్సవర్లతో పాటు చక్రతాళ్వార్కు వేద పండితులు వేదమంత్రాల నడుమ స్నపన తిరుమంజనం చేశారు. తదుపరి చక్రస్నానం చేయించారు. సాయంత్రం ఉభయ నాంచారులతో వేణుగోపాలుడు తిరుచ్చి వాహనంపై ఆశీనులై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం కంకణబట్టర్ మురళీకృష్ణకు టీటీడీ ఆనవాయితీ ప్రకారం అందించిన పట్టు వస్త్రాలను టీటీడీ అధికారులు బహూకరించారు. డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, పాల్గొన్నారు. నేడు పుష్పయాగం ఆలయంలో సోమవారం ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల మధ్య పుష్పయాగం చేపడతామని ఆలయ అధికారి చంగల్రాజు తెలిపారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం ఉంటుందని తెలిపారు. -
కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనానికి శనివారం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మనసును కలచివేశాయి రోడ్డు ప్రమాదా లు, బిడ్డకు ఆరోగ్యం బాగలేదని, అమ్మకు ఆపరేషన్ అంటూ చాలా మంది బ్లడ్ కోసం అల్లాడుతున్నారు. మా స్నేహితులే చాలా మంది రక్తం దొరక్క ఇబ్బంది పడ్డారు. ఈ విషయాలు మనసును కలచివేశాయి. అందుకే రక్తదానం చేయడం ప్రారంభించా. ఇప్పటి వరకు 15 సార్లు రక్తం దానం చేశా. అలాగే ట్రస్టు ద్వారా నాలుగేళ్లుగా జనవరి 26వ తేదీన రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నా. ఏటా 100 యూనిట్లకు తగ్గకుండా రక్త సేకరణ చేయిస్తున్నాను. ఈసారి కూడా 160 యూనిట్ల రక్తం సేకరించి..నిధికి అందజేశా. – మనోజ్రెడ్డి, రక్తదాత, చిత్తూరు అపోహలు వద్దు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరిలో రక్తదానంపై అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే బలహీనత వస్తుందని, ఆరోగ్యం దెబ్బతింటుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ అపోహలను ఎవరూ నమ్మవద్దు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానం చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది యువకులు క్యాంపులు ఏర్పాటు చేసి రక్తం సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందిస్తున్నారు. వారి సేవలు అబినందనీయం. – అమరనాథ్, రక్తనిధి మెడికల్ ఆఫీసర్, చిత్తూరు -
రమణీయం.. రథోత్సవం
కార్వేటినగరం : శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శనివారం రమణీయంగా రథోత్సవం నిర్వహించారు. రుక్మిణీ, సత్యభామ సమేతంగా స్వామివారు దివ్య రథంపై విహరించారు. అశేష భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ పురవీధుల్లో ఊరేగారు. ఈ క్రమంలోనే సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ జరిపించారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, ఆలయాధికారి చంగల్రాయులు, కంకణభట్టార్ మురళీకృష్ణ పాల్గొన్నారు. నేడు చక్రస్నానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం ఉదయం 9 గంటలకు స్కంధ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి చంగల్రాయులు తెలిపారు. సాయంత్రం ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిపూర్ణం కానున్నట్లు వెల్లడించారు. -
‘స్లీపర్’.. ఇకపై స్టార్ లైనర్
పలమనేరు/ బైరెడ్డిపల్లె : ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సులకు పేరు ఎంపికపై పోటీ చేపట్టింది. ఇందులో బైరెడ్డిపల్లె మండలం బేలుపల్లె పంచాయతీ చిక్కనపల్లెకు చెందిన బండి రెడ్డెప్ప స్టార్ లైనర్ అనే పేరును సూచించి రూ.10వేల బహుమతితోపాటు ఆర్టీసీ అధికారుల సత్కా రం అందుకున్నారు. వివరాలు.. 2022లో నాన్ఏసీ స్లీపర్ కోచ్ బస్సులకు ఏదైనా కొత్త పేరు పెట్టాలని ఇందులో ఎంపికై న వారికి బహుమతి ఉంటుందని ఆర్టీసీ ప్రకటన జారీ చేసింది. దీంతో బండి రెడ్డెప్ప ఇరవై పేర్లను సూచిస్తూ ఆర్టీసీ వారికి పంపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,585మంది రకరకాల పేర్లను సూచించారు. ఎట్టకేలకు రెడ్డెప్ప సూచించిన స్టార్ లైనర్ పేరుకే బహుమానం దక్కింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం హైదరాబాదులోని బస్సు భవన్లో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఘనంగా సన్మానించి రూ.10వేల బహుమతిని అందజేశారు. -
సిఫార్సులకే కొనుగోళ్లు
– మామిడిని తీసుకురావద్దని నోటీసు గుడిపాల: ఫుడ్ అండ్ ఇన్స్ గుజ్జు పరిశ్రమ యాజమాన్యం కేవలం సిఫార్సులకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ సుమారు 50 ట్రాక్టర్ల తోతాపురి రకం కాయలను సిఫార్సులతోనే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సాధారణ రైతులు మామిడి కాయలు తేవద్దని ఫ్యాక్టరీ ఎదుట శనివారం నోటీసును అంటించింది. రెండురోజుల పాటు మామిడికాయలను కొనుగోలు చేయమని నోటీసులో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న మామిడికాయల అన్లోడింగ్కు రెండురోజుల సమయం పడుతుందని వెల్లడించింది. మరోవైపు తాసా జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమిళనాడు నుంచి మామిడికాయలను కొనుగోలు చేస్తోంది. జిల్లా రైతులను పట్టించుకోవడం లేదు. రోజూ తూతూమంత్రంగా 50 టోకెన్లు జారీ చేసి చేతులుదులిపేసుకుంటోంది. ఆయా ఫాక్టరీల యాజమానులపై రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. -
కార్మికులకు దక్కని న్యాయం
శ్రీరంగరాజపురం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సంబంధించి వారి కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులపై ఉన్న శ్రద్ధ స్టీల్ప్లాంట్ కార్మికులపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమా దం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, కార్మికులకు అండగా ఉండకపోగా అపహేళన చేస్తూ మాట్లాడారని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఆర్థికసాయం ప్రకటించలేదని, చట్ట ప్రకారం కార్మికుల రావాల్సిన నిధులనే తాము ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటున్నారని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం అందించారని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే శుక్రవారం రాత్రి కూడా రెండు ప్రమాదాలు సంభవించాయని ఆరోపించారు. దీంతో స్టీల్ప్లాంటు కార్మికుల్లో అభద్రతాభావం ఏర్పడుతోందని తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నిత్యాన్నదానానికి విరాళం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి శనివారం మచిలీపట్నానికి చెందిన దాత హరికృష్ణ రూ.1,00,116 విరాళం అందించారు. కుటుంబసమేతంగా వచ్చిన దాతకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి శేషవస్త్ర, చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. -
హత్యా.. ప్రమాదమా..?
గంగవరం : బంగారుపాళెం మండలం జి.కురప్పల్లెకు చెందిన ఓ యువకుడు తీవ్రగాయాలతో శుక్రవారం మృతి చెందాడు. అయితే యువకుడి మరణంపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. జి.కురప్పల్లెలో నివసించే దేవేంద్ర, హేమలత దంపతుల కుమారుడు జయదీప్(25) ఎంబీఏ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(16)తో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ బాలిక గంగవరం మండలం దండపల్లె కురప్పల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పలమనేరులోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలోనే జయదీప్ దండపల్లె కురప్పల్లెకు చెందిన తన స్నేహితులు వినూత్, కల్యాణ్తో కలిసి బైక్పై బాలిక ఇంటి వద్దకు ఈ నెల 3వ తేదీ రాత్రి వెళ్లాడు. ఇద్దరూ కలిసి వారింటి మిద్దైపెన మాట్లాడుకుంటూ ఉండగా బాలిక తాత నిద్ర లేచి వచ్చేశాడు. దీంతో జయదీప్ అక్కడి నుంచి పారిపోయే యత్నంతో మిద్దైపె నుంచి పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. తల, కాలికి బలమైన గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై జయదీప్ కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని మెరుగైన చికిత్స నిమిత్తం రాణిపేట సీఎంసీకి తీసుకెళ్లి.. అనంతరం తిరుపతికి తరలించారు. శుక్రవారం మళ్లీ చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించాడు. అయితే బాలిక బంధువులే తమ బిడ్డను కొట్టి చంపేశారని జయదీప్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం దండపల్లె కురప్పల్లెలో జయదీప్ గాయపడిన ప్రాంతాన్ని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రాంభూపాల్ పరిశీలించారు. -
17న ఎస్డీహెచ్ఆర్లో మెగా జాబ్మేళా
తిరుపతి సిటీ: నగరంలోని న్యూ బాలాజీ కాలనీలో ఉన్న ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాకు 2021–26 వరకు ఉత్తీర్ణులైన బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీజెడ్సీ, బీసీసీఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. మెగా జాబ్ మేళాలో సజిలిటీ, సదర్లాండ్, ఫస్ట్సోర్స్, అలోరికా, అప్తారా, టెలిపెర్ఫార్మెనన్స్, ఒమేగా హెల్త్కేర్, ఆటోసెనన్స్, పేస్, ఆల్సెట్, కాల్క్లైట్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ ఎమ్ఎన్సీ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 7989004486, 9490557045 నంబర్లను సంప్రదించాలని కోరారు. కిక్కిరిసిన కాణిపాకం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులతో దర్శన మార్గాలు, క్యూలు కిక్కిరిసిపోయాయి. రద్దీని దృష్టిలో ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలలో తాగునీరు, విశ్రాంతి సదుపాయం, వైద్య సేవలు, భద్రత కల్పించా రు. భక్తులు సజావుగా స్వామివారిని దర్శించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదనపు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఫేస్బుక్ ప్రేమ.. చివరికి మోసం చిత్తూరు రూరల్ (కాణిపాకం): సోషల్మీడియా వేదికగా పరిచయం..ఆపై ప్రేమ ముసుగులో నమ్మకం..చివరికి మోసం చేసిన ఘటన శనివారం చిత్తూరు నగరంలో జరిగింది. వివరాలు.. చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట చెక్పోస్టుకు చెందిన విజయ్, తమిళనాడులోని చైన్నెకి చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. క్రమేణా పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో మురకంబట్టులో ఐదు నెలల పాటు సహజీవనం చేశారు. ఈ సమయంలో మహిళా నుంచి విజయ్ దశలవారీగా రూ.8లక్షల నగదు, 12గ్రాముల బంగారం తీసుకుని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్కుమార్ తెలిపారు. -
వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటు పనుల తనిఖీ
పలమనేరు : గొబ్బిళ్లకోటూరు డంపింగ్ యార్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీనాభాను శనివారం తనిఖీ చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే పట్టణంలో కంపోస్ట్ సమస్య తీరుతుందని తెలిపారు. అధ్యాపక పోస్టుల దరఖాస్తులకు రేపే తుది గడువు తిరుపతి సిటీ: ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ, కుప్పం ద్రావిడ వర్సిటీలో పలు అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి అధికారులు సమాచారాన్ని వెలువరించారు. ఈ నెల 8వ తేదీతో ముగిసిన గడువును పలువురి అభ్యర్థన మేరకు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని మూడు వర్సిటీల్లోని పోస్టుల కోసం సుమారు 21 వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. -
దైవం రూపేణా!
ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు.. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన మహిళలు.. తలసేమియాతో ప్రతి నెలా రక్తం కోసం ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేసే పిల్లలు.. వీరందరి చివరి ఆశ రక్తదాతలే. మానవత్వానికి ప్రతీకగా నిలిచే రక్తదానం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్రపంచంలో మనిషిని మరో మనిషి మాత్రమే కాపాడగలడని నిరూపిస్తోంది. అందుకే రక్తదానం మహోన్నమైందిగా అభివర్ణిస్తుంటారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. కాణిపాకం : చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వా స్పత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రం వేలాది మంది రోగులకు ప్రాణాధారంగా నిలుస్తోంది. ప్రమాద బాధితులు, గుండె ఆపరేషన్లు,, క్యాన్సర్ చికిత్సలు, ప్రసవాలు, రక్తహీనత, తలసేమియా వంటి అనేక సందర్భాల్లో బ్లడ్ అత్యవసరంగా కావాల్సివస్తుంది. ఈ అవసరాలను తీర్చడంలో స్వచ్ఛంద రక్తదాతల పాత్ర అత్యంత కీలకంగా మారింది. సాధారణంగా జిల్లా ప్రభుత్వాస్పత్రి బ్లడ్బ్యాంకులో 50 నుంచి 200 యూనిట్ల వరకు రక్త నిల్వలు ఉంటాయి. ప్రస్తుతం సుమారు 100 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంది. అవసరాలకు అనుగుణంగా నిల్వల ను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా రక్త సేకరణ చేపడుతున్నారు. 2025లో జిల్లా ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకు ద్వారా 3,648 యూనిట్ల రక్తం సేకరించారు. అదే సమయంలో 3,198 యూనిట్లను అవసరమైన రోగులకు అందజేశారు. ఈ గణాంకాలే జిల్లాలో రక్తదాతల సేవా స్పూర్తిని తేటతెల్లం చేస్తున్నాయి. యువతలో పెరిగిన సేవాభావం కొన్నేళ్లుగా జిల్లాలో యువత రక్తదాన శిబిరాల్లో చురుగ్గా పాల్గొంటోంది. సుమారు 15 నుంచి 20 మంది యువకులు వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాల ఆధ్వర్యంలో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పుట్టినరోజులు, జయంతు లు, వర్ధంతులు వంటి సందర్భాల్లో క్యాంపులను ఏర్పాటు చేసి మరింత మందిని దాతలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో రక్త కొరత సమస్య గణనీయంగా తగ్గిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్న్ కాల్ చేస్తే రక్తదానానికి ముందుకొచ్చే దాతల సంఖ్య కూడా పెరుగుతుండడం విశేషం. ఈ గ్రూపులకు డిమాండ్ జిల్లాలో అత్యధికంగా బీ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏ పాజిటివ్ రక్త గ్రూపులకు డిమాండ్ ఉంటోంది. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవలకు ఈ గ్రూపుల రక్తం తరచూ అవసరమవుతోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏబీ పాజిటివ్ రక్తానికి సైతం డిమాండ్ పెరుగుతోంది. ఓ పాజిటివ్, బీ పాజిటివ్ గ్రూపులకు చెందిన దాతలు ఎక్కువగా ఉండడంతో వీటి నిల్వలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అయితే అవసరాలు పెరిగినప్పుడు కొత్త దాతల నుంచి సేకరణ చేపడుతున్నారు. రక్తదానం చేసిన వెంటనే దాన్ని రోగులకు ఇవ్వరు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, వైరల్ ఇన్ఫెక్షన్లు లేవని ముందుగా నిర్ధారిస్తారు. అనంతరం ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లలో నిర్దిష్ట ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు. ఇక తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలకు తరచూ రక్త మార్పిడి అవసరమవుతుంది. రక్తం అందకపోతే ప్రమాదం. ఈ నేపథ్యంలో జిల్లా రక్తనిధి కేంద్రం వారు తలసేమియా బాధితులకు సుమారు 10 శాతం వరకు ఉచితంగానే బ్లడ్ అందిస్తున్నారు.జిల్లా ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు రక్త సేకరణ వివరాలు సంవత్సరం సేకరించిన యూనిట్లు 2021 1,5622022 3,1272023 2,5482024 2,5092025 3,468 -
గిట్టుబాటు ధర కల్పించాలి
గత ఏడాది మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బపడింది. మళ్లీ ఈసారి అదే దెబ్బ. ప్రస్తుతం మామిడి పంట సర్వనాశనమవుతోంది. కేజీ రూ.5, రూ.6 అని బోర్డు పెట్టారు. కేజీ కాయ అమ్మితే టీ, కాఫీ ఖర్చులకు కూడా రావడంలేదు. ఓ వైపు తోటలోని కాయ లు రాలిపోతున్నాయి. దీంతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. వెంటనే సర్కారు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. లేకుంటే రైతుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటానికి దిగుతుంది. – ఎంసీ విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త -
బిడ్డల భవితను మోస్తూ.. ఆర్థిక భారం భరిస్తూ..!
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు చదవడం లేదు. నిరంతరం స్మార్ట్ఫోన్లతోనే బతికేస్తున్నారు. మా మాట వినడం లేదు. ఇవి సగటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రుల ఆవేదన. పిల్లలపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గుండెను రాయి చేసుకుని మరీ దూర ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజుల్లోనే జిల్లాలోని ప్రైవేట్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. కంటికి దూరమైనా.. ప్రస్తుత సామాజిక పరిస్థితులు, సాంకేతికత తెచ్చిన పెట్టిన అనర్థాలు తల్లిదండ్రులను కఠిన నిర్ణయాల వైపు నెడుతున్నాయి. బిడ్డలు కళ్లెదుటే ఉంటే ఎంతో సంతోషం...కానీ వారి భవిష్యత్ నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోలేం కదా అంటూ ప్రైవేట్, కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చేస్తున్నారు. మొబైల్ మాయ ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్మార్ట్ఫోన్ వ్యసనం. ప్రస్తుతం దాదాపు 70 శాతం మంది విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు పక్కన పడేసి నిరంతరం ఫోన్లతోనే గడుపుతున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తగ్గడమే కాకుండా, తల్లిదండ్రుల మాటలను సైతం ఖాతరు చేయని మొండితనం వస్తోంది. హాస్టళ్లల్లో ఉంచితే క్రమశిక్షణ అలవడుతుందని తల్లిదండ్రులు నమ్ముతున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ సర్వస్వం వెచ్చించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ప్రధానంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. అక్కడ ర్యాంకులు.. మార్కులు వస్తున్నప్పటికీ అనుబంధం..ఆప్యాయతకు దూరమవుతున్నారు. అయినప్పటికీ మొబైల్ వ్యసనం నుంచి బిడ్డలను రక్షించుకునేందుకు హాస్టళ్లే శరణ్యమని మధ్యతరగతివారు భావిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు ఫీజుల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే పేరెంట్స్ సైతం అప్పులకు వెరవకుండా పిల్లల భవిత కోసం ఆర్థిక భారం మోస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. పిల్లల చదువుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఎంత ఖర్చు పెట్టేందుకై నా ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక సాధారణ స్థాయి ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో సైతం 6 నుంచి 10 వ తరగతి విద్యార్థికి ఏడాదికి కనీసం రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షల ఖర్చవుతోంది. డే స్కాల ర్ స్కూళ్లలోనే పుస్తకాలతో కలిపి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. పేరున్న కార్పొరేట్ పాఠశాలలైతే ఇతర ప్రాంతాల్లో రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. తమ ఆదాయానికి మించిన ఫీజులు ఉన్నప్పటికీ అప్పు చేసైనా పిల్లల బాగు కోసమే ఈ భారాన్ని తల్లిదండ్రులు మోస్తున్నారు. స్మార్ట్ఫోన్ల నుంచి కాపాడుకునేందుకే.. స్మార్ట్ఫోన్ల వాడకం ముదిరిపోయి, పిల్లలు తల్లిదండ్రుల మాట కూడా వినని పరిస్థితి రావడం నిజంగా ఆందోళనకరం. ఈ మొబైల్ వ్యసనం నుంచి తమ పిల్లలను రక్షించుకోవడానికే తల్లిదండ్రులు ఎంతటి ఆర్థిక భారమైనా భరించడానికి సిద్ధపడుతున్నారు. అప్పు చేసైనా ప్రైవేట్ స్కూళ్లు, వసతి గృహాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ హాస్టళ్ల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రధానంవగా గురుకులాలు, హాస్టళ్లలో కార్పొరేట్ స్థాయి వసతులు తీసుకురావాలి.పిల్లలు కూడా మొబైల్స్పై కాకుండా చదువుపై దృష్టిపెట్టాలి. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. -
ఆరుగాల కష్టం.. కళ్లెదుటే నష్టం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సుమారు 59 వేల హెక్టార్లలో మామిడి సాగు చేపట్టారు., అందులో 41 వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగు చేశారు. ఈ సీజన్న్లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలకు తరలించినట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇంకా ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కాయలు తోటల్లోనే ఉండడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. కుళ్లిపోతున్న కాయలు వాతావరణ మార్పులు, తేమ అధికంగా ఉండడంతో పండు ఈగ దాడి తీవ్రంగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయల్లో పురుగులు చేరడంతో కుళ్లిపోతున్నాయని వాపోతున్నారు. దీంతో కాయలు భారీగా రాలిపోతున్నాయి. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ఈ నష్టం రైతులను మరింత కుంగదీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు తోటలలో పాడైపోయిన కాయలను సేకరించి తొలగించుకుంటున్నారు. నిలిచిన కోతలు పంట సిద్ధంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీలు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు కోతలు నిలిపివేస్తున్నారు. ఎక్కడ విక్రయించాలో తెలియక తోటల్లోనే కాయలను ఉంచుతున్నారు. దీంతో పంట నాణ్యత దెబ్బతింటోందని, కాయలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ర్యాంపులకు తోలితే వారంలో డబ్బులు చేతిలో పెడతారని...చాలా మంది రైతులు కేజీ రూ.4లకే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలి జిల్లాలో లక్షలాది టన్నుల తోతాపురి పంట ఇంకా తోటల్లోనే ఉండడంతో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని రైతులు స్పష్టం చేస్తున్నారు. అన్ని ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో పనిచేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా పండు ఈగ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే మార్కెట్ అనిశ్చితి కారణంగా దిక్కుతోచని దుస్థితి దాపురించింది. సిండికేట్గా మారిన గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో వేగలేక తలబొప్పి కడుతోంది. కొనుగోళ్లు లేక లక్షల టన్నుల తోతాపురి తోటల్లోనే నిలిచిపోయింది. ఇదే అదునుగా పండు ఈగ రూపంలో పెనుముప్పు ఎదురవుతోంది. కాయ నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది. అలాగే వేలాది టన్నుల మామిడి నేలరాలిపోతోంది. ఇటు కొనేవాళ్లు రాక.. అటు కాయలను కాపాడుకోలేక రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఫ్యాక్టరీల వద్ద అవస్థలు అరకొరగా తెరుచుకున్న ఫ్యాక్టరీల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మూడు రోజులకోసారి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్న్ వచ్చిన తర్వాత కూడా అన్న్లోడింగ్కు రెండు నుంచి మూడు రోజులు పడుతోంది. గంగాధరనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద మామిడి కాయలతో వచ్చిన ట్రాక్టర్లు సుమారు రెండు కిలో మీటర్ల మేర బారులుతీరాయి. గుడిపాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద లారీలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. అవి కూడా తమిళనాడుకు చెందిన బండ్లు కావడం గమనార్హం. సరిహద్దులోని మరో ఫ్యాక్టరీ సిఫార్సుల కాయలను మాత్రమే తీసుకుంటోంది. సామాన్య రైతులకు అరకొరగా టోకెన్లు పంచిపెడుతోంది. దీంతో రవాణా ఖర్చులు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. ఫ్యాక్టరీలు, మధ్యవర్తుల సిండికేట్ కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. -
టమాట ధరలకు రెక్కలు!
