breaking news
Chittoor
-
సమస్యలు పరిష్కరించాలని వినతి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిషత్ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు కోరారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ రవికుమార్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం మాట్లాడుతూ జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలల పరిధిలో ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్మన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పీఎఫ్ వార్షిక స్లిప్స్ను వెబ్సైట్లో అప్డేట్ చేయాలని చెప్పారు. పీఎఫ్ సమస్యల పరిష్కారానికి వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలన్నారు. అంతర్ జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ిపీఎఫ్ కు సంబంధించిన ట్రాన్స్ఫర్, అకౌంట్ బదిలీ సమస్యలను తొలగించాలన్నారు. కారుణ్య నియామకలను నెలవారీగా సమీక్షించి ఎప్పటికప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలన్నారు. పీఎఫ్ రుణాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం కాకుండా మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు రామ్మూర్తి, సుబ్రహ్మణ్యం, మహేష్, షణ్ముగం, అరుణ్కుమార్, జిల్లా కార్యదర్శులు దేవరాజులు, కుమార్, చలపతి పాల్గొన్నారు. 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం పులిచెర్ల(కల్లూరు): వాహనం సహా 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. వారిక కథనం మేరకు.. ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందుగా సమాచారం అందడంతో కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఏపీ03–ఎస్3713 నంబరు గల మారుతీ సుజికీలో 13 ఎర్రచదనం దుంగలు, ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆపై నిందితులను అదుపులోకి తీసుకుని, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు తమిళనాడు రాష్ట్రం, కళువకుచ్చి జిల్లా, కళువరాయ్మలైకి చెందిన ఏలుమలై, సెంథిల్, అన్బలగన్, రామన్, అన్నాదొరై, కుప్పస్వామి, మణిగా గుర్తించారు. ఎర్రచందనం దుంగలతోపాటు వాహనం విలువ రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. దాడుల్లో స్క్వాడ్ డీఎఫ్ఓ గురుప్రభాకర్, ఎఫ్ఆర్ఓ ఎస్.చంద్రశేఖర్, ఎఫ్బీఓ ప్రకాష్కుమార్, ఎఫ్బీఓ కే.ప్రతాప్, రెడ్డిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎఫ్ చెల్లింపులు వేగవంతం చేయండి
చిత్తూరు కార్పొరేషన్ : భవిష్యనిధి రుణాలు (పీఎఫ్), తుది మొత్తాల చెల్లింపులు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఎస్టీయూ సంఘం రాష్ట్ర అసొసియేట్ అధ్యక్షులు గంటామోహన్, జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడుని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఈవోతో వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చెందిన టీచర్లకు తుది మొత్తాలు చెల్లించడం ఆలస్యమవుతోందని, ఈ జాప్యం వల్ల ఉద్యోగ విరమణ పొందిన టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. దీనిపై జెడ్పీ సీఈవో స్పందిస్తూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే చిత్తూరు జిల్లాలో భవిష్యనిధి ఖాతాల నిర్వహణ మెరుగ్గా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడె మోహన్యాదవ్, నాయకులు లింగమూర్తి, చంద్రన్, నరేంద్ర పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు నుంచి పడి వృద్ధుడి మృతి గుడుపల్లె: కుప్పం నుంచి కేజీఎఫ్కు వెళ్లే ఆర్టీసీ బస్సులో నుంచి ఓ వృద్ధుడు పడి శుక్రవారం మృతి చెందాడు. గుడుపల్లె ఎస్ఐ శ్రీనివాసులు కథనం.. కుప్పం నుంచి కేజీఎఫ్కు వెళ్లే ఆర్టీసీ బస్సులో బండకొత్తూరు గ్రామానికి చెందిన మునెప్ప(73) స్వగ్రామానికి వెళ్లాడానికి బస్సు ఎక్కాడు. మార్గమధ్యంలోని బండకొత్తూరు స్టాఫ్ వద్ద డ్రైవర్ బస్సును ఆపకుండా కొంచేం దూరం వెళ్లాడు. ఆపై ఎదురుగా వస్తున్న ఆటోను సైడ్ తీశాడు. ఇంతలో మునెప్ప తన స్వగ్రామం వచ్చేసిందని కిందకు దిగే క్రమంలో బస్సు కదిలింది. మునెప్ప బస్సు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
– స్నేహితుడే హతమార్చాడని బంధువుల ఆరోపణ కుప్పం: ఏడు నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మండల పరిధిలోని గెరిగశీనేపల్లి పంచాయతీ, డీ.ఆర్ అగ్రహారం గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సతీష్ గర్భిణిపై లైంగిక దాడి చేసి హతమార్చాడని మృతురాలు బంధువులు శుక్రవారం కుప్పం పోలీసు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మృతురాలి బంధువుల కథనం.. గెరిగశీనేపల్లి గ్రామానికి చెందిన ఇంద్రజ(30)కు వరుసకు మేనమామ అయిన పెరుమాల్తో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. పెరుమాల్ కూలి పనుల కోసం అరేబియన్ దేశం కత్తర్కు వెళ్లేవాడు. రెండేళ్లకోసారి స్వగ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సతీష్ ఇంద్రజతో స్నేహంగా ఉండేవాడు. ఏమైందో ఏమోగానీ గురువారం ఉదయం ఇంద్రజ డీఆర్ అగ్రహారం గ్రామంలోని సొంత ఇంట్లో ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈమె మృతిపై కత్తర్లో ఉన్న భర్త పెరుమాల్కు సమాచారం అందింది. అతను వచ్చి భార్య మృతిని తట్టుకోలేక బోరున విలపించాడు. సతీష్ అనే వ్యక్తి తన భార్యను వేధించి లైంగికదాడి చేసి చంపేశాడని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు సతీష్ను కఠినంగా శిక్షించాలని పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నల్లమందు ఉండలు తిని కుక్క మృతి గుడిపాల: నల్ల మందు ఉండలు తిని ఓ కుక్క మృతి చెందింది. వివరాలు.. మండలంలోని పశుమంద ఎస్టీ కాలనీ సమీపంలో గల చెరువు వద్ద అడవి పందుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం నల్లమందు బాంబులను పెట్టారు. ఇంతలో అక్కడికి వెళ్లిన ఓ కుక్క దాన్ని పట్టుకొని కొరకడంతో ఒక్కసారిగా పేలింది. ఆపై తల పగిలి అక్కడికక్కడే మృతిచెందింది. -
నమ్మకానికి ప్రతీక భారతి అల్ట్రా ఫాస్ట్
గుడిపాల: నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. శుక్రవారం గుడిపాల మండలంలోని నరహరిపేట సమీపంలో కృష్ణా ట్రేడర్స్ రవి ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ ఛాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భార తి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంఫర్ ఫ్రూప్ బస్తాలతో మా ర్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవ కాశం కూడా ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం భారతి సిమెంట్కు సంబంధించిన నాణ్య తా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మా ణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం తాఫీ మేస్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. -
మొగిలి దేవరకొండలో చిరుత
బంగారుపాళెం: మండలంలోని మొగిలి దేవరకొండలో చిరుతలు సంచరిస్తున్నాయి. శుక్రవారం తమిళనాడుకు చెందిన భక్తులు కారులో పార్వతీ సమేత శ్రీజలకంఠేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు దేవరకొండకు వెళ్తుండగా గోశాల సమీపంలో ఓ చిరుత రోడ్డు పకన కనిపించినట్లు తెలిపారు. దేవరకొండ చుట్టూ కౌండిన్య అభయారణ్యం ఆవరించి ఉండడం వల్ల చిరుతలు, ఏనుగులు సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు, గ్రామస్తులు తెలిపారు. గతంలో దేవరకొండ సమీపంలో చిరుతలు మేకలు, పశువులపై దాడి చేసి చంపేసినట్లు పేర్కొన్నారు. చిరుతల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సారా కేసుల్లో తొమ్మిది మంది బైండోవర్ కుప్పం: మండల పరిధిలోని దేవరాజుపురం, ఆరిమానుపెంట గ్రామాల్లో గతంలో సారాయి కేసుల్లో నిందితులుగా ఉన్నా తొమ్మిది మందిని బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ నాగరాజు తెలిపారు. తమిళనాడు సరిహద్దులోని తిమ్మంబట్టు, వాణియంబడి పోలీసు స్టేషన్లలో వీరిపై సారాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. దేవరాజుపురం గ్రామానికి చెందిన ఏలుమలై, తంగం, ముత్తు, రామలింగం, అమ్ములు, తిరుమలై, మోహన్, కార్తీక్, చిరంజీవిని కుప్పం తహసీల్దార్ చిట్టిబాబు సమక్షంలో హాజరు పరిచినట్టు వెల్లడించారు. ఆపై రూ.లక్ష చొప్పున పూచీకత్తుపై బైండోవర్ చేసినట్టు తెలిపారు. ఒంటరి ఏనుగు బీభత్సం తవణంపల్లె: ఒంటరి ఏనుగు పొలాల్లో బీభత్సం సృష్టించింది. మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మాధవరం సమీపంలోని అడవిలో నుంచి వచ్చి రచ్చరచ్చ చేసింది. గుంపులో నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగు చాలా కాలంగా సంచరిస్తోంది. ఈ ఏనుగు గురువారం రాత్రి మాధవరానికి చెందిన మనోహర్రెడ్డి మామిడి తోటలోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించింది. భారీగా మామిడి కొమ్మలు విరిచివేసింది. కొమ్మల్లో సుమారు అర టన్నుకు పైగా నీలం రకం కాయలను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో సుమారు రూ.20 వేల వరకు నష్టపోయినట్టు బాధిత రైతు వాపోయాడు. -
ఆ నగదు చెల్లించండి
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో పాల్గొన్న టీచర్లకు రెమ్యునరేషన్ నగదు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు డీఈవో కార్యాలయంలో ఏడీ 2 వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు పూర్తయ్యి మూడు నెలలు అవుతోందన్నారు. ఇంతవరకు పేపర్లు దిద్దిన టీచర్లకు నగదు ఇవ్వకపోవడం దారుణమన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. జిల్లాలో బదిలీలకు ముందు ఇచ్చిన ఉద్యోగోన్నతుల్లో సోషల్, గణితం, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఉద్యోగోన్నతుల పోస్టులు మిగిలిపోయాయన్నారు. వెంటనే మిగిలిన పోస్టులను ఉద్యోగోన్నతి ప్రక్రియలో భర్తీ చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్యాదవ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమల్లో వివిధ ప్రాథమిక పాఠశాలలకు నేరుగా సరఫరా చేయకుండా క్లస్టర్ కేంద్రాల్లో బియ్యం, రాగిపిండి డంప్ చేస్తున్నారన్నారు. ఇలాచేయడం వల్ల ప్రాథమిక పాఠశాలలకు క్లస్టర్ కేంద్రాల నుంచి వాటిని తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటామోహన్, సంఘ నాయకులు లింగమూర్తి యాదవ్, నరేంద్ర పాల్గొన్నారు. -
ఆస్తి కోసం భర్తపై దాడి
– తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తెలు కార్వేటినగరం: కాటికిపోయే వయసులో కక్షలు పెంచుకున్నారు. ఆస్తుల కోసం కత్తులతో దాడులదాకా దిగజారిపోయారు. ఈ ఘటన కార్వేటినగరం మండల పరిధిలో శుక్రవారం కలకలం రేపింది. స్థానికుల కథనం.. మండలంలోని కొల్లాగుంట గ్రామానికి చెందిన జయవేల్(70), రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలకు వివాహాలయ్యాయి. వాళ్లు ఒక్కోచోట స్థిరపడి పోయారు. కుమారుడి భార్య గతంలోనే విడిపోయి ప్రస్తుతం వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో తండ్రి జయవేల్ కుమారుడికి సపోర్ట్ చేస్తూ రాగా.. తల్లి రాజేశ్వరి కోడలికి మద్దతు పలుకుతూ వస్తోంది. జయవేల్ఽ తమ సొంత గ్రామం కొత్తపల్లిమిట్టలో ఉన్న ఆస్తిని అమ్మి కొల్లాగుంటలో ఆస్తి కొనుగోలుచేసి భార్య పేరుతో సొంత ఇంటి నిర్మాణం చేసుకుని స్థిరపడ్డారు. ఆ ఇంట్లో నుంచి భర్త జయవేల్ను తరిమేయాలని భార్య రాజేశ్వరి స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. జయవేల్ను చంపేస్తామంటూ భార్య బెదిరింపులకు దిగడంతో ఆయన టీవల పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. గురువారం భార్యాభర్తలిద్దరూ కోర్టుకు హాజరై వచ్చారు. అయినప్పటికీ తీరుమార్చుకోని భార్య రాజేశ్వరి గురువారం రాత్రి ఆయనతో తీవ్రంగా గోడవపడింది. ఆపై శుక్రవారం తమ బంధువులతో కలసి జయవేల్ను కత్తితో నరికి హత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గుర్తించి అతన్ని 108 వాహనం ద్వారా కార్వేటినగరం సీహెచ్సీకి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. తండ్రిపై దాడి జరిగినట్లు సమాచారం అందుకున్న కుమార్తెలు స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ
పలమనేరు: పట్టణంలోని టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్వీ బాలాజీ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకున్న విషయం శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని పెంకుల కిట్టన్న మిషన్ సమీపంలో నివాసముంటున్న ఆర్వీ బాలాజీ కుటుంబం వారం రోజుల క్రితం బయటికెళ్లింది. దీన్ని గమనించిన దొంగలు పక్కా ప్రణాళికతో ఇంటిపైనున్న కిటికీని తొలగించి లోనికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను ముందుగా తొలగించారు. ఆపై బీరువాలను ధ్వంసం చేసి సుమారు కిలో బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును చోరీ చేసి తీసుకెళ్లారు. కాగా గురువారం రాత్రి ఇంటికొచ్చిన ఆర్వీ బాలాజీ కుటుంబీకులు గ్రౌండ్ఫ్లోర్లో నిద్రించారు. శుక్రవారం ఉదయం పై అంతస్తులోని ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పని మనిషి బీరువాలు తెరిచి ఉండడం, కిటికీ ఊచలు విరిగిపోయి ఉండడాన్ని గుర్తించి యజమానికి తెలిపింది. దీంతో ఇంట్లో చోరీ జరిగినట్టు బాధితుడు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. డీఎస్పీ డేరంగుల ప్రభాకర్, సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఎంత బంగారు చోరీ అయిందనే విషయం ఇంకా నిర్ధారించలేదు. ఆర్థిక స్థితిగతులు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. -
సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాడుతాం
● ఆగస్టు నుంచి పోరాటం ఉధృతం ● కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి ● సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి ● కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ 2003 టీచర్ల ఫోరమ్ ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాడుతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ.రమణ స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 2003 డీఎస్సీ టీచర్ల ఫోరమ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఆపస్, ఎస్టీయూ, టీఎన్యూఎస్ తదితర సంఘాలు మద్దతునిచ్చాయి. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్లో ఉద్యోగాలకు ఎంపికై ఇతర కారణాలతో ఆలస్యంగా ఉద్యోగాల్లో చేరి సీపీఎస్ పరిధిలోకి వచ్చిన టీచర్లకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో సీపీఎస్ అమలు తేదీ 01–09–2004 కంటే ముందే ఉద్యోగానికి ఎంపికై అప్పటి ప్రభుత్వ కాలపరిమితి ముగిసి నూతన ప్రభుత్వ ఏర్పాటు వల్ల ఉద్యోగాల్లో చేరడం ఆలస్యమైందన్నారు. ఈ సమస్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 వేల మంది టీచర్లు, ఉద్యోగులు సంబంధం లేని, నోటిఫికేషన్లో పేర్కొనని సీపీఎస్ విధానంలోకి బలవంతంగా నెట్టబడ్డారని ఆరోపించారు. న్యాయం జరగకపోతే ఆగస్టు నుంచి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మమ్మల్ని ఓపీఎస్ పరిధిలోకి తీసుకోండి ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటామోహన్ మాట్లాడుతూ 2003 డీఎస్సీ బాధితులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పనిసరిగా నెరవేర్చాలన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు డీఆర్వో మోహన్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరమ్ కన్వీనర్లు మోహన్, ఢిల్లీ ప్రకాష్, వెంకటేష్, మధు, శ్రీధర్, కోదండరెడ్డి, జగన్మోహన్రెడ్డి, మదన్మోహన్రెడ్డి, నాగరాజురెడ్డి, కిరణ్కుమార్, మునాఫ్ పాల్గొన్నారు. -
కుళ్లబొడుస్తున్న టీడీపీ నేతలు
● నాలుగు నెలలుగా నిర్విరామంగా అక్రమ తవ్వకాలు ● రోజూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు ● రైతుల ముసుగులో ఇటుక బట్టీలు, వెంచర్లకు విక్రయాలు ● మొరవ వరకే మట్టి ఎత్తాలనే నిబంధన ఉన్నా పట్టించుకోని నేతలు ● అక్రమ తవ్వకాలపై మాట్లాడినందుకు ఇరిగేషన్ అధికారిని డమ్మీని చేసిన వైనం చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువు బావురుమంటోంది. నాలుగు నెలలుగా టీడీపీ నేతలు చెరువుని కుళ్లబొడుస్తున్నారు. అందులోని మట్టిని రాత్రిపగలు తేడాలేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మొరవ వరకే మట్టి ఎత్తాలనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా చెలరేగిపోతున్నారు. యథేచ్ఛగా జేసీబీలతో తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మట్టి తవ్వకాలపై ఓ ఇరిగేషన్ అధికారి ప్రశ్నించినందుకు అతన్ని డమ్మీ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ మట్టి దందాపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. చిత్తూరు టాస్క్ఫోర్స్: చిత్తూరులో నిత్యం లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్టాండ్ ఆనుకుని కట్టమంచి చెరువు ఉంది. ఈ చెరువులో నాలుగు నెలల నుంచి రాత్రి పగలు తేడాలేకుండా మట్టిదోపిడీ సాగుతోంది. కళ్లెదుటే కనిపిస్తున్నా ఉన్నతాధికారులెవ్వరూ నోరుమెదలేకపోతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న ఈ మట్టిమాఫియాపై స్థానికులు గ్రీన్ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ భూములకు మట్టి అవసరమైతే రైతు రూపాయి చెల్లించి తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. ఆ రైతు కూడా పాసుపుస్తకాలతో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆపైనే మట్టి తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. మట్టి తీసుకోవాలన్నా మొరవ వరకే తవ్వుకోవాల్సి ఉంటుంది. మొరవకు మించి చెరువులో మట్టిని తవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అమ్మకాలు ఇలా.. కట్టమంచి చెరువులోని మట్టిని జేసీబీలతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు పరిధిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇటుక బట్టీల వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో వైపు నగరంలోని కూటమి నేతలు కూడా వారికి తెలిసిన వారికి మట్టిని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. టిప్పర్ మట్టి రూ.4వేల నుంచి రూ.5వేలు, ట్రాక్టర్ మట్టి రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 23న ప్రారంభమైన తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఎవరైనా మాట్లాడితే టీడీపీ నేత ఎదురుతిరిగి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఇరిగేషన్లోని ఓ అధికారి మట్టి తవ్వకాలపై వేరొకరితో చర్చించినందుకు అతని అధికారాలకు కోత పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలపై అధికారులెవ్వరూ నోరెత్తకుండా టీడీపీ నేత చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కట్టమంచి చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
గజ బాధితులకు పరిహారం
యాదమరి: యాదమరి మండలంలో గజ బాధిత రైతులకు మొదటి విడతగా రూ.1.45 లక్షలు పంపిణీ చేశారు. ఈనెల 5న ‘పరిహారానికి గ్రహణం’ శీర్షికన సాక్షిలో వార్త వెలువడింది. దీనిపై స్పందించిన కూటమి ప్రభుత్వం గురవారం స్థానిక ఎమ్మెల్యే కె.మురళీమోహన్ చేతుల మీదుగా యాదమరి, బంగారుపాళ్యం మండలాల్లోని దాదాపు 20 మంది రైతులకు పరిహారాన్ని అందజేశారు. రెండో విడత పరిహారాన్ని మరో వారం రోజుల్లో అందజేస్తామని అటవీశాఖాధికారులు తెలిపారు. టీకాలు వేయించాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): వ్యాధి నిరోధక టీకాలను పిల్లలకు వంద శాతం వేయించాలని డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆశా నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గర్భిణుల నమోదు విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. వారికి వైద్య సేవలందించే విషయంలో అలసత్వం వద్దన్నారు. శిశుమరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు అనిల్కుమార్, జయరాముడు, శ్రీవాణి, మూర్తి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. డీపీఈ ఈఈగా హరి చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో డీపీఈ(విద్యుత్ చౌర్య నివారణ) విభాగం ఈఈగా హరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈఈగా ఉన్న షణ్ముగం ఇటీవల పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో ఆడోని డివిజన్ ఈఈగా ఉన్న హరి ఇక్కడికి బదిలీ పై వచ్చారు. ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు డీఈ, ఏఈలు పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. గతంలో డీపీఈ డీఈ, రూరల్స్ డివిజన్ ఈఈగా పనిచేసిన విషయం గుర్తుచేసుకున్నారు. అడవుల్లో సోలార్ లైట్ రిఫ్లెక్టర్స్ చిత్తూరు కార్పొరేషన్: అడవుల్లో సోలార్ లైట్ రిఫ్లెక్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ ఎఫ్ఆర్వో థామస్ తెలిపారు. రూ.12,500 విలువచేసే 10 లైట్స్ను రాష్ట్ర అటవీశాఖ పంపీణీ చేసిందన్నారు. వీటిని పొలాల సమీపంలో, ఏనుగులు, అడవి జంతువులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కల్లూరు, దేవళంపేట, కోటపల్లె, జూపల్లె, సైజలగుంట, కమ్మపల్లె ప్రాంతాల్లో పెట్టనున్నట్టు వెల్లడించారు. స్తంభాలు ఏర్పాటు చేసి అందులో లైట్స్ను పెడతామన్నారు. అందులో నుంచి తేనెటీగల శబ్దంతో పాటు తెల్లటి రంగులో వెలుతురు వస్తుందన్నారు. వెలుతురు జంతువుల కళ్లలో పడడంతో అటువైపుగా అవి రావన్నారు. లైట్స్ ఆఫ్ అండ్ డౌన్, రోటేషన్ పద్ధతిలో వాడుకోవచ్చని వివరించారు. స్టోర్స్కి అగ్నిమాపక పరికరాలు చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో స్టోర్స్కు శుక్రవారం అగ్నిమాపక పరికరాలు వచ్చాయి. మొత్తం 14 పరికరాలు ఇక్కడికి చేరుకున్నట్టు ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఏదైన అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మంటలార్పడానికి ఇవి ఉపయోగపడుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మంటలను అదుపు చేయడానికి వీటిని వినియోగించనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 24 వచ్చినట్టు పేర్కొన్నారు. వాటితో పాటు 56 కిలోమీటర్ల కేబుల్స్ కూడా వచ్చాయన్నారు. -
నేరుగా అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్లు చేసుకుంటారని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి చిన్నారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, పార్శికులు, బౌద్ధులు, జైనులు అడ్మిషన్లు పొందాలన్నారు. 5 నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లు పొందవచ్చన్నారు. 5వ తరగతిలో 61, ఆరో తరగతిలో 50, ఏడో తరగతిలో 42, 8వ తరగతిలో 41 సీట్లు ఖాళీలున్నాయన్నారు. అడ్మిషన్లు పొందే విద్యార్థులకు విద్యతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం, కాస్మొటిక్ చార్జీలు, వైద్య సౌకర్యం, పాఠ్యపుస్తకాలు అందజేస్తామన్నారు. ఇతర వివరాలకు 8712625058 నెంబర్లో సంప్రదించాలని కోరారు. సమష్టి కృషి వల్లే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ చిత్తూరు అర్బన్ : నగరపాలక అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ఉత్తమ ర్యాంక్ సాధ్యమైందని మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక కార్యాలయంలో అధికారులు, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేసీ్త్రలు, కార్మికులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కార్మికులను ఆత్మీయంగా సత్కరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రక్రియకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, సహాయ కమిషనర్ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, ఎంఈ వెంకటరామిరెడ్డి, ఏసీపీ నాగేంద్ర, ఇన్చార్జ్ మేనేజర్ గోపాలకృష్ణవర్మ, ఎంహెచ్వో లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసపు చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబు చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు అందజేశారు. -
సర్వే తీరు పరిశీలన
యాదమరి: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. శుక్రవారం ఆమె సమగ్ర సర్వే ప్రక్రియలో భాగంగా మండల పరిధిలోని కీనాటంపల్లి పంచాయతీ షికారీ కాలనీలో పర్యటించారు. సిబ్బంది చేపడుతున్న సర్వే తీరును పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో గృహ యజమానులతో మాట్లాడారు. ఒకే ఇంట్లోనే ఉంటూ వేర్వేరుగా వంట చేసుకునే వారికి సపరేట్గానే సర్వే నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోరు మోటారు ఏర్పాటు చేయండి మేడమ్ షికారీ కాలనీ ప్రజలు తమ కష్టాన్ని జేసీకి విన్నవించారు. వ్యవసాయం చేసుకోవాలన్నా అందుకు అవసరమైన నీటి వనరులు లేకపోవడంతో ప్రభుత్వం తమకిచ్చిన భూములు నిరుపయోగంగా ఉన్నాయని ఆవేదన చెందారు. తమకు ప్రభుత్వం నుంచి వ్యవసాయ బోరును ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగా పైళ్లెన వారు ఉన్నారని వారికోసం కొత్త రేషన్ కార్డులు, ఇళ్లను మంజూరు చేయించాలని విన్నవించారు. అసంపూర్తిగా ఉన్న పాత ఇళ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించాలని ఆమెను కోరారు. స్థానిక తహసీల్దార్ పార్థసారథి, ఎంపీడీఓ వేణు పాల్గొన్నారు. -
కాళ్లరిగేలా తిరుగుతున్నా..కనికరించరా?
● కల్లుగీత లైసెన్సు కోసం కలెక్టర్కు వినతి ● కలెక్టర్ చెప్పినా లైసెన్సు ఇవ్వకుండా తిప్పలు ● ఆర్నెళ్లుగా అబ్కారీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చిత్తూరు అర్బన్: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిపేరు లింగేశన్. చిత్తూరు మండలం, తాళంబేడుకు చెందిన కల్లుగీత కార్మికుడు. ఉదయాన్నే చెట్టు ఎక్కి కల్లుగీస్తే తప్ప పూట గడవదు. కులవృత్తిని నమ్ముకున్న లింగేశన్ వద్ద ఉన్న కల్లుగీత లైసెన్సు గడువు తీరిపోయింది. ఆర్నెళ్ల క్రితం కలెక్టర్ వద్దకు వెళ్లి, తన లైసెన్సు రెన్యూవల్ చేయాలని, వీలుకాని పక్షంలో కొత్త లైసెన్సు మంజూరు చేయాలని వేడుకున్నాడు. కలెక్టర్ కూడా పెద్ద మనసుతో వెంటనే కల్లుగీత లైసెన్సు మంజూరు చేయాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి వారంలో రెండు మార్లు చిత్తూరులోని ఎకై ్సజ్ ఈఎస్ కార్యాలయం వద్దకు రావడం, తన లైసెన్సు గురించి అధికారులను అడగం. ‘సారు వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. మళ్లీ రావయ్య..!’ అని ఒకరు, సారు మీటింగులో ఉన్నారు, రేపు రా..’ అంటూ మరొకరు. తీరా ఆ సారును కలిస్తే ఫైలు ఎక్కడుందో చూసి చెబుతానంటూ సమాధానం. ఇలా ఆరు నెలలుగా లింగేశన్కు ఎకై ్సజ్ అధికారులు నరకం చూపిస్తున్నారు. మళ్లీ కలెక్టర్ వద్దకు వెళితే తనపై పగబట్టి, లైసెన్సు ఇవ్వకుండా చేస్తారేమోనని.. లింగేశన్ ఆర్నెళ్లుగా ఎకై ్సజ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. అసలు కలెక్టర్ సంతకం చేసి ఇచ్చిన అర్జీ అధికారుల వద్ద ఉందో, లేదో కూడా తెలియడం లేదు. లేదనే విషయం చెబితే పరువుపోతుందనుకున్నారో ఏమోగానీ.. వారంలో రెండు సార్లు లింగేశన్ను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. పోనీ అధికారులకు ‘దక్షిణ’ ఏదైనా ఇద్దామంటే.. తన పరిస్థితి అంతంత మాత్రమేనంటూ లింగేశన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎకై ్సజ్ అధికారుల రాతి గుండె కరగడానికి పాపం ఈ వ్యక్తి ఇంకెన్నాళ్లు కార్యాలయం చుట్టూ తిరగాలో చూడాలి మరి. -
డిగ్రీ అడ్మిషన్లకు లైన్ క్లియర్
– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. డిగ్రీ అడ్మిషన్లు చేపట్టడంతో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది తీవ్ర ఆలస్యం చేసింది. విద్యార్థులు ఇంటర్మీడియెట్ పూర్తి చేసినప్పటికీ మిన్నకుండాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమందేమో ఇంజినీరింగ్ వైపు వెళ్లిపోగా...డిగ్రీ చదవాలని ఎంచుకున్న విద్యార్థులు మాత్రం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏప్రిల్లో ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల చేయగా మూడు నెలల తర్వాత డిగ్రీ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. డిగ్రీ అడ్మిషన్ దరఖాస్తు ప్రక్రియలో ఎస్సీ రిజర్వేషన్ అమలులో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు అడ్మిషన్ల ప్రక్రియకు అనుసరించాల్సిన విధి విధానాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్ట్స్, సైన్స్, సోషల్, కామర్స్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్ సబ్జెక్టుల్లో బీఏ, బీఎస్సీ, బీకాం అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్లకు అనుమతి మంజూరు చేసింది. ఆన్లైన్ మొరాయింపు డిగ్రీ అడ్మిషన్లకు మొదటి నుంచే ఆన్లైన్ మొరాయిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆఫ్లైన్లో సైతం దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతిచ్చారు. అయితే ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించే కళాశాలల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తే ప్రిన్సిపల్స్ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. విద్యార్థి ఏ కళాశాలలో అయితే దరఖాస్తు చేస్తారో ఆ కళాశాలను, అక్కడి కోర్సులను ప్రథమ ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు అందజేసే విద్యార్థులు దరఖాస్తుతో పాటు అడ్మిషన్లు పొందే కళాశాలల్లో కోర్సులను వరుస క్రమంలో పేర్కొనాలి. మెరిట్ కమ్ రోస్టర్ విధానం అమలు డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు వారి రిజర్వేషన్ ప్రకారం అడ్మిషన్ సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ విద్యార్థులకు మొత్తం సీట్లల్లో 15 శాతం కేటాయిస్తారు. ఈ రిజర్వేషన్లను వర్గీకరణ ప్రకారం అమలు చేస్తారు. గ్రూపు–1లోని 12 కులాలకు 1 శాతం, గ్రూపు–2లోని 18 కులాలకు 6.5 శాతం, గ్రూపు–3 లోని 29 కులాలకు 7.5 శాతం చొప్పున 15 శాతం సీట్లు కేటాయించేలా చర్యలు చేపడుతున్నారు. -
మహిళా కమిషన్లో రోజా ఫిర్యాదు.. గాలిపై చర్యలు తీసుకోవాల్సిందే..
సాక్షి, నగరి: చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా జాతీయ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా.. కమిషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని రోజా.. కమిషన్ను కోరారు. ఇక, అంతకుముందు.. భాను ప్రకాశ్ను అరెస్ట్ చేయాలని రోజా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా.. మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్కు ఎక్కువ.. హీరోయిన్కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా?మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి స్పందించారు. ఈ సందర్బంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం తలదించుకునేలా భాను ప్రకాష్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఇంట్లో మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. రోజాకు వెంటనే భాను ప్రకాష్ క్షమాపణ చెప్పాలి. భాను ప్రకాష్ను అరెస్టు చేయాలి. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ ఏమైపోయారు. మహిళలను అవమాన పరచడం అనేది టీడీపీ డీఎన్ఏనే ఉంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
నగరి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ఆర్కే రోజా ఫిర్యాదు
మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇంట్లో మహిళలు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ లేకుండా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నిస్సిగ్గుగా నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను అసభ్యంగా దూషిస్తూ.. ఆమె వాహనంపై టీడీపీ సైకో మూకలు దాడి చేసిన ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుండగా.. మరో వైపు మాజీ మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం సిగ్గు పడేలా దుర్భాషలాడుతూ ఐ టీడీపీ, చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రెచ్చిపోయారు. సాక్షి, అమరావతి/నగరి: పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్కు ఎక్కువ.. హీరోయిన్కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ స్పందించాలిమహిళా లోకం అసహ్యించుకొనేలా.. సభ్య సమాజం తల దించుకునేలా మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడటం దారుణం అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. ‘సినిమా వాళ్లు అంటే ఎందుకు మీకు ఇంత చులకన? మీరు నెత్తిన ఎక్కించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా?’ అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి అని ఆమె డిమాండ్ చేశారు. నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు. కౌన్సిలర్ల అక్రమ అరెస్ట్పై నిలదీసిన రోజాపుత్తూరు: తమిళనాడుకు ఏడు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ బ్యాచ్ పట్టుబడగా.. తప్పుడు వాంగ్మూలంతో పోలీసులు ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. వివరాలు.. ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఏడు టిప్పర్లను ఇటీవల నగరి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన భరత్ను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అనుచరుడైన భరత్ ఇచ్చిన తప్పుడు వాంగ్మూలంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బీడీ భాస్కర్, బిలాల్పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి.. బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వారిని గురువారం ఉదయం 11 గంటలకు పుత్తూరు సబ్ కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా పుత్తూరు కోర్టు వద్దకు చేరుకుని ఎస్సై విజయ్ను పలు ప్రశ్నలతో నిలదీశారు. ఇసుకను ఎక్కడ అక్రమంగా తరలిస్తుంటే వీరిని పట్టుకున్నారో సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశి్నంచారు. అసలు రాజంపేట నుంచి నగరి మీదుగా తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలించడం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు సాధ్యపడే విషయమేనా అని నిలదీశారు. అన్ని ప్రశ్నలకూ సీఐని అడగాలంటూ ఎస్సై నీళ్లునమిలారు. ఇసుక మాఫియాకు ప్రధాన సూత్రధారి అయిన గాలి భానుప్రకాశ్ ప్రధాన అనుచరుడు భరత్ నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకొని.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై అక్రమ కేసులు బనాయించారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. తప్పుడు కేసులకు భయపడే పరిస్థితిలో లేమని.. పార్టీ కేడర్కు వైఎస్సార్సీపీ నాయకులతో పాటు వైఎస్ జగన్ అండగా ఉన్నారని చెప్పారు. -
మామిడి ర్యాంపుల్లో సిండికేట్!
ధర తగ్గించేస్తున్న వైనం ● లబోదిబోమంటున్న అన్నదాతలు ● పట్టించుకోని హార్టికల్చర్ అధికారులు పలమనేరు: మామిడి ర్యాంపుల్లో సిండికేట్లు చెలరేగిపోతున్నారు. పట్టణ పరిధిలో నాలుగు దాకా మామిడి ర్యాంపులను అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల మామిడి ధరలు పెరిగిన నేపథ్యంలో తోతాపురి టన్ను ధర రూ.8వేలకు చేరింది. దీంతో స్థానికంగా మామిడి విక్రయాలు భారీగా పెరిగాయి. దీన్ని అదునుగా తీసుకున్న వ్యాపారులు సిండికేట్గా మారి మామిడిధరలను టన్ను రూ.7 వేలుగా చేశారు. దీంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇదిగో సాక్ష్యం రెండ్రోజుల క్రితం పలమనేరు మండలంలోని ఓ రైతు తన మామిడి కాయలను రూ.8వేల టన్నుగా ఇక్కడి ర్యాంపు వ్యాపారులకు విక్రయించాడు. అయితే ర్యాంపువ్యాపారులు సిండికేట్గా మారి మామడి ధరలను రూపాయి దాకా తగ్గించేశారు. దీనిపై మండిపడిన ఆ రైతు ఎందుకిలా మోసం చేశారంటూ అక్కడి ర్యాంపు నిర్వాహకులను ప్రపశ్నించారు. దీనిపై ర్యాంపు నిర్వాహకలంతా ఏకమై ఇష్టముంటే అమ్ము లేకుంటే సరుకు తీసుకెళ్లు అంటూ రైతుపై దౌర్జన్యానికి దిగారు. నోరుమెదపని హార్టికల్చర్ సిబ్బంది పట్టణంలోని ర్యాంపుల వద్ద హార్టికల్చర్ అధికారులు స్థానిక సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంట్లను విధుల్లో పెట్టారు. వీరు రైతుల నుంచి ర్యాంపులకు వచ్చే సరుకు ఎన్ని టన్నులో చూసి దానికి ప్రభుత్వం ద్వారా అందే రాయితీలను అందించాల్సి ఉంది. దీంతో పాటు రైతులకు ఎలాంటి అన్యాయం జరక్కుండా చూసుకోవాలి. కానీ ఈ ర్యాంపుల వద్దనున్న హార్టికల్చర్ అసిస్టెంట్లు వ్యాపారుతో సిండికేట్గా మారి ధర తగ్గిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై హార్టికల్చర్ ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. చర్యలు తీసుకోవాలి సిండికేట్లపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ర్యాంపుల యజమానులు సిండికేట్గా మారి మామిడి రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
సర్వ దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 75,104 మంది స్వామివారిని ద ర్శించుకోగా 31,896 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శ నం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. సూర్యప్రభపై కుమారస్వామి చిద్విలాసం శ్రీకాళహస్తి: విజ్ఞానగిరిపై ఉన్న కుమారస్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. విశేషంగా అలంకరించి, ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి, పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహిళపై టీడీపీ శ్రేణుల దాడి సాక్షి టాస్క్ఫోర్స్: కుమార్తైపె అసభ్యకరంగా ప్రవరించారని ప్రశ్నించినందుకు ఓ మహిళపై టీడీపీ శ్రేణులు దాడిచేసిన ఘటన చిత్తూరు మండలం, పచ్చనపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు .. పచ్చనపల్లినికి చెందిన కల్వి(43) కుమార్తె నీళ్లు తెస్తున్న క్రమంలో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం కుమార్తె తల్లికి చెప్పడంతో తల్లిదండ్రులను ప్రశ్నించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆ యువకుడు వారి కుటుంబీకులు (టీడీపీ శ్రేణులు) బండ బూతులు తిడుతూ కల్విని కర్రలతో చితక్కొట్టారు. దీంతో కల్వి తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, నలుగురు వ్యక్తులు తమపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని కల్వి, అతని భర్త చుక్క లింగం పేర్కొన్నారు. -
రేపటి నుంచి అభినయ ఆర్ట్స్ జాతీయ నాటకోత్సవాలు
తిరుపతి కల్చరల్: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో అభినయ ఆర్ట్స్ వారి రజతోత్సవాల్లో భాగంగా ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో జాతీయ స్థాయి హనుమ అవార్డ్స్ నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బీఎన్.రెడ్డి తెలిపారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభినయ ఆర్ట్స్ 25వ వార్షికోత్సవంలో భాగంగా రజతోత్సవ వేడుకలుగా ఈ జాతీయ స్థాయి నృత్య, నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు రోజు ఉదయం 9.30 నుంచి రాత్రి 9 గంటల వరకు శాసీ్త్రయ, జానపద బృంద నృత్యాలు, పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాబృందాల చే 8 పౌరాణిక పద్యనాటకాలు, 11 సందేశాత్మకమైన సాంఘిక నాటికలు అద్భుత రీతిలో ప్రదర్శన ఉంటుందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి హనుమ అవార్డులతో పాటు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అభినయ ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు ఎన్.విశ్వనాథరెడ్డి, గౌరవ సలహాదారుడు దామోదర గుప్త, ఉపాధ్యక్షుడు ధర్మయ్య పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలకు అ‘బలి’
పాకాల: భార్యపై అనుమానం.. కుటుంబ కలహాలు.. హతుడికి మానసిక రోగం.. వెరసి అబలతోపాటు ఇద్దరు చిన్నారులు బలైపోయారు. మద్దినాయనపల్లి పంచాయతీ పెద్దహరిజనవాడ గ్రామానికి చెందిన గిరి తన అక్క ఇంటి వద్ద ఉన్న భార్యాపిల్లలను తీసుకుని వస్తూ మార్గం మధ్యలోని తన తండ్రి వర్ధంతి సందర్భంగా సమాది వద్ద పూజలు చేశాడు. అనంతరం అదే దారిలోని బావిలో భార్యబిడ్డలను తోసి హతమార్చాడు. గిరి తిరుపతిలో ఎలక్ట్రీషియన్ పని చేస్తుండగా అతడి భార్య హేమంతకుమారి(33) లీలామహల్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తోంది. వీరికి పెద్ద కుమార్తె తనుశ్రీ(10), రెండవ కుమార్తె తేజశ్రీ(6) పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గిరి కుటుంబంతో తిరుపతిలోనే జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల కిందట గిరి పులిచెర్ల మండలం ఈ–రామిరెడ్డిగారిపల్లిలోని తన అక్కగారి ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడే మూడు రోజులు గడిపాడు. గురువారం తన తండ్రి వర్దంతి సందర్భంగా తిరిగి తన స్వగ్రామామైన పెద్దహరిజనవాడకు బయలుదేరాడు. మార్గం మధ్యలోని తన తండ్రి సమాది వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశాడు. ఆ తరువాత బయలుదేరి అదే మార్గంలోని కొత్త ఒడ్డిపల్లి గంగనబోయని బావి వద్దకు వారిని తీసుకెళ్లి, భార్యా బిడ్డలను బావిలోకి తోసేశాడు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువాత తాను బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం హతుడు ఆత్మహత్యకు పాల్పడే ముందు తన సోదరుడికి ఫోన్లో చెప్పడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే తల్లీబిడ్డలు మరణించారు. గిరిని వారు కాపాడి ఆస్పత్రికి తరలించారు. కాగా రెండు మూడు రోజులుగా గిరి మానసిక పరిస్థితి బాగా లేదని హతుడి సమీప బంధువులు చెబుతున్నారు. అలాగే కుటుంబ కలహాల కారణంగానే వారిని హత్య చేశారని మృతుల బంధువులు చెబుతున్నారు. బొమ్మల్లాంటి బిడ్డలను హతమార్చడానికి నీకు చేతులు ఎలా ఆడాయిరా నాయనా అని మృతుల బంధులు రోదనలు చూసిన వారి కంట తడి పెట్టిస్తున్నాయి. కాగా హతుడు గిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
రేణిగుంట: సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీన తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పి శ్రీనివాసరావు, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, సీఐలు జయచంద్ర, మంజునాథరెడ్డి, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు. -
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం రేపు
ఏర్పేడు: మండలకేంద్రం సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో శనివారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్థన్రాజు ఐఐటీ ప్రాంగణంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ భవనాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన ముందస్తు భద్రతా చర్యలను గురించి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా జేసీ శుభం బన్సల్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాల్గొన్నారు. -
భాను నోరు అదుపులో పెట్టుకో!
