breaking news
Chittoor
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– ముగ్గురికి తీవ్ర గాయాలు శ్రీరంగరాజపురం : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెంది, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారి సంగం పాల డెయిరీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు పెనుమూరు మండలం ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన హేమాద్రి(36), ప్రసాద్(54), రమేష్(47) తన స్నేహితులతో కలిసి పళ్లిపట్టుకు ఆటోలో వెళ్తుండగా గంగాధర నెల్లూరు మండలం వేటుకురుపల్లి గ్రామానికి చెందిన ఏ.సుబ్రమణ్యం (60) కార్వేటినగరం పాదిరికుప్పంలో తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో సంగం పాలడెయిరీ వద్ద ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు 108 వాహనం ద్వారా గాయపడిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సీఎంసీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అక్రమార్కుల్లో దడ
అక్రమాలు బయటపడేనా ! కరువు ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించి వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తుంటే..రాష్ట్రంలో అధికారం మాదే..అడిగేదెవరు , అడ్డొచ్చేదెవరు..అంటూ పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధి పనుల్లో తమ్ముళ్లు నిధులను అడ్డంగా దోచేశారు. దీనిపై విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగుతుండడంతో అక్రమార్కుల్లో దడ మొదలైంది. సాక్షి టాస్క్ఫోర్స్ : పుంగనూరు నియోజకవర్గంలో 2024–25లో రూ.65 కోట్లు ఉపాధి కోసం ఖర్చు చేసినట్టు లెక్కలు చూపి నిధులు బొక్కెశారు. దీనిపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్రెడ్డి ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టి, నివేదికలు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీభవాని హర్ష ఈనెల 15న చిత్తూరు జిల్లా పీడీ డ్వామాకు ఆదేశాలు జారీ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 28 మంది సభ్యులతో ఈనెల 21 నుంచి 23 వరకు పనుల అక్రమాలపై విచారణ చేపట్టి, నివేదికలు పంపాలని ఆదేశించారు. విజిలెన్స్ బృందానికి సంబంధిత రికార్డులను అందించాలని పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణకు రానుండడంతో ఉపాధి హామీ అధికారుల గుండెల్లో వణుకు పుడుతోంది. అధికార పార్టీకి తలొగ్గి , నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేపట్టారు. ప్రస్తుతం విజిలెన్స్ విచారణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని హడలి పోతున్నారు. పాత పనులకు కొత్త మెరుగులు ఉపాధి పథకంలో నియోజకవర్గంలోని ఓ ప్రధాన నాయకుడికి చెందిన రెండు మండలాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏ పంచాయతీలోనూ ఎన్నడూ ఖర్చు చేయని విధంగా ఒక్కో పంచాయతీలో ఖర్చు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. పాత పనులను కూటమి నాయకులు యంత్రాలతో కొత్త మెరుగులు దిద్ది, ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వస్తున్నాయి. రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగళ్లు పంచాయతీలో గతంలో వాటర్షెడ్ పథకం కింద చేసిన పనులకు ప్రస్తుతం ఉపాధిలో పెట్టి బిల్లులు చేసుకున్నారని విమర్శిస్తున్నారు. రొంపిచెర్ల మండలంలో 12 పంచాయతీలు ఉండగా అందులో 8 పంచాయతీల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అక్రమాలలో అందనంత ఎత్తుకు వెళ్లినట్లు సమాచారం. మండలంలోని గానుగచింతలో రూ.2.10 కోట్లు, రొంపిచెర్లలో రూ.1.62 కోట్లు, పెద్దగొట్టిగళ్లులో రూ.1.50 కోట్లు, సీహెచ్ రెడ్డిగారిపల్లిలో రూ.1.42 కోట్లు, మోటుమల్లెలో రూ.1.43 కోట్లు, చిచ్చిలివారిపల్లిలో రూ.1.29 కోట్లు, బోడిపాటివారిపల్లిలో రూ.1.20 కోట్లు , అలాగే పులిచెర్ల మండలం కావేటిగారిపల్లెలో రూ.1.54 కోట్లు, కల్లూరులో రూ.1.20 కోట్లు, సోమల మండలం నంజంపేటలో రూ.1.30 కోట్లు, కందూరులో కోటి రూపా యలు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు. యంత్రాలతో పనులు ఉపాధిహామీ పథకంలో పనులు చేపట్టాలంటే ముందుగా గ్రామీణ స్థాయిలో ప్రజలు కలసి పనిని ఎంపిక చేయాలి. లేబర్ బడ్జెట్ తయారు చేసి అందుకు అనుగుణంగా రైతులు, ప్రజలకు అనుగుణంగా అర్హతను బట్టి పనులను ఎంపిక చేయాలి. ఆ పనులను సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ తీర్మానం ఆమోదించాలి. ఆ పనులను మండల పరిషత్లో ఆమోదించాలి. ఈ పనులకు ఎస్టిమేట్లు వేసి పరిపాలన అనుమతులు కలెక్టర్ ద్వారా పొందాలి. తరువాత పనులను ప్రారంభించాల్సి ఉంది. కానీ కూటమి నాయకులు వీటికి తిలోదకాలు ఇచ్చి , ఏకపక్షంగా తమకు నచ్చిన వారికి పనులు కల్పిస్తూ , ఆ పనులను కూలీలతో చేయించకుండా యంత్రాలతో చేయిస్తూ ఉపాఽధి నిధులు దోచుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలను తన వారిచే చేయించుకునేందుకు టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి ఎంపీడీవోలకు పలు లేఖలు రాసి తనకు నచ్చిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకుని, పాత వారిని తొలగించారనే విమర్శలు ఉన్నాయి. -
బీర్జేపల్లెలో పిడుగు పాటు
చౌడేపల్లె: మండలంలోని చారాల పంచాయతీ, బీర్జేపల్లెలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు రెండు ఇళ్లపై పిడుగులు పడ్డాయి. దీంతో రూ.1.50 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. శనివారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం పడింది. ఒక్కసారిగా మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి. బీర్జేపల్లె గ్రామానికి చెందిన ఎస్.చంద్ర ఇంటి ముందుగల టెంకాయ చెట్టు తోపాటు నూతనంగా నిర్మించిన ఇంటిపై పిడుగుపడింది. చంద్ర ఇంట్లో విద్యుత్ వైర్లు అన్నీ కాలిపోయాయి. అలాగే పక్కనే ఉన్న శీనప్పకు చెందిన ఇంట్లో కూడా విద్యుత్ సామగ్రి కాలిపోయింది. పిడుగుపాటు శీనప్ప షాక్ గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇంటిపై పిడుగు పాటుకు గురైన ప్రాంతం పిడుగుపాటుకు కాలిపోయిన వైర్లు -
ప్రైవేటీకరణ విరమించుకోవాలి
చిత్తూరు కార్పొరేషన్ : పాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అసమర్థ కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాల కార్యక్రమం ద్వారా నిలదీద్దామంటూ ప్రజలకు వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పిలుపునిచ్చా రు. ఆదివారం చిత్తూరు నగరంలోని 34వ వార్డు కన్నయ్యనాయుడు కాలనీలో రచ్చబండలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడు ఆను ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ పార్లమెంట్ కార్యదర్శి, పరిశీలకులు రెడ్డెప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు నియో జకవర్గ సమన్వకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. కూటమి ప్రభు త్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల లు ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు పార్టీ ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గంలో 60 వేల సంతకాలు సేకరిస్తున్నామన్నా రు. సేకరించే సంతకాలను గవర్నర్, రాష్ట్రపతిలకు అందజేయనున్నట్లు తెలిపారు. అనూహ్య స్పందన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని విజయానందరెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, ప్రజలు తరలివచ్చి చంద్రబాబు వైఖరికి నిరసనగా సంతకాలు చేశారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు ఆలోచనను చంద్రబాబు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ కార్యదర్శి, పరిశీలకులు రెడ్డెప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయానందరెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సంతకం చేశారు. అనంతరం మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, రెడ్డెప్ప, నౌషాద్, రమణ, హరిషారెడ్డి, కౌషర్, బిందురెడ్డి, మస్తాన్, యువత, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేస్తున్న యువత మాట్లాడుతున్న చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి -
గ్రీవెన్స్ రద్దు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని దీపావళి పండుగ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. అలాగే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో సైతం గ్రీవెన్స్ను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. భార్య కాపురానికి రాలేదని.. యాదమరి: కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి పంచాయతీ, పావడదాసూరు గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు మునెప్ప(35) దినసరి కూలీ. కుటుంబ పోషణకు ఇతరుల నుంచి కొంత అప్పుగా తీసుకున్నాడు. అయితే వాటిని చెల్లించే క్రమంలో విఫలమవడంతో అప్పుల వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి వేధించేవారు. దీంతో అతని భార్య సౌజన్య ఆ అవమానాన్ని భరించలేక మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. తను ఎంతకీ తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన మునెప్ప ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని తల్లి చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునెప్ప మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా బంగారుపాళెం : మండలంలోని సంక్రాంతిపల్లె వద్ద ఆదివారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ సంఘటనతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు, పలమనేరు వైపు నుంచి చిత్తూరు వెళ్తున్న కారు సంక్రాంతి పల్లె వద్ద కు రాగానే ఓ ద్విచక్రవాహనదారుడు ఒక్కసారిగా అడ్డు రావడంతో ఎడమవైపు పోతున్న కారు.. యాదమరి నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ట్యాంకర్ రహదారిపై బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ట్యాంకర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడడంతో అందులో ఉన్న పెట్రోల్, డీజల్ లీకై ఎక్కడ మంటలు చెలరేగుతాయోనని గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న బంగారుపాళెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారాన్ని ఐఓసీ సిబ్బందికి తెలియజేయడంతో వారు సంక్రాంతిపల్లె వద్దకు చేరుకున్నారు. బోల్తా పడిన ఆయిల్ ట్యాంక్ నుంచి మరో వాహనంలోకి డీజల్, పెట్రో ల్ నింపారు. రహదారిపై బోల్తా పడిన ట్యాంకర్ను క్రేన్ల సాయంతో రహదారి పక్కకు తొలగించారు. ట్యాంకర్ బోల్తా పడడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మా రింది. ట్యాంకర్కు మంటలు చెలరేగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు. -
మహిళపై దాడి
శాంతిపురం : తమ వ్యవసా య భూమిని ఆక్రమించుకున్న వారిని అడ్డగించేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని ఓ మహిళ రాళ్లబూదుగూరు పోలీసులను ఆశ్రయించింది. శనివారం జరిగిన దాడిపై బాధితురాలు ఆదివారం పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఎం.కె.పురానికి చెందిన శివమ్మ ఫిర్యాదు మేరకు వివరాలు.. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా ఆమె ఒంటరిగా గ్రామంలో ఉంటోంది. వీరికి వారసత్వ ఆస్తిగా సంక్రమించిన దానిలో 1.45 ఎకరాలను అదే గ్రామానికి చెందిన మరో కుటుంబం ఆక్రమించుకుందని తెలిపారు. దీనిపై శివమ్మ హైకోర్టును ఆశ్రయించడంతో తన ఆస్తిని స్వాధీనం చేసుకోవటం, అనుభవించటంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయినా తనను సొంత భూమిలోనికి రానివ్వకపోవటంతో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ, కుప్పం ఆర్డీవో, డీఎస్పీ, కడ పీవోలకు వినతి పత్రాలు సమర్పించానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తమ పొలంలో ప్రత్యర్థులు అరటి చెట్లు నాటుతున్నా రని తెలిసి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వెంకటప్ప, వెంకటమ్మ, కృష్ణమూర్తి, పుష్ప తనపై దాడికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. దీనిపై పోలీసు అధికారులు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. -
నరక దారి
అధ్వాన్నంగా గ్రామీణ రహదారులు నిండ్ర : అధ్వాన్నంగా రహదారిచిత్తూరు : ఇందిరానగర్ వద్ద మురుగునీటి మధ్యే రాకపోకలు తిరుపతి..చిత్తూరు జిల్లాల్లో గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో పూర్తిగా ఛిద్రమయ్యాయి. సంక్రాంతి నాటికే రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు మాటలు నీటిమూటలుగా మిగిలిపోయాయి. అడుగుకో మడుగును తలపిస్తున్న మార్గాల్లో పల్లెవాసుల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలోనే ఇసుక.. గ్రావెల్ మాఫియా కారణంగా రహదారులు మరింతగా దెబ్బతిన్నాయి. అతి వేగంతో వెళుతున్న భారీ వాహనాల తాకిడికి సీసీ రోడ్లు సైతం శిథిలావస్థకు చేరాయి. అక్కడక్కడా నాణ్యతాప్రమాణాలను గాలికి వదిలి అరకొరగా మరమ్మతులు చేసిన మార్గాలు కూడా మళ్లీ ధ్వంసమయ్యాయి. ఈ మేరకు కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పల్లెదారులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఊదరగొట్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. ఈ ఏడాది పెద్ద పండుగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు చేరుకునే వారికి చూడముచ్చటైన మార్గాలు స్వాగతం పలుకుతాయని ప్రకటనలు గుప్పించి.. దీపావళి వచ్చినా గతుకుల.. అతుకుల రోడ్లతోనే సరిపెట్టి అవస్థలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, తిరుపతి జీడీ నెల్లూరు: ఏటుకూరుపల్లిలో రోడ్డు దుస్థితి -
రికార్డుల్లోనే ఖర్చులు.. క్షేత్ర స్థాయిలో కనిపించని పనులు
జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల్లో అక్రమాలలో పుంగనూరు నియోజకవర్గం టాప్గా నిలిచింది. నియోజకవర్గంలోని మూడు మండలా లు అక్రమాలలో అగ్రస్థానంలో ఉంది. పులిచెర్ల మండలంలో మొత్తం రూ.16.07 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.12.13 కోట్లు, మెటీరియల్ కింద రూ.3.94 కోట్లు , రొంపిచెర్ల మండలంలో రూ.15.01 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.13.45 కోట్లు, మెటీరియల్ కింద రూ.1.65 కోట్లు, సోమల మండలంలో రూ.10.99 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.7.32 కోట్లు, మెటీరియల్ కింద రూ.3.67 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు. -
రంకెలేసిన ఉత్సాహం
వెదురుకుప్పం: ఉత్సాహం ఉరకలేసింది...కాలుదువ్వి న కోడె గిత్తలు ... జనసమూహాన్ని చీల్చుకుంటూ దూ సుకుపోయిన పోట్లగిత్తలు తమ పౌరుషాన్ని చూపా యి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని కొండకిందపల్లెలో జరిగిన జల్లికట్టు జోష్ తెచ్చింది. యువత కేరింతల మధ్య జరిగిన జల్లికట్టు దుమ్ము రేపింది. నిర్వాహకులు ముందుగా ఎడ్లకు పలకలు, వస్త్రాలతో పాటు బెలూన్లు కట్టి పందేలకు సిద్ధం చేశారు. అంతకు ముందే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అక్కడికి చేరుకున్నారు. పోట్లగిత్తలు రంకెలేస్తూ దూసుకుపోయాయి. పరుగులు తీస్తున్న ఎడ్లను కట్టడి చేసేందుకు యువకు లు ప్రయత్నించారు. ఎడ్ల వేగాన్ని నిలువరించలేక చేతులెత్తేశారు. ఉత్సాహంతో పందెంలో పాల్గొన్న యువత పరుగులు తీస్తున్న కోడెగిత్తలను కట్టడి చేసి పలకలను లాక్కొన్నారు. కొన్ని ఎడ్లు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా యువతకు చిక్కకుండా పరుగులు తీశాయి. పశువుల కిందపడి కొందరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో గ్రామం జనంతో కిక్కిరిసింది. దూసుకుపోతున్న కోడెగిత్తలు గ్రామంలో జన సందడి -
ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి
ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ పుంగనూరు: దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వారిద్దరూ విడివిడిగా మాట్లాడుతూ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలసి జాగ్రత్తగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. వీరితోపాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్కుమార్ గాంఽఽధీ, ఎస్పీ తుషార్ డూడీ పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినాయకం అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు భవిష్యత్లో ఉద్యోగాలు పొందేందుకు ఉచిత శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కచ్చితంగా అంబేడ్కర్ చిత్రపటాన్ని పెట్టాలన్నారు. నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షులుగా మురళి, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్, గౌరవ అధ్యక్షులుగా ఓబులేశు, ఆర్థిక కార్యదర్శిగా షణ్ముగం, అసోసియేట్ ప్రెసిడెంట్గా సంతానం, జిల్లా అడిషనల్ సెక్రటరీగా వినాయక, జిల్లా కన్వీనర్గా బాబు, జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, ప్రసాద్, రమేష్, నవీన్, నరేష్, సుబ్బలక్ష్మి, ప్రణీత, రజనీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. -
‘పాలారు’కు జలకళ
శాంతిపురం : ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి ఆ వరద నీటితో పాలారు నది మళ్లీ జలకళను సంతరించుకుంది. కర్ణాటకలోని బేతమంగళ డ్యాం గేట్లు ఎత్తడం, సువిశాలమైన రామసాగర చెరువు నుంచి మూడు రోజులుగా మొరవ నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో వి.కోట, రామకుప్పం మండలాల మీదుగా ప్రవహిస్తూ ఆదివారం తెల్లవారుజామున నీరు శాంతిపురం చేరాయి. ఇక్కడి నుంచి కుప్పం మండలం మీదుగా తమిళనాడుకు చేరనున్నాయి. స్థానికంగా భారీ వర్షాలు లేకపోయినా నదిలో నీటి రాకతో స్థానికులు శాంతిపురం చెక్ డ్యాం వద్దకు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఆదివారం బడుగుమాకులపల్లి వారపు సంత ఉండటం, దీని పక్కనే పాలారు నది ప్రవహించడంతో రోజంతా జనాల తాకిడి కనిపించింది. కాగా కర్ణాటక నుంచి వస్తున్న వరద నీటితో పాలారు నది ప్రవహిస్తుంటే సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాలువ ద్వారా తెచ్చిన కృష్ణా నది జలాలు ప్రవహిస్తున్నాయని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నిజంగా నీరు ఎక్కడి నుంచి వస్తోందో తెలిసిన వారు ఈ పోస్టులను చూసి నవ్వుకొంటున్నారు. -
మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో చోరీ
పూతలపట్టు(యాదమరి): ఓ మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీ చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. భాదితుల కథనం.. మండల పరిధిలోని, పి.కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో చిన్నపాపమ్మ నివాసం ఉంటోంది. తన కుమారుడైన దాము ఆర్మీలో పదవీ విరమణ చెంది తిరుపతిలోని ఓ సెక్యూరిటీ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఆమె తిరుపతిలో నివాసం ఉంటున్న తన కుమారుడు ఇంటికి వెళ్లింది. అయితే దీపావళి పండుగ నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన వీరికి తమ ఇంటి తలుపులు తెరచి ఉండడాన్ని గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 60 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, రూ.50వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కా ప్రణాలికతోనే దుండగులు రెక్కీ నిర్వహించి చొరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు. -
ప్రమాదకరంగా చెరువు
చౌడేపల్లె : రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరదనీరు చేరుతోంది. దుర్గ సముద్రం పంచాయతీ పరిధిలోని బుటకపల్లె చెరువు సుమారు వంద ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ చెరువు నిండి మొరవ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువనున్న చిన్నపాటి కుంటలు, చెరువులు మొరవలు వెళ్లడంతో ఊహించని మేరకు వరద నీరు బుటకపల్లె చెరువుకు చేరుతోంది. చెరువు కట్ట మధ్యలో ఓ చోట మట్టి జారి కట్ట సగభాగం వరకు కోతకు గురై నీరు బయటకు వెళ్తోంది. మళ్లీ వర్షం కురిసినా లేదా వరద నీటి ఉదదృతి పెరిగితే కట్ట తెగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శెట్టిపేట పెద్ద చెరువుకు గండి పడింది. నీరు గండి ద్వారా బయటకు ప్రవహిస్తోంది. కట్ట తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయమైన రైతులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వినోదం.. కావొద్దు విషాదం!
పలమనేరు : సరదాగా స్నేహితులతో కలిసి కొంతమంది ప్రకృతి అందాలను వీక్షించి పరవశిస్తుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోష సాగరంలో మునిగి తేలుతుంటారు. సెలయేళ్లు, జలపాతాలు, వాటర్ ఫాల్స్ను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సెల్ఫీలు దిగుతూ.. ఫొటోలు తీసుకుంటూ సంబరపడి పోతుంటారు. ఇలాంటి సందర్భంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మొదలే వర్షాలు.. ఆపై రీల్స్.. సెల్ఫీల మోజులో పడి కన్నీళ్లు తెప్పించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కన్నీటి ‘జలపాతం’! నియోజకవర్గంలోని పలు వాటర్ఫాల్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. భారీ సుడిగుండాలు పలువురిని బలితీసుకుంటున్నాయి. తల్లిదండ్రులు పిల్లల పట్ల, యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాలతో కై గల్ దుముకురాళ్ల, కళ్యాణరేవులు, గంగన్న శిరస్సు, వైఎస్ఆర్ జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. సుడిగుండాలతో ప్రమాదకరంగా మారిపోయాయి. ముఖ్యంగా కళ్యాణిరేవులు, కై గల్ వాటర్ఫాల్స్లోని మృత్యులోయ ఇప్పటికే పలువురిని పొట్టనబెట్టుకుంది. ఇక్కడి సుడిగుండం కారణంగా నీటిలోకి దిగితే మళ్లీ పైకి రావడం సులభం కాదు. ఏడేళ్లలో 14 మంది మృతి గత ఏడేళ్లలో పలమనేరు నియోజకవర్గంలోని కై గల్, కళ్యాణిరేవులు, గంగనశిరస్సు, వైఎస్సార్ జలాశయం, వీకోట మండలంలోని గిడుగు జలపాతాల్లో 14 మంది దకా నీళ్లల్లో మునిగి మృతి చెందారు. సంబంధిత జలపాతాల్లో సుడిగుండాలు, నదిలోపలి పరిస్థితులు తదితరాలు గురించి అవగాహన లేకనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యువత సెలవుల్లో సరదాగా గడిపేందుకు అడవిలోని కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అక్కడున్న ఫాల్స్లో దూకడం కూడా ప్రమాదాలకు కారణమే. -
యూ‘మిస్’
పలమనేరు: మండలంలోని కళ్యాణిరేవులు జలపాతంలో రీల్స్ మోజులో దూకి నీటమునిగిన పట్టణ వాసి యూనిస్(25) మృతదేహాన్ని పలమనేరు ఫైర్ సిబ్బంది శనివారం వెలికితీశారు. మూడు రోజుల క్రితం యూనిస్ స్నేహితులతో కలిసి జలపాతం వద్ద సెల్ఫోన్లో వీడియోలు తీసుకుంటూ భారీగా ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్లోకి దూకి ఆపై కనిపించకుండా పోయాడు. తమిళనాడుకు చెందిన పది మంది గజ ఈతగాళ్లు సైతం మృతదేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. తుదకు శనివారం మధ్యాహ్నం ఘటన జరిగిన ప్రాంతం నుంచి ముందుకు కిలోమీటర్ దూరంలో సుడిగుండంలో చిక్కుకుని రాతిబండలకిందనున్న యూనిస్ మృతదేహం పైకి తేలింది. డ్రోన్ ద్వారా నదిపై గమనించగా ఈ విషయం కనిపించింది. ఆ ప్రాంతంలోకి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆపై స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. కాగా మృతదేహం కోసం స్థానిక ఫైర్ సిబ్బంది పడిన కష్టాన్ని పట్టణవాసులు అభినందించారు. -
చోరికి పాల్పడ్డ ముద్దాయి అరెస్టు
కుప్పం: రామకుప్పం మండలం, చెల్దిగానిపల్లి గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో చోరబడి చోరీకి పాల్పడ్డ ముద్దాయిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం, అంబూరు సమీపంలోని ఉదఎందిరం గ్రామానికి చెందిన రాజేంద్ర కుమారుడు గోడ్విన్ మోసెస్ రాజేంద్రణ్ అలియాస్ కడిష్ రామకుప్పం, వి.కోట ప్రాంతాల్లో సంచరిస్తూ దోంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో వారం క్రితం చెల్దిగానిపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చొరబడి 95 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. దీంతో పాటు గతంలో వి కోటలో జరిగిన దొంగతనం కేసులోనూ కడిష్ ముద్దాయిగా ఉన్నాడు. ఇతని వద్ద నుంచి 123.3 గ్రాముల బంగారు నగలు, కత్తి, రాడ్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై తమిళనాడులో ఇప్పటి వరుకు 30 కేసులు ఉన్నాయన్నారు. డీఎస్పీ వెంట సీఐ మల్లేష్యాదవ్, ఎస్ఐలు వెంకటమోహన్, నరేష్, శ్రీనివాసులు ఉన్నారు. -
సార్ చెప్పారు.. గిఫ్ట్ బాక్స్ ఇవ్వు!
చిత్తూరు కలెక్టరేట్ : దీపావళి రోజున టపాసులు కాల్చడం సంప్రదాయం. చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరులో తాత్కాలిక టపాసుల దుకాణాలు వెలిశాయి. వీటికి అనుమతులు పొందే సమయంలో ముడుపులతో పాటు అగ్నిమాపక, రెవెన్యూ, మరికొన్ని శాఖలకు గిఫ్ట్ బాక్సుల టపాసులు ఉచితంగా ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలా ఇవ్వని దుకాణాలకు వచ్చే పండుగకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదంటూ భయపెడుతున్నాడు. ఒక్కొక్క శాఖకు 50 నుంచి 200 వరకు గిఫ్ట్ బాక్సులు ఇవ్వాల్సి వస్తోందని, వారితో పాటు ప్రజాప్రతినిధులకు అదనంగా మరికొన్ని ఇవ్వాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఖరీదైన వెలుగుల పండుగ జిల్లాలో టపాసుల దుకాణాల ఏర్పాటుకు రెవెన్యూ, అగ్నిమాపక, ఇతర శాఖలకు ఎప్పటిలాగే ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాపారం మూడు రోజులు మాత్రమే ఉంటుందని, అది కూడా వర్షం కురిస్తే ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క దుకాణం నుంచి రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని, ఈ ఖర్చులు మొత్తం చివరికి వినియోదారులపైనే నెడుతున్నామని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే ముడుపులను పూడ్చుకునేందుకు అదనపు రేట్లను పెడుతున్నట్టు వెల్లడిస్తున్నారు. అందరికీ చెల్లింపులు ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 36 వరకు టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రతి దుకాణం నుంచి రెవెన్యూ, అగ్నిమాపక, నగరపాలక శాఖలకు చెల్లింపులు చేయాల్సి వస్తోందని, అలాగే విద్యుత్, నీరు, భద్రతా సదుపాయాల పేరుతో అదనపు లెక్కలు చూపుతున్నారని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు లైసెన్సులు పొందిన వ్యాపారులు నష్టాలను భరించలేక తమ అనుమతులను తాత్కాలికంగా మరొకరికి రూ.30వేల నుంచి రూ.40 వేలకు విక్రయించినట్టు సమాచారం. ధరలపై పర్యవేక్షణ కరువు తాత్కాలిక దుకాణాల్లో అధిక ధరలకు టపాసులు విక్రయిస్తుంటే పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. నియంత్రించాల్సిన పలు శాఖల అధికారులు తమ జేబులు నింపుకుని.. గిఫ్ట్ బాక్సులు తీసుకుని పట్టించుకోకుండా ఉండిపోతున్నారనే విమర్శలున్నాయి.టపాసుల ధరలపై వినియోగదారులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని అధిక ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రామ్నగర్ కాలనీకి చెందిన అమర్ అనే నిరుద్యోగి తాత్కాలిక టపాసుల దుకాణం పెట్టాడు. ఈ దీనికోసం బ్యాంకులో రుణం తీసుకుని రూ.20 లక్షల వరకు వెచ్చించాడు. అగ్నిమాపక, రెవెన్యూ శాఖల్లో అనుమతులు పొందే సమయంలో లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, అంతటితో ఆగకుండా టపాసుల గిఫ్ట్ బాక్సులు అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నాడు. అధికారులు ఒక్కొక్కరూ వచ్చి సార్ చెప్పారు.. 30 గిఫ్ట్ బాక్సులు ఇవ్వు.. అంటూ భయాందోళన సృష్టిస్తున్నారని వాపోతున్నాడు. వీరితోపాటు ప్రజాప్రతినిధులు సైతం గిఫ్ట్ బాక్సులు తమ ఇళ్లకు పంపాలంటున్నారని, ఇంత మందికి ఇచ్చుకుంటూ వెళితే అసలు కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నాడు. చిత్తూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అరుణ్ తాత్కాలిక టపాసుల దుకాణం పెట్టాడు. అనుమతులు ఇచ్చిన శాఖలకు మామూళ్లతో పాటు 50 నుంచి 100 వరకు టపాసుల గిఫ్ట్ బాక్సులు పంపాల్సి వస్తోందని చెబుతున్నాడు. ఇవ్వకపోతే మరోసారి అనుమతులు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నాడు. తెచ్చిన స్టాక్లో అధిక శాతం ఉచితంగా పలు శాఖల అధికారులకు ఇవ్వడం వల్ల ఆ నష్టాన్ని సంపాదించేందుకు రేట్లు పెంచి అమ్ముకోవాల్సి వస్తోందంటున్నాడు. ఎవ్వరికీ ఉచితంగా టపాసుల బాక్సులు ఇవ్వకపోతే తక్కువ రేట్లకే విక్రయించొచ్చని కుండబద్ధలు కొడుతున్నాడు. అధికారులకు పందారం.. ప్రజలపై పెను భారం -
బైక్ను ఢీకొట్టిన కారు
శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలో శాంతిపురంలోని పాలారు వంతెన వద్ద బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వడ్డెర వెంకట్రామప్ప, సత్యప్పలు చికెన్ షాపుల ఎదుట ఉన్న ఇనుప సామాన్ల కొలిమిలో తమ పని ముగించుకుని బైకుపై వెనుదిరిగారు. వెనుక నుంచి వచ్చిన కారు వీరి బైకును ఢీకొట్టడంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్రామప్ప(57) అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు ఉన్న సత్యప్ప(59) తీవ్రంగా గాయపడ్డాడు. 108 ద్వారా సత్యప్పను కుప్పం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును సమీపంలో వదిలేసి, అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఈ కారులో మద్యం బాటిళ్లను గుర్తించిన కెనమాకులపల్లి వాసులు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నిరసనకారులతో ఆందోళన విరమింపజేశారు. -
సీ్త్రలను అగౌరవపరిచే పార్టీ టీడీపీ
● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్వేటినగరం : సీ్త్రలను అవమానించే పార్టీ టీడీపీ అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశమన్నారు. భారతీయ సీ్త్రలు చీర, బొట్టు ధరించడం సంప్రదాయమన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బహిరంగ సభలో తన కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మిని సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యకరమైన తీరిలో చీర, బొట్టు, నగలు గురించి అవమానకరంగా మాట్లాడడం దారుణమన్నారు. కల్తీ మద్యం గురించి కృపాలక్ష్మి నిరసన తెలియజేస్తే పరుష పదజాలంతో మాట్లాడం సమంజసమేనా....? అని ప్రశ్నించారు. ‘నీకు జన్మనిచ్చింది కూడా మాతృమూర్తే’ అనే విషయాన్ని మరిచి వ్యంగంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. తాను అవినీతి, భూకబ్జా చేశానని ఆరోపించడం కాదు.. నిరూపించాలని సవాల్ విసిరారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. పచ్చనపల్లిలో పిడిగుల వాన చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, పచ్చనపల్లి ప్రాంతంలో శనివారం వేకువజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ తరుణంలో ఓ చెట్టుపై పిడుగు పడింది. దాని ధాటికి చెట్టు రెండుగా చీలింది. ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని లేదు. మూడు రోజుల కిత్రమే అనంతాపురం గ్రామంలో ఓ విద్యార్థి పిడుగుపాటుకు మృతి చెందాడు. చెట్ల కింద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని మండల అధికారులు సూచించారు. -
వైద్య విద్యను కాపాడుకుందాం!
పుత్తూరు: కోటి సంతకాల ప్రజాఉద్యమంతో వైద్య విద్యను కాపాడుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏడీకే కల్యాణ మండపంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన పాలనలో మొత్తం 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో ఐదింటిని పూర్తిచేసి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెల్టుషాపులపై ఉన్న శ్రద్ధ.. మెడికల్ కాలేజీలపై లేదా? గల్లీగల్లీలో బెల్ట్ షాపులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, మెడికల్ కాలేజీలపై ఎందుకు లేదని చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. వైద్య విద్య ప్రైవేటీకరణను ప్రజాఉద్యంతోనే అడ్డుకోవాలని, దీనికి ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకుడు కంకణధారుడు కావాలని పిలుపునిచ్చారు. జగనన్న సీఎంగా తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలను సైతం తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘సూపర్గా’ మోసం! సూపర్ సిక్స్ పేరిట ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, చేయూత, ఆసరా వంటి పథకాలను అటకెక్కించారన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చి మోసం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కోటి సంతకాలతో అడ్డుకుందాం మెడికల్ కళాశాలల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించి సంతకాలు చేయించాలని మాజీ మంత్రి రోజా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయించే కోటి సంతకాల పేపర్లతో జగనన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలసి వెళ్లి గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. తద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎ.హరి, వైస్ చైర్మన్లు డి.జయప్రకాష్, డీ.శంకర్, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, రూరల్ పార్టీ ఆధ్యక్షుడు అన్నా లోకనాథం, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతి షాపు నుంచి ఇవ్వాల్సిందే!
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తాత్కాలిక టపాసుల దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతులిచ్చారు. ఈ అనుమతులతో వారం రోజుల పాటు టపాసులు విక్రయించొచ్చు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 36, నగరి, పుంగనూరు, పలమనేరు, కుప్పం, జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 140 మొత్తం 176 తాత్కాలిక షాపులకు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులిచ్చారు. వీటితోపాటు జిల్లాలో పర్మినెంట్ లైసెన్స్లు కలిగిన టపాసుల షాపులు 17 ఉన్నాయి. ఈ ఏడాది అనుమతులిచ్చిన ఆయా శాఖల అధికారులకు ప్రతి షాపు నిర్వాహకుడు కచ్చితంగా గిఫ్ట్ బాక్సులు ఇచ్చుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గర్జించిన కలం!