– బాక్సు రూ.400 పలమనేరు : టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం పలమనేరు మార్కెట్లో బాక్సు (14 కిలోలు) టమాట రూ.400 పలికింది. సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కోలారులో బాక్సు రూ.505 చేరింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్లో డిమాండ్ కారణంగా ఇక్కడి మార్కెట్లలో టమాట ధర పెరిగినట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నా రు. పలమనేరు మార్కెట్కు వస్తున్న టమాటా రవాణాకు అనుకూలంగా లేకపోవడంతో రేటు కాస్త తగ్గిందని, కోలారుకు వెళ్లే సరుకు మరింత నాణ్యంగా ఉండడంతో అక్కడ పెరిగిందని వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సైతం ధర ఆశాజనకంగానే ఉంటుందని తెలియజేస్తున్నారు. దీంతో టమాట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
19 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి చర్యలు చేపట్టినట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.పద్మాంజలిదేవి తెలిపారు. ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పోస్టుల భర్తీ కోసం జూన్ 18వ తేదీ ఉదయం 10 మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిత్తూరులోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామ ని తెలిపారు. గైనకాలజీ, రేడియాలజీ, ఈఎన్ టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అన స్థీషి యా విభాగాలు, క్యాజువాలిటీ జనరల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అర్హత కల అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరా క్స్ ప్రతులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారిక వెబ్సైట్లలో ఉన్నాయని పేర్కొన్నా రు. అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలని వెల్లడించారు. ఒకే యాప్లోకి ఆరు ఆరోగ్య కార్యక్రమాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజారోగ్య సేవలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి శుక్రవారం చిత్తూరు నగరంలోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర డిజిటల్ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. డీఎంఅండ్హెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డి మాట్లాడుతూ ఎన్సీడీ (గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి అసంక్రమణ వ్యాధులు), జనని (మాతా–శిశు ఆరోగ్యం), నిక్షయ్ (క్షయవ్యాధి నియంత్రణ), పీఎంఎన్డీపీ (డయాలసిస్ రోగులకు సేవలు), యువిన్ (వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం), ఎస్సీడీ (సికిల్సెల్ వ్యాధి) వంటి ఆరు కీలక ఆరోగ్య కార్యక్రమాలను ఒకే యాప్లో సమీకరించే విధానాన్ని వివరించారు. శిక్షణ పొందిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. బెల్టు షాపులపై టీడీపీ మహిళానేత ఫిర్యాదు ? శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో విచ్ఛలవిడిగా సాగుతున్న బెల్టుషాపుల బాగోతంపై అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నేత పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారనే వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలపై విపక్షాలు విమర్శించినా, మీడియా వెలుగులోకి తెచ్చినా పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి ఇది చెంప పెట్టని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గ్రామాల్లో అడ్డగోలుగా వెలసిన బెల్టు షాపులు మందుబాబుల ఆరోగ్యాన్ని, వారి కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. బెల్టు షాపుల్లో అమ్మకాల జోరును గమనించిన అధికారిక షాపుల నిర్వాహకులు పొరుగున ఉన్న కర్ణాటక నుంచి మద్యం తెచ్చుకోకుండా నేరుగా చిల్లర దుకాణాలకు డోర్ డెలివరీ ద్వారా స్టాకును చేరవేస్తున్నారు. బెల్టు షాపులను నిర్మూలిస్తామని సీఎం చంద్రబాబు పదేపదే చెప్పినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే మద్యం విక్రయా లు జోరుగా సాగడం గమనార్హం. ఈ తతంగంపై స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారు లు ప్రతి పక్షాల విమర్శలను, సీఎం ఆదేశాలను పట్టించుకోవడం లేదని స్థానికులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒక మహిళా నాయకురాలు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్స ల్ సిస్టం (పిజీఆర్ఎస్) ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. ఇప్ప టికై నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మహిళా వైద్యకళాశాలలో రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలు తిరుపతి తుడా: స్విమ్స్ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో 7వ రాష్ట్రస్థాయి హయగ్రీవ–2026 క్విజ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. గురువారం పద్మావతి వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు వైద్యకళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించామన్నారు. వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఫిజియాలజీ విభాగం ఏడేళ్లుగా హయగ్రీవ క్విజ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృత్తి పరమైన మెలకువలు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ అలోక్ సచన్, విభాగాధిపతి డాక్టర్ శరణ్ బి సింగ్, పార్మాకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ముసుగు దొంగల హల్చల్!
● తాళాలు వేసిన పలు ఇళ్లలో చోరీలు ● సీసీటీవీ పుటేజీలో దొంగల సంచరిస్తున్న దృశ్యాలు పలమనేరు: పట్టణంలో ముసుగుదొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి రాత్రుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీ వల సాయినగర్లో భారీ చోరీకి పాల్పడ్డారు. తాజాగా గంటావూరులో విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ చేశారు. పలు ఇళ్ల వద్ద ఏర్పా టు చేసిస సీసీ టీవీ పుటేజీల్లో రాత్రిళ్లు ముసుగు దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు జనాన్ని మరింత కలవర పెడుతున్నాయి. పగటిపూట రెక్కీ బయటి ప్రాంతాలకు చెందిన ఈ దొంగల కుటుంబ సభ్యులు, మహిళలు పగలు పట్టణంలో యాచిస్తూ ఏ వీధిలో ఏ ఇంటికి తాళం వేసి ఉందో పక్కాగా నిర్ధారించుకుంటారు. వారు ఇచ్చే సమాచారంతో రాత్రుల్లో ముసుగులు ధరించిన దొంగలు ఆ ఇంటిలోకి చొరబదుతున్నారు. ఆ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలున్నా ఏమాత్రం భయపడకుండా తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దుండగులు జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు తప్పనిసరిగా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, ఎస్వీఎన్పీ చామల రేంజ్, కేఎంఎం కళాశాల సమీపంలోని అడవిలో తనిఖీలు చేశారు. తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, పడిమలై గ్రామానికి చెందిన అప్పస్వామి, కాశి అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత
చిత్తూరు అర్బన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం అందరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయసేవా సదన్ భవనంలో శుక్రవారం బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపడం తగదన్నారు. దీనివల్ల వారి భవిష్యత్తుకు సమాధి కడుతున్నామన్నారు. చదువుకునే వయస్సులో పిల్లలను పనులకు పంపడంతో ఒక తరం అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతోందన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. పోక్సో చట్టం, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను కృషి చేద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జువైనల్ డీపీవో లక్ష్మీపతి, ఎకై ్సజ్ ఏఈఎస్ కృష్ణకిషోర్రెడ్డి, డీఆర్డీఏ డీపీఎం మంజుల, సహాయ కార్మిక శాఖ అధికారి రోశయ్య పాల్గొన్నారు. -
ప్రసవమా.. ఆపరేషనా..?