తప్పుడు కేసుతో వేధిస్తున్నారు దారి కోసం తన ఇంటి స్థలం ఇవ్వలేదన్న నెపంతో ఓ టీడీపీ నాయకుడు వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో 8వ ర్యాంక్ ● నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్కు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ● వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై తప్పుడు కేసుల బనాయింపుపై మండిపాటు మామిడి ర్యాంపుల్లో సిండికేట్! మామిడి ర్యాంపుల్లో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధర తగ్గిస్తూ మామిడి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం): రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. జేబులో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రిలోనే దర్జాగా ఉచితంగా వైద్యం చేయించుకునే హక్కును ఆయన పేదలకు కల్పించారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈ పథకానికి మరిన్ని మెరుగులు అద్దారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1,800 లోపు ఉన్న చికిత్సలను ఆయన 3,255కు పెంచారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర నగరాల్లోనూ ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు పొందే విధంగా వెసులుబాటు కల్పించారు. నిధులు ఎలా? ఇకపై జిల్లా కలెక్టర్ నుంచి నిధులు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సంబంధిత నెట్వర్క్ ఆస్పత్రులకు కై ్లమ్ అమౌంట్ విడుదలవుతోంది. ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వస్తే కై ్లమ్ అప్రూవల్ ఇచ్చాక నిధులను కలెక్టర్ నుంచి విడుదల చేయనున్నట్లు సమాచారం. నెట్వర్క్ ఆస్పత్రులపై ఏవైనా ఫిర్యాదులొచ్చినా కలెక్టర్ నేరుగా చర్యలు తీసుకునే అధికారం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తేనే నిధులు ఇస్తామని చెప్పినట్లు చర్చ జరుగుతోంది. ఏడాదిగా కేంద్రం ఇస్తున్న నిధులను ఇతర పథకాలకు వాడుకుంటున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూ లు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయుష్మాన్ భా రత్ అమలుకు ప్రత్యేకంగా ఒక మెడికోను ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఎలా? ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేసి ఆయుష్మాన్ భారత్ను తీసుకొచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉంది. కాగా ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భారత్లో వ్యాధుల సంఖ్య 1,900లోపే ఉండడం.. ప్యాకేజీ కూడా తక్కువగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులు దీనిపై నిరాసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసి 1000 వ్యాధులను బీమా పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సూతన ఆరోగ్య పాలసీ రూపాందించే పనిలో కూటమి పెద్దలు ఉన్నట్లు స్పష్ట మవుతోంది. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : పాత పెన్షన్ సాధనకు డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరమ్ నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ ధర్నాలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం గళమెత్తనున్నారు. ఈ ధర్నాలో జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాలు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరమ్ టీచర్లు పాల్గొననున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ముగ్గురు హాజరు కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్)లో గురువారం నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ల పశీలనకు ముగ్గురు అభ్యర్థులు హాజరైనట్లు కళాశాల ఇన్చార్జి డీకే దామోదరం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 17 నుంచి 22వ తేదీ వరకు డైట్ అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. 91 మంది గవర్నమెంట్ కళాశాలకు, 103 మంది ప్రైవేటు కళాశాల విద్యార్థులు హాజరవ్వాల్సి ఉందని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ముగ్గురు విద్యార్థులు హాజరైనట్లు వివరించారు. అధ్యాపకులు నాగరాజనాయక్, దశరథుడు, మునిక్రిష్ణ, సూపరింటెండెంట్ కృపావతి, శ్రీనివాసులు పాల్గొన్నారు. పలమనేరుకు 13వ ర్యాంకు పలమనేరు : స్వచ్ఛ సర్వేక్షణ్లో పలమనేరు మున్సిపాలిటకి రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 386 ర్యాంకు సాధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం ఉత్వర్వులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ రమణారెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీలో తడి, పొడిచెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల శుభ్రత తదితర అంశాలపై కేంద్రం ర్యాంకులను ప్రకటించిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటీకి 272, చిత్తూరు 273, పలమనేరు 386, పుత్తూరు 508, నగరి 666, కుప్పం 1478 ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. సహకరించిన పట్టణ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 26న జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ 1–7 స్థాయి సంఘాల సమావేశం ఈనెల 26న శనివారం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి జిల్లా అధికారులు సమావేశానికి హాజరుకావాలని కోరారు. చిత్తూరు అర్బన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో చిత్తూరు నగరపాలక సంస్థకు రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ లభించింది. అలాగే జాతీయ స్థాయిలో 273వ ర్యాంక్ కై వసం చేసుకుంది. జీఎఫ్సీ (గార్భేజ్ ఫ్రీ సిటీ)లో మొదటి సారి చిత్తూరు స్టార్ రేటింగ్ సాధించింది. ఈ మేరకు గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్–2024 ఫలితాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫలితాలను నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగంలో సింగల్ స్టార్ రేటింగ్, ఓడీఎఫ్ ప్లస్ సర్టిఫికెట్ను సాధించినట్లు చెప్పారు. 1–10 లక్షల జనాభా కేటగిరీలో జాతీయ స్థాయిలో 824 నగరాలతో పోటీపడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ 273వ ర్యాంక్ పొందిందన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో 67 నగరాలతో పోటీపడుతూ 8వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో గత ఏడాది 446 నగరాలు పోటీపడగా ఈ ఏడాది ఏకంగా 824 నగరాలు పోటీలో ఉన్నాయన్నారు. జనాభా పరంగా మనకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలతో దీటుగా చిత్తూరు పోటీపడినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నిర్వహణ, ఓడీఎఫ్ ప్లస్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో గతంకంటే మెరుగైన మార్కులు వచ్చాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో మెరుగైన ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో మరింత మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తామని కమిషనర్ వెల్లడించారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్పథకాన్ని నీరుగార్చేందుకు కూటమి కుట్ర ఆయుష్మాన్ భారత్కు రంగం సిద్ధం ఉద్యోగులకు శిక్షణలు త్వరలో ప్రారంభించనున్న వైనం ప్రశ్నార్థకంగా ఆరోగ్య మిత్రల భవిష్యత్పేదల ఆరోగ్యానికి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కొండత భరోసానిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకానికి పురుడుపోసి ఊపిరిపోశారు. ఉచితంగానే ఖరీదైన వైద్య సేవలందించి అండగా నిలిచారు. ఆ తర్వాత ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సైతం తండ్రిబాటలోనే నడిచారు. ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారు. వేలాది చికిత్సలను పథకంలో చేర్చి ప్రజానేతగా రోగుల మదిలో నిలిచారు. అయితే ఈ పథకాన్ని రద్దు చేసే దిశగా కూటమి నేతలు అడుగులు వేస్తున్నారు. దీనిపై పలువురు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జిల్లాలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు ప్రభుత్వ నెట్వర్క్ ఆస్పత్రులు 4 ప్రైవేటు ఆస్పత్రులు 9 సీహెచ్సీ నెట్వర్క్ ఆస్పత్రులు 7 పీహెచ్సీ నెట్వర్క్ ఆస్పత్రులు 47 డెంటల్ క్లినిక్లు 7 మొత్తం 74 ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేసేవారు జిల్లా కో–ఆర్డినేటర్– 1 టీమ్ లీడర్లు 2 డీఈఓ 1 ఆరోగ్య మిత్రలు 48 కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చేశారు. అయినప్పటికీ ప్రజలు ఆరోగ్యశ్రీగానే పిలుస్తుండడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఈ పథకాన్ని తొలగించాలనే కుట్రకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ను తెరపైకి తీసుకొస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఐదు విడతల శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. మరో నెల రోజుల్లో పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ‘మిత్ర’ద్రోహమే! ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారత్ను తీసుకొ చ్చి లాగిన్ అవకాశాన్ని సంబంధిత నెట్వర్క్ ఆస్పత్రిలోని మెడికో ద్వారా చేపట్టనుండడంతో ఆరోగ్య మిత్రల ఉనికి ప్రశ్నార్థకం కానుంది. ఒకవైపు పథకా న్ని మార్చే పనులు వేగవంతంగా చేస్తున్నా మిత్రల గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో 48 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. గత 17 ఏళ్లుగా ఇందులో చా లామంది ఉద్యోగులు ట్రస్టును నమ్ముకుని పనిచేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వీరి మెడపై కత్తి వేలాడ తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. -
చిత్తూరులో పేట్రేగుతున్న.. ‘పచ్చ’ మాఫియా!
● రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా ● ఒక్కో ప్లాటు రూ.7 లక్షలకు విక్రయం ● కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లడంతో ఆగిన కబ్జా ● ఆలస్యంగా మేల్కొన్న అధికారులు చిత్తూరు అర్బన్: చిత్తూరులో కూటమికి చెందిన నాయకుల కన్ను రూ.కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములపై పడింది. ఇప్పటికే నగరంలో రాత్రిపూట ఎలాంటి బిల్లులు లేకుండా గ్రానైట్ తరలించడం, సివిల్ పంచాయితీలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ప్రధాన ముఠా.. తాజాగా ప్రభుత్వ భూములపై కన్నేశారు. నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన దాదాపు రూ.3 కోట్ల విలువచేసే స్థలాన్ని చదునుచేసి, రాళ్లు నాటి, ప్లాట్లు వేశారు. అంతటితో ఆగకుండా పలువురికి ప్లాట్లు కూడా అమ్మేశారు. ఆలస్యంగా మేల్కొన్న యంత్రాంగం పోలీసుల రక్షణతో గురువారం భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.కోట్ల విలువైన భూమి నగరంలోని మంగసముద్రం వద్ద మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన డంపింగ్ యార్డు ఉంది. దీని పక్కనే సర్వే నం.113లో దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఆనుకునే మంగసముద్రం మీదుగా తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారి కూడా ఉంది. ఈ రెండు ఎకరాల భూమి మార్కెట్ విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన ఓ క్లస్టర్ ఇన్చార్జ్ కన్ను ప్రభుత్వ భూమిపై పడింది. ఎలాగైనా దీన్ని కబ్జా చేయాలని భావించి, ఓ కూటమి నేత అనుచరుడిని ఆశ్రయించాడు. ‘అన్నా, ఇద్దరం కలిసి లే–అవుట్ వేద్దాం. పెట్టుబడి నాది. లాభంలో ఇద్దరికీ చెరిసగం. నువ్వు అండగా ఉంటే చాలు. వార్డు ఇన్చార్జ్ కూడా మనకు సపోర్ట్ చేస్తాడు...’ అంటూ ఆ వ్యక్తిని ఇందులోకి దించాడు. చిన్నపాటి గుట్టలు, ముళ్లకంపలు ఉన్న రెండు ఎకరాల భూమిని వారం రోజుల్లో శుభ్రం చేయడం, అందులో రాళ్లు నాటడం, 35కు 25 సైజులో ప్లాట్లు వేయడం చకచకా ప్రారంభించేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్లాట్లను చూపించి, ఒక్కో ప్లాటు రూ.7 లక్షలకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయడంతో.. చాలామంది ముందుకు వచ్చి ప్లాట్లు కూడా కొనేశారు. కలెక్టర్ ఛీవాట్లు పెట్టడంతో.. ఇక్కడ జరుగుతున్న భూ కబ్జా బాగోతంపై కార్పొరేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. నిత్యం ఇటువైపు కార్పొరేషన్ డంపింగ్ వాహనాలు, అధికారుల నుంచి కార్యదర్శుల వరకు తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది అధికార పార్టీ నేతలు కావడంతో ఎవ్వరూ నోరు మెదపలేదు. చివరకు విషయం కలెక్టర్ వరకు వెళ్లింది. కలెక్టర్ కల్పించుకుని రెవెన్యూ, మునిసిపల్ అధికారులకు ఛీవాట్లు పెట్టడంతో అధికారులు ఉరుకులు పరుగులతో ఇక్కడకు చేరుకున్నారు. గురువారం రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉన్న మునిసిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర, రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వ భూమిలో పాతిపెట్టిన రాళ్లను తొలగించి, జేసీబీ సాయంతో కంచెను వేసే ప్రక్రియ చేపట్టారు.ఎంత ధైర్యం? ప్రభుత్వ భూమిని చెరపట్టాలంటే సామాన్యులకు వీలుకాదు. అధికార పార్టీ అండదండలు, ప్రజాప్రతినిధికి వాటాలు ఇస్తేనే ప్రభుత్వ భూమిని కబ్జాచేసే ధైర్యం వస్తుంది. చిత్తూరులో రూ.కోట్ల విలువచేసే భూమిలో ధైర్యంగా రాళ్లు నాటి, విక్రయించే స్థాయికి వెళ్లారంటే.. ఆ టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్కు ఎంతటి అధికార పార్టీ అండ దండలు లభించాయోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. మరి దీనిపై కూటమి నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి. మరోవైపు ఇది తమ వంశపారంపర్య భూమి అంటూ స్థానిక వ్యక్తి ఒకరు అధికారులకు పలు పత్రాలను అందచేశాడు. ఆన్లైన్ అడంగల్ నివేదికలో పరిశీలిస్తే ఇది ప్రభుత్వ భూమిగా ఉందన్న అధికారులు, కలెక్టర్కు నివేదిక ఇస్తామని చెప్పారు. -
ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఊచించారు. ఈ మేరకు కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీ–4 కార్యక్రమంలో పేదలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను గర్తించి రిజిస్టర్ చేయించాలన్నారు. ఈ నెల 19వ తేదీన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 3వ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, వార్డులో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనం ఢీ
– ఆర్టీసీ మెకానిక్ మృతి రొంపిచెకర్ల: ద్విచక్ర వాహనం ఢీకుని ఆర్టీసీ మెకానిక్ మృతి చెందిన ఘటన రొంపిచెర్ల మండలం, బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ, ఫజులుపేటలో బుధవారం రాత్రి జరిగింది. ఫజులుపేటకు చెందిన ఆర్టీసీ మెకానిక్ మోహన్బాబు పీలేరు ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నడు. రొంపిచెర్ల బస్టాండ్ నుంచి రాత్రి 10 గంటల సమయంలో రొంపిచెర్ల పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంటికి నడిచి వెళ్లుతుండగా నగిరి దళితవాడకు చెందిన నూతనకుమార్ (16) ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ మెకానిక్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని చికిత్స కోసం పీలేరు ప్రభుత్వాస్పత్రికి .. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మరణించాడు. మృతుని కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. అటెండర్ ఆత్మహత్య చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (ఆర్డిఓ)లో అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ (39) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇతన్ని ఇటీవల కలెక్టరేట్కు బదిలీ చేశారు. కలెక్టరేట్లో విధులు నిర్వర్తించడం ఇష్టంలేని రవికుమార్ మనస్తాపంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రవికుమార్ మృతిచెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల అదృశ్యం చంద్రగిరి: హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వార్డెన్ వనజ కథనం మేరకు.. పట్టణంలోని ప్రభుత్వ బాలుర హాస్టల్లో తిరుపతికి చెందిన శ్యామ్ నాగరాజు, పీలేరుకు చెందిన గోపిచంద్ స్థానిక ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. బుధవారం మధ్యాహ్నం గోపిచంద్ స్కూల్కు వెళ్లకుండా బయట తిరుగుతుండగా వార్డెన్ వనజ కంటపడ్డాడు. దీంతో స్కూల్కు ఎందుకు వెళ్లలేదని ఆమె విద్యార్థినిని ప్రశ్నించారు. క్రమం తప్పకుండా స్కూల్కు వెళ్లాలని, ఇలా బయటకు రాకూడదని మందలించారు. ఆపై శ్యామ్ నాగరాజ్ కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించారు. చంద్రగిరికి చేరుకున్న శ్యామ్ నాగరాజ్ కుటుంబ సభ్యులు విద్యార్థిని తీవ్రంగా మందలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాచ్మెన్ విద్యార్థుల గదులను పరిశీలిస్తుండగా శ్యామ్ నాగరాజ్తోపాటు గోపిచంద్ కనిపించకుండా పోయినట్లు గుర్తించి, వార్డెన్కు సమాచారం అందించారు. హాస్టల్కు చేరుకున్న వార్డెన్ విద్యార్థులు కనిపించపోవడంతో వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. శ్రీనివాసమంగాపురం, శ్రీవారిమెట్టు, నరసింగాపురం రైల్వే స్టేషన్ పరిసరాలను ఆచూకీ కోసం వెతికారు. విద్యార్థులు ఆచూకీ లభించకపోవడంతో వార్డెన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం వార్డెన్ వనజ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. -
యూరియాకు కృత్రిమ డిమాండ్
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో లేకలేక వర్షాలు పడ్డాయి. రైతులు సేద్యపు పనుల్లో బిజీగా మారారు. పంటలకు, పశుగ్రాసానికి యూరియా అవసరం ఎక్కువైంది. ఇదే అదునుగా పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లోని ఎరువుల వ్యాపారులు యూరియాకు కృత్రిమ డిమాండ్ను సృష్టించారు. యూరియా బస్తా కావాలంటే.. కాంపె్లక్స్ ఎరువు బస్తా కొనాల్సిందేనని నిబంధన పెడుతున్నారు. దీంతో రైతులు విధిలేక యూరియా కోసం కాంప్లెక్స్ను కొనాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.1,300 నుంచి రూ.1,700 దాకా పెట్టికొన్న కాంప్లెక్స్ బస్తాలు దుకాణాల్లో అమ్ముడు కాకుండా వ్యాపారులకు భారంగా మారుతుండడం దీనికి కారణం. ప్రధాన డీలర్ల నుంచి స్థానిక వ్యాపారులకు కూడా ‘యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాల్సిందేనన్న’ డిమాండ్ వస్తున్నట్లు సమాచారం. రూ.250 యూరియా.. రూ.295కు విక్రయాలుఎమ్మార్పీ ప్రకారం యూరియా బస్తా ధర రూ.250గా ఉంది. కానీ ఇక్కడి దుకాణాల్లో వీటిని రూ.295 దాకా విక్రయిస్తున్నారు. ఎందుకని రైతులు ప్రశ్నిస్తే తమకు రేణిగుంటనుంచి యూరియా వస్తుందని అక్కడినుంచి ఇక్కడికి రవాణా, అన్లోడింగ్ చార్జీలు తప్పవని చెబుతున్నారు. కృత్రిమ డిమాండ్, అధిక ధరల విషయంలో విజిలెన్స్ అధికారుల హెచ్చరికలనూ వ్యాపారులు బేఖాతరు చేయడం గమనార్హం. ఒకవైపు కృత్రిమ డిమాండ్, మరోవైపు అధిక ధరల నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు కొందరు కర్ణాటకలోని నంగళి, ముళబాగిళు, బేతమంగళలకు వెళ్లి యూరియాను కొనుగోలు చేస్తున్నారు.నిజమే కానీ...యూరియా కావాలంటే.. కాంప్లెక్స్ కొనాల్సిందేనన్న షరతు వార్తలు నిజమే. ధరల విషయానికొస్తే రేణిగుంట నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జీలను ప్రధాన డీలర్లకు ప్రభుత్వం ఇస్తే.. ఆ ప్రయోజనాన్ని రిటైల్ వ్యాపారులకు అందించాల్సి ఉంటుంది. ఈ డబ్బు రానందున కొంత ఇబ్బందిగా మారింది. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎమ్మార్పీకే యూరియాను విక్రయించాలి. ఆయా అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడతాం. – సాక్షితో స్థానిక వ్యవసాయశాఖ ఏడీ గీతాకుమారి -
‘మా అన్న చనిపోతే పవన్ కనీసం పలకరించలేదు’
తిరుపతి జిల్లా: తన అన్న హత్య చేసిన కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్ రాయుడు సోదరి కీర్తి. ఈరోజు(గురువారం జూలై 17) శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి.. తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు రక్షణ కల్పించాలి కోరాం. చిన్న చిన్న విషయాలకు పవన్ కల్యాణ్ స్పందిస్తారు, మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయినా మమ్మల్ని తీసుకువెళ్ళండి. హత్య జరిగిన తర్వాత మాకు రూ. 30 లక్షలు ఆఫర్ చేశారు. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలి. సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు..వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేసింది. కాగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు’ అని రాజేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది.‘అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ’ -
‘గాలిలో గెలిచిన గాలిగాడు.. కౌన్సిలర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడతున్నారని మండిపడ్డారు.గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికు వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారుసుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారింది. నువ్వు చేసిన అక్రమాలు బయటకు తీస్తా.. నీ అవినీతి బయటకు కక్కిస్తా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకున్నారు. తప్పుడు కేసులు కు భయపడం. మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. లక్ష 86 వేల కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేశారు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. -
అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ: రాజేశ్వరమ్మ
సాక్షి, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని.. టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్ పెట్టాడు. కానీ, ఆయన ఏమీ స్పందించలేదు. నా పేరు బయటకు చెప్పవద్దు.. మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.ఇదిలా ఉండగా.. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు. -
‘కాణిపాకం’ను అభివృద్ధి చేయండి
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంను మరింత అభివృద్ధి పరచాలని నేషనలీస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్ అధికార ప్రతినిధి, యువ భారత్ చైర్మన్ వైద్య ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఈఓ క్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సన్మానం చేశారు. కాణిపాకం అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా దేవస్థాన అధికారులు అడుగులు వేయాలని ఈవోను కోరారు. రేపటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు తిరుపతి సిటీ : ఏపీఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ వెబ్ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఈనెల 13వ తేదీ నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటికే జిల్లాలో సుమారు 19 వేల మందికిపైగా వెబ్ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మరో రోజు మాత్రమే వెబ్ఆప్షన్లకు అవకాశం ఉండడంతో విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 19వ తేదీన ఒక రోజు మాత్రమే వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉండనుంది. 22 వతేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే ఐసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఈనెల 21వ తేదీవరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇచ్చిన అధికారులు, 22న వెబ్ ఆప్షన్ల మార్పు, 25న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. -
● పుష్పపల్లకీలో పురుషోత్తముడు
తిరుమల వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలసి బుధవారం సాయంత్రం పుష్పపల్లకీలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ఆణివార ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై కొలువుదీర్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. – తిరుమల -
తప్పులు లేకుండా ఓటరు జాబితా
చిత్తూరు అర్బన్ : తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు బాధ్యతగా పనిచేయాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఓటర్ల జాబితా రూపకల్పన, మార్పులు చేర్పులపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.,. బుధవారం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో చేపట్టిన బీఎల్వోల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఆర్ఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్వోల పాత్ర కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. ఓటర్ల జాబితా కోసం ఇంటింటి పరిశీలనను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. సర్వే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఓటర్ల జాబితాలో చిరునామా, ఇతర వివరాల మార్పులు చేర్పులకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సర్వేలో పారదర్శకంగా వ్యవహరించాలని, పొరబాట్లు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఏఎస్ఓ సౌందర్ రాజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, కార్పొరేషన్ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ ఎ.ప్రసాద్, రూరల్, అర్బన్ తహసీల్దార్లు కులశేఖర్, జయప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు హిమగిరి పాల్గొన్నారు. -
ఉజ్వల భవితకు ‘నవోదయం’
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో అత్యుత్తమ విద్యనందిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లె వద్ద జవహర్ నవోదయ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధిస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య చాలా కీలకమైంది. పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవీన విద్యను అందించాలన్న ఉద్దేశంతో జవహర్ నవోదయ విద్యాలయాలు నెలకొల్పారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 29వ తేదీతో గడువు ముగియనుంది. అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు అవకాశం ఈనెల 29న చివరి గడువు గ్రామీణ విద్యార్థులకు వరం సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు జిల్లా సమాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,947 ప్రాథమికోన్నత పాఠశాలలు 158 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 51,952 ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు 10,200 దరఖాస్తుకు గడువు జూలై 29 ప్రవేశ పరీక్ష తేదీ డిసెంబర్ 13 రిజర్వేషన్లు ఇలా.. ఎస్సీలకు 15 శాతం ఎస్టీలకు 7.5 దివ్యాంగులకు 3 బాలికలకు 33శాతంపరీక్ష ఇలా.. పరీక్ష రకం ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం మేధాశక్తి 40 50 60 అంకగణితం 20 25 30భాషాపరీక్ష 20 25 30(నిమిషాలు)దరఖాస్తులు ఇలా... జవహర్ నవోదయ విద్యాలయాలకు విద్యార్థులు www.cbseitems.rcl.gov.in/nvs అనే వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారై ఉండాలి. ప్రవేశ పరీక్ష రాయబోయే విద్యార్థి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన అడ్మిషన్లను పరిగణలోకి తీసుకుంటారు. అధునాతన సౌకర్యాలు సువిశాలమైన పాఠశాల ప్రాంగణం శాశ్వత తరగతి గదులు, డిజిటల్ పాఠాలకు ప్రత్యేక ఏర్పాట్లు అధునాతన కంప్యూటర్ ల్యాబ్ బాల, బాలికలకు విడివిడిగా వసతి గృహాలు ఇంటి తరహా భోజనం, పరిశుద్ధమైన తాగునీరు ఉదయం యోగా, వ్యాయామం సాధన కూచిపూడి, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, పలు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. పాఠ్యాంశాలతో పాటూ విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో పుస్తకాలతో కూడిన గ్రంథాలయం పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ త్వరగా దరఖాస్తు చేసుకోండి ఈనెల 29వ తేదీన చివరి రోజు కావడంతో ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నట్లైతే డీఈవో కార్యాలయంలో ఉన్న పరీక్షల విభాగంలో సంప్రదించవచ్చు. – వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు జిల్లా ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి సిఫార్సులకు తావుండదు. తల్లిదండ్రులు, విద్యార్థులు అపోహలకు లోనవ్వకుండా పూర్తి అవగాహన, అప్రమత్తతతో ఉండాలి. పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుంది. ప్రవేశం పొందే విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం సాగించవచ్చు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – గీత, ప్రిన్సిపల్, జవహర్ నవోదయ విద్యాలయ, వలసపల్లి అన్నమయ్య జిల్లా -
పకడ్బందీగా ఆధార్ నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఆధార్ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికీ ఆధార్ కార్డు తప్పనిసరన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంగా ఉంటుందని వెల్లడించారు. ఇందులో ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కుప్పం, నగరి నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని సూచించారు. విద్య, వైద్య, ఐసీడీఎస్, గ్రామ, వార్డు సచివాలయ అధికారులు సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలో 58 శాతం ఆధార్ నమోదుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా 58 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సెప్టెంబర్ నెలాఖరుకు ఆధార్ నమోదు 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 226 ఆధార్ కేంద్రాలున్నట్లు తెలిపారు. అందులో 117 గ్రామ, వార్డు సచివాలయాలు, 7 ఈ–సేవా కేంద్రాలు, 9 పోస్టాఫీసులు, 9 బీఎస్ఎన్ఎల్ ఆఫీసులు, 14 బ్యాంక్లు, 34 వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయల ద్వారా ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియ చేపడుతున్నుట్లు వివరించారు. జిల్లాలో 0–5 ఏళ్ల పిల్లల జనాభా దాదాపు 1,53,047 ఉండగా, ఈ ఏడాది జూన్ 5 వ తేదీ నాటికి 88,179 మందికి ఆధార్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్ఓ మోహన్కుమార్, డీఎల్డీఓ రవికుమార్, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, డీఈఓ వరలక్ష్మి, డీఎంహెచ్ఓ సుధారాణి పాల్గొన్నారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
పుంగనూరు : పట్టణంలోని కట్టకిందపాళెం వద్ద ఓ వృద్ధురాలి మెడలో గొలుసును ఇద్దరు యువకులు అపహరించారు. వివరాలు.. బుధవారం ఉదయం సుమారు 7 గంటలకు భాగ్యలక్ష్మీ(70) అనే వృద్ధురాలి మెడలో నుంచి 24 గ్రాముల బొట్టుచైనును ఇద్దరు యువకులు బైక్పై వచ్చి లాక్కెళ్లారు. దీంతో ఆమెకు కిందపడి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఘటనాస్థలానికి వెళ్లి వృద్ధురాలిని విచారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఘాట్ రోడ్డులో ప్రమాదం తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరుకు చెందిన భక్తులు కారులో అధికవేగంగా వెళుతుండగా వినాయక స్వామి ఆలయం వద్ద కారు అదుపుతప్పి చెట్టు ఢీకొంది. ఈ ప్రమా దంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా.. అందులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న ఘాట్ రోడ్డు సిబ్బంది వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. -
నేడు ఐఐటీలో ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం
ఏర్పేడు: మండల కేంద్రంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో గురువారం రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటైన కామన్ ఇంకుబేషన్ సెంటర్ను కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రమంత్రి టీజీ భరత్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తొలుత వీరు పర్యటన ఖరారైనప్పటికీ అనివార్య కారణాలతో ఢిల్లీ నుంచే కేంద్రమంత్రి వర్చువల్ విధానంలో ఈ యూనిట్ను ప్రారంభించనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.2,059 కోట్ల వ్యయంతో 76 కేంద్రాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ఈ యూనిట్ను ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభించనున్నారు. ఇక్కడ పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ద్వారా రోజుకు 20 టన్నుల మేరకు మామిడి, టమాట, అంజీర్, జామ తదితర పండ్లను ప్రాసెసింగ్ చేసి జ్యూస్, జామ్, పికిల్స్ వంటి ఉత్పత్తులు స్వస్త్ర బ్రాండ్తో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. -
జర్నలిస్టు హెల్త్ స్కీంను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గుర్తింపు పొందిన జర్నలిస్టులు హెల్త్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అక్రిడియేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకంలో ప్రీమియం రూ.1250ని చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. చెల్లించిన అనంతరం జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న అక్రిడిటేషన్ జిరాక్స్ కాపీలను సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. జర్నలిస్టులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) తరహాలో నగదు రహితంగా వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యుత్ గ్రీవెన్స్కు 6 వినతులు చిత్తూరు కార్పొరేషన్: స్థానిక గాంధీరోడ్డులోని ట్రాన్స్కో ఈఈ కార్యాలయ ఆవరణలో బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో వివిధ సమస్యలపై మొత్తం 6 వినతులు వచ్చినట్లు డీఈలు ఆనంద్, ప్రసాద్ తెలిపారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు వెల్లడించారు. యువకుడి బలవన్మరణం పుంగనూరు : చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం మండలంలోని ఈడిగపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాధమ్మ కుమారుడు అనిల్కుమార్(25) జేసీబీ డ్రైవర్గా పని చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అనిల్కుమార్తో భార్యకు విభేదాలు ఏర్పడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై తల్లి అనిల్కుమార్ను మందలించడంతో మంగళవారం పనికోసం వెళ్లి తన ఇంటిలోనే ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని ఉదయం గుర్తించారు. ఈ మేరకు తల్లి ..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
నీతి పద్యాలు దారి చూపే నేస్తాలు
చిత్తూరు కలెక్టరేట్ : నీతిపద్యాలు దారి చూపే నేస్తాలవంటివని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసినాథంనాయుడు అన్నారు. బుధవారం నగరంలోని జైహింద్ పాఠశాలలో విద్యార్థులకు నీతి పద్యాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నీతిపద్యాలు నేర్చుకుంటే వ్యక్తిత్వం పెరుగుతుందన్నారు. ఆగస్టు 29వ తేదీన తెలుగుభాషా దినోత్సవంలోపు వంద నీతి పద్యాలు నేర్చుకునే విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం ప్రకాష్, టీచర్లు చంద్రశేఖర్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకం
చిత్తూరు లీగల్ : కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని అవగాహన కల్పిస్తూ బుధవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకమని.. దీన్ని ప్రతి ఒక్క కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,020 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.19 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
మాతా శిశుసంరక్షణకు ప్రాధాన్యం
ఉజ్వల భవితకు నవోదయం జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.అక్రమ కేసులకు భయపడేది లేదు ● అరెస్టు చేసిన ప్రతి కార్యకర్తకు అండగా జగనన్న ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి● పలు శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష పుష్ప పల్లకిలో పురుషోత్తముడు తిరుమలలో బుధవారం శ్రీవారు ఉభయ దేవేరులతో పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : అర్హత ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది విద్యార్థులకు తల్లికి వందనం మొదటి, రెండు విడతల్లో సాయం అందని దుస్థితి. ఇదేమిటని ఆరాతీస్తే ఆధార్ అప్డేట్ (ఈకేవైసీ) జరగలేదనే కారణం తెలియవచ్చింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఆధార్ కేంద్రాలు, సచివాలయాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. మరికొంత మంది సచివాలయాలు, ఆధార్ కేంద్రాల వద్దకు తిరిగి ఆధార్ అప్డేట్ అవ్వక దూరమైన పరిస్థితి. ఇదే విధంగా పలు సంక్షేమ పథకాలకు అర్హులైనప్పటికీ వేల మంది లబ్ధిదారులు ఆధార్ సమస్యతో నష్టపోతున్నారు. ఆధార్ సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్డేట్ చేయించకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా మారింది. కొత్తగా ఆధార్ పొందడంతో పాటు ఎప్పుడో పొందిన ఆధార్ను అప్డేట్ (ఈకేవైసీ) చేయించుకోకపోవడం వల్ల లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. దీంతో అర్హత ఉన్నా సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. మ్యాన్డేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ (ఎంబీయూ) చేయించుకోని వారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఆధార్కార్డు ఉన్నప్పటికీ అప్డేట్ చేయించుకోకపోవడంతో సంక్షేమ పథకాలు పొందలేని దుస్థితి ఏర్పడుతోంది. అవగాహన కల్పించక.. శిబిరాల నిర్వహణ తెలియక జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆ శిబిరాలు ఎప్పుడు నిర్వహిస్తారో...ఎప్పుడు ముగిస్తారో అనే వివరాలు ఎవ్వరికీ తెలియని దుస్థితి. ఆధార్ శిబిరాల్లో ఏ సేవలు పొందవచ్చనే అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు. పిల్లలైతే తల్లి లేదా తండ్రిని తీసుకుని, పెద్దలైతే స్వయంగా ఆధార్తో వెళ్లి వేలిముద్రలు వేస్తే అప్డేట్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి ఎటువంటి రుసుం వసూలు చేయరు. కొత్తగా ఆధార్ పొందేవారి నుంచి మాత్రం నిర్ణీత రుసుం వసూలు చేస్తారు. తదితర అంశాలను, ఆధార్ శిబిరాల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడితే అర్హులకు న్యాయం జరుగుతుంది. విధుల్లో చేరని వీఆర్ఓలపై కఠిన చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : బదిలీ అయిన వీఆర్ఓలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని డీఆర్ఓ మోహన్కుమార్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వీఆర్వోలను ఇటీవల భారీ స్థాయిలో బదిలీలు నిర్వహించిన విషయం విధితమే. ఈ బదిలీలు జరిగి దాదాపు నెల రోజులు అవుతోంది. అయితే పలు ప్రాంతాల్లో బదిలీ అయిన వీఆర్ఓలు ఇప్పటికీ కొత్త స్థానాల్లో విధుల్లో చేరని పరిస్థితి ఉంది. ఈ విషయం పై ఉన్నతాధికారులకు తహసీల్దార్లు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన డీఆర్ఓ మోహన్ కుమార్ బదిలీ అయిన వీఆర్ఓలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని బుధవారం ఆదేశించారు. రెండు రోజుల్లో కొత్త స్థానాల్లో తప్పనిసరిగా చేరాలని, లేని పక్షంలో కఠిన చర్యలుంటాయని డీఆర్వో హెచ్చరించారు. వైద్య బిల్లుల చెల్లింపులో జాప్యం తగదు చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల వైద్య ఖర్చుల బిల్లుల చెల్లింపులో జాప్యం వహించడం సరికాదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డి శేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ గుర్తింపు లేని ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేసుకున్న ఉద్యోగులు, టీచర్ల బిల్లులు పెండింగ్లో పెట్టారన్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లో ముందస్తుగా ఖర్చులు పెట్టి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. వెంటనే రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా తనిఖీ చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులోని మిట్టూరులోని అరుణాచల జూనియర్ కళాశాలలో రెండు రోజులుగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలకు నిపుణ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ జారీచేసిన నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా మమ అనిపించేస్తున్నారు. ఈ శిక్షణ ప్రారంభమై న మొదటి రోజే హాజరైన ప్రైమరీ హెచ్ఎంలకు భోజనం పెట్టకపోవడంతో ధర్నా చేయాల్సి వ చ్చింది. దీంతో జిల్లా సమగ్రశిక్ష శాఖ అధికారుల అలసత్వ ధోరణిపై పలు ఫిర్యాదులు రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ మేరకు ఎస్ఐఎంఏటీ (స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్ మెంట్ అండ్ ట్రైనింగ్) శాఖ డైరెక్టర్ మస్తానయ్య బుధవారం ఆకస్మికంగా జిల్లా పర్యటనకు విచ్చేశారు. అరుణాచల జూనియర్ కళాశాల శిక్షణా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ కేంద్రంలోని ఐదు గదులలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అ యితే ఆయన ఐదు నిమిషాలు సైతం కేంద్రంలో ఉండకుండా ఏదో వచ్చామా....వెళ్లామా అనే ధో రణిలో పరిశీలించి వెళ్లిపోయారు. ఈ అంశం శిక్షణా కేంద్రంలో సర్వత్రా చర్చగా మారింది. ఇలాంటి మొక్కుబడి తనిఖీలతో ఎవరికి ఉపయోగమని సంఘం నేతలు పెదవి విరుస్తున్నారు. కార్వేటినగరం : అక్రమ కేసులకు, కూటమి నాయకుల తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని నియోజకవర్గ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి జగనన్నతో మాట్లాడుతూ.. బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించారని జగనన్నకు వివరించినట్లు తెలిపారు. కూటమి నాయకులు కక్ష కట్టి కేసులు పెట్టిన ప్రతి కార్యకర్తకూ జగనన్న అండగా ఉంటారని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారన్నారు. అక్రమ కేసులో అరెస్టు అయిన వారికి న్యాయ సలహా ద్వారా రక్షణ కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు జగనన్న సూచించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పాలసముద్రం మండలం నుంచి కూటమి నాయకులు యథేచ్ఛగా దోచుకుంటున్న గ్రావెల్ మాఫియాపై జగన్ మోహన్రెడ్డికి వివరించినట్లు తెలిపారు. వారి వెంట ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బండి హేమసుందర్రెడ్డి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం బూత్ కమిటీ కన్వీనర్ నారాయణరెడ్డి పలువురు ఉన్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ..ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు బాధ్యతాయుతంగా పనిచేసేలా మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని తెలిపారు. గర్భిణుల నమోదులో అలసత్వం చోటు చేసుకోకుండా అంగన్వాడీ కేంద్రాలల్లోని రిజిస్టర్తో సరిచూసుకోవాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్వో సుధారాణి, అడిషనల్ డీఎంహెచ్వో వెంకటప్రసాద్, డీఐవో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నిరక్షరాస్యులకు ‘ఉల్లాస్’ జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ పథకంలో అక్షర ఆంధ్రా ను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఈ పథకం అమలు పై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. జిల్లాలో దాదాపు 40 వేల నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 2029 నాటికి 100 శాతం అక్షరాస్యత దిశగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడేల్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, పలువురు అధికారులు పాల్గొన్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ పథకాలకు దూరమవుతున్న లబ్ధిదారులు అవగాహన లేక నష్టపోతున్న ప్రజలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం లబ్ధిదారులకు న్యాయం జరిగేదెప్పుడు? ఆధార్ అప్డేట్ లేకపోతే..ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ నుంచి పింఛన్ వరకు ఏ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులు ఆధార్ సమస్యలతో సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. ఆధార్ సమస్యలను పరిష్కరించాల్సిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఎంత మంది సంక్షేమ పథకాలకు దూరమైతే అంత మంచిదనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు దూరమైన లబ్ధిదారులకు ఎవరు న్యాయం చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో సమస్యగా మారిన ఆధార్ సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జిల్లాలో ఆధార్ అప్డేట్ సమస్యల వివరాలు ఇలా.. 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు 21,456 15 ఏళ్లకు పైబడిన వారు 1,45,258 తల్లికి వందనం పథకంలో నష్టపోయిన విద్యార్థులు దాదాపు 3 వేల మంది ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిన విద్యార్థులు 1,326 మంది ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిన పెద్దలు 4,879 మంది సంక్షేమ పథకాలకు దూరం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆధార్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ ముఖ్యం చేయడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. అవగాహన ఉన్న ప్రజలేమో కేంద్రాలకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటున్నారు. అవగాహన లేని వృద్ధులు అవస్థలు పడుతున్నారు. అదే విధంగా చాలా మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆధార్ అప్డేట్ అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ప్రజలకు న్యాయం చేయాలి. – వాడ గంగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు, చిత్తూరు జిల్లా సమస్యలు ఇలా.. చిత్తూరుకు చెందిన బాలుడు అజిత్ను ఒకటో తరగతిలో చేర్చేందుకు వారి తల్లిదండ్రులు వెళ్లారు. ఆధార్ లేకపోవడంతో చైల్డ్ ఇన్ఫోలో వివరాలు నమోదు కాలేదు. దీంతో తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాలో ఆ విద్యార్థి పేరు చేరలేదు. ఇదే సమస్యతో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులుగా జూన్ 30వ తేదీ లోగా ఆధార్ అప్డేట్ చేయించుకున్న రైతులనే ఎంపిక చేశారు. ఈకేవైసీ, ఆధార్ అప్డేట్ లేక వేల మంది రైతులు అర్హుల జాబితాలో చేరలేక నష్టపోయారు. ఫలితంగా నష్టపోయిన రైతులు నిత్యం రైతు సేవా కేంద్రాలు, సచివాలయాలు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1947 ప్రాథమిక, 158 ప్రాథమికోన్నత, 153 ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు పొందిన వారిలో దాదాపు 3 వేల మంది విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, విద్యా సామగ్రిని పొందలేకపోయారు. జిల్లాలోని వసతి గృహాల్లో అడ్మిషన్లు పొందిన దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఆధార్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. -
బోయకొండ కిటకిట
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ తల్లి దీవెనల కోసం భక్తులు బోయకొండకు బుధవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండ ఎటుచూసినా జనసంద్రంగా మారింది. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. -
రైతుకు పరీక్షే!
