breaking news
Chittoor
-
ఎందుకో హంగామా?
నియామకమా..మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెగబడింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానాహంగామా సృష్టించింది. తీరా అర్హులకు న్యాయం చేశారా.. అని చూస్తే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామాకు తెరలేపింది. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపు మూడు వేల మందిని తరలించాలని టార్గెట్ విధించింది. దీనిపై పలువురు మండిపడుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది. 150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మొండిచేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్డెస్క్కు కాల్ చేశారు. చిత్తూరు డీఈవో కార్యాలయానికి పరుగులు పెట్టారు. న్యాయం చేయండి మహాప్రభో అంటూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. అయితే అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేని దుస్థితిలో మిగిలిపోయారు. డీఎస్సీ పేరుకే తిలోదకాలు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్టిక్ సెలెక్షన్ కమిటీ) పేరుకు తిలోదకాలు వదిలింది. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు మొత్తం ఎన్నో ఏళ్లుగా జిల్లా స్థాయిలోనే జరిగేది. అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ కసరత్తులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన ఎంపిక జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు. ఎంపిక జాబితా పేరుతో ఐదు సార్లు ప్రచురించి, కాల్లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంక్లు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంక్లు వచ్చిన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో వందలాది మంది అభ్యర్థులు నష్టపోయారు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు న్యాయస్థానంలో 104 కేసులను వేశారని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అధికారిక సమాచారం. ప్రచార ఆర్భాటం మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాల పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార ంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 వేల మందిని విజయవాడకు పంపాలంటూ టార్గెట్ విధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టార్గెట్ విధించడంతో విద్యాశాఖ అధికారు లు తలలు పట్టుకుంటున్నారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులను కూడా విజయవాడకు తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపుతున్నారు. ఈ ప్రక్రియ తిరుపతి డీఈవో కేవీఎన్.కుమార్ పర్యవేక్షణలో సాగుతోంది. ఇందుకు ప్రత్యే కంగా 70 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వేలాది మంది అభ్యర్థులు మెగా డీఎస్సీలో నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని పలువురు మండిపడుతున్నారు. డీఎస్సీ నియామకపత్రాల పంపిణీ 19వ తేదీన నోటిఫైడ్ పోస్టులు 1,478 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు 1,408 విజయవాడ తరలింపుకు విధించిన టార్గెట్ 3వేల మంది ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్సులు 70 ప్రయాణం చేయాల్సిన దూరం – తిరుపతి – విజయవాడ 418 కి.మీ -
పశువైద్యం..కడు దైన్యం
జిల్లా పశు వైద్యశాల గాడితప్పింది. ఆస్పత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలువురు ఆస్పత్రి అధికారులు, సిబ్బంది విధులకు ఢుమ్మా కొట్టడం రివాజుగా మారుతోంది. సమయపాలనకు స్వస్తి పలకడంతో తాళం పడుతోంది. ఒక్క డాక్టరే దిక్కుగా మారిన ఈ ఆస్పత్రి.. వైద్య సేవల విషయంలో మూగబోయింది. సమస్యలు ఏకరువు పెడుతున్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్లో జిల్లా పశువైద్యశాల ఉంది. ఇక్కడికి నిత్యం 100కు పైగా ఓపీలు వస్తున్నాయి. పశువులతో పాటు మేకలు, గొర్రెలు, కోళ్లు, కుక్కలు, ఇతర పెంపుడు జంతువులను తీసుకొస్తుంటారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. చిత్తూరుతో పాటు బంగారుపాళ్యం, పూతలపట్టు, గుడిపాల, యాదమరి, తవణంపల్లి మండలాల నుంచి కూడా అధికంగా వస్తున్నారు. అయితే ఇక్కడ అత్యవసర వైద్యం ఆమాడదూరంలో నిలుస్తోంది. వైద్య బృందం ఉదయం ఆలస్యంగా రావడంతో పాటు సాయంత్రం 4.30 గంటలకే తాళం వేసి వెళ్లిపోతున్నారు. ఆపై వచ్చిన పాడి రైతులు, పెంపుడు జంతువులకు వైద్యం అందని ద్రాక్షగానే మారుతోంది. డాక్టరు లేరని ఇంటిబాట పడుతున్నారు. లేకుంటే ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఒక్క డాక్టర్తోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఆ డాక్టర్ సెలవు పెడితే కాంపౌడరే ఈ వైద్యశాలను నడిపించాల్సిన దుస్థితి ఏర్పడింది. 24 గంటలు పనిచేయాల్సిన ఈ ఆస్పత్రి 8గంటలు మాత్రమే నడుస్తోంది. రోజుల తరబడి సెలవుల్లోకి వెళ్లిపోతున్నారు. జంతు ప్రియులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారు లు స్పందించి డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు పనిచేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు. మృత్యువాత పడుతున్నాయి మూగజీవులకు ఆస్పత్రిలో తాగునీటి సదుపాయం లేదు. పాడి రైతులకు సైతం సరైన సదుపాయాలు లేవు. రైతులు రాత్రి పూట బస చేసేందుకు వసతులు లేవు. ఆస్పత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చి పదుల సంఖ్యల్లో మూగజీవులు ఆస్పత్రి ఆవరణలోనే మృత్యువాతపడ్డాయి. ప్రధానంగా లక్షలాది రూపాయల విలువ చేసే ఆవులు చనిపోతున్నాయి. బతకదనే వాటిని కళేబరాలకు ఇచ్చి వెళ్లిపోతున్నట్లు పలువురు వాపోతున్నారు. మందుల్లేవ్సరైన వైద్యం అందక పోగా.. ఆస్పత్రిలో అత్యవసర మందులు కరువయ్యాయి. మూగజీవులకు జ్వరం, మేత మందులు, ప్రసవ మందులు, కుక్క కరిచిన మందులు మాత్రమే ఉన్నాయి. ఆవులకు కాల్షియం లోపం, పాస్పరస్, ఐరన్ లోపం తదితర మందులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పశువుకు వేసిన నీడిల్, సిరంజన్ను ఇతర వాటికి కూడా వాడేస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత మందులు కూడా కనుమరుగవుతున్నాయి. ఈ తరుణంలో సిబ్బందికి, జంతు ప్రియులకు మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా పశువైద్య ఆస్పత్రిలో అస్తవ్యస్తం సాయంత్రం ఐదు గంటలకే తాళాలు -
స్పష్టత ఇవ్వాలి
మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా ఈనెల 15న ప్రచురించారు. ఆ తర్వాత నష్టపోయిన అభ్యర్థులు న్యాయం కోసం పరుగులు పెడు తున్నారు. కాల్లెటర్లు పంపించి, సర్టిఫికెట్లు పరిశీలించి ఉద్యోగం వస్తుందన్న అధికారులే నేడు ఉద్యోగం రాలేదని పేర్కొనడం బాధిస్తోంది. జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన డీఎస్సీ ప్రక్రి య రాష్ట్ర స్థాయిలో నిర్వహించడంలో దాగి ఉన్న రహస్యమేమిటో తెలియని దుస్థితి. తుది జాబితా అనంతరం హెల్ప్డెస్క్కు ఫిర్యాదు చేసి న్యాయం కోసం వస్తున్న అభ్యర్థులకు స్పష్టత ఇవ్వాలి. – రెడ్డిశేఖర్రెడ్డి, వైఎస్ఆర్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ -
చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మంగళవారం దేవరాజులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన దేవరాజులు ఓ ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తొమ్మిదేళ్లుగా ఇతను భార్యాబిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళతో చనువు ఏర్పడడంతో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల దేవరాజులు భార్య, పిల్లలు తరచూ అతని వద్దకు వస్తూ వెళుతున్నారు. దీంతో కుటుంబంలో కలహాలు రేగాయి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకొని ఇంటి పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్లో 01 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 77,043 మంది స్వామివారిని దర్శించుకోగా 41,859 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వెల్డింగ్ కార్మికుడి మృతి రొంపిచెర్ల: స్టోన్ క్రషర్ వద్ద వెల్డింగ్ కార్మికుడు మృతి చెందినట్లు కల్లూరు సీఐ జయ రాం నాయక్ తెలిపా రు. సీఐ కథనం.. రొంపిచెర్ల మండలం, బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ, పులిచెర్ల రోడ్డులోని బాలాజీ స్టోన్ క్రషర్లో కర్ణాటక రాష్ట్రం, చిక్కమంగళూరులోని కడూర్కు చెందిన షెక్ రసూల్ (49) వెల్డింగ్ పనికోసం రెండు రోజు క్రితం వచ్చాడు. మంగళవారం క్రషర్లో పనిచేస్తు సమయంలో గట్టిగా కేక వేసి కింద పడ్డాడు. సమీపంలోని మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు వచ్చి రసూల్ను లేపారు. అయితే రసూల్లో చలనం లేదు. చికిత్స కోసం అన్నమ్మయ్య జిల్లా, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే రసూల్ మృతి చెందినట్టు నిర్ధారించారు. రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్లూరు సీఐ జయరాంనాయక్, ఎస్ఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుమత్ షాక్తో మృతి చెందారా? పై నుంచి కింద పడి మృతి చెందారా..? అనేది పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. -
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రికలపైన, పత్రికా విలేకరులపై ఈ మధ్య కాలంలో అనేక కేసులు బనాయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పత్రికల ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్న జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపి దాడులు చేయడం అన్యాయం. అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాయడం కరెక్టు కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పెట్టిన కేసులను ఎత్తివేయాలి. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి -
పింఛన్ పెంపు..ఎప్పుడో చెప్పు?
రొంపిచెర్ల: నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడికి వికలత్వం 90 శాతం ఉన్నా ప్రభుత్వం రూ.6 వేలు మాత్రమే పింఛను ఇస్తోంది. రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందని రొంపిచెర్ల మండలానికి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచెర్ల మండలం, గానుగచింత గ్రామ పంచాయతీ, నగిరి దాసరిగుడెంకు చెందిన బాధితుల కథనం.. గ్రామానికి చెందిన కొరివి కుమారి కుమారుడు కె.గణేష్(10) పుట్టుకతోనే దివ్యాంగుడు. నడవలేని స్థితిలో ఉన్నాడు. అతనికి అన్నం పెట్టడానికి, చూసుకోవడానికి ఒకరు పక్కనే ఉండాల్సిందే. డాక్టర్లు కూడా బాలుడిని పరిశీలించి 90 శాతం వికలత్వం ఉన్నట్టు సర్టిఫికెట్ మంజూరు చేశారు. అయితే ఇతనికి పింఛను రూ.6 వేలు వస్తోంది. రూ.15 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని మొరపెట్టుకున్నా ఎవ్వరూ కనికరించలేదు. ఆస్పత్రిలో చికిత్సల ఖర్చుకు కూడా చాలడం లేదని, తన భర్త నాలుగు నెలల క్రితం మృతి చెందాడని కుమారి బోరున విలపిస్తున్నారు. మందులు కావాలన్నా అప్పు చేయాల్సి వస్తోందన్నారు. ఇద్దరు ఆడ బిడ్డలు, ఒక కుమారుడు ఉండగా వారిలో ఒక కుమార్తెకు వివాహం చేశామని, మరో కుమార్తె కూడా దివ్యాంగురాలేనని తెలిపారు. ఇప్పుటికై న అధికారులు స్పందించి రూ.15వేల పెన్షన్ ఇప్పించాలని కోరారు. పవిత్రోత్సవాలకు అంకురార్పణపుత్తూరు: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవాన్ని మేళతాళాల మధ్య నిర్వహించారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయని, దోషాల నివృత్తితో ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాల్లో ఈనెల 17న బుధవారం తొలిరోజున పవిత్ర ప్రతిష్ట, 18న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు, చివరిరోజు 19న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన నిర్వహిస్తామని వెల్లడించారు. పవిత్సోవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ఆలయ మహాగోపురం వద్ద వేదమంత్రోచ్ఛాణల మధ్యన అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ పు ష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. కార్య క్రమాలను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. విమానాశ్రయంలో యాత్రి సేవా దివస్ రేణిగుంట: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని తిరుపతి విమానాశ్రయంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయ డైరెక్టర్ బూమినాథన్ తెలిపారు. ఆయన మంగళవారం విమానాశ్రయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రయాణికులను స్వాగతించడం, ఎస్వీ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో జానపద నృత్య కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్కృతితో ప్రయాణికులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు చేయడానికి వైద్య, రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనంగా, విమానాశ్రయంలో ఆటో టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం ద్వారా ప్రయాణించే పిల్లలకు క్విజ్, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. విమానాశ్రయం లోని పరిస్థితులను వివరించేందుకు స్థానిక పాఠశాల విద్యార్థులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. -
ప్రశ్నించే గొంతుకపై కక్ష
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం అన్యాయం. ఒక నాయకుడు ప్రెస్మీట్లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే మీడియాపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇలా కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై గౌరవభావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు, వాక్స్వాతంత్య్రపు హక్కుకు సంకెళ్లు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నా?. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ధోరణిని మానుకోవాలి. అన్యాయంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – చైతన్య, విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి
మాట్లాడుతున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప ఏటవాకిలి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, ఎంపీపీ భాస్కర్రెడ్డి పుంగనూరు: క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయనున్నట్టు మాజీ ఎంపి రెడ్డెప్ప స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీలోని 10వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, కన్వీనర్ వజ్రభాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగ భూషణంతో కలిసి వార్డు స్థాయి విస్తృత సమావేశాలు నిర్వ హించారు. అలాగే మండలంలోని ఏటవాకిలి గ్రామంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, ఎంపీపీ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ నిర్మాణ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు, గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు, విధివిధానాలు, ప్రజల భాగస్వామ్యంతో యువత, మహిళలు, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కల్పించాల్సిన ప్రాతినిధ్యంపై చర్చించారు. రెడ్డెప్ప మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. కమిటీ సభ్యులతో నేరుగా పెద్దిరెడ్డి మాట్లాడే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశాల్లో పట్టణ, రూరల్ అధ్యక్షులు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి పాల్గొన్నారు. -
వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు?
కుక్కకు జబ్బు పడిందని వచ్చాను. ఇక్కడకు వస్తే తాళం వేసి వెళ్లిపో యారు.టైం సాయంత్రం 5గంటలే. ఇలా అయితే మూగ జీవులు ఎలా.. ?. 24 గంటల పాటు ఈ ఆస్పత్రి పనిచేయాలి. వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు. డాక్టరు లీవు అయితే మిగిలిన వాళ్లు కనీసం ప్రథమ చికిత్స కూడా అందించ డం లేదు. – రాజా, ఒబన్నపల్లి, చిత్తూరు కుక్కకు ఇన్ఫెక్షన్ అయ్యింది నేను పూతలపట్టు మండలం, పాటూ రు నుంచి వచ్చా. కుక్కకు ఇన్ఫెక్షన్ అయ్యింది. 24 గంటలు ఈ ఆస్పత్రి ఉంటుందని అనుకున్నా. ఇక్కడకు వచ్చాక తెలిసింది ఈ ఆస్పత్రిని సాయంత్రం 5 గంటలకే మూసేస్తారని. ఇలా అయితే ఎలా..? – గుణవతి, పాటూరు, పూతలపట్టు మండలం -
కనీస వేతనాలుండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎన్ఎంఆర్, మజ్దూర్ వర్కర్లకు మార్కెట్ రేట్లకు అనుగుణంగా కనీస వేతనాలుండాలని డీఆర్వో మోహన్కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఎన్ఎంఆర్, మజ్దూ ర్ వర్కర్లకు కనీస వేతనాల పెంపుపై జిల్లా కార్మికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కేటగిరీలలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాట్రాక్ట్, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు ఉంటుందన్నారు. మున్సిపాలిటీలలో పనిచేసే వర్కర్లకు కనీస వేతనం 10 శాతం పెంపునకు మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో సహాయ కార్మిక కమిషనర్ ఆలోచన, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చుక్కలతో ప్రధాని చిత్రం చిత్తూరు కలెక్టరేట్ : దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పదోతరగతి విద్యార్థి లోహిత్ చుక్కలతో ఆయన చిత్రపటా న్ని గీశాడు. నగరంలోని వరదప్పనాయుడు నగరపాలకోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లోహిత్ టెక్పాయింట్ బ్లాక్ పెన్ తో ప్రధాని చిత్రాన్ని వేసి జన్మదిన శుభాకాంక్ష లు తెలిపారు. ఆ పాఠశాల హెచ్ఎం భానుప్రభ, పలువురు టీచర్లు విద్యార్థిని అభినందించారు. -
కుండపోత వర్షం
కాణిపాకం: చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. ఈ రెండు నియోజకర్గ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మోకాటిలోతు వరకు నీళ్లు నిలిచాయి. అలాగే చిత్తూరు రూరల్, గుడిపాల, తవణంపల్లి, ఐరా ల, బంగారుపాళ్యం, యాదమరి, పూతలపట్టు మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. జిల్లా టూరిజం అధికారిగా నరేంద్ర చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా టూరిజం (పర్యాటక)శాఖ అధికారిగా ప్రొఫెసర్ ఏ.ఎం.నరేంద్ర నియమితులయ్యా రు. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా కేంద్రంలోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న నరేంద్రను డిప్యూటేషన్ విధానంలో జిల్లా టూరిజం అధికారిగా నియమించారు. ఆయన నియామకం పట్ల సావిత్రమ్మ కళాశాల, పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఐటీఐ అడ్మిషన్లకు అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో నాల్గవ విడత అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించారని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీల భర్తీకి నాల్గవ విడత అడ్మిషన్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అడ్మిషన్లకు ఈనెల 17 నుంచి 27వ తేదీ వరకు www.iti.ap.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎలాంటి కాల్లెటర్స్ పంపమని తేల్చిచెప్పారు. దరఖాస్తు చేసుకునే ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు ఈనెల 29, ప్రైవేట్కు 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు 7799679351, 9440738121, 9182590869 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. రెండు నెమళ్లు మృతి పుంగనూరు: మండలంలో రెండు నెమళ్లు మృతి చెందాయి. మండలంలోని కృష్ణాపురం వ్యవసాయ పొలాల వద్ద మంగళవారం రెండు నెమళ్లు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ సిబ్బంది వచ్చి మృతి చెందిన నెమళ్లను పోస్టుమార్టానికి తరలించారు. నెమళ్ల మృతికి గల కారణాలను పరిశోధిస్తున్నామని తెలిపారు. రూ.24.05 లక్షల ఆదాయం చౌడేపల్లె: బోయకొండ గంగాపురంలో మంగళవారం నిర్వహించిన షాపింగ్ కాంప్లెక్స్ రూముల అద్దె లీజు వేలం పాటల ద్వారా ఆలయానికి రూ.24.05 లక్షల ఆదాయం చేకూరినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆలయానికి చెందిన 45 షాపింగ్ రూములు మూడేళ్లపాటు అద్దెకిస్తూ వేలం నిర్వహించినట్టు వెల్లడించారు. ఇంకనూ 40 రూములున్నాయని, బుధవారం యథావిధిగా వేలంపాట జరుగుతుందని ఈఓ పేర్కొన్నారు. స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్లకు అవకాశం చిత్తూరు కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్ షిప్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ విక్రమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు కొత్తగా, రెన్యూవల్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. జిల్లా వాప్తంగా అర్హత ఉన్న విద్యార్థులు కళాశాల జ్ఞానభూమి లాగిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఆయా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ విద్యార్థుల పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల రిజిస్ట్రేషన్ పగడ్బందీగా ఈనెల 30వ తేదీ లోపు చేపట్టాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్, ఆధార్ అతంటికేషన్ గ్రామవార్డు సచివాలయాల్లో సంక్షేమ సహాయకుల లాగిన్లో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని డీడీ కోరారు. నేడు ట్రాన్స్కో ఉద్యోగుల నిరసన చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా జేఏసీ నాయకులు యజ్ఞేశ్వరరావు, వివేకానందరెడ్డి, చంద్రమౌళి తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొని జయపద్రం చేయాలని కోరారు. -
హోం వర్క్ రాయలేదని.. తల పగులగొట్టేశాడు!
పుంగనూరు: హోంవర్క్ రాయలేదని హిందీ టీచర్ 6వ తరగతి బాలిక తలను బ్యాగ్తో పగులగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలను సీజ్ చేయాలంటూ బాధితురాలి తల్లి, విద్యార్థి సంఘాలు మంగళవారం పాఠశాలను ముట్టడించాయి. విద్యార్థిని తల్లి తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు పట్టణంలోని నాగపాళెంలో నివాసం ఉన్న హరి, విజేత దంపతుల కుమార్తె సాత్విక నాగశ్రీ (11) స్థానిక భాష్యం పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తల్లి విజేత అదే పాఠశాలలో పనిచేస్తోంది. ఇలా ఉండగా ఈ నెల 10న ఉదయం క్లాసులో హిందీ హోంవర్క్ రాయలేదంటూ టీచర్ సలీంబాషా బ్యాగుతో విద్యార్థిని తలపై బలంగా కొట్టాడు. ఆ బాలిక నొప్పితో అల్లాడిపోయింది. తల్లి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించింది. అనంతరం బెంగళూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు చేయించారు. తలలో ఎముకలు విరిగిపోయాయని, చికిత్సకు సుమారు రూ.15 లక్షల మేరకు ఖర్చు అవుతుందని తెలియజేశారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలతో కలసి మంగళవారం పాఠశాల గేటుకు గడియ పెట్టి, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ కార్యదర్శి మున్న ఆధ్వర్యంలో పాఠశాలను ముట్టడించి నిరసన తెలిపారు. బాలికను కొట్టిన టీచర్, ప్రిన్సిపల్ను అరెస్ట్ చేయాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ధనుంజయ, ప్రవీణ్, రాజేష్, లోకేష్, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. కేసు నమోదు విద్యార్థిని గాయపరిచిన కేసులో ప్రిన్సిపల్ సుబ్రమణ్యం, హిందీ టీచర్ సలీంబాషాపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. కాగా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఎంఈవో విచారణ విద్యార్థినిని గాయపరిచిన కేసుకు సంబంధించి భాష్యం పాఠశాలలో విచారణ చేపట్టినట్లు ఎంఈవో నటరాజారెడ్డి విలేకరులకు తెలిపారు. పాఠశాలలో పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదికలను డీఈవో, జిల్లా కలెక్టర్కు పంపుతామని ఆయన వెల్లడించారు. పాఠశాలను ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలుపుతున్న విదార్థిని తల్లి -
తెప్పోత్సవానికి పోటెత్తిన భక్తులు (ఇన్సెట్) ప్రత్యేక అలంకరణలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి
● నేత్రపర్వం.. తెప్పోత్సవంప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి తెప్పపై విహరిస్తూ మంగళవారం కనువిందు చేశారు. ఉదయం మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం, అనంతరం చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి సిద్ధిబుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని వేంచేపుగా పుష్కరిణి వద్దకు తీకొచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి వారిని సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు అభమిచ్చారు. పోటెత్తిన భక్తులు తెప్సోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవ ఘట్టం చివరిది కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం క్యూలన్నీ నిండిపోయాయి. భకుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెప్పోత్సవంతో కాణిపాక వరసిద్ధుని ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. –కాణిపాకంనష్టాల పాలుపాలు పితుకుతున్న పాడి రైతు -
ప్రైవేట్ స్కూల్లో దారణం.. విద్యార్థిని తల చిట్లేలే కొట్టిన టీచర్
చిత్తూరు జిల్లా: పుంగునూరులో ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. భాష్యం స్కూల్లో ఆరో తరగతి విద్యార్థిని సాత్విక నాగశ్రీ(11) తలపై ఉపాధ్యాయుడు తలపై కొట్టాడు. దాంతో ఆ బాలిక పుర్రె చిట్లినట్లుగా ఎక్స్రేలో గుర్తించారు వైద్యులు. ఇది ఐదు రోజుల క్రితం జరగ్గా, ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. అయితే బాలిక తల్లి ఫిర్యాదును ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. ప్రస్తుతం మదనపల్లె ప్రైవేటు ఆస్పత్రిలో బాలిక వైద్యం చేయించుకుంటోంది. దీనిపై పోలీసులకు నిన్న(సోమవారం) రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి విజేత. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తిరుపతి: అలిపిరిలో ఘోర అపచారం
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహా విష్ష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసింది. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. ‘హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. హిందూ దేవుళ్ల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారు. తక్షణమే టిటిడి చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి. హిందుత్వ సంఘాలు , మఠాధిపతులు మేల్కొవాలి’ అని భూమన డిమాండ్ చేశారు. -
మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, కుప్పం, చిత్తూరు, పుత్తూరు పలు ప్రాంతాల నుంచి మెగా డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు డీఈవో కార్యాలయానికి విచ్చేశారు. ర్యాంకు, మార్కుల పరంగా అర్హత ఉన్న తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. పీఈటీ, ఇతర కేటగిరిలతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఎంపికై న వారి సర్టిఫికెట్లు సమగ్రంగా విచారించలేదని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీల్లో అనర్హులకు అందలం ఎక్కించారన్నారు. తుది జాబితాలో 1,408 మంది ఎంపిక రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సోమవారం ప్రచురించిన మెగా డీఎస్సీ తుది జాబితాలో 1,408 మంది ఎంపికై నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లలో 1,478 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ తుది జాబితా ప్రచురణ నాటికి పలు కేడర్లలో 1,408 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. తుది ఎంపిక జాబితాలను కలెక్టరేట్, డీఈవో కార్యాలయ నోటీసు బోర్డులలో ప్రచురించారు. తుది జాబితాలో అభ్యర్థులకు ఎవరైనా అభ్యంతరాలున్నట్లైతే కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ 8498991250 నెంబర్లో తెలియజేయాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ‘ఏడేళ్ల నుంచి డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యా.. డీఎస్సీలో ఎంపికయ్యా. కాల్లెటర్ పంపారు. సర్టిఫికెట్లన్నీ పరిశీలించి ఓకే అన్నారు. చివరికి తుది ఎంపిక జాబితాలో ఎంపిక కాలేదని చెప్పారు’..అంటూ పలమనేరుకు చెందిన సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే తక్కవ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టులు వచ్చాయన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక తమ ఆశలను నీరుగార్చడం అన్యాయమని ఆవేదన చెందాడు. ‘ఎస్జీటీ పోస్టుకు ఎంపికై నట్లు మెసేజ్ పంపారు. కాల్లెటర్ జారీచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన మొత్తం పూర్తి చేశారు. ప్రస్తుతం తుది జాబితాలో నా పేరు లేదు..’ అని శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళా అభ్యర్థిని కన్నీరుపెట్టుకున్నారు. సోమవారం డీఈవో కార్యాలయానికి విచ్చేసిన తనకు జరిగిన అన్యాయంపై అధికారులను ప్రశ్నించారు. తన తర్వాత ర్యాంక్ ఉన్న వారికి పోస్టు ఇచ్చారని ఆరోపించారు. ఈ ఇద్దరే కాదు.. సోమవారం చిత్తూరు డీఈవో కార్యాలయానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వందలాది మంది అభ్యర్థులు క్యూకట్టారు. కాల్లెటర్లు అందిన తమను ఎందుకు ఎంపిక చేయలేదంటూ అధికారులను ప్రశ్నించారు. ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. -
న్యాయం జరగడం లేదయ్యా!
‘ఎన్ని సార్లు మొరపెట్టుకుంటున్నా.. తమకు న్యాయం జరగడం లేదయ్యా’ అంటూ అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారులు విచ్చేసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 339 అర్జీలు వచ్చినట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ విద్యాధరిసిమెంట్ రోడ్డు మంజూరు చేయాలి తమ గ్రామానికి సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలంటూ గంగాధరనెల్లూరు మండలం, కుప్పనపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ గ్రామానికి చెందిన యువరాజ్ మాట్లాడుతూ తమ గ్రామానికి గత 30 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేదన్నారు. ఎస్ఎస్ కొండ నుంచి తమ గ్రామానికి సిమెంట్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. -
దసరా మహోత్సవాలకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్/ చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు జిల్లా అధికారులకు ఈఓ ఏకాంబరం సోమవారం ఆహ్వాన పత్రికలు అందజేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జేసీ విద్యాధరి, డీఎఫ్ఓ భరణి, పలమనేరు ఆర్డీఓ భవానితోపాటు పలువురు అధికారులకు ఆహ్వాన పత్రికలు అందజేసి అందజేసి సత్కరించారు. కుటుంబ సమేతంగా దసరా వేడుకల్లో పాల్గొనాలని కోరినట్లు ఈఓ తెలిపారు. నిందితుడికి రిమాండ్ చిత్తూరు అర్బన్: ప్రభుత్వాస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. చిత్తూరు నగరానికి చెందిన మొగిలీశ్వర్ అనే విద్యార్థి రక్తగాయాలతో శుక్రవారం రాత్రి జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించాడు. చికిత్స చేసే క్రమంలో వైద్యులకు.. విద్యార్థి, అతని స్నేహితులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. ఆపై విద్యార్థి, అతని స్నేహితులు కలిసి ముగ్గురు వైద్యులను చితకబాదారు. ఓ వైద్యుడి ముక్కును పగులగొట్టారు. దీంతో వైద్యులు నిరసనకు దిగడం, ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మొగిలీశ్వర్ను సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. రెండు ద్విచక్ర వాహనాల ఢీ రొంపిచెర్ల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకుని ఒకరు మృతి చెందగా.. భార్యాభర్తలు తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారి, రొంపిచెర్ల మండలం, అదర్శ పాఠశాల సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. అన్నమ్మయ్య జిల్లా, పీలేరు మండలం, ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయకుమార్ (23), భార్య రాజేశ్వరి(20) ద్విచక్ర వాహనంలో పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన ఎం.ఎస్.మహమ్మద్ గౌస్పీర్(38) రొంపిచెర్ల నుంచి పీలేరు వైపు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఈ రెండు వాహనాలో ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గరుకి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మహమ్మద్ గౌస్పీర్ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆయన రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి ఒక భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కుటుంబ యాజమాని మృతి చెందడంతో వారి కుటుంబం రోడ్డున పడింది. భార్యాభర్తలు ఇరువురూ పీలేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రొంపిచెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మద్దతు వి‘ఫలం’!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ఽమాయవుతోంది. తోతాపురి కేజీకి రూ.4 నుంచి రూ.6 వరకు మాత్రమే చెల్లిస్తోంది. దీనిపై రైతులు రగిలిపోతున్నారు. ఫ్యాక్టరీలు కేజీ తోతాపురికి రూ.8 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపుపై ఆగ్రహానికి గురవుతున్నారు. కాయలు కొనుగోలు ఇలా... జిల్లాలోని 43 ఫ్యాక్టరీలో 31 ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలుకు ముందుకొచ్చాయి. ఈ ఫ్యాక్టరీలు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్ష మెట్రిక్ టన్నుల దాకా కొనుగోలు చేశాయి. అలాగే ర్యాంపులు 30,600 మంది రైతులు 1.44లక్ష మెట్రిక్ టన్నుల కాయలను ర్యాంపులకు తరలించినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే కాయలు ఫ్యాక్టరీలకు తరలించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు నగదు చెల్లించలేదు. కిలోకు రూ.6 వరకు చెల్లింపు కూటమి ప్రభుత్వం తోతాపురికి మద్దతు ధర ప్రకటించింది. ఫ్యాక్టరీలు కిలోకి రూ.8 చొప్పున కొనుగోలు చేయాల ని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక నిధి కింద మరో రూ.4 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే కొన్ని ఫ్యాక్టరీలు కిలోకి రూ.4 నుంచి రూ.6 వరకు చెల్లిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపులోనూ జాప్యం జరుగుతోంది. ముందే చెప్పిన ఫ్యాక్టరీలు మామిడి దిగుబడి, ఎగుమతిని దృష్టిలో ఉంచుకుని పళ్లగుజ్జు పరిశ్రమలు ఈసారి మామిడి కొనుగోలుపై ఆసక్తి చూపలేకపోయాయి. అయితే జిల్లా యంత్రాంగం పట్టుబడడంతో చాలా ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. తోతాపురి కేజీ రూ.4, రూ.5, రూ.6కే కొనుగోలు చేస్తామని బోర్డులు సైతం పెట్టాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించలేమని ఫ్యాక్టరీలు తేల్చి చెప్పాయి. మామిడికి దక్కని మద్దతు ధర చర్యలు ఉంటాయి మద్దతు ధర ఇవ్వాలని ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చాం. కిలోకి రూ.4 ఎక్కడా ఇవ్వడం లేదు. ఆ బ్యాంకు వివరాలు ఇస్తే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. మద్దతు ధర ఇవ్వకపోతే కరెంటు కట్ చేయిస్తాం. పొల్యూషన్ బోర్డు ద్వారా చర్యలు ఉంటాయి. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, చిత్తూరు -
స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ కల్పించాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు మీడియా సమావేశాల్లో తెలియజేసిన విషయాలను కూడా పత్రికల్లో వస్తే నేరమనడం హాస్యాస్పదం. లోటు పాట్లను గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యం పై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. సాక్షి పై కేసు నమోదు చేయడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. విమర్శలు చేస్తే కేసులు పెట్టడం, ప్రభుత్వ పరిపాలన లోపాలను ఎత్తిచూపితే మీడియా సంస్థలను నియంత్రించాలనుకోవడం అన్యాయం. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. – ప్రకాష్, విద్యావేత్త -
భూమిని ఆక్రమించేశారు!