మహిళ జీవితంలో అమ్మగా మార డం అత్యంత ఆనందకరమైన ఘట్టం. ప్రస్తుతం ఆ ఆనందం కంటే భయం ఎక్కువగా వెంటాడుతోంది. ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేసే సిజేరియన్లు ఇప్పుడు సాధారణ ప్రక్రియగా మారిపోయాయి. గర్భిణి ఆస్పత్రి గడప తొక్కితే చాలు కోతలకు సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయడం పరిపాటిగా మారినా, ప్రభుత్వ వైద్యశాలల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరగడం ప్రజారోగ్య నిపుణులను కలవరపెడుతోంది. కాణిపాకం : చిత్తూరు జిల్లాలో నాలుగు నెలల కాలంలో నమోదైన ప్రసవాల గణాంకాలను పరిశీలిస్తే సిజేరియన్ల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు 1,626, సిజేరియన్లు 2,572 వరకు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు 754, సిజేరియన్లు 2,182 వరకు జరిగాయి. మొత్తం సాధారణ ప్రసవాలు 2,380, సిజేరియన్లు 4,754 వరకు తేలాయి. అంటే జిల్లాలో నమోదైన మొత్తం ప్రసవాల్లో దాదాపు రెండింట మూడొంతులకు పైగా సిజేరియన్లు కావడం గమనార్హం. ప్రతి సహజ ప్రసవానికి దాదాపు రెండు సిజేరియన్లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల మోత ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలంటే చాలా కుటుంబాలు భయపడుతున్నాయి. ఇందుకు అక్కడికి వెళితే సిజేరియన్ తప్పదనే భావన సర్వత్రా నెలకొనడమే. ప్రసవానికి వచ్చిన గర్భిణులకు ‘‘బిడ్డ మెడకు తాడు చుట్టుకుంది. బిడ్డ కదలికలు తగ్గాయి. ఉమ్ము నీరు తగ్గిపోయింది. బిడ్డ ఉమ్మునీరు తాగింది. ఆలస్యం చేస్తే ప్రమాదం’’ వంటి కారణాలు చెబుతూ ఆపరేషన్లకు ఒప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సహజ ప్రసవం జరిగితే కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. సిజేరియన్ అయితే మందులు, గది ఛార్జీలు, పరీక్షలు, వైద్యుల ఫీజులు అంటూ బిల్లులు భారీగా పెరుగుతాయి. దీంతో కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు సిజేరియన్లు చేయడానికే మొగ్గు చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముహూర్తాల మోజు జిల్లాలో ముహూర్తాల పేరుతో సిజేరియన్లు, శుభ సమయాల్లో పిల్లలు పుట్టాలని కోరుకునే కుటుంబాలు పెరుగుతున్నాయి. ముందుగానే తేదీలు, గంటలు నిర్ణయించి ప్రసవాలు చేస్తున్నారు. ప్రకృతి నిర్ణయించే ప్రసవ సమయాన్ని పక్కనబెట్టి మనుషులు నిర్ణయించిన సమయాల్లో పిల్లలను బయటకు తీసుకురావడం వైద్యపరంగా సరైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నేటి తరంలో చాలా మంది మహిళల్లో సహజ ప్రసవంపై భయం పెరిగింది. పురిటి నొప్పులు తట్టుకోలేమనే భావనతో ముందుగానే సిజేరియన్కు అంగీకరిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవ వివరాలు... ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ వివరాలు నెల సిజేరియన్లు సాధారణ ప్రసవాలు జనవరి 489 154 ఫిబ్రవరి 596 185 మార్చి 590 210 ఏరిపిల్ 507 205 మొత్తం 2182 754 నెల సిజేరియన్లు సాధారణ ప్రసవాలు జనవరి 627 329 ఫిబ్రవరి 599 402 మార్చి 760 495 ఏరిపిల్ 586 400 మొత్తం 2572 1626 ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు 1000 వరకు ఉన్నాయి. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్యశాలల్లోనూ సిజేరియన్ల సంఖ్య అధికంగా ఉండడం ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ పీహెచ్సీల్లోనే ఎక్కువ ప్రసవాలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా సిజేరియన్లను తగ్గించాలని పీహెచ్సీలు 24 గంటలు పనిచేసేలా చేశారు. దీనిపై గర్భిణులకు ముందస్తు అవగాహన కల్పించి సహజ ప్రసవాల వైపు మళ్లించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ దిశగా పర్యవేక్షణ తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిజేరియన్లను తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రగ్రహణం
బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబా బు వాటిని అమలు చేయకుండా ప్రజలకు వంచిస్తూ చంద్ర గ్రహణంలా పీడిస్తున్నారు. కూటమి నాయకులు ప్రజలకు చేసిన మోసాన్ని వివరించేందుకే ఈ నిరసన చేపట్టాం. విద్య, వైద్యం ప్రజలకు అందడం లేదు. రైతులకు తీరని మోసం చేశారు. అధికా రం కోసం అలవికాని హామీలిచ్చారు. లక్షల కోట్లు అప్పులు తీసుకువస్తున్నారు. హామీలు అమలు చేశారా అంటే అదీ లేదు. ప్రతిపక్షంపై విమర్శలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు 420 మ్యానిఫెస్టో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో కూ డిన మ్యానిఫెస్టో 420 మ్యానిఫెస్టోగా మారింది. వాటి ప్రచారానికి రూ.కోట్లను దారపోశా రు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పేరిట పంగనామా లు పెట్టారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి న పవన్ కల్యాణ్ అధికారంలో వచ్చాక ఏమీ చేయలేదు. తమిళనాడు సీఎం విజయ్ పొత్తు లేకుండా గెలిచి ప్రజలు మెచ్చేలా పాలన చేస్తున్నారు. ఆయన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. – ఆర్కే రోజా, మాజీ మంత్రి, -
సమస్యల స్వాగతం
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం బడిగంట మోగింది. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు సమస్యలతోనే ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా మారింది. పిల్లలకు పూర్తిస్థాయిలో విద్యార్థి మిత్ర కిట్ల అందలేదు. టీచర్లు పూర్థి స్థాయిలో కనిపించలేదు. అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల్లోనే పిల్లలు కూర్చోవాల్సి వచ్చింది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదు. పిల్లలు తాగునీటి కోసం మొదటి రోజే తిప్పలు పడాల్సి వచ్చింది. జిల్లాలో తరగతులు ప్రారంభమైన మొదటి రోజు పాఠశాలల నిర్వహణ దుస్థితిపై సాక్షి కథనం. చిత్తూరు కలెక్టరేట్ : వేసవి సెలవులు పూర్తి కావడంతో శుక్రవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో పాఠశాలల్లో విద్యార్థులకు అసౌకర్యాలు స్వాగతం పలికాయి. పాఠశాలలను పునః ప్రారంభం రోజుకు ముందే శుభ్రం చేయాల్సి ఉండగా, జిల్లాలోని అత్యధిక శాతం పాఠశాలలను హడావుడిగా తెరిచారు. మొదటి రోజునే పిల్లల చేతిలో పాఠ్యపుస్తకాలు పెడతామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు సైతం పూర్తి స్థాయిలో అందించలేని దుస్థితి ఏర్పడింది. మరుగుదొడ్ల నిర్వహణ గాలికి జిల్లాలోని 2,067 పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం 11,435 మరుగుదొడ్లు అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించింది. వాటి శుభ్రతకు 2,458 మంది ఆయాలను నియమించింది. స్కూల్ పునఃప్రారంభానికి ముందు రోజే మరుగుదొడ్లను శుభ్రం చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పనిచేయని ఆర్వో ప్లాంట్లు విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించేందుకు గత సర్కారు రూ.లక్షలతో ఆర్వో ప్లాంట్లను ఏర్పా టు చేసింది. వాటిని ప్రస్తుత చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో మూలనపడ్డాయి. అనేక పాఠశాలల్లో విద్యార్థులు మొదటి రోజే తాగునీటికి అవస్థలు పడ్డారు. ఇళ్ల నుంచి బాటిళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. కనిపించని మెనూ జిల్లా వ్యాప్తంగా 2,067 పాఠశాలల్లో 1,10,547 మంది విద్యార్థులు ఉన్నారు. తొలిరోజు 54,490 మంది హాజరయ్యారు. వారిలో 54,256 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అనేక పాఠశాలల్లో మెనూ కనిపించలేదు. పాఠశాలల్లో పాతబడిన బియ్యంతోనే అన్నం చేసి పెట్టారు. నీళ్ల సాంబారు వడ్డించారు. కోడిగుడ్లు సరఫరా చేయక పోవడంతో వడ్డించలేని దుస్థితి. అరకొరగా విద్యార్థి మిత్త కిట్ల పంపిణీ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతు న్న విద్యార్థుల్లో 1,10 లక్షల మందికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయా ల్సి ఉంది. విద్యాశాఖ గణాంకాల ప్రకారం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మాత్రమే అందజేశారు. అవి కూడా అరకొరగానే ఇచ్చారు. జిల్లాలో ఒక్క మండలానికి కూడా బ్యాగులు, షూలు, సాక్స్లు రాలేదు. బూట్లు ఇవ్వకపోవడంతో పాదరక్షలతో పాఠశాలకు వచ్చిన పీసీఆర్ పాఠశాల విద్యార్థులు, పీసీఆర్ పాఠశాలలో పనిచేయని ఆర్వో ప్లాంట్మోగిన బడిగంట కొత్త బ్యాగుల జాడేలేదు జిల్లా వ్యాప్తంగా 2,067 ప్రభుత్వ పాఠశాలలున్నా యి. వీటిలో 1,10,547 మంది పిల్లలు చదువుతుండగా మొదటి రోజు 54,490 మంది హాజరయ్యా రు. విద్యార్థి మిత్ర కిట్లు ఇవ్వలేదు. కొత్త బ్యాగులు ఇవ్వకపోవడంతో పాతవి, చినిగిన బ్యాగులతోనే పిల్లలు హాజరయ్యారు. చాలా పాఠశాలల్లో టీచర్లు పూర్తి స్థాయిలో కనిపించలేదు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కోసం చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో అసంపూర్తి గదుల్లోనే పిల్లలు అవస్థలు పడ్డారు. -
హాకీ సీనియర్ పురుషుల జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపికను గురువారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకాలకు పోటీలు నిర్వహించి, జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహిస్తున్న 16వ ఏపీ హాకీ సీనియర్ పురుషుల రాష్ట్ర స్థాయి పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు పాల్గొననుంది. జిల్లా జట్టుకు ఎంపికై న హాకీ క్రీడాకారులను హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంజన్రాజ్, ఆదిత్య, కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్కృష్ణ అభినందించారు. మామిడి కాయల కొనుగోలుకు బ్రేక్? చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలు ఫ్యాక్టరీలు మామిడి కాయల కొనుగోలు బ్రేకులు వేశాయి. టోకెన్ల పంపిణీని ఆపేశాయి. వచ్చేవారం నుంచి కొనుగోలు చేస్తామని పేర్కొన్నాయి. దీంతో మామిడి రైతులు కాయ లు కోయకుండా వదిలేశారు. వర్షాలు కురిస్తే కాయలు రాలిపోవడంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి పూర్తి స్థాయిలో కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నిరసనల హోరు
చిత్తూరులో నిరసన ర్యాలీ చేస్తున్న విజయానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలుపలమనేరులో ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు‘‘సూపర్ సిక్స్ పథకాలన్నారు.. పేదలకు సంక్షేమమే ధ్యేయమన్నారు.. సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు.. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగులకు భృతి కింద రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు పూర్తయినా ఏ ఒక్కటీ చేయలేదు. అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇదేనా బాబూ నీ చిత్తశుద్ధి’’ అని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ర్యాలీలతో హోరెత్తించారు. టీడీపీ మ్యానిఫెస్టోను తగలబెడుతున్న భూమన, ఆర్కే రోజాకుప్పంలో నిరసన ర్యాలీలో ఎమ్మెల్సీ భరత్, వైఎస్సార్ సీపీ నేతలు పూతలపట్టులో ర్యాలీ చేస్తున్న సునీల్కుమార్, నాయకులు‘కూటమి’ మోసాలపై కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు చిత్తూరు కార్పొరేషన్/చిత్తూరు అర్బన్ : అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు వాటిని నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ నాయ కులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఏటా ఆడబిడ్డ నిధి అన్నారని, ఇప్పటి వరకు ఆ పథకం ఊసేలేదని మండిపడ్డారు. ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదని, డీఎస్సీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. రెండేళ్లుగా మామిడికి కనీస గిట్టుబాటు ధర కల్పించలేదని, రైతులు అప్పుల్లో కూరుకుపోయారని దుయ్యబట్టారు. రెండేళ్లుగా వంచన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మండిపడ్డారు. కూటమి నేతలు ఇచ్చిన తప్పు డు హామీల మానిఫెస్టో ప్రతులకు నిప్పు పెట్టారు. పూతలపట్టులో టీడీపీ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉందని చెబు తూ పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న ర్యాలీని కొంతసేపు ఆపేశారు. అలాగే పలమనేరులో డీఎస్సీ భూతం దిష్టిబొమ్మను దహనం చేయడానికి నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
తోడ్పాటు అందిస్తే ఉన్నత శిఖరాలకు..
చిత్తూరు కలెక్టరేట్ : విభిన్న ప్రతిభావంతులకు తోడ్పాటు అందిస్తే ఉన్నత శిఖరాలు చేరుకుంటారని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు, జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. స్థానిక జ్యోతిరావుపూలే బీసీ భవనంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ ఆధ్వర్యంలో అలింకో సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశా రు. వారు మాట్లాడుతూ అలింకో సంస్థ సామాజిక బాధ్యతతో దాదాపు రూ.40 లక్షల విలువైన ఉపకరణాలు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. జిల్లాలోని 31 భవిత కేంద్రాల నుంచి విచ్చేసిన 463 మంది పిల్లలకు 564 సహాయక ఉపకరణాలను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. వాటిలో వీల్చైర్స్, ట్రై సైకిళ్లు, చెవుటి మిషన్లు, క్రచెస్ ఎల్బో, సీపీ వీల్చైర్స్, బ్రెయిలీ కిట్లు ఉన్నాయని తెలిపారు. జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ తేజోమూర్తి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేయడం అందరి బాధ్యత అని అన్నారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఐఈ కో ఆర్డినేటర్ మధు మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కుమార్, సెక్టోరల్ అధికారులు మధు, సుభాషిణి, సిబ్బంది గుణ, అలింకో సంస్థ ప్రతినిధులు సూర్యకుమారి, అమర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కాణిపాకం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం సాధ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. రానున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆవరణలో జిల్లా టూరిజం శాఖ ఆధ్వ ర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో మానసిక ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. అనంతరం యోగా శిక్షకులు జి.శ్రీనివాసులు నాయు డు యోగాసనాలు వేయించారు. కార్య క్రమంలో డీఆర్ఓ కె.మోహన్ కుమార్, కాణిపాకం ఆలయ ఈఓ పెంచల కిశోర్, ఆర్డీఓ శ్రీనివాసులు, చైర్మన్ మణి నాయుడు, ఎస్ఐ నరసింహులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మెనూ అమలు తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : మధ్యాహ్నభోజన పథకం మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఆదేశించా రు. ఆయన శుక్రవారం డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశా రు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు పాఠశాలలకు అందిన విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. గుడిపాల ఎంఈవో హసన్బాషా, టీచర్లు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ గోగర్భం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామిని దర్శించుకున్నారు. 42,566 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. -
గాడితప్పిన ముందస్తు చికిత్సలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిన్నారులకు ముందస్తు వైద్య పరీక్షలు, చికిత్సలు అందించాల్సిన జిల్లా బాలల ముందస్తు చికిత్సా కేంద్రం (డీఈఐసీ)లో పరిస్థితులు గాడితప్పాయి. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఈ కేంద్రంలో కొందరు ఉద్యోగులు, సిబ్బంది టీ, కాఫీల పేరుతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు విధులకు డుమ్మా కొడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు అందడం లేదు. కొన్ని విభాగాలకు పనివేళల్లోనే తాళాలు వేసి ఉండడం, సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, బాధ్యతాయుతంగా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ లోపమే కారణమా? అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే సిబ్బంది ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలు చేసి హాజరు, సేవల తీరును పరిశీలిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డిని వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బందిని పిలిచి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని పేర్కొన్నారు. బాలల ముందస్తు చికిత్సా కేంద్రం, పలు విభాగాలు తలుపులు వేసి ఉన్న దృశ్యం సక్రమంగా పనిచేయని ముందస్తు చికిత్సా కేంద్రం గంటల తరబడి నిరీక్షణ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ అనేక మంది చిన్నారులు ముంద స్తు చికిత్సల కోసం ఈ కేంద్రానికి వస్తుంటారు. పలువురు ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, కొన్ని విభాగాలు మూసివేయడంతో తల్లిదండ్రులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సిబ్బంది ఎంతసేపటికీ రాకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే పిల్లలకు సరైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. -
తొలిరోజే తడబడి
సీఎం సొంత జిల్లాలో విద్యావవస్థ పరిస్థితి రోజు రోజుకూ దిగజారు తోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై, పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజే జిల్లా విద్యాశాఖకు పూర్తి స్థాయి డీఈవో లేకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. పాఠశాలలు తెరి చే అత్యంత కీలకమైన రోజున, జిల్లాలో స్కూళ్లు, విద్యార్థుల సమస్యలను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారే లేకపోవడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు పెద వి విరుస్తున్నాయి. మే ఆఖరికి గత డీఈవో రాజేంద్ర ప్రసాద్ ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పటికి 11 రోజులు అవుతున్నా జిల్లాకు రెగ్యులర్ డీఈవోను నియమించ లేని దుస్థితికి కూటమి సర్కారు చేరింది.చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2047 పాఠశాలల్లో 1,40,666 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థుల శ్రేయస్సుకు జగనన్న విద్యాకానుక పథకం అమ లు చేశారు. ఈ పథకం పేరును మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్రగా పథకం పేరు మార్చింది. అయితే పేరు మార్చడంలో చూపించిన శ్రద్ధ ..కిట్ల ను పాఠశాలలకు చేరవేయడంలో ప్రదర్శించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నా రు. మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టి మొదటి రోజునే విద్యార్థులను ఖాళీ చేతులతో కూ ర్చోబెట్టడం ఆ మహానుభావుడి పేరుకు మచ్చ తెచ్చేలా ఉందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఏ ఒక్క పాఠశాలకు పూర్తి స్థాయిలో చేరని కిట్లు జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంతో పాటు మిగిలిన ఏ నియోజకవర్గంలోని ఏ ఒక్క పాఠశాలకూ పూర్తి స్థాయిలో కిట్లు చేరని దుస్థితి. జిల్లాలో పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఏ ఒక్క పాఠశాలకూ పూర్తి స్థాయిలో విద్యార్థి మిత్ర కిట్లు అందలేదు. కొన్ని చోట్ల కేవలం పాఠ్యపుస్తకా లు వస్తే, యూనిఫాం రాలేదు...మరికొన్ని చోట్ల బ్యాగులు ఉంటే, షూస్ లేవు. అసలు మెజారిటీ పాఠశాలల్లో కిట్ల ఊసే లేకుండా పోయింది. సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆందోళనలో తల్లిదండ్రులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాల తెరిచిన తొలిరోజే విద్యార్థులు సరికొత్త యూనిఫామ్లు, సరికొత్త బ్యాగులతో ఎంతో ఉత్సాహంగా బడికి వెళ్లేవారు. కానీ నేడు పాత దుస్తులతో చిరిగిన బ్యాగులతో తొలిరోజు పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును మార్చేలా సకాలంలో విద్యాసామగ్రిని అందించాలి. మొదటి రోజే కిట్లు ఇవ్వకపోతే పేద పిల్లలు చదువుపై ఎలా శ్రద్ధ పెడతారు? అని ఓ విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు పక్కనబెట్టి, యుద్ధప్రాతిపదికన విద్యార్థులందరికీ కిట్లు అందేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. పర్యవేక్షించే జిల్లా విద్యాధికారి లేకపోవడం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల వివరాలు విద్యాసామగ్రి అందాల్సిన చేరినవి పేరు సంఖ్య యూనిఫాం 1,40,012 20,618 షూలు 1,40,012 ఒక్కటీ రాలేదు బ్యాగ్లు 14,001 ఒక్కటీ రాలేదు నోట్బుక్స్ 7,90,187 7,03,329 వర్క్బుక్స్ 7,90,187 ఒక్కటీ రాలేదు -
నిరుద్యోగ భృతి భ్రాంతి!
ఒక్కరికే తల్లికి వందనం ఈమె పేరు వెంకటమ్మ. వత్తలూరు గ్రామం, పుల్లంపేట మండలం. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి లో ఒకరికి మాత్రమే తల్లికి వందనం వచ్చింది. ఇంకొకరికి రావడం లేదు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇద్దరికీ ఇవ్వాలి కదా..!. వచ్చే ఒక దానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఫింగర్ వేయాలంటే తీసుకోవడం లేదు. తల్లికి వందనం రాదంటున్నారు. ప్రతి ఏడాదీ నేరుగా అకౌంట్లో వేయాలి కానీ ఇలాంటి తరకాసులు పెట్టకూడదు. ఉత్త గ్యాస్ మాటలే! ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సాలమ్మ. రామంద్రాపురం మండలం, రేఖలచేను గ్రామం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సూపర్సిక్స్ హామీల్లో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పారు. దీంతో ఈమె గ్యాస్ కనెక్షన్ నంబరు: 7055675602తో దరఖాస్తు చేసుకుంది. రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఇప్పటి వరకు సాలమ్మకు ఎలాంటి గ్యాస్ సబ్సిడీ లభించలేదు. తనను అర్హురాలిగా గుర్తించాలంటూ పలుమార్లు గ్యాస్ ఏజెన్సీలు, రెవెన్యూ అధికారులకు అర్జీలిచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లలిత్. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాడు. బెంగళూరులో కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రతి నెలా హాస్టల్ ఫీజు, మెస్ చార్జీలు, స్టడీ మెటీరియల్స్ కోసం దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుపెడుతున్నాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తారని ఆశ పడ్డాడు. భృతి రూ.3 వేలు వస్తే కాస్త సహాయం కలిగేదని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కదా అమలు చేస్తే పుస్తకాలకై నా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అయితే రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితం చేసి, మోసం చేశారని విమర్శలు గుప్పిస్తున్నాడు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగంలో ఇద్దరికి చోటు
చిత్తూరు అర్బన్: వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో స్థానం కల్పించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. చిత్తూరుకు చెందిన వి.రెడ్డిశేఖర్ రెడ్డిను వైఎస్సార్టీఎఫ్ జోన్–4 వర్కింగ్ ప్రెసిడెంట్గా, పలమనేరుకు చెందిన ఎం.నాగేంద్రరెడ్డిను రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నేడు ఉపకరణాల పంపిణీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం విభిన్నప్రతిభావంతులకు ఉపకరణాలు పీవీకేఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న మహా త్మా జ్యోతిరావుపూలే భవనంలో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. 463 మంది విభిన్నప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేయనున్నట్లు ఏపీసీ వెల్లడించారు. లింగ నిర్ధారణపై సమాచారం ఇవ్వండి చిత్తూరు రూరల్ (కాణిపాకం): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1800 233 2447 టోల్ఫ్రీ హెల్ప్లైను అందుబాటులో ఉంచిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి తెలిపారు. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ, లింగ నిర్ధారణ సేవల ప్రకటనలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాల నిర్వహణ వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. సర్ను పకడ్బందీగా చేపట్టాలి గంగవరం: ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని కలె క్టర్ సుమిత్కుమార్ ఆదే శించారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో పలమనేరు నియోజకవర్గంలోని బూత్ లెవల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే జూలై నెల 15వ తేదీ వరకు జరిగే డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఇందులో ముఖ్యంగా ఓటర్ల వివరాలను ధ్రువీకరించి సంతకాలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఆర్ ఓ మోహన్కుమార్, ఆర్డీవో భవాని, అన్ని మండలాల అధికారులు, పాల్గొన్నారు. ప్రవేశాలు పెరగాల్సిందే చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో గతం కంటే 10 శాతం ప్రవేశాలు పెరగాల్సిందేనని డీఐఈవో రఘుపతి వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేలా ప్రిన్సిపల్స్ పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.ఈనెల 12వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు పూర్తి రోజు పనిచేస్తాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1826 మొదటి సంవత్సరం అడ్మిషన్లు అయినట్లు తెలిపారు. జూలై 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అయిదు సర్కిళ్లకు ఒక్కరే సీఐ చిత్తూరు అర్బన్: పోలీసు ఉద్యోగం నిత్యం పని ఒత్తిళ్ల మధ్య ఉంటుందని చెబుతూనే ఉంటారు. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం చిత్తూరులోని తూర్పు (తాలూక) సీఐ రామచంద్ర పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన చిత్తూరు పోలీసు సబ్–డివిజన్లోని అయిదు సర్కిళ్లకు ఇన్చార్జిగా ఉన్నారు. చిత్తూరు వన్టౌన్ స్టేషన్, చిత్తూరు టూటౌన్ స్టేషన్ సీఐగా ఉన్న నెట్టికంటయ్య సెలవుపై ఉండటంతో ఈ రెండు సర్కిళ్లు, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, పశ్చిమ (వెస్ట్) సీఐ శ్రీధర్ నాయుడు సీఎం బందోబస్తు వెళ్లడంతో ఈ రెండు స్టేషన్లు, పూతలపట్టు సర్కిల్లో పనిచేసిన గోపి సస్పెన్షన్లో ఉండటంతో ఈ స్టేషన్కు కలిపి.. మొత్తంగా అయిదు సర్కిళ్లకు రామచంద్ర ఇన్చార్జ్గా ఉన్నారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ శ్రీరంగరాజపురం : తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఒక వ్యక్తికి చెందిన ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన మండలంలో శ్రీరంగరాజపురంలో చోటుచేసుకుంది. బాధితుడు మహేష్ కథనం మేరకు శ్రీరంగరాజపురం గ్రామం కంఠంలో సర్వే నంబర్ 102లో 2 సెంట్ల స్థలంలో రేకుల ఇల్లుంది. దానిని తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు కు చెందిన త్యాగరాజ్, తులసిరామ్, మునిరత్నం, రాజమ్మ కలిసి శ్రీరంగరాజపురం తహసీల్దార్ సంతకం, కార్యాలయం రాజముద్రను ఫోర్జరీ చేసి కార్వేటినగరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2 సెంట్ల స్థలాన్ని పి.త్యాగరాజు పేరుపై రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.ఈ విషయంపై బాధితుడు మహేష్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన తహసీల్దార్ లోకనాథపిళ్లై ఫోర్జరీ చేసినట్లు గుర్తించి, పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. -
అప్పు చేసి ఫీజు చెల్లించా
ఇతని పేరు తిలక్. సత్యవేడు నియోజకవర్గం, నాగలాపురం టౌన్కు చెందిన వ్యక్తి. పుత్తూరులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ ఈసీఈ చదివాడు. గత ఏడాది బి.టెక్ పూర్తయింది. ప్రభుత్వం చెల్లిస్తామన్న ఫీజు రియింబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం అందించలేదు. 2022–23 సంవత్సరానికి గత ప్రభుత్వంలో ఓ విడత రియింబర్స్మెంట్ నగదు అందుకున్నాడు. తదుపరి ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఆ రియంబర్స్మెంట్ నగదు కూడా ప్రస్తుత సీఎం చెల్లిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా జమ కాలేదు. అతడి తల్లిదండ్రులు అప్పు చేసి కళాశాలకు ఫీజులు చెల్లించారు. -
మామిడి అల్లకల్లోలం
కాణిపాకం: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మామిడి అల్లకల్లోలమవుతోంది. పంట చేతికొచ్చిన వేళ గిట్టుబాటు ధర లేకుండాపోతోంది. శుక్రవారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు మామిడిగోడును పట్టించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 90వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. టేబుల్ రకాలు 20వేల హెక్టార్లల్లో ఉండగా.. వీటిలోని పలు రకాలను కొనుగోలు చేసేవారు లేరని పాకాల, బంగారుపాళ్యం, చిత్తూరు మార్కెట్ లో తిరస్కరిస్తున్నారు. ఇక తోతాపురి రకం 70 వేల హెక్టార్లల్లో వ్యాపించి ఉంది. తద్వారా సు మారు 8 లక్షల నుంచి 10 లక్షల టన్నుల కా యల దిగుబడి రానున్నట్టు అధికారుల అంచనా. వీటిని గుజ్జు చేసే ఫ్యాక్టరీలు 44 వరకు ఉన్నాయి. సీజన్ సమయానికి 10 ఫ్యాక్టరీల వరకు గుజ్జు తయారీని ప్రారంభించాయి. మిగిలిన ఫ్యాక్టరీలు పేరుకు తెరుచుకున్నాయి. దీని కారణంగా తోతాపురి కోతలు మందగించాయి. టోకన్ ఆపేశారు కొన్ని ఫ్యాక్టరీలు గత వారం రోజులకుపైగా తోతాపురిని కొనుగోలు చేసి ప్రస్తుతానికి చెక్ పెట్టాయి. టోకన్లు ఇవ్వడం పూర్తిగా నిలుపుదల చేశాయి. తాజాగా వచ్చే వారం నుంచే కాయలు కొనుగోలు అంటూ ఫ్యాక్టరీలు గేట్లు వేసేశాయి. ఈ దెబ్బతో రైతులు షాక్లో పడ్డా రు.చెట్లల్లోనే కాయలు కుళ్లి..రాలిపోతున్నాయి. ఫ్యాక్టరీలు సిండికేట్తోనే ఫ్యాక్టరీల్లో గతేడాది గుజ్జు నిల్వలు 90శాతం వరకు ఖాళీ అయ్యాయి. కొన్ని ఫ్యాక్టరీలు దీన్ని సాకుగా చూపించి.. ఈ ఏడాది ఫ్యాక్టరులు తెరవడానికి కష్టపడ్డాయి. ఆ తర్వాత తోతా పురి కేజీ రూ.6 అని బోర్డు పెట్టాయి. కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం కేజీ రూ.5 ప్రచారం చేస్తున్నాయి. ఫ్యాక్టరీలన్నీ సిండికేట్ అయ్యి తోతా పురి ధరను దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నాయి. ర్యాంపుల్లో తోతాపురి ధర కేజీ రూ.4కే కొంటున్నారు. వారి గేట్లు తెరుస్తున్నారు మామిడి విషయంలో కూడా కూటమి నేత లు అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. తమ కాయలనే కొనాలని ఫ్యాక్టరీలను బెదిరిస్తున్నారు. టోకన్లు, క్యూ లేకుండా..కాయలు నేరుగా దింపుకోమని హుక్కుం జారీ చేస్తున్నారు. దీంతో సామాన్య రైతుల కాయలు ట్రాక్టర్లల్లోనే కుళ్లిపోతున్నాయి. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గుడిపాల: సిఫార్సు ట్రాక్టర్లు ఓ వైపు...మరోవైపు సామాన్యుల ట్రాక్టర్లు , క్యూకట్టిన ట్రాక్టర్లు ఈ పర్యటన లోనైనా..! గత నెల యాదమరి మండలం, కండిగ గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు మామిడి రైతులను కలిసేందుకు అవ కాశం ఇవ్వలేకపోయారు. అలాగే కుప్పంకు వచ్చిన సమయంలో కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. శుక్రవారం తిరుపతి సభకు వస్తున్న సీఎం..మామిడి గోడు పట్టించుకుని.. వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆడ బిడ్డ నిధి ఇక రానట్టేనా?
ఈ ఫొటోలోని మహిళ పేరు సీ.రాణి. ఈమెది ముత్తువారిపల్లె. గత ప్ర భుత్వంలో ఆమె ఉన్న గ్రూపులో అప్పు తీసు కుని, కట్టిన వడ్డీని మూ డు విడతలుగా ఆమె ఖతాల్లోకి వేశారు. అప్పట్లో జగనన్న చెప్పినట్టు 2014 నుంచి 2019 ఏప్రిల్ వరకు అప్పు తీసుకున్న గ్రూపులో ఆమె ఉండేది. ఆ గ్రూపునకు వడ్డీ వెనక్కి వచ్చింది. అదనంగా ఆమెకు లభించిన డబ్బు ఎంతో ఉపయోగపడింది. కానీ ఈ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఇ స్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా దాని ఊసేలేదు. అసలు ఇస్తా రో లేదో కూడా తెలియడం లేదు. కూటమి రెండేళ్ల పాలనపై జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కినాక చుక్కలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు దూరం చేసి.. తీవ్ర అగచాట్లు మిగిల్చారని నిప్పులు చెరుగుతున్నారు. కార్మికుల నుంచి కర్షకుల వరకు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తూ కడుపు కొడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారని అన్నదాతలు శాపనార్థాలు పెడుతున్నారు. ఇంటి గడపకొచ్చే సేవల్ని దూరం చేశారని కన్నెర్రజేస్తున్నారు. ప్రజల నోటికాడ ముద్ద తీసేసి సంబరాల పేరుతో సభలు పెట్టేందుకు సిద్ధపడ్డారని విరుచుకుపడుతున్నారు. ‘ఏం చేశావని సంబరాలు బాబూ’ అంటూ నిలదీసేందుకు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనప్పటికీ ప్రధాన హామీలు నెరవేర్చలేకపోయింది. ఉద్యోగాల సృష్టి.. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి జాడ కరువైంది. సూపర్ సిక్స్ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. రెండేళ్ల లో అన్ని హామీలు అమలు చేసేశామని.. రాష్ట్రం బ్ర హ్మాండంగా ముందుకు వెళుతోందని చెప్పుకుంటూ.. నేడు విజయోత్సవం జరుపుకోవడాన్ని జనం తప్పుపడుతున్నారు. ‘ఏం చేశారని.. విజయోత్సవాలు’ అ ని ప్రశ్నిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరు చెప్పి ఓట్లు వే యించుకుని మోసం చేశారని శాపనార్థాలు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే వచ్చే వని గుర్తుచేసుకుంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రజల కష్ట నష్టాల ను తెలుసుకుని పరిష్కరించేవారని మాట్లాడుకుంటున్నారు. వలంటీర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంటింటికీ వెళ్లి సేవలందించేవారని చెప్పు కుంటున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సీన్ రివర్స్ అయ్యిందని విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలు దూరం చేశారని మండిపడుతున్నారు. హామీలు డాబు..అమలేది బాబు? కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సవాలక్ష హామీలు గుప్పించింది. అందులో కొన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. సూపర్ సిక్స్ అంటూ సూపర్గా మోసం చేసింది. ఇందులో ముఖ్యంగా ఏం చేశారని విజయోత్సవం? రెండేళ్లుగా సంక్షేమం ఊసే లేదు -
సాయం కోసం ఎదురుచూపులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిపేరు రాము అనే రామ్మూర్తి. వయసు 54 ఏళ్లు. శాంతిపురం మండలంలోని తుమ్మిశి పంచాయతీకి గతంలో సర్పంచ్గా చేశారు. బీసీ గాండ్ల కులానికి చెందిన వాడు. వివాహితుడైన కొడుకు బెంగళూరులో ఉంటే తల్లి లక్ష్మీదేవమ్మ, భార్య జయమ్మతో రాము స్వగ్రామంలో జీవిస్తున్నాడు. సర్పంచ్ కాకమునుపు, సర్పంచ్గా ఉండగా కూడా నిత్యం ఆటో నడుపుతూ, చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న 0.46 సెంట్ల మెట్టభూమి వివాదంలో ఉండడంతో సాగు చేయలేని పరిస్థితి. ఏడాదిన్నర క్రితం రాముకు లివర్ సంబంధిత సమస్య రావడంతో వైద్యం చేయించుకుంటున్నాడు. ఏ పనీ చేయలేక మంచానికే పరిమితమయ్యాడు. గోరుచుట్టపై రోకలి పోటులా భార్య జయమ్మ క్యాన్సర్ భారిన పడడంతో ప్రతి నెలా కీమో థెరపీ చేయించాల్సి వస్తోంది. కొంతవరకు ఆరోగ్యశ్రీ ఆదుకుంటున్నా ఇతర పరీక్షలకు ఖర్చు చేయక తప్పడం లేదు. తల్లి లక్ష్మీదేవమ్మకు నెలనెలా వస్తున్న వితంతు పింఛన్, మోదుగ ఆకులు దొరికే కాలంలో వాటిని పోగేసుకుని తల్లి, భార్య కుట్టే విస్తరాకులతో వచ్చే ఆదాయమే ఈ కుటుంబానికి దిక్కు. సీఎం చంద్రబాబు కరుణించి బీసీ అయిన తనకు 50 ఏళ్ల పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని రాము కోరుతున్నాడు. -
పారిశ్రామికవేత్తలకు సహకరించండి
వి.కోట: పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ కోరారు. ఆయన బుధవారం ఆర్డీవో భవానితో కలిసి వి.కోట మండలం ముసరందొడ్డి పంచాయతీలో పరిశ్రమల కోసం గుర్తించిన భూములను పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలు, పారిశ్రామికవేత్తలు, రైతులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ముసరందొడ్డి రెవెన్యూలో 29 ఎకరాల భూమి సేకరించి రైతులకు నష్టపరిహారం చెల్లించామన్నారు. ఇంకా 47 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ఆయా భూముల రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, ఆర్ఐ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
గంగవరం: మండలంలోని బాలేపల్లి గ్రామ సమీపంలోని ఉన్న కోళ్లఫారం షెడ్లో మంగళవారం ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు.. ఛత్తీస్గడ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లా బాస్నా గ్రామానికి చెందిన మన్బోధ్ బరిహా(32) మండలంలోని బాలేపల్లి గ్రామ సమీపంలోని ఆదినారాయణరెడ్డి కోళ్లఫారంలో కూలి పనులు చేసుకుంటున్నాడు. స్వగ్రామంలో అప్పులు ఉన్నట్టు అప్పుడప్పుడూ బంధువులతో చెప్పుకునేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి కోళ్లఫారం షెడ్లో తాడుతో ఉరి వేసుకున్నాడు. గమనించిన బంధువు ఛబీలాల్ చౌహాన్ కోళ్లఫారం యజమానికి సమాచారం అందించాడు. వారు అక్కడికి వచ్చి పరిశీలించగా అతను మృతిచెంది ఉన్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీఆర్లో పదోన్నతులు చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పంచాయతీరాజ్ (పీఆర్) డీఈఈలుగా ఉన్న పలువురికి ఈఈలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో చిత్తూరు పీఆర్ఐ ఇన్చార్జి ఈఈగా ఉన్న నవీన్ కుమార్ను పదోన్నతి కల్పించి అక్కడే కొనసాగించారు. అలాగే అనితను గుడూరుకు, భాస్కర్ను అనంతపురానికి, చైతన్యకుమార్ను వైఎస్సార్ కడపకు, రాజశేఖర్ను కావలికి పదోన్నతిపై బదిలీ చేశారు. ట్రాక్టర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని గంగసాగరం సమీపంలో బుధవారం మామిడి కాయలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. తుమ్మింద నుంచి చిత్తూరు మామిడి మార్కెట్కు కాయలను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ వెనుక భాగంలోని చక్రం విరిగిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు బోల్తా పూతలపట్టు(యాదమరి): మండలంలోని పి.కొత్తకోట సమీపంలో బుధవారం కారు బోల్తాపడి ఆరుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం హొసూరుకు చెందిన ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు మంగళవారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం తిరుపతి జిల్లాలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బుధవారం మధ్యాహ్నం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. పి.కొత్తకోట సమీపంలో కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో నలుగురు మహిళలు సహా ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానికులు 108లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
2.6 కిలోల గంజాయి స్వాధీనం
పలమనేరు: గంజాయి స్మగర్ల ఆటకట్టించడానికి జిల్లా ఎస్పీ తుషార్ దూడీ వారం క్రితం వినూత్న ప్రయోగం చేపట్టారు. అనుమానం ఉన్న వారిని కిట్ ద్వారా టెస్ట్ చేస్తే అతను మూడు రోజుల్లో గంజాయి పీల్చినా అది ఇట్టే పసిగట్టేస్తుంది. దీనిపై పలమనేరులో అవగాహన కార్యక్రమం నిర్వహించి డివిజన్లోని పోలీసులకు సమగ్రంగా వివరించారు. ఈ నేపథ్యంలో బైరెడ్డిపల్లి ప్రొహిబిషన్ ఎస్ఐ చందన ప్రియ ఈ కిట్స్తో అనుమానం ఉన్న వ్యక్తులను చెక్ చేశారు. రెండు రోజుల క్రితం ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతన్ని విచారించగా గంజాయి గట్టు రట్టు అయింది. బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి పంచాయతీ, కూటాలవంక గ్రామానికి చెందిన నరేష్(39) కొన్నాళ్లుగా లారీ క్లీనర్గా ఇచ్చాపురం వైపు వెళుతున్నాడు. అక్కడ తక్కువ ధరకే గంజాయి దొరుకుతుండడంతో కొనుగోలు చేశాడు. తాను వాడుకుంటూనే స్థానికంగా కొందరికి విక్రయించేవాడు. ఇలా 2.6 కిలోలు తెచ్చుకున్నాడు. ఎట్టకేలకు కిట్ ద్వారా అతని విషయం బయటకు రావడంతో ఎస్ఐ చందనప్రియ కూపిలాగారు. కిట్ ద్వారా జిల్లాలోనే తొలి కేసు నమోదు చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ బుధవారం స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఐని అభినందించారు. జిల్లా ఎస్పీ లక్ష్యం ముందుగా ఇక్కడే సత్పలితాన్నిచ్చిందన్నారు. నిందితుడు నరేష్పై కేసు నమోదు చేసి రూ.50 వేల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇకపై పలమనేరు పోలీస్ సబ్ డివిజన్లో గంజాయి సేవించేవారు, విక్రయించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
డబ్బులిస్తేనే బిల్లులు
పాలసముద్రం : ఉపాధి పనులు చేసిన తర్వాత బిల్లులు పెట్టడానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ డబ్బు డిమాండ్ చేస్తున్నాడని మండలంలోని క్రిష్ణజమ్మాపురం పంచాయతీ కొల్లిరెడ్డికండ్రిగ దళితవాడకు చెందిన కూలీలు ఆరోపించారు. వారు సోమవారం తమ గోడును వెల్లబోసుకున్నారు. మండుతున్న ఎండలో కష్టపడి పనులు చేసినా బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటి వరకు ఐదు వారాల బిల్లులు రాలేదని వాపోయారు. ఒక్కో కూలీ రూ.100 ఇస్తేనే బిల్లులు పెడతామని ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపించారు. అలా డబ్బులు ఇవ్వని కూలీలకు పనులు చూపడం లేదని తెలిపారు. కూలి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుందామనుని ఉపాధి పనులకు వస్తే బిల్లులు సక్రమంగా రాకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. కృష్ణజమ్మాపురం పంచాయతీలో సుమారు 200 మందికి పైగా ఉపాధి కూలీలు పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఉపాధిహామీ పథకంలో ఎన్నడూ లేని విధంగా అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని, ఈ విషయం తెలిసినా ఏపీడీ, ఏపీవో కన్నెత్తికూడా చూడడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మేమో ఉపాధిహామీ పథకంలో పని దినాలు, వేతనాలు పెంచామని చెబుతోందని, ఇక్కడ మాత్రం అలా జరగడం లేదని వాపోయారు. ఉపాధి సిబ్బందికి టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే చేశారని, అధికారులు విచారణకు వచ్చిన సమయంలో మీడియాపై నాయకులు దురుసుగా ప్రవర్తించారని చెబుతున్నారు. ఉపాధి ఫీల్డ్అసిస్టెంట్ అవినీతిపై ఏపీవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పనులు తక్కువగానే చూపిస్తున్నారు. అరకొరగానే వేతనాలు వస్తున్నాయి. దీనికితోడు మస్టర్ను అప్లోడ్ చేసి బిల్లులు పెట్టేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. ఇలా అయితే ఎలా బతకాలి అని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. -
ప్రభుత్వ కార్యాలయంలో టీడీపీ కార్యక్రమం
సాక్షి, టాస్క్ఫోర్స్: మండల ప్రజాపరిషత్ కార్యాలయం టీడీపీ కార్యాలయంలా మారింది. బుధవారం ఇక్కడ టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్లతో సర్పై జీడీ నెల్లూరు ఆ పార్టీ ఎమ్మెల్యే థామస్ సమావేశం ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా టీడీపీ కార్యక్రమం నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే థామస్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏక వచనంతో పలుమార్లు సంబోధించారు. దీనిపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటివి అనవసర వ్యాఖ్యలని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి, క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 83,812 మంది స్వామిని దర్శించుకున్నారు. 38,345 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. -
కొంపముంచిన మద్యం మత్తు!
పలమనేరు: మండలంలోని లెప్రసీ ఆస్పత్రి వద్ద బుధవారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు ఢీకొని బస్సు కిందకు దూసుకెళ్లింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం హొసూరుకు చెందిన ముంజునాథ, శరత్, ఆనంద్రాజ్, మంజు మెడికేరకు చెందిన కారును అద్దెకు తీసుకుని ఎక్స్ప్రైస్ హైవే మీదుగా తిరుమల బయలుదేరారు. ఎమ్మాస్విస్ ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక వైపు ఢీకొన్నారు. కారు బస్సు కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులోని నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వారు పూటుగా మద్యం సేవించినట్టు తెలిసింది. వారు మద్యం మత్తులో వీకోట వద్ద మరో బస్సును ఢీకొనేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసింది. బస్సు డ్రైవర్ కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మోహన్రెడ్డి అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆంబులెన్స్ ద్వారా పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని వైద్యులు పెద్దాసుపత్రికి రెఫర్చేశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
ఇక సమరమే!
●చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, తక్షణమే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. హామీలను అమలుచేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాయి. భవిష్యత్ పోరాలకు సిద్ధమవుతామని నాయకులు తెలిపారు. పెరుగుతున్న ధరల వల్ల ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, ప్రభుత్వం ప్రధాన ఆర్థిక అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై దారుణమని పేర్కొన్నారు. నాయకులు బుధవారం చిత్తూరులోని రెవెన్యూ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిరసన స్వరం వినిపించారు. ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని నిలదీశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఊసే ఎత్తకపోవడంపై జేఏసీ నేతలు మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ హామీలను నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తప్పవని ఏపీ జేఏసీ అమరావతి నేతలు సైతం హెచ్చరించారు. ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాలు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్ వేయకపోవడం దారుణం. కనీసం ఐఆర్ కూడా ఇవ్వకపోవడం ఎంత వరకు న్యాయం? బకాయిల కోసం కూడా మీ చుట్టూ తిరగాలా? మా హక్కుల కోసం రోడ్లెక్కి పోరాటాలు చేస్తే తప్ప ప్రభుత్వం కదలదా? – గోపి, ఏపీ జేఏసీ అమరావతి సంఘ సభ్యులు రెండేళ్లు పూర్తయినా చలనం లేదు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా హామీల అమలుపై ఎలాంటి చలనం లేదు. ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నాం. అవి కూడా చేయకపోతే ఎలా? ఉద్యోగుల పట్ల అలసత్వం వహించడం బాధాకరం. పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్ర కమిటీ కార్యాచరణ మేరకు పోరాటాలు చేస్తాం. – సుబ్రహ్మణ్యం, ఏపీ జేఏసీ అమరావతి సంఘం సభ్యులు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలి మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణం గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలోనూ మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్ కేర్ సెలవులు ప్రకటించాలి. పెండింగ్ బకాయిల వివరాలను ప్రతినెలా వచ్చే పే–స్లిప్లో స్పష్టంగా చూపించాలి. ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. – జయంతి, చైర్పర్సన్, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం -
మామిడికి రెడ్ సిగ్నల్
మామిడి రైతులకు ప్రతి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఫ్యాక్టరీల వద్ద కాయల కొనుగోలుకు, తర్వాత బిల్లుల కోసం పడిగాపులు తప్పడం లేదు. తాజాగా ఫ్యాక్టరీలు తమిళనాడు మామిడి కాయలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక రైతులకు నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నాయి. దీనికితోడు కూటమి నేతల సిఫార్సులు ఉన్న వారి ట్రాక్టర్లు, లారీలు లోపలికి రయ్మని దూసుకెళుతుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. కాణిపాకం/గుడిపాల: గుడిపాల మండలంలోని పల్ప్ ఫ్యాక్టరీల వద్ద ప్రస్తుతం జిల్లాకు చెందిన ట్రాక్టర్ల కంటే తమిళనాడు నుంచి వచ్చిన లారీలు, ట్రాక్టర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు కిలోకు రూ.3 చొప్పున కాయలను కొనుగోలు చేసి నేరుగా ఫ్యాక్టరీలకు తరలిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికంగా పండిన కాయలకు కొనుగోలు అవకాశాలు తగ్గిపోతున్నాయని వాపోతున్నారు. టోకెన్లపై రాజకీయ ముద్ర కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణ రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిల్చున్నా టోకెన్లు దొరకడంలేదు. కొందరు రాజకీయ నాయకుల సిఫార్సులు ఉంటే టోకెన్లు సులభంగా లభిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కష్టపడి టోకెన్లు సంపాదించినా రైతులకు ఇబ్బందులు తీరడం లేదు. కాయలు అన్లోడింగ్ కావాలంటే రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పడుతోంది. దీంతో ఫ్యాక్టరీల వద్ద వందలాది ట్రాక్టర్లు క్యూల్లో నిలుస్తున్నాయి. సిఫార్సులతో వచ్చే వాహనాలకు గంటల వ్యవధిలోనే అన్లోడింగ్కు గేట్లు తెరుస్తున్నారు. వాయిదా పడుతున్న టోకెన్ల పంపిణీ ఇప్పటికే భారీగా కాయలు వస్తుండడంతో అనేక ఫ్యాక్టరీలు టోకెన్ల జారీని నిలిపేశాయి. ఈ నెల 16 తర్వాతే టోకెన్లు ఇస్తామని ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన కాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే నాణ్యత తగ్గిపోతుందని, చివరకు నష్టాలు తప్పవని చెబుతున్నారు. జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా రైతులకు సవాలక్ష నిబంధనలు జిల్లాకు చెందిన రైతులు కాయలు విక్రయించాలంటే ముందుగా శ్యాంపిల్స్ తీసుకురావాలి. వాటిని పరిశీలించి ఆమోదిస్తేనే టోకెన్ ఇస్తారు. వెంటనే కొనుగోలు చేస్తారా అంటే అదీ లేదు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. కాయలు కోసి ట్రాక్టర్లలో ఉంచుకుని రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. బయటి రాష్ట్రాల నుంచి కాయలను తీసుకువస్తున్న రైతులకు ఎలాంటి నిబంధనలు లేకుండా నేరుగా కొనుగోలు చేస్తున్నారు. -
కూటమి విజయోత్సవ సభకు పెరిగిన ఖర్చు
● సభాస్థలి కోసం రోజుకి రూ.1.2 కోట్లు ఖర్చు ● సభ 12కి వాయిదా వేయడంతో మరింత భారం ● మూడు రోజుల అద్దె కోసం మరో రూ.1.80 కోట్లు ● సభ కోసం జనం తరలింపునకు వాహనాల ఖర్చు అదనం ● ప్రజాధనాన్ని ఇలా దుబారా చేయడంపై విమర్శలు అలవికాని హామీలు.. అందలమెక్కిన తర్వాత వెన్నుపోటు రాజకీయం.. రెండేళ్లు పాలన పూర్తి.. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విజయోత్సవ సభ నిర్వహణకు రంగం సిద్ధం.. అందుకు రూ.కోట్ల ఖర్చు.. ఆ సభ వాయిదాతో మరింత పెరిగిన వ్యయం.. ఎవరిని మభ్యపెట్టాలన్న ఆలోచన.. ఎందుకీ ప్రజాధనం దుబారా? అని ఆర్థిక వేత్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలి.. రూ.వేల కోట్లు అప్పులు చేస్తూ ఆ నిధులను దుబారా చేయడం ఏమిటని తప్పుపడుతున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: సీఎం చంద్రబాబు పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ పేరుతో ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుబారా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ఈనెల 9న జరగాల్సిన విజయోత్సవ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తోపాటు రాష్ట్రంలోని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనలో హామీలు అమలు చేయలేకపోయినా.. అభివృద్ధి గురించి పట్టించుకోకపోయినా రూ.వేల కోట్లు అప్పులు చేస్తూ ఆ నిధులను దుబారా చేస్తుండడంపై ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్టు.. శుక్రవారం నిర్వహించనున్న విజయో త్సవ సభకు భారీ ఎత్తున ఖర్చు చేస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలానికి 2 వేల మంది జనం కూటమి విజయోత్సవ సభకు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజక వర్గాల పరిధిలోని ప్రతి మండలం నుంచి 2 వేల మంది జనాన్ని తీసుకురావాలని నాయకులు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ 2 వేల మందిని తీసుకొచ్చి, తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలు, తాగునీరు, మజ్జిగ, భోజనం వంటి ఏర్పాట్ల బాధ్యత కూడా స్థానిక నాయకులకు అప్పగించినట్లు తెలిసింది. అలాగే డ్వాక్రా మహిళలను తీసుకొచ్చేందుకు ఏపీఓ, సంఘమిత్రలు, డ్వాక్రా లీటర్లకు బాధ్యతలు అప్పగించారు. సభకు రాకపోతే.. బ్యాంకు రుణాలు ఇచ్చేది లేదని అప్పుడే హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విజయోత్సవ సభ ద్వారా రెండేళ్ల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమి నేతలు, ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్భాటం కోసం రూ.కోట్లు ఖర్చా? సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలన సందర్భంగా విజయోత్సవ సభను దామినేడు వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట జూన్ 9వ తేదీన జరపాలని నిర్ణయించినా ఆ కార్యక్రమం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం కారణంగా శుక్రవారానికి వాయిదా వేశారు. చేసిన ఏర్పాట్లకు రోజుకు రూ.1.20 కోట్లు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సభ శుక్రవారానికి వాయిదా పడడంతో చేసిన ఏర్పాట్లన్నీ అలానే కొనసాగించేందుకు మరో మూడు రోజులు అద్దె చెల్లించేలా మాట్లాడుకున్నారు. రోజుకు మరో రూ.60 లక్షల చొప్పున రూ.1.80 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదు ర్చుకున్నారు. దీనికి తోడు ప్రజలను తరలించేందుకు బస్సులు, ప్రైవేట్ వాహనాల అద్దె, కేటరింగ్, సెక్యూరిటీ, లైటింగ్ వంటి సేవలకు పెట్టాల్సిన అదనపు ఖర్చులు బడ్జెట్ను మరింత పెంచుతున్నాయి. విజయోత్స సభ కోసం మొత్తంగా సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దుబారా ఖర్చులపై ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒప్పందాలు, ఖర్చుల పారదర్శకతపై ప్రశ్నిస్తున్నారు. అప్పు లు చేస్తూ.. అవసరమైన అభివృద్ధి పనులను వాయిదా వేసి, భారీ రాజకీయ సమారోహాల కోసం ప్రజాధనం వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు కొన్ని అద్దెలను తగ్గించడంతోపాటు ఖర్చులను నియంత్రించామని చెబుతున్నారు. -
అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ :జిల్లాలో అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎకై ్సజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవా రం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో క్వారీల్లో నెలకొన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామన్నారు. అక్రమంగా సాగిస్తున్న మైనింగ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మైనింగ్ ఆదాయం సుమారు రూ.3 వేల కోట్లకు చేరి, 40 శాతం వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్, లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, బీచ్ శాండ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 12 బ్లాక్లను గుర్తించి దశలవారీగా వేలం వేశామన్నారు. జిల్లాలో 682 మైనింగ్ లీజులు ఉండగా, ప్రస్తుతం 50 శాతం మాత్రమే నడుస్తున్నాయన్నారు. 500 నుంచి 600 వరకు ఉన్న ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో అనేకం మూతపడ్డాయన్నారు. వీటి సమస్యల అధ్యయనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలర్ గ్రానైట్ రంగంలో రాయల్టీ సమస్యలతో నష్టపోతున్న పరిశ్రమలను ఆదుకుంటామ ని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విధానాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని హామీ ఇచ్చా రు. వడ్డెర సహకార సంఘాలకు 50 శాతం రాయితీతో క్వారీ లీజులు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అటవీ అనుమతు లు, రెవెన్యూ ఎన్వోసీల మంజూరులో అడ్డంకులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కఠారి హేమలత పాల్గొన్నారు. గ్రానైట్ క్వారీని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర గుడిపాల: మండలంలోని కుప్పిగానిపల్లె, పశుమంద గ్రామ పరిధిలోని బ్లాక్ గ్రానైట్ క్వారీని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. 12 గ్రానైట్ క్వారీల హద్దులు, గ్రానైట్ బ్లాక్ విలువ, క్వారీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, ఎమ్మెల్యే జగన్మోహన్, మైన్స్ డీడీ సత్యనారాయణ, పలమనేరు ఏడీ ఆనంద్ పాల్గొన్నారు.