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు.. సాగు ఖర్చులు తగ్గించేందుకు చేపట్టే భూసార పరీక్షలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. దాదాపు ఏడాదిగా ఒక్కరూపాయీ విదల్చకుండా రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. మట్టి నమూనాలు సేకరించినా ఫలితాలు ఇవ్వకుండా వేధిస్తోంది. నేల స్వభావం తెలియక అధిక పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి రసాయన ఎరువులు వాడాలో కూడా చెప్పేవారు కరువవడం విమర్శలకు తావిస్తోంది. ఇష్టారాజ్యం మట్టి నమూనాల సేకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ ప్రకారమే సేకరించాల్సి ఉంది. గ్యాప్ పొలంబడి నిర్వహించే ప్రాంతాలు, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, ఆయిల్ సీడ్స్ ప్రదర్శనా క్షేత్రాలు.. తదితర ప్రాంతాల్లోనే మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. 2024–25లో మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సేకరించి మమ అనిపించారు. దీంతో భూసార పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ ఏడాది ఆన్లైన్లోనే మట్టి నమూనాల సేకరణ ప్రహసనంగా మారింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా మట్టినమూనాలు సేకరిస్తుండడంతో భూసార పరీక్షల్లో పారదర్శకత లేకుండా పోయింది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): భూసార పరీక్షలతో సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది జిల్లాలో 27 వేల భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇంతవరకు మట్టి నమూనాల సేకరణ, రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం మినహా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రైతుల పాలిట శాపం భూసార పరీక్షల్లో ఉదజని సూచిక, స్థూల పోషకాలైన భాస్వరం, నత్రజని, పోటాష్తో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, కాల్షియం, క్లోరిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, సల్ఫర్, కాపర్, మాలిబ్డినం తదితర 15 పరీక్షలు నిర్వహిస్తారు. ఉద్దేశం మంచిదే అయినా భూసార పరీక్షల నిర్వహణలో చిత్తశద్ధి లోపించడం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో 502 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో దానినుంచి 55 మట్టి నమూనాలు సేకరిం చాల్సి ఉంది. ఇలా 2,796 మట్టి నమూనాలు సేకరించేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 26,948 నమూనాలను సేకరించినట్లు అధికారులు లెక్కలుగట్టారు. సేకరించిన నమూనాలు.. వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చే స్తారు. తర్వాత మట్టి నమూనాలను సంబంధిత భూసార పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. కానీ ఇంతవరకు భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయీ విదల్చలేదు. కెమికల్స్ లేవు. ఇన్ని సమస్యల మధ్య భూసార పరీక్ష ఫలితాలు ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. చిత్తూరులో మాత్రమే... చిత్తూరు నగరంలోని మార్కెట్ యార్డులో ఉన్న భూసార పరీక్షల కేంద్రానికి మాత్రమే పరీక్షలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయి. కుప్పంలోని కేంద్రానికి అనుమతులు ఇవ్వలేదు. అయితే చిత్తూరులోని భవనం పాడుబడింది. వీటి మరమ్మతులకు ప్రభుత్వం రూ.9 లక్షలు మంజూరు చేసింది. గత నాలుగు నెలలకు కిత్రం నిధులు కేటాయించినా ఇంతవరకు ఆ భవనం భూసార పరీక్షలకు సిద్ధం కాలేదు. వచ్చే నెలకు పూర్తి కావొచ్చన్ని అధికారులు భావిస్తున్నారు. అస్తవ్యస్తం భూసార పరీక్షల్లో నాణ్యత ఉండాలంటే తగిన మోతాదులో రసాయనాలు వినియోగించాలి. ఇందుకు ఈ ఏడాది ఒక్క రూపాయీ విడుదల కాలేదు. రసాయనాలు లేవు. గతంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ భూసార పరీక్షలంటూ హంగామా చేసిందే తప్ప.. ఫలితాలను రైతులకు ఇవ్వలేదు. ఇదే పరిస్థితి 2024–25లో కూడా పునరావృతమైంది. 2025–26లో భూసార పరీక్షల నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మట్టి నమూనాలు సేకరిస్తున్న దృశ్యం ఖరీఫ్ మొదలైనా ఊసేలేని భూసార పరీక్షలు ఇష్టారాజ్యంగా మట్టి నమూనాల సేకరణ సిద్ధం కాని పరీక్ష కేంద్రం అవస్థల్లో అన్నదాతలు మరమ్మతులు జరుగుతున్నాయి ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలో 55 మట్టి నమూనాలు సేకరించే విధంగా లక్ష్యాలు ఇచ్చాం. ప్రస్తుతం రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత మట్టి నమూనాలు ల్యాబ్కు వస్తాయి. ల్యాబ్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే పరీక్షలు ప్రారంభమవుతాయి. –మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, చిత్తూరు -
‘ప్రేమించి పెళ్లి చేసున్నాం.. మాకు రక్షణ కల్పించండి’
చిత్తూరు: ‘ప్రేమించి పెళ్లి చేసున్నాం.. మాకు మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి’ అని నూతన వధువు మానస పోలీసులను వేడుకుంది. వివరాలు .. రొంపిచెర్ల మండలం, చెంచెంరెడ్డిగారిపల్లె పంచాయతీ, శ్రీరాముల వడ్డిపల్లెకు చెందిన చెంగల్రాయులు కుమార్తె మానస (22) తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం, వెత్తలతడుకు గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు(27)తో రెండేళ్లుగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. కలికిరి రాముడు గుడిలో ఈనెల 12వ తేదీ వివాహం చేసుకున్నారు. అయితే తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కల్లూరు సీఐ సూర్యనారాయణను వేడుకున్నారు. మానస తల్లిదండ్రులను సీఐ విచారించి వారికి నచ్చజెప్పి ప్రేమికులను కలిపారు. -
కోడలు అరెస్ట్
చౌడేపల్లె: మామపై అతికర్కశంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచి మృతికి కారుకురాలైన కోడలు సరస్వతమ్మను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఆయన కథనం.. చౌడేపల్లె మండలం, అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి, రాజమ్మపై కుమారుడు మనోహర్రెడ్డి ఆస్తి విషయంపై నిత్యం ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో మార్చి 30వ తేదీ ఇంట్లో ఉన్న తండ్రి చిన్నప్పరెడ్డితో ఘర్షణపడ్డాడు. ఈ క్రమంలో తండ్రి కాలు విరిగిపోగా స్థానిక గ్రామస్తులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయమై మార్చి 31న ‘సాక్షి’లో ‘కడుపున పుట్టినోళ్లా... తోడేళ్లా’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన జిల్లా ఎీస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది శస్త్ర చికిత్స అనంతరం చిన్నప్పరెడ్డిను స్వగ్రామాని తెచ్చారు. మనోవేదనకు గురైన అతను ఏప్రిల్ 21వ తేదీ మృతిచెందాడు. చిన్నప్పరెడ్డి మృతికి కారణమైన కుమారుడు మనోహర్రెడ్డి, కోడలు సరస్వతమ్మపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మనోహర్రెడ్డిని గత నెల 16న అరెస్ట్ చేయగా.. సరస్వతమ్మను మంగళవారం అదుపులోకి తీసుకుని పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
భక్తులతో కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో మంగళవారం కిక్కిరిసింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మహిళలు పిండి, నూనె దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో సిబ్బంది ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. యువతిపై అడవి పంది దాడి కుప్పం రూరల్ : మండలంలోని వి.మిట్టపల్లెలో మంగళవారం ఉదయం అడవి పంది దాడిలో ఓ యువతి గాయపడింది. వివరాలు.. గ్రామానికి చెందిన దండపాణి కుమార్తె మీనాక్షి పశువులకు గడ్డి తెచ్చేందుకు పాలానికి వెళ్లింది. ఇంతలో కుక్కలు తరమడంతో అటు వైపు వచ్చిన అడవి పంది దాడి చేసి మీనాక్షి కాలిని గట్టిగా కరిచేసింది. యువతి భయంతో కేకలు వేయడంతో సమీపంలోని కుటుంబీకులు హుటాహుటి వచ్చి పందిని తరిమేశారు. గాయపడిన మీనాక్షిని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ అడవి పందుల కారణంగా పంటలు నాశనమవుతున్నాయని, పలువురు గాయపడుతున్నారని తెలిపారు. అటవీ అధికారులు స్పందించి అడవి పందులు గ్రామాల్లోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య వి.కోట: భార్యతో గొడవపడి మనస్తాపంతో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. మండలంలోని యాలకల్లు పంచాయతీ, కపట్లబండకు చెందిన వెంకటరమణప్ప కుమారుడు సుబ్రమణ్యం(37) తన భార్యపిల్లలతో కలిసి మండలంలోని గెస్తింపల్లి సమీపంలోని ప్రజాష్స్వామికి చెందిన మామిడి తోటలో కొంతకాలంగా కాపలాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్య భర్తలిద్దరూ గొడవపడ్డాడు. మంగళవారం ఉదయం భార్య తోట నుంచి బయటకు వెళ్లగానే సుబ్రమణ్యం అదే తోటలో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రీ‘కాల్’ చేయొద్దు!
కలెక్టరేట్ వద్ద ఉన్న ప్రధాన గేటుకు ఉన్న గ్రిల్స్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వారి కాళ్లు ఇరుక్కుపోయేలా చేస్తోంది. ఇలాంటిదే మంగళవారం చోటు చేసుకుంది. పెన్షనర్ల సంఘం నాయకులు సమస్యల పరిష్కారం నిమిత్తం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పలు శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లు హాజరయ్యారు. రిటైర్డ్ రీజనల్ ఉపాధి కల్పనా అధికారి సూరి కలెక్టరేట్లోనికి వస్తున్న సమయంలో గేటు వద్ద ఉన్న గ్రిల్స్లో కాలు ఇరుక్కుపోయింది. చాలాసేపు తన కాలును బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఏమి చేయలేక అర్ధగంటకు పైగా అక్కడే కూర్చొని ఉండి పోయాడు. కాలును బయటకు తీసే ప్రయత్నంలో ఆ పెన్షనర్ నొప్పికి అల్లాడిపోయాడు. తీరా అక్కిమాపక శాఖ సిబ్బది ప్రత్యేక కట్టర్తో గ్రిల్ పైపు కట్టచేసి పెన్షనర్ను సురక్షితంగా బయటకు తీశారు. ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా గ్రిల్స్ను సరిచేయాలని పలువురు కోరుతున్నారు. – చిత్తూరు కలెక్టరేట్ -
గర్భవతిని రైలు నుంచి కిందికి తోసిన యువకుడికి జీవిత ఖైదు
● బాధిత కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్పేట సమీపంలోని రైలులో గర్భవతిపై అత్యాచారానికి యత్నించి రైలు నుంచి కిందకు తోసి వేసిన యువకుడికి జీవిత శిక్ష విదించడంతో పాటూ బాఽధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని తిరుపత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు.. ఆంఽధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భవతి ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదిన తిరుప్పూరు నుంచి తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరింది. ఆ సమయంలో వేలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామానికి చెందిన హేమరాజ్ అదే రైలులో వస్తూ గర్భవతిని లైంగికంగా వేధించాడు. బాధితురాలు కేకలు వేయడంతో రైలు నుంచి కిందకు తోసి వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమెకు కాళ్లు, చేతులు విరగడంతో పాటూ ముఖం పూర్తిగా దెబ్బతినడంతో ఆమెను చికిత్స నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్ను పోలీసులు అరెస్ట్ చేసి వేలూరు సెంట్రల్ జైలులో ఉంచారు. ఈ కేసు విచారణ తిరుపత్తూరు కోర్టులో జరుగుతుంది. తుది తీర్పు సోమవారం సాయంత్రం న్యాయమూర్తి మైనా కుమారి ముందుకు వచ్చింది. నిందితుడు హేమరాజ్కు జీవిత శిక్ష విధించడంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు, రైల్యే శాఖ రూ. 50 లక్షలు చొప్పున మొత్తం రూ. కోటి బాధిత కుటుంబానికి అందజేయాలని న్యాయమూర్తి తీర్పిచ్చారు. -
కూటమి మోసాలు ఎండగడుదాం
తవణంపల్లె: చంద్రబాబు, పవన్ల మోసపూరిత వాగ్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని, అందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మండలంలోని కాణిపాకం రోడ్డులో నారాయణాద్రి కల్యాణ మండపంలో బాబు షూరిటీ–మోసం గ్యారెంటీలో భాగంగా వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అధ్యక్షతన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన మోసపూరిత హామీలను, వైఎస్సార్సీపీ పాలనలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన 143 హామీలు, సూపర్ సిక్స్ను అమలు చేయకుండానే బుకాయిస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యం పర్యటనతో కూటమి నాయకుల్లో వణుకు పుట్టిందన్నారు. కలసికట్టుగా శ్రమిద్దాం పూతలపట్టు నియోజకవర్గం నుంచే ఉద్యమం చేపడుదాం బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ క్యూ ఆర్కోడ్ ఆవిష్కరణలో వైఎస్సార్సీపీ శ్రేణులకు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన పిలుపు మోసం..బాబు నైజం పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు. బాబు షూరిటీ– మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులను తీవ్రంగా హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ ప్రజలను మోసగించడం చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ ఇచ్చిన వాగ్ధానాలను ఏడాదిలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారన్నారు. అనంతరం బాబూ ష్యూరిటీ– మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. తవణంపల్లె, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల పార్టీ అధ్యక్షులు హరిరెడ్డి, రామచంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, జయచంద్రారెడ్డి, ధనంజయరెడ్డి, పార్టీ నాయకులు తలపులపల్లె బాబురెడ్డి, కుమార్రాజ, మోహన్రెడ్డి, శిరీష్రెడ్డి, కిషోర్కుమార్రెడ్డి, గజేంద్ర, ప్రకాష్బాబురెడ్డి, సుకేష్రెడ్డి, తేజారెడ్డి, కుమార్, గౌహతిసుబ్బారెడ్డి, సుగుణశేఖర్ రెడ్డి, రాజారత్నంరెడ్డి, సుధాకర్ రెడ్డి, దూర్వాసులురెడ్డి, ప్రబాకర్రెడ్డి, రమణారెడ్డి, కిషోర్రెడ్డి, సతీష్రెడ్డి, శరత్రెడ్డి, మధుకుమార్, చిన్నారెడ్డి, మురుగన్, మణిరాజ్, పరదేశి, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎస్సీల సమస్యలపై అలుపెరుగని పోరాటం
పలమనేరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యద ర్శిగా శ్యామ్సుందర్రాజు నియమితులైనట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పలమనేరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీల సమస్యలపై పోరాడుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా ముందుకెళతామన్నారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కార్వేటినగరం: ఏకంగా తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన మండలంలో కలకలం రేపుతోంది. దీనిపై తహసీల్దార్ నాగరాజు స్థానిక సీఐ హనుమంతప్పకు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామ కంఠం ధ్రువపత్రాల కోసం మండలంలోని కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో టీకేఎంపేట గ్రామానికి చెందిన కుమారస్వామి తన ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెవెన్యూ అధికారుల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉండగా.. కొందరు వాటిని నకిలీ సంతకాలు పెట్టి మంజూరు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు స్థానిక సీఐకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. -
రైతుల అంగీకారంతోనే భూసేకరణ
శాంతిపురం: కుప్పం విమానాశ్రయం కోసం రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ చేయరాదని హైకోర్టు ప్రభుత్వానికి నిర్దేశించినట్టు వ్యవసాయ కార్మిక, రైతు సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి ఓబులరాజు తెలిపారు. మంగళవారం ఆయన విమానాశ్రయ బాధిత రైతులతో కలిసి శాంతిపురంలో విలేకరులతో మాట్లాడారు. తప్పుడు నోటిఫికేషన్లతో ప్రభుత్వం నిర్బంధ భూ సేకరణకు పూనుకోవడంపై రైతులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. విచారణ సందర్భంగా నోటిఫికేషన్లలోని లోపాలను ప్రభుత్వ న్యాయవాది కూడా అంగీకరించారన్నారు. అంగీకారం ఉన్న రైతుల నుంచి మాత్రమే తాము భూములు సేకరిస్తున్నామని తెలిపారని వెల్లడించా రు. మిగతా రైతులకు భూ సేకరణ చట్టం 2013 ప్రకారం మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వ న్యాయవాది సుముఖత వ్యక్తం చేయడంతో కోర్టు ఈ వ్యాజ్యాన్ని ముగించిందని చెప్పారు. రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో విమానాశ్రయం కోసం ఎంచుకున్న భూముల రైతులతో పాటు వారిపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 3,500 మంది వ్యవసాయ కూలీలకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
పలమనేరు: పట్టణంలోని పలు క్రిమిసంహారక మందులు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్, స్థానిక వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇక్కడి దుకాణాల్లో 892 బస్తాల యూరియా నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాకు వివరాలు, బిల్లు బుక్కులను తనిఖీ చేశారు. రైతులు కొన్న ఎరువులు, క్రిమిసంహారక మందులకు కచ్చితంగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని దుకాణాల్లో ఎరువు ఽశ్యాంపిళ్లను సేకరించి నాణ్యతా పరీక్షల కోసం అగ్రిల్యాబ్కు పంపనున్నట్టు తెలిపారు. అగ్రికల్చర్ ఏడీ ధనుంజయరెడ్డి, విజిలెన్స్ సీఐ రవి, స్థానిక ఏవో సంధ్య పాల్గొన్నారు. -
పెన్షనర్లపై చిన్నచూపు తగదు
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల చిన్నచూపు చూడడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజ తెలిపారు. ఈ మేరకు ఆ అసోసియేషన్ నాయకులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన వ్యాలిడేషన్ అమెండ్మెంట్ను వెంటనే రద్దు చేయాలన్నారు. పీఎఫ్ఆర్డీఏ చట్టం వల్ల పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్, యూపీఎస్ విధానాలను నిలిపివేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే పే కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు. ఈ ధర్నాలో నాయకులు మురుగానందం, మురళి, ప్రభాకర్నాయుడు, శివకుమార్, దశరథనాయుడు, పలమనేరు, బంగారుపాళ్యం నుంచి పెన్షనర్లు పాల్గొన్నారు. -
హరీష్కు ప్రతిష్టాత్మక అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఐసీఆర్టీ) ప్రతిష్టాత్మకంగా ఇచ్చే యూత్ ఎంపవర్మెంట్ అవార్డుకు ఎంబీఏ విద్యార్థి హరీష్ బాబు ఎంపికయ్యారు. మంగళవారం ఈ మేరకు ఐసీఈఆర్టీ ఈడీ సిమ్రాన్ మెహతా ప్రకటించారు. హరీష్ చిత్తూరులోని విజయం ఎంబీఏ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే రోజున నిర్వహించే కార్యక్రమంలో హరీష్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల చైర్మన్ తేజోమూర్తి, డైరెక్టర్ శైలజా, ఐరాల మండలం 45 కొత్తపల్లి సర్పంచ్ బాలాజీ అభినందించారు. -
రీకాల్చేయొద్దు!
కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్ ఫిర్యాదుదారులు, ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. పేదలకు దూరంగా అధునాతన కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులుగా వెలుగొందుతున్న సీఎస్ఈ బ్రాంచ్లోని ఏఐ, డేటా సైన్స్, ఎమ్ఎల్, ఎస్ఎస్ కోర్సులు పేద విద్యార్థులకు అందనంత దూరంలో నిలిచాయి. ఏపీఈఏమ్సెట్లో సీటు సాధించినా ప్రైవేటు కళాశాలలో సీటు దొరకడం కష్ట తరమవుతోంది. లక్షలలో ఫీజుల చెల్లించలేని పేద విద్యార్థులు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. సీఎస్ఈ కోర్సు కేవలం ధనవంతుల కోర్సుగా మిగిలిపోయిందని మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – 8లో -
17 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో ఈనెల 17 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం కళాశాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025 డీఈఈసెట్ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ సమర్పించేందుకు అవకాశం కల్పించామన్నారు. అలాగే 13 నుంచి 16వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సీట్ అలాట్మెంట్ అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. సీట్ అలాట్మెంట్ చేసుకున్న అభ్యర్థులకు 17 నుంచి 22వ తేదీ వరకు డైట్ కార్వేటినగరం కళాశాలలోఽ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. సీట్ అలాట్మెంట్ అయిన వారికి ఈనెల 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు. 22 నుంచి అడ్వాన్స్డ్ తపాలా 2.0 సేవలు చిత్తూరు కార్పొరేషన్: అడ్వాన్స్డ్ తపాలా టెక్నాలజీ 2.0తో వినియోగదారులు ఇంటి వద్ద నుంచి సేవలు పొందవచ్చని ఆ శాఖ చిత్తూరు డివిజన్ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. చిత్తూరు డివిజన్ పరిధిలోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 427 తపాలా కార్యాలయాల్లో ఈ విధానం అమలువుతుందన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు తపాలా కార్యాలయాల్లో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీ నుంచి తపాలా కార్యాలయాల్లో సేవలు పునఃప్రారంభమవుతాయన్నారు. తపాలా శాఖ డాక్ సేవా యాప్ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మధ్యవర్తిత్వంతోనే కేసుల పరిష్కారం చిత్తూరు లీగల్: న్యాయ స్థానంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. మంగళవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని న్యాయసేవా సదన్ భవనంలో బ్యాంకులు, చిట్ఫండ్ సంస్థలు, బీమా కంపెనీలకు చెందిన ఉద్యోగులతో మధ్యవర్తిత్వంపై సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం కీలకమన్నారు. దీనివల్ల సమయంతో పాటు నగదు కూడా ఆదా అవుతుందన్నారు. ప్రతి ఒక్క సంస్థ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని, దీనికి న్యాయసేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుందన్నారు. అందుబాటులో స్టాంప్ పేపర్లు చిత్తూరు కార్పొరేషన్: నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఆర్ఓకు రూ.50 పేపర్లు 8వేలు, రూ.100 విలువైనవి 7వేలు, చిత్తూరు రూరల్కు రూ.50 పేపర్లు 7వేలు, రూ.100 విలువైనవి 7వేలు, బంగారుపాళ్యం రూ.50వి 2వేలు, రూ.100, 2 వేలు, పలమనేరు రూ.50– 5వేలు, రూ.100 –7వేలు, పుంగనూరు రూ.50– 5వేలు, రూ.100– 6వేలు, కుప్పం రూ.50– 5వేలు, రూ.100 –7వేలు, నగరి రూ.50– 6వేలు, రూ.100 –8 వేలు, కార్వేటినగరం రూ.50– 2వేలు, రూ.100– 4 వేల పేపర్లను ఆయా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేర్చినట్లు వివరించారు. మొత్తం జిల్లాలోని 8 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.50 విలువైనవి 40వేలు రూ.100 విలువైనవి 48వేలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. అలాగే కోర్టు ఫీజు స్టాంపులు 2.72 లక్షలు, ఎస్ఎ స్టాంపులు 2.16 లక్షలు, నోటరీ స్టాంపులు 2.24 లక్షలు ఉన్నాయని తెలిపారు. ఉపాధి కోసం ఉచిత శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బ్యూటిఫికేషన్, రీటైల్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి దొణప్ప తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పది, ఇంటర్, డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీన బయోడేటాతో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. వివరాలకు 8328677983, 7671066532 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బాధ్యతగా పనిచేయండి
చిత్తూరు కలెక్టరేట్ : నగరకపాలక, మున్సిపల్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్లు ప్రతి రోజూ ఉదయం శానిటేషన్ ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. సంఘాల అభివృద్ధికి చర్యలు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీఏ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డీపీఎం, ఏపీఎంలు పాల్గొన్నారు. నాణ్యతగా ఉండాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): బస్సుల రిపేర్లలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ) చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చిత్తూరు ఆర్టీసీ 1, 2 డిపోలను ఆయన పరిశీలించారు. అనంతరం డీపీటీవో రాము, డీఎంలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ అవసరాలకు తగ్గట్టుగా బస్సుల శాతాన్ని పెంచాలన్నారు. రానున్న కాలంలో బస్సుల్లో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. హ్యాంగింగ్ రాడ్లను బలమైనవిగా అమర్చాలని ఆయన సూచించారు. అనంతరం గ్యారేజ్ను తనిఖీ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. డిపో మేనేజర్ క్రిష్ణమూర్తి, సీఐ అల్తాఫ్ పాల్గొన్నారు. -
వెబ్ ఆప్షన్లలో ఆ కోర్సువైపు విద్యార్థుల మొగ్గు
● సీఎస్ఈ తరువాత ఏఐ, డేటాసైన్స్, ఎమ్ఎల్, ఎస్ఎస్ కోర్సులకు డిమాండ్ ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న ప్రైవేటు కళాశాలలు ● ఏడాదికి రూ.3 నుంచి రూ.4 లక్షలు వసూలు చేస్తున్న వైనం ● పేద విద్యార్థులకు దూరంగా సీఎస్ఈలోని అధునాత కోర్సులు ● మిగిలిన కోర్సులకు వెబ్ ఆప్షన్ పెడితే చాలు సీటు పక్కా తిరుపతి సిటీ : జిల్లాలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల హడావుడి ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడినా వెబ్ ఆప్షన్ల ఎంపికపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ ఈఏఎమ్సెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రెండు రోజుల నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో నెట్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. సెట్లో మంచి ర్యాకులు సాధించిన 90 శాతం మంది విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్నే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ కోర్సును ఎంచుకుంటున్నారు. అయితే ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులపై కనీసం 10 శాతం మంది కూడా తొలి ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది జిల్లాలో అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కా వచ్చేందుకు వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలు సొమ్ము చేసుకుంటూ.. సీఎస్ఈ కోర్సుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ను ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇదే అదునుగా రెచ్చిపోతూ ఫీజులు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. అన్ని ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ విద్యా సంస్థలలో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఏఐసీటీఈ గత ఏడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ను ఎత్తి వేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ప్రతిష్టల ఆధారంగా యాజమాన్యాలు ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసి కేవలం రూ.70 వేలకు రసీదులు ఇచ్చి పంపుతున్నారు. తిరిగి మాట్లాడితే విద్యార్థికి సీటు లేదంటూ వెనక్కి పంపుతారనే భయంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలో వారు అడిగినంతా ఫీజు చెల్లించి వెనుదిరుగుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల దౌర్జాన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏమీ చేయలేమని చేతులెత్తి కూర్చోవడం గమనార్హం. ఇంజినీరింగ్ క్రేజ్.. ఇప్పుడంతా సీఎస్ఈ బ్రాంచ్ చుట్టూ తిరుగుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారంతో పాటు పేరొందిన కంపెనీలలో లక్షల ప్యాకేజీలతో మెట్రోపాలిటన్ సిటీలలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో ఆ గ్రూప్నకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 25 వేల మంది వరకు ఏపీఈఏమ్సెట్ పరీక్షకు హాజరు కాగా ఇందులో 22,500 మంది అర్హత సాధించారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు సీఎస్ఈ బ్రాంచ్లోని పలు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారంటే డిమాండ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ కోర్సు చేయాలని.. ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లలో సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రథ మ ప్రాధాన్యం ఇచ్చాను. ఏఐకి క్రేజ్తో పాటు భవిష్యత్తు ఉంది. కష్టపడి చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. ఏఐ కోర్సుకు ఎస్వీయూ పరిధిలో పేరొందిన కళాశాలలకు తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్నా. –ప్రవల్లిక, విద్యార్థిని, తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని.. సాఫ్ట్ వేర్ రంగంలో రాణించాలనేది నా చిన్ననాటి కోరిక. ఏపీఈఏఎమ్సెట్లో 3 వేల లోపు ర్యాంక్ సాధించా. కచ్చితంగా పేరొందిన కళాశాలలో సీఎస్ఈ జనరల్ సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే వెబ్ ఆప్షన్ తొలి ప్రాధాన్యతగా సీఎస్ఈ జనరల్, రెండో ప్రాధాన్యతగా ఈఎస్ఈకి ఇచ్చా. – రజిని, విద్యార్థిని, తిరుపతిడేటా సైన్స్, ఏఐ ఆప్షన్లు పెట్టాను ఏపీఈఏఎమ్సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. డేటా సైన్స్ లేదా ఏఐ చేయాలని ఉంది. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యం డేటా సైన్స్, రెండో ప్రాధాన్యం ఏఐకి ఇచ్చాను. కచ్చితంగా నేను అనుకున్న కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఫారిన్లో ఎమ్ఎస్ చేయాలని ఉంది. – పృఽథ్వి, విద్యార్థి, తిరుపతి -
కొబ్బరి.. డిమాండే మరి!
చెట్టెక్కిన కొబ్బరి బొండాల ధర ● తోటల వద్ద కాయ రూ.25 ● హోల్సేల్ వారికి రూ.30 ● రిటైల్లో కాయ ధర రూ.40 ● మామిడికి ప్రత్యామ్నాయంగా కొబ్బరితోటలే మేలంటున్న ఉద్యానశాఖ పలమనేరు: సాధారణంగా వేసివిలో కొబ్బరి బొండాలకు డిమాండ్ ఉంటుంది. కానీ అన్ సీజన్లోనూ కొబ్బరి బొండాల ధర పెరుగుతూనే వస్తోంది. ఇదే సమయంలో మామిడి కాయలను కొనేవారు లేక రోడ్డుపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మామిడి తోటలున్న రైతులు ప్రత్యామ్నాయంగా కొబ్బరి తోటలను సాగుచేయడం మేలని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో కొబ్బరి బొండాం రూ.45 పలమనేరు రెవెన్యూ డివిజన్లో కొబ్బరితోటలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ పొలం గట్లలో వీటిని పెంచడం ఇక్కడి ఆనవాయితీ. కొందరు రైతులు మాత్రం కొబ్బరి తోటలను పెంచారు. ఇప్పుడు నెలకొన్న డిమాండ్ కారణంగా స్థానిక వ్యాపారులు రైతుల వద్ద ఓ కొబ్బరిబొండాన్ని రూ.25 దాకా కొంటున్నారు. వీటిని సేకరించి బయటి వ్యాపారులకు రూ.30 దాకా అమ్ముతున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా బొండాలు మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ, బిహార్, రాష్ట్రంలోని కడప, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్లూరు పేటకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి హోల్సేల్ వ్యాపారుల నుంచి రిటైల్ వ్యాపారులు రూ.35తో కొంటున్నారు. రిటైల్ మార్కెట్లో కాయ రూ.45గా విక్రయిస్తున్నారు. అదే లీటర్ కొబ్బరినీళ్లు రూ.120 దాకా విక్రయిస్తున్నారు. మామిడికి బదులు కొబ్బరి తోటలే మేలు జిల్లాలో తోతాపురి మామిడి ఏటా నష్టాలు చేకూర్చుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా మామిడి రైతులు కాయలు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. దీంతో పంట పెట్టుబడిమాట దేవుడెరుగు కనీసం కూలి కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు మామిడి తోటలను కోసేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కొబ్బరి తోటలు సాగుపై దృష్టి సారిస్తున్నారు. దీనిపై జిల్లా ఉద్యానశాఖ దృష్టి సారించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. అవగాహన కల్పిస్తున్నాం ఏటా మామిడి సీజన్లో తోతాపురికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మామిడికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై దృష్టి సారించాలని గత రెండేళ్లుగా క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మామిడికి బదులు కొబ్బరి కూడా మంచిదే. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి, చిత్తూరు భారీగా నష్టాలు రావు నేను పదేళ్లుగా కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నా. ఇందులో రైతులకు మేలు, నష్టం బాగా తెలుసు. మామిడితోటలకు లాగా వీటికి క్రిమిసంహారక మందులు పిచికారీ చేయనవసరం లేదు. అందుకే ఇక్కడి కొబ్బరి బొండాలకు దేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంటుంది. లాభాలే తప్ప నష్టాలుండవు. – ఖాదర్బాషా, కొబ్బరిబొండాల వ్యాపారి, బైరెడ్డిపల్లి ప్రత్యామ్నాయం చూసుకుంటా నేను మూడు దశాబ్దాలుగా మామిడితోటలను సాగుచేస్తున్నా. ఈ దఫా మామిడి పరిస్థితి చూసి ఇక లాభం లేదనుకున్నా. అందుకనే మామిడికి బదులు ప్రత్యామ్నాయంగా వేరే పంట సాగు చేయాలని అనుకుంటున్నా. ఉద్యానశాఖ సూచనలు తీసుకొని గ్యారెంటీ గిట్టుబాటుంటే పంటలను సాగుచేస్తా. – సుబ్రమణ్యం నాయుడు, రైతు, రామాపురం పెరిగిన ధరలు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు వద్ద మద్దూరు కోకొనెట్ మార్కెట్ ఆసియాలోనే పెద్దది. ఇక్కడికి కావేరి నదీ పరివాహక ప్రాంతం నుంచి నాణ్యమైన కొబ్బరి బొండాలు వస్తుంటాయి. అక్కడి నుంచి దేశ విదేశాలకు బొండాల ఎగుమతులు సాగుతుంటాయి. అలాంటి మార్కెట్లోనే ఇప్పుడు డిమాండ్కు సరిపడా సరుకు లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న కొబ్బరి బొండాలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. -
ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం
తిరుపతి సాక్షిటాస్క్ఫోర్స్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 746 మంది గ్రేడ్–3 ఏఎన్ఎంలున్నారు. వీరిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 693 మందికి సాధారణ బదిలీలు చేయగా.. మిగిలిన వారిని మెడికల్ గ్రౌండ్స్ కింద చూపించారు. తొలుత మాన్యువల్ ప్రకారం బదిలీలు చేయాలని నిర్ణయించారు. కూటమి నాయకులు, పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. సిఫార్సుల వెల్లువ బదిలీల ప్రకటనతో ఏఎన్ఎంలు వారికి అనుకూలమైన ప్రాంతాలు వరించేలా ఎవరికి వారు పోటీలు పడ్డారు. కూటమి బడా నేతలు, ఎమ్మెల్యేల వద్దకు క్యూకట్టారు. వారి సిఫార్సు లేఖలను బదిలీలకు జత చేశారు. ఈ సిఫార్సులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని చోటామోటా నాయకులు కూడా సొంత లెటర్లతో సిఫార్సులు పంపారు. ఎవరికి వారు సత్తా చాటుకోవాలని శాఖపై పట్టుబట్టారు. సిఫార్సులతో పాటు ఫోన్లు చేసి అధికారులను విసిగించారు. వారి హోదాను గుర్తు చేస్తూ.. భయభ్రాంతులకు గురిచేశారు. ఈకారణంగా ఎవరి సిఫార్సుకు తలొగ్గాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. బదిలీల ప్రక్రియను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖపై బురద కూటమి నేతల జోక్యం, ఒత్తిడి, సిఫార్సులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు శాఖ అధికారులు బదిలీల్లో జూమ్ కౌన్సెలింగ్ను తీసుకొచ్చారు. ఈనెల 8వ తేదీ నుంచి జూమ్ ద్వారా కౌన్సెలింగ్ను ప్రారంభించారు. 11వ తేదీ రాత్రితో ఈ ప్రక్రియను ముగించారు. అయితే చాలా మందికి అశించిన ప్రాంతాలు రాక అయోమయానికి గురవుతున్నారు. మరికొందర్ని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ ముగిసిన ఇప్పటికీ సిఫార్సుల గోల తగ్గడం లేదు. అధికారులపై కొందరు ఏఎన్ఎంలు ప్రజాప్రతినిధులు, కూటమి నేతల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆర్డర్ పత్రాలు ఇచ్చేందుకు కూడా అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ కారణంగా శాఖపై బురద పడుతోంది. కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ముడుపులు తీసుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూటమి నేతల జోక్యంతో వచ్చిన యవ్వారమని ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు.గందరగోళం ఏమీ లేదు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించాం. జూమ్ పద్ధతిలో ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలో ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నాం. మాకై తే ఎవరినీ ఇబ్బంది పెట్టించాల్సిన అవసరం లేదు. శాఖలో పనిచేసేవారు మా కుటుంబ సభ్యులే. వాళ్లను ఇబ్బంది పెట్టించాలని మేము ఏరోజూ కోరుకోం. ఇప్పటి వరకు వారికి ఇబ్బంది లేకుండా చూడాలని మా ప్రయత్నం చేస్తున్నాం. గందరగోళం ఏమీ లేదు. తప్పులుంటే కచ్చితంగా సరిదిద్దేలా చూస్తాం. సమస్యలుంటే నేరుగా తీసుకురావొచ్చు. –సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, చిత్తూరు ముందస్తు బుకింగ్లు ఏఎన్ఎంల బదిలీల విషయంలో డిమాండ్ పెరిగే కొద్దీ పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమ ప్రాంతంలో తమకు తెలియకుండా బదిలీలు చేయకూడదని హుక్కుం జారీ చేశారు. తమకు అనుకూలమైన వారినే వేయించుకుంటామని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ముందస్తుగానే 80శాతం ప్రాంతాలను వారి గుప్పట్లోకి తీసుకున్నారు. అక్కడికి రావాల్సిన వారిని వారే ఎంపిక చేసి అధికారులకు జాబితా పంపారు. కాగా వారి ఒత్తిడికి అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ఇక్కడి నుంచి శాఖలో పనిచేసే అధికారులను బదిలీ చేయిస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో వారు చేసేది లేక వారు చెప్పినట్లు బదిలీలను ముగించారు. కొందరు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఉన్న ఏఎన్ఎంలు, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఏఎన్ఎంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయించాలని ప్రయత్నాలు చేశారు. సహాకులతో వసూళ్లు? కొందరు ఏఎన్ఎంలే వారి సహాయకులకు కాసులతో ఆశ చూపించారు. తాను అనుకున్న స్థానానికి బదిలీ చేయిస్తే అడిగింత ఇచ్చుకుంటానని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఏఎన్ఎంల బదిలీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు రెచ్చిపోయారు. వారు ఒక్కో బదిలీకి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు పలువురు ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు బెదిరింపులు 80 శాతం ముందస్తు బుకింగ్లు ఆపై కొందరు ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరుల దందాలు కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తామంటూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు మండిపడుతున్న ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం జోరందుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యంతో గందరగోళమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి 80 శాతం ముందస్తు బుకింగ్ చేసుకుంది. ఆపై పలువురు ప్రజాప్రతినిధుల అనుచరులు తెరపైకి తళుక్కుమన్నారు. కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యేందుకు రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ దందాతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. కూటమి పెత్తనంపై ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
పెనుమూరు(కార్వేటినగరం): ఎరువుల దుకాణాలపై సోమవారం స్టేట్ విజిలెన్స్ స్క్వాడ్ దాడులు నిర్వహించింది. ఏడీఏ ధనుంజయరెడ్డి, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ డీలర్లందరూ ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎరువుల దుకాణాలను పరిశీలించి నిల్వల వివరాలను, అమ్మకాలు జరిపిన బిల్లులను పరిశీలించారు. ఎరువుల ధరల డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దాడుల్లో చిత్తూరు డీఏఓ కార్యాలయం ఏవో శ్రీకాంత్రెడ్డి, పెనుమూరు వ్యవసాయ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. వెబ్ల్యాండ్ ప్రక్రియను పర్యవేక్షించాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వెబ్ల్యాండ్ ప్రక్రియను ఆర్డీవోలు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె చాంబర్లో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వెబ్ల్యాండ్ ప్రక్రియలో తహసీల్దార్ల నుంచి ఒరిజినల్ ఫైళ్లను తెప్పించుకుని ఆర్డీవోలు పరిశీలించాలన్నారు. లబ్ధిదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా స్లాట్లు ఇచ్చి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. రీ సర్వే ప్రక్రియలో జిల్లాలో మొదటి దశలో 31 గ్రామాలలో చేపట్టినట్లు తెలిపారు. ఈ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆర్వోఆర్లను ఆర్డీవో లు వెంటనే ప్రచురించాలన్నారు. ఈ నెలాఖరు లోపు జిల్లాలోని వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటివద్దకే రేషన్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పట్టాకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను గుర్తించాలన్నారు. గ్రామసభలు నిర్వహించి జాయింట్ ఎల్పీఎం దరఖాస్తులు స్వీకరించాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం తగదు చిత్తూరు అర్బన్: ప్రజాఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వద్దన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులకు ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్ కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 42 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గిన్నీస్ రికార్డుకు టీచర్లు బాధ్యులా? చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం పాలనలో మెగా పీటీఎం పేరుతో గిన్నీస్ బుక్ రికార్డు పొందేందుకు టీచర్లను బాధ్యులు చేయడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇటీవల జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎంను నిర్వహించిందన్నారు. ఇందులో సాంకేతిక లోసుగులు సరిచేయకుండా ఆ తప్పులను టీచర్ల పై వేసి బాధ్యులను చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. టీచర్ల వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేసినప్పటికీ అవి సరిగా లేవంటూ తిరిగి అప్లోడ్ చేయాలంటూ ఒత్తిడి చేయడం కరెక్టు కాదన్నారు. అప్లోడ్ చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీచేస్తామని టీచర్లను భయాందోళనకు గురిచేయడం అన్యాయమన్నారు. యాప్ల నిర్వహణలో ఏర్పడే సాంకేతిక సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారో కూటమి ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ..!
చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు క్యూ కట్టారు. మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025సదుం: ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ..అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్న చంద్రబాబును ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని ఎర్రాతివారిపల్లెలో బాబు షూరిటీ–మోసం గారెంటీలో భాగంగా నిర్వహించిన మండల స్థాయి వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన బాండ్ల హామీని బీజేపీ నాయకులు సైతం విశ్వసించ లేదన్నారు. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కొని కరెంటు చార్జీలను పెంచడంతో పాటు, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. బెల్టుషాపులు విస్తృతం చేశారని మండిపడ్డారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను ఏనాడూ అమలు చేయలేదన్నారు. దీంతో ప్రజలకు చంద్రబాబుపై విశ్వాసం పోయిందన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా సంక్షేమ పథకాలను అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. గ్రామకమిటీలే కీలకం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇవి భవిష్యత్తులో కీలకంగా మారనున్నట్టు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లోపు.. ఆ తర్వాత కూడా గ్రామ కమిటీలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గ్రామాల్లోని ముఖ్యనాయకులకు కమిటీలలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మీకు రుణపడి ఉంటా గత 47 ఏళ్ల తన రాజకీయ జీవితంలో అండగా ఉంటూ.. తన వెంట నడుస్తున్న మండల ప్రజానీకానికి రుణ పడి ఉంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ తమ కుటుంబ సభ్యులకు మెజారిటీ అందిస్తున్న మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. వారికి ఏకష్టం వచ్చినా తాము అండగా నిలుస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అనీషారెడ్డి, శ్రీనాథ్రెడ్డి, పోకల అశోక్కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, పుట్రాజు, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్పరెడ్డి, ప్రకాష్రెడ్డి, కృష్ణారెడ్డి, రెడిఈశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, బాబురెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.– 8లో– 8లోన్యూస్రీల్ఎన్నికల ముందు అలవిగాని హామీలు అధికారంలోకి వచ్చాక పంగనామాలు నేతల సంతకాలతో ఇచ్చిన బాండ్ల సంతగేంటో? బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం ‘ఎన్నికల ముందు కూటమి నేతలు అలవిగాని హామీలిచ్చారు. సూపర్–6 పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఉచిత బస్సు అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికీ రూ.5 వేలు అంటూ సంతకాలు పెట్టి మరీ బాండ్లు పంపిణీ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అటకెక్కించారు. ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఊర్లోకెళ్లినా ప్రజలు బాబును ఇక నమ్మే ప్రసక్తే లేదని అంటున్నారు..’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సోమవారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సభల్లో పాల్గొని ప్రసంగించారు. -
అక్రమ కేసులకు అదరం..బెదరం
కార్వేటినగరం: అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూడడం వారి అవివేకమని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మి స్పష్టం చేశారు. గత వారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జిల్లా పర్యటనలో ఫొటో గ్రాఫర్పై దాడి చేశారని ఆరోపిస్తూ అక్రమ కేసులు బనాయించి జిల్లా కారాగారంలో బంధించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు చక్రి, మోహన్, వినోద్ను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా కృపాలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా జనంలో జగనన్నపై ఉన్న అభిమానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు జగనన్న, జగనన్న పార్టీ అండగా నిలిస్తోందని భరోసానిచ్చారు. ఆమె వెంట జీడీ నెల్లూరు మండల కన్వీనర్ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, నాయకులు పెద్దిరెడ్డి, అలీషేర్ఖాన్, ఉదయ్, మోహన్, వినోద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. రోల్ మోడల్గా చిత్తూరు ఎస్పీఎం చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలో రోల్ మోడల్గా చిత్తూరు ఎస్పీఎం(ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)ను తీర్చదిద్దుతామని ట్రాన్స్కో సీఎండీ సంతోషరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీఎంను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా చిత్తూరులో 2వేల లీటర్ల ఓఆర్ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్) అందుబాటులో ఉందన్నారు. ఇక్కడి నుంచి శుద్ధి చేసిన ఆయిల్ను పలమనేరు, పుంగనూరు, కార్వేటినగరం ఎస్పీఎంలకు పంపవచ్చన్నారు. మిషన్ ఆపరేటింగ్కు టెక్నికల్ సహాయకులను నియమిస్తామన్నారు. ట్రాన్స్ఫార్మర్ల పరంగా అన్ని మరమ్మతులు చిత్తూరు నుంచే జరిగే విధంగా చూస్తామన్నారు. ఈ విధానం విజయవంతమైతే ప్రతి జిల్లాలో ఒక ఓఆర్ఎంను కేటాయిస్తామన్నారు. పలు ప్రాంతాల్లో ఏఈలు మండల కేంద్రాల్లో నివాసం ఉండడం లేదన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఎలా అని ప్రశ్నించారు. మండల కేంద్రాల్లో ఏఈలు తప్పనిసరిగా నివాసం ఉండాలన్నారు. అనంతరం స్టోర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ కార్యాలయ మొదటి అంతస్తు నిర్మాణానికి ఫర్నిచర్ మంజూరు చేయాలని ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ కోరారు. అనంతరం చిత్తూరు రూరల్ డివిజన్ కార్యాలయాన్ని పరిశీలించారు. డైరెక్టర్ గురవయ్య, సీజీఎం జానకీరామ్, ఈఈలు మునిచంద్ర, సురేష్, అమర్బాబు, డీఈలు ప్రసాద్, వసంతనాయుడు, ఏఈలు పాల్గొన్నారు. -
ఆరు టిప్పర్ల సీజ్
పాలసముద్రం: గుట్టలోని గ్రావెల్ ఎర్రమట్టిని అక్రమంగా తమిళనాడుకి తీసుకెళ్తున్న ఆరు టిప్పర్లను స్థానిక తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తమ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి సీజ్ చేశారు. వారు మాట్లాడుతూ మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామమైన వనదుర్గాపురం పంచాయతీలోని గుట్టలో అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ మట్టిని తీసుకెళ్తున్నట్టు ఫిర్యాదు అందిందన్నారు. పరిశీలించగా.. అక్కడ గ్రావెల్ ఎర్రమట్టిని టిప్పర్లో తమిళనాడుకు తీసుకెళ్తున్నట్టు గుర్తించామన్నారు. అనంతరం ఎర్రమట్టి తరలిస్తున్న ఆరు టిప్పర్లను సీజ్ చేసి పోలీస్టేషన్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో డెప్యూటీ తహసీల్దార్ రిశివర్మ, ఆర్ఐ దేవి, వీఆర్ఓ వెంకటాచలం పాల్గొన్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర రైలు దొంగల అరెస్ట్
● కత్తులు, వైర్కట్టర్లు స్వాధీనం చిత్తూరు కార్పొరేషన్: రైళ్లలో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను రైల్వే గుంతకల్లు ఎస్పీ రాహుల్మీనా, తిరుపతి డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో రేణిగుంటలో చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణె జిల్లా, ఖడ్కి గ్రామానికి చెందిన జలిందర్ మహిర్యా పవార్(50), కోహినూర్ నవనత్ పవార్(24) రైళ్లలో దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. అనంతరం వారి నుంచి రెండు కత్తులు, రెండు వైర్కట్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులు ఎక్కువగా వేకువజామున 2–4 గంటల మధ్యలో నిర్మానుష ప్రాంతాల్లో సిగ్నల్బాక్స్లోని వైర్లను కట్ చేసి రైలు ఆగిపోయేలా చేసేవారని, ఆ తర్వాత కోచ్లో కిటికీ పక్కన ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు చైన్స్, విలువైన వస్తువులు దోచుకునేవారన్నారు. కొన్ని సందర్భాల్లో కత్తులతో ప్రయాణికులను బెదిరించారని చెప్పారు. వరుస దొంగతనాలు గత నెల 26న సిద్ధంపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తుండగా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును అపారన్నారు. నలుగురు మహిళలను కత్తులతో బెదిరించి 85 గ్రాముల బంగారు గొలుసులు లాక్కున్నారని తెలిపారు. వీటిపై డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో సీఐలు యత్రీంద, సుధాకర్రెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్, రవి, ధర్మేంద్రరాజు, గోపాల్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను నియమించి వీరి కోసం మహారాష్ట్రలోని సోలాపూర్, పూణేలోని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేసినట్టు తెలిపారు. అక్కడ దొరికిన సమాచారం మేరకు జూలై 13న నిందితులను రేణిగుంటలో అరెస్టు చేసినట్టు వెల్లడించారు. మే 2న మామండూరు రైల్వేస్టేషన్ సమీపంలో సోలాపూర్ స్పెషల్రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 35 గ్రామలు దోచుకోగా.., అదేనెల 12న పూతలపట్టు వద్ద ఆగి ఉన్న రైలు చివరిబోగిలో ఉన్న వ్యక్తి నుంచి దొంగతనానికి యత్నించి తప్పించుకున్నట్టు వెల్లడించారు. 14న ముంగిలిపట్టు రైల్వేస్టేషన్లో తిరుపతి–విల్లుపురం రైలులో ప్రయాణిస్తున్న మహిళ వద్ద 24 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించగా.., 21న మంత్రాలయం రైల్వేస్టేషన్లో దొంగతనానికి యత్నించి విఫలమైనట్టు తెలిపారు. జూన్ 2న ముంగిలిపట్టు స్టేషన్లో చామరాజనగర్ ఎక్స్ప్రెస్లో ఇద్దరు మహిళల నుంచి 60 గ్రాములు దోచుకున్నట్టు పేర్కొన్నారు. జూన్ 5న మానవపాడు, 13న అల్లంపూర్ రైల్వేస్టేషన్లలో దొంగతనానికి యత్నించి విఫలమైనట్టు తెలిపారు. 24న తాడిపత్రి రైల్వేస్టేషన్లో కిటికీ పక్కన ఉన్న ప్రయాణికురాల నుంచి 27 గ్రాములు దోచుకున్నట్టు వెల్లడించారు.రికవరీ శూన్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా ఈ ముఠా 9 దొంగతనాలకు పాల్పడింది. ఇందులో మొత్తం 242 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. వీరిని పట్టుకోవడానికి 40 మందితో కూడిన రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అక్కడ లభించిన సమాచారం మేరకు రేణిగుంటలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, రెండు వైర్కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక్క గ్రాము బంగారం కూడా వారి వద్ద రాబట్టలేకపోయారు. కేసు దర్యాప్తునకు సహకరించిన చిత్తూరు ఎస్పీ మణికంఠచందోలుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక బృందం సభ్యులకు అభినందన పత్రాలు అందజేశారు. -
సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : తోతాపురి మామిడికి ప్రభుత్వం అందజేసే సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చర్య లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తోతాపురి మా మిడి రైతులకు రూ.4ను ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదా పు మూడు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురిని పరిశ్రమల నిర్వాహకులు కొనుగోలు చేశారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.4 సబ్సిడీ మొత్తం రూ.120 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 30,500 మెట్రిక్ ట న్నుల వేరుశనగ విత్తనాలు వచ్చినట్టు తెలిపారు. -
భక్తిప్రపత్తులతో సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సోమవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతర్థి గణపతి వ్రతాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణరథంపై ఊరేగింపు రాత్రి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ..!
● కలెక్టరేట్కు క్యూ కట్టిన అర్జీదారులు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్కు మార్గాంధీ, జేసీ విద్యాధరి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్కు క్యూ కట్టారు. శ్రీసమస్యలు పరిష్కరించండి సారూ..!శ్రీ అంటూ అధికారులను అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందిస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 299 అర్జీలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. దూరంగా బదిలీ చేశారు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు తమను ఇష్టానుసారంగా దూరంగా బదిలీ చేశారని ఏఎన్ఎంలు లక్ష్మి, చైతన్య, లీలా, సావిత్రి తదితరులు ఆరోపించారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన బదిలీల్లో తమకు జరిగిన అన్యాయం పై కలెక్టర్ వద్దకు వెళ్లి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏఎన్ఎంల బదిలీ నిర్వహించారన్నారు. 200 మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. ముందు తప్పుల తడకగా సీనియారిటీ జాబితాను ప్రచురించారన్నారు. ఖాళీల జాబితాను ప్రచురించకుండా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. 5 ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ అందులో ఒక్కటీ రాలేదన్నారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య, తదితరులు పాల్గొన్నారు. ఆరు నెలలుగా నీటి సమస్య గత ఆరు నెలలుగా నీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులెవ్వరూ పట్టించుకోవడం లేదని పాలసముద్రం మండలం, కృష్ణజిమ్మాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట తలపై బిందెలు పెట్టుకుని ధర్నా నిర్వహించారు. ఆరు నెలలుగా నీటి కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో గ్రామస్తులు వెంకటమ్మ, రమణమ్మ, శాలిని, సుమలత పాల్గొన్నారు. భూములు ఎన్ని సార్లు ఇవ్వాలి ఇప్పటికే ఎన్హెచ్ 716 రోడ్డు ఏర్పాటుకు రెండు సార్లు తమ భూములను ఇచ్చామని, మరళా ఇంకెన్ని సార్లు భూములు ఇవ్వాలని నగరి మండలం, వీకేఆర్ పురం, తడుకుపేట గ్రామస్తులు రవిచంద్రన్, జ్యోతిప్రకాష్ వాపోయారు. ఈ మేరకు గ్రామస్తులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్హెచ్ 716 రోడ్డుకు భూములను తీసుకున్నారన్నారు. ప్రస్తుతం తిరిగి టోల్గేట్, స్లిప్ రోడ్డు ఏర్పాటు చేస్తామంటూ భూములు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. తడుకుపేట వద్ద ఉన్న ప్రభుత్వ భూములలో టోల్గేట్, స్లిప్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దారి సమస్య పరిష్కరించాలి తమ పొలాలకు దారి సమస్య ఉందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని తవణంపల్లి మండలం, నల్లప్పరెడ్డిపల్లి గ్రామస్తులు రామచంద్ర, శిల్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తాము వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమ పొలాలకు తరతరాలుగా ప్రభుత్వ భూమిలో ఉండే నీటి కాల్వ దారిలో వెళ్తున్నామన్నారు. ఆ దారిని కొందరు అడ్డుకుని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. -
దొంగ అరెస్ట్
కుప్పం: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూరు జిల్లా, కరంబూర్ గ్రామానికి చెందిన శక్తివేల్ దొంగతనాలకు పాల్పడేవాడని, ఈ క్రమంలో ఆంధ్రాలో అతనిపై ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు తెలిపారు. కుప్పం సర్కిల్ పరిధిలో కూడా అతనిపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం పోలీసు నిఘా ఉంచి అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిదింతుడి వద్ద నుంచి 5 తులాల బంగారం, కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రామకుప్పం మండలం, ననియాల గ్రామానికి చెందిన ఇద్దరు బియ్యం వ్యాపారులపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా వుండగా గోవిందరాజులు, మాణిక్యం తమిళనాడు బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ బియ్యం వ్యాపారికి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దళితులంటే అలుసా? చిత్తూరు కలెక్టరేట్ : నగరి మండలం, గుండ్రాజకుప్పం దళితవాడ ప్రజలను ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. గుండ్రాజ కుప్పం దళితవాడకు ఆనుకొని ఉన్న కొండను క్వారీ యజమానులకు అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ జీడీ నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం, సాయినగర్, ఎస్ఆర్ఆర్ కండ్రిగ, వనదుర్గపురం తదితర గ్రామాల్లో కొండలను తొలిచి టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని తోడేస్తున్నారని, అక్రమంగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేస్తుకుంటున్నారని చెప్పారు. -
టీబీని నివారిద్దాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): 2025 ఆఖరి కల్లా టీబీని దేశం నుంచి తరిమికొట్టాలని సెంట్రల్ టీబీ డివిజన్ డిప్యూటీ కమిషనర్ భవానిసింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లాలో జరుగుతున్న టీబీ ముక్త భారత్ కార్యాక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. టీబీని సమూలంగా నిర్మూలించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ షుఘర్, తాగుడు అలవాటు ఉన్నవారికి, పాత టీబీ రోగులకు, హెచ్ఐవీ రోగులందరికీ టీబీ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. అనంతరం జిల్లా టీబీ నివారణ అధికారి వెంకటప్రసాద్ మాట్లాడారు. ప్రతి సచివాలయ పరిధిలో రోజూ 10 మందికి టీబీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. అంతకుముందు జిల్లా టీబీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పూతలపట్టులోని వేపనపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జీడీ నెల్లూరు మండలంలోని నెల్లేపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ను తనిఖీ చేశారు. ఆయన వెంటన కేంద్ర బృందం సభ్యులు దర్మారావు, గంగాధర్, శ్రీ ధీరజ్, టీబీ శాఖ అధికారులు మనోహర్రెడ్డి, జశ్వంత్, సంతోష్ పాల్గొన్నారు. -
అవినీతి పీడీపై వేటు!
● హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ సస్పెన్షన్ ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టరేట్ : అవినీతి పీడీపై వేటు పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. హౌసింగ్ పీడీగా గోపాల్ నాయక్కు సీఎం సొంత జిల్లాలో పోస్టింగ్ కల్పించారు. ఈయన పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కీలకమైన శాఖను అప్పగించారు. ఆయన రోజూ తిరుపతి జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగించేవారు. స్థానికంగా ఉండకపోవడంతో హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ను గాలికొదిలేశారు. గత సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఆలస్యంగా వచ్చిన ఆయనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన గతంలో చేసిన అవినీతి ఆరోపణలను విచారించిన తర్వాత సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండ్ ఇందుకేనా? భూక్య గోపాల్ నాయక్ గతంలో అన్నమయ్య జిల్లా పీలేరు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ రాయచోటి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ఆ సమయంలో అనగాని శ్రీహరి అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి నుంచి బదిలీకి సంబంధించి లంచం డిమాండ్ చేశారు. ఈ విషయం బాధితుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన ప్రభుత్వం ప్రస్తుతం అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ ఉత్తర్వులు జారీచేశారు. అది ఆయనకు అలవాటే! హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ సస్పెండ్ విషయం జిల్లా అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన గతంలో పీలేరు డీఈఈగా పనిచేస్తున్న సమయంలో హౌసింగ్ లే అవుట్లలో జంగిల్ క్లియరెన్స్ కు ఓటీఎస్ నగదు ఖర్చు చేయకుండా నిబంధనలకు వ్యతిరేకంగా డ్రా చేసి పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా రాయచోటిలో ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించే ఇసుకను భారీ స్థాయిలో పక్కదారి పట్టించారని సమాచారం. పీలేరులో డీఈఈగా పనిచేస్తున్న సమయంలో ఇసుక, సిమెంట్, స్టీల్ ను భారీగా అక్రమదారుల్లో అమ్మకాలు చేశారనే ఆరోపణలున్నాయి. -
చిత్తూరు ఎంపీ ఇంతవరకు రాలేదు
● కలెక్టరేట్ ఎదుట టీడీపీ నగరి నియోజకవర్గ నేతల ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎన్నికై నప్పటి నుంచి ఇంత వరకు నగరి వైపు రాలేదని ఆ నియోజకవర్గ టీడీపీ నేత చలపతి ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు చేతబట్టి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఎంపీని చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరికి రానివ్వకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. గతంలో సైతం దివంగత ఎంపీ శివప్రసాద్ పట్ల ఇలాంటి ధోరణే అమలు చేశారని ఆరోపించారు. చిత్తూరు ఎంపీ నగరికి విచ్చేసి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలన్నారు. అనంతరం నగరి తెలుగుదేశం పార్టీలో దెయ్యం ఎవరు భూతం ఎవరంటూ ప్లకార్డులు చేతబట్టి ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 200 మీటర్ల కేబుల్ వైరు చోరీ చౌడేపల్లె: మండలంలోని చారాల కురప్పల్లెకి తాగునీటి సరఫరాచేసే బోరుకు అమర్చిన 200 మీటర్ల కేబుల్ వైరు ఆదివారం రాత్రి చోరీకి గురైందని సర్పంచ్ విజయకుమారి తెలిపారు. వైరు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు. -
చంద్రబాబు ఇలాకాలో మహిళ నిర్బంధం
శాంతిపురం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కర్లగట్ట పంచాయతీ తమ్మిగానిపల్లిలో సోమవారం ఒక మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమ్మిగానిపల్లె గ్రామానికి చెందిన మునెప్పకు ఇద్దరు భార్యలు. అనారోగ్యం బారినపడ్డ ఆయన ఈనెల 5న మృతి చెందాడు. మొదటి భార్య మునెమ్మకు కుమారుడు మంజున, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్య గంగమ్మకు కుమారుడు సురేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇరువురు భార్యల పిల్లల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో మునెప్ప రెండో భార్య గంగమ్మను విద్యుత్ స్తంభానికి కట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. సురేషే తన తల్లి గంగమ్మను కరెంటు పోల్ వద్ద నిలబెట్టి, డ్రిప్పు పైపును చుట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని ఎస్ఐ ఒక ప్రకటనను విడుదల చేశారు. -
నిరాశ్రయుల వసతి గృహం తనిఖీ
చిత్తూరు అర్బన్ : రాష్ట్రంలోని నిరాశ్రయుల గృహాల్లోని పేదలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి మెప్మా తరపున సహకారం అందిస్తామని రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నా రు. చిత్తూరులోని నిరాశ్రయుల వసతి గృహాన్ని శనివారం రాత్రి మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ తనిఖీ చేశారు. వంట శాలలో ఆహార పదార్థాల తయారీ, నిత్యావసర సరుకులు తేదీలను, వసతి పొందుతున్న వారి రికార్డులను పరిశీలించారు. అనంతరం వసతి పొందుతున్న వారి నుంచి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ , మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రానికి, కొన్ని వసతులు కోరారని, పరిశీలించి సమకూర్చుతామన్నారు. సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసఫ్ రాజు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఎస్ఎమ్ ఎమ్ మెప్మా శ్రీనివాసరావు , చిత్తూరు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర, సీఎంఎం వెంకటరమణ, టీఈఎస్ఎస్ రవి, మెప్మా పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం.. కాపర్ తీగలు చోరీ చౌడేపల్లె : కాపర్ వైర్ల కోసం వేర్వేరు ప్రదేశాల్లో ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని చారాల, శెట్టిపేట సమీపంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చారాల సచివాలయం పక్కన బీఎస్ఎన్ఎల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మను ఽ పగులకొట్టి కాపర్వైరు చోరీ చేశారు. అలాగే శెట్టిపేట సమీపంలోని పురుషోత్తం రాజు మామిడి తోటలో టవర్ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి కాపర్ తీగలను అపహరించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చోరీలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
● టైరు పేలి కారు బోల్తా ● ప్రాణాలతో బయటపడిన కుటుంబ సభ్యులు బంగారుపాళెం : మండలంలోని పాలేరు ఫ్లై ఓవర్ సమీపం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు టైరు పగిలి బోల్తా పడి దగ్ధమైంది. ఈ సంఘటనలో కాంచీపురానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు గాయాలతో బయటపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన తాండవమూర్తి (65)కి బైరెడ్డిపల్లె మండలంలోని విరుపాక్షపురంలోని ఆయుర్వేద వైద్యశాలలో నాటు మందు తాగించుకుని వచ్చేందుకు కుమారుడు కార్తికేయన్(34), తల్లి సంపత్కుమారి(60), భార్య అశ్వని(32), కుమారై రక్షిత(2), మామ వేలాయుధం(45) మొత్తం ఆరుగురు కలిసి ఉదయం 4.45 గంటలకు కాంచీపురం నుంచి తమ సొంత కారులో బయలుదేరి విరుపాక్షపురానికి 8 గంటలకు చేరుకున్నారు. అక్కడ తాండవమూర్తికి నాటుమందు తాగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో బంగారుపాళెం మండలం పాలేరు ఫ్లై ఓవర్కు కొంతదూరం వెళ్లిన తరువాత కారు టైరు పగిలి అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. కారుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. కారులో ఉన్న వారు డోర్ తెరుచుకుని దూకేసి ప్రాణాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న ఽకార్తీకేయన్, అతడి భార్య అశ్వనికి, మామ వేలాయుదానికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు మంటలను అదుపు చేసేందుకు కోసం పలమనేరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం అధికారి రెడ్డెప్పరెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేలోగా కారు పూర్తిగా కాలిపోయింది. గాయపడిన వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిన ప్రాణాపాయం కారు టైరు ఉన్న ఫలంగా పగిలిపోవడంతో అదుపుతప్పి కారు బోల్తాపడి మంటలు చెలరేగాయని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. కారులో ఉన్నవారు తేరుకుని డోర్లు తెరుచుకుని బయటకు వచ్చారని తెలిపారు. కొంతసేపటికే కారు పూర్తిగా దగ్ధమైందన్నారు. కారు డోర్లు తెరుచుకోకపోయి ఉంటే కారులోని వారు చనిపోయి ఉంటారన్నారు. -
కొండంత జనం
అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం బోయకోండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.కారు దగ్ధం..తప్పిన ప్రమాదం బంగారుపాళెం మండలంలో ఆదివారం పాలేరు ఫ్లైఓవర్ సమీపంలో కారు టైరు పేలి బోల్తాపడి దగ్ధమైంది. సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం..తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో విద్యార్థుల తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెన్స్ స్వీకరించడంతో ఈ పథకంపై పెద్ద ఎత్తున అర్జీలను విద్యార్థుల తల్లులు అందజేశారు. ఎవరు ఏ సమస్య వల్ల అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. వాటి ఆధారంగా అవసరమైన పత్రాలను జత చేసి గ్రీవెన్స్కు అర్జీలు అందజేశారు. అయితే ఆ అర్జీలు వివిధ దశల్లో అధికారులు ఆమోదించాల్సి ఉండటంతో పరిష్కారానికి నోచుకోని దుస్థితి నెలకొంది. అర్హులైనా..అనర్హులుగా తల్లికి వందనం పథకం అర్హత ఉన్నప్పటికీ గతంలో అమ్మఒడి పథకం పొందినప్పటికీ ఈ ఏటా అనర్హులుగా చూపించారు. అదే విధంగా చాలా మంది విద్యార్థుల తల్లులకు సంబంధం లేని సమస్యలను వారికి అంటగట్టి అనర్హులుగా జాబితాలో పెట్టారు. దీంతో జిల్లాలో తల్లికి వందనం వర్తింపజేయాలంటూ అర్జీలు సచివాలయాల్లో పోటెత్తాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ తల్లులు సచివాలయాలకు క్యూ కట్టి దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడో కారు విక్రయించేసినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూపించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్న్కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హులుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ అధిక సంఖ్యలో తల్లులు అర్జీలు పెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 1,890 మంది తల్లులు అధికారికంగా అర్జీలు దాఖలు చేశారు. వీరే కాకుండా అవగాహన లేక దరఖాస్తు చేసుకోవాల్సిన తల్లులు మరో వెయ్యి మంది ఉండొచ్చని అంచనా. జిల్లాలో 1,890 అర్జీలు నమోదు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,890 అర్జీలు పోటెత్తాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్ వినియోగ బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేసి ఆధారాలు చూపుతూ అర్జీలు పెట్టుకుంటున్నారు. తమ పేరుపై అనేక విద్యుత్ మీటర్లు సీడింగ్ అయి ఉన్నాయని వాటిని తొలగించాలనే అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. తమ కారు విక్రయించేసినా పథకం అమలు కాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివాహం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదా యం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అనేక మంది అర్జీలు దాఖలు చేశారు. అర్జీల పరిశీలనలో అలసత్వం తల్లికి వందనం పథకంలో వివిధ శాఖలకు పంపుతున్నా అర్జీల పరిశీలనలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కారుకు సంబంధించి జిల్లా రవాణా శాఖ, ఆదాయపు పన్ను అర్జీలను తహసీల్ధార్, ఇలా పలు సమస్యల అర్జీలను ఆయా శాఖల అధికారుల లాగిన్లకు పంపారు. అయితే సంబంధిత అర్జీలు ఆయా అధికారుల లాగిన్లలో నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదానికి నోచుకోక అలానే పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వేల మంది తల్లులు అర్జీల పురోగతి కోసం నిత్యం సచివాలయాల చుట్టూ తిరిగి వేశారి పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ 581 అర్జీలు నమోదు అయ్యాయి. ఆ అర్జీలను మొదటగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగా అక్కడ నుంచి వీఆర్వోకు, ఆ తర్వాత తహసీల్ధార్, అనంతరం ఆర్డీవో, చివరికి జాయింట్ కలెక్టర్ లాగిన్కు చేరుతాయి. ఇలా నమోదైన 581 అర్జీల్లో ఇప్పటి వరకు కేవలం 4 అర్జీలు మాత్రం ఆమోదించారు. అదే విధంగా ఇన్కం ట్యాక్స్ సమస్యలపై 263 అర్జీలు నమోదయ్యాయి. ఈ అర్జీల్లో ఇప్పటి వరకు 3 అర్జీలు మాత్రం ఆమోదించారు. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : నగరిలో అక్రమ గ్రావెల్ క్వారీలు, పలు సమస్యల పరిష్కారానికి ఈనెల 14న సీపీఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. నగరిలో అక్రమ గ్రావెల్ క్వారీలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గుండ్రాజ కుప్పం దళితులు హైవేలో ఇళ్లు కోల్పోతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పలు డిమాండ్లు పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. 22న మామిడి రైతు మహా జనసభ చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రపంచ మామిడి దినోత్సవ సందర్భంగా ఈనెల 22న మామిడి రైతు మహా జనసభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతు సంక్షేమ సంఘం నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సభను ఏర్పాటు చేశామని, ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సంఘ సమావేశం ప్రారంభమవుతుందని, మామిడి రైతులు పాల్గొనాలని కోరారు. గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం పెద్దపంజాణి : మండలంలోని శంకర్రాయలపేటలోని మహాత్మా జ్యోతిభా పూలే బాలికల గురుకుల పాఠశాల (ఇంగ్లిష్ మీడియం)లో 2025–26 సంవత్సరానికి గానూ 5,6,7,8,9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జోత్స్న తెలిపారు. ఈనెల 20 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్థానిక గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలకు వచ్చేవారు పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ జిరాక్స్, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకుని ఈనెల 12 నుంచి 18వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం లోపు పాఠశాలలో అందజేసి హాల్ టికెట్ తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 95157 64818 ఫోన్ నంబరును సంప్రదించాలని కోరారు. చిత్తూరు సచివాలయంలో తల్లికి వందనం సమస్యల అర్జీలు ఇస్తున్న తల్లిదండ్రులు (ఫైల్)రెండవ విడతకు కాలయాపన తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం జూన్ 13న అమలు చేసింది. నేటితో ఒక నెల పూర్తి అవుతోంది. చిత్తూరు జిల్లాలో 2,64,679 మంది విద్యార్థులకు సంబంధించి 1,30,382 మంది తల్లుల ఖాతాల్లో రూ.169.50 కోట్లు జమ చేశారు. అయితే మొదటి విడత మంజూరు కాని విద్యార్థులకు రెండో విడతలో పథకం నగదు జమ చేస్తామంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. మొదట రెండో విడత నగదును జులై 5వ తేదీన వేస్తామన్నారు. ఆ తర్వాత జులై 10వ తేదీ అన్నారు. ఈ రెండు తేదీలు గడిచిపోయినా ఇంకా నగదు జమ కాని దుస్థితి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఎగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థుల తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన పలమనేరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు విమర్శించారు. పలమనేరు పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళైన ఉప్పాల హారికపై గుడివాడలో టీడీపీ, జనసేన గుండాలు మారణాయుధాలతో దాడి చేయడం దారుణమన్నారు. మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల సాక్షిగా జరుగుతున్నా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా ప్రథమ పౌరురాలకే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్జిల్లాలోని తల్లికి వందనం పథకంలో తాము ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ చిత్తూరు అర్బన్లో 90, కుప్పం అర్బన్లో 28, కుప్పం రూరల్లో 28 మంది విద్యార్థుల తల్లులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుల నమోదు చేసి నెల రోజులు అవుతున్నా మోక్షం కలగని దుస్థితి. ఇదే కాదు జిల్లాలోని అన్ని మండలాల్లో తల్లికి వందనం అర్జీల పరిష్కార పరిస్థితి ఇలానే ఉంది. చిత్తూరు జిల్లాలో 1,890 అర్జీల నమోదు పరిష్కారానికి నోచుకోని ‘తల్లికి వందనం’ అర్జీలు సచివాలయాల చుట్టూ తల్లుల ప్రదక్షిణలు రెండో విడత మంజూరులో కాలయాపన కూటమి ప్రభుత్వం అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం.. తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.. మొదటి జాబితాలో పథకం వర్తించని వారు రెండో జాబితాకు ఎదురు చూస్తున్నారు. అర్హులైనప్పటికీ అనర్హులని మొదటి విడత తల్లికి వందనంలో చాలా మంది విద్యార్థులకు పథకం ఎగ్గొట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేల మంది తల్లులకు తల్లికి వందనం అర్జీలతో సచివాలయాల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ అర్జీలు పరిష్కారానికి నోచుకోక విద్యార్థుల తల్లులు...తిప్పలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అర్జీలపై సాక్షి ఫోకస్.జిల్లా సమాచారం నమోదైన పెండింగ్లో అర్జీలు ఉన్న అర్జీలు ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ 581 577 ఇన్కంట్యాక్స్ సమస్యలు 263 260 ఈకేవైసీ సమస్యలు 1,046 1,026 మొత్తం అర్జీలు 1,890 1,863 సర్కారు తీరు సరికాదు తల్లికి వందనం పథకం ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీని విస్మరించింది. ఒక కుటుంబంలో ముగ్గురు విద్యార్థులుంటే ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చి మిగిలిన పిల్లలకు కొర్రీల పేరుతో తొలగించారు. అదే విధంగా చాలా మందికి గతంలో అమ్మఒడి వర్తించినప్పటికీ ఇప్పుడు తల్లికి వందనం ఎందుకు వర్తించదో అర్థం కావడం లేదు. అర్జీలను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
కోర్సుల కోత.. కాలేజీల మూత!
● యూనివర్సిటీలలో పలు కోర్సులకు మంగళం ● మరిన్నింటిని రద్దు చేసే యత్నంలో ప్రభుత్వం ● అగ్రి పాలిటెక్నిక్ కళాశాలలకు చెల్లిన కాలం ● సర్కారు వైఖరిపై విదార్థి సంఘాల ఆగ్రహంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావిప్లవానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు బంగారు బాటలు వేసింది. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత విద్యారంగాన్ని విధ్వంసం చేస్తోంది. కార్పొరేట్కు కొమ్ముకాస్తూ గ్రామీణ విద్యార్థుల భవితను ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. అందులో భాగంగా విశ్వవిద్యాలయాల్లో పలు కోర్సులకు మంగళం పాడేసింది. అడ్మిషన్లు లేవనే సాకుతో మరిన్నింటిని తొలగించేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ పాలిటెక్నిక్ను పూర్తిగా రద్దు చేసేసింది. అలాగే యానిమల్ హస్బెండరీ కోర్సును సైతం చెల్లుచీటీ రాసేందుకు సన్నద్ధమవుతోంది. ఇక సాంకేతిక విద్యకు అధ్యాపకులను నియమించకుండా నిర్వీర్యం చేస్తోంది.ఆశగా ఎదురు చూశాం ఈ ఏడాది అగ్రి పాలిటెక్నిక్ కోర్సులో చేరాలని ఎంతో ఆశగా ఎదురు చూశా. మా సమీప బంధువు ఓ అమ్మాయి వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి విలేజ్ అగ్రికల్చరల్ ఆఫీసర్గా పనిచేస్తోంది. నేను కూడా ఉద్యోగం సాధించి రైతులకు సేవ చేయాలనుకున్నా. కానీ ఈ ఏడాది తిరుపతిలో ఆ కోర్సును రద్దు చేశారని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. – సౌమ్య, విద్యార్థిని, తిరుపతి బాధగా ఉంది తిరుపతిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మా అబ్బాయిని చదివించాలని అనుకున్నాం. కానీ ఈ ఏడాది నుంచి కోర్సును పూర్తిగా ఎత్తివేశారని తెలిసి చాలా బాధగా ఉంది. వ్యవసాయ విద్యను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సును దూరం చేయడం తగదు. దీంతో వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. – రామయ్య, రైతు, తిరుపతి రూరల్ భ్రష్టుపట్టించారు వర్సిటీలలో గ్రామీణ ప్రాంత పిల్లలు ఎంతో ఆసక్తితో చేరే ఆర్ట్స్ గ్రూప్లను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వ్యవసాయ విద్యను దూరం చేసే నిర్ణయాలు మంచివి కావు. వ్యవసాయ పాలిటెక్నిక్లో అడ్మిషన్లు రద్దు చేసి మూసివేయడం దారుణం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు. – మురళీధర్, వైఎస్సాఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి తిరుపతి సిటీ : గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి విశ్వవిద్యాలయాలే దిక్కు. అయితే వర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందే ఆర్ట్స్ గ్రూప్లను క్రమేణా కుదిస్తూ వస్తోంది. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయంటూ మెర్జింగ్ పేరుతో పలు కోర్సులను ఇప్పటికే రద్దు చేసింది. ఈ ఏడాదిలో వర్సిటీలలో సుమారు 12 కోర్సులను తొలగించింది. టెక్నాలజీ పేరుతో ఏఐ, డేటా సైన్స్ అంటూ నూతన కోర్సులను ప్రవేశపెట్టినప్పటికీ బోధనకు నిపుణులైన అధ్యాపకులు లేకపోవడంతో సాంకేతిక విద్య సైతం గాడి తప్పుతోంది. మూతపడిన వ్యవసాయ పాలిటెక్నిక్ గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుంచి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతో ఆసక్తితో చేరే వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సును పూర్తిగా తొలగించారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ ఎన్జీ రంగా వర్సిటీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు నిరాశే మిగిలింది. అదే దారిలో వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సుకు సైతం త్వరలో గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవేశాలు తక్కువగా ఉన్నాయనే నెపంతో పలు కోర్సులకు మంగళం పాడుతున్న ప్రభుత్వ వైఖరిపై అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉన్నత విద్య దూరమవుతోంది ప్రభుత్వం కారణంగా గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోంది. అందుకే వర్సిటీలలో పలు కోర్సులను రద్దు చేసింది. వ్యవసాయ పాలిటెక్నిక్తో ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అలాంటి కోర్సులను రద్దు చేసి ఏకంగా కళాశాలలనే మూసివేయడం దారుణం. – ఆర్.ఆషా, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి, తిరుపతి కోర్సుల రద్దు సరికాదు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిస్థాయిలో ఇంత వరకు విడుదల చేయలేదు. విద్యార్థుల ప్రవేశాలు తగ్గుముఖం పట్టడంతో వర్సిటీలు దయనీయస్థితిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చేపట్టకుండా కోర్సులను రద్దు చేయడం సరికాదు. – ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి, ఏఐఎస్ఎఫ్, తిరుపతి నిర్వీరం చేసే కుట్ర వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుకు ప్రభు త్వం మంగళం పాడేసింది. ఇదే తరహాలో మరిన్ని కోర్సులను రద్దు చేసి కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసేందుకు కుట్ర పన్నుతోంది. వర్సిటీలలో పెద్ద సంఖ్యలో మెర్జింగ్ పేరుతో పలు కోర్సులను రద్దు చేయడం దారుణం. – ఎస్.అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి -
లైంగిక దాడికి యత్నం
చౌడేపల్లె : ఇల్లు కట్టించడంతో పాటు అన్నీ తానై చూసుకుంటానని అసభ్యకరంగా మాట్లాడుతూ.. లైంగిక దాడికి యత్నించాడని కాగతి పంచాయతీ పలగార్లపల్లెకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదంటూ ఆదివారం ఆమె కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి కథనం.. పలగార్లపల్లెకు చెందిన గంగరాజుకు ప్రాజెక్టు సమీపంలోని ఊదరకుంట వద్ద వ్యవసాయ పొలం ఉంది. ఈనెల 11వ తేదీనా ఆమె తన భర్త గంగరాజు పొలం వద్ద ఉండగా మధ్యాహ్నం అన్నం తీసుకొని బయలు దేరగా మార్గ మధ్యలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. లైంగిక దాడికి యత్నించగా కేకలు వేయడంతో పరారైనట్లు పేర్కొంది. ఈ ఘటనపై అదే రోజు రాత్రి వెళ్లి అడగ్గా తన అనుచరులతో కలిసి శ్రీనివాసులు తనతో పాటు తన భర్త కుటుంబీకులపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఈనెల 12 వతేదీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. ఆర్థిక కారణాలతో వ్యక్తి ఆత్మహత్య చిత్తూరు అర్బన్ : కుటుంబ ఆర్థిక కారణాలు వేధించడంతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసుల కథథనం మేరకు చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఇన్భనాథన్(58) శనివారం సాయంత్రం కుటుంబీకులకు గిరింపేట వరకు వాకింగ్ వెళుతున్నాని చెప్పాడు. తీరా క్రిష్ణవేణి కళాశాల ప్రాంతంలో పురుగుమందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. కాగా భార్య షీలా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆర్థిక కారణాలతో మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లారీ బీభత్సం – మామిడిచెట్లు ధ్వంసం గుడిపాల : రోడ్డుపైన వెళ్తూ ఓ లారీ అదుపు తప్పడంతో వ్యవసాయ పొలంలోకి వెళ్లి పొలం పక్కన ఉన్న రాతి కూసాలను ఢీకొంటూ మామిడి చెట్లను ధ్వంసం చేసింది. బెంగుళూరు నుంచి తమిళనాడులోని నామక్కల్కు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం తాగి మద్రాస్ క్రాస్ రోడ్డు వద్ద జ్యోతీశ్వర్రెడ్డికి చెందిన రైతు మామిడితోటలోకి లారీని వదిలేశాడు. ఎదురుగా ఎవ్వరూ రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో వ్యవసాయ పొలంలోకి ప్రవేశించి రాతి కూసాలు ధ్వంసం కావడంతో పాటు మామిడిచెట్లు ధ్వంసం అయ్యాయి. -
కొండంత జనం
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన బోయకొండ ఆలయం భక్తులతో ఆదివారం కిక్కిరిసింది. అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం న కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండపై ఎటుచూసినా భకజన సందోహం నెలకొంది. అమ్మవారిని బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి నేవైద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయంలోని క్యూలైన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. గంటల తరబడి నిరీక్షించి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. సుమారు 50 వేల మందికిపైగా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఊహంచని రీతిలో వాహనాల్లో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యతో భక్తులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. కిక్కిరిసిన బోయకొండ ఆలయం రద్దీగా మారిన క్యూలు బోయకొండ ఒక్క రోజు ఆదాయం రూ.28.60 లక్షలు బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రూ:28.60 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఆలయంలో భక్తులకు విక్రయించిన వివిధ రకాల సేవా టికెట్లు, ప్రసాదం, తీర్థం టికెట్లు ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు చెప్పారు. -
ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
● ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం విఫలం ● వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు : అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించార ని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఏడాది పాలనలోనే ప్రజా విశ్వాసం కోల్పోయారని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం మున్సి పాలిటీ, రూరల్ మండలాల్లో ‘బాబు షూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమా న్ని వేల మందితో విడివిడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాక ఆయన ప్రజలను మోసగించడంలో కొత్తేమీ కాదన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసాల తోనే సాగిపోతోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం చేస్తే ఒక్కొక్కరూ తిరుపతి వెళ్లాలంటే మూడు జిల్లాల బస్సులు మారాల్సి ఉందన్నారు. ఇలాంటి ప్రయాణాలతో ఉపయోగం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి శ్రీకాకుళం నుంచి కుప్పం దాక ఉచిత ప్రయాణాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందని, సూపర్–6లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక టమాటా, మామిడి, మిర్చి, పొగాకు రైతు లు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయి న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న జగన్ మోహన్రెడ్డి పర్యటనలకు ప్రజలను రానివ్వకుండా వేల మంది పోలీసులతో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ప్రజలను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. కానీ జగన్ మోహన్రెడ్డిపై ఉన్న నమ్మకం , అభిమానంతో ప్రజలకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వేల మంది తరలివచ్చి పర్యటనలను జయప్రదం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రజాభిమానం చూసి వణుకు జగన్ సభలకు వస్తున్న ప్రజాభిమానం చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి వణుకు పుడుతోందని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్.జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీతో సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, నియోజకవర్గ నాయకుడు నూతనకాల్వ శ్రీనాథరెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్ షరీఫ్, రాష్ట్ర యువత కార్యదర్శి కొత్తపల్లి చెంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్రెడ్డి, జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ముతో పాటు పార్టీ పట్టణ, రూరల్ అధ్యక్షులు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి లతో పాటు సర్పంచ్లు, ఎంపీటీిసీలు, మాజీ ఎంపీపీలు, వైఎస్సార్సీపీ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తెలియజేయాలి... ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సూపర్–6ను అమలు చేయకపోవడం, మేనిఫెస్టోను పట్టించుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘బాబు షూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రతి రోజు తెలియజేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో పాటు పార్టీ క్యాడర్ పూర్తిగా ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చే సమాచారాన్ని ప్రజలకు వివరించాలన్నారు. -
‘మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం’
తిరుపతి: తనకున్న ఒకే ఒక్క బంధం అన్న అని, అతన్ని పొట్టనపెట్టుకున్నారని హత్య గావించబడ్డ శ్రీనివాసులు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం జరగాల్సిందేనని, దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని ఆమె పేర్కొంది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘ మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. నాకున్న ఒక్క బంధం అన్నయ్య. నా అన్నను నాకు లేకుండా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ మాకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ రావాలి.. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి. మేము జనసేన పార్టీలోనే ఉన్నాం. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. అవసరమైతే వేరే పార్టీ సపోర్ట్ తీసుకునైనా మా పోరాటం కొనసాగిస్తాం’ అని మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి స్పష్టం చేసింది. ‘ మా అన్న ఎప్పుట్నించో జనసేన పార్టీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మా అన్న కాలుకు దెబ్బ తగిలిందని కబురు వచ్చింది. చూడటానికి వెళ్లాం. చుట్టూ నలుగురికి పైగా ఉన్నారు. మా అన్నను మాతో ఏమీ మాట్లాడనివ్వలేదు. ఆ తరువాత మా అన్నను లేకండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే. వారిని వదిలేస్తే మరొకటి చేస్తారు.’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల కోసం కింద లింక్ క్లిక్ చేయండి..వినుత పన్నాగం..! -
బాండ్లు.. బాబు, పవన్ మోసం ప్రజలకు తెలియాలి: పెద్దిరెడ్డి
సాక్షి చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి తీసుకుని వెళ్ళాలి అని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మున్సిపాలిటీ, పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల్లో వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్సార్సీపీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ మాత్రమే కాకుండా 143 హామీలు ఇచ్చారు. ప్రతీ ఇంటికి ఇంత ఇస్తాం.. అంత ఇస్తాం అని టీడీపీ ప్రచారం చేసింది. వాటితో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి తీసుకుని వెళ్ళాలి. ప్రతీ ఇంటికి వీరి మోసాలు తెలియాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. కరోనా సమయంలో కూడా ఎక్కడా వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. కానీ, కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు చెడ్డ పేరు తెచ్చుకుంది. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. గతంలో రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. కరెంట్ ఛార్జీలు పెంచమని రామారావు హామీ ఇస్తే.. ఆ మాటను కూడా తుంగలో తొక్కి ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.2014లో కూడా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు. తల్లికి వందనానికి 13వేల కోట్లు అవసరమైతే కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. ఇక ఉచిత బస్సు అని చెప్పి అది స్థానికంగా మాత్రమే అని మెలికలు పెట్టారు.. అది కూడా ఇంకా అమలు కాలేదు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు గ్రామ గ్రామానా వివరించాలి’ అని పిలుపునిచ్చారు. -
వినుత పన్నాగం!