కలం గర్జించింది. వేధింపులపై గళం విప్పింది. జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటించింది. తప్పులెత్తి చూపితే సరిదిద్దు కోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం తగదని హెచ్చరించింది. సాక్షి మీడియాపై కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికింది. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. పలమనేరు/కుప్పం: ప్రజాసామ్యంలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం తగదని మేధావులు, ప్రజాసంఽఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలా కేసుల సంస్క్రృతి లేదని మండిపడ్డారు. కొన్ని రోజులుగా సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను ఎండగట్టారు. ఇలాంటివి ప్రమాదకరమని, వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. పలువురు జర్నలిస్ట్లు నిరసనలు చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. సాక్షిపై అక్రమ కేసులు అప్రజాస్వామికం సాక్షి పత్రిక, ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు అప్రజాస్వామికమని కుప్పం పాత్రికేయుల బృదం స్పష్టం చేసింది. శనివారం కుప్పంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంపై వరుసుగా సాక్షి ప్రతికలో వస్తున్న కథనాలు చూసి జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారీ దారులను వదిలి మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’పై కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం, నోటీసులు ఇవ్వడం, విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు. ఇలాంటి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. కుప్పం విలేకర్లు వెంకటాచలం, హరినాథ్, సుబ్రమణ్యం, నాదముని, నాగరాజు, గణేష్, చలపతి తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా? పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు తగదని పలమనేరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి విలేకరులు, ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వేధింపులకు నిరసనగా స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయ ఏవో కుమారస్వామికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత్రికేయులపై కేసులు పెట్టడం ప్రజాసామ్యంలో ఎక్కడా లేదన్నారు. జర్నలిస్టులు రమేష్, మణి, ఆది, మునిరత్నం, దిలీప్, వేణు, అశోక్, మురళి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.మీడియాపై కేసులా..? ప్రజాసామ్యంలో నాలుగో స్తంభంలా పనిచేసే మీడియాపై కేసులు, విలేకరుల నోరునొక్కడం, పత్రికా కార్యాలయాలపై దాడులు మంచిది కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం మీడియా నోరుకొక్కే ప్రయత్నాలు సాగుతు న్నాయి. పోలీసులు సైతం నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. – అబ్దుల్ సుభాన్, సౌత్ఇండియా మీడియాసెల్ సెక్రటరీ -
ఆగని దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. శనివారం తెల్లవారు జామున మండలంలోని పాతపేట, పూరేడువారిపల్లె చిట్టారెడ్డిపేట, పాళెం, కోటపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను నాశనం చేశాయి. పూరేడు వారిపల్లె వద్ద వరి పంటను తొక్కిపడేశాయి. అలాగే మామిడి కొమ్మలను విరిచేశాయి. దాదాపు ఏడు ఏనుగులు పంటలపై పడి సర్వనాశనం చేశాయి. చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి కుప్పంరూరల్: చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కుప్పం మండలం, డి.కె.పల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. కుప్పం సీఐ శంకరయ్య మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి చెరువులో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి సమాచారం ఇచ్చారని తెలిపారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మెరూన్ కలర్పై తెల్లటి చారల షర్టు ధరించి, బట్ట తల కలిగి ఉన్నాడని, ఎవరైన ఇలాంటి ఆనవాళ్లు కలిగిన వ్యక్తి కనబడక పోయి ఉంటే కుప్పం పోలీసులను సంప్రదించాలని సూచించారు. నేడు జిల్లా కార్యవర్గ సమావేశం చిత్తూరు కలెక్టరేట్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ తదితర సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు. -
సార్ చెప్పారు.. గిఫ్ట్ బాక్స్ ఇవ్వు!
‘సార్ చెప్పార్.. గిఫ్ట్ బాక్స్ ఇవ్వు.. లేకుంటే నెక్ట్స్ ఇయర్ నీకు లైసెన్స్ రాదు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించేశారు. పెత్తనాన్ని చేతిలోకి తీసుకుని పేట్రేగిపోతున్నారు. వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. పట్టపగలే యంత్రాలతో పనులు చేస్తూ కూలీల కడుపు కొడుతున్నారు. దొంగ మస్టర్లు సృష్టించి జేబులు నింపుకుంటున్నారు. అధికారులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు. మూగజీవుల సంరక్షణ, వృద్ధి కోసం ప్రవేశపెట్టిన గోకులం షెడ్ల నిర్మాణ పనులూ తమవారికే కట్టబెట్టేశారు. వాటిపైనే ఆధారపడ్డ పేద కుటుంబాలను వీధిన పడేశారు. తమ్ముళ్ల తీరు చూసి నియోజకవర్గ ప్రజలు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: పుంగనూరు నియోజకవర్గంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీల ద్వారా చేయాల్సిన పనులను పట్టపగలే యథేచ్ఛగా జేసీబీలు, హిటాచీలతో చేస్తున్నారు. మట్టిని ట్రాక్టర్లతో తరలించి బిల్లులు చేసుకంటున్నారు. కూలీలే పనిచేసినట్లు తప్పుడు మస్టర్లు సృష్టిస్తున్నారు. అధికారులను బెదిరించి కూలీల ఖాతాలో వేతనాలు జమ చేయిస్తున్నారు. ఆపై వారి ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు గతంలో చేసిన పనులకు మెరుగులద్ది ఆ పనులకే మళ్లీ బిల్లులు చేసుకుంటున్నారు. పథకం ప్రారంభం నుంచి పనిచేస్తున్న సిబ్బంది తమకు అనుకూలంగా లేరని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తున్నారు. తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పబ్బం గడుపుకుంటున్నారు. పశువుల సంరక్షణ కోసం మంజూరు చేసిన గోకులాలు సైతం తమ్ముళ్లు వశం చేసుకున్నారు. గోవులు లేకపోయినా గోకులాల పేరిట దోచుకు తింటున్నారు. నియోజకవర్గంలో ఉపాధి ఖర్చు రూ.65.07 కోట్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పుంగనూరు నియోజకవర్గంలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి నిధులు రూ.65.07 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనాల ద్వారా రూ.47.65 కోట్లు, మెటీరియల్ కంపోన్మెంట్ ద్వారా రూ.17.42 కోట్లు ఖర్చు చేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలో మొత్తం 19,113 పనులు చేసినట్లు రికార్డులు సిద్ధం చేశారు. యంత్రం..ఇదిగో సాక్ష్యం గోకులం.. తమ్ముళ్లకే అగ్రతాంబూళం పుంగనూరు మండలం, చదళ్లలో జేసీబీలతో చేసి, ట్రాక్టర్లతో మట్టిని అన్లోడ్ చేసిన తమ్ముళ్లు పుంగనూరు నియోజకవర్గంలో కూలీలు చేయాల్సిన పనులను కూటమి నేతలు యంత్రాలతో చేసి, కూలీలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. పుంగనూరు మండలం, కుమ్మరనత్తం పంచాయతీ చెరువులో ఫారంపాండ్ను జేసీబీతోనే చేశారు. చదళ్ల చెరువులో చేపల కుంట, క్యాటిల్ఫామ్ను యంత్రాలతోనే చేశారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో యంత్రాలతో పనులు చేసి కూలీల కడుపు కొడుతున్నారు. రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, చౌడేపల్లె, సదుం మండలాల్లో 90 శాతం మేరకు ఉపాధి పనులు జేసీబీలతోనే చేశారు. ఆ తర్వాత వాటిని కూలీలు చేసినట్టు రికార్డులు సృష్టించి జేబులు నింపుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. పశు సంపద వృద్ధి, సంరక్షించాలనే ధ్యేయంతో అమలు చేస్తున్న గోకులం షెడ్లు తమ్ముళ్ల పరమయ్యాయి. పశువులు ఉన్న రైతులను గుర్తించి, వాటి సంఖ్య ఆధారంగా షెడ్లను గ్రేడ్ల వారీగా మంజూరు చేయాల్సి ఉంది. కానీ పుంగనూరు నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించారు. కేవలం తెలుగు తమ్ముళ్లకు మాత్రమే గోకులం షెడ్లు అప్పగించారు. కొందరు పాత గోకులాలకు సైతం మెరుగులు దిద్ది బిల్లులు చేసి స్వాహా చేశారు. ఉపాధి పనుల్లో భారీ అవకతవకలు -
కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం
శాంతిపురం : పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త కెఆర్జే భరత్ తెలిపారు. మండలంలోని ఏడవమైలు వద్ద శుక్రవారం మొరసనపల్లి, కడపల్లి, కర్లగట్ట, తుమ్మిశి, అబకలదొడ్డి, నడింపల్లి పంచాయతీల పార్టీ కమిటీలు ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో క్యాడర్కు జరిగిన నష్టాన్ని గుర్తించిన అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇకపై వారికి తగిన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కమిటీల్లో కోవర్టులు, అవకాశవాదులకు చోటు లేకుండా యువత, సోషల్ మీడియా సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు. పంచాయతీల వారిగా క్రియాశీలక కార్యకర్తలు పార్టీ అధినేతతో కలిసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అధికారం వుండగా పార్టీలోకి వచ్చిన అవకాశవాదులు ఇప్పుడు పార్టీని వీడారని భరత్ చెప్పారు. వారి వల్లే కుప్పంలో పార్టీ 75 వేల ఓట్లకు పరిమితమైనట్టు తెలిపారు. అన్యాయం జరిగిన వారు, రాజకీయ వేధింపులకు గురయ్యే వారు డిజిటల్ బుక్ నమోదు చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, పార్టీ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఏవీ జయరాం, జగదీష్, ఆర్ముగం, విజయకుమార్, పట్టాభి, గజ్జల రమేష్, ప్రభాకర్రెడ్డి, నగేష్, వీరబద్రప్ప తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కమిటీల అధ్యక్షులు వీరే: మొరనపల్లి పంచాయతీ పార్టీ అధ్యక్షుడుగా జానకీరాం, గౌరవాధ్యక్షులుగా కాంతారావ్, కొండన్న వెంకటేష్, అబకలదొడ్డి పంచాయతీ అధ్యక్షుడుగా వీరప్ప, గౌరవాధ్యక్షులుగా పి.మణి, ఆదినారాయణ, కడపల్లి పార్టీ అధ్యక్షుడుగా ఎం.మురుగేష్, గౌరవాధ్యక్షులుగా వెంకటస్వామి, వెంకటేష్, తుమ్మిశి పార్టీ అధ్యక్షుడుగా చంగమరాజు, గౌరవాధ్యక్షులుగా టిపి భాస్కర్, ఎండి బాబు, నడింపల్లి పార్టీ అధ్యక్షుడుగా పిఎం రమేష్, గౌరవాధ్యక్షులుగా కృష్ణప్ప, మునివెంకటప్పలతో పాటు ఆయా పంచాయతీ పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలను ఎన్నుకున్నారు. -
22న జాబ్మేళా
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులతో కలిసి శుక్రవారం జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న సూళ్లూరుపేట సత్యసాయి కల్యాణ మండపంలో జాబ్ మేళా ఉందని చెప్పారు. తమతో పాటు పలువురు అధికారులు, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ నెల 20వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 21 కంపెనీలకు చెందిన ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పారు. పదో తరగతి నుంచి ఇంటర్, ఏదైనా డిగ్రీ లేదా పీజీ చదువుకున్న యువతి యువకులు అర్హులుగా పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9121646661, 9985056929, 9988853335 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాధం, పరిశ్రమలశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ భరత్కుమార్రెడ్డి, డీఆర్డీఏ అడిషనల్ పీడీ ప్రభావతి, జిల్లా ప్లేస్ మెంట్ అధికారి గణేష్ పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల అభివృద్ధే లక్ష్యం
చిత్తూరు రూరల్(కాణిపాకం): క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందింస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ హార్టికల్చర్ మిషన్ సహకారం అందిస్తోందని ఉద్యానశాఖ సీడీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ విద్యాశంకర్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో శుక్రవారం ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమంపై ఉమ్మడి జిల్లాల ఉద్యానశాఖ అధికారులు, రైతులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పలు పంటలను సీడీపీ పథకం అమలుకు ప్రాథమికంగా అనుమతులిచ్చామన్నారు. 20 శాతం వాటా భరిస్తే...20 శాతం బ్యాంకు రుణం, 20 శాతం సభ్యులైన రైతుల వాటా, మిగిలిన 40 శాతం కేంద్ర ప్రభుత్వ గ్రాంటు రూపంలో అందిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో దానిమ్మ, అరటి, టమాట, మిరప తదితర పంటలకు సీడీపీ కింద తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనం, మొక్కలు, ఎగుమతులు, కల్టివేషన్, పోస్ట్ హార్వెస్టింగ్, బ్రాండింగ్, లాజిస్టిక్స్ అంశాలపై ఏదైన ఒక పంటను ఎంపిక చేసుకున్న సంస్థ తమ దగ్గరున్న వనరులు, మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టు అందిస్తే అనుమతులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హాజరైన అధికారులు, రైతులు మాట్లాడుతున్న రాష్ట్ర కో–ఆర్డినేటర్ -
ఇంకా కనిపించని యువకుడి జాడ
పలమనేరు: మండలంలోని కళ్యాణి వాటర్ పాల్స్ ప్రవాహంలో గురువారం గల్లంతైన యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది రెండో రోజు శుక్రవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. పలమనేరు పట్టణానికి చెందిన ఫయాజ్ పెద్ద కుమారుడు యూసఫ్(25) చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్యాణి వాటర్పాల్స్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీన్ని చూసేందుకు పదిమంది స్నేహితులతో కలిసి గురువారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లారు. యూసఫ్ నీటిలో దూకాడు. పైనున్న స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేస్తున్నారు. యూసఫ్ నిమిషం వ్యవధిలోనే కనిపించకుండాపోయాడు. స్నేహితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని వెతికినా కనిపించలేదు. గురువారం చీకటి పడడంతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. వాటర్పాల్స్ కొండల నుడుమ ఉండడం, నీరు ఇక్కడి నుంచి తమిళనాడులోని మోర్ధానా ప్రాజెక్టుకు నీరు చేరుతుండడంతో మృతదేహం ఎక్కడైనా రాళ్లకు, చెట్లకు చిక్కుకుని వుండే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. -
గుండెపోటుతో న్యాయవాది మృతి
పాలసముద్రం: మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన అడ్వొకేట్ గాంధీ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. చిత్తూరు కోర్టు నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్నప్పుడు 7 గంటలకు గుండె నొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి న్యాయవాదులు చిత్తూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. కుటుంబ కలహాలతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని కందాడ దళితవాడకు చెందిన సచివాలయ ఉద్యోగి కు టుంబ కలహాలతో గురు వారం రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు. ఏర్పేడు మండలం కందాడ దళితవాడకు చెందిన బొంద మునె య్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో కుమారుడు బొంద నిరంజన్(27) శ్రీకాళహస్తి మండలం బీవీపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కందాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యం, చంద్రికల కుమార్తె విద్యప్రియను ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ భార్య విద్యప్రియ గర్భిణి. అత్తమామలు, భార్య వేధింపులకు తోడు అప్పులు ఎక్కువ కావడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిరంజన్ గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మా.. నాన్నా ఇక సెలవు.. మృతుడు నిరంజన్ వద్ద లభించిన సూసైడ్ నోట్ను బట్టి అత్తమామలు, భార్య వేధింపులు, అప్పులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేఖలో.. ‘పోలీసు వారికి మనవి.. నాకు పైళ్లెనప్పటి నుంచి భార్య, వాళ్ల అమ్మ, హేమలత(పెద్దమ్మ) నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాభార్య కూడా నన్ను చంపేదాక తీసుకొచ్చింది. దానికి రిలేటెడ్గా కాల్డేటా తీయండి సార్.. వీళ్లు నన్ను టార్చర్ పెట్టి చంపేసి నా భార్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. మా అమ్మా,నాన్న, అన్న, వదిన, తమ్ముడును కాపాడండి సార్.. ‘అమ్మా.. నాన్నా సారీ నాన్నా.. ఇక సెలవు.. ఇంకో జన్మలో మిమ్మల్ని బాగా చూసుకుంటా..’ అంటూ సూసైడ్నోట్లో నిరంజన్ రాసినట్లు గుర్తించారు. -
కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,77,02,032ల ఆదాయం వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 510 కిలోలు లభించింది. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,845, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.20,699 వచ్చింది. యూఎస్ఏవి 139 డాలర్లు, సింగపూర్వి 2 డాలర్స్, మలేషియావి 11 రింగిట్స్, యూఏఈ 25 దిర్హామ్స్, కెనడా 110 డాలర్లు, ఆస్ట్రేలియావి 110 డాలర్స్, యూరోవి 10 యూరోలు వచ్చాయి. డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
దళితుల సమస్యలకు సత్వర పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : దళితుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ (డీవీఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను సందర్శించి సమస్యలను గుర్తించి నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో ఈ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బందిపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విచారించేందుకు చిత్తూరు ఆర్డీవోను విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. రెండు రోజుల్లో విచారణ నివేదికలు అందిన వెంటనే చర్యలు చేపడుతామన్నారు. జిల్లాలో 60 వేల మంది గిరిజనులు ఉన్నారని, ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉండేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలలో గిరిజనుల సమస్యలపై సర్వే నిర్వహించామన్నారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. జిల్లాలోని ఎస్సీ కాలనీలలో శ్మశానవాటికల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తామన్నారు. జెడ్పీ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. సభ్యుల ఆమోదంతో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం పక్కనే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులలో 28 విచారణ చేసి 42 మంది బాధితులకు రూ.37,50,000 చెల్లించినట్టు తెలిపారు. సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవోలు శ్రీనివాసులు, భవాణి, అనుపమ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్కుమార్రెడ్డి, డీవీఎంసీ సభ్యులు మునీంద్రనాయక్, రాజ్కుమార్, వరలక్ష్మి, జీవీరమణ, శేషాద్రి, మునస్వామి, రఘురాం తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీపాల్గొన్న కమిటీ సభ్యులు, అధికారులు, పోలీసులు -
కలంపై కక్ష
తిరుపతి అర్బన్ : ‘సీఎం చంద్రబాబు జర్నలిస్టులతో రాజకీయం చేయ డం మంచి పద్ధతి కాదు.. రాష్ట్ర చరిత్రలో ఓ వార్త ప్రచురించారని ఏకంగా ఎడిటర్పై కేసు పెట్టడం ఇప్పటి వరకు జరగలేదు’ అంటూ తిరుపతి పాత్రికేయులు కూటమి సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సాక్షి కార్యాలయానికి పోలీసులు వెళ్లడం.. ఎడిటర్ ధనంజయరెడ్డిని ప్రశ్నించడంపై వారు మండిపడ్డారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా తిరుపతిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి సమాజంలో జరుగుతున్న మంచితో పాటు చెడును తెలియజేయడం ద్వారా అధికార యంత్రాంగం తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పత్రికలు పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉందని మండిపడ్డారు. తప్పొప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి జర్నలిస్టులు భజన చేయాలని భావించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సాక్షి ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తిరుపతి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఆర్.మురళి, కార్యదర్శి పి.బాలచంద్ర, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.గిరిబాబు, ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు మబ్బు నారాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు నగేష్, విజయయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బిగిసిన పిడికిళ్లు!
ఉరిమిన కళ్లు.. ప్రశ్నించే కలానికి సంకెళ్లా? ‘ప్రజల గొంతుకగా నిలిచే పత్రికా రంగాన్ని అణగదొక్కాలనుకోవడం అవివేకం. ఒక పత్రికపైనే కక్ష సాధింపులకు పాల్పడి వేధింపులకు దిగడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. నిరంకుశత్వానికి పరాకాష్ట. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ‘సాక్షి’పై వేధింపులు.. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించాలి. లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం. న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాం’ అంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నిరసనలు మిన్నంటించారు. ‘సాక్షి’పై కక్షగట్టడమేంటని ప్రశ్నించారు. తప్పొప్పులు జరిగితే ఖండించాల్సింది పోయి.. విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయించడం భావ్యం కాదన్నారు. పోలీసుల తీరును ఎండగట్టారు. చిత్తూరు అర్బన్ : వ్యవస్థలో లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్న పత్రికలపై కేసులు నమోదు చేయడం.. వేధింపులకు గురిచేయడం.. ప్రశ్నించే కలానికి సంకెళ్లు వేయడమేనని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాత్రికేయులపై కేసులు పెట్టడం దారుణమని ఎండగట్టారు. ప్రజాస్వామ్యమా.. నిరంకుశమా..? అంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వేధింపులు మానుకోవాలని డీఆర్ఓ మోహన్కుమార్కు వినతి పత్రం అందజేశారు. -
పార్టీ బలోపేతంలో గ్రామ కమిటీలు కీలకం
సదుం: పార్టీని బలోపేతం చేయడంలో గ్రామ కమిటీ సభ్యులు కీలకంగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మండలంలోని అమ్మగారిపల్లెలో పర్యటించారు. ఇటీవల నూతనంగా ఎంపికై నా పార్టీ గ్రామ కమిటీల విధి నిర్వహణపై నాయకులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు కీలకంగా పనిచేసేలా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అనంతరం రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, శ్రీధర్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, నారాయణ రెడ్డి, రమేష్రెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున, పురుషోత్తంరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీకు చేతనైంది చేసుకోండి
సాక్షి టాస్క్ఫోర్స్: మద్యం షాపును టెండర్లో దక్కించుకున్న లైసెన్సుదారునిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటన పూతలపట్టు మండలంలో చోటుచేసుకుంది. పూతలపట్టు పోలీసు స్టేషన్లో వారం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో అసలు పూతలపట్టులో ఏం జరుగుతుందో తెలియక అటు పాలకులు, ఇటు ప్రభుత్వాధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ‘ఒక లైసెన్సు దారునిపై ఇంత కేవలంగా మాట్లాడుతారా? మండలంలో మిగిలిన మద్యం షాపుల యజమానులు మాత్రం బెల్టు షాపులకు మద్యం సరఫరా చెయ్యొచ్చు. వాళ్లను మాత్రం వదిలేయొచ్చు. మా షాపు నుంచి బెల్టు షాపులకు పంపిస్తే మాత్రం దాడులకు తెగబడుతున్నారు. ఇదెక్కడి న్యాయం.. ప్రతి నెలా మీరు మా నుంచి మామూళ్లు తీసుకుంటున్నారు కదా. ఇదెక్కడి న్యాయం సార్. సమన్యాయం పాటించండి. కావాలనే మాపై నాలుగు సార్లు దాడులు చేశారు. మిగిలిన వాటిపై ఎందుకు చెయ్యడం లేదు. ఒక పోలీసుగా మీరు న్యాయం చేయాలి. మీరు చెప్పినట్లుగానే మేము చేస్తు న్నాం కదా. కానీ మాపై ఇలా కక్ష కట్టడం భాగాలేదు సార్. ఈ విషయంపై మీతో మాట్లాడాలని స్టేషన్కు వస్తే బయటకి పోరా అని అంటారా?. పోలీసు స్టేసన్ ఉన్నది మా సమస్యలు చెప్పుకుని వాటిని పరిష్కరిస్తారని. కానీ మీరేం చేస్తున్నారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తారా. ఈ విషయంపై ఐజీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం’.. అని రంగంపేట క్రాస్లో ఉన్నటువంటి ఓ మద్యం షాపు యజమాని పూతలపట్టు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీసు మీకు చేతనయ్యింది చేసుకోండి.. మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని వారిని బెదిరించాడు. ఈ ఉదంతంపై ఇప్పుడు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారింది. మండలంలో మునుపెన్నడూ లేని కొత్త సంప్రదాయానికి తెర లేవడంతో సంచలన ఘటనలకు పూతలపట్టు అడ్డాగా మారింది. సామాన్య ప్రజల్లో సైతం భయాందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
నాణ్యమైన మద్యాన్ని గుర్తించండి
చిత్తూరు అర్బన్: కల్తీ లేనటువంటి నాణ్యమైన్య మద్యాన్ని మొబైల్ యాప్ ద్వారానే గుర్తించవచ్చని జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ అన్నారు. శుక్రవారం చిత్తూరులోని మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ సురక్ష యాప్ పనితీరును మద్యం ప్రియులకు వివరించారు. మొబైల్ యాప్లో ఎకై ్సజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని మద్యం బాటిల్ వద్ద ఉన్న స్కాన్ చేస్తే నాణ్యమైన మద్యం వివరాల మొత్తం మొబైల్లోనే చూపిస్తుందన్నారు. ఇలాంటి వివరాలు రాకపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎకై ్సజ్ ఈఎస్ శ్రీనివాస్, అర్బన్ సీఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఈనెల 20న దీపావళి ఆస్థానం నేపథ్యంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి మొదలైన వాటిని నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్బాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,521 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,101 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
మహిళలను కించపరచడమా..సిగ్గు సిగ్గు
– ఎమ్మెల్యే థామస్పై చర్యలు తీసుకోండి కార్వేటినగరం : సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళలతో వెళ్లి కార్వేటినగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు ఆత్మగౌరవం, మహిళలే మాకు ఆరాధ్య దైవం అని గొప్పలు చెప్పుకునే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక మహిళ అయిన తనను పబ్లిక్లో కట్టూబొట్టు, వస్త్రధారణ పై అవహేళన చేస్తూ అవమానించడం బాధాకరమన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించక, మహిళలు ధరించే చీర, బొట్టు, నగలపై ఎమ్మెల్యే థామస్ అవహేళన చేస్తూ మాట్లాడడం దారుణమన్నారు. తన తండ్రి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపైన, తనపైన అనుచితంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హోదా రావాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు శేఖర్రాజు, మణి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రాధికరెడ్డి, జెడ్పీటీసీలు సుకుమార్, అన్బులగన్, సర్పంచ్ ధనుంజయవర్మ, నాయకులు వెంకటరత్నం, ధనశేఖర్యాదవ్, తౌకిర్ఖాన్, మహిళ నాయకురాలు మోహనకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై కినుక !
