breaking news
Chittoor
-
పోరాటాలతోనే హక్కుల సాధన
– దళిత ఉద్యమ నేత బైరి నరేష్ శ్రీరంగరాజపురం : అణగారిన వర్గాల వారు ఐకమత్యంతో హక్కుల కోసం ఉద్యమిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పీఠాలు కదలాలని ముఢ నమ్మకాల నిర్మూలన సంస్థ, దళిత ఉద్యమ నేత బైరి నరేష్ పిలుపునిచ్చారు. మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట దీపిక కల్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత మహాసభ ఆధ్వర్యంలో దళిత నాయకుడు మునికృష్ణ అధ్యక్షతన నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అంతకుముందు 49 కొత్తపల్లిమిట్ట ప్రధాన కూడలిలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బైరి నరేష్ మాట్లాడుతూ దళితులు, అణగారిన వర్గాలు మూఢనమ్మకాలతో తమ హక్కులను తామే కాలరాసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారినా దళుతులపై దాడులు ఆగడం లేదన్నారు. గతంలో చుండూరు, కారంచేడు, నేలవంకలో అగ్రవర్ణాల వారి చేతులో దళితులు ఊచకోతకు గురయ్యార ని పేర్కొన్నారు. టీడీపీకి ఓటు వేయలేదని చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పాదిరికుప్పం దళితవాడలోని ఇళ్లను కాల్చేశారని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో పిఠాపురం, పల్నాడులో సాల్మన్ హత్యతోపాటు దళిత యువతులు, మహిళులపై దాడులు పెరిగిపోయాయన్నారు. దళితులకు రక్షణ కరువైందని, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమన్నారు. విద్యతోనే సమాజంలో ఆర్థిక సమానత్యం సాధించవచ్చని తెలిపారు. ఐకమత్యంతో హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ డిప్యూటీ కలెక్టర్ ప్రకాష్రావు, హైకోర్టు అడ్వకేట్ నవయాన్, తమిళనాడు పెరియార్ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, కేర్ సంస్థ అధ్యక్షు లు పాల డేవిడ్, రామాంజనేయులు, ప్రభాకర్, శివరాం తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దళిత నాయకులు, మాట్లాడుతున్న బైరి నరేష్ -
పకడ్బందీగా అభయ నిస్వార్థ ప్రవేశ పరీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అభయ నిస్వార్థ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తమరెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూపర్ 60 అభయ నిస్వార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్ష నిర్వహించామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 160 మంది దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరైనట్టు పేర్కొన్నారు. ఇందులో అర్హత సాధించిన వారు అనంతపురంలో నిర్వహించే రెండవ లెవల్ పరీక్షకు హాజరువుతారని పేర్కొన్నారు. అక్కడ ఎంపికయ్యే వారికి అనంతపురంలో ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు షబ్బీర్, దుర్గాప్రసాద్, దేవరాజులురెడ్డి, దామోదరరెడ్డి పాల్గొన్నారు. అందరికీ వాటాలిస్తున్నాం.. చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేత ప్రజాప్రతినిధిగా ఎన్నికై న నాటి నుంచి ప్రకృతి వనరులను ఆ పార్టీ నేతలు కొల్లగొడుతున్నారు. తాము చెప్పినట్లు తలలు ఊపే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుని, అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. స్థానిక చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ మట్టి మాఫియాకు అడ్డాగా నిలిచింది. కాలనీలోని చివరి ప్రాంతంలో ఉన్న కొండగుట్టను ధ్వంసం చేస్తూ విలువైన ఎర్రమట్టిని దోచుకుపోతున్నారు. కొద్ది రోజులుగా గుట్టుగా చేస్తున్న ఈ దందాపై స్థానికులు తిరగబడడంతో విషయం బయటకు పొక్కింది. మట్టి మాఫియా మాత్రం తాము అధికార పార్టీ నేతలు, అధికారులకు వాటాలు ఇస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.800ల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు వందకు పైగా ట్రిప్పులు వెళ్తున్నాయంటే మాఫియా అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రెవెన్యూలోని కీలక అధికారికి ముడుపులు మట్టి, ఇసుక అక్రమ రవాణాపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా రెవెన్యూ అధికారులు ఏడాదిన్నరగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫిర్యాదు చేసిన వెంటనే అ నుమతులు ఇవ్వలేదని రెవెన్యూలోని కీలక అధికారి స్పష్టం చేస్తున్నారు. అక్రమాలపై ఘటన స్థలానికి వెళ్లి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు తిరుపతి సిటీ: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు ఈనెల 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ అధ్యయన కేంద్రం రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఇప్పటికే అభ్యర్థులకు హాల్టికెట్లు అందించామని తెలిపారు. నిర్ణీత గడవుకు 30 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. డిగ్రీ థర్డ్ ఇయర్ 5వ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు, సెకండియర్ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు, ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ, యూజీ, పలు డిప్లొమా కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోపు ఇగ్నో వెబ్సైట్ నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
కోడెగిత్తల జోరు–యువత హుషారు
– సీఆర్కండ్రిగలో దుమ్మురేపిన ఎద్దులు వెదురుకుప్పం : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వెదురుకుప్పం మండలంలోని సీఆర్కండ్రిగలో జల్లికట్టును ఘనంగా నిర్వహించారు. రంకెలేస్తూ దూసుకుపోతున్న కోడెగిత్తలను పట్టుకోవడానికి యువకులు ఉత్సా హం చూపారు. ఇక్కడికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పలువురు తమ పశువులను తీసుకువచ్చారు. నిర్వాహకులు ఎడ్లకు పలకలు, వస్త్రాలు కట్టి ఉసిగొల్పారు. రంకెలేసుకుంటూ దూసుకుపోతున్న ఎద్దులను నిలువరించి పలకలు సాధించేందుకు యువకులు విశ్వ ప్రయత్నం చేశారు. కొన్ని ఎద్దుల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి తమ ప్రతాపాన్ని చూపారు. పోట్లగిత్తలు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా పరుగులు తీశాయి. వెదురుకుప్పం ఎంపీటీసీ రాధిక, వైఎస్సార్ సీపీ నాయకులు రామయ్య, పురందర్రెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. -
హరికృష్ణారెడ్డికి ఘన సన్మానం
పెనుమూరు(కార్వేటినగరం): ప్రముఖ కవి, రచయిత, ఉప రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రకృతి వ్యవసాయ రైతు హరికృష్ణారెడ్డిని ఆదివారం తిరుపతి ఆకాశవాణి కేంద్రం అధికారులు ఘనంగా సన్మానించారు. ఆయన నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రంగానికి, ప్రకృతి వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్మానం చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేతలు, వ్యవసాయ వర్సిటీ అధికారులు రవికుమార్, సుమతి, ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ సుధాకర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్ర దొంగలు
పలమనేరులోనూ పలమనేరు: శేషాచలం అడవుల్లో ఉండే ఎర్రచందనానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో తమిళనాడు, కర్ణాటకకు చెందిన బడా స్మగ్లర్లు కూలీల ద్వారా ఎర్రచందనం వృక్షాలను నరికిస్తున్నారు. గతంలో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులను ముమ్మరం చేసి పలువురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ మధ్య కాలంలో దుంగల రవాణా కొంతమేర తగ్గి నా కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులను దాటిస్తున్నారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా లో పలుచోట్ల అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో పలమనేరు వాసులకు ఉన్న లింకులు వెలుగుచూశాయి. తాజాగా అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి వద్ద పింఛానది సమీపంలో వాటర్ ట్యాంకర్లోకి ఎర్రచందనం దుంగలను కూలీలు లోడ్ చేస్తుండగా తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నలుగురు స్మగర్లను అరెస్ట్ చేశారు. 72 దుంగలను స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.65 కోట్లు ఉంటుందని టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు కాగా మరో ఇద్దరు గంగవరం మండలానికి చెందిన వారు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అప్పినపల్లి ఘటనలో పారిపోయిందెవరో..? గత ఏడాది నవంబరు 14న ఎర్రచందనం దుంగలతో కారు పులిచెర్ల నుంచి పలమనేరు మీదుగా వస్తోందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. అధికారులు కాపుగాచినా కారును పట్టుకోలేకపోయారు. అప్పినపల్లి వద్ద గ్రామస్తులు కారును పట్టుకున్నారు. అప్పటికే స్మగ్లర్లు తప్పించుకున్నారు. వీరికి ఈ ప్రాంతంపై పట్టు ఉంటే గాని ఇది సాధ్య మయ్యే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు పట్టుబడిన వారు.. ఇటీవల కారును వదిలి పారిపోయినవారు ఇక్కటేనా అనే అనుమానం వస్తోంది. నిందితులు మధుకుమార్, మహబూబ్ బాషాఅంతర్రాష్ట్ర ముఠాలతో లింకులు వేలూరు జిల్లా అనైకట్టుకు చెందిన బూసి వెంకటేశన్, మళ్లవాడికి చెందిన ఏలుమలై రమేష్తో గంగవరం మండలం మర్రిమాకులపల్లికి చెందిన ముధుకుమార్(34), కీలపల్లి చెందిన మహబూబ్బాషా (33)కు లింకులు ఎలా ఏర్పడ్డాయన్న దానిపై టాస్క్ఫోర్స్ అధికారులు విచారించినట్టు తెలిసింది. గతంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఎర్రచందనం కేసుల్లో బడా స్మగ్లర్లతో కలిసి అరెస్టు అయ్యారు. తాజాగా అరెస్టు అయిన వారిలో ఒక వ్యక్తి ఇక్కడి టీడీపీ నాయకుడి కుమారుడు కావడం గమనార్హం. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలోనూ కొంతమంది ఎర్రచందనం స్మగ్లింగ్లోకి దిగినట్టు తెలుస్తోంది. -
సంక్షేమం సున్నా
కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్డెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కనిపించడం లేదని వాపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసే లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారికి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పారు. దాని గురించి పట్టించుకోలేదని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ, కొత్త పింఛన్ల మంజూరు తదితరాల ఊసే లేదని విమర్శిస్తున్నారు. విద్యా రంగం అభివృద్ధికి నిధులు కేటాయించకుండా పీపీపీ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తద్వారా పేద పిల్లలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తీసుకువస్తున్న రూ.లక్షల కోట్లు అప్పులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. – చిత్తూరు కార్పొరేషన్/ కాణిపాకం/గుడిపాల/పలమనేరు/చిత్తూరు కలెక్టరేట్ నిరుద్యోగ భృతి గోవిందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. రెండు బడ్జెట్లు పూర్తయినా దాని ఊసే లేదు. ఇలా నిరుద్యోగులను మోసం చేసే మాటలు ఎందుకు చెబుతారో అర్థంకావడం లేదు. బడ్జెట్ అంతా పెద్ద డూపుగా మారిపోయింది. ఇక ఎవరైనా చంద్రబాబు మాట నమ్ముతారా. – ప్రకాష్, బైరెడ్డిపల్లి సున్నా వడ్డీకి సున్నం పెట్టారు గ్రూపుల్లోని మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు. హామీలు ఇచ్చారు కానీ అమలు చేయడం లేదు. దీన్ని మోసం అనరా. అమలు చేసేందుకు వీలు కానప్పుడు ఎందుకు చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో మహిళా గ్రూపుల్లోని సభ్యులకు ఎలాంటి ప్రయోజనం లేక అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. – దేవసేన, పెద్దపంజాణి బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించని వైనం -
బడ్జెట్లో పేదలకు శఠగోపం
వెదురుకుప్పం : వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇస్తున్న సంక్షేమంకంటే ఎక్కువ ఇస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేస్తున్నట్టు మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. విజనరీగా చెప్పుకుంటున్న చంద్రబాబు మూడో విడత ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామన్న హామీ ఊసేలేదన్నారు. 20 లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీని చెత్తబుట్టలో వేశారని పేర్కొన్నారు. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టోకరా పెట్టారని దుయ్యబట్టారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500ల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. కొత్తగా ఒక్క పింఛను కూడా ఇవ్వలేదన్నారు. విద్య, వైద్య రంగాలకు నిధు లు కేటాయించకుండా పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇస్తూ నిరుపేదల భవిష్యత్తును సర్వనాశనం చేసినట్లు వాపోయారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించి పేద విద్యార్థుల కు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిల అతీగతీ లేదన్నారు. వలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు నెలకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి వారి కుటుంబాలను వీధిన పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ కింద రుణాలు ఇస్తామని చెప్పి మహిళలను దగా చేసినట్లు చెప్పారు. రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నట్లు మండిపడ్డారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి ఇష్టారాజ్యంగా అప్పులను తీసుకువస్తున్నారని, ఆ డబ్బును తమ వారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలపై నిలదీస్తే తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్న నేపథ్యంలో డైవర్షన్, కల్తీ రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేరోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. -
మనసే.. మరణశాసనం
చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఆత్మహత్యలు... చివరి ఫలితం ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు.ఒత్తిడికి లోనుకావొద్దు... తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్ఫోన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి. – దినేష్, మానసిక వైద్య నిపుణులు, చిత్తూరుసెల్ఫోన్.. చేతిలో ఉన్న విషంసెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తూ మనుషులు తెలియకుండానే మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతూ ఒంటరితనాన్ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా పోలికలు, అవమానాలు, నెగెటివ్ కంటెంట్ యువత మనస్సును చిదిమేస్తోంది. దీనికితోడు ఒంటరి జీవనం పెరిగిపోవడంతో కొందరు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇవి సమస్యలకు పరిష్కారం కాదని తెలిసినా, తాత్కాలిక ఉపశమనానికి అలవాట్లలో చిక్కుకుపోతున్నారు. చివరకు మానసిక, శారీరక, ఆర్థికంగా పూర్తిగా కుమిలిపోతున్నారు. ఇక ఒకప్పుడు కుటుంబాలతో కలిసి మెలిసి జీవించిన సమాజం ఇప్పుడు విడిపోయింది. మాట్లాడే మనుషులు లేరు. వినే చెవులు లేవు. బాధను పంచుకునే వారు లేక అనేక మంది లోలోపలే కుంగిపోతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా మానసిక రుగ్మతలు వ్యాపిస్తున్నాయి. -
పదో తరగతి యాక్షన్ప్లాన్ను పాటించాలి
పలమనేరు: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వందరోజుల యాక్షన్ ప్లాన్పై నిర్లక్ష్యం చేయరాదని డీఈఓ రాజేంద్ర ప్రసాద్ సూచించారు. పట్టణంలోని బాలికల పాఠశాలలో శనివారం జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టడీ అవర్లో పిల్లల అభ్యసనస్థాయిని పరిశీలించారు. టెన్త్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. కష్టపడి చదివితే విజయం దక్కుంతుందన్నారు. స్థానిక బాలుర హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరీశీలించారు. భవిత సెంటర్లో జరుగుతున్న అభ్యసనాలను తెలుసుకున్నారు. వచ్చే టెన్త్ పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు రావాలంటే ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ఎంఈఓలు లీలారాణి, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. -
మేలుకో..రిజిస్ట్రేషన్ చేసుకో!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 75 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా నమోదు చేయించుకోకపోవడంతో, తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా జరిగే ఉపయోగాలను వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఇప్పటి వరకూ రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బీమా వంటి సేవలు వివిధ జాబితాల ఆధారంగా అమలయ్యాయి. అయితే రాబోయే రోజుల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉన్న రైతులకే అన్ని రైతు సేవలు అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యను అందజేయనున్నారు. నమోదు లేకపోతే పథ కాల లబ్ధి పొందే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల భూ వివరాలు, పంటల సమాచారం, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు ఒకే డేటాబేస్లో నమోదవుతాయి. దీనివల్ల నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి, నకిలీ లబ్ధిదారులకు అడ్డుకట్ట, పథకాల అమలులో పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంకా 43,807 మంది జిల్లా వ్యాప్తంగా 1,74,716 మందికి రిజిస్ట్రేషన్చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు1,30,909 మందికి నమోదు పూర్తిచేశారు. ఇంకా 43,807 మందికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే డోర్లాక్, డెత్ కేసులతో ఈ నమోదు పక్రియ తడబాటు ఎదరవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు అదనపు సర్వేలు సైతం వేధిస్తున్నాయని వాపోతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కీలకం రాబోయే రోజుల్లో పంట బీమా, నష్ట పరిహారం, ఇన్న్పుట్ సబ్సిడీలు, రైతు సేవా కేంద్రాల సేవలు వంటి అన్ని అంశాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధారంగానే అమలు చేయనున్నారు. ఇప్పుడే నమోదు చేసుకోకపోతే భవిష్యత్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ రైతుల భవిష్యత్తుకు కీలకం. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. – మురళీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
పరమేశ్వరుని దివ్యతేజం
బంగారుపాళెం: మొగిలి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం శ్రీమొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మ వారు అధికార నంది వాహనాన్ని అధిరోహించి భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో అలంకరించా రు. అనంతరం నంది వాహనంపై కొలువుదీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఉత్సవ కార్యక్రమానికి గాండ్లపల్లె గ్రామానికి చెందిన సాంబశివనాయుడు, ఆయన సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి ఆదిశంకరుడై న మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మవారు సింహ వాహనంపై భక్తులను కనువిందు చేశారు. సింహవాహన ఉత్సవానికి బంగారుపాళ్యానికి చెందిన ఉషోదయా పాఠశాల యాజమాన్యం భారతి, ప్రతాప్ చంద్రనాయుడు ఉభయదారులుగా వ్యవహరించారు. నేటి వాహన సేవలు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మహాశివరాత్రి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం, వృషభ వాహన సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈఓ మునిరాజ తెలిపారు. వృద్ధురాలు అదృశ్యం ఐరాల: వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయశ్రీ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని నాంపల్లెకు చెందిన వెంకటరామానాయుడి భార్య మంగమ్మ(80) ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. చుట్టు పక్కల, సమీప బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రతిమలతో భక్తిఫలం
ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి పర్వదినం అతనికి కేవలం ఒక పండుగ కాదు. అది ఆత్మానుభూతి, ఆరాధన, ఆత్మసాధనల సమ్మేళనం. శివరాత్రి వస్తుందంటే అతను భక్తి పారవశ్యంతో మునిగిపోతాడు. ఆ ఆరాధననే కళారూపంగా మలిచి శివప్రతిమలను సృష్టిస్తాడు. పదహారేళ్లుగా ప్రతి శివరాత్రికి వినూత్న శివప్రతిమలు, ప్రత్యేక లింగాకారాలను రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నగరి మున్సిపాలిటీ కీళపట్టుకు చెందిన గణేశ్. నగరి: నగరి మున్సిపాలిటీ కీళపట్టుకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు గణేశ్. తండ్రి వారపు సంతలో కూరగాయలు అమ్ముతూ స్థానికంగా ఉన్న త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయంలో నిత్యపూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. తండ్రితోపాటు తరచూ ఆలయానికి వెళ్లే గణేశ్కు శివారాధనపై మక్కువ పెరిగింది. దీంతో శివరాత్రి రోజు విన్నూత్న వస్తువులతో తనే శివాకారాన్ని సృష్టించి, ఆరాధించాలనుకున్నాడు. అతని ఆలోచనకు తల్లిదండ్రులు సహకారం అందించారు. దీంతో పదిహేనేళ్ల క్రితం శివరాత్రిని పురస్కరించుకొని ఆల యం సమీపం పరమేశ్వరుని ప్రతిమలు చేయడం మొదలుపెట్టారు. మట్టి, రాళ్లు, ఆకులు, నార, గవ్వలు, రుద్రాక్షలు, టెంకాయలు ప్రకృతిలో లభించే పదార్థాలు అతని చేతిలో ఆధ్యాత్మిక రూపాన్ని దాల్చింది. ప్రతి ప్రతిమలో భక్తి, నైపుణ్యం, సృజనాత్మకత కలగలిపి కనిపించింది. శివరాత్రి నా కోసం ఒక ఆధ్యాత్మిక యాత్ర. ప్రతి ప్రతిమ నా భక్తికి ప్రతిబింబం, అని అతను వినమ్రంగా చెబుతాడు. అతను రూపొందించే లింగాకారాల్లో ప్రత్యేక ఆకృతులు, శైవ తత్వాన్ని ప్రతిబింబించే చిహ్నాలు ఉంటాయి. దీంతో భక్తులు, స్థానికులు ఆయన ప్రతిమలను ఆసక్తిగా వీక్షిస్తూ అభినందిస్తున్నారు. ప్రతి ఏడాది కొత్త ఆలోచనతో, కొత్త రూపంతో శివప్రతిమలను ఆవిష్కరించడం అతని ప్రత్యేకత. ఇది కేవలం కళ కాదు శివారాధన అని చెప్పే అతనికి శివరాత్రి అంటే ఆత్మసంతృప్తి. భక్తి, కళ, వినూత్నం కలిసినప్పుడు పుట్టేది ఇలాంటి ప్రతిభే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. స్థానిక యువకులు కూడా ఇతన్ని అనుసరిస్తూ ప్రతిమల తయారీలో సహకారం అందిస్తున్నారు. పలు ఆలయాలకు సంబంధిత కాంట్రాక్టు పనులు చేస్తూ శివరాత్రి పర్వదినానికి రెండు నెలలకు ముందు నుంచి శివప్రతిమలు చేసి అందరినీ అలరిస్తూ పదహారేళ్లుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రిని పురస్కరించుకొని అతను సిద్ధం చేసిన శ్మశానాధీశుడు, జ్యోతిర్లింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2021లో రుద్రాక్షలతో ఆనందతాండవం ఈ ఏడాది శ్మశానాధీశుని ప్రతిమ -
ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు
శేషవాహనంపై సోమస్కందుడు, యాళి వాహనంపై జ్ఞానప్రసూనాంబశ్రీకాళహస్తి: నాగేంద్రాహారాయ..త్రిలోచనాయ.. అన్న ట్లు నాగేంద్రుని హారంగా చేసుకున్న సర్వేశ్వరుడు నా గరాత్రి పురస్కరించుకుని ఆదిశేషుని పడగల నీడన కొ లువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజున నాగరాత్రిగా పిలుస్తారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి సోమస్కందమూర్తి శేషవాహనంపై, జ్ఞానప్రసూనాంబ యాళివాహనంపై పురవీధుల్లో ఊరేగారు. వాహన సేవల్లో కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం స్వామి అమ్మవార్లు హంస, శుక వాహనాలపై ఊరేగారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 10.30 గంటలకు: ఇంద్ర విమానం–చప్పర సేవ రాత్రి 9.30 గంటలకు: నంది–సింహ వాహనసేవ శివసాంస్కృతిక వైభవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం శేష, యాళి వాహన సేవ ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉదయం 10 గంటలకు భరతనాట్య ప్రదర్శన అలరించింది. శివాని, శివ నాట్య కళా నిలయం ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇచ్చారు. మధ్యాహ్నం వరకు భక్తి రంజని, భజనలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు కొనసాగాయి. భూ కై లాస్ నాటకం, యోగా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం తిరుపతి, చైన్నె, పలమనేరు ప్రాంతాల కళాకారులు భరతనాట్య ప్రదర్శన చేపట్టారు. -
ఏనుగుల గుంపు విధ్వంసం
గుడిపాల: ఏనుగుల గుంపు మళ్లీ పంట పొలాలపై స్వైరవిహారం చేస్తోంది. రోజు మార్చి రోజు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున ఓవైపు అటవీశాఖ అధికారులు టపాసులు పేలుస్తుండగానే వాటిని లెక్కచేయకుండా పిళ్లారికుప్పం గ్రామ సమీపంలోని పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఓవైపు కొబ్బరిచెట్లు, పశుగ్రాసం, మామిడికొమ్మలు, అరటిపంటను పూర్తిస్ధాయిలో ధ్వంసం చేశాయి. అక్కడక్కడా కొద్దిగా వేసుకొన్న చిన్న పంటలను నాశనం చేశాయి. దీంతోపాటు పైపులు, ఫెన్సింగ్తోపాటు ఇనుపగేట్లను కూడా విరగ్గొట్టాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు పంటలపై పడడంతో పంటలన్నీ ఒక్కసారిగా నాశనం చేసి తిరిగి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయాయి. -
మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మెడికల్ మాఫి యా ఆగడాలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి వీసీ గోపినాథ్ నాయకత్వం వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు మాట్లాడుతూ నకిలీ, కాలం చెల్లిన మందులను అరికట్టడంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. మెడికల్ షాపుల యజమానులపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కొన్ని మెడికల్ షాపులలో కాలం చెల్లిన, నకిలీ మందులను అమాయక ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకుని, జిల్లాలో మెడికల్ మాఫియాను అరికట్టకపోతే, భవిష్యత్తు లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె.మణి, దాసరి చంద్ర, సత్యమూర్తి, విజయ్ కుమార్, రఘు, విజయ గౌరీ, రమాదేవి, కుమారి, లతా రెడ్డి, ఫైరోజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవా కాలువలో దుప్పి మృతి
పెద్దపంజాణి: మండలంలోని కమ్మనాయునిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువ నీటిలో దుప్పి కొట్టుకు రావడాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని హంద్రీనీవా, ఫారెస్టు అధికారులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు ఈతగాడు పవన్కుమార్తో దుప్పిని నీటిలో నుండి బయటకు తీయించారు. అప్పటికే అది మృతి చెంది ఉండడంతో పశువైద్యాధికారి వినీత కుమారి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. కార్యక్రమంలో హంద్రీనీవా డీఈ సెల్వరాజ్, ఏఈ మహేష్, ముత్తుకూరు బీట్ ఎఫ్బీఓ శోభనాద్రి, గ్రామస్తులు పాల్గొన్నారు. హత్య కేసులో ముగ్గురి అరెస్టు బంగారుపాళెం: యువకుని హత్య కేసులో శనివారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ మండలంలోని సదకుప్పం గ్రామంలో మామిడి తోపులో చెట్లకు మందు కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు, జానకిరామ్, రాజసింహ, సుమంత్రెడ్డి అనే వ్యక్తులు దళితవాడకు చెందిన మనోజ్తో ఘర్షణపడి తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీంతో మనోజ్ మృతి చెందిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసుకు సంబంధించి జానకీరామ్, రాజసింహ, ఓ బాలుడిని బంగారుపాళెం–అరగొండ రహదారి ఎస్ఎల్వీ కల్యాణ మండపం వద్ద పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసులో బాలుడైన నిందితుడిని జువనైల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు తిరుపతిలోని జువనైల్ హోమ్కు తరలించామన్నారు. మరో నిందితుడు సుమంత్రెడ్డి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
దివ్యాంగుల పింఛన్లపై వివక్ష
ఐరాల: చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, నూత న పింఛన్లపై వివక్ష చూపుతోందని వైఎస్ఆర్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతన్న బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం మంత్రి కొండపల్లె శ్రీనివాస్ అసెంబ్లీ సాక్షిగా కేవలం వితంతు, వృయోవృద్ధుల నూతన పింఛన్లకు త్వరలో దర ఖాస్తులు స్వీకరిస్తామని ప్రస్తావించారన్నారు. అయితే దివ్యాంగుల నూతన పింఛన్లపై ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించకపోవడం దివ్యాంగులపై కక్ష పూరిత ధోరణికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వడ్రాంపల్లెలో 9 మంది దివ్యాంగుల పింఛన్లు అక్రమంగా తొలగించారన్నారు. పింఛన్ల అక్రమ తొలగింపుపై నిజా నిజా లు నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా నేటికీ దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీలు గుర్తించలేదని, ఎప్పటికీ భర్తీ చేస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో జగనన్న స్ఫూర్తితో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి సారధ్యంలో రాజీలేని పోరాటానికి సంసిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించారు చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల సంక్షేమానికి నిధులు ఎక్కడ అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యా య సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలా జీ ప్రశ్నించారు. శనివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఉద్యోగులకు తీవ్ర నిరాశను మిగిల్చిందని విమర్శించారు. బడ్జెట్లో ఉద్యోగుల సంక్షేమంపై మొక్కుబడి మాటలతో సరిపెట్టారే తప్ప, ఆచరణాత్మకమైన నిధుల కేటాయింపులు లేకపోవడం శోచనీయమన్నారు. అత్యంత ప్రధానమైన 12వ పీఆర్సీ, డీఏ విడుదలపై బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిల విడుదలకు ఎటువంటి రూట్ మ్యాప్ ప్రకటించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. సంజీవయ్యకు ఘననివాళి చిత్తూరు కలెక్టరేట్: దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య అని జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ భారత రాజకీయాల్లోకి అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన మహనీయుడు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండో ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారన్నారు. 1960–62 మధ్య కాలంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు నేటి తరాలకు మేలు చేస్తున్నాయని తెలిపారు. డీఆర్ఓ మోహన్కుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ఆయన మూల స్తంభంగా నిలిచారని వివరించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ విక్రమ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదో తరగతి యాక్షన్ప్లాన్ను పాటించాలి
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని పలమనేరులో డీఈఓ రాజేంద్రప్రసాద్ సూచించారు.ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026చంద్రబాబు ప్రభుత్వం నిన్నటి రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ చిత్తూరు జిల్లావాసులను నిట్టనిలువునా వంచించింది. కుప్పం చుట్టూనే రాజకీయం తిప్పుతూ, జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలను గాలికి వదిలేశారు. అంకెల్లో చూపిన వేల కోట్ల పెట్టుబడులు కేవలం ప్రచారానికే పరిమితమని, సామాన్యుడి బతుకుల్లో ఎలాంటి మార్పు రాబోదని జిల్లాలోని విశ్లేషకులు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ధనికులకు వరం... సామాన్యుడికి శాపంగా మారింది. ఉద్యోగుల కడుపు కొట్టి, రైతుల కళ్లల్లో మట్టి కొట్టి, కేవలం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు పెద్దపీట వేశారని స్పష్టమైంది. రాబోయే రోజుల్లో ప్రస్తుత సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లావాసులు మండిపడుతున్నారు. నారా గారడీచిత్తూరు కలెక్టరేట్: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్ చిత్తూరు జిల్లా పాలిట అంకెల గారడీగా మారింది. పారిశ్రామిక హబ్లు, హైవేల పేరుతో భారీ అంకెలను చూపిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసింది. ముఖ్యంగా జిల్లాలోని ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులకు ఈ బడ్జెట్ మొండిచేయి చూపింది. జిల్లా అంతటా ఒక్క కుప్పం తప్ప మిగిలిన ప్రాంతాలు మ్యాప్లోనే లేవన్నట్టుగా వ్యవహరించడంపై ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రకటనల హోరు కుప్పం నియోజకవర్గానికి రూ.6,339 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెబుతున్నా, గతంలో శంకుస్థాపన చేసిన పరిశ్రమలే ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. బడ్జెట్లో చూపి న కేటాయింపులన్నీ కేవలం కుప్పం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. పెట్టుబడుల పేరుతో కుప్పం రైతుల నుంచి వేల ఎకరాల భూములను సేకరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలమనే రు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో కనీస సాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలను విస్మరించి కుప్పం బ్రాంచ్ కెనాల్కే నిధులు మళ్లించడం ప్రాంతీయ వివక్షతకు పరాకాష్ట అని ప్రజలు మండిపడుతున్నారు. ఉద్యోగులకు తీరని అన్యాయం జిల్లాలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఈ బడ్జెట్ చూసి హతాశులయ్యారు. ఎప్పు డో రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. జీతాలు ఇవ్వడమే గగనమైన ఈ ప్రభుత్వంలో, కొత్త పీఆర్సీ వస్తుందని ఆశించడం తప్పేనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన పాతపెన్షన్(ఓపీఎస్) హామీని బడ్జెట్ పక్కన పెట్టేసింది. ఇది ఉద్యోగ వర్గాలను నిలువునా ముంచడమేనని సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. 43,000 ఉద్యోగాల గారడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసేలేదు. జిల్లాలో లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు లేక మిన్నకుండిపోతున్నారు. 43 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని బడ్జెట్లో ప్రస్తావించా రు. వాస్తవానికి జిల్లా నుంచి రోజూ 2.5 లక్షల మంది నిరుద్యోగులు బెంగళూరు, చైన్నెలకు పలు పను ల కోసం వలస వెళ్తున్నారు. నైపుణ్య శిక్షణా కేంద్రా లు, స్థానిక పరిశ్రమలపై సరైన స్పష్టత లేదు. అంకెల గారడీ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెలగారడీ మాత్రమే. అత్యంత ముఖ్యమైన రైతు సంక్షేమాన్ని ఈప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులను చూస్తే రైతులపై సీఎం చంద్రబాబుకు ఎంత అక్కరుందో అర్థమవుతోంది. టమాటా, మామిడి, కూరగాయ పంటలు, తోట పంటలకు ధరల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. పంటలబీమా, వ్యవసాయ సబ్సిడీ, కనీసం రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వని పరిస్థితి. ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తామని పాతపాటే పాడుతున్నారు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు -
ఒత్తిడితో దుష్ప్రభావాలు
కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశ్చితి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఆత్మహత్యలు... చివరి ఫలితం ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు.ఇవి పాటించాలి సమయానికి నిద్రపోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి యోగా, మెడిటేషన్పై దృష్టి సారించి, క్రమం తప్పకుండా పాటించాలి అధిక సెల్ఫోన్ వాడకం వదలి..పుస్తక పఠనంపై దృష్టి మళ్లించాలి భావోద్వేగాలు, ప్రవర్తనపై అదుపు కలిగి ఉండాలి అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి నిద్ర పట్టకపోవడం ఆకలి లేకపోవడం, లేక ఎక్కువ ఆహారం తినడం ఊబకాయం మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో ఇన్ఫెక్షన్స్ -
భూములు ఇవ్వలేం.. న్యాయం చేయండి
వి.కోట: ఎటువంటి నోటీసులు జారి చేయకుండా భూములను సేకరించడానికి ప్రయత్నాలు చేయడం ఎంత వరకు న్యాయమని చిన్నాగనపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. మండలంలోని ముదరందొడ్డి పంచాయతీ చిన్నాగనపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులస్తులకు ముదరందొడ్డి 74 రెవెన్యూ లెక్క దాఖల భూమిలో వర్షాధార పంటలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ భూముల్లో దాదాపు 20 ఎకరాల్లో సోలార్ సిస్టం ప్లాంట్ ప్రాజెక్ట్ అమర్చడానికి సిద్ధం చేస్తోంది. అనుభవంలో ఉన్న ఎస్సీ కులస్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ చిన్నాగనపల్లి గ్రామ ఎస్సీ రైతులు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుకు శుక్రవారం వినతి పత్రం అందించారు. దీనిపై స్పందిన ఆయన సోలార్ సిస్టం ఏర్పాటుపై జిల్లా కలెక్టర్తో చర్చించి న్యాయం చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. ప్రాంగణ ఎంపికలో 21మందికి ఉద్యోగాలు తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడీ రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో హైదరాబాద్కి చెందిన ఎంఆర్ఎఫ్ కంపెనీ చేపట్టిన ప్రాంగణ ఎంపికల్లో 21 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. శుక్రవారం కళాశాలలో జరిగిన ఈ ఎంపికల్లో కంపెనీ డిప్యూటీ మేనేజర్ రఘురాం పాల్గొని ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి ఎంపికై న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ కళాశాలలో ప్రాంగణ ఎంపికలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, ప్లేస్మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాలి శ్రీనివాసులు కథనం మేరకు.. 2021 డిసెంబర్ 6 తేదీ చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగకు చెందిన వై.దొరస్వామి పశువుల పాక వద్ద ఉండగా వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగ హరిజనవాడకు చెందిన ఎం సూర్య అలియాస్ సూర్య గోపాల్, ఎం.చిన్నబ్బ ఇతర కుటుంబ సభ్యులు వచ్చి వీధిలైట్లు విషయంపై గొడవ పడి అతనిపై మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో దొరస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతను వెదురుకుప్పం పోలీసులకు ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఏనుగుల గాలింపు కోసం మరోదారి