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. ఎవరూ లేని అనాథగా మిగిలాడు. తన అమ్మమ్మ వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. కొన్నేళ్ల తర్వాత తన అభిమాన హీరో పవన్కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరాడు. ఆపై పార్టీ శ్రీకాళహస్తి ఇన్చార్జ్ వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా.. డ్రైవర్గా విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి నమ్మినబంటుగా మెలిగాడు. ఏమైందో ఏమోగానీ ఇటీవల అతనిపై అనుమానం పెంచుకున్నారు. విధుల నుంచి సైతం తొలగించేశారు. వ్యక్తిగత రహస్యాలు, పార్టీ కార్యకలాపాలు బయటపెడుతున్నాడన్న కక్షతో అతికిరాతకంగా చంపేశారు. మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి ఓ నదిలో పడేసి చేతులు దులుపుకోవాలని చూశారు. అయితే అక్కడి పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది హాట్టాపిక్గా మారింది.ఏర్పేడు : చిన్న వయస్సులోనే పెద్ద పదవి వరించింది.. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తూ.. పబ్లిసిటీ స్టంట్తో నెట్టుకొచ్చిన కోట వినుత అసలు బండారం బట్టబయలైంది. అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని శ్రీకాళహస్తిలోని ఓ కీలక నాయకుడికి చేరవేస్తున్నాడని భావించింది. తన వద్ద డ్రైవర్గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసినట్టు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర స్థాయిలో విచారిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. సాధారణ యువతి నుంచి.. రేణిగుంటకు చెందిన నగరం వినుత తండ్రి నగరం భాస్కర్ స్థానికంగా మెడికల్ ల్యాబ్ను నిర్వహిస్తున్నాడు. నగరం వినుత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన కళాశాలలో పరిచయమైన చిత్తూరు జిల్లా, బంగారుపాళెంకు చెందిన కోట చంద్రశేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ జనసేన పారీ్టలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పదవి దక్కడం.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5 వేల ఓట్లు పడడంతో డిపాజిట్ కోల్పోయింది. ఎలాగైన వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆమెపై పారీ్టలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి వినుతను పట్టించుకోవడం మానేశారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీరి్ణంచుకోలేని కోట చంద్రశేఖర్నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పారీ్టలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.ఎవరీ శ్రీనివాసులు ? శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు ఏడేళ్ల వయస్సులోనే అతడి తల్లిదండ్రులు వెంకటరాయుడు, గీత చనిపోయారు. వీరి స్వగ్రామం వెంకటగిరి సమీపంలోని తోలుమిట్ట. అయితే శ్రీనివాసులు, అతడి సోదరిని అమ్మమ్మ రాజేశ్వరి శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెంకు తీసుకొచ్చి పెంచి పోషించింది. శ్రీనివాసులుకు పవన్కల్యాణ్పై ఉన్న అభిమానంతో జనసేన పారీ్టలో కార్యకర్తగా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన కోట వినుతకు దగ్గరయ్యాడు. 15 ఏళ్లుగా వారికి నమ్మిన బంటుగా ఉండడంతో ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా, కారు డ్రైవర్గా చేరాడు. ప్రతి కార్యక్రమంలోనూ వారిని వెంటబెట్టుకుని ఉంటూ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు. జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు వినుత దూరంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆ వివరాలు వెల్లడించారు. చెన్నైలో వినుతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు. -
వర్క్ఆర్డర్లను పదిరోజుల్లో పూర్తి చేయాలి
చిత్తూరు కార్పొరేషన్: పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్లను పదిరోజుల్లో పూర్తి చేయాలని ట్రాన్స్కో డైరెక్టర్ గురవయ్య ఆదేశించారు. శనివారం ఎస్ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్ డివిజన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూతలపట్టు, యాదమరి, ఐరాల రూరల్స్ ఏఈలు నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు డబ్బులు చెల్లించి ట్రాన్స్ఫార్మర్లు కోసం వేచి చూస్తున్నారన్నారు. వారికి సకాలంలో వ్యవసాయ సర్వీసులను విడుదల చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని చెప్పారు. వేగంగా మరమ్మతులు చేయడానికి చిత్తూరులో అందులోబాటులో ఉన్న నూతన ఓఆర్ఎంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్డివిజన్ పరంగా పరిశీలన పనులు డీఈలు ఇంటర్ చేంజ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి లైన్ సమస్యలను పరిష్కారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వరమైన ఆర్డీఎస్ఎస్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి సారీ సాకులు చెబుతూ పనులను ఆలస్యం చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈలు మునిచంద్ర, జగదీష్, అమర్బాబు, ఏఓ ప్రసన్న ఆంజనేయులు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?
శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ డ్రైవర్ దారుణ హత్య ● రాజకీయ వ్యూహాలు చేరవేస్తున్నాడని గత నెలలో డ్రైవర్గా తొలగింపు ● వ్యక్తిగత రహస్యాలు బట్టబయలవుతాయని కడతేర్చిన వైనం ● జనసేన నుంచి వినుతను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు ఏర్పేడు : చిన్న వయస్సులోనే పెద్ద పదవి వరించింది.. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తూ.. పబ్లిసిటీ స్టంట్తో నెట్టుకొచ్చిన కోట వినుత అసలు బండారం బట్టబయలైంది. అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని శ్రీకాళహస్తిలోని ఓ కీలక నాయకుడికి చేరవేస్తున్నాడని భావించింది. తన వద్ద డ్రైవర్గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చైన్నెలోని ఓ నదిలో పడవేసినట్టు చైన్నె పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర స్థాయిలో విచారిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. సాధారణ యువతి నుంచి.. రేణిగుంటకు చెందిన నగరం వినుత తండ్రి నగరం భాస్కర్ స్థానికంగా మెడికల్ ల్యాబ్ను నిర్వహిస్తున్నాడు. నగరం వినుత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన కళాశాలలో పరిచయమైన చిత్తూరు జిల్లా, బంగారుపాళెంకు చెందిన కోట చంద్రశేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పదవి దక్కడం.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5 వేల ఓట్లు పడడంతో డిపాజిట్ కోల్పోయింది. ఎలాగైన వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆమైపె పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి వినుతను పట్టించుకోవడం మానేశారు. జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు వినుత దూరంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆ వివరాలు వెల్లడించారు. చైన్నెలో వినుతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు. జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చైన్నె పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చైన్నె పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చైన్నెకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చైన్నె పోలీసులు వెల్లడించారు. -
సన్నిధి వినాయకస్వామి ఆలయంలో చోరీ
నగరి : పట్టణంలోని బేరివీధిలో ఉన్న సన్ని ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. హుండీ తాళా లు పగులగొట్టి చోరీ చేయడంతోపాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. శనివారం ఉదయం యథావిధిగా పూజలు చేయడానికి అర్చకుడు ఆలయానికి వచ్చాడు. అక్కడ హుండీ, సీసీ కెమెరాలు పగులగొట్టి ఉండడం చూసి, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ విక్రమ్ ఆదేశాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆలయానికి సమీపంగా ఉన్న నివాసాల ముందు అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితుల ఆచూకీ ఆరా తీస్తామని సీఐ తెలిపారు. మహిళ అదృశ్యం గంగవరం: మండలంలోని కొత్తపల్లికి చెందిన సుబ్రమణ్యం రెడ్డి భార్య మునిరత్నమ్మ(61) నా లుగు రోజులుగా కనిపించకుండా పోయిందని ఆమె బంధువులు శనివారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. బస్సును ఢీకొన్న ఐచర్ వాహనం బంగారుపాళెం : మండలంలోని మహాసముద్రం టోల్ప్లాజా వద్ద శనివారం బస్సును ఐచర్ వాహనం ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. అమరరాజా ఫ్యాక్టరీకి చెందిన బస్సు కార్మికులను తీసుకు వెళ్లేందుకు టోల్ప్లాజా వద్ద ఆగింది. అదే సమయంలో పలమనేరు నుంచి చిత్తూరు వెళుతున్న ఐచర్ వాహనం బస్సును వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఐచర్ వాహన డ్రైవర్ సలీంకు బలమైన గాయం తగలడంతో హైవే అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరకట్నం కేసు నమోదు పుంగనూరు (చౌడేపల్లె): అధిక కట్నం తేవాలని వివాహితను చిత్రహింసలకు గురి చేసిన నలు గురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రుక్ష్మినందనాయుడు శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని నల్లగుట్లపల్లెకి చెందిన స్వప్నకుమారితో కేవీ పల్లె మండలం పెద్దతాండాకు చెందిన గోవిందనాయక్ కుమారుడు బాలాజీనాయక్తో గత రెండేళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొన్ని రోజులపాటు సజావుగా సాగి న ఈ కుటుంబంలో అధిక కట్నం చిచ్చురేపింది. నిత్యం అధికకట్నం రూ.5 లక్షలు తేవాలని వేధించిన భర్త బాలాజీనాయక్, మామ గోవిందనాయక్, శ్రీదేవి, నూర్పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
క్యాబేజీ అధరహో
● ప్రస్తుతం టన్ను ధర రూ.12 వేలకు పైగా ● తోటల వద్దే కొంటున్న బయటి రాష్ట్రాల వ్యాపారులు ● నెలకు ముందు టన్ను క్యాబేజీ ధర రూ.వెయ్యి మాత్రమే ● అడిగేవారు లేక తోటల్లోనే పంటను వదిలేసిన రైతులు పలమనేరు ప్రాంతంలో వ్యాపార పంటల్లో క్యాబేజీ ఒకటి. ఈ పంటకు మొన్నటి వరకు ధర లేక.. అడిగేవారు లేక..పంట పొలాల్లోనే వదిలేశారు. ఈ పంట సాగుపై ఆసక్తి చూపలేదు. టన్ను రూ.వెయ్యి కూడా పలకని క్యాబేజీ నేడు అమాంతం రూ.12 వేలు పలుకుతోంది. దీంతో పుడమిపుత్రుడు పొంగిపోతున్నాడు. పలమనేరు: మొన్నటి దాకా క్యాబేజీని కొనేవారు లేక పంట సాగు చేసిన రైతులు పొలంలోనే పంటను వదిలేశారు. కనీసం టన్ను రూ. వెయ్యికి ఇస్తామన్నా కొనేవారు లేకుండా పోయారు. అ లాంటి క్యాబేజీ ధర ఇప్పుడు టన్ను రూ.12 వేల కు పైమాటే. పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రైతుల తోటల వద్దకొచ్చి పంటను కొని తీసుకెళుతున్నారు. దీంతో ఇప్పుడు క్యాబేజీ సాగు చేసి న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు సాగుకు అనుకూలం పలమనేరు ప్రాంతం శీతల వాతారణాన్ని కలిగి ఉంటుంది. ఇదే వాతారణం పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోనూ ఉంది. దీంతో అక్కడి రైతులు పండించే పలు కూరగాయల పంటలను ఇక్కడి రైతులు కొన్నేళ్లుగా సాగు చే స్తున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు ఉద్యానశాఖ డివిజన్ పరిధిలో 600 హెక్టార్లలో క్యాబేజీని సాగు చేశారు. మొన్నటి దాకా అడిగే దిక్కేలేదు గత కొన్ని నెలలుగా క్యాబేజీ ధరలు అమాంతం తగ్గాయి. గత నెలలో టన్ను కేవలం రూ.వెయ్యికి చేరింది. పంటను కొనేవారు లేక రైతులు పంటను కోయకుండా చేలల్లోనే వదిలిపెట్టేశారు. దీంతో రైతులకు పంట పెట్టుబడి సైతం దక్కక నష్టపోవాల్సి వచ్చింది. ధరలు పడిపోవడంతో చాలామంది రైతులు క్యాబేజీ నాటడానికి భయపడ్డారు. ధైర్యం చేసి పంట సాగు చేసిన రైతులకు ఇప్పుడు లాటరీ తగిలినట్లు అయ్యింది. నేడు తోటల వద్దే కొనుగోలు తోటల వద్దకే వ్యాపారులు వచ్చి క్యాబేజీ పంటను కొనుగోలు చేసి, అక్కడే గ్రేడింగ్ చేసి బయటి రాష్ట్రాలకు లారీల్లో తీసుకెళుతున్నారు. ముఖ్యంగా చత్తీస్ఘడ్, రాయపూర్, భువనేశ్వర్, కటక్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సరుకును తీసుకెళుతున్నారు. స్థానిక మార్కెట్లలోనూ క్యాబేజీకి మంచి డిమాండ్ నెలకొంది. ధైర్యం చేసి పంట సాగుచేశా మా ప్రాంతంలో క్యాబేజీ సాగు చేసి ధరల్లేక తోటల్లోనే వదిలేసిన వాటిని చూశా. కానీ చూద్దాం జూలైలో ధరలు వస్తాయనే ధైర్యంతో పంటను సాగు చేశా. ఒకటిన్నర ఎకరాలో పంటను ఒబ్బిడి చేశా. 30 టన్నుల దాకా ఉత్పత్తి వచ్చింది. ధరలు బాగుడడంతో సంతోషంగా ఉంది. – జగదీష్, రైతు, రామాపురం, పలమనేరు మండలం మంచి గిట్టుబాటు ధర నేను క్యాబేజీ పంటను నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా. గతంలో ఎప్పుడూ కిలో రూపాయికి పడిపోలేదు. కానీ ఈ దఫా సరుకు కొనేవారు లేకుండా పోయారు. దీంతో చాలామంది రైతులు క్యాబేజీని సాగు చేయలేదు. ఇప్పుడు టన్ను రూ.12 వేలు దాటింది. తోటలున్న రైతులకు మంచి గిట్టుబాటుగా మారింది. – హరి, రైతు, రామాపురం, పలమనేరు మండలం -
స్వచ్ఛనీటి సరఫరా ప్రభుత్వాల బాధ్యత
నగరి : ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు, ఆల్ ఇండియా బుద్దిస్టు సొసైటీ జాతీయ అధ్యక్షుడు భీమ్రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. తమిళనాడు తిరుత్తణిలో నిర్వహించిన జైభీమ్ మహానాడులో పాల్గొనడానికి వెళుతూ నగరి పట్టణంలోని దళిత సంఘాల ఆహ్వానం మేరకు శనివారం మధ్యాహ్నం బస్టాండ్ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. స్థానిక నేతలు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు విచ్చేస్తుంటానని తన ఆర్గనైజేషన్ బుద్దిస్టు సొసైటీ అక్కడ ఉందన్నారు. ఇటీవల రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, సమ్తా షైనింగ్ వెల్ అండ్ గుడ్డే సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లు కూడా ప్రారంభించామన్నారు. ఈ మూడు ఆర్గనైజేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పునాది వేసిందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ మూడు ఆర్గనైజేషన్లను స్థాపించడమే తన ధ్యేయమన్నారు. ఈ ఆర్గనైజేషన్లు వెనుకబడిన సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందన్నారు. ఎన్నో పార్టీలు వస్తున్నాయి అంబేడ్కర్ పేరును వాడుకుంటున్నాయని, ఆ పార్టీలకు మనం ఓటేస్తున్నామని, అయితే ఆ పార్టీ లు మన సామాజిక వర్గానికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరునావుక్కరసు, రాష్ట్ర అధ్యక్షులు గజేంద్ర, ఆర్పీఐ పార్థసారధి, బీఎస్పీ నేత ధనంజేయులు, ఉమాపతి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు బీడీ భాస్కర్, లాయర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఔను.. వాళ్లు ఒక్కటవుతున్నారు
భార్యాభర్తల మధ్య అంతరాలు.. చిన్న చిన్న తగవులు.. ఇంకొద్దిగా మనస్పర్థలు.. మనస్సు తట్టి హృదయాంతరాల్లోకి చూస్తే తమను తక్కువ చేశారనే భావన.. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులపై అవగాహన లేమి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం.. సమస్యలు విని సర్దుబాటు చేసే వారు లేకపోవడంతో పలు జంటలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి. అలాంటి జంటల సమస్యలను పరిష్కరించి, మళ్లీ వారి కాపురాలను చక్కదిద్దుతోంది ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం. నాటి వైఎస్సార్ సీపీ పాలనలో వేసిన ఈ బీజం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. చిత్తూరు అర్బన్: మహిళల హక్కులు, దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాటిన బీజం.. ఇపుడు వృక్షంగా ఎదిగింది. అదే ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం. నాడు దిశ స్టేషన్గా నామకరణం చేసి మహిళలకు అండగా నిలిచిన స్టేషన్ను.. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళా స్టేషన్గా పేరు మార్చి సేవలు అందిస్తోంది. నాటి ప్ర భుత్వంలో ఉన్న దిశ ఇపుడు పే రు మార్చినా.. అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతోంది. చిత్తూరు నగరంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శనివారం ఎస్పీ మణికంఠ చందోలు ఈ కేంద్రం పనితీరును మీడియాకు వివరించారు. విభేదాలు పరిష్కరించి.. చిత్తూరు నగరంలోని దర్గా కూడలిలో ఉన్న ఫ్యామిలీ కౌ న్సెలింగ్ కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మహిళలు, దంపతుల సమస్యలను పరిష్కరించడమే ఈ కేంద్రం లక్ష్యం. పోలీసులతో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మానసిక నిపుణులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా శిశు సంరక్షణ విభాగం ఉద్యోగులు ఓ కమిటీగా ఉంటారు. ఇంట్లో భర్తతో గొడవలు, అత్త–మామ, వదిన–తోడికోడళ్లు.. చాలా వరకు కేసుల్లో భర్త చెబితే నేను ఎందుకు వినాలి అని భార్య.. భార్యకు గౌరవం ఇవ్వడం ఏమిటని భర్త, అత్తా–మామాల చాదస్తం పడలేకపోతున్నామని కొందరు, కోడలు సరిగా చూసుకోవడం లేదని మరికొంరు స్టేష న్ మెట్లు ఎక్కుతుంటారు. ఇలా ఎవరి నుంచైనా సమస్య లు వస్తే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లడం, ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయడం చేసేవాళ్లు. కానీ ఈ కేంద్రంలో తొలుత వ చ్చి ఫిర్యాదు ఇచ్చినా.. ఎదుటి వ్యక్తులను స్టేషన్కు పిలిపిస్తా రు. ఇరుపక్షాల సమస్యలు విన్న తరువాత సమస్యకు పరిష్కారం చూపించడంతోపాటు కొద్ది సమయం కూడా ఇస్తా రు. సమస్య సమసిపోతే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండ దు.. అలా వీలుకాని పక్షంలో చట్టపరంగా ముందుకు వెళుతారు. 482 కేసుల పరిష్కారం.. ఏడాది కాలంలో ఈ కేంద్రంలో 482 ఘటనల్లో ఎఫ్ఐఆర్లు కట్టకుండా సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఆవేశంలో తలెత్తిన విభేదాలకు కొద్దిగా సమయమిచ్చి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలకు దారులు చూపిస్తున్నారు. ఈ కేంద్రంలో జిల్లాకు చెందిన కేసులే కాకుండా.. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాలకు చెందిన 52, విదేశాల నుంచి వచ్చిన మూడు కుటుంబాల్లోని విభేదాలను సైతం పరిష్కరించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 748 కుటుంబ సదస్సులు నిర్వహించి, కుటుంబంలో తలెత్తే సమస్యలు ఎలా అధిగమించాలో పాఠశాలల్లోనే పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. సత్ఫలితాలిస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం వైవాహిక బంధంలో సమస్యలు తీరుస్తున్న ఖాకీలు నాటి ప్రభుత్వంలో దిశ.. కూటమిలో మహిళాస్టేషన్ పేరు మారినా.. ప్రజలకు ఉపయోగపడుతున్న సెంటర్ శృతి మించితే.. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రంలో వీలైనంత వరకు ఓ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేస్తారు. కానీ కొన్ని కేసుల్లో భార్యను శారీరకంగా హింసించడం, కట్నం కోసం వేధించడం లాంటివి కూడా వస్తుంటాయి. వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇలా 181 మందిపై గృహహింస కేసు నమోదుకు సూచించామని, 58 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్టేషన్కు వెళితే తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి శనివారం స్టేషన్లో సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. -
కేసులు పెట్టండి.. లోపలెయ్యండి!
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సూపర్ సక్సెస్ కావడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఆ కార్యక్రమానికి తండోపతండాలుగా తరలి వచ్చిన రైతులు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే కుట్రలకు పదును పెట్టింది. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు రైతులు, అభిమానులు రాకుండా కూటమి పెద్దలు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని పోలీసులందరినీ రంగంలోకి దింపి అడుగడుగునా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు పలువురిని బైండోవర్ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులు, అభిమానులను చూసి కూటమి ప్రభుత్వం షాక్కు గురైంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్పై దాడి అంటూ బూచిగా చూపి కొందరిపై, రోడ్లపై మామిడి కాయలు పారబోశారంటూ మరికొందరిపై కేసులు నమోదు చేయించారు. ఇది చాలదన్నట్లు పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్, గంగాధర నెల్లూరు, చిత్తూరుకు చెందిన వినోద్, మోహన్, చక్రిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని జైల్లో పెట్టేందుకు బలమైన సాక్ష్యాలను సృష్టించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.కక్షగట్టి కేసుల నమోదుఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్పై దాడి చేశారనే నెపంతో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరి కొందరి పేర్లు చెప్పించేందుకు వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోగ్రాఫర్కు వంద మీటర్ల దూరంలో ఉన్న నేతలను సైతం గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మార్కెట్ యార్డులోకి చొరబడ్డారని, మామిడి కాయలను తొక్కారని మరికొందరిపై కేసులు పెట్టేందుకు వ్యవసాయ, సంబంధిత శాఖ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది. మామిడి కాయలు కింద పారబోసిన ఘటనలో సంబంధమే లేని ర్యాంపు యజమానిపై కేసు నమోదు చేసేందుకు యతి్నస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు వైఎస్సార్సీపీ నేతలే వారి తోటలోని కాయలు తీసుకొచ్చి కావాలనే రోడ్డుపై పారబోశారని కేసులు నమోదు చేశారు. తాజాగా సమీపంలోని ర్యాంపు యజమానే మామిడి కాయలు పంపించారని, అతనిపైనా కేసు నమోదు చేసేందుకు సాక్ష్యం కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న వారిపై దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఎల్లో మీడియా దు్రష్పచారం చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆగ్రహం వ్యక్తం చేసిన వారిపై ఎల్లో గ్యాంగ్ ఫోన్లు చేసి తీవ్రంగా బెదిరిస్తోంది. -
కుప్పం ఎయిర్పోర్ట్కు అంత భూమా?
శాంతిపురం: సీఎం చంద్రబాబును నలబై ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్న కుప్పం నియోజకవర్గంలోని రైతుల గోడు అరణ్య రోదనే అవుతోంది. విమానాశ్రయం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పంట భూములు తీసుకునే ప్రయత్నం చేస్తుండడంతో అన్నదాతలు లబోదిబో మంటున్నారు. ప్రతిపాదిత విమానాశ్రయం కోసం రామకుప్పం, శాంతిపురం మండలాల సరిహద్దుల్లో ఏకంగా 2,139.47 ఎకరాలను సేకరిస్తోంది. దీనికోసం పెద్దల డైరెక్షన్లో అధికారులు రైతులను బెదిరించి భూములు తీసుకొంటున్నారు. ‘‘మంచిగా ఇస్తే సరి.. ఎకరాకు రూ 16 లక్షలు పరిహారం వస్తుంది. అడ్డంపడితే రూ.10 లక్షల వంతున డిపాజిట్ చేసి భూములు తీసుకుంటాం’’ అని గదమాయిస్తున్నారు. కాదని కోర్టుకు వెళ్తే చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తీసుకుంటామని హెచ్చరిస్తుండడం గమనార్హం. కొందరు రైతులు ఈ వ్యవహారాన్ని వీడియో తీసుకున్నారు. భూములు ఇవ్వడం ఇష్టం లేకున్నా... తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ముందుకొచ్చారు. ప్రాణాలు పోయినా భూమి వదులుకునేది లేదని మరికొందరు రైతులు తెగేసి చెబుతున్నారు. 90 నిమిషాల్లోపే బెంగళూరు ఎయిర్పోర్ట్కు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కుప్పంకు వంద కిలోమీటర్ల లోపే ఉంది. దీనికి చేరేందుకు నాణ్యమైన రోడ్డు రవాణా ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజలు సూచిస్తున్నారు. ఇప్పటికే పాక్షికంగా పూర్తయిన చెన్నై–బెంగళూరు ఎక్స్ప్రెస్ వేతో నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి 60 నుంచి 90 నిమిషాల్లో కెంపేగౌడ విమానాశ్రయం చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో కుప్పంలో విమానాశ్రయం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక భారాన్ని మోస్తూ ఎంతమంది స్థానికులు రాకపోకలు సాగించగలరని నిలదీస్తున్నారు. బెంగళూరుకు డబుల్ డెక్కర్లో వెళ్లాలంటే రూ.315 చార్జీ అని, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో రూ.50, రూ.25తో వెళ్లొచ్చని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో 95 శాతం పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నారని చెబుతున్నారు. ఎయిస్ట్రిప్ నుంచి ఎయిర్పోర్ట్ కుప్పంలో తొలుత ఎయిర్్రస్టిప్ నిర్మాణానికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం 558.64 ఎకరాల సేకరణకు దిగింది. రామకుప్పం మండలంలో 496.24 ఎకరాలు, శాంతిపురం మండలంలో 62.40 ఎకరాలను తీసుకునేందుకు 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇ చ్చింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చారు. అంతకుముందే రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా టైడిల్ సిల్క్ పరిశ్రమ కోసం అంటూ 30సొన్నేగానిపల్లి, అమ్మవారిపేట రెవెన్యూలలో దాదాపు 175 ఎకరాలను లాక్కుని రికార్డులలో ప్రభుత్వ భూమిగా మార్చారు. అయితే, ఇప్పటికీ సాగు వదలని ఇక్కడి రైతులు న్యాయం చేయాలని పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఎయిర్్రస్టిప్నకు బదులు ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని అధికార యంత్రాంగం ప్రకటించింది. రామకుప్పం మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,021.765 ఎకరాలు, శాంతిపురం మండలం మూడు రెవెన్యూ గ్రామాల నుంచి 384.074 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది గతంలో తీసుకున్న 558.64 ఎకరాలకు అదనం. టైడిల్ సిల్్కకు తీసుకున్న 175 ఎకరాలనూ ఎయిర్పోర్ట్ కోసమే వాడనున్నారు. కొత్త భూ సేకరణకు పయ్రత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బలవంతపు భూసేకరణ చేస్తున్నారని రైతులు, అలాంటిది ఏమీ లేదని అధికారులు అంటున్నారు. విమానాశ్రయం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రైతులు సహకరించాలని ఓ వర్గం ప్రజలు కోరుతుండగా.. భూములు కోల్పోయే రైతు కుటుంబాలు, వారి బంధుమిత్రులు వాదన మరో రకంగా ఉంది. పోయేది తమ భూములని.. వేరేవారికి ఆ బాధ ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతగా కావాలంటే విమానాశ్రయాన్ని ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతున్నారు. కుదరదంటే పరిమిత విస్తీర్ణంలో మాత్రమే పంట భూములు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకింత భూమి..? కుప్పంలో చిన్న ఎయిర్ పోర్ట్ నిర్మాణానికే ప్రభుత్వం వేల ఎకరాలను ఎందుకు సేకరిస్తున్నదో చిదంబర రహస్యంగా మారింది. ఇక్కడికి నిత్యం ఎన్ని విమానాలు వస్తాయి? ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు? సరుకు రవాణా ఏ మేరకు సాగుతుంది? వీటిపై అంచనాలు లేకుండా అనవసరంగా రైతులను భూముల నుంచి వెళ్లగొడుతున్నారు. నిజంగా విమానాశ్రయానికి కావాలంటే తిమ్మరాజుపల్లి సమీపంలో అటవీ భూములు ఉన్నాయి. – చక్రపాణిరెడ్డి, బాధిత రైతు, దండికుప్పంబలవంతపు సేకరణ వద్దు ప్రభుత్వం ఎన్ని నీతులు చెబుతున్నా కుప్పం విమానాశ్రయం కోసం సాగుతున్నది బలవంతపు భూ సేకరణే. అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు ఇచ్చేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. కొండలు, బంజరును అభివృద్ధి చేసుకుని రైతులు తరతరాలుగా సాగు చేస్తుంటే... ఇప్పుడు వారిని గెంటివేస్తున్నారు. నేలను నమ్ముకున్న రైతుకు కావాల్సింది పరిహారం కాదు.. సాగుకు భూమి. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేయాలి. – ఓబులరాజు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి -
జగన్ పర్యటనతో మామిడికి మంచిరోజులొచ్చాయి..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యం పర్యటనతో మామిడి రైతులకు మంచిరోజులొచ్చాయి. మామిడి ధరలు పైపైకి చూస్తున్నాయి. ప్రధానంగా తోతాపురికి డిమాండ్ పుట్టుకొ చ్చింది. ర్యాంపులతో ఫ్యాక్టరీలు పోటీపడే స్థాయికి చేరుకుంది. ర్యాంపులు లేకుండా చూడాలని ఫ్యాక్టరీలు అధికారులకు నివేదించుకుంటున్నాయి. లేదంటే ర్యాంపులకు వచ్చే కాయలను స్థానిక ఫ్యాక్టరీలకు మళ్లించాలని అభ్యర్థిస్తున్నాయి. తోతాపురి కేజీ రూ.7లకు కొనుగోలు చేస్తామని ఫ్యాక్టరీలు ముందుకొచ్చాయి. రూ.8కి కొనాలని అధికారులు పట్టుపడుతున్నారు. అయితే, ఇది ముమ్మాటికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభావమేనని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈసారి పల్ప్ ఫ్యాక్టరీలు, దళారులు ధరలు తగ్గించి మామిడి రైతులను అవస్థలకు గురిచేశారు. కోత సమయం నుంచి ఈ నెల 8 వరకు రైతులు అతలాకుతలమయ్యారు. పంట విక్రయానికి నానా తంటాలు పడ్డారు. వారి గోడు ప్రభుత్వానికి పట్టకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. జగన్ వచ్చి వెళ్లాక ధరల పెరుగుదల.. రైతుల కష్టాలను విని వారికి భరోసా ఇచ్చేందుకు ఈ నెల 9న వైఎస్ జగన్ బంగారుపాళ్యంలో పర్యటించారు. రైతుల కాయకష్టం విన్నారు. వారి కన్నీళ్లు తుడిచి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. వైఎస్ జగన్ వచ్చి వెళ్లాక మామిడి ధరలు పెరుగుతున్నాయి. ర్యాంపుల్లో తోతాపురి ఒక్కసారిగా రూ.2 నుంచి రూ.6.50 వరకు పెరిగింది. దీంతో రైతులు కూడా ఫ్యాక్టరీల ర్యాంపుల వద్దకు క్యూ కడుతున్నారు. ర్యాంపు నిర్వాహకులు కొనుగోలు చేసిన కాయలను తమిళనాడులోని క్రిష్ణగిరి, నాసిక్కు విక్రయించుకున్నారు. అక్కడ రూ.8 నుంచి రూ.8.50ల వరకు ధరలు పలకడంతో ర్యాంపులు లాభాలు గడిస్తున్నాయి. ఇక ర్యాంపుల నుంచి జిల్లాలోని ఫ్యాక్టరీలకు కాయలొచ్చేలా పరిశ్రమదారులు అధికారులను పట్టుబడుతున్నారు. ఇదంతా జగన్మోహన్రెడ్డి చలవేనని.. ఆయన జిల్లాకు వచ్చి వెళ్లాకే తమకు మంచిరోజులు వచ్చాయని రైతులు సంబరపడుతున్నారు. ‘సాక్షి’ కథనంతో అధికారుల స్పందన.. ఇక ‘సాక్షి’ దినపత్రికలో ‘తోతాపురి.. కాస్త ఊపిరి’ పేరుతో శనివారం వార్తా కథనం ప్రచురితమైంది. ఇందులో స్థానిక ఫ్యాక్టరీల్లో పాత ధరలంటూ ప్రస్తావించింది. తోతాపురి కొనుగోలు ధరలను ఫ్యాక్టరీలు రైతులకు చెప్పడంలేదని వివరించింది. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు.. ఫ్యాక్టరీ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ చర్చలో ర్యాంపులకు, క్రిష్ణగిరి, నాసిక్కు కాయలు వెళ్లకుండా నిలుపుదల చేయాలని కంపెనీల నిర్వాహకులు అధికారులను కోరారు. లేదంటే ర్యాంపుల నుంచి కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలకు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కేజీ రూ.7 చొప్పున కొంటామని నిర్వాహకులు స్పష్టంచేశారు. అయితే, అధికారులు మాత్రం రూ.8కు కొనాలని పట్టుబడుతున్నారు. మరో రెండ్రోజుల్లో తోతాపురి రూ.8కు చేరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.ఈ ఘనత అంతా జగన్దే.. ఇన్నాళ్లు మా అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తోతాపురికి ధరలు లేవ్. వచ్చిన కాడికి రానీ అని కోత కోస్తే... కాయలు అన్లోడింగ్ అవుతుందో లేదో అనే బాధ. కోత కాడికి వెళ్తే కూలీలు దొరకరు.. ట్రాక్టర్ చిక్కదు.. ట్రాక్టర్ దొరికి.. కాయలు తోలుకెళ్తే అన్లోడింగ్కు 5, 6 రోజులు. ఇలా ఎన్నో అవస్థలు పడ్డాం. జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యం వచ్చి అడుగు పెట్టినారో లేదో.. మామిడి రేట్లు పరుగులు పెడుతున్నాయి. ఈరోజు తోతాపురి రూ.7 అంటున్నారు. ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్రెడ్డిదే. – భాస్కర్నాయుడు, రైతు, చిత్తూరు -
‘మా భర్తలకు ఏం జరిగినా ఎస్పీ, పోలీసులదే బాధ్యత’
సాక్షి, చిత్తూరు: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెడ్ యార్డ్ పర్యటనపై కూటమి నేతలు అక్కసు వెళ్లగక్కతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చి.. ఫొటోగ్రాఫర్పై దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా ఫొటోగ్రాఫర్ శివపై దాడి కేసులో అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చక్రి, జీడి నెల్లూరుకు చెందిన మోహన్లను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, చిత్తూరు డీటీసీకి తరలించారు. అయితే, వారిని మాత్రం పోలీసులు చూపించడం లేదు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ సందర్భంగా మోహన్ భార్య రాసాత్తి మాట్లాడుతూ..‘నా భర్త ఆరోగ్యం సరిగా లేదు.. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. రోజుకు మూడు సార్లు మందులు వేసుకోవాలి.. మూడు రోజులుగా పోలీసులు నిర్బంధంలో ఉన్నాడు.. నా భర్త మోహన్కు ఏం జరిగినా పోలీసులు, జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాలి. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం.. నా భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు’ అని అన్నారు.చక్రి భార్య కవిత మాట్లాడుతూ..‘ఫొటోగ్రాఫర్పై దాడి చేయక పోయినా నా భర్తను అరెస్ట్ చేశారు. బాధితుడు ఫొటోగ్రాఫర్ శివ కూడా చక్రి నా కెమెరా కాపాడాడు.. నన్ను రక్షించాడు అని చెప్తున్నా నా భర్తపై తప్పుడు కేసు పెడుతున్నారు’ అని తెలిపారు. -
వేదం.. విజయనాదం
● దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ చలువతో వేదిక్ వర్సిటీ ● నేడు వేదిక్ వర్సిటీ 20వ వ్యవస్థాపక దినోత్సవం తిరుపతి సిటీ : వేద విద్యను విస్తృతం చేసి వేదాల సారాంశాన్ని, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో వేద విద్యకు ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచించారు. ఇందులో భాగంగా 2006లో టీటీడీ ఆధ్వర్యంలో వేద పండితులు, పీఠాధిపతులు సలహాలతో అలిపిరి జూపార్క్ రోడ్డు సమీపంలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 19 విభాగాలలో.. వర్సిటీ ఏర్పాటు చేసిన తొలి ఏడాది నుంచి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేద విద్యను అభ్యసించేందుకు వందల సంఖ్యలో విద్యార్థులు వేదిక్ వర్సిటీలో అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం సుమారు 19 విభాగాలలో వర్సిటీ వేద విద్యను అందిస్తోంది. వేద విభాగంలో రుగ్వేద, కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం, ఆగమ శాస్త్ర విభాగాలలో వైఖానస, పంచరత్ర, శైవాగమం, పౌరోహిత్యం విభాగాలలో ఆశ్వాలయన, అపస్తంభ, పరస్కర, వేద భాష్యంలోని 5 విభాగాలలో, కల్ప, మీమాంస విభాగాలలో 15 చొప్పున అడ్మిషన్లు చేపట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులలో ప్రతి ఏడాది ఒక్కో విభాగంలో ప్రత్యేక నిపుణులైన వేద పండితులతో శిక్షణ ఇస్తున్నారు. సంస్కృత పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు ఏడు విభాగాలలో సర్టిఫికెట్ కోర్సులను సైతం వర్సిటీలో అందుబాటులో ఉంచారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా అడుగులు వేదిక్ వర్సిటీలో విద్యనభ్యసించి పీజీ, యూజీ, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దేశ, విదేశాలలోని పలు ఆలయాలలో పండితులు, పూజారులుగా, సలహాదారులుగా వందల మంది వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. టీటీడీ విద్యాసంస్థలలో అధ్యాపకులుగా, ఆలయాలలో పండితులుగా రాణిస్తున్నారు. అలాగే అయోధ్యలోని రామాలయంలో సైతం వేదిక్ వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థానాలలో పనిచేస్తుండటం వర్సిటీకి గర్వకారణంగా చెప్పవచ్చు. నేడు వర్సిటీ 20వ వ్యవస్థాపక వేడుకలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 20 ఏళ్లు నిండిన సందర్భంగా శనివారం వర్సిటీలోని సంధ్యావందన శాలలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. వీసీ రాణి సదాశివమూర్తి అధ్యక్షతన రిజిస్ట్రార్ భాస్కరుడు పర్యవేక్షణలో నిర్వహించనున్న వ్యవస్థాపక దినోత్సవానికి టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. -
ఐషర్ను ఢీకొన్న బైక్
చంద్రగిరి : ఎదురుగా టమాట లోడుతో వస్తున్న ఐషర్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన ఘటన తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పీటీసీ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భాకరాపేటకు చెందిన మహబూబ్ బాషా(58) మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో పీటీసీ సమీపంలోని పెద్ద మలుపు వద్ద వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టమాట లోడుతో వస్తున్న ఐషర్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో బైక్తో పాటు ఐషర్ వాహనం అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న భారీ లోతు ప్రాంతంలో బోల్తా పడడంతో టమాటా బాక్స్లు , బైక్ మహబూబ్ బాషాపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐషర్ వాహనంలోని డ్రైవరుతో పాటు క్లీనర్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిందితుడికి మూడేళ్ల జైలు