తన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని నగరి మండలం, ఏకాంబరకుప్పానికి చెందిన దివ్యాంగురాలు దేవకి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ తనకు 1958 నుంచి సర్వే నం.245/261 లో భూమి ఉందని, కొందరు కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించుకున్నారని వాపోయారు. భూమిని కబ్జాచేసేందుకు కుట్ర తనపై దౌర్జన్యం చేసి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చౌడేపల్లి మండలం, రామయ్యగట్టుకు చెందిన సుబ్బులమ్మ వాపోయారు. గ్రామంలో 3 ఎకరాల భూమి ఉందని, కొందరు దౌర్జన్యం చేసి ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. స్థానిక అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గృహహింసకు పాల్పడుతున్నారు అత్తగారి ఇంట్లో గృహహింసకు పాల్పడుతున్నారని చిత్తూరు నగరం అమ్మ న్ కోయిల్ వీధికి చెందిన బాధితురాలు మీనాకుమారి వాపోయారు. న్యా యం చేయాలంటూ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. ఆమె మాట్లాడుతూ తన భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారన్నారు. పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా ఆయన ప్రవర్తనలో మార్పు లేదని ఆవేదన చెందారు. సర్వేయర్లు పట్టించుకోవడం లేదు తన భూమిని కొలిచేందుకు పలు మార్లు సర్వేకు దరఖాస్తు చేసుకున్నా సర్వేయర్లు పట్టించుకోవడం లేదని కార్వేటినగరం ఆర్కేవీబీపేటకు చెందిన దివ్యాంగుడు మోహన్ వాపోయారు. గ్రామంలో సర్వే నం.154–8 లో ఒక ఎకరా ఐదు సెంట్లు భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందని, దానికి హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేయించాలని కోరారు. -
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
ప్రభుత్వానికి మధ్య వారధిగా, ప్రభుత్వాల దుర్నీతి పాలనను ఎత్తి చూపుతూ రాసే కథనాలపై పత్రిక ఎడిటర్, విలేకరులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అనుసరిస్తోంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు పెట్టడం సరికాదు. వైఫల్యాలను, వాస్తవాలను రాస్తున్న సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధతి కాదు. సాక్షి పత్రిక, సిబ్బందిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. – వి.రెడ్డిశేఖర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు -
శోధించి..ఛేదించారు!
పలమనేరు: పక్కాగా రెక్కీచేసి తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలు చేస్తున్న దొంగను పలమనేరు పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం మీడియాకు తెలిపారు. పక్కాప్లాన్తో..! పలమనేరులోని రాధాబంగ్లాలో టీడీపీ నాయకుడు సాకేవూరు రామూర్తినాయుడి ఇల్లు చుట్టుపక్కల గృహాలు లేకుండా ఉంది. ఈ ఇంటికి తరచూ లాక్ చేసుండడాన్ని దొంగ గమనించి పక్కాస్కెచ్ వేశాడు. గత నెల 31న ఇంట్లో ఎవరూలేనిది గమనించి సాయత్రం ఐదు గంటలకే ఇంట్లోకి వెళ్లాడు. ఎలాంటి సమస్యా లేకుండా చోరీ చేశాడు. దీనిపై బాధితుడు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లాలోని క్రైమ్ పార్టీల ద్వారా విచారణ ముమ్మరం చేశారు. టెక్నికల్గా దొంగను పట్టుకున్నారు! ఎట్టకేలకు జిల్లా, డివిజన్, స్థానిక క్రైమ్పార్టీ నిందితున్ని సోమవారం పట్టణ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాకినాడకు చెందిన ఆడపాల వెంకట శివ(32)గా తెలిపారు. అతని వద్ద నుంచి చోరీకి సంబంధించిన మొత్తం రికవరీ చేశామన్నారు. తగ్గేదే లే! ఈ కేసులో పలమనేరు పోలీసులు పట్టుకున్న శివాపై ఇప్పటిదాకా ఏపీలో 12 కేసులున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాకినాడకు చెందిన శివ డిగ్రీ పూర్తిచేసి ఈజీ సంపాదన కోసం చోరీలకి తెగబడ్డాడు. ఆపై హైదరాబాద్లో సినీపరిశ్రమలో కొన్నాళ్లుండి ఆపై మళ్లీ కొత్త నేరాలకు దిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు చాలెంజ్గా తీసుకున్న డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ మురళీమోహన్, క్రైమ్ సీఐ ఉమామహేశ్వర్, ఏఎస్ఐ దేవా పలమనేరు సమీపంలోని ఆంజినేయ స్వామి ఆలయం వద్ద నిందితున్ని సోమవారం పట్టుకున్నట్టు తెలిపారు. నిందితున్ని కోర్టుకు రిమాండ్కు తరలించారు. ఇందులో సీఐ మురళీమోహన్, క్రైమ్ సీఐ ఉమామహేశ్వర్ ఉన్నారు. -
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల(కల్లూరు): పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. తాజాగా సోమవారం తెల్లారు జామున ఏనుగులు మండలంలోని కల్లూరు, తలారివారిపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను తొక్కిపాడేశాయి. కల్లూరుకు చెందిన రఫీ మామిడి చెట్లు, తలారివారిపల్లెకు చెందిన కోదండ పొలంలోని కొబ్బరి చెట్లు, జామ, మామిడి పంట, ధనుంజేయకు చెందిన డ్రిప్పైపులు, బోరు, మల్లికార్జునకు చెందిన మామిడి చెట్లను విరిచేశాయి. దాదాపు 13 ఏనుగుల గుంపు పంటలను నష్టపరిచినట్టు రైతులు పేర్కొన్నారు. పగటి పూట సమీప పెద్దవంక, గోగులమ్మ వంకల్లో ఉండి రాత్రి పూట పొలాలపై దాడిచేస్తున్నట్టు వాపోయారు. అట వీ అధికారులు స్పందించి ఏనుగుల కట్టడికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. చెక్డ్యాం కూల్చివేత రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలంలోని చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ, గురికివారిపల్లె సమీపంలో భూగర్భ జలాల అభివృద్ధి కోసం నిర్మించిన చెక్డ్యాంను కొందరు కూల్చి వేశారు. 2018–19లో ఉపాధి పథకంలో రూ. 5 లక్షల వ్యయంతో వంకలో ఈ చెక్ డ్యాంను నిర్మించారు. అయితే గత వారం క్రితం జేసీబీతో చెక్డ్యాంను కూల్చి వేశారు. వర్షం కురిసిన నీరు చెక్ డ్యాంలో నిలిచే పరిస్థితి లేదు. ఈ విషయమై ఎంపీడీవో, తహసీల్దార్, ఉపాధి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతు దొరబాబునాయుడు తెలిపారు. ఇప్పుటికై నా అఽధికారులు తగు చర్యలు తీసుకుని, చెక్ డ్యాం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పోలీసు గ్రీవెన్స్కు 36 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 36 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ రాంబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టండి చిత్తూరు కార్పొరేషన్: హోంమంత్రి అనిత మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి సూచించారు. జగనన్న మీద అవాకులు, చవాకులు మాట్లాడడానికి మాత్రమే ఆమె ఎక్కువగా మీడియా ముందుకు వస్తారన్నారు. ఇటీవల ఆమె మెడికల్ కళాశాలల పై నిర్వహించిన ప్రెజెంటేషన్తో కూటమి ప్రభుత్వ అసమర్థత బయటపడిందన్నారు. 15 నెలల్లో కనీసం రూ.15 కోట్లు కూడా మెడికల్ కాలేజీల నిర్మాణానికి పెట్టలేదని దుయ్యబట్టారు. పీపీపీలపై కొత్త వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,893 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,604 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
మాయాజాలం!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రయివేటు జూనియర్ కళాశాలలు అడ్మిషన్ల రిజిస్టర్లలో మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఒక కళాశాలలో చదివితే మరో కళాశాల నుంచి టీసీలిచ్చి పంపేస్తున్నాయి. అవగాహన లేక చాలా మంది మోసపోతున్నారు. ఉన్నత విద్యనభ్యసించాక స్టడీ కోసం వెళ్తే అసలు విషయం బయటపడుతోంది. ఇలాంటి కంత్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్ నాశనం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 64 ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ బోర్డు నియమ, నిబంధనలను అమలు చేయాల్సి ఉండగా.. అక్రమాలకు తెరలేపుతున్నాయి. ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతోంది. తనిఖీల్లో అలసత్వం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ రిజిస్టర్ల నిర్వహణ గందరగోళంగా ఉంది. అలసత్వంతో పాటు అడ్మిషన్ రిజిస్టర్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక్కో విద్యార్థి పేరును అడ్మిషన్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలంటే రెండేళ్లకు గాను రూ.20 వేల వరకు గుంజుతున్నారు. ఉదాహరణకు చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉండే ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు 20 మందిని ఉత్తమ ర్యాంకుల కోసం జీడీ నెల్లూరులో ఉండే ఓ ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లు రాయించారు. ఆ తర్వాత అక్కడే చదువుతున్నట్లు క్రియేట్ చేశారు. అక్కడ పేర్లను నమోదు చేసిన ఒక్కొక్క విద్యార్థికి రూ.20 వేల చొప్పున మొత్తం 20 మంది విద్యార్థులకు గాను రూ.4 లక్షలను మురుగానపల్లి కళాశాల నిర్వాహకులు జీడీ నెల్లూరు కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులు ఉండడంతో! జిల్లాలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పరిమితికి మించి విద్యార్థులను అడ్మిషన్లు చేసుకుంటున్నారు. అలా అధికంగా అడ్మిషన్లు చేసుకున్న విద్యార్థుల వివరాలను నిబంధనల ప్రకారం అడ్మిషన్ రిజిస్టర్లో నమోదు చేసేందుకు అవకాశం లేదు. నిర్ధేశించి గ్రూపునకు 88 మంది విద్యార్థులను మాత్రమే అడ్మిషన్ చేసుకోవాలి. అయితే జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 300 మంది విద్యార్థుల వరకు ఒక్కొక్క గ్రూపులో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఇలా అధికంగా ఉన్న విద్యార్థులను మరొక కళాశాలలోని అడ్మిషన్ రిజిస్టర్లలో అడ్మిషన్లు అయినట్టు రాయించి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 64 విద్యార్థుల సంఖ్య 75,897 అడ్మిషన్ రిజిస్టర్ల నిర్వహణలో లోపాలున్న కళాశాలలు 52 పక్కాగా అడ్మిషన్ రిజిస్టర్లు అమలు చేస్తున్న ప్రభుత్వ కళాశాలలు 31 అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ కళాశాలలు 36 మోసాలకు అడ్డూ అదుపే లేదు జిల్లాలోని అనేక ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ రిజిస్టర్లను సరిగా నిర్వహించడమే లేదు. ఈ విషయం ఇంటర్మీడియెట్ అధికారులకు సైతం తెలుసు. ఆ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొన్ని కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేర్చుకుని నిబంధనలకు విరుద్ధంగా మరొక కళాశాలలో చదివినట్లుగా అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లు రాయిస్తున్నారు. ఇలాంటి అవకతవకలు చాలా ప్రైవేట్ కళాశాలల్లో జరుగుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన ఇంటర్మీడియెట్ అధికారులు అటు వైపు కన్నెత్తే చూడటం లేదు. – షేక్ రెడ్డిమస్తాన్, స్టూడెంట్ యూనియన్ జేఏసీ వైస్ చైర్మన్, చిత్తూరు జిల్లా జిల్లా సమాచారం ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో కానరాని అడ్మిషన్ రిజిస్టర్లు .. ఇది ఒక్క వినయ్ పరిస్థితే కాదు.. జిల్లాలోని చాలా ప్రయివేటు కళాశాలల్లో ఇదే తంతు. పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరిలో ఉన్న పలు ప్రైవేట్ కళాశాలల్లో మాయాజాలం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు అడ్మిషన్ రిజిస్టర్లను తనిఖీ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
కిలో మామిడికి రూ.12 ఇచ్చి తీరాల్సిందే
చిత్తూరు కలెక్టరేట : జిల్లాలోని మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.12 ఇచ్చి తీరాల్సిందేనని జిల్లా మామిడి సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్, హరిబాబుచౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు, రైతులు సోమవారం మార్కెట్యార్డు నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మామిడి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి మామిడికి సీఎం ప్రకటించిన ప్రకారం కిలోకు రూ.12 చెల్లించి తీరాలన్నారు. మామిడి రైతులకు కచ్చితంగా ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వం తరఫున రూ.4 మొత్తం రూ.12 ఒకేసారి ఇవ్వాలన్నారు. సత్వరం రైతుల ఖాతాల్లో నగదు జమచేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలలు దాటినా..! ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 వేల మంది రైతులు ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేశారని, రెండు నెలలు దాటినా అటు ఫ్యాక్టరీలు, ఇటు ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు జమచేయకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.12 ఇవ్వకపోతే ఉద్యమాలే శరణ్యమని హెచ్చరించారు. ర్యాంపులు రూ.3, రూ.4 మాత్రమే చెల్లించాయన్నారు. ఫ్యాక్టరీలతో పాటు ర్యాంపుల అధినేతలు రూ.8 చెల్లించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల ఓపికను పరీక్షిస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల ఆఖరి లోపు మొత్తం నగదు చెల్లించాల్సిందేనన్నారు. గుడిపాల రైతుసంఘ నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ రైతులకు ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. గౌరవ అధ్యక్షులు ఆనందనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు మునీశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీలు తక్షణం రూ.8 చెల్లించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో అక్టోబర్ 1 నుంచి రహదారులు దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు, హేమలత, రైతులు భాస్కర్నాయుడు, మునిరత్నంనాయుడు, బెల్లంకొండ శ్రీనివాసులు, లవకుమార్రెడ్డి, సంజీవరెడ్డి, సందీప్, భారతి, చంద్రమౌళి, మురళి, త్యాగరాజులురెడ్డి పాల్గొన్నారు. -
పూలంగి సేవ
కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యే క బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పూలంగి సేవ నిర్వహించారు. సామాన్యుల సమస్యలకే ప్రాధాన్యం చిత్తూరు అర్బన్: సామన్యుల సమస్యలను తీర్చడానికే పోలీసుశాఖ పనిచేస్తుందని తుషార్ డూడి అన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా బాపట్లలో పనిచేస్తున్న ఈయన చిత్తూరులో సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. డూడి తన తల్లి సమక్షంలో చిత్తూరు 68వ ఎస్పీగా విధుల్లోకి చేరారు. పోలీసు అధికారులు స్వాగతం పలకగా.. మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం డూడి మాట్లాడుతూ మహిళలు, పిల్లల సంరక్షణతో పాటు.. సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలోని పోలీసుల్లో వృత్తి నైపుణ్యత పెంచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. ప్రజలకు పోలీసుశాఖపై నమ్మకం పెరిగేలా.. ప్రజలకు చేరువయ్యి కమ్యూనిటీ పోలీసింగ్ను బలోపేతం చేస్తామన్నారు. జిల్లా ప్రజానీకానికి శాంతిభద్రతల సమస్య రాకుండా ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పిస్తామన్నారు. సబ్–డివిజన్ల వారీగా సమీక్ష.. బాధ్యతలు తీసుకున్న తరువాత డూడి జిల్లాలోని సబ్–డివిజన్ల వారీగా డీఎస్పీలు, సీఐలతో సమీక్ష నిర్వహించారు. ఆయా సర్కిళ్లల్లో ప్రధాన సమస్యలు, నేరాల తీరుతెన్నును ఇన్స్పెక్టర్లు వివరించారు. సీఎంతో ఎస్పీల సమావేశం ఉండడంతో ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్లారు. -
సమానత్వం దిశగా అడుగులు
తిరుపతి అర్బన్ : తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సును తిరుపతిలో నిర్వహించడం శుభసూచికమని, ఇదే స్ఫూర్తితో ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం దిశగా అడుగులు వేద్దామని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. ఆదివారం తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో జాతీయ సదస్సు నిర్వహించారు. మూడురోజులపాటు నిర్వహించనున్న సదస్సులో ముందుగా జాతీయ, రాష్ట్ర గీతం ఆలపించి ప్రారంభించారు. పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షులు పురందేశ్వరి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ మద్దిల గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకసభ స్వీకర్ మాట్లాడుతూ భక్తి, త్యాగం, మహిళా కృషికి తిరుపతి ప్రతీకని తెలిపారు. అందుకే తొలి సమావేశానికి తిరునగరాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వికసిత్ భారత్–2047కి స్వాతంత్రం వచ్చి వందేళ్ల గడుస్తోందన్నారు. భారత్ అభివృద్ధిలో మహిళాశక్తి ప్రాధాన్యతను వివరించారు. అనంతరం రాజసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ తిరుపతి వేదికగా మహిళా సదస్సును నిర్వహించడం విజయానికి నాందిగా భావిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూతిరుపతిలో మహిళా సాధికారత తొలి సదస్సును జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సులో తీసుకోనున్న తీర్మానాల అమలుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరారు. పురంధేశ్వరి మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మహిళలకు సురక్షితత, విద్య, నైపుణ్యాలు, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా చట్టసభ్యులందరినీ ఈ సదస్సు ఏకం చేస్తుందని తెలిపారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం సమాన అవకాశాలు, సురక్షిత సమాజం, గౌరవమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. సాధికారత కమిటీ చైర్పర్సన్ గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా మహిళా సాధికారత విధానాలు తెలుసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి, సవాళ్లపై చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు మాట్లాడుతూ. తిరుపతిలో ఈ సమావేశం నిర్వహించడం చారిత్రాత్మకమైన ఘట్టమని తెలిపారు. -
ఆపేది ఎవడ్రా?
చిత్తూరు అర్బన్: చిత్తూరులో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలను విచ్చల విడిగా సాగిస్తున్నారు. వీరి ఆటకట్టించేందుకు ఎందుకో ప్రజాహితమైన ఫిర్యాదులు పోలీస్స్టేషన్లోకి వెళ్ల డం లేదు. నేరుగా కలెక్టర్, ఆపై ఎస్పీకే ఇక్కడి అన్యాయాలను చెప్పేస్తున్నారు. వాళ్లు రంగంలోకి దిగితేతప్ప.. న్యాయం జరగదనే భావన బలంగా పాతుకుపోయింది. అధికారమే అండగా! అర్దగంట జీపు తీసుకుంటే చిత్తూరు నగరం మొత్తాన్ని ఓసారి చుట్టి రావొచ్చు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ శాంతి భద్రతలకు పెద్దగా విఘాతాలు కల్పించడం, ఫ్యాక్షన్ గొడవల్లాంటివి లేవనే చెప్పాలి. ఇదే సమయంలో గత కొంతకాలంగా చిత్తూరును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నిర్వహించడం, నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, ప్రైవేటు సెటిల్మెంట్లు, అర్ధరాత్రి గ్రానైట్ స్మగ్లింగ్, ఫేక్ కంపెనీ సిగరెట్ల విక్రయాలు, వీధి వీధిలో జరుగుతున్న గంజాయి విక్రయా లు కలవర పెడుతున్నాయి. తప్పు చేస్తున్న వారిలో ఎక్కువమంది అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి విషయాలు నాయకులకు తెలియడం లేదా..? అన్నీ వాళ్ల కనుసన్నల్లో జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారా..? ఒకవేళ వాళ్లకు సంబంధం లేకుంటే సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు..? అనే ప్రశ్నలు సామాన్యులను తొలిచేస్తున్నాయి. ఖాకీలు గట్టిగా ఉండడంలేదా..? చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ఇదే సమయంలో తప్పు చేసిన వ్యక్తి ఖాకీలను చూస్తే మాత్రం భయపడి తీరాల్సిందే. చిత్తూరులో వన్టౌన్, టూటౌన్, తాలూక లాంటి ప్రధాన మూడు స్టేషన్లతో పాటు వీటిని పర్యవేక్షించడానికి డీఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. కానీ రహస్యమైన సమాచారం, అసాంఘిక కార్యకలాపాల వివరాలు మాత్రం స్టేషన్లకు వెళ్లడం లేదు. ఇక్కడ పనిచేసే అధికారులపై నమ్మకం లేదా..? అంటే లేకపోవడం వల్లేకదా కీలక ఫిర్యాదులు కలెక్టర్, ఎస్పీ వరకు వెళుతున్నాయనే సమాధానం వినిపిస్తోంది. తప్పుచేసిన వాళ్లు తనవాళ్లైనా వదలొద్దని ప్రజాప్రతినిధులు బహిరంగంగా చెబుతున్నా.. ఖాకీలు చర్యలకు ఉపక్రమించకపోవడం అవి వట్టి మాటలేననే సందేహం కలుగుతోంది. నేడు బాధ్యతలు చేపడుతున్న నూతన ఎస్పీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వీటిని కాదంటారా? -
కార్వేటినగరాన్ని తిరుపతిలో చేర్చాలి
కార్వేటినగరం : తుడా పరిఽధిలో ఉన్న కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని అఖిలపక్ష నాయకులు ఆదివారం స్కంధ పుష్కరిణి వద్ద డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బౌగోళికంగా అత్యంత దగ్గరగా ఉండడమే కాకుండా సామాజిక, ఆర్థిక , వ్యాపార, విద్యా, ఉద్యోగ, ఆరోగ్య పరంగా ఎన్నో దశాబ్దాలుగా కార్వేటినగరం మండల ప్రజలు తిరుపతి పట్టణంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. అలాంటి మండలాన్ని తిరుపతిలో విలీనం చేయాలని గతంలో బాధుడే బాధుడు కార్యక్రమానికి విచ్చేసిన నేటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారానికి వచ్చిన వెంటనే కార్వేటినగరాన్ని తిరుపతిలో చేరుస్తానని హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్నారు. అదే విధంగా వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేరుస్తానన్నారు. ఆ హామీలపై ప్రజా ప్రతినిధులు స్పందించి కార్వేటినగరం ప్రజల ఆశాభావాన్ని నెరవేర్చాలని అన్నారు. అనంతరం కార్వేటినగరం తిరుపతిలో విలీనం చేయడంపై పోరాటం చేయడానికి ఉపాధ్యాయ సంఘ నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు, కార్యాచరణ రూపొందించారు. ఈ పోరాటానికి రాజకీయ, కుల, మతాలకు అతీతంగా కలసి రావాలని పిలుపునిచ్చారు. త్వరలో చిత్తూరు కలెక్టర్, నగరి ఆర్డీఓలకు వినతి అందిస్తామన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, వెంకట కృష్ణయాదవ్, పలువురు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. -
కామధేనువుపై లంబోధరుడు!
కాణిపాకం: ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆదివారం రాత్రి కామధేనువుపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామిని తిలకించి పరవశించారు. సాయంత్రం తొలుత అలంకార మండపంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయస్వామి ఉత్సమూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి కామధేను వాహనంలో అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, మేళాతాళాలు, కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా చేపట్టారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. నేడు పూలంగిసేవ... ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో సోమవారం పూలంగిసేవను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం అభిషేకం, రాత్రి పూలంగిసేవ ఉంటుందన్నారు. -
గజరాజుల బీభత్సం
పులిచెర్ల (కల్లూరు) : మండలంలోని పాతపేట, చల్లావారిపల్లె, మతుకువారిపల్లె గ్రామాల్లో ఆదివారం తెల్లవారు జామున ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు భారీ నష్టం చేకూరింది. ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఆయా గ్రామాల్లో ఎక్కువ మంది రైతుల పంటలు ధ్వంసం కావడంతో ఆవేదన చెందుతున్నారు. ఏనుగులు మామిడి, కొబ్బరి చెట్లను పెకిలించి వేశాయి. టమోటా పంటలను తొక్కి నాశనం చేశాయి. మామిడి తోపుల చుట్టూ ఉన్న ముళ్ల కూసాలను సైతం విరిచేశాయి. పది రోజులుగా ఆయా గ్రామాల్లోనే తిరుగుతూ రాత్రి పూట పంటలపై పడి ధ్వంసం చేస్తున్నాయి. తిష్ట వేసిన ఏనుగులు మండలాన్ని వదిలి పోవడంలేదు. దీంతో ఎక్కువ మంది రైతులు పంటలను సాగు చేయడమే మానేశారు. ఏనుగుల బెడద నుంచి అటవీశాఖ అధికారులు పంటలను కాపాడాలని కోరుతున్నారు. 16 నుంచి బోయకొండలో షాపులు అద్దెకు వేలం చౌడేపల్లె : బోయకొండ గంగాపురంలో దేవస్థానానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్లో గల కింది అంతస్తులోని 85 షాపింగ్ రూములును 3 ఏళ్లపాటు అద్దెకు ఇవ్వడానికి మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వేలం పాటలతో పాటు సీల్డు టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొండ కింద గల గెస్ట్హౌస్లో మూడు రోజుల పాటు వేలం పాటలు జరపనున్నామని, ఆసక్తిగల వ్యాపారులు షాపింగ్ రూములను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిగిలిన వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
‘స్మార్ట్’ బాదుడు !
స్మార్ట్ మీటర్లు అంటూ ఎవరైనా వస్తే వాటిని పగులగొట్టండి.. మీకు అండగా ఉంటానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నేడు అధికారంలోకి రాగానే అదే స్మార్ట్ మీటర్లను పెట్టడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ముందుగా కమర్షియల్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించడంతో రూ.2 వేలు నుంచి 4 వేలు వస్తున్న కరెంట్ బిల్లు నేడు ఏకంగా రూ.25 వేలు నుంచి రూ.70 వేలు వరకు వస్తుండడంతో చిరు వ్యాపారులు వణకిపోతున్నారు. వ్యాపారాలను మూసివేయడం తప్ప తమకు మరోదారి లేదంటూ విలపిస్తున్నారు. పుత్తూరు : కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగులగొట్టండి అంటూ బహిరంగ వేదికలపై ప్రకటనలు చేశారు. అధికారంలోకి రాగానే అదే విధానాన్ని చంద్రబాబు అమలు చేయడంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే ఇలా బిల్లుల పేరిట దోపిడీకి దిగితే తాము ఎవరితో మొరపెట్టుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వ్యాపారాలే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మూతపడనున్న చిన్న పరిశ్రమలు చిన్నపాటి యంత్రాల ఆధారంగా, కొంత మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ నడిచే చిన్నపాటి పరిశ్రమలు కూటమి బాదుడుకు మూతకు సిద్ధమవుతున్నాయి. ఈ తరహా పరిశ్రమలు పట్టణాలు, పల్లెల్లోనూ మనకు కనిపిస్తుంటాయి. ఇందులో కొయ్య తోపుడు యంత్రాలు, సిమెంట్ రాయి తయారీ, పిండి మిల్లులు, వెల్డింగ్ వర్క్ షాపులు, పవర్లూమ్స్, రెడీ మేడ్ డ్రస్సులు, ఫర్నీచర్ తయారీ వంటివి మనకు నిత్యం కనిపించేవి. కూటమి ప్రభుత్వం బిగించిన స్మార్ట్ మీటర్లతో వస్తున్న అధిక బిల్లులతో పరిశ్రమల నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేశారు. సరసమైన ధరలతో నిరంతర విద్యుత్ సరఫరా అయితే స్మార్ట్ మీటర్ల పేరిట రోడ్డున పడేస్తే ఎలా అంటూ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నాడు మీటర్లు పగులగొట్టమన్నారు, ఈ రోజు అదే మీటర్ల కత్తిపైన కూర్చోబెట్టారు. ఇది ఎంత వరకు సమంజసమంటున్నారు. ఈ బిల్లుల బాధను తాము తట్టుకొని నిలబడలేమని, మూసివేయడమే తప్ప తమకు మరో మార్గం కనిపించడం లేదంటూ పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమాచారం హడలిపోతున్న గృహ వినియోగదారులు ప్రస్తుత కాల పరిస్థితుల్లో టీవీ, కూలర్, ఏసీ, ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్, హీటర్ వంటివి సర్వ సాధారణంగా ప్రజలు వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ వస్తువులు. వీటన్నింటిని వినియోగిస్తే ప్రస్తుతం నెలవారి బిల్లు మహా అంటే రూ.2 నుంచి 3 వేలు ఉంటోంది. ప్రస్తుత స్మార్ట్ మీటర్ల ఏర్పాటును పరిశీలిస్తే నెలకు రూ.10 వేల నుంచి 20 వేల బిల్లులు వస్తాయోమనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగదారులు 13,03,270 వాణిజ్య వినియోగదారులు 1,61,215 పరిశ్రమలు 21,175 ప్రభుత్వ కార్యాలయాలు 45,405 వ్యవసాయ వినియోగదారులు 3,32,264 -
ప్రజాస్వామ్యం ఖూనీ
ప్రజలకు వాస్తవాలను తెలిపే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, దాడులు చేయడం, వేధించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు, ప్రసంగాలను సాక్షి దిన పత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చేర్చడం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారి లోపాలను ఎత్తిచూపే పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. అధికారబలం ఉన్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై నా ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ,శ్రీకాళహస్తి -
పాత్రికేయులను భయపెడుతున్నారు
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను పత్రికల్లో రాసినందుకే విలేకరులపై ప్రతాపం చూపుతున్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలకంగా పనిచేస్తాయి. ప్రజాపక్షాన నిలబడే పత్రికలపై జులుం ప్రదర్శిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. పాత్రికేయులను భయపెడుతున్నారు. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. నిజాలను వెలుగులోకి తీసుకురావడం ప్రతికల హక్కు. ఆ హక్కును హరించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికలపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో విషసంస్కృతిని తీసుకువస్తున్నారు. విలేకరులకు స్వేచ్ఛ ఇవ్వాలి. లేకుంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. – లలితా థామస్, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు -
రేపటి నుంచి పాఠశాలల్లో ‘స్వచ్ఛతా పక్వాడా’
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 16వ తేదీ నుంచి ఈనెల 30 వరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆ కార్యక్రమం షెడ్యూల్, విధి విధానాలకు డీఈవో కార్యాలయానికి పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలో పకడ్బందీగా స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కార్యక్రమంలో నిర్వహించే ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ఇలా...... ఈనెల 16న స్వచ్ఛత ప్రతిజ్ఙ , 17న నీటి పారిశుధ్య సదుపాయాల తనిఖీ, మరమ్మతులకు ప్రణాళికలు, 18న పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ సమావేశాలు, 19న పాఠశాల పరిసరాల శుభ్రతపై దృష్టి, 20న వ్యాసరచన పోటీలు (స్వచ్ఛత అంశంపై), 21న పెయింటింగ్, మోడల్ మేకింగ్ పోటీలు , 22న క్విజ్ పోటీలు, 23న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ దినం, 24న పాడైన వస్తువులు, పాత ఫర్నిచర్ మొదలైన చెత్తను తొలగించడం, 25న పాఠశాలల్లో మొక్క లు నాటడం, 26న చేతులు శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన, 27న విద్యార్థులు, టీచ ర్లు స్థానిక ప్రజలకు స్వచ్ఛత అవగాహన కార్యక్రమం, 28న శుభ్రపరిచే ప్రత్యేక డ్రైవ్, 29న స్వచ్ఛ త అవగాహన ర్యాలీలు, 30న స్వచ్ఛత ప్రదర్శన, ఉత్తమ పాఠశాలలకు బహుమతులు మొత్తం కార్యక్రమాల సమీక్ష, నివేదిక అంద జేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నేడు ఎస్పీ తుషార్ డూడి బాధ్యతల స్వీకరణ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నూతన ఎస్పీగా నియమితులైన తుషార్ డూడి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. డీసీసీబీలో అడ్డగోలుగా విచారణ ! చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు నేతలు డీసీసీబీపై కన్ను పెట్టారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న పాలకవర్గంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కోట్లల్లో అవినీతి, అక్రమాలంటూ కట్టుకథలు అల్లుతున్నారు. ప్రజలను, డీసీసీబీ రుణదారులను ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే విచారణ పేరుతో రుణాల మంజూరులో భారీగా బోగస్ జరిగిందని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ప్రస్తుతం సెక్షన్ 51 కింద విచారణ జరుగుతోంది. ఇంతలోనే అధికారులు సస్పెండ్ అంటూ కొందరు అధికారులు, సిబ్బంది పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. శాఖలో 11 మంది ఉద్యోగుల సస్పెన్షన్ 30 మందిపై చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పెద్ద కుట్రే దాగుందని డీసీసీబీ రుణదారులు మండిపడుతున్నారు. ఇదంతా కక్ష పూరితమేనని వారు వాదిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన లోటును భర్తీ చేసి... గత ఐదేళ్లల్లో డీసీసీబీ లాభాల్లో పయనించేలా చేశారని రుణాదారులు గుర్తు చేస్తున్నారు. చిన్న తప్పిదాలను బూతద్దంలో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారని, అలాగే గత పాలకవర్గానికి కొందరు అధికారులు, సిబ్బంది అంటకాగారని..టార్గెట్ చేసి ఈ కుట్రకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. -
తిరుపతిలో నాలుగు మృతదేహాల కలకలం
సాక్షి,చిత్తూరు: తిరుపతిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలోని పాకాల మండలం పాకాలవారిపల్లిలోని నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ జంటతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను అటవీప్రాంతంలో పశువుల కాపరులు గుర్తించారు. భయాందోళనకు గురైన పశువుల కాపరులు మృతదేహాలపై పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి పంపించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు సమీపంలో మద్యం బాటిళ్లు, మాత్రలు,దస్తులు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మెడికోలపై ఇంజినీరింగ్ విద్యార్థుల దాడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై ఇంజినీరింగ్ విద్యార్థులు శనివారం దాడిచేశారు. దీంతో వైద్యులు విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్యుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది ఇంజినీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి తమ స్నేహితుడి చేయికి గాయమైందని చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చారు. అక్కడే డ్యూటీలో ఉన్న ఓ వైద్యుడు పరిశీలించి స్కానింగ్ చేయించుకోవాలని రాశారు. దెబ్బతగిలిన విద్యార్థితోపాటు వచ్చిన స్నేహితులు ఆస్పత్రిలోనే ఉన్న స్కానింగ్ కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా రేడియాలజిస్ట్తో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె వెంటనే సెల్ ఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు ఆమెను ‘ఏం చేసుకుంటావో చేసుకో, బయటకు వస్తావు కదా నీ కథ చూస్తామని హెచ్చరించారు. అనంతరం అక్కడే డ్యూటీలో ఉన్న మరో ఉద్యోగి స్కానింగ్ తీసి క్యాజువాలిటీకి వెళ్లాలని సూచించారు. రిపోర్ట్ తీసుకొని తిరిగి గుంపుగా క్యాజువాలిటీకి వచ్చిన విద్యార్థులు వైద్యులపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ అరుస్తూ హడావుడి చేశారు. దీంతో గాయపడిన విద్యార్థి వద్ద ఒకరు ఉండి మిగిలినవాళ్లు బయటకు వెళ్లాలని డ్యూటీ వైద్యుడు సూచించారు. తమనే బయటకు వెళ్లమంటావా అంటూ విద్యార్థులు ఆ వైద్యుడి ముక్కు పగలగొట్టారు. అక్కడే డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లపైనా సుమారు 15 మంది విద్యార్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. వైద్యులను గాయపరిచారు. ఈ ఘటనతో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. జూనియర్ డాక్టర్ల నిరసన నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు శనివారం విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. దాడికి పాల్పడిన మొగిలేశ్వర్, షరీఫ్, లోకేష్, యశ్వంత్, వినేష్, సందీప్పై కేసు నమోదు చేశామని టూటౌన్ సీఈ నెట్టికంఠయ్య తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ మృతి
పుత్తూరు: మండల పరిధిలోని పరమేశ్వరమంగళం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్ మృతి చెందాడు. సీఐ శేఖర్రెడ్డి కథ నం మేరకు.. తమిళ నాడు రాష్ట్రం అరక్కోణం వద్ద కిజ్కుప్పం గ్రామానికి గజేంద్ర అడియార్ రెండో కుమారుడు జి.సంతోష్కుమార్(34) రేణిగుంట వద్ద గల న్యూలింక్ కంపెనీలో ఇంజినీర్. రెండు రోజుల పాటు కంపెనీకి సెలవు రావడంతో శుక్రవారం రాత్రి పనిముగించుకొని టూ వీలర్పై అరక్కోణంకు బయలు దేరాడు. రాత్రి 9 గంటల సమయంలో పరమేశ్వరమంగళం గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ దారితప్పి వెళ్తున్నామని గుర్తించి డ్రైవర్ ఒక్కసారిగా యుటర్న్ తీసుకున్నాడు. టూ వీలర్పై వెళ్తున్న సంతోష్కుమార్ అదుపు తప్పి లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో సంతోష్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వయస్సుకు వచ్చిన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి సంబంధాలు చూస్తున్న వేళ మృత్యువాత పడడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. లారీ డ్రైవర్ను అదులోకి తీసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వం విద్యాసంస్థలకు జాతీయ పురస్కారం తిరుపతి సిటీ : విశ్వం సైనిక్ నవోదయ కోచింగ్ ఇన్స్టిట్యూట్కు ‘బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇయర్–25’ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం బెంగుళూరు వేదికగా జరిగిన భారతీయ శిక్షణ రత్న అవార్డులు–2025 కార్యక్రమంలో భాగంగా ఈ వార్డును ఆ సంస్థ ప్రతినిధులు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంతోష్ హెగ్డే, ప్రముఖ విద్యావేత్త రంజన రజోర శర్మ చేతుల మీదుగా విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్. విశ్వచందన్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటక మంత్రి హెచ్ ఆంజనేయ, ఆధ్యాత్మిక నాయకులు డాక్టర్ మలయ శాంతముని, నటుడు చేతన్ కుమార్ పాల్గొని విశ్వం విద్యా సంస్థలకు అభినందనలు తెలిపారు. డాక్టర్ల దాడిపై కేసు నమోదు చిత్తూరుఅర్బన్: జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పీజీ డాక్టర్ల దాడిపై టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి పీజీ వైద్యులపై కొందరు విద్యార్థులు, వారి స్నేహితులు దాడి చేశారు. దీనిపై బాధిత డాక్టర్లు రక్షిత్, సరన్, యోగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన మొగిలేశ్వర్, షరీఫ్, లోకేష్, యశ్వంత్, వినేష్, సందీప్పై కేసు నమోదు చేసినట్లు సీఐ నెట్టికంఠయ్య వెల్లడించారు. కూరగాయల వితరణ కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి ఓ దాత ఆదివారం పలు రకాల కూరగాయలను వితరణగా అందజేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకట్రెడ్డి సుమారు 2.5 టన్నుల కూరగాయలను అందించారు. కార్యక్రమంలో అన్నదాన సూపరింటెండెంట్ బాలరంగస్వామి పాల్గొన్నారు. -
ఆఫీసు సబార్డినేటర్ల సంఘం ఏకగ్రీవం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఆఫీసు సబార్డినేటర్ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు. శనివారం జిల్లా వాణిజ్య పన్నులశాఖ జేసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం మాట్లాడారు. ఏడు పదవులకు గాను అదే సంఖ్యలో నామినేషన్ రావడంతో సంఘం ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నమన్నారు. ఎన్నికల అధికారిగా బీ.గోపాలకృష్ణయ్య, సహాయ ఎన్నికల అధికారిగా కే.చెన్నకేశవులు వ్యవహరించారన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.మనోహరనాయక్, ఉపాధ్యక్షులుగా తిప్పన్నా, పి.సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.మునికృష్ణయ్య, కార్యాలయ కార్యదర్శిగా సి.రవి, సంయుక్త కార్యదర్శిగా కె.భరత్, జిల్లా కోశాధికారిగా డి. షఫీను ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు వివరించారు. మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని కాపాడుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్ అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన టీచర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర, జిల్లా స్థాయిలో పురస్కారాలు పొందిన నౌషాద్ అలీ, గోపీనాథ్రెడ్డి, కమలాపతి, సుబ్రహ్మణ్యం, మీనాక్షి, రాధాకుమారి, ప్రసన్నకుమారి, రామకృష్ణ, ఆనందయ్య తదితరులను దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. -
పోలీస్ బాస్ తుషార్ డూడీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నూతన ఎస్పీగా తుషార్ డూడీ నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ మణికంఠను బదిలీ చేశారు. ఈయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కూటమి నేతలకు నచ్చక? గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏప్రిల్ 4వ తేదీన మణికంఠ చిత్తూరు ఎస్పీగా నియమితులయ్యారు. దాదాపు 17 నెలల పాటు చిత్తూరు ఎస్పీగా మణికంఠ రాణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన దాదాపు 45 మంది కానిస్టేబుళ్లను ఈయన సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులపై విచారణకు ఆదేశించినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక పుంగనూరులో జరిగిన ఓ టీడీపీ కార్యకర్త హత్య ఘటనలో కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే నుంచి నాయకుల వరకు మణికంఠపై ఒంటికాలితో పైకిలేచారు. ఓ దశలో ఈ హత్యకు మణికంఠ బాధ్యత వహించాలని, తాము అడిగిన పోలీసులకు ఆయా స్టేషన్లలో పోస్టింగ్లు ఇవ్వకపోవడం వల్లే హత్య జరిగిందని బురదను కూడా చల్లారు. బంగారుపాళ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం, కార్యకర్తపై జరిగిన దాడిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మన్ను సస్పెండ్ చేయడం అనైతికమంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధానంగా కూటమి పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు మణికంఠ పనితీరు నచ్చలేదనే చెప్పాలి. దీనిపై ఏకంగా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఎస్పీ బదిలీల ప్రక్రియలో మణికంఠకు స్థానచలనం కలగడం అధికారపార్టీ నేతలకు ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. క్రమశిక్షణ ప్రధానం చిత్తూరు కొత్త ఎస్పీగా నియమితులైన డూడీకు క్రమశిక్షణే ప్రధానం. 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేసి చిత్తూరుకు వస్తున్నారు. డూడి స్వస్థలం రాజస్థాన్లోని ఝున్జున్ నగరం. ఇండోర్ ఐఐటీలో ఇంజినీరింగ్ చదివిన ఈయన.. మూడో ప్రయత్నంలో సివిల్ సర్వీసుకు ఎంపికై ఐపీఎస్ అధికారి అయ్యారు. కర్నూలులో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారు. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా సర్వీస్లో చేరారు. వైఎస్ఆర్ కడప జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదోన్నతి పొంది 2024 ఫిబ్రవరిలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్గా, మన్యంలో చింతపల్లి ఏఎస్పీగా కూడా పనిచేశారు. తుషార్ డూడీకి ఎస్పీగా చిత్తూరులో మూడో పోస్టింగ్. సోమవారం ఇక్కడ బాధ్యత తీసుకునే అవకాశముంది. -
కలానికి సంకెళ్లా?
సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగుచూపడంలో పత్రిక కీలకంగా పనిచేస్తోంది. నిర్భయంగా అన్యాయాలను పత్రికల ద్వారా వెలుగులోకి తేవడం పాత్రికేయుల విధి. నిజాన్ని నిర్భయంగా పత్రికలు ప్రచురించడంలో తప్పులేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికలపై దాడులు ఎక్కువయ్యాయి. ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తోంది. చిన్నచిన్న వార్తాలు ప్రచురితమైతే కూడా కేసులు పెట్టిస్తోంది. ఇలా కలానికి సంకెళ్లు వేయడం కరెక్టు కాదు. విచారణ పేరుతో పోలీసులు వేధించడం తగదు. పోలీసులు కూడా వాస్తవాలను తెలుసుకోవాలి. ప్రభుత్వ తప్పిదాలను బయట పెడితే పగబడుతోంది. ఇందుకు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం మరిచిపోతే ఎలా? –సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు -
పత్రికా విలేకరులపై కేసులా?
ఎవరిపైనన్నా కావాలనే తప్పుడు న్యూస్ రాస్తే కూడా దానికి రీజాయిండర్ ఇస్తారు. కానీ ప్రెస్మీట్లో మాట్లాడిన న్యూస్ను రాస్తే దానిపై విలేకరులు, ఆ పత్రిక ఎడిటర్పై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా..? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలవబడే పత్రికలకు అసలు మన రాష్ట్రంలో స్వేచ్ఛ ఉందా...? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందనే అక్కసుతో ఓ పత్రికపై మాత్రమే కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తోందనే విషయం సాధారణ ప్రజలకు సైతం అర్థమవుతోంది. పత్రికలపై కన్నెర్ర చేసిన ఎన్నో ప్రభుత్వాలు గతంలో కాలగర్భంలో కలిచిపోయాయి. ఈ విషయాన్ని ఇప్పటికై నా సీఎం చంద్రబాబు ఆలోచనచేస్తే బాగుంటుంది. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు -
భయంకరి
పలమనేరులో ఓ మదపుటేనుగు హల్చల్ చేసింది. అడవిలోంచి ఒంటరిగా జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. దాన్ని చూసి జనం కేకలు వేయడంతో మరింత చిర్రెత్తిపోయింది. దాదాపు ఆరు గంటలపాటు రోడ్లపై స్వైరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై ఎదురుదాడికి దిగింది. బుల్లెట్పై వచ్చిన ఎఫ్ఎస్వో సుకుమార్పై దాడికి తెగబడింది. తనదారికి అడ్డొచ్చిన వాహనాలను ఎత్తిపడేసింది. ఓ లేగదూడపైన ఉరిమింది. అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నించిన ట్రాకర్పై దాడి చేసి.. ఆ తర్వాత అడవిలోకి వెళ్లింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పలమనేరు: కౌండిన్య ఎలిఫెండ్ శాంచురీ సమీపంలోని అడ విలోంచి ఓ ఒంటరి ఏనుగు శనివారం ఉదయం పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు సమీపంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న వారు గమనించి స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఎస్వో సుకుమార్ తన సిబ్బంది ట్రాకర్స్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాణసంచా పేలుస్తూ ట్రాకర్స్ ఏనుగును మళ్లించే ప్రయత్నం చేశారు. దీంతోపాటు స్థానికుల అరుపులు, కేకలు, సెల్ఫోన్లలో వీడియోలు తీయడం లాంటివి చేశారు. ఆగ్రహించిన ఏనుగు జనంపైకి ఎదరుదాడికి దిగింది. ఇదే సయంలో పాత కీలపట్ల రోడ్డు వద్ద బుల్లెట్పై వచ్చిన ఎఫ్ఎస్వో సుకుమార్ పైకి దాడికి పాల్పడింది. ఆయన తప్పించుకునే ప్రయత్నంలో బైక్ను ఆపి పరుగెత్తబోయి కిందపడ్డాడు. ఆ ఏనుగు అతనిపై పడి నలిపేసింది. జనం గట్టిగా అరుపులు పెట్టగా ట్రాకర్లు నాగరాజు తదితరులు రాళ్లతో ఏనుగుపై దాడి చేశారు. దీంతో అది అక్కడి నుంచి పక్కకెళ్లింది. 108 సమయానికి రాకపోవడంతో ఫారెస్ట్ వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏనుగు దాడిలో సుకుమార్కు కాలు, చేయికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ప్రథమ చికిత్సలనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఆరు గంటలపాటు హల్చల్ ప్రజల అరుపులు, అలజడితో ఏనుగు ఘీకాంరాలు చేస్తూ ఎటు వెళ్లాలో తెలియక రాఘవేంద్రస్వామి ఆలయం, చిన్నూరు, బైపాస్రోడ్డు, గంటావూరు, బెంగళూరు– చైన్నె హైవే బైపాస్ తదితర ప్రాంతాల్లో హల్చల్ చేసింది. హైవేలో ఏనుగు వెళుతున్నప్పుడు వందలాది మంది రోడ్డుపక్కన గుమిగూడారు. ఏనుగు కారణంగా బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ ఆగిపోయింది. ఏనుగును చూసేందుకు జనం రోడ్డుపై ఆగిన వాహనాలపై ఎక్కి గోల చేశారు. దీంతో మరింత భయపడిన ఏనుగు గంటావూరు వద్ద టెర్రకోట దుకాభాల మధ్య రోడ్డుపై వెళుతూ రోడ్డు పక్కన పార్క్ చేసిన పలు కార్లను పైకెత్తేందుకు ప్రయత్నించింది. అక్కడికి వచ్చిన ఫారెస్ట్ జీపుపై దాడికి రాగా డ్రైవర్ చాకచక్యంగా జీపును రివర్స్చేసి వెళ్లిపోయాడు. ఎఫ్ఆర్వో సుకుమార్పై దాడి చేస్తున్న ఏనుగు పలమనేరు పట్టణంలో సంచరిస్తున్న మదపుటేనుగు పలమనేరులో ఒంటరి ఏనుగు స్వైరవిహారం -
రాజీ మార్గమే రాచమార్గం!
చిత్తూరు లీగల్/అర్బన్: కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్అదాలత్ను ఆమె ప్రారంభించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను లోక్అదాలత్ల ద్వారా పరిష్కరిస్తూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, శ్రీదేవి, శిరీషా, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎనిమిదో స్థానం చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అదాలత్లో 5,345 కేసులను పరిష్కరించి రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. ఇందులో చిత్తూరులో 1,652 కేసులు, తిరుపతిలో 1,488, వాయల్పాడు 82, తంబళ్లపల్లె 186, శ్రీకాళహస్తి 245, సత్యవేడు 308, పుత్తూరు 214, పుంగనూరు 139, పీలేరు 78, పలమనేరు 245, పాకాల 94, నగరి 104, మదనపల్లె 695, కుప్పంలో 84 కేసులు పరిష్కరించారు. -
నేడు, రేపు మహిళా సాధికారత సదస్సు
తిరుపతి అర్బన్ : మహిళల సాధికారత అంశాన్ని అజెండాగా చేసుకుని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని వేదికగా తీసుకుని దేశస్థాయి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లోకసభ స్పీకర్ ఓంబిర్లా ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సమావేశాన్ని ఆది, సోమవారం జరుపుకోనున్నారు. సదస్సు ముఖ్య ఉద్దేశ్యం వికసిత్ భారత్లో భాగంగా మహిళలు సైతం డిజిటల్ దిశగా అడుగులు వేయడానికి, క్వాంటమ్ కంప్యూటరింగ్, బయో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ, వ్యాపార రంగాల్లో మహిళల పాత్ర తదితర సెక్టార్లకు సంబంధించి చర్చలు జరపనున్నారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు, జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు తదితరులు లైజన్, నోడల్ అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు ముఖ్య అతిథులు రాక ఆదివారం ఉదయం 10 గంటలకు తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్కు పలువురు వీఐపీలు రానున్నారు. సదస్సుకు సంబంధించి రెండు రోజుల పాటు రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రగిరి కోటను సందర్శించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో పాటు లోకసభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాష్ట్ర శాసనసభ స్వీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణంరాజు, లోకసభ కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి, రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ చరితారెడ్డి, పలువురు ఐఏఎస్ సీనియర్ అధికారులు ఆదివారం హాజరు కానున్నారు. అలాగే సోమవారం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు.సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీలకు పాస్లు నిలుపుదల జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ మహిళా సదస్సు కార్యక్రమానికి మీడియాకు సమాచారశాఖ వారు ఆహ్వానం పలికారు. అయితే దేశ స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో సమాచారశాఖ నుంచి పాస్లు జారీ చేసిన వారు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీలకు చెందిన రిపోర్టర్లకు పాస్లను ఇవ్వడం లేదని సమాచారశాఖ జిల్లా అధికారి గురుస్వామి శెట్టి స్పష్టం చేశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్లో 29 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి రూ.2.9 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 29 మందిపై కేసు నమోదుచేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.9 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇంత చిన్నచూపా? పలమనేరు: సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మురళీనాథ్ శనివా రం ఆవేదన వ్యక్తం చేశారు. తమను వలంటీర్లుగా మార్చేశారన్నారు. రకరకాల సర్వేలు, ఇంటింటికీ వెళ్లి మ్యాపింగ్లు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వలంటీర్లు 50 కుటుంబాలకు చేస్తున్న సేవలను సైతం తమవద్దే చేయిస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ రేష న్ కార్డుల పంపిణీని సైతం తమ వద్ద చేయించడం సమంజసం కాదన్నారు. -
పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వేలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసినందుకు అధ్యాపకులు శరత్చంద్రశేఖర్కు రాష్ట్ర ఉత్తమ అవార్డు దక్కిందని రిటైర్డ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శనివారం రాష్ట్ర అవార్డు గ్రహీత శరత్చంద్రశేఖర్కు అభినందన సభ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ హెడ్మాస్టర్ వీరరాఘవనాయుడు మాట్లాడుతూ శరత్చంద్రశేఖర్ పనిచేసిన కళాశాలల్లో విద్యార్థుల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. -
కళాశాలలు ఎలా నిర్వహించాలి?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్టీఎఫ్ (రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ) నిధులు విడుదల చేయకపోతే కళాశాలలు ఎలా నిర్వహించాలని ఎస్వీయూ అసోసియేషన్ ఈసీ మెంబర్ హేమచంద్రనాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు చెల్లించాల్సిన ఆర్టీఎఫ్ నిధుల మంజూరుకు ఆందోళనలు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈనెల 20లోపు విడుదల చేయాల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేయాలని, లేని పక్షంలో ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించారు. -
ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి
చిత్తూరు కార్పొరేషన్: ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని విద్యుత్శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం డిస్కం కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం సంఘం 5వ వార్షికోత్సం సందర్భంగా చిత్తూరులోని ఆశాఖ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఉద్యోగ రీత్యా అందరూ కలిసి పనిచేసిన రోజులు గుర్తు చేశారు. అనంతరం 70 ఏళ్లు దాటిన విశ్రాంత ఉద్యోగులు మురళి, రమణమూర్తి, సుబ్రమణ్యంశెట్టి, మోహనపిళ్లై, గంగమ్మనాయుడు, ఏకాంబరం, రెడ్డెప్పనాయుడు, చంద్రబాబు, రంగయ్యనాయుడు, శివన్కుట్టి, ప్రకాష్, సుబ్రమణ్యంశెట్టి, గుణశేఖర్, రామచంద్రన్, అబ్దుల్సలాం, రాజామందడి, ముత్తు, మారిముత్తు, పార్థసారథి, జయపాల్, సూర్యబాబు, చెంగల్రాయశెట్టి, శ్రీరాములకు జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. సంఘం డివిజన్ కార్యదర్శి మునిరత్నంశెట్టి, నాయకులు ప్రకాష్, వేణుగోపాల్అయ్యర్, ప్రభావతి, మురళి, మోహన్రాజ్, మునిరత్నంశెట్టి, బాబునాయుడు పాల్గొన్నారు. -
రోజా కుమార్తెకు మౌరీన్ బిగ్గర్స్ అవార్డు
నగరి: యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్టన్లోని ఇండియానా వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సు చదువుతోన్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025–26ను అందుకున్నారు. ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్.. టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలను కలుపుకొని వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం, నమీబియా, నైజీరియా, భారత్ వంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ, మాధ్యమాల ద్వారా పేదవర్గాలకు సమగ్రమైన సాంకేతిక విద్యను అందించడానికి కృషిచేసినందుకుగాను ఈ అవార్డును ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. -
మెడికల్ కాలేజీలు.. మంత్రులు అనిత, సవితకు రోజా సవాల్
సాక్షి, నగరి: ఏపీలో కూటమి నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు సిద్ధమని రోజా తెలిపారు. హోం మంత్రి అనిత, మంత్రి సవితపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగిరిలో మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చేసిన స్కిట్ అందరు చూశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చి వేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి అనేది లేదు మీకు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాలని చంద్రబాబు చూశారా?. మొదటిసారి సీఎంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు.నాణ్యమైన వైద్యం అందించాలని చూశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. పప్పు బెల్లం మాదిరే తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారు. హోం మంత్రి అనిత మీడియా సమావేశంలో చిరాకు కనిపిస్తుంది. మహిళల భద్రత, అత్యాచారాలు జరిగిన ఘటనపై ఏనాడు అనిత స్పందించలేదు. వైఎస్ జగన్ను తిట్టడానికి ఫేక్ వీడియోలు ప్రదర్శిస్తూ ప్రజెంటేషన్ చేశారు. వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చి, వాటిలో ఆరు మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి తెచ్చారు. మొదటిసారి సీఎం అయిన జగన్ చేసిన పని చంద్రబాబు మూడు సార్లు సీఎంగా ఎందుకు చేయలేకపోయారు. ఐదువేల కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఖర్చు చేయలేక పోతున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని అనిత చెబుతున్నారు.. మరి పీపీపీ అంటే ఏమిటి?. రౌడీ షీటర్లకు ఇచ్చే పెరోలా?. ప్రభుత్వం ఇచ్చిన ప్రైవేటీకరణ జీవో వెనక్కి తీసుకోవాలి. కొత్త పిచ్చోడు పొద్దు ఎరుగడు అనే విధంగా మంత్రి సవిత ప్రవర్తన ఉంది. ఆమె మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి. మీ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవడం చేతకాలేదు.నేను రాజమండ్రి, విజయనగరం, పాడేరు, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరకు నేను వస్తాను. దమ్ముంటే మంత్రులు అక్కడికి రావాలి. వైఎస్ జగన్ పూర్తి చేసిన కాలేజీలను నేను చూపిస్తాను. చంద్రబాబు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు విజన్ ఉంది .. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పుకోవడమే తప్ప అభివృద్ధిలో చేసింది శూన్యం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి అంటే ఏడేళ్లు పడుతుంది. ఎయిమ్స్ పూర్తి కావడానికి తొమ్మిది ఏళ్లు పట్టింది. మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయి అనే కనీస అవగాహన కూడా మంత్రులకు లేదు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో ప్రజలు అందరికీ తెలుసు. కోవిడ్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎక్కడున్నారు?.రైతులకు యూరియా కూడా అందించలేని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నుయ్యి గొయ్యి చూసుకోవాలి. లక్ష 97వేల కోట్లు 15 నెలల్లో అప్పులు చేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి షూటింగ్స్ చేసుకోవడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది. పిఠాపురంలో ఓట్లు వేసిన ప్రజల్ని పవన్ పట్టించుకోవడం లేదు. నీకు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
ఆపద్బాంధవులవుదాం.. రండి!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు, సమాజంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు స్పందించి సహాయ కార్యక్రమాలు చేడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా ప్రజలకు సేవలందిస్తుంటారు. అలాగే విపత్తు సమయాల్లో ఏం చేయాలి? అనే దానిపై అవగాహన కల్పిస్తుంటారు. అలాంటి వాటిలో పౌరరక్షణ దళం ఏర్పాటు చేయాలని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ భావించింది. యువ ఆపదమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం నిర్వహణ బాధ్యతలను జాతీయ విపత్తు సంస్థ, మేరా యువ భారత్కు అప్పగించింది. ఆపద వేళ ఆదుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు జిల్లాలో అర్హత ఉన్న వలంటీర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆపద మిత్ర పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి దరఖాస్తులు చేయించేందుకు నెహ్రూ యువ కేంద్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 140 దరఖాస్తులు అందినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. శిబిరం, చేయాల్సిన విధులుఅర్హులు ఎవరంటే దరఖాస్తుకు సెప్టెంబర్ 20 వరకు గడువు జిల్లాలో ఆపద మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు నెహ్రూ యువ కేంద్ర అధికారులు వెల్లడించారు. దరఖాస్తులను చిత్తూరు జిల్లా కేంద్రం గిరింపేట వద్ద ఉన్న పగడమాను వీధిలో నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 8368866411 నంబర్లో సంప్రదించవచ్చు. ఈ పథకంలో ఎంపికయ్యే వారికి వారం పాటు ఉచితంగా శిక్షణ ఉంటుంది. భూకంపాలు, వరదలు, కరువు, కరోనా, ప్రమాదాలు సంభవించినప్పుడు, అల్లర్లు చోటు చేసుకున్నప్పుడు ప్రజలను రక్షించడం. భద్రతా దళాలకు అండగా ఉంటూ సహాయం చేయడం. గాయపడిన వారికి ప్రథమ చికిత్సలు చేయడం, పరిస్థితి విషమంగా ఉంటే దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించడం. ట్రాఫిక్ నిర్వహణ వల్ల జన సముదాయాలను నియంత్రించడం. విపత్తుల వేళ ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లడం శిక్షణను విజయవంతంగా పూర్తిచేసే యువతకు ఆపత్కాలంలో ఉపయోగపడే కిట్, సర్టిఫికెట్ అందజేస్తారు. -
అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు పలు అక్రమాలకు తెరలేపుతున్నారు. తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేసుకుని విద్యార్థులను ముప్పుతిప్పలకు గురిచేస్తున్నారు. కొందరు పేరొందిన కళాశాలల కంటే తాము 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ఫీజుతో బోధన అందిస్తామని, ఐఐటీ, జేఈఈ, నీట్ క్లాసులను ప్రత్యేకంగా నిర్వహిస్తామని మాయమాటలతో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థుల నామినల్ రోల్స్ను ఇతర కళాశాలలకు పంపడం, పాస్ అయిన తర్వాత టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లను మరొక కళాశాల నుంచి ఇప్పించడం వంటివి చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలో ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా మోసం చేస్తున్నారు. ఇలాంటి అవకతవకల వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ ఫీజులు అని అడ్మిషన్ల సమయంలో చెప్పి చేర్పించిన తర్వాత అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు మరొక చోట పిల్లల సర్టిఫికెట్లు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు మించి ఆ కళాశాలలో విద్యార్థులు ఉండడంతో అడ్మిషన్లు అక్కడే చేయించుకుని, అటెండెన్స్ మరొకచోట వేస్తున్నారు. ప్రతి విద్యాసంవత్సరం ఇదే తంతు కొనసాగుతోంది. చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉండే మరో ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఏకంగా అడ్మిషన్లు, ఫీజులు ఆ కళాశాలలో చేయించుకుంటూ ఉత్తమ ర్యాంకుల కోసం సమీప మండలాల్లోని మరో ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్నట్లు రికార్డుల్లో రాయిస్తున్నారు. పబ్లిక్ పరీక్షల సమయంలో సమీప మండలంలో ఒకే పరీక్ష కేంద్రం ఉండడం వల్ల మాల్ ప్రాక్టీస్కు ఎక్కువ అవకాశాలుంటాయని వారి భావన. విద్యాశాఖ విఫలం జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ అధికారులు ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలు చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒక వేళ కొన్ని కళాశాలలకు వెళ్లినా పరిసర ప్రాంతాలను పరిశీలించి... చాయ్ బిస్కెట్ తినేసి వచ్చేస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎంత మంది ? అడ్మిషన్ రిజిస్టర్లు రాస్తున్నారా? సరైన రికార్డులు అమలు చేస్తున్నారా ? పలు విషయాలను తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టించుకుంటే ఒట్టు జిల్లాలో చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరిలో ఉండే పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇష్టానుసారంగా విద్యార్థులను అడ్మిషన్ చేసుకున్నాయి. దీనిపై సంబంధిత జిల్లా అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులున్న కళాశాలలను వదిలేసి ఫిర్యాదులు లేని కళాశాలలను తనిఖీ చేస్తున్నారు. అధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయించుకున్న కళాశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా -
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ రిజిస్ట్రార్గా ఎంవీ రమణ
చంద్రగిరి : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్గా ఎంవీ రమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై వర్సిటీ రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. వ్యవసాయ వర్సిటీలో వివిధ హోదాలలో 34 ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాలలో సుదీర్ఘ సేవలు అందించారు. 2013లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుతో పాటు 2015లో యూనివర్సిటీ స్థాయిలో ఏవీ కృష్ణయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. రిజిస్ట్రార్ పదవికి మరింత వన్నె తెచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. -
మొక్కుబడిగా పెట్టుబడీదారుల సదస్సు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి తాజ్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు (రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్) మొక్కుబడిగా సాగింది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట హాజరయ్యారు. కాగా వేదికపై ప్రత్యేకంగా ఆహ్వానించిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రసంగాలకే అధిక సమయం కేటాయించారు. మధ్యాహ్న భోజన సమయంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగంలో పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించే ప్రయత్నం కాస్త పక్కదారి పట్టింది. వినేవారు లేకపోవడంతో ఇన్వెస్టర్స్తో, హోమ్ స్టే ఆపరేటర్స్తో ప్రత్యేకంగా మాట్లాడుతామంటూ కార్యక్రమాన్ని మమ అనిపించారు. అనంతరం కూటమి నాయకులు మంత్రిని సన్మానించేందుకు అత్యుత్సాహం చూపారు. సన్మాన, సత్కారాల అనంతరం మీడియా ముందుకు మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఏపీలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కూటమి పాలనలో పర్యాటక రంగానికి ఏమి చేస్తామనే అంశాలను దాటవేస్తూ గత వైఎస్సార్సీపీ పాలనలో పర్యాటక రంగం అభివృద్ధి జరగలేదనే విష పూరిత వ్యాఖ్యలతో ప్రభుత్వ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆహ్వానం లేదంటూ సీఆర్ రాజన్ మండిపాటు రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఆ శాఖ అధికారుల పిలుపు మేరకు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు హాజరయ్యారు. వారందరిని ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించారు. అయితే అక్కడే ఉన్న రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్ను పిలువలేదు. దీంతో ఆయన తీవ్ర మసస్తాపానికి గురయ్యారు. ఇతరులు చెబితే తెలుసుకుని ఇక్కడికి వస్తే ప్రొటోకాల్ మేరకు పిలవాలనే జ్ఞానం లేదా అంటూ ఆయనకు ఎదురుపడ్డ జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ మండిపడ్డారు. ఆహ్వానించడం అనే విషయం తన పరిధిలో కాదని తన పై అధికారులంటూ నచ్చజెప్పే ప్రయత్నం జనార్దన్ రెడ్డి చేశారు. అయితే సీఆర్ రాజన్ ఆ మాటలు పట్టించుకోకుండా తనతో వచ్చిన అనుచరులతో బయటకు వెళ్లిపోయారు. -
అక్కడ ఇసుక తవ్వకాలు నిషేధం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషేధిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నట్టు తెలిపారు. జిల్లాలో ఇసుక తవ్వేందుకు ఎక్కడైనా యంత్రాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా పక్క రాష్ట్రాలకు ఇసుక తరలించనా సహించేది లేదన్నారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీవో శ్రీనివాసులు, మైన్స్ డీడీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనం విరాళం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి శుక్రవారం కెనరా బ్యాంక్ ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందించింది. రూ.5.5 లక్షల విలువ చేసే ఈ వాహనాన్ని దివ్యాంగుల నిమిత్తం అందజేసినట్లు బ్యాంకు అధికారులు నాగేశ్వరారవు, అనురాధ, పాండురంగ తెలిపారు. -
ఇద్దరు దొంగలు అరెస్టు ఏడు బైకుల స్వాధీనం
చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న జయకుమార్ (26), లోకనాథన్ (18) అనే ఇద్దరు నిందితులను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దాదాపు రూ.3.5 లక్షల విలువ చేసే ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరులోని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐలు మహేశ్వర, నెట్టింకంటయ్య కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇటీవల నగరంలో మోటారు సైకిళ్లు వరుసగా చోరీకి గురయ్యాయని, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. చిత్తూరు–వేలూరు రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు తమిళనాడులోని వేలూరుకు చెందిన జయకుమార్, లోకనాథన్ ఇద్దరు అనుమానితులు కనిపించారని తెలిపారు. వీళ్లను విచారించగా మోటారు సైకిళ్లను చోరీ చేసినట్లు అంగీకరించినట్టు వెల్లడించారు. నిందితులు దాచి ఉంచిన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పారిపోయిన సయ్యద్ నస్రుల్లా అనే నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ రమేష్ బాబు, సిబ్బంది బాబు, నరేష్, మునస్వామి, రఫుల్లా పాల్గొన్నారు.అది దుర్మార్గంపాలసముద్రం : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దుర్మార్గమని జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగనన్న హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి, రూ 8,450 కోట్లతో పూర్తిచేయాలని సంకల్పించారని, ఇందులో భాగంగానే మొదటి దశలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ముందు మరో మూడు కాలేజీలు పూర్త య్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రయివేటు పరం చేస్తోందన్నారు. -
వంచనగురూ!
తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసిన సమాజం మనది. గురువులను సమాజనిర్దేశకులంటారు. ఎక్కడైతే మంచి గురువు ఉంటాడో అక్కడి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. గతంలో ఉన్న గురువులు ఎంతో నిజాయితీతో పనిచేసేవారు. అందుకే వారికి ఇప్పటికీ సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు టీచర్ల తీరు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే మాయని మచ్చని తెచ్చిపెడుతోంది. ఎలాగూ సర్కారు కొలువు.. నెలకి మంచి జీతం.. పిల్లలు ఎలా పోతే మాకేంటి.. మా పిల్లలు కార్పొరేట్ బడుల్లో చదువుకుంటున్నారనే భావన, వృత్తిపై నిర్లక్ష్యాన్ని, వికృత చేష్టల వైపు ఉసిగొల్పుతోంది. ఇంతకీ ఆ గురువంచన ఏందో మీరే చదవండి..! పలమనేరు: నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం, దేవదొడ్డి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ టీచర్ (45) బడిలోని పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకరానిచోట తాకడం, ఎవరైనా చెప్పారంటే తాటతీస్తానంటూ బెదిరించడం అలవాటుగా చేసుకున్నారు. తాజాగా శుక్రవారం ఆ బడి పిల్లలే ఆ విషయాలు చెప్పడంతో వెలుగుచూసింది. గ్రామస్తులంతా ఏకమై ఆ పంతులు గారికి దేహశుద్ధి చేశారు. ఇలాంటి కీచక గురువుల కారణంగా నిజాయితీగా పనిచేసే గురువులకు సమాజంలో గుర్తింపులేకుండా పోతోంది. ఎంతసేపూ సంపాదనే పలమనేరు నియోజకవర్గంలోని కొందరు టీచర్లు గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్లో స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉండేవారు. కానీ ఈ మధ్య వారే రంగంలోకి దిగి వెంచర్లు వేయడం, ప్లాట్లను అమ్మడం లాంటి కార్యక్రమాల్లో బిజీగా కనిపిస్తున్నారు. వీరితోపాటు ఎందరో టీచర్లను ఇందులోకి చేర్చి వారికి సైట్లను అమ్మడం లేదా వారిని భాగస్వాములుగా చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. నెలవారీ చీటీల గోల మరికొందరు టీచర్లు నెలవారీ చీటీలు, ఫైనాన్స్ వ్యాపారాల్లో తలమునకలైపోయారు. వీరికి బడితో పనిలేదు. కేవలం నెలవారీ చీటీలు, కొత్త సభ్యులు, చీటీల సొమ్ము వసూలు చూసుకుంటూ ఎప్పుడో తూతూమంత్రంగా విధులు నిర్వహించడం పరిపాటిగా మారింది. మహిళా టీచర్లు సైతం చీరల వ్యాపారాలు, చైన్లింగ్ వ్యాపారాలు, సన్నబడే మందులు, టానిక్ల వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. అదనపు సంపాదనపై చూపుతున్న శ్రద్ధ పిల్లల చదువు పట్ల లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. నీతిగా, నిజాయితీగా పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా పనిచేస్తున్న గురువులకు ఇలాంటి వారి కారణంగా సమాజంలో మర్యాదలేకుండా పోతోంది.ఉపాధ్యాయ వృత్తికే కళంకం దేవదొడ్డి ఘటనతో చాలాబాధపడ్డాను. ఇలాంటి గురువుల ప్రవర్తక కారణంగా మొత్తం వ్యవస్థపైనే చెడు భావం కలుగుతుంది. మంచి సమాజాన్ని నిర్మించాల్సిన గురుతర బాధ్యత గురువులపై ఉంది. కానీ కొందరి కారణంగా సమాజంలో టీచర్లు తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. – సోమచంద్రారెడ్డి, మాజీ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి మా బిడ్డలను మీ పిల్లలుగా చూసుకుంటారనే నమ్మకంతో బడికి పంపుతాం. కానీ టీచర్లే ఇలా కీచకులుగా మారి వికృతంగా ప్రవర్తిస్తే వీరినేమనాలి. ఇలాంటి టీచర్ల కారణంగా అందరూ టీచర్లకు చెడ్డపేరు ఎందుకు రాదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – ఈశ్వర, పేరెంట్, దేవదొడ్డి గ్రామం -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు తెలియజేసిన విషయాలను కూడా పేపర్లలో రాయడం నేరమనడం హాస్యాస్పదం. అలాగే పొలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ‘సాక్షి’పై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. –జ్ఞానేంద్రరెడ్డి, మాజీ ఎంపీ, చిత్తూరు -
ఆశలు నేలమట్టం.. అందదా పరిహారం
జిల్లాలో వ్యవసాయరంగం కుదేలవుతోంది. పంటలపై ప్రకృతి విరుచుకుపడుతోంది. వరుస విపత్తులతో పంట మొత్తం దెబ్బతింటోంది. వేరుశనగ పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. రైతుల పెట్టుబడి మట్టికొట్టుకుపోయింది. నష్టం అంచనా పరిశీలనకే పరిమితమైంది. ఏడాదిలో పరిహారం చెల్లింపు విషయమై జాప్యం జరుగుతోంది. మామిడికి మద్దతు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. సాగుపై రైతులు ముఖం చాటేయాల్సి వస్తోంది. అయినా కూటమి ప్రభుత్వం అన్నదాత విషయంలో చిన్నచూపు చూస్తోంది. కాణిపాకం: జిల్లాలో వ్యవసాయరంగంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వరి, మామిడి, కూరగాయలు, పండ్ల తోటలపై అధికంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే ప్రకృతి సహకరించక వీరి బతుకులు అతలాకుతలమవుతున్నాయి. సాగులో ఉన్న పంటలను భారీ వర్షాలు మింగేస్తున్నాయి. లేకుంటే అదునుకు వర్షాలు కురవక మట్టిపాలు చేస్తున్నాయి. దీంతో రైతులు కంటతడి పెడుతున్నారు. వేరుశనగ నేలమట్టం గతేడాది ఖరీఫ్లో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 43,174 హెక్టార్లు కాగా 13,044 హెక్టార్లలో పంట సాగు చేశారు. అదునుకు వర్షాలు లేక 9 వేల హెక్టార్లల్లో పంట దెబ్బతింది. వీటిని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. పంట నష్టం విలువ రూ.15.42 కోట్లుగా అంచనా వేశారు. యాదమరి, గుడిపాల, పెనుమూరు మండలాలను అత్యంత కరువుల మండలాలుగా ప్రకటించారు. మరో 13 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. దీనిపై కేంద్ర కరువు బృందం యాదమరి, గుడిపాల మండలాల్లో పర్యటించి పరిశీలన చేపట్టింది. అయినా ఇంత వరకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు గొగ్గోలు పెడుతున్నారు. మామిడికి ఏదీ మద్దతు ఈ సారి మామిడి పంట తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. పండిన ఫలాలను అమ్ముకోవడానికి రైతులు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. తీరా ఆ ఫలానికి తగ్గ ప్రతిఫలం కూడా ఇంతవరకు చేతికి అందలేదు. 31 ఫ్యాక్టరీలు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేశాయి. అలాగే ర్యాంపులు 30,600 మంది రైతుల నుంచి 1.44లక్షల మెట్రిక్ టన్నుల కాయలను తీసుకున్నాయి. అవీ ఇంత వరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదు. కార్వేటినగరంలోని ఫ్యాక్టరీ మాత్రం తోతాపురి కేజీకి రూ.4.90 చొప్పున్న చెల్లించింది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర మరుగున పడింది. ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఉద్యాన పంటల నష్టం ఇలా.. గతేడాదితో పాటు..ఈ సారి కురిసిన వర్షాలకు ఉద్యాన పంటలు 52.31 హెక్టార్లల్లో దెబ్బతిన్నాయి. మామిడి 46.60 హెక్టార్లు, టమాటా 1.96 హెక్టార్లు, కాకరకాయ 0.90 హెక్టార్లు, కీరకాయ 0.45 హెక్టార్లు, చామంతి 0.20 హెక్టార్లు, బొప్పాయి 2.00 హెక్టార్లు, బీరకాయ 0.20 హెక్టారల్లో నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మొత్తం రైతులు 115 మంది నష్టపోగా.. రూ.34.23 లక్షలు నష్టం జరిగినట్లు లెక్కగట్టారు. అయితే ఇంత వరకు పంట నష్టపరిహారం రాకపోవడంతో రైతులు మండిపోతున్నారు. తుపాను దెబ్బకు ఇలా... గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాను దంచి కొట్టింది. దీని ధాటికి వరి, రాగి 66.18 హెక్టార్లల్లో దెబ్బతింది. ఈ పంట సాగులో 194 మంది రైతులు నష్టపోగా...పంట నష్టం విలువ రూ.11.21 లక్షలుగా లెక్కగట్టారు. ఈ నివేదికలు ప్రభుత్వానికి చేరగా.. నష్ట పరిహారం కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. -
ప్రజాస్వామ్యానికి ముప్పు
వాస్తవాలను వెలికితీసే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, వేధించడం ప్రజాస్వామ్యానికి ముప్పు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్మెట్లు, ప్రసంగాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం, పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. బలమున్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై న ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – రెడ్డెప్ప, మాజీ ఎంపీ -
పేదలను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం
వెదురుకుప్పం: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కూటమి దోపిడీ పెచ్చుమీరుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. శుక్రవారం పుత్తూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మట్టి, గ్రావెల్, ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఇక్కడి నుంచి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా పాలసముద్రం మండలంలో ఉన్న కొండలు, గుట్టలను తవ్వి అక్రమంగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో నడుస్తున్న సుమారు 33 క్వారీలల్లో కూటమి నాయకులు నియమించుకున్న వసూలు రాజాలు ముక్కుపిండి దందాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కూటమి నాయకులు చేస్తున్న పాపాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టేందుకు ప్రయత్నించడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఒక్కో క్వారీ యజమాని నుంచి రూ.3 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. తాజాగా వెదురుకుప్పం మండలం, బందార్ల పల్లె గ్రామ సమీపంలో ఎద్దల బండపై క్వారీ నడిపే ప్రయత్నంలో టీడీపీకి చెందిన రౌడీ మూకలు గ్రామస్తులపై దాడులకు దిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
వికలత్వంపై మరోసారి పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఇటీవల నోటీసులు అందుకున్న దివ్యాంగుల వికలత్వాన్ని మరోసారి పరిశీలించనున్నట్టు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ఉన్న దివ్యాంగులందరికీ పింఛన్ అందజేస్తామన్నారు. నోటీసులందిన వారందరూ మరోమారు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. జిల్లా లో త్వరలో రీ అసెస్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పాటు ఇతర అధికారులను నియమిస్తామన్నారు. పరిశీలన చేసే సమయంలో ఫొటో గ్రాఫర్, వీడియోగ్రాఫర్లను నియమించి పరిశీలన చేయిస్తామని తెలిపారు. జిల్లాలో పింఛన్ రీ అసెస్మెంట్కు ఇప్పటి వరకు 4 వేల దరఖాస్తులు అందినట్లు చెప్పారు. అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డీఎంహెచ్వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, దివ్యాంగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి పాల్గొన్నారు. -
ఎక్సైజ్ కుర్చీకి ఎసరు?
చిత్తూరు అర్బన్ : జిల్లాలో మద్యం బార్ల వ్యవహారం ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి కుర్చీకి ఎసరు తెచ్చిపెట్టనుందా? నిర్ణీత గడువులోపు బార్లకు దరఖాస్తులు రాకుంటే ఆ అధికారిపై బదిలీ వేటు తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మద్యం బార్లకు దరఖాస్తులు కూడా వేయించనివాళ్లు, ఏం పనిచేస్తారని ఇప్పటికే రెండు జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులపై బదిలీ వేటు పడటం ఇక్కడి అధికారులను కలవరానికి గురిచేస్తోంది.రెండు రోజులే గడువుజిల్లాలో 12 మద్యం బార్లకు గతనెల నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో చిత్తూరులో 8, కుప్పం, నగరి, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో ఒక్కో మద్యం బారు ఏర్పాటు చేయాలని నోటిఫై చేశారు. కుప్పం, పుంగనూరు, నగరితో పాటు చిత్తూరులో మూడు (ఒకటి గీత సామాజిక వర్గాలకు) బార్లకు దరఖాస్తులు రావడంతో లైసెన్సులు కేటాయించారు. పలమనేరు, చిత్తూరులోని మరో అయిదు బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో వీటికి రీ–నోటిఫికేషన్ విడుదల చేశారు. వాస్తవానికి చిత్తూరు నగరంలో మెజారిటీ మద్యం బార్లు కూటమి నేతల చేతుల్లోనే ఉండేది. ప్రభుత్వం సూచించిన లైసెన్సు ఫీజులు, నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలు నచ్చకపోవడంతో నిర్వాహకులు గతంలో సిండికేట్గా ఏర్పడ్డట్లు తెలుస్తోంది. అందరూ మాట్లాడుకుని అయిదు బార్లకు దరఖాస్తులు వేయలేదని సమాచారం. ఈనెల 14వ తేదీ సాయంత్రంలోపు ఆరు బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా నిర్ణయించారు.దరఖాస్తులు రాకపోతే..మద్యం బార్కు దరఖాస్తులు కూడా వేయించలేని అధికారులు, పనిచేయడం దండగ అనే కోణంలో బాపట్ల, కోనసీమ జిల్లాల్లోని ఇద్దరు ఎక్సైజ్ జిల్లా అధికారులపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోనూ ఇదే భయం పట్టుకుంది. నాటు సారా నిర్మూలన, నవోదయం 2.0తో పాటు మద్యం దుకాణాల టెండర్లు, అధికారులకు ప్రొటోకాల్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటే ఇప్పుడు మెడపై కత్తి పెట్టి మద్యం బార్ల అంశాన్ని తీసుకొచ్చారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బార్లకు దరఖాస్తులు రాకుంటే బదిలీ వేటు తప్పదనే నేపథ్యంలో అధికారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పనితీరు బాగోలేకుంటే బదిలీ చేయొచ్చు. ప్రభుత్వ పాలసీ నచ్చకుండా నిర్వాహకులు ముందుకు రాకుంటే తమను బలి పశువు చేయడం ఎంత వరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దళిత ద్రోహి చంద్రబాబు
తిరుపతి మంగళం: దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని దళితులను హేళనగా మాట్లాడిన దళిత ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర ఆధ్వర్యంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీజేఆర్ సుధాకర్బాబు, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావుతో పాటు ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమార్, లలితా థామస్, నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నూకతోటి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దళిత మహిళలపై ఆత్యాచారాలు అధికమయ్యాయన్నారు. ఎన్నికల ముందు మహిళలకు అండగా ఉంటా మహిళల జోలికి వస్తే తాటతీస్తానంటూ ప్రగల్భాలు పలికిన పవన్కల్యాణ్కు దళిత మహిళ ఆత్యాచారాలు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి దళితులంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. సమాజంలో దళితులకు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవులను కల్పించిన ఏకై క నాయకుడు జగనన్న మాత్రమేనని.. అలాంటి గొప్ప నాయకున్ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సైనికుల్లా పని చేద్దామన్నారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎనభై ఏళ్ల క్రితమే దళిత కుటుంబంతో వివాహ బంధం ఏర్పరుచుకుని దళితులతో బాంధవ్యాన్ని కలుపుకున్న కుటుంబం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని గుర్తు చేశారు. అనంతరం భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు రూ.2.80 లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో అందించిన గొప్ప నాయకుడు జగనన్న అన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు సునీల్కుమార్, నూకతోటి రాజేష్ మాట్లాడుతూ జగనన్న అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ఉంటాయన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్కుమార్, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ నల్లాని బాబు, కార్పొరేటర్లు కోటూరు ఆంజినేయులు, బోకం అనిల్కుమర్, పుణీతమ్మ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
ప్రభుత్వం కక్ష సాధింపు
జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి భారతదేశం బలమైన రాజ్యాంగ రక్షణ కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాసే ప్రయత్నం చేస్తోంది. పత్రికలు, జర్నలిస్టులపైన కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. స్టేట్మెంట్లు ఇచ్చినా కేసులు పెడతారా? ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. వాస్తవాలు భయటపెట్టే పత్రికలపై కేసులు పెట్టడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. – ఆర్ కే రోజా, మాజీ మంత్రి -
ఆకట్టుకున్న శోభాయాత్ర
పుంగనూరు : హరిహరపురం మఠాధిపతి శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే పట్టణంలో తొలిసారిగా హిందూ శోభాయాత్ర నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆయన పుంగనూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందువులు ఏకమై స్వామి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారు శ్రీచక్రన వారణ పూజా కార్యక్రమాలు సాయంత్రం ని ర్వహించి, భక్తులకు ఉపదేశం ఇచ్చారు. హిందువులు ఐకమత్యంతో ఉండాలని, శాంతి భా వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.నియామకంచిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ సంయుక్త కార్యదర్శిగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీ.వెంకటేష్ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.ఆభా ఐడీ విధిగా నమోదు చేయాలిచిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆభా (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) ఐడీని విధిగా నమోదు చేయాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం డాకర్లు, స్టాఫ్నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకు డిజిటల్ మిషన్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆభా ఐడీ ప్రతి ఒక్కరికీ నమోదు చేయి ంచాలన్నారు. తద్వారా వైద్య సేవలు ఆన్లైన్లో పొందుపరుస్తారన్నారు. ప్రస్తుతం కుప్పంలో నర్వ్ సెంటర్ నడుస్తోందన్నారు. అలాగే చిత్తూరులో కూడా సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆభా ఐడీ నమోదులో అలసత్వం వద్దని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంఓ ప్రవీణ, వైద్యులు అనూష, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.రేపు జాతీయ లోక్ అదాలత్చిత్తూరు అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 13వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారమే లక్ష్యంగా అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. రాజీ చేసుకోదగ్గ కేసులను అదాలత్లో పరిష్కరించుకోవచ్చని.. వివరాలకు చిత్తూరు కోర్టులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలన్నారు.15 నుంచి ఇంటర్ త్రైమాసిక పరీక్షలుచిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ త్రైమాసిక పరీక్షలు ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అబ్ధుల్ మజీద్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నియమ, నిబంధనల మేరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఉత్తర్వులు అందాయన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఈనెల 15 నుంచి అక్టోబర్ 10 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని ప్రిన్సిపల్ వెల్లడించారు.డిమాండ్ల పరిష్కారానికి నిరసనలుచిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం టీచర్ల డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు నిరసనలు చేపట్టారు. ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. తమ నిరసనలు ఈ నెల 17 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. -
సూపర్ సిక్స్ సభ అట్టర్ ఫ్లాప్
పాలసముద్రం : అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సభకు ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన లేదన్నారు. సభ విజయవంతం కాకపోవడంతో కూటమి నాయకులు షాక్కు గురయ్యారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ సభకు బలవంతంగా జన సమీకరణ చేశారన్నారు. ప్రతి మహిళా సంఘం నుంచి ఐదుగురు సభ్యులు ఈ సభకు రావాలని అధికారులు ఒత్తిడి చేయడంతో మహిళలు తప్పని పరిస్థితిలో సభకు వెళ్లారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయకుండానే సూపర్హిట్ సభ నిర్వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి సభను నిర్వహించినా ప్రజల్లో స్పందన కరువైందన్నారు. బలవంతపు విజయోత్సవాలు చేసుకోవడం దేశంలోనే చంద్రబాబుకు మాత్రమే సాధ్యమేని విమర్శించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గుట్టలో ఎర్రమట్టి తమిళనాడుకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఎన్నడు లేని విధంగా గుట్టలు మాయమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 25 లోపు మామిడి రైతుల ఖాతాల్లో సబ్సిడీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి సబ్సిడీ నగదును ఈ నెల 20 నుంచి 25వ తేదీలోపు సంబంధిత మామిడి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో మామిడి సీజన్లో 4.1 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిన 37 వేల మంది రైతులకు సబ్సిడీని జమచేయనున్నట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.160 కోట్ల మేర జమచేస్తామన్నారు. గత కొద్ది రోజులుగా అర్హుల నివేదికలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున రైతులకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ రాయితీ అందజేస్తోందన్నారు. ఒక్కొక్క రైతుకు రాయితీ రూపంలో దాదాపు రూ.40 వేలు జమవుతుందని తెలిపారు. మామిడి పరిశ్రమల ఆధ్వర్యంలో 2.35 లక్షల మెట్రిక్ టన్నులు, ర్యాంపులు, మండీల నుంచి 1.65 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడిసాగుకు రూ.10 కోట్లు ఖర్చు చేశామన్నారు. త్వరలో కృష్ణగిరి నుంచి రెండు కొత్త పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెదురుకుప్పం మండలంలో విధుల పట్ల అలసత్వం వహించిన ఇద్దరు వీఆర్వోలను ఇటీవల సస్పెండ్ చేశామన్నారు. -
జాతరలో ప్రత్యేకతలు
పట్టువస్త్రాల సమర్పణ జాతర సందర్భంగా దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మేళతాళలతో పట్టువస్త్రాలను సమర్పించారు. దేవదాయ కమిషనర్ రామచంద్రయ్య, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోవూరు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, చైర్మన్ నక్కా భానుప్రియ హాజరయ్యారు. 0000వెంకటగిరి(సైదాపురం) : కోరిన కోర్కెలు తీర్చే తల్లీ..పోలేరమ్మా.. కాపాడగరావమ్మా.. అంటూ భక్తజనం పోలేరమ్మ ఎదుట ప్రణమిల్లారు. జాతర సందర్భంగా వెంకటగిరి పురవీధులన్నీ స్వర్ణకాంతులతో దేదీప్యమానంగా కాంతులీనాయి. అమ్మవారి ప్రతిరూపాన్ని తనివితీరా దర్శించుకున్న భక్తులు పులకించారు. అమ్మలుగన్న అమ్మా.. పోలేరమ్మా తల్లీ అంటూ పట్టణ పురవీధుల్లో ప్రతిధ్వనించాయి. వెంకటగిరి పట్టణమంతా జైపోలేరూ.. జైజై పోలేరూ తల్లీ అంటూ మార్మోగింది. జిల్లా నలుమూలలే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా పోలేరమ్మ జాతరకు విచ్చేయడంతో దారులన్నీ వెంకటగిరివైపే మళ్లాయి. దీంతో ఎక్కడ చూసినా జనమే దర్శనమిచ్చారు. సారె సమర్పణ.. వెంకటగిరి రాజా కుటుంబీకుల సర్వజ్ఞకుమార కృష్ణ యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించారు. ఆలయ మహద్వారం నుంచి పసుపు కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలతో కూడిన సారెను అందించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్సీపీ నేత బొలిగర్ల మస్తాన్యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరకు భద్రత.. పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ కావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అయితే అనుకున్న మేర ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆనందోత్సాహాల నడుమ నగరోత్సవం.. భక్తజన సందోహం నడుమ నగరోత్సవం ప్రారంభం కాగా భక్తులు పెద్దఎత్తున వీక్షించారు. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి మెట్టునిల్లు అయిన జీనుగులవారి వీధి నుంచి వేకువజామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో అధిష్టించారు. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. అయితే భక్తులకు నామమాత్రంగా ఓ గంట పాటు వాటర్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఉచిత దర్శనం, రూ.100, రూ.300 టికెట్లను కొనుగోలు చేసిన భక్తుల కోసం పాతబస్టాండ్ మీదుగా కొత్తగా క్యూలైన్ను పొడిగించారు. అమ్మవారి సాంగెం పోలీసు బందోబస్తు నడుమ రాజా భవనం నుంచి అమ్మవారి ఆలయం వద్ద తీసుకురావాల్సి ఉండగా అవేవీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది కూటమి నేతల కనుసన్నల్లో జాతర జరిగింది. గతంలో ఉన్న వీఐపీ క్యూలైన్ పూర్తిగా ఎత్తేసి ప్రోటోకాల్ ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక దర్శనమని ప్రకటించారు. కానీ అదంతా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. దున్నపోతు బలితో.. జాతర సంప్రదాయ ప్రకారం అమ్మవారికి దున్నపోతు బలి కార్యక్రమం జరిగింది. అమ్మవారి నిమజ్జనం పూర్తయ్యే వరకు గండదీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బలి పూర్తి కాగానే గ్రామ పొలిమేరల్లో నాలుగుదిక్కులా పొలి చల్లారు. -
ద్విచక్ర వాహనం డీకొని వ్యక్తి మృతి
వి.కోట: బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వి.కోట –పెర్నంబట్ జాతీయ రహదారిలోని ఏడుచుట్లకొట్ల గ్రామం వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని చింతమాకులపల్లి గ్రామానికి చెందిన చిన్న బిడ్డప్ప కుమారుడు శ్రీనివాసులు(65) కూలి పనులు ముగించుకుని ఏడుచుట్ల గ్రామం వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన వ్యక్తి బైక్పై వి.కోట నుంచి పెర్నంబట్టు వైపు వెళ్తున్న శ్రీనివాసులును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ీప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు అప్పటికే మృతిచెందిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ సోమశేఖర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పేకాట ఆడుతున్న 24 మంది అరెస్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 24 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ నెట్టింకటయ్య కథనం మేరకు.. గంగనపల్లెలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సీఐ నెట్టికంటయ్య తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. ఇక్కడ పేకాట ఆడుతున్న కెఎస్.మధు (57), పి.జగదీష్ (39), ఎంజి.ఆనంద్బాబు (38), ఐ.రియాజ్ భాష (40), పికె.ఆసీఫ్ (29), ఎండి.షరీఫ్ (33), ఎస్.హసీఫ్ (30), ఎం.లోకేష్ (37), డి.ధనుష్ (21), జె.ఉమాపతి (28), ఆర్.మణికంఠ (29), కె.మోహన్బాబు (36), ఎంఆర్.జయప్రకాష్ (51), వి.ఏలుమలై (52), పి.సదాశివ (58), కె.శివ (47), పి.బషీర్ (52), పి.స్వాతికిరణ్ (43), ఎన్.జ్యోతీశ్వరన్ (44), ఎ.రాజ్కుట్టి (35), ఎస్.రాజా (36), జి.షాన్వాజ్ (40), ఎస్కె.మున్నా (40)ను అరెస్టు చేసి, ఆపై 41 నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. నిందితుల వద్ద రూ.37,160 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా పోలీసులకు చిక్కిన నిందితుల్లో కూటమి పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి పదవుల్లోని వాళ్లూ ఉన్నారు.విద్యాలయంలో మందుబాబుల ఆగడాలుచిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని వన్నియర్ బ్లాక్లో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మందుబాబుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. విద్యాలయంలో రాత్రి సమయాల్లో మందుబాబులు మద్యం సేవించి బాటిళ్లను పాఠశాల ఆవరణలో పడేస్తున్నారు. అదే విధంగా ఆ పాఠశాలలో ఉండే ఓవర్ హెడ్ ట్యాంక్ నిచ్చెన మెట్లు మరమ్మతులకు లోనుకావడంతో ప్రమాదకరంగా మారింది. చిన్నారులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల వద్ద రాత్రి సమయాల్లో పోలీసుల గస్తీ పెంచి వాచ్మన్ను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు
వార్తలు రాస్తే కేసులు పెడతారా? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ? తప్పుడు కేసులు నమోదుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సాక్షి పత్రికలో ప్రెస్మీట్లు, స్టేట్మెంట్లు ప్రచురించినందుకు పత్రికపైన , ఎడిటర్పైన , సంబంధిత రిపోర్టర్లపైన కూటమి ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించడం, కార్యాలయాలు, ఇళ్లు సోదాలు చేయడం దుర్మార్గం. పత్రికల గొంతునొక్కేందుకు తప్పుడు కేసులు నమోదు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం వికృతచేష్టలకు నిదర్శనం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా , ఆ తప్పులను ఎత్తి చూపుతున్న సాక్షిపై ప్రభుత్వం క్షక్ష సాధిస్తోంది. – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
ఎర్రమట్టి రవాణాలో తమ్ముళ్ల కుమ్ములాట
పాలసముద్రం : గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్, టీడీపీ రాష్ట్ర నాయకుడు చిట్టిబాబునాయుడు మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటోందని కొంత మంది టీడీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఇలా వారిద్దరి మధ్య విభేదాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఎర్రమట్టి గ్రావెల్ క్వారీలో అక్రమంగా తమిళనాడుకు తలిస్తున్నారు. వీటిని అడ్డుకట్ట వేసేందుకు చిట్టిబాబు నాయుడు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అయినా అక్రమ ఎర్రమట్టి గ్రావెల్ తమిళనాడుకు తరలిపోతూనే ఉంది. అధికారులు కూడా ఎర్రమట్టి గ్రావెల్ ఆపితే ఎమ్మెల్యే ఏమంటారోనని.. ఆపకపోతే రాష్ట్ర టీడీపీ నేత చిట్టిబాబు నాయుడు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తారని భయాందోళన చెందుతున్నారు. ఇలా ఎమ్మెల్యే వర్గం.. రాష్ట్ర టీడీపీ నేత చిట్టిబాబు వర్గం ఎర్రమట్టి రవాణాలో ఎవ్వరికి వారే యమునా తీరేలా వ్వవహరిస్తున్నారు. -
మామిడి రైతులకు రూ.8 చెల్లించాల్సిందే !
గంగాధర నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు చెప్పిన మాట ప్రకారం కొనుగోలు ధర 8 రూపాయలు చెల్లించాల్సిందేనని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు జిల్లాల కలెక్టర్లు రైతులు, సంఘాల నాయకులు పరిశ్రమ యజమానులు సమావేశం ఏర్పాటు చేసి తోతాపూరి ధర 12 రూపాయలుగా నిర్ణయించగా ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యాలు నాలుగు, ఐదు రూపాయలే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు ధర 8 రూపాయలు, సబ్సిడీ ధర 4 రూపాయలను వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పరిశ్రమల ముందు మామిడి రైతులు బిచ్చగాళ్లలాగా పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 15వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు మ్యాంగో యార్డు నుంచి కలెక్టరేట్ వరకు మామిడి రైతుల ట్రాక్టర్ వాహన మహా ర్యాలీలో రైతులు పాల్గొని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మామిడి రైతుల సంక్షేమ గౌరవాధ్యక్షుడు జయరాం రెడ్డి, అధ్యక్షుడు త్యాగరాజ రెడ్డి, రైతు నాయకులు వెంకటేశులు ప్రభాకర్ , పురుషోత్తం, గుణశేఖర్ రెడ్డి, ప్రకాష్ , చిట్టిబాబు మామిడి రైతులు పాల్గొన్నారు. -
గజరాజుల బీభత్సం
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని ఆవుల పెద్దిరెడ్డిగారిపల్లె, కురవపల్లె, గౌరిశెట్టిగారి పల్లెల్లో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి బీభత్సం సృస్టించాయి. వరుస దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆవుల పెద్దిరెడ్డిగారి పల్లెలో రైతు వీరయ్య పొలంలో వరి పంటను ధ్వంసం చేశాయి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో టమోటా, అరటి, కొబ్బరి చెట్లను తొక్కి నాశనం చేశాయి. అటవీశాఖ అధికారులు ఏనుగులను పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అశ్విక (32) అనే వివాహిత గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. వన్టౌన్ సీఐ మహేశ్వర కథనం.. గుడిపాలలోని 190–రామాపురానికి చెందిన అశ్విక, గంగాధరనెల్లూరుకు చెందిన అరుణ్కుమార్కు పదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల చదువురీత్యా దంపతులు ఇద్దరూ చిత్తూరులోని మిట్టూరులో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి ఒకే గదిలో పడుకున్న దంపతులు.. తెల్లవారి చూసేసరికి పడకపై అశ్విక అచేతనంగా పడి ఉంది. ఆమె చనిపోయిందని తెలుసుకున్న భర్త గంగాధరనెల్లూరులోని ఆరిమాకులపల్లెకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని, మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. ‘అఖిల దేవతా కృతి’ పాట ఆవిష్కరణ కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో గురువారం పలమనేరుకు చెందిన వాసుదేవన్ రచించిన అఖిల దేవతా కృతి అనే పాటను ఆవిష్కరించారు. ఈఓ పెంచల కిషోర్ చేతుల మీదుగా పాటను ఆవిష్కరించగా పలువురు వాసుదేవన్ను అభినందించారు. కార్యక్రమంలో ఏఈఓ ధనపాల్, సినీ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?
వైభవంగా కలశ ఊరేగింపు కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం కలశాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా, మట్టి, ఇసుక, గ్రానైట్ వంటి ప్రకృతి సంపదను దోచుకుంటున్న పచ్చనేతలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాస్వామ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతోంది. నిజాలను వెలికితీసే పత్రికలపైనా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదు. కేవలం రెడ్బుక్ రాజ్యాంగమే అమలవుతోంది. పత్రికల గొంతునొక్కి, జర్నలిస్టులను మానసికంగా ఇబ్బంది పెట్టి , భయపెట్టేందుకే ఇలాంటి చేతగాని రాజకీయాలు చేస్తున్నారు. నిజాలను ప్రచురించే పత్రికలపై కేసులు పెట్టడం దుర్మార్గం. – కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి -
వైభవంగా కలశ ఊరేగింపు
కాణిపాకం : వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్షవాహన సేవను పురస్కరించుకుని కాణిపాకంలోని దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం కలశంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. శివాలయం నుంచి 501 కలశాలతో పురవీధుల్లో కోలాటలు, కేరళ వాయిద్యం, తప్పెటగుండ్లు నడుమ అత్యంత వైభవంగా కలశాలతో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఈఓలు ఆలయ అధికారులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్పవృక్షవాహన సేవలో భాగంగా ఆలయాన్ని శోభయామానంగా తీర్చిదిద్దారు. -
ఆటో అదుపు తప్పి .. గాయాలు
చౌడేపల్లె : అయ్యో.. పొట్టనింపుకోవడానికి కూలీ పనుల కోసం వచ్చి పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా దుర్గసముద్రం వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలపైకి తెచ్చుకొన్న ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం గౌదమాకులపల్లెకు చెందిన కొందరు ఆటోలో చౌడేపల్లె మండలం ఎర్రప్పల్లె వద్ద టమోటా తోటలో కూలీ పనుల కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో దుర్గసముద్రం వద్ద వెళ్తుండగా గుత్తివారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ విశ్వనాథ్ (38)కు ఫిట్స్ రావడంతో వాహనంను రోడ్డు పక్కనే ఉన్న శంకరప్ప ఇంటిలోకి ఆటో వేగంగా దూసుకెళ్తు ఎదురుగా ఉన్న రాతి కూసాలు, గోడను ఢీకొని ఆటో ఆగింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్నహేమశ్రీ (32)మంజుల (35)హారతి (18) టి.మంజుల(40)లక్ష్మమ్మ(45) సుబ్బమ్మ(52) లతో పాటు మరో ఇద్దరికి గాయాలైయ్యాయి.స్థానికులు ప్రవేటు వాహనంలో చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వీరిలో మంజుల, హారతి, హేమశ్రీల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మదనపల్లెకు రెఫర్ చేశారు. సుమారు గంట సేపు 108 వాహనం కోసం క్షతగాత్రులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎదురుగా వాహనంను ఢీకొని ఉంటే పెద్ద ప్రాణ నష్టం సంభవించేదని కూలీలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకొన్న ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తమ దృష్టిలో సూపర్సిక్స్ హిట్ కాదని... సూపర్ ఫ్లాప్ అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ర50 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని..ఇంత వరకు ఇవ్వలేదన్నారు. అలాగే 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని..ప్రైవేటు కంపెనీల ఒప్పందం పేరుతో హడావుడి చేస్తోందన్నారు. ఎన్నికలప్పుడు అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6వేలు కలిపి రూ. 20వేలు ఇస్తున్నారని, పలు రకాల కారణాలు చెబుతూ పథకంలో కోతలు పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామమని...అమలుపై నోరెత్తడం లేదన్నారు. మానవత్వం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులకు అడ్డగోలుగా పింఛన్లను తొలగించారన్నారు. వితంతులకు పింఛన్లు లేవన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటప్పుడు సూపర్సిక్స్ విజయవంత సభల నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విభజన హామీలపై కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు మోదీకి తాకట్టుపెట్టారన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, కిల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
గుడిపాల : పంచాయతీల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకంగా ఉండాలని జెడ్పీ సీఈఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీలకు జమ చేయడం జరిగిందని వాటిని ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటికి ఉపయోగించుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుడిపాల మండలంలోని ఎస్సీలు అధికంగా ఉన్న పశుమంద, వెంగమాంబపురం, కొత్తపల్లె, శ్రీరంగంపల్లె, మరకాలకుప్పం గ్రామాలకు రూ.20 లక్షలు మంజూరైందని వీటిని సీసీ రోడ్లు మినహా మిగతా పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో కుమార్, డిప్యూటీ ఎంపీడీవో కృష్ణప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్నాయుడులు , తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇలాంటి విధానాల వల్ల సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, భద్రత లాంటివి రేపటి సమ సమాజ స్థాపనకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఉండాలే కానీ, గొంతు నొక్కేలా వ్యవహరించకూడదు. అలా నిజాల్ని మరుగునపరిచే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరం పాలకవర్గాలను క్షమించదన్న విషయం గమనించుకోవాలి. పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని గతంలోకి లక్నోకి చెందిన కేసులో సుప్రీం కోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నాలు చేయరు. -
డ్రాపౌట్స్ తగ్గింపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బడి బయట పిల్లలు (డ్రాపౌట్స్) తగ్గింపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బడిబయట పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలో జూలై 2025 నాటికి 4202 మంది విద్యార్థులను బడిబయట పిల్లలుగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1997 మంది విద్యార్థులను తిరిగి వివిధ పాఠశాలల్లో చేర్పించారన్నారు. పాఠశాలల్లో చేరిన బడిబయట విద్యార్థుల వివరాలను ఎంఈవోలు పాఠశాల వారీగా ప్రత్యేక ఫ్రొఫార్మాలో వివరాలు అందజేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా మెనూ ప్రకారం అమలు చేయాలని తెలిపారు. నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, విద్యాశాఖ ఏడీ–1 సుకుమార్, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టలో కూటమి నేతలకు ఎర్రమట్టి గ్రావెల్ మంజూరైంది. కానీ బుధవారం అనుమతి పేరుతో ఎక్కడ ఎర్రమట్టి బాగుందో అక్కడ కూటమి నాయకులు హిటాచీతో ఎర్రమట్టిని టిప్పర్లలో తమిళనాడుకు తరలించి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుకున్న గ్రామస్తులు తహసీల్దార్ అరుణ కుమారి , ఎస్ఐ చిన్నరెడ్డప్పకు వివరించారు. వారు సంఘటన స్థలానికి చేరుకునే లోగానే వారికి మంజూరైన ప్రదేశానికి హిటాచీలను, టిప్పర్ని తరలించారు. వారికి మంజూరైన చోటులో సర్వేయర్ సహాయంతో హద్దులు చూపించారు. ఇందులో చుట్టు పక్కల 30 అడుగులు వదిలేసి మిగిలిన చోటనే మట్టిని తీసుకోవాలన్నారు. అలా కాకుండా ఇష్టానుసారం మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పంచాయతీ ఇచ్చిన తీర్మానంలో 2.95 హెక్టార్లకు క్వారీకి అనుమతి ఇచ్చినట్టు ఉంది. కాగా మైనింగ్ అధికారులు ఇచ్చిన అనుమతిలో 4.900 హెక్టార్లలో క్వారీకి అనుమతి ఇచ్చినట్లు పరస్పర విరుద్ధంగా అనుమతులు ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
చంద్రప్రభపై వరసిద్ధుడు
కాణిపాకం : ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి బుధవారం చంద్రప్రభ వాహనంపై కటాక్షించారు. తొలుత మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం చేశారు. చందన అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మాడ వీధుల్లో ఊరేగించారు. చంద్రప్రభ వాహన సేవలో భాగంగా ఉభయదారులు క్షీర కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన ఆలయ కల్యాణ వేదికలో ఉత్సవమూర్తి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నేడు కల్పవృక్షవాహనం కాణిపాక ఉత్సవంలో భాగంగా గురువారం స్వామివారు కల్పవృక్ష వాహనంలో ప్రత్యక్షమవనున్నారని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. రాత్రి కల్పవృక్షవాహన సేవ ఉంటుందన్నారు. -
కక్ష సాధింపులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
రాష్ట్రంలో పరిస్థితులు దారణంగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు వస్తే తమకు మింగుడుపడని పక్షంలో ఖండించాలి తప్ప కక్ష సాఽధింపు చర్యలకు దిగడంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు బనాయించి నోటీసులు జారీచేయడం మేధావి వర్గాలు, జర్నలిస్టులు ఆలోచించాల్సిన విషయం. వ్యవస్థలను తమ చేతులోకి తీసుకుని ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తే అందుకు తగిన మూల్యం భారీ స్థాయిలో చెల్లించుకోక తప్పదు. ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనబడలేదు. ఇకనైనా పత్రికల యాజమాన్యాలపైన, జర్నలిస్టులపైనా కేసులు పెట్టే సంస్కృతి మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ దృష్టి సారించాలి -
ఈనెల 15 వరకు ఇన్స్పైర్ మనక్ గడువు
చిత్తూరు కలెక్టరేట్ : ఇన్స్పైర్ మనక్ 2025–26లో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ కు దరఖాస్తు చేసుకునేలా హెడ్మాస్టర్లు చర్యలు చేపట్టాలని డీఈవో ఆదేశించారు. ఉద్యోగ మేళాకు స్పందన కార్వేటినగరం : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సీడాప్ ఏపీ ఎస్.ఎస్.డి.సి సంయుక్తంగా శనివారం కార్వేటినగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టరేట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఆనంద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి , సీడాప్ – ఏపీఎస్ఎస్డీసీ అధికారులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. మొత్తం 178 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 86 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. నేడు వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగ సమావేశం తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ విభాగం నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని వివరించారు. భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బుధవారం సంకటహర చతుర్థి గణపత్రి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తులతో జరిపించారు. స్వర్ణరథంపై స్వామివారు... స్వయంభు శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి శనివారం రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై కటాక్షించారు. ప్రధాన ఆలయంలో సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చక, వేద పండితులు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణ రథంలో కొలువుదీర్చి ఊరేగించారు. మిలటరీ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు తిరుపతి సిటీ : రాష్ట్రీయ మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు అక్టోబర్ 9వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్రెడ్డి బుధవారం తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ స్కూల్, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
విద్యుత్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
గంగాధర నెల్లూరు : ప్రత్యేక విద్యుత్ అదాలత్ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి పిలుపు నిచ్చారు. గంగాధర నెల్లూరు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో బుధవారం విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక విద్యుత్ అదాలత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడినప్పుడు సకాలంలో సంబంధిత సిబ్బంది పరిష్కరించి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ సాంకేతిక ఆర్థిక సభ్యులు మధుకుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి , విద్యుత్ శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈ. సురేష్ కుమార్, డీఈలు శేషాద్రి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చంద్రబాబు, గంగాధర నెల్లూరు , ఆవలకొండ విద్యుత్ శాఖ ఏఈలు వరదరాజులు, తనిగవేలు పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం సేవలో ఆర్టీసీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : సీఎం చంద్రబాబు వివిధ ప్రాంతాల్లో పర్యటించే ప్రతిసారీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం పాల్గొనే సభలను విజయవంతం చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నారు. ఈ విషయం ముందస్తుగా తెలియక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాతో పాటు ఇతర జిల్లాలో జరిగే సీఎం చంద్రబాబు పర్యటనకు ఆర్టీసీ బస్సులు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అనంతపురం జిల్లాలో జరిగే సభకు జిల్లాలోని బస్సులను తరలించారు. అక్కడ సభను విజయవంతం చేసేందుకు జిల్లా బస్సులను పంపించేశారు. మంగళవారమే బస్సులన్నీ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో బుధవారం ఉదయం నుంచి జిల్లాలో బస్సుల కొరత వేధించింది. బస్సుల్లేక ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 426 బస్సులుంటే 300 బస్సులను సభకు పంపించేశారు. ఇందులో తిరుపతి, వేలూరు, బెంగుళూరు మార్గాల్లో తిరిగే బస్సులు అధికంగా ఉన్నాయి. పల్లె వెలుగు బస్సులను సైతం వదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా.. ఆర్టీసీ బస్సులను సీఎం సభకు తరలిస్తారనే ముందస్తు సమాచారం లేకపోవడంతో బుధవారం ఉదయం నుంచే ప్రయాణికులు బస్టాండుకు వచ్చి షాక్కు గురయ్యారు. గమ్యం చేరుకోవడానికి పడిగావులు పడ్డారు. డొక్కు బస్సులు తప్ప మిగిలిన సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగుతో సహా సభకు తరలించారు. ఫలితంగా గ్రామాలు, మండల కేంద్రాలకు రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలే దిక్కు.. గంటల తరబడి బస్టాండుకు బస్సులు రాకపోయే సరికి ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. బస్సులను సభకు పంపిన విషయంపై సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వాహనాదారు లు రెచ్చిపోయారు. ఏకంగా చిత్తూరు ఆర్టీసీ బస్టాండుకే వాహనాలను తీసుకొచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లారు. ప్రయాణికులపై చార్జీల మోత వేశారు. పట్టించుకోని అధికారులు ఆర్టీసీ ఇష్టానుసారంగా బస్సులను సీఎం సభలకు మళ్లించి. జిల్లా పర్యటనతో పాటు ఏ జిల్లాలో సభ జరిగినా ఆర్టీసీ అధికారులు అప్పన్నంగా బస్సులను పంపుతున్నారు. ప్రయాణికుల కష్టాలను పట్టించుకోకుండా ఎప్పడు పడితే అప్పుడు బస్సులను మళ్లించడం ఆర్టీసీకి పరిపాటిగా మారిందని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు. చిత్తూరు బస్టాండ్లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు -
పీహెచ్సీల్లో మందుల్లేవ్!
జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రతి ఇంటా జ్వరంతో ఇద్దరూ, ముగ్గురూ మంచం పట్టారు. పీహెచ్సీల్లో మందుల్లేక వైద్యం మొక్కుబడిగా మారింది. జ్వరానికి సైతం మాత్రలు, మందుల్లేక బయట కొనుక్కోవాల్సి రావడం రోగులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికీ వెళ్లి నాడీపట్టి మందులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో నేడు ఆసుపత్రికి వెళ్లినా మందుల్లేక విలవిల్లాడిపోతున్నారు.కాణిపాకం : తరచూ కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల కారణాలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి గ్రామంలో జ్వర పీడితులు ఉన్నారు. పేదలు వైద్యం కోసం పీహెచ్సీలకు వెళ్తే ఒకటి, రెండు మాత్రలు మినహా అత్యవసరమైన ఔషధాలు లభించడం లేదు. ఆరోగ్య కేంద్రాల్లో మందులు, మాత్రలు లేక వెలవెలబోతున్నాయి. కేంద్రాల నుంచి ఇండెంట్ పెట్టి నెలలు గడస్తున్నా సరఫరా విషయంలో జాప్యం నెలకొంది.జిల్లా వ్యాప్తంగా 50 పీహెచ్సీలున్నాయి. ప్రతి పీహెచ్సీకి నిత్యం 100–200 వరకు ఓపీలొస్తున్నాయి. 50–75 మంది వరకు దీర్ఘకాలిక వ్యాధులతో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రస్తుతం మలేరియా, డెంగీ, టైఫా యిడ్తో పాటు, విష జ్వరం, రోగాలు వ్యాపిస్తున్నాయి. ఇటీవల పీహెచ్సీలకు జ్వరం కేసులు అధికమయ్యాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఇతర లక్షణాలతో క్యూ కడుతున్నారు. వీరికి వైద్య సేవలను అటు ఉంచితే...మందు బిల్లలూ కరువయ్యాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీహెచ్సీలో మందులు, మాత్రలు ఫుల్గా ఉండేవి. కొరత వచ్చిన వెంటనే వాటిని అప్పటికప్పుడే భర్తీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మందులు, మాత్రల కొరత వేధిస్తోంది. నెలల తరబడి మందులు, మాత్రల కొరత ఉన్నా పట్టించుకోవడంలేదు. సెంట్రల్ డ్రగ్స్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు.ప్రబలుతున్నా నిర్లక్ష్యమేజిల్లాలో జ్వరాలు తాండవిస్తున్నాయి. చిత్తూరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో జ్వరాల కేసులు పెరిగిపోతున్నాయి. ఊరురా జ్వరాలు ప్రబలుతున్నాయి. అయితే జ్వరాలతో పీహెచ్సీలకు వెళ్తే తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. పీహెచ్సీలకు నిర్లక్ష్య జబ్బు అంటుకుంటోంది. జ్వరానికి మందులు, మాత్రలు లేని దుస్థితి ఏర్పడింది.బయటకొనుక్కోండిఆరోగ్య కేంద్రాల్లో మందు బిల్లలు లేక పల్లె ప్రజలు అవస్థలు పడుతున్నారు. జ్వరం, ఇతర నొప్పులతో ఆస్పత్రికి వస్తే...గంటల కొద్ది క్యూలో వేచి ఉంటున్నారు. ఆ తర్వాత ఏంటీ సమస్య అని అడిగి మందులు, మాత్రలు రాయిస్తున్నారు. ఈ చీటీని మందులు, మాత్రలు ఇచ్చే సిబ్బంది దగ్గరికి తీసుకెళ్తే ఇవీ లేవని బయటే తీసుకోవాలని చెప్పి పంపించేస్తున్నారు. డబ్బులు లేక వచ్చే వారు బయట మాత్రలు తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల, నొప్పులు, కండరాలు, శ్వాస సంబంధిత మాత్రలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.వారంలో కేసుల వివరాలు కేసు రకం; పరీక్ష చేసినవారి సంఖ్య; నమోదైన కేసులుజ్వరం; 0; 0టైపాయిడ్; 384; 30మలేరియా; 2540; 1డెంగీ; 423; 8పీహెచ్సీ ఓపీల సంఖ్యనెల; ఓపీ సంఖ్యఏప్రిల్; 1,95,587మే; 2,19,915జూన్; 2,20,556జూలై; 1,96,665ఆగష్టు; 1,92,513మాత్రలు బయట కొనమంటున్నారు..మోకాళ్ల నొప్పుల సమస్యలతో కొన్నేళ్లుగా బాధపడుతున్నా.. మందుల కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి పోతే స్టాక్ లేదంటున్నారు. మాత్రలు బయటకొనమని చీటీలు రాస్తున్నారు. రూ.వందల్లో ఖర్చు అవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకునే స్తోమత లేకనే ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ కూడా మందులు బయటకు రాస్తున్నారు. మాలాంటి వాళ్లు ఏం చేయాలి. – శ్రీనివాసులు, ఐరాలసెంట్రల్ డ్రగ్స్కు నివేదిక పంపాంమందుల కొరత ఉందని మా దృష్టికి వచ్చింది. వెంటనే సెంట్రల్ డ్రగ్స్కు నివేదిక పంపాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులకు సూచించారు. వారిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించాం. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తాం. – సుధారాణి, డీఎంహెచ్ఓ, చిత్తూరుకొన్ని రోజులుగా ఇలానే ఉంది..విష జ్వరాలు వస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కొరత ఉంది. ఏ రోగానికి వెళ్లినా మందులు లేవని ఉన్నవాటితో సర్దుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఇలానే ఉంది. జ్వరానికి మందులు, మాత్రలు లేవంటే మాలాంటి వాళ్లు ఇబ్బందులు పడక తప్పదు. ప్రభుత్వం స్పందించి మందులు, మాత్రలు ఇవ్వాలి. –ధనపాల్, ఆముదాల, పాలసముద్రం మండలంపడిపోతున్న ఓపీనిర్వహణలోపం, డాక్టర్ల అలసత్వం కారణంగా పీహెచ్సీలో ఓపీల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. పీహెచ్సీల్లో డాక్టర్లు సమయానికి రావడంలేదనే విషయం లోతుగా పాతుకుపోయింది. వచ్చిన తళుక్కుమని మాయమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యాహ్నం వరకు ఉండి..ఆపై మీటింగ్, ఇతర కారణాలు చెప్పి విధులకు డుమ్మా కొట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో పల్లె వైద్యం పడకేసింది. సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నా వైద్యులు కానరావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మందులు, మాత్రలు దొరక్కపోవడంతో ఓపీ సంఖ్య ఇంకాస్త తగ్గుముఖం పట్టింది.ఇవీలేవు...పీహెచ్సీల్లో చాలా వరకు మాత్రల కొరత అధికంగా ఉన్నాయి. పారాసెటమాల్ 500 ఎంజీ, 650 ఎంజీ(జ్వరం, తలనొప్పి), డైక్లోఫెనాక్(కీళ్లు సంబంధిత వ్యాధులకు), రాంటాక్ (కడుపునకు సంబంధించినవి), పాంటాప్ (గ్యాస్ట్రిక్), యాంటీబయాటిక్లతో పాటు మరో 10 రకాల మాత్రలు లేవు. అలాగే పారా సెటమాల్, అంబ్రోక్స్ (గొంతు, తదితర సమస్యలకు), సీపీఎం(అలర్జీ) సిరఫ్లు ఖాళీ అయ్యాయి. దీంతో పాటు పారాసెటమాల్ ఇంజెక్షన్, రాంటాక్, వోవెరాన్(కండరాలు, కీళ్లు), గాంటామిసిన్(యాంటీబయాటిక్), అమికాసిన్(చర్మం, ఊపిరితిత్తులు, తదితర వ్యాధులకు) అనే ఇంజెక్షన్లు కరువయ్యాయి. నెలల తరబడి ఇవీ సరఫరా కాకపోవడంతో పల్లె జనానికి ప్రాథమిక ఆరోగ్యం దూరమైంది.ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుపీహెచ్సీలు గాడితప్పడం, మందులు, మాత్రలు దొరక్కపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పల్లె ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుగా మారుతున్నాయి. మండల కేంద్రం, పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. లేకుంటే ఆర్ఎంపీల వద్ద చూపించుకుంటున్నారు. ఇందుకు రవాణా ఛార్జీలు, ఆస్పత్రి ఫీజులతో జేబులు ఖాళీఅవుతున్నాయి. జ్వరానికి ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.600 నుంచి రూ.2 వేల వరకు ఖర్చువుతోంది. డెంగీ, టైపాయిడ్ జ్వరమంటే రూ. 5 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చువుతోంది. ల్యాబ్ టెస్టులు అదనంగా మారింది. -
క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి లేజర్ రన్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ సాధించిన చిత్తూరు క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆ క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. బీహార్ రాష్ట్రం బెంగుసారాలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 9వ జాతీయ స్థాయి లేజర్ రన్ పోటీల్లో చిత్తూరు విద్యార్థులు ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో అర్హత పొంది అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థి సాయి భార్గవ్ను అభినందించారు. ఈ విద్యార్థి దేశం తరపున సౌత్ ఆఫ్రికాలో డిసెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్, మెడల్స్ అందజేసి అభినందించారు. -
మదమెక్కిన భీ'కరి'!
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. మదపుటేనుగుల మేటింగ్ సీజన్ మొదలు కావడంతో జనానికి ముప్పు తప్పేలాలేదు. అక్టోబర్ నుంచి జనవరి వరకు మదమెక్కిన గజరాజులకు పట్టపగ్గాలే ఉండవు. అలవి కాని ఆగ్రహంతో రెచ్చిపోయే భీ‘కరి’ నుంచి తోటి జంతువులతోపాటు మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. మేటింగ్ సీజన్ ముగిసే వరకు అటవీ సమీప ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎలిఫెంట్ శాంచురీని దాటి బయటకొచ్చే మదపుటేనుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పలమనేరు : రాష్ట్రంలోని కుప్పం, చిత్తూరు, పలమనేరు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులతోపాటు అటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, కృష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హోసూర్, బన్నేర్గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే ఏనుగులున్నాయి. స్థానికంగా ఉన్న గుంపుల్లో మొత్తం 12 మగ ఏనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు (మదపుటేనుగులు) మాత్రం ఉన్నాయి. గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా సంచరిస్తున్నాయి. ఒక్కో మదపుటేనుగు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. జనం కనిపిస్తే దాడులు చేస్తుంటాయి. వీటి చేష్టలు, గుర్తులను బట్టి స్థానికంగా వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో రౌడీ ఏనుగు, రాముడు, భీముడు, ఒంటి దంతం ఏనుగు, ఒంటికన్ను ఏనుగు ఇలా వీటికి పేర్లు పెట్టారు. ఇవి తమ ఉనికి కోసం రౌడీల్లా ప్రవర్తిస్తుంటాయి. మిగిలిన ఆడ ఏనుగులు, గున్నలకు భయమెక్కువ, దీంతో ఇవి గుంపులోనే ఉంటూ జనాన్ని చూసి వెనక్కు వెళుతుంటాయి. కానీమదపుటేనుగులు ఏమాత్రం భయపడవు, ఎదురు దాడులకు దిగుతుంటాయి. ప్రస్తుతం ఆరు మాత్రమే.. కౌండిన్యలోని 12 మదపుటేనుగుల్లో ప్రస్తుతం ఆరు మాత్రమే ఉన్నాయి. బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లెలో రౌడీ ఏనుగుగా చెప్పుకునే మదపుటేనుగు కరెంటు తీగలకు బలైంది. గంగవరం మండలం మన్నారునాయనిపల్లె సమీపంలో పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటుకు మరో మదపుటేనుగు బలైంది. అంతకుముందు కాలువపల్లె, మొసలి మడుగు వద్ద రాముడు, భీముడు అనే రెండు మదపుటేనుగులు చనిపోయాయి. మూడేళ్ల క్రితం పలమనేరు మండలంలోని బేరుపల్లె, గాంధీనగర్ల వద్ద రెండు మదపుటేనుగులు కరెంట్ షాక్తో కన్నుమూశాయి. ఇవి బతికున్నప్పుడు మనుషులు, పశువులు, కుక్కలను తరమి తరిమి చంపేవి. ఇప్పుడున్న ఆరు మదపుటేనుగుల్లో గుడ్డి కన్ను ఏనుగు గత మేటింగ్ సీజన్లో యాదమరి మండలం దిగువకనతల చెరవువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ ను చంపిన విషయం తెలిసిందే. మొసలిమడుగు రౌడీగా పిలవబడే మరో ఏనుగు కౌండిన్యలోని వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్ను తొండంతో విసిరేసింది. ఊసరపెంట మదపుటేనుగు తరచూ ఆ గ్రామంలోకి వచ్చి రాత్రంతా ఉండి వెళ్లడం దీని ప్రత్యేకత. మిగిలిన రెండు మదపుటేనుగులు వేర్వేరుగా కౌండిన్యలో సంబంధిత ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఈ నాలుగు నెలలు ప్రమాదమే.. ముఖ్యంగా మదపుటేనుగులు అక్టోబరు నుంచి జనవరి వరకు ఆడ ఏనుగుల సాంగత్యం కోసం మత్తులో ఉంటాయి (మేటింగ్ సీజన్). దీంతో తిక్కతిక్కగా ప్రవర్తించడం, మనుషులను చూస్తే ఆగ్రహంతో ఊగిపోతుంటాయి. తన పరిధితోపాటు అడవిలో ఆడ ఏనుగుల కోసం చాలాదూరం అన్వేషిస్తుంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో మనషులు, జంతువులపై దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆడ ఏనుగులు వీటి మాట వినకపోవడం లేదా అక్కడ జరిగే రభసతో ఇప్పటిదాకా ఆరు ఆడ ఏనుగులు మృతిచెందాయి. ఏదేమైనా ఈ నాలుగునెలలు మదపుటేనుగుల కారణంగా ప్రమాదాలు పొంచిఉన్నాయి. కాబట్టి అడవుల్లోకి ఎవరూ వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ... మదపుటేనుగులపై జనం రాళ్లు విసరడం, టపాకాయలను పేల్చడం, టైర్లు కాల్చి వాటి పైకి విసరడం లాంటి చర్యలతో మగ ఏనుగులు జనంపై కసి పెంచుకున్నాయి. ఆడ ఏనుగులుకున్నంత సహనం వీటికి ఉండదు. ఇప్పటిదాకా పరిశీలిస్తే యాదమరి మండలం దిగువకనతల చెరువువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ ను, వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్ను తొండంతో విసరడం, పందేరుపల్లి వద్ద రైతును, కాలువపల్లి వద్ద యువకుడిని తొండంతో కొట్టి చంపడం చేసింది మదపుటేనుగులే. పెద్దపంజాణిమండలం పెనుగొలకలకు చెందిన బంగారప్పను, కాలువపల్లి వద్ద రైతు సుబ్రమణ్యను చంపింది మదపుటేనుగులే. కుప్పంలోనూ దాడులు చేసింది ఇవే. పదిరోజుల క్రితం పెద్దపంజాణి మండలంలో రైతును తొక్కి చంపిందే మదపుటేనుగే. గుడిపాల మండలంలో దంపతులను చంపిందే మదపుటేనుగే. మదపుటేనుగులకు కోపం ఎక్కువ గుంపులనుంచి వేరుగా ఉంటూ ఒంటరిగా సంచరించే మదపుటేనుగులు చాలా కోపంగా ఉంటాయి. వీటి బారినుంచి తప్పించుకోవాలంటే ఏనుగు తరిమినప్పుడు మనిషి నేరుగా కా కుండా ఎస్ ఆకారంలో వెళ్లాలి. ఒంటిపై ఉన్న బ ట్టలను తీసి ఏనుగు ముందు వేస్తే అది కాసేపు దాన్ని వాసన చూస్తు తొక్కుతుండగా ఆ గ్యాప్లో తప్పించునే అవకాశముంటుంది. మేటింగ్ సీజన్లో మరింత ఆగ్రహంగా ఉంటాయి. కాబట్టి అ టవీ సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. – భరణి, డీఎఫ్ఆర్ఓ, చిత్తూరు కౌండిన్య పరిధిలోనిమొత్తం ఏనుగులు : సుమారు 100 ఇప్పటి వరకు గజ దాడుల్లో మృతుల సంఖ్య : 15 గాయపడినవారు : 36 ఇప్పటిదాకా మృతి చెందినఏనుగుల సంఖ్య : 19 -
డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేస్తాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రైవే ట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం అసో సియేషన్ ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామన్నారు. అయితే ఎటువంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర సంవత్సరంగా కరస్పాండెంట్లు అప్పులు చేసి కళాశాలలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్కాలర్షిప్ల కోసం ప్రతి నెలా ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 2023–24, 2024–25 విద్యాసంవత్సరాల పెండింగ్ ఆర్టీఎఫ్ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. డిగ్రీ కోర్సు ఫీజులను సవరించి కొత్త ఫీజు విధానం ఆయా యూనివర్సిటీలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. -
అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్’అయిపోతారు!
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు నియోజకవర్గం గ్రూపుల సంఖ్య చిత్తూరు 500 గంగాధరనెల్లూరు 1,881 కుప్పం 2,171 నగరి 1,404 పలమనేరు 2,475 పుంగనూరు 1,791 పూతలపట్టు 2,316 మొత్తం 11,538చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పొదుపు సంఘాల్లో నిత్యం ఏదో ఒక చోట అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పొదుపు సంఘాలు అక్రమాలకు పాల్పడి నగదు కొట్టేస్తున్న ఘటనలు తలెత్తుతున్నాయి. ఇలా అక్రమాలకు పాల్పడే పొదుపు సంఘాలపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అటువంటి పొదుపు సంఘాల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, స్వయం సహాయక సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. మొబైల్ బుక్ కీపింగ్ యాప్ (మన డబ్బులు–మన లెక్కలు) పేరుతో యాప్ను రూపొందించారు. ఈ యాప్ను డీఆర్డీఏ శాఖ జిల్లాలోని పొదుపు సంఘాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి నుంచి పుస్తకాల్లోనే వివరాలు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపులో చేరినప్పటి నుంచి పుస్తకాల్లోనే వివరాలను నమోదు చేస్తున్నారు. ఇకపై అలాంటి పద్ధతికి అవకాశం లేకుండా యాప్లో నగదు లావాదేవీలన్నీ నమోదు చేసేలా అవకాశం కల్పించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్లో సభ్యులు పొదుపులో చేరినప్పటి నుంచి పుస్తకాల్లో నమోదు చేసిన సమగ్ర వివరాలను నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ప్రయోజనాలు ఇలా..! పొదుపు సంఘాలకు ప్రత్యేక యాప్ చిత్రం, పొదుపు సంఘాల గ్రూపు నిర్వహణ అభ్యంతరాలకు అవకాశం ఈ ఏడాది మార్చి 31 వరకు సంఘాలు, వాటిలోని సభ్యుల పొ దుపు, బ్యాంకుల నుంచి పొంది న రుణాలు, సీ్త్రనిధి, ఉన్నతి వివరాలన్నీ యాప్లోనే నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు సైతం యాప్లో కనిపిస్తాయి. ఇందులో ఏవైనా అ భ్యంతరాలుంటే యాప్లోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. – శ్రీదేవి, డీఆర్డీఏ పీడీ, చిత్తూరు జిల్లా -
రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలు సీజ్
పుంగనూరు: టపాకాయల నిల్వలపై చిత్తూరు ఎస్బీ అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి, సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టపాకాయల వ్యాపారి డీష్బాబు, శ్రీధర్గుప్తా, రాఘవేంద్ర సప్లయర్స్ వారు అనుమతులు లేకుండా సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను నిల్వ చేసి ఉండడంపై ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. సీఐ సుబ్బరాయుడు, పోలీసులతో కలసి దాడులు చేసి, టపాకాయలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. చిత్తూరులో బాణసంచా సీజ్ – ఇద్దరి అరెస్ట్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అనుమతుల్లేకుండా తరలుతున్న బాణసంచా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. మంగళవారం సాయంత్రం చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారిపై టూటౌన్ సీఐ నెట్టింకటయ్య ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ మినీ లారీని తనిఖీ చేయగా.. తమిళనాడులోని శివకాశి నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు 70 బాక్సుల్లో బాణసంచా తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు. బాణసంచాతో పాటు వీటిని తరలిస్తున్న మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఎం.రవికుమార్, యాదమరికి చెందిన మణిగండన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో సిబ్బంది సుధీర్, బాబురెడ్డి, బాబు, రాజేష్, సుబ్రమణ్యం, బాషా, నాగరాజు ఉన్నారు. -
11 నుంచి డైట్లో కళా ఉత్సవ పోటీలు
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో 11, 12 తేదీల్లో భారతీయ సంస్కృతి, సంప్రయాల వారసత్వ కళలపై (కళాఉత్సవ్) పోటీలు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ బీ.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం డైట్ కళాశాల ఆవరణలో ఉళాఉత్సవ్ పోటీల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ నెల 11, 12 తేదీలలో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు సంస్కృతి కళలపై కళాఉత్సవ్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. అనంతరం కళాఉత్సవ్ ఇన్చార్జి ఎస్.రంజిత్కుమార్ మాట్లాడతూ 11న గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం నృత్యం విభాగాలలో పోటీలు ఉంటాయని తెలిపారు. 12న థియేటర్స్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ సంప్రదాయ కథకథనం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు 10వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా 8801718082 నంబర్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డీకే దామోదర్రావు, మోహన్రెడ్డి, నాగరాజునాయక్, సూపరింటెండెంట్ కృపావతి పాల్గొన్నారు. -
పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి
పూతలపట్టు(యాదమరి): పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పూతలపట్టు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నాగరాజు ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి(2.0)పై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన వనరులను అన్వేషించాలన్నారు. పొడి, తడి చెత్తను వేరు చేసి అందులో నుంచి వర్మీకంపోస్టును తయారు చేసి, వాటిని రైతులకు విక్రయించాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈఓపీఆర్డీ శ్రీనివాసులు -
ఆరోపణల వెనుక కుట్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మా అధికారిగా పనిచేసిన రమణ పోద్బలంతో మహిళా సంఘాల సభ్యుల పేరిట భువనేశ్వరి, ఉషారాణి అనే ఇద్దరు మహిళలు తనపై నిరాధార ఆరోపణలు చేశారని చిత్తూరు నగర పాలక సంస్థ రిసోర్స్ పర్సన్ బేబీ శ్వేత ఆరోపించారు. చిత్తూరు ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను 38 గ్రూపులకు ఆర్పీగా పనిచేశానని, తమ గ్రూపులోని సభ్యులు ఎవరూ ఆరోపణ చేయలేదన్నారు. సభ్యులు కాని వారు ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెప్మా అధికారి రమణ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు కక్ష సాధింపుగా ఇలా లేనిపోని ఆరోపణలను చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. తన భర్తకు ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనతో తమ పిల్లలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ‘నిరసన వారం’ చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై ఏపీటీఎఫ్ ‘నిరసన వారం’ కార్యక్రమాన్ని చేపడుతోందని ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ విధానాల్లో నిరసనలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. -
గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు
చౌడేపల్లె: మండలంలోని పెద్ద యల్లకుంట్ల పంచాయతీ పరిధిలో గ్రామంలోని మహిళను ఆశా కార్యకర్తగా నియమించడంపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులందరూ కలిసి మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యురాలు మోనాను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఆశ కార్యకర్తగా ఉన్న లక్ష్మీదేవి మృతిచెందడంతో ఆ పోస్టుకు ఆరుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అయితే నిబంధనలు పాటించకుండా పక్క పంచాయతీలో నివాసమున్న మహిళకు పోస్టు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్లో 11 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అంతర్జాతీయ క్రీడల్లో విద్యార్థులు రాణించాలి కుప్పం: ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. అంతర్జాతీయ క్రీడలకు మంగళవారం ఎంపికై న విద్యార్థులను అభినందించారు. నేపాల్లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. పీఈఎస్ విద్యార్థికి బహుమతి గుడుపల్లె: మండలంలోని పీఈఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి జాహ్నవికి విశిష్ట బహుమతి లభించింది. హెల్త్ యూనివర్సిటీ 2023లో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. ఇందుకు గాను ప్రతిష్టాత్మక కవూరి హైమావతి, కవూరి చలపతిరావు బహు మతి జాహ్నవికి లభించింది. విజయవాడలో మంగళవారం నిర్వహించిన హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవంలో విద్యార్థి సాయిజాహ్నవికి బహుమతి ప్రదానం చేశారు. టెట్పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి అని ఆదేశించిన సుప్రీం తీర్పుపై కూటమి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో సీనియర్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు మరింత క్లిష్టమవుతాయన్నారు. 20 ఏళ్లకు పైగా పనిచేసిన టీచర్లు ఇప్పుడు టెట్ అర్హత సాధించడం అన్యాయమని, కష్టతరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన దసరా సెలవుల్లో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలి చిత్తూరు కార్పొరేషన్: కూటమి నాయకుల అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దోపిడీకి అడ్డులేకుండా పోతోందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆరోపించారు. పలువురు తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్రమంగా క్వారీల నిర్వహణ, గ్రావెల్, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని చెప్పారు. వీటిపై పత్రికలు, మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. -
ఏ.కొత్తకోటలోనే రైతుసేవా కేంద్రం కొనసాగించాలి
చౌడేపల్లె: మండలంలోని ఏ.కొత్తకోట గ్రామంలోనే రైతుసేవా కేంద్రాన్ని కొనసాగించాలని రైతులు ఏవో మోహన్కుమార్ను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో రైతుల శ్రేయస్సు కోసం తమ గ్రామంలోనే రైతుభరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ఇటీవల దుర్గసముద్రం రైతుసేవా కేంద్రానికి ఏ.కొత్తకోటను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ చేయడం తగదన్నారు. రెండు రోజుల క్రితం ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న దుర్గసముద్రం రైతు సేవా కేంద్రానికి వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. రైతులు విజయ్కుమార్రెడ్డి, షఫీ, మునిరాజ, మల్లికార్జున పాల్గొన్నారు. సకాలంలో వైద్యం అందించాలి పుంగనూరు: ఏరియా ఆస్పత్రిలో గ్రామీణ ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్యులు, నర్సుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ హరగోపాల్, డాక్టర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఫొటో, వీడియోగ్రఫీలపై ఉచిత శిక్షణ చంద్రగిరి : యూనియన్ బ్యాంక్ , గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి 31 రోజుల పాటు పురుషులు, మహిళలకు ఫొటో, వీడియోగ్రఫీపై ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్ , రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్టు సైజు ఫొటోలతో సంస్థకు వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 79896 80587, 94949 51289 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఆంక్షలు.. అడుగడుగునా ఆటంకాలు
కుప్పం: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చాలని వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు కుప్పంలో నిర్వహించిన అన్నదాత పోరుకు పోలీసులు ఆంక్షలతోపాటు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలో ర్యాలీలకు అనుమతులు లేవని, ఆర్టీఓకు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతిస్తున్నట్టు కుప్పం డీఎస్పీ పార్థసారథి సోమవారమే తేల్చారు. భారీగా పోలీసుల మోహరింపు అన్నదాత పోరు కార్యక్రమాన్ని అడ్డుకునేందకు ఎమ్మెల్సీ, కుప్పం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మెహరించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పోలీసులు ప్యాలెస్ రోడ్డు, క్యాంపు కార్యాయలం వద్ద మోహరించారు. వైఎస్సార్ సీపీ కేడర్ను రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ క్యాంపు ఆఫీసు వద్ద కుప్పం అర్బన్ సీఐ, ఇద్దురు ఎస్ఐలు, పోలీసు యంత్రాంగం తిష్టవేసింది. దారి పోడువునా అడ్డగింత కుప్పం నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులను దారి పోడవునా పోలీసులు అడ్డగించారు. అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ అర్బన్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ హఫీజ్, మోహన్ రామ్ను శెట్టిపల్లి వద్ద నిలిపి వేశారు. అదేవిధంగా గుడుపల్లె మండలం, కుప్పిగానిపల్లి సర్పంచ్ రామూర్తిని వంద పడకల అస్పత్రి సర్కిల్ వద్ద నిలిపివేశారు. -
ఆ సంస్థకే యూరియా కేటాయించాలి
చౌడేపల్లె: రైతు ఉత్పత్తిదారుల సంస్థకే యూరియా కేటాయించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రైతు ఉత్పత్తిదారుల సంఘ మండల అధ్యక్షుడు వెంకటరమణ కోరారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో రైతులు, డైరెక్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఉత్పత్తిదారుల సంఘం పరిధిలో 2,315 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, వరి, గడ్డి సేద్యం సాగుకోసం ప్రతి రైతుకూ యూరియా అవసరమని చెప్పారు. ప్రభుత్వం రైతుసేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న యూరియాలో కొంతమేరకు మాత్రమే సరిపోతోందని, ఇంకనూ యూరియా అవసరం ఉందని సమావేశంలో తీర్మానించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా యూరియా కొనుగోలుకు ముందస్తుగానే సొమ్ము చెల్లిస్తామని, ఉన్నతాధికారులు స్పందించి యూరియా మంజూరుచేస్తే రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో డైరక్టర్లు కృపాకర్రెడ్డి, కృష్ణప్ప పాల్గొన్నారు. -
బాబొస్తే కన్నీరే
పలమనేరు ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పీచైర్మన్, మాజీ ఎమ్మెల్యేపలమనేరులో ర్యాలీగా వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడసాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అన్నదాతలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. సరైన విత్తనాలు.. చాలినంత ఎరువులు అందక అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా యూరియా కొరత మెడకు చుట్టుకోవడంతో గిజగిజా కొట్టుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎర్రటి ఎండనూ లెక్కచేయక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా కూటమి నేతలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై అన్నదాతలు రగిలిపోతున్నారు. వీరికి అండగా వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’కు పిలుపునిచ్చింది. మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పలమనేరు, కుప్పం, చిత్తూరు, నగరి ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. వేరుశనగ, వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, పంటలకు ఉచిత బీమా అమలు చేయాలని సూచించారు. కుప్పంలో ఆంక్షల జోరు ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రైతు సమస్యలను పరిష్కరించాలని అధికారికి వినతి పత్రం సమర్పించారు. పార్టీ శ్రేణులు, రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. 30 యాక్ట్ అమలులో ఉందని, ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని సోమవారం రాత్రే ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు. కేవలం ఐదుగురు.. లేదా ఆరుగురితో ఆర్డీఓ కార్యాలయాలకి చేరుకుని వినతి పత్రం సమర్పించాలని హుకుం జారీచేశారు. ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. చిత్తూరులో అడ్డగింపులు చిత్తూరులో ర్యాలీలు, నిరసన చేపట్టకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టేందుకు పూనుకున్నారు. మాజీ మంత్రి నారాయణస్వామి, చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, డాక్టర్ సునీల్కుమార్, కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి పాల్గొని అన్నదాతలకు మద్దతుగా నిలిచారు. అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా గంగినేని చెరువు నుంచి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. నిరసనలతో గర్జించిన నగరి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యర్తలు, రైతులు కలిసి ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు, అన్నదాతలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. హోరెత్తిన పలమనేరు పలమనేరులో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సిల్క్ ఫాం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలతో పలమనేరు పట్టణం హోరెత్తింది. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. సమస్యలపై కదంతొక్కిన రైతన్నలు జిల్లాలో అన్నదాతలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. ఏడాదిన్నరగా ఎదర్కొంటున్న సమస్యలపై నిరసనలు మిన్నంటించారు. వరి, వేరుశనగ, మామిడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి నేతలు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చిన ఎరువులను కొందరు నేతలు బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కక్ష సాధింపు మానుకో.. గిట్టుబాటు ధరలిచ్చుకో..!,’ ‘నాటకాలు ఆపు..ఎరువులివ్వు బాబూ’! అంటూ నినాదాలు మిన్నటించారు. అనంతరం ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గడిచిన నాలుగు దఫాలు ఎప్పుడైనా రైతులు సంతోషంగా ఉన్నారా..?. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వారికి కన్నీళ్లే. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండదు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఊసేలేదు. కనీసం యూరియా దిక్కులేని పాలన కేవలం చంద్రబాబుకే దక్కింది. యూరియా బ్లాక్మార్కెట్కు తరలించిన ఘనత కూటమి సర్కార్కే చెల్లుతుంది. యూరియా ఎక్కువ వాడితే భూసారం దెబ్బతింటుందని చంద్రబాబు ఉచిత సలహాలు ఎవరికోసం గుప్పిస్తున్నాడో రైతులు గుర్తించాలి. కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలేక పలువురు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురైంది. ఈ ప్రాంతంలో టమాటాకు రేట్లు లేక రోడ్డుపాలు చేసిన ఘటనలు చూశాం గానీ ఎప్పుడైనా మామిడిని రోడ్డుపై పడేశారా..?. గత ప్రభుత్వంలో కోవిడ్లాంటి కష్ట సమయంలోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కింది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే -
పలుకుబడి ఉన్నోళ్లకే యూరియా
యాదమరి: ‘మీరిచ్చే ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్నాం. కానీ మీరేమో గుట్టుచప్పుడు కాకుండా రాజకీయంగా పలుకుబడి ఉన్నోళ్లకే బినామీ టోకెన్లు జారీచేసి ఇచ్చేస్తున్నారు. అడిగితే స్టాకు లేదని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం’ అని పలువురు రైతులు రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ ఘటన మంగళవారం మోర్దానపల్లి రైతు సేవా కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మండల పరిధిలోని మోర్దానపల్లి రైతు సేవా కేంద్రానికి 300 బస్తాల యూరియా వచ్చింది. దీని కోసం రైతులు ఉదయం 7 నుంచే క్యూలో వేచి ఉన్నారు. అయితే ఎప్పటిలాగే ఆర్ఎస్కే సిబ్బంది 11 గంటలకు వచ్చారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న అన్నదాతలు సిబ్బంది ధోరణిపై అసహనానికి గురయ్యారు. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకి దొడ్డిదారిన యూరియా అందించడంతో, ఇది గమనించిన రైతులు ఓ మహిళా సిబ్బందిని ప్రశ్నించారు. ఒకానొక దశలో ఆ మహిళా ఉద్యోగితో తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. మండలంలో రెండు నెలల కిందట వేరుశనగ విత్తనాల పంపిణీ సమయంలో కూడా ఆ మహిళా ఉద్యోగి రైతులపై దురుసుగా ప్రవర్తించినట్టు అక్కడి రైతులు పేర్కొన్నారు. కాగా వచ్చిన 300 బస్తాల యూరియాలో మోర్దానపల్లి, యాదమరి, కీనాటంపల్లి, వరదరాజులుపల్లి, 14కండ్రిగ, కోనాపల్లి పచాయతీల నుంచి 222 మంది అన్నదాతలకు ఒక్కో బస్తా చొప్పున అందించారు. మిగిలిన 78 బస్తాలను బుధవారం మాధవరం, జంగాలపల్లి పంచాయతీలోని రైతులకు పంపిణీ చేయనున్నట్లు ఏఓ దీప చెప్పారు. -
నేడు రెడ్ రన్ మారథాన్
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ.. బుధవారం చిత్తూరులో రెడ్ రన్ మారథాన్ను నిర్వహించనున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 6 గంటలకు మెసానికల్ మైదానం నుంచి ఈ రన్ ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు అర్హులని, రన్లో ప్రతిభ కనబరచిన వారికి నగదు బహుమతి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మెసానికల్ మైదానం వద్దకు చేరుకుని పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పంటలు ధ్వంసం పులిచెర్ల(కల్లూరు): మండలంలోని చల్లావారిపల్లె, పాతపేట పంచాయతీల్లో మంగళవారం తెల్ల వారు జామున ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి ధ్వంసం చేసింది. పది రోజులుగా వరస బెట్టి ఒకే ప్రాంతంలో ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. చల్లావారిపల్లెలో మొక్కజొన్న పంటను తిని తొక్కి నాశనం చేశాయి. అలాగే పనస, మామిడి, అరటి, వేరుశనగ పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల బారినుంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. యూరియా పంపిణీ పరిశీలన పెద్దపంజాణి: మండలంలోని పెద్దపంజాణి, కొళత్తూరు, వీరప్పల్లి రైతు సేవా కేంద్రాలలో యూరియా పంపిణీని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ–కేవైసీ, బయోమెట్రిక్తో డీబీటీ పద్ధతిలో పారదర్శకంగా రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు మరొక బస్తా పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. అవసరమైన చోట 20 రోజుల తర్వాత మరో విడత యూరియా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఏడీఏ శివకుమార్, ఎంపీడీఓ బాలాజీ, ఏఓ హేమలత, సచివాలయ సిబ్బంది ఉన్నారు. యూరియా కొరత లేదు పుంగనూరు: ప్రస్తుతం ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులందరికీ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలోని యూరియా గోడౌనును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. లక్ష్యాన్ని మించి యూరియాను సరఫరా చేస్తున్నామని, వ్యవసాయాధికారుల సూచనల మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. కలెక్టర్ వెంట జేడీ మురళీకృష్ణ, ఏడీ శివకుమార్ ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం జరగాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి ఆదేశించారు. చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో మంగళవారం జననీ సురక్ష యోజన పథకంపై వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. హైరిస్క్ కేసులకు అందించే వైద్య సేఓవల విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. ప్రతి కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికీ జననీ సురక్ష కింద అర్బన్ ప్రాంతాల వారికి రూ.800, రూరల్కు రూ.1000 చొప్పున్న డీబీటీ ద్వారా ఇవ్వాలన్నారు. అలాగే ఎన్హెచ్ఎం ఫండ్స్పై చర్చించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, వైద్యులు రోజారాణి, రామ్మోహన్, వైద్యులు పాల్గొన్నారు. డీఎఫ్ఓ భరణి బదిలీ చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్ఎస్ల బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా డీఎఫ్ఓ భరణి బదిలీ అయ్యా రు. ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భరణిని శాప్ ఎండీగా బదిలీ చేయగా.. ఆమె స్థానంలో జిల్లాకు 2022 బ్యాచ్కు చెందిన కోడూరు సబ్డీఎఫ్ఓగా ఉన్న సుబ్బురాజును నియమించారు. -
సూర్యప్రభపై అభయం
కాణిపాకం: ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి మంగళవారం సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చారు. ఉదయం స్వామికి ప్రత్యేక అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఉత్సవ మూర్తునలు ప్రత్యేకంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం స్వామిని మంగళవాయిద్యాల నడుమ మూడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు చంద్రప్రభ వాహన సేవ కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ మూర్తులు బుధవారం చంద్ర ప్రభ వాహనంపై ఊరేగుతూ కటాక్షించనున్నారు. ఉదయం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందని ఆలయ ఈవో పెంచలకిషోర్ తెలిపారు. అలరించిన నాట్యం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. నాటక, గీతాలపానలు, కూచిపూడి, భరతనాట్యం కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ధార్మికోపనాస్యం, హరికథ ఆకట్టుకుంది. సూర్యప్రభ వాహనంపై స్వామివారు అలరించిన కళాకారిణి -
వరిపంట కొనుగోలే లేదు
పుంగనూరు : పుంగనూరులో వరిపంట కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖరీఫ్ పంట పండించిన రైతులు వరి ధాన్యాన్ని తమకు నచ్చిన రీతిలో క్వింటా రూ.2,200 లతో విక్రయాలు చేసుకున్నారు. కాగా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల , సదుం, రొంపిచెర్లం, పులిచెర్ల మండలాలతో పాటు పంజాణి, గంగవరం మండలాల్లో సుమారు 5,200 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం రబీ సాగు 2.50 హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. ఈ సారైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. -
‘ఎద్దల బండ’పై గద్దలు!
కూటమి ప్రభుత్వంలో పచ్చమూక రెచ్చిపోతోంది. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడుతోంది. అందులో భాగంగానే బందార్లపల్లె సమీపంలోని ఎద్దల బండపై కన్నేసింది. కొండను పగులగొట్టి కాసులు పోగేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారుల అండతో క్వారీ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే స్థానికుల అడ్డుతొలగించుకునేందుకు దాడులకు పాల్పడుతోంది. పోలీసులను సైతం ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తోంది. వెదురుకుప్పం : మండలంలోని కొమనగుంట పంచాయతీ బందార్లపల్లె గ్రామానికి సమీపంలో ఎద్దలబండ ఉంది. సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలోని ఈ కొండపై క్వారీ నడిపేందుకు టీడీపీ నేతలు యుగంధర్నాయుడు, తదితరులు సన్నాహాలు సాగిస్తున్నాడు. అధికారులను మామూళ్ల మత్తులో జోకొట్టి అనుమతులు సైతం తీసేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో క్వారీ ప్రారంభమైతే సమీపంలోని తమ పంట పొలాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం ఎద్దల బండపై క్వారీ నడిపితే పేలుళ్ల కారణంగా వచ్చే దుమ్ముధూళితో వాతావరణ కలుషితమవుతుందని బందార్లపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో దుమ్ము పేరుకుపోయి పంటలు పండే ఆస్కారం ఉండదని వాపోతున్నారు. వాయుకాలుష్యం కారణంగా దీర్ఘకాలిక రోగాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే క్వారీ పేలుళ్లతో గ్రామంపై రాళ్లు పడి స్థానికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే దుస్థితి దాపురిస్తుందని మండిపడుతున్నారు. పేలుళ్ల శబ్దాలకు ఇళ్లు సైతం బీటలువారే ప్రమాదముందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలితో ప్రశాంతంగా తమ గ్రామం ఉంటుందని, క్వారీ కారణంగా పూర్తిగా నాశనమవుతుందని వాపోతున్నారు. పట్టించుకోని అధికారులు సుమారు రెండు నెలలుగా క్వారీ విషయం గందరగోళంగా మారినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాంబూలం ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. క్వారీకి అనుమతులు మంజూరు చేసి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా సదరు క్వారీ యజమాని సుమారు 20 మంది రౌడీలను తీసుకువచ్చి తమపై దాడి చేయించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పోలీసులు కూడా అక్రమార్కులకే వంతపాడుతున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రశాంతమైన తమ ఊరును కాపాడాలని విన్నవిస్తున్నారు.అడ్డు పడితే అంతే.. బందార్లపల్లె వాసుల సమస్యలను గుర్తించకుండా కేవలం ధన దాహంతో క్వారీ యజమాని పనులు చేపడుతున్నాడు. క్వారీ కారణంగా తలెత్తే అనర్థాలను పక్కన పెట్టి ఎలాగైనా బండను కొల్లగొట్టేందుకే అభ్యంతరాలను ఖాతరు చేయడం లేదు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూండాలను సైతం రంగంలోకి దింపి దాడులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం.. మా ఎమ్మెల్యే.. ఇక్కడ అధికారం మాది అంటూ ముప్పతిప్పలు పెడుతున్నాడని ఆవేదన చెందుతున్నారు. బీడు పెట్టుకోవాల్సిందే.. ఎద్దలబండపై క్వారీ నిర్వహిస్తే సమీపంలోని 20 ఎకరాలను బీడు పెట్టుకోవాల్సిందే. భూములు సాగుకు పనికిరాకుండా పోతాయి. క్వారీ వద్దని అభ్యంతరం చెబితే మహిళలని కూడా చూడడం లేదు. విచక్షణా రహితంగా దాడి చేస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. – ధనలక్ష్మి, బందార్లపల్లెఊరొదిలి వెళ్లాల్సిందే.. ఎద్దల బండపై క్వారీ మొదలైతే అందరం ఊరొదిలి వెళ్లిపోవాల్సిందే. ఇళ్లు, పొలాలు నాశనమవుతాయి. ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడతాయి. మేత కరువై పశువుల పెంపకం కష్టతరంగా మారుతుంది. ఇప్పుడు ఎద్దల బండపై పంట నూర్పిళ్లు కూడా చేసుకుంటున్నాం. టీడీపీ నేతలు మా కష్టాలను గమనించి కనికరించాలి. – జయంత్ రెడ్డి, బందార్లపల్లె -
ఆలయ ‘గ్రహణం’
కాణిపాకం, పెంచలకోన ఆలయాల తలుపులు మూసివేస్తున్న అధికారులుసంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలు మూతపడ్డాయి. రాత్రి 9.57 నుంచి గ్రహణ సమయం మొదలవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచే ఆలయాలను మూసివేశారు. ఈ క్రమంలోనే తిరుమల, తిరుపతి, కాణిపాకం, పెంచలకోన, బోయకొండ, మొగిలిలో సంప్రదాయబద్ధంగా మహద్వారాలు మూతపడ్డాయి. అయితే రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదిదంపతులకు శాంతి అభిషేకం నిర్వహించారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. సంప్రోక్షణ, పుణ్యాహవచనం తర్వాత భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతించారు. – తిరుమల/శ్రీకాళహస్తి/కాణిపాకం/రాపూరు -
నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.పోలీస్ కార్యాలయంలో..చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా తనను కలిసి తెలియజేయవచ్చని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.బస్సుల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలుగుడిపాల : తమిళనాడుకు వెళుతున్న బస్సులను ఆదివారం గుడిపాల పోలీసుల సహకారంతో తిరుపతి ఎర్రచందనం టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం కూలీలను తిరుపతికి తరలించారు.ఎంపీడీఓలకు ఉద్యోగోన్నతిచిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పలువురు ఎంపీడీఓలకు డీడీఓలుగా ఉద్యోగోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 మంది ఎంపీడీఓలను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు(డీడీఓ)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఐరాల ఎంపీడీఓ ధనలక్ష్మిని డ్వామా ఏపీఓ (ఎంఅండ్ఈ)చిత్తూరు, నెల్లూరు డ్వామా ఏపీఓ(ఎంఅండ్ఈ) ఎం.ధనలక్ష్మిని డ్వామా పలమనేరు, తిరుపతి ఎంపీడీఓ రామచంద్రను డీడీఓ పలమనేరు, వైఎస్సార్ జిల్లా సంపేపల్లె ఎంపీడీఓ ఎన్.రామచంద్రను కుప్పం డీడీఓగా నియమించారు. శ్రీకాళహస్తి వెటర్నరీ ఆఫీసర్ అమర్నాథ్ను అక్కడే కొనసాగించేలా ఆదేశాల్లో పేర్కొన్నారు.నేడు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నాచిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు దివ్యాంగుల జేఏసీ నేతలు కొణతం చంద్రశేఖర్, మురళి వెల్లడించారు. ఆదివారం వారు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగుల్లో ఒక్కొక్కరికి రూ.1.07 లక్షల విలువ చేసే మూడు చక్రాల స్కూటర్ పంపిణీ చేయనున్నారన్నారు. ఇందులో వైకల్య శాతం 70 శాతం కంటే ఎక్కువ ఉంటేనే స్కూటర్ అందిస్తామని నిబంధన విధించడం సరికాదన్నారు. సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్లో చాలా మంది దివ్యాంగుల వైకల్యశాతం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్లో పంపిణీ చేసే పింఛన్లపై సైతం స్పష్టత లేదన్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగనున్నట్లు వివరించారు. జిల్లాలోని దివ్యాంగులు ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ వద్దకు రావాలని పిలుపునిచ్చారు. -
కుంటలో పడి చిరు వ్యాపారి మృతి
బంగారుపాళెం: మండలంలోని 65 వెంకటాపురం సమీపంలో సోమవారం కుంటలో పడి చిరువ్యాపారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు పట్టణం మంగసముద్రం హౌసింగ్ కాలనీకి చెందిన ముస్తఫా(44) పాతసామాన్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వ్యాపారం కోసం స్కూటీపై బంగారుపాళెం మండలానికి వచ్చాడు. మంగళపల్లె పంచాయతీ 65 వెంకటాపురం –సంక్రాతిపల్లె రహదారి పక్కన గల నీటి కుంటలో ద్విచక్ర వాహనంతో పాటు పడి మృతి చెందాడు. ఈ విషయాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తిని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. డబ్బు వసూలు చేయడం అన్యాయం చిత్తూరు కలెక్టరేట్ : పీసీఆర్ పాఠశాలలో విద్యార్థుల వద్ద టీసీ మంజూరుకు డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు కందాటి విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీసీ మంజూరుకు డబ్బులు వసూలుకు పాల్పడటం బాధాకరమన్నారు. టీసీ కోసం వచ్చే విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం నేరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పిపోయిన వ్యక్తి ప్రత్యక్షం.. ఆపై మాయం పలమనేరు: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి ప్రత్యక్షమై.. మళ్లీ కనిపించకుండా పోయిన ఘటన ఆదివారం పలమనేరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని బోయవీధికి చెందిన అస్లాం 15 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. అప్పట్లో కుటుంబీకులు వెదికినా దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని వినాయక నిమజ్జనంలో అతను ఉన్న ఓ వీడియో లోకల్ యూట్యూబ్ చానెల్లో కనిపించింది. అతన్ని గుర్తుపట్టిన కుటుంబీకులు సంతోషంతో అక్కడికెళ్లి చూడగా ఆ ప్రాంతంలో అతను కనిపించలేదు. అతను పట్టణంలోనే ఉన్నాడని భావించి గాలించడం మొదలు పెట్టారు. సరెండర్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందిపై ఫిర్యాదులు వెలువెత్తడంతో కలెక్టరేట్కు సరెండర్ చేశారు. ఇటీవల చేపట్టిన ఏఎన్ఎంల బదిలీల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ సిబ్బందిపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిగింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టి కలెక్టరేట్కు సరెండర్ చేసినట్టు డీఎంఅండ్హెచ్ సుధారాణి తెలిపారు. అలాగే అక్రమ లింగనిర్థారణ విషయంలో చేతులు కలిపిన ఆశ వర్కర్ను కూడా సస్పెండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. టపాకాయలు సీజ్ పెనుమూరు(కార్వేటినగరం): అక్రమంగా తరలిస్తున్న రూ.1.6 లక్షల విలువ జేసే టపాకాయాలు సీజ్ చేసిన ఘటన చిత్తూరు–పెనుమూరు రోడ్డు మార్గంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనరసింహ కథనం... పెనుమూరు–చిత్తూరు మార్గంలో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పీలేరుకు చెందిన కె.నవ్యకాంత్ ఏపీ 39 టీహెచ్1738 నంబరు గల టెంపో వాహనంలో రూ.1.6 లక్షల విలువ జేసే టపాకాయలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో వాహనాన్ని అందుపులోకి తీసుకుని, టపాకాయలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
చిత్తూరు కలెక్టరేట్ సోమవారం ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. సమస్యల పరిష్కారం కోసం పలువురు క్యూకట్టారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి వెట్టిచాకిరీ నుంచి ఓ కుటుంబానికి అధికారులు విముక్తి కలిగించిన ఘటన జీడీనెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025చౌడేపల్లె మండలం, దుర్గసముద్రం రైతుసేవా కేంద్రం వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు గంగవరం: మండలంలోని (గుండుగల్లు, పసుపత్తూరు) క్లస్టర్కు 200 బస్తాలు, (దండపల్లి, మారేడుపల్లి) క్లస్టర్కు 200, జీడిమాకులపల్లికి 150, కొత్తపల్లికి 200, గంగవరం 1, 2 క్లస్టర్కు 200, గండ్రాజుపల్లి 1, 2 క్లస్టర్కు 200, మామడుగుకి 200 బస్తాల యూరియా వచ్చింది. వ్యవసాయాధికారి రఖీబా, రైతు సేవా సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం పంపిణీని ప్రారంభించారు. అయితే ఒక్కో సచివాలయ పరిధిలో వేల మంది రైతులు క్యూలో బారులు తీరారు. ముందుగా టోకెన్లు పొందిన రైతులకు యూరియా బస్తాలు సరిపోగా.. వెనుకబడిన రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఎదురైంది. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన క్లస్టర్లకు యూరియా రాకపోవడంతో రైతులు గందరగోళానికి గురయ్యారు. తీరని యూరియా కష్టాలు పెద్దపంజాణి: యూరియా కోసం అన్నదాతలు మండలంలోని శంకర్రాయలపేట, రాజుపల్లి, బట్టందొడ్డి, తుర్లపల్లి, కొళత్తూరు, లింగాపురం, పెద్దపంజాణి రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం వరి పంటకు యూరియా ఎంతో అవసరం. అదును దాటితే ఎంత వేసినా ప్రయోజం శూన్యం. దీంతో ఉదయమే ఆర్ఎస్కేల వద్దకు చేరుకున్నారు. అన్ని పనులు వదిలేసి క్యూలో నిలబడితే ఒకేఒక్క బస్తా యూరియా ఇవ్వడంతో ఆవేదనకు లోనయ్యారు. అదికూడా సగం మందికి కూడా ఇవ్వలేదని రైతులు వాపోయారు. రోజంతా పడిగాపులు కాసినా ఒక్క బస్తా యూరియా దొరకండం లేదని వాపోయారు. నువ్వు ముందా..నేను ముందా? చౌడేపల్లె: మండలంలోని 12 రైతుసేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తారని ప్రకటించడంతో అధిక సంఖ్యలో రైతుసేవా కేంద్రాల వద్దకు రైతులు చేరుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్లు చేతపట్టుకొని ఉదయం నుంచే పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. కూటమి నేతలు కొందరు పంపిణీ కేంద్రాల వద్ద చేతివాటం ప్రదర్శించి తమవారికే ముందు యూరియా ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు. దుర్గసముద్రం సచివాలయం వద్ద అగ్రికల్చర్ అసిస్టెంట్ రమణమ్మ, వెల్ఫేర్ అసిస్టెంట్ రియాజ్ తప్ప ఎవరూ సకాలంలో విధులకు రాలేదు. అప్పటికే అక్కడకు వందల మంది రైతులు చేరుకోవడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. లద్దిగం రైతుసేవాకేంద్రం వద్ద రైతులు గుంపులు గుంపులుగా వెళ్లడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్కో కేంద్రం వద్ద 150 బస్తాల యూరియా మాత్రమే స్టాకు ఉండడంతో నువ్వుముందా..నేను ముందా..? అనే ఆతృతతో రైతులు పోటీపడ్డారు. చివరికి సీఐ రాంభూపాల్, వ్యవసాయశాఖ ఏడీఏ శివకుమార్, ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఓ మోహన్ రైతులతో మాట్లాడారు. ఉన్న స్టాకును పంపిణీ చేయగా మిగిలిన రైతులకు టోకన్లు జారీ చేశామని, త్వరలో వారందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే రైతులు దానికి సంతృప్తి చెందలేదు. అదునుదాటాక యూరియా ఇస్తే ఏం లాభం అంటూ పెద విరవడం కనిపించింది. ప్రత్యేక విద్యుత్ అదాలత్ రేపు చిత్తూరు కార్పొరేషన్: ప్రత్యేక విద్యుత్ అదాలత్ను బుధవారం జీడీనెల్లూరు డీఈ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో రూరల్ ఈఈ సురేష్ తెలిపారు. విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు. పెనుమూరు, ఆవులకొండ, జీడీనెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, నగరి, పన్నూరు, నిండ్ర సెక్షన్ల పరిధిలోని వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే ప్రగతి సాధ్యం చిత్తూరు కలెక్టరేట్ : సంపూర్ణ అక్షరాస్యతతోనే ప్రగతి సాధ్యమని జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ మహమ్మద్ ఆజాద్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బీఎస్ కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ అక్షరాస్యులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. నిరక్షరాస్యతను రూపుమాపేందుకు అనేక పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం జిల్లాలో అమలువుతోందన్నారు. జిల్లాలోని 76,410 మందిని ఉల్లాస్ కార్యక్రమంలో గుర్తించి అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కోమల పాల్గొన్నారు. నేడు అన్నదాతపోరు చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాతపోరు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు స్థానిక గంగినేని చెరువు వద్ద నుంచి 9.30 గంటలకు ర్యాలీగా బయలుదేరుతామని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందజేస్తామన్నారు. తమతో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, పార్టీ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ర్యాలీపై పోలీసుల ఆంక్షలు చిత్తూరు అర్బన్: రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఆంక్షలు విధించింది. చిత్తూరులో రైతులకు యూరియా పంపిణీ ఇప్పటికే ప్రారంభించారని, కావలసిన అంత స్టాకు కూడా ఉందని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. యూరియా కొరత ఉందని రైతులను రెచ్చగొట్టొద్దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద కేవలం పది మంది పార్టీ నాయకులకు మాత్రమే అనుమతుందని, ర్యాలీలు, నిరసనలు తెలియజేయడానికి వీల్లేదంటూ తెలిపారు. దీనికి తోడు చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీసు యాక్ట్ను అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. చిత్తూరులోని మూడు నియోజకవర్గాల్లో ర్యాలీలు ఊరేగింపులు నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రజాసమస్యపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కడానికి పోలీసు శాఖ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వద్దు చిత్తూరు అర్బన్: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దన్ని ఏఎస్పీ రాజశేఖరరాజు చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 37 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. యూరియా.. బ్లాక్ మార్కెట్కు తరలుతోందా?బైరెడ్డిపల్లె: యూరియా కోసం బారులు తీరిన రైతులు పెద్దపంజాణి: యూరియా కోసం గుమికూడిన రైతులుయాదమరి : యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులుగంగవరం: గుండుగల్లు రైతు సేవా కేంద్రం వద్ద రైతుల తంటాలు పంట పొలాలపై ఏనుగుల దాడి పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. తాజాగా సోమవారం పూరేడువారిపల్లె, కల్లూరు, కొంగరవారిపల్లెల్లోని పంట పొలాలను సర్వనాశనం చేశాయి. వరి, కొబ్బరి పంటలను ధ్వంసం చేశాయి. ఇనుపగేట్లు, మామిడి చెట్ల కొమ్మలను విరిచివేశాయి. మండేగుండెలు!చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పాల్గొన్న దివ్యాంగురాలు రిహానా తండ్రి ‘మేమేమి చేశాము పాపం. మాకెందుకింత శిక్ష వేస్తున్నారు. మాపై కక్ష సాధింపులెందుకు..? పాలకులారా.. మా బిడ్డల గోడు తగలకుండా పోదు.. మా బాధ మిమ్మల్ని క్షోభించకుండా వదలదు..’ అంటూ అవిటివారైన తమ బిడ్డలనెత్తుకుని న్యాయం చేయాలంటూ మండుటెండలో తల్లిదండ్రులు గంటలకొద్దీ నిరీక్షించడం చూపరులను కదిలించింది. మా బాధ ఆలకించండి మహాప్రభో అంటూ..! కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కలచివేసింది. ఈ ఘటన సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట కనిపించింది. చిత్తూరు జిల్లా, ఐరాల మండల కేంద్రంలో నివాసముంటున్న షేక్ అల్తాఫ్, ముక్తియార్ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. వారి కుమార్తె రిహానా అవిటితనంతో జన్మించింది. ప్రస్తుతం బాలికకు 14 ఏళ్లు. నడవలేదు. కాళ్లు చేతులు చచ్చుబడ్డాయి. కనీసం కూర్చోలేని పరిస్థితి. అన్నం కూడా స్వతహాగా తినలేదు. తల్లిదండ్రులే సపర్యలు చేయాల్సిన దుస్థితి. బిడ్డ బాగోగుల కోసం ఉన్నదంతా అమ్మి ఆస్పత్రులకు పెట్టేశారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. కూలీనాలి చేసి బిడ్డను పోషించడం కష్టతరంగా మారింది. తన కుమార్తెకు దివ్యాంగ పింఛన్ రూ.15 వేలు ఇప్పించాలని మొదట ఐరాల మండల అధికారులను అభ్యర్థించారు. ఆపై న్యాయం జరగకపోవడంతో ప్రతి సోమవారం అక్కడి నుంచి ఆటో పెట్టుకుని కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా ఇప్పటికి 12 సార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు హాజరయ్యారు. బిడ్డను చేతిలో పెట్టుకుని న్యాయం చేయాలంటూ మండుటెండలో గంటల కొద్దీ నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మనసు లేని అధికారులు ఇప్పటికై నా కనికరిస్తారో.. లేదా తమ కఠినత్వం ఇందేనని మరోమారు రుజువు చేస్తారో వేచి చూడాలి మరి!. – చిత్తూరు కలెక్టరేట్ న్యాయం కోసం తండ్రి పడుతున్న ఆరాటం, అద్దె ఆటోలో రిహానాను కలెక్టరేట్కు తీసుకొస్తూ..‘ఏం ప్రభుత్వమో ఏమో..! పొద్దుపొడవక ముందే సద్ది కూడా తినకుండా వచ్చేశాం. ఎర్రటి ఎండలో.. నోరు పిడసగట్టుకుపోతున్నా రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టాం. అందరికన్నా ముందు ఉంటే ఒక బస్తా యూరియా అన్నా దొరుకుతుందని ఆశపడ్డాం. మేమొచ్చే లోపే క్యూకట్టేశారు. ఇంకేం చేయలేక.. కాళ్లు పీకేస్తున్నా ఇక్కడే ఉండిపోయాం. యాడికిపోయినా యూరియా లేదంటున్నారు. ఇప్పుడీ రైతు సేవా కేంద్రాలకొచ్చినా క్యూలో ముందున్న వారికి ఒక్కో బస్తా యూరియా ఇచ్చి పంపించేశారు.. కొందరు యూరియా కోసం కొట్లాట వరకు దిగేశారు. ఇలాంటి పరిస్థితి మేమెప్పుడూ చూడలేదు.. ఇక మాపరిస్థితి ఏందో తెలియడం లేదు’ అంటూ సోమవారం రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతులు చర్చించుకోవడం కనిపించింది. ఒక్క బస్తా కోసం.. యాదమరి: మండలంలోని బోదగుట్టపల్లి, 184గొల్లపల్లి రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు పోలీసు బందోబస్తు నడుమ మండల వ్యవసాయాధికారులు యూరియా సరఫరా చేశారు. ఎన్నో ఆశలతో యూరియా కోసం రైతన్నలు ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షించినా చివరికి నిరాశే ఎదురైంది. మండలానికి కేవలం 300 బస్తాలు యూరియా మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఒక్క బస్తా యూరియాతో పంటను ఎలా కాపాడుకోవాలని రైతులు నిలదీశారు. త్వరలోనే మరింత యూరియా వస్తుందని తహసీల్దార్ పార్థసారథి, ఏఓ దీప రైతులకు భరోసా ఇచ్చారు. కాగా నేడు మండలంలోని మోర్దానపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ చేయనున్నట్టు ఏఓ తెలిపారు. జిల్లాలో దయనీయంగా యూరియా నిల్వలు కాణిపాకం: జిల్లాలో ఎప్పుడూ లేన్నంతగా గత ఏడాదిన్నర కాలంలోనే యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా పక్కదారి పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరఫరా అవుతున్న యూరియా మొత్తం కొన్ని ప్రైవేటు దుకాణాలకు కేటాయించడంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అక్కడి నుంచి యూరియాను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతు భరోసా కేంద్రాలుండగా.. ప్రైవేటు షాపులకు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇచ్చి..అలా బ్లాక్ మార్కెట్కు తరలించి.. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మండిపడుతున్నారు. తర్వాత సిఫార్సులతో కొంత మందికి యూరియాను కావాల్సినంత ఇవ్వడం సమంజసం కాదంటున్నారు. ఆర్బీకేల ద్వారా ఎందుకివ్వరు? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేసింది. రైతులకు అవరసరమైన విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు అందిస్తూ వచ్చింది. రైతులకు కావాల్సినంత మేరకు యూరియాను అందజేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్బీకేలను నీరుగార్చింది. రైతు సేవలను దూరం చేస్తోంది. కేవలం మండల కేంద్రంలోని సొసైటీలు, ప్రైవేటు దుకాణాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. అవస్థలు ఎన్నో..! యూరియా క్షేత్ర స్థాయిలో అందకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. మండల స్థాయిలోని ప్రైవేటు దుకాణాలకు యూరియా పంపిణీ బాధ్యతలు ఇవ్వడంతో రైతులు పడిగావులు కాయాల్సి వస్తోంది. రైతులు పనులు మానుకుని పంపిణీ కేంద్రం వద్ద గంటలకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి. తొక్కిసలాట.. తోపులాటలో నలిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. విధిలేక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్తా యూరియా రూ.260 నుంచి రూ.280 ఉండగా.. బ్లాక్ మార్కెట్లో అదనంగా రూ.450కి కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. బారులు తీరిన రైతులు బైరెడ్డిపల్లె : ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం క్యూలో వేచి ఉన్నా కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని 7 రైతు సేవా కేంద్రాల్లో సోమవారం 2,250 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. అయితే ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే పంపిణీ చేశారు. దీనికోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు వాపోయారు. -
ఎర్రమట్టి..కొల్లగొట్టి!
పాలసముద్రం: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు కొల్లగొడుతోంది. అందినకాడికి ఎర్ర గావెల్ను తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. దీనిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి అండతో మరింత రెచ్చిపోతోంది. మండలంలోని వనదుర్గాపురం రెవెన్యూ లేక్కదాఖాల జగనన్న కాలనీ సమీపంలోని గుట్టపై కన్నేసింది. తలసిందే తడువుగా హిటాచీలు దించేసింది. పదుల సంఖ్యలో ఎర్రగ్రావెల్ను నింపి లారీలను సరిహద్దు దాటించింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే! మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీకి ఆనుకుని గుట్టలున్నాయి. ఇవి తమిళనాడు హైవేకి కిలో మీటరు దూరంలో ఉండడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ గుట్టల్లోని విలువైన ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. గ్రావెల్, మట్టిని తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులో ఒక్కో టిప్పర్ గ్రావెల్ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరే? తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఇదే అదునుగా అక్రమార్కులు అందినకాడికి అడ్డంగా తోడేస్తున్నారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులకు ఎదురు లేకుండా పోతోంది. మండలంలోని గుట్టలు, కొండలను కరింగించేస్తున్నారు. గతంలో అనుమతి లేకుండా ఎర్రమట్టి తీసుకెళ్తున్న టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. వాటిని రెండు రోజుల క్రితమే అక్రమార్కులు పన్నులు చెల్లించి తీసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీ సమీపంలోని గుట్టలో తవ్వకాలు ప్రారంభించారు. తమకడ్డొచ్చిన అధికారులను కూడా బెదిరించినట్టు సమాచారం. వాహనాలు సీజ్ వనదుర్గాపురం గుట్టలో ఎర్రమట్టి తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తవ్వకాలు, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేశారు. తమిళనాడు టిప్పర్లకు అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
చిత్తూరు కలెక్టరేట్ : వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ధర్నాలు నిర్వహించడంతో కలెక్టరేట్ దద్దరిల్లింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ధర్నాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లపై దౌర్జన్యం 60 ఏళ్లుగా నివాసముంటున్న 93 కుటుంబాల ఇళ్లను కూల్చేసి ఆ భూమిని ఆక్రమించుకునేందుకు సతీష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు పెనుమూరు మండలం, దాసరపల్లె గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామానికి చెందిన ప్రజల అధిక సంఖ్యలో కలెక్టరేట్కు విచ్చేసి ధర్నా నిర్వహించారు. వారి ధర్నాకు సీపీఎం నేతలు మద్దతు పలికారు. గ్రామస్తులు మాట్లాడుతూ దాసరపల్లిలో సర్వే నం.7లో గత 60 ఏళ్లుగా 93 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో రెండు బోరు మోటార్లు, ప్రభుత్వ పాఠశాల, నీళ్ల ట్యాంకు, ఆలయంతో పాటు 93 కుటుంబాలు ఉన్నట్టు తెలిపారు. ఆ ఇళ్లను ప్రస్తుతం కూల్చేసి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నామని, అయినా ఇళ్లను కూల్చేసేందుకు నోటీసులు పంపి బెదిరిస్తున్నారన్నారు. గతంలో సర్వే నం.7లో మేత బీడు పోరంబోకుగా ఉండేదన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ భూమిని మేత భూమి నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు సైతం ఇచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం పెనుమూరు తహసీల్దార్ మొత్తం భూమిని స్వాధీనం చేయాలంటూ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో గ్రామస్తులు రాజారెడ్డి, రామకృష్ణారెడ్డి, మునిలక్ష్మి, విజయ, సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులను అవమానిస్తూ..అపహేళన చేస్తూ! కూటమి ప్రభుత్వం దివ్యాంగులను అవమానిస్తూ.. అపహేళన చేస్తూ కించపరుస్తోందని ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మురళి ఆరోపించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిస్సహాయులైన దివ్యాంగులపై చేస్తున్న దాడికి ప్రతిరూపమే రీ వెరిఫికేషన్ ప్రక్రియ అని అభివర్ణించారు. రీ వెరిఫికేషన్లో వికలత్వ శాతం తగ్గించి దివ్యాంగుల పొట్ట కొట్టడం అన్యాయమన్నారు. దివ్యాంగులను ద్వేషిస్తూ, కించపరుస్తూ, వికలత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. పూర్తిగా మంచానికి, వీల్చైర్కు పరిమితమైన దివ్యాంగులను రూ.15 వేల పింఛన్కు అర్హులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండాలనే నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమతి, నేతలు చిరంజీవి, సుబ్రహ్మణ్యం, లీలాపతినాయుడు, రమేష్ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ భవనం ఎదుట మండుటెండలో బైఠాయించిన వెదురుకుప్పం మండలం, బందార్లపల్లె గ్రామస్తులు, ధర్నాను అడ్డుకుంటున్న పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం ధర్నా నిర్వహిస్తున్న దాసరపల్లె గ్రామస్తులుదివ్యాంగుల ధర్నా జీతాలు లేక అలమటిస్తున్నా.. కూటమి ప్రభుత్వంలో గ్రీన్ అంబాసిడర్లు జీతాలు లేక అలమటిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 25 నెలలుగా పెండింగ్లో ఉన్న గ్రీన్ అంబాసిడర్ల జీతాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డిలు మాట్లాడుతూ కార్మికుల పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పటికీ వారి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారికి ప్రతి నెలా ఇచ్చే రూ.6 వేలు సైతం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ధర్నాలో నగర కార్యదర్శి దాసరిచంద్ర, నాయకులు రమాదేవి, కవిత, రాజేంద్రన్, గోవిందస్వామి పాల్గొన్నారు. న్యాయం చేసే వరకు కదిలేదే లేదు తమకు న్యాయం చేసే వరకు కదిలేదే లేదు అంటూ వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామస్తులు పీజీఆర్ఎస్ భవనం ముందు ధర్నా నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో కలెక్టరేట్కు విచ్చేసి టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎండగట్టారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గంటల తరబడి పీజీఆర్ఎస్ భవనం ఎదుట బైఠాయించారు. ఆ గ్రామస్తులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్వల్ప వాగ్వాదం నెలకుంది. ఈ ధర్నాలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సొంత తమ్ముడు నిది గ్రామస్తులకు మద్దతుగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామస్తులు మాట్లాడుతూ బందార్లపల్లె గ్రామానికి సమీపంలో ఎద్దలబండ వద్ద టీడీపీ నేత యుగంధర్నాయుడు తదితరులు క్వారీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఆ క్వారీ ప్రారంభమైతే తమ పంట పొలాలు నాశనమవుతాయన్నారు. క్వారీ ప్రారంభించకూడదని ప్రశ్నించినందుకు తమ పై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ క్వారీ ఆపివేసేలా ఆదేశిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. -
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
గంగాధర నెల్లూరు: వెట్టి చాకిరీ నుంచి ఓ కుటుంబానికి అధికారులు విముక్తి కల్పించారు. వివరాలు.. పెనుమూరు మండలం, పూనేపల్లి గ్రామానికి చెందిన నందిని కుటుంబ సభ్యులు జీడీ నెల్లూరు మండలం, కోటగరం పంచాయతీ, ఎట్టెరి గ్రామానికి చెందిన ఓ సిమెంట్ ఇటుకల వ్యాపారి వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు. దీనికి బదులుగా గత ఏడాది పాటు తా కుటుంబాన్ని పెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. ఈ విషయం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా నందిని కుటుంబ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాసులు సోమవారం బాధితులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సదరు యజమానితో మాట్లాడి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఏఎస్ఐ మురళి పాల్గొన్నారు. బాలికపై లైంగిక వేధింపులు – నిందితుడికి జైలు, జరిమానా చిత్తూరు లీగల్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ లోకేష్ (30) అనే నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. కార్వేటినగరానికి చెందిన లోకేష్ 2021లో ఓ మైనర్ బాలికను తనతో ఫోన్లో మాట్లాడాలని బలవంతం చేసేవాడు. ఓ రోజు బాలికను బెదిరించి తన ఇంటికి పిలిపించుకుని, ఆమెకు అశ్లీల వీడియోలు చూపించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేయడంతో బాలిక, జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఓ రోజు బాలికతో పాటు ఆమె తల్లి గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. విషయం పోలీసులకు తెలియడంతో విచారించి, లోకేష్పై పోక్సో కింద కేసు నమోదుచేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారు. బాధిత బాలిక కుటుంబానికి రూ.50 వేలు పరిహారం అందజేయాలని చిత్తూరు ఆర్డీఓను జడ్జి ఆదేశించారు. -
మండలంలో లేకుండా చేస్తాం..
పాలసముద్రం: అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు, పొక్లెయిన్ను తహసీల్దార్, ఎస్ఐ అడ్డుకుని వాటిని సీజ్ చేసినందుకు వారిని మండలంలో లేకుండా చేస్తామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు ఒకరు బెదిరించాడు. పైగా.. ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..పాలసముద్రం మండలం నుంచి టీడీపీ కూటమి నాయకులు మూడు, నాలుగు నెలలుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టల్లో నుంచి అనుమతుల్లేకుండా తమిళనాడుకు ఎర్రమట్టి తరలిస్తున్న సంఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని తొమ్మిది టిప్పర్లు, రెండు పొక్లెయిన్లను సీజ్చేశారు. ఇలా ఎర్రమట్టిని అక్రమంగా తరలించకూడదని ఎస్ఐ రెడ్డప్ప వాహనాలను పోలీస్స్టేషన్కి తరలిస్తుంటే టీడీపీ కూటమి నాయకులు వారిపై గొడవకు దిగారు. అధికారులకు వేలు చూపిస్తూ హెచ్చరికలు..: ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు, చెన్నైకి చెందిన శరవణ అక్కడకు చేరుకున్నాడు. టిప్పర్ల యజమానులతో కలిసి ఆయన తహసీల్దార్ అరుణకుమారిని, ఎస్ఐ రెడ్డప్పను ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది. త్వరలో మిమ్మల్ని మండలంలో లేకుండా చేస్తా’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. ఇదే సమయంలో అక్కడ ఫొటోలు తీస్తున్న సాక్షి విలేకరిని ‘నువ్వెవరు ఫొటోలు తీయడానికి.. నీ అంతుచూస్తా’.. అంటూ బెదిరిస్తూ పైపైకి దాడి చేయడానికి వస్తూ దూషించాడు. తోటి విలేకరులు రావడంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు. -
అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ
కార్వేటినగరం : అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన చేపడుతున్నామని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆదివారం పుత్తూరులోని తన నివాసంలో అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతల అవసరాలకు అనుగుణంగా రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులను అందించామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం యూరియా పంపిణీలో సైతం కోతలు విధిస్తోందని విమర్శించారు. మామిడి రైతులకు ఫ్యాక్టరీల ద్వారా రూ.8, ప్రభుత్వం రూ.4 చెల్లిస్తామని చంద్రబాబు ఊదరగొట్టారని, వాస్తవానికి ఫ్యాక్టరీలు రూ.5 మాత్రమే చెల్లించినా పట్టించుకోలేదని మండిపడ్డారు.ఇక ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.4లకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. -
అక్రమ కేసులకు భయపడం
కార్వేటినగరం : కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. ఆదివారం పుత్తూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి పేదలు అవసరం లేదని, పెత్తందారులే ప్రధానమని ఆరోపించారు. అందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసిందని మండిపడ్డారు. వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకే కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకంగా 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చామని వెల్లడించారు. నేడు కేంద్ర ప్రభుత్వం చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారని, వారిని ఎదిరించే దమ్ము, ధైర్యం లేక మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేద విద్యార్థులపై వివక్ష చూపుతారని విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే.. స్కామ్ జరిగిందని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. పైసా అవినీతి లేని లిక్కర్ కేసులో దాదాపు 39 మందిని కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో రెండు నుంచి మూడు బెల్టు షాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారని,ఈ ప్రభుత్వంలోనే కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వమే వస్తుందని, జనరంజకంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. -
వరసిద్ధుని వైభవం
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం మూలవిరాట్కు పంచామృతి అభిషేకం నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. రాత్రి ఈ మేరకు రావణబ్రహ్మ వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వైభవంగా ఊరేగించారు. భక్తులు కర్పూరహారతులతో మొక్కులు చెల్లించుకున్నారు. అలరించిన నృత్యం ఆలయంలోని ఆస్థాన మండపంలో నిర్వహించిన కూచిపూడి, భరత నాట్యం అలరించాయి. అలాగే గీతాలపాలనలు భక్తులను హృదయాలను రంజింపజేశాయి. ఈ సందర్భంగా కళాకారులను ఈఓ పెంచలకిషోర్ సత్కరించారు. నేడు యాళివాహన సేవ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి యాళివాహన సేవ నిర్వహించనున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. -
మదమెక్కిన భీకరి!
కౌండిన్య అడవిలో సంచరించే మదపుటేనుగులు (ఫైల్) కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. మదపుటేనుగుల మేటింగ్ సీజన్ మొదలు కావడంతో జనానికి ముప్పు తప్పేలాలేదు. అక్టోబర్ నుంచి జనవరి వరకు మదమెక్కిన గజరాజులకు పట్టపగ్గాలే ఉండవు. అలవి కాని ఆగ్రహంతో రెచ్చిపోయే భీ‘కరి’ నుంచి తోటి జంతువులతోపాటు మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. మేటింగ్ సీజన్ ముగిసే వరకు అటవీ సమీప ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎలిఫెంట్ శాంచురీని దాటి బయటకొచ్చే మదపుటేనుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పలమనేరు : కుప్పం, చిత్తూరు, పలమనేరు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులతోపాటు అటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, కృష్ణగిరి, కావేరిపట్నం , కర్ణాటకలోని హోసూర్, బన్నేర్గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే ఏనుగులున్నాయి. స్థానికంగా ఉన్న గుంపుల్లో మొత్తం 12 మగ ఏనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు ( మదపుటేనుగులు) మాత్రం ఉన్నాయి. గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా సంచరిస్తున్నాయి. ఒక్కో మదపుటేనుగు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. జనం కనిపిస్తే దాడులు చేయడం, లేదా తరమడం చేస్తుంటాయి. వీటి చేష్టలు, గుర్తులను బట్టి స్థానికంగా వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో రౌడీ ఏనుగు, రాముడు, భీముడు, ఒంటి దంతం ఏనుగు, ఒంటికన్ను ఏనుగు ఇలా వీటికి పేర్లు పెట్టారు. ఇవి తమ ఉనికి కోసం రౌడీల్లా ప్రవర్తిస్తుంటాయి. మిగిలిన ఆడ ఏనుగులు, గున్నలకు భయమెక్కువ, దీంతో ఇవి గుంపులోనే ఉంటూ జనాన్ని చూసి వెనక్కు వెళుతుంటాయి. కానీమదపుటేనుగులు ఏమాత్రం భయపడవు, ఎదురు దాడులకు దిగుతుంటాయి. ప్రస్తుతం ఆరు మాత్రమే.. కౌండిన్యలోని 12 మదపుటేనుగుల్లో ప్రస్తుతం ఆరు మాత్రమే ఉన్నాయి. బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లెలో రౌడీ ఏనుగుగా చెప్పుకునే మదపుటేనుగు కరెంటు తీగలకు బలైంది. గంగవరం మండలం మన్నారునాయనిపల్లె సమీపంలో పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటుకు మరో మదపుటేనుగు బలైంది. అంతకుముందు కాలువపల్లె, మొసలి మడుగు వద్ద రాముడు, భీముడు అనే రెండు మదపుటేనుగులు చనిపోయాయి. మూడేళ్ల క్రితం పలమనేరు మండలంలోని బేరుపల్లె, గాంధీనగర్ల వద్ద రెండు మదపుటేనుగులు కరెంట్ షాక్తో కన్నుమూశాయి. ఇవి బతికున్నప్పుడు మనుషులు, పశువులు, కుక్కలను తరమి తరిమి చంపేవి. ఇప్పుడున్న ఆరు మదపుటేనుగుల్లో గుడ్డి కన్ను ఏనుగు గత మేటింగ్ సీజన్లో యాదమరి మండలం దిగువకనతల చెరవువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ను చంపిన విషయం తెలిసిందే. మొసలిమడుగు రౌడీగా పిలవబడే మరో ఏనుగు కౌండిన్యలోని వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్ను తొండంతో విసిరేసింది. ఊసరపెంట మదపుటేనుగు తరచూ ఆ గ్రామంలోకి వచ్చి రాత్రంతా ఉండి వెళ్లడం దీని ప్రత్యేకత. మిగిలిన రెండు మదపుటేనుగులు వేర్వేరుగా కౌండిన్యలో సంబంధిత ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆగ్రహంతో ఊగిపోతూ... మదపుటేనుగులపై జనం రాళ్లు విసరడం, టపాకాయలను పేల్చడం, టైర్లు కాల్చి వాటి పైకి విసరడం లాంటి చర్యలతో మగ ఏనుగులు జనంపై కసి పెంచుకున్నాయి. ఆడ ఏనుగులుకున్నంత సహనం వీటికి ఉండదు. ఇప్పటిదాకా పరిశీలిస్తే యాదమరి మండలం దిగువకనతల చెరువువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ను, వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్ను తొండంతో విసరడం, పందేరుపల్లి వద్ద రైతును, కాలువపల్లి వద్ద యువకుడిని తొండంతో కొట్టి చంపడం చేసింది మదపుటేనుగులే. పెద్దపంజాణిమండలం పెనుగొలకలకు చెందిన బంగారప్పను, కాలువపల్లి వద్ద రైతు సుబ్రమణ్యను చంపింది మదపుటేనుగులే. కుప్పంలోనూ దాడులు చేసింది ఇవే. పదిరోజుల క్రితం పెద్దపంజాణి మండలంలో రైతును తొక్కి చంపిందే మదపుటేనుగే. గుడిపాల మండలంలో దంపతులను చంపిందే మదపుటేనుగే. ఏనుగుల ఉనికిని పసిగట్టి రక్షణకోసం చెట్లపై ఏర్పాటు చేసుకున్న అటక(ఫైల్)మదపుటేనుగుల జాడకోసం నిత్యం శ్రమించే ఎలిఫెంట్ ట్రాకర్లు కౌండిన్య పరిధిలోని మొత్తం ఏనుగులు : సుమారు 100 ఇప్పటి వరకు గజ దాడుల్లో మృతుల సంఖ్య : 15 గాయపడినవారు : 36 ఇప్పటిదాకా మృతి చెందిన ఏనుగుల సంఖ్య : 19 ఈ నాలుగునెలలు ప్రమాదమే.. ముఖ్యంగా మదపుటేనుగులు అక్టోబరు నుంచి జనవరి వరకు ఆడ ఏనుగుల సాంగత్యం కోసం మత్తులో ఉంటాయి (మేటింగ్ సీజన్). దీంతో తిక్కతిక్కగా ప్రవర్తించడం, మనుషులను చూస్తే ఆగ్రహంతో ఊగిపోతుంటాయి. తన పరిధితోపాటు అడవిలో ఆడ ఏనుగుల కోసం చాలాదూరం అన్వేషిస్తుంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో మనషులు, జంతువులపై దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆడ ఏనుగులు వీటి మాట వినకపోవడం లేదా అక్కడ జరిగే రభసతో ఇప్పటిదాకా ఆరు ఆడ ఏనుగులు మృతిచెందాయి. ఏదేమైనా ఈ నాలుగునెలలు మదపుటేనుగుల కారణంగా ప్రమాదాలు పొంచిఉన్నాయి. కాబట్టి అడవుల్లోకి ఎవరూ వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. -
వేడుకగా విశ్వరూప పాదయాత్ర
తిరుపతి కల్చరల్: కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, సత్యచంద్ర సరస్వతి స్వామివార్ల విశ్వావసు నామ సంవత్సరం చాతుర్మాష్య దీక్ష విరమణ సందర్భంగా కంచి మఠ స్వామీజీల ఆధ్వర్యంలో మఠ భక్తులు ఆదివారం సాయంత్రం నగరంలో విశ్వరూప యాత్ర వేడుకగా చేపట్టారు. కంచి మఠం మహాపాదుకా మండపం నుంచి దివ్యారామం ఉద్యానవనం వరకు ఈ విశ్వరూప పాదయాత్ర సాగింది. అనంతరం అక్కడ కంచి మఠాధిపతులు శ్రీభగవద్గీతలోని విశ్వరూప దర్శనయోగ అధ్యాయనాన్ని పఠించారు. అనంతరం స్వామివారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి రాణి సదాశివమూర్తి, నగరంలోని పలువురు ప్రముఖులు, మఠం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. -
అమ్మవారి శిరస్సు చోరీ
ఐరాల : పురాతనమైన పాలేటమ్మ ఆలయంలో అమ్మవారి శిరస్సును చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఐరాలకు చెందిన శ్రీరాములు, కురప్పపల్లెకు చెందిన హరి, వైఎస్ గేటుకు చెందిన జయరామ్తోపాటు, పాకాల మండలం గానుగపెంటకు చెందిన నీల అనే మహిళ ఆలయంలో పూజలు నిర్వహించే సాకుతో ప్రవేశించారు. ఎవరూ లేని సమయం చూసి అమ్మవారి శిరస్సును అపహరించారు. హరి, శ్రీరాములు ముందుగా అక్కడి నుంచి పరారయ్యారు. శిరస్సు ఉంచిన బ్యాగులో నీల, జయరామ్ ద్విచక్రవాహనంలో చిత్తూరు వైపు వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత పూజ చేసేందుకు వచ్చిన భక్తులు అమ్మవారి శిరస్సు కనిపించకపోవడంతోఆలయ వంశపార్యంపర ధర్మకర్త బాలాజీకి సమాచారం అందించారు. ఆయన ఆలయానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా చింతగుప్పలపల్లె వద్ద ద్విచక్రవాహనంలో అమ్మవారి శిరస్సుతో వెళుతున్న జయరామ్, నీల పట్టుబడ్డారు. అనంతరం శ్రీరాములు, హరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి ప్రధాన సూత్రధారి శ్రీరాములుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆలయంలో ప్రత్యేక పూజలుపాలేటమ్మ ఆలయంలో చోరీకి గురైన అమ్మవారి శిరస్సు తిరిగి అదే స్థానంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రోక్షణ, అభిషేకాలు చేపట్టారు. -
ఉత్తమ ప్రతిభకు ఉపకార వేతనం
చిత్తూరు కలెక్టరేట్ : ఉత్తమ ప్రతిభ కనబరచిన పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందించేందుకు కేంద్రప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. అలాగే సంబంధిత విద్యార్థులు కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులు ఈ పరీక్ష రాసేందుకు అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికై న వారికి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున స్కాలర్షిప్ అందుతుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సినవి ఇవే.. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కుల, ఆదాయ, విద్యా ధ్రువీకరణపత్రాలు ప్రస్తుతం లేకపోయినప్పటికీ పరీక్ష రాసే సమయానికి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు www.bre.ap.gov.in వెబ్సైట్లో పాఠశాల డీఐఎస్ఈ నంబర్తో లాగిన్ కావాలి. తర్వాత ఆధార్కార్డు మేరకు వివరాలను అప్లోడ్ చేయాలి. అనంతరం అదే లాగిన్లో ఆన్లైన్ లో పరీక్ష ఫీజు చెల్లించాలి. -
టీడీపీ రౌడీ మూకల దాడి
వెదురుకుప్పం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చమాఫియా రెచ్చిపోతోంది. ప్రజలకు జరిగే నష్టాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది. అడ్డుపడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ కండకావరం ప్రదర్శిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన అక్రమ క్వారీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఈ క్వారీని అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసుల సహకారంతో యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అనంతరం క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో 20 మందికిపైగా రౌడీమూకలను దింపింది. వారు ఇనుపరాడ్లతో గ్రామస్తులపై దాడికి యతి్నంచారు. దీంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా ప్రతిఘటించారు. అసలేం జరిగిందంటే.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కొమరగుంట పంచాయతీ పరిధిలోని బందార్లపల్లె గ్రామానికి సమీపంలో సుమారు 7ఎకరాల విస్తీర్ణంలో ఎద్దల బండను క్వారీ నిర్వహణ కోసం అధికారులు అనుమతిచ్చారు. రెండు నెలలుగా టీడీపీకి చెందిన యుగంధర్ నాయుడు క్వారీ నిర్వహణ పనులు చేస్తున్నాడు. ఎద్దల బండకు ఆనుకుని సుమారు 20 ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. అయితే అక్కడ క్వారీ పనులు చేపడితే అన్ని విధాలా నష్టం జరుగుతుందని భావించిన గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకున్నారు.గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో శనివారం కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య క్వారీ వద్దకు వెళ్లి పనులను అడ్డుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడతారని గ్రామస్తులను బెదిరించారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తే రేషన్ కార్డులు, ఫింఛన్లు కట్ చేస్తామంటూ పోలీసులే బెదిరింపులకు దిగారు. అయినా క్వారీ నిర్వహణ సాగనివ్వబోమని గ్రామస్తులు చెప్పడంతో 13 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఆదివారం ఎద్దలబండ వద్దకు వెళ్లారు.గమనించిన క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో సుమారు 20 మంది అనుచరులను రంగంలోకి దింపింది. వారు ఇనుప రాడ్లతో వచ్చి గ్రామస్తులపై దాడి చేయడంతో బద్రి, ధనలక్షి్మ, ప్రమీలమ్మ, శాంతమ్మ, జయంత్రెడ్డి, వరప్రసాద్లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎమ్మెల్యే థామస్ అండ చూసుకుని క్వారీ యాజమాన్యం రెచ్చిపోతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు ఇళ్లపైకి వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు.గ్రామస్తులకు నారాయణస్వామి భరోసా గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ సుకుమార్ ఉన్నారు. -
గురువుపై బరువు
●కార్వేటినగరం: పాఠాలు చెప్పి విద్యార్థులను ఉన్నంతగా తీర్చిదద్దే ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం భారం మోపుతోంది. మూల్యాంకనంలో తీసుకొచ్చిన అసెస్మెంట్ బుక్లెట్ విధానం గుదిబండగా మారింది. వాస్తవానికి ఫార్మేటీవ్, సమ్మెటీవ్ పరీక్షలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను అసెస్మెంట్ బుక్లెట్లో పొందుపర్చాలి. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని మార్కులను ఇందులోనే నమోదు చేయాలి. ఒక్కో పరీక్షకు సంబంధించి 100 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గురుపై బరువెందుకు బాబూ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదీ లెక్క! నిజానికి విద్యార్థులకు ఏడాదిలో నాలుగు ఫార్మేటీవ్లు, రెండు సమ్మేటీవ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ షీట్ఽను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. జవాబు పత్రాలను విద్యార్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటిని టీచర్లు మూల్యాంకనం చేసి మార్కులను ఓఎమ్మార్ షీట్లలో పొందుపర్చేవారు. ఆపై జిల్లా అధికారులు స్కానింగ్ చేసి భద్రపరిచేవారు. మూల్యాంకనాన్ని మూడు రోజుల్లో పూర్తిచేయాలనే నిబంధన ఉండేది. దీంతో బోధించేందుకు ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉండేది. కొత్తగా ఇలా.. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి పరీక్షల విధానంలో నూతన సంస్కరణలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫార్మేటీవ్, సమ్మేటీవ్ పరీక్షల కోసం అసెస్మెంట్ బుక్లెట్ను ప్రవేశపెట్టింది. పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ టీష్లను ఇందులో పొందుపరిచాలి. టెస్ట్ సమయంలో విద్యార్థులకు అసెస్మెంట్ బుక్లెట్ను ఇచ్చి అందులో జవాబులు రాయించాలి. ఇందులో వచ్చిన మార్కులను ఓఎమ్మార్ షీట్లో పొందుపరచడంతో పాటు స్కానింగ్ను కూడా ఉపాధ్యాయులే చేయించాలి. ఈ బుక్లెట్లో విద్యార్థి ఆధార్, యూడైస్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్లనూ వీరే నమోదు చేయాలి. ఈ రకంగా ఏడాదిలో సబ్జెక్టుకు 6, 7 తరగతులకు 36, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 42 ఓ ఎమ్మార్ షీట్లుంటారయి. విద్యాసంవత్సరం ముగిసేంత వరకు జవాబు పత్రాలు, వారికొచ్చిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. వీటిని పాఠశాలల్లోనే భద్రపరచాలి. ఇంటికి తీసుకెళ్లకూడదు. పెరిగిన ఒత్తిడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్లో ఐఎమ్మెమ్మెస్, స్టూడెంట్స్ కిట్స్, మోగా పేటీఎంలను ఉంచారు. దీంతో పాటు పాఠశాలకు ప్రతి నెలా అందిన బియ్యం, బస్తాలపై క్యూర్ కోడ్ను స్కాన్ చేసి అందులోని నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో ప్రభుత్వం పునరాలోచించి అసెస్మెంట్ విధానానికి స్వస్థి పలికి పాత పద్ధతినే కొనసాగించాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘనాయకులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలకు కూటమి ప్రభుత్వం అందించిన అసెస్మెంట్ బుక్లెట్ అనాలోచిత నిర్ణయం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో అసెస్మెంట్ విధానం పిల్లలనే కాకుండా ఉపాధ్యాయులనూ పరిక్షించే విధంగా మారింది. దీని వల్ల బోధనకు వారం పాటు దూరంగా ఉండాల్సి వస్తొంది. ప్రాజెక్టుల పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారు. తరగతికి మించిన స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటోంది. ఇలాంటి పనులతో ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటున్నారు. – కిరణ్, ఏపీటీఎఫ్1938 చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, కార్వేటినగరం అసెస్మెంట్ విధానాన్ని తొలగించాలి అసెస్మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈ ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. బోధనేతర పనుల భారాన్ని మోపడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సిలబస్ను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూల్యాంకనంలో పాత విధానాన్నే కొనసాగించాలి. – చలపతిరావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా సీపీఎస్సీ అధ్యక్షుడు, కార్వేటినగరం -
తప్పుకదా ‘గురూ’!
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ పోస్టులను కై వసం చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైన కొలువులు కొట్టేదామని భావించారు. అయితే అధికారుల పరిశీలనలో అభ్యర్థులు సమర్పించిన వివరాలు, సర్టిఫికెట్లలో తప్పిదాలను గుర్తించారు. దీంతో పలువురు అభ్యర్థుల పై అనర్హత వేటు వేశారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో ఒకటికంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై న వారిని ఆప్షన్ మేరకు ఒక పోస్టుకు పరిమితం చేశారు. ఇతర స్థానాల్లో ఉన్న తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. బోగస్ సర్టిఫికెట్లతో మోసం మెగా డీఎస్సీలో కొందరు అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి మోసం చేసేందుకు ప్రయత్నించారు. దివ్యాంగ, అంధత్వ, చెవిటి, మూగ, ఇలా పలు రకాల వికలత్వంతో డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి తిరుపతి రుయా ఆస్పత్రిలో మరోమారు పున:పరిశీలన నిర్వహించగా గుట్టురట్టయ్యింది. పలువురు అభ్యర్థులు సమర్పించిన వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ అని అక్కడి వైద్యులు తేల్చారు. దీంతో అలాంటి వారందరినీ అనర్హులుగా ప్రకటించారు. మొత్తం 68 మంది పీహెచ్ కేటగిరీలో ఎంపికవగా వారిలో 56 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగిలిన 12 మందివి బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించారు. ఈడబ్ల్యూఎస్లో కూడా... ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లలో కూడా కొన్ని నకిలీవి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పలువురు అభ్యర్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు. అనుమానం, ఫిర్యాదులు అందిన అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అయితే ఆ వివరాలు బయటకు రానివ్వకుండా విద్యాశాఖ అధికారులు తొక్కిపెట్టారు. గుర్తించిన బోగస్ సర్టిఫికెట్ల సమగ్రవివరాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో పంపించారు. ఇప్పటికి మూడు విడతల్లో పరిశీలన ఇప్పటికీ డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మూడు విడతల్లో నిర్వహించారు. ఈనెల 6 నాటికి రెండు వి డతల్లో పరిశీలన ప్రక్రియ నిర్వహించగా తాజాగా శనివారం మూడో విడతలో ఎంపికై న అభ్యర్థుల జాబితా ను విడుదల చేశారు. ఆ అభ్యర్థుల జాబితా ప్రకారం ఆదివారం మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. -
పొలాల వద్దకు వెళ్లకండి
పాతపేటలోని నటరాజ పొలంలో విరిచేసిన డ్రిప్ పరికరాలు, రెడ్డెప్ప పొలంలో ధ్వంసమైన కొబ్బరి చెట్లుపులిచెర్ల(కల్లూరు): ఏనుగులు కల్లూరు రిజర్వు ఫారెస్టులో తిష్ట వేసి ఉన్నాయని, సమీప గ్రామాల రైతులు రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లరాదని అటవీ అధికారులు సూచించారు. ప్రస్తుతం పాతపేట సమీప అటవీ ప్రాంతంలో ఏనుగులు ఉండడంతో రైతులు ఎవ్వరూ ఆ చుట్టు పక్కల సంచరించరాదన్నారు. తెలుపు రంగు దుస్తులు వేసుకొని అసలు వెళ్లకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ఏనుగులు కనిపిస్తే తరమ కూడదని, అదిలించకూడదని సూచించారు. వెంటనే ఫారెస్టు సిబ్బంది 9550067503 నంబరుకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. పంటలు ధ్వంసం మండలంలోని పాతపేట పంచాయతీలో శనివారం తెల్లవారు జామున ఏనుగులు పంట పొలాలపై పడి సర్వనాశనం చేశాయి. వారం రోజులుగా ఏనుగుల మంద పాతపేట, చల్లావారిపల్లె పంచాయతీల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నట్టు పలువురు రైతులు వాపోతునానరు. పాతపేటకు చెందిన నటరాజ పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలు, రెడ్డెప్ప పొలంలో కొబ్బరి చెట్లను విరిచివేశాయన్నారు. -
మధ్యంతర బెయిల్పై చౌడేపల్లెలో సంబరాలు
చౌడేపల్లె: అక్రమ కేసుల నుంచి ఎంపీ పీవీ.మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, జెడ్పిటీసీ సభ్యుడు ఎన్.దామోదరరాజు, మండల పార్టీ కన్వీనర్ జి. నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ స్పష్టం చేశారు. శనివారం అక్రమ కేసులో నుంచి మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. బస్టాండులో బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కుట్రలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇకనైనా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, దాడులు ఆపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసే బుద్ధిని ప్రసాదించాలని దేవుడ్ని కోరారు. కార్యక్రమంలో మాజీ సింగిల్విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ శ్రీరాములు, కో–ఆప్షన్ మెంబరు సాధిక్బాషా, సర్పంచులు ఓబుల్రెడ్డి, రఘురామిరెడ్డి, భాగ్యవతి, షంషీర్, నాయకులు చెంగారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, షఫీ, వినోద్రెడ్డి, ఓబులేసు, కృష్ణప్ప, శంకరప్ప, హనుమంతురెడ్డి, అనుప్రియ, శ్రీనివాసులు, భాస్కర్, అల్తాఫ్, గిరి, భాస్కర్రెడ్డి, బాబు తదితరులున్నారు. -
జూనియర్ కాలేజీలో చోరీ
– ఇంటి దొంగల పనేనా? శాంతిపురం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ప్రిన్సిపల్ రూమును లక్ష్యంగా చేసుకుని శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. విద్యుత్ సరఫరాను ఆపేసి, గది బయట వేసిన నాలుగు తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. మొత్తం ఆరు బీరువాలను పగులగొట్టి రికార్డులను చిందరవందర చేశారు. తమకు కావాల్సిన రికార్డులను గుర్తుతెలియని వ్యక్తులు పట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం వస్తుందన్న కారణంగా కాలేజీ సిబ్బంది ఏ వస్తువునూ తాకకపోవడంతో ఏయే రికార్డులు చోరీ అయ్యాయనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే కాలేజీలో మొత్తం 16 సీసీ కెమెరాలు పెట్టించారు. శుక్రవారం రాత్రి చొరబడిన దుండగులు తమకు సంబంధించిన పుటేజీ దొరక్కుండా చేసేందుకు సీసీ టీవీలకు సంబంధించిన డీవీఆర్ను కూడా పట్టుకుపోయారు. కశాశాల నిర్వహణ లోపాలపై వచ్చిన ఫిర్యాదులతో ఈ నెల 9 శాఖాపరమైన విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విచారణలో తమ అక్రమాలు వెలుగు చూడకుండా చేసేందుకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారే రికార్డులను మాయం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై కాలేజీ సిబ్బంది ఫిర్యాదు మేరకు రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హరికథా కాలక్షేపం, కూచిపూడి, భరతనాట్యం, గీతాలాపన, పౌరాణిక నాటిక ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి. తిరుపతికి చెందిన కలవకుంట మునిసాయికృష్ణ బృందం అన్నమాచార్య సంకీర్తనలు, ప్రత్యేక భజన పాటలు, సంగీత కచేరితో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత బృందం గాయని వానిష్ట, తబలా మురళీకృష్ణ, కీబోర్డు కిరణ్కుమార్ పాల్గొన్నారు. కాగా అద్భుత ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. ప్రశంసా పత్రాలతో కళాకారులు -
స్వామివారి సేవలో ఐజీ
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం రాష్ట్ర పోలీసు శాఖ ఐజీ అడ్మిన్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. డీఈవో సాగర్బాబు పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
కార్యకర్తపై దాడి
పుంగనూరు: ఆలయపనులకు చేపట్టరాదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె బీసీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. గత ప్రభుత్వంలో గ్రామస్తుల వినతి మేరకు గంగమ్మ గుడి నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ముగింపు దశలో ఉండగా గిరిబాబు మరికొందరితో కలిసి మదనపల్లెలో అవసరమైన టైల్స్ వేసుకొని గుడివద్దకు చేరుకున్నాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత ఓబులేసు పనులు చేపట్టరాదని, టైల్స్ను వాహనంలో నుంచి దింపరాదని అడ్డుకున్నాడు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్త గిరిబాబు పై దౌర్జన్యంగా దాడికి తెగబడ్డాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం బాధితుడ్ని పోలీసులే పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వాతావరణమే ముఖ్యం
టమాటా పంటకు ముఖ్యంగా సూర్యరస్మి ఉండాలి. ఇటీవల వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం బాగా తగ్గింది. ఫలితంగా టమాటా తోటల్లో వైరస్ ప్రభావం పెరిగింది. పంట క్వాలిటీ దెబ్బతింటోంది. ఇలాంటి కాయలకు మార్కెట్లో మంచి ధర లభించదు. ముఖ్యంగా ఈ కాయలను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వీలుకాదు. ఎందుకంటే రెండురోజులకే ఇవి దెబ్బతింటాయి. అందుకే బయటి వ్యాపారులు ఇక్కడ కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. – డా.కోటేశ్వరావు, ఉద్యానశాఖ సహాయసంచాలకులు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టా ఈ దఫా వేరే రైతుపొలం కౌలుకు పెట్టుకుని రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మూడెకరాల్లో టమాటాను సాగుచేశా. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మొన్నటి వర్షాల కారణంగా కాయల నాణ్యత తగ్గింది. దీంతోపాట తెగుళ్లు శోకాయి. ఇప్పుడున్న ధలతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదు. కచ్చితంగా టమాటా రైతులు అప్పులపాలే. – గోవిందురెడ్డి, నాగమంగళం, పలమనేరు మండలం -
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: నేడు సెప్టెంబరు7న చంద్రగ్రహణం సందర్భంగా నేడు శ్రీవారి ఆలయం మూసివెయనున్న టిటిడి. సెప్టెంబరు 7 సాయంత్రం 3:30 నుండి 8 వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్ 8న సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. ⇒ గ్రహణానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ⇒ తిరుమలకు వచ్చే భక్తులు గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని రావాలని టిటిడి సూచన⇒ గ్రహణం సమయంలో అన్నప్రసాద వితరణ రద్దుచంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దుసెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది.అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. -
రేపు చంద్రగహణం
కాణిపాకం: చంద్రగ్రహణ కారణంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని ఆదివారం రాత్రి మూసివేయనున్నట్టు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. గ్రహణం రాత్రి 9.57 నుంచి మరసటి రోజు వేకువజామున 1.26 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఇదే సమయానికి ప్రధాన ఆలయంతో పాటు మణికంఠేశ్వరస్వామి ఆలయం, శ్రీవరదరాజులస్వామి ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, గ్రహణశాంతి, అభిషేకం అనంతరం ఉదయం 6 గంటలకు భక్తుల దర్శన సేవ ప్రారంభమవుతుందన్నారు. -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడవ రోజైన శుక్రవారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. అందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి పలు రకాల అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి.. దర్జాగా కబ్జా
రాజకీయ నాయకులు, అధికారుల అండ కొంత ఉండాలే కాని ఆక్రమణదారులకు అంతే ఉండదు. ఇందుకు నిదర్శనంగా పుత్తూరు పట్టణం నడిబొడ్డులో కోట్లు విలువ చేసే సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమిని ఓ ప్రబుద్ధుడు దర్జాగా కబ్జా చేస్తున్నాడు. గత వారం రోజులుగా ముళ్ల కంపలను తొలగించి, తీర్చిన సదరు వ్యక్తి నేడు దర్జాగా దున్నడం మొదలు పెట్టాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు: ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన విలువైన ప్రభుత్వ భూములు పరులపాలవుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్థానిక బైపాస్ రోడ్డులో గోవిందపాళెం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 282/4లో 1.76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలోని ఈ భూమికి ఆనుకొనే ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఓ ప్రైవేటు కల్యాణ మండపంతోపాటు వివిధ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి చెందిన పట్టణ నడిబొడ్డున కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి పరుల పాలవుతుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తున్నా.. గతంలోనూ ఇదే భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకొన్నారు. దీనిపై సదరు వ్యక్తులకు రెవెన్యూ శాఖ మధ్య డబ్ల్యూపీ నెంబర్ 30275/2021 కింద హైకోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇందులో ఎవరూ ప్రవేశించరాదంటూ రెవెన్యూ శాఖ ఓ బోర్డును రాయించింది. అయితే సదరు బోర్డును నేటి వరకు సదరు భూమిలో ఏర్పాటు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగేళ్లు గడిచే సరికి మళ్లీ సదరు వ్యక్తులో, ఇతరులో భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. విలువైన భూమిని అధికారులు పరిరక్షించి, ప్రజా అవసరాలకు వినియోగించాల్సి ఉంది. -
క్రికెట్ ఆడడానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
నగరి : సెలవు రోజున క్రికెట్ ఆడడానికి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ ఘటన మున్సిపల్ పరిధి కేవీపీఆర్ పేటలోని నేత కుటుంబంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నేత కార్మికుడు ఆరుముగం కుమారుడు యువరాజ్ (14) నగరి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గుండ్రాజుకుప్పం దళితవాడ సమీపంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. ఆట ముగిసిన సమయంలో మైదానానికి పక్కనే ఉన్న చెరువులో నీటిని చూసి అందులో ఈతకు దిగాడు. ఈత కొడుతూ నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. కాగా ఆరుముగంకు ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమారుడు యువరాజ్ ఒక్కడే కావడంతో ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 75 బస్తాల బియ్యం స్వాధీనం వడమాలపేట (పుత్తూరు): ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, 75 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. అక్రమ రవాణా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి వడమాలపేట మండలం, తడుకు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఏపీ 39 డబ్ల్యూడీ 5318 నెంబరు గల బొలేరో లగేజ్ వెహికల్ను ఆపి తనిఖీ చేయగా అందులో 50 కేజీల బరువు గల 75 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలం, బీరకుప్పం గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.1.35 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 8న ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 8వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, డీ, బీ, ఎం, ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 95338 89902, 79898 10194 సంప్రదించాలని సూచించారు. -
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
చిత్తూరు కలెక్టరేట్ : సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షాశాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఉపాధ్యాయులేనని, వారిని పట్టుదలతో సన్మార్గంలో నడిపించాలన్నారు. అనంతరం మేయర్ అముద, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు వినూత్న బోధనలను అమలు చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలందిస్తున్న 69 మంది టీచర్లకు ప్రశంసాపత్రాలను అందించి దుశ్శాలువతో సత్కరించారు. జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఏపీఎస్డబ్ల్యూఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ పద్మజ, డీవైఈవోలు ఇందిరా, లోకేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అనధికారికంగా 15 మందికి అవార్డులు ఉత్తమ సేవలందిస్తున్న టీచర్లకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించేందుకు ముందస్తుగా పేర్లను విద్యాశాఖ అధికారులు గుర్తించి కలెక్టర్ ఆమోదం పొందుతారు. అలా ఆమోదం పొందిన టీచర్లకు మాత్రమే గురుపూజోత్సవం రోజున ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరిస్తారు. అయితే శుక్రవారం జెడ్పీలో నిర్వహించిన గురుపూజోత్సవంలో 15 మందికి అనధికారికంగా అవార్డులు అందజేశారు. అది కూడా కూటమి పార్టీకి అనుకూలమైన వారికి అవార్డులు అందజేసి సత్కరించడం విమర్శలకు తావిచ్చింది. అనధికారిక అవార్డులు ఇప్పించేందుకు టీడీపీ అనుబంధ సంస్థ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు వ్యవహరించిన తీరు పై టీచర్లు విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రసంగం గురుపూజోత్సవం వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజకీయ ప్రసంగం చేయడం పట్ల విమర్శలు వెలువెత్తాయి. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేసిందేమి లేకపోయినా గత ప్రభుత్వాన్ని కించపరుస్తూ ప్రసగించడం విమర్శలకు తావిచ్చింది. అదే విధంగా అనధికారికంగా కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులను సత్కరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జ్యోతిప్రజ్వళన చేస్తున్న డీఈవో వరలక్ష్మి, గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల టీచర్లు తిరుమల, చౌడేపల్లి, ఎంఈవో–2 బాల చైతన్య, గ్రేడ్–2 హెచ్ఎం, జెడ్పీ కలుపల్లి, గంగవరంసుబ్బరామయ్య, గ్రేడ్–2 హెచ్ఎం, జెడ్పీ జీడీనెల్లూరు -
శ్రీసిటీలో ‘స్మైల్ ఎకో’ ప్రారంభం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు (శానిటరీ న్యాప్కిన్స్) తయారు చేసే ‘స్మైల్ ఎకో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన పరిశ్రమ శుక్రవారం శ్రీసిటీలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీఎస్ఎన్ఎల్ మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, పద్మశ్రీ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున పరుచూరి సమక్షంలో లాంఛనంగా పరిశ్రమను ప్రారంభించారు. రూ.20 కోట్ల పెట్టుబడితో స్థాపించబడిన ఈ ప్లాంట్ ఏడాదికి 259.2 మిలియన్ల శానిటరీ న్యాప్కిన్లను తయారు చేస్తుందన్నారు. దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దీని ఉత్పత్తులు దేశీయ మార్కెట్తో పాటు విదేశాలకు ఎగుమతులు చేస్తారన్నారు. నాడు ఉద్యోగి, నేడు పారిశ్రామికవేత్త స్థానికుడైన మల్లికార్జున్ నాడు శ్రీసిటీ ఉద్యోగి కాగా నేడు పారిశ్రామికవేత్తగా మారి ‘స్మైల్ ఎకో’ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎండీ మల్లికార్జునను ఈ సందర్భంగా డాక్టర్ సన్నారెడ్డి అభినందించారు. దేశ టెలికాం సంస్కరణలలో ప్రముఖ పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి హనుమాన్ చౌదరి చేత ఈ పరిశ్రమ ప్రారంభం కావడం అత్యంత శుభపరిణామం అన్నారు. అనువైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థతో 240 పైచిలుకు పరిశ్రమల స్థాపనతో పాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక ప్రగతికి చొరవ చూపుతున్న శ్రీసిటీ యాజమాన్య కృషిని డాక్టర్ హనుమాన్ చౌదరి ప్రశంసించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీసిటీలోని పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సొసైటీని కొనసాగించాలి
గత 40 ఏళ్లుగా సొసైటీ ద్వారా విద్యుత్ స్టోర్స్లో హమాలీలు పనిచేస్తున్నారు. హమాలీ సొసైటీకి పనులు ఇస్తుండడంతో ఉన్న కార్మికులే కొనసాగుతున్నారు. ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్కు పనులు ఇవ్వడం అన్యాయం. దీంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతాయి. – ఆర్యోగదాస్, రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ స్టోర్స్ హమాలీ యూనియన్ అన్యాయం కార్మికుల కష్టాలను తీరుస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. తీరా వారి కడుపు కొట్టాలని యత్నిస్తోంది. ఎక్కడో అనంతపురంలో అమలైన విధానాన్ని చిత్తూరు జిల్లాలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. వారికి వసతులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేయాలని యత్నించడం అన్యాయం. – గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సీఐటీయూ ●చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్టోర్స్ నుంచి విద్యుత్ పరికరాలు సరఫరా చేస్తున్నారు. చిన్న బోల్టు నుంచి సబ్స్టేషన్లో బిగించే పరికరాల వరకు ఈ స్టోర్స్ నుంచే తీసుకెళ్తుంటారు. ఇక్కడ 15 మంది హమాలీలు 40 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు వారిని తొలగించి కొత్తగా కాంట్రాక్ట్కు పనులు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. దీనిపై హమాలీ కార్మికులు రగిలిపోతున్నారు. తమ పొట్టకొట్టొద్దు బాబూ అంటూ గళం ఇప్పుతున్నారు. కూలీల్లో కోత హమాలీలు వీటి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. తొలుత కూలి విధానంలో విద్యుత్ పరికరాల లోడింగ్, ఆన్లోడింగ్ చేసేవారు. 2008 నుంచి సంస్థలో పీస్రేటు సిస్టమ్ అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్న హమాలీ సొసైటీకే కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పనులను సొసైటీకి కాకుండా విద్యుత్ కాంట్రాక్టర్కు కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. కార్మికుడు పీస్ వర్క్ కింద వస్తువులను బట్టి రూ.0.25 పైసల నుంచి రూ.1200 వరకు ట్రాన్స్కో చెల్లిస్తోంది. రోజూ కార్మికుడు సరాసరి రూ.500–1,500 వరకు సంపాదిస్తున్నారు. సైడ్ హారం పరికరానికి రూ.2–6, తుక్కు కేజీకు రూ.0.70 పైసలు నుంచి ప్రారంభమవుతుంది. 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను వాహనంలో పెడితే రూ.230, 63 కేవీ అయితే రూ.375, అదే సబ్స్టేషన్లో పెట్టే వీసీబీ(బ్రేకర్స్)కు రూ.1,286 ఇస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తే వీరందరూ రోడ్డున పడాల్సిందే.విద్యుత్ పరికరాలు విద్యుత్ పరికరాలు ఎత్తిపెడుతున్న కార్మికులు అనంతపురంలో అమలు చేశారనీ..! అనేక సంవత్సరాలుగా ట్రాన్స్కో స్టోర్స్లో పీసు రేటు కింద హమాలీ సొసైటీకి పనులను ఇస్తున్నారు. ఇప్పుడు కార్మికుల కష్టం పై కూటమి నాయకులు కన్నేశారు. ఇందుకు బీజంగా అనంతపురం జిల్లాలో ఆ సొసైటీకి కాకుండా కాంట్రాక్టర్కు అప్పగించారు. ఆ విధానాన్ని చిత్తూరు జిల్లాలో కూడా అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,834 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
వసతులు కల్పించాలి
కార్మికులకు వసతులు కల్పించాలి. ప్రస్తుతం ఇస్తున్న సదుపాయాలను కాలానుగుణంగా మార్పు చేయాలి. ఈఎస్ఐ, పీఎఫ్లను రెగ్యూలర్ వాచ్మెన్లతో సమానంగా ఇవ్వాలి. ఈపీఎస్పీడీసీఎల్తో సమానంగా ఏరియా అలవెన్స్లు ఇవ్వాలి. – చిట్టిబాబు,హమాలీ రోడ్డున పడతాం కాంట్రాక్టర్కు పనులు ఇస్తే మేమంతా రోడ్డును పడతాం. ఎందుకంటే వారు పీస్ రేటు కాకుండా నెలవారీ వేతనాలు ఇస్తారు. సెలవులు పెట్టినా, ఆలస్యంగా వచ్చినా వేతనాలు కట్ చేస్తారు. దీంతో నెలకు రూ.20 వేల వరకు ఆదాయం కోల్పోతాం. మమ్మల్ని తీసేసి కొత్తవారిని తక్కువ వేతనాలకు పనిలో పెట్టుకుంటారు. – ఆనంద్, హమాలీ -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల కావాలని పూజలు
పెళ్లకూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి త్వరగా విడుదల కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి స్వగ్రామమైన పుల్లూరులో శుక్రవారం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాల్లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్రెడ్డి త్వరలో విడుదల కావాలని గ్రామ దేవతకు పూజలు చేసినట్లు చెప్పారు. అమ్మవారికి కుంకుమార్చన, పుష్పయాగం చేసి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పూజలు చేశారు. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేకుండా ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి బెయిల్ రాకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్రెడ్డి, మణినాయుడు, వెంకటాచలం, వీరాస్వామిరెడ్డి, రమణయ్య, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం.. బూట్లతో స్వామివారికి పట్టువస్త్రాలు
సాక్షి, టాస్క్ఫోర్స్: శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు ధరించి స్వామి వారికి పట్టు వ్రస్తాలు తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగరాజపురం మండలంలోని డీకే మర్రిపల్లి దళితవాడలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీవేంకటేశ్వరస్వామి భజన మందిరం నిర్మించారు.ఆలయంలో గురువారం కుంభాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు వేసుకునే పట్టువ్రస్తాలు తీసుకొచ్చారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన బూట్లు ధరించే పూర్ణకుంభానికి అక్షింతలు వేశారు. ఎమ్మెల్యే తీరుపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలక్షన్ జరగదని, సెలక్షన్ మాత్రమేనని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ వివాదాస్పద వ్యాఖ్యలతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. గురువారం జిల్లాలోని పెనుమూరులో నిర్వహించిన మార్కెటింగ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.‘త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే అభ్యర్థులను సెలక్షన్ చేద్దాం. ఎలక్షన్ ఉండదు. ఎన్నికలు జరిపించాలన్న చోట అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ వేయకుండా చూడండి. అప్పుడు ఏకగ్రీవంగా మనవాళ్లే ఎన్నికవుతారు. ఏం జరిగినా మీ వెనుక మేమున్నాం. టీడీపీ అభ్యర్థులను భయపెడితే కాళ్లు, చేతులు తీసేందుకు సిద్ధంగా ఉండాలి. టీడీపీలో కొందరు వైఎస్సార్సీపీకి కోవర్టులుగా ఉన్నారు. వారిని ఒకచోట చేరిస్తే ఎండ్రకాయల్లా కొట్టుకుంటారు. అందుకే ఒక్కొక్కరిని ఏరి ఒక్కొక్క బొక్కలో పెడుతున్నా’ అని వ్యాఖ్యానించారు. -
బాల్య వివాహాలు నివారిద్దాం
పలమనేరు: బాల్య వివాహాల నివారణపై క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖలు దృష్టి సారించాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దాసరి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బాల్యవివాహాల నివారణ, లైంగిక నేరాల చట్టాలపై వివిధ శాఖలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల విషయంలో అంగన్వాడీ వర్కర్ల పాత్ర చాలా కీలకమన్నారు. గ్రామ స్థాయిలో దీనిపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీఓ భవాని మాట్లాడుతూ బాల్య వివాహాలతో జరిగే నష్టాలను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వరి, లీగల్ ఆఫీసర్ వెంకటేశులు, శివశంకర్, చైల్డ్ హెల్ఫేర్ కో–ఆర్డినేటర్ నాగమణి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో జయరాముడు, పలువురు సీఐలు, ఎస్ఐలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
‘ముందే’ కూసింది!
మూడు నెలల ముందే సర్పంచ్ ఎన్నికలు చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్శాఖకు ఎస్ఈసీ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల పై రాష్ట్ర ప్రభుత్వం సైతం ముందుస్తుగా వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు జిల్లా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగియనుంది. కానీ మూడు నెలల ముందే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకు కసరత్తును ప్రారంభించింది. సజావుగా సాగేనా? క్షేత్ర స్థాయిలో రెడ్ బుక్ పేరుతో ఏకగ్రీవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పాలనలో ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎలా బెదిరింపులకు పాల్పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. దానికితోడు టీడీపీ, జనసేన, బీజేపీలోనూ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఏ పార్టీ మద్దతుదారులకు సర్పంచ్గా అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ అక్టోబరు 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలి. 16 నుంచి నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబరు 1–15 లోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తిచేయాలి. 16–30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తిచేయాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి. జిల్లా సమాచారంపంచాయతీలు 696 వార్డులు 6,220 గ్రామీణ జనాభా 14,63,661 మంది ఓటర్లు 10,91,739 మంది -
పలుకుబడి ఉంటేనే‘సార్’!
గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం గురుపూజోత్సవం రోజున అందజేసే అవార్డులకు సైతం రాజకీయ రంగు పులిమింది. పలుకబడి ఉన్న ఉపాధ్యాయులనే రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కాల్ చేసి మరీ ‘మీరు వైఎస్సార్సీపీ సానుభూతిపరులా..’ అంటూ విచారించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చిత్తూరు కలెక్టరేట్ : గురువు స్థానానికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తమ బోధన చేస్తున్న టీచర్లను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తుండడం రివాజుగా మారుతోంది. అయితే ఇటువంటి గొప్ప సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులమడం విమర్శలకు తావిస్తోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారా? జిల్లా వ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రతిపాదనల రూపంలో సిద్ధం చేసి అందజేశారు. దరఖాస్తులు చేసుకున్న టీచర్లందర్నీ జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ ఇంటర్వ్యూలు చేపట్టింది. ఇందులో ప్రతిభ చాటిన టీచర్లు పలువురు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టేశారు. రాజకీయ పలుకుబడి, రాజకీయ సిఫార్సులున్న వారిని రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేసి.. మిగిలిన టీచర్లను అవమానపరిచారు. ఇష్టానుసారంగా ఉత్తర్వులు రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ల అవార్డులకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారంగా జారీచేశారు. మొదట్లో 1:1 ప్రాతిపదకన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆ తర్వాత 1:2 ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాలన్నారు. అదే విధంగా లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోని టీచర్లను సైతం ఇంటర్వ్యూలకు పిలిపించుకున్నారు. అవార్డులు పొందొచ్చనే ఆశతో ఉత్తమ ప్రతిపాదనలతో జిల్లా నుంచి పలువురు టీచర్లు రాష్ట్ర స్థాయి ఇంటర్వ్యూలకు వెళ్లారు. అయితే అటువంటి వారందరినీ పక్కన పెట్టి సిఫార్సులున్న వారికి అవార్డులకు ఎంపిక చేశారని దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విధానం అమలు చేయలేదని వాపోతున్నారు. ఉపాధ్యాయ అవార్డులకు రాజకీయ రంగు