గుడిపాల: ఏనుగుల గాలింపు కోసం మరో దారిని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ కరణ్సింగ్ అన్నారు. గుడిపాల మండలంలోని చిత్తపార అటవీ ప్రాంతంలో నెలరోజులకు పైగా తిష్టవేసిన ఏనుగుల గుంపు కోసం నరహరిపేట చెక్పోస్ట్ సమీపంలో నుంచి బట్టువాళ్లూరు గ్రామం సమీపానికి రోడ్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం కొత్తగా అటవీప్రాంతంలో ఏనుగుల గాలింపు కోసం మద్రాస్క్రాస్ రోడ్డు సమీపంలో నుంచి నెల్లేపల్లి వంక వరకు మరోదారిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం శుక్రవారం నుంచి అటవీ ప్రాంతంలో జేసీబీలతో దారిని ఏర్పాటుచేసి అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఏనుగుల గుంపును తరిమేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ దారితో ఏనుగులు ఎప్పుడు వచ్చినా తరిమేందుకు అనుకూలంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. -
సన్నిధిగొల్లను వేధించడం అన్యాయం
నగరి: వడమాలపేట మండలం, అప్పలాయగుంటలో కొలువైన ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొలిదర్శనం చేసుకునే సన్నిధి గొల్లను విధులకు రావొద్దంటూ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు హుకుం జారీ చేయడం అన్యాయమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సన్నిధిగొల్ల వెంకటేశ్ యాదవ్, విశ్రాంత సన్నిధిగొల్ల మునికృష్ణయాదవ్ తమను విధుల నుండి తొలగించారంటూ మీడియా సాక్షిగా ఆలయం ముందు విలపించడంపై ఆమె స్పందించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో దశాబ్దాలుగా స్వామి సేవలో ఉన్న సన్నిధిగొల్ల కుటుంబాన్ని రాజకీయ కక్షలతో దూరం పెట్టడం దారుణమన్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని అన్నారు. సంప్రదాయాలను కాపాడాల్సిన ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సన్నిధిగొల్లకు న్యాయం చేసి అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను కాపాడాలన్నారు. స్పందిస్తున్న దయార్థ్ర హృదయాలునగరి: మండలంలోని తడుకు దళితవాడకు చెందిన విద్యార్థిని ప్రభావతి ఆరోగ్య పరిస్థితిని వెలుగులోనికి తెస్తూ బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘ప్రభావతం.. ప్రాణసంకటం’ అనే వార్తకు దయార్థ్ర హృదయాలు స్పందిస్తున్నాయి. ఆమె ఫోన్పే, గూగుల్పే నెంబర్లకు శుక్రవారం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఫోన్ నెంబర్లు 90325 01552, 90590 78374కు ఫోన్పే, గూగుల్పే ద్వారా సాయం చేయాలని ప్రభావతి తల్లి రాములమ్మ కోరారు. -
హామీలు నెరవేర్చకుంటే చలో విజయవాడ
చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే చలో విజయవాడ ఖాయమని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్, జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీన ఆ సంఘం నాయకులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించిన టీచర్లపై పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు వీల్లేదని టెంట్ను తొలగించారు. దీంతో సంఘ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు బెదిరింపులకు పాల్పడడం దారుణమని ఎస్టీయూ నాయకులు మండిపడ్డారు. అనంతరం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసుకోవాలని చెప్పడంతో ఆ సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద వందలాది మంది టీచర్లు రోడ్డు పై బైఠాయించి చంద్రబాబు సర్కారు తీరు పై నినాదాలు చేసి విమర్శలు గుప్పించారు. బతుకు భారంపై ఆవేదన ఎస్టీయూ జిల్లా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్రెడ్డి, షేక్ ఇలియాజ్ మాట్లాడుతూ సుమారు 35 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం కావాలనే తొక్కి పెడుతోందని ఆరోపించారు. సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఈ నెల 25వ తేదీ లోపు ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే వేలాది మందితో చలో విజయవాడ చేపట్టి దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ మోహన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర అదనపు కార్యదర్శి పురుషోత్తం, నాయకులు దేవరాజులురెడ్డి, రాధాకుమారి, ప్రమీలకుమారి, వేదవతి, యువరాజు, పురుషోత్తం, చంద్రశేఖర్, రమేష్రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయుల గర్జన చంద్రబాబు సర్కారు తీరు మార్చుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్ హెచ్చరించారు. టీచర్లకు ఇచ్చిన హామీలను గాలికొదిలేయడం దారుణమని ధ్వజమెత్తారు. వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
రెండిళ్లకే సీసీ రోడ్డు
శ్రీరంగరాజపురం: మండలంలోని పొలంలో ఇద్దరు టీడీపీ నాయకులు నిర్మించుకున్న రెండు ఇళ్లకే దాదాపు రూ.14 లక్షలతో సీసీ రోడ్డు వేశారు. పొలంలోని ఓ ఇంటికి రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు శ్రీరంగరాజపురం మెదవాడ ఎస్టీ కాలనీలో ప్రభుత్వ నిధులతో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారి నుంచి పొలంలో ఇళ్లు నిర్మించుకున్న ఇంటి వరకు దాదాపు రూ.3 లక్షలతో కల్వర్టు, రూ.4 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2 లక్షలతో కాలువ ప్రొటక్ట్ వాల్ నిర్మాణం చేపట్టారు. పొలంలో నిర్మించుకున్న ఇంటికి దాదాపు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. మెదవాడ పంచాయతీలో దళితవాడ, ఎస్టీ కాలనీలకు రోడ్లు వేయలేదని, ఇద్దరి ఇళ్లకు మాత్రం రోడ్లు వేయడం ఏమిటని స్థానికులు అడ్డుకున్నారు. సాక్షి విలేకరిపై దౌర్జన్యం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సాక్షి మండల విలేకరి సెల్ఫోన్లో రోడ్డు నిర్మాణ పనులను చిత్రీకరించి అధికారులకు తెలియజేశారు. దీనిపై కాంట్రాక్టర్ జ్యోతిప్రకాష్ నాయుడు, అతని సోదరుడు సాక్షి విలేకరిని దుర్భాషలాడాడు. కులం పేరుతో దూషించి, దాడికి యత్నించారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్: ఇరువర్గాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నగరి డీఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శేషాపిరాన్ మసీదు కమిటీ వివాదంపై ఇరు వర్గాలతో శుక్రవారం కలెక్టరేట్లోని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరువర్గాలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ రానున్న రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎవ్వరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదన్నారు. వివాదాస్పద చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, వన్ టౌన్ సీఐ మహేశ్వర పాల్గొన్నారు. -
పరీక్షల నిర్వహణలో రాజీ వద్దు
చిత్తూరు కలెక్టరేట్: పరీక్షల నిర్వహణలో ఎలాంటి రాజీ వద్దని డీఆర్ఓ కె.మోహన్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రెగ్యులర్ ఇంటర్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించబోయే రెగ్యులర్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించాలన్నారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు ఈ నెల 23 వ తేదీ నుంచి మార్చి 24 వ తేదీ వరకు జిల్లాలోని 50 కేంద్రాల్లో నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 29,279 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 13 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 1,063 మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. మార్చి 16 వ తేదీ నుంచి మార్చి 28 వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 19 కేంద్రాల్లో ఓపెన్ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 2,528 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కచ్చితంగా 144 సెక్షన్ అమలు చేయాలని డీఆర్ఓ ఆదేశించారు. భద్రత, నిఘా పకడ్బందీగా ఉండాలన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు పరీక్షల సమయంలో మూసివేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు కచ్చితంగా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి లేదన్నారు. శాఖల వారీ బాధ్యతలు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు శాఖల వారీగా బాధ్యతలను అప్పగించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని తెలిపారు. సీసీ కెమెరాల పని చేసేందుకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎం, నర్సులను నియమించి, ప్రథమ చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, బెంచులు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని డీఆర్ఓ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ డీఐఈఓ రఘుపతి, డీఈఓ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ మహబూబ్ బాషా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
చిత్తూరు అర్బన్: విధి ఎప్పుడు ఎవరిని ఎలా వెంటాడుతుందో తెలియదు. బెంగళూరు నుంచి గుడిపాల వస్తున్న యువకుడు ఎనిమిది నిమిషాల్లో తన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. కానీ ఓ స్కూటర్ను నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తి.. అతివేగంగా ట్రక్కును నడిపిన డ్రైవర్ కారణంగా కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చిత్తూరు నగర శివారుల్లోని ఇరువారం–యాదమరి క్రాస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుదీపక్(33) అనే యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమిళనాడులోని తేనెకు చెందిన లారీ డ్రైవర్ కుమార్(49)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా స్కూటర్ నడిపి లారీ చివర్లో రాసుకోవడంతో కింద పడ్డ చంద్రన్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. తప్పిన పెను ప్రమాదం లారీ కారుపై పడడానికి కొన్ని క్షణాల ముందు ఏడుగురు ప్యాసింజర్లతో ఓ ఆటో అప్పుడే రోడ్డు దాటింది. త్రుటిలో ఆటో తప్పించుకుంది. దానికి కొద్ది క్షణాల ముందు మరో కారు మెరుపువేగంతో ముందుకు వెళ్లడంతో అది కూడా తప్పించుకుంది. జాతీయ రహదారిని కలిపే యాదమరి–ఇరువారం కూడలి వద్ద కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడం, ఫ్లైఓవర్ కూడలి మీదుగా నిర్మించకపోవడం అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఉదయం– 8.13 గంటలు బెంగళూరు–చైన్నె జాతీయ రహదారిపై గుడిపాలలోని 180–రామాపురం వెళ్లడానికి అనుదీపక్ తన కారు నడుపుతూ ఇరువారం ఫ్లైఓవర్ నుంచి దిగుతున్నాడు. చైన్నె–హోస్కోట వైపు వెళుతున్న కంటైనర్ వేగంగా ఫ్లైఓవర్ ఎక్కడానికి వెళుతోంది. ఇంతలో యాదమరి వైపు నుంచి చిత్తూరు వెళ్లడానికి చంద్రన్ అనే వ్యక్తి స్కూటర్పై వస్తూ ఉన్నట్టుండి ఎన్హెచ్పైకి వచ్చేశాడు. స్కూటరిస్టును తప్పించడానికి డ్రైవర్.. లారీను పూర్తీగా కుడివైపు తిప్పేశాడు. లారీ వేగం చూసి భయానికి గురైన అనుదీపక్ తన కారును అలాగే ఆపేశాడు. ఒక్కసారిగా లారీపై ఉన్న కంటైనర్ కారుపై పడిపోయింది. సమయం – 8.41 గంటలు స్థానికుల హాహాకారాలు. కానీ కంటైనర్ను పక్కకు తీయడం సాధ్యంకాదు. ఏం చేయాలో కారులో ఎందరు ఉన్నారో ఏమీ అర్థంకాలేదు. అప్పటికి పోలీసులు ఎవరూ కూడా ఘటనా స్థలానికి చేరుకోలేదు. సమయం – 8.46 గంటలు చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, యాదమరి ఎస్ఐ ఈశ్వర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, జేసీబీ సాయంతో కంటైనర్ను పక్కకు తప్పించారు. కారు నుజ్జునుజ్జు కావడంతో లోపల ఎవరూ ప్రాణాలతో బయటపడే పరిస్థితి కనిపించలేదు. కానీ కారులో ఎందరు ఎన్నారో ఎవరికీ అర్థం కాలేదు. సమయం – 8.57 గంటలు కారు డోర్లను పగులగొట్టి, పక్కకు తీశారు. మరికొందరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని డ్రైవింగ్ సీటులో ఒక్క వ్యక్తి అచేతనంగా పడున్నాడు. సమయం – 9 గంటలు కారులో ఉన్న వ్యక్తిని అతికష్టం మీద బయటకు తీశారు. గుడిపాల మండలం 180–రామాపురానికి చెందిన అనుదీపక్గా గుర్తించారు. అవివాహితుడు. సాఫ్ట్వేర్ కంపెనీలో హైబ్రిడ్ పద్ధతిలో కొద్ది రోజులు బెంగళూరు, కొద్ది రోజులు ఇంట్లో పని చేస్తాడు. కొద్ది నిముషాల్లో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కలుసుకోవాల్సిన అనుదీపక్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. -
అంతా.. ఇంతా కాదు
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. సందుకో ఆస్పత్రి పురుడు పోసుకుంటోంది. అనుమతి లేకుండానే దర్జాగా క్లినిక్ల పేరుతో ఆస్పత్రులు తెరుచుకుంటున్నాయి. అడిగేవారు లేరని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు చోట్ల డమ్మీ డాక్టర్లు, సిబ్బందితో దోపిడీ చేస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో చేరి పడకెక్కితే పరలోకానికి పయనమేనని ఆరోపణలున్నాయి. అయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం : జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు 154 వరకు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో హాస్పిటల్స్ 95, డెంటల్ క్లినిక్లు 15, క్లినిక్లు 23, ఇతర క్లినిక్లు 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అనుమతులు లేకుండా దాదాపు 300 పైగా క్లినిక్లు, ఆస్పత్రులు అనుమతుల్లేకుండా నడుస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి నడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అరకొర వైద్యం అందించే డాక్టర్లు, సిబ్బందితో వైద్య వ్యవస్థను కలుషితం చేస్తున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెప్పిస్తున్నారు. ఇక గడువు ముగిసిన ఆస్పత్రులు కూడా 30కి పైగానే ఉన్నాయి. ఇవి కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆస్పత్రులు కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బోరుమంటున్నారు. తప్పనిసరి అనుమతులు ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు లేబోరేటరీలు, డెంటల్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ యూనిట్ల ఏర్పాటు చేయాలంటే వివిధ విభాగాల నుంచి అనుమతులు తప్పనిసరి. వీటిని ఏర్పాటు చేసే భవనాలకు పట్టణ, పంచాయతీ అనుమతులు, అగ్నిమాపక శాఖ, ఐఎంఏ సభ్యత్వం, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య పరీక్షల సామగ్రి వివరాలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి, స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఫార్మసీ సిబ్బంది, ఆడిట్ నివేదిక ఇలా అన్ని రకాల అనుమతులతో రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫీజులు ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వేలల్లోనే ఫీజులుంటాయి. సాధారణ క్లినిక్లు రూ.1250, పాలి క్లినిక్లకు రూ.2500, 20 పడకల ఉన్న ఆస్పత్రికి రూ.3750, 21 నుంచి 50 పడకల ఆస్పత్రికి రూ.7500, 50 నుంచి 100 పడకల ఆస్పత్రికి రూ.10 వేలు, 101 నుంచి 200 పడకలకు రూ.15 వేలు, 200 పైగా పడకలున్న ఆస్పత్రికి రూ.37,500, ల్యాబోరేటరీకి రూ.2500, డయాగ్నోస్టిక్ సెంటర్, ఎక్స్రే, సీటీ స్కాన్ సెంటర్లకు రూ.10 వేలు, ఫిజియోథెరపీ క్లినిక్కు రూ.3750 ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ రకంగా పలు ప్రైవేటు హాస్పిటల్స్, క్లినిక్కులు రిజిస్ట్రేషన్కు ముందుకు రాకపోవడానికి పలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే సాక్ష్యం చిత్తూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయానికి సమీపంలోని మూడు ఆస్పత్రులకు అనుమతి లేదు. ఇందులో ఒక చిన్న పిల్లల ఆస్పత్రి కూడా ఉంది. ఈ మూడు ఆస్పత్రులకు రోజువారీగా రూ.లక్షల్లో ఫీజులొస్తుంటాయి. ఇక మెడికల్ షాపులు కూడా వీరే నిర్వర్తించడంతో రూ.3 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. ఇక ఈ ఆస్పత్రుల్లో వైద్యార్హత లేని డాక్టర్లు, సిబ్బంది చికిత్స చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని మరో ఆస్పత్రి కొత్తగా పురుడు పోసుకుంది. ఆ ఆస్పత్రి సకల సౌకర్యాలతో నడుస్తున్నా ఇంత వరకు అనుమతి పొందలేదు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు సుందరయ్యవీధిలో ఓ డెంటల్ ఆస్పత్రికి కొన్నేళ్లుగా అనుమతి లేకుండానే నడుస్తోంది. 2014 జూలైలో అప్పటి డీఎంఅండ్హెచ్ఓ ఆ బోగస్ ఆస్పత్రిని గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఇంత వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని కార్యాలయ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ చేయిస్తామంటే.. విధిగా చేయించుకునేవాళ్లు వందల సంఖ్యలో ఉన్నామని రిజిస్ట్రేషన్ కాని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళితే రూ. లక్షల్లో ఖర్చు అవుతోందని పలువురు వాపోతున్నారు. ఒక్కో ఆస్పత్రికి రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో మధ్యవర్తులుగా వ్యవహరించే కొందరి చేతిలో పైసలు పెడితే తప్ప పనులు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక అనుమతులు లేని పలు ఆస్పత్రుల నుంచి మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. అందుకే ఆస్పత్రి రిజిస్ట్రేషన్ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి.. మధ్యవర్తుల జోక్యాన్ని కట్టడి చేసి.. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ను నియమ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. -
లంకేశ్వరుడిపై లయకారుడు
స్వామి,అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణశ్రీకాళహస్తి: అసుర జాతిలో పుట్టిన రావణుడు బ్రహ్మణోత్తముడు..అత్యంత శివభక్తి పారాయణుడు. కైలాసాన్ని తన శిరస్సుకెక్కించుకుని.. రు ద్రవీణాగానంతో పరమేశ్వరుడిని మెప్పించిన భక్తాగ్రేసరుడు. అందుకే మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ముక్కంటీశ్వరుడు ధశకంఠుడిపై అధిరోహించాడు. స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబ మయూర వాహనాన్ని అధిరోహించి, భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. వినాయకుడు మూషిక వాహనంపై, శ్రీవల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండీకేశ్వరస్వామి, భక్త కన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బంగారు యాళి వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప కొలువుదీరారు. కళాకారుల కోలాటాలు, నందుల వాయిద్యాలు, శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిసరాలు మార్మోగాయి.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా జ్ఞానప్రసూన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. మేళ,తాళాల మధ్య పట్టువస్త్రాలు, సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ఆలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయిలకు అందజేశారు. -
సెల్ఫోన్.. చేతిలో ఉన్న విషం
సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తూ మనుషులు తెలియకుండానే మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతూ ఒంటరితనాన్ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా పోలికలు, అవమానాలు, నెగెటివ్ కంటెంట్ యువత మనస్సును చిదిమేస్తోంది. దీనికితోడు ఒంటరి జీవనం పెరిగిపోవడంతో కొందరు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇవి సమస్యలకు పరిష్కారం కాదని తెలిసినా, తాత్కాలిక ఉపశమనానికి అలవాట్లలో చిక్కుకుపోతున్నారు. చివరకు మానసిక, శారీరక, ఆర్థికంగా పూర్తిగా కుమిలిపోతున్నారు. ఇక ఒకప్పుడు కుటుంబాలతో కలిసి మెలిసి జీవించిన సమాజం ఇప్పుడు విడిపోయింది. మాట్లాడే మనుషులు లేరు. వినే చెవులు లేవు. బాధను పంచుకునే వారు లేక అనేక మంది లోలోపలే కుంగిపోతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా మానసిక రుగ్మతలు వ్యాపిస్తున్నాయి. -
విద్యుత్ సమస్యలు పరిష్కారం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి, సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లలో 72 సమస్యలు, ట్రాన్స్ఫార్మర్లలో 22, ఎల్టీ లైన్లలో 163, సర్వీసు లైన్లో 15 కలిపి మొత్తం 272 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 18 సమస్యలను పరిష్కారించామన్నారు. మిగిలినవి ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరిష్కరించనున్నట్లు వివరించారు. కుప్పంలో పాల కల్తీ లేదు కుప్పం: కుప్పం ప్రాంతంలో పాల కల్తీ ఎక్కడా జరగలేదని, ఈ వ్యవహారం అంతా కర్ణాటకకు సంబంధించిందిగా కుప్పం డీఎస్పీ పార్థసారధి తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కుప్పం ప్రాతంలో కల్తీ పాలు విక్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కుప్పం ప్రాంతంలో పాల కల్తీ జరగలేదని, కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆ రాష్ట్రంలోని బల్లగిరి గ్రామంలో జరిగిన దాడుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరిలో రామకుప్పం మండలానికి చెందిన బాలరాజు, గుడుపల్లెకు చెందిన వెంకటేష్, బాలాజీ, దిలీప్పై కేసులు నమోదు చేశారని తెలిపారు. వీరంతా కర్ణాటకలోని బల్లగిరి వద్ద పాలు కల్తీకి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. కర్ణాటకలో జరిగిన సంఘటనలో కుప్పంవాసులు ఉండడంతో ఈ వార్తలు వస్తున్నాయన్నారు. కల్తీ జరిగింది కుప్పంలో మాత్రం కాదని స్పష్టం చేశారు. పరీక్షలపై సీఎస్ సమీక్ష చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్కుమార్ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణతోపాటు, కోర్టు భవనాలకు స్థల కేటాయింపులు, ప్రభుత్వ కార్యాలయాల స్థల సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పది, ఇంటర్మీడియట్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ వివరించారు. పెనుమూరు పీడీపై సస్పెన్షన్ వేటు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని పెనుమూరు మండలంలో విద్యార్థిని వేధింపుల ఘటనలో పెనుమూరు జెడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ చంద్రశేఖర్పై వేటు పడింది. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో పీడీ అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ డీఈఓ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు పెనుమూరు జెడ్పీ హైస్కూల్ పీడీ చంద్రశేఖర్ గత ఏడాది మే నెలలో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. రాష్ట్ర హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్(హెచ్ఆర్డీ)లోని ప్రజాసమస్యల పరిష్కార వేదికను బాధితులు ఆశ్రయించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర విచారణ చేయాలంటూ చిత్తూరు డీఈఓను ఆదేశించింది. విచారణాధికారి చిత్తూరు డీవైఈఓ ఇందిరను ప్రాథమిక విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా పీడీను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష సమయంలో పార పట్టించారు చిత్తూరు రూరల్ (కాణిపాకం): అసలే పరీక్ష సమయం. విద్యార్థులు పుస్తకాలు పట్టి కుస్తీ పట్టాల్సిన తరుణం. అయితే పార పట్టి పనులు చేయించారు. చిత్తూరు మండలం బీఎన్ఆర్ పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు శుక్రవారం ఆ కళాశాల అధ్యాపకులు గట్టి పని పెట్టారు. గడ్డపార, పార ఇచ్చి పరీక్ష పెట్టారు. కళాశాల ముఖ ద్వారం ఆనుకుని కళాశాల ఆవరణంలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించేలా చేశారు. సుమారు 3 గంటల పాటు పనులు చేయించారు. -
30 స్టార్టర్లు చోరీ
పుత్తూరు: పట్టణ పరిధిలోని తిమ్మాపురం, కట్టకింద రామకృష్ణాపురం, కొత్తతిమ్మాపురం, కొండల్చెరువు గ్రామాల్లోని పలువురు రైతులకు చెందిన 30కి పైగా స్టార్టర్లు, వందల మీటర్ల కాపర్ వైర్ను దుండగులు గురువారం రాత్రి దోచుకెళ్లారు. శుక్రవారం పొలాల వద్దకు వెళ్లిన రైతులకు మోటార్ల వద్ద తెగి పడిన వైర్లతో పాటు స్టార్టర్లు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పరుగులు తీశారు. పంట పొలాలకు నీళ్లు ఎలా కట్టాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు కలసి వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో రైతు కనీసం రూ.10 వేలు ఖర్చు పెడితేగాని స్టార్టర్, వైర్లను ఏర్పాటు చేసుకొనే పరిస్థితి లేదు. పోలీసులు ఈ వరుస దొంగతనాలను అరికట్టడానికి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు కట్టకింద రామకృష్ణాపురానికి చెందిన మురళీ, తిమ్మాపురంలో గాంధీ, కృష్ణారెడ్డి, శంకర్రెడ్డి, జగదీష్, నాగరాజురెడ్డి, గంగయ్యరెడ్డి, పంచాక్షరరెడ్డి, ఏలుమలైరెడ్డి, కొత్తతిమ్మాపురంలో కందస్వామి తదితర రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. -
చిత్తూరులో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కంటైనర్ వాహనం కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఇరువారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విజయపథంలో ఆమె పాదం
వైకల్యం అనే ఓ పదం మనిషి ఆశలను, ఆశయాన్ని చలనం లేకుండా చేయలేదు అని నిరూపించింది. తనను చూసి ఎగతాళి చేసిన అయిన వాళ్లతో పాటు.. కరుడుగట్టిన బయటవాళ్లనూ గెలిచారు కృష్ణవేణి. ఇటీవల వెలువడ్డ గ్రూప్–1 ఫలితాల్లో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని శ్రీరంగరాజపురం (ఎస్ఆర్)కు చెందిన ముద్దంగల కృష్ణవేణి రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యారు. తల్లి రోజువారీ తాపీ పనులకు వెళితే.. తండ్రి వ్యవసాయ కూలి పనులు చేసి బిడ్డను చక్కగా చదివించారు. ఇపుడు ఊరంతా కృష్ణవేణి విజయం గురించి మాట్లాడుతోంది. కానీ ఆ విజయం వెనుక కష్టం గురించి మాత్రం కృష్ణవేణే మాట్లాడాలి. ఆమె ఏం చెబుతోందో తెలుసుకుందాం...మాది పేద కుటుంబం. అన్న, నేను, తమ్ముడు ముగ్గురం. నాన్న దొరస్వామి. రోజూ ΄÷లంలో కూలి పనులు చేస్తాడు, అమ్మ పేరు రత్నమ్మ. మగాళ్లకు సమానంగా ఇసుక–సిమెంటు కలపడం, ఇటుకరాళ్లు మోయడం లాంటి తాపీ పనులు చేసింది. రోజూ ఎవరో ఒకరు పనికి వెళితే తప్ప.. ఆ రోజు ఇల్లు గడవదు. తిన్నా, తినకున్నా.. నాకు మాత్రం స్కూల్లో ఉండడం ఇష్టం. నేను ఆరోతరగతి చదువుతుండగా 2010లో ఓ రోజు ఇంటి దగ్గర బట్టలుతికి, ఆరేస్తుండగా.. 11 కేవీ విద్యుత్ వైరు తగలడంతో నేను కిందపడి పోయాను. మా కుటుంబం పరిస్థితి తలకిందులై పోయింది.అప్పుల ఊబిలో చిక్కుకున్నాంట్రాన్స్కో అధికారులకు అప్పటికే చాలాసార్లు చెప్పాం. లైను మార్చమని, వాళ్లు పట్టించుకోక పోవడంతో కరెంటు తీగలు తాకిన నాకు షాక్ తగిలి శరీరమంతా నల్లగా మారి పోయింది. ఇక బతకదన్నారు. చివరి ప్రయత్నంగా తమిళనాడు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నన్ను ఎలాగో బతికించారు. మూడు నెలల తరువాత కాలు, చేయి కోల్పోయిన నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే నా వైద్యంకోసం భూములు పోయినాయి. అప్పుల్లో చిక్కుకున్నాం. (ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాం) కానీ నాకేమో ఇంట్లో ఉండడం నచ్చదు. ఏది ఏమైనా బడికి వెళ్లాలి. ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్లడానికి రోడ్డుపై నిలబడితే ఊర్లో ఉన్న ఎవరో ఒకరు నన్ను స్కూటర్పై ఎక్కించుకుని బడిలో వదిలితే అమ్మో నాన్నో వచ్చి పిలుచుకెళ్లేవాళ్లు. ఆ తర్వాత కృత్రిమ కాలు అమర్చుకున్నాను.ఆ నిర్లక్ష్యమే కసిని పెంచింది.ట్రాన్స్ కో అధికారుల నిర్లక్షా్యనికి పరిహారం కోరుతూ కలెక్టరేట్ చుట్టూ తిరిగేవాళ్లం. చేయి, కాలు పనిచేయని నన్ను అమ్మ–నాన్న చిత్తూరులో ఉండే కలెక్టరేట్కు తీసుకెళ్లేవాళ్లు. క్యూలో నిలబడి చాలాసార్లు మాకు జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నాం. అప్పుడే నేనొకటి గమనించాను. మాకన్నా దారుణమైన పరిస్థితి ఉన్న వాళ్లు కూడా కలెక్టర్ పిలిస్తే వెంటనే అక్కడ నిలబడటం, ఆయన ఆదేశాలు పాటించడం చూశాం. అంటే చదువుకుని చేతిలో అధికారం ఉంటే అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయొచ్చని మాత్రం అర్థమయ్యింది. ట్రాన్స్కో అధికారుల మనసు కరగక పోవడంతో అప్పులు చేసి మరీ కోర్టులో కేసు వేశాం. 54 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ తొక్కుతూ నాన్న వాయిదాలకు హాజరయ్యేవారు. అదే నాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే కసిని పెంచింది. 14 ఏళ్ల తరువాత పరిహారం వచ్చినా.. అది మా అప్పులు–వడ్డీలకు కూడా చాల్లేదు. పదో తరగతి వరకు ప్రభుత్వ బడే. మళ్లీ ఇడుపుల పాయలో సీటు, అక్కడే బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేశాను.ఐఏఎస్ అవుతా..డిగ్రీ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాను. 2022లో వెలువడ్డ గ్రూప్స్ నోటిఫికేషన్ లో తొలి పరీక్షే తప్పాను. ఆ మరుసటి ఏడాది వెలువడ్డ నోటిఫికేషన్ లో ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని నిర్ణయించుకున్నాను. గ్రూప్–1, గ్రూప్–2కు సమాంతరంగా సిద్ధమయ్యాను. నా ఆర్థిక పరిస్థితి తెలిసి చాలామంది దాతలు చందాలు వేసుకుని హాస్టల్ ఫీజులు, స్టడీ సెంటర్ ఫీజులు కట్టారు. అది ఎప్పటికీ మర్చి పోలేను. ఈ మధ్యే గ్రూప్–2లో సివిల్ సప్లైస్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినా గ్రూప్ 1లో ఉద్యోగం వస్తుందన్న ధీమాతో అందులో చేరలేదు. నా నమ్మకం వమ్ము పోలేదు. అనుకున్నట్లే వచ్చింది. అమ్మా నాన్నలను నా కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పాలి. ఇదే సమయంలో ఎప్పటికైనా ముద్దంగల కృష్ణవేణి.. ఐఏఎస్ అని పిలిపించుకోవాలన్న నా లక్ష్యాన్ని సాధించి తీరతాననే నమ్మకం ఉంది. – ఎం.లోకనాథన్, సాక్షి, చిత్తూరు అర్బన్ -
అర్ధ వార్షిక మహాజన సభ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం అర్ధ వార్షిక మహాజన సభ సమావేశం నిర్వహించారు. బ్యాంకు కార్యకలాపాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. 2025 సెప్టెంబర్ నాటికి బ్యాంకు పరిపాలన నివేదికను పరిశీలించారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా ఆదాయ, వ్యయాలు, ఖర్చు అంచనాలను ఆమోదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.4,460 కోట్ల వ్యాపారాభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.1,260 కోట్ల డిపాజిట్లు సమీకరించడం, రూ.3,200 కోట్ల వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మంజూరైన వివిధ రకాల రుణాల బట్వాడాపై చర్చించారు. అలాగే సంఘాల్లో హెచ్ఆర్ పాలసీ అమలు, ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని తీర్మానించారు. సంఘాల్లో ఉన్న అసమతుల్యతలను తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మహాజన సభలో చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి ఎస్.లక్ష్మి, సీఈవో శంకర బాబు, జీఎంలు, డీజీఎంలు, ఏజీఎంలు తదితరుల సభ్యులు పాల్గొన్నారు. -
బంగారు ఉంగరం అపహరణ
బంగారుపాళెం: ఓ విశ్రాంత ఉగ్యోగి బంగారు ఉంగరాన్ని మాయమాటలు చెప్పి అపహరించుకు పోయాడు ఓ అపరిచితుడు. ఈ ఘటన గురువారం బంగారుపాళెంలో జరిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన లక్ష్మీపతి సోషల్ వెల్ఫేర్ డిపార్టు మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. స్థానిక ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ఓ అపరిచిత వ్యక్తి స్కూటర్పై వచ్చి నమస్తే అన్నా.. బాగున్నావా అంటూ పలకరించాడు. తర్వాత లక్ష్మీపతి ఉంగరం చూసి ‘భలే ఉందే ఎన్ని గ్రాములు ఉంటుంది.. ఇలాంటిదే కొనా లనుకుంటున్నా’ అని చెప్పాడు. అనంతరం ఉంగ రం పరిశీలిస్తున్నట్లు నటించి చట్టుక్కున లాక్కుని స్కూటర్పై పరారయ్యాడు. దీంతో లక్ష్మీపతి చేష్టలుడిగి నిలబడిపోయాడు. కాసేపటికి తేరుకుని కుటుంబీకులతో కలిసి గాలించినా అపరిచితుడి ఆచూకీ చిక్కలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన ఉంగరం 5 గ్రాములుంటుందని బాధితుడు వెల్లడించారు. లారీ డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్య వి.కోట : లారీ డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నాయకనేరి ఘాట్లో గురువారం చోటుచేసుకుంది. సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం, రాణిపేట జిల్లా, ఆర్కాడ్కు చెందిన జయకుమార్(34) లారీ డ్రైవర్. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జయకుమార్ వారం క్రితం బెంగళూరుకు లోడ్ వేసుకుని వెళ్లి గురువారం తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో నాయకనేరి ఘాట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద లారీని పక్కన ఆపి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన్నట్లు వివరించారు. మృతుడు తాగుడుకు బానిసై భార్యతో తరచూ గొడవపడే వాడని, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అతని బంధువులు తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు. 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం సుండుపల్లె : అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాను టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. రూ.1.65 కోట్ల విలువైన 72 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ నీటి ట్యాంకర్ను సీజ్చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు, ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులు సహా నలుగురిని అరెస్టుచేసినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున అటవీ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడుల్లో నిందితులు పట్టుబడినట్లు ప్రధాన స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వారు తెలిపారు. కేసును ఛేదించిన తిరుపతి టాస్క్ఫోర్స్ సిబ్బందిని టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు అభినందించారు. అనుమతి లేకుండా విదేశాలకు టీచర్ చిత్తూరు కలెక్టరేట్ : ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలకు గైర్జాజరైన ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మికి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ను నమోదు చేస్తూ డీఈవో రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గురువారం జారీచేసిన ఉత్తర్వుల మేరకు పుంగనూరు మండలం, బండపల్లి పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న జ్యోతిలక్ష్మికి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారు ల అనుమతి లేకుండా దీర్ఘకాలికంగా పాఠశాలకు గైర్జాజరు అయినట్లు తెలిపారు. 2024 డిసెంబర్ 3 నుంచి ఆమె పాఠశాలకు రావడం లేదన్నారు. ఎటువంటి సెలవు చీటీ ఇవ్వకుండానే ఆమె గైర్హా జరు కావడంతో విచారణ నిర్వహించినట్లు తెలిపారు. విచారణ సమయంలో ఆమె తన నివాసంలో సైతం అందుబాటులో లేరని, తదుపరి విచా రణలో ఆమె అధికారులకు తెలియకుండానే అనధికారికంగా విదేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయినట్లు తేలిందన్నారు. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జారీ అయిన పది రోజుల్లోపు విద్యాశాఖ కార్యాలయంలో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోపు స్పందించకపోతే ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. రెండు బస్సులు ఢీ.. పది మందికి గాయాలు వడమాలపేట (పుత్తూరు): తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సత్యవేడుకు వెళుతుండగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో వడమాలపేట మండలం ఎస్వీపురం వద్ద పుత్తూరు ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో సత్యవేడు బస్సు ఎదురుగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి స్తంభాన్ని ఢీకొనడంతో ముందు కూర్చొన్న ప్రయాణికులు సైతం గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు 108 వాహనాల ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అపూర్వ ఆదరణ
ఆధ్యాత్మిక మహాపాదయాత్రకుతిరుపతి రూరల్: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం పాతికేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వందలాది మంది భక్తుల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. తుమ్మలగుంటలోని కల్యాణ వెంకన్న ఆలయం నుంచి గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరిన ఆధ్యాత్మిక మహాపాదయాత్ర పేరూరు, తాటితోపు, చెర్లోపల్లి, పుదిపట్ల, గాంధీపురం, పెరుమాళ్లపల్లి, సి.మల్లవరం, కాలూరు క్రాస్ మీదుగా శ్రీనివాసమంగాపురం వరకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంది. చెవిరెడ్డి చేపట్టిన ఆధ్యాత్మిక మహాపాదయాత్రలో స్వామివారికి మేల్చాట్ వస్త్రంతోపాటు, శేషమాలలను పల్లెల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ప్రతి పల్లెలో శ్రీవారికి సమర్పించే సారెను గ్రామస్తులతో మోయిస్తూ వారిలో భక్తితత్వాన్ని పెంచుతూ ముందుకు సాగారు. భక్తుల గోవింద నామస్మరణలు, చెక్కభజనలు, కోలాటాలు, భజన బృందాలు, మహిళల మంగళ హారతుల నడుమ ఆధ్యాత్మిక మహా పాదయాత్ర కనులపండువగా సాగింది. చెవిరెడ్డితోపాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మహాపాదయాత్రకు వచ్చిన భక్తులు అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు కదిలారు. ఆలయాధికారులకు అందజేత తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి చెవిరెడ్డి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను శ్రీనివాసమంగాపురంలోని ఆలయాధికారులు స్వీకరించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆయనకు సాదర స్వాగతం పలికిన అధికారులు ఆలయ ముఖమండపంలో పట్టువస్త్రాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు, వేద మంత్రాల నడుమ అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. అనంతరం చెవిరెడ్డి నుంచి స్వీకరించిన పట్టువస్త్రాలను స్వామివారికి వినియోగించే వస్త్రాల దాతల రిజిస్టర్లో వారి పేరును నమోదు చేశారు. -
సర్వేలతో ఎనర్జీ తిప్పలు!