చిత్తూరు అర్బన్: బాలికల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం స్థానిక జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారు. ప్రత్యేక పీపీ మోహనకుమారి కథనం మేరకు వివరాలిలా.. మదనపల్లెకు చెందిన చంద్రశేఖర్(52) చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో మదనపల్లె బాలికోన్నత పాఠశాల వద్దకెళ్లి.. పిల్లల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేవాడు. దీనిపై 2017లో పాఠశాల హెచ్ఎం పద్మజ మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చంద్రశేఖర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి మూడేళ్లు జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఎన్ఐఏబీతో వెటర్నరీ వర్సిటీ ఒప్పందం తిరుపతి సిటీ : హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)తో ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం వర్సిటీలో జరిగిన ఒప్పందంపై వీసీ ప్రొఫెసర్ రమణ, ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారు శర్మ సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జంతు సంరక్షణ, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్ఐఏబీ సంస్థతో వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రధానంగా నాణ్యమైన విద్య, నూతన పరిశోధనలు, విద్యా మార్పిడి వంటి విషయాలపై సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడమే ఎంఓయూ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డీన్, అధికారులు పాల్గొన్నారు.నేటి నుంచి గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి బైరాగిపట్టెడలోని గిరిజన భవన్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గ్రాప్లింగ్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అండర్–11, 13, 15, 17 కేటగిరిలో బాల బాలికలకు నిర్వహించనున్న ఈ పోటీలను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏజి.రేఖారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ఆయా విభాగాల్లో గెలుపొందిన బాల బాలికలు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ఘడ్ రాష్ట్రం, బిలాస్పూర్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు. తిరుమలకు వెళ్లి వచ్చేసరికే ఇల్లు గుల్ల 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చిల్లకూరు : తిరుమలలో జరిగే గరుడ సేవకు కుటుంబ సభ్యులు వెళ్లి వచ్చేసరికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన నల్లయగారిపాళెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని నల్లాయగారిపాళెం గ్రామానికి చెందిన మస్తానయ్య గురువారం తిరుమలకు వెళ్లారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసిన పక్కనే ఉన్న బంధువులు గమనించి తిరుమలలోని మస్తానయ్యకు దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫోన్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ కిశోర్బాబు, ఎస్ఐ సురేష్బాబుతో పాటు క్లూస్ టీం చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. సోషల్ మీడియా ● జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ.అనిల్కుమార్రెడ్డి(తిరుపతి), ఎ.భానుప్రకాష్(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ది.షణ్ముగంరాయల్(తిరుపతి), ఈశ్వర్రెడ్డి(పుంగనూరు), ప్రదీప్రెడ్డి(చిత్తూరు), యోగానందరెడ్డి(చంద్రగిరి), శోభన్కుమార్(సత్యవేడు), కార్తీక్రెడ్డి(జీడీనెల్లూరు), ఎన్.మురుగేష్(తిరుపతి), కార్యదర్శులుగా జి.రమేష్(కుప్పం), అరుణ్కుమార్(చిత్తూరు), మహేష్రెడ్డి(పుంగనూరు), హరిప్రసాద్(తిరుపతి), ఈశ్వర్(పలమనేరు), మదన్(జీడీనెల్లూరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. యువజన విభాగం ● జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రమణ్యంనాయుడు (పలమనేరు), రూపేష్రెడ్డి(చిత్తూరు), ప్రభురాజ్(నగరి), ఆఫ్రిడ్ మాలిక్(పుంగనూరు), ప్రధాన కార్యదర్శులుగా దిలీప్యాదవ్(శ్రీకాళహస్తి), మోహన్వంశీ(తిరుపతి), పి.శివ(పుంగనూరు), నవీన్కుమార్రెడ్డి(జీడీనెల్లూరు), శశింద్ర(తిరుపతి), మనోహర్రెడ్డి(చంద్రగిరి), మునివెంకటలోకేష్(తిరుపతి), షేక్బావాజీ(పుంగనూరు), వంశీకృష్ణ(పూతలపట్టు), కార్యదర్శులుగా శేషాద్రిరెడ్డి(జీడీనెల్లూరు), రమేష్(సత్యవేడు), రెడ్డిప్రసాద్(పలమనేరు), ధనుంజయరెడ్డి(చంద్రగిరి), సుధీర్(తిరుపతి), హేమంత్కుమార్రెడ్డి(కుప్పం), ఈసీ మెంబర్లుగా 16 మందని నియమించారు. విద్యార్థి విభాగం ● జిల్లా ఉపాధ్యక్షులుగా శశిదీప్(చిత్తూరు), సోమశేఖర్(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా మహేష్చౌదరి(చిత్తూరు), మహేష్(జీడీనెల్లూరు), మధుసూదన్రెడ్డి(తిరుపతి), భానుప్రకాష్రెడ్డి(చంద్రగిరి), వీరమణి(కుప్పం), కార్యదర్శులుగా అజిత్కుమార్(చిత్తూరు), అశ్విత్(పలమనేరు), వేణురెడ్డి(జీడీనెల్లూరు), ప్రదీప్కుమార్(తిరుపతి), పృధ్వీరెడ్డి, సుధీర్రెడ్డి, దినేష్, నరేష్బాబు(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 11 మందిని నియమించారు. వాణిజ్య విభాగం ● జిల్లా ఉపాధ్యక్షులుగా రూపేష్కుమార్రెడ్డి(తిరుపతి), ప్రసాద్(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా రాధికరెడ్డి(జీడీనెల్లూరు), విజయరెడ్డి(తిరుపతి), రవి(కుప్పం), రమేష్(తిరుపతి), కార్యదర్శులుగా పెద్దన్న (కుప్పం), రోహిత్బుచ్చిరెడ్డి(చిత్తూరు), సుబ్రమణ్యంరెడ్డి(జీడీనెల్లూరు), అమర్నాథ్రెడ్డి(పలమనేరు), చలపతి, మంజూరు, కిషోర్(పుంగనూరు), జీవరత్నం (తిరుపతి), ఈసీ మెంబర్లుగా 19 మందిని నియమించారు. వైఎస్సార్టీయూసీ ● జిల్లా ఉపాధ్యక్షులుగా తిరుమలరెడ్డి(తిరుపతి), షేక్ ఫిరోజ్అహ్మద్(పూతలపట్టు), ప్రధాన కార్యదర్శులుగా వెంకటేష్(జీడీనెల్లూరు), ఎం.బాబు(నగరి), శ్రీమంతుల రామయ్య(తిరుపతి), సుబ్రమణ్యంరెడ్డి(చంద్రగిరి), వేణుగోపాల్(కుప్పం), కోటేశ్వరరావు(చంద్రగిరి), కార్యదర్శులుగా శ్రీనివాసులు(పలమనేరు), రఘు(పూతలపట్టు), మునికృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), మాంగండన్(నగరి), వెంకటముని(చిన్ని)(తిరుపతి), జి.కోటేశ్వరరావు(సత్యవేడు), సురేష్(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా 16 మందిని నియమించారు. వలంటీర్ల విభాగం ● జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జయచంద్ర(తిరుపతి), అబ్దులజైలా(జీడీనెల్లూరు),బోస్రెడ్డ్డి(చంద్రగిరి),శివలింగం(కుప్పం),బాలసుబ్రమణ్యం(సత్యవేడు), కార్యదర్శులుగా పి.వరదరాజన్, పురుషోత్తం(తిరుపతి), రాము (జీడీనెల్లూరు), మనోహర్(శ్రీకాళహస్తి), ప్రభాకర్రెడ్డి(పలమనేరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. చేనేత విభాగం ● జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏలుమలై(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా రవిరెడ్డి(జీడీనెల్లూరు), పి.చంద్రశేఖర్(తిరుపతి), సుధాకర్, మునిరాజా(శ్రీకాళహస్తి), విజయ్భాస్కర్(సత్యవేడు), కార్యదర్శులుగా రమేష్రెడ్డి(పలమనేరు), తిరుమల(జీడీనెల్లూరు), కన్నాయిరం(నగరి), వెంకటేష్(కుప్పం), అమరలింగయ్య(సత్యవేడు), నలుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు. -
‘రూసా’ పనులు వేగవంతం చేయాలి
తిరుపతి సిటీ : రుసా ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రుసా) పథకం కింద జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేయడానికి ఎస్వీయూలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం వర్సిటీ వీసీ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీలో మౌలిక సదుపాయాలు, విద్యా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు వర్సిటీలో రూసా పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. అనంతరం రూసా కోర్డినేటర్ ప్రొఫెసర్ రమశ్రీ వర్సిటీలో జరిగే పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు, రుసా సీఈఓ, ఆర్థిక, అభివృద్ధి విభాగాల కీలక అధికారులు పాల్గొన్నారు. -
రేట్లు పెంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : మధ్యాహ్న భోజన పథకం రేట్లు పెంచాలని వైఎస్సార్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్రం రూ.5.45 చొప్పున మధ్యాహ్న భోజన ధరలను నిర్ణయించిందన్నారు. అయితే ఆ నగదుకు అధనంగా రాష్ట్ర ప్రభుత్వం కుకింగ్ కాస్ట్ గా రూ.0.43ను మంజూరు చేస్తూ మొత్తం రూ.5.88గా నిర్ణయించినట్టు తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కేంద్రం రూ.8.17 నిర్ణయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అధనంగా రూ.40 పైసలు మొత్తం రూ.8.57 గా నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో రూ.6.19, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.9.26 చొప్పున కేంద్రం పెంచిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రం పెంచిన ఉత్తర్వులను అమలు చేయకుండా మీనామేషాలు లెక్కిస్తోందన్నారు. పెరిగిన కుకింగ్ కాస్ట్ను అమలు చేయకుండా పాతరేట్లు అమలు చేయడం తగదన్నారు. వెంటనే కొత్త ఎండీఎం రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భోజనం తయారీ కార్మికులకు కనీస వేతనంగా రూ.5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు విశ్వంలో ఉచిత అవగాహన సదస్సు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యాసంస్థలో ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి అవగాహన సదస్సును ఉచితంగా నిర్వహించనున్నారు. ఆ మేరకు విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు 4 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. 14న కేంద్ర బృందం రాక చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమ అమలుపై సోమవారం కేంద్ర బృందం అధికారి భవాన్సింగ్ పర్యటించనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 9గంటలకు ఆయన జిల్లాకు చేరుకోనున్నారన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో టీబీ ముక్తభారత్ కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. అలాగే టీబీ సెంటర్లను పరిశీలించనున్నట్టు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 63,473 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
‘విత్తు’కోని ఆశలు
● వర్షాభావంతో అదును దాటుతున్న వైనం ● ఈ దఫా భారీగా తగ్గనున్న వేరుశనగ సాగు విస్తీర్ణం జిల్లా వేరుశనగ సాగు వివరాలు సాధరణ సాగు విస్తీర్ణం : 35,228 హెక్టార్లు ఖరీఫ్లో పంటను సాగు చేసే రైతులు : 90 వేల మంది దాకా అవసరమైన విత్తనకాయలు : 50 వేల క్వింటాళ్లు కూటమి ప్రభుత్వంలో అందినవి : 39 వేల క్వింటాళ్లు ఇప్పటిదాకా సాగైన వేరుశనగ విస్తీర్ణం : 300 హెక్టార్లు పలమనేరు: వేరుశనగ రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. సాధారణంగా జూలై తొలి వారానికల్లా ఇక్కడ వేరుశనగ విత్తనాలేసే పనులు పూర్తికావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటిదాకా వరుణుడు కరుణించకపోవడంతో చేలల్లో విత్తనాలు పడలేదు. ఎక్కడో వెతికినా దొరకనట్టు ఓ శాతం మాత్రం వేసిన విత్తనాలు మొలకెత్తినా అవీ వర్షం లేక మాడిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ దఫా జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆశలే వదేలుకోవాల్సిందేనా? పదేళ్ల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.2 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగుగా ఉండేది. ఏటా పంటసాగు తగ్గుతూ వస్తోంది. జిల్లా విభజన జరిగాక పంట సాధారణ సాగు 55 వేల హెక్టార్లకు పడిపోయింది. ప్రస్తుతం సాధారణ సాగు 35 వేల హెక్టార్లకు దిగజారిపోయింది. ఈ దఫా సకాలంలో వానలు పడుంటే పంట సాగు 20వేల హెక్టార్లు దాకా ఉండొచ్చునని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ సీజన్ ముగుస్తున్నా వరుణుడు కరుణించ లేదు. ఈ దఫా వేరుశనగ పంటపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనన్న మాటలు వినిపిస్తున్నాయి. సాగుచేసినా నష్టాలు తప్పవా? గత కొన్నేళ్లుగా వేరుశనగను రైతులు సాగుచేయడం తగ్గించారు. ఇందుకు ప్రధాన కారణం పంటకు పెట్టిన పెట్టుబడి సైతం దక్కడం లేదు. సకాలంలో వర్షాలు రాకపోవడం, లేదా ఎక్కువగా వర్షాలు పడి పంటకు నష్టం జరుగుతుండడంతో రైతులు వేరుశనగ సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. పంట దిగుబడులు సైతం ఎకరానికి నాలుగైదు బస్తాలు కూడా కావడం లేదు. ఎకరా పొలంలో పంట సాగుకు రూ.15వేల దాకా అయితే దిగుబడి 5వేలు కూడా రావడం లేదు. దీంతో రైతులు వేరుశనగ పంటపై ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది. బస్తా (30కేజీలకు) రూ.1116 సబ్సిడీగా వస్తుందని చాలామంది రైతులు విత్తనాలను తీసుకున్నారు. కానీ వర్షాలు లేక సీజన్ ముగుస్తుండడంతో వీటిని అమ్ముకోవడం .. లేదా ఇళ్లకు వాడుకోవడం చేసుకోవాల్సిందే. విత్తనాలే ఇవ్వలేదు విత్తనాలేసేందుకు వానలేదు. సరే కనీసం విత్తనాలను సైతం ఇవ్వలేదు. మాకు కొంగోళ్లపల్లి, మామొడుగు గ్రామాల్లో ఆరెకరాల భూములున్నాయి. రెండుచోట్ల రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలడిగినా లేవని చెప్పారు. వచ్చిన విత్తనాలను ఎవరు తీసుకున్నారో దేవుడికే తెలియాలి. – నాగరాజరెడ్డి, రైతు, కొంగోళ్లపల్లి, గంగవరం మండలం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం మరో వారం రోజుల దాకా విత్తనాలేసేందుకు సీజన్ ఉంది. అప్పటిదాకా వర్షం పడకుంటే ఆపై ఏమీచేయను కాదు. అందుకే ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొలాల్లో ఉలవ సాగుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పలమనేరు డివిజన్కు మాత్రమే 80 వేల క్వింటాళ్ల ఉలవ విత్తనాలకు ఇండెంట్ చేశాం. జిల్లాలో ఎక్కడా వర్షాలు లేవు. వేరుశనగ సాగు భారీగా తగ్గే అవకాశం ఉంది. – గీతాకుమారి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, పలమనేరు ఈ దఫా సీజన్ పోయినట్టే! సాధారణంగా వేరుశనగ విత్తనాలకు జూన్ 15 నుంచి జూలై తొలివారంలోగా చేలల్లో వేయాలి. ఈ సీజన్లో వేస్తేనే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటిదాకా వర్షాలు పడలేదు. దీంతో 90 శాతంపైగా చేలు బీళ్లుగానే ఉన్నాయి. పది శాతం మంది రైతులు వేసవి దక్కులు చేసుకున్నా విత్తనాలేసేందుకు అవకాశం లేకుండా పోయింది. సిద్ధం చేసుకున్న విత్తనాలు వర్షం కోసం ఎదరుచూస్తున్నాయి. -
ఆదరణ చూసి ఓర్వలేక
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇచ్చిన హామీల విషయంలో మాట దాట వేసింది. రైతులకు చేసేందేమీ లేదు. వేరుశనగ పంట పూర్తిగా నేటమట్టమైంది. మామిడి రైతులు మద్దతు ధర లేక రోడ్డుపై అల్లాడుతున్నాము. అయితే ఈ రోదనను వినేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనను అడ్డుకోవడం సరికాదు. కూటమి ప్రభుత్వం ఆయన ఆదరణ చూసి ఓర్వలేకపోతోంది. అందుకే ఈ రకంగా రైతులను, జనాన్ని రాకుండా తొక్కిపడేస్తోంది. వాళ్లు ఎంత తొక్కితే అంతా పైకి లేస్తాం. – రవీంద్రనాథ్, రైతు నాయకులు -
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చంద్రశేఖర్
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన న్యాయవాది ఎం.చంద్రశేఖర్ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి ఈయన మూడేళ్ల పాటు ఏపీపీగా కొనసాగనున్నారు. ఇందుకోసం నెలకు రూ.40 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేషనల్ అవార్డ్స్కు దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు నేషనల్ అవార్డ్స్కు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2025 కు సంబంధించి జాతీయ పురస్కారాలు (నేషనల్ అవార్డ్స్)కు అర్హత, ఆసక్తి ఉన్న టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 13వ తేదీలోపు www.nationa lawardstoteacher.education.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం హార్డ్ కాపీని డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ సెల్ఫ్ నామినేటెడ్ ది టీచర్ చివరి తేదీ ఈనెల 15 అని ఆమె వెల్లడించారు. జిల్లా ఓటర్లు 15,71,402 చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై ఒకటవ తేదీ నాటికి 15,71,402 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటర్ల జాబితా సిద్ధం చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఓటర్ల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10,615 మందికి ఓటర్ ఎపిక్ కార్డులను పంపుతున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్, పలు పార్టీల ప్రతినిధులు ఉదయ్కుమార్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, వాడ గంగరాజు పాల్గొన్నారు. మంజూరైన పనులు చేయకపోతే రద్దు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జెడ్పీ, 15 వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పనుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. జిల్లాలోని 31 మండలాల్లో చేపడుతున్న తాగునీరు, మురుగునీటి కాలువలు, సిమెంట్ రోడ్లు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో లోపం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంజూరై పనులు ప్రారంభం కాకపోతే రద్దు చేస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నెలకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
జగన్ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు
● పోలీసుల అణచివేతతోనే భారీగా జనం ● రక్షకభటులే ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఎలా? ● ఖాకీల తీరును తప్పుబడుతున్న రైతన్నలు పలమనేరు/కాణిపాకం: ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ బుధవారం బంగారుపాళెంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఎందుకు వారిపై ఇంత కఠినంగా వ్యవహరించారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారుపాళెంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు ఎందుకిలా అడ్డుకున్నారనే మాట రైతుల్లో అయోమయాన్ని కల్గిస్తోంది. ఏ మార్గంలోనూ జనం వెళ్లకుండా ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. ఎటుచూసినా కర్ఫూ వాతావరణాన్ని సృష్టించారు. కనీసం నడిచి వెళుతున్న వారితోనూ దురుసుగా మాట్లాడారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోలు బంకుల్లో పెట్రోలు పట్టనీయకుండా చేశారు. జగన్ పర్యనటలో భాగంగా కొన్ని చోట్ల గుమిగూడిన రైతులపై లాఠీతో విరుచుకుపడ్డారు. బంగారుపాళెం మార్కెట్లోని మామిడి రైతులను బయటకు పంపేశారు. వ్యాపారులు లేకుండా చేశారు. అసలు జనాన్ని చూస్తేనే పోలీసులు కోపంతో ఊగిపోయారు. మొత్తం మీద పోలీసులు చేసిన అణచివేత చర్యల కారణంగానే రైతులు వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసిందనే మాట జనంలో వినిపిస్తోంది. పోలీసులు ఇన్ని రకాలుగా ఆంక్షలు పెట్టి ఉండకపోతే కార్యక్రమం ప్రశాంతంగానే జరిగిపోయేదని అంటున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరి రైతుల మాటల్లోనే.. -
విత్తుకోని ఆశలు
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025‘పోలీసులు తన, మన తేడా లేకుండా వ్యవహరించాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు పెద్ద పీట వేయాలి. నేరాల నియంత్రణకు కట్టుబడి పనిచేయాలి. పౌరుల హక్కులకు భంగం వాటిల్లకుండా సేవ చేయాలి..’ కానీ కూటమి ప్రభుత్వంలో ఖాకీలు ఇలాంటివి పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రోద్బలంతో కక్ష సాధింపులకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ విధులు మరచి ప్రవర్తిస్తున్నారనే ఆపవాదులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎదురైందని ప్రజలు, రైతులు గళం విప్పుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంత కఠినంగా వ్యవహరించడంపై పెదవి విరుస్తున్నారు. పోలీసన్నా.. ఇదేందన్నా అంటూ నిట్టూర్పులు వెళ్లగక్కుతున్నారు. – 8లోన్యూస్రీల్ -
కేసులతో భయపెడతారా?
రైతులతో ఆటలొద్దు. మేము రోడ్డు మీదకు వస్తే మళ్లీ మా మూళ్లగా ఉండదు. రైతు పండించే పంటకు గిట్టుబా టు ధర కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది చేయలేకపోతే..ఇలా ప్రతిపక్షాలు రోడ్డుపైకి వస్తాయి. ఇదీ ఆయన సొంత కార్యక్రమం కాదు కదా. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి సమస్యలను వినేందుకు వచ్చారు. అందులో తప్పేంముంది. అడ్డకుంలు సృష్టించడంతో పాటు గొంతు కూడా నొక్కేస్తున్నారు. కేసుల పేరుతో భయపెట్టడం న్యాయం కాదు. – ఉమాచంద్ర, రైతు నాయకులు -
దేవదాయ భూములను పరిరక్షించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా దేవదాయ భూములను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఆర్వో మోహన్కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో దేవదాయ భూముల పరిరక్షణ పై జిల్లా స్థాయి భూ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 17,540 ఎకరాల దేవలయ భూములున్నాయన్నారు. ఈ భూములన్నింటినీ సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నట్లైతే వెంటనే గుర్తించి తొలగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,343.17 ఎకరాల దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఏవైనా కోర్టు కేసుల్లో ఉన్నట్లైతే స్టే వెకేషన్కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 9,761 ఎకరాలకుగాను 4,866 ఎకరాల భూములు 1 బీ అడంగళ్లో దేవదాయ పేర్లుగా నమోదు చేశారన్నారు. 5,500 ఎకరాలకు 1 బీలో పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా 2,200 ఎకరాల భూములను వెంటనే 1 బీ అడంగల్లో నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దేవదాయ భూములను తక్కువ ధరకు వేలంలో లీజుకు ఇస్తున్నారని తమ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివాదాస్పద భూములన్నింటినీ సర్వే చేయించాలని సూచించారు. జాయింట్ సర్వే పెండింగ్లో ఉన్న భూములను ఆయా శాఖల సమన్వయంతో 30 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా దేవదాయ శాఖ కమిషనర్ చిట్టెమ్మ పాల్గొన్నారు. -
ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే
ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటి ని అధిగమించి మా కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్తో పంచుకోవాలని పర్యటనకు వెళ్లాం. కనీసం ద్విచక్ర వాహనం కూడా వదల్లేదు. ఎ క్కడికక్కడ కట్టడి చేసి విఘాతం కలిగించారు. ఆయనకు వస్తున్న ప్రజాధరణను ఓర్వలేక కూటమి ప్రభు త్వం ఈ రకంగా హింసించింది. రైతులను అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. వాళ్లు ఏం చేసి నా జనబలాన్ని ఆపలేకపోయారు. ఇలా చేస్తే ప్రజా లే భవిష్యత్లో తీర్పునిస్తారు. ఏ అధికారమైనా జనబలం ముందు తలవంచాల్సిందే..అనడానికి ఇదీ ఒక నిదర్శనం. – వెంకటేష్, రైతు, జీడీనెల్లూరు -
వేదం..విజయనాదం
తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ●కర్షకులపై కర్కశమా? కూటమి ప్రభుత్వం రైతులను కట్టడి చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసింది. పోలీసులతో నిలువరించింది. తెల్లచొక్కా, రైతు కండువ కనిపిస్తే చాలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తమ సమస్యను మాజీ ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని వెళితే తప్పా..? సమస్యలు చెప్పుకుందామని నడుచుకుని వచ్చాం. అడ్డదారులో చేరాం. రాళ్లురప్పలను లెక్క చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి చెంత మామిడి కష్టాలను కన్నీళ్లతో వెలిబుచ్చాం. కర్షకులపై ఇంత కర్కశం పనికిరాదు. – వెంకటరెడ్డి, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు శత్రువులా చూశారు జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి. ఆయనొస్తే..వీళ్లకెందుకు నొప్పి. కూటమి ప్రభుత్వం ప్రజాధరణతోనే గెలిచింది కదా. అలాంటప్పుడు జగన్మోహన్రెడ్డి వచ్చి వెళితే మీకేంటి?.. దానికి ఇంత రాద్ధాంతం చేయలా..?. ఇంతటి దౌర్జన్యం చేసినా రైతులు గుండెనిండా అభిమానంతో జగన్మోహన్రెడ్డిని కలవాలని వచ్చారు. ఆ అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతులను శత్రువులను చూసినట్లు చూశారు. – పద్మనాభరెడ్డి, రైతు నాయకులు – 8లో -
మేమూ రైతులమే
మా కష్టాలు మాకు తెలుసు. మా కష్టాలు ఎవరికో ఒకరికి చెప్పుకుంటే తప్ప తీరదు. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులను ఆదుకోవాలి. మా కష్టసుఖాలను వినాలి. అలా ఎవరు వచ్చినా కష్టాలను చెప్పుకోవడానికి రైతులు ముందు పడతాం. వస్తే అందుకు ఈ రకంగా చేస్తారా..? దారుణమండి. ఇలా చేయడం కరెక్టు కాదు. పోలీసులు మారాలి. కక్షపూరితమైన రాజకీయాలు వద్దు. మనుషులని చూడండి. రైతు కష్టాలను అన్ని శాఖల అధికారులకంటే.. పోలీసులే దగ్గరుండి చూశారు. మీలో కూడా రైతు కుటుంబాలు ఉన్నాయి..కదా. టోకన్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు కదా.. మళ్లెందుకు ఇలా చేశారు. – పెద్దిరెడ్డి, రైతు, వేపంజేరి -
తోతాపురి.. కాస్త ఊపిరి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇన్నాళ్లూ మామిడి రైతులు అష్టకష్టాలు పడ్డారు. తోతాపురి అమ్మకానికి పడరానిపాట్లు పడ్డారు. నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీల వద్ద మామిడి పంటను వాహనాల్లో ఉంచుకుని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. కనీస గిట్టుబాటు ధర రాక ఉసూరుమన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ను సందర్శించి రైతుల ఆవేదన విన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాన్ని కడిగిపారేశారు. దీంతో వ్యాపారుల్లో కాస్త చలనం వచ్చింది. ఫలితంగా తోతాపురి మామిడికి ర్యాంపుల్లో కిలో రూ.4 నుంచి రూ.6.50 వరకు పలుకుతోంది. క్రిష్టగిరి, నాసిక్కు ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలోని మ్యాంగో ఫ్యాక్టరీలు కనీసం రెండు మూడు రూపాయలకు కూడా కొనుగోలు చేయక పోవడంతో చాలా మంది రైతులు కోతలు కోయకుండా చెట్లపైనే కాయలను వదిలేశారు. వీటిలో చాలా వరకు కుళ్లిపోయి, నేల రాలాయి. ఇంకా 30–40 శాతం పంట అలానే ఉంది. అయితే వైఎస్ జగన్ పర్యటన అనంతరం ర్యాంపుల్లో ధర పెరగడంతో మిగిలిన పంటను అమ్ముకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.4 నుంచి రూ.6.50 వరకు వ్యాపారులు కొంటున్నారు. ఆపై వారు తమిళనాడులోని క్రిష్ణగిరి వద్ద ఉండే ఫ్యాక్టరీల్లో కిలో రూ.8 నుంచి రూ.8.50 వరకు అమ్ముకుంటున్నారు. అలాగే నాసిక్కు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతులు గత రెండు రోజుల నుంచి పుంజుకున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 24 ర్యాంపులు ఉండగా, వీటి ద్వారా సుమారు 1200 టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు వెళుతున్నాయి. మరో 1500 టన్నులకు పైగా నాసిక్కు ఎగుమతి అవుతోంది. స్థానిక ఫ్యాక్టరీల్లో పాత ధరలేతమిళనాడులోని క్రిష్ణగిరి, హోసూర్ తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో తోతాపురికి కొంచెం మంచి ధర ఉంది. అయితే చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలు మాత్రం ప్రభుత్వ అండ చూసుకుని పాత ధరలతోనే కొనుగోళ్లు చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఏ రేటుకు కొనుగోలు చేస్తున్నారో కూడా రైతులకు చెప్పడం లేదు. పక్క రాష్ట్రంలో తోతాపురి ధరలు పెరిగినా, ఇక్కడ ఎందుకు పెరగడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
కాయలు పారబోశారని.. అక్రమ కేసులు
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ కూటమి సర్కారు మోసాలను ఎండగడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనంలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంతటితో ఆగడం లేదు! వైఎస్ జగన్ పర్యటనల్లో పాల్గొన్న వారిని, పార్టీ కార్యక్రమాలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోంది. ప్రధానంగా రైతులు, యువత, వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ అక్కడకు వెళ్లగా తాజాగా కూటమి ప్రభుత్వం పలువురు రైతులపై అక్రమ కేసులు మోపింది. మామిడికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై కాయలు పారబోసినందుకు బంగారుపాళ్యంలో రైతులపై పోలీసులు శుక్రవారం అక్రమ కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా తుంబపాళ్యానికి చెందిన రైతు దేవేంద్ర, తిమ్మోజుపల్లెకు చెందిన రైతులు ప్రకాష్రెడ్డి, భగత్రెడ్డి, తుంబపాళ్యానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు అక్బర్, ఉదయ్పై కేసులు బనాయించారు. మామిడికి గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ బంగారుపాళెం మార్కెట్యార్డును సందర్శించిన విషయం తెలిసిందే. గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న మామిడి రైతన్నలు తమ గోడు చెప్పుకునేందుకు పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు లభించిన స్పందన చూసి ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు పోలీసులను ప్రయోగించి సరికొత్త నాటకానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది.పిలవని పేరంటానికి హాజరై...!ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. అక్కడకు వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరాగా, ఆహ్వానం లేకున్నా ఎల్లో మీడియా కూడా దూరిపోయింది! అసలు ఈ కార్యక్రమానికి తాము ఎల్లో మీడియాను పిలవలేదని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారుపాళ్యం చేరుకున్న పచ్చ మీడియాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మామిడికి గిట్టుబాటు ధర దక్కడం లేదని కాయలను కింద పోసి నిరసన వ్యక్తంచేస్తున్న రైతులను ఉద్దేశించి.. ‘మీకు బుద్ధుందా..? ఏం చేస్తున్నారు..? అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా...?’ అంటూ దుర్భాషలాడి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో మాటామాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ ఫోటోగ్రాఫర్ బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. తమ అనుకూల మీడియాకు చెందిన ప్రతినిధి కావడంతో సీఎం చంద్రబాబు నుంచి ఆయన తనయుడు, మంత్రులు వరుస ట్వీట్లు పెడుతూ ఆగమేఘాలపై స్పందించారు. నిందితులను వదిలేది లేదని, చట్టరీత్యా చర్యలు తప్పవంటూ మామిడి రైతుల సమస్యను డైవర్ట్ చేశారు. చిత్తూరుకు చెందిన చక్రి తనపై దాడి చేయలేదని, తన కెమెరాను అతడే కాపాడాడని ఫోటోగ్రాఫర్ చెబుతున్నా ఖాకీలు పరిగణలోకి తీసుకోలేదు. ‘కేసు ఇప్పుడు మా పరిధిలో లేదు...! సీఎం వరకు వెళ్లిపోయింది.. నువ్వు ఏదిపడితే అది మాట్లాడొద్దు.. మేమేం చెబితే అది చెయ్.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టు.. ఏం జరిగిందో కూడా మేమే చెబుతాం.. అందరికీ అలాగే చెప్పు..’’ అంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా..ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోటోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకుండా ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు అనుమానితుల పేరిట వైఎస్సార్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచే పలువురు కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. గంగాధర నెల్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ మండల ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కె.మోహన్, మండల సోషల్ మీడియా కో–కన్వీనర్ వినోద్, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి అనుచరుడు చక్రవర్తి (చక్రి), పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరుడు ఆచార్య, పూతలపట్టుకు చెందిన మరికొంత మందిని అక్రమంగా నిర్భందించి అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో నిర్భందించి శుక్రవారం చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రానికి (డీటీసీ) తరలించారు. అక్కడకు వెళ్లిన న్యాయవాదులను లోపలకు అనుమతించలేదు. ఫొటోగ్రాఫర్ను కులం పేరు చెప్పాలంటూ బెదిరించి ఆయుధాలతో దాడి చేశారంటూ అట్రాసిటీ, హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు బనాయించి కేసు నమోదు చేశారు. దాదాపు 20 మందికి పైగా వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అక్రమంగా నిర్భందించగా మరి కొందరి కోసం ఓ బృందం బెంగళూరుకు వెళ్లినట్లు చెబుతున్నారు..హెబియస్ కార్పస్ పిటిషన్.హెబియస్ కార్పస్ పిటిషన్.!తమ శ్రేణుల అక్రమ నిర్భందంపై వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టు తలుపు తట్టడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వారి పేర్లను సేకరించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.ఎల్లో మీడియాపై రైతన్న కన్నెర్ర..బంగారుపాళ్యంలో మామిడి రైతుల ఆవేదనను ‘సాక్షి’ ప్రచురించిన నేపథ్యంలో ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ‘సాక్షి’ మీడియాకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమేనా..? మీతో బలవంతంగా చెప్పించారా..? అంటూ రైతులను ఆరా తీస్తోంది. అయితే మామిడి రైతులను రౌడీలు, గొంతులు కోసే ఉన్మాదులతో ఎల్లో మీడియా పోల్చడం, దండుపాళ్యం బ్యాచ్గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలు వారిపై మండిపడుతున్నారు.తప్పుడు ఫిర్యాదుతో అక్రమ నిర్భందం..సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు బంగారుపాళ్యం ఘటన మరో నిదర్శనం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు తరలి వచ్చిన జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేని కూటమి నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. కుప్పంలో ఓ వార్త రాసినందుకు అక్కడి సాక్షి విలేకరిపై తప్పుడు కేసు పెట్టారు. వాట్సాప్ గ్రూపులో ఎవరో ఏదో పెడితే మరో టీవీ ఛానల్ రిపోర్టర్పై కేసు పెట్టారు. వారిని సీఎం స్థాయిలో చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు? మీడియాలో మీకు అనుకూలంగా ఉన్నవారికి ఒక న్యాయం, నిజాలు నిర్భయంగా ఎలుగెత్తే వారికి మరో న్యాయమా..? పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తున్న పోలీసులను చట్టం ముందు నిలబెడతాం. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడుఅక్రమ కేసులు బనాయించారు..మా కార్యక్రమానికి రావాలని మేమేమైనా పచ్చ మీడియాను ఆహ్వానించామా..? గొడవ చేసి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులకు శ్రీకారం చుట్టారు. ఆ ఫోటోగ్రాఫర్ను ఎవరు కొట్టారు..? నాపేరు ఎలా చెబుతారు..? కుప్పంలో పని చేస్తున్న సాక్షి రిపోర్టర్, మరి కొంతమందిపై టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు ఇస్తే.. ఎస్పీ అక్రమ కేసులు బనాయించారు. జిల్లావ్యాప్తంగా మావారిని 25 మందికిపైగా రెండు రోజులుగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నా ఎస్పీ నోరు మెదపడంలేదు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టాలని కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీసులకు చెబుతున్నారు. మా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ యువకులను అక్రమంగా నిర్బంధించారు. దీనికంతటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కె.నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి. కాపాడినందుకు కేసా..? ఆ ఫోటోగ్రాఫర్ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయనే కాపాడారని చెప్పారు. కెమెరా ఎక్కడ విరిగిపోతుందోనని కెమెరాను పట్టుకున్నారు. కాపాడిన పాపానికి మా ఆయన్ను ఇరికించాలని చూస్తున్నారు. చక్రి నన్ను కాపాడాడు అని ఆసుపత్రిలో ఆ ఫోటోగ్రాఫరే చెప్పారు. ఇప్పుడు ఓ డీఎస్పీ స్ట్రిప్టు రాసిచ్చి, దీని ప్రకారం ఇవ్వాలని ఫోటోగ్రాఫర్తో అబద్ధపు ఫిర్యాదు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం యూనిఫామ్ వేసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంట్లో అన్నం తింటా ఉన్న నా భర్తను ఇప్పుడే పంపిస్తామని తీసుకెళ్లారు. ఇప్పటివరకు నా భర్త ఆచూకీ చెప్పలేదు. చిత్తూరు డీటీసీ వద్ద ఉన్నారని తెలిసి అక్కడకు వెళితే లోపలకు కూడా పంపలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా..? – కవిత, చక్రవర్తి (చక్రి) భార్య, చిత్తూరు.నా భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీదే బాధ్యతజగన్పై అభిమానంతో చూడడానికి మా ఇంటాయన అక్కడికి పోయినాడు. ఫోటోగ్రాఫర్ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. అంతే.. ఇంట్లో ఉన్నోడిని ఇప్పుడే పంపిస్తామని పోలీసులు తీసుకుపోయినారు. ఇంతవరకు పంపలేదు. నా భర్తకు ఒక కన్ను కనిపించదు. షుగర్ కూడా ఉంది. రోజూ మూడుసార్లు మాత్రలు వేసుకోవాలి.చిత్తూరు డీటీసీలో ఉండానని చెబితే అక్కడి పోయినాము. ఆ అడవిలో నా భర్తను చూపీకుండా పోలీసులు తరిమేసినారు. ఇపుడు కేసులు పెడతామంటా ఉండారు. మేమే ఎస్సీలైతే మాపైనే ఎట్లా అట్రాసిటీ కేసు పెడతారు..? నా భర్తకు జరగరానికి ఏదైనా జరిగితే ఎస్పీనే బాధ్యత వహించాలి. – రాసాత్తి, మోహన్ భార్య, గంగాధరనెల్లూరు. -
కోర్టులో హాజరుపరచకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వేధింపులు!