● గత ప్రభుత్వంలో ఎక్కడ ఆగాయో అక్కడే పనులు ● అసంపూర్తి ప్రాజెక్టు పనులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● 200 వందల ఎంసీఎఫ్టీ నీటిని ఒడిసిపట్టలేని వైనం ● ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హామీ విస్మరించిన చంద్రబాబు ● గత ఎన్నికల హామీ గాలికొదిలేసిన ప్రభుత్వం వర్షం నీరు సముద్రంపాలు వెంగంవారిపల్లి అడవిలో ప్రవహిస్తున్న నది పలమనేరు : జిల్లాలోని పడమటి ప్రాంతమైన పలమనేరులో సాగు, తాగునీటికి బోర్లపైన ఆధార పడాల్సిందే. వర్షాలు కురిసినప్పుడు చిన్న నదులు ప్రవహిస్తుంటాయి. అయితే ఆ నీటిని వడిసిపట్టే ప్రయత్నాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కౌండిన్య నదిపై కాలువపల్లి వద్ద వైఎస్ఆర్ హయాంలో జలాశయాన్ని నిర్మించారు. ఆపై వచ్చిన కిరణ్ కుమార్రెడ్డి, చంద్రబాబు సర్కార్ మిగిలిన ప్రాజెక్టుల విషయాన్ని గాలికొదిలేశాయి. గత ఎన్నికల్లో పలమనేరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సైతం కూటమి అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాని ప్రాజెక్టుల పరిస్థితి నేటికీ ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయింది. పలమనేరు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి ఇక్కడి నదులు ప్రవహించినప్పుడల్లా నీరు వృథాగా పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని మోర్థానా ప్రాజెక్టుకు చేరుతోంది. దీన్ని గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు రంగం సిద్ధం చేసింది. అయితే అప్పట్లో కోవిడ్, తదుపరి ఎన్నికల కారణంగా ఈ పనులు వివిధ ధశల్లో ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమైనట్టే. 3 ప్రాజెక్టుల నిర్మాణాలకు గత ప్రభుత్వంలో చర్యలు ప్రాజెక్టుల నిర్మాణంపై గత ప్రభుత్వంలో బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిపై రూ.22 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. దీనికి భూసేకరణకు అవసరమైన చెల్లింపులు జరిగి టెండర్ల ప్రకియలో పనులు ఆగాయి. వీకోట మండలంలోని దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు రూ.46.82 కోట్ల అంచనాలను గతంలోనే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. పలమనేరు మండలంలోని గంగన్నశిరస్సు ప్రాజెక్టు పనులు గతంలో మొదలై అర్థంతరంగా ఆగాయి. అయితే దీనిపై స్థానిక ఇరిగేషన్శాఖ రూ.27.37 కోట్ల కొత్త అంచనాలతో పబ్లిక్హెల్త్ శాఖకు పంపింది. అయితే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతున్నందున ప్రాజెక్టుకు ఇబ్బందికరంగా మారింది. ఇక బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి నది విషయం కనీసం ఇరిగేషన్ శాఖకు కూడా తెలియదు. మొత్తం మీద ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే గంగనశిరస్సు ప్రాజెక్టులో 55 ఎంసీఎఫ్టీ, కై గల్ రిజర్వాయర్ ద్వారా 45.27 టీఎంసీ, దుర్గమ్మ ఏరు ప్రాజెక్టు ద్వారా 56 , వెంగంవారిపల్లి 40 ఎంసీఎఫ్టీ మొత్తం ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 200 ఎంసీఎఫ్టీ దాకా నీటిని ఒడిసిపట్టినట్టే. దీంతో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. కూటమి హామీ ఇచ్చింది.. వదిలేసింది.. గత ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సైతం ఈ ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వీటి గురించి పట్టించుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పను లు ఎక్కడ ఆగాయో ఇప్పటికే అక్కడే ఉన్నాయి. జోరుగా ప్రవహిస్తున్న కౌండిన్య నది వీకోట మండలంలోని దుర్గమ్మ ఏరు ప్రవహిస్తున్న దృశ్యం పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కై గల్, దుర్గమ్మఏరు, వెంగంవారిపల్లి నదులు ముఖ్యమైనవి. వర్షాకాలంలో ఈ నదుల ప్రవహించినప్పుడు 150 నుంచి 200 ఎంసీఎఫ్టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)ల నీరు వృథాగా తమిళనాడు రాష్ట్రంలోని మోర్థనా ప్రాజెక్టుకు చేరి ఆపై బంగాళాఖాతంలో కలుస్తోంది. అయితే కౌండిన్య నదిపై రూ.55 కోట్ల వ్యయంతో పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రిజర్వాయర్ను నిర్మించారు. దీంతో 50 ఎంసీఎఫ్టీల నీటిని ఇక్కడ నిలుబెట్టుకోగలిగాం. ప్రస్తుతం నదులకు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిలో ప్రస్తుతం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరు కౌండిన్య నదిలో చేరి తమిళనాడులోని మోర్ధనా డ్యామ్కు వృథాగా వెళుతున్నాయి. అదే విధంగా పలమనేరు మండలంలోని ఎరగినేరి నది నీళ్లు సైతం తమిళనాడుకు చేరుతున్నాయి. వీకోట మండలంలోని దుర్గమ్మ ఏటి నీరు తమిళనాడుకే ఉపయోగపడుతున్నాయి. బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి అడవి లోని మరో నది ఇలా ఈ ప్రాంతంలోని అన్ని నదుల నుంచి ఏటా 200 ఎంసీఎఫ్టీ నీరు సముద్రం పాలవుతోంది. ప్రభుత్వానికి రివైజ్డ్ అంచనాలు పంపించాం గంగన్న శిరస్సు ప్రాజెక్టు పనులకు అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. కై గల్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉన్నాయి. దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు ఆర్థికశాఖ క్లియరెన్స్ రావాల్సి ఉంది. రెండు ప్రాజెక్టులకు రివైజ్డ్ అంచనాలతో ఇటీవలే అంచనాలను పెంచి ప్రభుత్వానికి పంపించాం. ఈ ప్రాజెక్టు పనులు త్వరగా మొదలుపెట్టేందుకు అవసరమైన ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. – లక్ష్మీనారాయణ, నీటిపారుదల శాఖ జేఈ -
కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
తవణంపల్లె : విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిర ఆదేశించారు. గురువారం మండలంలోని తొడత్తర హైస్కూల్, తొడత్తర మోడల్ స్కూల్ను తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. తొడత్తర మోడల్ స్కూల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. డిప్యూటీఈఓతో పాటు తవణంపల్లె ఎంఈఓలు హేమలత, మోహన్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సాక్షి మీడియాపై కేసులు అప్రజాస్వామికం
మీడియాపై రాజకీయ కక్ష తగదు ప్రభుత్వం గ త నాలుగు రోజులుగా సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. పోలీసులను ముందు పెట్టి జర్నలిస్టులను భయపెట్టా లని చూస్తున్నారు. ఇలాంటి చర్యలు మీడియా స్వేచ్ఛకు మంచిది కాదు. వార్తలపై అభ్యంతరం ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలి తప్ప ఇలా కేసులతో భయపెట్టి లొంగదీసుకోవాలని చూడడం అసాధ్యం. మీడియాను రక్షించాల్సిన వ్యవస్థలే కక్ష పూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. – ఆర్.మురళి, అధ్యక్షుడు, తిరుపతి ప్రెస్ క్లబ్మీడియాకు రాజకీయ కక్ష అప్రజాస్వామికం. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్షిలో కథనాలు ప్రచురించారని పత్రిక కార్యాలయాలపై పోలీసులు దాడిచేయడమేంటి? ఎడిటర్ను బెదిరించడం, కార్యాలయంలో సోదాలు చేయడం దారుణం. మీడియాపై అధికారులు ఇలా దాడులకు పాల్పడితే అది ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. ఈ విధానాన్ని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. – విజయ్ యాదవ్, జేశాప్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు -
ప్రతిభకు ప్రోత్సాహం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు కౌశల్ ప్రతిభా అన్వేషణ పోటీలు దోహదపడుతాయని డీఈవో వరలక్ష్మి అన్నారు. గురువారం డీఈవో కార్యాలయంలో కౌశల్ పోటీ పరీక్షల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులను కౌశల్ 2025 క్విజ్ పోటీలకు సిద్ధం చేయాలన్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ, ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 8,9 ,10 తరగతుల విద్యార్థులు అర్హులన్నారు. పాఠశాల స్థాయిలో నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు, జిల్లా స్థాయిలో 27, 28 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తారన్నారు. జిల్లా సమగ్ర శిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు కౌశల్ క్విజ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు హసన్భాషా, గణపతి, కౌశల్ పోటీల నిర్వాహకులు దామోదర్రెడ్డి, అరుణ్కుమార్, మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్ మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 79,919 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 28,218 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. వినాయక సదన్ తనిఖీ కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని వినాయక సదన్ను గురువారం ఈఓ పెంచల కిషోర్ తనిఖీ చేశారు. పాత సదన్తో పాటు కొత్తగా సముదాయాన్ని పరిశీలించారు. ఆ భవనంలోని ఫర్నీ చర్ శాంపిల్స్ను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. -
బాల్య వివాహాల కట్టడికి సహకారం
చిత్తూరు కలెక్టరేట్ : బాల్య వివాహాల కట్టడికి ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని తిరుపతి ఐసీడీఎస్ పీడీ వసంత అన్నారు. గురువారం జిల్లా పరిష త్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బాల్య వివాహాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల కట్టడికి ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే మరింతగా కట్టడి చేయవచ్చన్నారు. ఉమ్మడి చిత్తూరులో దాదాపు 4500 కు పైగా టీనేజీ గర్భిణులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. యుక్త వయసులో గర్భిణులు గా మారడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. -
కాసుల వైద్యం
కాణిపాకం : జిల్లాలో 1200పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. రిజిస్ట్రేషన్ కానీ ఆస్పత్రులు మరో 1000 దాకా ఉన్నాయి. అలాగే ల్యాబ్లు 900 ఉండగా..అనాధికారికంగా 7000పైగా నడుస్తున్నాయి. ప్రధానంగా పలు ఆస్పత్రుల్లో చూస్తే వెయ్యి..పట్టుకుంటే 5 వేలు అనేంతగా వైద్యుల తీరు మారింది. వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకోవాలంటే కన్సల్టెన్సీ ధర తక్కువలో తక్కువంటే రూ.500 నుంచి ఆరంభం. రూ.2 వేలు ఉండే ఆ ధరలు ఉన్నాయి. మందులు మా త్రం నెలకు రాసేస్తారు. అంటే నెల తర్వాత వస్తే మళ్లీ డబ్బులు సమర్పించుకోవాలి. అసలు నాడి పట్టుకోకుండా రోగి లోనికి వచ్చిన సమస్య ఏమిటని అడగడం మరుక్షణం నుంచే మందులు రాసేస్తారు.ఈ కన్సల్టెన్సీ ఫీజులపై నియం త్రణ లేకపోవడంతో రోగిని పిండేస్తున్నారు. ప్రస్తుత తరం వైద్యులను చూసి ఆ తరం వైద్యు లు మారిపోయారు. డబ్బే పరమావధిగా వైద్యం చేస్తున్నారు. దీంతో రోగులు.. వారి కూడా వచ్చే బంధువులు లబోదిబోమంటున్నారు. ఇష్టారాజ్యంగా వైద్య సేవలు చాలా వరకు రిజిస్ట్రేషన్ ఉన్న ఆస్పత్రులు ఫీజులు, వైద్యం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులను మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా వైద్యంతో పాటు ఆఫరేషన్లు, ప్రసవాలు చూస్తున్నాయి. ఆ అనుమతి లేని ఆస్పత్రుల్లో చాలా మంది వైద్యర్హాత లేని సిబ్బంది పనిచేస్తున్నారు. కొందరు మెడికల్ షాపుల్లోనే ప్రైవేటు క్లినిక్లు, ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుని దర్జాగా చికిత్సలు చేస్తున్నారు. కాసులు సముపార్జనే ధ్యేయంగా జరుగుతున్న ఈ దందాకు వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతిలేని ఆస్పత్రులు చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధిలోనే పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే మిట్టూరు, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, చర్చివీధి తదితర ప్రాంతాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్లేని ఆస్పత్రులు దర్శనమిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఉంది.కమీషన్ల వ్యాపారం వైద్యో నారాయణో హరి అన్నది ఒకప్పటి నానుడి.. ఎందుకంటే అప్పటిలో వైద్యుడు దేవుడిలా ఉండేవాడు.. వైద్యమూ అలాగే చేసేవారు.. నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేవారు.. రోగిని చూసి వైద్యం చేసేవారు.. మరిప్పుడు అంతా మారిపోయింది.. రోగి చెప్పింది వినాలంటే (కన్సల్టెన్సీ) రూ.500 నుంచి రూ.1000.. మరీ డిమాండ్ ఉంటే రూ.2 వేలు.. ఒకసారి చేయి పట్టుకుంటే (ఐసీయూ) రూ.10 వేలు..ఆ తరువాత టెస్ట్లు.. మందులు షరా మామూలే.. రోగి నుంచి ఇష్టానుసారం పిండేస్తున్నారు.. ఎమర్జెన్సీ ఆసుపత్రుల్లో అయితే మరీనూ.. లక్షలు ఉంటేనే వైద్యం.. లేదంటే దైన్యమే.. ప్రైవేటు వైద్యంపై ప్రభుత్వ నియంత్రణ కొరవడడంతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక అనుమతులు లేని ఆస్పత్రులు రెచ్చిపోతున్నాయి. ఆసుపత్రి కెళ్తే జేబు ఖాళీ.. ఇవాళ వైద్య రంగంలో కాసుల కక్కుర్తి తప్ప మానవతా దృక్పథం, నైతిక విలువలు కొరవడడంపై సర్వత్రా విమర్శలు విపిస్తున్నాయి. రోగి వ్యాధిని డబ్బుతో తూకం వేయడం మితి మీరిపోయింది. డాక్టర్లు టార్గెట్లు రీచ్ కావడానికి అవసరం లేకపోయినా ఎక్స్రే, స్కానింగ్, మందులు రాసేస్తున్నారు. ఆస్పత్రులకు పట్టుకొన్న మరో జాడ్యం మందులు (మెడిసిన్). సొంతగా ఆస్ప త్రుల్లోనే మెడికల్ షాపులు ఉండడంతో ప్రిస్క్రిప్షన్న్ నిండిపోయే వరకూ మందులు రాసేస్తున్నారు. దీని వెనుక ఆశ్చర్యపోయే మాయ దాగి ఉంది. గతంలో మందుల తయారీ కంపెనీలు రిప్రజెంటెటివ్స్ని నియమించుకొని వాళ్లను డాక్టరు వద్దకు పంపించి ప్రొడక్టును ప్రచారం చేసుకోవడం జరిగేది. దీనిని ఎథికల్ మార్కెటింగ్ అనే వాళ్లు. ఆ ప్రొడక్టును ఎక్కువగా రాసినందుకు తాయిలాలుగా వచ్చేవి. ఈ పద్ధతి ఇప్పటికీ ఉన్నా బాగా తగ్గింది. ఇప్పుడు కొత్త ఒరవడి వచ్చింది. బెంగుళూరు, చైన్నెలతో పాటు పలు చోట్ల మందుల తయారీ కంపెనీలు కోకొల్లలుగా ఉంటాయి. ఆయా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున మందులు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇవి వైద్యులకు చాలా తక్కువ ధరకు వస్తాయి. వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తారు.అందుకే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మందులు రాస్తుంటారు. గ్యాస్ట్రిక్ లేకపోయినా గ్యాస్ ట్యాబ్లెట్ రాసేయడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. వైరల్ ఫీవర్కు యాంటి బయోటిక్ రాయకూడదు.అసలు యాంటి బయోటిక్స్ తక్కువగా సూచించాలని ఆ తరం వైద్య నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అయినా తమ మెడికల్ షాపుల వ్యాపారం కోసం వైరల్ ఫీవర్కు యాంటి బయోటిక్స్తో చీటీలో నింపేస్తున్నారు. కాసుల కక్కుర్తితో రాసే మందులు వ్యాధి నయం మాట అటుంచితే కొత్త రోగా లు చుట్టు ముడుతున్నాయి. చివరికి రోగి ఒళ్లు, ఇల్లు గుల్లవుతోంది. చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల విషయంపై నిఘా పెట్టాం. ఇదివరకే రిజిస్ట్రేషన్ ఉన్న ఆస్పత్రులతో పాటు రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రి వివరాలను సేకరించాలని ఆదేశించాం. ఆ బాధ్యత డెమో సెక్షన్ వాళ్లు చూస్తున్నారు. చిత్తూరు నగరంలో ఎక్కడెక్కడ అనుమతులు లేని ఆస్పత్రులు ఉన్నాయో చూస్తాం. అధిక ఫీజు వసూళ్లు చేసే ఆస్పత్రులపై కొరడా ఝలిపిస్తాం. అలా జరిగితే ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – సుధారాణి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు అధిక శాతం ఆస్పత్రులు కమీషన్లతో లాభాలు గడిస్తున్నాయి. ఆర్ఎంపీ, పీఎంపీ ఆయా ఆస్పత్రుల్లో ఎన్రోల్ చేయించుకొని పేషెంటును రిఫర్ చేస్తే కొంత మొత్తం లేదా 40 శాతం వరకూ కమీషన్ ముట్టజెబుతున్నారు. అందుకే ఈ మధ్య నగరాల్లోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో గ్రామీణ రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక స్కానింగ్, ఎక్స్రే తదితర టెస్టులకు తమ వద్దకు పంపిస్తే లేబోరేటరీలు ఆయా ఆస్పత్రులకు 50 శాతం వరకూ కమీషనన్ రూపంలో ఇస్తున్నాయి. ఫలానా ల్యాబ్కు మాత్రమే వెళ్లాలని ఆస్పత్రుల్లో సూచించడం, వేరే దగ్గర చేయించుకొంటే తిరస్కరించడం, స్పష్టంగా ఫలితాలు రాలేదని చెప్పడం దాదాపుగా అందరికీ అనుభవమే. దీనికి ఆ కమీషన్ల కక్కుర్తే కారణం. ఓ వ్యక్తి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షకు ఓ ల్యాబ్కి వెళ్లారు. రూ.1200 అవు తుందని వాళ్లు చెప్పారు. ఆ వ్యక్తి డాక్టరు ఫోన్్ చేసి వారికి ఇచ్చారు. తాను వేరే ఊరి డాక్టరునని, తనకు కమీషనన్ వద్దని చెప్పడంతో రూ.600 మాత్రమే ల్యాబ్ వారు బిల్లు వేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడు ఎందుకు కన్నీరు పెడుతోందో చెప్ప డానికి ఈ ఉదాహరణలు మచ్చు తునకలు మాత్రమే సుమా!.. రోజూ ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. -
మహిళలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
– మహిళలపై గౌరవం లేని పార్టీ టీడీపీ శ్రీరంగరాజపురం : మహిళలు అంటే గౌరవంలేని పార్టీ టీడీపీ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని ముద్దుకుప్పంలోని విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దళిత మహిళ అయిన తనను అవమానకరమైన రీతిలో సభ్య సమాజం తలదించుకొనేలా ఏక వచనంతో అసభ్యకర పదజాలంతో మాట్లాడటం దారుణమన్నారు. ఈ సృష్టికు మూలం మహిళ అలాంటి వారి గురించి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం మహిళలందరినీ అవమానించినట్టేనని అన్నారు. తన చీరల గురించే మాట్లాడం కంటే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై మాట్లాడాలని, వాటిని పరిష్కరించాలన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సహకరిస్తాం, అంతేకానీ మహిళల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను అవమానిస్తూ మాట్లాడటాన్ని జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మహిళ లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యం తిరుపతి కల్చరల్: ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సౌత్ ఇండియా ఓబీసీ వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగిన సౌత్ ఇండి యా ఓబీసీ సెమినార్లో దక్షిణాదితోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఓబీసీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతోపాటు సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన శాసీ్త్రయ పద్ధతిగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన తమ వాటా హక్కు లను తమకు కేటాయించాలన్నారు. తెలంగాణ తరహాలో 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
అలా ముగించేశారు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశాలను మొక్కుబడిగా మార్చేశారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనప్పుడల్లా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వెల్లడిస్తున్నా జిల్లా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపణలు గుప్పించారు. క్షుణ్ణంగా నిర్వహించాల్సిన 1 నుంచి 7 స్థాయీ సంఘాల సమావేశాలు మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించి మమ అనిపించేశారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ సమావేశాలకు చిత్తూరు, తిరుపతి, అన్న మయ్య జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు. ప్రతి సమావేశానికి పూర్తి స్థాయిలో అధికారులు గైర్హాజరవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. ఇలాంటి స్థాయి లేని సమావేశాలను నిర్వహించి ఎలాంటి లాభమూ లేదని జెడ్పీటీసీలు నిట్టూర్చారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, 5 వ స్థాయి సంఘం చైర్పర్సన్ భారతి, జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టిసారించండి సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయన్నా రు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ పాఠశాలల బలోపేతం కోసం నిర్వహించిన నాడు–నేడు పనుల నిధులు చాలా పాఠశాలల ఖాతాల్లో ఉన్నాయన్నారు. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా నిబంధనల మేరకు ఖర్చు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. హాజరుకాని కూటమి ఎమ్మెల్యేలు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరు కావాల్సిన కూటమి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టా రు. అదే విధంగా తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి పలు శాఖల జిల్లా అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపారు. దీంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు సిబ్బంది సమా ధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. బాధ్యతగా హాజరు కావాల్సిన జిల్లా అధికారులు గైర్హాజరు కావడంతో సభ్యులు విమర్శలు గుప్పించారు. ప్రతిసారి ఏదో ఒక సాకుతో గైర్హా జరవుతున్న జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరయ్యే ప్రజల సమస్యలను చర్చించాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా హాజరు కాకపోవడంపై విమర్శలు గుప్పించారు. చర్చించిన సమస్యలు ఇలా..... కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్ని స్తున్నారని, ఎందుకు మంజూరు చేయడంలేదని సదుం జెడ్పీటీసీ సోమశేఖరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్లో గ్రామా ల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోయారు. బిల్లులు అప్లోడ్ చేసేందుకు చిత్తూరు జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇస్తే తిరుపతి జిల్లాలో మాత్రం మార్చి 6వ తేదీ వరకు సమయం ఇవ్వడం ఏమిటని డ్వామా అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నా యని వాటిని పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ లకు రైతులు నెలల తరబడి నిరీక్షిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో 50కి పైగా ఆసుపత్రులు ఉంటే కొత్తగా ఏర్పాటు చేసిన అశ్విని ఆసుపత్రిని మాత్రం అన్నమయ్య వైద్యశాఖ అధికారులు లంచం కోసం సీజ్ చేశారని పీలేరు జెడ్పీటీసీ రత్నశేఖర్ ఆరోపించారు. జగనన్న కాలనీ ఏర్పాటుకు భూమి చదును చేసి ఎర్రమట్టి పోసి ప్లాట్లు కేటాయించగా, అందుకు ఖర్చు చేసిన నిధులను అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద విడుదల చేసిన నోటిఫికేషన్ అనుమతి లేకుండా విడుదల చేశారనే ఆరోపణలున్నట్లు గుడుపల్లి జెడ్పీటీసీ కృష్ణమూర్తి అన్నారు. ఇలా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న బడుల ను మూసివేయడం దారుణమని సభ్యులు మండిపడ్డారు. ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి ఎదురవుతోందని సదుం జెడ్పీటీసీ సోమ శేఖర్రెడ్డి విమర్శించారు. సదుం మండలంలో ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తామన్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు ఎలాంటి అటెండెన్స్ లేకుండా నష్టపోతున్నారని చెప్పారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థులను తీసుకెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
కేసులతో మీడియాను భయపెట్టలేరు
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..! వార్తల్లో ఏవైనా అభ్యంతరం ఉంటే సరైన ఖండన ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా కేసులు పెట్టి మీడియాను భయపెట్టాలని చూడడం సరైనది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సాక్షి ఎడిటర్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. పోలీసుల ద్వారా మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదు. మీడియా పైన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి. – కె. గిరిబాబు, రాష్ట ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ మీడియాకు సంకెళ్లు వేయడం అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసినట్లే. పత్రికల్లో ప్రచురించే కథనాలపై కేసులు పెట్టడం అన్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. పోలీసులను ముందు పెట్టి మీడియాను తన అదుపులోకి ఉంచుకోవాలని ప్రభుత్వం చూడడం సిగ్గుచేటు. పోలీసు కేసులతో మీడియాను కట్టడి చేయాలన్న ఆలోచన సరైంది కాదు. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి. – పి. బాలచంద్ర, జనరల్ సెక్రటరీ, తిరుపతి ప్రెస్ క్లబ్ -
కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్
బంగారుపాళెం : కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అన్యాయాలకు డిజిటల్ బుక్ సమాధానం చెబుతుందని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అన్నా రు. గురువారం మండలంలోని నల్లంగాడు, శెట్టేరి, తూంపాయనపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలు, అను బంధ విభాగాల కమిటీ నియాయక సమావేశాలను డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడి పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ప్రభు త్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కుమార్రాజా, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలు లలిత కుమారి, సర్పంచ్ ధనుంజయరావు, ఉపసర్పంచ్ శంకర్, ఎంపీటీసీ ఉషశ్రీ, మాజీ సింగిల్ విండో, ఏఎంసీ అధ్యక్షులు దత్తాత్రేయరెడ్డి, కృపాసాగర్రెడ్డి, రాష్ట్ర సామాజిక మాధ్యమాల సంయుక్త కార్యదర్శి కిషోర్కుమార్రెడ్డి, జిల్లా కార్యదర్శి గోవిందరాజులు, జిల్లాట్రేడ్ యూనియన్ కార్యదర్శి రఘుపతిరాజు, సీనియర్ నాయకులు పాలాక్షిరెడ్డి, ధామస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజ, యూత్ అధ్యక్షుడు గజేంద్ర పాల్గొన్నారు. -
యువత అన్ని రంగాల్లో రాణించాలి
చిత్తూరు కలెక్టరేట్ : యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విజయం కళాశాల ప్రాంగణంలో మై భారత్ ఆధ్వర్యంలో సమితి స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా యువజన అధికారి మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడా పోటీల్లో రాణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. మై భారత్ ప్రాంగీయ గణాంక అధికారి బాబురెడ్డి, విజయం కళాశాలల ఏవో రాజగోపాల్నాయుడు, యూత్ ఫర్ సేవా అధ్యక్షుడు హరీష్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. -
గుజ్జు లాగేశారు!
ఏడాది పాటు చెమటోడ్చి కష్టించే మామిడి రైతులంటే అందరికీ అలుసుగా మారింది. తోతాపురి మామిడి రైతులను ఈ ఏడాది ఎన్నడూ లేనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. పంట విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో కుటుంబ అవసరాలు, చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న కర్షకుల ఆశలు అడియాశలయ్యాయి. తోతాపురి విక్రయంలో అన్ని దశల్లోనూ పుడమి పుత్రులు దగా పడ్డారు. కాణిపాకం: మామిడి కాయల విక్రయంలో బినామీ లెక్కలకు రెక్కలొచ్చాయి. అక్రమాలు పరిశీలన పక్కదారి పట్టింది. అసలు లెక్కలను అధికారులు తోసిపుచ్చారు. బోగస్ లెక్కలను తేల్చలేకపోయారు. తద్వారా ప్రభుత్వం అందించిన మామిడి ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపు దుర్వినియోగమైందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రా యితీ పోయినా ఫ్యాక్టరీ చెల్లించాల్సిన రూ.8 కోసం రోడ్డెక్కారు. రైతు సంఘం నేతల గొంతు నొక్కేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి అవకతవలను నివారణకు జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చి కాయలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.12 గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీలు కిలో రూ.8 చెల్లించేలా, ప్రభుత్వం ప్రోత్సాహక నిధి కింద రూ.4 చెల్లిస్తామని వెల్లడించింది. అయితే కాయల విక్రయానికి టోకెన్ల పద్ధతి ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో రాయితీపై కన్నేసిన కొందరు అక్రమాలకు తెగబడ్డారు. మధ్యవర్తుల దందా.. మామిడి కొనుగోలు సమయంలో ఫ్యాక్టరీల వద్ద కొందరు కాపు కాచారు. కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పి టోకన్లను అమ్ముకున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో పండిన కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించారనే వాదనలు వినిపించాయి. ఈ దోపిడీ జోరుగా సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై తమిళనాడు సరిహద్దులో నిఘా పెట్టారు. దీనికితోడు వ్యాపారులను బుట్టలో వేసుకుని కూటమికి చెందిన కొందరు ప్రభుత్వ ప్రోత్సాహక నిధి దోపిడీకి తెరలేపారు. ర్యాంపులను అడ్డం పెట్టుకుని కాయలు కాటా వేసి, బోగస్ పేర్లు, బిల్లులు సృష్టించారు. ఇలాంటివి బంగారుపాళెం, కుప్పం, వి.కోట, పలమనేరు, సోమల తదితర ప్రాంతాల్లో జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే నీలం కాయలను కూడా ర్యాంపులకు తరలించి తోతాపురి లెక్కల్లోకి ఎక్కించారని ఆరోపణలు భగ్గుమన్నాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ మామిడి దినోత్సవ సభలో భగ్గుమన్నారు. బోగస్ లెక్కలను బయటకు తీస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే అధికారులు పరిశీలన పేరుతో జాప్యం చేసి తమ చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ర్యాంపుల వద్ద లెక్కలు గందరగోళంగా ఉండడంతో ఏం చేయలేక మిన్నకుండిపోయినట్లు సమాచారం. రూ.8 మాటేంటీ..ప్రభుత్వం తోతాపురికి ప్రకటించిన మద్ధతు ధర విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రూ.4 ప్రోత్సాహక నిధి చెల్లించి..చేతులు దులుపుకుంటోంది. అయితే ఫ్యాక్టరీ నుంచి కిలో రూ.8 ఇవ్వాల్సి ఉండగా..దీనిపై నోరువిప్పడం లేదు. ఇది వరకే కొన్ని ఫ్యాక్టరీలు కిలో రూ.5 చెల్లించగా రైతులు భగుమంటున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రైతు సంఘ నాయకులు అక్రందన సభ నిర్వహణకు సిద్ధపడ్డారు. బుధవారం బంగారుపాళెం మండలంలోని మార్కెట్యార్డులో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కూటమికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి రైతుల సంఘం నాయకులకు బెదిరింపులు వస్తున్నాయి. సభను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్ధతు ధరపై పోరాడుతున్న రైతు నాయకులను అడ్డుకుంటే భవిష్యత్ ఉండదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిధి మంజూరుతో ఇలా.. అధికారులు పరిశీలన పూర్తి చేసి ఇచ్చిన నివేదికలపై రైతులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి చిత్తూరుజిల్లా వ్యాప్తంగా 31,929 మంది రైతులు 79,963 సార్లు కాయలు తరలించగా 3.67లక్ష టన్నుల కాయలు విక్రయించినట్లు లెక్కకట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.146 కోట్ల మేర నిధులు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ చెల్లింపులపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోగస్ లెక్కలు తేల్చకుండా నిధులు జమ చేయడంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అమ్మకాలు..చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది తోతాపురి రకం 39,895 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు కాగా 4.99 లక్షల టన్నుల కాయలు దిగుబడి వచ్చినట్లు అధికారుల అంచనా వేశారు. మొత్తం 43 ఫ్యాక్టరీలుండగా 31 ఫ్యాక్టరీలు కాయల కొనుగోలు చేశాయి. ఈ ఫ్యాక్టరీ లు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేయగా.. 25 ర్యాంపులు 30,600 మంది రైతుల నుంచి 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేసినట్లు అధి కారులు అప్పట్లో నివేదికలిచ్చారు. బోగస్ లెక్కలు తేల్చాలి కొన్ని ర్యాంపుల్లో ప్రభుత్వ నిధిని దోచుకోవాలని బోగస్ లెక్కలు చూపించారు. ఆ లెక్కలు తేలకుండా నిధి జమ చేశారు. దీంతో ప్రజానిధి పక్కదారి పట్టిందని భావిస్తున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఆ బోగస్ లెక్కలు తేల్చాలి. అలాగే ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 ఇవ్వాలి. ఇందుకు అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని సభకు పూనుకున్నాం. – ఉమాపతినాయుడు, మామిడి రైతు సంఘ ఉపాధ్యక్షులు ఫ్యాక్టరీల నుంచి రూ. 8 ఇప్పించాలి ప్రభుత్వం తోతాపురికి మద్ద తు ధరగా కిలో రూ.12 ప్రకటించింది. ఆ ప్రకారమే రైతు లకు నగదు ఇప్పించాలి. ఫ్యా క్టరీలు కేజీకి రూ. 5 ఇస్తే ఒప్పకోం. కచ్చితంగా రూ.8 ఇవ్వా ల్సిందే. ఇవ్వని ఫ్యాక్టరీ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈనేపథ్యంలోనే బంగారుపాళ్యంలో అక్రందన సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను అడ్డుకోవద్దు. మేము రైతుల కోసం పోరాడుతున్నాం. ఇందుకు అందరు సహకరించాలి. – జనార్దన్, మామిడి రైతు సంఘ అధ్యక్షులు ఇంకా చేయాల్సింది ఉంది మామిడి కొనుగోలుపై పరిశీలన చేపట్టాం. పరిశీలనలో చాలా వరకు తీసేశాం. ఇంకా పరిశీలన చేయాల్సి ఉంది. చేస్తాం. ఏదైనా అనుమానం ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కచ్చితంగా స్పందిస్తాం. చర్యలు తీసుకుం టాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అనుమానాలు వద్దు. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, చిత్తూరు -
రైతుల సమక్షంలోనే భూ రీసర్వే
నిండ్ర : మండలంలో జరుగుతున్న ముడో విడత భూ రీసర్వే పనులను రైతుల సమక్షంలోనే చేయాలని సర్వేయర్ ల్యాండ్ రికార్డు జిల్లా అధికారి జయరాజ్ అన్నారు. బుధవారం నిండ్ర మండలం కేఆర్ పాళెంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసర్వేకు మందు ప్రతి రైతుకు ముందుగానే విషయం తెలిపి నోటీసులు అందించి వారి సమక్షంలోనే భూమిని సర్వే చేసి రికార్డులను తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో నగరి డివిజన్ అధికారి ప్రసాద్ రావు, తహసీల్దార్ శేషగిరిరావు, మండల సర్వేయర్ వెంకటేశు, తదితరులు పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లు!
నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ..కూటమి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ..చిత్తూరు అర్బన్ : ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను పాత్రికేయులు ఎత్తిచూపితే అధికారులు, పాలకులు పొరపాట్లను సరిచేసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రశ్నించే పత్రికలపై కేసులు పెడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ హక్కుకు సంకెళ్లు వేస్తున్నారు. మద్యంపై వార్తలు రాస్తున్నందుకు ‘సాక్షి’ పత్రికపై కక్షగట్టి కేసులు పెడుతున్నారు. జిల్లాలో కేసులు ఇలా.. పత్రికలో ఏదైనా కథనం ప్రచురితమైతే అందులో ఉన్న విషయాన్ని గుర్తించి, లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. తప్పుచేసిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోచ్చు. కథనంలో ఏదైనా తప్పుగా ఉందనిపిస్తే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు. న్యాయపరంగా ముందుకు వెళ్లొచ్చు. ఇవన్నీ వదిలేసి వార్తలు రాసిన పాత్రికేయులే లక్ష్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జర్నలిస్టులపై కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ● కుప్పం రూరల్ మండలంలో ఒకరు చనిపోతే శ్మశాన వాటికలో ఓ వర్గం అనుమతించలేదని, స్థానికంగా పోలీసులు కల్పించుకోవడంలో పరిస్థితి సద్దుమణిగిందంటూ సాక్షితో పాటు ఇతర పత్రికల్లోనూ వార్తలు ప్రచురితమయ్యాయి. కానీ స్థానిక సాక్షి విలేకరి నాగరాజుపై స్థానిక కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది జూన్లో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ● కుప్పంలో హంద్రీ–నీవా కాలువ గేట్లలోకి పాము వచ్చిందని, గేటు మరమ్మతు చేసే సమయంలో నీళ్లు ఆగాయంటూ ‘సాక్షి’లో వార్త ప్రచురితమయ్యింది. దీన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో గతనెల ‘సాక్షి’ రిపోర్టర్లపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ● పుంగనూరులో ఓ మైనర్ బాలిక కనిపించలేదని పోలీసులు మీడియాకు చెప్పడంతో గతేడాది వార్త ప్రచురించారు. అయితే బాలిక హత్యాచారానికి గురయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలి, నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలు రాసినందుకు సాక్షి ఎడిటర్తో పాటు స్థానిక విలేకరి ప్రకాష్పై కేసు పెట్టారు. ● తిరుమలలో కల్తీనెయ్యి వ్యవహారంపై పాలకులు ఆరోపణలు చేయడం, దీనిపై సుప్రీం కోర్టు కల్పించుకుని విచారణకు ఆదేశించడం తెలిసిందే. తిరుమలలో జరిగి వాస్తవాలు బయటపెట్టినందుకు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఒకరి ఫ్లెక్సీ మరొకరు తొలగిస్తుండగా తొట్టంబేడు ‘సాక్షి’ రిపోర్టర్ హరీష్రెడ్డి వీడియో తీశారు. దీనిపై వార్త రాసినందుకు ఏప్రిల్లో అతని పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోనూ దారుణ పరిస్థితి.. మొలకచెరువులో కల్తీ మద్యం తయారుచేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇది సరఫరా కావడంపై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్కు నోటీసులు ఇవ్వాలని బుధవారం ఏకంగా హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రశ్నల పేరిట ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డికు సైతం నోటీసులు ఇచ్చి, విచారణ పేరిట స్టేషన్కు పిలిపించారు.ఆక్షేపణీయం జర్నలిస్టులను ఏ ప్రభుత్వమైనా జర్నలిస్టులుగానే చూడాలి. యాజమాన్యాలతో ముడిపెట్టొద్దు. వాస్తవాలను రాసిందుకు కేసులు పెడుతూ పోవడం మంచి పద్ధతికాదు. ఇది ప్రతికా స్వేచ్ఛను హరించడమే. ఆది ఆక్షేపణీయం. – మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజేభావ వ్యక్తీకరణపై దాడి.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కుతో పాటు భావ వ్యక్తీకరణ వ్యక్త పరిచే హక్కును కల్పించింది. ప్రభుత్వాల్లో జరిగే తప్పులకు పత్రికలు ఎత్తి చూపిస్తాయి. ఇందులో తప్పేం ఉంది. ఆ మాత్రం దానికి పత్రికా కార్యాలయాల్లో సోదాలు చేయడం, పాత్రికేయులపై కేసులు పెట్టడం సరైంది కాదు. – కెఎం.అశోక్కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజేపోరాటలే శరణ్యం పత్రికలు, పాత్రికేయులపై కేసులు పెట్టి నోళ్లు మూయిస్తామనుకునే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. జిల్లాలో పలువురు పాత్రికేయులపై కేసులు పెట్టారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఆందోళనలు చేస్తున్నాం. మున్ముందు ఇలాంటివి కొనసాగితే రోడ్డెక్కి పోరాటాలు చేయక తప్పదు. – కాలేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే -
‘బ్లాక్రైస్’ బంగారమే!