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాల పై సర్వే చేయలేదంటూ ఎనర్జీ అసిస్టెంట్లకు(జేఎల్ఎం–2)కు షోకాజ్ నోటీసులిస్తున్నారు. ఇప్పటికే పుంగనూరు డివిజన్లో నలుగురు ఎనర్జి అసిస్టెంట్లకు ట్రాన్స్కో అధికారులు నోటీసులు జారీ చేశారు. సక్రమంగా సర్వే చేయలేదని, వాటికి సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వివరణ అనంతరం అధికారుల సంతృప్తి కాకపోతే సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరి పై చర్యలు తీసుకుంటే అందరికీ భయం వస్తుందని ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. దీనిపై పుంగనూరు ఈఈ శ్రీనివాసమూర్తిని కలిసి నాయకులు వినతి పత్రం అందజేశారు. అల్లాడుతున్న ఎనర్జీ అసిస్టెంట్లు ఎనర్జీ అసిస్టెంట్లు పేరుకు మాత్రమే సచివాలయ ఉద్యోగులే అయినా పని మొత్తం విద్యుత్శాఖలోనే చేయాల్సి ఉంటుంది. ఉదయం సచివాలయలంలో ముఖ హాజరు వేసుకున్న అనంతరం సాయంత్రం వరకు విద్యుత్ సబ్స్టేషన్, సంబంధిత సెక్షన్ల పరిధిలో విధులు నిర్వర్తిసుటారు. దీనికి అదనంగా నైట్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వే చేయాల్సిన పనిలేదంటూ విద్యుత్శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ మేరకు ఎనర్జీ అసిస్టెంట్లు సర్వేకు దూరంగా ఉన్నారు. కానీ సర్వే ప్రాధాన్యత దృష్ట్యా వారిని అందులో భాగం చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిటీ సర్వే చేయాలని ఆదేశించింది. ప్రతి సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని 25 ఇళ్లలోని కుటుంబ సభ్యుల వివరాలను ప్రతి రోజూ ఆధార్, కేవైసీ చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ సర్వే ఽఆధారంగానే సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఎనర్జీ అసిస్టెంట్లు సమన్వయం చేయలేక అగచాట్లుగత డిసెంబర్లో వీరికి ఉద్యోగోన్నతులను ఇచ్చి..వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నెల ముచ్చటగా ఆ తంతు జరిగింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, వేతనాలు, పదోన్నతుల్లో కోత పెట్టింది. ఎనర్జీ అసిస్టెంట్ల ఎంపిక గతంలో సచివాలయాల పరిధిలో జరిగింది. వారిని సైతం సచివాలయ ఉద్యోగుల కిందనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. కానీ జీతాలు మాత్రం విద్యుత్శాఖ చెల్లిస్తోంది. వీరు ఏఈ పరిధిలో పనులు చేస్తుంటారు. నూతన సర్వీసులు మంజూరు, డీసీ లిస్టు, లూజ్లైన్ బాగు చేయడం, 11 కేవీ బ్రేక్డౌన్ సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు వంటి పనులకు లైన్మెన్లకు సాయంగా పనిచేస్తున్నారు. వీటికి తోడు సెక్షన్ల పరిధిలో ఉద్యోగుల సంఖ్య ఽఆధారంగా రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. వీటితో ఇప్పుడు అదనంగా సర్వే పనులను సమన్వయం చేసుకోలేక తిప్పలు పడుతున్నారు. అయితే రోజు సర్వేకే సమయం సరిపోతోందని వీటితో పాటు విద్యుత్ సమస్యలు పరిష్కారించాలని అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. -
పీహెచ్సీ నిర్మాణానికి స్థల పరిశీలన
కార్వేటినగరం : పీహెచ్సీ భవన నిర్మాణానికి వెంటనే స్థల సేకరణ చేపట్టా లని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. గురువారం మండలంలోని కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ని ర్మాణానికి పలు స్థలాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే సొంత భవనంలో వైద్యసేవలందించాలని స్పష్టం చేశారు. పీ హెచ్సీల్లో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టాలని కోరా రు. కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్, ఆక్సిజన్ వంటివి అందుబాటు లో ఉండాలని సూచించారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ చంద్రమౌళి పాల్గొన్నారు. -
ప్రాణహాని ఉందని డీజీపీకి ఫిర్యాదు
పుత్తూరు: పలువురు అధికారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని స్థానిక సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె.మురగారెడ్డి మంగళగిరిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ పుత్తూరు పట్టణంలో ఈడీ.కవితారాణి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చైన్నె శరవణ ఐ క్లినిక్ అక్రమ వ్యవహారాన్ని ఆర్టీఐ ద్వారా బయటపెట్టినట్టు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి అక్రమంగా నిర్వహిస్తున్న సదరు క్లినిక్ను సీజ్ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనపై కక్ష పెంచుకొన్న కవితారాణి పుత్తూరు సీఐ రెడ్డిశేఖర్తో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని నాన్ బెయిల్బుల్ కేసును నమోదు చేయించిందని ఆరోపించారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా 41 నోటీసు ఇచ్చి నిందితుడ్ని విచారించాలని హైకోర్టు ఆదేశించిందని వెల్లడించారు. తనపై మరింతగా కక్ష పెంచుకొన్న సీఐ రెడ్డిశేఖర్, కవితారాణి ఇద్దరూ కలసి మళ్లీ రెండో దఫా తాను పుత్తూరులో లేని సమయంలో తాను నేరం చేసినట్లు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. వీరి చర్యలను బట్టి తనకు పై ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు వివరించారు. ఫిర్యాదు అందించిన వారిలో సమాచార హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి, నేషనల్ ఆర్టీ ప్రెసిడెంట్ కె.శివ, ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి కుమరేశన్, దళిత సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి అంకయ్య తదితరులు ఉన్నారు. ఒక వ్యక్తిపై ఎన్ని కేసులైనా కట్టొచ్చు పోలీసుల నుంచే తనకు ప్రాణహాని ఉందన్న ఆరోపణపై సీఐ రెడ్డిశేఖర్ని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఒకే వ్యక్తి రెండవ సారి నేరం చేస్తే, రెండవ సారి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పడంలో అర్థం లేదని, సాక్ష్యాలను తాము కోర్టు ముందుంచుతామన్నారు. అవసరమైతే డిఫరమేషన్ సూట్ సైతం వేస్తామని స్పష్టం చేశారు. -
టమాట వినదే!
పలమనేరు: ఈ దఫా తొలి సీజన్ మొదలైనప్పటి నుంచి టమాటా ధరలు ఆశించినంతగా లేవు. పలమనేరు టమాటా మార్కెట్లో గురువారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200, కనిష్ట ధర రూ.100 మాత్రమే పలికింది. భారీ పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులకు నష్టాలు తప్పటట్టు లేదు. కనీసం టమాటాలను కోసే కూలీల ఖర్చు సైతం రైతులకు దక్కని పరిస్థితి నెలకొంది. బయటి రాష్ట్రాల్లో మొదలైన సీజన్ బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు వస్తే స్థానికంగా ధరలు బాగుండేవి. కానీ ఇదే సమయంలో సత్తీస్ఘడ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాల్లో సీజన్ ఆఖరు దశలో ఉంది. దీంతో అక్కడి అవసరాలకు లోకల్ సరుకు సరిపోతోంది. అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. లోకల్ వ్యాపారులు మాత్రమే టమాటాలన కొనుగోలు చేస్తున్నారు. అనంతపూర్లో 700 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం అనంతపురం జిల్లా నుంచి 700 మెట్రిక్ టన్నుల టమాటా రోజూ మార్కెట్లకు వస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. నిత్యం అక్కడి నుంచి 300 టన్నుల దాకా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని పలు మార్కెట్లకు చేరుతోంది. వేసవి మొదలు కావడంతో అక్కడి తోటల్లోని టమాటా మాగడం మొదలైంది. దీంతో ఉన్న సరుకును అమ్ముకోవాలని రైతులు మాగిన కాయలను వెంటవెంటనే కోసి ఇక్కడి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండడమే ఇందుకు కారణమైంది. వేసవిలో టమాటా సాధరణ సాగు 5వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 3వేల హెక్టార్లు కోత దశలో ఉన్న తోటలు 600 హెక్టార్లు -
సర్వేల మయం!
సచివాలయం..బాబు నయా మోసం సచివాలయ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. బాబు సర్కారు పెట్టే సర్వేలతో ముప్పుతిప్పలెదుర్కొంటున్నారు. అలివిగాని పని ఒత్తిడితో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కుటుంబాలకు దూరమై మానసికంగా..శారీరకంగా కుంగిపోతున్నారు. ఊపిరుంటే చాలు.. అనే నిశ్చయానికి వచ్చేస్తున్నారు. కానీ కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకోలేక.. కుటుంబాలను వీధిన పడేయలేక పోరాటాలకు సిద్ధమవుతున్నారు. సర్వేలతో వేధిస్తున్న బాబు ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. కసితీరా కడిగేసేందుకు సమాయత్తమవుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వే ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సచివాలయ ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడితో సతమతమవుతున్నారు. నిరంతర సర్వేలు, అర్ధరాత్రి వరకు యాప్ల అప్లోడింగ్లు, పై అధికారులు టార్గెట్ల మధ్య విలవిల్లాడుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న తోటి ఉద్యోగుల మరణాలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక చేసుకుంటున్న ఆత్మహత్యలు తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. వేధింపులే పనితీరుకు కొలమానమా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులపై వేధింపులు పెరిగిపోయాయి. సర్వేల కోసమే సచివాలయ ఉద్యోగులను యంత్రాల్లా వాడుకుంటున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్నా...రావాల్సిన అరియర్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారు. విద్యావంతులైన తమను వలంటీర్లుగా మార్చి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జీవో నం.11 వల్ల తమ భవిష్యత్తు నాశనమవుతోందని వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులే వెన్నెముక గత వైఎస్సార్సీపీ సర్కారు ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి గ్రామ, సచివాలయ వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు సర్కారు ఎన్నికల సమయంలో సచివాలయ ఉద్యోగులకు తప్పుడు హామీలు ఇచ్చి ప్రస్తుతం మోసానికి తెగబడింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సచివాలయ ఉద్యోగులే వెన్నెముక లాంటి వారు. అలాంటి వారి పట్ల చులకన భావనతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కుప్పంలోని గ్రామ సచివాలయంసచివాలయ ఉద్యోగుల ఆక్రందన జిల్లా సమాచారం రూరల్ సచివాలయాలు 504 అర్బన్ సచివాలయాలు 108 గ్రామ సచివాలయ ఉద్యోగులు 5,040 వార్డు సచివాలయ ఉద్యోగులు 1,080 మొత్తం ఉద్యోగులు 6,120 సర్కారుకు సవాల్ ‘గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పుట్టిన ఈ వ్యవస్థను, చంద్రబాబు ప్రభుత్వం కేవలం రాజకీయ అవసరాలకు వాడుకుంటోంది?. ఉద్యోగోన్నతులు లేవు, బకాయిల నిధులు చెల్లించడం లేదు. కేవలం టార్గెట్లు మాత్రమే మిగిలాయా ?..’ అంటూ చంద్రబాబు సర్కారును సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మేము ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధం. ప్రభుత్వం స్పందించి జీవో 11 ను రద్దు చేయకపోతే త్వరలో అమరావతిని చుట్టుముట్టడం ఖాయం అని సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరిస్తోంది. సర్వేలకే పరితమవుతున్న సచివాలయాలు -
నమో..భూతనాథ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భూతవాహనంపై ముక్కంటీశుడు, శుకవాహనం జ్ఞానప్రసూనాంబ ఊరేగారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై పరమశివుడు సర్వాలంకార శోభితుడై విహరిస్తుండగా మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తన్నప్ప చప్పరాలపై స్వామి అమ్మవార్ల వెంట అనుసరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాలు, భజన బృందాలు, భక్తులు శంఖం ఊదుతూ వెళుతుండా స్వామిఅమ్మవార్ల పురవిహారం చేశారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్, కొట్టేసాయి, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు యాప్లలో డేటా ఎంట్రీలు, సర్వేలే సరిపోతున్నాయి. సెలవు అడిగితే మెమోలు ఇస్తున్నారు. మా తోటి మిత్రులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం సర్వేలు పూర్తి చేయండి అని ఆర్డర్లు వేస్తోంది తప్ప, మా ప్రాణాలకు విలువనివ్వడం లేదు. – కుప్పం నియోజకవర్గంలోని వార్డు కార్యదర్శి అనిల్ ఆక్రోశం మేము ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మారాం. కానీ ప్రస్తుతం ఒత్తిడితో కుంగిపోతున్నాం. సచివాలయ ఉద్యోగుల పై ఒత్తిడి పెంచి ఆత్మహత్యలకు కారణమవుతున్న చంద్రబాబు సర్కారు పై సమ్మెకు సిద్ధపడుతున్నాం. చేపట్టబోయే సమ్మె తోటి ఉద్యోగుల ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే అస్తిత్వ పోరాటం. – చిత్తూరు నగరంలోని సచివాలయ ఉద్యోగి రమేష్ ఆవేదన బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో తిరునాళ్లు: గాంధర్వ రాత్రి (మాఘ బహుళ ఏకాదశి) వాహన సేవలు ఉదయం 9గంటలకు: హంస–యాళి వాహనసేవ ఉభయదాతలు: కీ.శే. చిట్టాప్రగడ సీతారామంజనేయుడు, గుడివాడ, కృష్ణాజిల్లా రాత్రి 8గంటలకు రావణుడు – మయూర వాహనసేవ ఉభయదాతలు : జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి శ్రీకాళహస్తి -
కదం తొక్కిన కార్మికులు
చిత్తూరు కార్పొరేషన్: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రామిక సంఘాల నాయకులు, కార్మికులు కదం తొక్కారు. గురువారం జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. పలు కార్మిక, వామపక్ష, రైతు సంఘాల నాయకులు పాల్గొని ఆందోళన చేపట్టారు. దీనికి వైఎస్సార్టీయూసీ మద్దతు పలికింది. మిట్టూరులోని మున్సిపల్ పార్క్ వద్ద నుంచి గాంధీవిగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్లు పరిష్కారించాలని నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు చాన్బాషా, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్మిక చట్టాలను, హక్కులను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం స్కీము వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు గోపీనాథ్, మణి, రమాదేవి, విజయగౌరీ, కుమారి, బ్యాంక్ కార్మికుడు శేఖర్, అంగన్వాడీ నుంచి ప్రేమ, షకీలా, ప్రభావతి, ఆశ గంగాభవాని, ఆటో యూనియన్ నుంచి విజయ్కుమార్, రఘు, రవి, మున్సిపల్ కార్మికుల నుంచి జయశంకర్, సుగుణ, వాసు, సుకన్య రమణి, సురేష్ సివిల్ సప్లయ్ నుంచి కృష్ణ, ఐఎంఎఫ్ఎల్ చంద్ర, మెడికల్ ఉద్యోగుల సంఘం నుంచి మణికంఠ, సుగుణ వాసు, సురేష్, రమణి, రాజారాం, మధ్యాహ్న భోజనం నుంచి జయలక్ష్మి, హమాలి యూనియన్ నుంచి కమల్, నాగరాజా, బిల్డింగ్ వర్కర్స్ నుంచి మునుస్వామి, జయరాం పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న పలు సంఘాల కార్మిక నాయకులు, కార్మికులు మద్దతు తెలిపిన వైఎస్సార్టీయూసీ నాయకులు -
ఏనుగులను తరిమేందుకు చర్యలు
గుడిపాల: ఏనుగులను తరిమేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామని జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. బుధవారం ఆయన చిత్తపార ఫారెస్ట్లో పంట పొలాలను సందర్శించారు. రైతులు మాట్లాడుతూ కొబ్బరి, మామిడి, అరటి, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని, రాత్రి వేళల్లో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోయారు. సుబ్బరాజు స్పందిస్తూ రైతులందరికీ తప్పనిసరిగా నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఏనుగులను తరిమేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయనతో పాటు ఎఫ్ఆర్ఓ థామస్ సుకుమార్, డీఆర్ఓ కరణ్సింగ్, ఎఫ్బీవోలు కుసుమ, హరిప్రియ, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. 22న విశ్రాంత ఉపాధ్యాయుల సదస్సు చిత్తూరు కలెక్టరేట్ : విశ్రాంత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 22న తిరుపతి జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెంగల్రాయమందడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతిలోని కొరమీనుగుంటలో ఉండే గీతాంజలి పాఠశాలలో ఉదయం 10 గంటలకు సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో పెండింగ్లో ఉన్న పెన్షన్లు, గ్రాట్యూటీ, నూతన పెన్షన్ తదితర సమస్యల పై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా ఏపీ రిటైర్డ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఉపాధి అక్రమాలపై విచారణ వి.కోట : మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలపై స్థానిక కార్యాలయంలో బుధవారం డ్వామా పీడీ విచారణ చెప్పట్టారు. నిండిన చెరువుల్లో ఉపాధి పనులు చెప్పట్టామంటూ నెలక్రితం ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ీఫిల్డ్ ఆఫీసర్లు దాదాపు రూ.2 కోట్ల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదైంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టడానికి డ్వామా పీడీ మండలంలోని 18 పంచాయతీలలో జరిగిన ఉపాధి పనులను పరిశీలించారు. అవకతవకలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజాధనాన్ని రికవరీ చేస్తామని తెలిపారు. సీకాం డిగ్రీ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: స్థానిక అన్నమయ్య సర్కిల్ సమీపంలోని సీకాం డిగ్రీ కళాశాల అటానమస్ హోదా పొందిన తర్వాత డిగ్రీ కోర్సులకు సంబంధించి తొలి సెమిస్టర్ ఫలితాలను బుధవారం ఎస్వీయూలో వీసీ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు చేతుల మీదుగా విడుదల చేసింది. కార్యక్రమంలో సీకాం విద్యాసంస్థల అధినేత డాక్టర్ టి. సురేంద్రనాథ్రెడ్డి, డైరెక్టర్ టి.ప్రణీత్ స్వరూప్, పరీక్షల నియంత్రణాధికారి ఎం.మునిరాజ్ పాల్గొన్నారు -
తల్లీబిడ్డ ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్
పుత్తూరు: భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు కుమార్తైలెన ఇ.తేజశ్రీ(7), ఇ.లాస్య(5) సహా ఆత్మహత్య చేసుకున్న వి.పద్మ(27) కేసుకు సంబంధించి నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శేఖర్రెడ్డి మీడియాకు తెలియజేసిన వివరాల మేరకు.. మృతురాలు పద్మ అన్న వి.తులసికార్తీక్ ఫిర్యాదు మేరకు నిందితులైన ఆమె భర్త ఇ.శివశంకర్రావ్(29), అత్త ఇ.పద్మావతిబాయి(50)ని బుధవారం సాయంత్రం పైడిపల్లి గ్రామంలోని నిందితుడు ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు దారి తీసిన వివరాల గురించి తెలియ జేస్తూ.. పుత్తూరు మండలం, పైడిపల్లి గ్రామానికి చెందిన శివశంకర్, నేసనూరు గ్రామానికి చెందిన పద్మ 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు పుత్తూరు పట్టణంలోని కృష్ణానగర్ మూడవ వీధిలో బాడుగ ఇంటిలో కాపురం పెట్టారు. వీరికి తేజశ్రీ, లాస్య అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఈ క్రమంలో శివశంకర్ ఉద్యోగానికి వెళ్లకుండా అప్పులు చేస్తూ జులాయిగా తిరుగుతూ వచ్చాడు. గత కొంత కాలంగా భర్త శివశంకర్తో పాటు అత్త పద్మావతి ఇద్దరూ అదనపు కట్నం కోసం పద్మను వేధింపులకు గురిచేశారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన పద్మ తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఈనెల 7వ తేదీ సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకొని మృతి చెందింది. దీంతో బుధవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
పన్నుపోటు!
కార్యదర్శులకు..పన్ను వసూళ్ల విషయంలో పంచాయతీ కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ నెలాఖరు లోపు వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. లేకుంటే ఉద్యోగాలు ఊడుతాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిగుతున్నా పల్లెల్లో పన్నులు వసూళ్లుగాక.. ఏం చేయాలో తెలియక కార్యదర్శులు తలలుపట్టుకుంటున్నారు. గుడిపాల మండలం జిల్లా పంచాయతీ కార్యాలయంచిత్తూరు కార్పొరేషన్: గ్రామీణ ప్రజల ముక్కుపిండి పన్ను వసూలు చేయాలంటూ కార్యదర్శులకు ప్రభుత్వం హుకుం జారీచేసింది. చేయని పక్షంలో సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగింది. ఈ పరిణామం పంచాయతీ కార్యదర్శుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం రూ.27.41 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.14.06 కోట్లు వసూలు చేశారు. మిగిలిన మొత్తంలో ఈ నెల 15లోపు 50 శాతం, నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సాంకేతిక సమస్యలతో సతమతం పన్ను వసూళ్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అవస్థలు తెచ్చిపెడుతోంది. ఎవరైతే తమ ఇంటికి, నీటి పన్నులు చెల్లించాలనుకుంటున్నారో.. వారి మొబైల్ నుంచే చెల్లింపులు చేపట్టాల్సి ఉంది. ఇది పెద్ద సమస్యగా మారింది. నిరక్షరాస్యులు ఆన్లైన్ పన్నులు చెల్లించే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారు పన్నులు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఒక ఇంటి నంబర్తో పన్ను చెల్లింపు ప్రారంభిస్తే అందులో ఏదైనా చిన్న సమస్య ఎదురైనా మరో 24 గంటల వరకు సర్వర్ స్తంభిస్తోంది. దీంతో ఆ ఇంటి పన్ను తిరిగి చెల్లించాలంటే మరో రోజు వేచి చూడాల్సి వస్తోంది. జిల్లా సమాచారం మండలం పన్ను రూ.లక్షల్లో బైరెడ్డిపల్లె రూ.25.65 బంగారుపాళ్యం రూ.83.70 చిత్తూరు రూ.19.76 జీడీనెల్లూరు రూ.55.94 గంగవరం రూ.47.47 గుడిపాల రూ.53.48 గుడుపల్లె రూ.23.90 ఐరాల రూ.3.95 కోట్లు కార్వేటినగరం రూ.41.34 కుప్పం రూ.17.01 నగరి రూ.39.10 నిండ్ర రూ.15.13 పలమనేరు రూ.32.66 పాలసముద్రం రూ.8.81 పెద్దపంజాణి రూ.24.84 పెనుమూరు రూ.37.99 పూతలపట్టు రూ.43.66 పులిచెర్ల రూ.1.20 కోట్లు రామకుప్పం రూ.15.07 రొంపిచెర్ల రూ.23.25 ఎస్ఆర్పురం రూ.28.37 శాంతిపురం రూ.25.10 తవణంపల్లె రూ.48 వి.కోట రూ.29.69 వెదురుకుప్పం రూ.74.87 విజయపురం రూ.16.24 యాదమరి రూ.59.84 మొత్తం రూ.14.06 కోట్లుటెన్షన్ బాబోయ్! పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియ పర్యవేక్షించాల్సిన విధులు కేటాయించారు. ఆ విధుల్లోనే ఎక్కువ సమయం పడుతోంది. అనంతరం పన్ను వసూళ్లకు రావాల్సి ఉంది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోంది. పన్ను వసూళ్లపై ఒత్తిడి పెంచుతోంది. చేసేది లేక కార్యదర్శులు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒత్తిడిని తాళలేక వయసుపైబడిన సీనియర్ కార్యదర్శులు బీపీ, షుగర్ బారిన పడుతున్నట్టు పలువురు వాపోతున్నారు. కొందరు కార్యదర్శులైతే సెలవులో వెళ్లిపోయేందుకు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. -
హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్ర
పలమనేరు: తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో విచారణ చేసిన సిట్ సాక్షిగా రుజువైనా చంద్రబాబు తప్పుడు ప్రచా రం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరులోని వీటీఎస్ కల్యాణ మండపంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో పార్టీ పలమనేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అంతకుముందు పలమనేరు రూరల్ మండల కన్వీనర్ బాలాజీనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక డిగ్రీ కళాశాల నుంచి సభా వేదిక వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. భూమన మాట్లాడుతూ చంద్రబాబు బూటకపు హామీలను నమ్మిన జనం ఎంత మోసపోయారో అర్థమైందన్నారు. ప్రతినెలా ఓ కొత్త వివాదాన్ని లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిచామని, జగన్ కుదేలవుతాడని ఆయన ఊహించాడని అనుకున్నారని, జగన్కు ప్రజ లు పడుతున్న బ్రహ్మరథాన్ని చూసి ఓర్వలేక అభాండాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో చంద్రబాబు సీఎం అయ్యాకే కల్తీ వ్యవహారం వెలుగు చూసిందన్నారు. దీనిపై సుప్రీం కోర్టు 2024 ఆగస్టు 18న సీబీఐ నేపథ్యంలో సిట్ ఏర్పాటుచేసి విచారణ జరిపించింద్నారు. లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. ఆలయానికి నెయ్యి సర ఫరా చేసిన నిర్వాహకులు, ఆలయ ఉద్యోగులు, సాంకేతిక సిబ్బంది కుమ్ముకై ్క అక్రమాలు చేశారని తేల్చినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పింది నిజం కాద ని తేలడంతో వైఎస్సార్సీపీని హిందూ వ్యతిరేకిగా ము ద్రవేసేందుకు ఇది హిందువులపై సాగుతున్న కుట్ర అంటూ కొత్త ఆరోపణలను తెరపైకి తెచ్చా రని విమర్శించారు. మతం పేరిట జగన్ను అణగదొక్కాలని చూడడం ఆయన చేతగాని తనమన్నారు. ఇప్పటికే హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబుపై జనం నిప్పులు కక్కుతున్నారనే చేదు నిజం ఆయన బుర్రకెక్కడం లేదన్నారు. దేవునితో పెట్టుకుంటే పుట్టగతులుండవన్న విషయం త్వరలో తెలుస్తుందన్నారు. ఇది ఓ రకంగా హిందువులపై చంద్రబాబు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ కూటమి అరాచక పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి వాస్తవంగా నాటి టీడీపీ హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడే బోలేబాబా డెయిరీ నుంచి 1.60 లక్షల కేజీల నెయ్యి ఆలయానికి చేరిందన్నారు. 2014–19 కాలంలో ప్రీమియం డెయిరీ నుంచి 80 శాతం నెయ్యి వచ్చిందన్నారు. ఇవన్నీ ఆ వేంకటేశ్వరస్వామికి తెలుసునని, చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదన్నారు. గత ప్రభుత్వంలో మనం జనానికి చేసిన మేలును చెప్పుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు. రాబోవు రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట ఉంటుందన్నారు. -
తప్పిన ప్రమాదం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో బుధవారం సాయంత్రం రోడ్డుపై వెళుతున్న ఓ వాహనం అదుపుతప్పి.. గోడను ఢీ కొట్టడంతో ప్రమాదం తప్పింది. పలమనేరు వైపు నుంచి చిత్తూరు నగరానికి వస్తున్న ఓ ఐషర్ వాహనం న్యూట్రిన్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపుతప్పి.. అవతలివైపు ఉన్న రోడ్డు దాటుకుంటూ ఓ గోడను ఢీకొట్టింది. అటువైపుగా వస్తున్న ఆటో ను సైతం ఢీ కొట్టగా ఎవరికీ ఎలాంటి గాయా లు కాలేదు. పాఠశాల ముగిసే సమయం కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినపుడు రోడ్డు పై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. జాతీయ సదస్సుకు చిత్తూరు విద్యార్థి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఢిల్లీలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సదస్సుకు చిత్తూరు జిల్లాకు చెందిన కె. యుగవర్దన్ ఎంపికయ్యాడు. చిత్తూరు నగరం, మిట్టూరుకు చెందిన యుగవర్దన్ అపోలో విశ్వవిద్యాలయంలో బీటెక్ తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై జరుగనున్న ఈ సదస్సులో విద్యార్థి విభాగం నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. క్రమశిక్షణ చర్యలు నిలుపుదల చిత్తూరు కలెక్టరేట్: సర్వే ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చెందిన గిరిపై క్రమశిక్షణ చర్యలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వును జారీచేసింది. ఆయన జిల్లాలో సర్వే ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఆరోగ్య కారణాలతో రీసర్వే లక్ష్యాలను అధిగమించలేకపోతున్నానని, రెగ్యులర్ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నాననే కారణాలు చూపి 27.4.2022 నుంచి 28.6.2022 వరకు మెడికల్ సెలవుపై వెళ్లారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వును జారీచేసింది. అప్పట్లో దీనిపై విచారణాధికారి దర్యాప్తు జరిపి, చార్జెస్ నిరూపణ కాలేదని నివేదిక నిచ్చారు. ఈ క్రమంలో గతేడాది మార్చి 31న ఆయన ఉద్యోగ విరమణ చెందారు. విచారణ నివేదిక, చార్జెన్ నమోదైన అధికారి వివరణను పరిశీలించిన ప్రభుత్వం.. క్రమశిక్షణ చర్యలపై తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ ఉత్తర్వును జారీచేసింది. -
లడ్డూకు మేకప్ వేసింది సీఎం చంద్రబాబే
కార్వేటినగరం/శ్రీరంగరాజపురం: రాజకీయంగా మాజీ సీఎం జగన్ను ఎదుర్కోలేక తిరుమల లడ్డూపై దుష్న్రచారం చేసినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. శ్రీరంగరాజపురం మండలం, 49 కొత్తపల్లె మిట్ట దీపికా కల్యాణ మండపంలో బుధవారం వైఎస్సార్సీపీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీకి హిందువుల ఓట్లను దూరం చేయాలన్న దురాలోచనతో వ్యవహరిస్తోందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో చంద్రబాబు లడ్డూలో ఆవు కొవ్వు కలిసిందని మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సనాతన ముసుగులో లడ్డూల్లో చేప నూనె, పంది, ఆవు కొవ్వు కలిసిందని ఒక డ్రామా ఆడడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు. బోలేబాబాకు బాబే అనుమతి కుల రాజకీయీలకు ఆజ్యం పోసిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలకు తెరలేపిన ట్లు చెప్పారు. బోలే బాబాకు అనుమతిచ్చింది చంద్రబాబే కదా..? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ చేసిన సిట్ వైఎస్సార్సీపీ నేతలకు సంబంధం లేదని తేల్చినా మళ్లీ కుతంత్రాలకు ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ సౌరబ్బోరా, మై హోమ్ అధినేత రామేశ్వర్ ఇద్దరి చేతితో చిలికిన 4,060 కిలోల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసి, ఆ నెయ్యితోనే అయోధ్య రామ మందిరానికి లడ్డూలు తయారుచేసి పంపినట్టు తెలిపారు. ఆ నెయ్యిలో కల్తీ జరిగినట్లు పవన్కల్యాణ్ ఆరోపించారని చెప్పారు. సువాసన కోసం.. 28 ఫిబ్రవరి 2018లో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ పరాక్ ప్రోడక్ట్ నుంచి 87,500 కేజీల నెయ్యిని కేజీ రూ.300 చొప్పున కొనుగోలు చేసేందుకు టీటీడీ తీర్మానం చేసినట్లుఽ ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే లడ్డూ నాణ్యత లోపించడంతో సువాసన కోసం లడ్డూకు మేకప్ వేసినట్లు ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను ఎలాగైనా హిందువులకు దూరం చేయాలన్న కుతంత్రంతోనే దేవాలయాలచుట్టూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాలయాలను రాజకీయ వేదికగా మార్చు కుని అపచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, నేతలు పాల్గొన్నారు. -
పట్టు వస్త్రాల సమర్పణ
కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుంచి శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం, శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ పాల్గొని పట్టు వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో కాణిపాక ఆల య చైర్మన్ మణినాయుడు, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్నాయుడు, ఈవో శ్రీనివాసరావు, బోర్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు. దాతలు స్పందించేలా.. చిత్తూరు కలెక్టరేట్ : దాతలను స్ఫూర్తిగా తీసుకుని విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ ప్రభు త్వ పాఠశాలల్లో మౌలి క వసతుల పెంపునకు విద్యాంజలి పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీ సీ వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. సేవాభావంతో ముందుకొచ్చే ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో సర్కారు బడుల్లో సౌకర్యాలు పెంచనున్నట్లు తెలిపారు. పాఠశాలల అవసరాలను గుర్తించి వివరాలను విద్యాంజలి 2.0 పోర్టల్లో నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై హెచ్ఎంలకు అవగాహన క ల్పించేలా ఎంఈవోల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోర్టల్లో పాఠశాలలను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరిస్తున్నామని ఏపీసీ తెలిపారు. పది పరీక్షల అబ్జర్వర్గా మువ్వా రామలింగం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మార్చి 2 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించే పది పబ్లిక్ పరీక్షలకు అబ్జర్వర్లను నియమించారు. గతంలో జిల్లాలో డీఈవోగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఇన్ఫ్రా జేడీగా ఉన్న మువ్వా రామలింగంను అబ్జర్వర్గా నియమిస్తూ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన పది పబ్లిక్ పరీక్షల ప్రారంభం నుంచి చివరి తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్నారు. పది పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో త్వరలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాలకు సీసీ కెమెరాలు అమర్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పరీక్షల విభాగం అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం డీఈవో కార్యాలయానికి అందాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మాస్కాపీయింగ్ ఎక్కువగా జరుగుతాయనే అనుమానాలు ఉండే కేంద్రాలను పరిశీలించి పేర్లను ఈ నెల 12 లోపు సిఫార్సు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పొరపాట్లు సరిదిద్దుకోండి చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థి జీవితంలో పదో తరగతి మార్కుల జాబితా చాలా కీలకం. ఇందులో ఏ చిన్న పొరబాటు ఉన్నా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఆధార్ వివరాలు పాఠశాల రికార్డుల్లోని వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు రాష్ట్ర పరీక్షల విభాగం అధికారులు అవకాశం కల్పించారు. విద్యాశాఖ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశా ల యూడైస్ పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఏమేం మార్చుకోవచ్చంటే..... విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, శరీరంలోని గుర్తులు (మోల్స్), కులం, ఉపకులం, ఫొటో, సంతకాన్ని మార్చుకునే వీలుంది. పుట్టిన తేదీ మార్చుకోవడానికి అవకాశం లేదు. యూడైస్ మార్చిన వివరాలను పాఠశాల రికార్డుల్లో సైతం సరిదిద్ది డీవైఈవో దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత హెచ్ఎంలపై ఉంది. సంబంధిత డీవైఈవో వద్ద నిర్ధారణ సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఈ నెల 12వ తేదీ వరకే ఉంటుంది. గురువారం చివరి రోజు అని తెలిపారు. పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యాహక్కు చట్టం కింద జిల్లాలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల విద్యార్థులకు ఒకటవ తరగతిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించనున్నట్లు తెలిపారు. ఐదేళ్లు నిండిన పిల్లలకు అడ్మిషన్ల కోసం ఈ నెల 20 నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. విద్యార్థులు తమ ఆధార్ ఆధారంగా ప్రాథమిక వివరాలతో www.cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ సూచించారు. -
నులి పురుగుల నిర్మూలనకు సన్నద్ధం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 21వ జాతీ య నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి బుధవారం వైద్యాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాల ను క్షేత్రస్థాయి సిబ్బంది, మండల స్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో పంచుకోవాలని సూచించారు. ఈనెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో 1–19 ఏళ్లలోపు మొత్తం 3,62,535 మంది పిల్లలు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందులో 1–5 ఏళ్లలోపు 77,318 మంది చిన్నారులు ఉండగా, ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతు న్న 2,84,060 మంది విద్యార్థులు ఉన్నారు. బడి బయట ఉన్న 1,157 మంది పిల్లలకు కూడా మాత్రలు అందజేయనున్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, శారీరక ఎదుగుదల లోపం, కడుపునొప్పి, బలహీనత, ఆకలి లేకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని అధికారులు తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రల వాడకం ద్వారా రక్తహీనత నియంత్రణతో పాటు పిల్లల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందని వివరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో కార్యక్రమం చేపడుతున్నామని, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సహకరించాలని డీఎంహెచ్ఓ కోరారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
ఆదర్శ సౌమ్యం!