చిత్తూరు జిల్లా: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి కేసుకు సంబంధించి బంగారుపాళ్యం పోలీసులు ఓవరాక్షన్ చేస్తన్నారు. ఈఈ కేసుకు సంబంధించి జీడినెల్లూరు నియోజకవర్గంకు చెందిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరచకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వేధిస్తన్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో స్టేషన్లోనే వారిని ఉంచి వేధింపులకు గురిచేస్తన్నారు. మరొకవైపు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అరెస్ట్లు చేసిన 24 గంటల్లో కోర్టుకు హాజరు పరచాల్సి ఉన్నా, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు .పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ దాడి కేసులో మరికొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు. -
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 48 మంది న్యాయవాదులు, సంఘ సేవకులకు మధ్యవర్తిత్వం, ఇతర అంశాలపై గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఈ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భారతి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ అనూజ సక్సేన, మధ్యప్రదేశ్కు చెందిన న్యాయవాది, సంఘ సేవకురాలు నీనా కరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి భారతి ఇద్దరు న్యాయవాదులను సన్మానించారు. జగన్ పర్యటన సక్సెస్చిత్తూరు కార్పొరేషన్: పోలీసులను అడ్డం పె ట్టుకుని ప్రభుత్వం ఎ న్ని అడ్డంకులు సృష్టించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప ర్యటన విజయవంతమైందని వైఎస్సార్ సీపీ రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ రైతు విభాగం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, ఎఫ్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, సర్పంచ్ మధుసూదన్రాయల్ మాట్లాడారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారికి మద్దతుగా జగనన్న బంగారుపాళెం పర్యటనకు వచ్చారన్నారు. జగనన్న పర్యటన కార్యక్రమాన్ని ప్రకటించిన తరువాత ప్రభుత్వానికి రైతులపై హఠాత్తుగా ప్రేమ వచ్చిదంన్నారు. ఆకస్మాతుగా వారితో అధికారులు సమావేశాలు పెట్టి హడావుడి చేశారన్నారు. జగనన్న పర్యటనకు 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చామన్నారు. కానీ ఎందుకు 2 వేల మందికి పైగా పోలీసులు పెట్టి అడుగడు గున అడ్డంకులు సృష్టించారని ప్రశ్నించారు. ఎంత ప్రయత్నం చేసి అధినేతపై రైతులకు ఉండే ఆదరణ, అభిమానాన్ని అపలేకపోయారన్నారు. కొండలు, గు ట్టలు దాటుకుని మార్కెట్యార్డుకు వేలాది మంది వచ్చారన్నారు. పర్యటనను ఫ్లాప్ చేయాలని పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జీ చేసి, రైతులను కొట్టారన్నారు. రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా? వేలాది మంది రైతులు రావడం చూసి ఓర్వలేని ఆంధ్రజ్యోతి పత్రికలో రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను దండుపాళ్యం బ్యాచ్తో పోలుస్తూ వార్తలు రాయ డం సరికాదన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు వేలాది టోకెన్లు అక్రమంగా తీ సుకున్నారన్నారు. వారు చెప్పిన వారికి మాత్రమే ఫ్యాక్టరీల్లో త్వరగా పంటను దింపుకున్నరన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రూ.16 ఇస్తున్నారని చెప్పారు. విజనరీ సీఎంగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కిలో మామిడి రూ.8 కూడా ఎందుకు కోనుగోలు చేయలేకపోతున్నరని ప్రశ్నించారు. రైతులంటే ప్రేమ లేదు చంద్రబాబుకు రైతులంటే ఎప్పుడు ప్రేమ లేదని గ్రీనరి బ్యూటిఫికేషన్ రాష్ట మాజీ డైరెక్టర్ గుణశేఖర్రెడ్డి, సర్పంచ్ అమరనాథ్రెడ్డి, ఏకాంబరం, నాయకులు రవీంద్రరెడ్డి విమర్శించారు. 1996లో బషీర్బాగ్లో రైతులు ధర్నా చేస్తుంటే వారిపై కాల్పులు జరిపిన ఘనత బాబుదన్నారు. తర్వాత వారి కుటుంబాలకు సైతం పరిహారం ఇవ్వలేదన్నారు. మంత్రి అచ్చెనాయుడు చిత్తూరుకు వచ్చి పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం నిర్వహించిన తరువాత వారి పరిస్థితి ఇంకా దారుణంగా మారిందన్నారు. -
ప్రచార ఆర్భాటం.. మెగా పీటీఎం
జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మెగా పీటీఎం 2.0 సమావేశాలు కూటమి ప్రభుత్వం ప్రచారం కోసమే నిర్వహించినట్లు ఉందని విద్యావేత్తలు పెదవి విరిచారు. విద్యార్థులు పురోగతి, పాఠశాలల్లో నెలకొన్న సమస్యల నిమిత్తం నిర్వహించాల్సిన మెగా పీటీఎం సమావేశం ఉద్ధేశాన్నే మార్చేశారన్నారు. విద్యావ్యవస్థలో కూటమి పార్టీ ప్రచారం కోసం మెగా పీటీఎం సమావేశాలను పావుగా వాడుకున్నారన్న విమర్శ వచ్చింది. సమావేశాలకు తల్లిదండ్రులు గైర్హాజరు కావడంతో ఏదో నిర్వహించామంటే...నిర్వహించామనే ధోరణిలో మెగా పీటీఎం సమావేశాలు జరిపి, చేతులు దులుపుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2,984 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమి కనిపించని పరిస్థితి నెలకొంది. మెగా పీటీఎం సమావేశం ఉద్దేశాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జిల్లాలో విద్యాభివృద్ధికి చేసిందేమి లేదు. అభివృద్ధి దిశగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలను పౌండేషన్ పాఠశాలల పేరుతో కిలోమీటర్ దూరంలో స్కూళ్లలో విలీనం చేసి విద్యార్థులకు నష్టం చేకూర్చారు. గత వైఎస్సార్సీపీ సర్కారు వేల కోట్లు ఖర్చు చేసి అమలు చేస్తున్న నాడు–నేడు పనులను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులను ఏ మార్చేందుకు పబ్లిసిటీ స్టంట్ కోసం మెగా పీటీఎంలను నిర్వహించారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆటల పోటీలు తప్ప..సాగని చర్చలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం సమావేశాలు మొదలు పెట్టినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆటల పోటీలు, డ్యాన్సులు చేయించారు. విద్యార్థులు విద్యలో ఎలా రాణిస్తున్నారు? ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు? వారి అభ్యున్నతికి చేపట్టే చర్యలేమిటి? పాఠశాల అభివృద్ధికి చేయాల్సిన పనులేమిటి? ఇలా పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ దిశగా చర్చలేమి మెగా పీటీఎం సమావేశాల్లో జరగని పరిస్థితి కనిపించింది. ఈ సమావేశాలకు కూటమి ఎమ్మెల్యేలు హాజరై గొప్పలు చేసేశామనే ధోరణిలో ప్రసంగాలు చేసి వెళ్లి పోయారు. దాదాపు 90 శాతం పైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా వరకు పాఠశాలల్లో విద్యార్థుల పురోగతిని తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రాస్ కార్డులను సైతం ఇవ్వని పరిస్థితి నెలకొంది. అధికంగా గైర్హాజరు జిల్లాలోని 2,984 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో 20 శాతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం జాడే కనిపించని పరిస్థితులు నెలకున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం సమావేశాలకు 2,60,641 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి 2,894 మంది తల్లిదండ్రులు మాత్రం హాజరైనట్లు విద్యాశాఖ నివేదికలు పేర్కొన్నాయి. వీటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు ఈ సమావేశాల నిర్వహణ తీరు ఎలా సాగిందన్న విషయం. కాగా కూటమి ప్రభుత్వంలో రెండో విడత ఈ సమావేశాలు నిర్వహించారు. గతంలో మొదటి సారి నిర్వహించిన ఈ సమావేశాల్లో చర్చించిన సమస్యలేవి పరిష్కారం కాలేదని తల్లిదండ్రులు పెదవి విరిచారు. ఈ సమావేశాల వల్ల ఒరిగిందేమి లేదని తల్లిదండ్రులు విమర్శలు గుప్పించారు. ప్రైవేట్, కార్పొరేట్లో ఇష్టానుసారం జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం 2.0 సమావేశాలను ఇష్టానుసారంగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం వరకు కొన్ని పాఠశాలల్లో.. మరికొన్ని పాఠశాలల్లో 11.30 గంటలకే ముగించేశారు. అలాగే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలను భేఖాతర్ చేశారు. జిల్లాలోని నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో మెగా పీటీఎం అని కాకుండా పేర్లు మార్చి సమావేశాలు నిర్వహించి మమ అనిపించేశారు. కూటమి ప్రచారం తప్ప ఒరిగిందేమి లేదు సమావేశంలో చర్చకు రాని విద్యార్థుల పురోగతి అధికంగా గైర్హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేరు మార్చి సమావేశాలు జిల్లాలో మెగా పీటీఎం 2.0 నిర్వహణ సమాచారం జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలలు : 2,984 సమావేశాలకు రిజిస్టర్ చేసుకోని పాఠశాలలు : 6 హాజరైన తల్లులు : 1,731 హాజరైన తండ్రులు : 1,112 హాజరైన సంరక్షకులు : 51 మొత్తం విద్యార్థులు : 2,60,641 హాజరైన విద్యార్థులు : 2,07,621 గైర్హాజరైన విద్యార్థులు : 53,020కొన్ని ఉదాహరణలు ఇలా.. చిత్తూరు సంతపేటలోని పీఎన్సీ మున్సిపల్ పాఠశాలలో మొత్తం 409 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కొందరు తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ హామీ ఏమైంది సార్ అని ప్రశ్నించారు. ఇందుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి అంటూనే చివర్లో చిన్న సమస్యతో పెండింగ్ పడింది. త్వరలోనే కేంద్రీయ విద్యాలయ హామీ నెరవేరుతుందన్నారు. 409 మంది తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉండగా 150 మంది విద్యార్థులు మాత్రం సమావేశానికి హాజరయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం ఊటూరు ప్రాథమిక పాఠశాలలో నలుగురే విద్యార్థులున్నారు. ఆ నలుగురు విద్యార్థుల తల్లిదండ్రులు అర్ధగంట పాటు ఉండి వెళ్లిపోయారు. నగరి నియోజకవర్గంలోని నగరి మండలం ఎం.కొత్తూరు జెడ్పీ హైస్కూల్లో 226 మంది విద్యార్థులుంటే 36 మంది తల్లిదండ్రులు మాత్రమే హాజరయ్యారు. నగరి నియోజకవర్గంలోని చింతలపట్టెడ వినాయకపురం జెడ్పీ హైస్కూల్లో 175 మంది విద్యార్థులకుగాను ఐదుగురు తల్లులు మాత్రమే మెగా పీటీఎం సమావేశానికి హాజరయ్యారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొంది. -
తానా కార్యదర్శిగా సునీల్ పాంట్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) కార్యదర్శిగా జిల్లాకు చెందిన సునీల్ పాంట్ర ఎన్నికయ్యారు. తానా సంఘంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పలు పదవులు అనుభవించారు. ఈ నేపథ్యంలో తానా కార్యదర్శిగా ఎంపికయ్యారు. కాగా ఆయన మన రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఘనంగా సత్యనారాయణ వ్రతం కాణిపాకం: గురుపౌర్ణమి సందర్భంగా కాణిపాకంలో సత్యనారాయణస్వామి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీభూదేవి సమేత శ్రీవరదరాజులస్వామి ఆలయంలో గురువారం పౌర్ణమి పూజలు చేశారు. ఈ సందర్భంగా మూలవిరాట్కు విశేషాలంకరణ చేసి, అర్చన జరిపారు. అనంతరం సత్యనారాయణ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్ని వ్రతం ఆచరించి, తరించారు. -
వైద్యంపై నకిలీ పెత్తనం
డాక్టర్లు...డమ్మీ? అనుమతులు లేని క్లినిక్ల విషయాన్ని పక్కన పెడితే.. డాక్టర్లు కూడా నకిలీలు తయారయ్యారు. దర్జాగా డాక్టర్లగా కొనసాగుతున్నారు. ఇష్టామొచ్చినట్లు చికిత్సలు చేస్తూ..అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది డమ్మీ డాక్టర్లు ఏకంగా ప్రసవాలు, చిన్నపిల్లల వైద్య చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర వాటికి చికిత్సలు చేస్తుండడంతోపాటు ఏకంగా సర్జరీలు చేస్తూ.. రూ.లక్షలు కాజేస్తున్నారు. రెగ్యులర్గా కొంత మందికి సలహాలు ఇస్తూ.. ఎంబీబీఎస్ డాక్టర్లుగా నమ్మిస్తున్నారు. వీరంతా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పుట్టుకొస్తున్నారు.జ్వరం.. దగ్గు.. ఆయాసం.. గుండెపోటు.. వ్యాధి ఏదైనా నయం కావాలంటే నాణ్యమైన వైద్యం అందాలి. అయితే నకిలీల వైద్యం రోగి బతుకులో విషం చిమ్ముతోంది. రోగిని అప్పులు పాలు చేయడమే కాకుండా అతడి ప్రాణాలను హరిస్తోంది. జిల్లాలో ఈ నకిలీల బెడదతో పలువురు నష్టపోయారు. అయినా ఏమాత్రం జంకు లేకుండా నకిలీ క్లినిక్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైద్యంపై నకిలీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. చిత్తూరురూరల్ (కాణిపాకం): జిల్లా నకిలీ వైద్యు లు, అక్రమార్కులకు చిరునామాగా మారింది. జిల్లాలో గతంలో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కరెన్సీ వెలుగుచూడగా, ఇటీవల కాలంలో నకిలీ వైద్యులు పట్టుబడుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా రెండురోజులకు కిందట ఓ డాక్టర్ నకిలీ కార్డియాలజిస్ట్ అన్న విషయం వెలుగుచూసింది. దీనికితోడు జిల్లాలో నకిలీ దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో 900 క్లినిక్లు, 250 ఆస్పత్రులు, 20 పాలీక్లినిక్లు, 2వేల వరకు ఆర్ఎంపీ క్లినిక్లు ఉన్నాయి. ఇవన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతులతో నడుస్తున్నాయి. అయితే అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లు జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఒకదానికి కూడా రిజిస్ట్రేషన్ లేదు. ఇష్టానుసారంగా వైద్య కార్యకలపాలు నిర్వర్తిస్తున్నారు. చిత్తూరు పొన్నియమ్మ గుడివీధి, సుందరయ్యవీధి, చర్చివీధి, కొంగారెడ్డిపల్లి, పలమనేరు రోడ్డు. వన్డిపో రోడ్డు, మిట్టూరు, మురకంబట్టు, ప్రశాంత్నగర్, యాదమరి, పలమనేరు, కుప్పం, ఎస్ఆర్ పురం, నగరి తదితర ప్రాంతాల్లో ఈ నకిలీ క్లినిక్లు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. నకిలీ డాక్టర్లకు రూ.లక్షల్లో ఫీజులు జిల్లాలో కార్డియాలజిస్ట్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. గుండె జబ్బు వస్తే తిరుపతి, తమిళనాడులోని వేలూరు, రాణిపేట, చైన్నె, కర్ణాటకలోని బెంగళూరును ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో నకిలీ డాక్టర్లు డిమాండ్ ఉన్న విభాగానికి డాక్టర్గా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రత్యక్షమవుతున్నారు. ప్రైవేటు క్లినిక్లను నడిపిస్తూ రూ.లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే ఫీజుతో పాటు సకల వసతులు ఉండేలా చూసుకుంటున్నారు. వైద్యశాఖ అనుమతులు తప్పనిసరి ఎవరైనా వైద్యులు తమ వైద్యవృత్తిని నిర్వహించుకోవాలంటే ముందుగా డీఎంహెచ్ఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యకోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించాలి. వైద్యాధికారులు సదరు సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతే ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తారు. అలాగే ఇండియన్న్ మెడికల్ అసోసియేషన్ మెంబర్షిప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల జీవితాలతో నకిలీ వైద్యులు చెలగాటం ఆడుతుంటే.. ప్రభుత్వ వైద్యాధికారులు ఏం చేస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయనాయకులు, అధికారుల పలుకుబడితో వైద్యవృత్తికి సంబంధం లేని వ్యక్తులు జిల్లా కేంద్రంలో ఆస్పత్రులను నిర్వహిస్తుండడం గమనార్హం. తక్కువ మొత్తంలో జీతాలకు నామమాత్రంగా వైద్యులను తీసుకువచ్చి ఆస్పత్రులను నడుపుతున్నారు. ఎలాంటి అర్హత లేని వారు వైద్యవృత్తిని కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో క్లినిక్ల పేరుతో నకిలీ దందా చిత్తూరులో కలకలం సృష్టిస్తున్న నకిలీ డాక్టర్ల వ్యవహారం అనుమతులు లేకుండా క్లినిక్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా వైద్యం.. పెయిన్స్ కిల్లర్స్ వారి ఆయుధం తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా జిల్లాలోకి నకిలీ వైద్యులు ఇదిగో సాక్ష్యం.. చిత్తూరు నగరంలోని భరత్నగర్లో కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి తన ఇంట్లోనే లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జిల్లాలో సంచలనం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి స్కానింగ్ చేసి, అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయం కలెక్టర్ చెవిలో పడడంతో ఆయన నిఘా పెట్టి పట్టుకున్నారు. కేసు నమోదు చేయించారు. పట్టుబడిన వారిలో చిత్తూరు వాసులతో పాటు తమిళనాడు వాసులున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం మేరకు చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తిది గుంటూరు జిల్లా. ఇతడు కొన్నేళ్లుగా కార్డియాలజిస్ట్గా నమ్మిస్తున్నాడు. బాధితులు మాయగాడి అవతారాన్ని బహిర్గతం చేయడంతో నకిలీ వ్యవహరం బయటకు వచ్చింది. ఏడేళ్లకు క్రితం ఓ మీడియా కూడా కార్డియాలజిస్ట్ నకిలీ వ్యవహరాన్ని బయటపెట్టింది. కొన్నాళ్లు తలదాచుకున్న ఈ వ్యక్తి బెంగళూరు నుంచి చిత్తూరు నగరానికి వచ్చాడు. ఇక్కడ డాక్టర్గా నమ్మించాడు. తీరా గుట్టు బయటకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి సర్టిఫికెట్ ఎలా వచ్చింది. మెడికల్ కౌన్సిల్లో ఎలా పేరు నమోదైందనే విషయంపై పలువురు వైద్య నిపుణులు అవాక్కవుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లో రూ.2 స్టాంప్లా ఉంటుందని, ఆ స్టాంప్ నకిలీ డాక్టర్ ఇచ్చుకున్న సర్టిఫికెట్లో లేదని, ఇది దొంగ పత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ డాక్టర్లుగా రుజువైతే కేసులుంటాయి. అలాంటివి జిల్లాలో ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బులు కోసం నకిలీ డాక్టర్లుగా అవతారమెత్తి..ప్రజల ఆరోగ్యాన్ని హరించకండి. ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులను సంప్రందించాలి. లేకుంటే గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలి. నకిలీ డాక్టర్లను నమ్మొద్దు. – సుధారాణి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు -
రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరణపై ఆగ్రహం
● విలువలు పాటించకుండా కర్షకులపై వ్యతిరేక కథనాలు ● కూటమి సర్కార్కు తొత్తుగా మారిన పచ్చమీడియా ● మండిపడుతున్న అన్నదాతలు రైతులను అవమానించడం దారుణం బంగారుపాళెం సమావేశానికి వెళ్లిన వారు రైతు లు కాదు.. దండుపాళెం బ్యాచ్ అంటూ ఓ పత్రిక లో వార్త చూశా. ఓ రైతు గా మనసులో చాలా బాధేసింది. పదిమందికి అన్నం పెట్టే రైతులంటే అందరికీ చులకన అయినట్టుంది. అన్నీ తెలిసి, బాగా చదువుకున్న వారే ఇలాంటి రాతలు రాయడం మంచిది కాదు. ఆ స్థానంలో మామిడి రైతే కాదు ఏ రైతున్నా ఒక్కటే కదా? ఎవరిపైనో కోపాన్ని రైతులపై చూపడం భావ్యం కాదు. – గోవిందురెడ్డి, రైతు, బేరుపల్లి -
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ రొంపిచెర్ల: విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండా లని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. గురువారం రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ డ్రగ్స్ వాడకంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయన్నారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రుల నిఘా ఉంచాలన్నారు. ప్రతి రోజూ కొంత సేపు పిల్లలతో కలసి ఉండాలన్నారు. పిల్లలు ఏమి చేస్తున్నారో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకోవాలన్నారు. అలాగే పాఠశాలలకు పిల్లలు సక్రమంగా వెళ్లుతున్నారా? లేదా అని పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వం నెలకు ఒక విద్యార్థిపై రూ.5 వేలు ఖర్చు చేస్తుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పిల్ల లు విద్యార్థి దశలో సోషల్ మీడియా, సెల్ఫోన్లకు బానిసలవుతూ ఆట పాటలకు దూరం అవుతున్నా రని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలపై రుద్దడంతో వారు విజయాలు సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. చదువుకోవడంలో పిల్లలకు తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. అలాగే పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ మార్కు లు సాధించిన రిషిత, భరత్ కుమార్, వీణావాణికి షైనింగ్ అవార్డులు, సాధియా, రీద, గీతాశ్రీకి ఎన్ఎంఎంఎస్ అవార్డులను ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ అమరనాఽథ్, ఎంఈఓ శ్రీనివాసులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రెడ్డి ప్రదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
శాంతిపురం: తెలుగుదేశం పార్టీ నాయకులు మోసం చేశారంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్లగట్ట పంచాయతీలోని తంబిగానిపల్లికి చెందిన ఎం.ఎల్లప్ప గురువారం కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. తనకు మంచి పదవి ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు తమ పంచాయతీలోని టీడీపీ నాయకులు పార్టీలోకి చేర్చుకున్నారని ఎల్లప్ప చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం తిప్పుకోవడంతోపాటు భారీగా ఖర్చులు పెట్టించారని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా తనకు పదవి ఇవ్వలేదన్నారు. పదవి ఇవ్వాలని, పక్కా ఇల్లు ఇవ్వాలని పదే పదే అడిగితే తనను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరానికి తనను వాడుకుని మోసం చేశారని అర్థం కావడంతో తాను ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా పాలన సాగించి, మాట తప్పని నేతగా నిలిచిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కర్లగట్ట ఎంపీటీసీ సభ్యుడు చలం, నాయకులు శ్రీనివాసులు, వెంరటముని తదితరులు పాల్గొన్నారు. -
బంగారు విభూది పట్టి విరాళం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారికి గురువారం యూఎస్ఏకు చెందిన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.14 లక్షలు విలువ చేసే 140 గ్రామల బంగారు విభూది పట్టిని స్వామివారికి విరాళంగా ఇచ్చారు. దాతలు ఈ పట్టిని ఈఓ పెంచల కిషోర్కు అందజేశారు. అనంతరం వారికి ఆలయాధికారు లు ఆలయ మర్యాదలు చేసి, స్వామివారి దర్శనం కల్పించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి యాదమరి: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జా యింట్ కలెక్టర్ విధ్యాదరి అన్నారు. గురువారం ఆమె కోనాపల్లిలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ వంతు తోడ్పాటు అందించాలన్నా రు. ఎంఈఓ రుక్మిణి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిత చేకూరుతుందన్నారు. పిల్లలు సెల్ఫోన్ల తో కాలక్షేపం చేయకుండా చదువుపై దృష్టి సా రించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. అలాగే కొట్టాలం ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు యూసఫ్ తల్లిదండ్రులతో పాఠశాల అభివృద్ధి, బోధన, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ పార్థసారథి, ఎంఈఓ–2 ప్రసాద్, ఉపాధ్యాయులు వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆరోగ్య వివరాలు సేకరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల ఆరోగ్య వివరాలను పకడ్బందీగా సేకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సూపర్వైజర్ 150 మంది పిల్లల బరువు వివరాలను సేకరించి రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. కచ్చితమైన కొలతలు నిర్వహించాలన్నారు. గత వివరాలతో సరిపోల్చి పురోగతిని అంచనా వేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పప్పు, పాల సరఫరాలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలన్నారు. చిన్నారుల్లో ఆధార్ సమస్యలున్నట్లైతే సరిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్ సమస్యలు ఎక్కువగా ఉన్న మండలాలను గుర్తించి, నివేదికలు అందజేయాలన్నారు. సూపర్వైజర్ నిత్యం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు. కుప్పంలో ఆరోగ్య, పోషణ స్క్రీనింగ్ నాణ్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆగ్రహం బంగారుపాళెం: ‘టీడీపీ ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తేలేదు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి తమ కష్టాలను చెప్పకునేందుకు వచ్చిన రైతులపై కూటమి సర్కారు పోలీసులతో లాఠీచార్జి చేయించడం దారుణం.’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. గురువారం ఆయన బంగారుపాళెంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎంకు రైతులు కష్టాలు చెప్పుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో రైతులను దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులతో అనుచితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. మీడియా ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి ప్రభుత్వానికి కొమ్ముకాస్తోందన్నారు. జగన్మోహన్రెడ్డి పర్యటనకు జనం కరువయ్యారంటూ మొదటి పేజీలో ఫొటో పెట్టారన్నారు. 13వ పేజీలో 10 వేల మంది జనం వచ్చారని రాసుకోచ్చారన్నారు. మరి 10 వేల మంది జనం ఫొటోను ఎందుకు పెట్టలేకపోయారని మండిపడ్డారు. జగన్ పర్యటనకు రానీయకుండా బంగారుపాళేనికి 30 కిలోమీటర్ల అవతల నుంచి ఆంక్షలు విధించి, బారికేడ్లు పెట్టి, బెదిరించి రానీయకుండా చూశారన్నారు. అవేవీ లెక్క చేయకుండా రైతులు, అభిమానులు బంగారుపాళేనికి తరలిరాచ్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి కాదన్నారు. జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే, తానూ ఎమ్మెల్యేనే అంటూ సవాల్ చేయడం మంచిపద్ధతి కాదన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎమ్మెల్యే జూస్ ఫ్యాక్టరీ యజమానుల వద్ద కమీషన్లు తీసుకుని రైతులకు అన్యాయం చేసి, వారి కడుపుకొట్టారని ఆరోపించారు. మామిడికి గిట్టుబాటు ధర రాక మామిడి చెట్లను నరికి వేస్తున్నారని, అ విషయం ప్రభుత్వం కళ్లకు కనిపించలేదా? అని మండిపడ్డారు. జగన్ పర్యటలో మద్యం, బిరియాని పంపిణీ చేశామని ప్రచారం చేస్తున్నారన్నారు. వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సత్యప్రమాణం చేయగలరా? అని సవాలు విసిరారు. నాయకులకు నోటీసులు అందించి, కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రైతులు ఆవేదన చెంది మామిడి కాయలను రోడ్డుపై పడేెస్తే దానిపైనా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు. మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, కుమార్రాజా, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షడు పాలాక్షిరెడ్డి, మాజీ సర్పంచులు ప్రకాష్రెడ్డి, కృష్ణమూర్తి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు గజేంద్ర, నాయకులు పరదేశి, మహేంద్ర, రఘుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల అనంతరం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం
సదుం: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వి జయం ఖాయమని, తరువాత టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి తెలిపారు. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డితో కలసి గురు వారం బాబు షూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరకాలంగా చంద్రబాబు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గాలికొదిలేసి, ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ కోసం కష్టపడుతున్నవారిని వేధించడమే పని గా పెట్టుకున్నారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకనే నిస్సిగ్గుగా అమలు చేస్తున్నట్లు ప్రకటించడం ఆయనకే చెల్లిందన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనలేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కడం చంద్రబాబు నైజమన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మామిడి కిలో రూ. 2 పలకడం తన జీవింతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక రాష్ట్రం కిలో రూ.16 మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం లక్షలాది టన్నులు కొనుగోలు చేస్తుంటే, ఢిల్లీకి మంత్రిని పంపి, కిలోకు రూ.4 ధరతో రూ. 260 కోట్లు చాలని కోరడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. హామీల పేరుతో మోసం జగన్ అమలు చేసిన సంక్షేమం కంటే మరింత ఎక్కువ చేస్తానని ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు కరుణాకరరెడ్డి తెలిపారు. కూటమి పాలనలో అరాచకాలే మిగిలాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను జైళ్లకు పంపుతున్నారని, 680 మంది సోషియల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. ప్రభుత్వం 2 వేల మంది పోలీసులు ఎంత ఇబ్బందులు పెట్టినా బంగారుపాళెంలో మామిడి రైతులు నిర్వహించింది కవాతు అని చెప్పారు. బంగారుపాళెం పర్యటన చూసి జిల్లాలో వైఎస్సార్సీపీ సత్తా ఏమిటో వారికి తెలిసివచ్చిందన్నారు. పార్టీ కార్యక్రమాలు చూసి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కొన్ని పచ్చ పత్రికలు ఏ రోజూ నిజం రాయవని, వైఎస్సార్సీపీపై నిందలు లేకుండా ఒక వార్తా రాయలేరని అన్నారు. బంగారుపాళెం పర్యటనను దండుపాళెం బ్యాచ్గా వర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు దండుపాళెం బ్యాచ్ అయితే టీడీపీ నాయకులు వారికి వేదపండితులు, మునులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, పోకల అశోక్ కుమార్, ఫకృద్ధిన్, చెంగారెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఆగని గజదాడులు
పులిచర్ల మండంలో గజదాడులు ఆగడం లేదు. రోజుకో చోట పంటలపై దాడులు చేసి, ధ్వంసం చేస్తున్నాయి.●అది మంచి పద్ధతి కాదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలో దండుపాళ్యెం బ్యాచ్ దాడులంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు రాయడాన్ని తప్పుపడుతున్నాం. పత్రికలంటే ఎంతో గౌరవం ఉంది. ఒక వేళ రాజకీయంగా మీకు అనుకూలంగా ఉన్న నాయకుడిపై మంచి కథనాలు రాసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే రైతులకు వ్యతిరేకంగా దండుపాళ్యెం బ్యాచ్ అంటూ కథనం ఇవ్వడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. – సుబ్రమణ్యం, రైతు, జంగాలపల్లి, వెంకటగిరి రూరల్ మండలం మంచి చెడులతో సంబంధం లేదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలకు మంచి చెడులతో సంబంధం లేదు. రైతులు, పేదోడు అనే భావన లేదు. ఒకటే మార్గం చంద్రబాబు ఏమీ చేసినా అదే కరెక్ట్గా భావిస్తున్నారు. ఆయనపై ఒక కథనం చెడుగా ఇప్పటి వరకు ఆ పత్రికల్లో రాలేదు. అంటే సీఎం చంద్రబాబు వందశాతం మంచే చేస్తున్నారా? ప్రతి పక్షనేతపై ఒక్క మంచి కథనం ఇప్పటివరకు ఇవ్వలేదు. చివరికి దండుపాళ్యెం బ్యాచ్ అంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయమో తెలియడం లేదు. – గుర్రం నాగిరెడ్డి, రైతు, ఆర్సీ పురం దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఎంటీ ? రైతులను ఎల్లో మీడియా దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఏమిటో తెలియడం లేదు. ఎంతో దారుణంగా కథనాలు రాస్తున్నా రు. చంద్రబాబును బతికించడానికే ఆ పత్రికలు పనిచేస్తున్నాయి. మామిడి రైతులు కష్టాల్లో ఉంటే వారిని పరామర్శించడానికి వచ్చిన వారిపై విషాన్ని చిమ్మడం ఎందుకో అర్ధం కావడం లేదు. పత్రిక విలువలు పూర్తిగా దిగజార్చి కథనాలు రాస్తున్నా యి. రైతులకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం. – తిరుమల రెడ్డి, రైతు, కారూరు, సూళ్లూరుపేట నియోజకవర్గం – 8లో -
కాణిపాకం వినాయక ఆలయంలో అపచారం.. మండిపడ్డ భక్తులు
సాక్షి, చిత్తూరు: కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. వినాయక స్వామి వారి అభిషేకానికి పాడైపోయిన(విరిగిపోయిన) పాలను ఉపయోగించుకున్నారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రతీరోజు ఉదయం, సాయంత్రం క్షీరాభిషేకం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. అయితే, బుధవారం సాయంత్రం స్వామి వారికి అభిషేకం చేయడానికి విగిరిపోయిన, నాసిరకం పాలను ఉపయోగించారు. కాంట్రాక్టర్ ఇలా విరిగిపోయిన పాలను సరఫరాల చేయడంతో స్వామి వారికి ఇలానే అభిషేకం కానిచ్చేశారు. ఇది చూసిన భక్తులు.. అపచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, నాసిరకం పాలను సరఫరా చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
లాఠీ కాఠిన్యం.. రక్తమోడినా తరగని అభిమానం
చిత్తూరు: తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్రెడ్డికి వైఎస్ఆర్ అన్నా.. ఆ కుటుంబమన్నా అతనికి ప్రాణం.. మహానేత రాజశేఖరరెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా.. పది మందికీ అన్నం పెడతాడు; రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకుంటాడు.. జననేత జగనన్న అంటే అతనికి మహాఇష్టం.. రాజన్న బిడ్డగానే కాదు.. తన అభిమాన నాయకునిగా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతడు అభిమాననేత పర్యటనకు ఉత్సాహంగా వెళ్లాడు. అయితే అడుగడుగునా పోలీసుల అవరోధాలు, ఆంక్షలు అధిగమించి వెళ్లిన అతడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. లాఠీచార్జ్ చేసి తల పగగొట్టారు.వివరాలు..మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వాన్ని నిలదీయడానికి బంగారుపాళెంకు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకుని శశిధర్రెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం 5 గంటలకే తిరుపతి నుంచి బయలుదేరి పోలీసుల ఆంక్షలన్నీ అధిగమించి బంగారుపాళెం వెళ్లిన శశిధర్రెడ్డి అక్కడకు వచ్చిన వేలాది మంది జనంలో ఒక్కడిగా జగనన్న రాక కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో జగనన్న కాన్వాయ్ వస్తుండగా జనం తోపులాటలో తాను దగ్గరకు వెళ్లి కళ్లారా జగనన్నను చూడాలని తపించాడు.దీంతో అక్కడే ఉన్న పోలీసులు తమ చేతిలోని లాఠీలకు పనిచెప్పారు. రాక్షసత్వంగా వ్యవహరించి తలపై లాఠీలతో బలంగా కొట్టారు. ఆ లాఠీ దెబ్బకు తలపగిలిన శశిధర్రెడ్డి ముఖంపై రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అలాగే ముందుకొచ్చాడు.. ఇది చూసి జగనన్న చలించిపోయారు. కాన్వాయ్ దిగి అతని వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గాయపడ్డ శశిధర్రెడ్డిని దగ్గరకు తీసుకుని తలకు తగిలిన గాయం చూసి మరింత ఆవేదనతో పోలీసుల తీరుపై అక్కడే ఉన్న ఎస్పీ మణికంఠ చందోలుపై మండిపడ్డాడు. తన కోసం వచ్చిన కార్యకర్తల తలలు పగలగొట్టడమేమిటని ప్రశ్నించారు. అనంతరం శశిధర్రెడ్డిని ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. శశిధర్రెడ్డి కూడా తన అభిమాన నాయకున్ని చూశానన్న ఆనందంలో తలకు తగిలిన గాయా న్ని లెక్క చేయకపోవడం విశేషం! ఆ తరువాత కొంతసేపటికి అక్కడే ఉన్న అంబులెన్స్లో ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి తిరుపతికి చేరుకున్నాడు. -
పోలీసుల ఓవర్యాక్షన్!