పలమనేరు : సాధారణంగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. వరి పంట కాలం నాలుగు నెలలు మాత్రమే. అద్భుతమైన ఔషధ గుణాలున్న బ్లాక్ రైస్ రకం ఇప్పుడు రైతులకు వరంగా మారింది. గతంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలో అక్కడి పూర్వీకులు సహజ పద్ధతిలో సాగు చేస్తూ వరి విత్తనాలను కాపాడుకుంటూ వచ్చారు. అవే నేటి తరాలకు అందుబాటులోకి వస్తున్నాయి. తమిళనాడు ప్రాంతం నుంచి మాపిళ్ళైసాంబ( బ్లాక్రైస్) విత్తనాలను తెచ్చి పలమనేరు మండలంలోని కూర్మాయి వద్ద ఓ ప్రకృతి రైతు చందూల్ కుమార్ ప్రయోగాత్మకంగా ఈ వంగడాన్ని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. ఊపందుకున్న సాగు పలమనేరు మండలంలోని కూర్మాయి గ్రామం వద్ద చందూల్ కుమార్ అనే ప్రకృతి రైతు మూడేళ్లుగా బ్లాక్ రైస్ను సాగు చేస్తున్నాడు. ఈ విడత సైతం తన ఎకరా పొలంలో ఈ వంగడాన్ని నాటాడు. ప్రస్తుతం వరి పంట ఆరు అడుగులకు పైగా పెరిగి ఏపుగా ఎన్ను పట్టింది. రైతు పూర్తిగా సేంద్రియ, సహజ పద్ధతిలో పంట సాగు చేశాడు. సాధారణంగా వరి పంట కాలం నాలుగు నెలలుగా ఉంటే దీనికి ఏడు నెలలుగా ఉంటుంది. ఈ రైతు పండించిన ఈ రకాన్ని చుట్టు పక్కల ప్రాంతాలే కాదు కర్ణాటక నుంచి సైతం రైతులు సందర్శించి వెళుతున్నారు. ఈ విడత పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో 30 ఎకరాల్లో బ్లాక్రైస్ సాగు అవుతోంది. దేశవాళి వరి వంగడాల్లో అగ్రస్థానం హరితవిప్లవం తర్వాత పలు రకాల హైబ్రిడ్ వరి వంగడాలు సృష్టించబడి రెండు వేల దాకా వంగడాలు సాగులో ఉన్నాయి. అనాదిగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దేశవాళి రకాలు వంశపారం పర్యంగా సాగులో ఉంటూ ఆ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి 26 కాగా వీటిలో అత్యంత పోషకాలు కలిగిన ఔషధ గుణాలున్న వరుసలో తొలిస్థానం మాత్రం బ్లాక్రైస్దే, అందుకే మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. కిలో ధర రూ.200 పైమాటే... దుకాణాల్లో బ్లాక్ రైస్ పెద్దగా అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పలు కంపెనీలు కిలో నుంచి మూడు, ఐదు కిలోల బ్యాగుల్లో వీటిని ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. డీమార్ట్, బిగ్బాస్కెట్ లాంటి మాల్స్లోనూ అందుబాటులో ఉన్నాయి. కిలో రూ.160 నుంచి రూ.250 దాకా కంపెనీలను బట్టి ధరలున్నాయి. -
జూడో జిల్లా పోటీలకు ఎంపిక
వడమాలపేట (పుత్తూరు) : ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 జూడో జిల్లా జట్టుకు వడమాలపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. బుధవారం తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వడమాలపేట విద్యార్థినులు గీతశ్రీ 40 కిలోల విభాగం, అంజలి 48 కిలోల విభాగంలో ప్రథమ స్థానాలను కై వసం చేసుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లా జూడో జట్టుకు ఎంపికయ్యారు. వీరు అక్టోబర్ చివరి వారంలో శ్రీసత్యసాయి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను స్కూల్ హెచ్ఎం కరుణా నవనీతం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
ఎర్రచందనం దుంగల కారు బోల్తా
బంగారుపాళెం: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కారు బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలంలోని కాటప్పగారిపల్లె వద్ద బోల్తాకొటింది. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారున్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు(కేఏ05–ఎండి4456) కాటప్పగారిపల్లె సమీపంలోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారిపై ఎడమ వైపు నుంచి డివైడర్ను ఢీకొని కుడివైపునకు దూసుకుపోయింది. కల్లూరుపల్లె పంచాయతీ, కొరివారిపల్లె నుంచి బంగారుపాళ్యానికి వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని రహదారి పక్కన గల కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొరివారిపల్లెకు చెందిన వెంకటస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. బంగారుపాళెం ఎస్ఐ ప్రసాద్, సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ద్విచక్రవాహన దారున్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రచందనం దుంగలను కారులో అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు అప్పటికే పారిపోయారు. బోల్తాపడిన కారులో 9 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. పారిపోయిన స్మగ్లర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారుతో సహా ఎర్రచందనం దుంగలను పోలీస్ స్టేషన్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటస్వామిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎర్రచందనం దుంగలు ఎక్కడికి తీసుకువెళ్తునారో? గతంలో తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల నుంచి బెంగళూరుకు ఎర్రచందనం అక్రమ రవాణా సాగేది. ఈ క్రమంలో బంగారుపాళెం స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ కేసులు నమోదయ్యాయి. కొన్ని సందర్భాలాలో ఇలా అక్రమంగా దుంగలు తరలిస్తూ కార్లు, టెంపోలు బోల్తాపడిన సంఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు బెంగళూరు నుంచి చైన్నె వైపు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా పోలీసులకు సైతం పలు అనుమానాలకు తావిస్తోంది. బెంగళూరు నుంచే వస్తున్నాయా? లేక జిల్లాలో ఎక్కడైనా డంప్ చేసి వాటిని తరలిస్తున్నారా..? అనే అనుమానం కలుగుతోంది. -
ప్రయాణికుల పడిగాపులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కర్నూలులో గురువారం జరిగే పీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు జిల్లా నుంచి 250 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ఈ బస్సులు బుధవారం ఉదయం కర్నూలుకు బయలు దేరాయి. దీంతో అత్యధిక శాతం గ్రామీణ బస్సు సర్వీసులు రద్దయ్యాయి. దీంతో పాటు ఎక్స్ప్రెస్, సప్తగిరి బస్సులను కూడా పంపించేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం చిత్తూరుకు వచ్చిన ప్రయాణికులు తిరిగి వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. గత్యంతరం లేక ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కుప్పం : పీఎం సభ జన సమీకరణ కోసం కుప్పం ఆర్టీసీ నుంచి 71 బస్సులను బుధవారం తరలించారు. కుప్పం ఆర్టీసీ డిపోలో నడస్తున్నదే కేవలం 97 సర్వీసులు వీటిలో 71 బస్సులను సభలకు కేటాయించారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరో మూడు రోజులు ప్రయాణికులకు అవస్థలు తప్పేలాలేవు. -
రైతులకు అన్యాయం
బంగారుపాళెం : మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ వారి కడుపు కొడుతోందని మామిడి రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బ్రహ్మానందాశ్రమం ఆవరణలో జిల్లా అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షతన మామిడి రైతు ఆక్రందన సభ నిర్వహించారు. గుజ్జు యజమానుల నుంచి అందాల్సిన రూ 370 కోట్లు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగించాల్సిందేనన్నారు. ఏపంటకూ గిట్టుబాటు లేదు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర అందడంలేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ముఖ్యమంత్రికి చిత్తశుద్థి ఉంటే గుజ్జుయజమానులను కట్టడి చేయడం పెద్ద పనికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు గుజ్జు ఫ్యాక్టరీ యజమానులకే అండగా ఉంటోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. రైతు ఉద్యమాలకు రాజకీయం చేయడం స్థానిక ఎమ్మెల్యేకు తగదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు మాట్లాడుతూ.., పల్ఫ్ను టీటీడీ, ఇతర సంస్థలకు సరఫరా చేస్తే గిట్టుబాటు ధర కల్పించడం సాధ్యమన్నారు. సభను అడ్డుకునేందుకు కుట్రలు మామిడి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్, మునీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఆక్రందన సభ అడ్డుకునేందుకు వారం రోజులుగా స్థానిక శాసనసభ్యులు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. నియోజకవర్గంలో రూ. 4 చొప్పున 75 కోట్లు మంజూరు అయినందుకు అభిషేకాలు చేయడం గొప్పకాదని, 8 రూపాయలు చొప్పున రూ 150 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత, మురళీ, ఏఎస్ఎప్ జాతీయ నేత శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేంద్ర, కోశాధికారి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు మునిరత్నంనాయుడు, ఉమాపతి నాయుడు, కార్యదర్శులు శ్రీనివాసులు, మోహన్రెడ్డి,సందీప్రెడ్డి, ఓబుల్రాజు, తవణంపల్లె మాజీ ఎంపీపీ, వైఎస్సార్సీపీ నేత రవికుమార్, చెంగల్రాయరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలోవలంటీర్ మృతి
పలమనేరు : మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లకుంటకు చెందిన సంతోష్(35) మంగళవారం రాత్రి కర్ణాటక రాష్ట్రంలోని ముళబాగిళు వద్ద హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బెంగళూరు నుంచి బైక్పై స్వగ్రామానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు అక్కడి పొలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముళబాగిళు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యాపిల్లలున్నారు. గత ప్రభుత్వంలో నీళ్లకుంటలో వలంటీర్గా పనిచేస్తూ ప్రజలకు సేవలందించాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను తొలగించడంతో బతుకు తెరువు కోసం బెంగళూరుకు వెళ్లి అక్కడ డెలవరీ బాయ్గా పనిచేస్తుండేవాడు. దీపావళి పండగ కోసమని ఇంటికొస్తుండగా కానరానిలోకాలకెళ్లాడు. సంతోష్ మృతితో నీళ్లకుంటలో విషాదం అలుమకుంది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి సదుం : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు..కొత్తపల్లెకు చెందిన విజయ(45) భర్త చంద్రశేఖర్ గల్ఫ్లో ఉంటున్నాడు. ఆమె పీలేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. గత మంగళవారం ఉదయం విధుల కోసం వెళ్తూ తిరిగి రాలేదు. 15న ఉదయం విజయ మృతదేహాన్ని పుట్టావారిపల్లె బస్స్టాప్ సమీపంలో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే దారిలో గుర్తించిన కొందరు ఆమె కుమారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరుకు తరలించారు. ఆమె కుమారుడు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. యువజనోత్సాహం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెట్విన్ సీఈవో యశ్వంత్ మాట్లాడుతూ.. నేటి యువత స్వామి వివేకానంద సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని యువత కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో బాలాజీ, సెట్విన్ మేనేజర్ మోహన్కుమార్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు పాల్గొన్నారు. -
నీటిలో నిలబడి నిరసన
వెదురుకుప్పం : 30 ఏళ్లుగా నరకయాతన పడుతున్నామని, రోడ్డు మరమ్మతు చేపట్టాలని కురివికుప్పం ఎస్సీ కాలనీ వాసులు రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. రోడ్లు అధ్వాన్నంగా ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే రోడ్డుపై అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నామంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్డును ఆధునికీకరించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. -
న్యాయం గెలిచింది!
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్ని టెర్రరిస్ట్లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది. అణగదొక్కడం సరికాదు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే! తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్కు తరలించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.రెడ్బుక్ రాజ్యాంగం అమలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు. -
పరిశ్రమల స్థాపనకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలోని వ్యవసాయదారులకు సహాయ సహకారాలను అందించని మూడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల కేటాయింపులకు అవసరమైన భూ కేటా యింపులు త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పరిశ్రమలకు దారి ఏర్పాటు చేసేలా హైవే శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2025–26వ సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు 1,551 సూక్ష్మ, చిన్న పరిశ్రమలతో రూ.22 కోట్ల ఉత్పత్తి ప్రారంభించి 6,577 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. త్వరలో 3,663 కోట్ల పెట్టుబడులతో 52 భారీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, జెడ్ఎం సుబ్బారావు, ఎల్డీఎం హరీష్, పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి కట్టమంచి బాబి పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలి టాటా నెర్వ్ కేంద్రం జిల్లాలో.. రాష్ట్రంలోనే తొలి టాటా నెర్వ్ కేంద్రం జిల్లాలోని కుప్పంలో ప్రారంభించడం జరిగిందని, త్వరలో జిల్లా మొత్తం అమలు చేసేలా చర్యలు చేపడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంజీవని హెల్త్కేర్ ప్రాజెక్ట్ అమలుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం కుప్పం నియోజకవర్గంలో అమలు చేశామన్నారు. డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సుధారాణి, డీపీఎంవో ప్రవీణ్, చిత్తూరు నియోజకవర్గం అధికారి డాక్టర్ అనూష పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాను పర్యాటకరంగంలో ముందంజలో ఉండేలా సంబంధిత శాఖల అధికారు లు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. నగదు జమకాకపోతే ఆందోళన వద్దు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు సబ్సిడీ నగదు జమకాకపోతే ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ సబ్సిడీ కచ్చితంగా చేరుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లో మామిడి సబ్సిడీ నగదు జమ అంశంపై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 31,929 మంది రైతుల ఖాతాల్లో రూ.146.84 కోట్లు సబ్సిడీ నగదు ను జమ చేశామన్నారు. ఎవరికై నా టెక్నికల్ సమస్య కారణంగా నగదు జమకాకపోతే ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు. అగ్రికల్చర్ అధికారులను సంప్రదిస్తే సబ్సిడీ నగదు జమ చేసేందుకు చర్యలు చేపడతారన్నారు. జమ చేసిన సబ్సిడీ నగదులో బంగారుపాళెం మండలానికి చెందిన ఇద్దరు రైతులకు ఎక్కువ మొత్తం సబ్సిడీ జమ అయ్యిందన్నారు. జిల్లాలో 20 వేల మంది రైతులకు రూ.లక్షకు మించి సబ్సిడీ జమ అయినట్లు తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కచ్చితమైన సబ్సిడీ నిర్ధారించామన్నారు. అర్హత కలిగి నగదు జమ కాని రైతుల నుంచి అక్టోబర్ 30 వ తేదీ వరకు వినతులు స్వీకరించి సబ్సిడీ జమ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. రైతుల నుంచి వచ్చే అర్జీలను 48 గంటల్లోపు పునఃపరిశీలన చేసి నిర్ధారిస్తామన్నారు. రూ.5 లక్షలకు మించి సబ్సిడీ అందే రైతులు జిల్లాలో 21 మంది ఉన్నారని, వీరి అర్హతను మరింతగా పరిశీలించి నగదు జమ చేస్తామన్నారు. ఆ మూడు ఫ్యాక్టరీలకు ఎలాంటి సహకారాలు ఉండవ్! మామిడి రైతులకు సహకరించని మూడు ఫ్యాక్టరీలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తరఫున ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని గుడిపాల, పుంగనూరు, బంగారుపాళెంలో ఉండే మూడు ఫ్యాక్టరీలు మామిడి రైతులకు సహాయ సహకారాలు అందించడంలో విఫలమయ్యాయన్నారు. ఆ మూడు ఫ్యాక్టరీలకు ప్రభు త్వం తరఫున వచ్చే ప్రోత్సాహకాలను అందించడం జరగదని స్పష్టం చేశారు. జిల్లా హార్టికల్చర్ శాఖ డీడీ మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలలో తనిఖీలు
తిరుమల : తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 187 మంది యాచకులు, అనధికార హాకర్లను గుర్తించి తిరుపతికి తరలించారు. అలాగే 73 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించి రికార్డులను పరిశీలించారు. తిరుమలలో పనిచేసే కార్మికులను సంబంధిత యజమానులు పనులు పూర్తి కాగానే తిరుపతికి పంపివేయాలని సూచించారు అనధికార వ్యక్తులను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
– పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ బంగారుపాళెం: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏకపక్ష నిర్ణయాలతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని, దానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేద్దామని వైఎస్సార్ సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని తుంబపాళెం, ఈచనేరిపల్లె, పెరుమాళ్లపల్లె పంచాయతీల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసి, పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ దుష్ట చర్యలను నిరసిస్తూ సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు గ్రామ, వార్డుల్లో రచ్చబండ, సంతకాల సేకరణ, 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు తరలింపు, 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు, గవర్నర్కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పార్టీ నేతలతో కలసి శ్రీవైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంశ్రీ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. కార్యకర్తలకు భరోసా కల్పించడమే లక్ష్యం గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు భరోసా కల్పించడమే వైఎస్సార్సీపీ లక్ష్యమని డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పించి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ సభ్యులు గ్రామస్థాయిలో వైఎస్సార్సీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని సీఎంగా గెలిపించుకునేందుకు పోరాటం సాగిద్దామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌ న్సిల్ సభ్యురాలు లలితకుమారి, పాలఏకరి విభా గం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్రాజా, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్రెడ్డి, జిల్లా కార్యదర్శులు గోవిందరాజులు, ప్రకాష్రెడ్డి, ట్రేడ్యూనియన్ జిల్లా కార్యదర్శి రఘుపతిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కృపాసాగర్రెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ అ ధ్యక్షుడు రెడ్డెప్ప, యూత్ మండల అధ్యక్షుడు గజేంద్ర, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు నాగరాజ, రై తు సంఘం మండల అధ్యక్షుడు అరుణామల్రెడ్డి, సుధాకర్రెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షు డు శైలేష్, సర్పంచ్ అనురాధ, నేతలు రమేష్, హరి, దూర్వాసులు, బాలాజీ, సుధా పాల్గొన్నారు. -
కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శ్రీరంగరాజపురం : రాష్ట్రంలో కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబునాయుడు అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మద్యపానం నిషేధం అమలు చేస్తే, ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు ఊరురా బెల్ట్షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారించారన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో కల్తీ మద్యం విక్రయానికి అవకాశం లేకుండా జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వమే మ ద్యం షాపులు నిర్వహిస్తే, నేడు మద్యం షాపులో కల్తీ మద్యం ఏరులైపారుతుందన్నారు. కల్తీ మద్యం కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎందుకంటే ఈ సిట్ కూటమి ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు చేస్తారని, అందుకే సీబీఐతో కల్తీ మద్యంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభు త్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇసుక, గ్రానైట్, గ్రావెల్ అక్రమ రవాణా, గంజాయి విక్రయం తదితర అసాంఘిక కార్యకలాపాలతో రాష్ట్రంలో అవి నీతి రాజ్యమేలుతుందన్నారు. యువత గంజాయికి బానిసై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నాయని ప్రగల్బాలు పలికే టీడీపీ ప్రభుత్వంలో నేడు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు,అత్యాచారాలు జరుగుతున్నా, కూ ్డటమి సర్కారు చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్ తన కుమార్తె, వైఎస్సార్ సీపీ గంగాధరనెల్లూరు నియోజవర్గం సమన్వయకర్తపై అసభ్యకరమైన రీతిలో సభ్యసమాజం తలదించుకునేలా వ్యంగంగా మాట్లాడటం టీడీపీకే చెందుతుందన్నారు. మహిళలు చీరలు కట్టుకోకూడదా? నగలు వేసుకోకుడదా? అని ప్రశ్నించారు. ఈ సృష్టికి మూలం సీ్త్ర అని, ఆ సీ్త్రమూర్తికి నేడు అవమానం జరిగితే సభ్యసమాజం తలదించుకోవాలన్నారు. ప్రపంచంలో అన్ని వర్గాల వారికి దేవుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని, అలాంటి మహనీయుడిపై కూడా టీడీపీ రాజకీయం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
పరిహారం.. ఫలహారం!
కష్టాల సుడి నుంచి కర్షకుడిని గట్టెక్కించడానికి సర్కారు మంజూరు చేసిన సాయంలోనూ కొందరు చేతివాటం ప్రదర్శించారు. తమ తోటలను లీజు కిచ్చిన ఫలితం దక్కించుకున్న రైతులు సైతం దొంగ బిల్లులతో పరిహారం పొందారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడగా.. నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం జరిగింది. పలమనేరు: తోతాపురి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం కిలోకి రూ.4 రాయితీ ఇస్తామని చెప్పడంతో మామిడి రైతులు ప్రభుత్వాన్ని ఎలా ఏమార్చాలో తెలుసుకుని మరీ మోసం చేశారు. వీరికి సంబంధిత హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది బాగా సహకరించారు. దీంతో చిత్తూరు జిల్లాలో దాదాపు రూ.46 కోట్ల కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. తోతాపురి మామిడికి ధరల లేక ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చాలామంది రైతులు భారీగా మోసాలకు పాల్పడ్డారు. ఫలితంగా జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి అందిన నష్టపరిహారంలో దాదాపు రూ.46 కోట్ల వరకు తప్పుడు బిల్లుల ద్వారా అక్రమాలు జరిగినట్టు సమాచారం. మోసాలు ఎలాగంటే.... జిల్లాలోని రైతుల్లో సగం మంది మామిడి రైతులు మూడేళ్ల ఫలసాయానికి వ్యాపారులు తోటలను విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యాపారి తోటలోని కాయలను తీసుకెళ్లాడు. కానీ రైతులు తామే ఫ్యాక్టరీలకు, లేదా సంబంధిత ర్యాంపులకు తోలినట్టు కాటా, హార్టికల్చర్ సిబ్బందితో కుమ్ముకై ్క దొంగ బిల్లులతో నష్టపరిహారం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో వీరిందరికి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందింది. దొంగ బిల్లులకు భారీ కమీషన్లు... ఎలాగైనా ప్రభుత్వం నుంచి అందే నష్టపరిహారాన్ని తస్కరించాలని భావించిన వారిలో 90శాతం కూటమి నాయకులే ఉన్నారు. అధికార బలాన్ని వాడిన వీరు ట్రాక్టర్ల ద్వారా ర్యాంపులకు మామిడిని అమ్మినట్టు దొంగ వేబ్రిడ్జి లెక్కలు, ట్రాక్టర్ల నంబరు ప్లేట్లను మార్చి వాటి ద్వారా సచివాలయ హార్టికల్చర్ సిబ్బంది ద్వారా ఈ అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. ఈ అక్రమాలకు చేసిన వే బ్రిడ్జి నిర్వాహకులకు ట్రాక్టర్కు రూ.2 వేలు, హార్టికల్చర్ సిబ్బందికి రూ.1500, దొంగ ట్రాక్టర్కు రూ.500 చొప్పున ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై విచారణ చేస్తే అసలు దొంగలు బయటకొస్తారు! మామిడి రైతుల్లో 40 శాతం మంది దొంగ బిల్లుల ద్వారా ప్రభుత్వం నుంచి రూ.46 కోట్ల కుంభకోణానికి సంబంధించి హార్టికల్చర్ అధికారులు దీనిపై సమగ్రమైన విచారణ చేపడితే మరిన్ని మోసాలు బయటపడే అవకాశాలున్నాయి. అయితే ఈ అక్రమాల్లో హార్టికల్చర్ అధికారులే కీలకమైనందున ఎలా అక్రమాలు వెలుగు చూస్తాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ అయినా స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన అవరసం ఎంతైనా ఉంది. ఇదీ నష్టపరిహారం లెక్క... -
లైసెన్సులు రద్దు చేయాలి
బంగారుపాళెం: జూస్ ఫ్యాక్టరీలు ఇస్తామన్న రూ.8 ఎక్కడని రైతు సంఘం నేతలు ప్రశ్నించారు. ఆ యజమానుల లైసెన్సులు రద్దు చేయాలని రైతు సంఘ అధ్యక్షుడు జనార్దన్, ప్రధాన కార్యదర్శి మునీశ్వర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెండ్ సురేంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ, మామిడి రైతుల అక్రందన సభ నేపథ్యంలో ఒక్క రోజు ముందు ప్రభుత్వం ఇస్తామన్న రూ.4 సబ్సిడీ రూ.185 కోట్లు విడుదల చేయడం సంతోషమన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటన మేరకు రూ. 12 ఒకేసారి జమ చేసి ఉంటే బాగుండేదన్నారు. జిల్లా కలెక్టర్ గుజ్జు పరిశ్రమ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నేపథ్యంలో తొలుత రూ.8 చొప్పున వారి నుంచి రైతుల అకౌంట్లకు రూ.370 కోట్లు జమ చేసి ఉంటే పూర్తి భరోసా ఉండేదన్నా రు. ఫ్యాక్టరీ యజమానులు నేటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమ లు చేసేందుకు ముందుకు రాకపోవడం దారుణమన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం బంగారు పాళెం మార్కెట్ యార్డు వద్ద జరిగే రైతు ఆక్రందన సభ రూ.8 రాబట్టడడంపై దృష్టి సారిస్తామన్నారు. ఫ్యాక్టరీ, ర్యాంపు నిర్వాహకులపైన ప్రత్యేక్ష పోరాటానికి సన్నద్ధమవుతామన్నారు. రైతు ఆక్రందన సభకు ఆటంకం కలిగిస్తే రైతు వ్యతిరేకులుగా ముద్రపడటం ఖాయమన్నారు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ రైతు ఆక్రందన సభకు సీపీఎం మద్దతు ఇస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో మామిడి రైతు సంఘ నేతలు మునిరత్నంనాయుడు, శ్రీనివాస్, సంజీవరెడ్డి, మురళి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్వర్టు కొట్టుకుపోయింది!
తవణంపల్లె: మండలంలో ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు బహునది పరివాహక ప్రాంతాలైన అరగొండ సమీపంలోని కల్వర్టు, మత్యం వద్ద వాగుపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు వారం రోజులుగా ప్రజల రాకపోకలకు, స్కూల్ బస్సులు, పాలవ్యాన్లు, ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. మండలంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టకపోగా శాశ్వతంగా కల్వర్టులు నిర్మించి ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వర్షాకాలం వస్తే ప్రజలకు రోడ్లతో వెతలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
సర్కారు వేధింపులు సరికాదు!
పీహెచ్సీ వైద్యుల న్యాయమైన డిమాండ్లు నెర వేర్చకుండా వేధింపులకు పాల్పడడం సరికాదని శ్రీనివాసమూర్తి అన్నారు.బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఏడాది పాటు చెమటోడ్చి కష్టించే మామిడి రైతులంటే అందరికీ అలుసుగా మారింది. తోతాపురి మామిడి రైతులను ఈ ఏడాది ఎన్నడూ లేనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. పంట విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో కుటుంబ అవసరాలు, చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న కర్షకుల ఆశలు అడియాశలయ్యాయి. తోతాపురి విక్రయంలో అన్ని దశల్లోనూ పుడమి పుత్రులు దగా పడ్డారు. మామిడి కాయలతో క్యూకట్టిన ట్రాక్టర్లు (ఫైల్) 19న చెస్ పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ సహకారంతో ది స్కూల్ ఆఫ్ చెస్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన చి త్తూరుటౌన్లో చెస్ చాంపియన్ చెస్ పోటీలు నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ బాబుప్రసాద్రెడ్డి, ఆంధ్రా చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఆర్.బి ప్రసాద్ చెస్ పోటీల వివరాలను వెల్లడించారు. చిత్తూరు నగరంలోని విద్యార్థులు మా త్రమే చెస్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉంటుందన్నారు. అండర్ 7,9,12,16 విద్యార్థులు చెస్ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు 9000475799 నంబర్లో సంప్రదించి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు కోరారు. కర్నూలుకు 250 ఆర్టీసీ బస్సులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): కర్నూలులో జరిగే పీఎం సభకు జిల్లా నుంచి 250 బస్సులు కేటాయించారు. చిత్తూరు వన్డిపో నుంచి 42, టూడిపో నుంచి 53, కుప్పం నుంచి 70, పలమనేరు నుంచి 37, పుంగనూరు నుంచి 47 బస్సులు పంపాలని నిర్ణయించారు. ఇవీ బుధవారం జిల్లా నుంచి కర్నూలుకు బయలుదేరనున్నాయి. గురువారం జరిగే సభ ముగిసిన తరువాత శుక్రవారం తిరిగిరానున్నాయి. దీంతో మూడు రోజులపాటు జిల్లాలోని ప్రయాణికులకు అవస్థలు పడాల్సి ఉంది. 18న ప్రదోషపూజ కాణిపాకం: శని త్రయోదశిని పురస్కరించుకుని ఈనెల 18వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైనా మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రదో ష పూజ జరగనున్నట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రదోషపూజ జరుగుతుందని ఆయన తెలిపారు. నేడు విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బుధవారం వి ద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్థానిక గాంధీరోడ్డులోని అర్బన్ డివిజన్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల విద్యుత్ వినియోగదారులు సమస్యలను వినతుల రూపంలో తెలియజేయాలని ఆయన కోరారు. తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్)కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.23.60లక్షల విరాళం అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఐజర్లో మౌలిక వసతుల కల్పన ఈ మొత్తం అందజేసింది. ఇందులో అత్యవసర వైద్య సేవల నిమిత్తం రూ.15.38లక్షల విలువైన అంబులెన్స్, క్యాంటీన్ సేవల మెరుగుపరిచేందుకు రూ.8.22లక్షల విలువైన ఆటోమెటిక్ కియోస్క్ వ్యవస్థను వితరణ చేసింది. మంగళవారం ఈ మేరకు ఎస్బీఐ ఉన్నతాధికారులు రాజేష్కుమార్ పటేల్, అమరేంద్రకుమార్ సుమన్, దినేష్ గులాటీ చేతుల మీదుగా ఐజర్ ప్రతినిధులకు అందజేశారు. గుజ్జు లాగేశారు! కాణిపాకం: మామిడి కాయల విక్రయంలో బినామీ లెక్కలకు రెక్కలొచ్చాయి. అక్రమాలు పరిశీలన పక్క దారి పట్టింది. అసలు లెక్కలను అధికారులు తోసిపుచ్చారు. బోగస్ లెక్కలను తేల్చలేకపోయారు. త ద్వారా ప్రభుత్వం అందించిన మామిడి ప్రో త్సాహక నిధి రూ.4 చెల్లింపు దుర్వినియోగమైందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రా యితీ పోయినా ఫ్యాక్టరీ చెల్లించాల్సిన రూ.8 కోసం రోడ్డెక్కారు. రైతు సంఘం నేతల గొంతు నొక్కేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తోతాపురి మామిడి అవకతవలను నివారణకు జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చి కాయలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.12 గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీలు కిలో రూ.8 చెల్లించేలా, ప్రభుత్వం ప్రోత్సాహక నిధి కింద రూ.4 చెల్లిస్తామని వెల్లడించింది. అయితే కాయల విక్రయానికి టోకెన్ల పద్ధతి ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో రాయితీపై కన్నేసిన కొందరు అక్రమాలకు తెగబడ్డారు. మధ్యవర్తుల దందా.. మామిడి కొనుగోలు సమయంలో ఫ్యాక్టరీల వద్ద కొందరు కాపు కాచారు. కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పి టోకన్లను అమ్ముకున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో పండిన కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించారనే వాదనలు వినిపించాయి. ఈ దోపిడీ జోరుగా సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై తమిళనాడు సరిహద్దులో నిఘా పెట్టారు. దీనికితోడు వ్యాపారులను బుట్టలో వేసుకుని కూటమికి చెందిన కొందరు ప్రభుత్వ ప్రోత్సాహక నిధి దోపిడీకి తెరలేపారు. ర్యాంపులను అడ్డం పెట్టుకుని కాయలు కాటా వేసి, బోగస్ పేర్లు, బిల్లులు సృష్టించారు. ఇలాంటివి బంగారుపాళెం, కుప్పం, వి.కోట, పలమనేరు, సోమల తదితర ప్రాంతాల్లో జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే నీలం కాయలను కూడా ర్యాంపులకు తరలించి తోతాపురి లెక్కల్లోకి ఎక్కించారని ఆరోపణలు భగ్గుమన్నాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ మామిడి దినోత్సవ సభలో భగ్గుమన్నారు. బోగస్ లెక్కలను బయటకు తీస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే అధికారులు పరిశీలన పేరుతో జాప్యం చేసి తమ చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ర్యాంపుల వద్ద లెక్కలు గందరగోళంగా ఉండడంతో ఏం చేయలేక మిన్నకుండిపోయినట్లు సమాచారం. నిధి మంజూరుతో ఇలా.. అధికారులు పరిశీలన పూర్తి చేసి ఇచ్చిన నివేదికలపై రైతులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 31,929 మంది రైతులు 79,963 సార్లు కాయలు తరలించగా 3.67లక్ష టన్నుల కాయలు విక్రయించినట్లు లెక్కకట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.146 కోట్ల మేర నిధులు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ చెల్లింపులపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోగస్ లెక్కలు తేల్చకుండా నిధులు జమ చేయడంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.8 మాటేంటీ.. వైఎస్సార్ సీపీ, మాజీ సీఎం జగన్ చల్లగుండాలని..పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు – 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. 2026వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీలోపు కచ్చితంగా మ్యాండిటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ) చేయించుకోవాలని ఆధార్ సంస్థ యూఐడీఏఐ ఆదేశించింది. ఈ మేరకు ఎంబీయూ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు గుర్తించిన పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంప్లు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 నుంచి 15 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 32,011 మంది, 15 సంవత్సరాలు పైబడిన 16,937 మంది మొత్తం 48,948 మంది విద్యార్థులు మ్యాండిటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. వీరందరికీ ఆధార్ అప్డేట్ చేసేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. అధికారిక సమావేశంలో టీడీపీ నేత సాక్షి, టాస్క్ఫోర్స్: అదేదో మారుమూ ల ప్రాంతం కా దు..సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారి ఉండే కలెక్టరేట్ కార్యాలయం. ఆ కార్యాలయంలోని కలెక్టరేట్ చాంబర్లో టూ రిజం అధికారులతో నిర్వహిస్తున్న సమావేశంలో టీడీపీ నాయకుడు జయప్రకాష్నాయుడు తిష్టవేశారు. అధికారిక సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి హోదా లేని ఆయన తిష్ట వేయడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి హోదా లేని ఆయన కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం ఏమిటని సమావేశంలో పాల్గొన్న అధికారులే పెదవి విరుస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదా లేని నాయకులను ప్రోత్సహిస్తున్న జిల్లా యంత్రాంగంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే విలువ కోల్పోకుండా ఉంటారని పలువురు పెదవి విరుస్తున్నారు. కాణిపాకం: వైఎస్సార్ సీపీతోపాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చల్లగుండాలని ఆ వరసిద్ధి వినాయకస్వామివారిని వేడుకున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామివారిని మంగళవారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయాధికారులు ఆయనకు దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు శేషవస్త్రం అందజేసి, ఆశీర్వచనం పలికారు. తర్వాత ఆలయాధికారులు స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీతోపాటు, జగన్కు ఎల్లప్పుడు వరసిద్ధివినాయకస్వామివారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించినట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ మోహన్రెడ్డి, సర్పంచ్ శాంతిసాగర్రెడ్డి, సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలితా కుమారి, మండల కన్వీనర్లు శ్రీకాంత్రెడ్డి, పాలేరు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, నాయకులు శిరీష్రెడ్డి, బాబురెడ్డి, సుధాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి, మనోహర్, ప్రవీణ్రెడ్డి, పాలాక్షిరెడ్డి, చిన్నారెడ్డి, ప్రకాష్రెడ్డి, కిషోర్కుమార్రెడ్డి, నాగరాజు, సైలేష్, కుమారరాజా, గోవిందస్వామి, కోదండ, అన్నామలై తదితరులు ఉన్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న మాజీ మంత్రి పెడ్డిరెడ్డి రామచంద్రారెడ్డి, నాయకులు స్వామివారి సన్నిధిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం గెలిచిందిప్రభుత్వం తోతాపురికి ప్రకటించిన మద్ధతు ధర విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రూ.4 ప్రోత్సాహక నిధి చెల్లించి..చేతులు దులుపుకుంటోంది. అయితే ఫ్యాక్టరీ నుంచి కిలో రూ.8 ఇవ్వాల్సి ఉండగా..దీనిపై నోరువిప్పడం లేదు. ఇది వరకే కొన్ని ఫ్యాక్టరీలు కిలో రూ.5 చెల్లించగా రైతులు భగుమంటున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రైతు సంఘ నాయకులు అక్రందన సభ నిర్వహణకు సిద్ధపడ్డారు. బుధవారం బంగారుపాళెం మండలంలోని మార్కెట్యార్డులో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కూటమికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి రైతుల సంఘం నాయకులకు బెదిరింపులు వస్తున్నాయి. సభను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్ధతు ధరపై పోరాడుతున్న రైతు నాయకులను అడ్డుకుంటే భవిష్యత్ ఉండదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బోగస్ లెక్కలు తేల్చాలి కొన్ని ర్యాంపుల్లో ప్రభుత్వ నిధిని దోచుకోవాలని బోగస్ లెక్కలు చూపించారు. ఆ లెక్కలు తేలకుండా నిధి జమ చేశారు. దీంతో ప్రజానిధి పక్కదారి పట్టిందని భావిస్తున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఆ బోగస్ లెక్కలు తేల్చాలి. అలాగే ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 ఇవ్వాలి. ఇందుకు అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని సభకు పూనుకున్నాం. –ఉమాపతినాయుడు, మామిడి రైతు సంఘ ఉపాధ్యక్షులు ఫ్యాక్టరీల నుంచి రూ. 8 ఇప్పించాలి ప్రభుత్వం తోతాపురికి మద్ద తు ధరగా కిలో రూ.12 ప్రకటించింది. ఆ ప్రకారమే రైతు లకు నగదు ఇప్పించాలి. ఫ్యా క్టరీలు కేజీకి రూ. 5 ఇస్తే ఒప్పకోం. కచ్చితంగా రూ.8 ఇవ్వా ల్సిందే. ఇవ్వని ఫ్యాక్టరీ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈనేపథ్యంలోనే బంగారుపాళ్యంలో అక్రందన సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను అడ్డుకోవద్దు. మేము రైతుల కోసం పోరాడుతున్నాం. ఇందుకు అందరు సహకరించాలి. – జనార్దన్, మామిడి రైతు సంఘ అధ్యక్షులు ఇంకా చేయాల్సింది ఉంది మామిడి కొనుగోలుపై పరిశీలన చేపట్టాం. పరిశీలనలో చాలా వరకు తీసేశాం. ఇంకా పరిశీలన చేయాల్సి ఉంది. చేస్తాం. ఏదైనా అనుమానం ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కచ్చితంగా స్పందిస్తాం. చర్యలు తీసుకుం టాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అనుమానాలు వద్దు. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, చిత్తూరు -
‘టీడీపీకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు’
చిత్తూరు జిల్లా: ‘నేను తెలుగుదేశం పార్టీకే ఓటువేశా. ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది. ఎవరూ తెలుగుదేశానికి ఓటు వేయకండి. నాశనమైపోతారు. నా.. పోతారు. వద్దు..’ అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పూతలపట్టు మండలం రామాపురానికి చెందిన దినేష్ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది.ఆ తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. తనను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది. కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోతో మరో సెల్పీ వీడియో పెట్టాడు.వివరాలు అతడి మాటల్లోనే.. ‘నా పేరు దినేష్, నా భార్య సుభద్ర, నా కూతురు సహస్ర. టీడీపీ నాయకులు యువరాజులునాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వల్లే మా ప్రాణాలు పోతాయి. వాళ్లు పోలీసు స్టేషన్లో చిత్రహింసలు పెట్టించారు. నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాను. నాకు న్యాయం జరగలేదు. కానీ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా.. ఎవ్వరూ కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దు. నాశనం అయిపోతారు. నా.. పోతారు. వద్దు..’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వరుస వీడియోలు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారాయి. -
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని కొమ్మిరెడ్డిగారిపల్లెలో సోమవారం తెల్లవారు జామున ఏనుగులు పంట పొలాలపై పడి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. మళ్లీ ఏనుగులు ఇదే మండలంలో తిష్ట వేసి పంటలను రోజూ నాశనం చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఏడాది కాలంగా ఇక్కడే ఉంటూ రైతులు సాగు చేసిన పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నా యి. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయోనని రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొమ్మిరెడ్డి గారిపల్లెవద్ద సోమ వారం అమరనాథరెడ్డి పొలంలో వరి, అరటి పంటలను తొక్కి నాశనం చేశాయి.ఏనుగులు తొక్కేసిన అరటి పంట కొమ్మిరెడ్డిగారిపల్లె వద్ద దెబ్బతిన్న వరిపంట -
కరకట్ట బంగ్లాకు కోట్లు!
కల్తీ మద్యంతో..చిత్తూరు అర్బన్: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకుల కనుసన్నల్లోనే నకిలీ మద్యం బాగోతం నడిచింది. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో బయటపడ్డ నకిలీ మద్యం తయారీ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ చేరింది. ఇందులో వచ్చిన లాభాలు కూటమి నేతలు పంచుకు తిన్నారు. అందులో పెద్ద మొత్తంలో కరకట్ట బంగ్లాలోని పెద్దలకు కమీషన్లు అందాయి. వెంటనే ఈ వ్యహారాన్ని సీబీఐకి అప్పగించాలి. దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నకిలీ మద్యం ఘటనపై సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. చిత్తూరులో.. చిత్తూరు నగరంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కట్టమంచి చెరువు వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుంచి అర్బన్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ వరకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అక్కడ నిరసన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం అరికట్టాలని, బెల్టు దుకాణాలు తొలగించాలని ఎకై ్సజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, రాష్ట్ర మునిసిపల్ విభాగం ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ హయంలో నకిలీమద్యం ఏరులై పారుతున్నా ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా పారదర్శకంగా అమ్మకాలు సాగిస్తే, తమ నాయకులను వేధించడానికి తప్పుడు కేసులు బనాయించారన్నారు. పలమనేరులో.. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో పలమనేరులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసి, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పట్టణంలో నకిలీ మద్యంపై నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూతలపట్టులో.. పూతలపట్టు వైఎస్సార్సీపీ నాయకులు చిత్తూరులోని అర్బన్ ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, ఇందులోని ప్రభుత్వ పెద్దల పాత్ర తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఎకై ్సజ్ పోలీసులకు వినతిపత్రం అందచేశారు. కుప్పంలో.. కుప్పం పట్ణణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ వరకు ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నారాసురపాలన నశించాలిగంగాధరనెల్లూరులో ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి ఆర్కే రోజానగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో కలిసి కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. నకిలీ మద్యం స్కాంపై సిట్ విచారణ వద్దని, సీబీఐ విచారణ చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. నారావారి సారా పాలన నశించాలని నినాదాలు చేశారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందించారు. జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కార్వేటినగరంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించారు. మహిళలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. కల్తీమద్యం అమ్మకాలు బెల్టు దుకాణాల్లోనే జరిగాయని, వీటిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎకై ్సజ్ అధికారులకు వినతిపత్రం అందచేశారు. నకిలీ మద్యం అమ్మకాలతో మహిళల తాళిబొట్లు తెగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. -
ఉప్పొంగినది!
– చిత్తూరులో నీవానది బీభత్సం చిత్తూరు నగరంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నీవాది ఉప్పొంగింది. తమిళనాడులోని పరదరామి, గుడియాత్తం మీదుగా వర్షపు నీళ్లు యాదమరి నుంచి చిత్తూరు నగరంలోని నీవానదిలోకి భారీగా వచ్చి చేరింది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే నీవానది పరివాహక ప్రాంతమైన తేనబండ, గంగాకాలనీ, వీరభద్రకాలనీ, రాజుగుడి వీధి, లిల్లీబ్రిడ్జి, కై లాశపురం, తోటపాళ్యంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. ఇళ్లలోకి వర్షపునీళ్లు రావడంతో నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వేలాది కుటుంబాలున్న నీవానది పరివాహక ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. – చిత్తూరు అర్బన్ -
రైలు ఢీకొని నేత కార్మికుడి మృతి
పుత్తూరు: పట్టణంలోని ధర్మరాజుల స్వామి ఆలయం ఎదురుగా రైల్వే ట్రాక్ట్ దాటుతుండగా ప్రమాద వశాత్తు రైలు ఢీకొని నేత కార్మికుడు దుర్మరణపాలైన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకొంది. రైల్వే పీసీ శివ కథనం మేరకు.. స్థానిక దాసరిగుంట వీధికి చెందిన ఎస్.వి.కిష్టన్(63) పుత్తూరు టౌన్లోకి వెళ్లేందుకు ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు రేణిగుంట రైల్వే పోలీసుటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాటు తుపాకీతో సహా వ్యక్తి అరెస్ట్ పుంగనూరు: సోమల మండలం అన్నెమ్మగారిపల్లె అటవీ ప్రాంతంలో బోయకొండప్ప సోమవారం ద్విచక్ర వాహనంలో నాటు తుపాకీ పెట్టుకుని సంచరిస్తుండగా అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ శ్రీరాములు ఆధ్వర్యంలో సిబ్బంది అతని వద్ద నుంచి నాటుతుపాకీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పింఛన్లు మంజూరు చేయించండయ్యా! – దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రుల మొర తవణంపల్లె: ‘పిల్లల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొన్నాం.. కూటమి ప్రభుత్వం మాత్రం కనికరం చూపడం లేదు..’ అంటూ దివ్యాంగ పిల్లల తల్లిండ్రులు ప్రాధేయపడ్డారు. కూటమి ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి పింఛన్లు మంజూరు చేయాలని అర్జీలు ఇస్తూనే ఉన్నాం... కానీ ఇప్పటి వరకు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లలతో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొన్నారు. ఎంపీడీఓ హరిప్రసాద్రెడ్డికి తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ పిల్లల జీవనాధారం కోసం పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలని మొరపెట్టుకొన్నారు. దీనిపై ఎంపీడీఓ స్పందిస్తూ కొత్త పింఛన్లు మంజూరు కోసం ప్రభుత్వం అనుమతిచ్చే వరకు ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అనంత రం దివ్యాంగులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వరచౌదరి స్థానిక ఎమ్మె ల్యే ద్వారా డ్వామా పీడీతో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సహిత విద్యా ఉపాధ్యాయుడు దేవేంద్ర పాల్గొన్నారు. -
పత్తికొండలో విషాద ఛాయలు
ఆస్పత్రికి తరలుతున్న క్షతగాత్రులు పలమనేరు/గంగవరం: మండలంలోని పత్తికొండలో తీవ్ర విషాదం నెలకొంది. ఒంగోలు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్కోకు చెందిన ఓ జేఎల్ఎం మృతి చెందగా, మరో నలుగరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. పలమనేరు ట్రాన్స్కో పరిధిలోని సిబ్బంది తమ సమస్యల సాధన కోసం విజయవాడలో సోమవారం జరిగే నిరసన కార్యక్రమానికి ఆదివారం ఇక్కడి నుంచి టెంపో ట్రావెలర్లో 19 మంది బయలుదేరారు. వీరి వాహనం ఒంగోలు వద్ద వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో గంగవరం మండలం, పత్తికొండకు చెందిన జూనియర్ లైన్మన్ చరణ్(30) మృతి చెందాడు. సురేంద్ర, నాయక్, కుపేంద్ర, ప్రసాద్ గాయపడినట్టు తెలిసింది. స్థానిక ట్రాన్స్కో ఏడీ జీవన్రెడ్డి, అధికారులు సైతం విషయం తెలిసిన వెంటనే అక్కడి ఆస్పత్రివద్దకు వెళ్లారు. -
గుజ్జు ఫ్యాక్టరీలకు కూటమి సహకారమా?
యాదమరి: గుజ్జు ఫ్యాక్టరీలకు కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి పరోక్ష సహకారం ఉండడంతోనే మామిడికి రూ.8 చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్, మునీశ్వర్రెడ్డి ఆరోపించారు. ఈనెల 15న బంగారుపాళ్యంలో నిర్వహించనున్న ఆక్రందన సభ విజయవంతం కోసం వారు సోమవారం పూతలపట్టు, పి.కొత్తకోట, కొటాలం గ్రామల్లోని రైతులను కలసి కరపత్రాలను అందజేశారు. వారు మాట్లాడుతూ మామిడి బిల్లుల ఆలస్యానికి గల కారణం కర్మాగారాల యాజమాన్యంతో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలేనన్నారు. గుజ్జు కర్మాగారాలకు లబ్ధి చేకూర్చడానికి 40 వేల మంది రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. బుధవారం జరిగే ఆక్రందన సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి సంజీవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాజారత్నం రెడ్డి, రైతు నాయకులు చెంగల్రెడ్డి, నరసింహులు నాయుడు, జ్ఞానశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత బద్రీ ఆగ్రహం
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై టీడీపీ నేత, మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడి తమ్ముడు బద్రీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బలిజ సంఘ నాయకులతో కలిసి ఆయన కార్పొరేషన్ కార్యాలయంలో సహాయ కమిషనర్ ప్రసాద్ను కలిసి, వినతిపత్రం అందచేశారు. బద్రీనారాయణ మాట్లాడుతూ కొంగారెడ్డిపల్లిలో శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ను తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. కొంగారెడ్డిపల్లెలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ కడుతున్నారని, దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కౌన్సిల్ అనుమతితో ఏర్పాటుచేసి ప్రజలకు శుద్ధినీటిని అందిస్తున్న వాటర్ ప్లాంట్ కొట్టేస్తామని చెప్పడం మంచిదికాదన్నారు. వాటర్ప్లాంట్ కొట్టేస్తే ఊరుకునేదిలేదన్నారు. 2014లో నాటి ఎమ్మెల్యే సత్యప్రభ, సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్ను ప్రారంభించారని గుర్తుచేశారు. అవసరమైతే వాటర్ ప్లాంట్ను మరో స్థలంలో ఏర్పాటు చేస్తామని ఏసీపీ నాగేంద్ర చెప్పడంతో.. దీన్ని అంగీకరించబోమని బద్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీతి అయోగ్ డైరెక్టర్తో భేటీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు విచ్చేసిన నీతి అయోగ్ డైరెక్టర్ జుబైర్ అలీ హష్మీతో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయనను కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతి పై కాసేపు చర్చించారు. పిడుగుపాటుకు దెబ్బతిన్న ఇల్లు బంగారుపాళెం: మండలంలోని తుంబకుప్పంలో పిడుగుపాటుకు ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రాణెమ్మ ఇంటిపై ఉన్న నీటి ట్యాంకుపై పిడుగు పడింది. దీంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు కరెంటు వైర్లు, ఇతర విద్యుత్ సామగ్రి కాలిపోయాయి. రెండు రోజుల క్రితం రాణెమ్మ బెంగళూరులో ఉన్న తన కుమార్తె దగ్గరకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. -
న్యాయం చేయండి సారూ!
తమ సమస్యలను పరిష్కరించండి సారూ..! అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు పీజీఆర్ఎస్లో వినతులు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, డీఆర్వో మోహన్కుమార్ ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 364 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. – చిత్తూరు కలెక్టరేట్ -
ఐక్యంగా ఉద్యమిద్దాం!
పుత్తూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి అన్ని సంఘాల వారు కలసి రావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగారావు పిలుపు నిచ్చారు. సోమవారం పుత్తూరులోని ఓ ప్రైవేటు కల్యా ణ మండపంలో 8వ సీఐటీయూ జిల్లా మహా సభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సభలను స్థానిక సీఐటీయూ సీనియర్ నేత సుబ్రమణ్యంపిళ్లై చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను క్రమేపీ తగ్గిస్తూ, సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి అన్ని కార్మిక, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షు డు అజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు నాగరాజు, పుల్లయ్య, నాయకులు సుబ్రమణ్యం, జయచంద్ర, ప్రసాద్రావు, రమేష్, రామకృష్ణ, శ్రీధర్బాబు, జనార్దన్, వాణిశ్రీ తదితరులు ప్రసంగించారు. తర్వా త పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
అవునా బొజ్జలా?
రాజకీయాల్లో కొందరు నేతలు నైతిక విలువలను వదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు వదిలేసి జిత్తులకు దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం దిగజారుతున్నారు. ఇదే కోవలో జనసేన మాజీ నేత కోట వినూతపై ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పలు కుట్రలకు తెగబడినట్లు సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ వీడియో వైరల్గా మారింది. వినూత డ్రైవర్గా పనిచేసి హత్యకు గురైన రాయుడు తీసుకున్నట్టుగా చెబుతున్న సెల్ఫీ వీడియో జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కోట దంపతులను టార్గెట్ చేసుకుని బొజ్జల తనకు డబ్బులు ఎరవేసినట్లు డ్రైవర్ స్పష్టంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల నడుమ పోరులో చివరకు సదరు దళితుడు బలి కావడం విషాదంగా మిగిలింది. సాక్షి టాస్్కఫోర్స్ : జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోట వినూత వద్ద డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన ఓ సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డిపై పలు ఆరోపణలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినూత రహస్య సమాచారం, కొన్ని వీడియోలు సేకరించి అధిష్టానానికి చేరవేసి సు«దీర్రెడ్డి టికెట్ సాధించినట్లు శ్రీకాళహస్తి వాసులు చర్చించుకుంటున్నారు. బొజ్జల సు«దీర్రెడ్డి కారణంగా కూటమిలోని అనేక మంది నేతలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు టికెట్లు దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు వెన్నుపోట్లు పొడుచుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శ్రీకాళహస్తి టికెట్ కోసం ఏకంగా హత్యా రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా గుప్పుమంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ కోసం కూటమి పారీ్టలోని బొజ్జల సు«దీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కుమారుడు, బీజేపీ నేత కోలా ఆనంద్, జనసేన నేత కోట వినూత పోటీ పడిన విషయం విధితమే. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు.. ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ముఖంగా వీధికెక్కారు. నాడు టీడీపీ, జనసేన నేతల మధ్యే పోటీసార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పారీ్టల సీట్ల కేటాయింపుకు సంబంధించి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ లేదా జనసేనలో ఒకరికి ఇస్తారని ముందుగానే తేలిపోయింది. దీంతో కోట వినూతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రైవర్ని కోవర్టుగా బొజ్జల సుధీర్రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు రాయుడి వీడియో ద్వారా బయటపడింది. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేందుకు కూటమి నేతలు కోవర్టులను నియమించుకున్నారు. అందులో భాగంగా కోట వినూత విషయంలో బొజ్జల చాలా దూరంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రైవర్ రాయుడుకి రూ.60 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వీడియో ద్వారా వెలుగు చూసింది. అలాగే అనేక మందిని పావుగా వాడుకున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. చివరకు కోట వినూత దంపతులను యాక్సిడెంట్ ద్వారా హత్య చేసేందుకు సైతం రెండు పర్యాయాలు యతి్నంచినట్లు రాయుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. రాజకీయ పోరులో దళితుడైన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురవడం అప్పట్లో సంచలనంగా మారింది. రాయుడు హత్యకు దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు నిజమేనా? డ్రైవర్ రాయడు హత్య తర్వాత అరెస్ట్ అయిన కోట వినూత దంపతులు మీడియా సాక్షిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పేరును ప్రస్తావించారు. రాయుడి హత్య వెను ఎవరి పాత్ర ఉందని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి పేరును వెల్లడించడం నాడు కలకలం రేపింది. అన్ని విషయాలను త్వరలోనే బయటపెడతామని చెప్పినట్టే.. నేడు రాయుడి వీడియో వైరల్ కావటం పెద్ద దుమారమే రేపుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవిని కొట్టే సాయికి కట్టబెట్టడం వెనుక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి హస్తం ఉందని కోట వినూత లేఖ ద్వారా ఆరోపించింది. బొజ్జల సుదీర్రెడ్డికి టికెట్ కేటాయించడం వెనుక జనసేనలోని మరో నాయకుడు కొట్టేసాయి ఉన్నారని రాయుడు వీడియో ద్వారా తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తిలో పలువురు ప్రధాన భూమిక పోషించారని డ్రైవర్ వీడియో ద్వారా వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వస్తాయోనని కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
పీఆర్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శశిధర్
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శశిధర్ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా శశిధర్, ప్రధాన కార్యదర్శిగా చెంచురత్నం యాదవ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లుగా లక్ష్మీపతి యాదవ్, గిరిధర్రెడ్డి, చక్రపాణి, త్రివిక్రమరావు, ఉపాధ్యక్షులుగా మూర్తి, వాణి, లోకే ష్, కుమార్, సంయుక్త కార్యదర్శులుగా అలీ, లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. -
కొండను పిండేస్తున్నారు!
సాక్షి టాస్క్ఫోర్స్: అధికారుల అలసత్వం, ప్రభుత్వం ఉదాసీనత అక్రమార్కులకు వరంగా మారింది. అహ్లాదాన్ని పంచిపెట్టే కొండగుట్టలను నిత్యం జేసీబీలు, హిటాచీలుతో మట్టిని తరలిస్తున్నారు. ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన సంబంధిత రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బంగారుపాళెం మండలంలోని గుండ్లకట్టమంచి రెవెన్యూ, చీకూరు పల్లె పంచాయతీలోని తంబుగానిపల్లె రహదారి సమీపంలో ప్రభుత్వం ఆదీనంలో గుట్ట ఉంది. ఈ గుట్టను హిటాచీతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు.జాతీయ రహదారి నుంచి చూస్తే ఈ గుట్ట కనిపిస్తుంది.బంగారుపాళెం మండలంలోని కేజీ సత్రం గ్రామానికి చెందిన ఓ రైతు తిరుపతికి చెందిన వ్యక్తులకు పెట్రోల్ బంక్ నిర్వహించేందుకు స్థలాన్ని లీజుకు ఇచ్చారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ స్థలానికి సమీపంలోని గుట్టను తవ్వి రెండు రోజులుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్న స్ధలంలో మట్టి నింపి చదును చేస్తున్నారు. సుమారు వెయ్యి లోడ్ల మట్టి అవసరమవుతోంది. ప్రభుత్వ స్థలాల్లో మట్టిని తరలించుకోవాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాల్సింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకు మట్టిని తరలించాల్సి ఉంటుంది. గుట్టను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయాన్ని సంబంధిత తహసీల్దార్, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ భూములకు పరిరక్షకులుగా ఉంటున్న రెవెన్యూ అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించుకుంటూ పోతే ప్రకృతి సంపద అంతరించే ప్రమాదం లేకపోలేదని స్థానికులు అంటున్నారు. -
25న పెద్ద శేష వాహన సేవ
తిరుమల: తిరుమలలో అక్టోబర్ 25న నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్ద శేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు.ఆ దిశేషువు జగన్నాథునికి తల్పంగా స్వామివారికి సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. వరసిద్ధుని సేవలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం సినీనటుడు జూనియ ర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి దర్శించుకున్నా రు. ఆమెతో పాటు సినీ నటుడు నార్నె నితిన్, వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగ తం పలికి దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచనాలు, స్వామి ప్రసాదం, చిత్ర పటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీనాయుడు తదితరులున్నారు. -
బోయకొండ కిటకిట
చౌడేపల్లె : బోయకొండ జనంతో ఆదివారం కిక్కిరిసిపోయింది. కర్ణాటక భక్తులు, స్థానిక భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. వేకువ జామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండపై ఎటుచూసినా భక్తుల సందోహం కనిపించింది. ఆలయంలో క్యూలైన్లు నిండిపోయాయి. గంటల తరబడి నిరీక్షించి భక్తులు దర్శనం చేసుకున్నారు. సుమారు 25 వేలమందికిపైగా అమ్మవారిని భక్తులు దర్శించుకొన్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఊహించని రీతిలో వాహనాల్లో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నాలుగు కాళ్ల మండపం నుంచి రణభేరి గంగమ్మ ఆలయం వద్దకు వాహనాల రాకపోకలు స్తంభించడం, పోలీసులు పత్తాలేకపోవడంతో భక్తులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. -
కూటమి కల్తీ మద్యంపై నిరసనలు
పుంగనూరు : కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం మాఫియా, వేల కోట్ల రూపాయలను చట్ట వ్యతిరేకంగా దోచుకోవడంపై సోమవారం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఆదివారం తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు , వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, వల్లివేడు పృధ్వీధర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీంబాషాలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం వ్యాపారంతో వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం నాయకుల వ్యాపారాల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేయాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పుంగనూరు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, నాయకులు గౌస్, అఖిల్, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన పర్యటన
చిత్తూరు అర్బన్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్లుఫోలియో జడ్జి జస్టిస్ బీ.కృష్ణమోహన్ రెండు రోజుల జిల్లా పర్యటన ముగిసింది. ఆదివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికతో కలిసి చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. అదాలత్లు నిర్వహించి కేసులను బాగానే పరిష్కరిస్తున్నా.. కొత్త కేసులు కూడా అదే తరహాలో ఫైల్ అవుతున్నాయన్నారు. ఇది న్యాయమూర్తులపై మరింత బాధ్యతను పెంచుతోందని చెప్పారు. ప్రధానంగా దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించి, కక్షిదారులకు మేలు చేకూర్చాలన్నారు. కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, విడాకుల కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చూపించాలన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు రమే ష్, భారతి, శ్రీదేవి, శ్రీనివాసరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలకు సుస్తీ.. సేవలకు స్వస్తి
ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యం అలుముకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు పడకేశాయి. డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో సేవలు నిలిచిపోయాయి. దీనికి తోడు ఆరోగ్య శ్రీసేవలు ఆగిపోయాయి. పేరుకు పోయిన బకాయిల దెబ్బకు నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దీంతో ప్రభుత్వ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. సర్కారు వైద్యం నిర్వీర్యం కావడంతో సామాన్య జనం ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 సీహెచ్సీలు, 4 ఏరియా ఆసుపత్రులు, 15 యూపీహెచ్సీలు, ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పనిచేస్తున్నా యి. ఇందులో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం రెండు వారాలుగా విధులు బహిష్కరించి సమ్మె బాటపట్టారు. దీంతో వైద్యసేవలు పేదలకు దూరం అయ్యాయి. నాడీపట్టే నాథుడే లేరు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 60 మందికి పైగా వైద్యుల సమ్మె చేస్తుండటంతో చికిత్స చేసేవారు కరువయ్యారు. దీంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీల నుంచి వైద్యులు, పీజీ వైద్యులను సర్దుబాటు చేశారు. ఈ సర్ధుబాటు కారణంగా వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సన్నగిల్లాయి. ఇతర సేవలు సైతం స్తంభించాయి. అలాగే పీహెచ్సీల్లో కూడా చాలా చోట్ల వైద్య సేవలు మొ క్కు బడిగా అందుతున్నాయి. కొన్ని చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేక రోగులు చికిత్స కోసం వచ్చి వెనుదిరుగుతున్నారు. మందుబిల్లలతో సరిపెడుతూ.. చిన్న రోగాలకు ఫార్మసిస్టులు, నర్సులు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. వైద్యుల సమ్మెతో 104 సేవలకు జ్వరమొచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్లపై పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో పల్లె జనం చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారు. మందు బిల్లలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా ఆస్పత్రుల్లో కొరవడిన సేవలు చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పూర్తిగా కొరవడ్డాయి. ఇక్కడ ప్రధానంగా డాక్టర్ల కొరత వేధిస్తోంది. స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, పలు టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, జీడీఏ తదితర పోస్టుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై అదనపు పనిభారం మోపుతున్నారు. ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది. తద్వారా వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. మధ్యాహ్నానికే పలు సేవలు పరిమితమవుతున్నాయి. దీంతో ప్రజలు వైద్యం కోసం తిప్పలు పడుతున్నారు. ఇదే మాదిరిగానే ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీల్లో సమస్యలు వేధిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిల భారం... జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు శుక్రవారం నుంచి సమ్మె ప్రారంభించాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తప్పనిసరై వారు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా జిల్లాలోని పలు నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో కొన్ని ఆసుపత్రులు రోగులకు అత్యవసర వైద్యం అందించేందుకు తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తున్నా ఆరోగ్యశ్రీలో నమోదు చేయడం లేదు. అడ్మిషన్ అవసరమైన వారికి ప్రాథమిక చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాయి. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్న వారికి మళ్లీ రావాలని వెనక్కి పంపిస్తున్నారు. రూ. వందల కోట్లల్లో పేరుకు పోయిన బకాయిలను చెల్లించే వరకు బంద్ వీడబోమని నెట్వర్క్ ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పేదలు కార్పొరేట్ వైద్యానికి తిప్పలు పడుతున్నారు. వైద్యం విషయంలో పేద ప్రజలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. -
కూటమి భూమాయ!
విజయపురం : వారంతా నిరుపేద కుటుంబానికి చెందినవారు. రోజు కూలికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితి. సొంతంగా సెంటు భూమి లేని నిరుపేదలు. తమ బతుకులు మార్చడానికి ఏ మహాత్ముడైనా రాకపోడా అని ఎదురు చూస్తున్న సమయంలో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సెంటు భూమి లేని ప్రతి కుటుంబానికి పథకంలో భూములు ఇచ్చారు. ఇలా పన్నూరు దళతవాడ, ఆది ఆంధ్రవాడ, బీసీ కాలనీకి చెందిన 200 కుటుంబాలకు జగన్నాథపురం లెక్క దాఖలో ఒక్కో కుటుంబానికి 1.50 ఎకరాలకు పట్టారు ఇచ్చారు. తమకు ఇచ్చిన భూముల్లో ఏటా పంట పండించుకొని హాయిగా బతుకుదామని ఆశ పడ్డారు. అయితే ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి అకాల మరణం అనంతరం వారి ఆశలు ఆడియాశగా మారాయి. ఆపై వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఈ అంశాన్ని మరుగున పడేశాయి. లబ్ధిదారులకు తమ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. గత ప్రభుత్వంలో మరుగున పడ్డ వీరి సమస్యను ఆరా తీసి, ఆ ఫైళ్లకు బూజు దులిపి, గుట్టలుగా ఉన్న స్థలాలకు ఒక రూపురేఖకు తెచ్చి సమస్య పరిష్కారం దిశగా కొలిక్కి తెచ్చారు. తీరా భూములు చూపే సమయంలో అధికారం మారడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. భూకేటాయింపులో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పచ్చ కండువా వేసుకున్న వారికి, పచ్చనోటు చూపే వారికి మాత్రమే స్థలాలు చూపుతున్నారు. భూములు లేక, ఆర్థికంగా కుంగిపోయిన పేదలు భూములు ఎక్కడున్నాయో చూపాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి భూములు ఎక్కడ ఉన్నాయో ఇంత వరకు తెలియక ఆందోళనకు గురవుతూ తమ ఆగ్రహాన్ని అధికారుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు ఇస్తేనే పనులు ..విజయపురం మండలంలో భూ సమస్య తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకోవాలంటే రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఎంత ఎక్కువ మొత్తంలో ముడుపులు ఇస్తే పనులు అంత తొందరగా పరిష్కారం అవుతాయి. లేకుంటే ఎన్నేళ్లైనా ఆ సమస్య పరిష్కారం కాదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు రైతులు రూ.10 వేలు నుంచి 50 వేల వరకు ఇచ్చుకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
రూ.20 లక్షలు చోరీ
నగరి: పట్టణ పరిధిలోని ఏకాంబరకుప్పం గ్రామంలో తాళాలు వేసిన ఓ ఇంట్లో సుమారు రూ.20 లక్షల భారీ చోరీ జరిగింది. స్థానిక సీఐ విక్రమ్ కథనం మేరకు.. ఏకాంబరకుప్పం గ్రామంలో విద్యుత్ శాఖ ఉద్యోగి నీలకంఠం నివాసం ఉంటున్నాడు. ఈనెల 10వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి అత్తిమంజేరిపేటలో బంధువుల రిసెప్షన్కు వెళ్లాడు. 11వ తేదీన ఇంటికి రాగా ఇంట్లో దొంగలు పడ్డట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగులగొట్టి అందులోని 174 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించినట్లు గుర్తించాడు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని నీలకంఠం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో తొమ్మిది గొర్రెలు మృతి ఐరాల: మండలంలోని చిగరపల్లెలో విద్యుత్ షాక్ తో తొమ్మిది గొర్రెలు మృతిచెందాయి. వివరాలి లా ఉన్నాయి.. చిగరపల్లెకు చెందిన ఏసు గొర్రెల ను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్లో రోజూలాగే శనివారం రాత్రి తన గొర్రెలను ఉంచి, ఇంటికి వెళ్లిపోయాడు. షెడ్కు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తెగి పడడంతో షెడ్ చుట్టూ వేసిన ఇనుప కంచెకు తగిలింది. ఆ వైరు ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై షెడ్డులో ఉన్న తొమ్మిది గొర్రెలు మృతి చెందాయి. ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి గొర్రెలు మృతిచెంది ఉండడంతో బోరున విలపించాడు. జీవనాధారం కోల్పోయానని ఏసు కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతి చెందిన గొర్రెలకు మద్దిపట్లపల్లె పశువైద్యాధికారి పినాకపాణి పోస్టుమార్టం చేశారు. లారీ ఢీకొని యువకుడి మృతి పుంగనూరు: పట్టణ సమీపంలోని బైపాస్ సర్కిల్లో ఆదివారం బైక్ను లారీ ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పెద్దపంజాణి మండలం షాపూర్ గ్రామానికి చెందిన మహబూబ్బాషా కుమారుడు జమీర్(24) ద్విచక్ర వాహనంలో పంజాణికి వెళుతున్నాడు. పుంగనూరు బైపాస్ సర్కిల్లో అతివేగంగా వచ్చిన ఐచర్ లారీ ఢీకొంది. దీంతో జమీర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో కారులో వెళ్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, కృష్ణమూర్తి ప్రమాదాన్ని గమనించి కారును ఆపారు. బాధితుడికి ప్రథమ చికిత్స చేయించి, 108లో ఆస్పత్రికి తరలించారు. అతను మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
‘మోదీకి విజ్ఞప్తి.. NDA అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే’
సాక్షి, నగరి: ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే(NDA) అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం(AP Liquor Case) మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు(CM Chandrababu) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ కాపాడారు. ఏపీలో 43వేల బెల్ట్ షాపులు తొలగించారు. మద్యం దుకాణాలను మూసేశారు. కానీ, టీడీపీ నాయకుల మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం. ఎన్డీయే అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు?.సాక్ష్యాలతో దొరికిన పచ్చ బ్యాచ్..దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పైనుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. ఏ జిల్లాలో చూసినా మన మొలకలచెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా కట్టే పరిస్థితి కాదు. ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెడిపేస్తూ వాళ్ళ మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తూ సిగ్గులేకుండా మళ్ళీ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.మహిళా ద్రోహి చంద్రబాబు.. చంద్రబాబు మొదటి నుంచి మహిళా ద్రోహి. మహిళలు అంటే గౌరవం లేదు. ఆడదాని పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. మరి ఆడవాళ్ళ మానప్రాణాలకు ఏం విలువ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వీటివల్ల మహిళల మాన, ప్రాణాలకి హాని కలుగుతుంది. ఏపీలో 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని, ఎంతమంది ఆడవాళ్లపై లైంగిక దాడులు జరిగాయి. ఎంత మందిని హత్య చేశారు. కొంత మంది మహిళలు అదృశ్యం కాగా.. ఇప్పటివరకు కూడా దొరకలేదు’ అని విమర్శలు చేశారు.కమీషన్లు, దందాలు బయటకు రావాలి..తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ కోవర్టు అయితే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు.. ఎందుకిచ్చారు?. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మైన్స్, వైన్స్లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్ రెచ్చిపోతోంది. ప్రధాని మోదీకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలి అని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్సార్సీపీ కోవర్టులు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు. ఈ లిక్కర్ కేసుకి మూలం సురేంద్ర నాయుడు అనే వ్యక్తి.. లోకేష్కు ఎంత సన్నిహితులు అనేది అందరూ కూడా గమనించాలి. కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006లో హత్య చేసిన వ్యక్తి. జీవితకాలం శిక్ష ఉంది. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక క్షమాభిక్ష పెట్టించారు. అతడిని బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబు క్రిమినల్స్కు ఆశ్రయం ఇచ్చారు అని మండిపడ్డారు. -
వరద బాధితులకు అన్నదానం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని నీవానది ప్రాంతంలోకి వరదనీళ్లు రావడంతో అక్కడి కాలనీ వాసులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి అన్నదానం చేశారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అల్తాఫ్ ఆధ్వర్యంలో అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వరద బాధితులతో విజయానందరెడ్డి మాట్లాడి వాళ్ల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వరద నీళ్లు ఇళ్లలోకి రాకుండా తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని పలువురు విజయానందరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా నీవానది పరివాహక ప్రాంతంలో ప్రహరీ నిర్మించాలన్నారు. ఏడాదిన్నరలో ఇప్పటికే రెండు మార్లు వరదనీళ్లు ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయన్నారు. ఎమ్మెల్యే తన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వెంకటేష్, నవాజ్, మురుగదాస్, గౌస్ఖాన్, నిజాం, గఫార్, రియాజ్ పాల్గొన్నారు. కాగా అన్నదానం కూడా చేయనీకుండా పలువురు పోలీసులు అక్కడి నుంచి పంపించేయడం గమనార్హం. -
మళ్లీ ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు: మండలంలో రెండు రోజుల తర్వాత తిరిగి ఏనుగులు ప్రవేశించాయి. భాకరాపేట అడవుల్లోకి వెళ్లి పోయాయనుకుని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి దర్శనమివ్వడంలో బెంబేలెత్తిపోతున్నారు. శనివారం తెల్లవారు జామున పాతపేట, ఎద్దులవారిపల్లె, కోటపల్లె, పాళెం గ్రామాల్లోని పొలాల్లో ప్రవేశించి పంటలను ధ్వంసం చేశాయి. రైతులు హరి, ప్రసాద్, నాగరాజ, మునిరత్నం పొలాల్లో అరటి, టమాట, వేరుశనగ, మామిడి వరి పంటలను తొక్కి నాశనం చేశాయి. డీఎస్డీఓగా ఉదయ్భాస్కర్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీవో)గా ఉదయ్భాస్కర్ను నియమిస్తూ శాప్ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. సత్యసాయి జిల్లా డీఎస్డీవోగా ఉన్న ఆయన చిత్తూరుకు బదిలీపై రానున్నారు. ఇప్పటి వరకు డీఎస్డీవోగా ఉన్న బాలాజీని చిత్తూరులోనే ఖోఖో కోచ్గా కొనసాగించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఎఫ్సీ రూటే సపరేటు
‘మేము ఆటో డ్రైవర్లం. ఎఫ్సీకి నేరుగా వస్తే పని కాదు.. వస్తే సాకులు చెప్పి రిజెక్టు చేస్తున్నారు. అదే ఏజెంట్ల ద్వారా వస్తే తక్షణం పనులు జరుగుతున్నాయి. ఆటోకు ఎఫ్సీ గడువు తీరి నాలుగు నెలలు గడుస్తోంది. దీనికారణంగా ఆన్లైన్లో చలానా రూ.1,400 వరకు వచ్చింది. ఒక్కో ఆటోకు ఓ ఏజెంట్ రూ.3,400 వరకు వసూలు చేస్తున్నాడు. లేకుంటే ఒకటికి రెండు సార్లు రావాలంటే ఇబ్బంది పడాలి, జిల్లా అంతటికీ ఇదొక్కటే సెంటర్..శ్రీ అంటూ వారి ఇబ్బందులను బహిరంగంగానే ఆటో డ్రైవర్లు ‘సాక్షి’కి వివరించారు. కాణిపాకం : ఇటీవల ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న ఫిట్నెస్ సెంటర్ (గవర్నమెంట్ అప్రూవ్డ్ ఆటోమేటిడ్ టెస్టింగ్ స్టేషన్)లో అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి వాహనానికీ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఆయా వాహనాలకు యజమానుల నుంచి భారీగా కమీషన్లు తీసుకుంటూ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఏజెంట్లుగా అవతారమెత్తిన దళారులు ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీటి కట్టడికి కళ్లెం వేసే వారు లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా దోచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని వాహనాలకూ ఇక్కడే.. పరీక్ష ! జిల్లా కేంద్ర సమీపంలోని బంగారుపాళ్యం వద్ద ఇటీవల ఆటోమెటిక్ ఫిట్నెస్ స్టేషన్ ఏర్పాటయ్యింది. ఎఫ్సీ కోసం జిల్లాలోని ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన అన్ని వాహనాలు ఇక్కడే పరీక్షించుకోవాలి. కుప్పం, పుంగనూరు, నగరి, పలమనేరు నియోజకవర్గాల వారికి ఈ టెస్టింగ్ సెంటర్ ఇబ్బందికరంగా మారింది. రానుపోను ఒక రోజంతా కేటాయించాల్సి వస్తోంది. ఒక వేళ టెస్ట్ పాస్ కాకపోతే మళ్లీ రావాల్సి వస్తోంది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు వసూళ్లకు తెరలేపారు. పాత వ్యక్తులే ఇక్కడ ఏజెంట్గా పాతుకుపోయి దందా కొనసాగిస్తున్నారు. పాతుకుపోయారు ఇన్నాళ్లు కార్యాలయంలో పాతుకుపోయిన ఏజెంట్లే.. ఇప్పుడు ఏటీఎస్ వద్ద పాగా వేశారు. వారి కన్నుసన్నల్లోనే ఏటీఎస్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏజెంట్లకు ఆయా వాహనాలకు సుమారు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్ ముట్టజెప్తేనే బండి పాస్ అవుతున్నాయి. లేదంటే సాకులు వెతికి గేటు నుంచి వెనక్కి పంపేస్తారు. పొరపాటున ఎవరైనా సిఫార్సు ద్వారా చలానా మాత్రమే తీసి టెస్టింగ్కు పంపిస్తే మాత్రం, లేనిపోని కారణాలు చెప్పి ఫిట్నెస్ ఫెయిల్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇక బండి రాకున్నా కూడా రూ.10 వేలు ఇస్తే పరీక్ష చేసేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గంటల కొద్దీ నిరీక్షణ కొన్నేళ్ల కిందటి వరకు ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలంటే క్షణాల్లోనే ఇచ్చేవారు. ఆయా వాహనాలకు సంబంధించిన కాగితాలు చూసి ఆర్టీఏ సిబ్బంది వాహనాన్ని డ్రైవింగ్ చేసి పంపేవారు. కానీ ప్రస్తుతం ఫిట్నెస్ కేంద్రంలో ఏదైనా వాహనం లోపలకు వెళ్తే మాత్రం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం వెళ్లిన బండ్లు సాయంత్రానికే తిరిగి వస్తాయి. సహనం కోల్పోతున్న వాహన డ్రైవర్లు ఫిట్నెస్ కేంద్ర సిబ్బందితో వాగ్వావాదం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతా ఏజెంట్ల సమక్షంలోనే.. గత ప్రభుత్వంలో ఆర్టీఏ పనులు వాహన్ యాప్లో, స్థానిక సచివాలయంలో త్వరితగతిన జరిగేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏజెంట్లతోనే అంతా కమీషన్ పద్ధతిలో ఫిట్నెస్ కేంద్రంలో జరగడం గమనార్హం. ప్రతీ ఫైల్కు ఒక్కో రేటు పెట్టి ఆ రేటును ఏజెంట్లకు ముట్టజెప్పితేనే బండికి ఫిట్నెస్ అందిస్తారు. అయితే ఇవేమీ అక్కడ చెల్లుబాటు కావడం లేదు. కేవలం ఏజెంట్ల చేతిలోనే జరిగిపోతున్నాయి. పట్టించుకునే వారు లేక మూముళ్ల వ్యవహారం మితిమీరిందని పలువురు ఆరోపిస్తున్నారు. ముక్కుపిండి వసూళ్లు డబ్బులు ఇవ్వొద్దు ఒకప్పుడు వాహనానికి ఫిట్నెస్ పరీక్షలు మా ఆర్టీఏ పరిధిలో ఉండేవి. ఇప్పుడు అంతా ప్రైవేటుపరమైంది. బండిని సక్రమంగా టెస్టుకు తీసుకెళ్లండి. లోటుపాట్లు లేకుండా చూసుకోండి. అసలు డబ్బులు ఇవ్వొద్దు. ఏదైనా ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందిస్తాం. చర్యలు తీసుకుంటాం. – కృష్ణవేణి, జేటీసీ, రవాణాశాఖ జిల్లాలోని ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు సంబంధించి ఇక్కడ నుంచే ఫిట్నెస్ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారు, బస్సు, ఆటో, లారీ ఏ వాహనమైనా ప్రభుత్వానికి కట్టాల్సిన చలానా రూ.800 నుంచి రూ.2,000 లోపు ఉంటుంది. ఆటోకు రూ.600, టాటా ఏస్, బొలెరో, నాలుగు చక్రాల గూడ్స్ వాహనాలకు రూ.1,200, సెవెన్ సీటర్ మోటర్ క్యాబ్కు రూ.2 వేలు, టెంపో వాహనాలకు రూ.2,500, ఎంజీవీ వాహనాలకు రూ.2,500, పది చక్రాల టిప్పర్కు రూ.3 వేలు, 12 చక్రాల లారీ (టిప్పర్)కు రూ.3,200, 14, 16 చక్రాల లారీకి రూ.4 వేలు, బస్సుకు రూ.3,500, ట్రాక్టర్కు రూ.వెయ్యి చలానా కట్టాలి. అయితే ఫీజులతో పాటు అదనంగా వసూలు చేస్తుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఏ వాహనానికి ఎంత మామూళ్లు వసూలు చేయాలో ముందుగానే ధర నిర్ణయించి కరపత్రం రూపంలో ఏజెంట్లకు అందజేయడం, ఆ ప్రకారమే మామూళ్లు వసూలు చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. -
ఉగ్రరూపం దాల్చిన బహుదానది
తవణంపల్లె: మండలంలోని బహుదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పాటు అరగొండ వద్ద బహుదానది ఉగ్రరూపం దాల్చింది. పడమటి మండలాల్లోని అడవుల్లో నుంచి భారీగా వర్షపు నీరు చేరుతోంది. మాధవరం వంక, బోయపల్లె వంక, మత్యం వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇవి బహుదానదిలో కలవడంతో నదికి వరద నీరు పోటెత్తింది. శనివారం సాయంత్రానికి నదిలో నీటి శాతం కొంతమేర తగ్గింది. తెగిన కల్వర్టులు ప్రతి ఏటా భారీ వర్షాలప్పుడు కల్వర్టులు తెగిపోవడం రివాజుగా మారుతోంది. అరగొండ–గాజులపల్లె మధ్యలో ఉన్న కల్వర్టు, గాజులపల్లె–సరకల్లు రోడ్డు మధ్యలో తొడతర దగ్గర ఉన్న కల్వర్టు, అరగొండ– ఎ.గొల్లపల్లెకు వెళ్లే దారిలోని కల్వర్టు, మత్యం క్రాస్– ఎగువ మత్యం వెళ్లే దారిలోని కలర్టులు వరద ఉధృతికి కోతకు గురయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కనీసం పాల వ్యాన్లు, స్కూల్ బస్సులు కూడా తిరగడం లేదు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 35 గంటల పాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు తగ్గుముఖం పట్టి వాగుల్లో ప్రవాహం ఉధృతి తగ్గే వరకు జనాలు తెగిన కల్వర్టులపై వెళ్లరాదు. వరద ఉధృతికి దెబ్బతిన్న కల్వర్టు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాహనాలు, ప్రజలు వెళ్లకుండా అడ్డుకట్టలు వేయించారు. – సుధాకర్, తహసీల్దార్ -
నా కొడుకుని బతికించండి
గంగాధరనెల్లూరు: ‘ఒక్కగానొక్క కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పట్టుమని పదేళ్లు నిండకుండానే లివర్ సమస్యతో అల్లాడిపోతున్నాడు. రోజురోజుకీ బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తోంది. అతన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కాపాడుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదు. సాయం చేసే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం.’ అంటూ కడుపులో బాధ దిగమింగుకుని, కళ్లల్లో నీళ్లు పెట్టుకుని గంగాధరనెల్లూరు మండలం, తూగుండ్రం పంచాయతీ, బాలయ్యకొత్తూరు గ్రామానికి చెందిన దంపతులు నీతూ, నరసింహారెడ్డి వేడుకుంటున్నారు. వివరాలు.. నీతూ, నరసింహారెడ్డికి వెంకటేష్ (9), చంద్రిక (7) పిల్లలున్నారు. కుమారుడు వెంకటేష్ తూగుండ్రం ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అతనికి ఏడాది క్రితం జ్వరం రావడంతో చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందించారు. ఆపై వివిధ సమస్యలు రావడంతో చీలాపల్లి సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి వెంకటేష్కి లివర్ సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. ఏడాదిగా రూ.8 లక్షల వరకు అప్పు చేసి మందులు, మాత్రలతో నెట్టుకొస్తున్నారు. కానీ బిడ్డ పరిస్థితి మాత్రం మెరుగు పడలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రాణాలు అడ్డుపెట్టిన తల్లి! ఈ క్రమంలో తన తల్లి నీతు లివర్ను కొంత తీసి బిడ్డకు పెట్టాలని నిశ్చయించారు. దానికి డాక్టర్లు కూడా అంగీకరించారు. అయితే చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో తల్లీబిడ్డ ఆపరేషన్ తర్వాత పరిస్థితి ఏంటని మదనపడుతున్నారు. ఆపరేషన్కు రూ.20 లక్షలు, బాధితులు కోలుకోవడానికి మరో రూ.పది లక్షల వరకు అవసరముంటుందని డాక్టర్లు చెబుతున్నారు. -
నియామక పత్రాల జారీ
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ కొత్త టీచర్ల నియామకానికి సమయం ఆసన్నమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,394 మంది సోమవారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న గురువులు సామాజిక, నైతిక విలువలతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేసి పిల్లల అభివృద్ధి, సర్కారు బడుల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొంటున్నారు. ఈ మేరకు కొత్త టీచర్లకు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, డీఈఓ వరలక్ష్మి చేతుల మీదుగా శనివారం నియామకపత్రాలు అందజేశారు. రైలు కింద పడి వృద్ధుడి మృతి పుత్తూరు: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకొంది. రైల్వే ఎస్ఐ మధు కథనం మేరకు.. పుత్తూరు మండల పరిధిలోని ఎగువ తిరుమలకుప్పం గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు(77) తిరుపతికి వెళ్లడానికి స్థానిక రైల్వే స్టేషన్కు రామారావు కాలనీ నుంచి అడ్డదారిలో బయల్దేరాడు. ప్రమాదవశాత్తు కన్యాకుమారి వెళ్లే వివేక్ ఎక్స్ప్రెస్ కింద పడి మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తమైన అధికారులు తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టాఫ్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచారంపై వీసీ ఆచార్య నర్సింగరావు విశ్వవిద్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ పరిసరాల్లో ఆయన పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు, ఆ ప్రాంతంలో తిరిగే వారికి తెలిసేలా బారికేడ్లను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అభిషేక సింహాసనం బహూకరణ చంద్రగిరి : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి దాతలు అభిషేక సింహాసనాన్ని బహూకరించారు. శనివారం ఆలయ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి అందజేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకు చెందిన మదన్ మోహన్ రెడ్డి, యువజ్యోతి దంపతులు స్వామి వారికి కై ంకర్యాలను నిర్వహించేందుకు అభిషేక సింహాసనం అవసరమని తెలుసుకుని, అభిషేక సింహాసనాన్ని రూ.9 లక్షల వ్యయంతో తయారు చేయించారు. అనంతరం వాటిని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
షెడ్డు తొలగిస్తావా! కేసులు పెట్టమంటావా?
పాలసముద్రం: ‘షెడ్డు తొలగిస్తావా.. కేసులు పెట్టమంటావా..?’ అంటూ టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఓ వ్యక్తిని బెదిరించిన ఘటన మండలంలో సంచలనంగా మారింది. వివరాలు.. మండలంలోని వనదుర్గాపురం ఆదిఆంధ్రవాడకు చెందిన పీ.కృష్ణయ్యకు 2019 నుంచి జగనన్న కాలనీలోని ఖాళీ స్థలంలో కొబ్బరి కీతులతో గుడిసె వేసుకుని అందులో నివాసముంటున్నాడు. వనదుర్గాపురంలో ఉన్నట్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం అప్పు చేసి పక్కనే ఇనుపరేకులతో షెడ్డు వేశాడు. దీన్ని గమనించిన వనదుర్గాపురంలోని టీడీపీ నాయకులు డబ్బులిస్తే పట్టా ఇప్పిస్తామని, లేకుంటే షెడ్డుని తొలగించి బయటకు వెళ్లగొడతామని బెదిరించారు. కానీ కృష్ణయ్య వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆగ్రహించిన టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ అరుణకుమారి, ఆర్ఐ దేవి, వీఆర్ఓ వెంకటాచలం శనివారం షెడ్డు వద్దకు చేరుకుని పరిశీలించారు. రాజకీయ ఒత్తిడి ఎక్కువైందని, వెంటనే షెడ్డుని తీసేయాలంటూ హుకుం జారీచేశారు. లేకుంటే కేసులు పెడతామంటూ వీఆర్వో వెంకటాచలం హెచ్చరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ వనదుర్గాపురం పంచాయతీల్లో అగ్రకులస్తులకు ఒక్కో కుటుంబంలో రెండు, మూడు పట్టాలున్నాయని, రోజూ కూలికెళ్లే తనకు ఇంటి పట్టా ఇవ్వమంటే ఎలా అని టీడీపీ నాయకులతోపాటు అధికారులను నిలదీశారు. సంబంధిత ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
తల్లిఒడికి చేరకనే..
చౌడేపల్లె: పురిటిబిడ్డ తల్లి ఒడికి చేరకనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆ కుటుంబంమంతా విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబీకుల కథనం.. చౌడేపల్లె టౌన్, కుమ్మరవీధికి చెందిన ప్రసాద్, కవిత దంపతులకు పైళ్లెన ఏడాదికి కుమార్తె జన్మించినది. అప్పటి నుంచి సంతానంలేదు. ఇటీవలే కవిత మరోసారి గర్భందాల్చింది. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించగా హైరిస్క్ కేసుగా చౌడేపల్లె వైద్యులు నిర్ధారించారు. అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. నెలలు నిండడంతో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ప్రయివేటు వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ లేకపోగా అక్కడే విధుల్లో ఉన్న ఏఎన్ఎంకు హైరిస్క్ గర్భిణి కేసుగా తెలియజేసి అడ్మిట్ చేయించారు. డాక్టర్లు గర్భిణీని పట్టించుకోలేదు. నార్మల్ డెలివరీ చేయించాలని సమయం వృథా చేశారు. బిడ్డ సుమారు 3.75 కేజీల బరువు ఉండడంతో డెలివరీ కష్టతరంగా మారింది. సిబ్బంది అతికష్టం మీద శనివారం ఉదయం 10.10 గంటల మధ్య చిన్నపాటి సర్జరీ చేసి బిడ్డ బయటకు వచ్చేలా చర్యలు చేపట్టారు. అప్పటికే పురిటి బిడ్డ హార్ట్బీట్ ఆగిపోయింది. డాక్టర్ పరీక్షించి పురిటిబిడ్డ మృతి చెందినట్టు నిర్ధారించారు. తల్లిదండ్రులు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని, హైరిస్క్ కేసు అని చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. శస్త్ర చికిత్సచేసి ఉంటే తమ బిడ్డ బతికేదన్నారు. కడుపుపై ఒత్తడంతోపాటు, బలవంతంగా బిడ్డ బయటకు వచ్చేలా చేయడంతోనే చనిపోయిందని ఆరోపించారు. ఈ మేరకు వైద్య సిబ్బందిపై మదనపల్లె టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునారావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. పురిబిడ్డను అశ్రునయనాల నడుమ చౌడేపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. -
అంబేడ్కర్ భిక్షతోనే మనందరికీ పదవులు
వెదురుకుప్పం: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పెట్టిన భిక్షతోనే మనమందరం ఎమ్మెల్యేలు, మంత్రులుగా పదవిలో కొనసాగుతున్నామని హోం మంత్రి అనిత అన్నారు. శనివారం వెదురుకుప్పం మండలంలోని దేవళంపేట గ్రామంలో పర్యటించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్కు జరిగిన అవమానం జాతికందరికీ జరిగినట్టేనన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక ఇలాంటి కుయుక్తులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నట్లు చెప్పారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్రావు, ఎమ్మెల్యేలు థామస్, మురళీమోహన్, ఎంఎస్రాజు, మాజీ ఎంపీటీసీ మోహన్మురళి పాల్గొన్నారు. -
నియామక పత్రాల జారీ
డీఎస్సీ కొత్త టీచర్లకు నియామకపత్రాలు జారీ చేశారు. వారంతా సోమవారం నుంచి పాఠశాలలకు వెళ్లనున్నారు. వేరుశనగ పంట ధ్వంసం తవణంపల్లె: వేరుశనగ పంట చేతికొచ్చే సమయంలో రాత్రుల్లో అడివి పందులు దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ఒడుపుకొనే సమయంలో కాయలను పూర్తిగా ఆరగిస్తున్నాయి. మండలంలో పలు చోట్ల కోతులు, అడవి పందుల వల్ల పంట దెబ్బతింటోంది. దీనిపై అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 15న మామిడి రైతులఆక్రందన సభ గంగాధర నెల్లూరు: బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వద్ద ఈనెల 15న మామిడి రైతుల ఆక్రందన సభ నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షుడు జనార్దన్ తెలిపారు. గంగాధరనె ల్లూరు మండల కేంద్రంలో మామిడి రైతులతో ఆక్రందన సభకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. మామిడి రైతులకు దాదాపు రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. మామిడి రైతు సంఘం కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాసులు, ఉపాధ్యక్షురాలు హేమల త, నేతలు త్యాగరాజులరెడ్డి, సందీప్రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, రాజేంద్ర నాయు డు, మోహన్రెడ్డి, చక్రవర్తి పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జలాశయం గేట్ల ఎత్తివేత
పెనుమూరు(కార్వేటినగరం): జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కలవకుంట వద్ద ఉన్న ఎన్టీర్ జలాశయం గేట్లను శనివారం ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. మొత్తం 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి ఎగువ ప్రాంతాలైన పూతలపట్టు, పాకాల, దామలచెరువు, ఐరాల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పది వేల క్యూసెక్కుల నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ ఏఈ భరత్ తెలిపారు. చిత్తూరు– పెనుమూరు జాతీయ రహదారిపై జలాశయం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జలాశయానికి దిగువన ఉన్న జీడీనెల్లూరు ప్రజలు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎలాంటి పరిస్థితుల్లోనూ నదిని దాటేందుకు సాహసించొద్దని సూచించారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు..!
చిత్తూరు అర్బన్: ‘‘ఎమ్మెల్యే చెప్పినా అంతే. చట్టం చట్టమే. ఆ టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు’’ అంటూ చిత్తూరు కూటమి పార్టీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయుడుపై జనసేన నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిత్తూరులోని ఓ హోటల్లో శనివారం హై రోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు మాట్లాడుతూ చిత్తూరులోని హైరోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని, తాము ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించామన్నారు. పరిహారం, టీడీఆర్ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఇంతలో సభలో కూర్చున్న జనసేన నాయకుడు దయారాం నాయుడు మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి? ఎమ్మెల్యే ఓ పొరంబోకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినపుడు హైరోడ్డు భవన యజమానులకు పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. ఇప్పుడు కూడా ఆయన వద్ద్దకే వెళ్తాం. కూటమి ఉంటుందో, ఊడిపోతుందో తర్వాత కథ. నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది. కొట్టండి నీవానది ఆక్రమణల్ని. చంద్రబాబు అమెరికా, యూరప్ పోయి ఫండ్స్ తీసుకొస్తా, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తా అంటున్నారు. ముందు చిత్తూరు హై రోడ్డును అభివృద్ధి చేయండి. శ్మశానంలాగా తయారయ్యింది హై రోడ్డు’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మహిళ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వం పనికిరాని భూములకు రూ.కోట్లలో పరిహారం ఇచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలియదా? ఎంతసేపు బిల్డింగ్ కొట్టేయండి, కొట్టేయండి అని ఎమ్మెల్యే అంటున్నారు. ఆయనకు పేరు వచ్చేయాలి. మరి మేము రోడ్డున పడాలా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చిత్తూరు హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తామని, టీడీఆర్ బాండ్లు తమకు వద్దని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. -
● మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గం
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గమని దుయ్యబట్టారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తెచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రయివేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. దీన్ని అడ్డుకుంటామని ప్రతిన బూనారు. – చిత్తూరు అర్బన్/ బంగారుపాళెం/ పలమనేరు/నగరి/ కుప్పం/ కార్వేటినగరం చిత్తూరు: పోస్టర్లు ఆవిష్కరిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డిపోస్టర్లను ఆవిష్కరిస్తున్న పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడనగరి: పోస్టర్లు ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రి సోదరుడు రామ్ప్రసాద్రెడ్డికుప్పంలో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు కార్వేటినగరం మండలంలో పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సమన్వయకర్త కృపాలక్ష్మిబంగారుపాళెం: పోస్టర ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమార్, లలితకుమారి -
ఇచ్చిన హామీ ఎక్కడ?
నీవానది పరివాహక ప్రాంతంలో రిటైన్వాల్ ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. గోడ ఎక్కడ నిర్మించారు..? కార్పొరేషన్ నిధులతో ప్రజలకు భోజనాలు అందిస్తే, ఎమ్మెల్యే ఏదో దానం చేసినట్టు ప్రచారం చేయించుకుంటున్నారు. చిత్తూరు ప్రజల ఇబ్బందులు చూడటానికి కూడా ఎమ్మెల్యేకు సమయంలేదా..? అసలు ఎమ్మెల్యే ప్రజలు అందుబాటులో ఎక్కడున్నారు..? కార్పొరేషన్ అధికారులు వరదల పేరిట, నీవానది శుభ్రత కోసం ఎంత ఖర్చు చేశారు..? ఏ నాయకుడి జేబులు నింపుతున్నారనే వివరాలు కూడా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాం. – విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్సీపీ -
త్వరలో కానిస్టేబుళ్లకు శిక్షణ
చిత్తూరు అర్బన్: ఇటీవల వెలువడ్డ పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో త్వరలోనే శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి డీటీసీని పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ శిక్షణలో కనీస వసతులు, సదుపాయాలు పక్కాగా ఉండాలన్నారు. ఏఆర్ ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీ మహబూబ్, సీఐలు అమర్నాథరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు. విచారణ అధికారి నియామకం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం తహసీల్దార్గా షబ్బీర్బాషా (ప్రస్తుతం కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నారు) పనిచేసే సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన 2023 మార్చి 21న జరిగింది. ఆయనతో పాటు తయ్యూ రు వీఆర్వో గోవిందరెడ్డి సైతం ఈ కేసులో పట్టుబడ్డారు. వారిపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేస్తూ ఈ నెల 10న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఇద్దరినీ విచారించేందుకు చిత్తూరు జాయింట్ కలెక్టర్ను విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. -
చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
● రూ.28 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర నేరస్తుడు హెచ్.హనుమంతప్ప (27)ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు రూ.28 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏఆర్ పోలీసు కార్యాలయంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, టూటౌన్ సీఐ నెట్టికంటయ్య, ఎస్ఐ రమేష్తో కలిసి మీడి యాకు వివరాలను వెల్లడించారు. గతనెల 30న నగరంలోని రామ్నగర్ కాలనీకు చెందిన అల్తాఫ్ అనే వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగులగొట్టి.. ఇంట్లో ఉన్న 150 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని చిత్తూరు–కాణిపాకం బైపా స్ వద్ద కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన హను మంతప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చిత్తూరులో జరిగిన చోరీతో పాటు అనంతపురంలోని ఓ ఇంట్లో 60 గ్రాము ల బంగారు, రూ.2 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనం కూడా తానే చోరీ చేసినట్లు నిందితు డు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ.25 లక్షల విలువచేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి హాజరుపరచగా, రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. మహిళ అదృశ్యంపై కేసు పుంగనూరు: మండలంలోని నెక్కుంది గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అదృశ్యమైంది. శుక్రవారం భర్త ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేదని , తన భార్య అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పనితీరును పర్యవేక్షించండి చిత్తూరు కలెక్టరేట్ : మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అభివృద్ధి పనుల పనితీరును కచ్చితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్లోపు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో నిర్వహిస్తున్న పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. నవంబర్లోపు జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయకుమార్, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
మైండ్ బ్లాంక్!
చిత్తూరు కలెక్టరేట్ : కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన డీఎస్సీ నూతన టీచర్లకు కూటమి ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పోస్టింగ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోంది. తమకు నచ్చిన విధంగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టింది. పోస్టింగ్ల కౌన్సెలింగ్లో నిబంధనలను అమలు చేయకుండా సూచించిన చోటే కోరుకోవాలని నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. ఏకంగా 500 పోస్టులకు పైగా బ్లాక్ చేయడం దుమారం రేపుతోంది. ఎప్పుడూ ఇలా లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హెచ్ఆర్ఏ పేరుతో (కేటగిరీ 1, 2) పోస్టులను 500కు పైగా బ్లాక్ చేశారు. కొత్త టీచర్లకు హెచ్ఆర్ఏ పోస్టులు ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడా లేదు. ఇలా బ్లాక్ చేసిన పోస్టులన్నీ ప్రధాన ప్రాంతాల్లో ఉండడంతో వాటిని డిప్యూటేషన్స్ (ప్రభుత్వ ఆర్డర్) పేరుతో దోచుకునేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో డీఎస్సీ పోస్టింగ్లు ఇచ్చే సమయంలో పోస్టులను బ్లాక్ చేసిన సందర్భాలు లేవని యూనియన్ నాయకులు వాదిస్తున్నారు. లోగుట్టుగా కౌన్సెలింగ్ ప్రక్రియ తిరుపతి జిల్లా కేంద్రంలో ఎస్జీటీలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ లోగుట్టుగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. కౌన్సెలింగ్ నిర్వహించకముందే నూతన టీచర్లకు ముందస్తుగా ఖాళీలను చూపించాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా మోసం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తారని ఉపాధ్యాయ సంఘ నాయకులను లోనికి అనుమంతించ లేదు. కౌన్సెలింగ్ ప్రక్రియను అర్ధరాత్రిలో ప్రారంభించి వేకువ జాము వరకు నిర్వహించారు. ఒకే ప్రాంతంలో నూతన టీచర్లందరికీ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా, అలా చేయకుండా కొందరికి ఒక కేంద్రంలో, మరికొందరికీ మరొక కేంద్రంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా కేంద్రంలో విశ్వం పాఠశాల శిక్షణా కేంద్రంలో ఈ నెల 9న ఉదయం 4.30 గంటల వరకు 1 నుంచి 250 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 10న మెడ్జీ స్కూల్లో వరుస సంఖ్య 250 కు పైన ఉన్న వారిని ఉదయం 7 గంటలకు కౌన్సెలింగ్కు పిలిపించి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరీక్షింపజేశారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. దివ్యాంగ ఉపాధ్యాయులకు అన్యాయం డీఎస్సీలో ఎంపికై న దివ్యాంగ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో అన్యాయం చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో వారికున్న రిజర్వేషన్, రోస్టర్ల ప్రకారం ముందస్తుగా పిలువాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా చివర్లో కౌన్సెలింగ్ నిర్వహించి దివ్యాంగ టీచర్లకు అన్యాయం చేశారు. అవకతవకలు ఇలా... -
బాత్రూమ్లో జారిపడి..
బాత్రూమ్లో జారిపడి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025చిత్తూరులో ఎకై ్సజ్ స్టేషన్ వద్ద మద్యం బాటిళ్లను పగులగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు ‘కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కల్తీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో స్పిరిట్ను అడ్డదారిలో ఆంధ్రాలోకి రప్పించుకున్నారు. విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్రం మొత్తం సరఫరా చేశారు. వందల మంది ప్రాణాలతో చెలగాటమాడారు. కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేశారు. అనేక మంది ఆరోగ్యాల మీద దెబ్బకొట్టారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..?. వారి కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు..?. వారికి అండగా ఎవరు నిలుస్తారు..? సీఎం చంద్రబాబునాయుడా..?!.. లోకేశా.. పవన్కళ్యాణా..?. సమాధానం చెప్పాలి..’ అంటూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ మద్యం పెద్దలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ చిత్తూరు జిల్లా కేంద్రంలో నిరసనలు మిన్నంటించారు. చిత్తూరు అర్బన్: ‘నారా’వారి కల్తీ మద్యానికి అమాయకులు బలవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు నుంచి కల్తీ మద్యం ఏపీ మొత్తానికి సరఫరా అయ్యింది. ఆఫ్రికాలో ప్రణాళికలు రూపొందించి, పేదల ప్రాణాలను తీశారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు..?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కల్తీ మద్యం కేసులో పెద్దలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హై రోడ్డు నుంచి స్థానిక అర్బన్ ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం బాటిళ్లను పగులగొట్టి నిరసన తెలిపారు. అనంతరం మహిళా విభాగం నాయకులు మాట్లాడుతూ మొలకలచెరువులో వెలుగుచూసిన కల్తీమద్యం తయారీ, కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రం మొత్తానికి పాకిందన్నారు. ఈ మౌనం దేనికి సంకేతం? ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం బ్రాండ్లలో కుట్ర జరిగిపోయిందని మసిపూసి మారేడు కాయ చేశారు. తమ నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించారు. ఏదో జరిగిపోయిందంటూ గ్లోబెల్స్ ప్రచారానికి దిగారు. ఇప్పుడు నకిలీ మద్యంలో కూటమి నేతలు అడ్డంగా దొరికిపోయినా మౌనంగా ఉన్నారు. ఇది దేనికి సంకేతం...?’ అంటూ మహిళా నేతలు నిలదీశారు. సరి‘హద్దు’లు దాటిన కల్తీ మద్యం జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులు దాటుకుని స్పిరిట్ చిత్తూరులోకి వస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహిళా నేతలు ఆరోపించారు. ఏడాదికిపైగా కల్తీ మద్యం జోరుగా సాగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అనంతరం ఎకై ్సజ్ పోలీసులకు వినతిపత్రం అందచేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు పీవీ.గాయత్రీదేవి, లీనారెడ్డి, మునిసిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలి రెడ్డి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు హరీషారెడ్డి, కార్పొరేటర్ భాగ్యలక్ష్మిరెడ్డి, కౌసర్, పూంగొడి, బిందు, శాంతి, లత, విజయశాంతి, సృజన పాల్గొన్నారు. ఏరులై పారుతున్న కల్తీ మద్యం -
నూతన అయ్యోర్లతో చెడుగుడు!
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం నూతన అయ్యోర్లతో చెడుగుడు ఆడుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి అభ్యర్థులకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్, రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నూతన అయ్యోర్లు ఉద్యోగాల్లో చేరకముందే నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తీవ్ర ఒత్తిడిని భరించలేక ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఒక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగమే వద్దు అంటూ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఉద్యోగాలు సాధించినప్పటికీ చాలా మంది పాల్గొనకపోవడం సైతం విమర్శలకు తావిస్తోంది. ఖాళీలే ప్రదర్శించకుండా.. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ఉన్న పూర్తి ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే విద్యాశాఖ అధికారులు అలా చేయకుండా లోలోపలే కుట్రలకు పాల్పడి పలు పోస్టులను బ్లాక్ చేశారు. ఈ కుట్రలను ఉపాధ్యాయ సంఘ నేతలు ప్రశ్నిస్తారని పసిగట్టి సంఘ నాయకులకు కౌన్సెలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని ప్రకటించారు.జరుగుతున్న అన్యాయాన్ని నూతన టీచర్లు ప్రశ్నించలేక మిన్నకుండిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కేటగిరీ 1, 2లో దాదాపు 500 పోస్టులను ప్రదర్శించకుండా బ్లాక్ చేశారు. 1:1 ప్రాతిపదికన తిరు, చిత్తూరు జిల్లాల్లో శిక్షణలకు హాజరైన నూతన టీచర్లు ఎంత మంది ఉన్నారో అనే ఖాళీలను ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించారు. 1,394 ఖాళీలు మాత్రమే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,394 మందికి 1,394 ఖాళీలు మాత్రమే ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. నూతన ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాల్లో నియమించేలా కుట్రలకు పాల్పడడంతో దుమారం చెలరేగింది. కనీసం ఖాళీలను కోరుకునే అవకాశం కల్పించలేదని నూతన అయ్యోర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నూతన టీచర్లందరికీ ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా తిరుపతి జిల్లా కేంద్రంలోని ఒక్కొక్క శిక్షణ కేంద్రంలో ఒక్కొక్కసారి కౌన్సెలింగ్ జరపడడంతో నూతన టీచర్లు పూర్తిగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నది మెగా డీఎస్సీ కాదు మాయా డీఎస్సీ అంటూ ఉద్యోగాలు పొందిన నూతన టీచర్లే వెల్లడించడం కొసమెరుపు. కౌన్సెలింగ్లో చూపించిన పోస్టులు 1,394కౌన్సెలింగ్ గందరగోళం ఉన్నతవిద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 9న చిత్తూరులోని శిక్షణ కేంద్రాల్లో వెబ్ కౌన్సిలింగ్, తిరుపతిలోని శిక్షణ కేంద్రాల్లో ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి నిర్వహించకుండా పూటకు ఒక నిర్ణయంతో గందరగోళం సృష్టించారు. మొదట్లో స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, ల్యాంగ్వేజ్ పండిట్ కేడర్లకు మ్యాన్యూవల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వారందరికీ వెబ్కౌన్సెలింగ్ నిర్వహించి, ఎస్జీటీలకు మాత్రం మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒక్కో నిర్ణయం తీసుకుని నూతన అయ్యోర్లకు చుక్కలు చూపించి గందరగోళానికి తెరలేపారు. చివరికి ఈ నెల 9న రాత్రి 7 గంటల సమయంలో తిరుపతి జిల్లా కేంద్రంలోని శిక్షణా కేంద్రాల్లో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ను ప్రారంభించారు. -
కొనసా..గుతున్న స్వచ్ఛీకరణ!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా స్వచ్ఛీకరణ సా..గుతోంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత కొన్ని నెలలుగా కసరత్తు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. జిల్లాల పునర్విభజన అనంతరం చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల స్వచ్ఛీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన ఈ పరిశీలన ప్రక్రియలో పూతలపట్టు నియోజకవర్గం 46 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, చిత్తూరు నియోజకవర్గం 30 శాతంతో ఆఖరి స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 40 శాతం ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ పరిశీలన నిర్వహించారు. ఈ ప్రక్రియ నిర్వహణలో కొన్ని నియోజకవర్గాల అధికారులు అలసత్వం వహిస్తున్నారు. పెరిగిన ఓటర్లు జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2002లో 13,25,269 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 15,68,788 మంది ఓటర్లున్నారు. గత 25 సంవత్సరాల్లో జిల్లా వ్యాప్తంగా 2,43,519 మంది ఓటర్లు పెరిగారు. 2029లో నిర్వహించే సాధారణ ఎన్నికల సమయానికి జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బోగస్ ఓట్లకు చెక్ పెట్టేలా.. జిల్లా వ్యాప్తంగా బోగస్ ఓట్లకు చెక్ పెట్టేలా అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓటర్ల గుర్తింపునకు పాత, కొత్త జాబితాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 2002 నుంచి ఇప్పటి వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉన్న వారిని మాత్రమే స్థానికంగా గుర్తిస్తూ..మిగిలిన వారిన వలసలుగా భావించి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఓటర్ల స్వచ్ఛీకరణ సమాచారంనియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలునియోజకవర్గం ఓటర్ల సంఖ్య పుంగనూరు 2,39,149 నగరి 2,02,709 జీడీ నెల్లూరు 2,05,623 చిత్తూరు 2,03,570 పూతలపట్టు 2,21,638 పలమనేరు 2,69,065 కుప్పం 2,27,034 మొత్తం 15,68,788పకడ్బందీగా ప్రక్రియ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల స్వచ్ఛీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ప్రక్రియను స్వయంగా పరిశీలన చేస్తున్నాం. ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ప్రక్రియ నిర్వహణ పై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలిస్తున్నాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. – సుమిత్ కుమార్ గాంధీ, కలెక్టర్, చిత్తూరు -
అసలు నిందితులను అరెస్టు చేయాలి
తిరుపతి మంగళం : గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని తగలపెట్టిన అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి జీవకోనలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాజకీయ కక్షలతో టీడీపీకి చెందిన సతీష్నాయుడు తగల పెట్టించారని ఆరోపించారు. గతంలో అక్కడ స్థానిక సర్పంచ్ గోవిందయ్య అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే సతీష్నాయుడు అడ్డుకున్నాడని, అయినప్పటికీ అక్కడి దళితులంతా ఒక్కటై ఏర్పాటు చేశారన్నారు. ఆ విషయాలను మనసులో పెట్టుకుని సతీష్నాయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తగల పెట్టించాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్య పైనే తిరిగి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం కూటమి నాయకుల అరాచకాలు, దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. పోలీసులు సైతం కూటమి నాయకులకు కొమ్ముకాస్తూ అంబేడ్కర్ విగ్రహ దహనాన్ని చాలా చులకనగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా అసలైన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్కుమార్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బత్తల గీతాయాదవ్, టౌన్బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్, పార్టీ నాయకులు శ్రీనివాసులు, చేజర్ల మురళి, మద్దాలి శేఖర్, ఆటో ప్రసాద్, కుప్పయ్య, రమణ, శారద, కవితమ్మ, శాంతారెడ్డి, సరస్వతమ్మ, దుర్గ, కుమారమ్మ పాల్గొన్నారు. -
13న నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 13న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రముఖ కంపెనీలలో ఉన్న అప్రెంటిస్షిప్ ఖాళీలను భర్తీ చేసేందుకు పీఎం నేషనల్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేళా చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో శిక్షణ పూర్తిచేసి పాస్ అయిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. హాజరయ్యే వారు అప్రెంటిస్షిప్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేని పక్షంలో తమ కార్యాలయంలో సర్టిఫికెట్లతో సంప్రదించాలన్నారు. నామినల్ రోల్స్ అందజేయండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) స్కాలర్షిప్ పరీక్షల నామినల్ రోల్స్ అందజేయాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రింటెడ్ నామినల్ రోల్స్, ఫీజు చలానాలను ఈ నెల 16వ తేదీలోపు ఆయా హెచ్ఎంలు డీఈవో కార్యాలయంలో అందజేయాలని డీఈవో ఆదేశించారు. గజ ప్రజా యాప్పై విస్తృత అవగాహన చిత్తూరు కలెక్టరేట్ : గజ ప్రజా యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ నూతనంగా ఆవిష్కరించిన గజ ప్రజా యాప్ ఉపయోగాలను ప్రజలకు క్షేత్ర స్థాయిలో తెలియజేయాలన్నారు. వ్యవసాయ పంటల నష్టాలను నివేదించేందుకు యాప్ సహాయం చేస్తుందన్నారు. రైతులు ఈ యాప్ను వినియోగించి పంటల నష్టాల వివరాలను ఫొటోలతో సహా నేరుగా ఫోన్ నుంచి అప్లోడ్ చేయవచ్చన్నారు. ఈ ప్రక్రియ పంట నష్ట పరిహారం ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నారు. యాప్లో పంట నష్టం వివరాలను నమోదు చేస్తే వారంలోపు నష్టపరిహారం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఏనుగుల వల్ల నష్టపోయిన పంటల వివరాలను గజ ప్రజా యాప్లో తెలుసుకోవచ్చన్నారు. త్వరలో ఈ యాప్ ను ప్రముఖుల చేతుల మీదు గా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైల్డ్ లైఫ్ నిష్ణాతులు రాకేష్, ఆర్డీవో భవాని, సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తుల వేచి ఉన్న క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,861 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,802 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. ప్రపంచ దృష్టి లోపం దినోత్సవ ర్యాలీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ప్రపంచ దృష్టిలోప దినోత్సవం నిర్వహించారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి, కంటి వైద్యులు అర్పిత వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం డీఐసీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దృష్టి లోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు వివరించారు. -
నేటి నుంచి బోధనేతర పనులు బహిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నుంచి బోధనేతర పనులను పూర్తిగా బహిష్కరిస్తామని ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్, సెక్రటరీ మునీర్అహ్మద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు గురువారం డీఆర్వో మోహన్కుమార్, డీఈవో వరలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వల్ల బోధనా సమయం కుంటుపడుతోందన్నారు. టీచర్లకు బోధనపై ఆసక్తి తగ్గిపోయే విధంగా కూటమి ప్రభుత్వం బోధనేతర పనులు చెప్పడం దారుణమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించిన పోరుబాటలో బోధనేతరపనులు బహిష్కరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధాహ్న భోజన పథకానికి సంబంధించి మాత్రమే టీచర్లు పనులు చేపడుతారన్నారు. సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఫ్యాఫ్టో సంఘ నాయకులు చెంగల్రాయమందడి, మదన్మోహన్రెడ్డి, కిరణ్, జగదీష్, చిరంజీవి పాల్గొన్నారు. -
భావప్రకటనా స్వేచ్ఛ ఉందా లేదా..?
శ్రీరంగరాజపురం : అధికార పార్టీ ఎమ్మెల్యే, నాయకుల అరాచకం, దోపిడీపై వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం నేరమా..? అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఇటీవల తమపై అనుచిత వాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నాయకుడు, ఉమ్మడి జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య విలేకరుల సమావేశం నిర్వహించారని తెలిపారు. అది పెద్ద నేరమైనట్టు పోలీసులు కుప్పయ్యని ఆదుపులోకి తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసు స్టేషన్కు చేరుకుని తాను మీడియాతో మాట్లాడినా అది నేరమైనట్టు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ ఉందా..లేదా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక పాకిస్థాన్, ఉత్తరకొరియా వంటి నిరంకుశత్వ దేశాల్లో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్తకు, నాయకుడికి ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకుడు ఏకాబరం కూర్చొని ఉంటే కారణం లేకుండా టీడీపీకి చెందిన కొంతమంది రౌడీ మూకలు దాడిచేసి గాయపరచడం బాధాకరమన్నారు. -
చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది మాత్రం..!
సాక్షి, టాస్క్ఫోర్స్: గురివిందకు కింద నలుపు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఓ పాలక మండలి సభ్యుడు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని అంటూనే ప్రతిదీ రాజకీయం చేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో గోవిందా...! నారాయణ..! అంటూనే ఇతరులపై విషం చిమ్ముతున్నాడు. ఆఖరుకి రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన వరివట్టం వ్యవహారం కూడా ఆయన తన రాజకీయ వేదిక కింద మలిచేశారు. టీటీడీలో ఏ వివాదం తలెత్తినా తగుతునమ్మా అంటూ వకల్తా పుచ్చుకుంటున్నాడు. పోనీ వాస్తవాలు చెబుతాడా..! అంటే అదీ లేదు. అన్నీ అసత్యాలే. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. వారికి సంబంధించిన అంశాలు అయితే మాత్రం తిరుమలను వేదికగా చేసుకొని ప్రసంగాలు దంచేస్తాడు. ఇక రోజు మార్చి రోజు దర్శనానికి వచ్చే ఆయన అయితే.. టీటీడీ చైర్మన్ ప్రాపకం కోసం ఆయన చానల్లో కనిపించడం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు. అసత్యాలను వల్ల్లివేస్తున్నాడు.⇒ వరివట్టం కట్టడం విషయంలో గతంలో ఏమైనా జరిగాయో లేదో పక్కన పెడితే ఇలా చేయడం బహిరంగంగా తప్పని పండితులు చెప్తున్నారు.⇒ అయితే సదరు సభ్యుడు పబ్లిసిటీ పిచ్చి కోసం టీటీడీని అడ్డంగా వాడుకుంటున్నాడు. టీటీడీలో అనేక మంది పాలకమండలి సభ్యులు ఉన్నా.. ఎవరూ తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయరు. కానీ సదరు సభ్యుడు మాత్రం శ్రీవారి ఆలయం ముందు నిత్యం రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. 2019 క్రితం పాలకమండలి సమావేశంలో అయితే ఏకంగా చైర్మన్ కార్యాలయంలోనే సమావేశం నిర్వహించి.. రాజకీయ ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై భక్తులు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ⇒ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా ఇలా మాట్లాడడంపై పలువురు భక్తులు రగిలిపోతున్నారు. -
● దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ● బంధువుల రోదనలతో పుత్తూరు ఆసుపత్రి
పుత్తూరు : కై లాసవాసా ఉన్నెపాత్తదానే వందారు.. కై విట్టియే సామి అంటూ పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. బుధవారం సాయంత్రం స్థానిక బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తమిళనాడు పళ్లిపట్టు తాలుకా పొద్దటూరుపేటకు చెందిన మూర్తి (58), సుబ్రమణ్యం(56) అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ ఓబయ్య కథనం మేరకు.. పొద్దటూరుపేటకు చెందిన పవర్లూమ్స్ కార్మికులైన మూర్తి, సుబ్రమణ్యం ఇద్దరు బుధవారం ఉదయం బైక్పై శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొన్నారు. తిరుగు ప్రయాణంలో పుత్తూరు బైపాస్ రోడ్డులో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మూర్తికి నలుగురు పిల్లలు కాగా, సుబ్రమణ్యానికి ముగ్గురు పిల్లలు అందరికీ వివాహాలు అయ్యాయి. -
కల్తీ మద్యం.. కూటమికి నైవేద్యం
తిరుపతి మంగళం : రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కాసుల కక్కుర్తితో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీతాయాదవ్, తిరుపతి నగర బూత్కమిటీ ఇన్చార్జి ఉప్పాల సాయికుమారి మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు తిరుపతిలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయం వద్ద మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. కల్తీ మద్యం అరికట్టాలి, బెల్ట్ షాపులను తొలగించాలి, నకిలీ లిక్కర్ తయారుచేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. టీడీపీ నేతలే విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప నకిలీ లిక్కర్ కారణంగా మహిళల పుస్తెలు తెగిపోతున్నా పట్టదని ఆరోపించారు. ఈ ఏడాదిన్నరలోనే కల్తీ మద్యం తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా లిక్కర్ దందాను నిలిపివేయకుంటే ఇదే మద్యం ఒంటిపై పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. పవన్కల్యాణ్కు ఇప్పడు కల్తీ లిక్కర్ కనిపించం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుణీత, పార్టీ నేతలు నైనారు మధుబాల, విజయలక్ష్మీ రాయల్, పద్మజ, పుష్పలత, మహిత, రాజేశ్వరి, రాధ, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
ఎస్వీ వెటర్నరీలో జాతీయ సదస్సు ప్రారంభం
చంద్రగిరి: పశుపక్ష్యాదులకు అందించాల్సి మెరుగైన వైద్య సేవలు, శస్త్రచికిత్సల కోసం తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ తిలగర్ హాజరవ్వగా, ప్రత్యేక అతిథిగా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జేవీ రమణ, ప్రొఫెసర్ ప్రతాబన్ పాల్గొన్నారు. ఎస్వీ వెటర్నరీ చికిత్స, టీచింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి 14 రాష్ట్రాల నుంచి 25 పశువైద్య కళాశాలలకు చెందిన 250 పశువైద్య విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ తిలగర్ మాట్లాడుతూ.. పశువైద్యంలో స్పెషలిలైజేషన్ చాలా అవసరమన్నారు. పశువైద్య విద్యార్థులు స్కిల్తో పాటు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ పాత్ర చాలా ఉందని తెలిపారు. ప్రొఫెసర్ ప్రతాబన్ మాట్లాడుతూ.. శస్త్ర చికిత్స విభాగం, డయాగ్నోసిస్ విభాగం ప్రాముఖ్యత, వ్యాధి నిర్ధారణ విభాగాల పాత్ర చాలా అవసరమన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ వి. వైకుంఠరావు, పశు వైద్య కళాశాల, తిరుపతి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ పి.జగపతి రామయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రొఫెసర్ వీరబ్రహ్మయ్య వ్యవహరించారు. అనంతరం పశువైద్య, శస్త్రచికిత్సలకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. -
ఆటో ఢీకొని చిన్నారి మృతి
నగరి : మండలంలోని మునెప్పనాయుడు కండ్రిగ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బిందుప్రియ (5) అనే చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేష్ కుమార్తె బిందు ప్రియ వీధిలో ఆడుకుంటుండగా ఆ వైపు వేగంగా వచ్చిన ఆటో చిన్నారిని ఢీకొనడంతో పాటు చిన్నారిపై నుంచి పోవడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉడుమును వేటాడిన ఇద్దరు అరెస్టు చిత్తూరు కార్పొరేషన్ : ఉడుమును వేటాడిన ఇద్దరి వ్యక్తులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బుధవారం అటవీశాఖ ఈస్ట్ ఎఫ్ఆర్వో థామస్ వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన జిల్లాలోని పాలసముద్రం మండలంలో ఉడుమును వేటాడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. వేటాడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ ఎఫ్ఎస్వో చండికుమార్, బీట్ ఆఫీసర్లు బాలాజీ, ప్రభాకర్రెడ్డి, గౌస్భాషా, తదితరులు పాల్గొన్నారు. ఎస్వీయూ వీసీగానర్సింగరావుతిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ నర్సింగరావు బెనారస్ వర్సిటీలో పీజీ పూర్తి చేసి పలు ఐఐటీ కళాశాలల్లో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించారు. మంత్రి లోకేష్ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఎస్వీయూ వీసీగా నియమితులయ్యే అవకాశముందని రెండు నెలల ముందే సాక్షి పత్రిక పసిగట్టంది. ఈ మేరకు కథనాలు ప్రచురించడం గమనార్హం. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీని తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసమే మంత్రి లోకేష్ తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి వైస్ చాన్సలర్ పదవిని కట్టబెట్టినట్లు జిల్లాలో విస్తృతంగా చర్చసాగుతోంది. -
పేలుడు పదార్థాల రవాణాలో ఐదేళ్ల జైలు
చిత్తూరు అర్బన్/చిత్తూరు లీగల్: అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్, జిల్లా సెషన్స్ న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కథనం మేరకు.. 2019 ఫిబ్రవరి 22వ తేదీన కుప్పం మండలం మల్లనూరు–తిరుపత్తూరు రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ట్రాక్టర్ను తనిఖీ చేయగా 40 జిలెటిన్ స్టిక్స్, 40 డిటోనేటర్లు లభించాయి. ట్రాక్టర్ను సీజ్ చేసిన అప్పటి కుప్పం సీఐ జిటి.నాయుడు.. తమిళనాడు వేలూరుకు చెందిన నిందితుడు మురుగన్ మన్నుకన్(39)ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. అనంతరం నిందితుడిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. -
సమర్థ పాలనతోనే దేశాభివృద్ధి
ఏర్పేడు : సమర్థవంతమైన పాలనతోనే దేశాభివృద్ధి సుస్థిరంగా సాగుతుందని లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ‘ఇండియా రోడ్ అహెడ్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ, చట్ట పాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు వంటి సామూహిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎందుకు అవసరమో వివరించారు. దేశంలో ప్రజాస్వామ్య విధానం, ఆర్థిక పరిణామం, సాంకేతిక విప్లవం కోసం నూతన ఆవిష్కరణల ఆవశ్యతకను విశదీకరించారు. సుస్థిర, సమ్మిళిత వృద్ధి సమాన అభివృద్ధిని నిర్ధారించేందుకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరం తగ్గించేందుకు ఆవిష్కరణలు ఉపయోగపడతాయన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పరిశ్రమ వంటి రంగాలే ప్రధాన ఆర్థిక వ్యవస్థలని వెల్లడించారు. అనంతరం ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ పదేళ్ల ప్రస్థానం, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. -
సమస్యలు గుర్తించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంక్లను తనిఖీ చేసి సమస్యల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల నివేదికలను సంబంధిత హెచ్వోడీలకు అందజేయాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రూ.10 లక్షలు, వివిధ సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పల్లె ముంగిటకే సేవలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య సేవలను పల్లె ముగింటకే తీసుకొచ్చింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. ఆ కేంద్రాలకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించింది. 150 రకాల మందులు, మాత్రలను అందుబాటులో ఉంచింది. 14 రకాల పరీక్షలు అక్కడే చేసేలా చర్యలు తీసుకుంది. కేంద్రం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తిస్తూ వచ్చింది. టెలీమెడిసన్ విధానం ద్వారా వైద్య సేవలను సులభతరం చేసింది. తద్వారా పల్లె జనానికి వైద్య ఆరోగ్య సేవలను చేరువ చేసింది. ఈ సేవలను నిత్యం పర్యవేక్షిస్తూ..లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చర్యలు చేపట్టింది. పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్ల విధానాన్ని తీసుకొచ్చింది. పేషియల్ అటెండెన్స్ను తీసుకొచ్చి సేవలను పారదర్శకంగా అమలు చేసింది. పల్లె జనానికి ఆరోగ్య భరోసాను కల్పించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ వైద్య సేవలను నీరుగారుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కట్టమంచి.. ప్రమాదం పొంచి
సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ప్రసిద్ధి గాంచిన కట్టమంచి చెరువు సుందరీకరణకు తొలి అడుగు అంటూ గత ఏడాది సెప్టెంబర్ 24న కూటమి నేతలు హంగామా చేసి భూమి పూజ చేశారు. సుందరీకరణ చేపడుతున్నామంటూ ప్రజలను ఏమార్చారు. రోజులు గడిచే కొద్ది కట్ట మంచి చెరువులో జరిగే అభివృద్ధి ఏమిటనేది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యింది. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండు, రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో కట్టమంచి చెరువు ఉండటంతో అటు వైపుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కూటమి నేతలు జరిపిన అక్రమ మట్టి తవ్వకాలను చూసి ఆశ్చర్యపోయారు. పొక్లయిన్, జేసీబీలతో యథేచ్ఛగా మట్టిని తవ్వి ఆ చెరువు తల్లికి తీరని శోకం నింపారు. ఎక్కువ లోతు మట్టిని తవ్వితే ప్రమాదం జరుగుతుందనే ఆలోచన కూడా లేకుండా వందల లోడ్ల మట్టిని అక్రమంగా తరలించి జేబులు నింపుకున్నారు. కూటమి నాయకులు చేపట్టిన పనులు సుందరీకరణగా లేకపోయినప్పటికీ కట్ట మంచి చెరువు ను డేంజర్ జోన్లోకి నెట్టేసింది. చెరువు కట్టలకు ప్రమాదం కట్ట మంచి చెరువులో ఎక్కువగా మట్టి తవ్వడం వల్ల కట్ట బలహీనపడే అవకాశాలున్నట్లు నగరవాసులు భయాందోళనకు లోనవుతున్నారు. భవిష్యత్తులో ఎక్కువ వర్షాలు కురిస్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఆందోళన చెందుతున్నారు. ఇష్టానుసారంగా అధిక స్థాయిలో మట్టిని తవ్వడం వల్ల కట్టమంచి చెరువులో భూగర్భ జలాల రీచార్జ్ సరిగ్గా జరగదని నిపుణులు వెల్లడిస్తున్నారు. బోర్లల్లో సైతం నీటి స్థాయి తగ్గుతుందని చెబుతున్నారు. మట్టిని ఎక్కువ లోతు తవ్వడంతో చెరువు సహజ జీవావరణం మారిపోతుంది. చెరువు భూమి కింద ఉన్న రాతి పొరలు బయపడి భూమి ఉత్పాదకత తగ్గిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చెరువులో అనియంత్రితంగా మట్టిని తవ్వడం వల్ల తాత్కాలిక లాభం కంటే దీర్ఘకాల నష్టాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అధిక వర్షాలు కురిస్తే కట్ట మంచి చెరువుకు సమీపంలో ఉండే ఆర్టీసీ బస్టాండు, సమీపంలో ఉండే కట్టమంచితో పాటు మరికొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. సంరక్షణ శూన్యం చెరువు సంరక్షణకు చర్యలు చేపట్టాల్సింది పోయి సుందరీకరణ పేరుతో మట్టిని అక్రమంగా తవ్వేశారు. అక్రమమట్టి తవ్వకాల వల్ల చెరువుకు చుట్టూ ఉన్న పెన్సింగ్ దెబ్బతింది. చెరువుకు సమీపంలో నిర్మించిన కాలువ కుంగిపోయింది. పలు చోట్ల పగుళ్లు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. మట్టి లోతు 1 నుంచి 1.5 మీటర్ల వరకు మాత్రమే తొలగించాల్సి ఉంటే అంతకంటే ఎక్కువ లోతుకు తవ్వేశారు. దీంతో కట్టమంచి చెరువు సహజ రూపురేఖలు మారిపోయాయి. చెరువులోకి వచ్చే నీటి ప్రవాహ మార్గాలను శుభ్రం చేయకుండా అనేక వ్యర్థ పదార్థాలు అధికంగా చేరిపోయాయి. చెరువులో పీవోపీ విగ్రహాలు అలాగే ఉండటంతో కలుషితంగా మారింది. చెరువు కట్టకు దగ్గరలో తవ్వడం వల్ల అధికవర్షాలకు ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి నేతల వాదనలు ఇలా.. కట్ట మంచి చెరువులో నిర్వహించిన అక్రమ తవ్వకాల వ్యవహారం కొన్ని నెలలుగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కట్టమంచి చెరువులో పూడికతీత పనుల వల్ల చిత్తూరు నగర పరిధిలో ఉండే బోర్లకు నీరు రీచార్జ్ అవుతుందని వెల్లడిస్తున్నారు. చిత్తూరు నగర పరిధిలో ఉండే దాదాపు 500 బోర్లకు పూడికతీత పనుల వల్ల ప్రయోజనం కలుగుతుందని కూటమి నేతలు వాదిస్తున్నారు. అయితే నిష్ణాతుల అభిప్రాయాలు, అధికారుల అనుమతులు, పర్యావరణ నిబంధనలు పాటించకుండా అక్రమంగా కట్టమంచి చెరువులో అక్రమ తవ్వకాలు నిర్వహించడం భవిష్యత్తులో నష్టమేనని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు. కట్ట మంచి చెరువులో ఇష్టానుసారంగా మట్టిని తవ్వేశారు. చెరువులో అధిక లోతుకు మట్టి తవ్వడంతో కట్ట బలహీనపడి గండి పడే ప్రమాదం పొంచి ఉంది. చెరువులో ఎక్కువ లోతుకు మట్టి తవ్వేయడంతో డేంజర్ జోన్లో ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉండే కట్టమంచి చెరువుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అటు వంటి చెరువును తమ అక్రమార్జన కోసం స్వరూపాన్నే మార్చేశారు. ఫలితంగా అధిక వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని నగర వాసులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. -
‘నవోదయం’ నగుబాటు!
చిత్తూరు అర్బన్ : నాటు సారాకు సిబిల్ స్కోరుకు సంబంధం ఏంటనేగా సందేహం. అధికారులు తలుచకుంటే దేనికై నా లింకులు పెట్టగలరు. జిల్లాలో నాటుసారా వృత్తిని మాన్పించి.. ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెరపైకి తీసుకొచ్చిన నవోదయం 2.0 నవ్వులపాలవుతోంది. ఎవరెన్ని చెప్పినా తమ నిబంధనలు మారవంటూ బ్యాంకర్లు చేతులెత్తేయడంతో పంచాయతీ కలెక్టర్ వద్దకు వెళ్లనుంది. సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎంచుకున్న కుల వృత్తులు, ఎదురైన పరిస్థితులు అట్టడగు పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. జిల్లాలోని కొన్ని వర్గాలు పల్లెల్లో సేద్యం చేసుకోవడానికి భూముల్లేక, ఉండటానికి సొంత ఇళ్లులేక రెండు, మూడు తరాల కిందట ఎంచుకున్న నాటు సారా తయారీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడిగా సారా తయారీను వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలు ఆ ఊబి నుంచి బయటకు రాలేకున్నాయి. ఇదే సమయంలో కూలీలకు డబ్బులు ముట్టజెప్పి రూ.కోట్లు గడించిన వాళ్లు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా మారిపోయాయి. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నవోదయం తీసుకొచ్చినా.. సారా తయారీ కుటుంబాలపై సమాజంలో అసమానతలను తొలగించడంలో విఫలమయ్యింది. సిబిల్ స్కోర్ లేదు.. రుణాలు ఇవ్వం సారా మాన్పించడానికి ఎవరెవరికి ఏయే రుణాలు ఇవ్వాలనేదానిపై ఎకై ్సజ్ అధికారులు ఓ నివేదిక సిద్ధంచేసి కలెక్టర్కు ఫైలు పంపించారు. తొలుత తాకట్టులేనిదే రుణం ఇవ్వబోమని మొండికేసిన బ్యాంకర్లు.. కలెక్టర్ చీవాట్లు పెట్టడంతో సరేనన్నారు. తీరా ఇప్పుడేమో అధికారులు ప్రతిపాదించిన వాళ్లకు సిబిల్ స్కోర్ లేదని, రుణాలు మంజూరు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవంటూ మొండికేసి కూర్చుకున్నారు. సారా తయారీను వదలిస్తే రుణాలు ఇప్పిస్తామన్న ఎకై ్సజ్ అధికారులు మాటలు వట్టివేనంటూ ఇప్పటికే పలు కుటుంబాలు మళ్లీ సారా ఊబిలోకి దిగుతున్నాయి. వీటిని నడిపిస్తున్న వ్యక్తులు సైతం క్రమంగా నాటుసారా విస్తరిస్తూ పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అదే పేరు.. అదే తీరు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోపు జిల్లాలో ఎక్కడా నాటు సారా ప్యాకెట్ ఒక్కటి కూడా తయారు కాకూడదని ఎకై ్సజ్ శాఖకు బాధ్యతలు పురమాయించింది. చిత్తూరులోని రాసనపల్లె, పాలసముద్రంలోని నరసింహాపురం, నగరి సత్రవాడ, విజయపురం మంగళం, కెవి.పురం, పుంగనూరులోని పెద్దతండా, నల్లగుంట్లపల్లె తండా, పట్రపల్లె తండా ల్లాంటి 52 సారా తయారీ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా గుర్తించారు. సారా తయారీ తప్ప మరో దారితెలియని 239 కుటుంబాలను గుర్తించి.. వీళ్లకు స్వయం ఉపాధి కల్పించడానికి బ్యాంకు రుణాలు ఇవ్వడమే ఏకై క మార్గమని నివేదిక రూపొందించారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి ఫైలు సిద్ధం చేయగా.. బ్యాంకర్ల నుంచి ఊహించని ట్విస్టు ఎదురయ్యింది. -
సర్కారుకు షాక్ తప్పదు
తిరుపతి రూరల్ : విద్యుత్ శాఖలో సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు రోడ్డెక్కారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. తిరుపతి డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు కూటమి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయాస్ సంఘాల సమాఖ్య (జేఏసీ) తిరుపతి డిస్కమ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం గ్రేడ్–2 కింద నియమితులైన కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. డిస్కమ్ కో–చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ యాజమాన్యం అనుసరించే అశాసీ్త్రయ విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు నష్టం వస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి యాజమాన్యాలు తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. డిస్కమ్ కన్వీనర్ మురళీధర్ మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తూ దూర విద్య కళాశాలల్లో ఉన్నత చదువులు చదివి అర్హత సాధించిన వారికి ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లడించారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయరాం మాట్లాడుతూ ఉద్యోగులపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయమణి మాట్లాడుతూ జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు వారికి విధించిన కొత్త సర్వీసు రెగ్యులేషన్స్ను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశార9ఉ. తిరుపతి సర్కిల్ జేఏసీ చైర్మన్ వెలకటూరి గోపి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్ ఉప కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.తిరుపతిలో రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు మోసానికి నిరసనగానే.. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఉద్యోగులను మోసం చేసినందుకు నిరసనగానే ఈనెల 13న చలో విజయవాడ చేపడుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి కూడా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పందించకుంటే ఈనెల 15 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు ఎల్.చలపతి, వై.వెంకట సునీల్, వి.సతీష్, టి.రవికుమార్, సురేష్,రియాజ్ అహ్మద్, రామలింగారెడ్డి, సంజీవరావు, కృష్ణయ్య , తిరుపాల్ రెడ్డి ,రంగయ్య ,హుస్సేనయ్య , శంకర్, బాలకాశి, నాగార్జున, సుధాకర్, ఏలుమలై పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,773 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,100 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
చంద్రబాబుకు దశితులంటే చిన్నచూపు
నన్నెవడ్రా ఆపేది? చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడి పేరు చెప్పిన ఆ వ్యక్తి నగరంలో కార్పొరేషన్ అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నాడు. ప్లాన్ లేకపోవడంతో భవన నిర్మాణాన్ని ఆపాలని ఇటీవల అధికారులు సూచించగా.. అధికార పార్టీ నాయకుడు ఫోన్ చేసి వదిలేయమన్నారు. సరేనని అధికారులు వచ్చేశారు. తీరా మూడంతస్తుల భవనం నిర్మిస్తుండడంతో కార్పొరేషన్ అధికారులు పనులను ఆపి, నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతలో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన ఆ వ్యక్తి పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారులపై నోరు పారేసుకున్నాడు. ‘నేను రూలింగ్ పార్టీ వ్యక్తిని. అన్నకు ప్రధాన శిష్యుడిని.. ప్లాన్ లేదు, అయితే ఎవడ్రా ఆపేది..?’ అంటూ ఏకవచనంతో అధికారులను తూర్పారబట్టాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు తీవ్రంగా స్పందించడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంత అధికార పార్టీకి చెందిన వ్యక్తులైనా.. ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడి ఇలా అధికారులనే బెదిరింపులకు గురిచేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తిరుపతి మంగళం : ‘చంద్రబాబుకు దళితుంటే చిన్నచూపు, అందుకే దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని వ్యాఖ్యానించారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టినా పట్టించుకోరు.. దళితులపై దాడులు జరిగినా స్పందించరు’ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంల దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహ దహనంపై కక్షపూరిత రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. విగ్రహం కాల్చిన దుండగులను వదిలేసి, ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం రెడ్బుక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ విషయంలో చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ అది స్వల్ప విషయమంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలీసులు కేవలం పచ్చనేతల మెప్పుకోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ బుక్లో దళితులకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేస్తామని, చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన నారాయణస్వామిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని అనేక కుట్రలు చేశారన్నారు. ఇప్పుడు దేవళంపేటలో సర్పంచ్ గోవిందయ్యపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత సతీష్నాయుడే అంబేడ్కర్ విగ్రహాన్ని తగులబెట్టించాడని తెలిసినా పచ్చనేతల మెప్పు కోసం చిత్తూరు ఎస్పీ కుట్రపూరితంగా గోవిందయ్య పై కేసులు పెట్టారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడు తూ గతంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టనీయకుండా టీడీపీ నేత సతీష్నాయుడు అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే థామస్ ఏనాడైనా దళితుల కోసం పోరాటాలు చేశారా? ఎక్కడైనా ఒక్క అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు కోసం దళితుడని అని చెప్పుకునే థామస్ తిరుమలకు వెళ్లినప్పుడు క్రిస్టియన్గా డిక్లరేషన్ ఇవ్వడంలోనే నిజ స్వరూపం తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తాను రూ. వేల కోట్లు అవినీతి చేశానంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులను చంద్రబాబు, పవన్కల్యాణ్ అంటరానివారిగానే చూస్తున్నారన్నారు. ఈ మేరకు దళితులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, నల్లాని బాబు, రామయ్య, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, ఎస్పీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి పాల్గొన్నారు. -
రాష్ట్ర తైక్వాండో పోటీలకు ఎంపిక
వడమాలపేట (పుత్తూరు): ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో అండర్–14 బాల బాలికలకు తైక్వాండో ఎంపిక పోటీలు సోమవారం చిత్తూరులో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వడమాలపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని రేష్మా తైక్వాండో 20 కిలోల విభాగంలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు బాపట్ల జిల్లా, రేపల్లెలో జరుగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న రేష్మాను హెచ్ఎం కరుణానవనీతం, ఉపాధ్యాయులు అభినందించారు. -
అవగాహన కల్పించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మందులు, మాత్రల జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాక్షి దినపత్రికలో ‘ఏ మాత్రం తగ్గలేదు’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన ఆమె చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆ శాఖ అధికారులు, వైద్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీహెచ్సీ, సీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో మందులు, మాత్రల జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 19వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు విధిగా నిర్వహించాలన్నారు. ర్యాలీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, అధికారులు ప్రవీణ, అనూష, వేణుగోపాల్, శ్రీవాణి, రామ్మోహన్ పాల్గొన్నారు. -
వాల్మీకి సేవలు మరువలేనివి
చిత్తూరు కలెక్టరేట్ : వాల్మీకి మహర్షి సేవలు మరువలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. వాల్మీకి జయంతి ని పురస్కరించుకుని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేయర్ అముద, బీసీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, సూపరింటెండెంట్ శ్రీను పాల్గొన్నారు. సావిత్రమ్మ కళాశాలలో.. నగరంలోని సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్.ఉషారాణి పాల్గొని ప్రసంగించారు. అధ్యాపకులు షమ్స్ అక్తర్ పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర రూ.9 ఇవ్వాలి
కోళ్లు పెంచి పోషిస్తే కార్పొరేట్ సంస్థలు కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నాయి. ఫీడ్, చిక్స్ క్వాలిటి తక్కువగా ఇస్తున్నారు. దీనివల్ల పెంపకందారులు చాలా నష్టపోతున్నాం. కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఉండడంలేదు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిరిగా కేజీకి రూ.9 ఇవ్వాలి. ఆరకంగా అధికారులు చొరవ చూపాలి. మాజీవనోపాధిని కాపాడాలి. – విశ్వనాథరెడ్డి, గంగాధరనెల్లూరు ఖర్చు పెరిగింది ఫౌల్ట్రీ రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇటీవల ఉత్పత్తి వ్యయాలు బాగా పెరిగాయి. కరెంటు బిల్లులు, వరిపొట్టు, బొగ్గు, మందుల ధరలు భారంగా మారాయి. కంపెనీ చెప్పిన విధంగా నిబంధనలు పాటించినా గిట్టుబాటు కలగడం లేదు. బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నాం. అప్పుల పాలవుతున్నాం. అధికారులు స్పందించాలి. మాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – కేశవులురెడ్డి, చెన్నారెడ్డిపల్లి, గంగాధరనెల్లూరు -
అడ్డగోలుగా తవ్వకాలు
కట్టమంచి చెరువులో ఇరిగేషన్ అధికారుల సూచనలు, స్పష్టమైన అనుమతులతో పూడి కతీత పనులు చేపట్టినట్లు గతంలో కూటమి ప్రజాప్రతినిధి వెల్లడించారు. తాజాగా ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన సమాచారంతో అంతా అవాక్కయ్యా రు. కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్పష్టంగా తెలియజేశారు. గత రెండేళ్లుగా తమ శాఖ తరఫున ఎటువంటి తనిఖీలు చేయలేదని ఇరిగేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. నెలలతరబడి సాగిన పూడికతీత పనులకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చేశారు. కట్టమంచి సుందరీకరణ పేరుతో టీడీపీ నాయకులు మట్టిని అక్రమంగా తరలించి దోచుకున్నట్టు స్పష్టం చేశారు. -
మోకాళ్లపై నిరసన
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఏపీపీహెచ్సీడీఏ సంఘం పిలుపు మేరకు జిల్లాలోని పీహెచ్సీ వైద్యులు సమ్మెను కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్ ధరించి.. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సంఘ నాయకులు ఎల్లయ్య, శిరీష మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె ఆగదన్నారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్ సర్వీస్ పీజీ కోటా విషయంలో తగ్గేదేలేదన్నారు. పీహెచ్సీలు వెలవెల సమ్మె కారణంగా పీహెచ్సీలు వెలవెలబోతున్నాయి. వైద్యులు సమ్మె బాట పట్టారని తెలిసి పల్లెల్లోని జనం పట్టణ బాట పడుతున్నారు. కేవలం మందులు, మాత్రల కోసమే పీహెచ్సీలకు వస్తున్నారు. చికిత్స కోసం ఆర్ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పీహెసీల్లో ఓపీ సేవలు పూర్తిగా స్తంభించాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మూలనపడ్డాయి. ఆన్లైన్ సేవలు ఆమాడ దూ రంలో పడిపోయాయి. పల్లెల్లో విష జ్వరాలు కోరలు చాస్తున్నాయి. సమ్మె మరిన్ని రోజులు కొనసాగితే పరిస్థితులు చేయిదాటిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
సచివాలయం పక్కనే జీవశ్చవంలా..
నగరి : పట్టణ పరిధి కశింమిట్ట సచివాలయ సమీపంలో నాలుగు రోజులుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి నీరు, ఆహారం లేకుండా నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లేవారు గానీ, సచివాలయానికి వచ్చి వెళ్లేవారుగానీ, సిబ్బంది గానీ చూస్తూ వెళుతున్నారు తప్ప.. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్నది తెలియరాలేదు. ఎండకు, వానకు ఎలాంటి చలనం లేకుండా అక్కడే పడివున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఆ ప్రాంతంలో జీవశ్చవంలా పడి ఉన్నా అధికారులు ఎవ్వరూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రాణం తప్ప చలనం లేని ఇతని పరిస్థితిని ఆరా తీయాలనిని స్థానికులు కోరుతున్నారు. -
విచ్చలవిడిగా స్పిరిట్!
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు ఏపీలోకి విచ్చలవిడిగా స్పిరిట్ దొడ్డిదారిన వస్తోంది. ములకల చెరువుతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఈ మద్యం తయారీకి అసలైన ముడిసరుకు ఆర్ఎస్(రెక్టిఫైడ్ స్పిరిట్). గతంలో మన రాష్ట్రంలోకి మహారాష్ట్ర, గోవాల నుంచి కర్ణాటక మీదుగా వచ్చేది. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్ఎస్ను ఆయిల్ ట్యాంకర్లలో స్మగింగ్ చేసేవారు. అప్పట్లో పలమనేరు పోలీసులు సైతం డీజిల్ ట్యాంకర్లో ఆయిల్ బిల్లుతో వస్తున్న స్పిరిట్ ట్యాంకర్ను పట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో గంగవరం మండలంలోని ఓ కోళ్ల ఫామ్లో నకిలీ మద్యం గుట్టురట్టయ్యింది. తయారీ పరికరాలు బెంగళూరు, నరసాపురం నుంచి వస్తుంగా.. స్పిరిట్ మాత్రం మహారాష్ట్ర నుంచి తమకు అందుతోందని పట్టుబడిన వ్యక్తులు ఎకై ్సజ్ పోలీసులకు చెప్పారు. తాజాగా ములకలచెరువుతోపాటు విజయవాడ ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారవతున్నందున స్పిరిట్ అక్రమ రవాణా మళ్లీ సాగుతోందని తెలుస్తోంది. ఇదో పెద్ద నెట్వర్క్ స్పిరిట్తో బయల్దేరిన ట్యాంకర్ గమ్యం చేరేదాకా ఓ రహస్య నెట్వర్క్ బలంగా పనిచేస్తోంది. ఒక్కో ట్యాంకర్కు నలుగురికి పైగా డ్రైవర్లు ఉంటున్నారు. ఈ వాహనానికి ముందు రోడ్డు క్లియరెన్స్ కోసం మరికొందరు ఇతర వాహనాలతో ఎస్కార్ట్గా వెళ్తుంటారు. వీరికి అండగా సంబంధిత ప్రాంతాల్లోని స్థానికులు, ఎకై ్సజ్, మార్కెటింగ్, రవాణాశాఖలోని కొందరి అండదండలున్నట్టు సమాచారం. వీరందరూ మొత్తం అక్రమరవాణాను చిన్న మొబైల్ ఫోన్ల ద్వారానే సాగిస్తారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోనే.. గతంలో నకిలీ మద్యం తయారీ జరిగింది కూడా కర్ణాటక, ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లోనే. ఇప్పుడు కూడా ములకలచెరువు కర్ణాటక రాష్ట్రానికి దగ్గర్లోనే ఉంటుంది. ఎందుకంటే తయారీకి అవసరమైన వస్తువులు చేరవేసేందుకు బోర్డర్లే సేఫ్టీగా వీరు భావిస్తుంటారు. ఏదేమైనా ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పిరిట్ అక్రమరవాణాపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో పలమనేరులో పట్టుబడిన స్పిరిట్ లారీ -
పరిసరాల శుభ్రత పై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలపై ఆధారపడకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసే వర్షాలకు ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పకడ్బందీగా రీ సర్వే జిల్లా వ్యాప్తంగా 3వ విడత రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వేశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించడంలో మండల సర్వేయర్, వీఆర్వోలు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. రీ సర్వేలో అందే అర్జీలకు పది రోజుల్లోపు పరిష్కారం చూపాలన్నారు. జేసీ విద్యాధరి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 31 గ్రామాల్లో 30,774 ఎకరాల భూమిని రీ సర్వే చేశారన్నారు. రెండో విడతలో 38 గ్రామాల్లో 40,359 ఎకరాల్లో, మూడో విడతలో 12 గ్రామాల్లో 3,859 ఎకరాల భూమిని రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఈ రీ సర్వే వచ్చే ఏడాది మార్చి 31 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రేపటి నుంచి జిల్లాలోని 12 గ్రామాల్లో మూడో విడత రీ సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్కుమార్, సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ శాంతిరాజ్, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ
సదుం: మండలంలోని చెరుకువారిపల్లె శివార్లలో ఉన్న కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టి ఆలయంలో ప్రవేశించారు. ఆలయంలో ఉన్న బీరువాను చిందర వందర చేశారు. హుండీలో ఉన్న కొంత నగదును ఎత్తుకెళ్లారు. కాగా దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. జిల్లా నూతన కార్యవర్గం చిత్తూరు రూరల్ (కాణిపాకం): నగరంలో మంగళవారం జిల్లా నాయీబ్రహ్మణ సంఘ నూత న కార్యవర్గాన్ని ఎనుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా చిట్టిబాబు, వెంకటేష్, అధ్యక్షుడిగా ప్రసా ద్, ఉపాధ్యక్షులుగా మురళి, లక్ష్మీకాంత్, కార్య దర్శులుగా ధనశేకర్, శివ, కోశాధికారిగా వాసు కిరన్, మురళీకృష్ణ, సహాయ కార్యదర్శిగా కార్తీక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రచార కార్యదర్శులు, సభ్యులను నియమించుకున్నారు. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో కార్తీక్కు చోటు చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎన్సీసీ అధికారి, ఉపాధ్యా యుడు కార్తీక్కు రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్సీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఏటా ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల పరేడ్కి ఎన్సీసీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఆయన ఎంపికయ్యారు. ఆయన ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఫ్రీ ఆర్డీసీ క్యాంప్లో పాల్గొంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ఆయన ఎంపిక కావడంపై హెచ్ఎం హసన్బాషా, తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఐరాల: అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఫారేస్ట్ రేంజ్ అధికారి కథనం మేరకు.. సోమవారం తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ అధికారికి పులిచెర్ల సమీపంలో కొంతమంది ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ప్లయింగ్ స్క్వాడ్ బృందం రాత్రి 10 గంటల సమయంలో పులిచెర్ల క్రాస్ సమీపంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. ఇన్నోవా కారు వేగంగా వచ్చింది. పసిగట్టి ఐరాల మార్గంలోకి వెళ్లగా పోలీసులు వెంబడించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ బృందం మండలంలోని గుడిపల్లె సమీపంలోని మామిడి తోట పక్కన ఇన్నోవా కారుతో పాటు 439.100 కిలోల బరువున్న 13 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పుల్లిచెర్ల నుంచి సుమారు 30 కి.మీ దూరం వరకు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నామన్నారు. నిందితుడు కారు వదిలి పరారయ్యాడని తెలిపారు. వాటి విలువ రూ.18,64,857 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలో సెక్షన్ అధికారి శశికుమార్, బీట్ అధికారులు చంద్రబాబు, ప్రసాద్కుమార్, వాచర్లు భార్గవ్, రాజా తదితరులు పాల్గొన్నారు. -
కోడికి కార్పొరేట్ అంతంతే!
కాణిపాకం: కార్పొరేట్ సంస్థల కారణంగా కోళ్ల పెంపకందారులు నష్టాల్లో మునిగిపోతున్నారు. కష్టపడి కోళ్లను పెంచితే కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 మాత్రమే చెల్లిస్తున్నారు. ఫలితంగా ఫౌల్ట్రీ రైతులు ఫల్టీకొడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. దీంతోవారు రోడెక్కి.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ను లేవనెత్తారు. కోళ్ల పెంపకం ఇలా... జిల్లాలో లింగాపురం, నాటుకోళ్లు, లేయర్స్, బ్రాయిలర్స్ పెంపకం జరుగుతోంది. లింగాపురం, లేయర్స్, నాటుకోళ్లు పక్కన పెడితే బ్రాయిలర్స్ కోళ్ల పెంపకంపై వెయ్యి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంటిళ్లిపాదీ ఈ పెంపకంలో నిమగ్నమైపోతున్నారు. వీరి వద్ద సుమారుగా 7 లక్షల నుంచి 10 లక్షల కోళ్లు పెరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందట హెచరీస్ ద్వారా ఫౌల్ట్రీ రైతులు కోడి పిల్లలను తెచ్చుకుని పెంచేవారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలే పిల్లలను ఇచ్చి.. ఫీడు, మెడిసిన్ ఇస్తున్నాయి. ఫౌల్ట్రీ రైతులు వాటిని 40 రోజుల పాటు పెంచితే... కిలోకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నాయి. ఈ మొత్తం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. అదనపు భారం కోళ్ల పెంపకందారులు 10వేల కోళ్లను 40 రోజుల పాటు పెంచి పోషించాలంటే కార్పొరేట్ సంస్థలు ఇచ్చే ఫీడ్, మెడిసిన్ సరిపోవడం లేదని రైతుల వాదన. ఈ కారణంగా ఫౌల్ట్రీ రైతులపై అదనపు భారం పడుతోంది. తొలుత పిల్లలను ఉష్ణోగ్రతలో పెట్టేందుకు బొగ్గు 25 బ్యాగు(25కేజీ)లు అవసరమవుతోంది. ఒక బ్యాగును రూ.500 చొప్పున్న కొనుగోలు చేస్తున్నారు. మెడిసిన్ ఖర్చులు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోంది. కరెంటు బిల్లు 40 రోజులకు గాను రూ.7 వేల నుంచి రూ.9వేల వరకు వస్తోంది. వరిపొట్టు సైతం డబ్బులిచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోందని పెంపకందారులు వాపోతున్నారు. ఏదీ లాభం పెంపకందారులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కోడి పిల్లలను దింపే సమయంలో చెప్పే ధరకు, కోడి బలిసిన తర్వాత ఇచ్చే ధరకు పొంతన ఉండడం లేదని పెంపకందారులు వాపోతున్నారు. కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు చనిపోయిన కోళ్లు, కాళ్లు దెబ్బ తిన్న కోళ్లను తమవైపే నెట్టేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇదేమని అడిగితే ఎఫ్సీఆర్, సీఎఫ్సీఆర్ పేరుతో బెదిరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీకి రూ.9 ఇవ్వాలని రోడెక్కుతున్నారు. -
ఏ 'మాత్ర'o తగ్గలేదు!
జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త స్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే మెడికల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ధరలతోనే కొనుగోలు చేసి జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకపోగా.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో దాదాపు 1,500 మెడికల్ స్టోర్లు, 200పైగా హోల్ సేల్ షాపులున్నాయి. వీటి ద్వారా రోజువారీ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ట్యాక్స్ ఎగ్గొట్టాలని చాలామంది మెడిసిన్ కొనుగోలుపై బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. బేరాల్లేవ్! చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించరే మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడా ఈ బోర్డులు కనపించడం లేదు. దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల వత్తాసు ఉందని జీఎస్టీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలను మందులు, మాత్రలతో మాయ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ధరలు అమలుపై నిఘా కొరవడింది. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణలో ఎక్కడా తనిఖీలు గానీ, సోదాలు గానీ చేసినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాత మందులంటూ బూచీ జీఎస్టీ తగ్గింపు కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందుల ధరలు తగ్గుతాయనే ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయింది. మందుల షాపుల యాజమా నులు పాత స్టాక్ పేరు చెప్పి ఆ ధరలకే విక్రయిస్తున్నారు. పాత స్టాక్ పూర్తయిన తర్వాతే కొత్త ధరలు అమలవుతాయని బుకాయి స్తున్నారు. పాత స్టాక్ నిల్వలపై కొత్త ధరలు వర్తింపజేయడానికి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయా న్ని సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తగ్గింపు ధరలు అమలు కావాలి ఇప్పుడున్న రోజుల్లో తిండికంటే ముందు ముఖ్యమైనవి మందులు, మాత్రలు. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి. మందులు, మాత్రలకు పేద కుటుంబాల వారు కూడా నెలవారీగా వేలల్లో ఖర్చు చేస్తున్నా రు. జీఎస్టీ ఊరటతో కాస్త తగ్గుతుందని అనుకుంటే..ఇంకా మందుల దుకాణాల్లో పాత ధరలే అమలవుతున్నాయి. అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు వర్తించేలా చూడాలి. – రాజారత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు -
మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్
తిరుపతి జిల్లా: సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విచారణ చేపట్టింది. పేరెంట్స్ అసోసియేషన్ పిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.గత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా 26 కోట్లు అదనంగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ 15 లక్షలు రూపాయలు ఫైన్ విధించింది.ఆ మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) తిరుపతిలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం, 2022లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. -
తగ్గలేదు!
జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త స్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే మెడికల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ధరలతోనే కొనుగోలు చేసి జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకపోగా.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏ మాత్రం మంగళవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పాత మందులంటూ బూచీ కాణిపాకం: జిల్లాలో దాదాపు 1,500 మెడికల్ స్టోర్లు, 200పైగా హోల్ సేల్ షాపులున్నాయి. వీటి ద్వారా రోజువారీ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ట్యాక్స్ ఎగ్గొట్టాలని చాలామంది మెడిసిన్ కొనుగోలుపై బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. బేరాల్లేవ్! చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించరే మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడా ఈ బోర్డులు కనపించడం లేదు. దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల వత్తాసు ఉందని జీఎస్టీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలను మందులు, మాత్రలతో మాయ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ధరలు అమలుపై నిఘా కొరవడింది. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణలో ఎక్కడా తనిఖీలు గానీ, సోదాలు గానీ చేసినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందుల ధరలు తగ్గుతాయనే ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయింది. మందుల షాపుల యాజమా నులు పాత స్టాక్ పేరు చెప్పి ఆ ధరలకే విక్రయిస్తున్నారు. పాత స్టాక్ పూర్తయిన తర్వాతే కొత్త ధరలు అమలవుతాయని బుకాయి స్తున్నారు. పాత స్టాక్ నిల్వలపై కొత్త ధరలు వర్తింపజేయడానికి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయా న్ని సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తగ్గింపు ధరలు అమలు కావాలి ఇప్పుడున్న రోజుల్లో తిండికంటే ముందు ముఖ్యమైనవి మందులు, మాత్రలు. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి. మందులు, మాత్రలకు పేద కుటుంబాల వారు కూడా నెలవారీగా వేలల్లో ఖర్చు చేస్తున్నా రు. జీఎస్టీ ఊరటతో కాస్త తగ్గుతుందని అనుకుంటే..ఇంకా మందుల దుకాణాల్లో పాత ధరలే అమలవుతున్నాయి. అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు వర్తించేలా చూడాలి. – రాజారత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు -
గుర్తింపు లేదా?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కరోనా వంటి విపత్తులను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న వైద్య వృత్తికి తగిన గుర్తింపు లేదని పీహెచ్సీ వైద్య సంఘ నాయకురాలు శిరీష అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా.. పీహెచ్సీ వైద్యులకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇక పీజీ కోటాను 10 శాతం తగ్గించడం దారుణమన్నారు. ఇలాగైతే పీహెచ్సీ వైద్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని గుర్తు చేశారు. పలుమార్లు దీనిపై రాష్ట్ర పాలకులకు విన్నమించినా ఎలాంటి మార్పులు లేవని వాపోయారు. వైద్యులు జానకీరావు, ఎల్లయ్య పాల్గొన్నారు. -
క్వారీ..వసూళ్ల సవారీ!
అడ్డూఅదుపూ లేదు సాక్షి టాస్క్ఫోర్స్: క్వారీలపై వసూల్ రాజాలు కన్నేశారు. రాయల్టీ పేరుతో దోచుకోవడం ప్రారంభించారు. దొంగ బిల్లులతో రెచ్చిపోతున్నారు. కాపు కాచి కాసులు కొట్టేస్తున్నారు. యూనియన్ పేరుతో అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. దీనికితోడు అధికారిక రాయల్టీ వసూళ్ల ప్రక్రియ ముగిసింది. ఆ శాఖకు వసూళ్ల పగ్గాలు దక్కాయి. దీంతో అడ్డూ అదుపు లేకుండా మాఫియా వసూళ్లకు తెగబడుతోంది. ఈ అక్రమాలకు ఆ శాఖలోని కొందరు కొమ్ము కాస్తూరనే విమర్శలు వస్తున్నాయి. ఇది ఇంతేనా? బంగారుపాళ్యం మండలం, పాలేరు ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విలువైనా ఖనిజం బయట పడడంతో జోరుగా తవ్వేస్తున్నారు. ఇదంతా ఓ ప్రజాప్రతినిఽధి కనుసన్నల్లో సాగుతోంది. అనుమతి లేకుండా ఈ క్వారీని కొనసాగిస్తున్నారు. ఆ విషయం సంబంధిత శాఖ అధికారులకు కూడా తెలుసు. నేషనల్ హైవే రోడ్డు నుంచి చూసినా ఈ అక్రమ క్వారీ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో వరుసగా కథనాలొచ్చాయి. వీటిపై ఆ శాఖ అధికారులు స్పందించినట్టు నటించి మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. దోచేద్దాం..దాచేద్దాం! కూటమి అధికారంలోకి రావడంతో అందరి కన్నూ ఆదాయంపై పడింది. తొలుత వర్కులపై పడ్డారు. అవి పార్టీలో పట్టున్న నాయకులే దక్కించుకోవడంతో అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఇందులో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న క్వారీ తవ్వకాలపై కన్నేశారు. పార్టీ కోసం కష్టపడిన వారు, సీనియర్లందరూ అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ప్రధానంగా కూటమిలో కొత్త ముఖాలు మాత్రమే చక్రం తిప్పుతున్నాయి. వీరంతా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి అక్రమ సంపాదనలో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా మైనింగ్ మాఫియాలోకి దిగి కోట్లకు పడగలెత్తుతున్నారు. కొండలు కరిగించి.. కోట్లు మింగేసి కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తగా తెరపై కనిపిస్తున్న కూటమి నేతలు మైనింగ్ మత్తులో పడిపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకుని అక్రమ క్వారీలతో కోట్లు కొల్లగొడుతున్నారు. సమీప గ్రామాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దొంగబిల్లుల సంగతేంటి? రాయల్టీ అధికారిక వసూళ్లతోపాటు కూటమి నేతలు బెదిరించి యూనియన్ పేరుతో దొంగ బిల్లులు ఇస్తూ.. కాసులు దోచేస్తున్నారు. నెలనెలా కోట్లు కొల్లగొడుతూ గుట్టు చప్పుడు కాకుండా దొంగ బిల్లుల వ్యవహరాన్ని నడిపిస్తున్నారు. ఈ వ్యవహరం బయటకు రావడంతో దొంగ బిల్లులను నొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. ఇది అధిష్టానం వరకు వెళ్లడంతో పార్టీలోని సీనియర్లతో పాటు వివిధ శాఖల అధికారులు సైతం దొంగ బిల్లుల రారాజుపై ఏళ్లు ఎక్కుపెట్టారు. దీంతో కొంతమందికి గట్టిగా అక్షింతలు పడ్డాయి. ఇంతలో అధికారిక రాయల్టీ వసూళ్ల ప్రక్రియ ముగిసింది. పట్టుకుంటారా? అక్రమ క్వారీలు, తరలింపులు దర్జాగా సాగుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయల్టీ వసూళ్ల పగ్గాలు ఆ శాఖకు అప్పగించినా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వెళ్లి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ క్వారీలు, తరలింపులను కట్టడి చేసేందుకు సాహసం చేయడం లేదని, మైనింగ్ మాఫియాకు భయపడి వారు మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు కార్యాలయంలోని ఓ అధికారి సహకారం, ఆయనిచ్చే సలహాలతోనే అక్రమ క్వారీల వ్యవహారం పుంజుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోని బడానేతల పేర్లు చెప్పుకుంటూ ఈ దందాకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. బంగారుపాళ్యంలో అక్రమ క్వారీ -
వారికి న్యాయవాదులు సహకరించకూడదు
మైనర్ బాలికలపై గ్యాంగ్రేప్, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు కోరారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దుర్మార్గపు కామాంధులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. ఆ నింధితులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదన్నారు. గత ఐదు రోజులకు ముందు సీఎం సొంత జిల్లా పెనుమూరు క్రాస్ వద్ద అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన పార్కులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహాయం చేయకూడదని కోరారు. -
ఆగని ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలో పంట పొలా లపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తుండడంతో రైతు లు లబోదిబోమంటున్నారు. సోమవారం తెల్ల వారు జామున బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి వరి పంట, ప్రభాకర్రెడ్డి, రుక్మణమ్మకు చెందిన వేరుశనగ పంటను తొక్కి నాశనం చేశాయి. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను వేరే ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరసిద్ధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగ తం పలికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేయగా.. ఏఈవో రవీంద్రబాబు స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. -
తిరుపతిలో కత్తితో రౌడీషీటర్ హల్చల్
తిరుపతి క్రైమ్: తిరుపతిలోని విక్టరీ వైన్స్ వద్ద ఆదివారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీవీఎస్ సర్కిల్ వద్ద ఉన్న ఓ వైన్ షాప్ ముందు వీరంగం సృష్టించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు.. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తన బృందంతో ఆ యువకుడిని, అతనితో పాటు ఉన్న మరో యువకుడిని వీడియో ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ కత్తితో హల్చల్ చేసిన వ్యక్తి రౌడీషీటర్ ఫిరోజ్, పక్కన ఉన్న వ్యక్తి సయ్యద్ బాషాగా గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడు ఫిరోజ్ గతంలో కేసుల్లో నేరస్తుడనీ, అతను చాలా కాలంగా పరారీలో ఉన్నాడని తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారించామని..వారిపై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నాయని.. తెలిపారు. నగరంలో నడిపించుకుంటూ కోర్టుకు రెండు రోజుల క్రితం చిత్తూరులో లైంగిక దాడి కేసులో నిందితులను పోలీసులు కోర్టు వరకు నడిపించుకుని తీసుకెళ్లారు. అదే తరహాలో తిరుపతిలో కత్తితో హల్చల్ చేసిన నిందితులు ఫిరోజ్, సయ్యద్ బాషాలను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండ్కు తర లించామని తెలిపారు. -
ట్రాక్టర్ల దొంగలు అరెస్ట్
గుడిపాల: రెండు ట్రాక్టర్లను దొంగతనం చేసిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం.. గుడిపాల మండలం, పశుమంద దళితవాడకు చెందిన వినాయకం ట్రాక్టర్ను జూలై 21వ తేదీ రాత్రి దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అలాగే సెప్టెంబర్ 30వ తేదీన కృష్ణజమ్మాపురం గ్రామానికి చెందిన చిట్టిబాబునాయుడు ట్రాక్టర్ను కూడా ఎత్తుకెళ్లారు. వీటిపై కేసు నమోదైంది. చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనం జరిగిన ప్రదేశం నుంచి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ట్రాక్టర్లు రెండూ తమిళనాడు వైపుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు తమిళనాడు మేల్పాడి దారిలో నిఘా పెట్టారు. సోమవారం చలిచీమలపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కమ్మతిమ్మాపల్లె వైపు నుంచి మేల్పాడి వైపుగా రెండు ట్రాక్టర్లు.. వాటి ముందు ఒక మోటార్ సైకిల్లో వస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, కాట్పాడి తాలూకా, కోదండ రామాపురం గ్రామానికి చెందిన బద్రి అలియాస్ సాయికుమార్(26), కార్తీక్(19), రాజమణి(47) ఉన్నారు. వారి నుంచి రెండు ట్రాక్టర్ల తోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.18 లక్షలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు వారు పేర్కొన్నారు. -
స్వచ్ఛతే మన లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నాగయ్య కళా క్షేత్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత, పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో స్వచ్ఛత కార్పొరేషన్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 7 అవార్డులు, జిల్లా స్థాయిలో 55 అవార్డులు అందజేసినట్టు వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులను కై వసం చేసుకునేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ 2026 నాటికి జిల్లాకు 100 స్వచ్ఛత అవార్డులు తెప్పించాలన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేతుల మీదుగా జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డులను అందజేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి త దితరులు పాల్గొన్నారు.