పుత్తూరు: సంప్రదాయల పేరుతో మహిళలకు పరిమితులు విధిస్తున్న సమాజంలో ఈ సంఘటన నూతన సందేశాన్ని ఇస్తోంది. పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే కాదు పుత్రిక సైతం ఆ బాధ్యతను నెరవేర్చగలదు అంటూ ఓ కుమార్తె తన తండ్రికి అంతిమ సంస్కరణలు నిర్వహించిన ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ ఘటన బుధవారం వడమాలపేటలో చోటుచేసుకొంది. వడమాలపేటకు చెందిన ఎస్.మునిశేఖర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య సంధ్యాలక్ష్మి, సౌమ్య, హిమజ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో మంగళవారం మునిశేఖర్ మృతి చెందాడు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రికి తలకొరివి పెట్టాల్సింది కుమారుడు. అయితే కుమారుడు లేని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో పెద్ద కుమార్తె సౌమ్య తన తండ్రికి తలకొరివి పెడతానంటూ ముందుకొచ్చింది. అంతిమ యాత్రలో అన్నీ తానై వ్యవహరిస్తూ తండ్రిని అశ్రునయనాలతో సాగనంపింది. సౌమ్య సాహసోపేత నిర్ణయానం బంధు మిత్రులకు సైతం కంటతడి పెట్టించింది. నేటి మహిళలు విద్య, ఉద్యోగం, నాయకత్వంలో మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలను సైతం ముందుండి నడిపించగలరని సౌమ్య నిరూపించింది. -
అవినీతి జలగలు!
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. చిత్తూరు అర్బన్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం చిత్తూరులో సాధారణ కూలీగా పనిచేసిన వ్యక్తి రైటర్గా అవతారమెత్తి రూ.2 కోట్లతో ఇల్లు కట్టాడు. కొందరు రైటర్లు వేలకు వేలు సంపాదిస్తున్నారు. నిన్న కుప్పం సబ్రిజి స్ట్రార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులు సీట్లో ఏకంగా ప్రైవేటు వ్యక్తి అయిన డ్యాకుమెంట్ రైటర్ దర్జాగా రిజిస్రేష్టన్ ప్రక్రియ నిర్వహించడం వెలుగులోకి వచ్చింది. మొన్న తిరుపతిలో సస్పెండ్ అయిన రేణిగుంట సబ్రిజిస్ట్రార్ కార్యాలయ అటెండర్ తిరుమలేష్ ఆస్తుల వివరాల పై ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు రూ.50 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి అనకొండలు తిష్టవేశాయి. చిన్న పనికి కూడా వేలల్లో గుంజేస్తున్నాయి. నిబంధనల ప్రకారం వెళితే క్రయవిక్రయదారులకు చుక్కలు చూపిస్తాయి. సవాలక్ష కొర్రీలు పెట్టి ముప్పుతిప్పలు పెడుతుంటాయి. అదే రైటర్లు, వెండర్ల సాయంతో వెళితే క్షణాల్లో పనిచేసి పెట్టేస్తాయి. అదీ వారు అడినంత ఇచ్చుకుంటే సరి.. లేకుంటే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించడం అలవాటు చేసుకున్నాయి. ఇక్కడి కింది స్థాయి సిబ్బంది కూడా కోట్లకు పగడలెత్తడం చూస్తే అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో ఇట్టే అర్థమవుతుంది.. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి దందాపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో చిత్తూరులో 2, బంగారుపాళ్యం, పలమనేరు, పుంగనూరు, కుప్పం, కార్వేటినగరం, నగరిలో మొత్తం 8 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. రోజూ 200 నుంచి 300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మొత్తంగా రూ.50 లక్షలకు పైగా ఆ శాఖకు ఆదాయం వస్తోంది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేరుగా వెళ్లి కనీసం ఒక ఈసీ కూడా తీసుకొళ్లేము. దానికి సవాలక్ష కొర్రీలు చెప్పి రోజులు తరబడి తిప్పించడం రివాజుగా మారుతోంది. అదే రైటర్కు అదనంగా రూ.300 ఇస్తే నిమిషాల్లో ఈసీ తీసి చేతిలో పెడతారు. బేజారు రిజిస్ట్రేషన్స్శాఖ అంటేనే ఉద్యోగులకు రోజూ పండుగ వచ్చినట్టే. ఉదయాన్నే ఖాళీ జేబుతో విధులకు వచ్చి సాయంత్రం ఇంటికి రూ.వేలు తీసుకుపోవడం వారి జీవితంలో భాగంగా మారింది. పైసా సంపాదనతో ప్లాట్స్, కార్లు, బంగారు కోనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాదేమీ లేదంటూనే రైటర్లను అడ్డంగా పెట్టుకొని అధికారులు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తే గానీ దారికి రాని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇదీ పరిస్థితి కుప్పంలోని సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయం పలమనేరులో చేయి తడపందే పనికాదు -
కూతురు ప్రాణం.. తల్లి పోరాటం
పేద కుటుంబం కావడం, కూలిపని చేసి కూడబెట్టిన డబ్బుతో పాటు, అప్పుచేసి తెచ్చిన నగదు, బంధువుల సహకారం కూడా అప్పటివరకు చేసిన వైద్యాని కే ఖాళీ అయిపోయింది. కూతురు ప్రాణం ఎలా కాపాడాలో తెలియక ఆ తల్లి కన్నీటి సుడిగుండంలో చిక్కుకుపోయింది. పేదరికంతో బాధ పడుతున్న తనకు చికిత్స చేయించే స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓ వైపు చావు బతుకుల్లో కుమార్తె, ఇంకోవైపు రూ.20 లక్షలు ఎవర్ని అడగాలి.. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో విలపిస్తోంది. దాతలు సాయం చేయగలిగితే తమ బిడ్డ ప్రాణాలను కాపాడుకోగలనిని బరువెక్కిన హృదయంతో దయార్థ హృదయాలను వేడుకుంటోంది. సాయం చేసే దాతలు తల్లి రాములమ్మ ఫోన్ నం. 9059078374కు పోన్పే, జీపే ద్వారా సాయం అందించాలని సూచిస్తోంది. -
మార్మోగిన గాయత్రీ మంత్రం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు పాఠశాలల్లో గాయత్రీ మంత్రం మార్మోగింది. శ్రీ సత్యసాయి సేవ సంస్థలు ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో ఈ నెల 8 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సామూహిక ‘శ్రీ సత్యసాయి గాయత్రీ తండులార్చన’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులతో సామూహికంగా 108 పర్యాయాలు గాయత్రీ మంత్రాన్ని పఠింపజేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా సమన్వయకర్త జి.శంకర్, జిల్లా అధ్యక్షులు ఎస్.మధుసూదనం, బాలవికాస్ గురువులు అనురాధ, సత్యనారాయణ, కల్పన, కమలప్రభ, సాయిలక్ష్మి, శ్రీదేవి, వాసవి పాల్గొన్నారు. -
ప్రభావతం..ప్రాణ సంకటం
కూలి పనులు చేసి ఇద్దరి పిల్లల్ని కంటికి రెప్పలా పెంచుతోంది. ఎలాగైనా ఉన్నత చదువులు చదివించి తండ్రిలేని లోటు తీర్చాలని కడుపు కట్టుకుని బిడ్డల్ని చదివిస్తోంది. ఇంతలో మాయదారి జబ్బు కూతురి ప్రాణాలకు చుట్టుకుంది. మరో పది రోజుల్లో పదో తరగతి పరీక్ష రాయాల్సిన బిడ్డ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడడం చూసి జీర్ణించుకోలేక పోతోంది. శస్త్రకిత్సకు రూ.20 లక్షలు దాకా అవుతుందని వైద్యులు తేల్చడంతో అంత డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక.. బిడ్డను బతికించుకోలేక దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. ఆ తల్లి ఆరాటం.. బిడ్డ పోరాటానికి దయగల దాతలు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరి : మండలంలోని తడుకుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రభావతి (15) ప్రాణాలతో పోరాడుతోంది. తడుకు దళితవాడకు చెందిన ఈ విద్యార్థిని తండ్రి ప్రభాకర్ పన్నెడేళ్ల క్రితం మృతిచెందారు. తల్లి రాములమ్మ కూలి పని చేసుకుంటూ పిల్లలు ప్రభావతి, మదన్కుమార్ను పోషిస్తోంది. గత నెల 28వ తేదీన పాఠశాలలో నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి హాజరై పరుగు పందెంలో విజేతగా నిలిచింది. బహుమతి అందుకొని ఎంతో ఉత్సాహంగా ఇం టికి వచ్చిన ప్రభావతికి ఆ రోజు రాత్రి నుంచి తీవ్ర జ్వరం పట్టుకుంది. తల్లి స్థానికంగా ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లి మందులు తీసిచ్చినా రెండు రోజుల వరకు జ్వరం తగ్గలేదు. పైగా 3వ తేదీ రాత్రి కళ్లు తేలేయడంతో భయాందోళనకు గురైన తల్లి, బంధువులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తిరుపతి రూయాకు రెఫర్ చేశారు. అక్కరకు రాని ఆరోగ్యశ్రీ అక్కడ పరీక్షించిన వైద్యులు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, సీరియస్ కండీషన్లో ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీలో దీనికి వైద్యం లేకపోడం, ఆపై పలువురి సూచనల మేరకు వేలూరు సీఎంసీకి తరలించారు. ఐదు రోజులపాటు అక్కడ వైద్యం అందించారు. తర్వాత ఆపరేషన్ చెయ్యాలని, అందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. సాయం అందించిన సహ విద్యార్థులు, గురువులు విద్యార్థి చదివిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రభావతి ప్రాణాలు కాపాడడంలో తమదే తొలి అడుగుగా రూ.70 వేలు దాకా పోగుచేసి విద్యార్థి తాత కన్నియప్పన్కు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. దాతలు సహకారం అందించి తమ మిత్రురాలిని కాపాడాలని కోరుకున్నారు. వారం క్రితం పరుగు పందెంలో బహుమతి -
రాజీ పడొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి రాజీపడకూడదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదన్నారు. వసతి గృహాలను జాయింట్ ఇన్స్పెక్షన్ బృందాలు ప్రతిరోజూ తనిఖీ చేయాలని స్ప ష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ప్రతి రోజూ నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వసతి గృహాల్లో పారిశుద్ధ్యం పై ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. ఒకవేళ లోపా లు కనిపిస్తే సంబంధిత వార్డెన్లపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘వన్ హెల్త్’ విధానంతో సమన్వయం సంక్రమణ వ్యాధుల నివారణకు రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సిఫారసుల మేరకు ‘వన్ హెల్త్’ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ సూచించా రు. ఆరోగ్య, మున్సిపల్, విద్యాశాఖల మధ్య సమ న్వయం పటిష్టంగా ఉండాలని చెప్పారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహార భద్రత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై రాజీలేని తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు జిల్లా స్థాయి సంయుక్త తనిఖీ కమిటీలు అంతర్–శాఖీయ ర్యాపి డ్ రెస్పాన్న్స్ టీమ్లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు పాల్గొన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చిత్తూరు అర్బన్: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి చిత్తూరు కోర్టు జరిమానా విధించింది. జిల్లా ఎస్పీ తుషార్డూడి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం మత్తులో వాహనా లు నడుపుతున్న ఏడుగురు పట్టుబడ్డారు. వీరి ని మంగళవారం చిత్తూరు ఫస్ట్ స్పెషల్ జుడీషి యల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి కె.పరిమళదేవి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించారు. -
క్షమాపణ చెప్పు బాబు!
తవణంపల్లె: పవిత్రమైన తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని, కానీ కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం మండలంలోని కాణిపాకం రోడ్డులోని నారాయణాద్రి కల్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ రిపోర్టులో తేలిపోయిందన్నారు. భక్తుల మనోభాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హరిరెడ్డి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్రెడ్డి, పార్టీ నాయకులు ప్రకాష్బాబురెడ్డి, సుకేష్రెడ్డి, నవీన్కుమార్, నితిన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెలుగుబాటలో నైట్ విజన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో నైట్ విజన్ కార్యక్రమం అమలులో భాగంగా మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పలువురు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి నైపుణ్యాలను పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ సరికొత్త అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని సంతపేట పీఎన్సీ మున్సిపల్ పాఠశాల పరిధిలో విద్యార్థుల ఇళ్ల వద్ద నైట్ విజన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ హేమాద్రి, ఎస్జీఎఫ్ సెక్రటరీ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ రొంపిచెర్ల: అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం, బండకిందపల్లె గ్రామ పంచాయతీలో రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై కమోళ్లపల్లె, మట్లోళ్లపల్లె గ్రామస్తులు కలెక్టర్ సుమిత్కుమార్కు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి పక్కన భూముల ధరలు కోట్లల్లో పలుకుతున్నాయి. రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో అక్రమణ దారులు రెండు మూడు రోజులుగా సర్వే నం.36లో సుమారు రూ.75 సెంట్ల భూమిని జేసీబీతో చదును చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేసి మామిడి మొక్కలు కూడా నాటేశారు. దీనిపై కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ అక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను అదేశించారు. ఇరిగేషన్ ఏఈ మునిశేఖర్ సదరు సప్లయ్ చానల్ను పరిశీలించగా.. ఆ చానల్ ఆనవాళ్లే కనిపించలేదు. నిర్లక్ష్యం చేసిన ముగ్గురికి మెమోలు జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూమి అక్రమణకు గురవుతున్నా బండకిందపల్లె వీఆర్వో సురేంద్ర, వీఆర్ఏలు ఇర్ఫాన్అలీ, లక్ష్మణ్కు మెమోలు ఇచ్చినట్లు తహసీల్దార్ కిరణ్కుమార్ మంగళవారం తెలిపారు. -
చిన్నారి పెళ్లికూతురు!
కాణిపాకం: జిల్లాలో టీనేజీ వయసు దారి తప్పుతోంది. పుత్తిడి బొమ్మలు.. మూడు ముళ్ల బంధంలో చిక్కుకుపోతున్నారు. ప్రేమో.. ఆకర్షణో తెలు సుకునే సరికే బాల్యం బలవుతోంది. ఆడుకునే వయసులో అమ్మలను చేస్తోంది. కుప్పంలో ఇలా టీనేజీ గర్భవతులు అధికమతున్నారు. ఏడాది కాలంలో 2,971 మంది చిట్టి తల్లులయ్యారు. ఇదీ జిల్లాను కలవరపాటుకు గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో అవగాహన కొరవడుతోంది. జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 2025–2026 (జనవరి వరకు)గాను 31,291 మంది గర్భ వతులు నమోదయ్యారు. వీరిలో 27,291 మంది ప్రసవించారు. అయితే ఈ ఏడాదిలో టీనేజీ గర్భవతులు 2,971 మందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. మల్లానూరు పీహెచ్సీలో 66, వీరాన్నమలలో 29, కొత్తపల్లిలో 61, పైపల్లిలో 67, వెంకటగిరిలో 96, రాయల్ పేట 57, కొలమాసనపల్లిలో 75, కంగుడిలో 36, శాంతిపురంలో 76, విజలపురంలో 40, గుడిపల్లెలో 51, రాళ్లబుదుగూరు 63, బైరెడ్డిపల్లిలో 77, మాదిరెడ్డిపల్లిలో 46, పెద్దపంజాణి 67, ఓగు పీహెచ్సీ పరిధిలో 92 టీనేజీ గర్భవతులు తేలారు. మరిన్ని పీహెచ్సీల్లో కూడా టీనేజీ గర్భవతుల సంఖ్య ఘణనీయంగా పెరిగింది. కుప్పం..పరిసర ప్రాంతాల్లోనే అధికం కుప్పం.. అక్కడి పరిసర ప్రాంతాలు జిల్లాకు చిట్టచివరి ప్రాంతాలు. ఈ ప్రాంతం తమిళనాడు, కర్ణాటక నడుమ ఉంటుంది. అలాగే ఇక్కడ అక్షరాస్యత తక్కువ. ఇంకా అక్కడి ప్రజలు వారి పూర్వీకుల లాగానే ఆలోచిస్తుంటారు. 10వ తర గతి చదివితే చాలు పిల్లలకు.. వెంటనే పెళ్లి ముచ్చట తీర్చి బాధ్యత వదిలించుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. అలాగే ప్రేమ మోజులో పడి చాలా మంది.. మూడు ముళ్ల బంధంలో నలిగిపోతున్నారు. అభం శుభం తెలి యని వయసులో చిట్టి తల్లులవుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాల మాయలో పడి చిన్న వయసులో బతుకు భారాన్ని మోస్తున్నారు. శారీరక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అలాగే కార్వేటినగరం, శ్రీరంగరాజుపురం, బంగారుపాళ్యం, పలమనేరు, తవణంపల్లి, యాద మరి తదితర ప్రాంతాల్లో కూడా టీనేజీ తల్లుల సంఖ్య అధికమవుతోంది. ఈ టీనేజీ పెళ్లిళ్లు మాతా శిశు మరణాలకు దారితీస్తాయి. ‘స్మార్ట్’ ప్రభావం ఎక్కువ కరోనా పుణ్యమా అని పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. విద్యాలయాలు మూసివేసి ఆన్న్లైన్ క్లాసుల నిర్వహణతో కేజీ నుంచి పీజీ స్థాయికి స్మార్ట్ఫోన్ తప్పనిసరైంది. కొందరు విద్యార్థులు పాఠాలు వినేందుకు వినియోగిస్తే మరికొందరు వక్రమార్గం పట్టారు. ఇప్పుడు అర చేతిలో ఇమిడే ఫోన్లలోనే ఆశ్లీలత చేరిపోవడంతో మానసిక పరిపక్వత చెందని వయసులోనే టీనేజీ యువతపై దాని ప్రభావం పడుతోంది. దీంతో వారు చెడు మార్గం పడుతున్నారు. బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం పీహెచ్సీ పరిధిలో 13 ఏళ్ల బాలిక గర్భవతి అయింది. 20 రోజుల కిందట ఆ బాలికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పుడే గర్భవతి కావొద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా తల్లిదండ్రులు తలొగ్గలేదు. చేసేది లేక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ బాలికను హైరిస్క్ జాబితాలో పెట్టారు. ఆ చిట్టి తల్లిని నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు జిల్లాలో చాలానే ఉన్నాయి. జిల్లాలో పెరుగుతున్న టీనేజీ తల్లులు బాల్య వివాహాల కట్టడి ఏదీ? టీనేజీ గర్భవతుల నమోదుకు.. బాల్య వివాహాల నిలుపుదల సంఖ్యకు పొంతన ఉండడం లేదు. ఈ ఏడాదిగా జిల్లాలో 2,971 టీనేజీ గర్భవతులు నమోదైతే.. బాల్యవివాహాల సంఖ్య 92 మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇందులో 91 బాల్యవివాహాలను ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఒక్క కేసు నమోదు చేయించారు. కుప్పంలో 9, శాంతిపురంలో 8, పుంగనూరులో 7, పలమనేరులో 6, బంగారుపాళ్యంలో 5, గంగవరంలో 5, నగరిలో 5 చొప్పున్న గుర్తించామ ని ఐసీడీఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయి తే క్షేత్ర స్థాయి లోని ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు బాల్యవివాహాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని జిల్లా అధికారులు ఆగ్రహానికి గురవుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే క్రమంలో తల్లిదండ్రుల సహకారం ఉండడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, బెదరింపులు వస్తున్నాయని వాపోతున్నారు. -
కల్తీ పాల తయారీ ఇలా..
సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పా‘పాల’ పుట్టకు ప్రతిరూపంగా మారింది. ఇక్కడి కూటమి నేతలు కెమికల్ డాన్లుగా మారిపోయారు. అధికార మదంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు తాగే పాలలో రసాయనాలు కలిపి ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారు. పాలకూట విషాన్ని అధికార పలుకుబడితో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది. కల్తీ రాయుళ్ల ఆటకట్టించడంలో ఇక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలం చెల్లిన పాల పౌడర్, పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలను కలిపి మిక్సీ పడతారు. తద్వారా చిక్కటి క్రీం తయారవుతున్నట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇలా తయారైన లీటరు క్రీంలో నాలుగు లీటర్ల పాలు, 20 లీటర్ల నీటిని కలిపి మొత్తంగా 25 లీటర్ల పాలను తయారుచేస్తున్నారు. ఈ పాలను వివిధ డెయిరీలకు విక్రయించి వినియోగదారులపైకి వదులుతున్నారు. తమ బండారం బయట పడకుండా ప్రైవేటు డెయిరీల్లోని ఉద్యోగులను కల్తీపాల మాఫియా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. తమ అక్రమార్జనలో వా టాలు ఇస్తూ, మాట వినని వారిని బెదిరింపులతో నె ట్టుకొస్తున్నారు. కృత్రిమంగా తయారు చేస్తున్న పాల లో ఏయే రసాయనాలను ఏ మోతాదులో కలిపారో నిర్ధారించేందుకు పొరుగు రాష్ట్ర పోలీసులు పాల నమూనాలను పరీక్షలకు పంపారు. ఇవేం పాపాలుకర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పాల తయారీకి కావాల్సిన రసాయనాలు, వస్తువులను సేకరించి తమకు అనుకూలంగా ఉన్న డెయిరీల ఏజెంట్లకు అందిస్తున్నారని తెలిసింది. ఓ మహిళా నాయకురాలి భర్త కనుసన్నల్లోనే కుప్పంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు పాల తయారీ రసాయనాలు రవాణా అవుతున్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్లోని ఫుడ్ సేప్టీ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలా గడంతో కుప్పంలో డొంక కదులుతోంది. సాక్షి, టాస్క్ఫోర్స్ : కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఊకదంచుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కానీ స్థానిక పరిస్థితులు మాత్రం నేతి బీరకాయను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తూ కుప్పం ప్రాంతానికి చెందిన కూటమి నాయకులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు కల్తీ పాల దందా కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అందరికీ అవసరమైన పాలను విషంగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పట్టని పాలకులు కల్తీ పాల తయారీకి కుప్పం అడ్డాగా మారిందని పొరుగు రాష్ట్రాల పోలీసులు చర్యలకు ఉపక్రమించినా స్థానిక అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడడం లేదు. నెలవారీగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా పట్టించుకోవడం మానేశారు. పైపెచ్చు పొరుగు రాష్ట్ర విచారణ సంస్థలకు కూడా సహకరించడం లేదనే అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. కల్తీ పాల ముడి సరుకులను అందిస్తున్న కీలకమైన వ్యక్తిని పట్టుకునేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన కర్ణాటక పోలీసులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకుని బలవంతంగా వెళ్లగొట్టినట్టు సమాచారం. కర్ణాటకలోని రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చి అక్కడి పోలీసులను కట్టడి చేసేందుకు అధికార పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కలెక్టర్, ఎస్పీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డొంక కదులుతోంది ఆమె భర్తే కల్తీ డాన్ రసాయనాలతో తయారు చేస్తున్న కల్తీ పాలు పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రంలోకి వస్తున్నట్టు గుర్తించిన అక్కడి పోలీసులు గత నెలలో కోలారు జిల్లా కేజీఎఫ్ ఎస్పీ పరిధిలోని ఆండర్సన్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కుప్పానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుప్పానికి చెందిన ఓ మహిళా నాయకురాలి భర్త కల్తీ పాల తయారీ రాకెట్కు సూత్రధారిగా ఉన్నాడని అక్కడి పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కుప్పం నుంచి పొరుగు రాష్ట్రాలకు కల్తీ పాలు -
దందాకి గైడెన్సీ!
చిత్తూరు కలెక్టరేట్ : ఒక్కప్పుడు ప్రభుత్వ బడి అంటే పేదవాడికి దక్కిన గొప్పవరం అని భావించేవారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు సర్కారులో జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అక్షర క్షేత్రంలో అక్రమదందా సాగిస్తున్నారు. జిల్లాలోని 80 శాతానికి పైగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కమీషన్లకు నిలయంగా మారుతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయాల ప్రజాధనంతో ఉచితంగా పాఠ్యపుస్త కాలను పంపిణీ చేస్తోంది. అయితే కొందరు టీచర్లు మాత్రం ప్రైవేట్ గైడ్ల కోసం విద్యార్థుల జేబులకు తూట్లు పెడుతున్నారు. విద్యాశాఖ వైఫల్యం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ దందా బహిరంగంగా సాగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల అధికారులు మౌనం వహిస్తున్నా రు. రాబోయే విద్యాసంవత్సరానికి ఇప్పటి నుంచే పలు ప్రైవేట్ పబ్లిషర్లు దందా మొదలుపెట్టారు. ఈ దందా మొత్తం విద్యాశాఖ అధికారులకు తెలిసినా మౌనం వహించడం వెనుక భారీ మర్మమే ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు టీచర్లు గైడ్లను దాచి పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పుస్తకాల అమ్మకం నిషేధమనే రూల్ను తుంగలో తొక్కేశారు... ఇది ఒక్క జీడీనెల్లూరులోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సాగుతున్న గైడ్ల దందా ఇది. అక్కడి హెచ్ఎంల అండదండలతో ఉపాధ్యాయులు ప్రయివేటు పబ్లిషర్తో కుమ్మకై గైడ్ల సంస్కృతికి బీజం వేశారు. సృజనకు తాళం వేసి.. బట్టీ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు, మేధావులు రగిలిపోతున్నారు. జిల్లా సమాచారం నియోజకవర్గం ప్రభుత్వ విద్యార్థుల హైస్కూళ్లు సంఖ్య చిత్తూరు 32 7,384 గంగాధరనెల్లూరు 49 8,675 కుప్పం 88 18,516 నగరి 25 5,756 పలమనేరు 84 19,005 పూతలపట్టు 48 9,178 వ్యాపార కేంద్రాలుగా బడులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు ప్రభుత్వం వ్యాపార కేంద్రాలుగా మార్చేసింది. కొన్ని చోట్ల ఎంఈవోలకు సైతం పబ్లిషర్ల నుంచి నజరానాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గైడ్ల తతంగం బహిరంగంగా జరుగుతున్నా, ఏ ఒక్క ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదు. గైడ్లల్లో ఏముంది? ఉపాధ్యాయులు బోధన మానేసి గైడ్ల సేల్స్మెన్స్లాగా వ్యవహరించడం దారుణం. జిల్లాలో పేద విద్యార్థులను అప్పులపాలు చేస్తున్న ఈ గైడ్ల మాఫియాపై సమగ్ర విచారణ నిర్వహించాలి. కలెక్టర్ ఈ గైడ్ల దందా పట్ల ప్రత్యేక టీంలతో సమగ్రంగా విచారణ చేయించాలి. లేదంటే డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం. – ప్రవీణ్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. చర్యలు కఠినంగా ఉంటాయ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వద్ద గైడ్లు కనిపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయి. నేను పాఠశాలలను ఆకస్మికంగా చేసే తనిఖీల్లో విద్యార్థుల వద్ద గైడ్లు ఉన్నట్లు కనిపిస్తే సంబంధిత టీచర్తో పాటు హెచ్ఎం పై సైతం శాఖాపరమైన చర్యలు తీసుకుంటా. ప్రైవేట్ పబ్లిషర్స్తో కలిసి విద్యార్థులను గైడ్లు కొనుగోలు చేయాలని టీచర్లు ఒత్తిడి చేస్తే వెంటనే నాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయండి. – రాజేంద్రప్రసాద్, డీఈవో, చిత్తూరు జిల్లా -
13న ఉపాధ్యాయుల గర్జన
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ సంఘ నాయకులు మంగళవారం డీఈవో కార్యాలయ ప్రాంగణంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ నెల 13న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ వాయిదా వేస్తూనే వెళ్లడం దారుణమన్నారు. పెరిగిన ధరల దృష్ట్యా వెంటనే 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. 2003 డీఎస్సీలో ఎంపికై న టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.34 వేల కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 13వ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిలో జిల్లాలోని టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు గంటామోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, ఉపాధ్యక్షులు దేవరాజులురెడ్డి, నాయకులు ఢిల్లీప్రకాష్, రాధాకుమారి, బాలచంద్రారెడ్డి, చంద్రన్, సుబ్రహ్మణ్యం పిళ్లై తదితరులు పాల్గొన్నారు. -
ఇదేంది ‘తంబీ’!
కుప్పంరూరల్: మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పం అటవీ ప్రాంతంలో తమిళ ఆస్పత్రి వర్గాలు వ్యర్థాలు పడేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టి వెళ్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఆస్పత్రి వ్యర్థాల నిర్వ హణపై గట్టి నిబంధనలు ఉండడంతో రాత్రి పూట ప్రత్యేక వాహనా ల్లో వచ్చి కుప్పం అటవీ ప్రాంతంలో పారబోసి నిప్పుపెడుతున్నారు. గత నెల రోజుల నుంచి ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తమిళ ఆస్పత్రి వ్యర్థాలు కుప్పం అడవుల్లో నిప్పులు రేపుతున్నాయి. వేపనపల్లి నుంచే అధిక మొత్తంలో... కుప్పం మండలం, గుడ్లనాయనపల్లి, తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి మధ్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులోనూ వేపనపల్లి అతి సమీపంలో ఉంది. దీన్ని ఆసరాగా తీసుకున్న వేపనపల్లి, చుట్టు పక్కల పెద్ద ఎత్తున వెలిసిన ప్రైవేట్, ఆర్ఎంపీ క్లినిక్ల నుంచి నిత్యం వందల కిలోల వ్యర్థాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణపై తమిళనాడులో నిబంధనలు కఠినంగా ఉండడంతో రాత్రి పూట ప్రత్యేక వాహనాల్లో గుడ్లనాయనపల్లి అటవీ ప్రాంతంలో పారబోసి, వ్యర్థాలకు నిప్పుపెట్టి వెళ్తున్నారు. అందులో రసాయనాలతో కూడిన విషపూరిత వ్యర్థాలు కూడా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుడ్లనాయనపల్లి సమీపంలో అక్కడక్కడ పది చోట్ల వరకు పారబోసి నిప్పుపెట్టి వెళ్తున్నారు. పగటి పూట ఆ గాలి పీలిస్తే ఊపిరాడడం లేదని పశువులు, గొర్రెల కాపరులు వాపోతున్నారు. అదే విధంగా ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ఓ రకమైన దుర్గంధం వస్తోందని చెబుతున్నారు. ఈ మెడికల్ డంపింగ్పై కుప్పం అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సమస్యలు అనేకం..నీరుగారుతున్న లక్ష్యం!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమకు న్యాయం చేయాలంటూ ప్రతి సోమవారం జిల్లాలోని కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల నుంచి బాధితులు పీజీఆర్ఎస్కు విచ్చేస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారులకు అర్జీలు అందజేస్తూనే ఉన్నారు. ప్రజల చెంతకే పాలన అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, కలెక్టరేట్ గోడల మధ్యే ఆవిరైపోతున్నాయి. అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు తప్ప, వాటికి విముక్తి కల్పించడం లేదని క్షేత్ర స్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. 115 అర్జీలు నమోదు సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు.కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్కుమార్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీకి న్యాయం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వివిధ సమస్యలపై సోమవారం 115 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పలు ప్రాంతాల నుంచి పీజీఆర్ఎస్కు విచ్చేసిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్న అర్జీదారులుపీజీఆర్ఎస్కు క్యూ కడుతున్న అర్జీదారులు -
దాతలకు దక్కని గౌరవం!
నగరి: ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం మాజీ మంత్రి ఆర్కే రోజా తన చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన వెయిటింగ్ చైర్లపై ఉన్న ఆమె పేరు మూసివేయడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. దాత ఆర్కే రోజా పేరును ఉద్దేశపూర్వకంగా కప్పివేయడం దాతృత్వానికి అవమానమని పలువురు ఆరోపిస్తున్నారు. నగరి ఏరియా ఆస్పత్రిలో కమిటీ సభ్యులు, వైద్యాధికారులు చేసిన ఈ చర్యపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆస్పత్రి అభివృద్ధికి సహకరించిన వారిని గౌరవించాల్సిన బాధ్యత అధికారులదే.. పేరు మూసివేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో చెప్పాలని’’ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు మరింత ఊతమిస్తోంది. దాతలకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఎలా అనిమేధావులు హెచ్చరిస్తున్నారు. -
చిత్తూరులో సైక్లోథాన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సక్షమ్–2026 కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు నగరంలో సోమవారం సైక్లోథాన్ నిర్వహించారు. కోంగారెడ్డిపల్లిలోని పెట్రోల్ బంక్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ఈ సైక్లోథాన్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా హెచ్పీసీఎల్ చిత్తూరు సేల్స్ ఆఫీసర్ ఉదయ్ కార్తికేయన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. రోజువారీ జీవితంలో ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ శక్తి వనరుల వైపు ప్రజలు దృష్టి సారించాలని సూచించారు. ఈ సైక్లోథాన్లో సుమారు 100 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి పండ్లు పంపిణీ చేశారు. సాహితీ పురస్కారాల పోటీలకు ఆహ్వానం చిత్తూరు రూరల్ (కాణిపాకం): కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాల ట్రస్టు ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాల పోటీలను నిర్వహిస్తున్నట్లు ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు రోజా, నిరంజన్రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కవులు, రచయితల నుంచి నాలుగు రకాల సాహితీ ప్రక్రియలకు సంబంధించిన రచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కథలు (కథానికలు), నవలలు, ఛందోబద్ధ కవిత్వం, వచన కవిత్వం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల తెలుగు రచయితల నుంచి జాతీయ స్థాయి నవలల పోటీలకు కూడా రచనలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రచయితలు జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్యకాలంలో ముద్రితమైన పుస్తకాలను మాత్రమే పంపాల్సి ఉంటుందన్నారు. జాతీయ స్థాయి నవలల పోటీలకు కూడా ఇదే కాలవ్యవధిలో ముద్రితమైన నవలలు అర్హమని స్పష్టం చేశారు. ప్రతి ప్రక్రియకు మూడు ప్రతులు (మూడు పుస్తకాలు) తప్పనిసరిగా పంపాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో ఉత్తమ రచనగా ఎంపికై న ప్రతి ప్రక్రియకు రూ.10 వేలు నగదు బహుమతి, జ్ఞాపిక, చందనమాల, శాలువతో ఘనంగా సన్మానిస్తామన్నారు. అలాగే ఉత్తమ జాతీయ స్థాయి నవలలుగా ఎంపికై న నాలుగు నవలలకు కూడా ఒక్కొక్క రచయితకు రూ.10 వేలు నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, చందనమాల, శాలువతో సన్మానం చేస్తామన్నారు. రచయితలు తమ రచనల మూడు ప్రతులను మార్చి 10వ తేదీ లోపల డాక్టర్ కె.రామలక్ష్మి రామలక్ష్మి నర్సింగ్ హోమ్, నెం.17–434, సుందరయ్య వీధి, చిత్తూరు – 517001 చిరునామాకు పంపాలని కోరారు. సాహితీ మహోత్సవాల తేదీ, వేదిక తదితర వివరాలను తరువాత ప్రకటిస్తామని ట్రస్టు నిర్వాహకులు పేర్కొన్నారు. -
ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలు
వేరుశనగ పప్పుకిలో రూ.200 వేరుశనగ గింజల ధర ఒక్కసారిగా పెరగడంతో వంట నూనె ధరలకు రెక్కలొచ్చినట్టు చెబుతున్నా రు. వారం రోజుల క్రితం వరకు కిలో వేరుశనగ గింజలు రూ.130 నుంచి రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.200 వరకు విక్రయిస్తున్నారు. రబీ పంటలు చేతికి వచ్చే వరకు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిత్యావసరాల ధరలు అదుపు తప్పుతున్నాయి. అనేక హామీలతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం సామాన్యులకు ఏ మాత్రం ఊరటనివ్వలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో ప్రచారంతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు బహిరంగ మార్కెట్లో ధరలు సలసలకాగుతున్నాయి. సామాన్యుడి వంటింటి బడ్జెట్ పూర్తిగా మారిపోతోంది. – చిత్తూరు రూరల్ (కాణిపాకం)జేబులకు చిల్లు కొన్ని కంపెనీలు లీటరు 900 గ్రాముల పేరుతో 850 గ్రాములు, 800 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులు ధర మాత్రమే చూసి పరిమాణాన్ని గమనించకపోవడంతో మోసపోతున్నారు. వంట నూనెతో పాటు పప్పులు, మసాలా దినుసుల ధరలు సైతం అనూహ్యంగా పెరిగాయి. కంది పప్పు రూ.110 నుంచి రూ.130కి, ఎండుమిర్చి కిలో రూ.240 నుంచి రూ.300కి, మినపప్పు కిలోకు రూ.20 మేర పెరిగింది. పండుగల సీజన్ లేకపోయినా ధరలు ఇలా పెరగడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలు, రాజకీయ విమర్శలు పక్కనబెట్టి ప్రభుత్వం ధరల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని మేధావులు, ప్రజలు కోరుతున్నారు. ధరల కట్టడి చేయాలి నిత్యావసర సరుకులు పెరుగుదలతో సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు. నెల వారీ సరుకు కొనాలంటే కనీసం రూ.3వేల వరకు ఖర్చువుతోంది. కూరగాయలు, ఇతరాత్ర అధనం. ఇలా ఇంటి అవసరాలకే నెలకు రూ. 5వేల వరకు ఖర్చువుతోంది. వచ్చే జీతం తినే తిండికి సరిపోయేటట్టు ఉంది. – నవమణి, చిత్తూరు -
గుండె మంటలు.. ఆకలి కేకలు!
తిరుపతి జిల్లా, కపిలతీర్థం సమీపంలోని శివజ్యోతి నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంధుల శరణాయంలోని బధిరులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్కు విచ్చేసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీకి సమస్యలను విన్నవించుకున్నారు. చూపు లేదు.. కానీ గుండె నిండా ఆవేదన ఉంది.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ అంధుల శరణాలయంలో నిలువ నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ వేధింపులు భరించలేక పోతున్నామని వాపోయారు. అంధుల శరణాలయం నుంచి విచ్చేసిన మర్రిపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీఅయ్యా మాకు చూపు లేదు.. ఏడీ వినోద్కుమార్కు మేమంటే ఇంత అలుసా..?శ్రీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే దిక్కెవరు అని ప్రశ్నించారు. ఏడీ తమ పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని, శరణాలయంలో సమయానికి భోజనం కూడా పెట్టడం లేదన్నారు. ఏమి అడిగినా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ప్రశ్నిస్తే మానసిక వేధింపులు, బెదిరింపులే సమాధానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే న్యాయం చేయాలంటూ కలెక్టర్ను ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు అందులు పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సమస్యను విన్నవించేందుకు వెళ్తున్న దివ్యాంగులు ఏడీ వేధింపుల నుంచి కాపాడాలని కన్నీరు మున్నీరవుతున్న దివ్యాంగులు -
చూతము రారండి..
విద్యుద్దీప కాంతుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయంశ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మూగజీవులు ముక్తి పొందిన దివ్యక్షేత్రంగా.. భక్తుల పాలిట భూకై లాసంగా.. శ్రీకాళహస్తి విరాజిల్లుతోంది. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ విశేషోత్సవాలు మంగళవారం భక్త కన్నప్ప ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం కానున్నాయి. ఈశ్వరునిపై అచంచల భక్తి,విశ్వాసాలు చాటిన భక్త కన్నప్పకు తొలి పూజ నిర్వహించిన తరువాతే ఈ దివ్యోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఒక్కొక్క రోజును ఒక్కొక్క రాత్రిగా పరిగణిస్తూ ఉత్సవాలను జరపడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. స్వర్ణముఖి నది వంతెనపై నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయం సోమ వారం రాత్రి శోభాయమానంగా దర్శనమిచ్చింది. నేటి నుంచి మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ, 11న శ్రీకాళహస్తిశ్వరస్వామి ధ్వజారోహణం, వెండి అంబారి వాహనసేవ, 12న ఉదయం స్వామివారు సూర్యప్రభ అమ్మవారికి చప్పర వాహనసేవ, 13న ఉదయం హంస, యాళి వాహనసేవ, రాత్రి రావణ మయూర వాహనసేవ 14న ఉదయం హంస, శుక వాహనసేవ, రాత్రి శేష, యాళి వాహనసేవ, 15న మహాశివరాత్రి, ఉదయం ఇంద్ర విమానం, చప్పర సేవ, రాత్రి నంది సేవ, సింహ వాహనసేవ, 16న రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరగనుంది. 17న ఉదయం అధికార నంది, కామధేనువు, రాత్రి గజ, సింహవాహనసేవ, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం, 18న ఉదయం రుద్రాక్ష , అంబారి సేవ, రాత్రి సభావతి కల్యాణం, 19న అంబారి వాహనసేవ, రాత్రి ఆశ్వం, సింహ వాహన సేవ, 20న ధ్వజావరోహణం, 21న వల్లకీ సేవ, 22న ఏకాంత సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో నేడు భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ (మాఘ బహుళ అష్టమి) మధ్యాహ్నం 2.55గంటల నుంచి ప్రారంభం ఉభయదాతలు శ్రీబోయ కులస్తుల వారి సంఘం, శ్రీకాళహస్తి. -
వరిపై జంట ఏనుగుల దాడి
ఐరాల: వరి పంటపై జంట ఏనుగులు దాడి చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని చిగరపల్లె గ్రామానికి చెందిన ఉదయగిరి వరి పైరు తొక్కి నాశనం చేశాయి. అదే గ్రామానికి చెందిన మరో రైతు మామిడి తోటకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను ధ్వంసం చేశాయి. సుమారు రూ.20 వేల వర కు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపా రు. చిత్తూరు డీఆర్ఓ కరణ్సింగ్ జంట ఏనుగు లు తొక్కి నాశనం చేసిన వరి పంటను పరిశీలించారు. నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు రాత్రి పూట ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ప్రస్తుతం జంట ఏనుగులు తవణంపల్లె మండలం వైపు వెళ్లినట్లు చెప్పారు. ఎఫ్బీఓ రెడ్డెప్ప, ఏబీఓ ఉదయ్ పాల్గొన్నారు. 3,477 మంది విద్యార్థులకు కళ్లద్దాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని 3,477 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ అర్పిత తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 500 పాఠశాలల్లో మొత్తం 57,561 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. 16 మంది కంటి వైద్యులు ఈ పరీక్షల్లో పాల్గొనగా, అందులో 3,477 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించామన్నారు. ఇప్పటివరకు వెయ్యి మంది విద్యార్థులకు కళ్లద్దాలు అందజేశామని, మిగిలిన వారికి త్వరలోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాబ్ బుకింగ్లో డ్రోన్ సేవలు చిత్తూరు కలెక్టరేట్ : వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతికతను మరింత విస్తృతంగా రైతులకు అందించేందుకు కిసాన్ డ్రోన్స్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్యాబ్ బుకింగ్ ద్వారా డ్రోన్ సేవలు పోస్ట ర్లను ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ ఈ డ్రోన్ సేవలు రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలను డ్రోన్తో పిచికారీ చేయవచ్చన్నారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్కుమార్, వ్యవసాయ శాఖ అధికారి మురళి పాల్గొన్నారు. -
క్రమబద్ధకం!
చిత్తూరులో బీపీఎస్ పరిధిలోకి వచ్చే భవనాలకు మార్కింగ్ చేస్తున్న సిబ్బంది ఆదాయం పట్టించుకోరా? 1995 జనవరి 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు జరిగిన భవనాల నిర్మాణంలో మునిసిపాలిటీల నుంచి తీసుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అతిక్రమణలు జరిగిన భవనాలు, అసలు ప్లాన్ అప్రూవల్స్ లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకోవడానికి గతేడాది నవంబర్లో బీపీఎస్ పథకాన్ని తీసుకొచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఏడాది మార్చి 11వ వరకు గడువు విధించారు. అంతంత మాత్రంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) ఆర్థిక పరిస్థితి బీపీఎస్తో కాస్త ఆర్థిక పరిపుష్టి లభించనుంది. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంతో ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల నిధులు రాకుండా చేజారే ప్రమాదం ఉంది. 90 శాతం అక్రమాలే.. జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో నిర్మించే ప్రతి వంద మందిలో 80 మంది ప్లాన్ అప్రూవల్స్ తీసు కుంటే.. 20 శాతం మంది అనుమతులు తీసుకోరు. ఇక ప్లాన్ అప్రూవల్ తీసుకున్న 80 శాతంలో 90 శాతం మంది నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతుంటారు. వీరంతా కూడా బీపీఎస్ పరిధిలోకి రావాల్సిందే. పైగా అక్రమాలను నామమాత్రపు చార్జీలతో సక్రమం చేసుకునే వెలుసు బాటు బీపీఎస్లో ఉండడం వల్ల భవన యజమానికి మేలే జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, దరఖాస్తు చేసుకునేలా చేయడంలో యంత్రాంగం వైఫల్యం చెందుతోంది. జిల్లాలో బీపీఎస్ దరఖాస్తులు ఇలా.. మునిసిపాలిటీ దరఖాస్తులు చిత్తూరు 208 పలమనేరు 16 నగరి 40 కుప్పం 19 మేల్కొంటారా? 2015లో బీపీఎస్ ఇచ్చినప్పుడు జిల్లా మొత్తంలో 14వేల వరకు దర ఖాస్తులురాగా, దాదాపు రూ.12 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. 2019లో రెండు వేల దరఖాస్తులు వస్తే రూ.9 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. తాజాగా జిల్లాలో ఇప్పటి వరకు 300 దరఖాస్తులు కూడా రాలేదు. తాజా నోటిఫికేషన్లో బీపీఎస్ ద్వారా రూ.10 కోట్లకు పైగా ఆదాయం రావాల్సింది. కానీ జిల్లా వ్యాప్తంగా భవనాల నుంచి కేవలం 332 దరఖాస్తులు అందితే.. ఇందులో చిత్తూరు కార్పొరేషన్దే 200లకు పైగా ఉన్నాయి. మిగిలిన మూడు మునిసిపాలిటీలకు కలిపి వంద దరఖాస్తులు కూడా అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పలమనేరు, కుప్పం మునిసిపాటీల్లో 16,19 దరఖాస్తులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికై నా మునిసిపల్ అధికారులు కాస్త గట్టి ప్రయత్నం చేస్తే బీపీఎస్ కాసులు కురిపించే కల్పవృక్షం కానుంది. -
అడ్డగోలు దుష్ప్రచారమా బాబు?
పాలసముద్రం : సీఎం చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వివిధ రాష్ట్రాల్లో నిబంధనలను ఉల్లంఘించి పాలు, పెరుగు తయారు చేసిందన్నారు. పాల ఉత్పత్తులు నిల్వ కాలం పెంచడానికి ప్రమాదకర రసాయనాలు ఉండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. హెరిటేజ్ పెరుగులో కొవ్వు లేదని చెప్పి ఫుడ్ స్టేప్టీ, స్టాండర్స్ అధికారులు లక్ష ఫెనాల్టీ విధించే వరకు కనుగొనలేని చంద్రబాబు తిరుమల వెంకటన్న ప్రసాదం లడ్డూపై విషం చిమ్మడం సిగ్గుచేటన్నారు. తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలవనే లేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపిన సిట్ నిగ్గు తేల్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు శ్రీశైలం మల్లన్న లడ్డూలో కల్తీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. కనీసం విచారణ జరపకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమంత్రి అనిత దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. -
దందా ఖనిజం!
శ్రీవారి దర్శనానికి 12 గంటలుచిత్తూరు అడ్డాగా గ్రానైట్ దందా సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలో 400 వరకు గ్రానైట్ క్వారీలున్నాయి. ఇందులో 150 వరకు అనధికారికంగా నడుస్తున్నాయి. మరో 100 క్వారీలు అక్ర మార్కుల చేతిల్లో గుల్లవుతున్నాయి. పలు క్వారీల్లో అక్రమ గ్రానైట్ తరలింపు పుంజుకుంటోంది. శ్రీరంగరాజుపురం, జీడీనెల్లూరు, యాదమరి, బంగారుపాళ్యం మండలాల్లో అక్రమ గ్రానైట్ తవ్వకాలతో పాటు తరలింపులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అనుమతులు లేకుండానే తవ్వకాలు, రాయల్టీ లేకుండానే తరలింపులు చేస్తున్నారు. రోజుకు కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ చిత్తూరు మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. శ్రీరంగరాజుపురం, జీడీనెల్లూరు మీదు గా చిత్తూరుకు తరలించేస్తున్నారు. అలాగే చిత్తూరు మండలం, ముత్తుకూరు వద్ద ఉన్న తచ్చూరు హైవే ను అక్రమ మార్గంగా ఎంచుకున్నారు. ఈ మార్గం గుండా కోట్లాది రూపాయల విలువచేసే గ్రానైట్ దిమ్మెలు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ‘రాయల్’గా దోపిడీ! రాయల్టీ వసూళ్ల విషయమైతే మరీ దారుణంగా తయారైంది. అడిగితే ‘టెండర్లు జరగలేదు’ అని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. కానీ వందల లారీలు, రాయల్టీ ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు ఉన్నాయా? లేక కాగితాలకే పరిమితమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఒక క్యూబీ మీటర్కు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు కలిపి రూ.2,500 నుంచి రూ.2,700 వరకు కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మైనింగ్ శాఖ అధికారులే వసూలు చేయాలి. కానీ ఆ రకంగా అధికాారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అక్రమ గ్రానైట్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చట్టాలు, నిబంధనలన్నీ కూటమి నేతలు గాలికి వదిలేశారు. గ్రానైట్ దిమ్మెల దోపిడీలో ఆరితేరిపోయారు. రాయల్టీకి పంగనామాలు పెట్టేస్తున్నారు. బడా నేతల అండతో అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కాదని పట్టుకుంటే.. అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్ దందాపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,894 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,754 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.,91 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అధికారులకు గుది‘బండ’! నిబంధనల ప్రకారం గ్రానైట్ దిమ్మె తరలించాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రతి మీటర్కు రాయల్టీ చెల్లించాలి. కానీ పలు మండలాల్లో మాత్రం మాఫియా చట్టాన్ని తుంగలో తొక్కేస్తోంది. జీడీనెల్లూరులో ఓ ప్రజాప్రతినిధి అండతో రాజస్థాన్కు చెందిన ఓ బడా వ్యాపారి రాయల్టీ కట్టకుండా దోచేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే మాదిరిగానే బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరులో కూడా బడా నేతలు రాయల్టీలకు డుమ్మా కొడుతున్నారు. వీటిపై అధికారులు పట్టించుకుంటే వారికి బెదిరింపులు వస్తున్నాయని కొందరు అధికారులు వాపోతున్నారు. దీంతో పట్టుకున్న బండ్లను కూడా వదిలేయాల్సి వస్తోందని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం జీడీనెల్లూరులో బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఓ గ్రానైట్ లారీని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అయితే దీన్ని అధికార పార్టీ నేతల ఒత్తిడితో వదిలేశారని.. పలువురు భగ్గుమంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ గ్రానైట్ దందాపై ఉక్కుపాదం మోపకపోతే చిత్తూరు ఖనిజ సంపద పూర్తిగా దోచుకుపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరిస్తున్నారు. -
పార్టీ బలోపేతమే లక్ష్యం
నగరి : వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ యువజన విభాగం, సోషల్ మీడియా పనిచేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం తన నివాసంలో వున్న కార్యాలయం వద్ద సోషల్ మీడియా, యువజన, విద్యార్థి, ఐటీ, ప్రచార విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడు తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజల పక్షాన నిలబడి ముందుకు సాగాలన్నారు. టీడీపీ గూండాలు, రౌడీలతో వైఎస్.జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్సార్ సీపీ పార్టీ కీలక నాయకుల మీద ప్రభుత్వం తప్పు డు ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. ఆ దాడులు, బెదిరింపులను ఎదుర్కొంటూ వెనక్కి తగ్గకుండా పార్టీ శ్రేణులు ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మనం జగనన్న సైనికులమని, ఆయనను ఆదర్శంగా తీసుకుని బలంగా నిలబడాలన్నారు. సోషల్ మీడియా సహా అన్ని వేదికల్లో వాస్తవాలతో అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. జగనన్న ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ భవిష్యత్తు కార్యకర్తల చేతుల్లోనే ఉందన్నారు. ప్రతి విభా గం సమన్వయంతో పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందన్నారు. యువత, విద్యార్థులు, సోషల్ మీడియా వలంటీర్లు పార్టీకి బలమైన ఆయుధాలుగా మారాలని పిలుపునిచ్చారు. అలాగే అన్ని మండలాల్లో పంచాయతీ, వార్డు స్థాయిలో అనుబంధ కమిటీలు, పార్టీ కోర్ కమిటీలను తక్షణమే పూర్తి చేసి పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. కమిటీలు పూర్తయిన తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులు, సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు, పార్టీ తీసుకునే నిర్ణయాలు వారికి వేగంగా చేరేలా పనిచేయాలన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. ఈ సందర్భంగా యువశ్రేణులు మాజీ మంత్రిని గజమాలతో సత్కరించారు. -
కాసారా కటకటాలే !
కార్వేటినగరం: పోలీసులు సారా విక్రయాలపై ఉక్కుపాదం మోతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఏఎస్పీ దేవదాసు, సీఐ హనుమంతప్ప, ఎస్ఐ తేజస్విని, ఎస్టీఎఫ్ బృందం సంయుక్తంగా కార్వేటినగరం మండలం కొటార్వేడు దళితవాడ అటవీ సమీపంలో దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ద్విచక్ర వాహనాల రికార్డులు, వాహన యజమాని లైసెన్సును పరిశీలించారు. దైర్య స్పర్శలో భాగంగా భయానికి ముంగిపు – భద్రతకు భరోసా అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ దేవదాసు మాట్లాడుతూ గ్రామాల్లో సారా, గంజాయి, బెల్టు షాపుల్లో మద్యం వక్రయాలతో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. సారా కాస్తే కటకటాలు తప్పవన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ వ్యాపారాలకు స్వస్థి పలికితే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పిస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హా జరుకావాలని ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీసు కార్యాలయంలో.. అలాగే చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 నుంచి ప్రజలు తనను నేరుగా కలిసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని తెలిపారు. జ్యోతిబాపూలే స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు పెద్దపంజాణి : మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబందించి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఏ.జ్యోత్స్న తెలిపారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ 5వ తరగతిలో 40 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 5వ తరగతిలో చేరడానికి ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 2024–25, 2025–26లో చదివి ఉండాలన్నారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు 2015 సెప్టెంబర్ 01, 2017 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మంచరాదన్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తిగల వారు ఆన్లైన్లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా సంరక్షకుని మొబైల్ నెంబర్ వివరాలతో రూ.100 చెల్లించిన తర్వాత వచ్చే జర్నల్ నంబర్ ఆధారంగా mjpapbcwreis.apcfss.in వెబ్సైట్ ద్వారా 2026 మార్చి 04లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటలోని పాఠశాలలో సంప్రదించాలన్నారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వినియోగదారులు ఉద యం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీ పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర సంఘం తరపున సుబ్రహ్మణ్యంరెడ్డి, సమన్వయకర్తగా అన్నమయ్య జిల్లా కార్యదర్శి అన్సర్ బాషా, హెచ్ఎం అసోసియేషన్ కార్యదర్శి సురేష్ వ్యవహరించారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల నుంచి 126 మంది ఓటు వేశారు. జిల్లా అధ్యక్షుడిగా సిరాజ్ అహ్మద్, కార్యదర్శిగా దేవానంద్, కోశాధికారిగా శశిప్రకాష్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జిల్లాలో పీఈటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,777 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
కల్తీని కడిగేద్దాం!
కూటమి పాపాలపై ఆ దేవదేవుడే శిక్షిస్తాడు తిరుపతి మంగళం : శ్రీవారి లడ్డూ ప్రసాదం చేసే నెయ్యిలో కల్తీ జరగలేదని, చంద్రబాబు, పవన్కళ్యాణ్ మనసులే కల్తీ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్ ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి అలిపిరి వరకు కూటమి నాయకులు అపవిత్రం చేస్తూ నడిచిన రోడ్లను ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెట్టేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదంతో నీచ రాజకీయం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తూ, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నా రని ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్ మాట్లాడుతూ తిరుపతి పుణ్య క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో పాటు కూటమి నాయకులు పసుపు బట్టలు ధరించి దొంగ దీక్షలతో పాదయాత్ర చేపట్టి నెయ్యిలో కల్తీ చేశారంటూ నమ్మబలికించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లడ్డూ భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పుల్లయ్య, తలారి రాజేంద్ర, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, దినేష్రాయల్, పార్టీ సీనియర్ నాయకులు తుడా వెంకటరెడ్డి, నాయకులు రాజేష్, కడపగుంట అమరఽనాఽథ్రెడ్డి, చంద్రయ్య, వెంకటేష్రాయల్, కోటి, స్వరూప్, ఆటో ప్రసాద్, బాలాజీ, ధనశేఖర్, విజయలక్ష్మి, పద్మజ, శాంతారెడ్డి, పుణీత, పుష్పాలత, యశోద, పావని తదితరులు పాల్గొన్నారు. -
సున్నా వడ్డీకి సున్నం
కార్వేటినగరం : తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎసురు పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చి దాదా పు 18 నెలలకు పైగా కాలం గడిచిన ఇప్పటికీ నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో దాదాపు లక్షల మంది రైతులు నష్టపోతున్నారు.. రాయితీ ఇలా.. అన్నదాతలకు ఎంతో మేలు చేసే ఈ బృహత్తర పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి శ్రీకా రం చుట్టారు. తాను నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాద యాత్రలో పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి ఆ పథకాన్ని ప్రకటించారు. అప్పటి వరకు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు. ఆ తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయి తీ చెల్లిస్తామని ప్రకటించారు. ఆ విధంగా రూపుదిద్దుకున్న ఈ పథకం కింద పంట రుణాలు తీసుకు న్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చొప్పున భరిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రా యితీ అందించి ఎంతో మేలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలును పూర్తిగా విస్మరించింది. పంట రుణాలు ఇలా.. చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీ) పరిధిలోని 40 సహకార బ్యాంకు బ్రాంచిలు,198 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా లు (సొసైటీలు) ఉన్నాయి. వీటి పరిధిలో ఒక లక్ష మందికి పైగా సభ్యులున్నారు. ప్రస్తుతం వీరికి ఏటా రూ. 500 కోట్లకు తక్కువ కాకుండా రుణాలిస్తున్నారు. డీసీసీబీతో పాటు పలు వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు కనిష్ఠంగా రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకూ పంట రుణాలిస్తున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడంతో వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీల నుంచి తీసుకు న్న రుణాలకు సంబంధించి అసలుతో పాటు మొ త్తం వడ్డీని కూడా రైతులే చెల్లించాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. క్రేంద్ర ప్రభుత్వం ఏటా రుణా లు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3 వేల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ. 4 వేల వడ్డీ రాయితీని 18 నెలలు గా ఇవ్వడం లేదు. ఈ విధంగా జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 2 కోట్ల మేర వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ పథకానికి ఎగనామం రైతు సంక్షేమానికి దోహదపడే ఒక్కో పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. ఈ క్రమంలో సున్నా వడ్డీ పథకానికి కూడా పుర్తిగా ఎగనామం పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ. 20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకానికి ఒక ఏడాది ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అరకొరగా రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. అదికూడా చాలా మంది రైతులకు ఇవ్వలేదు. అలాగే ప్రకృతి వైప్యరిత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ పరిహారం చెల్లించ లేదు. చెల్లించకుంటే రుణం ఎలా ? పంటల రుణాలపై ప్రభుత్వం 18 నెలలుగా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో ఆ భారం రైతుల పైనే పడుతోంది. ప్రభుత్వం వడ్డీ రా యితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీలు కూడా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో కొంత మంది రైతులు తంటాలు పడుతూ బ్యాంకుల కు వడ్డీ చెల్లిస్తున్నారు. అలా చెల్లించలేని వారు తమకు పంట రుణాలు ఏవిధంగా వస్తాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. పునరుద్దరించాలి ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారుల ఒత్తిడి తెస్తుండడంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. – మురళీకృష్ణారెడ్డి, రైతు, ముక్కరవానిపల్లి, కార్వేటినగరం మండలం వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గతేడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి, గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప పథకాలకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది. – లోకనాథరెడ్డి, రైతు, అన్నూరు, కార్వేటినగరం మండలం -
మునిసిపాలిటీల్లో ఓటర్ల జాబితాలపై కసరత్తు
చిత్తూరు అర్బన్ : మునిసిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 9వ తేదీన అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫొటో ఓటర్ల జాబితాను ప్రచురించాలని కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు మాత్రం నిర్ణీత సమయంలో నిర్వహించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితానే.. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితానే మార్చిలో ప్రచురించడానికి అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు పూర్తయి, ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారి పేర్లను సైతం జాబితాలో చేర్చనున్నారు. ప్రతి ఒక్కరీ ఫొటోతో జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేసుకుని, మార్చి 9వ తేదీన ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జిల్లా పునర్విభజన పూర్తయ్యాక జిల్లా పరిధిలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్, పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలు ఉన్నాయి. చిత్తూరులో 50 డివిజన్లు ఉండగా, పలమనేరు మున్సిపాలిటీలో 26, నగరిలో 29, కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వీటిలో కూడా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలి. రిజర్వేషన్లు కీలకం ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత వార్డుల్లో సామాజిక వర్గాల వారీగా ఉన్న జనాభా, ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్ నిర్ణయిస్తారు. అలాగే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ స్థానాలు రిజర్వు చేయాల్సి ఉంది. ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరలోనే కుల గణన జరగాల్సి ఉంది. ఎన్నికలకు ముందు కుల గణన పూర్తయ్యేలా లేదు. ఇది కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం. చైర్పర్సన్లు, మేయర్ పదవులు ఆశించే ఆశావహులకు అనుకూలంగా రిజర్వేషన్లు లేకపోతే అసమ్మతి రాగం కొంప ముంచుతుందని రిజర్వేషన్లపై కూడా ఓ నిర్ణయానికి రాకపోచ్చు. ప్రత్యేక పాలన తప్పదా..? జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లోని పాలక వర్గాల(కౌన్సిల్)కు మార్చి 17వ తేదీతో గడువు ముగియనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటపడుతుందనే ఉద్దేశంతో మునిసిపల్ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా కొద్ది రోజుల పాటు మునిసిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి పాలన సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరుల నెలల పాటు ప్రత్యేక పాలన సాగించి, ఆపై ప్రభుత్వం మున్సిపోల్స్పై ఆలోచించే అవకాశం ఉంది. -
కారును ఢీకొన్న ద్విచక్రవాహనం
బంగారుపాళెం : మండలంలోని కేజీ సత్రం వద్ద ఆదివారం సాయంత్రం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో కారును బైక్ ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఒక బైక్ పలమనేరు నుంచి చిత్తూరు వెళుతోంది. కేజీ సత్రం నుంచి వచ్చిన కారు యూటర్న్ తీసుకోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కారును వెనుకవైపు ఢీకొని కిందపడింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మురుగు కాలువ పూడ్చివేత గంగవరం: మురుగు నీరు ప్రవహిచే కాలువను టీడీపీ నాయకుడు స్వార్థబుద్దితో మట్టితో పూడ్చేసిన సంఘటన మండలంలోని నడిమి గొర్రెలదొడ్డి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. పసుపత్తూరు పంచాయతీ నడిమిగొర్రెలదొడ్డి గ్రామంలో ప్రజల సౌకర్యార్ధం గత ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు రూ.2.5 లక్షలు వెచ్చించి మురుగు కాలువను నిర్మించారు. అది తన ఇంటి ముందు వెళ్లిందన్న స్వార్థంతో టీడీపీ నాయకుడు మట్టితో పూడ్చేశాడు. అధికార పార్టీ నాయకులు ప్రజలకు మంచి చేసి మన్ననలు పొందాల్సి ఉండగా కాలువను పూడ్చి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని స్థానికులు విమర్శిస్తున్నారు. అడిగితే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి, మీ ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు మా ఇంటి ముందు వెళ్లాలా అని దుర్భాషలాడుతున్నట్టు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గొంతు కోసి వృద్ధురాలి హత్య గుడుపల్లె: మండలంలోని ఓఎన్ కొత్తూరు గ్రామంలో ఆదివారం వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. ఓఎన్ కొ త్తూరు గ్రామానికి చెందిన చెందిన చిన్నక్క(64) గ్రామం చుట్టుపక్కల ఉన్న చింత చెట్ల వద్దకు వెళ్లి చింతకాయ లు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయాన్నే గ్రామ సమీపంలోని చింతచెట్టు వద్దకు వెళ్లింది. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు కోసి హత్య చేశారు. అనంతరం చెవుల్లోని కమ్మలను అపహరించి మృతదేహాన్ని సమీపంలోని ఇటుకల బట్టీలో పడేసి పారిపోయారు. సాయంత్రం ఇటుకల కోసం వచ్చిన స్థానికులు వృద్ధురాలి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ పార్థసారథి, సీఐ మల్లేష్యాదవ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా విచారణ చేపడుతున్నారు. ఉలిక్కిపడ్డ ఓఎన్ కొత్తూరు ప్రశాంతంగా ఉండే తమిళనాడు సరిహద్దులోని ఓఎన్ కొత్తూరు గ్రామం చిన్నక్క హత్య ఉదంతంతో ఉలిక్కిపడింది. మహిళలు ఒంటరిగా బయటకి వెళ్లరాదంటూ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సురక్షితంగా అడవిలోకి జంట ఏనుగులు చిత్తూరు కార్పొరేషన్ : అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్స్ ఆదివారం రాత్రి జంట ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించారు. ఈ డ్రైవ్లో పలమనేరు నుంచి 13 మంది ట్రాకర్స్, ఐదుగురు సిబ్బంది, చిత్తూరు నుంచి 20 మంది సిబ్బంది పాల్గొన్నారు. వారు ఏనుగుల వెనుక టపాసులు కాలుస్తూ, రాకెట్లు వదులుతూ నగర ప్రాంతం దాటించారు. మురకంబట్టు వద్ద ఏనుగులు కాసేపు వెనుతిరగడంతో వాటిని అడ్డుకట్ట వేసి ముందుకు పంపారు. అనంతరం లెనిన్నగర్ మీదుగా సీతమ్స్ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తరలించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా వాటిని పంపినందుకు అధికార, సిబ్బంది బృందంను డీ ఎఫ్ఓ సుబ్బరాజు అభినందించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వోలు పట్టాబి, థామస్ పాల్గొన్నారు. పంటలపై మళ్లీ ఏనుగుల దాడి గుడిపాల : మండలంలో ఏనుగులు మళ్లీ దాడి చేశాయి. ముత్తువాళ్లూరు, బట్టువాళ్లూరు గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పంట పొలాలపై శనివారం రాత్రి పడ్డాయి. ఆరేళ్ల వయసున్న కొబ్బరి చెట్లను మొదలు నుంచి పెరికేశాయి. సుమారు 60 కొబ్బరి చెట్ల దాకా ధ్వంసం చేశాయి. మరోపక్క మామిడి చెట్లను కూడా ధ్వంసం చేశాయి. మామిడి పూత వస్తున్న తరుణంలో ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా అటవీశాఖ అధికారులు ఏమి చేస్తున్నారని, ప్రతిరోజూ వచ్చి డ్రైవ్ చేయడమే కానీ ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరిమేసిన దాఖలాలు కనిపించలేదని రైతులు వాపోతున్నారు. అక్కడక్కడా అరటి పంటను కూడా ధ్వంసం చేశాయని తెలియజేశారు. ఏనుగులు పొలాల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మా ర్గాలు చూడాలని రైతులు వేడుకుంటున్నారు. -
సిద్ధార్థలో సందడే సందడి
– ర్యాంప్ వాక్తో ఆకట్టుకున్న శ్రీలీల నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆదివారం సినీ నటి శ్రీలీల, సంగీత దర్శకుడు తమన్ సందడి చేశారు. 12 రోజుల పాటు జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో చివరి రోజు ఆదివారం రాత్రి కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో హీరోయిన్ శ్రీలీల ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. రెండు గంటల పాటు తమన్ చేసిన సంగీత విభావరి అందరినీ మంత్రముగ్దులను చేసింది. -
ఫౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి
● కార్వేటినగరంలో ర్యాపిడ్ టీమ్ ఏర్పాటు ● కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఫౌల్ట్రీ రైతులు బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన ఆదివారం పశుసంవర్థక శాఖ, తదితర శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ కోళ్లు అధిక సంఖ్యలో మృతి చెందితే వెంటనే పశుసంవర్థకశాఖ అధికారులతోపాటు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు తెలియజే యాలన్నారు. ఏవీఎన్ ఇన్ఫ్లూయెంజా అనేది పక్షి నుంచి పక్షికి మాత్రమే వ్యాపిస్తుందన్నారు. ఇది పక్షులు, కోళ్ల నుంచి మనుషులకు వ్యాప్తి చెంద దని తెలిపారు. కార్వేటినగరం మండలంలో కోళ్ల మరణాలు సంభవించడంతో ర్యాపిడ్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్వేటినగరం మండలం ఆర్కే పేటలో పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాధి నిర్ధారణకు నమూనాలను సేకరించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్లో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యురిటీ అనిమల్ డిసీజెస్కు పంపినట్లు తెలిపారు. నివేదిక వచ్చే వరకు ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు, ప్రజలకు సూచనలు ఫౌల్ట్రీ ఫారం నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను కఠినంగా పాటించాలి. ఫౌల్ట్రీ లోపలికి బయటి వ్యక్తులను, వాహనాలను అనుమతించకూడదు. 17 మంది కోడి పందెం రాయుళ్ల అరెస్ట్ శాంతిపురం: కోడి పందేలు ఆడుతున్న 17 మందిని అరెస్టు చేసినట్టు రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని కర్లగట్ట–చామనపల్లి గ్రామాల మధ్య కోడి పందేలు ఆడుతున్నట్టు సమాచారం అందిందన్నారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ సహకారంతో పందేలు జరుగుతున్న ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో తనిఖీ చేపట్టినట్టు చెప్పారు. చింత చెట్ల తోపులో కోడి పందేలు జరుగుతున్నట్టు గుర్తించి దాడి చేశామన్నారు. 17 మందిని అదుపులోకి తీసుకుని కుప్పం కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. వారి నుంచి రూ.44,220లు, మూడు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు కుప్పం ప్రాంతంతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించామన్నారు. -
లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరగలేదు: జనసేన ఎమ్మెల్యే
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ‘ఎన్డీడీబీ, సిట్ నివేదికలలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు’ అని ఆయన స్పష్టంచేశారు. జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్తూ ఆ స్వామివారే ఆయన నోట పలికించారని నెటిజన్లు, జనం అభిప్రాయపడుతున్నారు. -
మొగిలి ఘాట్లో వాహనాలు ఢీ
– ఇద్దరికి గాయాలు బంగారుపాళెం : మండలంలోని మొగిలిఘాట్లో శుక్రవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు నుంచి చిత్తూరు వైపు పోతున్న పాల ట్యాంకర్ మొగిలి ఘాట్ మలుపు వద్ద ముందు పోతున్న ఐచర్ వాహనాన్ని ఢీకొంది. ఈక్రమంలో ఐచర్ వాహనం ముందు పోతున్న లగేజీ ఆటోను ఢీకొంది. దీంతో ఆటో రహదారిపై బోల్తా పడింది. అందులోని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుచేసుకోవడంతో బెంగళూరు నుంచి చైన్నె మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మాబూబాషా, హరీష్ను బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇదే స్ఫూర్తితో పనిచేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఉద్యోగి స్ఫూర్తిగా పనిచేసే తత్వం అలవరుచుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఈ– సైకిళ్ల పంపిణీలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. 24 గంటల వ్యవధిలో 5555 ఈ సైకిళ్ల పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయ్యేలా విధులు నిర్వహించిన డీఆర్డీఏ సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పనులు చేపట్టి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. ఈ సైకిళ్ల పంపిణీలో జిల్లా గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వకారణమన్నారు. ప్రజలకు పర్యావరణహిత రవాణా సాధనాలను అందించడమే లక్ష్యంగా వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛంద కార్యక్రమాలు, ముస్తాబు కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నా రు. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలను బలోపే తం చేయాలన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ చాటిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా ధ్రువీకరణపత్రం చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు సాహిత్య, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను అందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రం అందింది. శనివారం కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చేతుల మీదుగా తెలుగు సాహిత్య, సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు ధ్రువీకరణ పత్రం స్వీకరించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ధనంజయ, దర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి సంపులో పడి కార్మికుడి మృతి
బంగారుపాళెం : నీటిసంపులో పడి గ్రానెట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని కుప్పాలపల్లె వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పాలపల్లె సమీపంలో ఓ గ్రానెట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్కు చెందిన కార్మికుడు గౌతమ్(30) ఫ్యాక్టరీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ ఆవరణలో పనులు చేస్తూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద నీటి సంప్లో పడిపోయాడు. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో సంప్లో పడి ఉన్న గౌతమ్ను తోటి కార్మికులు చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టరు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమగ్రశిక్ష శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ 12(1) సి చట్టం ప్రకారం పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా ఒకటవ తరగతిలో అడ్మిషన్లు కల్పించడం జరుగుతుందన్నారు. 2026–2027 విద్యాసంవత్సరానికి గాను జిల్లాకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు నివాస ప్రాంతంలో సమీపంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలకు ఆన్లైన్లో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్సైట్లో ఈ నెల 20 వ తేదీ నుంచి మార్చి 10 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మార్చి 25 వ తేదీన మొదటి విడత లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తామన్నారు. ఇతర వివరాలకు 18004258599 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. సెమీ కండక్టర్ల హబ్గా భారత్ నారాయణవనం: రాబోవు రోజుల్లో భారత దేశం సెమీ కండక్టర్లకు, క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో కీలక పాత్ర ఇంజినీర్లదే ఉంటుందన్నారు. మేక్ ఇండియా, స్కిల్ ఇండియా నినాదాలతో ప్రారంభమయ్యే స్టార్టప్ కంపెనీలకు కేంద్రం ఊతమిస్తోందన్నారు. సెమీ కండక్టర్ల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు జరిగిందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం రూ.9 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. డీఆర్డీఓ శాస్త్రవేత్త రామమూర్తి మాట్లాడుతూ ఆలోచనే ఇంజినీర్లకు గుర్తింపు తీసుకువస్తుందన్నారు. పరిశోధలపై మక్కువ చూపి, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సినీనటి నిథి అగర్వాల్ హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమాలలో కళాశాలల చైర్మన్ అశోకరాజు, వైఎస్ చైర్మన్ ఇందిరవాణి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. -
సాంకేతికతపై అవగాహన పెంచుకోండి
–జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక చిత్తూరు అర్బన్ : సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు శ్రీఈ కోర్ట్ ప్రోగ్రాంశ్రీపై శనివారం నుంచి రెండు రోజుల శిక్షణను ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. సాంకేతికతపై అవగాహన పెంచుకుంటే కోర్టుల వ్యవహారాలను త్వరగా పూర్తి చేయవచ్చునన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్.కమలాకర రెడ్డి(జ్యుడిషియల్), హైకోర్టు రిజిస్ట్రార్ వి. శ్రీనివాస శివరామ్(విజిలెన్స్), కర్నూలుకు చెందిన సివిల్ జడ్జి దివాకర్(సీనియర్ డివిజన్)లు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తూ.. ఈ కోర్ట్పై వివరించారు. శిక్షణలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్, నాల్గవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
కుప్పానికేనా!
కొత్త పింఛన్లు అర్హులందరికీ సమన్యాయ పాలన చేయాల్సింది పోయి ప్రజలు, నియోజకవర్గాల మధ్య తారతమ్యం బాబు సర్కారు చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కానీ కుప్పం నియోజకవర్గానికి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికే ప్రత్యేక రూల్ అనే ధోరణిలో సర్కారు వ్యవహరిస్తోంది. రెండు ఏళ్ల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటికి రాజకీయ రంగు పులిమి తొలగించారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల కొత్త పింఛన్ల ఆవేదనపై ప్రత్యేక కథనం. -
ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి !
చిత్తూరు అర్బన్ : ‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పింది. అదే సుప్రీం కోర్టు నేతృత్వంలో ఏర్పడ్డ సీబీఐ–సిట్ కమిటీ తొమ్మిది నెలలు విచారించి శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వులు లేవని కోర్టుకు రాతపూర్వక నివేదిక ఇచ్చింది. ఇంకేం చెప్పాలి చంద్రబాబు నాయుడు..? మరేం రాయాలి..? మీ ప్రతిక ఒక్క మాటలో అసహనం, అభద్రత కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని హైందవ వ్యతిరేకిగా చూపిస్తూ, లడ్డూ అనే బాంబును ఆయుధంగా చేసుకుని వైఎస్సార్సీపీపై వేయడానికి పవన్ కళ్యాణ్, పచ్చ పత్రికలతో కలిసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మీకు గుణపాఠం తప్పక చెబుతారు’ అంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డితో కలిసి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. సిట్–సీబీఐ కోర్టుకు ఇచ్చిన నివేదికలో 32 మందిని కల్తీ నెయ్యిలో బాధ్యులుగా చూపిందని, ఇందులో ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేసిందన్నారు. పైగా జంతుకొవ్వులు లేవనే విషయాన్ని కూడా ప్రస్తావించిందన్నారు. ఈ నివేదికను జీర్ణించుకోలేని చంద్రబాబు తన కుట్రలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని.. ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త ఈ అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019–24 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపై విచారించిన సిట్.. 2014–19 మధ్యలో సరఫరా చేసిన నెయ్యిపై సైతం దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటపడుతాయన్నారు. టీటీడీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘటన వైఎస్.రాజశేఖర్రెడ్డి, అటుపై వైఎస్ జగన్కే సాధ్యమయ్యిందన్నారు. చిత్తూరులో అమలు కావడం సంతోషం జిల్లా అనుబంధ కమిటీల టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను కాపాడుకోవాలని వైఎస్.జగన్ చెబుతున్న 2.0 కార్యక్రమం.. చిత్తూరులో అమలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యం వైఎస్.జగన్ హయంలోనే జరిగిందన్నారు. పార్లమెంటు పరిశీలకులు చవ్వా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న తప్పుల్లో సింహభాగం బాధ్యత పవన్ కళ్యాన్దేన్నారు. ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నారన్నారు. తన శిష్యుడు రేవంత్రెడ్డి కోసం రాయలసీమ ప్రాజెక్టులకు తాకట్టుపెట్టిన వ్యక్తిగా బాబు చరిత్రకెక్కారన్నారు. జెడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ.. లడ్డూల విషయంలో బాబుకు తగిన శిక్ష శ్రీవారే విధిస్తారన్నారు. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారారని, వైఎస్సార్సీపీలో ఇక నుంచి కార్యకర్తలదే భవిష్యత్తన్నారు. గ్రామ కమిటీలు చెప్పిందే వైఎస్.జగన్ చేస్తారని, వాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు కెపి.శ్రీధర్, రూరల్ అధ్యక్షుడు జయపాల్, గుడిపాల అధ్యక్షులు ప్రకాష్, నాయకులు చంద్రశేఖర్, జ్ఞానజగదీష్, విజయసింహారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గాయత్రీదేవి, హరిణిరెడ్డి పాల్గొన్నారు. బహిరంగ సభకు హాజరైన పార్టీ శ్రేణులువిజయానందరెడ్డితో కలసి ప్రసంగిస్తున్న భూమన కరుణాకర రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతోందని భూమన అన్నారు. అమిత్ షా శిష్యుడు, ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు పాలక మండలి సభ్యుడు సౌరబ్ బోరా నాడు రూ.30 లక్షలు వెచ్చించి అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డూలు తీసుకెళ్లాడని, అతను లడ్డూల తయారీకి కల్తీ నెయ్యిను ఉపయోగించాడనే విషయం పవన్ కళ్యాణ్కు సైతం తెలుసన్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వులు లేవని, వైఎస్.జగన్కు ఇందులో సంబంధంలేని మాట్లాడిన పవన్కళ్యాణ్.. రెండు రోజుల్లో మళ్లీ కొవ్వులు కలిపారని, జగన్కు సంబంధం ఉందని చెప్పడం అబద్దాలతో రాజకీయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతూ.. -
విభిన్న ప్రతిభావంతుల ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల ప్రతిభ అమోఘమని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పూలే భవనంలో సమగ్రశిక్ష శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆర్ట్, సాంస్కృతిక పోటీ లు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పోటీలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీ మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగాల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఐన్స్టీన్, న్యూ టన్, లూయిస్ బ్రెయిలీ, హెలన్ కెల్లర్ తదితర ఉద్దండులైన వ్యక్తులు విభిన్న ప్రతిభావంతులేనని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఆర్ట్స్, సాంస్కృతిక పోటీల్లో విభిన్న ప్రతిభావంతులు తమదైన శైలిలో ప్రతిభ చాటారన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఈ కో ఆర్డినేటర్ మధు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు. విజేతలు ఇలా...... డ్యాన్స్ జూనియర్ విభాగంలో లోకేశ్వరి (కార్వేటినగరం) గీతిక (ఐరాల), దీక్షిత (గుడిపాల), సీనియర్ విభాగంలో చరణ్ (శాంతిపురం), వైష్ణవి (వెదురుకుప్పం), లాస్య (తవణంపల్లె) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. పాటల పోటీలో జూనియర్ విభాగంలో నరేష్ (రామకుప్పం), హారిక (ఎస్ఆర్పురం), సీనియర్ విభాగంలో జగదీష్ (ఎస్ఆర్పురం), జానుశ్రీ (పుంగనూరు), ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. చిత్రలేఖనం పోటీలో రేణుశ్రీ (గంగాధరనెల్లూరు), దీక్షిత (గుడిపాల), ఆనందన్ (నగరి), సీనియర్ విభాగంలో ఇందు (పుంగనూరు), వాసుదేవరెడ్డి (వెదురుకుప్పం), ఢిలీబాబు (తవణంపల్లె), పోస్టర్ మేకింగ్ పోటీలో మమత (పూతలపట్టు), జయశ్రీ. (గంగాధరనెల్లూరు), ప్రీతిక (నిండ్ర) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతియ బహుమతులు సాధించారు. -
పీఎస్హెచ్ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక
పుత్తూరు : మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ (పీఎస్హెచ్ఎం) ఫోరం తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పుత్తూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఫోరం కార్యదర్శి శ్రీనివాసులు, అసోసియేట్ ఉపాధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమగ్ర ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్లో చేపట్టనున్న బదిలీల్లో పీఎస్హెచ్ఎంలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి స్కూల్ అసిస్టెంట్స్గా నియమించాలని డిమాండ్ చేశారు. జనవరి 13న ప్రభుత్వం ఇచ్చిన మెమోను అందరికీ ఆమోదయోగ్యంగా సవరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమ బాట పడ తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.గోపి (ఏర్పేడు), అధ్యక్షుడిగా వి.వెంకటరమణ (నాగలాపురం), ప్రధాన కార్యదర్శిగా ఎస్.మధుసూదన్రాజు (తిరుపతి రూరల్), కోశాధికారిగా కె.నరేష్ (వడమాలపేట), మహిళా అధ్యక్షురాలుగా డి.గీర్వాణి (తిరుపతి రూరల్), అసోసియేట్ అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా మరి కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెరువులో మృతి చెందిన వ్యక్తి గుర్తింపు తవణంపల్లె: మండలంలోని టి.పుత్తూరు చెరువులో మృతి చెందిన వ్యక్తిని గుర్తించినట్లు తవణంపల్లె ఎస్ఐ డాక్టర్ నాయక్ తెలిపారు. ఎస్ఐ కథనం.. పూతలపట్టు మండలం, పాపానాయుడుపల్లెకు చెందిన జి.నందకుమార్నాయుడు(48) ఈ నెల ఒకటవ తేదీన తవణంపల్లెలో ఉంటున్న తన అన్న మొగిలప్పనాయుడు ఇంటికి వచ్చాడు. తర్వాత కూలి పనులకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మద్యం సేవించి కాలకృత్యాలు తీర్చుకోవడానికి టి.పుత్తూరు చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. శవం ఉబ్బి పోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. వెంకటరమణ, అధ్యక్షుడు గోపి, గౌరవాధ్యక్షుడు -
విజేతలు.. విభిన్న ప్రతిభావంతులు
చిత్తూరు కలెక్టరేట్ : విజేతలు విభిన్న ప్రతిభావంతులు అని సమగ్రశిక్ష శాఖ జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. ఆ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూలే భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్లో ప్రతిభను వెలికితీసేందుకు సాంస్కృతిక, పెయింటింగ్ పలు రకాల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. న్యూటన్, లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కిల్లర్ వంటి మేథావులు విభిన్న ప్రతిభావంతులే అయినప్పటికీ నూతన శకానికి నాంది పలికారన్నారు. వైకలాన్ని ఎదురించి మొక్కవోని దీక్షతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. డీఈవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వైకల్యం అంటేనే పెద్ద సవాలు అని అన్నారు. శ్రమిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల భవిత కేంద్రాల్లోని విభిన్న ప్రతిభావంతులు, జిల్లా సహిత విద్య కో–ఆర్డినేటర్ మధు సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు. -
సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి
ర్యాంప్పై మీనాక్షిచౌదరి క్రీడాకారులకు ట్రోఫీ అందజేస్తున్న మీనాక్షిచౌదరి నారాయణవనం: సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి సినీ నటి మీనాక్షి చౌదరి విద్యార్థులతో కలిసి సందడి చేశారు. కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్పోర్డ్స్డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సినీ నటి మీనాక్షిచౌదరి హాజరయ్యారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో గెలుపొందిన వారికి కృష్ణయ్య, మీనాక్షిచౌదరి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను, ట్రోపీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు శారీరకంగానూ, మానసికంగానూ ధృఢంగా ఉంటేనే చదువుపై దృష్టిని సారించే అవకాశం ఉంటుందన్నారు. సినీ నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. దేహ ధారుడ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ శనివారం పూర్వ విద్యార్థుల అలుమిని డే, ఆదివారం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సినీ హీరోయిన్స్ నిధి అగర్వాల్, శ్రీలీల, హీరో తేజా సజ్జా, తమన్ సంగీత విభావరి, నటరాజ్ ట్రూప్ నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. -
వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,82,25,471 ఆదాయం వచ్చింది. బంగారం 11 గ్రాములు, వెండి 910 గ్రాములుగా లెక్కగట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.17,200 నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.1,57,895, ప్రచార రథా నికి రూ.2,105 వచ్చింది. యూఎస్ఏవి 481 డాలర్లు, సింగపూర్వి 12 డాలర్స్, మలేషి యావి 1 రింగిట్స్, యూఏఈ 1,070 దిర్హా మ్స్, ఆస్ట్రేలియావి 20 డాలర్స్ , కెనాడా 10 డాలర్లు, ఇంగ్లాడ్ 15 పౌండ్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏఈవోలు వీంద్రబాబు, ప్రసా ద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాలుగు మద్యం బార్ల కేటాయింపు చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో లాటరీ పద్ధతిలో నాలుగు మద్యం బార్లను కేటాయించారు. చిత్తూరు నగరంలో మద్యం బార్ల నిర్వహణ కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా.. మంగళవారం చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరిగింది. ఇందులో నాలుగు బార్లను నిర్వాహకులు దక్కించుకున్నారు. ఫలితంగా జిల్లాలో మద్యం బార్ల సంఖ్య 11కు చేరింది. 2028– ఆగస్టు 31వ తేదీ వరకు మద్యం బార్లకు లైసెన్సులను కేటాయించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,655 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,003 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ఏనుగుల గాలింపు కోసం దారి
గుడిపాల మండలంలో ఏనుగుల గాలింపు కోసం అడవిలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర దారి ఏర్పాటు చేశారు. డాక్టర్ చీటి విలువ జీరో డాక్టర్ ప్రిస్క్రిప్షన్కు వి లువ లేకుండా పోయింది. ‘‘ఏ మందైనా ఇ స్తాం’’ అన్న ధోరణితో మెడికల్ షాపులు వ్యవహరిస్తున్నాయి. ఇది వై ద్యవృత్తికే మచ్చగా మారుతోంది. రోగులు అ డగ్గానే మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రా ణాంతకమైన నిద్రమాత్రలు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అది కూడా డాక్టర్ చీటీ లేకుండానే. డా క్టర్ ఒక మాత్ర రాస్తే మెడికల్ షాపుల్లో మరొకటి ఇచ్చి, అదే కాంబినేషన్ అని చెబుతారు. కాంబినేషన్ ఒకటే అయినా.. అది తక్కువ ధ ర, ఎక్కువ కమీషన్ ఇచ్చే మాత్ర అయి ఉంటుంది. ఇలా చాలా మందుల దుకాణాల్లో మో సాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతు న్నా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వ్యాపారులకు ఇదే బలంగా మా రింది. మొత్తంగా చూస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజారోగ్యం గాల్లో దీపంలా మారింది. ఔషధ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మాఫియా ముసుగులో పడి..తనిఖీలకు అంటిముట్టనట్టు తిరుగుతున్నారు. -
కిక్కుకు రెక్కలు!
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇష్టానుసారంగా మద్యం ధరలు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఎవరి ఇష్టం వాళ్లది. ఒక దుకాణంలో ఉన్న ధర, మరో దుకాణంలో ఉండడంలేదు. ఇదేమిటని అడిగితే ప్రభుత్వం ధరలు పెంచిదంటూ సమాధానం. అసలు ఎంత పెంచింది..? ఎంతకు విక్రయిస్తున్నారు..? వేటిపై ధరలు పెంచారు..? అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు. చిత్తూరు అర్బన్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మద్యం ధరల నియంత్రణను గాలికొదిలేశారు. అమ్ముకున్నోడికి అమ్ముకున్నంతగా పట్టించుకోవడం మానేశారు. ఇదే అదునుగా వ్యాపారులు మ ద్యం ధరలను పెంచేశారు. ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. కోట్లు ‘లూఠీ’ ‘వడ్డించేవాడు మనోడైతే చాలు..’ అన్నట్లు మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు ఏడాదిన్నరగా పెద్దగా లాభాలు రావడంలేదని భావించిన ప్రభుత్వం.. క్వార్టర్ బాటిల్పై రూ.10 పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చెప్పిందో లేదో.. జీవో రాకపోయినా పర్లేదు అన్నట్లు, వ్యాపారులు జిల్లాలో ధరలు పెంచేశారు. జీవో ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం పట్టగా.. అప్పటికే దాదాపు రూ.5 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక అప్పటి నుంచి రెండు జిల్లాల్లో మద్యం ధరలపై నియంత్రణ పట్టుతప్పింది. ఒక దుకాణంలో దొరికే ధర, మరో దుకాణంలో ఇవ్వడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అమ్ముకుంటున్నారు. ఫలితంగా రెండు జిల్లాల్లో మద్యం ప్రియుల నుంచి రోజుకు దాదాపు రూ.40 లక్షల వరకు దోచుకుంటున్నారు. ఇందులో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వాటాల్లేవంటే నమ్మశక్యం కావడం లేదు. అన్నింటిపై బాదుడే గత నెల 8న అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎకై ్సజ్ పాలసీలో పలు మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం తీసుకుంది. ఇందులో ప్రతి మద్యం బాటిల్పై రూ.10 పెంచడమనేది ప్రధాన నిర్ణయం. రూ.99 మద్యంకు ఇందులో మినహాయింపు ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ధరలు పెంచేశారు. ప్రతి క్వార్టర్ బాటిల్పై రూ.10 అక్రమంగా వసూలు చేయడం ప్రారంభించారు. బీర్ విక్రయాలపై ధరల పెంపు లేకపోయినా.. జిల్లాలో యథేచ్ఛగా ధరలు పెంచేసి దోచేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లపై రూ.20 – రూ.50 చొప్పున క్వార్టర్ బాటిల్పై వసూలు చేస్తున్నారు. ఐదు రోజులు తర్వాత జీవో వచ్చినా.. అప్పటికే మద్యం ప్రియుల నుంచి రూ.కోట్లు పిండుకున్నారు. విచ్చలవిడిగా ‘బెల్టు’.. తిమ్మిని బమ్మి చేస్తూ.. పెంచిన మద్యం ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులు ఇచ్చే సమాధానంతోనే మద్యం ప్రియులకు సగం కిక్కు దిగిపోయేలా ఉంటుంది. తొలుత ధరల పెంపు జీవో రాకమునుపే.. ‘ప్రభుత్వం ధరలు పెంచింది’ అని బోర్డు పెట్టి అదనంగా దండుకున్నారు. ఆపై జీవో అమల్లోకి వచ్చాక.. తీరా బాటిళ్లపై పాత ధరలు ఉన్న వాటిని కొట్టేసి, కొత్త ధరలు ప్రింట్ చేసి పంపిణీ చేస్తే.. బాటిళ్లపై పాత ధరను చెరిపేసి.. పెరిగిన ధరను ముద్రించారు. పెరిగిన ధర ముద్రించిన తర్వాత కూడా బాటిళ్లపై ఉన్న ధర కాదని అదనపు నగదు వసూలు చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ‘ప్రభుత్వం ధరలు పెంచింది’ అనే బోర్డు చూపిస్తున్నారు. వీటిపైనే ధరలు పెరిగాయంటూ అదనపు నగదు వసూలు చేస్తూ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొందరు వ్యాపారులు రోజుకు రూ.లక్షలు దోచుకుంటున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిగా వెలుస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 4 వేలకు పైగా బెల్టు దుకాణాలున్నట్టు సమాచారం. చిల్లర కొట్టు నుంచి కిరాణా దుకాణం వరకు ప్రతీ చోటా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రూ.20–రూ.50 అధిక ధరలకు బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేస్తున్నారు. వీటిల్లో లభిస్తున్న మద్యం ఏ బ్రాండు..? ఏ దుకాణం నుంచి వచ్చింది..? అసలు కల్తీనా..? అనే ప్రశ్నలకు ఎవ్వరి వద్దా సమాధానాలు దొరకడం లేదు. మద్యం కల్తీ కాకపోతే వాటిపై ఉన్న క్యూఆర్ ఆధారంగా అవి ఏ దుకాణానికి చెందినవో ఎక్సైజ్ అధికారులు గుర్తించి, రూ.లక్షల్లో జరిమానాలు విధించాలి. కానీ జిల్లాల్లో అలా జరగడం లేదు. వ్యాపారుల అక్రమంగా వసూలు చేస్తున్న దాంట్లో ఎకై ్సజ్శాఖలోని పలు పెద్ద తిమింగలాలతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులకు వెళుతోందనే ఆరోపణలు లేకపో లేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి. చిత్తూరు జిల్లాలో ఎకై ్సజ్ సూపరింటెండ్ ఫోన్–9492925832, తిరుపతి జిల్లాలో ఫోన్–9440902540 నంబర్లకు ఫిర్యాదు చేయండి. వీటితో పాటు టోల్ఫ్రీ నంబరు–14405కు కూడా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – విజయశేఖర్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ -
గుంతలను తప్పించబోయి..
– అదుపు తప్పి బోల్తాపడిన లారీ యాదమరి: గుడియాత్తం – చిత్తూరు రోడ్డు మార్గంలో గుంతలను తప్పించబోయి ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కాశీరాళ్ల వద్ద చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికుల వివ రా ల మేరకు.. తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి హైదరాబాద్కు రసాయనిక పదార్థాలతో పా టు ఇనుప బోరు పైపులు వేసుకుని అధిక సామర్థ్యంతో లారీ వెళుతోంది. ఈ క్రమంలో కాశీరాళ్ల బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే అసంపూర్తిగా ఉన్న మార్గంపై ఏర్పడిన గుంతలను తప్పించే యత్నంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శివకుమార్, క్లీనర్కు ఎటువంటి గాయాలు కా లేదు. కాగా ఈ మార్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేసి ప్రమాదాల ను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇరువర్గాల ఘర్షణ – బొమ్మనచేనులో పోలీసు బందోబస్తు యాదమరి: ఇరువర్గాల మధ్య నడుస్తున్న ఓ వివాదం ఘర్షణకు దారి తీసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధి బొమ్మనచేను గ్రామంలో గత కొంతకాలంగా వ్యక్తిగత కక్షల వల్ల రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. దీంతో పలువురికి చిన్నపాటి గాయాలయ్యాయి. డీఎస్పీ సాయినాథ్ ఆదేశాలతో సీఐ శ్రీధర్ నాయుడు, స్థానిక ఎస్ఐ ఈశ్వర్ రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. గ్రామంలో మళ్లీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఈశ్వర్ హెచ్చరించారు. జరిగిన సంఘటనపై ఫిర్యా దుల మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. -
● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మాత్రల విక్రయం ● చిత్తూరు, తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా మెడికల్షాపులు ● రిజిస్ట్రేషన్ లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో షాపులు ● ఆర్ఎంపీలు సైతం మాత్రల విక్రయాలు ● కాలం చెల్లి
ఆస్పత్రులే అక్రమాల అడ్డా.. ప్రైవేటు ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. చాలా వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఆవరణలోనే మెడికల్ షాపులను సైతం ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు నగరం, జీడీనెల్లూరు, పలమనేరు, కుప్పం, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి, సత్యవేడు, పుత్తూరు తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా మెడికల్ షాపులు టేర్పాటు చేసుకున్నారు. రోగి బ యటకు అడుగు పెట్టకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. ఒకే ఆస్పత్రిలో పరీక్షలు, ప్రిస్క్రిప్షన్, మందుల అమ్మకం మూడు ఒకే చోట జరుగుతున్నా, నియంత్రణ మాత్రం శూన్యం. -
మేం భూములు ఇవ్వలేం
కుప్పం: పరిశ్రమలకు భూములు ఇవ్వలేమని పలార్లపల్లి గ్రామస్తులు తహసీల్దార్ చిట్టిబాబుకు తేల్చిచెప్పారు. శుక్రవారం పలార్లపల్లి గ్రామంలో గ్రమసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ లెక్క దాఖలాలో 18 ఎకరాల ప్రభుత్వ భూమి పరిశ్రమలకు ఎంపిక చేశారు. ఇంకా 12 ఎకరాల పట్టా భూమి కావాల్సి ఉందని తహసీల్దార్ రైతులకు సూచించారు. దీనిపై రైతులు మాట్లాడుతూ ఇప్పటికే వందలాది ఎకరాల భూములు ఇచ్చామని, ఇక మిగిలిన కొద్ది పాటి భూములు ఇస్తే తమ జీవనాధారం ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తాము భూములు కోల్పోతే ఎలా బతకాలని నిట్టూర్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని ఖరాకండీగా చెప్పారు. దీంతో తహసీల్దార్ అక్కడి నుంచి వెళ్లి పోయారు. -
విరబూసిన ఆశలు!
ఆశాజనకంగా మామిడి పూత పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. సుమారు లక్షన్నర ఎకరాల్లో సాగవుతోంది. ఏటా జనవరిలో పూత వికసించి పక్వానికి రావడం ఆనవాయితీ. ఈ యేడు జనవరిలోనూ పూర్తి స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత సైతం మంచు ఉండడంతో కొన్ని తోటల్లో మగ్గి రాలిపోయింది. అధికారుల సూచనల మేరకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో జనవరి మూడో వారం నుంచి పూత రావడంతో పాటు పిందె కడుతున్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ దశలోనూ మామిడి రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన జగ్రత్తలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. మార్కెటింగ్పై చొరవ చూపాలి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడిలో చిక్కదనం (బ్రిక్స్) శాతం ఎక్కువగా ఉంటుంది. 8 నుంచి 12 శాతం వరకు చిక్కదనం ఉన్న కారణంగా చిత్తూరు మామిడికి డిమాండ్ ఎక్కువ. ఉద్యానవన శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఎగుమతులు చేయడానికి అవకాశాలు ఎక్కువ. గల్ఫ్ దేశాలైనా సౌదీఅరేబియా, యూఏఈ, కువైట్ దేశాలతో పాటు ఈ ఏడు చైనాకు ఫల్ప్ అందిస్తే 60 శాతం వరకు ఎక్స్పోర్టు చేసేందుకు అవకాశం ఉంటుంది. మల్టినేషనల్ కంపెనీలైన పార్లె, బ్రిటానియా, ఐటీసీ కంపెనీల నుంచి ముందుస్తు మార్కెటింగ్కు అధికారులు చొరవ చూపాల్సి ఉంది. ఇలా చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర సులభంగా అందించడానికి అవకాశం ఉంది. చెర్లోపల్లిలో మందులు పిచికారీ చేస్తున్న రైతు కళ్యాణపురంలో విరగబూసిన మామిడి పూత -
ఏనుగుల హల్చల్
వెదురుకుప్పం: మండలంలోని తిప్పినాయుడుపల్లె గ్రామ పరిసరాల్లో జంట ఏనుగులు హల్చల్ చేశా యి. శక్రవారం ఉదయం శ్రీరంగరాజపురం మండలంలోని మంగుంట, పిల్లిగుండ్లపల్లె అటవీ ప్రాంతాల మీదుగా మండలంలోకి ప్రవేశించాయి. ఉద యం గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొలాల గుండా అడుగులు వేస్తూ పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులు వచ్చాయన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా రు. దీంతో ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. గ్రామం పక్కనే ఉన్న ముళ్ల పొదల మాటున నిలిచిపోయాయి. విషయం తెలియడంతో వెదురుకుప్పం ఎస్ఐ నవీన్బాబు, ఎంపీడీఓ పురుషోత్తం, తిప్పినాయుడుపల్లె సర్పంచ్ రాజశేఖర్రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి ఏనుగుల నియంత్రణకు మార్గాలను అన్వేషించారు. ఏనుగుల సంచారంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు తిప్పినాయుడుపల్లె గ్రామ పరిసర ప్రాంతాల్లోకెళ్లి గ్రామాల మీదకు రానీయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి నుంచి కదలకపోవడంతో అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. సాయంత్రం దాటాక టపాకాయలు పేల్చి అటవీ ప్రాంతాలకు తరిమేస్తామని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి తరుముతున్నా మళ్లీ అదే స్థానానికి వచ్చి చేరుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఒంటరి ఏనుగు హల్చల్ గంగవరం: మండలంలో కీలపట్ల బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఒంటరి ఏనుగు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కీలపట్ల, కెసి.పెంట, మేలుమాయి, కొత్తపల్లి, కల్లుపల్లి, బూడిదపల్లి ప్రాంతాల్లో సంచరిస్తోంది. రాత్రి వేళ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నట్టు రైతులు పేర్కొన్నారు. గురువారం రాత్రి బూడిదపల్లి గ్రామం ఆనుకుని మామిడి తోపులో ఏనుగును గమనించిన స్థానికులు ఫారెస్ట్ సిబ్బంది సాయంతో టపాసులు పేల్చి అక్కడి నుంచి తరిమేశారు. అక్కడి నుంచి రాయలపేట అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్టు అటవీ సిబ్బంది చెబుతున్నారు. శుక్రువారం కెసి.పెంట అటవీ సరిహద్దులోని పులిఈతవంక దగ్గర ఒంటరి ఏనుగు ఉన్నట్టు పశువుల కాపరులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మధ్య తరచూ ఇదే ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తుండడంతో రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ముసలమడుగు ఎలిఫ్యాంట్ క్యాంప్ వద్ద కుంకీ ఏనుగుల సాయంతో ఒంటరి ఏనుగును దారి మళ్లించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోయేంతవరకు పట్టించుకోరా..? అంటూ ఫారెస్ట్ అధికారులపై మండిపడుతున్నారు. పంటలకు భారీ నష్టం జంట ఏనుగులు రాత్రికి అక్కడే ఉంటే ప్రాణ నష్టంతో పాటు పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి చొరబడితే ఇళ్లను ధ్వంసం చేసి మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అదేవిధంగా బొమ్మయ్యపల్లె గ్రామా నికి చెందిన రైతులు వందల ఎకరాల్లో సాగు చేసిన పంటలను ధ్వసం చేసే ఆస్కారం ఉందంటున్నారు. వరి, చెరుకు, వేరుశనగ పంటలను ధ్వంసం చేస్తే లక్షల ఎకరాల్లో నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కౌండిన్య, మోర్థానలో.. వీరప్పన్లు!
మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకి కర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపు సాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు. ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా? ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మగ ఏనుగులకు మాత్రమే దంతాలుపలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్రేంజ్ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యం దాదాపు 250 చ.కి.మీగా ఉంది. ఇందులో సుమారు వంద దాకా ఏనుగులున్నాయి. ఇక ఇదే అడవికి ఆనుకొని ఉన్న మోర్థా నా రేంజ్ 130 చ.కి.మీగా ఉండగా ఇందులో 26 దాకా, కృష్ణగిరి, మైసూరు జిల్లాలో 320 చ.కిమీ విస్తీర్ణలో 46 దాకా ఏనుగులున్నట్టు తెలుస్తోంది. వీటిలో మగ ఏనుగులు (టస్కర్స్) 27 దాకా ఉన్నట్టు సమాచారం. ఇందులో కొన్ని మదపుటేనుగులు కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని దాటి భాకరాపేట అడవుల మీదుగా శేషాచలం అడవుల్లోనూ సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అటు తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం ఫారెస్ట్లోని మోర్థాన ప్రాంతం, క్రిష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్గట్టల నుంచి తరచూ కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. జిల్లాలో మొత్తం 12 మదపుటేనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు మాత్రమే ఉన్నాయి.విదేశాల్లో భలే డిమాండ్ చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది.తాజాగా తమిళనాడులో... కౌండిన్య అభయారణ్యానికి ఆనుకొని ఉన్న తమిళనాడులోని మోర్థాన ఫారెస్ట్లో గత డిసెంబర్ 4న మూడు ఏనుగుల కళేబరాలు భయపడ్డాయి. వీటిలో మదపుటేనుగు దంతాలు కనిపించకపోవడంతో అక్కడి ఫారెస్ట్ అధికారులు శోధిస్తుండగా నాలుగురోజుల క్రితం గుడియాత్తంలో ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారిని విచారించగా తమకు పలమనేరు మండలంలోని ఓ వ్యక్తి ద్వారా వచ్చాయనే విషయం వెలుగుచూసింది. -
వీరప్పన్లు!
కౌండిన్య, మోర్థానలో..మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. రాష్ట్ర సరిహద్దులో పేట్రేగుతున్న ఏనుగు దంతాల స్మగ్లర్లు -
మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని ఎస్పీ తుషార్డూడి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభు త్వ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ నేటి యువతే రేపటి దేశ భవిష్యత్ అని అన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడితే వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజం, దేశం నష్టపోతుందన్నారు. మత్తు పదార్థాలు క్షణిక ఆనందం మాత్రమే ఇస్తాయని, కానీ జీవితాంతం వెంటాడే నష్టాన్ని మిగులుస్తాయన్నారు. డగ్స్ వద్దు–డ్రీమ్స్ కావాలి అనే నినాదాన్ని ప్రతి విద్యార్థి తన జీవిత సూత్రంగా మార్చుకోవాలన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది అక్రమ రవాణాదారులు మోసపూరిత మార్గాల్లో డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో తనిఖీ చేయగా స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో పొగాకు ఉత్పత్తులు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. చిన్న వయస్సులో ఇలాంటి అలవాట్లు మొదలైతే భవిష్యత్లో మరింత ప్రమాదకరమైన మత్తు పదార్థాల వైపు వెళ్తారన్నారు. అనంతరం పరీక్షల్లో రాణిస్తున్న, క్రీడాపోటీల్లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ తరుణ్పహ్వా, ఇంటర్మీడియట్ డీఐఈవో రఘుపతి, పీసీఆర్ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్, డీఎస్పీ సాయినాథ్, సీఐలు మహేశ్వర, ఉమామహేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు చిట్టిబాబు పాల్గొన్నారు. -
ఆహాకారం!
పాఠశాలల్లో..చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1,42,098 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు తీరు అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సరైన వసతులు లేక ఇరుకై న గదులు, కట్టెల పొయ్యితో వంట కార్మికులు సైతం అగచాట్లు పడుతున్నారు. చాలా పాఠశాలల్లో అసలు వంట గదులు లేవు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తదితర పాఠశాలల్లో ఇళ్ల నుంచి వంట వండుకుని తీసుకొచ్చి పెడుతున్నారు. వంట సామగ్రి, బిల్లులు సకాలంలో అందక వంట కార్మికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పర్యవేక్షణ లోపం మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్న సమయంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, అధికారుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. కానీ పర్యవేక్షణ చేసే సమయం కూడా తమకు ఉండడం లేదని పలువు రు హెచ్ఎంలు వాపోతున్నారు. వండుతున్న కార్మికులకు సైతం జీతాలు తక్కువగా ఇస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని శాఖల అధికారులు నిత్యం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరు పర్యవేక్షించేవారు. ఆ సమయంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని వెంటనే సరిదిద్దేవారు. చంద్రబాబు పాలనలో మధ్యాహ్న భోజన పథకానికి పేరు మార్చి చేతులు పైకెత్తేశారు. గుర్తించిన సమస్యలు ఇవే చిత్తూరు జిల్లాలో గురువారం మధ్యాహ్నభోజనం అమలు తీరు సమాచారంజిల్లాలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పాలకులు, అధికారులు గాలికొదిలేశారు. పేద బిడ్డలే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ‘పెట్టిందే మెనూ..నోరు మూసుకుని తిను’అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నాసిరకం కూరలు, ముద్దకట్టిన అన్నం తినలేక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకుంటుండగా.. మరికొందరు పస్తులతో పొట్టలు మాడ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ‘సాక్షి’ విజిట్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా సమాచారం గురువారం మధ్యాహ్న భోజనం అమలు ఇలా నాసిరకంగా మధ్యాహ్న భోజనం నాణ్యత లోపమే.. అసలు సమస్య మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండడమే అస లు సమస్యగా మారింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు బడికొచ్చినా భోజనం చేయకుండా కడుపులు మాడ్చుకుంటున్నారు. నాణ్యత లేని కూరగాయలు, పప్పు, కోడిగుడ్లు ఇతర వంట సామగ్రిని వినియోగిస్తున్నారు. ఉడకని అన్నం.. నీళ్ల సాంబారు ఉంటుండడంతో మీ పిల్లలకై తే ఇలానే పెడతారా..? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మెనూ అమలు ఎక్కడ? జిల్లాలోని చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో మెనూను సరిగ్గా అమలు చేయడం లేదు. ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు సమాధానం చెప్పడం లేదు. నాణ్యత బాగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్లు తీసుకెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేదు. – సద్దాం, చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్, జేఏసీ చైర్మన్ పక్కాగా అమలు చేస్తున్నాం మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. ఎటువంటి సమస్యలున్నా అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. వంట చేసే కార్మికులకు నిత్యం ఆదేశాలిస్తున్నాం. పాఠశాలలో వంట చేసే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశిస్తున్నాం. – రాజేంద్రప్రసాద్, డీఈవో, చిత్తూరు. -
బడుల్లో సౌకర్యాల కల్పనకే ‘విద్యాంజలి’
రొంపిచెర్ల : విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడమే విద్యాంజలి ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా డీవైఈఓ ఇందిర అన్నారు. ఆమె గురువారం రొంపిచెర్ల బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యాంజలి పథకం ద్వారా పాఠశాలలకు అవసరమైన వసతులను దాతల నుంచి సేవా కార్యక్రమాల రూపంలో ఏర్పాటుచేసి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుందన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రయాణాల పెంపునకు సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దాతలు తమకు తోచిన రీతిలో పాఠశాలలకు సహకారం అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అమర్శేఖర్, రవీంద్రనాథ్, సుజాత, రెడ్డిప్రదీప్, చిన్నయ్య, ధనలక్ష్మి, హరినాయక్, రెడ్డి రమేష్, వెంకటరమణా రెడ్డి, సీఆర్ఎంటీ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు
మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభకు హాజరైన పార్టీ శ్రేణులుచలో పోతిరెడ్డిపాడుకు పార్టీ శ్రేణులతో కలిసి వెళుతున్న భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని పార్టీ నేతలు, శ్రేణులు నిర్వహించారు. చంద్రబాబు నీచ రాజకీయాలతో రాయలసీమకు చేస్తున్న తీవ్ర నష్టం, రాయలసీమ హక్కుల కోసం పోరాడేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కొరముట్ల శ్రీనివాసులు, వెంకటేగౌడ్, సునీల్కుమార్, ఎమ్మెల్సీ భరత్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, విజయానందరెడ్డి వందల వాహనాల్లో వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. – తిరుపతి మంగళం -
ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా?
ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గురువారం సంకటహరచతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చా రు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సా యంత్రం 5 నుంచి 6గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతానిన జరిపించారు. స్వర్ణ రథంపై చిద్విలాసం స్వయంభు శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై కటాక్షించారు. భక్తులు కర్పూర హారతులతో స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ మోహన్, ఏఈఓ రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పనులు ఆశించిన వేగంగా జరగడం లేదని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఎస్ఈ కార్యాలయంలో నిర్మా ణ, ఎంఆర్టీ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 421 ఫీడర్లపరంగా ఆర్డీఎస్ఎస్ పనులు చేయాల ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాగా ఇప్పటి వరకు 200 ఫీడర్లు మాత్రమే పూర్తి చేసినట్టు వెల్లడించారు. మార్చిలోపు మిగిలిన ఫీడర్ల పనులు చేయడం కష్టంగా మారిందన్నారు. పనులు వేగంగా చేయడానికి అదనపు సిబ్బందిని పెట్టుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వ, వాణిజ్య సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగింపు పను లు పూర్తిచేశారన్నారు. నివాస సర్వీసులపరంగా 200 యూనిట్లు దాటినవారికి మీటర్ల ఏర్పాటు వేగవంతంగా చేయాలన్నారు. గత నెలలో జిల్లాలో 590 ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులయ్యాయని, వేసవిని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈఈలు మునిచంద్ర, సురేష్, శ్రీనివాసమూర్తి, భాస్కర్నాయుడు, ఏఓ బాలు పాల్గొన్నారు. -
ప్రశ్నార్థంగా గజరాజుల మనుగడ
పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ా ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకికర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపుసాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు.విదేశాల్లో భలే డిమాండ్చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది. -
ఆటోను ఢీకొన్న కంటైనర్
– ఇద్దరికి గాయాలు బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్లో గురువారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై లగేజీ ఆటోను కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పలమనేరు నుంచి బంగారుపాళెంకు టమాట లోడ్డులో వస్తున్న లగేజీ ఆటోను మొగిలి ఘాట్ వద్ద బెంగళూరు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజ, అర్షద్ఆలీ గాయపడ్డారు. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బతికుండగానే కూతురికి పిండ ప్రదానం
శ్రీరంగరాజపురం: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ తండ్రి.. వెంటనే బంధువులను పిలిచి తన కూతురు చనిపోయిందని కర్మక్రియలు జరిపించాడు. పిండం పెట్టి.. నలుగురికీ భోజనాలు పెట్టాడు. ఎస్ఆర్ పురం మండలంలో గురువారం వెలుగు చూసిన ఈ ఘటన సంచలనం కలిగించింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీరంగరాజపురం మండలం పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన ఉష, సుబ్రమణ్యంరెడ్డి దంపతుల రెండో కుమార్తె హేమప్రియ తిరుపతిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కిషోర్, హేమప్రియ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి తమ ప్రేమ సంగతి ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందామని భావించింది.విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు ఒప్పుకోకపోవడంతో బుధవారం కిషోర్, హేమప్రియ ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. సుబ్రమణ్యం రెడ్డి దంపతులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. గురువారం బంధువుల సమక్షంలో తమ చిన్నకుమార్తె చనిపోయిందని, ఆమె చిత్రపటం ఏర్పాటు చేసి పిండం సమర్పించి విందు భోజనం పెట్టి కర్మక్రియలు చేసుకున్నారు. -
పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రుల పాత్ర కీలకం
నారాయణవనం: పిల్లలకు క్రమశిక్షణతోపాటు ఉజ్వ ల భవిష్యత్తును అందివ్వడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని పలువురు పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబ్లీ వేడుక ల్లో భాగంగా గురువారం పేరెంట్స్డే నిర్వహించా రు. విద్యార్థులతోపాటు వారి తల్లితండ్రులకు ఆట ల పోటీలను నిర్వహించారు. టాపర్లకు తల్లిదండ్రులతో జ్ఞాపికలను అందజేశారు. మధ్యాహ్నం ఓపెన్ ఆడితోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త జొన్నవిత్తుల రాఘవశర్మ ‘విద్యార్థి వ్యక్తిత్యాన్ని తీర్చి దిద్దడంతో సనాతన ధర్మం పాత్ర ’పై ప్రవచించారు. పురాణాల నుంచి ఒక్కో అంశాన్ని మనం నేర్చుకుని అనుసరించాలన్నారు. సాయింత్రం ఓపెన్ ఆడితోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతితిగా పాల్గొన్న జేఎన్టీయు ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ యువ ఇంజినీర్లకు టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతేనే తమ కేరీర్ను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. కళాశాలల చైర్మన్ అశోకరాజు, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. లోన్ ఇవ్వలేదని.. పలమనేరు: తనకు అన్ని అర్హతలున్నా అధికారులు రుణం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ స్థానిక వెలుగు కార్యాలయం వద్ద వంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానంటూ బెదిరించింది. ఈ ఘటన గురువారం పలమనేరులో చోటుచేసుకుంది. మండలంలోని నడిమికల్లాడు గ్రామానికి చెందిన భవాని ఎస్హెచ్జీలో సరోజమ్మ సంఘ సభ్యురాలుగా ఉంది. ఈ గ్రూపులో ఈమెకు రూ.లక్ష రుణంగా మంజూరైంది. అయితే అదే గ్రూపులోని ఇతర సభ్యుల కారణంగా బాధితురాలికి రుణం అందకుండా పోయింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఇక్కడి కార్యాలయం వద్ద తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. -
ఎంపీపీ ఎన్నిక వాయిదా
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోట ఎంపీపీ ఎన్నిక గురువారం కూడా వాయిదా పడిందని అధికారులు తెలిపారు. ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఆ కేటగిరిలో ఎంపీటీసీలు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఎన్నిక వాయిదా వేశామన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. తదుపరి ఎన్నిక జరిగే వరకు ప్రస్తుతం ఉన్న వైస్ ఎంపీపీ ఇన్చార్జిగా యథావిధిగా కొనసాగుతారన్నారని తెలిపారు. ‘పది’ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ ఫీజు చెల్లించేందుకు తత్కాల్ అవకాశం కల్పించారు. గురువారం డీఈవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మార్చిలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్తో ఈ నెల 12వ తేదీ లోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఈనెల 12వ తేదీలోపు నామినల్ రోల్స్ను అప్లోడ్ చేయాలన్నారు. నిర్ణీత పబ్లిక్ ఫీజుతో పాటు అదనంగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయంలోని పరీక్షల విభాగంలో సంప్రదించాలని ఆయన కోరారు. సమాజ భాగస్వామ్యం కీలకం యాదమరి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యాప్రమాణాల మెరుగు కోసం సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. డీఈఓ మాట్లాడుతూ విద్యాంజలి 2.0 పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వదలిచిన వారు ఆయా పాఠశాలల్లో సంప్రదించాలన్నారు. ఎంఈఓ – 2 ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాకు 400 మెట్రిక్ టన్నుల యూరియా చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాకు శుక్రవారం 400 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళితెలిపారు. ప్రస్తుతం ఉన్న నిల్వను పకడ్బందీగా పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా సరఫరా కానున్న యూరియాను కూడా సచివాలయాల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పెళ్లి చూపులని మోస పోయాడు! చిత్తూరు రూరల్ (కాణిపాకం): పెళ్లిచూపుల కోసం ఓ యువకుడు ఆన్లైన్ అన్వేషణలో పడ్డా డు. మ్యాట్రీమోనీ ద్వారా యువతి కోసం వెదికా డు. అలా ఆన్లైన్లో పరిచయమైన ఓ యువతి.. చివరకు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసగించింది. రూ.3.8 లక్షల వరకు దారబోసుకున్న యువ కుడు.. చివరకు మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశా రు. ఎస్ఐ అశోక్కుమార్ వివరాల మేరకు... చి త్తూరు మండలం, పెద్దిశెట్టిపల్లి గ్రామానికి చెంది న మునిక్రిష్ణ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా డు. ఇతడు ఆన్లైన్ ద్వారా మోట్రీమోనీలో పెళ్లి చూపులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో డిసెంబర్ 25వ తేదీన ఓ యువతి పరిచయమైంది. ఆ యువతి ఫొటోలు పెట్టడంతో పూర్తిగా నమ్మేశాడు. వాట్సాప్ ఫొటోలు, వీడియోకాల్తో పరి చయం కాస్త గట్టి పట్టింది. మెల్లగా ఆ యువతి యువకుడిని ఆన్లైన్ ట్రేడింగ్లోకి దింపింది. ఆ యువకుడు యువతికి విడతలగా వారీగా రూ.3.8 లక్షల వరకు పంపాడు. చివరకు మోస పోయామని తెలుసుకున్న మునిక్రిష్ణ సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసు కేసు నమోదు చేశారు. కాగా ఈ యువకుడు గతంలో ఓ సారి మోసపోయినట్లు సమాచారం. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 68,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,764 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది.ఙ -
కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
చిత్తూరు అర్బన్: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని మహిళ చెప్పడంతో వృద్ధురాలిని హత్య చేయబోయాడు ఓ బాలుడు. చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరం, గిరింపేటకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు స్థానికంగా నివాసం ఉంటున్న 37 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్లయి, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాలుడితో ఉన్న బంధం కారణంగా తరచూ ఇంట్లో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపేయాలని ఆ మహిళ, బాలుడికి అతను చెప్పడంతో బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రేరేపించిన మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. -
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు
తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల క్రాస్ రోడ్ వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి వినుకొండకు వెళుతున్న ఈ బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కోరలు చాచిన ముఠా!
పలమనేరు: ఏనుగులకు రక్షణ లేకుండా పోతోంది. అడవి దాటితే చాలు స్మగ్లర్లు వేటాడేస్తున్నారు. దంతాలు కోసి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇలాంటిదే ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. ఓ ముఠా ఏనుగు దంతాలను విక్రయిస్తుండగా అక్కడి ఫారెస్ట్ అధికారులు రెండ్రోజుల క్రితం కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో పలమనేరు మండలం, అటవీ సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కీలకంగా ఉన్నట్టు బయటపడింది. తమిళనాడు ఫారెస్ట్ అధికారులు ఇక్కడున్న అటవీశాఖ అధికారుల ద్వారా ఏనుగు దంతాల కేసులో కీలక వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. ‘మోర్థన’లో ఏం జరిగింది? తమిళనాడుకు ఆనుకుని ఉన్న మోర్థాన ఫారెస్ట్లో గతేదాడి డిసెంబర్ 4న పేర్నాంబట్, అరట్ల, చెత్తపెంట గ్రామాలకు సమీపంలోని కొండపల్లి కుంట వద్ద ఓ మదపుటేనుగు, ఆడ ఏనుగు, ఓ పిల్ల ఏనుగులకు చెందిన కుళ్లిన మృతదేహాలను గుడియాత్తం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వారు పరిశీలించగా మూడు వారాల క్రితం అవి మృతి చెందినట్టు అర్థమైంది. ఈ ఏనుగులు పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో జూ అధికారులు అక్కడే పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మగ ఏనుగుకు దంతాలు కోసివేసినట్టు గుర్తించారు. ఇది వేటగాళ్ల పనేనని భావించి.. అప్పటి నుంచి దీనిపై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగు దంతాలను విక్రయిస్తుండగా ఓ ముఠాను తమిళనాడు ఫారెస్ట్ అధికారులు పట్టుకొని విచారిస్తున్నారు. గతంలోనూ.. గతంలోనూ గుడిపాల మండలంలో ఏనుగు దంతాలను విక్రయించే కొందరిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా ఇప్పుడు పలమనేరు అటవీ ప్రాంత వాసి పేరు వెలుగులోకి రావడంతో తమిళనాడు ఫారెస్ట్ అధికారులతో కలసి ఇక్కడి అధికారులు నిందితుడ్ని పట్టుకొనే పనిలోపడ్డారు.అది నిజమే! ఈ ఘటన తమిళనాడులోని మోర్థాన ఫారెస్ట్లో జరిగింది. ఏనుగు దంతాల కేసులో ఇక్కడి వ్యక్తి ప్రమేయం ఉండడంతో అక్కడి ఫారెస్ట్ అధికారులకు సాయం చేస్తున్న మాట నిజమే. – సుబ్బరాజు, చిత్తూరు డీఎఫ్వో -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
బంగారుపాళెం: రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుని సీమ కు ద్రోహం చేశారని పూతలపట్టు నియోజకవర్గ సమస్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ ఆరోపించారు. బుధవారం బంగారుపాళెంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా నివాసంలో పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలతో కలసి ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమా ర్, లలితకుమారి మాట్లాడారు. రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలన్న బృహత్తర సంకల్పంతో నాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎత్తిపోతల పఽథకాని రూపకల్పన చేశారన్నారు. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతు సంక్షేమమే ధ్యేయంగా 2002లో పథకాన్ని ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలతో రైతుల ఆశలను నీరుగార్చేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇది సీమ ప్రజలకు చేసిన తీవ్ర అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ఈ పథకాన్ని అడ్డుకుంటున్నారన్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ను తెలంగాణకు తాకట్టు పెట్టాలనిచూస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీమ ప్రజలు, రైతుల శ్రేయస్సు, హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ అవిశ్రాంతంగా పోరాడుతుందని, ఈ దిశగా 5వ తేదీ నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పాలఏకరి రాష్ట్ర అధ్యక్షుడు కుమార్రాజా, సింగిల్విండో మాజీ చైర్మన్ దత్తాత్రేయరెడ్డి, సీనియర్ నాయకులు థామస్, కృష్ణమూర్తి, సర్పంచులు వాణిప్రియ, శ్రీనివాసులు, ఉపసర్పంచ్ కామరాజు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కిషోర్కుమార్రెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఫిరోజ్, కార్యదర్శి రఘుపతిరాజు, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాకీర్, శైలేష్, మహేంద్ర, సుధాకర్రెడ్డి, పరదేశి, జగదీష్, సుబ్రమణ్యం, హరి, ముబారక్, రఘు, ఖాదర్బాషా, హిద్దు, కుట్టి, బాబు, వెంకటప్ప, సన్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయాల విలువలు పెంచండి
నారాయణవనం: భవిషత్తుకు దారి చూపే వృత్తి విద్యలతో సమానంగా కుటుంబ, దేశ సంప్రదాయాలకు విలువలు పెంచేలా యువ ఇంజినీర్లు కృషి చేయాలని అశోకరాజు అన్నారు. సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా బుధవారం ట్రెడిషనల్(సంప్రదాయ) డే నిర్వహించారు. చైర్మన్ నుంచి విద్యార్థులు వరకు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో కళాశాలకు విచ్చేశారు. అధ్యాపకులకు విద్యార్థులకు తంబోల, ఫొటో కాంపిటీషన్, మిస్టర్ అండ్ మిసెస్ పోటీలను నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి షీల్డ్లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ పూర్వం మన పెద్దలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించారని తెలిపారు. ఆధునిక, పాశ్చాత్య దేశాల పోకడలతో సంప్రదాయాల విలువలు తగ్గుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక, నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
వడమాలపేట (పుత్తూరు): తిరుపతి– చైన్నె జాతీయ రహదారి, పాదిరేడు బైపాస్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణపాలయ్యాడు. వడమాలపేట మండలం, పాదిరేడు గ్రామానికి చెందిన ఎ.గంగయ్య(55) మోటర్ సైకిల్పై బైపాస్ రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చైన్నెకి వెళ్తున్న తమిళనాడుకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జ్యూస్ బాటిల్ కొనుగోలు చేస్తున్నట్టు నటించి.. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. గిరింపేటలోని శ్రీనగర్ కాలనీ వద్ద సరోజమ్మ అనే మహిళ చిన్నపాటి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి హెల్మెట్లు వేసుకున్న ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. జ్యూస్ బాటిల్ కొనుగోలు చేసినట్లు నటించి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. మహిళ కింద పడడంతో ఆమె మెడ వద్ద గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు ఎస్ఐలకు పోస్టింగులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు జిల్లాలో ముగ్గురు ఎస్ఐలకు పోస్టింగులు ఇస్తూ ఎస్పీ తుషార్డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. వేకెంట్ రిజర్వు (వీఆర్)లో ఉన్న శ్రీనివాసులును పెనుమూరుకు, వెంకటరమణను చిత్తూరు తాలూకకు, పెనుమూరులో ఉన్న వెంకట నరసింహను చిత్తూరు వన్టౌన్కు బదిలీ చేశారు. జిల్లాలో 2,442 టన్నుల యూరియా చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 2,442 టన్నుల యూరియా నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. ఆర్బీకే పరిధిలోనే ఈ యూరియాను అధికంగా ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. గురువారం మరో 400 టన్నుల యూరియా రానుందన్నారు. ఆ యూరియాను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు అందేలా చూస్తామన్నారు. బి.కొత్తకోట ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుడిపాల, బి.కొత్తకోట ఎంపీపీల స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. బి.కొత్తకోట ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళ కావడంతో, ఎంపీటీసీలు ఎవ్వరూ ఆ కేటగిరీకి చెందిన వారు లేకపోవడంతో పోటీ చేయలేదు. అధికారులు ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. అసలు సమస్యను ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గుడిపాలలో ఎంపీటీసీ జి.హరిప్రసాద్ చౌదరి ఎంపీపీగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. అడిగిన చోటుకి పోస్టింగ్ ఇస్తే రూ.20 వేలు సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లా వ్యాప్తంగా గతనెల సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లల్లో ఈ సంజీవని కేంద్రాని ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ముందుగా 136 మంది మిడ్లెవల్ హెల్త్ప్రొవైడర్లకు శిక్షణ ఇచ్చి స్థానం కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను కూడా వైద్య ఆరోగ్యశాఖలోని కొందరు కాసుల వర్షం కురిపించుకునేపనిలో పడ్డారు. అడిగిన చోటుకు పోస్టింగ్ ఇస్తే రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది తెలిసి ఇకొంత మంది డిమాండ్ను పెంచారు. రూ.30 వేల నుంచి రూ.40వేలు ఇస్తామని.. ఆ చోటుకు ఆర్డర్ ఇవ్వాలని ముందుకొస్తున్నట్టు సమాచారం. రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి పుత్తూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై బుధవారం సుమారు 50 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి ఒంటిపై క్రీమ్ కలర్ ఆఫ్ షర్టు, కాషాయం కలర్ పంచె, స్కైబ్లూ డ్రాయర్ ఉన్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. రేణిగుంట రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణలో యువకుడి మృతి! బంగారుపాళెం: మామిడి చెట్లకు మందు కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు స్ఫృ హతప్పి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటన బుధవారం మండలంలోని సదకుప్పం గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సదకుప్పం దళితవాడకు చెందిన మనోజ్, చరణ్, జానకీరామ్, సిద్దు నలుగురూ రైతు బాలిరెడ్డి మామిడి తోటలో చెట్లకు మందు కొట్టేందుకు కూలి పనులుకు వెళ్లారు. ఈ క్రమంలో మనోజ్, చరణ్కు మధ్య గొడ జరిగింది. చరణ్, అతని అన్న జానకీరామ్ ఇద్దరు మనోజ్ను తీవ్రంగా కొట్టడంతో స్ఫృహతప్పి పడిపోయాడు. మనోజ్ను చికిత్స నిమిత్తం అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మనోజ్(20) మృతి చెందినట్లు తెలిపారు. కాగా మనోజ్కు ఏడాది క్రిత మే వివాహమైంది. మనోజ్ భార్య గర్భవతి. గతంలో చరణ్, మనోజ్కు మధ్య పాత గొడలు న్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. డ్రోన్ సేవలు ప్రారంభంచిత్తూరు రూరల్ (కాణిపాకం): 2024–25 సంవత్సరానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 31 కిసాన్ డ్రోన్లను 80శాతం సబ్సిడీతో రైతులకు అందింస్తున్నట్టు డీఏఓ మురళి తెలిపారు. రైతులు డ్రోన్లను ఉపయోగించి పంటలకు వచ్చే తెగుళ్లు, పురుగులను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా రైతులు క్యాబ్ లాంటి విధంగా ఆన్న్లైన్లో డ్రోన్లను బుక్ చేసుకోవచ్చన్నారు. రైతులు కిసాన్ యాప్లో తమ వివరాలు నమోదు చేసిన తర్వాత, సమీపంలో ఉన్న డ్రోన్లను యాప్ చూపిస్తుందన్నారు. దీని ఆధారంగా డ్రోన్ సేవలను ఆన్న్లైనన్లో బుక్ చేయొచ్చన్నారు. గ్రామ రైతు సేవా కేంద్రాల్లోని వాల్పోస్టర్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవడం ద్వారా కూడా డ్రోన్లను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. -
తప్పుల తడకగా భూ రీసర్వే
పాలసముద్రం : చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే తప్పుల తడకగా మారింది. గత నెల 2 నుంచి చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో ఈ విషయం తేటతెల్లమైంది. కొందరు రైతుల ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు తప్పుగా నమోదై ఉన్నాయి. మరికొందరి ఒరిజినల్ పట్టా భూములు ప్రభుత్వ భూములు గానూ.. వాగు పోరంబోకుగాను చూపిస్తున్నాయి. ఇంకొందరివి ఉండాల్సిన భూముల విస్తీర్ణం కంటే తక్కువగా నమోదు చూపాయి. వీటి సవరణ కోసం తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళితే రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలని అక్కడి అధికారులు ఉచిత సహాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. చలానా పెంపు రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుకం తెరిసే సుమారు 50 మంది పేర్లు ముంద్రిచి ఉన్నాయి. వీటికి తోడు 5 ఎల్పీఎం నంబర్లు ఉన్నాయి. ఈ పాసుపుస్తకం తీసుకెళితే బ్యాంకులో ఉన్న లోన్లు కూడా రెన్యూవల్ కావు. ఇదేమని అడిగితే ఎల్ఎంఎం నంబర్ల విభజనకు చలానా కట్టాలని సూచిస్తున్నారు. అయితే సుమారు 100 మంది రైతుల్లో చలానా ఎవరూ కట్టాలి అంటే నాలుగైదుగురికి ఒక ఎల్పీఎం నంబర్ ఉంది. వాటిలో ఏ ఒక్కరు చలానా కట్టినా సరిపోతుందని చెబుతున్నారు. పైగా రూ.60 నుంచి రూ.500కు చలానా మొత్తం పెంచడంతో రైతులు మండి పడుతున్నారు. రైతులకు అదనపు భారం రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలపై రైతులు గత రెండేళ్లుగా మండల కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కొందరు రైతులు తమ భూములకు సంబంధించి ఆర్హెచ్ నకళ్లు, ఈసీలు డాక్యూమెంట్లు ఇచ్చినా వాటిని జాయింట్ కలెక్టర్కు పంపామని, అక్కడి నుంచి రావాల్సిందేనని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. ఆముదాల రెవెన్యూ పరిధిలో తమకు ఉండాల్సిన భూమికంటే తక్కువ భూమి 1–బీలో చూపు తోందని కొందరు రైతులు పేర్కొంటున్నారు. -
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : మెటీరియల్ కాంపొనెంట్ నిధుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర ఎంప్లాయ్గ్యారెంటీ పథకం అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ హెచ్చరించారు. బుధవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లా పరిషత్ కార్యాలయంలో డ్వామా అధికారులతో, ఎంపీడీవో, క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.89 కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలన్నారు. ఈ నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు ఖర్చు పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.70 కోట్లతో పనులు చేపట్టారన్నారు. ఫిబ్రవరి 20వ తేదీలోపు వివిధ పనులకు సంబంధించిన బిల్లులను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. మార్చి 31 లోపు మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నిధులతో పాటు జిల్లాకు అవసరమైన రూ.20 కోట్లు అదనంగా మంజూరు చేస్తామన్నారు. పలమనేరు నియోజకవర్గంలో రూ.84 లక్షలు ఖర్చు చేశారని, క్షేత్ర స్థాయిలో ఏ పనులు చేపట్టలేకపోతున్నారో వివరంగా డ్వామా పీడీకి తెలియజేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పథకం పేరును వీబీ గ్రామ్జీగా మారుస్తారన్నారు. ఈ సమీక్షలో డ్వామా పీడీ రవికుమార్, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
భారత బాల్బ్యాడ్మింటన్ జట్టుకు నగరి విద్యార్థి
నగరి : భారత బాల్బ్యాడ్మింటన్ జట్టుకు నగరి పట్టణంలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలకు చెందిన కేసీ తేజేష్ ఎంపికై నట్లు ఆ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి.బాలాజీ, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటస్వామి, చైర్మన్ పీ.జగన్నాథంనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు తమిళనాడు ఈరోడ్ ఎక్సెల్ కళాశాలలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయని, ఆ పోటీల్లో మన రాష్ట్ర జట్లు 3వ స్థానాన్ని కై వసం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన నగరి పట్టణానికి చెందిన కేసీ తేజేష్ మార్చిలో మలేషియా, థాయ్లాండ్లో నిర్వహించే అంతర్జాతీయ టెస్ట్ సీరిస్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికై నట్లు ప్రకటించారు. క్రీడల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు తప్పకుండా ప్రోత్సాహం ఉంటుందన్నారు. భారత జట్టుకు ఎంపికై న విద్యార్థికి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. -
పాఠశాలలను బలోపేతం చేయాలి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డీఈఓ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా... సచివాలయ ఏఎన్ఎంలు ఆరోగ్య సంబంధిత విధులనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఇతర శాఖల పనులు వారిపై రుద్దకూడదని స్పష్టం చేశారు. అదనపు పనులు అప్పగించడం వల్ల స్క్రీనింగ్, క్యాన్సర్ పరీక్షలు, చిన్నపిల్లల ఆరోగ్య సేవలు ప్రభావితమవుతున్నాయని, సంబంధం లేని పనులు చేయలేదని షోకాజ్ నోటీసులు ఇవ్వడం, జీతాలు నిలిపివేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశాలను లెక్కచేయకుండా పలు మండలాల్లోని ఎంపీడీఓలు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తాం
చిత్తూరు కార్పొరేషన్: పరిశ్రమల్లో తలెత్తే విద్యుత్ సమస్యలను పరిష్కారిస్తామని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ స్పష్టం చేవారు. బుధవారం ఎస్ఈ కార్యాలయంలో పారిశ్రామిక వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు పరిశ్రమల అధికారులు, ఉద్యోగులు కార్యక్రమానికి వచ్చి సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా కెపాసిటర్లు సర్చార్జి ఎక్కువగా వస్తోందన్నారు. నూతన మీటర్ల ఏర్పాటు వల్ల వాడకం ఎక్కువగా చూపుతోందన్నారు. వాటిని రివైజ్డ్ చేయాలని కోరారు. అలాగే పరిశ్రమల సర్వీసులకు ఏబీ స్విచ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ విద్యుత్ సమస్య వచ్చినా పరిశ్రమల్లో మొత్తం లైన్ సరఫరా అగిపోతోందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను ప్రతినెలా మూడో బుధవారం తిరుపతిలోని సీఎండీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో తెలియజేయాలని వివరించారు. ఈఈ మునిచంద్ర, ఏఓ బాలు, డీఈ బాలాజీ పాల్గొన్నారు. వసతుల కల్పనపై దృష్టి చిత్తూరు కార్పొరేషన్: పల్లెల్లో పన్నుల వసూళ్లతో పాటు వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్ (పీఆర్) అదనపు కమిషనర్ సుధాకర్రావు తెలిపారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లెల్లో ప్రధానంగా ఇంటింటి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, ట్యాంక్ల క్లీనింగ్, చెత్త సేకరణ పనులు ఉంటాయన్నారు. వీటి నిర్వహణను సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయాలన్నారు. పల్లెల్లో పన్నుల ద్వారా వచ్చే డబ్బుతో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా నీటి వసతి, వీధి దీపాల నిర్వహణ, సకాలంలో చెత్త తీయడం, కాలువల శుభ్రత చేయించాలన్నారు. వేసవిలో నీటి కొరత లేకుండా చూడాలన్నారు. కార్యదర్శులు పనిచేయకపోతే సర్పంచులకు, డిప్యూటీ ఎంపీడీఓ, డీపీఓ, సీఈఓలకు చెడ్డపేరు వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ సాయిలహరి, జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, డీపీఓ సుధాకర్రావు, డీడీఓలు రవికుమార్, రామచంద్ర, వాణి పాల్గొన్నారు. -
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ రీడర్ల భవితవ్యం ● ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వేడుకోలు
●విద్యుత్ మీటర్ రీడర్ల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపే కారణమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టండి.. విద్యుత్ బిల్లులు చెల్లించకండి’ అంటూ టీడీపీ అగ్ర నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, ప్రస్తుతం గృహ వినియోగదారులకు సైతం చకచకా బిగించేస్తున్నారు. ఈ క్రమంలో మీటర్ రీడర్లు ఉపాధి లేక రోడ్డున పడే దుస్థితి నెలకొంటోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందికిపైగా మీటర్ రీడర్స్ పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు అందిస్తారు. ఇందుకు రీడర్లకు ఒక్కో బిల్లుకు పట్టణాల్లో రూ.3.6 పైసలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3.73 పైసలను విద్యుత్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. ఈ విద్యుత్ బిల్లుల రీడింగ్ నిర్వహణ కోసం టెండర్ ఎత్తుకొన్న కాంట్రాక్టర్కు మిషన్, పేపర్ కాస్టుకు సంబంధించి అదనంగా మరో రూ.4 చెల్లిస్తుంది. ఇలా జిల్లాల వారిగా కాంట్రాక్టర్లు ఉంటారు. గతం ప్రభుత్వంలో కొండంత భరోసా సంబంధిత కాంట్రాక్టర్లు తమకు రూ.3.3 పైసలు చెల్లిస్తున్నారంటూ రీడర్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేయాలని విద్యుత్ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేశారు. రీడర్లకు కొండంత అండగా నిలిచారు. బొక్కేస్తున్న ‘యువగళం’ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీటర్ రీడర్స్కు కష్టాలెక్కువయ్యాయి. నాటి కాంట్రాక్టర్లను తొలగించి యువగళం కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. ప్రస్తుత కాంట్రాక్టర్లు రీడర్లకు రూ.2.8 పైసలు, కొన్నిచోట్ల రూ.3 వంతున ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకో.. లేకుంటే వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్గా రోడ్డుపైకి! శ్రమ దోపిడీ ఓ పక్క జరుగుతుండగా ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ మీటర్ల కారణంగా తమ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడిందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే రీడర్లు బిల్లులు తీసి ఇచ్చే పరిస్థితి ఉండదు. అందులోని చిప్ ద్వారా రీడింగ్ను విద్యుత్ కార్యాలయం నుంచే సేకరించి, మొబైల్ రీచార్జ్ తరహాలో ముందస్తు చెల్లింపులతో విద్యుత్ వినియోగం రానుంది. దీంతో విద్యుత్ రీడర్లు కనుమరుగుకానున్నారు.విజ్ఞప్తి చేశాం ప్రభుత్వానికి, విద్యుత్ ఉన్నతాధికారులకు పలుమార్లు మా ఉద్యోగ భద్రతపై విజ్ఙాపనలు అందజేశాం. ప్రభుత్వం నుంచి సానుకూల సందేశాలు రాలేదు. ఉపాధి చూపమని వేడుకొంటున్నాం. ప్రభుత్వం కనికరం చూసుతుందని ఆశిస్తున్నాం – యువరాజ్, మీటర్ రీడర్, పుత్తూరు15 ఏళ్లుగా పనిచేస్తున్నా.. గత 15 ఏళ్లుగా మీటర్ రీడర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం వస్తున్న వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉద్యోగ భద్రత ఆందోళనకరంగా ఉంది. భవితవ్యం అర్థం కావడం లేదు. – సుబ్రమణ్యం, మీటర్ రీడర్, పుత్తూరు ఉద్యోగ భద్రత కల్పించాలి మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే పని కల్పించండి. షి ప్టు ఆపరేటర్లుగా, వాచ్ టు వార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, బ్రేక్ డౌన్ గ్యాంగ్, వాచ్మెన్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ వంటి విధుల్లో చేర్పించండి. మా కుటుంబాలకు అండగా నిలవండి. –సి.రమేష్, ఉపాధ్యక్షుడు,ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ కమిటీ -
నేడే ‘చలో పోతిరెడ్డిపాడు’
నగరి : తాగు, సాగునీటి అంశంలో రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని తిప్పికొట్టే ఉద్దేశంతో గురువారం చేపట్టిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె మాట్లాడుతూ హెడ్ రెగ్యులేటర్ అంశంలో రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ‘చలో పోతిరెడ్డిపాడు’ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తెన పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
రెండేళ్లకే కూటమి పాలనపై విసిగిపోయారు!
తిరుపతి మంగళం: అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి నమ్మక ద్రోహం చేసిన కూటమి పాలనపై రెండేళ్లకే రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కార్యకర్తలకే అగ్రస్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి చేయడంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు ఇతరత్రా ఏ కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలేనని, వారిని మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకరరెడ్డి ఉన్న రెండు సార్లు శ్రీవారి ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారన్నారు. శ్రీవారి భక్తి చానల్, వాడవాడలా శ్రీవారి కల్యాణాలు, దళిత గోవిందం వంటి అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత కరుణాకరరెడ్డిదన్నారు. అలాంటి గొప్ప దైవభక్తి కలిగిన కరుణాకరరెడ్డితో పాటు వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు చంద్రబాబు, పవన్కళ్యాణ్ లడ్డూలో కల్తీ అంటూ దుష్ప్రాచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలతోనే వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసుకోగలమన్నారు. పార్టీపై అభిమానం, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ కమిటీల్లో నియమించాలని సూచించారు. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐడీ కార్డులు ఇచ్చి, వారికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని, పార్టీకి పునాదులు వారేనన్నారు. జగనన్న వంటి గొప్ప నాయకుడు తిరిగి అధికారంలోకి రాగానే ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం మేయర్ శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అందరి దృష్టి మళ్లించేందుకు శ్రీవారి లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అందాయంటే అది ఒక జగనన్న పాలనలో మాత్రమేనన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేద్దామన్నారు. అనంతరం భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికే ఆదర్శంగా తిరుపతిలో పదివేల మందితో పార్టీ అనుబంధ కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఉన్న యాభై డివిజన్లకు గానూ 45 డివిజన్లలో కమిటీలను పూర్తి చేయడంతోపాటు డిజలైజేషన్ చేశామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు తిరుపతి నగరంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త వల్లేనన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే కార్యకర్తలకే పెద్దపీట -
‘కల్తీ’మాటలు ఆపండి!
కార్వేటినగరం: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ కాలేదని సుప్రీం కోర్టు నియమించిన సిట్ బృందం నిర్థారించినా చంద్రబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం పుత్తూరులోని పార్టీ కార్యాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే దేవదేవుడి ప్రసాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు వదిలి పెట్టడం లేదన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని విషప్రారం చేసి ప్రతిపక్షంపై నేరాన్ని మోపడానికి పూనుకుంటున్నారని దుయ్యబట్టారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం మంచిది కాదని హెచ్చరించారు. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వైఎస్సార్సీపీ నాయకులు ఆలయాల్లో పూజలు చేస్తే వారిపై కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాదన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి ఫొటోలు పెట్టి కూటమి నాయకులు అవమానిస్తుంటే వాటిని ప్రశ్నించిన అంబటి రాంబాబుపై దాడులు చేసి, ఇంటిపై పెట్రోల్ బాబులు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంద, ఇది ఎల్లకాలం పనిచేయదన్నారు. ఎవరు ఏ తప్పు చేసినా ఆ ప్రభుత్వాని ప్రశ్నిస్తా అన్న వారు నేడు ఎక్కడికెళ్లారో అర్థం కావడం లేదన్నారు. -
నకిలీ ప్రభుత్వం.. ఫేక్ ప్రచారం !
– ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మండిపాటు బైరెడ్డిపల్లె : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూను ప్రతి ఒక్కరూ కళ్లకద్దుకుని ఇష్టంగా తింటారని, అంతటి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తప్పుడు ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోరెలా వచ్చిందని ఎమ్మెల్సీ కే.ఆర్.జే. భరత్ ప్రశ్నించారు. బైరెడ్డిపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీనియర్ అని చెప్పుకుంటూ రౌడీ రాజ్యంలో జంగిల్ రాజ్లా మారిన ముఖ్యమంత్రి చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని, నాయకులపై, వారి ఇళ్లపై దాడులను ప్రోత్సహించే హక్కు ఎవరిచ్చారన్నారు. ప్రజ లు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ రాజకీయాలను గమనిస్తున్నారన్నారు. తిరుమల లడ్డూ లో జంతువుల కొవ్వు ఉందని అభాండం వేసిన తర్వాత అది తప్పు అని సిట్, సుప్రీంకోర్టు నివేదికల ద్వారా తెలియజేస్తే చంద్రబాబు, లోకేష్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కూటమి నేతలు ఇతరులపై దాడులకు తెగబడుతున్నట్లు ఆయన మండిపడ్డారు. అందులో భాగంగా కాపు నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందన్నారు. పోలీసులు అక్కడే ఉన్నా ఆపే ప్రయత్నం చేయలేదని, ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగి న దాడి అని అర్థమవుతోందన్నారు. గతంలో పట్టా బి, చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్లు నోటితో చెప్పలేని విధంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మాట్లాడిన అసభ్య పదజాలాన్ని ఆయన గుర్తు చేశా రు. ఆ సమయంలో కనిపించని బాధ అధికారంలో కి వచ్చాక వారికి ఇప్పుడు ఎలా కనిపిస్తోందన్నారు. రాంబాబు సంఘటన జరిగిన కొంత సమయం కాక ముందే జోగి రమేష్ ఇంటిలో భార్య, పిల్లలు, తండ్రి ఉండగా దాడులు చేయడం, పెట్రో బాంబులతో కలకలం సృష్టించడం హేయమైన చర్య అన్నా రు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదన్నారు. సీనియర్ అని చెప్పుకుంటూ ప్రపంచమంతా తిరుగుతున్న వారికి సంస్కారం ఉండాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తప్పుపట్టే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ భరత్ ఘూటుగా విమర్శించారు. -
ట్రాన్స్ఫార్మర్ కష్టాలు
పలమనేరు : ట్రాన్స్కో డివిజన్ పరిధిలో రైతులకు ఓవర్లోడ్ కారణంగా తరుచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో పాటే స్టార్టర్లు, మోటార్లు దెబ్బతింటున్నాయి. వీటిని రీప్లేస్ చేసుకోవడానికి ఇస్తే 15 రోజులకు గానీ రైతులకు చేరడం లేదు. ఫలితంగా పచ్చని పంటలకు నీరందివ్వలేని దుస్థితి నెలకొంది. నెల రోజులుగా ఉన్న ఈ సమస్య ప్రస్తుతం మరింత జఠిలమైంది. పలమనేరు ట్రాన్స్కో డివిజన్ పరిధిలో పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట మండలాలున్నాయి. ఇందులో 20 వేల దాకా విద్యుత్ సర్వీసులున్నాయి. గతంలో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటినప్పుడు ఈ ప్రాంతంలో కేవలం ఆరువేల కనెక్షన్లు మాత్రమే రన్నింగ్లో ఉండగా ప్రస్తుతం 18 వేల కనెక్షన్లు రన్ అవుతున్నాయి. గతంలో ఇక్కడ కేవలం 5 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతుండేవి. ఇప్పుడు పంటల సాగు 50 వేల హెక్టార్లకు చేరింది. ముఖ్యంగా ఈ సీజన్లో వేసవిలో వరి సాగు ఎక్కువైంది. దీంతో విద్యుత్ వినియోగం ఎక్కువైంది. భారం ఎక్కువ గతంలో ఒక్కో 15 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్లో ఇద్దరు రైతులకు చెందిన రెండు 7.5 హెచ్పీ మోటార్లు నడుస్తుండేవి. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు 15 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్లను 25 హెచ్పీగా అప్గ్రేడ్ చేయించుకున్నారు దీంతో పాటే మోటార్లు, స్టార్టర్లు సామర్ాధ్యన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలా కాదు. ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని అందరు రైతులు పెంచిన కెపాసిటీతోనే విద్యుత్ను వినియోగిస్తున్నారు. ఈ కారణంగా భారీగా ఓవర్లోడ్ అవుతోంది. ఈక్రమంలో తరచూ ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ కావడంతో పాటు మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. మరమ్మతుల్లో జాప్యం మరమ్మతుకు గురైన ట్రాన్స్ఫార్మర్లను రీప్లేస్మెంట్ కోసం ఇస్తే కనీసం 15 రోజులులైనా అవి మరమ్మతులు కావడం లేదు. పెద్దసంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతోండడంతో చాలీచాలని సిబ్బందితో వాటిని మరమ్మతు చేయిస్తుండడంతో ఆలస్యమవుతోంది. ఈ వ్యవధిలో రైతు పండించిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వీటిని రీప్లేస్ చేసుకోవాలన్నా ట్రాన్స్కో సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకోవాల్సింది వస్తోందని రైతులు వాపోతున్నారు. కాలిపోతున్న నియంత్రికలు కెపాసిటర్లే ప్రత్యామ్నాయం పలమనేరు డివిజన్ పరిధిలో ఎక్కువగా హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా కాలుతుండడంపై ట్రాన్స్కో ఉన్నతాధికారులు గతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఓవర్లోడ్ కారణంగానే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నట్లు తేల్చారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా కెపాసిటర్లను అమర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 7.5 హెచ్పీ మోటార్కు 3–కేవిఆర్ సామర్ధ్యం గల ఐఎస్ఐ మార్కు కెపాసిటర్ను వాడుకోవాల్సి ఉంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గి అటు ట్రాన్స్ఫార్మర్కు గానీ ఇటు మోటార్, స్టార్టర్లకు ఇబ్బంది లేకుండా రైతుకు మేలు జరిగే అవకాశం ఉంది. కాగా ట్రాన్స్ఫార్మర్ల విషయంగా ఎవరైనా మామూళ్లు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ట్రాన్స్కో ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. -
ఆరోగ్యశ్రీ అయోమయం
కాణిపాకం : ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజల మనసుల్లోంచి పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పథకం ప్రారంభమై 20 ఏళ్లవుతున్నా దానిని ప్రారంభించిన వైఎస్సార్ కొనసాగించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే వినిపిస్తోంది. అందుకే ఈ పథకాన్నే ఎత్తేస్తే వారి గురించి ప్రజలు ఆలోచించరనే ఆలోచనతో ప్రభుత్వం ఈ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ స్థానంలో త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురానుంది. అయితే ఇప్పటి వరకు నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకా యిలు, వైద్య మిత్ర ల ఉద్యోగుల విషయంలో ఎలాంటి స్పష్టత లేకుండా నూతన పాలసీకి వెళ్లడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. వైద్యమిత్రల ఆందోళన జిల్లాలో ప్రస్తుతం 4,73,877 ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులు, 74 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 4 ప్రభుత్వ ఆస్పత్రులు, 9 ప్రైవేటు ఆసుపత్రులు, 47 పీహెచ్సీలు, 7 సీహెచ్సీలు, 7 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో 48 మంది వైద్యమిత్రలు గత 17 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ప్రభు త్వం మారిన ప్రతిసారి వైద్యమిత్రల ఉద్యోగ భద్ర త ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పుడు కొత్త పాలసీ అమలుకు రెండు నెలలే సమయం ఉండటంతో, ప్రస్తు తం పనిచేస్తున్న సిబ్బందిలో సగానికి పైగా ఉద్యో గాలు కోల్పోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వైద్యమిత్రలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బకాయిల భారం జిల్లాలోని 47 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. బ్యాంకు రుణాల ద్వారా బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదు. కొన్ని ఆసుపత్రులకు వారి బకాయిల్లో 5 నుంచి 10 శాతం మాత్రమే చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. ట్రస్టుకు రుణం ఇవ్వాలంటే ష్యూరిటీ కావాలంటూ బ్యాంకులు వెనుకడుగు వేస్తుండటంతో బకాయిల సమస్య మరింత క్లిష్టంగా మారింది. పేదల జీవితాల్లో వెలుగు ఒకప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలంటే పేదలు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అలాంటి దుస్థితి నుంచి పేదలను బయటకు తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీ పథకమే. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే చాలు, ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా వైద్యం అందేలా మారింది. ఆయన మరణానంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని కొనసాగించినా అనేక పరిమితులతో అమలు చేశాయి. అయితే 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్న్రెడ్డి ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారు. చికిత్సల సంఖ్యను 1,800 నుంచి 3,255కు పెంచడమే కాకుండా, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాల్లోనూ వైద్యం అందేలా విస్తరించారు. ఆరోగ్యశ్రీ పేరును పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జీఓ నెం.162 మాత్రమే విడుదల చేసి, పాలసీకి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను బయటపెట్టలేదు. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపై మొత్తానికి ఇన్సూరెనన్స్ కంపెనీల ద్వారా చికిత్స అందించాలనే ప్రతిపాదనపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే ఆసుపత్రుల సిబ్బంది వివరాలు రిజిస్టర్ చేశారు. అయితే తక్కువ ప్యాకేజీల కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావడం లేదనే సమాచారం. అనిశ్చితిలో ఆరోగ్య భద్రత పేదలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని స్పష్టత లేకుండా తొలగించడం, ఉద్యోగులను అనిశ్చితిలో నెట్టడం, ఆసుపత్రుల బకాయిలను పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. కొత్త పాలసీ నిజంగా పేదలకు మేలు చేస్తుందా? లేక పేరు మార్చి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. -
నేడు తిరుపతిలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
తిరుపతి మంగళం : తిరుపతి పద్మావతిపురంలో బుధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మడి చిత్తూ రు జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ శిరీష పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. నేడు విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. స్థానిక గాంధీ రోడ్డులోని డివిజన్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. చిత్తూ రు, పూతలపట్టు నియోజకవర్గాల వినియోగదారుల సమస్యలను రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు. శిక్షణ సమన్వయకర్త నియామకం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వనరుల కేంద్రం కార్యాలయంలో సహాయ వ్యవసాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న వాసును జిల్లా రైతు శిక్షణ సమన్వయకర్తగా ఇనన్చార్జిగా నియమించారు. మంగళవారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. రైతులకు వ్యవసాయ రంగంలో రాణించేలా శిక్షణలు అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
వరసిద్దుడి సేవలో మాజీ న్యాయమూర్తులు
కాణిపాకం : కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని మంగళవారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ.వీ. రవీంద్రన్, కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్. సత్యనారాయణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ప్రొటో కాల్ ఏఈఓ ధనపాల్ పాల్గొన్నారు. కరెంటోళ్ల జనబాటలో 17 పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్ల నందు అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 110 సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల పరంగా 6, ఎల్టీ లైన్ల పరంగా 60, సర్వీసు లైన్ పరంగా 15 కలిపి మొత్తం 185 సమస్యలను గుర్తించినట్లు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 17 సమస్యలను పరిష్కరించామన్నారు. నేడు పారిశ్రామిక పరిష్కార వేదిక చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నారు. స్థానిక ఎస్ఈ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు గంట సేపు తమ సమస్యలను పరిశ్రమదారులు తెలపవచ్చన్నారు. జిల్లాలో మొదటి బుధవారం, తిరుపతి జిల్లాలోని డిస్కం కార్యాలయంలో మూడో బుధవారం కార్యక్రమం ఉంటుందన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా సైని క సంక్షేమ శాఖ అధికారి రాఘవులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవనంలో మంగళవారం ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్ప సేవల కు గుర్తింపుగా వెటర్నర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. త్రివిధ దళాలలో 70 ఏళ్లకు పైబ డిన 62 మంది మాజీ సైనికులను కార్యక్రమంలో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ప్రతి సైనికుడి సేవలు ఎనలేనివన్నారు. సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సైనికుల కుటుంబీకులకు ఎటువంటి సమస్యలు ఎదురైన జిల్లా సైనిక సంక్షేమ శాఖలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ వివేక్ మోనిష్, లెప్ట్నెంట్ కల్నల్ లోకనాథం, గ్రూప్ కమాండర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సొమ్మొకరిది.. సోకొకరిది
పాలసముద్రం : ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో బ్యాటరీ సైకిళ్ల పంపిణీ గిన్నిస్ రికార్డు అయిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. తీరా చూస్తే బ్యాటరీ సైకిళ్లు తెలుగుదేశం పసుపు కలర్లో పంపిణీ చేస్తున్నారు. సొమ్ము ఒకరిది.. సోకు టీడీపీదా అంటున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఐకేపీ ద్వారా సంఘం సభ్యులకు పంపిణీ చేసిన బ్యాటరీ సైకిళ్ల పంపిణీలో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. బ్యాటరీ సైకిళ్లు తీసుకోవడానికి ముందుకు రాలేదు. డబ్బులు ఏ శాఖలో రొటేసన్ అవుతాయో గుర్తించి చివరికీ ఐకేపీ సిబ్బందికి మండలానికి టార్గెట్ ఇచ్చారు. ఐకేపీ సిబ్బంది రూ. 24 వేల బ్యాటరీ సైకిల్ తీసుకోవాలని సంఘ సభ్యులకు తెలిపారు. వారు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బ్యాటరీ సైకిల్ తీసుకోవడానికి వీఓలో రూ. 24 వేలు అప్పుగా ఇస్తామని, నెల నెలా కంతుల ప్రకారం వడ్డీతో చెల్లించాలని సీసీలు సంఘ మిత్రాలు తెలిపారు. అందుకు సంఘాల సభ్యులు మొదట బ్యాటరీ సైకిళ్లు ఇవ్వండి ఆపై ప్రతి నెలా రూ. 1000 వడ్డీతో సహా 24 కంతులు పట్టుకుంటామని తెలిపారు. అలా కాదు రూ 24 వేలు పూర్తిగా చెల్లిస్తేనే బ్యాటరీ సైకిళ్లు ఇస్తామని తెలిపారు. వారి టార్గెట్ పూర్తి చేయాలని ఉద్దేశంతో డ్వాక్రా సంఘాల సభ్యులకు నచ్చజెప్పి వీఓలో రూ.24 వేలు వారిపై అప్పురాసి ఆన్లైన్లో మీకు బ్యాటరీ సైకిల్ ఏ కలర్ కావాలని ఎంపిక చేసి సైకిళ్లు నమోదు చేసుకున్నారు. తీరా చూస్తే ఆన్లైన్లో నమోదు చేసిన కలర్ సైకిల్ ఇవ్వకుండా పసుపు కలర్ బ్యాటరీ సైకిళ్లు ఇస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన కలర్ ఇవ్వకుండా మాకు పసుపు కలర్ ఇస్తున్నారని ఐకేపీ సిబ్బంది అడిగితే వారు సమాధానం చెప్పడం లేదు. నియోజకవర్గంలో సుమారు ఆరు వందలకుపైగా బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు. ఇస్తున్నప్పుడే లైట్లు పడకుండా, బ్రేకులు పట్టకుండా పోతున్నాయి. రూ 24 వేలు ఇచ్చి బ్యాటరీ సైకిళ్లు తీసుకుని అది రిపేర్కు ఎక్కడ చేయించాలో తెలియని పరిస్థితిలో సైకిళ్లు తీసుకున్న లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
యూరియా కోసం తమ్ముళ్ల రగడ
సాక్షి టాస్క్పోర్సు : మండలంలోని జొన్నగురకలో యూరియా కోసం టీడీపీ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. జొన్నగురకల సచివాలయం పరిధిలో ఎగువ తడకర, జొన్నగురకల పంచాయతీలు ఉన్నాయి. జొన్నగురకల రైతు సేవా కేంద్రంలో మంగళవారం వ్యవసాయాధికారులు యూరియా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్రమైన పదజాలంతో దూషించుకున్నారు. అక్కడ ఉన్న రైతులందరూ టీడీపీ నాయకుల తీరును చూసి ఛీదరించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో యూరియా కొరత ఉండగా టీడీపీ నాయకులు హంగామా అదికమవుతోందని రైతులు విమర్శిస్తున్నారు. రైతులకు పంపిణీ చేయడంలో సహకరించాల్సిన నాయకులు తమకు అనుకూలమైన వారికి యూరియా ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి నాయకుల ఆగడాలకు అధికారులకు తలనొప్పిగా మారుతోంది. పంటలు సాగు చేసే రైతులు చాలా మందికి యూరియా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ప్రతి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీలో అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన వారికే ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు రైతుల నుంచి విమర్శలున్నాయి. దీంతో సామాన్య రైతులు వేకువజాము నుంచే పడిగాపులు పడినా ఎరువులు అందక నిరుత్సాహంతో వెనుతిరుగుతున్నారు. -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 69,262 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,728 మంది భక్తులు తలనీలాలు అ ర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శ నం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లా లని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయా నికంటే ముందు వెళ్లిన వారిని క్యూ లోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
మోకరిల్లిన వైకల్యం
శ్రీరంగరాజపురం : ఆమె పట్టుదలతో వైకల్యాన్ని జయించారు. విద్యుత్ షాక్తో ఒక కాలు, ఒక చేయి పూర్తిగా కాలిపోయాయి. ఆమె శరీరం ఏమాత్రం సహరించుకున్నా ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదువులో రాణించారు. శ్రీరంగరాజపురం మండలం గాండ్లపల్లి గ్రామానికి చెందిన ఎం.దొరస్వామి, ఎం.రత్నమ్మ దంపతుల కుమారై కృష్ణవేణి కృషి ఉంటే ఎదగడానికి అంగవైకల్యం అడ్డు కాలేదని నిరూపించారు. మట్టిలో మాణిక్యంగా ఎదిగి తాజా గ్రూప్–1 ఫలితాల్లో గ్రూప్ వన్ అధికారిగా వాణిజ్య పన్నుల విభాగంలో సహా య కమిషనర్గా ఎంపికయ్యారు. గ్రూప్–2 ఫలితాల్లో సివిల్ సప్లై కమిషనర్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం శ్రీ రంగరాజపుర మండలంలోని వడ్డి కండ్రిగలో ఎం.దొరస్వామి, ఎం.రత్నమ్మ దంపతులకు కృష్ణవేణి 2000లో జనవరి 19న జన్మించారు. ఆమె పదో తరగతి వరకు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. 2010లో ఆమె 6వ తరగతి చదవుతున్నప్పుడు విద్యుత్షాక్కు గురై ఒక కాలు, ఒక చేయి కోల్పోయారు. 10 పరీక్షల్లో మండలానికి మొదటి స్థానం రావడంతో వైఎస్సార్ కడవ జిల్లాలోని ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలో సీటు పొందారు. అక్కడ విద్యను పూర్తి చేసి, 2023 లో ఇంటి వద్దనే గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం అయ్యారు. మొదటి ప్రయ త్నం విఫలం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో శిక్షణ పొందారు. తాజాగా నేడు విడుదల చేసిన గ్రూప్–1లో రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగంలో సహాయ కమిషనర్గా, అలాగే గ్రూప్స్–2 లో సివిల్ సప్లై కమిషనర్గా ఉద్యోగాలు సాధించా రు. తన తల్లిదండ్రులు కృషి ప్రోత్సాహంతో నే నేడు గ్రూప్స్లోని రెండు ఉద్యోగాలను సాధించినట్లు తెలిపారు. తండ్రి ఎం.దొరస్వామి తల్లి ఎం.రత్నమ్మ అవమానాలకు గురయ్యా.. నేను చదువుకున్న రోజుల్లో సహచర విద్యార్థుల వద్ద, గ్రామంలో అనేక అవమానాలకు గురయ్యా. పాఠశాలకు వెళ్లాలన్నా నడవలేని పరిస్థితి. అందరూ ఇంటిలోనే కూర్చో ఇక ఏం చదువుకుంటావు. అని హేళన చేసేవారు. అవి ఏవీ పట్టించుకోకుండా నా అన్నదమ్ములు, కుటుంబ సహకారంతో ఎక్కడా నిరుత్సాహ పడకుండా చదివాను. ఇంటి వద్దనే నిత్వం సాక్షి పత్రిక , మిగిలిన ఇంగ్లీషు దిన పత్రికలు చదివి అనేక మంది జీవిత చరిత్రలు, భారతీయ రాజకీయాలు, జనరల్ నాలెడ్జ్లో పట్టు సాధించా. మా ఉపాధ్యాయులు రఫీ, సేహ్నితురాలు అన్నపూర్ణ, మా వదిన పూర్ణిమ ప్రోత్సాహంతోనే రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. – ఎం.కృష్ణవేణి, గ్రూప్స్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థిని -
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సమగ్రశిక్ష శాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఐఈఆర్పీ (సహిత రిసోర్స్ పర్సన్లు) లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణ అన్నారు. డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఐఈఆర్పీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ, జిల్లాలోని దివ్యాంగ విద్యార్థుల వివరాలను విధిగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్పెన్షనల్ లెర్నింగ్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విధి విధానాలను ప్రతి ఐఈఆర్పీ తెలుసుకోవాలన్నారు. అనంతరం ఐఈఆర్పీలకు కార్యక్రమం అమలు తీరుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త మధు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్నామలై జిల్లా, పోలూరు తాలూకా, పులియాన్ కుప్పం గ్రామానికి చెందిన పి శేఖర్కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరి ప్రసాద్, కానిస్టేబుల్ పళని కథనం మేరకు.. కార్వేటినగరం పోలీసులకు 2017 జనవరి 5వ తేదీ వచ్చిన సమాచారంతో కార్వేటినగరం మండలం, గురువరాజు గుంట సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐదుగురు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి ఐదు దుంగలుగా మార్చి తరలిస్తున్నట్టు గుర్తించారు. 163 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసి, పుత్తూరు సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ దశలో నిందితుడు శేఖర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై విచారణ తప్పించి మిగిలిన నలుగురిపై కేసు విచారణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం కేసుల విచారణ కోర్టు తిరుపతిలో ఏర్పాటు కావడంతో కేసు తిరుపతికి బదిలీ అయింది. పోలీసులు నిందితుడు శేఖర్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు శేఖర్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
హాస్టళ్లపై పకడ్బందీ ప్రణాళిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని 113 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 113 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ప్రాంగణంగా రూపాంతరం చేసే కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి వసతి గృహంలో కచ్చితంగా ఆర్వో ప్లాంట్, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలన్నారు. వసతి గృహాల్లో అవసరమైన సౌకర్యాలపై ఈనెల 6 న నివేదికలు అందజేయాలన్నారు. ప్రతి వసతి గృహానికి రూ.50 వేల చొప్పున నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో సంక్షేమ శాఖల అధికారులు విక్రమ్కుమార్రెడ్డి, మూర్తి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ తప్పకుండా చెల్లించాలి అభివృద్ధి పనులు జరుగుతున్న శాఖల్లో తప్పనిసరి గా జీఎస్టీ తప్పకుండా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. జీఎస్టీ అమలు తీరుపై సమీక్ష నిర్వహించా రు. జిల్లాలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పను లు చేస్తున్నట్లు తెలిపారు. పీఎం–అజయ్ పథకంలో గృహ నిర్మాణ శాఖలో నిర్వహిస్తున్న అన్ని పనులను వెబ్ పోర్టల్ తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఆ పనులకు సంబంధించిన జీఎస్టీని జాప్యం చేయకుండా చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ పన్ను చెల్లింపుదారులను గుర్తించాలన్నారు. కుప్పం లో రూ.29 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. బకాయి లు ఉన్న చెల్లింపుదారుల పన్ను లావాదేవీలను నిషే ధించాలన్నారు. డీఆర్వో మోహన్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. -
6న ఉపాధి పరిరక్షణ యాత్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉపాధి హామీ చట్టంను మహాత్మా గాంధీ పేరిట కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర 6వ తేదీన జిల్లాలో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధిహామీ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఉదయం పలమనేరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం జీడీ నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కీ రాయల్ , ఎం మైనారిటీ నాయకులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు. పంటలపై ఏనుగుల దాడి గుడిపాల: మండలంలో పంటలపై గజదాడులు ఆగడం లేదు. మరోసారి ఇవి స్వైర విహారం చేశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు 13 ఏనుగుల గుంపు పంటలపై పడి నష్టం కలిగించాయి. కిల్లారిపల్లె గ్రామ సమీపాన వరిపంట, పశుగ్రాసం, మామిడి పంటలను, 189 కొత్తపల్లె సమీపంలో చెరకు పంటను ధ్వంసం చేశాయి. ఆ తర్వాత పిళ్లారికుప్పం, బట్టువాళ్లూరు గ్రామాల సమీపానికి వెళ్లి అరటి పంటను ధ్వంసం చేసి అటవీప్రాంతంలోకి వెళ్లి పోయాయి. వీటి దాడుల్లో దాదాపు 20మంది రైతులు తమ పంటలు నష్టపోయారు. అటవీశాఖ అధికారులు టపాసులతో బెదిరించడం మినహా ఏనుగులను దాడుల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపడంలేదని రైతన్నలు వాపోయారు. జోరుగా మట్టి నమూనాల సేకరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించే రైతుల కోసం మట్టి నమూనాలు సేకరణ జోరుగా చేస్తున్నట్టు ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివశంకర్ తెలిపారు. జిల్లాకు 16,401 లక్ష్యంగా కాగా మూడు రోజులుగా ఈ మట్టి నమూనా లు సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు 1,143 నమూనాలు సేకరించినట్లు తెలిపారు. మార్చి నెలాఖరు లోపు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. భూసార పరీ క్షల ఆధారంగా రైతులు పంటలు సాగు చేసేలా చూస్తామన్నారు. ఓవరాల్ చాంపియన్గా ఎన్ఎస్యూ తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా నాలుగు రోజులుగా జరిగిన సౌత్జోన్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్–2026 ఘనంగా ముగిసింది. దేశంలోని 13 వర్సిటీల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్న స్పోర్ట్స్ మీట్లో తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులు పలు పోటీల్లో ప్రతిభ చూపి, ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మంగళవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎల్ జయరాములు ముఖ్యఅతిథి విచ్చేసి ప్రసంగించారు. సంస్కృత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే తమ తరఫున ఇంటర్నేషనల్ స్పాన్సర్షిప్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాకే వర్సిటీకి రెండు గోల్డ్ మెడళ్లు, బెస్ట్ రీసెర్చ్ గోల్డ్మెడల్, స్పోర్ట్స్లో ప్రతిభ కనబరచిన వారికి రెండు క్రీడా గోల్డ్ మెడల్స్ అందజేస్తామని చెప్పారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత విద్యతో పాటు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సౌత్జోన్ స్పోర్ట్స్ మీట్ గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి సేతురామ్, స్పోర్ట్స్ మీట్ చైర్మన్ ప్రొఫెసర్ దక్షిణమూర్తి శర్మ, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ వెంకటనారాయణ పాల్గొన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరానే ధ్యేయం తిరుపతి రూరల్: వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే ధ్యేయంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న శ్రీకరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ చంద్రశేఖరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవాశీర్వాదంతో కలిసి తిరుపతి జిల్లా నారాయణవనం మండలం బ్రాహ్మణ తాంగేళిలో పర్యటించారు. ఆ గ్రామంలో విద్యుత్ లైన్లను పరిశీలించి, సరఫరా తీరుపై వినియోగదారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రూఫ్ టాప్ సోలార్, స్మార్ట్ మీటర్ల ఉపయోగాలను వినియోగదారులకు వివరించారు. సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే స్మార్ట్ మీటర్ల అంశంపై వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. -
ఎస్టీఐ వ్యాధులపై అవగాహన కల్పించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఎస్టీఐ(సెక్సువలీ ట్రాన్సి ్మటెడ్ ఇన్ఫెక్షన్స్) వ్యాధులపై విస్తృత అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని కార్యాలయంలో మంగళవారం ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్టీఐ వ్యాధులపై అవగాహన కల్పించే గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే సిఫిలిస్, గనేరియా, శాంక్రాయిడ్, గోనోకోకల్ వంటి వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విచ్చలవిడి శృంగారం ద్వారా ఈ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే మొదటి దశలోనే గుర్తించి వైద్యులు చికిత్స అందిస్తే వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పడతాయన్నారు. అందుకే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లా డుతూ.. క్షేత్రస్థాయి సిబ్బంది నాణ్యమైన నమూనాల (క్వాలిటీ శాంపిల్స్) సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సరైన నమూనాలు పరీక్షించినప్పుడే పాజిటివ్ కేసులు గుర్తించగలమని, ఆ దిశగా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. డాక్టర్లు రెఫర్ చేసిన అన్ని రకాల రక్త పరీక్షలను ల్యాబ్లో తప్పనిసరిగా నిర్వహించాలని, పాజిటివ్ కేసులు గుర్తించిన వెంటనే వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. -
ఒకే నంబరు.. 2 బోర్వెల్స్
పరిశోధనలకు అవకాశాలు కల్పించాలి నారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసుకోవడానికి సరైన వసతులను కల్పిస్తే పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుందని తిరుపతి రతన్టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్) సీఈఓ విజయవంత్ మాథూర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా మంగళవారం 16వ నేషనల్ లెవెల్ టెక్నిరల్ సింపోజియం సిద్ధార్థ క్వెస్ట్–2కే26ను నిర్వహించారు. క్వెస్ట్లో వివిధ కళాశాలల నుంచి 575 పేపర్ ప్రెజెంటేషన్లు నమోదు కాగా 10 బ్రాంచీల నుంచి 510 పేపర్లు ప్రజెంటేషన్లను ఎంపిక చేశారు. పరిశోధనల పరస్పర సహకారానికి రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. విజరయ్వంత్ మాథూర్ మాట్లాడుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజినీరింగ్ విద్యార్థులకు సరైన ప్లాట్ఫామ్ను కల్పించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సునీల్కుమార్ (ఐఐటీ, తిరుపతి), సాంబయ్య (జేఎన్టీయూ), ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలతో అభయం
చిరుత భయం.. చిరుతల నుంచి రక్షించుకోవాలి చిత్తూరు కార్పొరేషన్: ఇటీవల జిల్లాలోని పలు గ్రామాల సమీపంలో చిరుతల సంచారం పెరుగుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పశువులపై దాడి చేసి సంఘటనలు జరిగాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతల సంచారం సహజమని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుతల రాకపై అనుమానాలు ఉంటే సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఆహారం కోసం సాధారణంగా చిరుతలు ఎక్కడైనా మనుగడ సాగించగల పిల్లి జాతి జంతువులు. వీటికి దట్టమైన అడవులే అవసరం లేదు. అటవీ ప్రాంతాల్లో మేత కోసం గొర్రెల మందలను తీసుకెళ్లే సమయంలో వాటి వెంట నడిచే కుక్కల శబ్దం చిరుతను ఆకర్షిస్తుంది. దీంతో మందలను చిరుతలను అనుసరిస్తూ గ్రామాల్లోకి గాని, గొర్రెల మందలు నిలిపే పెంటల వద్దకు గానీ చిరుతలు చేరుకుంటాయి. అదును చూసి అక్కడ ఉండే కుక్కలను ఎత్తుకు పోతుంటాయి. అప్పుడప్పుడూ ఇతర జీవుల పై దాడులు చేస్తుంటాయి. పెద్దపులులు అభయారణ్యంలో ఉండడంతో సహజంగా చిరుతలు జనావాసాల సమీపంలో తిరుగాడడం సహజమైన అంశమే. ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులపై దాడి సాధారణంగా చిరుతలు ఆహారం కోసం మనుషులపై దాడులు చేయవు. రెండు కాళ్లపై సంచరించే ఏ జంతువు (మనిషి) చిరుతలకు ఆహారం కాదు. చిరుతలు మనుషులకు కనిపించకుండానే సంచరించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అటవీ ప్రాంతాల్లో పిల్లలతో సంచరించేటప్పుడు పెద్దవారు తగు జాగ్రత్తలతో ఉండాలి. అటవీ ప్రాంతాల్లో వంగి పనిచేయడమో, ఆహారం తినేందుకు కింద కూర్చోవడమో చేయడం ద్వారా చిరుతలకు మనుషులు ఆహారం జంతువులుగా అనిపిస్తారు. ఈ సమయంలోనే ఎక్కువ దాడులు జరుగుతుంటాయి. అప్రమత్తంగా ఉండాలి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప చిరుత సాధారణంగా మనుషులపై దాడి చేయడానికి సిద్ధమవ్వడు. చిరుత అడవుల్లో కాక, మైదాన ప్రాంతాలు, పట్టణ శివార్లలోనూ ఉండగలిగే వన్యప్రాణి. చిరుతలకు కుక్కలపై మక్కువ ఎక్కువ. అందకే వాటిని అనుసరిస్తూ గ్రామాల్లోకి, అటవీ సమీప జనావాసాల్లోకి వస్తుంటాయి. జనావాసాల్లో చిరుత కనిపిస్తే దాడి చేయొద్దు. వెంటనే సమీపంలోని అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. చిరుతలాంటి వన్యప్రాణులకు హాని కలిగిస్తే శిక్షార్హులవుతారు. – సుబ్బురాజు, డీఎఫ్ఓ