పలమనేరు: పోలీసులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎక్కడాలేని ఆంక్షలు పెట్టి ఓవర్యాక్షన్ చేశారు. పలమనేరు వైపు నుంచి ద్విచక్ర వాహనాలను సైతం పంపకుండా పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద అడ్డుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వాహనాన్ని ఆపారు. ఆపై మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆపై అక్కడున్న వారిని పోలీసులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటకు పంపారు.పోలీసుల జులుంపలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు బంగారుపాళెం ఫ్లైవర్ నుంచి కాలినడకన వెళ్తుండగా అక్కడున్న పోలీసులు జనంపై లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు సర్దిచెబుతున్నా లెక్కచేయలేదు. ఒకానొక సందర్భంలో పోలీసులపై ప్రజలు తిరగబడాల్సి వచ్చింది. ఎటూ చూసి నా జనాన్ని చూసిన పోలీసులు శత్రువులును చూసినట్టుగా అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పోలీసుల కవ్వింపుల కారణంగానే ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యారు.బైక్ల తాళాలు లాక్కునీ..రోడ్డుపై బైకులో వస్తున్న వందలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. తాము స్థానికులమని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. వారి బైక్ కీలను లాక్కొన్నారు. దీంతో జనం ఆగ్రహానికి గురయ్యారు. వైఎస్ జగన్ పర్యటక ముగిశాక సైతం మార్కెట్ నుంచి జనం బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లను వేసేశారు. దీంతో భయపడిన జనం గోడలు, గేట్లు దూకి బయటకు వెళ్లాల్సి వచ్చింది.సీఎం.. డౌన్డౌన్కాణిపాకం: బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్ గేటు ఎదుట బుధవారం ఉదయం 10.30గంటల ప్రాంతంలో రైతులు, జగనన్న అభిమానులు రెండో గేటు ఎదుట ఆగ్రమానికి గురయ్యారు. లోపాలికి పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పట్టించుకోని పోలీసులతో విసిగిపోయిన వారు సీఎం డౌన్..సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు మిన్నంటించారు. ఆపై ఒక్కసారిగా వారంతా మొదటి గేటులో నుంచి మార్కెట్ లోపలకి దూసుకొచ్చారు. కొందరు మార్కెట్ ప్రహారీ గోడను ఎక్కి లోపలికి తరలివచ్చారు.చిన్నారి పులకింతకాణిపాకం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, స్థానికులతో పాటు వృద్ధులు, చిన్నారులు కూడా వైఎస్ జగన్ను చూసేందుకు తరలివచ్చారు. అందులో భాగంగా ఓ (చిత్తూరుకు చెందిన హోమ శైలుషా 7వ తరగతి) చిన్నారి తన భామతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు రోడ్డుపై వేచి ఉంది. వీరిని గమనించిన జగన్మోహన్రెడ్డి తన కాన్వాయ్ని ఆపి వారిని దగ్గరకు పిలిచారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారిద్దరూ ఆనందంలో మునిగితేలారు. -
బంగారుపాళెంలో జన సునామీ
● కూటమి కుయుక్తులు.. ఆంక్షల కంచె పటాపంచలు ● అభిమాన నేతను చూసి మురిసిపోయిన అక్కచెల్లెమ్మలు ● మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చిత్తూరు అర్బన్/ కాణిపాకం/ పలమనేరు/ బంగారుపాళెం: ఒకే ఒక వ్యక్తిని అడ్డుకోవడానికి వందలాది మంది ఖాకీలు. కానీ వేలాది మంది అభిమానం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. చివరకు ఏ సంబంధం లేని సామాన్యులను సైతం అడ్డుకున్నారు. అడగుడగునా ఆంక్షల చట్రం విధించినా ఏ మాత్రం అవి పనిచేయ లేదు. మామిడి రైతులను పరామర్శించడానికి బుధవారం బంగారుపాళెంకు వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన దిగ్విజయంగా ముగిసింది. రెడ్జోన్గా బంగారుపాళెం వాహనాల్లో బంగారుపాళెంకు వెళుతున్న పలువురు నాయకులను మహాసముద్రం టోల్గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలందర్నీ అదుపులోకి తీసుకుని చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. అసలు ఏ బస్సు కూడా బంగారుపాళెం లోపలకు వెళ్లకూడదని, జాతీయ రహదారి మీదుగా కూడా వెళ్లకూడదని హుకూం జారీ చేశారు. బంగారుపాళెం బస్సు టికెట్లే ఇవ్వలేదు. పలమనేరు టికెట్టు కొనుక్కున్న ప్రయాణికులు హైవేల వైపు దిగి కిలో మీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహాసముద్రం టోల్ గేటు వద్ద బస్సుల్లోకి ఎక్కిన పోలీసులు ఎవరైనా బంగారుపాళెంకు వెళుతున్నారా..? అని అడుగుతూ.. వెళుతున్నామంటే ప్రయాణికులను సైతం అదుపులోకి తీసుకున్నారు. టోల్ గేటు వద్ద దించేశారు. పలుచోట్ల లాఠీ చార్జ్ వైఎస్.జగన్ను చూడడానికి పలుచోట్ల ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడ్డారు. వీళ్లను తరమివేయడానికి పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. చాలా చోట్ల ప్రజలు పోలీసుల మాటల్ని లెక్కచేయకపోవడంతో లాఠీలతో చావ బాదారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్యులు సైతం గాయపడ్డారు. మరికొన్ని చోట్ల ప్రజల్ని నెట్టేయడంతో తోపులాటకు కింద పడిపోయారు. నాయకులపై జులుం వైఎస్సార్సీపీ నాయకులపై చాలా చోట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు డా.సునీల్, వెంకటేగౌడ, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తమ కార్యకర్తలతో హెలిప్యాడ్ వద్దకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. తాను మాజీ ఎంపీ అని రెడ్డెప్ప చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమార్, వెంకటగౌడ్, బియ్యపు మధుసూదన్రెడ్డి, నియోజవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, భూమన అభినయరెడ్డి, కృపాలక్ష్మి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారుపాళెంలో జగన్ జాతర మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన జన జాతరను తలపించింది. బంగారుపాళెం చుట్టూ పోలీసులు విధించిన ఆంక్షలు పటాపంచలయ్యాయి. పోలీసుల అడ్డగింతలు, నోటీసులతో జనం ఉలిక్కిపడ్డారని అధికార పక్షం, అధికారులు అనుకున్నారు. మార్కెట్ ప్రాంగంణం, రోడ్డు మార్గంలో జనం పలుచగా ఉన్నారని తెగ సంబరపడ్డారు. ఆ తర్వాత ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. వీరి రాకతో మార్కెట్ ప్రాంతమంతా నిండిపోయింది. కర్ణాటక సరిహద్దు నుంచి ఆంక్షలు బంగారుపాళెంకు జనం వెళ్లకుండా పోలీసులు కర్ణాటక సరిహద్దుల్లోని గంగవరం మండలం, కుప్పం ప్రాంతంలో వీకోట, బైరెడ్డిపల్లి, జాతీయ రహదారిలో గాంధీనగర్ వద్ద భారీగా మోహరించారు. బంగారుపాళెంకు వెళ్లే గ్రామీణ రహదారులను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు. -
విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రిడ్జ్ కోర్సును బుధవారం ప్రారంభించారు. వర్సిటీలోని చెలికాని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, స్కూల్ ఆఫ్ దర్శన్ డీన్ ప్రొఫెసర్ విష్ణుభట్టాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్కృత భాషతోపాటు అందులో శాసీ్త్రయ అంశాలు, శాస్త్రాల సమగ్ర జ్ఞానాన్ని బ్రిడ్జ్ కోర్సులో అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, సహాయక ఆచార్యులు డాక్టర్ యశస్వి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా వీసీ కాన్ఫరెన్స్లో ఎన్ఎస్యూ వీసీ తిరుపతి సిటీ : కర్ణాటకలోని ముద్దెనహలి, సత్యగ్రామ, సత్యసాయి ప్రేమామృతం వేదికగా జరిగిన ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారత్ విశ్వగురువుగా వెలుగొందేందుకు తీసుకోవాల్సిన నూతన సంస్కరణలు, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ప్రోత్సహించడం, వర్సిటీల బలోపేతం తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో విస్తృతంగా చర్చించారు. -
జగన్ జనాదరణను అడ్డుకోలేరు
తిరుపతి కల్చరల్ : పంటకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతూ తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనలో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే చర్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపోతున్న మామిడి రైతుల పరామర్శకు మాజీ సీఎం మార్కెట్ యార్డుకు రావడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. పర్యటనలో ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడమే కాక వారిని దూర ప్రాంతాలకు తరలించి నిర్భంధించడం దుర్మార్గ చర్య అన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ నిర్భంధాలకు పూనుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ రైతు సంఘం నేతగా తనతో మరో 30 మందిని జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకొని నిర్భంధించడమే కాక కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వ్యవహరించడం చూస్తే పోలీసులు కూటమి ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే కేసులు పెడతామని, రౌడీషీట్ పెడతామని స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి ఒక అవివేకని విమర్శించారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి కేంద్ర సహకారంతో మామిడి కిలో రూ.16 కల్పిస్తే ఆంధ్రాలోని మామిడి రైతులు నష్టపోతున్నా నోరు మెదపక, శ్రీవారి దర్శనాలే ప్రరమావధిగా వ్యవహరించే బీజేపీ నేత పసలేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు వెంకటేష్రెడ్డి, కె,వెంకటాచలం పాల్గొన్నారు. -
ఆంక్షల గట్టు దాటి.. తండోపతండాలు
ఎస్పీలు.. డీఎస్పీలు.. ఏఎస్పీలు.. 2 వేల మందికిపైగా పోలీసుల కవాతు..! అదేమీ ఉగ్రవాద కల్లోలిత ప్రాంతం కాదు..! తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ బందోబస్తు అంతకంటే కాదు..! ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనలో ఐదు వందల మందికి మించి పాల్గొనకూడదంటూ ఆంక్షలు విధించింది. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు అణచివేతలకు పాల్పడింది. బంగారుపాళ్యంలో వేల సంఖ్యలో ఖాకీలను మోహరించింది. రైతుల కోసం తలపెట్టిన కార్యక్రమానికి రైతులెవరూ రాకూడదంటూ.. రౌడీషీట్లు తెరుస్తామంటూ నిర్భందాలకు తెగబడింది! ఈ సర్కారు ఎన్ని చేసినా.. ఎన్ని కుట్రలకు తెగించినా.. ఎటుచూసినా విరగకాసిన మామిడిలా జనమే.. జనం!! సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్ని పాట్లు పడినా, పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా.. తుదకు వైఎస్ జగన్పై ఉన్న జనాభిమానాన్ని అడ్డుకోలేకపోయింది. ఊరికొక చెక్ పోస్ట్.. బంగారుపాళ్యం చుట్టూ బారికేడ్లు.. వాటి వద్ద వందల మంది పోలీసుల మోహరింపు.. జగన్ పర్యటనకు రావొద్దని రైతులకు బెదిరింపులు.. రౌడీషీట్ తెరుస్తామని నాయకులకు నోటీసులు.. రోడ్డుపై ఆటో.. ట్రాక్టర్ కనిపిస్తే సీజ్ చేస్తామనే హెచ్చరికలు.. ఇలా అడుగడుగునా ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించారు. అయినా వైఎస్ జగన్ చిత్తూరు గడ్డపై కాలు మోపగానే జనసంద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. వేలాది మంది రైతులు బంగారుపాళ్యం వైపు పరుగులు తీశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను, పోలీసుల లాఠీ దెబ్బలను దాటుకుని అభిమాన నేత చెంతకు చేరారు. తమ కష్టాలను వివరించారు. నేనున్నాను.. అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో గుండెల్లో భారం దిగిందని ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. డీఐజీ, ముగ్గురు ఎస్పీల పర్యవేక్షణలో సుమారు 2000 మందికిపైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపింది. రెండు రోజులుగా పోలీసులు నిద్రాహారాలు మాని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయడంలో నిమగ్నమయ్యారు. జన సంద్రమైన మార్కెట్ యార్డుప్రభుత్వ అధికార యంత్రాంగం జనాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినా.. జనం మాత్రం ఆగలేదు. ఎక్కడైతే వాహనాలను ఆపి వెనక్కు పంపేశారో.. అక్కడి నుంచి కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టల మీదుగా వైఎస్ జగన్ పర్యటించే రహదారి సమీపంలోని మామిడి తోటల్లో వేచి ఉన్నారు. వైఎస్ జగన్ అక్కడికి రాగానే ఒక్కసారిగా రహదారిపైకి దూసుకురావటం కనిపించింది. కొత్తపల్లి హెలిప్యాడ్ నుంచి కొత్తపల్లి బ్రిడ్జి వరకు, తుమ్మేజిపల్లి, నలగాంపల్లి క్రాస్, దండువారిపల్లి, మాధవనగర్, ముంగరమడుగు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్డుపైకి చేరుకుని వైఎస్ జగన్కు జైకొట్టారు. వారిని గమనించిన వైఎస్ జగన్ కాన్వాయ్ని ఆపి వారితో ఆప్యాయంగా మాట్లాడి ముందుకు కదిలారు. కొత్తపల్లి నుంచి బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వరకు 5 కి.మీ దూరం ప్రయాణానికి 3 గంటల సమయం పట్టిందంటే ఎంతగా జనప్రవాహం పోటెత్తిందో ఇట్టే తెలుస్తోంది. ఏకంగా 25 చెక్పోస్టులువైఎస్ జగన్ పర్యటనకు వచ్చే వారిని నిలువరించేందుకు తిరుపతి– చిత్తూరు, పలమనేరు మార్గంలో బంగారుపాళ్యం చుట్టుపక్కల ఉన్న అన్ని మార్గాల్లో ఏకంగా 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాలను గాదంకి టోల్ప్లాజా వద్ద పోలీసులు చెక్ చేసి పంపటం ప్రారంభించారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు, పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు చెక్ చేయటం కనిపించింది. రైతులను నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపేశారు. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారెవరైనా బంగారుపాళ్యం టికెట్ తీసుకుని ఉంటే.. అటువంటి వారు అక్కడ దిగకుండా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నిజంగా బంగారుపాళ్యం వాసులైనా వారిని అక్కడ దిగనివ్వలేదు. అటు చిత్తూరు, ఇటు పలమనేరుకు పంపించేశారని పలువురు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు స్థానికులు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా కూడా వారిని కూడా ఆపి చెక్చేసి వెనక్కు పంపే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్కు వచ్చే సమయానికి యార్డులో రైతులు, మామిడి కాయలు లేకుండా బలవంతంగా తరలించేశారు. పోలీసులే వాహనాలను ఏర్పాటు చేసి మామిడి కాయలను తరలించటం కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ యార్డు మెయిన్ గేటుకు తాళం వేశారు. చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే ఆటోలు, ట్రాక్టర్లను సైతం సీజ్ చేశారు. -
ఎందుకీ నిర్బంధం.. ఆంక్షలు?
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో బుధవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు వెళ్తున్న క్రమంలో వైఎస్ జగన్ను కలిసేందుకు వచ్చిన రైతులు, మహిళలు, వృద్ధులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొన్నిచోట్ల లాఠీచార్జ్ చేశారు.పోలీసుల దాడిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం అయింది. దీన్ని గమనించిన జగన్మోహన్రెడ్డి స్థానిక పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. శశిధర్ రెడ్డికి వెంటనే మంచి వైద్యం అందించాలని వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. బాధితుడిని పరామర్శించడాన్ని కూడా ఎస్పీ అడ్డుకున్నారు. రూట్మ్యాప్ మార్చే యత్నంవైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నా.. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు మణికంఠ, విద్యాసాగర్ నాయుడు కాన్వాయ్ ముందుకు వచ్చి రూట్ మ్యాప్ మార్చే ప్రయత్నం చేశారు. సబ్వేలో వెళ్లాల్సిన కాన్వాయ్ని నేషనల్ హైవేపైకి మళ్లించమన్నారు. ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్లోనే కాన్వాయ్ వెళ్తుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నేషనల్ హైవేపై కాన్వాయ్ వెళితే అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారని, అందుకే సబ్వేలో ముందుకు వెళతామన్నారు. అనంతరం సబ్ వే ద్వారానే బంగారుపాళ్యం చేరుకున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల చిత్తూరు, బెంగళూరు హైవే మీద చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీనియర్ నేతలను సైతం అడ్డుకున్న వైనంమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు లెక్క చేయలేదు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బంగారుపాళ్యం చేరుకునేందుకు వాహనాల్లో వస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్కుమార్, వెంకటేగౌడ్, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అని పోలీసులు చులకనగా వ్యవహరించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, ఆయన అనుచరులను అడ్డుకుని వారిపై లాఠీచార్జ్ చేశారు. విజయానందరెడ్డి పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో పోలీసులు తోసెయ్యడంతో విజయానందరెడ్డి కింద పడిపోయారు. ‘సాక్షి’ విలేకరులపైనా ఎస్ఐ సుబ్బరాజు దురుసుగా వ్యవహరించారు. సాక్షి వారిని కొట్టుకుంటూ పోతే మరోసారి రారంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. మార్కెట్ యార్డు వద్ద కొందరు జర్నలిస్టులు తెల్ల చొక్కాలు ధరించడాన్ని కూడా పోలీసులు తప్పుపట్టారు. అక్రిడిటేషన్ కార్డు చూపించినా వారి వ్యవహార శైలి మారలేదు. ‘మామిడి’ వేదన.. రైతు రోదన!చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన నలుగురు రైతులు మామిడి కొనుగోలు చేసే వారు లేక విసిగిపోయారు. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో ఆవేదన గురయ్యారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకోవాలని వచ్చారు. అదే సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో మామిడి పంటను తిమ్మోజీపల్లి వద్ద రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు. కంట తడి పెడుతూ జగనన్నా.. నీవే దిక్కు అంటూ వెళ్లిపోయారు. రైతులను అడ్డుకోడానికి ఇంత మంది పోలీసులా?జగన్ రాకకు ముందు ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులుసాక్షి టాస్క్ఫోర్స్ : వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయోగించిన పోలీస్ బలగాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాయలసీమ డీఐజీ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్లు సహా 2,000 మంది పోలీసులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు. వీళ్లంతా జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం జగన్ అనే నాయకుడిని బంగారుపాళ్యం వెళ్లకుండా, మరీ ముఖ్యంగా ఆయన కోసం జనం ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకుండాం ఉండటం కోసమే పని చేశారు. ఎక్కడ చూసినా ఖాకీ యూనిఫాంలో గుంపులు గుంపులుగా కనిపించారు. యథేచ్ఛగా లాఠీలు సైతం ఝుళిపించారు. జగన్కు భద్రత కల్పించడంలో మాత్రం పోలీసుశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వారంతా చిత్తూరు నుంచి పలమనేరు వరకు మోహరించి.. బస్సులు, స్కూటర్లు, బైక్లు, కార్లలో వచ్చే వాళ్లను నిలువరించడంపైనే దృష్టి సారించారు. తీరా వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు లోపలకు అడుగు పెట్టగానే ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. కేవలం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప.. కానిస్టేబుల్ కూడా సమీపంలో లేరు. దీంతో వేలాది సంఖ్యలో తరలి వచి్చన జనం.. వైఎస్ జగన్ను చుట్టేశారు. జగన్ను వెనుక వైపు నుంచి లాగుతూ, ఆయన చేతులు లాగేస్తూ మీద మీదకు వెళ్లిపోయారు. ఓ దశలో వైఎస్ జగన్ కిందకు తూలి పోతుండగా వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇంత మంది జనం మధ్య ఆయన మార్కెట్ లోపల రైతుల వద్దకు వెళ్లడానికి అరగంట పైనే సమయం పట్టింది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఓ వీఐపీని ఇలా జన సమూహంలో వదిలేసి, పోలీసులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జెడ్ ప్లస్ భద్రత అంటే ఇదేనా అని వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టాయి. -
ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్ జగన్
కేవలం 500 మంది మాత్రమే రావాలట! అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది? జగన్ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు.ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయొద్దంటూ బంక్ల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా?మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్సార్సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రాష్ట్రంలో ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్నారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా దారుణం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? కిలో మామిడికి కనీసం రెండున్నర రూపాయలు కూడా రావడం లేదని మామిడి రైతులు చెబుతున్నారు. ఇంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నేను మామిడి రైతుల సమస్యలను ఆరా తీసేందుకు ఇక్కడికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టింది. నా పర్యటనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ రైతులను సైతం అడ్డుకుంది. రైతులకు మంచి జరగకూడదని కోరుకుంటోంది. ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపోతున్నా కూడా ఎవరూ స్పందించ కూడదని ఉద్దేశంగా పెట్టుకుంది. అసలు జగన్ రైతుల్ని కలిస్తే తప్పేమిటి? రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యే లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి.. జగన్ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలో మామిడికి కనీసం రూ.12 (టన్నుకు రూ.12 వేలు) వచ్చేలా చూడాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇన్నాళ్లూ గాడిదలు కాశారా?⇒ చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.. ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు?⇒ జూన్ 3వ వారం వరకు కొనుగోళ్లు ఎందుకు మొదలు కాలేదు?⇒ ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగేలా ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల జూన్ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్ను ముంచెత్తడం నిజం కాదా?⇒ రైతులంతా మామిడి పల్ప్ కంపెనీల వద్ద బారులు తీరడం మీకు కనిపించ లేదా? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడింది?⇒ పల్ప్ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోవడం మీకు కనిపించ లేదా? కేజీ మామిడి రూ. 2తో కొంటుండటం వాస్తవం కాదా? మీ పుణ్యాన ఈ పంటకు ఇక ధర రాదనే బాధతో చెట్లను కొట్టేసుకున్న రైతులను బెదిరిస్తారా?అశేష జనసందోహం నడుమ మార్కెట్ యార్డు లోపలికి వెళుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒ చిత్తూరు జిల్లాలో 52 మామిడి పల్ప్ కంపెనీలు ఉన్నాయి. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?⇒ ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8 చొప్పున కొన్నాయి?⇒ మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఈ రోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి ఉందంటే అది మీ నిర్వాకం కాదా?⇒ పక్కన కర్ణాటకలో జనతాదళ్కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు.. కనీస రేటు అని చెప్పి, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారు? ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది?⇒ చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు కేవలం రూ.2 కే కిలో అమ్ముకుంటున్నారు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టడం భావ్యమా? ⇒ ఇక్కడికి జగన్ వస్తున్నాడని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు వాస్తవంగా కనీసం కిలో మామిడికి రూ.2 కూడా రావడం లేదంటే.. మీరు నిద్రపోతున్నారా?రైతన్నలకు అండగా గత ప్రభుత్వంమా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడుగునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ నోటిఫై చేసే వారు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్ఫెడ్ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి.. ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు.ఇప్పుడవన్నీ కనుమరుగుఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తలకిందులయ్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు. ఈ రోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్ కూడా అయిపోయింది. జూలైలో ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబునాయుడు గారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఆర్బీకేలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఈ – క్రాప్ లేకుండా పోయింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, యూరియా, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విభాగాలు ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణంశశిధర్రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబానికి చెందిన వారు కాదా? పోలీసుల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది అని అడుగుతున్నా.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది ఆ రంగం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్బంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్ చేశారు. ఇది అత్యంత దారుణం. -
వైఎస్ జగన్ పర్యటన.. వివాదాస్పదంగా పోలీసుల తీరు
సాక్షి,చిత్తూరు : వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వైఎస్ జగన్ పర్యటనలో సెక్యూరిటీని వదిలేసి కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఉన్నతధికారులు పనిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్యార్డును సందర్శించారు. మామిడి రైతుల్ని పరామర్శించారు. వారికి తానున్నాననే భరోసా కల్పించారు. అయితే,ఈ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న జగన్కు భద్రత కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ జగన్ పర్యటనను ముగ్గురు ఎస్పీలు, రేంజి ఐజీ ఆసాంతం ఫాలో అయ్యారు. కానీ జగన్ మామిడి యార్డులోకి వెళ్లేసరికి పోలీసులు సెక్యూరిటీ కనుచూపుమేరలో కనిపించలేదు. జగన్ రైతులను కలిసేందుకు వెళ్తుంటే అడుగు ముందుకు పడడం కష్టమైంది.అదే సమయంలో వైఎస్ జగన్ పర్యటనకు జనాన్ని రానీయకుండా చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఓ సీఐ కార్యకర్త తల పగులకొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పరామర్శించేందుకు వెళ్లబోయిన మాజీ సీఎంను కారు దిగనీయకుండా ఎస్పీ మణికంఠ అడ్డుపడ్డారు. ఆ తర్వాత కూడా జనాన్ని రానీయకుండా పోలీసులు కుట్ర చేయడం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది -
పోలీసుల్లారా.. చంద్రబాబు రేపు మిమ్మల్ని మోసం చేయొచ్చు
సాక్షి,చిత్తూరు: బంగారుపాళ్యంలో ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఏదో రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారాయన.‘రైతుల తలలు పగలకొడతారా? 1,200 మందిని జైల్లో పెడతారా?. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?. కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేయొచ్చు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదుప్రతి పోలీసు అధికారికీ ఒకటే చెబుతున్నా. అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా.. మీకు కూడా సమస్యలుంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పలికేది ఒక్క జగన్ మాత్రమే. పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నాడు. మామిడి రైతుల సమస్యల పైనా జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగుల సమస్యలైనా.. వాళ్లకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలన్నా, వేతనాల సవరణ (పీఆర్సీ) డిమాండ్ చేయాలన్నా, వాళ్లకు కరవు భత్యం (డీఏ) ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబునాయుడు హామీలను నిలదీస్తూ, ఆయన్ను గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ సిక్సు, సూపర్ సెవెన్లు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టాలన్నా.. జగన్ మాత్రమే ముందుంటాడు. ప్రతి పోలీస్ సోదరుడు దీన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.అధికారంలో ఉన్న ఆ ఎస్పీలు, డీఐజీలు, సీఐలు వీళ్ల మాటలు వినకండి. వీళ్ల ప్రలోభాలకు లొంగకండి. రేప్పొద్దున మీ సమస్యలపైనా ఇదే మాదిరిగానే చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే.. అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు వస్తాడు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. అసలు సమస్యలే లేనట్లు వక్రీకరిస్తారు. డ్రామాలాడతారు. తప్పుదోవ పట్టిస్తారు. అలా సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అందరూ నష్టపోయే కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రతి పోలీస్ సోదరుడికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. గుర్తుంచుకోండి’’ అని హితబోధ చేశారాయన. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్లో మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారాయన. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్.. పోలీసులపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్, లాఠీచార్జ్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వైఎస్సార్సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై.. రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్ జగన్కు తెలియడంతో కారును ఆపారు. లాఠీచార్జ్లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని ఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు.దీంతో, చిత్తూరు పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్పై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. మరోవైపు.. బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ.. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్నారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. -
జగనన్న పలకరింపు.. ఆనందంతో మురిసిపోయిన చిన్నారి
సాక్షి, బంగారుపాళ్యం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా మరోసారి అభిమాన సంద్రం ఎగిసిపడింది. అయితే ఓ చిన్నారి తన బామ్మ కలిసి.. వైఎస్ జగన్ను కలిసేందుకు కాన్వాయ్ వద్దకు వచ్చింది.బంగారుపాళ్యం వెళ్తున్న వైఎస్ జగన్కు కలిసేందుకు చిత్తూరుకు చెందిన హోమ శైలుషా (7th తరగతి) కాన్వాయ్ వద్దకు వచ్చింది. అనంతరం, వైఎస్ జగన్ను కలిసేందుకు ప్రయత్నించింది. చిన్నారిని చూసిన వైఎస్ జగన్.. కాన్వాయ్ ఆపి మరీ.. చిన్నారి, బామ్మను పలకరించారు. దీంతో, వారిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పట్ల వారికున్న ప్రేమ, అభిమానం చూపించారు. జగన్ మామను కలిసిన ఆనందంలో చిన్నారి తెగ మురిసిపోయింది. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. People's Leader🤍#YSJagan #YSJaganForPeople #JaganaitheneChesthadu #AndhraPradesh pic.twitter.com/QFppxeE15F— Jaganaithene Chesthadu (@Jaganaithene) July 9, 2025 -
రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్ జగన్
సాక్షి,చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారుమామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదువరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?. ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.నాడు కిలో రూ.29. మరి నేడు?మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.ప్రభుత్వమే కొనుగోలు చేయాలిఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.అసలు మీరు మనుషులేనా?ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి’అని ముగించారుమార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు చేరుకున్న వైఎస్ జగన్మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్ జగన్జనసందోహంగా మారిన మార్కెట్ యార్డ్. పోలీసుల వలయం దాటుకుని మార్కెట్ యార్డుకు రైతులు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు. మామిడి రైతుల ఆవేదనమామిడి మార్కెట్ యార్డ్కు రాకుండా 25 చెక్పోస్టులు పెట్టారు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది. వైఎస్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు.. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్.పోలీసుల లాఠీచార్జ్లో కార్యకర్తకు గాయాలు.గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్ను అడ్డుకున్న ఎస్పీ.కాన్వాయ్లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.రైతుల సమస్యలు జగన్కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర. చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలుహెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులుచివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులుఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులుYSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేతహైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయంచిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులుపోలీసులు లాఠీచార్జ్లో వైఎస్సార్సీపీ కార్యకర్త తలకు గాయం.వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్సీపీ శ్రేణులు. వైఎస్ జగన్కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులుజగన్ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.వైఎస్ జగన్కు మా సమస్యలు చెప్పుకుంటాం.జగన్ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది. యార్డుకు వచ్చిన రైతులు..వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలుపోలీసులు చెక్పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్కు చేరుకున్నారు. వైఎస్ జగన్ కోసమే యార్డ్కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ప్రజలు తెలిపారు వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు. బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్ జగన్ కాసేపట్లో మార్కెట్ యార్డ్కు వైఎస్ జగన్కూటమి సర్కార్ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులుమామిడి మార్కెట్కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలువైఎస్ జగన్ కోసం తరలిన అభిమానులు..వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలుఅడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులువైఎస్ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్షీట్ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులుఅయినా తగ్గిన అభిమానులునడుచుకుంటూ వైఎస్ జగన్ని చూడటానికి వెళ్తున్న ప్రజలుబంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటువైఎస్సార్సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్. బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్ జగన్కాసేపట్లో మామిడి మార్కెట్ యార్డ్కు వైఎస్ జగన్గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్ చెక్పోస్టుల ఏర్పాటు.. తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటుకర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్పోస్టులుకొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటువాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులుఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులుప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులుభారీగా పోలీసుల మోహరింపువైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలుబంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులురైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలురైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలుసమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపుఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులుప్రభుత్వ చర్యలపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహంపోలీసుల ఓవరాక్షన్బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులువాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులుకూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహంటోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామినారాయణ స్వామి కామెంట్స్..జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందివైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారుచిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలుపోలీసులు ఆంక్షలు..బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులుబంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డుబైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలుబంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి చిత్తూరు..వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.వైఎస్ జగన్ పర్యటన ఇలా... వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. -
ప్రశ్నిస్తే కేసులా?
గంగాధర నెల్లూరు: కూటమి ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా నాయకురాలైన కృపాలక్ష్మి రాజకీయంగా ఎదుగుతున్న పరిస్థితిని ఓర్వలేక, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృపాలక్ష్మి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు ఎవర్నీ కించపరిచే విధంగా మాట్లాడలేదని, సోషల్ మీడియాలోని ఇన్స్ట్రాగామ్లో అకౌంటే లేదని తెలిపారు. జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగానే కృపా లక్ష్మిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. తన బిడ్డ పోస్టింగ్ చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, జిల్లా మాజీ సీడీసీఎంఎస్ చైర్మన్ వేల్కూర్ బాబురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి. మాజీ రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుణశేఖర్రెడ్డి, సీనియర్ నాయకులు మునిరాజారెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, సర్పంచ్ సుబ్రహ్మణ్యంయాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏకాంబరం, యువజన విభాగం అధ్యక్షులు కిషోర్రెడ్డి పాల్గొన్నారు. -
రేపు మెగా పీటీఎం 2.0
● మండల స్థాయి అధికారులకు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు ● ప్రతి పాఠశాలలో ఒక అధికారి పాల్గొనాలి ● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కార్యక్రమాలు ● ప్రత్యేకంగా తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమం ● కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం 2.0)ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం క్షేత్ర స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలోని ఎంఈవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్, అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. మెగా పీటీఎం కు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా ఒక్కొక్క పాఠశాలలో కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమ నిర్వహణ పై ఇదివరకే ఆయా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. ఉదయం 9కే కార్యక్రమం జిల్లాలోని ప్రభుత్వ 2,437, ప్రైవేట్ 506, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 50 మొత్తం 2,993 విద్యాసంస్థల్లో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న 1,32,996 మంది, ప్రైవేట్ కళాశాలల పరిధిలోని 86,162, జూనియర్ కళాశాలల పరిధిలోని 7,576 మొత్తం 2,26,734 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు స్కూల్ గ్రాంట్స్లో రూ.2.68 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11 గంటల వరకు తల్లిదండ్రులతో సమావేశం, 11 నుంచి 11.20 గంటల వరకు ఆటల పోటీలు, 11.30 నుంచి పాఠశాల ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, అధికారులు, దాతల ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. అనంతరం విద్యార్థుల తల్లి పేరుతో పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు. ఈ కాన్ఫరెన్స్లో డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు. -
మామిడి గోడు వినరే!
● గిట్టుబాటు కాని మామిడి ● మాయమైన ప్రభుత్వ మద్దతు ధర ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ● ఆదుకోవాలంటూ విన్నపాలు ● పట్టించుకోని కూటమి నేతలు ఒక్క పంటకూ దిక్కులేదు చక్కెర ఫ్యాక్టరీ మూయించిన ఘనత చంద్రబాబుదే. దీనికి ముందు పాల ఫ్యాక్టరీని మూయించారు. ఇదే మాదిరిగానే మామిడి రైతులను ముంచేయాలని చూస్తున్నట్లు ఉంది. ఈ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి. చెరుకు పండించి బెల్లం తయారీ చేస్తే ఆంక్షలు పెడుతున్నారు. వేరుశనగ పండిస్తే చేతికి అందే పరిస్థితి లేదు. ఇప్పుడు పంట మామిడి ఒక్కటే. –రాము, చిత్తూరు మండలం ఈ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు 2018లో ఇలానే అల్లాడిపోయాం. అప్పు డు కాయలు కొనే వారు లేక చెట్లల్లోనే వదిలేశాను. ఈ సారి కాయలు అడిగే వారు లేరు. బలవంతంగా ప్యాక్టరీలకు తోలుకుంటున్నాం. ప్యాక్టరీ రేటు తొతాపురి రూ.8 అని ప్రకటించాయి. ఎక్కడ ఆ రేటుకు కొనుగోలు చేస్తున్నారు..?. కానీ ప్యాక్టరీలను ఏం చేయలేక పోతోంది. సీఎం, మంత్రులు అలా వచ్చి...ఇలా వెళ్లిపోయారు. –సాము, చిత్తూరు మండలం -
పకడ్బందీగా పీఎం ఉద్యోగ కల్పన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం అమలు చేయాలన్నారు. పరిశ్రమలు నెలకొల్పితేనే యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు అనుమతులు ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని కోరారు. యువత ఉపాధి కల్పన కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8.39 కోట్లతో 547 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలతో ఉత్పత్తులు ప్రారంభించారని వివరించారు. వీటిలో 1,604 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. రూ.3,494 కోట్లతో 13 భారీ, మధ్య తరహా, రూ.117 కోట్లతో 38 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇవి ప్రారంభమైతే దాదాపు 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సింగిల్ డెస్క్ విధానంలో 532 దరఖాస్తులను ఆమోదించామని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అమలు చేస్తున్నందున దరఖాస్తులు స్వీకరించి పకడ్బందీగా పరిశీలించాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన లో 2,131 యూనిట్లకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇందులో 1,843 మందికి లబ్ధి చేకూర్చి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జెడ్ఎం సుబ్బారావు, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమల అసోషియేషన్ ప్రతినిధి కట్టమంచి బాబీ పాల్గొన్నారు. -
ఆంక్షలతో జగన్ పర్యటనను ఆపలేరు
బంగారుపాళెం: మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. జగన్ రాకకోసం కొత్తపల్లె హైవే సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ను, బంగారుపాళెంలోని మామిడి మార్కెట్ యార్డ్ను మంగళవారం పార్టీ నేతలతో కలసి ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నప్పుడు ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. వైఎస్సార్సీపీకి సంబంధించిన నాయకులు రాకూడదు.. ఇంత మందే రావాలి.. అంటే ఎట్లని ప్రశ్నించారు. అనుమతి ఇచ్చి.. కట్టడి చేసినట్టుగా ఉందని చెప్పారు. నాయకులెవర్నీ బయటకు రాకుండా చేసి జగన్మోహన్రెడ్డిని ఒక్కరినే మామిడి మార్కెట్ యార్డులోకి అనుమతించి టీడీపీ నాయకుల చేత అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు. రూపాయికి కూడా కొనలేమని చెప్పిన ఫ్యాక్టరీ యజమానులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకుని రూ.6 కొనుగోలు చేస్తామంటూ టోకన్లు జారీ చేస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్కుమార్, లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా పాల్గొన్నారు. -
అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి టాస్క్ఫోర్స్: ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతున్న చెట్లను రైతన్నలే పెకిలిస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది? కోత ఖర్చులు కూడా దక్కక మామిడి కాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి.. రోడ్లపై పారబోస్తున్నా సర్కారులో చలనం ఉండదా? మిర్చి.. ధాన్యం.. పొగాకు.. మామిడి..! ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను ఓదార్చి భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని అన్నదాతలు మండిపడుతున్నారు. అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించడం.. కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లాంటి కుయుక్తులతో చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యనేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా.. మరోవైపు కూటమి నేతలు రైతులు, వ్యాపారులపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఫోన్ చేసి వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు సమాచారం. వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.6 చొప్పున మాత్రమే చెల్లిస్తామని రైతులతో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. ర్యాంపుల వద్ద కేవలం రూ.2కే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా మార్కెట్ యార్డు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడనుండటంతో చంద్రబాబు సర్కారులో వణుకు ప్రారంభమైంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళెం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు తరలి వెళ్లటానికి వీల్లేదని ఆదేశించారు. బంగారుపాళెం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్కు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో పూతలపట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జయప్రకాష్ వ్యాపారులను పిలిపించుకుని సమావేశం అయినట్లు సమాచారం. బుధవారం కొనుగోళ్లు ఆపేయాలని, మార్కెట్కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్ను అడ్డుకుంటామని ప్రకటించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా... మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.కటౌట్లు కూల్చివేతపై స్థానికుల నిరసనబంగారుపాళెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లను మంగళవారం రాత్రి పోలీసులు కూల్చి వేయించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీని తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లను కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతలపట్టు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ పోలీసులను ప్రశ్నించారు. తమకు కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయని ఓ సీఐ పేర్కొనడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
‘ఎస్పీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణం’
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కోసం వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను భగ్నం చేయాలనే చంద్రబాబు కుట్రలకు అనుగుణంగా జిల్లా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనపై శాంతిభద్రతల అంశాన్ని అడ్డం పెట్టుకుని జిల్లా ఎస్పీ మణికంఠ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రైతులు తమ పంటలను లారీల్లో మార్కెట్ యార్డ్కు తీసుకురాకూడదని, వారు వాటిని రోడ్డుపై పారవేసి రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమంటూ జిల్లా ఎస్పీ రాజకీయంగా మాట్లాడటం వెనుక చంద్రబాబు డైరెక్షన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను కలిస్తే రౌడీషీట్లు తెరుస్తామంటూ రైతులను, పార్టీ శ్రేణులను బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు బుధవారం ప్రతిపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మామిడి మార్కెట్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు ఇస్తున్నామని ఒకవైపు చెబుతూనే, మరోవైపు పోలీసులు అనేక ఆంక్షలును విధిస్తున్నారు. ఎక్కడికక్కడవైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన కూడదంటూ ముందస్తు అరెస్ట్లతో భయోత్పాతానికి గురి చేస్తున్నారు. బస్తర్ అడవుల్లో నక్సల్స్ను వేటాడుతున్నట్లుగా చిత్తూరు జిల్లాలోవైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వెంటాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ అధికారుల మీదవైఎస్సార్సీపీకి మంచి గౌరవం ఉంది. కానీ దానికి భిన్నంగా వైఎస్ జగన్ పర్యటనను దెబ్బతీసేలా అదే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడుతూ జన సమీకరణ చేస్తున్న వారిని గుర్తిస్తున్నాం, వారిని అరెస్ట్ చేసి, రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఆటోలు, మోటార్ సైకిళ్ళపై వస్తుంటే, వారి వాహనాలకు పెట్రలో, డీజిల్ పోయవద్దంటూ పోలీసులే పెట్రలో బంక్ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. ఆటోల్లో వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఎక్కించుకోవద్దని, అలా చేస్తే కేసులు పెడతామంటూ వారిని కూడా బెదిరిస్తున్నారు.పదిమంది రైతులు మాత్రమే మాట్లాడాలని ఆంక్షలుతమ అభిమాన నాయకుడిని చూడాలని రైతులతో పాటువైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు కూడా వస్తుంటే, వారిని కూడా శాంతిభద్రతల సమస్యను ముందు పెట్టి అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులను గూండాలు, రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం సమంజసం కాదు. ప్రజల హక్కులను కూడా కాలరాయాలని అనుకోవడం రాజ్యాంగ విరుద్దం. మార్కెట్ యార్డ్లో వైఎస్ జగన్ను కలిసేందుకు గరిష్టంగా పదిమందిని మాత్రమే అనుమతిస్తామని జిల్లా ఎస్పీ చెప్పడం దారుణం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల అప్పులపాలై, తమను ఎవరు ఆదుకుంటారా అని ఆక్రోశిస్తున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు వస్తున్న వైఎస్ జగన్ను రైతులు కలవడానికి కూడా ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామికమా? ఇప్పటి వరకు మామిడి రైతులు కనీసం తమకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని గొంతువిప్పి బయటకు చెప్పుకోలేని నిర్భందంలో ఉన్నారు. అలాంటి వారికి వైఎస్ జగన్ అండగా నిలిచేందుకు వస్తుంటే సహించలేక పోతున్నారు.పోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయంపోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. జిల్లా ఎస్పీతో మాట్లాడించిన మాటలు చూస్తే శాంతిభద్రతలను కాపాడే అధికారులు మాట్లాడే మాటలు కావు అవి. జగన్ను కలిసేందుకు వచ్చే వారిపై రౌడీషీటర్లు తెరుస్తామని ఎలా బెదిరిస్తారు? వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకుంటాం, ఆయనను నిలదీస్తాం, ఆయనతో వాగ్వివాదంకు దిగుతామని హెచ్చరిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మాత్రం పోలీసులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా మాట్లాడకూడదంటూ కనీసం వారిని వారించే ప్రయత్నం కూడా జిల్లా పోలీస్ అధికారులు చేయలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు హెచ్చరిస్తుంటే పోలీసులకు వినిపించడం లేదా? జిల్లా ఎస్పీతో ఇలా మాట్లాడిస్తున్నది కూటమి ప్రభుత్వం కాదా, సీఎం చంద్రబాబు కాదా? రైతులను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. రైతులకు శిక్షణ కూడా ఇచ్చారంటూ మాట్లాడటం దారుణం’ అని ధ్వజమెత్తారు -
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు
సాక్షి,చిత్తూరు జిల్లా : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు తాము పెట్టిన నిబంధనలను ఉల్లంఘించి జనసమీకరణ చేస్తే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్ జగన్ బుధవారం (జులై9) బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ టూర్కు జనసమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవు. మాజీ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మందికి నోటీసులు ఇచ్చాం. ఇది కేవలం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం మాత్రమే. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని, హెలిపాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నాం. ఈ పరిధి దాటితే నిర్వాహకులు ఎవరు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
చిత్తూరు కలెక్టరేట్ : తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా అని జిల్లా కలెక్టర్ కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఏమో ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటలకు ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరవుతారు. ఆయన వచ్చిన గంట తరువాత పలువురు జిల్లా అధికారులు హాజరుకావడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కలెక్టర్ విచ్చేసిన గంట తర్వాత హౌసింగ్ శాఖ ఈడీ గోపాల్ నాయక్ విచ్చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు జిల్లా అధికారులు ఆలస్యంగా విచ్చేశారు. హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వెళ్లిపోవాలంటూ పీజీఆర్ఎస్ నుంచి పంపించేశారు. అలాగే డీఎంఅండ్హెచ్ఓ, డీసీహెచ్ఎస్ అని పిలవగా వారిద్దరు సైతం పీజీఆర్ఎస్కు హాజరుకాని పరిస్థితి. దీంతో గైర్హాజరైన డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలిను సరెండర్ చేస్తానంటూ కలెక్టర్ మండిపడ్డారు. -
జగన్ అంటే అంత భయమెందుకో!
చిత్తూరు: మామిడి రైతుల బాధలను చూసి వా రికి అండగా నిలిచి, గిట్టుబాటు ధర కోసం ప్ర భు త్వాన్ని ప్రశ్నించేందుకు ఈ నెల 9వ తేదీన జిల్లా లోని బంగారుపాళెం మామిడి మార్కెట్ వద్ద కు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా వా సులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్రెడ్డి పర్యటకు ప్రభుత్వం హెలీక్యాప్టర్కు అనుమతులివ్వకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రైతుల బాధల వినడానికి తా ను బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళేనికి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వాసులే కాదు పొరుగునే ఉన్న కర్ణాటకలోని హొసకోటె, కోలార్, ముళబాగిళు, నంగిళి ప్రాంతాల్లోనూ జగన్మోహన్రెడ్డి రాక కోసం ఎదురుచూస్తున్నారు. బుధవారం రోడ్డు మార్గంలో ఏపీ మాజీ సీఎం వస్తున్నాడని తెలిసి ఇప్పటికే భారీ సంఖ్యలో కర్ణాటక వాసులు రోడ్డు పక్కన బ్యానర్లకు ఆర్డర్ ఇచ్చేశారు. కర్ణాటకలోనూ స్వాగతం పలి కేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోౖవైపు జిల్లా లోని పడమటి ప్రాంత రైతులు, వైఎస్సార్సీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారుపాళెంలో హెలీప్యాడ్కు అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ రైతు ల కష్టాల కోసం జగన్ వస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు హడలిపోతుందనే ప్రశ్న తలెత్తుతోంది.అనుమతి వెనుక ఇంత తతంగమా?బెంగళూరు నుంచి బంగారుపాళెం వరకు దాదాపు 150 కిలోమీటర్లు జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో వస్తే హైవేలో పెద్దసంఖ్యలో వాహనాలు, భారీ గా తరలివచ్చే జనంతో వైఎస్సార్ సీపీకి జాతీయ స్థాయిలో భారీ మైలేజీ వస్తుందని నిఘా వర్గాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసినట్టు తెలిసింది. దీంతో హెలిప్యాడ్కు అనుమతిలిస్తేనే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చేసేది లేక అధి కారులు హెలీఫ్యాడ్కు అనుమతులు ఇచ్చారనే మాట ఇప్పుడు జనం నోట నానుతోంది. ఏదేమైనా జగన్మోహన్రెడ్డి ఎలా వచ్చినా బంగారుపాళెం కార్యక్రమానికి వెళ్లేందుకు జనం సిద్ధంగా ఉండడం విశేషం.వైఎస్. జగన్ పర్యటన రేపుచిత్తూరు అర్బన్: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ నా యకులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మా మిడి రైతులు పడుతున్న కష్టాన్ని తెలుసుకోవడానికి బంగారుపాళెం మార్కెట్ యార్డులో రైతు లతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉదయం10 గంటలకు బెంగళూరు నుంచి హెలిక్యాఫ్టర్లో బంగారుపాళేనికి బయలుదేరుతారు. 10.50 గంటలకు బంగారుపాళెం మండలం కొత్తపల్లె హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11.20 గంటలకు రోడ్డు మార్గంలో బంగారుపాళెం మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. 11.20 నుంచి 12.20 గంటల వరకు మామిడి రైతుల కష్టాలపై బంగారుపాళెం మామిడి యార్డులో రైతులతో నేరుగా మాట్లాడుతారు. 12.20 గంటలకు మార్కెట్ యార్డు నుంచి బ యలుదేరి 12.35 గంటలకు హెలిప్యాడ్ వ ద్దకు చేరుకుంటారు. 12.45 గంటలకు బంగారుపాళెం కొత్తపల్లెలోని హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకు బయలుదేరి, మధ్యాహ్నం 1.35 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు.