Chittoor
-
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
మూల్యాంకన షెడ్యూల్ ఇలా.. చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఆదివారం నుంచి చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా మొదలవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ప్రధాన ద్వారంతో పాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. మూల్యాంకనంలో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మూల్యాంకనం చేయాలని అధికారులు సూచించారు. 20 రోజులపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి 1,67,700 పేపర్లు జిల్లాకు విచ్చేశాయి. ఆ పేపర్లను జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో పకడ్బందీ బందోబస్తు నడుమ భద్రపరిచారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 1,67,700 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,60,925 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,60,925 కోడింగ్ పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం రెండు విడతల్లో 20 రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో మూల్యాంకనం నిర్వహించనున్నారు. మొదటి విడత ఉదయం 10 నుంచి 1 గంట వరకు, 2వ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ ఒక పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. సిబ్బంది నియామకం మూల్యాంకనం కోసం 480 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 60 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 160 స్క్రూటినీ నైజర్లు, 15 మంది ఏసీఈలను నియమించినట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది నియామకం పూర్తి మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినర్ల నియామక ఉత్తర్వులను బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్గా డీఐఈవో రఘుపతి వ్యవహరిస్తారు. జనరల్–1 గా పీసీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అబ్ధుల్ మజీద్, జనరల్–2, సీనీట్–1, సీనీట్–2గా పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు వ్యవహరిస్తారు. వీరితో పాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, సబ్జెక్టు ఎక్స్పర్ట్స్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్లు ఎగ్జామినర్లు, స్క్రూటినీ నైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు సైతం ఆయా కళాశాలలకు చేరాయి. నేటి నుంచి ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం విడత మొదలయ్యే తేదీ దిద్దనున్న సబ్జెక్ట్ వివరాలు మొదటి మార్చి 22వ తేదీ నుంచి తెలుగు, హిందీ, హిస్టరీ, ఎకనామిక్స్, గణితం, సంస్కృతం రెండవ మార్చి 25వ తేదీ నుంచి బాటనీ, జువాలజీ, కామర్స్, ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ -
విద్యార్థులూ దరఖాస్తు చేసుకోండి
ముగియనున్న గడువు తిరుపతి సిటీ: పలు వర్సిటీల్లో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే 2026కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు ప్రవేశ పరీక్షలకు ఈనెల చివరితో దరఖాస్తులకు గుడువు తేదీ ముగియనుంది. విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించి సంబంధిత పీజీ, యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రవేశ పరీక్షలకు తుది గడువుల వివరాలిలా ఉన్నాయి. ప్రవేశ పరీక్ష చివరి తేదీ ఏపీ ఐసెట్ మార్చి 23 ఏపీ ఎడ్సెట్ మార్చి 26 ఏపీ పీజీసెట్ మార్చి 28 ఏపీ ఈఏఎమ్సెట్ మార్చి 24 ఏపీ లాసెట్ జరిమానాతో మార్చి 24 ఏపీ పాలీసెట్ ఏప్రిల్ 4 -
టమాట గుజ్జు.. ఫ్యాక్టరీల మోజు
కాణిపాకం: టమాట గుజ్జుపై ఫ్యాక్టరీలు మొగ్గు చూపుతున్నాయి. పది ఫ్యాక్టరీలు టమాట పేస్ట్ తయారీలో బిజీగా ఉంటున్నాయి. రోజువారీగా 1500 నుంచి 1700 టన్నులు సేకరిస్తున్నాయి. మరో 2 వేల టన్నుల కాయలొచ్చినా పేస్ట్ తయారీకి సిద్ధంగా ఉన్నాయి. మార్కెటింగ్ సులభం కావడంతో పేస్ట్ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. టమాట పంట విస్తీర్ణం పెరగడంతో మార్కెట్లో ధరలు పడిపోతుండగా, పళ్లగుజ్జు పరిశ్రమలు మాత్రం ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్నాయి. సాధారణంగా మామిడి సీజనన్ కు మాత్రమే పరిమితమయ్యే ఈ యూనిట్లు ఇప్పుడు టమాట పేస్ట్ తయారీలోకి అడుగులు వేస్తున్నాయి. 6 వేల ఎకరాలో సాగు జిల్లాలో 6 వేల ఎకరాల్లో టమాట సాగు ఉంది. జనవరి నుంచి ప్రారంభమైన టమాట సాగు ఇప్పటి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతానికి 3 వేల ఎకరాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 5 వేల మంది రైతులు ఈ పంటపై ఆధారపడి ఉన్నారు. పలమనేరు, చౌడేపల్లి, సోమల, సదుం, శాంతిపురం, వి.కోట, గంగవరం, కుప్పం, గుడిపల్లి, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి వంటి మండలాల్లో టమాట సాగు అధికంగా ఉంది. మొదటి రకం టమాటను రైతులు కోతకు వచ్చిన స్థానికంగా ఉండే మార్కెట్కు తరలించి అమ్మకానికి పెడుతుంటారు. కొనుగోలు ఇలా... పళ్లగుజ్జు పరిశ్రమలు జిల్లాలో ప్రస్తుతం 10 ఫ్యాక్టరీలు పేస్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు ముఖ్యంగా రెండో రకం టమాటలను కిలోకు సుమారు రూ.4 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. పలమనేరుతో పాటు పీలేరు, కలకడ, కలికిరి, ములకల చెరువు నుంచి టమాటను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ రోజుకు 250 నుంచి 300 టన్నుల వరకు టమాటలను ప్రాసెస్ చేస్తున్నాయి. గుజ్జు తయారీ లెక్కలు ఇలా.... ఫ్యాక్టరీలు కిలోకు రూ.4కు కొనుగోలు చేసిన టమాటతో తయారైన పేస్ట్ను సాస్ తయారీ కంపెనీలు కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ పేస్ట్ను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా 18 నెలల వరకు నిల్వ ఉంచే సామర్థ్యం ఉండటం పరిశ్రమలకు అదనపు లాభంగా మారింది. మామిడి సీజన్ లేనప్పుడు సాధారణంగా మే నుంచి ఆగస్టు వరకు మామిడి గుజ్జు తయారీలో బిజీగా ఉండే ఫ్యాక్టరీలు, ఆ మధ్యలో ఖాళీగా ఉండే సమయాన్ని ఇప్పుడు టమాట పేస్ట్తో భర్తీ చేస్తున్నాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి మామిడి సీజన్ ప్రారంభం కానుండగా, కేరళ నుంచి కాదర్ కాయలు, అలాగే విజయవాడ ప్రాంతం నుంచి మామిడి సరఫరా ప్రారంభమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యంత్రాలకు పని చెబుతున్నాం... మ్యాంగో సీజన్ తర్వాత ఖాళీగానే ఉంటాం. ఆ సమయంలో టమాట పేస్ట్ చేస్తున్నాం. జిల్లాలో 10 ఫ్యాక్టరీల వరకు టమాట పేస్ట్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పేస్ట్ అమ్ముడుబోతున్నాయి. సాస్ కంపెనీలు కొనేస్తున్నాయి. మార్కెటింగ్లో పెద్దగా ఇబ్బంది లేదు. మామిడి సీజన్కు టమాటను ఆపేస్తాం. – రఘురాం చౌదరి , పళ్ల గుజ్జు పరిశ్రమల జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు రోజువారీగా రూ.500 టన్నులకు పైగా దిగుబడి జిల్లాలో రోజువారీగా సుమారు 500 టన్నుల నుంచి 700 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. వీటిలో 200 టన్నుల కాయలు జిల్లా వ్యాప్తంగా అమ్మకానికి వెళుతుంటాయి. మిగిలిన టమాట మొత్తం మార్కెట్ల నుంచి తమిళనాడులోని చైన్నె, కోయంబత్తూరు, సేలం, విజయవాడ, కలకత్తా వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. రోజుకు సుమారు 200 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయి. మొదటి రకం టమాట ధర ప్రస్తుతం కిలో రూ.8 నుంచి రూ.12 మధ్యే ఉంది. రెండో రకం టమాటకు మాత్రం మార్కెట్లో కొనుగోలు చేసేవారు కరవుతున్నారు. అయితే ఈ టమాటను పలు పళ్ల గుజ్జు పరిశ్రమలు అందిపుచ్చుకుంటున్నాయి. -
టీడీపీకి దళిత నేత రాజీనామా
వెదురుకుప్పం : దళితులపై చిన్నచూపుతో అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్న టీడీపీలో ఇమడలేకున్నాం...కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా దళితుల సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా పావుగా వాడుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగి న బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు కొత్తపల్లె శంకర్ ప్రకటించారు. ఈమేరకు శనివారం వెదురుకుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలను విడగొట్టి బలిపశువులు చేసినట్లు ధ్వజమెత్తారు. రెండు సంవత్సరాల కూటమి పాలనలో దళితుల సంక్షేమం కోసం వారి అబివృద్ధి కోసం ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేపట్టకపోవ డం దారుణమన్నారు. సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో వాటిని ఏ ఎస్సీ కాలనీలో ఖర్చు చేశారో తెలియదన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్ పోస్టులను భర్తీ చేయ కపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, వివక్షకు నిదర్శనమన్నారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు దళితుల కు న్యాయం చేస్తారని భావించి కష్టపడి పనిచేసినట్లు గుర్తు చేశారు. అయితే దళితుల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు దళితులందరూ ఏకమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీలను ఎంతో హేళనగా చూస్తూ ఎన్నో అవమా నాలకు గురిచేస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అందరూ ఏకమవుతున్నట్లు చెప్పారు. టీడీపీలో ఉన్న దళితులందరూ ఎందుకు ఓటేశామా అంటూ వ్యతిరేక భావాలను వ్యక్త పరుస్తున్నట్లు చెప్పారు. దళిత వ్యతిరేక ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎస్సీల సంక్షేమాన్ని కోరే, అంబేడ్కర్ ఆశయ సాధ న కోసం నడిచేవాళ్లందరూ కూటమి ప్రభుత్వాన్ని వీడనున్నట్లు చెప్పారు. -
అలసత్వం వహిస్తే చర్యలు
జిల్లాలో 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధుల కు కేటాయించిన సిబ్బంది తప్పక హాజ రు కావాలి. విధులకు కేటాయించిన లెక్చరర్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి మూల్యాంకన విధులకు పంపాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించడం జరగదు. మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్ట్రీమింగ్ చేయించాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. – రఘుపతి, డీఐఈవో, ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్ -
● భక్తిశ్రద్ధలతో రంజాన్ సంబరాలు ● నమాజ్లతో పులకించిన ఈద్గా, దర్గాలు
ఈద్ ముబారక్ ! నెల‘రోజా’లు భక్తిశ్రద్ధలతో సాగిన దీక్షలు శుక్రవారం నెలవంక తొంగి చూడడంతో జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఈద్గాలకు ర్యాలీగా వెళ్లి సామూహికంగా నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పండుగపూట బంధుమిత్రులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు తోచిన ధాన ధర్మాలు చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. – పలమనేరు -
పరిష్కారం ఏదీ?
ప్రశ్నలతోనే సరి.. చిత్తూరు కార్పొరేషన్: సభ్యులంటే మండల స్థాయిలోనూ అధికారులకు లోకువే, జిల్లా స్థాయిలో అధికారులు కనీసం సమావేశానికి హాజరు కాకుండా మరింత చులకనగా చూస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబఽంధిత అధికారుల వివరణ కోరుతూ నోటీసుల ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడును ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ భారతి, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్య రానివ్వద్దు పెద్దపంజాణిలో 2 హెల్త్సెంటర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలన్నారు. ప్రమాదకర లైన్లను మార్పు చేయాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగినా బిల్లులు విడుదల కావడం లేదన్నారు. ఎర్రవారిపాళ్యం ఆస్పత్రిలో రూమ్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తంబలపల్లె, ములకలచెరువుల నందు నూతన పీహెచ్సీ భవనాలు నిర్మించాలన్నారు. అక్రమాలు అరికట్టాలని.. కుప్పంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని జెడ్పీటీసీ సభ్యుడు శరవణ వాపోయారు. రేషన్ దుకాణంను డీలర్లు సూపర్ మార్కెట్గా మార్చారని, వేల రూపాయల సరుకులు కొంటే గానీ పేదలకు బియ్యం ఇవ్వడం లేదని సమస్యను తెలిపారు. ఆ సరుకులు కొనాలనే నిబంధన ఏమన్నా ఉందా అని ప్రశ్నించారు. టన్నుల కొద్దీ బియ్యంను అక్రమంగా విక్రయిస్తున్నరని విమర్శించారు. జిల్లా అధికారులు తనిఖీ చేయకపోవడంతో అక్రమాలు పెరుగుతున్నాయన్నారు. ఎంఈఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆ స్థానంలో మరొకరిని నియమించాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది లేమితో రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. గుడుపల్లె మండలంలోని రెడ్డిపాళెంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ మార్చాలన్నారు. దొంగతనం అయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ సర్వీసులు తమ డివిజన్ పరిధిలో వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయన్నారు. కుప్పం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు గుంతలు పడి అధ్వాన్నంగా ఉందన్నారు. పేరుకుపోయిన రూ.కోట్ల బకాయి బిల్లులు ఎన్ఆర్జీఎస్ పథకం కింద చేసిన పనుల బకాయిలు రూ.కోట్లు పేరుకుపోయాయని వడమాలపేట, ఎర్రవారిపాళ్యం జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్రెడ్డి, కరుణాకర్రెడ్డి ప్రశ్నించారు. గత పాలనలో జరిగిన పనులకు సైతం బిల్లులు క్లోజ్ చేశారని, కానీ డబ్బులు చెల్లించలేదన్నారు. పంచాయతీ పరంగా కొత్త పనుల మంజూరు కావడం లేదన్నారు. గతంలో జరిగిన పనులకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మండల గ్రాంట్స్ నందు గ్రావెల్ తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నారని అలాగే జెడ్పీ గ్రాంట్స్ పరంగా ఇవ్వాలని నారాయణవనం జెడ్పీటీసీ సభ్యుడు సుమన్ డిమాండ్ చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. నక్కలచెరువు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, పనుల పూర్తికి నిధులు ఇవ్వడం లేదన్నారు. సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్లు అసంపూర్తిగా ఉన్నాయని వాటి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని రామసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శివాలయానికి వెళ్లేదారిలో రూ.2 కోట్లతో గత పాలనలో రోడ్డు పనులు మంజూరు అయ్యాయన్నారు. రూ.70 లక్షల పనులు జరిగాయని, మిగిలినవి మధ్యలోనే ఆపివేశారన్నారు. చేసిన పనుల నందు 20 శాతం తక్కువ బిల్లులు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేస్తున్నారని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు ఆరోపించారు. ఆయనను మార్చాలని పుత్తూరు మండల సమావేశంలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఏఈని తక్షణం మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్డీఆర్ పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు. సదుం మండలంలో కాలువలు నిర్మించకుండా రోడ్డు వేస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి తెలిపారు. చౌడేపల్లె–సోమల–సదుం ఆర్అండ్బీ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చౌడేపల్లె జెడ్పీటీసీ సభ్యుడు దామోదారరాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
టమాట గుజ్జు.. ఫ్యాక్టరీల మోజు
టమాట గుజ్జుతో సాస్ చేసే పనుల్లో పరిశ్రమలు బిజీగా ఉంటున్నాయి. ధరలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. 24న అథ్లెటిక్స్ పోటీలు చిత్తూరు కలెక్టరేట్: శాప్ లీగ్లో భాగంగా ఈనెల 24న చిత్తూరులోని డీఎస్ఏ స్టేడియంలో మాస్టర్ వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ ఉదయభాస్కర్ తెలిపారు. 100, 400, 800, 1,500 మీటర్ల పరుగు పందెం, లాంగ్జంప్, డిస్కస్త్రో, షాట్ఫుట్, హైజంప్, జావెలిన్త్రో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 35–45 సంవత్సరాలలోపు పురుషులు/మహిళలు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల వారు https:// sports. ap.gov.in అనే వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలు ఈనెల 30, 31 తేదీల్లో గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. చిత్తూరులో చేనేత–హస్తకళా మేళా చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత–హస్తకళా మేళా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు వినియోగదారులను మెప్పిస్తున్నాయి. మేళాలో సిల్క్, కాటన్తో తయారైన పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఎంబ్రాయిడరీ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గద్వాల్, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ వంటి ప్రసిద్ధ చేనేత ప్రాంతాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి. ఇక బెడ్షీట్లు, బెడ్కవర్లు, హ్యాండ్క్రాఫ్ట్ వస్తువులు, కాటన్ షర్టింగ్ వంటి అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. ఈ మేళా ద్వారా జిల్లా ప్రజలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తులు అందించడంతో పాటు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మేనేజర్ సంజెమ్ జెయిన్ తెలిపారు. -
డీఎల్ఏటీఓకు రాష్ట్ర స్థాయి అవార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): టీబీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీటీసీసీఓఎన్–2026 (ఏపీ టీబీ చెస్ట్ కాన్ఫరెన్స్) కార్యక్రమంలో జిల్లా డీఎల్ఏటీఓ డాక్టర్ జి.వెంకట ప్రసాద్కు బెస్ట్ డీఎల్ఏటీఓ–2025–26శ్రీ అవార్డు ప్రదానం చేశారు.శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీబీ నియంత్రణలో విశేష కృషి చేసినందుకు ఆయనను ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట ప్ర సాద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, టీబీ నిర్మూలన లక్ష్యంతో మరింత కృషి చేస్తానని తెలిపారు. ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట భద్రత చిత్తూరు అర్బన్: రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. శనివారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలోని మసీదులు, ప్రార్థనా మందిరాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను, నిఘాను ఉంచా రు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందు లు కలగకుండా ట్రాఫిక్ను పర్యవేక్షించారు. -
కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు కలిసి రావడంతో భక్తుల రాక మరింత పెరిగింది. ఆలయ ప్రధాన మార్గాలు, ప్రాంగణం జనంతో నిండిపోయింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ నిర్వహణతో పాటు తాగునీరు, భద్రత, పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. అదనపు సిబ్బందిని మోహరించి రద్దీని నియంత్రిస్తున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జాబ్ క్యాలెండర్ దగా చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ దగా అని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్రెడ్డి విమర్శించారు. వీటి ద్వారా 4 విడతలు, 41 నోటిఫికేషన్ల ద్వారా 10,060 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారన్నారు. గత పాలనలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా ప్రస్తుతం వాటిని ఎందుకు భర్తీ చేయలేదన్నా రు. గ్రూప్ 1, 2 పోస్టులు, ఇంజినీరింగ్ విభాగం, టీచర్ పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయన్నారు. గత పాలనలో 1.34 లక్షల ఉద్యోగాలను సచివాలయాల ద్వారా భర్తీ చేశారన్నారు. -
ఫిర్యాదు చేయండి
లైసెన్స్, రిజిస్ట్రేషన్స్కు అదనపు వసూళ్లు తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. అలాగే రాష్ట్ర, కేంద్ర ల్యాబ్ల నందు శాంపిల్స్ తనిఖీల నందు కొన్నిసార్లు మిస్మ్యాచ్ వస్తున్నాయి. సిబ్బంది కొరతతో శాంపిల్స్ సేకరణకు బయట వారిని వినియోగిస్తున్నాం. కోర్టు కేసులతో ఇన్స్పెక్టర్లు నెలవారీ శాంపిల్స్ లక్ష్యంగా అధిగమించలేకపోతున్నారు. సమస్యల పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, సహాయ ఫుడ్ కంట్రోలర్, ఆహార భద్రత, ప్రమాణాలశాఖ -
జూనియర్ కళాశాలలకు సరికొత్త క్యాలెండర్
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ బోర్డు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా సంవత్సరాన్ని ముందస్తుగా ఏప్రిల్1 నుంచే ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు జూని యర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతా యి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1వ తేదీ నుంచి కళాశాల లు తిరిగి పూర్తిస్థాయిలో పని చేస్తాయి. మొత్తం పనిదినాలు ఇలా... ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 314 రోజులకు గాను, 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. మిగిలిన 82 రోజులు ఆదివారాలు, పండుగ సెలవులుగా ప్రకటించారు. ప్రభుత్వ కళాశాల ల్లో సంఖ్యను పెంచడ మే లక్ష్యంగా జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్ప టికే గత ప్రభుత్వంలో చేపట్టిన ‘నాడు–నేడు’ తో కళాశాలల రూపురేఖలు మారాయని, డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయా లని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు అందాయి. అర్ధగిరి అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి అన్నిశాఖల సమన్వయంతో పనిచేయాలని ఉపాధి పథకం రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్ ఆదేశించారు. శుక్రవారం అర్ధగిరి క్షేత్రంను దర్శించుకొని అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆలయంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతితో సమావేశమై అభివృద్ధి పనుల ప్రణాళిక తయారీపై చర్చించారు. అర్ధగిరి క్షేత్రంలో సుమారు 179 ఎకరాల్లో కొండ చుట్టూ పైభాగంలో ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక తయారు చేసి(డిపిఆర్) నివేదిక పంపాలన్నారు. ఆయనతో పాటు డ్వామా పీడీ రవికుమార్, ఏపీడీలు మల్లికార్జున, సుబ్రమణ్యం, ఏపీఓ బాల, వాటర్షెడ్ డెవలప్మెంట్ , ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
కట్టడిలేని ‘కల్తీ’
చిత్తూరు కార్పొరేషన్: మనం తీసుకొనే ఆహార పదార్థాలకు సంబంధించి జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ పరిధిలోకి వస్తాయి. మనిషి ఆరోగ్య పరిరక్షణలో ఈశాఖ పాత్ర కీలకం. అలాంటి సంస్థ సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. ఉద్యోగుల కొరత, పని ఒత్తిడి, ప్రైవేటు ఉద్యోగుల హల్చల్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు, శాంపిల్స్ సేకరణలో దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నా యి. లోటుపాట్లను అవకాశంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆహార తనిఖీ వాహనం చిత్తూరు జిల్లాకు మంజూరు చేస్తే పలు ఆహార పదార్థాల ఫలితాలు అప్పుడే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా పనులు జరగడం లేదు. సంస్థ లక్ష్యం ఇదీ.. హోటళ్లు, బేకరీలు, గోధుమ, పసుపు, నూనెలు, పండ్ల వ్యాపారాలు తదితర ఆహార పదార్థాల విక్రయ తయారీ కేంద్రాల్లోని కల్తీలను ఆహార నియంత్రణ శాఖ పరిశీలించాలి. అందుకు సంబంధించి జిల్లాలో రెండు డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు డివిజన్లో చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, పలమనేరు నియోజకవర్గాలు రాగా, కుప్పం డివిజన్ పరంగా కుప్పం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నగరి, పుంగనూరు మండలాలు వస్తాయి ఫిర్యాదులు వచ్చినా లేదా ఏదైనా అనుమానం ఉన్నా తనిఖీలు చేపడతారు. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు. నెలకు 12 నమూనాల పరిశీలన వివిధ పదార్థాలు..వస్తువుల నుంచి నెలకు 12 శ్యాంపిల్స్ తీయాలి. ఒక శ్యాంపిల్తో పాటే అదనంగా రెండు తీసుకుంటారు. ఆ ప్రకారం ఒక నెలకు మొత్తం 36 శ్యాంపిల్స్ తీస్తారు. ఒక్కో శ్యాంపిల్ చొప్పున కల్తీ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్లోని నాచారంలోని లేబొరేటరీకి పంపిస్తారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు పరీక్షల్లో నాసిరకం అని తేలితే శ్రీసబ్ స్టాండెడ్, మిస్ బ్రాండెడ్ అని అంటారు. దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరుగుతుంది. అలాగే తినడానికి వీలులేని పదార్థాలు, వస్తువులను శ్రీఆన్సేఫ్శ్రీ అంటారు. దీనికి న్యాయ స్థానం శిక్ష ఖరారు చేస్తుంది. సంబంధిత వ్యక్తికి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు భారీగా జరిమానా పడటంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అదే విధంగా ఈశాఖ ప్రభుత్వ రంగ సంస్థలైన హాస్టళ్లు, ఐసీడీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆహార పథకాలను కూడా పర్యవేక్షించే అధికారం ఉంది. సిబ్బంది కొరత కీలకమైన ఈ శాఖకు సిబ్బంది కొరత శాపంగా మారింది. జూనియర్ సహాయకులు, సీనియర్ సహాయకులు, అటెండర్ల లేమితో అవస్థలు పడుతున్నారు. పని ఒత్తిడి పేరుతో అధికారులు పనులను ఆలస్యం చేస్తున్నారు. ఏడాది కాలంలో చిత్తూరు డివిజన్లో 77, కుప్పం డివిజన్లో 102 తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం 240 చేయాల్సి ఉంది. ఇందులో 10 సబ్స్టాండ్, 4 ఆన్సేప్ కేసులు నమోదు చేయగా వారి వద్ద నుంచి రూ.3 లక్షలకు పైగా జరిమానాలు విధించారు. జిల్లా మొత్తానికి ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. మరో ఇన్స్పెక్టర్ అవసరం ఉన్నా కేటాయింపులు లేవు. తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా కుప్పలు, తెప్పలుగా హోటళ్లు , రెస్టారెంట్లు, తినుబండరాలు, వస్తువులను తయారు చేసే కేంద్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాగా ఈ శాఖ పరిధిలో అధికారికంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. లైసెన్స్ పరిధిలోకి పెద్ద హోటళ్లు, నూనె తదితర ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు వస్తాయి. రిటైల్ డిస్ట్రిబ్యూటర్లు తదితర వ్యాపార కేంద్రాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ పరిధిలో చిన్న హోటళ్లు ఉంటాయి. అధికారికంగా అన్నింటిని కలుపుకున్నా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగినవి తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో పంచనామా నిర్వహిస్తున్న విశ్రాంత ఉద్యోగి, ప్రైవేటు డ్రైవర్ (ఫైల్) ఆహారభద్రత ప్రమాణాల శాఖ కార్యాలయం ఏడాది కాలంలో తీసిన శాంపిల్స్ 179 అందులో సబ్స్టాండ్ 10 అన్సేఫ్ 4 మొత్తం లైసెన్స్ డీలర్లు 550 రిజిస్ట్రేషన్ డీలర్ల్లు 1000 కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’ సహాయ ఆహార నియంత్రణ శాఖ ప్రతిదానికి వసూళ్లు ? ఏడాదికి రూ.12 లక్షలు కంటే తక్కువ వ్యాపారం చేసేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటికి ప్రభుత్వం రుసుం రూ.100 ఏడాదికి కానీ రూ.2 వేలు అప్పనంగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రూ.12 లక్షలు పైగా జరిగే వ్యాపారాలకు లైసెన్స్ ఫీజు రూ.2 వేలు వీటికి రూ.5 వేలు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అంతే కాదు నెలవారీ తనిఖీలకు వెళ్లినప్పుడు శాంపిల్స్ సేకరిస్తారు. అందులోనూ లైసెన్స్దారుల నుంచి వేలకు వేలు పిండుతున్నారని వాపోతున్నారు. తనిఖీల్లో భాగంగా మూడు శాంపిల్స్ తీస్తారు ఇందులో ఆన్సేఫ్ అని వస్తే బాధితుడు చాలెంజ్ చేసుకోవడానికి నెలరోజులు సమయం ఉంటుంది. కానీ చాలెంజ్ చేసినప్పుడు సెంట్రల్ ల్యాబ్లో తిరిగి పరీక్షలకు పంపినప్పుడు ఎటువంటి సమస్య లేదనే వస్తోందని సమాచారం. వసూళ్లతో అధికారులు బేరం కుదుర్చుకొని మేనేజ్ చేస్తున్నారనే అపవాదు ఉంది. అంతే కాకుండా అధికారులు డ్రైవర్లను అడ్డుగా పెట్టుకొని దోపిడీకి తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరుకు తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పంచనామాకు సైతం విశ్రాంత ఉద్యోగి, డ్రైవర్ ద్వారా చేయిస్తున్నారు. డీలర్లపై వారి పెత్తనం పెరిగింది. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. -
అకాల వర్షంతో పంటనష్టం
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలంలో బుధ, గురువారాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా భారీగా పంట నష్టపోయారు. మండల పరిధిలోని పాదిరేడు, టి.సి.అగ్రహా రం, లక్ష్మమ్మ కండ్రిగ పరిసర ప్రాంతాల్లో సు మారు 200 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోతకు వచ్చిన సమయంలో ఇలా అకాల వర్షం కారణంగా పంట మొత్తం పడిపోయి నీట ము నగడంతో తాము పూర్తిగా మునిగిపోయామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థినులకు గాయాలు బైరెడ్డిపల్లె: పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని కమ్మనపల్లె ఆదర్శ పాఠశాల వద్ద శుక్రవారం ఇద్దరు విద్యార్థినులు రహదారి దాటుతున్న సమయంలో బొలెరో వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 9వ తర గతి చదువుతున్న వనజశ్రీ, ఆశారెడ్డి పాఠశాల ముగియగానే స్వగ్రామానికి వెళ్లేందుకు రహదారిపైకి వచ్చారు. ఆ సమయంలో బొలెరో వాహనం ఢీకొంది. ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ ఢీ.. యువకుడి దుర్మరణం శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై గుండిశెట్టిపల్లి సమీపంలో లారీ బైకును ఢీకొనడంతో యువకుడు మృత్యువాత పడ్డాడు. శుక్రవారం రాత్రి బైకుపై వెళ్తున్న గుండిశెట్టిపల్లికి చెందిన రవికుమార్(30)ను శాంతిపురం వైపు నుంచి వి.కోట వైపునకు వెళ్తున్న బోరు సపోర్టింగ్ లారీ ఢీకొంది. దీంతో వెంకట్రామప్ప కుమారుడు రవికుమార్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహమైంది. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించాయి. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. -
గడ్డి లారీ దగ్ధం
వెదురుకుప్పం: పశుగ్రాసం తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తూ దగ్ధమైన ఘటన శుక్రవారం సాయంత్రం వెదురుకుప్పం మండలం దామరకుప్పం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు...శుక్రవారం సాయంత్రం మండలంలోని పచ్చికాపల్లం నుంచి వెదురుకుప్పం వైపు పశుగ్రాసం లోడ్తో వాహనం బయలు దేరింది. మార్గమధ్యలోని దామరకుప్పం వద్ద సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగలు తగిలి నిప్పు రవ్వలు ఎగిసి పడి గడ్డికి అంటుకున్నాయి. దీంతో గడ్డితో పాటు లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. లారీలో మంటలు ఎగిసి పడడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో రోడ్డు పక్కన పొలంలోకి లారీని నడిపి వదిలేశాడు. దీంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పైనే ఉంటే పెను ప్రమాదం సంభవించేది.దీంతో పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేదన్నారు. కాగా రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగలను సరి చేయాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. -
వరసిద్ధుడి సేవలో ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర విద్యుత్, సహజవాయువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీఐ వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. అలాగే రాష్ట్ర సమాచార కమిషనర్ శరత్చంద్ర కల్యాణ చక్రవర్తి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, డీజీఐ వెంకటరమణ -
ఇంటిలెక్క తేలుద్దాం
దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ‘జనగణన–2027’ ప్రక్రియకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈసారి రెండు దశల్లో గణనను నిర్వహించనున్నారు. గ్రామ, పట్టణ స్థాయిల నుంచి జాతీయ స్థాయి వరకు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ గణాంకాలు దోహదపడనున్నాయి. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం ఆనవాయితీ. అయితే 2021లో నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. చివరి సారిగా 2011లో జనాభా లెక్కల సేకరణ చేయగా, ప్రస్తుతం కొత్తగా సేకరణకు చర్యలు చేపట్టారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2027 జనగణన ప్రక్రియకు సంబంధించి ముందస్తు కసరత్తు వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మొదటి దశ : రెండో దశ : 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా సమాచారంమొత్తం జనాభా 5732,66చ.కి.మీ జిల్లా విస్తీర్ణం 16,43,224 రెవెన్యూ డివిజన్లు 4 అర్బన్ జనాభా 3,13,898 రూరల్ జనాభా 13,29,326 అసెంబ్లీ నియోజకవర్గాలు 5 (పూర్తి), 2 (పాక్షికం) మండలాలు 28 రెవెన్యూగ్రామాలు 762 ఎస్సీలు 3,61,461 ఎస్టీలు 44,367 ‘జనగణన’కు కసరత్తు పకడ్బందీగా చేస్తాం జిల్లా వ్యాప్తంగా జనగణన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్, నియమ, నిబంధనల ప్రకారం ఈ కసరత్తు చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ప్రత్యేక సిబ్బంది, పర్యవేక్షణకు అధికారులను నియమించారు. జనగణన ప్రక్రియపై ఇటీవలే శిక్షణ పూర్తి చేశాం. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నాం. – సుమిత్ కుమార్ గాంధీ, కలెక్టర్ -
‘పది’ మూల్యాంకనంలో మార్పులు వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో మార్పులు చేయడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పరీక్షల విధానంలో వినూత్న మార్పులు చేసిన కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం చోటు చేసుకున్నట్లు మండిపడ్డారు. కాగా ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యే పది జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో ట్యాబ్ ఆధారిత విధానం అమలు చేయడం తగదన్నారు. ఈ విధానం అమలుకు రూ.30 లక్షల నిధులు కేటాయించిందన్నారు. ఆ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని విమర్శించారు. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా మార్కుల నమోదులో తప్పిదానికి భారీ జరిమానా నిబంధన పెట్టడం అధికారుల అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ మొరాయించడం, నెట్ కవరేజ్ సరిగా లేకపోవడం తదితర సమస్యలు ఏర్పడినప్పుడు జరిమానా ఎవరికి విధించాలని ప్రశ్నించారు. మార్కుల నమోదుకు రాత్రిళ్లు వేచి ఉండక తప్పదని హెచ్చరించారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం ఆరు సబ్జెకులను రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మూల్యాంకన కేంద్రాల్లో మొదట అమలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
● ఊపిరి తిత్తుల వ్యాధితో అస్వస్థతకు గురైన బాలుడు ● మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక సాయం ● రెండు శస్త్ర చికిత్సల అనంతరం కోలుకున్న బాలుడు ● చమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఙతలు తెలిపిన తల్లిదండ్రులు
పుత్తూరు: మండల పరిధిలోని మజ్జిగ గుంట కాలనీకి చెందిన శివ కుమారుడు గౌతమ్(8) కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంలో తల్లిదండ్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు ఊపిరితిత్తులు 90 శాతం పాడయ్యాయని, ఖర్చుతో కూడుకొన్న ఆపరేషన్ అవసరమవుతుందని తేల్చి చెప్పారు. దీంతో దిక్కుతోచని ఆ తల్లిదండ్రులు సాయం చేసే వారి కోసం అన్వేషించారు. ఆశాదీపంగా మాజీ మంత్రి ఆర్కే రోజా వారి మదిలో మెదిలారు. ఆలస్యం చేయకుండా ఆమె వద్దకు వెళ్లి కుమారుడి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఆర్కే రోజా రుయా ఆసుపత్రికి వెళ్లి బాలుడ్ని మెరుగైన వైద్య శస్త్ర చికిత్సల కోసం నారాణాద్రి ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. దీంతో వైద్యులు గౌతమ్కు రెండు పర్యాయాల పాటు శస్త్ర చికిత్సలు చేసి, ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. ప్రసుత్తం గౌతమ్ వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నాడు. శుక్రవారం మరోసారి ఆసుపత్రికి వెళ్లిన రోజా గౌతమ్ను, తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డాక్టర్లు త్వరలో గౌతమ్ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు చెమ్మగిల్లిన కళ్లతో మాజీ మంత్రి ఆర్కే రోజాకు కృతజ్ఙతలు తెలిపారు. -
బాబుపై వ్యతిరేకత
రెండేళ్లలోనే ‘బాబు సర్కారు గద్దెనెక్కి రెండేళ్లు.. అప్పటి నుంచి ఆడంబరపు మాటలు.. అభివృద్ధి పేరిట ఆకాశయానాలు.. అప్పుల కుప్పలు.. వెరసి పడకేసిన అభివృద్ధి.. అమలుకు నోచుకోని హామీలు.. అందని సంక్షేమం.. ఫలితంగా బాబు పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.’ అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బూత్ కమిటీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్లో ఇబ్బందులు లేకుండా.. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ బూత్ లెవల్, ఎలక్షన్ ఏజెంట్లకు ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు, చైన్నెలో స్థిరపడివారి ఓట్లు 15వేల నుంచి 20 వేలు ఉన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మనకంటే ముందుగా ఎన్నికలు జరగడంతో అక్కడ ఓట్లు వేసి, మళ్లీ ఇక్కడ ఓట్లు వేస్తున్నారన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు నుంచి వచ్చి పంచాయతీకి రూ.కోటి వరకు ఖర్చు చేసినవారు ఉన్నారన్నారు. ఇలాంటి డబుల్ ఓటింగ్ వేసే వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎంతసేపు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం, దుర్భాషలాడడం తప్ప మరొకటి లేదన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించి, అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను చేర్చకుండా చూడాలన్నారు. పార్టీ నేతలమైన తాము ఎంత కష్టపడినా బూత్కమిటీలు, బీఎల్వోలు సక్రమంగా పనిచేస్తేనే వైఎస్సార్ సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఎలక్షన్ కమిషన్ పెట్టే ప్రతి సమావేశానికి బూత్ కమిటీలు, బీఎల్వోలు హాజరుకావాలన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మనపార్టీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి గ్రహణం పట్టుకుందన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి పడకేసి, రాష్ట్ర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తెచ్చే రూ.లక్షల కోట్ల అప్పులు దేనికి ఖర్చుపెడుతున్నారో ఆ దేవుడికే ఎరుకన్నారు. ఏదైనా మాట్లాడితే అమరావతి అభివృద్ధి తప్ప చంద్రబాబు నోట మరొకటి రాదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. రాబోయే ఎన్నికల్లో అలా కాకుండా పట్టిష్టంగా బూత్కమిటీలు పని చేసి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ బూత్కమిటీలు సమర్థవంతంగా పనిచేసినప్పుడే వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ఆ బాధ్యత మనందిరిపై ఉందన్న విషయాన్ని బూత్కమిటీలన్నీ గుర్తు పెట్టుకుని పనిచేయాలని కోరారు. వైఎస్సార్సీపీ గెలుపునకు బూత్ కమిటీలే కీలకమన్నారు. జగనన్న మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, మాజీ మేయర్ శిరీష, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, బూత్కమిటీ నాయకులు పాల్గొన్నారు.దొంగ ఓట్లతో జాగ్రత్త -
జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు
చిత్తూరు రూరల్ (కాణిపా కం): జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపా రు. గత నెల సాక్షి దినపత్రికలో విత్తు..రాయితీ చిత్తు పేరుతో వార్త ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించింది. మేనెలో విత్తనాల పంపిణీ చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్తార్ విందులో జెడ్పీ చైర్మన్ వి.కోట: సమాజంలో శాంతి, ఐక్యత కోసం మూస్లింలు చేస్తున్న కృషి అభినందనియమని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. గురు వారం పట్టణంలోని జామీయ మసీద్లో నిర్వహించిన ఇప్తార్ విందులో ఆయన పాల్గొన్నా రు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం శాంతి, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని కొనియడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్దే.గౌస్, ముస్లింలు షామీర్ జప్రూల్లా, అరిప్, ఖాదర్, జెడ్పీ చైర్మన్ తనయులు అమరేంద్ర, నరేంద్ర, శ్రీనివాసులు పాల్గొన్నారు. లేగదూడపై చిరుత దాడి! వి.కోట: లేగదూడపై చిరుత దాడిచేసిన ఘటన మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామంలో గురువారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల వివరాలు..మండలంలోని ఎస్ బండపల్లి పంచాయతీ ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన గురువిరెడ్డి అనే రైతు గురువారం ఉద యం తమ బావి వద్ద లేగ దూడను కట్టేసి వచ్చాడు. సాయంత్రం బావి దగ్గరకు వెళ్లగా దూడను చిరుత దాడి చేసి చంపేసి తినేసి ఆన వాళ్లు గుర్తించాడు. పొలంలో చిరుత కాలిగుర్తులు గమనించారు. అధికారులు దీనిపై విచారించి.. చిరుత..? లేక హైనాన అనే విష యం తేల్చాలని ఆయన కోరారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్ తిరుమల : టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన యోగేష్ అనే వ్యక్తి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని, దర్శన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం యోగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత పాపులారిటీ కోసం యోగేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని, టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తిరుమలకు రానీయకుండా కూడా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాముడు హెచ్చరించారు. టీటీడీ ట్రస్టులకు రూ.37.55 లక్షల విరాళాలు తిరుమల : టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు గురువారం పలువురు దాతలు రూ.37.55 లక్షలు విరాళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన సుజన్ జ్యువెలరీ అధినేత రవికుమార్ రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు చొప్పున విరాళాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. అలాగే హైదరాబాద్కు చెందిన మధుశేషు అనే భక్తుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్కు చెందిన మరో దాత ఆలపాటి సత్యదేవ్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. -
తుమ్మలగుంటలో కల్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులు తిరుపతి రూరల్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనులకు విశేష సమర్పణ చేశారు. ఆ తరువాత ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు సమర్పించిన పట్టు వస్త్రాలతో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఉగాది రోజున నిర్వహించే పంచాంగ శ్రవణం సర్వకార్య శుభఫల ప్రదాయకమని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు అన్ని కార్యాల్లో శుభాలు కలగాలని చెవిరెడ్డి దంపతులు మొక్కుకున్నారు. చెవిరెడ్డితోపాటు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మాట్లాడారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. -
జగన్తోనే ప్రజల జీవితాల్లో ఆనందం
ఉగాది వేడుకలు నారాయణస్వామి వెదురుకుప్పం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పరాభవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని గురువారం పుత్తూరు లోని క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని పచ్చికాపల్లం పంచాయతీకి చెందిన యువత పెద్ద ఎత్తున మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయ ణస్వామి ఆయన సతీమణి పరంజ్యోతిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా పేదలకు నేరుగా డబ్బులు అందేవని గుర్తు చేశారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే నవరత్నాలను మించి పేదలకు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా సంక్షేమ పథకాల అమలు పట్ల ఏ మా త్రం చిత్తశుద్ధిలేకుండా పోయిందన్నారు. ఉన్నదిపోయి కొత్తవి ఏదీ రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్ఫృహల మధ్య జీవితాలను గడపాల్సివస్తోందని తెలిపారు. పేద ల భాగోగులను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అబద్ధాలు, అసత్యాలు, అరాచకాలతో పాలన సాగిస్తున్నట్లు మండిపడ్డారు. కేవలం ప్రచారార్బాటాలు తప్ప బడుగు, బలహీనవర్గాలకు ఒరి దింది ఏమీ లేదన్నారు. పేదల మోములో చిరునవ్వు రావాలంటే అది ఒక్క జగనన్నతోనే సాధ్య మని చెప్పారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉన్నా పక్కన పెట్టి పేద ల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రతి పేదవాడి ఇంట్లో పండుగ రోజేనని చెప్పారు. ఆర్థిక అసమానతలను తొలగించడం కోసమే జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యదర్శి బోడిరెడ్డినరేష్రెడ్డి, ఎస్సీ సెల్ కార్యదర్శి మురళి, యువత నాగరాజరెడ్డి, భాస్కర్రెడ్డి, మనోజ్కుమార్రెడ్డి, విజయభాస్కర్, వెంకటముని, నాగరాజు, ఉదయ్ పాల్గొన్నారు. -
గరుడ వారధిపై ఆర్టీసీ బస్సులు ఢీ.. 10 మందికి గాయాలు
తిరుపతి క్రైం: నగరంలోని గరుడ వారధిపై గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన ఆర్టీసీ బస్సు శ్రీనివాసం సమీపంలోని ఫ్లైఓవర్పై ప్రయాణికులను దింపుతుండగా వెనకనుంచి వచ్చి మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పది మందికి స్వల్ప గాయాలయ్యా యి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఈస్ట్ సీఐ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్ వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఘనంగా ఉగాది పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో, వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సతమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చందన, పంచామృతం, క్షీర, నారికేళ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది వేళ..ఆధ్యాత్మిక శోభ
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉగాది విశిష్టత ప్రతిబింబించేలా శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో హైగ్రీవుడిని సంహరించి, నాలుగు వేదాలను రక్షించి, బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న దృశ్యాన్ని టీటీడీ శిలారూపంలో ఆవిష్కరించింది. అలాగూ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద చేసిన పుష్పాలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి ఆలయం ముందు శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాన్ని ఉద్యానవన విభాగం కార్మికులు కళాత్మకంగా రూపొందించారు. మరోవైపు, శ్రీరాముడు, చిన్నికృష్ణుడు, వేణుగాన కృష్ణుడి నమూనాలు ఉగాది ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మికతను జోడించాయి. – తిరుమల ఆలయం వెలుపల పుష్పాలతో రూపొందించిన ఏనుగులు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న శ్రీమహావిష్ణువు ఆవు, దూడలతో ఆడుకుంటున్న రాధాకృష్ణులు మామిడికాయలను చోరీ చేస్తున్న చిన్నికృష్ణుడు -
అందరి జీవితాల్లో ఆనందం నిండాలి
చిత్తూరు కార్పొరేషన్: అందరి జీవితాల్లో ఆనందం నిండాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆకాంక్షించారు. గురువారం కలెక్టరేట్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, వేద విజ్ఞానం సంప్రదాయాల్ని వారసత్వంగా కొనసాగించాలన్నారు. ఉగాదిని పండుగకే పరిమితం చేయకుండా ఇందులోని విశిష్టతను తెలుసుకోవాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్ మాట్లాడుతూ ఉగాది యుగానికి ఆది అని అభివర్ణించారు. అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అర్చకులు చిలకమర్తి వెంకటసుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరంలో అన్నింటా జిల్లా ముందంజలో నిలుస్తుందని పేర్కొన్నారు. వేద పండితులు వెంకటసుబ్బారావు, శ్రీధర్అయ్యర్, పద్మనాభగురుకుల్, రామకృష్ణఆచార్య, పార్థసారథిని ప్రభుత్వం తరఫున సత్కరించి గౌరవించారు. ఉగాది కవి సమ్మేళనంలో కవితలను ఆలపించిన కవులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. అలాగే పండ్ల పరిశ్రమ, మామిడి రైతులకు చేసిన సేవలను గుర్తించి ఆలిండియా ఫుడ్ ప్రొసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ బాబిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్రకుమార్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చిట్టెమ్మ, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బాబిని సన్మానిస్తున్న ఇన్చార్జ్ కలెక్టర్, అధికారులు మాట్లాడుతున్న ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ -
అమ్మో..క్యాన్సర్!
స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్) జిల్లాలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 30 ఏళ్లు దాటిన మహిళలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. వారినే నమ్ముకున్న కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతోంది. కడుపున పుట్టిన బిడ్డలను అనాథలను చేసి వీధిన పడేస్తోంది. ఈ మహమ్మారిపై సరైన అవగాహన లేకపోవడం.. మహిళలు స్క్రీనింగ్ టెస్ట్లకు భయపడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాణిపాకం: జిల్లా జనాభా సుమారు 15 లక్షలు ఉండగా ఇప్పటివరకు ఆరోగ్యశాఖ చేపట్టిన స్క్రీనింగ్ కార్యక్రమాల్లో 6.2 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కేసులు 131, అనుమానిత కేసులు 3,200, ఒరల్ క్యాన్సర్ నిర్ధారణ కేసులు 192, అనుమానిత కేసులు 6,100, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 171, అనుమానిత కేసులు 1,040 నమోదయ్యాయి. ఈ గణాంకాలు జిల్లాలో క్యాన్సర్ ముప్పు ఎంత వేగంగా పెరుగుతోందో తెలియజేస్తున్నాయి. స్క్రీనింగ్ టెస్టులకు దూరం ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉంచింది. అయినప్పటికీ ప్రజలు వాటిని పెద్దగా వినియోగించుకోవడం లేదు. గ్రామీ ణ ప్రాంతాల్లో అవగాహన లోపం, భయం, నిర్ల క్ష్యం కారణంగా పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఇక తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స ఉంది. పీఓయూ రూమ్ నెం.222లో ప్రతి మంగళ, గురువారాల్లో నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై కూడా ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష అవసరమని, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న సమస్యలైనా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేయొద్దు మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా లేకపోవడం, పరీక్షలకు ముందుకు రాకపోవడం వల్ల రోగం ముదిరిన తర్వాతే గుర్తిస్తున్నారు. అసాధారణ రక్తస్రావం, నొప్పులు వంటి లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కుప్పం ప్రాంతంలో ఒరల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పొగాకు, గుట్కా, మద్యం వంటి అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. నోట్లో పుండ్లు, మచ్చలు వచ్చినా చాలా మంది వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తున్నారని వారు అంటున్నారు. జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు -
వైభవంగా ఉగాది ఉత్సవం
తిరుపతి కల్చరల్: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పంచాంగ పరిష్కర్త, ఆగమ సలహా మండలి అధ్యక్షుడు వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలుకోవడమే పంచాంగమని తెలిపారు. అనంతరం పంచాంగ కర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. తర్వాత ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు ఎస్వీయూ విశ్రాంత ఆశాచర్యుడు ఆచార్య దామోదర్ నాయుడు కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముందు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు , విద్యార్థులు చక్కని మంగళధ్వని, ప్రార్థన వినిపించారు. తర్వాత ఎస్వీ ఉన్నత వేదాధ్యమన సంస్థ ఆధ్వర్యంలో వేది పండితులు వేద స్వస్తి నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీపీపీ కార్యదర్శి రఘునాథ్, సంక్షేమం విభాగం డిప్యూటీ ఈఓ ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే జైలు
ఆక్రమణలు తొలగించండి గంగాధరనెల్లూరు: శ్రీసిద్ధేశ్వర స్వామి కొండ గ్రామంలో ప్రభుత్వ గయాలు భూమిలో ఉన్న దేవదాయ భూములను ఆక్రమించిన వారిపై ఎట్టకేలకు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం వింజం రెవెన్యూ గ్రామం సర్వే నెం.296లో ఉన్న ప్రభుత్వ గయాలు భూమి ఆక్రమణల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్గా స్పందించింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫున అడ్వకేట్ పసపల సుధాకర్రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. మొదటి వాయిదా విచారణలో గయాలు భూమిలో సుమారు నాలుగు ఎకరాల మేర ఆక్రమణ జరిగినట్టు, ముఖ్యంగా సతీష్కుమార్, సాగి కుమార్ ఆక్రమించారని రికార్డులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి వాయిదాలో తహశీల్దార్ పూర్తి రికార్డులతోపాటు సంబంధిత భూ స్కెచ్ను నేరుగా కోర్టుకు సమర్పించి, భూమి స్వరూపం, సబ్డివిజన్ జరిగిన భాగాలు, మిగిలిన గయాలు భూమి వివరాలను ఒరిజినల్ రికార్డును కోర్టుకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు వచ్చిన.డబ్ల్యూపి నెం.3565/2026 కేసులో, జీడీనెల్లూరు మండల డిప్యూటీ తహశీల్దార్ కోర్టుకు హాజరై ఒరిజినల్ రికార్డులను సమర్పించారు. 1977లో సర్వే నం.296పై సబ్డివిజన్ జరిగినట్లు, మిగిలిన 45.18 ఎకరాల గయాలు భూమిలో కొండ ప్రాంతంగా ఉన్నట్లు తెలిపారు. ఆ భూమిలో కొంత భాగం వ్యక్తులు ఆక్రమించినట్లు కోర్టుకు తెలియజేయగా, ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కోర్టు ఆక్రమణదారులకు సెక్షన్ 7–6 కింద నోటీసులు జారీ చేసి ఆక్రమణలను తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన వివరాలను తదుపరి విచారణలో సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు కేసును 09.03.2026 తేదీకి వాయిదా వేసింది. ప్రజా ప్రయోజనాలకు చెందిన ఈ భూమి భవిష్యత్తులో మరలా ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు దృష్టికి పసపల సుధాకర్రెడ్డి న్యాయవాది తీసుకువచ్చారు. శ్రీసిద్ధేశ్వర స్వామి గ్రామానికి చెందిన హిందూ సంఘాలు పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎట్టకేలకు హైకోర్టు ఆక్రమణదారులపై మొట్టికాయలు వేయడంతో న్యాయం గెలిచిందని సంతోషపడ్డారు. -
నవ వసంతం.. ఉగాది సంబరం
పుష్పాలంకరణతో ఆకట్టుకున్న వరసిద్ధుడి ఆలయం కాణిపాకం: ఉగాది సంబరం అంబరమంటిది. పరాభవ నామ నామసంవత్సరానికి గురువారం జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. ఇళ్ల వాకిళ్లకు మామిడి ఆకులు, పూలతోరణాలు కట్టి అందంగా ముస్తాబు చేశారు. ఉదయాన్నే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించారు. సమ్మేళనమై ఉగాది పచ్చడిని రుచి చూశారు. భక్తుల రాకతో ఆలయం ఉగాది శోభను సంతరించుకుంది. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. ఆలయాన్ని విదేశీ పుష్పాలతో సుందరంగా అలకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేక, పూజలు కొనసాగాయి. పంచాంగ శ్రవణాన్ని పురోహితులు పఠించారు. ముందుగా ఉత్సవమూర్తులు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, వేదపండితులు పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి సాగర్రెడ్డి పాల్గొన్నారు. భక్తులు కిటకిట కాణిపాకం ఆలయం వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడం, ఉగాది పర్వదినం తోడవడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వేకువ జామునుంచే భక్తులు క్యూకట్టారు. రాత్రి వరకు కూడా రద్దీగా కనిపించింది. భక్తుల రద్దీ పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు -
జ్యూస్ ఫ్యాక్టరీలో షెడ్లు దగ్ధం
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని గాజు లపెళ్లూరు సమీపంలోని రసా జ్యూస్ ఫ్యాక్టరీ లో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నాలుగు షెడ్లు దగ్ధమయ్యాయి. దీంతో భారీ నష్టం వట్టిల్లిందని యాజమాన్యం తెలిపింది. ఉగాది పండుగ కావడంతో ఫ్యాక్టరీలోని షెడ్ల లో కార్మికులు లేరని, దీంతో ఎలాంటి ప్రాణహాని కలగలేదని పేర్కొంంది. శ్రీకాళహస్తి నుంచి ఫైర్ ఇంజిన్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి, పక్కనే ఉన్న మరో షెడ్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలానికి రెవెన్యూ, పోలీ సు సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించారు. కేజీ సత్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడి మృతి బంగారుపాళెం: మండలంలోని కేజీ సత్రం వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నలగాంపల్లె పంచాయతీ, పాపానివారిపల్లెలో ప్రభు అనే వ్యక్తి కోళ్లఫారంలో బీహార్కు చెందిన లితేష్కుమార్ పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై కేజీ సత్రం గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభు ఎడమవైపు మట్టి రోడ్డుపై పడిపోయాడు. లితేష్కుమార్(19) జాతీయ రహదారిపై పడ్డాడు. అదే సమయంలో అటువైపు వస్తున్న ట్యాంకర్ లారీ లితేష్కుమార్ తలపై తొక్కించుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
పండుగ పూటా పస్తులే
– స్విమ్స్ యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటున్న వేళ స్విమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న 800 మంది కార్మికులు చేపట్టిన ఆకలి పోరాటం 22వ రోజుకు చేరుకుంది. పండుగ రోజున కూడా తమ దీక్షా శిబిరం వద్దే తమ పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే వేణుగోపాల్ మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించే రోజున ప్రజలు ఇళ్లలో సంతోషం నిండిపోతుంటే, స్విమ్స్ కార్మికుల ఇళ్లలో మాత్రం ఆకలి, ఆందోళన మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా, కార్మికులను చర్చలకు పిలవకుండా యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేవలం రూ.13,500 తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న కార్మికులు పండుగ రోజున కూడా తమ పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న రోగులకు సేవలు అందించే వార్డ్ బాయ్లు, పేషెంట్ కేర్ అసిస్టెంట్లను ‘శానిటేషన్ కార్మికులు’గా తక్కువ చేసి చూడడం అమానుషమన్నారు. ఇతర టీటీడీ అనుబంధ సంస్థల్లో ఉన్నట్లే గౌరవం, వేతనాలు స్విమ్స్ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారుల మొండి వైఖరి కారణంగా వందలాది కుటుంబాలు పండుగ రోజున కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఈ పోరాటాన్ని ఆపలేరని, వెంటనే హోదా మార్పు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి, గోపి, సూరి, వెంకటేష్, బాలకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ బూత్కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం
తిరుపతి మంగళం : పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్రవా రం ఉదయం 10 గంటలకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ కమి టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు నాగూరి యోగాంజనేయరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, బూత్కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆటో, కారు ఢీ – నలుగురికి తీవ్ర గాయాలు చంద్రగిరి: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చంద్రగిరి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద ఎదురెదురగా ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా రుయాస్పత్రికి తరలించారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధులకు వెళుతూ.. ఏర్పేడు: ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో నాగంపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు ఎస్ఐ రవిప్రకాష్ కథనం మేరకు.. ఏర్పేడు మండలం ఆమందూరు బీసీ కాలనీకి చెందిన గురుస్వామి, ప్రమీల దంపతుల కుమారుడు చెంచు గురుచంద్ర(28) రాక్మెన్ కంపెనీలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పాగాలి సమీపంలోని రాక్మెన్ కంపెనీకి వెళ్లేందుకు బైక్పై ఇంటి నుంచి బయలుదేరాడు. నాగంపల్లి సమీపంలోని ఓ ఆస్పత్రి ఎదురుగా ముందు వెళుతున్న కట్టెల లోడ్ ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న చెంచు గురుచంద్ర తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరికిన కేసులో ఇద్దరికీ ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్, ఎరగ్రుట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లా ఇస్లాంనగర్కు చెందిన సాదిక్ బాషా, గణేషన్ మురుగన్ ఎరచ్రందనం చెట్లను నరికి తొమ్మిది దుంగలుగా మార్చి తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 326 కిలోల తొమ్మిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు గాయాలు
పలమనేరు: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ గాయపడిన ఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మునిలక్ష్మి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై భారీ శబ్దం రావడంతో కొందరు స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పి ప్రమదాన్ని తప్పించారు. గాయపడిన మునిలక్ష్మిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చట్టబద్ధంగానే కొనుగోలు చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న స్థలాన్ని చట్టబద్ధంగానే విక్రయించినట్లు థియే సోఫికల్ సొసైటీ ఇండియా చాప్టర్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. వారణాసిలోని తమ సొసైటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో చిత్తూరులోని ఆస్తులను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఈ భవనం పురాతనమైనది కావడంతో ఇప్పటికే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నివాసయోగ్యానికి అనుకూలంగా లేదని ధ్రువీకరణ పత్రం సైతం పొందామన్నారు. భవన నిర్మాణ కూల్చివేత పనులన్నీ తమ అనుమతితోనే జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. శిల్పి జక్కన్నకు కళారత్న పురష్కారం పలమనేరు: నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం, నేలపల్లికి చెందిన ప్రముఖ శిల్పి తొండవాని పురుషోత్తమాచార్య అలియాస్ జక్కన్న(80)కి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా శిల్పకళారంగంలో చూపిన ప్రతిభకు ఏడాదికి గాను కళారత్న పురష్కారానికి ఎంపిక చేసింది. ఆ మేరకు స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అజయ్జైన్ నుంచి బుధవారం ఆదేశాలందాయి. ఉగాది సందర్భంగా ఆయనకు ఈ పురష్కారాన్ని అందించనుంది. కాగా జక్కన్నకు స్థానిక పలమనేరు రచయితల సంఘం, తెలుగు సాహిత్య సాంస్క్రృతిక సమితి నిర్వాహకులు అభినందలు తెలిపారు. ‘దివ్యాంగశక్తి’ ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులని.. వారి సమస్యలను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్నవారని ఇన్న్చార్జి కలెక్టర్ రాజేంద్రన్ కొనియాడారు. బుధవారం చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్లో ‘దివ్యాంగ శక్తి’ (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 33,848 మంది దివ్యాంగులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, చుడా చైర్మన్ కఠారి హేమలత పాల్గొన్నారు. -
క్వాంటమ్ టెక్నాలజీలో ఎస్వీయూ కీలక ప్రాత పోషించాలి
తిరుపతి సిటీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ టెక్నాలజీకి దోహదపడేలా ఎస్వీయూ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్వీయూ వీసీ చాంబర్లో ఆయన క్వాంటమ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యవస్థకు దోహదపడేలా విద్యార్థులను, పరిశోధకులను, అధ్యాపకులను సిద్ధం చేయడంలో ఎస్వీయూ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు పాల్గొన్నారు. -
గ్రూప్–డీ పరీక్షలకు ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నేతృత్వంలో రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డీ 2026 పోటీ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచిత శిక్షణ ఉంటుందని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తులను తిరుపతి ఎమ్మార్పల్లి బీసీ స్టడీ సర్కిల్, కృష్ణానగర్, ఎమ్మార్పల్లి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వంద మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణతోపాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణ అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక విధానం పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి మార్కు లిస్టులు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డీ పరీక్షకు దరఖాస్తు చేసిన ఆన్లైన్ జిరాక్స్, 2 పాస్ పోర్ట్ సైజ్ పొటోలు జతపరచి ఇవ్వాలని స్పష్టం చేశారు. బీసీ స్టడీ సర్కిల్ 9441456039, 9346221553 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు. స్కూల్ వ్యాన్ను ఢీకొన్న ట్రాక్టర్ తిరుపతి రూరల్: మండలంలోని కేసీపేట పంచాయతీ భాగ్యనగరం వద్ద బుధవారం రాత్రి ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్ను ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వచ్చే స్కూల్ వ్యాన్పైకి దూసుకు వెళ్లగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కదలలేని స్థితిలో వున్న స్కూల్ వ్యాన్ను నెమ్మదిగా పక్కకు తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ఎవరికీ పెద్ద గాయాలు లేనందున అందరు ఊపిరిపీల్చుకున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం వద్ద ఉన్న వెరిటాస్ సైనిక్ స్కూల్ వ్యాన్ పిల్లలను వదిలేసి తిరిగి పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినందున పెను ప్రమాదం తప్పింది. -
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు తిరుపతికి చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొండూరు మోహన్ కుమార్ రాజు కుమార్తె డాక్టర్ శ్రావ్య రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి దాత తల్లిదండ్రులు సుధా, మోహన్ కుమార్ రాజు, భర్త యుగంధర్ చేతుల మీదుగా డీడీని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో విరాళం ఇచ్చానని చెప్పారు. తన వ్యక్తిగత, కుటుంబ ఉన్నతితో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జన్మించినప్పటి నుంచే ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ చిన్నారి జీవితంలో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల డాక్టర్లు వెలుగులు నింపారు. నెలలు నిండకముందే పుట్టిన ఆ పాపకు అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, కొత్త జీవితాన్ని ప్రసాదించారు. తిరుపతి జిల్లా పాకల మండలం దామలచెరువుకు చెందిన శిరీషా–విజయకుమార్ దంపతులకు పుట్టిన పాప ప్రారంభం నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. పాలు సరిగా తాగకపోవడం, తల పరిమాణం అసాధారణంగా పెరగడం, తరచూ మూర్చ రావడం వంటి లక్షణాలతో కుటుంబం ఆందోళనకు గురైంది. పరిస్థితి విషమించడంతో వెంటనే చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా, పాప మెదడులో రక్తస్రావంతో పాటు నీరు చేరినట్టు గుర్తించారు. ఇది హైడ్రోసెఫలస్ అనే ప్రమాదకర స్థితి. ప్రాణాపాయం ఉన్న ఈ కేసును వైద్యులు సవాలుగా స్వీకరించారు. మొదట పాపకు వస్తున్న ఫిట్స్ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. అనంతరం అత్యంత జాగ్రత్తలతో క్లిష్టమైన బ్రెయిన్ సర్జరీకి సిద్ధమయ్యారు. తక్కువ బరువు, పలుచని చర్మం కారణంగా ప్రతి క్షణం ప్రమాదకరంగా మారిన ఈ ఆపరేషన్ను న్యూరో శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె.సాయినాథ్రెడ్డి నేతత్వంలో విజయవంతంగా పూర్తిచేశారు. మెదడులో చేరిన నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేక స్టంట్ను అమర్చి, రక్తప్రసరణను సక్రమంగా పునరుద్ధరించారు. ఆపరేషన్ తర్వాత పాప ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అపోలో ఆధ్వర్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి మానవత్వానికి చిరునామాగా నిలిచింది. -
ఆ కూత రాదే?
రోజూ చిత్తూరు మీదుగా వెళ్లే రైళ్లు – 19 ప్రయాణికుల సంఖ్యృ – 3,600 రిజర్వేషన్ ప్రయాణికులు – 300 పైన రోజువారీ రైల్వేస్టేషన్ ఆదాయం – రూ.3 లక్షలు స్టేషన్ ర్యాంక్ – ఎన్ఎస్జీ–4చిత్తూరు కార్పొరేషన్: పేరుకే జిల్లా కేంద్రం. ఇక్కడి నుంచి రవాణా సదుపాయాలు అంతంతమాత్రమే. స్థానిక రైల్వేస్టేషన్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి నుంచి రోజూ పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో పలు ప్రముఖ నగరాలకు సైతం చిత్తూరు స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. అయితే ప్రధాన నగరాలకు వెళ్లే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు చిత్తూరులో స్టాపింగ్ లేదు. ఇక్కడ ఆగని రైళ్ల కోసం ప్రయాణికులు చిత్తూరు నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న తమిళనాడులోని కాట్పాడికి, లేదా 33 కి.మీ దూరంలో ఉన్న పాకాల, 72 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి వెళ్లి ఎక్కాల్సి వస్తోంది. ముఖ్యంగా చైన్నె ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తోందో తెలియడం లేదు. వీటి పై ఇటు పాలకులు, అటు అధికారులు స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కుప్పంకే ప్రాధాన్యత కుప్పంలో పలు రైళ్లు ఆపాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఇటీవల సీఎం చంద్రబాబు కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన వాస్కోడగామ–వేలాంకణి, దాదర్సెంట్రల్–పాండిచ్చేరి ఎక్స్ప్రెస్లను కుప్పం రైల్వేస్టేషన్లో స్టాపేజ్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీచేశారు. కానీ జిల్లా కేంద్రంలో రైళ్లు ఆగకపోవడం, చైన్నెకి నేరుగా రైలు లేకపోవడం పై పట్టించుకోకపోవడం కొసమెరుపు. ఎంపీ మిథున్రెడ్డి వినతి చైన్నె –మదనపల్లె రోడ్డు మధ్య రైలు నడిచేలా కోవిడ్ సమయంలో రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వీటి పై రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి రైల్వే మంత్రిని కలిసి వినతి చేశారు. ఈ రైలు చైన్నెలో ఉదయం 8 గంటలకు బయలుదేరి 11.25 గంటలకు చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లె రోడ్కు వస్తుందని, తర్వాత తిరిగి 2.45 గంటలకు మదనపల్లె రోడ్ నుంచి బయలుదేరి రాత్రి 8.55 గంటలకు చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ చేరుకునేలా షెడ్యూల్ను గతంలో నిర్ణయించారు. ఈ రైలును ప్రారంభిస్తే రెండు రాష్ట్రాలకు చెందిన చిత్తూరు, చైన్నె, మదనపల్లె వాసులకు ఎంతో సౌకర్యం ఉంటుంది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో? కాట్పాడిలో ఆగే రైలు చిత్తూరులో ఆగితే నగరవాసుల కల తీరుతుందని పలువురు అభిప్రాయపడుతన్నారు. చిత్తూరు నుంచి దేశంలోని ముఖ్య నగరాలైన ఢిల్లీ, కలకత్తా, బాంబే, అహ్మదాబాద్తో పాటు నాగపూర్, బెంగళూరు వంటి నగరాలకు రైలు సదుపాయం ఉంది. కానీ వాటి కంటే తక్కువ దూరంలో ఉన్న చైన్నెకి రైలు సదుపాయం లేదు. చిత్తూరు నుంచి చైన్నెకి రైలు సదుపాయం కల్పించాలని చిత్తూరు స్మార్ట్ సీటీ డెవలప్మెంట్ సభ్యులు స్థానిక రైల్వేస్టేషన్లో ప్రజాభిప్రాయాలు తీసుకుని రైల్వేశాఖకు సైతం పంపారు. కానీ దీనిపై పాలకులు ఎలాంటి శ్రద్ధా చూపలేదు. స్టేషన్ మాస్టర్కు అందజేస్తున్న సంతకాల జాబితా(ఫైల్) వీటిని ఆపే దమ్ముందా? తిరుపతి–రామేశ్వరం, హౌరా–పాండిచ్చేరి, ఓకా–రామేశ్వరం, తిరుపతి–రామేశ్వరం, టాటా–యశ్వంత్పూర్, కన్యాకుమారి, హఠియా–యశ్వంత్పూర్, హౌరా–పాండిచ్చేరి రైళ్లు చిత్తూరు మీదుగా వెళ్తుంటాయి. కానీ వీటికి ఇక్కడ స్టాపింగ్స్ లేవు. వీటిలో ప్రయాణించాలంటే పాకాల లేదా తిరుపతి, కాట్పాడికి వెళ్లి ఎక్కాల్సిందే. -
గ్యాస్ కొరత అవాస్తవం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్యాస్ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ప్రస్తుతం 42 గ్యాస్ ఏజెన్సీలున్నాయిని, దాదాపు 16 వేల సిలిండర్లు బఫర్ స్టాక్గా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.వినియోగదారులు బుక్ చేసిన 48 గంటల లోపే సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. సరఫరా వ్యవస్థను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. గ్యాస్ పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రతి ఏజెన్సీ వద్ద ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08572–242734కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అయితే వినియోగదారులు కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. -
పెండింగ్ పనుల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశా లల్లో పెండింగ్లో ఉన్న నాడు– నేడు (మనబడి మన భవిష్యత్) పనులను సమగ్రశిక్ష జేడీ మువ్వా రామలింగం మంగళవారం పరిశీలించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో నాడు–నేడు కింద పనులు చేపట్టారు. రెండో విడత పనుల్లో జిల్లావ్యాప్తంగా 830 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనులను చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. దీంతో రూ.30 కోట్లు నిధులు ఆయా పాఠశాలల ఖాతాల్లో అలాగే ఉన్నా యి. త్వరలో పెండింగ్లో ఉన్న పనుల పూర్తికి ఉన్నత విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇవ్వనున్నట్లు సమగ్రశిక్ష శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు విచ్చేసిన జేడీ మువ్వారామలింగం పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో పెండింగ్ పనులను తనిఖీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఏపీసీ వెంకటరమణ, ఎంఈఓలు మోహన్, గణపతి పాల్గొన్నారు. -
గోమాతపై దాష్టీకం
నగరి : పట్టణంలో మూగజీవిపై అమానుష దాడి చోటుచేసుకుంది. కూరగాయలు తినిందనే కారణంతో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గోమాతను తీవ్రంగా గాయపరిచిన ఘటన బస్టాండు ప్రాంగణంలోని సంత మైదానంలో కలకలం రేపింది. మున్సిపల్ పరిధిలోని కీలపట్టు దళితవాడకు చెందిన సుబ్రమణ్యం కుటుంబానికి చెందిన ఆవు చూలుతో ఉంది. ఏమరపాటుగా వదిలేయడంతో ఆవు సోమవారం సాయంత్రం సంత మైదానంలోకి వెళ్లి కొన్ని దుకాణాల వద్ద ఉన్న కూరగాయలను తిన్నట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకున్న గుర్తుతెలియని దుకాణదారు, ఎవరూ లేని సమయంలో ఆవు వెనుక భాగంలో కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆవును వెతుక్కుంటూ వచ్చిన యజమాని సోమవారం రాత్రి ఆవు ఆక్రందన విని అక్కడికి చేరుకోగా, తీవ్రంగా గాయపడిన స్థితిలో కనిపించింది. వెంటనే పశువుల ఆస్పత్రికి తరలించగా, వైద్యులు 24 కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. మూగజీవిపై ఇలాంటి క్రూర చర్యకు పాల్పడిన నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
జెడ్పీ విభజనకు కసరత్తు?
ఉమ్మడి జిలాలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మందికి పైగా జెడ్పీ ఉద్యోగులున్నారు. విభజన సమయంలో ఉద్యోగులు ఏ జిల్లాకు వెళ్లాలనుకుంటున్నారు? ఆ తర్వాత సీనియార్టీ కేడర్ ప్రతిపాదికన జాబితాను అధికారులు సిద్దం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుత జిల్లా పరిషత్ పునర్వ్యవస్థికరించడం, కొత్త జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన, తాతాక్కలిక భవనాల గుర్తింపు, కేటాయింపు , జడ్పీ భవనాల నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జెడ్పీ ఎన్నికల ప్రకటన వచ్చేలోపు ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాల వారీగా పూర్తి స్థాయి ఆదేశాలు రావాల్సి ఉంది. ఉద్యోగుల జాబితా తయారీ, ఇతర వాటిపై సృష్టత రావాలి అని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలియజేశారు. చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కేంద్రంగా జెడ్పీ పరిపాలన సాగుతోంది. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఉండటంతో వాటి విభజన చేయలేదు. ప్రస్తుతం వారి పాలన గడువు సెప్టెంబర్లో ముగియనుంది. దీంతో జెడ్పీల విభజన చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎం సూచనప్రాయంగా ప్రకటించారు. దీంతో కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి వేరుపడి కొత్తగా మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిషత్ ఏర్పా టు కానున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటూ పాలకుల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. దీంతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు ప్రక్రియ రూపుదాల్చనుంది. ఇది వరకే కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ ఏర్పాటవుతాయని, తద్వారా ఎన్నికలు జరుగుతాయంటూ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తెలియజేశారు. ఇప్పటి వరకు కడప ఉమ్మడి జిల్లా కింద రాయచోటి నియోజకవర్గంలోని మండలాలుండగా ఇవన్నీ మదనపల్లె కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా పరిషత్ కిందకు చేరనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కింద ఉన్న పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలోని మండలాలు అన్నమయ్య జిల్లా పరిషత్లో చేరనున్నాయి. ఐదు నియోజవర్గాల పరిధిలోని 25 మండలాల పరిధి కింద జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ ఉద్యోగోన్నతులు జరగ్గా.. కొత్త జిల్లాలకు కేటాయింపునకు వీలుగా సీఈవోల నియామకానికి కసరత్తు దాదాపు పూర్తి చేశారు. ఆర్థికశాఖ అనుమతులు రాగానే కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు, వాటికి సీఈవోలు,ఉద్యోగుల సర్దుబాటు వ్యవహారం పూర్తి కానుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త జడ్పీ అధికార యంత్రాంగం చేపట్టనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు 2021లో జరగ్గా ఆ తర్వాతనే 2022 ఏప్రిల్ జిల్లాల పునఃవ్యవస్థీకరణ జరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్ పాలన సాగింది. ఇక జిల్లాల వారీగా జిల్లా పరిషత్ అందుబాటులోకి వస్తాయి. వ్యవస్థ ఏర్పాటుతో పాటు రాజకీయంగానూ జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. 17సీటీఆర్55: జెడ్పీ కార్యాలయం సీనియార్టీ ప్రాతిపాదికన -
టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు , సెకండ్ గ్రేడ్ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపా రు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ జాబితాను మేనేజ్మెంట్ల వారీగా (జిల్లా పరిషత్, ప్రభుత్వం, మున్సిపాలిటీలు , కార్పొరేషన్) విభజించి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో నమోదు చేశామన్నారు . గతంలో (మార్చి 1న) విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని సవరించిన అనంతరం తుది జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు చెప్పారు. అలాగే ఎంఈఓ డీవైఈవో మెయిల్స్కు పంపినట్లు తెలిపారు. సవరించిన ఈ జాబితాలపై ఇంకా ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే, తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పా రు. అభ్యంతరాలను ఈనెల 23వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. కడా పీడీ ఆకస్మిక తనిఖీ కుప్పం: నియోజకవర్గంలోని మూడు గురుకుల పాఠశాలలో కడా పీడీ వికాస్ మర్మత్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మంగళవారం రామకుప్పం, కడపల్లి, గణేష్పురంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల వసతి గృహాల్లో తనిఖీ చేట్టా రు. వసతి గృహాల్లో విద్యార్థులకు వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయాలు, హాస్టల్స్ తాగునీరు, మురుగు దొడ్లు పరిశుభ్రతను పరిశీలించారు. వసతి గృహాల భోజనాల నాణ్యత, వంట గదులు పరిశుభ్రత, భోజనాల రుచి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బదిలీ చిత్తూరు కలెక్టరేట్: ఐవోసీఎల్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటశివను నంద్యాల జిల్లా ఆత్మకూ రు ఆర్డీవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. -
లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలి
ఐరాల : లాభసాటి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కోరారు. మంగళవారం మండలంలోని 45 కొత్తపల్లెలో జిల్లా వ్యవసాయాధికారి మురళి ఆధ్వర్యంలో స్థానిక రైతులకు రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా అన్ని శాఖలను సమన్వయం చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మారుతున్న కాలనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ఫ్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలపై పంచసూత్రాల విధానాన్ని రైతులు అవలంబించేలా అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్యం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం వలన జరిగే మేలును వివరించాలన్నారు. జిల్లా వ్య వసాయాధికారి మురళి మాట్లాడుతూ.. రైతులు ఒకే రకం పంటను సాగు చేయకుండా వేర్వేరు పంటలను సాగు చేసుకోవాలని, ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసుకోవాలన్నారు. పంటల సాగుకు నీటిని పొదుపుగా వాడడంతో పాటు, భూగర్భ జలాలను పెంచే విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ప్రకృతి వ్యసాయం జెడ్బీఎన్ఎఫ్ నుంచి పీఎండీఎస్ కిట్స్ 25 రకాల ధాన్యాలు రైతులకు పంపిణీ చేశారు. జేసీ రైతులకు పంచ సూత్రాల కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమామహేశ్వరి, డీఆర్సీ ఏఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ లోకేశ్వరి, ఎంపీడీఓ చంద్రశేఖర్రెడ్డి, ఏఓ శివప్రసాద్, ఆర్ఎస్కే సిబ్బంది రామచైతన్య, నరేష్, శంకర్, అశ్విని, జెడ్బీఎన్ఎఫ్ సిబ్బంది భారతి, యతీంద్రనాయుడు, రేఖ, వాణి, రైతులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి మురళి రైతులకు ధాన్యాలు పంపిణీ చేస్తున్న జేసీ -
జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియామకం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియమించారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి మురళికృష్ణ (సూపరింటెండెంట్) ను నియమించారు. ఆయన రెండు జిల్లాల పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తారు. అలా గే ఏప్రిల్ 4,5 తేదీల్లో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ట్యాబ్ ఆధారిత మార్కుల ఎంట్రీ సిస్టమ్ను, మూల్యాంకనం పనితీరును పరిశీలన చేస్తా రు. పదో తరగతి మూల్యాంకన కేంద్రాల్లో 300 ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి అనుమతులిచ్చారు. ట్యాబ్ పరికరాల నిరంతర చార్జింగ్, పవర్ సాకెట్లతో కూడిన పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇందుకు గాను ప్రత్యేక నిధులను కేటాయించారు. నేడు దివ్యాంగ శక్తి ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బుధవారం చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రారంభించనున్నట్లు డీపీటీఓ రాము ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పథకం ద్వారా 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారికి సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని పేర్కొన్నారు. నాన్–స్టాప్, ఇంటర్స్టేట్ సర్వీసులకు ఈ సౌకర్యం వర్తించదని స్పష్టం చేశారు.100 శాతం దృష్టి లోపం లేదా మేధోపరమైన వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. డిజిటల్ బస్ పాస్ కలిగిన వారు తప్పనిసరిగా సదరన్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలని, కండక్టర్లు అర్హతను పరిశీలించి జీరో ఫేర్ లేదా రాయితీ టికెట్లు జారీ చేస్తారని వివరించారు. కాణిపాకంలో కియోస్క్లు కాణిపాకం: భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కీలక కాణిపాకం దేవస్థానంలో ముందడుగు పడింది. ఆలయంలో టికెట్లు, ఆర్జిత సేవ లు, విరాళాలు సులభంగా పొందేందుకు ఆలయ అధికారులు 8 కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్లను ఎమ్మెల్యే మురళీమోహన్ మంగళవారం ప్రారంభించారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మిషన్లు భక్తులకు వేగవంతమైన సేవలు అందించనున్నాయి. ప్రారంభానికి ముందు ఆర్జిత సేవా కౌంటర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచ లకిషోర్, బోర్డుసభ్యులు పాల్గొన్నారు. 14 మంది పందెం రాయుళ్లపై కేసు పెనుమూరు (కార్వేటినగరం): కోడి పందేలు ఆడుతున్న 14 మందిపై దాడులు చేసి కేసు నమోదు చేసిన సంఘటన పెనమూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా... మండల పరిధిలోని శాతంభాకం పంచాయతీ బలిజపల్లి చెరువుకు తూర్పుభాగాన ఖాళీ స్థలంలో మామిడి చెట్టు కింద కోడి పందేలు ఆడుతున్నట్లు అందిన రహస్య సమాచార మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టామన్నారు. ఈ దాడుల్లో రూ.15,350 నగదు, ఏడు కోడి పుంజులను స్వాధీనం చేసుకుని కోడి పందేలు ఆడుతున్న 14 మంది అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మనేక్షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో ఎంఓయూ ఏర్పేడు: దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో నూతన ఆవిష్కరణల కోసం తిరుపతి ఐఐటీ, ద మనేక్షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ రీసెర్చ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీలో మంగళవారం ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, మానేక్షా సెంటర్ ముఖ్య పోషకుడు, గౌహటి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవేంద్ర జలిహాల్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా భద్రతా సంస్థలు, ప్రముఖ భాగస్వాముల సహకారంతో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష రంగంపై అధునాతన పరిశోధనలు చేయనున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మనేక్షా సెంటర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డా. సుబ్రతా సాహా, మానేక్షా సెంటర్ సీవోవో శంఖ సువ్ర భౌమిక్, తిరుపతి ఐఐటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సుమంత్ విజయం
చిత్తూరు అర్బన్: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఎన్నికల్లో చిత్తూరుకు చెందిన ఎన్వీ సుమంత్ విజయం సాధించా రు. సుమంత్ చిత్తూ రు నగరంలోని తోటపాళ్యం కాగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఓ ట్ల లెక్కింపులో చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూ రు, తిరుపతి జిల్లాల నుంచి 1409 ఓట్ల కోటాను సాధించిన ఆయన.. బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనట్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత ప్రకటించారు. చిత్తూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది, ప్రస్తుత రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథరెడ్డి తనయుడే సుమంత్ కావడం గమనార్హం. ఆయన గెలుపుపై జిల్లాకు చెందిన పలువురు న్యాయ వాదులు, న్యాయవాద సంఘాలు సైతం అభినందనలు తెలిపారు. నాణ్యమైన కరెంటు సరఫరాకు కృషి పెనుమూరు(కార్వేటినగరం): విద్యుత్ విని యోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన విద్యుత్ను అందించాలని ఎస్ ఈ ఇస్మా యిల్ అహ్మద్ అన్నారు. మంగళ వారం పెనుమూరు విద్యుత్ సబ్స్టేషన్ను తని ఖీ చేశారు. వేసవి దృష్యా విద్యుత్ వినియో గం పెరిగే అవకాశం ఉందని దానికి అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ను అందించాలని పేర్కొన్నారు. గ్రామాలలో విద్యుత్ వినియో గంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాత బకాయిలను వేగవంతంగా వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం సబ్స్టేషన్ రికార్డులను పరిశీలించి తగు సూచనలిచ్చారు. ఆయన వెంట చిత్తూరు రూరల్ ఈఈ సురేష్కుమార్, పెనుమూరు ఏఈ తులసీ ప్రసాద్ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం వి.కోట : బైక్పై వెళ్తున్న వ్యకిని గుర్తుతెలియని లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం మండలంలోని పలమనేరు–వి.కోట జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం వేకువ జామున మండలంలోని నెర్నిపల్లి గ్రామానికి చెందిన అక్బర్ సాహెబ్(60) పలమనేరు జాతీయ రహదారి దొడ్డిపల్లి క్రాస్ సమీపంలో తన బైక్పై రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న గుర్తు తెలియని లారీ అక్బర్ బైక్ను ఢీకొని ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అక్బర్ అక్కడికక్క డే మృతి చెందాడు. గమనించిన స్థానికలు పోలీ సులకు ఈ ఘటన పై సమాచారం ఇవ్వగా సీసీ ఫుటేజ్ సాయంతో ప్రమాదానికి కారణమైన లారీ ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ మేనేజర్గా కృష్ణానాయక్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్గా కృష్ణానాయక్ను ప్రభు త్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు నూతనంగా ప్రాజెక్ట్ మేనేజర్గా నియమితులైన ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. -
139 విద్యుత్ సమస్యల గుర్తింపు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట చేపట్టారు. జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 30 సమస్యలు, డీటీఆర్ 1, ఎల్టీ లైన్ల పరంగా 90, సర్వీసు లైన్లకు 18 కలిపి మొత్తం 139 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఆస్తి పన్నుపై వడ్డీ బాదుడు! చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుపై వడ్డీ మాఫీని 50శాతానికే పరిమితం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వాళ్లకు.. అప్పటి వరకు ఉన్న వడ్డీపై 50 శాతం మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆస్తి పన్నుపై మొత్తం వడ్డీ మాఫీ చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్నుపై దాదాపు రూ.26.02 కోట్లు వడ్డీ ఉండగా.. ఇందులో 50 శాతం మాఫీ చేసిన తర్వాత ప్రజలపై రూ.13 కోట్ల వడ్డీ భారం పడుతోంది. అలాగే కుప్పం మున్సిపాలిటీలో రూ.97 లక్షలు, పలమనేరులో రూ.14 లక్షలు, నగరిలో రూ.68 లక్షలు వడ్డీని ప్రజలు భరించాల్సి వస్తోంది. మొత్తం రూ.14.8 కోట్లు వడ్డీని తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యుత్ సర్వీసుల విడుదలకు ఆదేశం చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్ఫార్మర్లు స్టాకు వస్తోందని వ్యవసాయ విద్యుత్ సర్వీసులను సకాలంలో విడుదల చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఆదేశించారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్, రూరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండు డివిజన్ల పరిధిలో దాదాపు 1000 వ్యవసాయ సర్వీసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్ల నిల్వలు పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయని, ఏప్రిల్ ఆ సంఖ్య మరింత పెర గే ప్రమాదముందని హెచ్చరించారు. ఆ సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ చౌర్యంపై ప్రత్యేక నిఘా పెట్టాని ఆదేశించారు. సమావేశంలో ఈఈలు మునిచంద్ర, సురేష్, హరి పాల్గొన్నారు. హోటల్లో గ్యాస్ చార్జీలు! చిత్తూరు అర్బన్: చైన్నెలోని హోటళ్లలో భోజ నం చేసినా, పార్శిల్ తీసుకెళ్లినా గ్యాస్ చార్జీలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన చిత్తూరు నగరంలోనూ జరిగింది. నగరంలోని ఓ హోటల్లో మంగళవారం ఉదయం టిఫిన్ పార్శిల్ తీసుకున్న వ్యక్తికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. గ్యాస్ పేరిట అదనంగా మరో రూ.10 బిల్లులో చేర్చింది. దీంతో వినియోగదారులు ఆ హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దేవునితో రాజకీయాలు దురదృష్టం
– మాజీ మంత్రి ఆర్కే రోజా పుత్తూరు: దేవునితో రాజకీయాలు చేయడం దుర దృష్టకరమని, ఆలయాల వద్ద పాలిటిక్స్కు స్థానమే లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పుత్తూరులోని శ్రీధర్మరాజస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ద్రౌపదీ దేవి 40 అడుగుల భారీ విగ్రహానికి పూజలు చేశా రు. అనంతరం రోజా మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ఆలయాల వద్ద సైతం కుటిల రాజకీయాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ద్రౌపదీదేవి రాజగోపురానికి రూ.20 లక్షలను మంజూరు చేయించామని, మరో రూ.5లక్షల సొంత నిధులు అందించామని, మొ త్తం రూ.25లక్షలతో నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు.అలాగే అమ్మవారి గర్భగుడిని సైతం ఆధు నికీకరించామన్నారు. అప్పట్లో ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాకుంభాభిషేకంలో రాజకీయాలకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేశామ ని తెలిపారు. అయితే ఆలయ ఆవరణలో తాము ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ప్రస్తుత పాలకులు అహంకారంతో ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టను సైతం పార్టీ కార్యక్రమంగా నిర్వహించి భక్తులను అవమానించారని విమర్శించారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని దేవాలయాల్లో రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్ చైర్మన్ డి.జయప్రకాష్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకాంబరం, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశులు, నేతలు రవీంద్ర, రాజేశ్వరి, మునిరత్నం, చక్రి, బాలాజీ, గుణ, ఈశ్వ రయ్యయాదవ్, ప్రవీణ్, దిలీప్కుమార్, కుట్టి, లారీ మోహన్, మనోహర్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివలింగం, సుబ్రమణ్యం, చిన్నా, శివ, శీనా పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగం..
అప్రజాస్వామిక పాలన●అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తున్న నేతలుతిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులుభయపడం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లన్నీ వారితో నింపినా భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన గూండాలు దాడులు చేస్తే వారిని వదిలిపెట్టి, దాడిలో గాయపడిన మా పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడం దుర్మార్గం. ఇసుక అక్రమ రవాణా విషయమై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై అక్రమ కేసు నమోదు చేయడం, నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, మరికొంత మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు, రెడ్బుక్ పాలనకు నిదర్శనం. – డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి బాధితులపై కేసులు పెడతారా? వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి బాధితులపైనే కేసులు పెడతారా..? చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలంటే చులకనగా చూస్తున్నారు. మగువ, మత్తుపదార్థాలతో కూటమి నేతలు జోగుతున్నారు. అధికార అహంకారంతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాసలీలల బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత లేదు. శ్రీవారి భక్తుల మనోబావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు నిజంగా శ్రీవారిపై భక్తి ఉంటే వెంటనే బీఆర్ నాయుడుని తొలగించాలి. – నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం భ్రష్టు పట్టించారు టీటీడీ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా టీటీడీ ప్రతిష్టను బీఆర్ నాయుడు భ్రష్టుపట్టించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నీ అపరాచాలే. ఇలాంటి చైర్మన్ ఎప్పుడూ లేడు. ఇక రారు కూడా. ఆయనను ఇంకా చైర్మన్గా కొనసాగిస్తే అంత కంటే మహాపాపం మరొకటి ఉండదు. ఇప్పటికై నా చేసిన తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడు తప్పుకోవాలి. – సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ నిరసన తెలిపే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా? దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతోనే కూటమి పాలన సాగిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఎస్సీలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. కామ కలాపాలు సాగించే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా కొనసాగించడం దారుణం. – నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తసాక్షి ప్రతినిధి, తిరుపతి/మంగళం: రెడ్బుక్ రాజ్యాంగంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం ఈ మేరకు తిరుపతి, చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద చేపట్టిన మెరుపు ధర్నాలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచడంపై మండిపడ్డారు. తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యాలు నశించాలంటూ నినదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మాధవిరెడ్డి పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రా జ్యాంగం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో ఎన్నడూ దాడులు జరిగి న దాఖలాలే లేవు. నైతిక విలువలు లేని బీఆర్ నా యు డిని టీటీడీ చైర్మన్గా కొనసాగించడం కంటే మహా పా పం మరొకటి ఉండదు. ఆయన్ని ఉపేక్షించడంలో ఆంతర్యమేంటో చెప్పాలి. – భూమన అభినయ్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తబీఆర్ నాయుడుని తొలగించాలి తిరుమల శ్రీవారి పరమభక్తుడిని, ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏడు కొండలనే చూస్తానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికై నా స్పందించాలి. బీఆర్ నాయుడు అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలే తప్ప ప్రజాపాలన లేదు. అక్రమ కేసులు పెడితే భయపడి ఇంట్లో ఉంటామనుకుంటే పొరబాటే. – చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్న్యాయమే గెలిచింది.. అధర్మం ఓటమి పాలైంది.. ఇందుకు నిదర్శనం అక్రమ కేసులో అరెస్టయిన అందరినీ విడుదల చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పడమే.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి రాసలీలలను వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టారు. వీరిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. అధికార పార్టీ సూచనల మేరకు పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్సార్సీపీ నాయకులు పసుపులేటి సురేష్ బాబు అలియాస్ సురేష్, ఏ అజయ్కుమార్, ఈ.అనిల్కుమార్ రెడ్డి, బి అరుణ్ కుమార్ యాదవ్ అలియాస్ అరుణ్ యాదవ్, బృంగి నవీన్, ఎల్ .దినేష్, ఎన్. బాబు, ఏ. కోటి ,బి గీతా యాదవ్ అలియాస్ గీతాదేవి, ఎం. సాయికుమారి, కె లక్ష్మి ,జి విజయలక్ష్మి, కె.వి పద్మజ తదితరులను అరెస్టు చేశారు. దీనిపై న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు అందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. చిత్తూరు కార్పొరేషన్ : టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టడంపై మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ మహిళలను టీడీపీ నేతలు అసభ్యంగా దూషించడం హేయమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పాలనను ఇప్పటి వరకు చూడలేదని విమర్శించారు. బీఆర్నాయుడు రాసలీలలు బయటపడినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం ఫోన్లోనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినందుకు అప్పటి ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీని వెంటనే తొలగించారని గుర్తుచేశారు. బీఆర్ నాయుడు వీడియోలు వెలుగు చూసినా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నిరసనకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ సంఖ్యలో మొహరించారు. కార్యక్రమంలో నేతలు గాయత్రీదేవి, విజయసింహారెడ్డి, కేపీ శ్రీధర్, సరళమేరీ, అంజలిరెడ్డి, హరిషారెడ్డి, సూర్యప్రతాప్రెడ్డి, సుగుణశేఖర్, అప్పొజీ, రజనీకాంత్, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, మనోజ్రెడ్డి, వెంకటేష్, ప్రతిమారెడ్డి, అల్తాఫ్, నారాయణ, దేవరాజులు, మనోహర్, డేవిడ్ పాల్గొన్నారు. చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రం ఇస్తున్న విజయానందరెడ్డి ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు ‘‘ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు ప్రభుత్వం పాతరేసింది.. పేదల సంక్షేమానికి తిలోదకాలిచ్చింది.. రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసింది.. కుటిల రాజకీయాలకు తెరతీసింది.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడమే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోంది. ప్రశ్నించిన వారిని జైలుపాలు చేస్తోంది.. నిలదీస్తే నిలువునా దాడులు చేయిస్తోంది.. నైతికత లేని వారిని అందలం ఎక్కిస్తోంది.. అన్యాయాలే అజెండాగా అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది‘‘ అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలను దారుణంగా కొట్టిన టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలకు అండగా నిలిచి బాధితులపై ఆక్రమ కేసులు నమోదు చేసిన పోలీసుల వైఖరిని ఖండించారు. సర్కారు తీరును ఎండగడుతూ మంగళవారం చిత్తూరు..తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహాల వద్ధ మహాధర్నా చేపట్టారు.చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తిన ఆగ్రహం -
యువతకు వరం..‘జాబ్ కనెక్ట్’
చిత్తూరు కలెక్టరేట్ : యువతకు సీడాప్ జాబ్ కనెక్ట్ ఓ వరమని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం చిత్తూరులోని టీటీడీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సీడాప్ జాబ్ కనెక్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీడీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా మేనేజర్ సరితారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు, పరిశ్రమలకు వారధిలా పనిచేయడమే సీడాప్ జాబ్ కనెక్ట్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. జాబ్ మేళాకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం 170 మంది హాజరయ్యారన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 102 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నట్లు వివరించారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ!
కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు ● అర్జీలు స్వీకరించిన ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ చిత్తూరు కలెక్టరేట్: సమస్యలు పరిష్కరించండి సారూ..! అంటూ పలువురు అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నా రు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు ఉన్నతాధికారుల ఎదుట తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర న్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించేలా క్షేత్రస్థా యి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. భూ సేకరణపై ఆందోళన కుప్పం ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చేస్తున్న భూ సేకరణ ప్రక్రియలో భూ బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్బాబు, చిత్తూరు నియోజకవర్గం ఇన్చార్జ్ టిక్కిరాయల్లు డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ బాధితులకు ముందుగా ప్రభుత్వం నిర్ధేశించిన పరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే భూ సేకరణ ప్రక్రియను చేపట్టాలన్నారు. ఒక వేళ పరిహారం అందజేయకుండా భూ సేకరణకు ప్రయత్నిస్తే, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇన్చార్జ్ కలెక్టర్కు సమస్యలు మొరపెట్టుకుంటున్న అర్జీదారులున్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు -
మామిడి చెట్లు దగ్ధం
గంగాధరనెల్లూరు : మండలంలోని తూగుండ్రం పంచాయతీ దళితవాడకు చెందిన కళ్యాణి, అన్నాదొరైకి చెందిన 150 మామిడి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు సమీపంలోని గుట్టకు నిప్పు పెట్టడంతో గుట్టతో పాటు పక్కన ఉన్న పొలంలోకి మంటలు వ్యాపించాయి. చేతికి వచ్చే దశలో మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. టీటీడీకి కూరగాయల వితరణ పలమనేరు: తిరుమలలోని అన్నదాన కేంద్రానికి పట్టణంలోని మార్కెట్ నుంచి 12 టన్నుల కూరగాయలను రాష్ట్ర సంచార జాతుల సంఘ అధ్యక్షుడు పూసల రవి ఆధ్వర్యంలో సోమవా రం అందజేశారు. టీటీడీ వాహనానికి దాతలు పూజలు చేసి గోవిందనామ స్మరణ మధ్య తిరుమలకు సాగనంపారు. ఇందులో మండీ యజమానులు రెడ్డెప్పరెడ్డి, కందస్వామి తదితర శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. 166 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షకు 166 మంది గైర్జాజరైనట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 734 మంది విద్యార్థులకు గాను 568 మంది హాజరైనట్టు ఆయన వెల్లడించారు. పోలీసు గ్రీవెన్స్కు 42 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. సేవకు పురస్కారాలు చిత్తూరు ఆర్బన్: పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను సోమవారం ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి తొమ్మిది మందిని ఈ పురస్కారాలు వరించాయి. ఎస్ఆర్.రాజశేఖర్రాజు, ఏఎస్పీకి మహోన్నత సేవా పతకం, జీ,గోపాల్ ఆర్ఎస్ఐ(డీఏఊఆర్)కు ఉత్తమ సేవా పతకం, చిత్తూరు వన్టౌన్ సీఐ ఎన్.మహేశ్వర, ఐరాల ఏఎస్ఐ కే.వేణుగోపాల్నాయుడు, ఎం.పరంధామనాయుడు, ఏఎస్ఐఐ, శ్రీరంగరాజపురం, ఎన్.ఉదయకుమార్, హెచ్సీ, మహిళా పీఎస్, చిత్తూరు, ఎం.ఎస్.సుమన్, ఏఆర్ పీసీ (డీఏఆర్), చిత్తూరు, వి.సురేష్, ఏఆర్ హెచ్సీ (డీఏఆర్), చిత్తూరు, బి.ఢిల్లీ, హెచ్సీ, గుడిపాల పీఎస్కు సేవా పతకాలు వరించాయి. పశువులకు వ్యాధి నిరోధక టీకాలు చిత్తూరు కలెక్టరేట్ : పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేయించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. -
‘మురుగు’ ఆలోచనలొద్దు?
రైతులను ముంచేస్తారా..? మామిడి కాయల మార్కెట్ యార్డుకు 40 ఏళ్లుగా వస్తూ పోతున్నాం. రైతులకు అనువైనా స్థలం. ఇక్కడ మురుగునీటి శుద్ధ కేంద్రం ఏర్పాటు చేస్తే..రైతులకు ఇబ్బంది తప్పదు. కాయలు తోలుకొస్తే..ఇక్కడ ఎలా ఉండాలి. రాత్రి పగలు...ఇక్కడే పడి ఉంటాం. ఆ కంపును భరించలేం. మామిడి కాయల మార్కెట్లో ఆ కేంద్రం వద్దు. ఊరు చివరన పెట్టండి. – దొరస్వామి, మామిడి రైతు, చిత్తూరు ప్లాంట్ వద్దు మార్కెట్ యార్డులో కొన్నేళ్లుగా ట్రేడర్ నడుపుతున్నాం. ఏడాదిలో నాలుగు నెలలు మార్కెట్ రద్దీగా కనిపిస్తోంది. లారీలు వచ్చి క్యూకడతాయి. వాటికి సరిపడినంత స్థలం ఉంది. రెండు ఎకరాల స్థలం మురుగు నీటి శుద్ధ కేంద్రానికి ఇచ్చేస్తే.. మార్కెట్ స్థలం కుంచించుకుపోతుంది. మామిడి వ్యాపారాలకు అంతరాయం ఏర్పడుతోంది. – రత్నంరెడ్డి, ట్రేడర్, చిత్తూరు చిత్తూరు రూరూల్ (కాణిపాకం): చంద్రబాబు సర్కార్ వ్యవసాయ మార్కెట్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోంది. మార్కెట్ స్థలంలో మురుగు నీటి శుద్ధ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతు కార్యకలపాలను భ్రష్టు ప ట్టించేలా చూస్తోంది. మురుగునీటి శుద్ధ కేంద్ర ఏర్పా టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ...మార్కెటింగ్ శాఖ జేడీకి సోమవారం ట్రేడర్లు, రైతులు ఫిర్యాదు చేశారు. మామిడి వ్యాపారానికి కీలక కేంద్రం చిత్తూరు జిల్లా మామిడి పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. పంటను చిత్తూరు నగరంలోని కట్టమంచి వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మామిడి సీజన్ సమయంలో ఈ మార్కెట్ యార్డు రైతులకు ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ సమయంలో రోజువారీగా సుమారు 50 లారీలలో మామిడి పండ్లు లోడింగ్ చేసి రాజస్థాన్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ వ్యాపారం ద్వారా వేలాది మంది రైతులు, కూలీలు, వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. మార్కెట్ యార్డులో మొత్తం 43 షాపులు ఉండగా, అందులో సుమారు 34 షాపులు నడుస్తున్నాయి. అయితే అత్యంత విలువైన ఈ మార్కెట్ యార్డులోనే మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు జరగుతున్నాయి. మార్కెట్ స్థలంలో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తే వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని పలువురు పేర్కొంటున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రమంటే? ఇళ్ల నుంచి, డ్రైనేజీ లైన్ల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) అంటారు. ఈ కేంద్రంలో మురుగు నీటిలో ఉన్న చెత్త, మలినాలను ప్రత్యేక పద్ధతుల్లో తొలగించి నీటిని శుభ్రం చేస్తారు. శుద్ధి చేసిన నీటిని తోటలు, పార్కు లు, పరిశ్రమల అవసరాలకు వినియోగిస్తారు. పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభు త్వం ఈ కేంద్రా లను ఏర్పాటు చేస్తుంది. అయి తే నివాస ప్రాంతాలు లేదా వ్యాపార ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే అసౌకర్యం తలెత్తే అవకాశం ఉందని స్థానికులు చెబు తున్నారు. వ్యాపారాలకు ఆటంకం మార్కెట్ యార్డు స్థలంలో రెండు ఎకరాల భూమిని మురుగునీటి శుద్ధి కేంద్రం కోసం కేటాయిస్తే వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని రైతులు, ట్రేడర్లు చెబుతు న్నారు. ముఖ్యంగా మామిడి సీజన్ సమయంలో పెద్ద సంఖ్యలో లారీలు మార్కెట్ యార్డు కు వచ్చి పోతుంటాయి. ఇలాంటి సమయంలో స్థలం తగ్గిపోతే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో ప్రస్తుతం వ్యాపారస్తులు కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం జరిగి తే తమ దుకాణాలను తరలించాల్సివస్తుందని, అప్పుడు వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం కూ డా నిలిచిపోవచ్చని అంటున్నారు. చుట్టుపక్క ల నివసిస్తున్న ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. నగర శివారులో ఏర్పాటు చేయాలి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మార్కెట్ యార్డు లో కాకుండా నగర శివారు ప్రాంతాల్లో లేదా అనువైన ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేయాల ని రైతులు, ట్రేడ ర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో విజయ డెయిరీ, చక్కెర ఫ్యాక్టరీలు, మత్స్యశాఖ ఆస్తుల తర్వాత ఇప్పుడు మార్కెట్ యార్డు స్థలంపై కూడా కన్నేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రైతులు, ట్రేడర్ల సమావేశం మార్కెట్ స్థలం ధారాదత్తం చేసే కుట్ర ఈ విషయంపై సోమవారం మార్కెట్ యార్డు లో రైతులు, ట్రేడర్లు సమావేశమయ్యారు. మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికా రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రీజినల్ మార్కెటింగ్ శాఖ జేడీ రామాజంనేయులను కలసి వినతి పత్రం అందజేశారు. -
సచివాలయ ఉద్యోగికి గాయాలు
రొంపిచెర్ల: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలైన ఘటన అన్నమయ్య– చిత్తూ రు జిల్లా సరిహద్దులో సోమవారం ఉదయం జరి గింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలం, పెద్దమల్లెల రైతు సేవాకేంద్రంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్గా పని చేస్తున్న రాజకుమార్ పీలేరు నుంచి ద్విచక్ర వాహనంలో విధులకు బయలు దేరారు. పీలేరు మండలం, ఎర్రగుంటపల్లె సమీపంలోని స్సీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి రాజకుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకుమార్ వేలూరు సీఎంసీలో కోమాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ బాధ్యతల స్వీకరణ కుప్పం: ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ఆచార్య ఎస్.సి.మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ యున్సివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను కుప్పం ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాన్ని విద్య, పరిశోధన, పరిపాలన రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం వర్సిటీలో ఉద్యోగులు ఆయనను కలసి శుభాంకాంక్షలు తెలిపారు. -
‘అనుభవం’ లేదు సర్!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర విద్యాశాఖ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ వింత నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెచ్చిపెట్టాయి. విద్యార్థులను, టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని జూనియర్ టీచర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. సీనియర్ టీచర్లను విస్మరించడం వల్ల మొదటి రోజు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. జూనియర్ల చేతుల్లో చీఫ్ బాధ్యతలు పరీక్షల నిర్వహణలో అత్యంత కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్ బాధ్యతలను ఈ సారి ఎటువంటి అనుభవం లేని వారికి కట్టబెట్టారు. గతంలో పదేళ్లుగా చీఫ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన వారిని ప్రస్తుతం పక్కన పెట్టారు. గతంలో ఎన్నడూ చీఫ్ బాధ్యతలు నిర్వహించని, చీఫ్ విధులపై అవగాహన లేని జూనియర్ టీచర్లకు చీఫ్ బాధ్యతలను అప్పగించారు. విచిత్రమేమిటంటే, గతంలో చీఫ్ సూపరింటెండెంట్లుగా పనిచేసిన సీనియర్ టీచర్లను ప్రస్తుతం సాధారణ ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ విధానం విద్యాశాఖలోని సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. బెదిరింపు ధోరణి విద్యాశాఖ అధికారుల వింత ధోరణి పై ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఇన్విజిలేషన్ విధుల నుంచి మినహాయింపు కోరుతున్న వారిని అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక వేళ విధులకు హాజరుకాకపోతే జూన్ వరకు సెలవు పెట్టాల్సి ఉంటుంది అంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేస్తున్నారు. దీంతో టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా మొదటి రోజు పరీక్ష జిల్లాలో మొదటి రోజు ల్యాంగ్వేజెస్–1 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని అబ్జర్వర్ మువ్వారామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పరీక్ష కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఏవైనా మా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ కేంరద్రాన్ని తనిఖీ చేసిన అబ్జర్వర్ విద్యార్థులను తనిఖీ చేసి లోనికి పంపుతున్న పోలీసులు, సిబ్బందిపది పబ్లిక్లో ప్రయోగాలు! మొదటి రోజు 252 మంది గైర్హాజరు జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 129 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ల్యాంగ్వేజ్ పేపర్–1 (తెలు గు, ఉర్దూ, తమిళం) పరీక్షకు 252 మంది గైర్హాజరయ్యారు. 21,062 మంది విద్యార్థులకు గాను 20,810 మంది హాజరయ్యారు. మొదటి రోజు పరీక్ష నిర్వహణలో జిల్లాకు విచ్చేసిన అబ్జర్వర్ మువ్వారామలింగం విస్తృతంగా పలు కేంద్రాల ను తనిఖీ చేశారు. డీఈవో రాజేంద్రప్రసాద్ 8 పరీక్ష కేంద్రాలను, ప్లైయింగ్ స్క్వాడ్ లు 14 మంది 63 కేంద్రాలను పరిశీలించారు. 96 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహించారు. పలు పరీక్ష కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది ఐడీ కార్డులు ధరించకుండా కనిపించారు. తొలి రోజే తడబాటు కొత్త చీఫ్ సూపరింటెండెంట్లకు అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొదటి రోజే తడబాటుకు లోనయ్యారు. గంగవరం, పలమనేరు ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో ప్రశ్నపత్రాల పంపిణీలో తారుమారు చోటుచేసుకుంది. కుప్పం, జీడీనెల్లూరు, నగరి ప్రాంతాల్లో సైతం ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తారుమారైన పత్రాలను విద్యార్థులకు అందజేయడం, ఆ తర్వాత వాటిని సరిదిద్దడం, సమయపాలన పాటించకపోవడం వంటి ఫిర్యాదులు జిల్లా వ్యాప్తంగా వెలువెత్తాయి. దీంతో నిమిషాల సమయం వృథా కావడంతో విద్యార్థులు ఆందోళనకు లోనయ్యారు. అలాగే చాలా పాఠశాలల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాల్లో రెండు, మూడు బిందెలు నీటిని పెట్టి చేతులు దులుపుకున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.45 అవుతున్నా విద్యార్థులను లోనికి అనుమతించకుండా బయటే నిరీక్షించేలా చేశారు. -
దాడులూ మాపైనే.. కేసులూ మాపైనేనా?
శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు విచక్షణరహితంగా దాడులకు పాల్పడడం హేయం. దాడులు మాపైనే, కేసులు మాపైనే. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దాడులు చేసే సంస్కృతి ఇంతవరకు లేదు. ఆ ఘనత కూడా టీడీపీకే దక్కుతుంది. మహిళలు, నాయకులపై విచక్షణరహితంగా దాడులుచేసి గాయపరిచారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రచించిన రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. – భూమన అభినయ్రెడ్డి, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తగాయపడిన భృంగి నవీన్నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేస్తున్న పోలీసులు -
ఏం సాధించారు?
చిత్తూరు అర్బన్: 2021 మునిసిపల్ ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకు గాను 46 సీట్లను కై వశం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. మూడేళ్లకు పైగా వైఎస్సార్సీపీలో పదవులు అనుభవించిన వాళ్లు.. ఆపై కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మరి ఆ కార్పొరేటర్ల భవిష్యత్తు..? మళ్లీ వైఎస్సార్సీలోకి రానిస్తారా..? పోనీ మధ్యలో వెళ్లినా.. టీడీపీ సీటు ఇస్తుందా..? మరి అప్పటి వరకు టీడీపీలో పనిచేసిన కార్యకర్తల పరిస్థితి..? ఏంటి..? ఒకరిద్దరు మినహా.. మిగిలిన కార్పొరేటర్లు వార్డులో పది మంది ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా..? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రస్తుత తాజా మాజీ కార్పొరేటర్ల మది లో మెదలుతున్న ప్రశ్నలు. మంగళవారంతో పాలకవర్గం పదవీ కాలం ముగియనుండగా.. ప్రత్యేకాధికారిగా నియమితులైన కలెక్టర్ సుమిత్కుమార్ పరి పాలన వ్యవహారాలపై బుధవారం నుంచి నిర్ణయాలు తీసుకోనున్నారు. దూకేశారు 2024 మేలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో చిత్తూరు కార్పొరేషన్లోని పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది జూలైలో ఏకంగా 24 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి దూకేశారు. అంటే దాదాపు 20 నెలలు టీడీపీలో ఉన్నారు. పార్టీ మారిన కార్పొరేటర్లలో కొందరిని ఏంసాధించారంటూ ‘సాక్షి’ ప్రశ్నిస్తే.. వారిలో బాధ తప్ప మరేం కనిపించ లేదు. ‘కష్టమో, నష్టమో ఒక్క పార్టీలో ఉండిపోయి ఉంటే బాగుణ్ణు.. ఇక్కడకు వచ్చి సాధించింది ఏమీలేదు..’ అని కొందరు, ‘ప్రజల కోసం వార్డులో నా లుగు పనులు చేయించుకున్నాం..’ అంటూ కొందరినిట్టూర్పు. ‘అసలు రానున్న మునిసిపల్ ఎన్నిక ల్లో నాకు టికెట్టు ఇస్తారనే నమ్మకం లేదు. అప్పటి వరకు వార్డు ఇన్చార్జ్గా ఉన్న వ్యక్తికే టీడీపీలో టికెట్టు ఇస్తారట, ఇటు ఉన్న పార్టీని వదిలేశాం, మధ్యలో చేర్చుకున్న పార్టీ వదిలేసింది..’ అంటూ ప్రజాప్రతినిధులు నిర్వేదం వ్యక్తం చేశారు. అదో చరిత్ర 2021 మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి బ్రాండ్తో చిత్తూరు కార్పొరేషన్ కుర్చీని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఏకంగా 37 డివిజన్లలో వైఎస్సార్సీపీ తరఫున కార్పొరేటర్లు ఏకగ్రీవంగా గెలుపొందారు. 13 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించగా అందులోనూ 9 స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. టీడీపీ 3, స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిచారు. మొత్తంగా మేయర్తో కలిపి 46 డివిజన్లను ఓ ప్రాంతీయ పార్టీ గెలుచుకోవడం చిత్తూరు మునిసిపల్ చరిత్ర లో ఓ సరికొత్త అధ్యయనం సృష్టించింది. మోదం–ఖేదం పార్టీని వీడేటప్పుడు కొందరు కార్పొరేటర్లు వచ్చి వైఎస్సార్పీసీ ఇన్చార్జ్ విజయానందరెడ్డికి తమ మనసులో మాట చెబితే.. మరికొందరు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. కానీ ఆయన నుంచి వచ్చిన సమాధాం ఒక్కటే.. ‘మీరు చిన్న పిల్లలు కాదు. ఎవరి వల్ల గెలిచారు..? ఆ పార్టీలోకి వెళితే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా..? ఏం చేస్తున్నారు..? అని ఆలోచించుకోండి. ఒక్కసారి వెళితే మళ్లీ పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కొద్దు.., మీ ఇష్టం’ అన్నారు. పార్టీ మారిన మేయర్తో సహా 24 మంది కార్పొరేటర్లను వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారి స్థానంలో కొత్త వ్యక్తులను తయారు చేసుకుని, పార్టీని బలోపేతం చేసుకున్నారు. కానీ ఏకంగా 24 మందిని చేర్చుకున్న గురజాల జగన్మోహన్ నాయుడుకు మాత్రం మునిసిపల్ ఎన్నికల వేళ ఇబ్బందులు తప్పేలా లేవు. తాజా మాజీలకు సీట్లు ఇవ్వాలా..? అప్పటి వరకు జెండాలు మోసిన ఇన్చార్జ్లకు స్థానం కల్పించాలా? ఒకరికి సీటు ఇచ్చి, మరొకరికి ఇవ్వ కుంటే ఫిర్యాదులు, ఎంపీ చెప్పినవాళ్లు, పూతలపట్టు నియోజకవర్గంలోకి వచ్చే డివిజన్లు, జనసేన–బీజేపీ పొత్తు లాంటి అంశాలతో ఆయనకు ఖేదం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
నిబంధనలు పాటించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ద్విచక్ర వాహన షోరూం డీలర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీటీసీ నిరంజన్రెడ్డి ఆదేశించారు. సాక్షి దినపత్రికలో ఇటీవల ‘దోపిడీ బండి’ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనిపై రవాణశాఖ అధికారులు స్పందించారు. చిత్తూ రు నగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో డీటీసీ సోమవారం షో రూం డీలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు మాత్రమే వసూలు చేయాలని చెప్పారు. స్ఫూర్తిప్రదాత పొట్టిశ్రీరాములు చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ అన్న పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన మన రాష్ట్రానికే కాకుండా, భారతదేశం గర్వించదగ్గ గొప్ప స్ఫూర్తిప్రదాత అని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాల్చి చంపేశారా? వెదురుకుప్పం: మండలంలోని కొమరగుంట పంచాయతీ బందార్లపల్లె సమీపంలోని మేకలబండ వద్ద గుర్తు తెలియని కాలిన యువకుడి శవం బయట పడడం కలకలం రేపింది. సోమవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్పీ రాజశేఖర్, నగరి ఇన్చార్జి డీఎస్పీ సాయినాథ్, కార్వేటినరగం సీఐ హనుమంతప్ప సిబ్బందితో కలిసి ఘటనా స్థలిలో కాలిన యువకుడి శవాన్ని పరిశీలించారు. అనంతరం నగరి ఇన్చార్జి డీఎస్పీ బందార్లపల్లె రోడ్డు వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువకుడిని ఏదో కారణం చేత చంపి కాల్చినట్లుగా ఆనవాళ్లను బట్టి తెలుస్తోందన్నారు. యువకుడి వయస్సు సుమారు 20 ఏళ్లు ఉండొచ్చని తెలిపారు. అమ్మ జ్ఞాపకాలతోనే! నగరి : తెల్లవారితే పదో తరగతి పరీక్షలు. కానీ అంతకుముందు రోజే తల్లి హఠాత్తుగా మరణించింది. గుండె నిండా అమ్మ జ్ఞాపకాలు, కళ్ల నిండా కన్నీళ్లు ఉన్నా.. తన తల్లి చివరి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షకు హాజరైంది. వివరాలు.. నగరి మున్సిపల్ పరిధి నెత్తంకండ్రిగకు చెందిన రైతు రామిరెడ్డి, మునిలక్ష్మి దంపతుల కుమార్తె పూ ర్ణిమ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వ్యవసాయ కూలీలైన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డారు. కాయకష్టం చేసైనా కూతుర్ని ప్రయోజకురాలు చేయాలని తల్లి భావించింది. కానీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పూర్ణిమ తల్లి ఆదివారం అకస్మాత్తుగా మరణించింది. సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. తల్లి మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిని కోల్పోయిన బాధ పూర్ణిమకు తీరని లోటుగా మారింది. అయితే తన తల్లి చివరి కోరిక చదువేనని గుర్తుచేసుకున్న పూర్ణిమ, గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని సోమవారం పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ‘తల్లి కలను నెరవేర్చడమే ఇప్పుడు నా లక్ష్యం’ అనే భావంతో పరీక్ష రాస్తున్న పూర్ణిమ అందరినీ భావో ద్వేగానికి గురిచేస్తోంది. -
ప్రమాణం చేయగలరా?
‘‘సూళ్లూరుపేటనియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మట్టి దందాలకు తమకు సంబంధం లేదని వేంకటేశ్వరస్వామివారిపై ప్రమాణం చేసి చెప్పగలరా? నియోజకవర్గంలో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతారా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య. అక్రమాలను ప్రశ్నించేవారి గొంతు నొక్కేలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తండ్రికి దేవుడంటే భయం లేదు. భక్తి కూడా లేదు. ఆయన ఏకంగా వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపులకు తమకు సంబంధం లేదని చెప్పడంతోనే అర్ధమవుతుంది.– కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే -
అక్రమార్కులను పట్టించినందుకు అరెస్టు
పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతల దౌర్జన్యాలను ప్రశ్నించిన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారు. పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో కాంట్రాక్టర్, కూటమి నాయకులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా భారీ హిటాచీలతో నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు, సాగునీరు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపై సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి స్థానిక రైతులతో కలిసి ఇసుక దోపిడీని అడ్డుకుని, పలు యంత్రాలు, లారీలను పోలీసులకు అప్పగించారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకపోగా, ఇసుక దోపిడీని అడ్డుకున్న రైతులు, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని తిరుపతి విమానాశ్రయం వద్ద, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, రైతులు అట్ల గోపాలయ్య, శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సురేష్రెడ్డిను వారివారి నివాసాల వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, దొరవారిసత్రం పోలీస్స్టేషన్కు తరలించారు. నాయుడుపేటలో వైద్య పరీక్షలు అనంతరం నాయుడుపేట కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి నెల్లూరు జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి అరెస్టుకు రెక్కీ సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఎలాగైనా అరెస్టు చేయాలని డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో రెక్కీ నిర్వహించారు. పెళ్లకూరు మండలం కలవకూరులో స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవడంతో పాటు సోమవారం నాయుడుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రమణ్యం చేస్తున్న అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ పోలీస్ బలాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే సంజీవయ్యను అరెస్టు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంజీవయ్య నివాసం వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా మొహరించడంతో పోలీసులు ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. అందుకే 144 సెక్షన్ విధించారు. సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు. -
నిరసన తెలిపితే నిర్బంధం
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు అధికార జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా గాయపడిన వారినే అరెస్టు చేసి, అక్రమ కేసులు నమోదు చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం ఉంటే ఏదైనా చెయవచ్చు అన్నదానికి నిదర్శనమే తిరుపతి శిల్పారామం వద్ద సోమవారం జరిగిన ఘటన. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు ఓ మహిళతో వంటగదిలో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. నాడు ప్రెస్మీట్ అనంతరం దూరంగా ఉన్న బీఆర్ నాయుడు సోమవారం తిరుపతికి చేరుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకమండలి అయిన బీఆర్ నాయుడు వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లకార్డులతో హోటల్ ముందు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను టీడీపీ నేతలు జేబీ శ్రీనివాసులు, పులిగోరు మురళితో పాటు వారి అనుచరులు అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నా.. నిరసనను అడ్డుకునే అధికారమే లేని టీడీపీ నేతల బరితెగింపును న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. అంతటితో ఆగని టీడీపీ గూండాలు ‘కామాందులు ఎలా ఉంటారో రండి చూపిస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ మహిళ నాయకులను అసభ్య పదజాలాలతో దూషించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతటితో ఆగని అధికారపార్టీ నేతలు.. పోలీసులతో గాయపడిన వారిని, నిరసన తెలియజేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్టేషన్కు తరలించారు. సంబంధమే లేని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి 13 మంది వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్టేషన్లో కూర్చోబెట్టడానికి న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. ఆ 13 మందిలో మహిళలు కూడా ఉండడం గమనార్హం. -
ఇసుక రీచ్ అడ్డుకున్నందుకే అక్రమంగా కేసు
పెళ్లకూరు మండలంలో అక్రమ ఇసుక రీచ్ అడ్డుకున్నందుకే నాపై అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నాకు కనీసం ముందుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఆ తరువాత నాయుడుపేట రూరల్ పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారు. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడంతో సాగునీరు అడుగంటి పోతుండడంతో కలవకూరు వద్ద నదిలో శాంతి యుతంగా నిరసన తెలిపాను. ఆ కక్షతోనే నాపై అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేశారు. – కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి -
ఇసుక జోరు.. తమ్ముళ్ల పోరు
భగ్గుమంటున్న సొంత పార్టీ నేతలుతిరుపతి సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు కేంద్రంగా ఇసుక అడ్డగోలు వ్యాపారం హద్దులు దాటింది. మాఫియా డంప్లు చేసి దందాను దర్జాగా చేస్తోంది. అధికారుల కళ్ల ముందే కోట్ల రూపాయల దందాను కొనసాగిస్తోంది. ఈ అక్రమ వ్యాపారం రోజు రోజుకూ రెచ్చిపోతోంది. వావిల్తోట వయా తమిళనాడుకు పరుగులు పెడుతోంది. బీఎన్ఆర్పేట నుంచి మంచినీళ్లకుంట మీదుగా రయ్రయ్మంటోంది. ఇలా ప్రకృతి సంపదను కొల్లగొట్టి మాఫి యా కోట్లకు పడగలెత్తుతోంది. ఈక్రమంలో ఓ వర్గానికి చెందిన మాఫియా పోలీసుల చేతిలో లాక్ అవ్వడంతో.. తమ్ముళ్ల మధ్య వర్గపోరు మొదలైంది. ‘డంప్లు కాదు...ఇసుక కొండలే’... పూతలపట్టు మండలం వావిల్తోట, చిత్తూరు బీఎన్ఆర్పేట ప్రాంతాలు ప్రస్తుతం ఇసుక దందాకు అడ్డాగా మారాయి. వావిల్తోట నుంచి ఇసుక తోడి మురకంబట్టులో దాచిపెడుతున్నారు. అలాగే మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంప్లు కొండలను తలపిస్తున్నాయి. నదులు, వంక నుంచి తవ్విన ఇసుకను ముందుగా ఇక్కడే నిల్వ చేసి తర్వాత లారీల్లో లోడ్ చేసి అక్రమ వ్యాపారానికి ఆజ్యం పోస్తున్నారు. సరిహద్దులు దాటుతున్న లారీలు చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడుకు ఇసుక రవాణా సులభంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వరుసగా లారీలు బయలుదేరి సరిహద్దు దాటుతున్నాయి. అక్కడ భారీ డిమాండ్ ఉండటంతో ఈ దందా మరింత ఊపందుకున్నట్లు తెలుస్తోంది. గుడిపాల మండల సరిహద్దులోని మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ నుంచి మాత్రం పట్టపగలే బహిరంగంగా లారీల్లో రయ్రయ్మంటున్నాయి. అక్కడ లారీ ఇసుక రూ. 1.20 లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ ఇసుకకు భారీగా డిమాండ్ పెరగడంతో అక్రమ లారీల సంఖ్యను పెంచారు. మురకంబట్టు నుంచి రోజువారీగా 15 లారీల నుంచి 20 లారీలు, మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ నుంచి 30 నుంచి 40 లారీలు వెళుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు వ్యాపారం జరుగుతున్నట్లు వారు అంటున్నారు. ఆ ఇద్దరే..దమ్ముంటే పట్టుకోండి చూద్దాం? గుడిపాల మండలంలోని ఆ ఇద్దరు చోటా నేతలు ఇసుక అక్రమ వ్యాపారంలో ఆరితేరారు. తమిళనాడులో బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని ఇసుక వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ డంప్ల నుంచి కమ్మతిమ్మపల్లి మీదుగా తమిళనాడుకు తన్నుకుపోతున్నారు. వీరి కంట్లో పడినవారంతా పాతాళానికి పడిపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండతో...అక్రమ వ్యాపారాన్ని రెండేళ్లుగా దర్జాగా నడిపిస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. వారి తమిళనాడు వ్యాపారానికి పోటీగా వచ్చేవారికి నరకం చూపిస్తున్నారని మండి పడుతున్నారు. దమ్ముంటే..వాళ్లను పట్టుకోండి చూద్దామని ఓ వర్గ తెలుగు తమ్ముళ్లు సవాల్ విసురుతున్నారు. ఇసుక వ్యాపారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకే పార్టీకి చెందిన నేతల మధ్యే విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ పోటీ మరింత పెరిగితే పరిస్థితి ఎటు దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో పెరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అధికారులు సమగ్రంగా దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే చిత్తూరు జిల్లాలో ఇసుక దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవకు దారి తీసే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. మురకంబట్టు... లారీలు మాత్రమే లాక్ గతనెల మురకంబట్టు నుంచి ఇసుక తరలిస్తు న్న ఓ లారీని చిత్తూరు తాలూకా పోలీసులు పట్టుకుని గుడిపాల పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి నిఘా పెట్టి రెండు ఇసుక లారీలను పట్టుకున్నారు. అరెస్ట్ కూడా చూపించారు. అయితే మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ ప్రాంతాల నుంచి వెళ్లే లారీలకు మాత్రం పెద్దగా అడ్డంకులు లేకుండా రవాణా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మురకంబట్టు తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక మార్గానికి బ్రేక్ మరో మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
అక్షర ఆంధ్ర పరీక్ష విజయవంతం
పెనుమూరు(కార్వేటినగరం): జిల్లాలో అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం అయిందని, 99 శాతం మంది అభ్యాసకులు హాజరయ్యారని వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు ఎస్.మహ్మద్ అజాద్ అన్నా రు. ఆదివారం పెనుమూరు మండలం కలవకుంట మండల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అక్షర ఆంధ్ర పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వయోజన విద్యాశాఖ డీడీ మాట్లాడుతూ.. అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకున్న అభ్యాసకులకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పరీక్ష నిర్వహించడం జరిగిందని అభ్యాసకులు వారికి అనుకూలమైన సమ యంలో వచ్చి రెండు గంటల పాటు పరీక్ష రాయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా లక్ష్యం 65,185 అభ్యాసకులను నిర్ణయించారని , పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1583 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు 1583 మంది అంగన్వాడీ టీచర్లను అలాగే స్థానికంగా ఉన్న ఇతరులను ఇన్విజిలేటర్లుగా నియమించామని పేర్కొన్నారు. అభ్యాసకులు వారికి అనుకూలమైన సమయంలో రెండు గంటలు పరీక్ష రాయడం జరిగిందని తెలిపారు. ప్రతి విభాగంలో పాస్ మార్కులు 17గా నిర్ణయించామని, ఏదైనా విభాగంలో 17 మార్కుల కన్నా తక్కువగా వచ్చినట్లయితే 5 గ్రేస్ మార్కుల ను కలపవచ్చని, అంగన్వాడీ టీచర్లు, అలాగే ఇతర ఇన్విజిలేటర్లు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసిన తరువాత మార్కులను అవార్డు లిస్టులో వేసి అవార్డు లిస్టును వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లకు ఇవ్వాల్సి ఉంటుందని, మార్కుల ను అలాగే హాజరును అక్షర ఆంధ్ర యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఆదివారం జరిగిన అక్షర ఆంధ్ర పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 64,560 మంది అభ్యాసకులు హాజరు కావడంతో 99 శాతం హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను ఉప సంచాలకులతో పాటు పర్యవేక్షకులు జయప్రకాష్రెడ్డి, డీఆర్డీఏ ఏపీఎం చిరంజీవి, పలువు రు పరిశీలించారు. -
అవస్థల ‘రహదారి’
నగరి : పుత్తూరు నుంచి తిరువళ్లూరు వరకు చేపట్టిన జాతీయ రహదారి ప్రయాణికులకు అవస్థల రహదారిగా మారింది. పలు ప్రాంతాల్లో నిర్వహణ లోపం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ముప్పుతిప్పలు పడుతున్నారు. రాష్ట్ర సరిహద్దు తమిళనాడులోని తిరుత్తణి నుంచి నగరి మీదుగా పుత్తూరు ఓవర్ బ్రిడ్జి వరకు 205 చైన్నె సెక్షన్ 716, 71 తిరుపతి–తిరుత్తణి నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి, రెండు వైపులా సర్వీసు రోడ్డు రూపుదిద్దుకుంటోంది. తిరుపతి నుంచి తిరువళ్లూరు వరకు రూ.864 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేయగా అందులో తిరుత్తణి పుత్తూరు మధ్య పనులు ఆగిపోయాయి. రెండేళ్ల క్రితం ఈ పనులు మాజీ మంత్రి ఆర్కేరోజా చొరవతో ప్రారంభమైంది. 20.05 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును విస్తరించే పనులు చేపట్టారు. ఈ మార్గంలో వీఎన్ఆర్ పేట జంక్షన్ వద్ద, వీకేఆర్ పురం వద్ద, కీళపట్టు ఆంజనేయ స్వామి ఆలయ సర్కిల్, ఓంశక్తి ఆలయ సర్కిల్, కొండచుట్టు మండపం సర్కిల్, ప్రభుత్వ ఆస్పత్రి సర్కిల్ వద్ద, కనంమిట్ట వద్ద, వేపగుంట క్రాస్ల వద్ద అండర్ పాస్ రోడ్లు, కుశస్థలినదిపై మేజర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దేశమ్మ దేవాలయ ఆర్చి సమీపం ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, ఉయ్యాల కాలువ, జీవీఆర్ కళ్యాణమండపం సమీపం, పరమేశ్వర మంగళం వద్ద మినీ బ్రిడ్జులు, 60 ప్రాంతాల్లో కల్వర్టులు ఈ పనుల్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ పనులు ప్రారంభమై సుమారు 18 నెలలుగా జరుగుతోంది. అయితే ఈ పనులు ప్రణాళికాబద్ధంగా జరగక పోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రణాళిలేకుండా పనులు జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రణాళికా రహితంగా సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టి వాటిని పూర్తి చేయకుండా వదిలేయడంతో దుకాణదారులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టడం వల్ల తాగునీటి పైపులు పగిలిపోతుండటంతో పలుచోట్ల తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. సర్వీసు రోడ్డు వేసే ప్రాంతంలో రోడ్డును ఆనుకొని అర అడుగు ఎత్తులో కాలువలు నిర్మిస్తున్న సిబ్బంది అవసరమైన ప్రాంతాల్లో ఎత్తు తగ్గించి దారి వసతి కల్పించాలి. అలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో రోడ్డుకు ఆనుకొని నివసించే వారు, పక్క వీధుల్లోకి వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలతో రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడడంతో ప్రజలే మట్టి పోసి గట్టులు కట్టి రోడ్డును దాటుతున్నారు. రోడ్డు పనుల్లో పలు ప్రాంతాల్లో సరైన సూచిక బోర్డులు లేకపోవడం, ఉన్న రోడ్లలో ఏ రోడ్డు చివరి వరకు ఉందో? ఏ రోడ్డు మధ్యలో ఆగిపోతుందో ? వాహనదారులకు తెలియని పరిస్థితి. కొండలు కరిగిపోతున్నా పూర్తికాని పనులు నిర్మాణ సమస్యలు ఓ వైపు ఉండగా జాతీయ రహదారి పేరిట నగరి నియోజకవర్గంలో ఉన్న కొండలు కరిగిపోతున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన వ్యాపారులు భారీ యంత్రాలతో కొండలను పిండి చేసేస్తున్నారు. కంకర, గ్రావెల్ విచ్చల విడిగా తరలించేస్తున్నారు. జాతీయ రహదారి ప్రామాణికాల మేరకు పనుల చేపడతామని చెబుతున్నా రెండేళ్లలో పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించిన అధికారులు పనులు, ఇప్పటికి 18 నెలలు కావస్తున్నా ఇంకా జరగాల్సిన పనులు ఎక్కువగా ఉన్నాయి. నిర్మించాల్సిన ఓవర్ బ్రిడ్జిలు, అండర్పాస్లు చాలావరకు ఉన్నాయి. ప్రమాదానికి గురైన లోనైన ట్రాక్టర్, బస్సు (ఫైల్) వాహనాలు వెళ్లే సమయంలో రేగుతున్న మట్టి -
బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
పలమనేరు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులోకి వెళుతున్న ఓ బస్సు ముందు టైర్ పక్కనే వెళుతున్న ఓ వృద్ధురాలి కాలుపై తొక్కించడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం స్థానిక ఏటీఎం వద్ద చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి పలమనేరుకు వస్తున్న బస్సు బస్టాండులోకి వెళ్లే సమయంలో పక్కనే వెళుతున్న గంటావూరుకు చెందిన మునెమ్మ(65)ను కాలుపై బస్సు ముందు చక్రం ఢీకొనడంతో కాలు విరిగింది. స్థానికులు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములకు తీవ్ర గాయాలు వి.కోట: గుర్తు తెలియని కారు అతి వేగంగా వచ్చి టూవీలర్ను ఢీకొట్టడంతో అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని కుంబార్లపల్లి గ్రామానికి చెందిన షబీర్ కుమారులు అమ్జాద్(27), అతిక్(24) చెరుకు జ్యూస్ వ్యాపారం చేసుకుని జీవించేవారు. వీరిద్దరూ రామకుప్పం మండలంలో చెరుకు జ్యూస్ వ్యాపారం ముగించుకుని ఆదివారం సాయంత్రం టూ వీలర్లో వీ.కోటకు బయల్దేరారు. అదే సమయంలో వీ.కోట నుంచి పెర్నంబట్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు అతి వేగంగా వచ్చి టూవీలర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమ్జాద్, అతిక్ దాదాపు పది అడుగుల దూరం ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అతిక్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో కుప్పం పీఈఎస్కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రెండు కార్లు ఎదురెదురుగా ఢీ
● గూగుల్ మ్యాప్లో చూస్తూ మార్గం తప్పిపోయిన వైనం ● ఈక్రమంలో పుత్తూరు మీదుగా చైన్నె వెళ్తుండగా ఘటన ● ఒకరికి తీవ్రగాయాలు , అయిదుగురికి స్వల్పగాయాలు గంగాధర నెల్లూరు: రెండు కార్లు ఎదురెదురుగా అప్పిరెడ్డి కండ్రిగ వద్ద ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో అయిదుగురికి చిన్నపాటి గాయాలైన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది . స్థానిక పోలీసుల కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలంలోని ఎట్టేరి పంచాయతీ అప్పిరెడ్డి కండ్రిగ వద్ద ఆదివారం సాయంత్రం చిత్తూరు– పుత్తూరు జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి చైన్నెకి గూగుల్ మ్యాప్లో మార్గం తప్పిపోయి జీడీ నెల్లూరు–పుత్తూరు మీదుగా ప్రయాణిస్తున్న కారు , వెదురు కుప్పం మండలంబొమ్మయపల్లి గ్రామం నుంచి చిత్తూరు వైపునకు ప్రయాణిస్తున్న మరో కారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బెంగళూరు నుంచి చైన్నెకి వెళుతున్న తిరుమలేష్ కుటుంబ సభ్యులు కలై వాణికి తీవ్ర గాయాలు కాగా , మరో కారులో ఉన్న బొమ్మాయిపల్లికి చెందిన మధుతో పాటు ఇద్దరు కుమారులకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కలై వాణిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధు కుమారులు ఇద్దరిని వేలూరు సీఎంసికి తరలించినట్లు తెలిపారు . అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
కరెంట్ షాక్తో యువకుడి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): చిత్తూరు నగరంలో కరెంట్ షాక్తో 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంం.. బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం చిత్తూరు నగరంలోని గోపాలపురం వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలోని మోటార్ను ఆన్ చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ అశోక్కుమార్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి శాంతిపురం: మండలంలోని ఎంకేపు రం పంచాయతీ, కృష్ణాపురానికి చెందిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృత్యువా త పడ్డాడు. గ్రా మానికి చెందిన ఖాదర్బాషా కుమారుడు నవా జ్(19) శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఉదయం బంధువులు, మిత్రులు గ్రామ పరిసరాల్లో గాలించారు. కృష్ణాపురం–పొన్నేపల్లి మధ్య ఉన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు వేలాడుతున్న నవాజ్ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ ఘట నా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఆనవాళ్లు చూస్తే కొట్టి చెట్టుకు ఉరి వేసి, అనంతరం తల పగులగొట్టి నట్టుగా ఉంది. పోలీసులు మృతదేహాన్ని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శాంతిపురంలో ఓ మోటారు రీ వైండింగ్ మెకానిక్ వద్ద పనిచేస్తున్న నవాజ్ వివాద రహితుడుగా కృష్ణాపురం వాసులు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియకపోవడంతో కేసును ఛేదించడానికి పోలీసులు ఆధారాల సేకరణ కోసం ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఎద్దుల పందేలకు వెళ్లి వ్యక్తి దుర్మరణం కుప్పం రూరల్: ఎద్దుల పందేలు చూసేందుకు వెళ్లి అక్కడ ఎద్దు పొడవగా వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన రామకుప్పం మండలం, పీఎంకే తండాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. రామ కుప్పం మండలం, కావలిమడుగు గ్రామానికి చెందిన రాజప్ప(50) ఎద్దుల పందేలను చూ సేందుకు ఆదివారం పీఎంకే తండాకు వెళ్లాడు. అక్కడ ఓ ఎద్దు మీదికి వచ్చి రాజప్పను పొడి చింది. రాజప్ప తీవ్రంగా గాయపడ్డాడు. సహ చరులు హుటాహుటిన కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజప్ప ప్రాణాలు వదిలాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ పరామర్శ పెనుమూరు (కార్వేటినగరం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తల్లి విజయా రెడ్డి వారం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్ర సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డిని ఫోన్లో ఓదార్చి పరామర్శించారు. రాకేష్ రెడ్డి తల్లి విజయారెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. -
మాఫీ చేస్తారా? లేదా?
చిత్తూరు అర్బన్: పట్టణాల్లో అభివృద్ధి పనులకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నులే. ఏటా మార్చి వస్తోందంటే మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను వసూళ్లపై ఓ ప్రణాళిక ఉంటుంది.కానీ ఈ ఏడాది అధికారులు వేసుకున్న ప్రణాళికలకు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడంలేదు. కారణం ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తామంటూ ఇటీవల రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్సుల్లో కమిషనర్లకు స్పష్టత ఇచ్చారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడకపోవడంతో పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొంది. రూ.26 కోట్ల బకాయిలు జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 83,477 భవనాల నుంచి ఆస్తి పన్నులు వసూలవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లా నుంచి రూ.40.54 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, బకాయిల రూపంలో రూ.8.97 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంగా రూ.56.25 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఆదివారం నాటికి రూ.26.28 కోట్లు వసూల య్యాయి. అంటే దాదాపు 48 శాతం పన్నులు వసూలయ్యాయి. ఇంకా మిగిలిన 52 శాతం వసూళ్లు నిలిచిపోయాయి. ‘మాఫీ’పైనే ఆశలు ఇటీవల రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ అధికారు లు కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి.., రెండు రోజుల్లో ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ జీ.వో వెలువడుతుందని ప్రకటించారు. ఇదే విషయాన్ని అధికారులు ప్రజలకు చేరవేశారు. కానీ ఈ సమావేశం జరిగి పది రోజులు కావస్తున్నా, ప్రభు త్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఫలితంగా పన్నుల వసూళ్లల్లో మందగమనం నెలకొంది. -
కమనీయం..దేవదేవుడి కల్యాణం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం కమనీయంగా సాగింది. శ్రీవారి జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం పద్మావతీ, ఆండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. ఆలయ పండిత బృందం ముందుగా గణపతి హోమం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ మాంగల్య ధారణ కమనీయంగా నిర్వహించారు. ఆలయ అధికారి వేణుగోపాల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
నాడు: విలేజ్ హెల్త్ క్లినిక్లు.. ఫ్యామిలీ డాక్టర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గడప వద్దకే వైద్యాన్ని అందించారు. ఈ కాన్సెప్ట్లో గ్రామాల్లో 14 రకాల వైద్య పరీక్షలు జరిపి 105 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం సేవలు దూరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సేవలు రోగులకు దూరమయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థలు నిర్వీర్యం చేసి అధికారులను సర్వేల పేరుతో గ్రామాల్లో తిప్పడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ కుర్చీలతో దర్శన మిస్తోంది. -
పరీక్షల్లో అలసత్వం వహిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : పది పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ మనబడి మన భవిష్యత్ శాఖ జేడీ మువ్వా రామలింగంను జిల్లా అబ్జర్వర్గా నియమించారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రానికి విచ్చేశారు. జిల్లాలో పది పరీక్షల నిర్వహణపై క్షేత్రస్థాయి అధికారులతో వెబెక్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోని ఏర్పాట్లను ఆరా తీశారు. పరీక్షల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు ఉంటా యని హెచ్చరించారు. పది పరీక్షలు పూర్త య్యే వరకు ఆయన జిల్లాలో ఉంటూ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు. టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ చిత్తూరు అర్బన్ : పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏఎస్పీ రాజశేఖర్ రాజు ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎవ్వరూ గుంపులుగా ఉండడం చేయొద్దన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే డయల్–112కు సమాచారం ఇవ్వాలని కోరారు. నో మొబైల్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని జిల్లాకు విచ్చేసిన అబ్జర్వర్ మువ్వా రామలింగం వెల్లడించారు. ఆదివారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాస్ కాపీయింగ్కు తావు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. అధికారులకు కూడా అనుమతి లేదు..... పరీక్ష కేంద్రాల పరిధిలోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చేందుకు అనుమతి లేదన్నారు. మీడియాకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలకు తావు లేకుండా పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించారన్నారు. నిబంధనలను అతిక్రమించి మొబైల్ ఫోన్లతో పట్టుబడితే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరీక్షలను తనిఖీ చేసేందుకు ప్లైయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఈవో రాజేంద్రప్రసాద్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, సూపరింటెండెంట్ స్వర్ణకుమారి, ఎంఈవోలు గణపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చెరుకు బకాయిల చెల్లింపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : చెరుకు రైతులకు అందాల్సిన బకాయిల చెల్లింపునకు చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హామీ ఇచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో నేతమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీ నిర్వాహకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలోని నేతమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగులు, రైతుల దీర్ఘకాలిక బకాయిల పరిష్కారానికి కసరత్తు చేపడుతామన్నారు. బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు రైతులకు రూ.35.92 కోట్లు, ఉద్యోగుల జీతాలు దాదాపు రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల వసూలు ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బకాయిలు త్వరగా ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో చక్కెర కర్మాగారం కమిషనర్ ముత్యాలు, రైతు సంఘం ప్రతినిధులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, ఉద్యోగ సంఘం నాయకులు భాస్కర్రెడ్డి, సంపత్ పాల్గొన్నారు. -
ఇంటి వద్దకే రేషన్
గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే అందేలా చేసింది. ప్రజలకు అవసరమైన ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని జగనన్న సురక్ష పేరుతో నేరుగా ఇంటి వద్దకే అందించింది. రేషన్ కూడా ఎండీయూ వాహనాలతో ఇంటి వద్దే పంపిణీ చేసింది. ప్రస్తుతం సేవలు అందక నరకయాతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ను నిలిపివేయడంతో పింఛన్ లబ్ధిదారులు నరకయాతన పడుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం, రెవెన్యూ సమస్యలు, ఇతర ప్రభు త్వ సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
విజయీభవ
జిల్లా సమాచారం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఇప్పటికే ఆదేశించారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, వైద్య ఆరోగ్య సిబ్బంది విధుల్లో ఉంటారు. హాల్టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. పరీక్ష సమయాల్లో వివిధ రూట్లకు మరిన్ని బస్సులు తిప్పేలా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ వెబెక్స్లో పరీక్షల నిర్వహణపై ఆదేశాలు జారీచేశారు. సందేహాల నివృత్తి కోసం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ పై సందేహాలు, ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం నంబర్ 9032185001ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలు 129 బాలురు (రెగ్యులర్) 10,737 బాలికలు (రెగ్యులర్) 10,264 బాలురు (ప్రైవేట్, వన్స్ఫెయిల్డ్) 1,318 బాలికలు (ప్రైవేట్, వన్స్ఫెయిల్డ్)726 మొత్తం విద్యార్థులు 23,095 -
నాడు
నేడుసచివాలయ సేవలు గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి 500కి పైగా సేవలను ప్రజలకు అందించింది. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా, ఈ– క్రాప్ ధాన్యం కొనుగోలు వంటి సేవలు 100కి పైగా అందించేవారు. నేడు రైతు సేవా కేంద్రాలు అలంకారప్రాయం కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చి ఎరువులు, పురుగు మందుల సరఫరాను నిలిపి వేశారు. దీంతో ప్రైవేటు ఎరువులు, పురుగు మందుల షాపులకు రెక్కలొచ్చాయి. -
మెడి'కిల్'... క్లినిక్లు
కాణిపాకం/తిరుపతి తుడా : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న అక్రమ వైద్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. మందులు విక్రయించాల్సిన మెడికల్ షాపులు అనుమతి లేకుండానే క్లినిక్లుగా మారిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిన మెడికల్ షాపుల్లో కొన్నిచోట్ల చిన్న ఆస్పత్రుల్లా వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు దూరంగా ఉండ టం, చిన్నపాటి సమస్యలకే గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రజలు దగ్గరలో ఉన్న మెడికల్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని మెడికల్ షాపులనే క్లినిక్లు గా మార్చేశారు. సరైన అర్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు డాక్టర్లుగా మారి రోగులకు చికి త్స అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల సంఖ్యలో మెడికల్ షాపులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొన్నేళ్లలో మెడికల్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధికారిక అంచనాల ప్రకారం రెండు జిల్లా ల్లో కలిపి 2500 పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 మెడికల్ షాపుల్లో క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మెడికల్ షాపులు డాక్టర్లు సూచించిన మందులను మాత్రమే విక్రయించాలి. అయితే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అనేక షాపులు చిన్న వైద్య కేంద్రాల్లా మారిపోయాయి. ప్రజారోగ్యంపై ముప్పుఅర్హతలేని వ్యక్తులు వైద్యం చేయడం వల్ల రోగుల ఆరో గ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పరీక్షలు లేకుండా మందులు ఇవ్వడం, అవసరం లేని ఇంజెక్షన్లు వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో దగ్గరలోనే చికిత్స లభిస్తుందని భావించి ప్రజలు ఈ మెడికల్ షాపులపై ఆధారపడుతున్నారు. నకిలీ డాక్టర్ల హడావుడి ఫార్మసీ లైసెన్స్ను కేవలం మందులు విక్రయించడానికి మాత్రమే పొందినా, అదే పేరుతో కొందరు క్లినిక్లు నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, కడుపు నొప్పి వంటి సాధారణ వ్యాధుల కు అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ లు పెట్టడం వంటి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆర్ఎంపీలతో చేతులు కలిపి రోగులకు నాడీ పట్టించి మందులు ఇవ్వడం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు నిజమైన వైద్య సేవల నుంచి దూరమై నకిలీ వైద్యులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఔషధ నియంత్రణ శాఖపై విమర్శలు అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ శాఖపై ఉన్నప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోవ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల మత్తుల్లో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ క్లినిక్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమది కాదని, అది వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వస్తుందని చెబుతూ బాధ్యతను ఒక శాఖ నుంచి మరో శాఖపైకి నెట్టేస్తున్నారని స్థానికులు అంటున్నారు.జిల్లాలో మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమ వైద్యంపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ క్లినిక్లు నిర్వహిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. » గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాపు అడ్డాగా క్లినిక్ను నిర్వహిస్తున్నారు. ఆర్ఎంపీగా చలామణి అవుతున్న ఆ వ్యక్తి మెడికల్ షాపు నిర్వహణతో పాటు...లోపలే దొంగ చాటుగా వైద్యం చేయిస్తున్నారు. దీనిపై సంబంధింత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో..అప్పటి డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. వాస్తవాలను గుర్తించి నోటీసులిచ్చారు. » తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు బీపీ, షుగర్ పరీక్షలు చేస్తూ...మందులు, మాత్రలు ఇచ్చేస్తున్నాడు. ఓ 50 ఏళ్ల మహిళకు ఆ నిర్వాహకుడు బీపీ, షుగర్ పరీక్షించి..క్రమంగా మందులు, మాత్రలు ఇస్తూ వచ్చాడు. తీరా...బీపీ, షుగర్ స్థాయి భారీగా పడిపోవడంతో..కుటుంబీకులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటి వరకు తీసుకున్న మందులు, మాత్రలపై అక్కడి డాక్టర్లు మండిపడ్డారు. ఇలాంటి కేసులు తిరుపతి జిల్లాలో వందలకొద్ది వెలుగు చూస్తున్నాయి. » చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధిలో కూడా ఓ మెడికల్షాపు నిర్వాహకులు షాపును అడ్డుగా పెట్టుకుని...షాపునకు లోపలి భాగంలో క్లినిక్ను నిర్వహిస్తున్నారు. తమిళనాడు నుంచి డాక్టర్లను రప్పించి....ఆస్పత్రిగా మార్చేశాడు. ఈ విషయం 2024లో వెలుగు చూసింది. అప్పటి డీఎంహెచ్ఓ తనిఖీ చేయగా..అసలు విషయాలు బయట పడ్డాయి. ఇలాంటివి చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. » తిరుపతి టౌన్ క్లబ్ సమీపంలో ఓ వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆ మెడికల్ షాపు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో..షాపును లైసెన్స్ను రద్దు చేశాడు. మళ్లీ డ్రగ్స్ శాఖ దళారులను ఆశ్రయిస్తే షాపు నిర్వహణకు రూ. లక్షల్లో డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి చేసేదీ లేక..అదే స్థలంలో బోర్డు మార్చేసి..షాపు నిర్వహిస్తున్నాడు. ఈ షాపులో వైద్యం చేస్తున్నట్లు తెలిసింది. -
ద్విచక్ర వాహనాలు ఢీ
పూతలపట్టు(యాదమరి): అంబులెన్సు 108 వైఫల్యం వలన ఓ యువకుడి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. శనివారం స్థానిక ఎస్వీ సెట్ కాలేజీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. స్థానికుల వివరాలు మేరకు..గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు గ్రామానికి చెందిన హేమంత్ చిత్తూరు నుంచి ఎస్వీ సెట్ కాలేజీ సర్వీస్ రోడ్డు వైపుగా వస్తున్నాడు. అదే సమయంలో జశ్వంత్, పునీత్ అనే యువకులు కాలేజీ నుంచి బయటకు వచ్చే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. చావు బతుకులు మధ్య పోరాటం చేస్తున్న యువకులకు ప్రాణదానం చేయాల్సిన అంబులెన్సు సకాలంలో రాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో హేమంత్ పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే ఆటోలో పక్కనే ఉన్న ఆర్వీఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం , అత్యవసర సమయంలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వలనే బాధితులు పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. -
● పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25 ● ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24 ● విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి తిరుపతి అర్బన్: పదో తరగతి విద్యార్థులు ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. విశ్వనాథ రెడ్డి వెల్లడించారు. శనివారం వరదరాజనగర్లోని విశ్వం పోటీపరీక్షల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో 2026 సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది తర్వాత పాలీసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరి సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని తెలిపారు. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్లో లేటరల్ ఎంట్రీ ద్వారా బిటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశముంటుందని వెల్లడించారు. ఏపీ పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్ 4 వరకు గడువు ఉందని, పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ ఉంటుందని చెప్పారు. అలాగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు ఉందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24వ తేదీన ఉంటుందన్నారు. ఏపీఆర్జేసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యను ఉచితంగా చదివే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 36 ఏళ్లుగా పాలిటెక్నిక్ కోచింగ్లో విశ్వం ఇన్స్టిట్యూట్ అద్భుత ఫలితాలు సాధించిందని, ముఖ్యంగా 2025 పాలీసెట్ ప్రవేశ పరీక్షలో జిల్లా ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. అలాగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 8688888802, 93999 76999 సంప్రదించవచ్చని తెలిపారు. -
చెరుకు రైతు కన్నెర్ర
నగరి : ఆరుగాలం శ్రమించి చెరుకు పంట సాగు చేసిన రైతులకు ఆరేళ్లుగా చెరుకు ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడం, విన్నవించుకుంటున్నా జిల్లా స్థాయి అధికారులు న్యాయం చెయ్యకపోవడం, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, ఎమ్మెల్యే వాటిని నెరవేర్చకపోవడంతో ఆగ్రహించిన నేటమ్స్ షుగర్స్ రైతులు, కార్మికులు శనివారం రోడ్డెక్కారు. మండల కేంద్రమైన నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు రోడ్డుపై బైఠాయించారు. ఆరేళ్లుగా ఆర్థికంగా చితికిపోయిన వారి ఆవేదన ఆందోళనగా పెల్లుబికింది. మాకు న్యాయం జరిగేదెప్పుడు? మా గోడు వినేదెవరు అంటూ భారీ ఎత్తున ఆందోళన చేశారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎస్పీ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. బకాయిలు చెల్లించాలి ఈ సందర్భంగా చెరుకు సంఘ నాయకులు, కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ.. 2019–20 సంవత్సరంలో క్రషింగ్ సీజన్లో చెరుకు సరఫరా చేసిన 10150 మంది రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.37 కోట్లు బకాయి పడిందన్నారు. అలాగే ఫ్యాక్టరీ కార్మికులు 298 మందికి చెల్లించాల్సిన బకాయిలు రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఆరేళ్లుగా రావలసిన డబ్బులు రాక ఆర్థికంగా చితికిపోయామన్నారు. కొందరు రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. పలువురు రైతులు భూములు అమ్ముకొని రైతు కూలీలుగా మారారన్నారు. అప్పులు చేసి పుస్తెలు అమ్ముకున్నవారు ఉన్నారన్నారు. తీవ్ర ఆవేదనకు లోనై అనారోగ్యం పాలై చనిపోయిన రైతులున్నారన్నారు. ఇలా నేటమ్స్ షుగర్ ప్యాక్టరీకి ఆరేళ్ల క్రితం చెరుకు తోలిన రైతుల బాధలు వర్ణనాతీతమన్నారు. హామీలు ఏమయ్యాయి బాబూ ? ‘నిండ్రలో నేటమ్స్ షుగర్స్ మూతపడింది. దానిని తెరిచే బాధ్యత తీసుకుంటాం’... షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో పుత్తూరు బహిరంగ సభలో హామీ ఇచ్చారన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే బకాయిలు ఇప్పించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలు ఏౖమయ్యాయని పశ్నించారు. నగరికి ముఖ్యమంత్రి విచ్చేసిన సమయంలో ఆయనను కలవడానికి అపాయింట్మెంట్ దొరక లేదన్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళనలు తప్పవన్నారు. రాస్తారోకో చేస్తూ తిరుపతి–చైన్నె రహదారిపై బైఠాయించారు. దీంతో సుదూరం వరకు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో సంఘటనా స్థలానికి పరుగు పరుగున అధికారులు విచ్చేశారు. రూరల్ సీఐ భాస్కర్, తహసీల్దార్ ఈశ్వర్, జిల్లా షుగర్ క్రేన్ కమిషనర్ ముత్యాల నాయుడు రైతుల వద్దకు వచ్చి వారితో చర్చించారు. సమస్య తీరే వరకు లేవమంటూ రైతులు భీష్మించుకొని కూర్చొవడంతో వారి చర్యలు విఫలమయ్యాయి. గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో తహసీల్దార్ జిల్లా కలెక్టర్కు సమాచారం అందించగా ఆయన రైతు నాయకులతో మాట్లాడారు. నిరసనకారులతో చర్చిస్తున్న అధికారులు రహదారికి అడ్డంగా పడుకున్న రూ.కోటి బకాయి రావాల్సిన రైతు సోముకలెక్టర్ హామీతో ఆందోళన విరమణ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆందోళనకారులతో మాట్లాడుతూ.. చెరుకు రైతుల బకాయిలు, కార్మికుల బకాయిల విషయమై గతంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటకు వచ్చే సమయంలో ఆయనతో నేరుగా చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కర్మాగారంలో ఉన్న స్క్రాప్, ఇనుప సామానులు వేలం వేసి వచ్చే రాబడిని రైతులు, కార్మికులకు చెల్లిస్తామన్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తనను కలవాలన్నారు. దీంతో శాంతించిన రైతులు, కార్మికులు ఆందోళన విరమించారు. ఆపై పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘ నాయకులు నారాయణస్వామి రెడ్డి, శ్రీనివాస యాదవ్, పట్టాభిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి శ్యామ్లాల్, బీఎస్పీ పార్టీ నాయకులు నాగూర్, కార్మికనాయకులు భాస్కర్రెడ్డి, నరసింహులు, హేమలత,సంపత్కుమార్, మణి, తోయజాక్ష, బాబురెడ్డి, చంద్రశేఖర్రాజు, శేఖర్, సుదర్శననాయుడు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. -
● మెడికల్ షాపుల పేరిట క్లినిక్లు ● జిల్లాలో పుట్టగొడుగుల్లా మెడికల్ షాపుల్లో ఆస్పత్రులు ● నకిలీ అవతారమెత్తిన కొందరు కేటుగాళ్లు ● ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణశాఖ అధికారులు ● మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు సిబ్బంద
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026కాణిపాకం/తిరుపతి తుడా : జిల్లాలో మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న అక్రమ వైద్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. మందులు విక్రయించాల్సిన మెడికల్ షాపులు అనుమతి లేకుండానే క్లినిక్లుగా మారిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిన మెడికల్ షాపుల్లో కొన్నిచోట్ల చిన్న ఆస్పత్రుల్లా వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు దూరంగా ఉండ టం, చిన్నపాటి సమస్యలకే గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రజలు దగ్గరలో ఉన్న మెడికల్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని మెడికల్ షాపులనే క్లినిక్లు గా మార్చేశారు. సరైన అర్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు డాక్టర్లుగా మారి రోగులకు చికి త్స అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల సంఖ్యలో మెడికల్ షాపులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొన్నేళ్లలో మెడికల్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధికారిక అంచనాల ప్రకారం రెండు జిల్లా ల్లో కలిపి 2500 పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 మెడికల్ షాపుల్లో క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మెడికల్ షాపులు డాక్టర్లు సూచించిన మందులను మాత్రమే విక్రయించాలి. అయితే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అనేక షాపులు చిన్న వైద్య కేంద్రాల్లా మారిపోయాయి. ప్రజారోగ్యంపై ముప్పు. అర్హతలేని వ్యక్తులు వైద్యం చేయడం వల్ల రోగుల ఆరో గ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పరీక్షలు లేకుండా మందులు ఇవ్వడం, అవసరం లేని ఇంజెక్షన్లు వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో దగ్గరలోనే చికిత్స లభిస్తుందని భావించి ప్రజలు ఈ మెడికల్ షాపులపై ఆధారపడుతున్నారు. నకిలీ డాక్టర్ల హడావుడి ఫార్మసీ లైసెన్స్ను కేవలం మందులు విక్రయించడానికి మాత్రమే పొందినా, అదే పేరుతో కొందరు క్లినిక్లు నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, కడుపు నొప్పి వంటి సాధారణ వ్యాధుల కు అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఇంజెక్షన్లు వేయడం, సైలెన్ లు పెట్టడం వంటి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆర్ఎంపీలతో చేతులు కలిపి రోగులకు నాడీ పట్టించి మందులు ఇవ్వడం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు నిజమైన వైద్య సేవల నుంచి దూరమై నకిలీ వైద్యులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఔషధ నియంత్రణ శాఖపై విమర్శలు అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ శాఖపై ఉన్నప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోవ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల మత్తుల్లో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ క్లినిక్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమది కాదని, అది వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వస్తుందని చెబుతూ బాధ్యతను ఒక శాఖ నుంచి మరో శాఖపైకి నెట్టేస్తున్నారని స్థానికులు అంటున్నారు. జిల్లాలో మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమ వైద్యంపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ క్లినిక్లు నిర్వహిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
విభజన.. ఖాళీల దరువు
చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పంచాయతీలకు కార్యదర్శుల కొరత లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం పంచాయతీల వికేంద్రీకరణకు సిద్ధమైంది. ఆదా యం జనాభాను బట్టి జిల్లాలో పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించింది. ఇందుకు సంబంధించి ఆదేశాలును సైతం విడుదల చేశారు. అయితే కార్యదర్శుల కొరత తీరుస్తామంటున్న ప్రభుత్వం ఇటు కొత్త ఉద్యోగుల కల్పన చేయడం లేదు. అటు పంచాయతీల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయడం లేదు. ఇదే సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థపై నిత్యం విషం చిమ్ముతూనే కార్యదర్శుల బాధ్యతలు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్లతో పంచాయతీ కార్యదర్శులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. సచివాలయ వ్యవస్థతోనే ముందుకు జిల్లాలో మొత్తం 621 పంచాయతీలు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే వరకూ మూడు, నాలుగు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ఓ కార్యదర్శి తాను పనిచేస్తున్న పంచాయతీతో పాటు మరో రెండు, మూడు పంచాయతీలకు ఇన్చార్జిగా ఉండేవారు. దీనివల్ల పరిపాలన మొత్తం స్తంభించేది. ఇలాంటి సమస్యలకు గత పాలనలో చెక్ పడింది. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం వాటికి అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను నియమించడంతో గ్రామాల్లోనే అనేక రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, వాటిని డిజిటలైజేషన్ చేయడం వంటి పనులు సచివాలయం కేంద్రంగా జరిగేవి. సచివాలయాల నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు ధ్రువీకరణ పత్రాలు అందడంతో ప్రజలకు పంచాయతీ అవసరాలు చాలా వరకూ తీరాయి. మరీ ముఖ్యంగా కార్యదర్శి లేక పడే ఇబ్బందులు ప్రజలకు తప్పాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నెమ్మదిగా నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. వలంటీర్ వ్యవస్థ ఎత్తివేసి ఆ భారాన్ని ఉద్యోగులపై మోపింది. ఇదే సమయంలో పంచాయతీ పరిపుష్టి చేస్తామంటూ ఈ వ్యవస్థను మొత్తం ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇలా.. ప్రస్తుతం రూర్బన్(స్పెషల్ గ్రేడ్)తో కలిపి గ్రేడ్–1,2.3 కింద పంచాయతీ విధానం తీసుకొచ్చారు. దీనివల్ల కార్యదర్శులకు తప్పనిసరిగా స్థానచలనం కలుగుతుంది. గ్రేడ్లలో వ్యత్యాసం ఉంటే జీతాల విడుదలలో సమస్యలు తలెత్తాయి. పదివేలకు పైబడి జనాభా ఉన్న లేదా రూ.కోటి ఆదాయం ఉన్న పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా (రూర్బన్)గుర్తించారు. వీటికి డిప్యూ టీ ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి అధికారిని ప్రత్యేక కార్యదర్శిగా నియమించనున్నారు. రూర్బన్ పంచాయతీలకుగాకు చిన్న పురపాలక సంఘంగా రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో రెవెన్యూ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు బిల్కల్టెకర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మేసీ్త్ర, ఇద్దరు సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, డ్రైయిన్ క్లీనర్, ఎలక్ట్రిషియన్, సహాయ ఎలక్ట్రిషియన్, ిపిట్టర్, ట్యాంకు క్లీనర్, ఇంజనీరింగ్ అసిస్టెంటు, వివిధ శాఖల సిబ్బంది ఉంటారు. గ్రేడ్–1 పంచాయతీ కింద ఏడాది ఆదాయం రూ.30 లక్షల పైబడి రూ.కోటి కన్నా తక్కువ ఆదాయం, 3 వేలకు పైబడి, పది వేలకన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు వీటి పరిధిలోకి వస్తాయి. గ్రేడ్–2 కింద 2–3 వేల జనాభా ఉన్నవి, గ్రేడ్–3 , 2 వేల జనాభా కంటే తక్కువ ఉన్నవి వస్తాయి. వి.కోట పంచాయతీ కార్వేటినగరం పంచాయతీ గ్రేడ్–3 కింద 377 పంచాయతీలు జిల్లాలో రూర్బన్ కింద గంగవరం, కాణిపాకం, కార్వేటినగరం, వి.కోటలు ఉన్నాయి. గ్రేడ్–1 కింద 100 పంచాయతీలు, గ్రేడ్–2 కింద 140 పంచాయతీలు, గ్రేడ్–3 లో 377 పంచాయతీలు వస్తాయి. గ్రేడ్–1 పంచాయతీలో ఒక్కో పంచాయతీకి 20 మంది, గ్రేడ్–2లో ఒక్కో పంచాయతీకి 12 మంది, గ్రేడ్–3లో 9 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం గ్రేడ్–4, 5 పంచాయతీలను రద్దు చేస్తూ అక్కడి వారికి గ్రేడ్–3, 2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పించనున్నారు. కార్యదర్శుల కొరత ఇటీవల పదో న్నతుల నందు దాదాపు భర్తీ చేస్తున్న మిగిలిన ఉద్యోగుల ఖాళీలు, పదోన్నతులు, రెగ్యులైజేషన్ చేస్తే పాలన వేగంగా జరుగుతుంది. జనాభాకు అనుగుణంగా గుర్తింపు జిల్లా పునర్విభజన తర్వాత 697 పంచాయతీలు 621కు కుదించారు. ఆ లెక్కన జిల్లాలో గ్రేడ్ –1 పంచాయతీలు 37 కాగా అందులో కార్యదర్శులు గ్రేడ్– 2, 56, కార్యదర్శులు 51, గ్రేడ్–3 ,106 కాగా కార్యదర్శులు 103, గ్రేడ్–4 242 ఉండగా కార్యదర్శులు 185 ఉన్నారు. 2011 జనాభాకు అనుగుణంగా పంచాయతీలను గుర్తింపు చేపటడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జనాభాకు అనుగుణంగా గ్రేడ్లు నిర్ణయించాల్సి ఉంది. పంచాయతీల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. పంచాయతీలో ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నా యి. వీటిని భర్తీ చేయాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని కోరుతున్నారు. వీరికి అవకాశం కల్పించాల్సి ఉన్నా ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో పనిచేస్తున్న జేఏ, బీసీలు సైతం పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా డిమాండ్ల పరిష్కరించకుండా వికేంద్రీకరణ చేస్తే ఫలితం ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. -
గ్యాస్ సిలిండర్ల కోసం ఘర్షణ
గంగవరం : మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా సిలిండర్లు సక్రమంగా అందకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. గంగవరంలోని గ్యాస్ ఏజెన్సీ వద్దకు శనివారం భారీగా జనం చేరుకున్నారు. ఏజెన్సీ సిబ్బంది టోకెన్ల వారిగా ఒక్కొక్కరికీ సిలిండర్లు అందజేశారు. అందరికీ సిలిండర్లు ఇవ్వాల్సిందేనని వినియోగదారులు ఏజెన్సీ నిర్వాహకులపై ఘర్షణకు దిగారు. ఈక్రమంలో కార్యాలయ అద్దాలను పగులగొట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సిలిండర్లు బుక్ చేసుకుని వారం గడిచినా తమకు సిలిండర్లు సరఫరా కాలేదని ఇళ్లలో వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కలగజేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. సీఐ రాంభూపాల్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లు డిమాండ్ ఎక్కడా లేదని అవసరమైన వారు ముందుగా బుక్ చేసుకున్నట్లయితే నేరుగా మీ ఇళ్లకే సరఫరా జరుగుతుందన్నారు. అంతేగానీ సిలిండర్ల కొరత అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. -
రాజీ మార్గమే రాజమార్గం
చిత్తూరు అర్బన్ : న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి రాజీమార్గం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ ను చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా జడ్జి ప్రారంభించారు. లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించు కున్న తరువాత దీనిపై అిప్పీలు వెళ్లడానికి వీలుండదని.. ఇదే అంతిమ తీర్పన్నారు. అదాలత్ కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో కలిపి 35 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒకటే మార్గం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కోసం చిత్తూరు, తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లోని న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలంటే.. అదాలత్ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు భారతి, శ్రీదేవి, ఉమాదేవి, శ్రీనివాసరావు, శిల్ప, బాబాజాన్, చిత్తూరు న్యాయవాదు ల సంఘం అధ్యక్షులు శంకర్ నాయుడు పాల్గొన్నారు. -
అదనపు వసూళ్లు చేస్తే చర్యలు
– సందేహాలకు కంట్రోల్ రూం ఏర్పాటు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి శంకరన్ తెలిపారు. సాక్షి దినపత్రికలో శనివారం గ్యాస్ దందా పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై ఆయన స్పందించారు. గ్యాస్ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఎప్పటికప్పు డు సమాచారం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందేహాలు ఉన్న వారు 08572–242734 నంబర్కు పని దినాల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో వినియోగదారులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద తహసీల్దార్ను సరఫరాపై పర్యవేక్షణ కోసం నియమించిన ట్లు చెప్పారు. ప్రజలు వదంతుల ను నమ్మి వెంటవెంటనే గ్యాస్ రీఫిల్లింగ్ బుకింగ్ చేయవద్దని అధికారులు సూ చించారు. వినియోగదారులు గ్యాస్ బిల్లులో పేర్కొన్న ధర మాత్రమే డెలివరీ సిబ్బందికి చెల్లించాలని, అదనపు రుసుం డిమాండ్ చేసినట్లయితే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృతిమ కొరత సృష్టించే వ్యక్తులు, సంస్థలపై అలాగే డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించే వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
‘పది’ పరీక్షలకు సన్నద్ధం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్, ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని డీఈవో రాజేంద్రప్రసా ద్ అన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేసి న ఏర్పాట్లను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పది పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 219 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 9032185001 ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విద్యాసంవత్సరం రెగ్యులర్ విధానంలో బాలురు 10,787, బాలికలు 10,264 మొత్తం 21,051, ప్రైవేట్ (వన్స్ ఫెయిల్డ్) విధానంలో బాలురు 1,318, బాలికలు 726, మొత్తం 2,044 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో సూపరింటెండెంట్ స్వర్ణ, పది పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, సిబ్బంది మురళి, సల్లార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్దకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఆర్టీసీ బస్సుల్లో హాల్టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించారన్నారు. 144 సెక్షన్ అమలు జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఈవో తెలిపారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను కచ్చితంగా మూసివేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల కేంద్రాల్లో ఉండే జిరాక్స్ మిషన్లు ప్రత్యేక రూంలో భద్రపరచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష విధుల్లో ఉండే చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్, ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్ఫోన్ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తీసుకెళ్లేటప్పుడు ద్విచక్రవాహనాలను వాడకూడదన్నారు. -
పదిలమైన వ్యూహం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి... ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. భవిష్యత్తు ఉన్నత విద్యాభ్యాసానికి, పునాది వేసే తొలి మెట్టు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని ఆందోళన, కంగారు, ఒత్తిడి మొదలవు తాయి. అయితే పరీక్షలు అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసం ఉంటే పది పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ (10కి10) సాధించడం సులువేనని మానసిక, విద్యా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు భయాన్ని వీడి, విజయతీరాలను చేరుకోవడానికి నిపుణులు అందిస్తున్న సమగ్రమైన మెలకువలపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రణాళిక అవసరం కచ్చితమైన టైమ్ టేబుల్ ముఖ్యం. రోజువారీ దినచర్యలో ఏ సమయానికి ఏ సబ్జెక్టు చదవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ సమయం, ఉదయం పూట ప్రశాంతమైన సమయాన్ని కేటాయించాలి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయో బ్లూ ప్రింట్ ద్వారా అవగాహన పెంచుకోవాలి. ఎక్కువ మార్కు ల వెయిటేజీ ఉన్న పాఠాలపై ముందుగా దృష్టి పెట్టాలి. చదివిన ప్రతి అంశాన్ని ఒక చిన్న నోట్ బుక్లో పాయింట్ల వారీగా రాసుకోవాలి. ఫార్ములాలు, ముఖ్యమైన తేదీలు, కీ వర్డ్స్ కోసం మైండ్ మ్యాప్స్ ఉపయోగిస్తే చివరి నిమిషంలో రివిజన్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ప్రశ్న పత్రాల సాధన ప్రస్తుత ఏడాదిలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను రివిజన్ చేసుకోవాలి. వాటిని నిర్ణీత సమ యంలో (3 గంటల్లో) రాయడానికి సాధన చేయాలి. దీనివల్ల సమయ నిర్వహణ అలవడుతుంది. మోడల్ పేపర్లు రాసిన తర్వాత, ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో విశ్లేషించుకుని సరిదిద్దుకోవాలి. పరీక్ష హాలులో పాటించాలి తొలి 15 నిమిషాల సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష మొదలవడానికి ముందు ప్రశ్న పత్రం చదువుకోవడానికి ఇచ్చే 15 నిమిషాల సమయం విలువైంది. ఇందులో పేపర్ మొత్తాన్ని ఒకసారి చదివి, బాగా వచ్చిన ప్రశ్నలను ముందుగా గుర్తించాలి. జవాబు పత్రం చూడగానే దిద్దే ఉపాధ్యాయుడికి మంచి అభిప్రాయం కలగాలి. రెండు జవాబుల మధ్య సరైన గ్యాప్ వదలడం, ముఖ్యాంశాలను అండర్ లైన్ చేయడం, అవసరమైన చోట కొట్టి వేతలు లేకుండా రాయడం అలవర్చుకోవాలి. ఏ సెక్షన్కు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే ఒక అంచనాతో ఉండాలి. ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోయి సమయం వృథా చేయకూడదు. రాని ప్రశ్నలను చివర్లో ఆలోచించి రాయాలి. షీట్లో వివరాలు నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బబ్లింగ్ చేసేటప్పుడు హడావుడి పడకూడదు. అడిషనల్ షీట్స్ తీసుకుంటే వాటికి నంబర్లు వేసి దారం గట్టిగా కట్టాలి. ఆరోగ్యం , తల్లిదండ్రుల పాత్ర పరీక్షల సమయంలో నిద్ర వాయిదా వేసుకోకూడదు. పగలు, రాత్రి పుస్తకాలతో కుస్తీ పడుతూ నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర మెదడును చురుకుగా ఉంచుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యమైనది. ఈ సమయంలో పిల్లలపై మార్కుల ఒత్తిడి తీసుకురాకూడదు. ఇతరులతో పోల్చి వారి ఆత్మన్యూనతను పెంచకూడదు. ‘నువ్వు చేయగలవు, ఎంత వస్తే అంత రాయ్, మేమున్నాం’ అనే భరోసా ఇస్తే పిల్లలు రెట్టించిన ఉత్సాహంతో పరీక్షలు రాస్తారు. -
అతివకు ఆదర్శం
చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు సాహితీవనంలో తనదైన ముద్ర వేసిన తొలి తెలుగు కవయిత్రి, ఆతుకూరి మొల్ల మహిళా సాధికారతకు నిలువుటద్దమని డీఆర్వో మోహన్ కుమార్ కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్తో పాటు పీవీకేఎన్, సావిత్రమ్మ ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో కవయిత్రి మొల్ల జయంతి ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో మొల్ల విగ్రహానికి నివాళులర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. తెలుగు సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన తొలి తెలుగు కవయిత్రి, భక్త శిఖామణి ఆతుకూరి మొల్ల అని అన్నారు. ఆమె నేటి తరానికి, ముఖ్యంగా మహిళా లోకానికి గొప్ప ఆదర్శప్రాయురాలని కొనియాడారు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల, సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ నాటి సామాజిక పరిస్థితులను అధిగమించి సాహిత్యం వైపు అడుగులు వేశారని ఆయన గుర్తుచేశారు. ఆమె రచించిన రామాయణం పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా సరళమైన, స్వచ్ఛమైన తెలుగులో ఉండటం వల్లే కాలపరీక్షను తట్టుకొని నిలిచిందన్నారు. నేటి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, తమలోని సృజనాత్మకతను వెలికితీసి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రబ్బానీ భాషా, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రాయలసీమ కుమ్మరి యూత్ సెక్రెటరీ హరిప్రసాద్, హరి బాబు, చలపతి, సోమశేఖర్ పలువురు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య సౌరభం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొల్ల జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య చరిత్రలో మొల్ల ఒక అద్వితీయమైన స్థానాన్ని ఆక్రమించారని కొనియాడారు. తెలుగు భాషా సాహిత్య సంపదలో ‘మొల్ల రామాయణం’ ఒక ఆభరణం వంటిదని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు చెన్నకేశవులు, జయచంద్రుడు, గోపీనాయక్, జ్యోత్స ్న, నిరోషా, బాలకృష్ణా, సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు. సుందరకాండకు సాహితీ నీరాజనం... తెలుగు సాహిత్య చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన తొలి తెలు గు కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి వేడుకలు సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న తెలుగు అధ్యాపకులు డాక్టర్ జి. ధర్మమూర్తి మాట్లాడుతూ.. మొల్ల సాహిత్య ప్రతిభను విద్యార్థులకు వివరించారు. మొల్ల రచించిన రామాయణంలో సుందరకాండకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అద్భుతమైన గ్రంథంగా తీర్చిదిద్దారని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మనోహర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి, అధ్యాపకులు శివశంకర్ పాల్గొన్నారు. -
హమ్మయ్య..బతికిపోయాడులే!
గంగవరం : విద్యుత్ స్తంభంపైన కరెంటు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. కరెంటు తీగలపైనే వేలాడుతూ కొంతసేపు శరీరంలో చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు.. చూసినవాళ్లందరూ అతడు మరణించాడనుకున్నారు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అతడు పైకి లేవడంతో హమ్మయ్య బతికిపోయాడులే అని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలకు మండలంలోని గుండుగల్లు సబ్ స్టేషన్లో ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ)గా మహేంద్ర(34) విధులు నిర్వహిస్తున్నాడు. కరెంటు మరమ్మతు కారణంగా నాలుగు రోడ్ల వద్ద విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతు పనులు పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా తీగల్లో విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు కొద్దిసేపు తీగలపైన వేలాడుతూ అలాగే ఉండిపోయాడు. గమనించిన స్థానికులకు షాక్ గురైన అతడు చనిపోయి ఉంటాడనుకున్నారు. విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్లి వెంటనే కరెంట్ సరఫరా ఆపేసి అతడిని కిందికి దించే ప్రయత్నం చేశారు. అంతలో అతడు పైకి లేవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు బాధితుడిని చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స చేసి సాయంత్రానికి ఇంటికి పంపించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అనుమానాస్పద స్థితిలో చంద్రశేఖర్ (69) అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. బంగారుపాళ్యం మండలం మొగిలిమిట్టూరుకు చెందిన చంద్రశేఖర్కు మానసిక సమస్యలున్నాయి. గతనెల హైదరాబాదులో ఉన్న తన కుమారు డు మురళి వద్దకు వెళ్లాడు. 24వ తేదీన హైదరాబాదు నుంచి చిత్తూరుకు రైలులో తన తండ్రిను మురళి ఒంటరిగా పంపించాడు. ఆ మరుసటిరోజు తన తండ్రి ఇంటికి వచ్చాడా..? అని ఆరాతీస్తే రాలేదని తెలిపారు. అప్పటి నుంచి చంద్రశేఖర్ కోసం అతని కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. శుక్రవారం మధ్యా హ్నం చిత్తూరు నగరంలోని పట్రాంపల్లె వద్ద ఓ వృద్ధుడు పొలాల్లో పడుంటే.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబరుకు సంప్రదిస్తే మురళీ ఘటనా స్థలానికి వచ్చి చూసి, తన తండ్రి చంద్రశేఖర్గా గుర్తించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కవయిత్రి మొల్లకు నివాళులు చిత్తూరు అర్బన్: తెలుగు తొలి మహిళ కవయి త్రి ఆతుకూరి మొల్లకు చిత్తూరు పోలీసు శాఖ నివాళులర్పించింది. మొల్ల జయంతి సందర్భంగా శుక్రవారం చిత్తూరులోని పోలీసు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఏ ఆర్ ఏఎస్పీ దేవదాసు , డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఐ సుధాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. మైనార్టీ భవన నిర్మాణానికి కృషి చిత్తూరు కలెక్టరేట్: త్వరలో మైనార్టీ భవనాన్ని నిర్మించడానికి స్థల సేకరణ కార్యక్రమం వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్కుమార్ గాంఽధీ పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం తరఫున శుక్రవారం ఇఫ్తార్ విందును ఇచ్చారు. కార్యక్రమాన్ని స్థానిక ఉర్దూషాదీ మందిర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ నగర మేయర్ అముద పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నగరంలో షాదిఖానా నిర్మించడానికి స్థల సేకరణ చేస్తామని తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నా రెడ్డి, ఈడీ మైనారిటీ ఆర్థిక సంస్థ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పెను విషాదం తప్పింది. పాడుబడ్డ 108, 104 వాహనాల స్క్రాప్ తొలగింపు సమయంలో గ్యాస్ కట్టర్లు వినియోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే ఒక 108 వాహనం పూర్తిగా దగ్ధమైంది. అపోలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్కారప్ వాహనాలతోనే ప్రమాదం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పాడుబడ్డ 108, 104 వాహనాలకు ఇటీవల వేలం నిర్వహించారు. వేలంలో 23 వాహనాలను దక్కించుకున్న స్క్రాప్ యజమానులు వాటిని అక్కడి నుంచి తరలించి తమ ప్రాంగణంలో విడగొట్టాల్సి ఉండగా ఆస్పత్రి ఆవరణలోనే గ్యాస్ కట్టర్లతో కటింగ్ పనులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక 108 వాహనంలోని సీట్లకు మంటలు అంటుకుని కేవలం ఐదు సెకన్లలోనే వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది. వాహనంలో ఉన్న ఫోమ్, ప్లాస్టిక్ పదార్థాలు, చుట్టుపక్కల ఎండిన చెత్త, చెట్లు ఉండటంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కొద్దిసేపట్లోనే పక్కనే ఉన్న మరో స్క్రాప్ వాహనానికి మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగిన విషయం గుర్తించిన అపోలో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. అందుబాటు లో ఉన్నవాటితో మంటలను ప్రాథమికంగా అదుపు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఆగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే 108 వాహనాల కార్యాలయం, శిశు వార్డు ఉండటం తీవ్ర ఆందోళన కలిగించింది. మంటలు అదుపులోకి రావడంలో కాస్త ఆలస్యం అయినా 108 కార్యాలయంతో పాటు శిశు వార్డుకూ మంటలు వ్యాపించే పమ్రాదం ఉండేది. రోగుల తరలింపు మంటల చెలరేగడంతో శిశు వార్డు వైద్యాధికారి అప్రమత్తమై అక్కడున్న రోగులను వెంటనే మరో ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు స్క్రాప్ యజమానుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్క్రాప్ యజమానులు గ్యాస్ కట్టర్ల కోసం కమర్షియల్ సిలిండర్లనే వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి భద్రతా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్పత్రి ఆవరణలో ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ షరతులతో స్క్రాప్ తొలగింపు పనులు అప్పగించారు? డొమెస్టిక్ సిలిండర్లు వాడారా? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాలిపోయిన పాత వాహనాలుమంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది -
17న ఉద్యోగ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 17న ఉద్యోగ మేళా (సీడాప్ జాబ్కనెక్ట్) నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ), సీడాప్ సంయుక్తంగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉన్న టీటీడీసీ ప్రాంగణంలో ఉద్యోగ మేళా జరుగుతుందన్నారు. జిల్లాలోని 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ మేళాలో టీసీఎల్ (తిరుపతి), టాటా ఎలక్ట్రానిక్స్ (హోసూర్), బ్లింకిట్ (చైన్నె) తదితర కంపెనీలు హాజరవుతాయన్నా రు. ఎంపికయ్యే అభ్యర్థులకు సంబంధిత కంపెనీల నియమ, నిబంధనల మేరకు జీతాలు ఇస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వివరాలు నమోదు, ఇతర సమాచారానికి 8712495517, 9441872140 నంబర్లలో సంప్రదించాలన్నారు. హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్లు(ఒరిజినల్, జిరాక్స్) తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పీడీ కోరారు. నిఘా సంస్థల పాత్ర కీలకం తిరుపతి సిటీ: కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న క్రమంలో శాంతి భద్రతలు, సామాజిక అంశాల నియంత్రణపై నిఘా సంస్థల పాత్ర కీలకంగా మారనుందని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ రాజనీతి శాస్త్రం, ప్రభు త్వ పాలనా శాస్త్ర విభాగం పూర్వ విద్యార్థుల సహకారంతో శుక్రవారం వర్సిటీ సెనేట్ హాల్లో ‘చట్టబద్ధ నిఘా రాజకీయ పరిణామాలు.. ఒక విమర్శాత్మక దృక్పథం’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా జరుగుతున్న పరిణా మాల దృష్ట్యా భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. శాస్త్ర సాంకేతిక యుగంలో నిఘా సంస్థల ప్రాబల్యం గణనీయంగా పెరుగుతోందని తెలిపా రు. విభాగధిపతి ఆచార్య బీవీ మురళీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నిఘా చర్యలు చట్టపరమైన విధానాల ద్వారా అమలవుతాయన్నారు. చట్టబద్ధ నిఘా ప్రధాన ఉద్దేశం జాతీయ భద్రతను కాపాడడం, నేరాలను నిరోధించడం, ప్రజాశాంతిని పరిరక్షించడమన్నారు. సదస్సుకు హాజరైన జార్ఘండ్ రాష్ట్ర మానవ వనరుల విభాగం పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ క్రాంతి కుమార్ గడిదేసి మాట్లాడుతూ ప్రధానంగా కృత్రిమ మేధస్సు పోలీసు వ్యవస్థపై ఎంతగానో ప్రభావం చూపుతోందని, పోలీసింగ్ డేటా ఆధారిత అంశాలపై ఆధారపడుతోందన్నారు. ఈ సదస్సులో డాక్టర్ సాంబమూర్తి, కోకన్వీనర్లు డాక్టర్ ఐఎస్ కిషోర్, పి సాయికుమారి, డాక్టర్ సీఎల్ చెన్నారెడ్డి పాల్గొన్నారు. -
‘అన్నదాత సుఖీభవ’ నిధులు
గుడిపాల: రైతులందరికీ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను పంటల సాగులో వినియోగించుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల మండలంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మూడు విడతలుగా 2 లక్షలా 5 వేల 753మంది రైతులకు 400 కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ వ్యక్తిగత ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధాన పంటగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటల అభివృద్ధి , పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉన్నదని రైతులు ఉద్యానశాఖ పంటలపై ఆసక్తి చూపాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు ప్రభుత్వం రూ.14 వేలు అందజేసిందన్నారు. అనంతరం కలెక్టర్తో కలిసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష, ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్, సింగిల్విండో చైర్మన్ ప్రతాప్నాయుడు, వ్యవసాయాధికారులు సంగీత, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
గ్యాస్ దందా!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో గ్యాస్ బాంబ్ పేలుతోంది. బండపై...పలు ఏజెన్సీలు బండబాదుడు బాదుతున్నాయి. కొరతంటూ..వినియోగదారులకు కోతపెడుతోంది. బుకింగ్ ఫుల్కు పుల్స్టాఫ్ పెడుతూ...బ్లాక్ మార్కెట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, టిఫిన్న్ సెంటర్లు, బేకరీలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా తగ్గిందనే పేరుతో గ్యాస్ ఏజెన్సీలు బుకింగ్లను పెండింగ్లో పెట్టి, అదే సిలిండర్లను అదనపు డబ్బులు తీసుకుని దొంగచాటుగా విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి కింద దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, ఎల్పీజీ కనెక్షన్లు 5,09,116, కమర్షియల్ కనెక్షన్లు 2,930 వరకు ఉన్నాయి. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందని ఏజెన్సీలు చెబుతున్న ప్పటికీ, వాస్తవానికి కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్కు తెరతీసినట్టు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్కు భారీ డిమాండ్ జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలు కమర్షియల్ గ్యాస్పై ఆధారపడి ఉంటాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుకింగ్లు చేసినా సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. బ్లాక్లో అమ్మకాలు..? వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేస్తే ‘స్టాక్ లేదు’, ‘సరఫరా రాలేదు’ అంటూ పలు ఏజెన్సీలు సమాధానం చెబుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కొందరికి అదనపు డబ్బులు తీసుకుని సిలిండర్లు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో గ్యాస్ సిలిండర్పై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసే వారు. ప్రస్తుతం పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఒక్కో సిలిండర్పై రూ.200 నుంచి రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారు లు చెబుతున్నారు. ముఖ్యంగా హోటల్ యజమానులు, చిన్న వ్యాపారులు ఈ అదనపు చార్జీలను చెల్లించక తప్పడం లేదని అంటున్నారు. డెలివరీ బాయ్ల పాత్రపై ఆరోపణలు కొన్ని చోట్ల డెలివరీ సిబ్బంది ముందుగా సిలిండర్లను నిల్వ ఉంచి, తర్వాత అదనపు డబ్బులు ఇచ్చే వారికి మాత్రమే అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారని వినియోగదారులు అంటున్నా రు. దీంతో సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టించుకోని అధికారులు గ్యాస్ దందాపై పౌరసరఫరాల శాఖ అధికారులు చర్య లు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులు ఫోన్న్ చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడిలో అధికారులు జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కొరత పేరుతో జరుగుతున్న దందాపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్మార్కెట్కు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుని సిలిండర్ల సరఫరాను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
చిత్తూరు (న్యాయవిభాగం): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచ్లు ఏర్పాటు చేయగా చిత్తూరులో ఐదు బెంచ్ల ద్వారా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యాంకులు, బీమా సంస్థలు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సహకరించాలని కోరారు. జాతీయ స్థాయి ఆదర్శ పంచాయతీగా నాయనూరు కుప్పం: జాతీయ స్థాయిలో ఆదర్శ పంచాయతీగా కుప్పం మండలం నాయనూరు గ్రామ పంచాయతీ ఎంపికై ంది. దీనికి గాను కేంద్ర అధికార బృందం నాయనూరు పంచాయతీలో శుక్రవారం పర్యటించింది. గత ఐదేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయనూరును పంచాయతీ కేంద్రంగా విభజన చేసింది. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. దీంతో ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధి జాతీయ స్థాయిలో మెరిసింది. ఏప్రిల్లో అవార్డు ప్రదానం చేయనున్నట్టు అధికార బృందం పేర్కొంది. -
తెలుగు అభ్యసన ఇలా..
● అవగాహన, ప్రతిస్పందన విభాగంలో అడిగే ప్రశ్నలకు పూర్తి వాక్యాలలో జవాబులు రాయాలి. ● పద్యభాగం, గద్య భాగం, ఉపవాచకాల నుంచి వచ్చే లఘు, వ్యాస రూప సమాధాన, సృజనాత్మక ప్రశ్నలకు వాటి స్వభావం మేరకు తగిన విధంగా జవాబులు స్పష్టంగా రాయాలి. ● భాషాంశాలకై పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉన్న అభ్యాసాలు, పుస్తకం చివరలోని పదవిజ్ఞానం, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి–వికృతి పదాలను అవలోకనం చేసుకోవాలి. ● బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అ, ఆ, ఇ, ఈ ఐచ్ఛికాలలో సమాధానాన్ని గుర్తించడంతో పాటు సంబంధిత పదాలు కూడా రాయాలి. ● చక్కని దస్తూరీతో పాటు విరామ చిహ్నాలు పాటిస్తూ, అక్షర దోషాలు లేకుండా చూపుకోవాలి – చండ్ర నరేష్, తెలుగు ఉపాధ్యాయుడు -
అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయండి
చిత్తూరు కార్పొరేషన్: వేసవిలో లోవోల్టే జీ సమస్యల నివారణకు ప్రతి మండలంలోనూ అధిక సామర్థ్యం కలిగిన అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయాలని ట్రాన్స్కో సీజీఎం కృష్ణారెడ్డి ఆదేశించా రు. ఆయన గురువారం ఎస్ఈ, రూరల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వేసవి కారణంగా గ్రామా ల్లో విద్యుత్ వినియోగం పెరిగిందన్నా రు. దీంతో తరచూ వోల్టేజ్ సమస్య వస్తోందన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయి ల్యూర్స్తో విద్యుత్ అంతరాయం ఏర్ప డుతోందన్నారు. దాన్ని అధిగమించేందుకు 62 కేవీ ట్రాన్ఫార్మర్ల స్థానంలో 100 కేవీ, 100 కేవీ స్థానాల్లో 160 కేవీ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో కూడా అంతరాయం లేని విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. వేసవిని ఎదుర్కొనేందుకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మ ద్, ఈఈ సురేష్, డీఈ శేషాద్రి పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మూడు రోజుల జైలుశిక్ష చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తూ చిత్తూరులోని స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కె.పరిమళాదేవి గురువారం తీర్పు చెప్పారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నలుగురికి రూ.40 వేలు జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
చిత్తూరు అర్బన్: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 151 గ్రాము ల బంగారు నగలు, రెండున్నర కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. వారు గురువారం సీఐ లు నెట్టికంటయ్య, మహేశ్వరతో కలిసి చిత్తూరు నగరంలోని పోలీసు అతితి గృహంలో మీడియాతో మాట్లాడారు. దుండగులు గత నెల 5వ తేదీన చిత్తూరులో ని దుర్గానగర్ కాలనీకి చెందిన మాజీ సైనికుడు వరదరాజులు నాయుడు ఇంటి తలుపులు పగులగొట్టి, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, పూజ గదిలో ఉన్న వెండి ఆభరణాలను దొంగలు చోరీ చేశారని తెలిపారు. దీనిపై చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు. చిత్తూరు–వేలూరు రోడ్డులో గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువకులు పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా చిత్తూరులో చోరీ చేసింది తామేనని అంగీకరించారని చెప్పారు. నిందితులు తమిళనాడులోని సేలంకు చెందిన లల్లూ ప్రసాద్ (34), జనార్దన్ (31)గా గుర్తించామన్నారు. వారి నుంచి 151 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాటి విలువ దాదాపు రూ.36 లక్షలు ఉంటుందని తెలిపారు. కా గా నిందుతుల్లో ఒకడైన లల్లూ ప్రసాద్పై తమిళనాడులోని ఈరోడ్, నామక్కల్ తదితర ప్రాంతాల్లో రెండు హత్య కేసులు, 11 దోపిడీ, 16 చోరీ కేసులు ఉన్నా యని తెలిపారు. జనార్దన్పై తమిళనాడులో ఏడు కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసును ఛేదించడంతో ప్రతిభ చూపించిన ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ దేవరాజులు, బాబు, శ్రీనివాసులు, తవరాజ్ తదితరులను ఏఎస్పీ అభినందించారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 66,606 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,899 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. తిరుమలలో ఆకస్మిక తనిఖీలు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని హోటళ్లలో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. ఐస్క్రీమ్లు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలోని అన్ని హోటళ్లలోనూ నమూనాలను సేకరించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. -
బాధిత రైతులకు పంట నష్ట పరిహారం
గుడిపాల: ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందజేస్తామని జిల్లా వ్యవసాయాధికారి మురళి తెలిపారు. ఆయన గురువారం అటవీశాఖ, ఉద్యా నవనశాఖ అధికారులతో కలిసి ముత్తువాళ్లూ రు గ్రామంలో ఏనుగుల దాడుల్లో దెబ్బతిన్న మామిడి, అరటి, వరి పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటల వివరాలతో నివేదికను కలెక్టర్కు అందజేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, కచ్చితంగా నష్ట పరిహా రం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్టాభి, డీఆర్ఓ కరణ్సింగ్, ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్, వ్యవసాయాధికారి సంగీత, ఉద్యానశాఖాధికారి ప్రవీ ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు డిల్లీరాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
జీవశాస్త్రం ఇలా..
● మొదటి యూనిట్ జీవక్రియల నుంచి అధిక ప్రశ్నలు అడుగుతున్నారు. ● మన పర్యావరణం యూనిట్ నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు ఇస్తారు. ప్రధానంగా ఓజోన్ పొర క్షీణత, బయో డీగ్రేడబుల్, నాన్– బయో డీగ్రేడబుల్, అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి, ● డయాగ్రమ్ కోసం విసర్జన వ్యవప్థ, నెఫ్రాల్ నిర్మాణం, పుష్ప నిలువు కోత, సీ్త్ర ప్రత్యుత్తత్తి వ్యవస్థ, పుష్ప ఫలదీకరణ చిత్రం వస్తాయి. ● ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన ఐదు మోడల్ పేపర్స్పై దృిష్టి పెట్టాలి. – బాబు, స్కూల్ అసిస్టెంట్ -
వంట గ్యాస్కు మంట పెట్టిస్తున్నారు..!
జిల్లాలో వంట గ్యాస్పై వస్తున్న వదంతులతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధ పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ సరఫరా దెబ్బతినిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. త్వరలో గ్యాస్ సిలిండర్లు దొరకవని, సరఫరా నిలిచిపోతుందనే వార్తలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 6 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్కు కొరత ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఒకటి కాకుండా రెండు సిలిండర్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్యాస్ బుకింగ్ వ్యవస్థపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. బిజీబిజీగా టోల్ ఫ్రీ నంబర్లు వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఒకేసారి గ్యాస్ బుకింగ్ కోసం కాల్స్ చేయడంతో టోల్ ఫ్రీ నంబర్లు బిజీగా మారుతున్నాయి. చాలా మంది పలుమార్లు కాల్ చేసినా కనెక్ట్ కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ముందస్తు బుకింగులతోనే సమస్య ఎదురవుతోందని ఏజెన్సీలు వివరిస్తున్నాయి. జిల్లాలో గ్యాస్ కొరత ఉందన్న వార్తలను నమ్మొద్దని చెబుతున్నాయి. ప్రస్తుతం సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా యధావిధిగా కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నాయి. సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చిత్తూరు అర్బన్: వంట గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. యుద్ధం కారణంగా గ్యాస్ సిలెండర్ల కొరత ఉందని, ధరలు పెరిగిపోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్కడైనా సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే డయల్–112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఆందోళన చెందొద్దని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్–ఇజ్రాయేల్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడలేదని తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారు 30 రోజుల వ్యవధిలోనే బుక్ చేసుకోవాలని, వెంటవెంటనే బుకింగ్ చేస్తే వెబ్ పోర్టల్ అనుమతించదన్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా ఓటీపీతో ధ్రువీకరించుకోవాలని వెల్లడించారు. అవసరానికి మించి సిలిండర్లను నిల్వ చేయడం, కొనుగోలు చేయరాదని జేసీ హెచ్చరించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థల్లో అత్యవసర విభాగాలకు యధావిధిగా గ్యాస్ సరఫరా అందుతుందని స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను నిబంధనల ప్రకారం సరఫరా చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షించాలని తహసీల్దార్లు, సివిల్ సప్లయీస్ డీటీలను ఆదేశించారు. -
ఫిజికల్ సైన్సు ఇలా..
● మొదట 8 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, తర్వాత 2 మార్కుల, 1 మార్కు ప్రశ్నలు స్పష్టంగా రాయాలి ● 8 మార్కుల ప్రశ్నలు రాసేందుకు బ్లూప్రింట్ పరంగా ముఖ్యంగా మానవుడి కన్ను, రంగుల ప్రపంచం, రసాయనిక చర్యలు, సమీకరణలు, విద్యుత్తు ప్రవాహం, అయస్కాంత ఫలితం, విద్యుత్, కార్బన్ సమ్మేళనాలు, లోహాలు, ఆలోహాలు పాఠాలను క్షుణ్ణంగా చదవాలి ● 4 మార్కుల ప్రశ్నలకు ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, కాంతి పరావర్తనం చదవాలి. వీటి నుంచే చిత్రపటాలు, రేఖా చిత్రాలు వస్తాయి ● అలాగే ఎఫ్ఏ పరీక్షలు,, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్టు ప్రశ్నపత్రాలను సేకరించి సన్నద్ధం కావాలి. – గంటామోహన్, స్కూల్ అసిస్టెంట్ -
హిందీ సబ్జెక్టు ఇలా..
● ప్రశ్నపత్రంలోని మొదటి బాగంలో 35 మార్కులకు గాను పాసేజ్ పశ్నలు, కవి పరిచయం, రచయిత పరిచయం అడుగుతారు. వీటిని సమాధానం పరచడం సులభం. ప్రశ్నలలోని మూల పదాలను వెతికితే సమాఽధానాలు పొందవచ్చు ● పద్యభాగంలోని 4 దోహా (పద్యాలు)లను నేర్చుకుంటే ఇతర చిన్న ప్రశ్నలను నేర్చుకోవాల్సిన అవసరముండదు ● స్వరాజ్యకీ నీవ్, అంతర్రాష్ట్రీయ్ స్తర్ పర్ హిందీ, దక్షణీ గంగా, గోదావరి నుంచి లఘు ప్రశ్నలను అడిగే అవకాశముంది ● ఉపవాచకంలో దో కళాకార్లోని ప్రశ్నలన్నీ నేర్చుకుంటే చాలు ● పద్యభాగంలో బరస్తేబాదల్, కణ్ కణ్కా అధికారి సారాంశాలను నేర్చుకోవాలి. గద్యభాగంలో ఈద్గాహ్, లోక్ గీత్ పాఠ్యాంశాలను అభ్యసించాలి. ● లేఖలో చుట్టీప్రత్ , పుస్తక్ వికేత్ర కేశాయ్,కేపత్ర్, పితాజోకోపత్ర్ నేర్చుకుంటే మంచిది, నిబంధ్లో రాష్ట్ర భాష హిందీ, ప్రియత్యౌహార్, స్వచ్చభారత్, పర్యావరణ ప్రదూషణ్, పుస్తకాలమ్, విజ్ఞాన సెలభ్హానీ మొదలైనవి నేర్చుకుంటే మంచిది, – సుధాకర్, స్కూల్ అసిస్టెంట్ -
ప్రణాళికతో పదిలం
ఇంగ్లిష్ ఇలా.. ● జవాబు రాసేప్పుడు ఆర్డర్ మిస్ కాకూడదు ● లెసెన్ చివరలో ఉండే టెక్స్వల్ గ్రామర్ను బాగా ప్రాక్టీస్ చేయాలి ● స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ● క్రియేటివ్ రైటింగ్లో మాగ్జిమమ్ మార్కులు స్కోర్ చేయడానికి 2 పేజీలకు తక్కువ లేకుండా ఆన్సర్లు రాయాలి – జయంతి, స్కూల్ అసిస్టెంట్ చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల భవిష్యత్కు పదో తరగతి ఫలితాలే తొలిమెట్టు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సబ్జెక్టు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న క్రమంలో ఒత్తిడిని అధిగమించి ప్రణాళిక బద్ధంగా చదివితే పరీక్షలను చక్కగా రాసి ఉత్తమ మార్కులు సాధించవచ్చని సూచిస్తున్నారు.విద్యార్థి జీవితంలో పదోతరగతి అత్యంత కీలకమని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక్కడ సాధించిన ఫలితాలే భవితకు దిశానిర్దేశం చేస్తాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు ప్రణాళికాబద్ధంగా పరీక్షలు సన్నద్ధం కావాలని వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఒత్తిడిని జయిస్తే ఉత్తమ మార్కులు సాధించవచ్చని వివరిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నతంగా రాణించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు సబ్జెక్టుల వారిగా సలహాలు అందిస్తున్నారు. -
టీకాస్త్రం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులన్నింటిలో హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన ఆడపిల్లలకు మంగళవారం నుంచి ఈ వ్యాక్సినేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు ఆడపిల్లలు 10,900 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ విడతల వారీగా ఈ వ్యాక్సిన్ వేయించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఆడపిల్లకు 0.5 ఎంఎల్ డోసు వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. మూడు నెలలపాటు ఈ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు రెండు రోజుల్లో 300 మందికి టీకా వేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కీలకం సర్వైకల్ క్యాన్సర్ బారిన మహిళలు అధిక సంఖ్యలో పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి హెచ్పీవీ వైరస్ కారణంగా వస్తుందని, చిన్న వయసులోనే వ్యాక్సిన్ వేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని వెల్లడిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం హెచ్పీవీ వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు కొన్ని రకాల గొంతు క్యాన్సర్లు, జననేంద్రియ వ్యాధులను కూడా నివారించడంలో ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. దుష్ప్రభావాలు స్వల్పం వ్యాక్సిన్ వేసిన చోట కొద్దిగా నొప్పి, వాపు, తల తిరగడం, స్వల్ప జ్వరం, కండరాల నొప్పులు వంటి సమస్యలు కొంతమందిలో కనిపించే అవకాశముందని వైద్యులు తెలియజేస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యం ఉన్న వారు కోలుకునే వరకు వ్యాక్సిన్ వేయించుకోవద్దని సూచించారు. అలాగే ఎలర్జీ ఉన్న వారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.ఆడబిడ్డల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా టీకాస్త్రం అందించింది. ఈ మేరకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా వేయిస్తోంది. అందులో భాగంగా జిల్లాకు తొలివిడతగా 6,045 డోసులను సరఫరా చేసింది. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపడుతోంది. సర్వేకల్ క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలు ముందస్తు జాగ్రత్తగా టీకా వేయించుకోవాలని సూచిస్తోంది. ఉచితంగానే.. సాధారణంగా మార్కెట్లో ఒక్కో హెచ్పీవీ వ్యాక్సిన్ ధర సుమారు రూ.4 వేల వరకు ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ఖరీదైన వ్యాక్సిన్ను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది. -
నగరిలో 17న జాబ్ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నగరిలో ఈ నెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్రెడ్డి తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం సంయుక్తంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో 20కి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, బీటెక్, బీ ఫార్మసీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఎంపికయ్యే వారి నైపుణ్యాన్ని బట్టి నెలకు రూ.13 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందన్నారు. హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, బయోడేటా తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. వివరాలకు రసూల్ 6300954441, నాగరత్నం 8520048041లో సంప్రదించాలన్నారు. ఐరాల యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు చిత్తూరు కలెక్టరేట్ : ఐరాల మండలం 45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పం చ్ బాలాజీ కుమారుడు హరీష్బాబుకు ప్రతిష్టాత్మకమైన యంగ్ సోషల్ ఇంపాక్ట్ చాంపియన్ బిరుదు లభించింది. హరీష్బాబు ప్రస్తుతం చిత్తూరులోని విజయం బిజినెస్ స్కూల్లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదు వుతున్నాడు. ఈ విద్యార్థి సామాజిక సేవా రంగంలో చేసిన కృషికి ఈ బిరుదు దక్కింది. ఇన్ఫూ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ 2026 మార్చి 8న ప్రపంచ రికార్డుల పుస్తకంలో హరీష్ పేరును అధికారికంగా నమోదు చేసింది. హరీష్ బాబు చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతతో మెలిగి, ప్రపంచ స్థాయి రికార్డు సాధించడంపై ఐరాల మండల వాసులతోపాటు విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి, బిజినెస్ స్కూల్ అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నైపుణ్యాభివృద్ధిపై నిరుద్యోగులకు ఉచిత శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాబివృద్ధిపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా నెల్లూరు ప్రాజెక్ట్ పరిధిలో ఐటీడీపీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు తెలిపా రు. డేటా ఎంట్రీ ఆపరేటర్, లైట్ వెహికల్ డ్రైవింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్ తదితర కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. శిక్షణా కాలం 45 నుంచి 60 రోజులు ఉంటుందని, అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. ఎంపికయ్యే అభ్యర్థులు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కు సెంటర్ మేనేజర్ బాలాజీని 8187899877లో సంప్రదించాలన్నారు. నేడు ప్రభుత్వ ఇఫ్తార్ విందు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులోని అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఉర్దూ షాదీమహల్ వద్ద శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. ఆయన గురువా రం విలేకరులతో మాట్లాడుతూ రంజాన్ మాసా న్ని పురస్కరించుకుని ముస్లింలకు ప్రభుత్వం తరఫున కలెక్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పాల్గొనాలని కోరారు. -
క్రెడిట్ చోరీలో బాబును మించిన గురజాల
చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్ : ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలోకి వేసుకోవడంతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబు నాయుడిని మించిపోయారని వైఎస్సార్ సీపీ చిత్తూరు సమన్వయ కర్త ఎంసి.విజయానందరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను తానే చేయించినట్లు గురజాల డప్పు కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. చిత్తూరులోని ఫారెస్టు–పీవీకేఎన్ రోడ్డు పనులకు 2023లో టెండర్లు పిలిచారని, జేఎంసీ కంపెనీ 2024లో పనులను దక్కించుకుందన్నారు. వాటిని తానే చేయించినట్లు చెప్పుకోవడం గురజాల జగన్కే చెల్లిందన్నారు. తన పార్టీ మహిళా కార్యకర్త రోడ్డుపై పడి మృతి చెందితే రూపాయి ఆర్థిక సాయం చేయని స్థానిక ఎమ్మెల్యే, ఒక పిల్లాడిని ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంతో చలించిపోయి రోడ్డు వేయించానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో తన సొంత నిధులతో ప్రజల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశానని తెలిపారు. వాటిపై గురజాల జగన్మోహన్ బొమ్మలు అతికించి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. పలమనేరు రోడ్డులో తన సొంత ఆస్తులు, బినామీ ఆస్తులు ఉండడంతో అక్కడ విస్తరణ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కట్టమంచి చెరువులో మట్టి తవ్వి రూ.కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. కాజూరు చెరువు, కొట్రకోన, దొడ్డిపల్లె వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు–తచ్చూరు, చైన్నె–బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేరోడ్లు, చీలాపల్లెలోని సీఎంసీ ఆస్పత్రి అభివృద్ధి, చిత్తూరు–తిరుపతి డబుల్ రోడ్డు పనులన్నీ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా జరిగినవేనని ప్రజలందరికీ తెలుసన్నారు. వీటిని గురజాల జగన్మోహన్ నాయుడు తన ఖాతాలోకి వేసుకోవడం సిగ్గు చేటన్నారు. -
వైఎస్సార్ సీపీ పతాక దిమ్మె తొలగింపు
నగరి : పట్టణంలో గురువారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ పతాక దిమ్మెను మున్సిపల్ కమిషనర్ కూల్చేయడం దుమారం లేపింది. గతంలో నిర్మించిన పతాక దిమ్మెకు రెండు వైపులా ఎన్టీఆర్, గాలి ముద్దుకృష్ణమనాయుడి విగ్రహాలు ఉన్నాయి. అంతేగాక దుకాణాలు ఏర్పాటుచేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు గురువారం తెల్లవారుజామున మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆనుకుని నూతన పతాక దిమ్మెను చిన్నదిగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరూ లేని సమయంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్ దిమ్మెను కూల్చివేసి పతాక స్తంభాన్ని పక్కన పడేసి వెళ్లిపోయారు. వేడుకలు జరుపుకోవడానికి అక్కడికి వచ్చిన నేతలు పతాక దిమ్మెను తొలగించడాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మాజీ మంత్రి ఆర్కేరోజా మున్సిపల్ కమిషనర్ తీరుపై మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన బాలాజీ యాదవ్ మున్సిపాలిటీని నాశనం చేసి సస్పెండ్ అయ్యాడన్నారు. ఇప్పుడు బాలాజీనాయక్ అహంకారంతో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ఏర్పాటుచేసిన దిమ్మెను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో నగరిలో ఆస్పత్రి అభివృద్ధితోపాటు డయాలసిస్ సెంటర్, క్రిమియేషన్ సెంటర్, పార్కు, రోడ్లు, డ్రైనేజీలు ఇలా అనేక పనులు చేపట్టామన్నారు. 16 ఏళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన నిలిచి పనిచేస్తోందని వివరించారు. గత ఐదేళ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినట్టు తెలిపారు. అలాంటి పార్టీ పతాక దిమ్మెను కూల్చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్య అన్నారు.ముద్దు కృష్ణమనాయుడి విగ్రహానికి అనుమతి ఎలా ఇచ్చారుచిన్న దిమ్మె కట్టుకుంటే కూల్చేసిన అధికారులు ముద్దు కృష్ణమనాయుడు విగ్రహానికి ఎలా అనుమతిచ్చారో చెప్పాలని మాజీ మంత్రి ఆర్కేరోజా ప్రశ్నించారు. ఆయన నియోజవర్గానికి ఏమి చేశారని విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. దాన్ని తీసేయాలని మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించినా తొలగించడానికి చొరవ చూపని అధికారులు దిమ్మెలను తొలగించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని తెలిపారు. వారు అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని అనడానికి ఈ సంఘటన అద్దం పడుతోందన్నారు. నడిచేది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? నిరంకుశత్వమా అని ప్రశ్నించారు. ఇలా టీడీపీ నేతల్లా వ్యవహరించే అధికారుల పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. -
టీటీడీ చైర్మన్ కనిపించడం లేదు!
సాక్షి టాస్క్ఫోర్స్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం (ఏడీ బిల్డింగ్) వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో భక్తులు నిలదీస్తారనే భయంతో బయటకు కనిపించకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ నాయుడు బయటకు వచ్చి హిందువులకు క్షమాపన చెప్పడంతో పాటు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ నల్లాని బాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ పసుపులేటి సురేష్, పార్టీ బీసీ విభాగం జోనల్ అధ్యక్షుడు వాసుయాదవ్, నాయకులు అరుణ్యాదవ్, అనిల్రెడ్డి, మోహనరాజ్, రమణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి నగరి: తన భూమి సర్వే చేయించుకునేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్పై టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటన బుధవారం నగరి మండలం టీవీ కండ్రిగలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్ గురుమూర్తికి టీవీ కండ్రిగలో కొంత భూమి ఉంది. ఆ అందులో సర్వే చేసి.. హద్దులు చూపించాలని సర్వేయర్కు ఆయన అర్జీ పెట్టుకున్నారు. సర్వేయర్ బుధవారం వస్తానంటూ సమాచారమిచ్చారు. సర్వేయర్ వచ్చేలోపు.. వ్యక్తిగత పనులు పూర్తి చేసుకుందామని గురుమూర్తి బైక్పై తన సోదరుడు ఎ.శివకుమార్రెడ్డితో కలిసి నగరికి బయలుదేరాడు. మార్గంమధ్యలో టీడీపీ నేత ఎం.స్వామినాథన్్ వారిని అడ్డుకున్నాడు. ‘ఎందుకు సర్వే చేయిస్తున్నావ్?’ అంటూ గురుమూర్తిని ప్రశ్నించాడు. ‘నా భూమిలో సర్వే చేయించుంటున్నాను. అది రైతుగా నా హక్కు. అందులో సమస్య ఏంటి?’ అని గురుమూర్తి స్పందించగా.. నాకే ఎదురు సమాధానమిస్తామా? అంటూ గురుమూర్తి, శివకుమార్రెడ్డిపై మండిపడ్డాడు. టీడీపీ స్థానిక నేతలు శ్రీధర్, శ్రీనివాసులు, భూపాల్, షణ్ముగరెడ్డితో కలిసి దాడి చేశారు. గ్రామస్తులు వారిని అడ్డుకుని.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గురుమూర్తి తెలిపారు. డైయింగ్ యూనిట్ తనిఖీ పుత్తూరు : గేట్ పుత్తూరులో నిర్వహిస్తున్న డైయింగ్ యూనిట్ను బుధవారం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు తనిఖీ చేశారు. సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె.మురగారెడ్డి ఫిర్యాదు మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు డైయింగ్ యూనిట్ను పరిశీలించారు. వ్యర్థాలతో కూడిన రంగునీళ్లను పబ్లిక్ ప్రదేశంలో యథేచ్ఛగా వదలి పెడుతుండడం గమనించారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమై, ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని గుర్తించారు. అలాగే డైయింగ్ యూనిట్కు ట్రేడ్ లైసెన్స్ సైతం లేకనే ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. తక్షణం యూనిట్ను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్వాహుకులను కమిషనర్ ఆదేశించారు. లేకుంటే యూనిట్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మోహనకృష్ణ పాల్గొన్నారు. -
ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి..
పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం ఇప్పటికీ అట్టడుగు వర్గాల్లోనూ చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. రైతుల ఆక్రందనలపై గళమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం చేసిన కుట్రలను దీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలను విని, విజయానికి చేరువయ్యారు. -
మెడికల్ వేస్ట్ నిర్వహణపై శిక్షణ
చిత్తూరు రూరల్(కాణిపాకం): బయో మెడికల్ వేస్ట్ నిర్వహణపై వైద్య సిబ్బందికి బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో చేపట్టిన తరగతుల్లో డీఎంహెచ్ఓ సుధారాణి మాట్లాడుతూ ఆస్పత్రులు, ల్యాబ్లు, క్లినిక్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సురక్షితంగా వేరు చేసి శాసీ్త్రయ పద్ధతుల్లో నిర్వీర్యం చేయాలని సూచించారు. సూదులు, రక్తం అంటిన బ్యాండేజీలు, ఇతర ప్రమాదకర వ్యర్థాలను రంగుల కోడ్ డబ్బాలలో వేయడం ద్వారా కాలుష్యం, అంటువ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల కంటైనర్ల ద్వారా వ్యర్థాలను వర్గీకరించి నిర్వీర్యం చేయాలని స్పష్టం చేశారు. బయో మెడికల్ వ్యర్థాలను 48 గంటలకు మించి నిల్వ ఉంచకూడదని, ప్రత్యేక వాహనాల ద్వారా సురక్షితంగా తరలించాలని ఆదేశించారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో అలసత్వం వహిస్తే హెచ్ఐవీ, హెపటైటిస్–బి వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఆస్పత్రుల నిర్వాహకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ విభాగం సిబ్బంది గణేష్ కుమార్, రేఖ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. డీపీఎంఓ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నిరంజన్ రెడ్డి, డాక్టర్ దివ్య దీప్తి, జార్జి పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు భూ సేకరణకు ససేమిరా
శాంతిపురం: తరతరాలుగా తమకు అన్నం పెడుతున్న భూములను విమానాశ్రయానికి ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూసేకరణపై రైతులతో చర్చించేందుకు తహసీల్దార్ ప్రకాష్బాబు బుధవారం మండలంలోని దండికుప్పం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పదేపదే భూముల కోసం వేధిస్తే ప్రాణాలు తీసుకోవడం మినహా గత్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఉన్న భూములు లాక్కుని భిక్షగాళ్లుగా మార్చవద్దని వేడుకున్నారు. సిద్ధారెడ్లపల్లెకు చెందిన మహిళా రైతులు సులోచనమ్మ, పద్మమ్మ మాట్లాడుతూ భూములు పోతాయనే బాధ కంటే తమ ప్రాణాలు తీసుకోవడమే మేలని వాపోయారు. దీనిపై ఒత్తిడి చేయడం కంటే ప్రభుత్వమే విషమిచ్చి తమ కుటుంబాలను చంపేస్తే అరకొర పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరముండదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మారకపోతే తమ బలవన్మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికే తమ గ్రామానికి చెందిన వెంకటప్ప ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడుతున్నాడని వెల్లడించారు. తమ గ్రామానికి తాగునీరు, వ్యవసాయ భూములకు సాగునీరు ఇస్తున్న బోర్లు అన్నీ కురబవానికుంట ప్రాంతంలోనే ఉన్నాయన్నారు. ఇప్పుడు అధికారులు ఆయా భూములను, కుంటను లాగేసుకుంటే గ్రామంలో ఎవరూ బతకాల్సినపని లేదని తెలిపారు.దండికుప్పానికి చెందిన రైతులు చక్రపాణిరెడ్డి, లక్ష్మి మాట్లాడుతూ అభ్యంతరం లేని రైతులు ఇచ్చిన దాదాపు 2 వేల ఎకరాల్లోనే విమానాశ్రయం కట్టుకోవాలని చెప్పారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నామని, భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేమని స్పష్టం చేశారు. అభివృద్ధి, విమానాశ్రయం పేరుతో తమ గ్రామాలకు ఉనికి లేకుండా చేయవద్దని విన్నవించారు. ఈ మేరకు రైతుల అభ్యంతరాలను రెవెన్యూ అధికారుల నమోదు చేసుకున్నారు. మొత్తం విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి వెనుదిరిగారు. బాధిత రైతుల విజ్ఞప్తితో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, నేతలు మురళీరెడ్డి, మంజునాథరెడ్డి, శ్రీరాములుగౌడు గ్రామానికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలే కానీ, బలప్రయోగం చేయవద్దని అధికారులను కోరారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
రూ.10 కోట్లు హాంఫట్
పలమనేరు: నియోజకవర్గంలోని వీకోట మండలంలో గత మూడు నెలల్లో జరిగిన ఉపాధి పనుల్లో రూ.10 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. మండలంలోని కొంగాటం పంచాయతీలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు రూ.3 కోట్ల దాకా బినామీ కూలీల ద్వారా అక్రమాలు సాగినట్టు సమాచారం. కొంగాటంలో 21 పనుల్లోనే రూ.కోట్లు స్వాహా వీకోట మండలంలో గత నెల 26న కొంగాటం గ్రామంలోనే 21 పనులను 758 మంది కూలీలు చేసినట్టుగా రికార్డ్ చేశారు. వీరు నీళ్లున్న చెరువుల్లో ఫిష్పాండ్స్, ఫీడర్చానెళ్లు, బౌండరీ ట్రెంచులు చేసినట్టుగా పెట్టారు. కానీ అన్ని పనుల్లోనూ ఒకటే కూలీల గ్రూపుఫొటోను అప్లోడ్ చేసి అసలైన కూలీల కడుపుగొట్టారు. ఇదిగో సాక్ష్యం వీకోట మండలంలోని కొంగాటం పంచాయతీలో ఫిబ్రవరి నెలఖారు దాకా 21 పనులకు 758 మంది దాకా కూలీలు పనులు చేసినట్టు యాప్లో రికార్డు చేశారు. అయితే మార్చి 1 నుంచి ఫేషియల్ అటెండెన్స్ రాగానే కూలీలు కనిపించలేదు. మార్చి 2న కేవలం మూడే పనులు సాగుతున్నట్టు అందులో 16 మంది కూలీలు పనులు చేసినట్టుగా ఉంది. మార్చి 3న వర్క్ ఐడీ 0210062013 ఎంఎస్సార్ నెం:12194లో కాంప్రెహెన్సివ్ రిస్టోరేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ఇన్ శివునికుప్పం చెరువు పనులకు ఫిబ్రవరి నెలాఖరు దాకా పది మంది కూలీలు పనులు చేసినట్టు గ్రూప్ ఫొటో అప్లోడ్ చేశారు. కానీ మార్చి మూడున ఆ కూలీల్లో కేవలం రంగారెడ్డి అనే కూలీ మాత్రమే వచ్చినట్టు అప్లోడ్ చేశారు. అంటే కొత్త యాప్ అమలులోకి రావడంతో వీరి ఆటలు సాగలేదని తెలుస్తోంది. శివునికుప్పం చెరువు పనుల్లో లక్షలు స్వాహా కొంగాటం పంచాయతీలోని శివునికుప్పం చెరువు పనుల్లో జనవరి 7 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ దాకా 17 మస్టర్లను జనరేట్ చేసి భారీగా కూలి పనులు చేసినట్టు ఒకే గ్రూపు ఫొటోలను అప్డేట్ చేసి రూ.69,50,024 బిల్లులు చేసుకున్నారు. ఇలాంటివి ఆ పంచాయతీలోనే మరో 20 పనులు జరిగాయి. ఇంక మండలంలో ఎన్ని అక్రమాలు జరిగే ఇట్టే అర్థమవుతోంది. ఎప్పటికప్పుడు బిల్లులు అందినట్టు ఎన్ఎంఎంఎస్ యాప్ లో కనిపిస్తున్నా అక్కడి ఏపీవో మాత్రం కొన్నింటి బిల్లులు జనరేట్ చేయలేదని చెప్పడం గమనార్హం. -
తుక్కురేగ్గొట్టేదెప్పుడు?
స్క్రాప్ స్కాంపై అధికారుల మౌనం చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రంగా జరిగిన తుక్కు మాఫియా అక్రమాలు అక్షరాలా రూ.400 కోట్లు. అమాయక ప్రజలను అస్త్రంగా చేసుకుని బినామీ పేర్లతో బోగస్ సంస్థలను సృష్టించి సీజీఎస్టీ రిటర్న్స్ సొమ్మును కాజేశారు. వందల మందికి నోటీసులు అందడంతో తుక్కు మాఫియా అక్రమా లు వెలుగు చూశాయి. రంగంలోకి దిగిన అధికారు లు విచారణ చేపట్టి మిన్నకుండి పోయారు. మాఫియాపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. వెనకుండి నడుపుతున్న తిమింగలాలు ఎవరు చిత్తూరు కేంద్రంగా స్క్రాప్ వ్యాపారి తన అక్రమ సామ్రాజ్యాన్ని మొత్తం నడిపించాడు. కొందరి సహకారంతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించా డు. బినామీ పేర్లతో సరుకును విక్రయించి రూ.కోట్లు కొల్లగొడుతూ, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీజీఎస్టీని ఎగ్గొట్టాడు. ఇతనిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎటు వెళ్లినా అక్రమ వ్యాపారి దానికి వ్యతిరేకంగా న్యాయపరంగా వెళుతున్నారని అధికారులు సర్దిచెప్పుకుంటున్నారు. ప్రశ్నించిన అధికారులను బెదిరించడం.. వారిని బదిలీ చేయిస్తానని దబాయిన్నాడంటే అతని వెనుక ఎంత పెద్ద నెట్ వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నకిలీ సంస్థలను కనుగొన్న అధికారులు ఆపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. -
నేతల పెత్తనం
నెలనెలా మామూళ్లు కాణిపాకం/తిరుపతి తుడా: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధికారికంగా మూడు వేలకు పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. అనధికారికంగా మరో 2,500 వరకు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహించడం సర్వసాధారణమైపోయింది. ఫార్మసీ అర్హతలు లేని వ్యక్తులే మందులు విక్రయించడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దొంగచాటు అమ్మకాలు కొన్ని మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్న్ కిట్లు, బలమైన మందులు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. ఇది మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే మెడికల్ షాపులు ఏర్పాటు చేయడం మరో సమస్యగా మారింది. ఆస్పత్రికి వచ్చే రోగులు తప్పనిసరిగా అదే షాపులో మందులు కొనాల్సిందే. ఇలాంటి మెడికల్ షాపుల ద్వారా రోజుకు సుమారు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. ఈ వ్యవహారంలో భాగంగా ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారు ల పేరిట డబ్బులు తీసుకుంటూ షాపు లు కొనసాగించేందుకు అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. మామూళ్లలో నెలవారీగా అధికారులకు వాటా ఇస్తున్నామని కొందరు బహిరంగగానే చెబుతున్నారు. రెండు జిల్లాల్లో కలిపి నెలవారీగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు మామూళ్లు వసూలు అవుతున్నట్టు సమాచారం. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ అధికారికంగా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఆ శాఖలో ఇద్దరు అధికారులపై ఏసీబీ దాడు లు జరిగినా వారి తీరు మారలేదని.. ఆ శాఖలోని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మెడికల్ షాపుల సంఘం పేరుతో కొందరు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా షాపు ప్రారంభించాలంటే ముందుగా అతని అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి లేకుండా షాపు ప్రారంభిస్తే వివిధ రకాల ఇబ్బందులు కలిగిస్తున్నట్లు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ షాపు రిజస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ వ్యక్తికి రూ.20 వేల నుంచి రూ.50వేల ముట్టజెప్పాలి. మెడికల్ షాపులు విక్రయించే మందులు, మాత్రలు కూడా అతను సూచించిన డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలి. -
మజ్జిగ కోసం వచ్చి..
– మహిళ మెడలో చైన్ స్నాచింగ్ వెదురుకుప్పం: మజ్జిగ కోసం దుకాణానికి వచ్చి మహిళ మెడలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు చైన్ లాక్కెళ్లిన ఘటన మంగళవారం మండలంలోని నల్లవెంగనపల్లెలో చోటుచేసుకుంది. ఎస్ఐ నవీన్బాబు కథనం.. నల్లవెంగనపల్లె గ్రామ సచివాలయం పక్కన బాలాజీనాయుడు భార్య అమృత చిన్న దుకాణం నడుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుకాణం వద్దకు వచ్చి మజ్జిగ ప్యాకెట్లు కావాలని అడిగారు. మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే క్రమంలో అమృత మెడలో ఉన్న బంగారు చైన్ను లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కేకలు పెట్టింది. అప్పటికే దొంగలు పరారుకావడంతో జరిగిన ఘటనను భర్త బాలాజీనాయుడుకి చెప్పింది. చోరీకి గురైన చైన్ 20 గ్రాముల బరువు, రూ.3 లక్షల మేర ఉంటుందని బాధితురాలి తెలిపింది. అమృత ఫిర్యాదు మేరకు వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి వి.కోట : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మండలంలోని బీసీ పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని బీసీపల్లె గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమార్తె వైష్ణవి(20) చింతలగుంట గ్రామానికి చెందిన శివతో మూడెళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం బీసీ పల్లిలో ఉంటున్న వైష్ణవికి గత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పూర్తిగా నీరసించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వైష్ణవి మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మృతురాలికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. శక్తివంతమైన ఆయుధం విద్య పూతలపట్టు(యాదమరి): నేటి ఆధునిక యుగంలో అతివలు రాణించాలంటే విద్య అనే అత్యంత శక్తివంతమైన ఆయుధం వల్లే సాధ్యమవుతుందని ఎస్వీఎంవీవీ రిజిస్ట్రార్ ఉష తెలిపారు. మంగళవారం ఆమె మండల పరిధి పి.కొత్తకోట వేము ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే అభిలాష మాత్రమే ఉంటే సరిపోదని, అందుకు సరిపడా ఆసక్తి, పట్టుదల, క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రస్తుత సమాజంలోని కొందరు మహిళలపై చిన్నచూపు చూస్తున్నారని, అటువంటి ప్రతికూల ఆలోచనలు పట్టించుకోకుండా ముందుకు సాగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో చదువుతున్న వారిలో సుమారు 52 శాతానికి పైగా అమ్మాయిలు ఉండడం సంతోషదాయకమన్నారు. కళాశాల పూర్తిగా ర్యాగింగ్ రహిత క్యాంపస్గా ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సాయిశిరీషా, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గ్యాస్మంటలు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వంట గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై మరోసారి భారీ భారం పడింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా పెరగడం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 చొప్పున పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో 47 గ్యాస్ ఏజెన్సీలుండగా...6 లక్షల వరకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 3.2 లక్షల సిలిండర్లు అమ్ముడుబోతున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.883 ఉండగా తాజా పెంపుతో అది రూ.943కు చేరింది. నెలకు ఒకటి లేదా రెండు సిలిండర్లు వినియోగించే కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది. ఇప్పటికే పప్పు, నూనె, గోధుమపిండి, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. మరింత భారమే గత కొంతకాలంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరలు కూడా పెరగడంతో సాధారణ కుటుంబాలు ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు పడుతున్నాయి. కొత్త నిబంధనలతో మరిన్ని తిప్పలు ధరల పెంపుతో పాటు ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలను కూడా అమలు చేస్తున్నాయి. ఒకే సిలిండర్ ఉన్న వినియోగదారులు 25 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునేలా, రెండు సిలిండర్లు ఉన్నవారు 30 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునేలా పరిమితులు విధించాయి. ఈ నిబంధన వల్ల అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్ పొందడం కష్టమవుతోంది. మళ్లీ పొగబెట్టే పరిస్థితి పదేళ్ల క్రితం వరకు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వంట గ్యాస్ వినియోగం చాలా తక్కువగా ఉండేది. అడవుల్లో దొరికే కలపతో వంట చేసేవారు. దీంతో పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం ఏర్పడేది. ఈ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వాలు గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించాయి. దీపం, ఉజ్వల వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. అయితే ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగడంతో చాలా కుటుంబాలు సిలిండర్ వినియోగాన్ని తగ్గించే పరిస్థితి ఏర్పడింది. భారం వద్దు నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగాయి. నెలకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చువుతోంది. దీంతో పాటు గ్యాస్ ధరలు పెరిగాయి. ఇది సామాన్య జనానికి ఇబ్బందికరమే. గ్యాస్ రాయితీలు ఇస్తామన్నారు. అది కూడా సక్రమంగా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. – గోవిందమ్మ, ఎస్ఆర్పురం మండలం -
ఇక సభకు సెలవు!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ (పాలకవర్గం) చివరి సమావేశం ముగిసింది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 46 డివిజన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని.. మేయర్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఆపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కొందరు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరి, సస్పెన్షన్లకు గురవడమూ తెలిసిందే. కాగా ఈ నెల 17తో పాలకవర్గం గడువు ముగియనుండా.. మంగళవారం చివరి సమావేశాన్ని పూర్తిచేశారు. మేయర్ అముద అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇందులో పలు ప్రధాన సమస్యలు ప్రస్తావించారు. ఇవీ సమస్యలు మంగసముద్రం డంపింగ్ యార్డ్ సర్వే నం.135లో రెండు ఎకరాల స్థలం ఉంది. దాన్ని అభివృద్ధి చేయలే కానీ, ఎవరికీ ఇవ్వరాదని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ సభలో వెల్లడించారు. 50 ఏళ్ల ముందు మిలిటరీ పట్టాగా ఆ స్థలం తనకు ఇచ్చారని ఓ బాధితురాలు తనవద్దకు వచ్చారన్నారు. ఆ స్థల విక్రయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలం మున్సిపల్కు సంబంధించిందని.. దాని విక్రయించొద్దని సభలో ప్రసావించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 9వ డివిజన్లో కాలువలు నిర్మించి, రోడ్డును విస్తరించాలన్నారు. అలాగే కొంగారెడ్డిపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రాంతంలో కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. కట్టమంచి నుంచి సాంబయ్యకండ్రిగ రోడ్డు పనులు వేగం పెంచాలన్నారు. ఈ మార్గంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని తొలగించకుండా పనులు చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ హరిణిరెడ్డి సభలో ప్రస్తావించారు. కరోనా సమయంలోనూ జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. జగనన్న పాలనలో అభివృద్ధి జరగలేదని చెప్పడం సరికాదని వెఎస్సార్సీపీ కార్పొరేటర్ స్వరూపరాణి ఖండించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ షర్మిల మాట్లాడుతూ కట్టమంచి చెరువు వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేయాలన్నారు. స్థానిక గంగినేనిచెరువులో మౌలానా అబుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం విగ్రహలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కో–ఆప్షన్ సభ్యుడు ఆను కోరారు. గతంలో స్థానిక ఫారెస్టు రోడ్డులో ప్రమాదంలో మరణించిన పాఠశాల విద్యార్థి జైనిరూప్ పేరును ఆ రోడ్డుకు పెట్టడానికి ఆమోదం తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు గత పాలనలో మేయర్గా అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేయర్ అముద కృతజ్ఞతలు తెలియజేశారు. పాలన కాలంలో సహకరించిన యంత్రాగానికి ధన్యావాదాలు తెలిపారు. కమిషనర్ నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, మేయరు, డిప్యూటీ మేయర్లు, సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. ఈ సమావేశంలో చుడా చైర్ పర్సన్ కఠారిహేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్కుమార్రెడ్డి, సహాయ కమిషనర్ ఎ.ప్రసాద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాన్ని సందర్శించిన ఆర్జేసీ
కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని మంగళవారం తిరుపతి జోన్ దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానంలోని లడ్డూ పోటు, అన్నదానం, క్యూలైన్లు తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. లడ్డూ పోటులో తయారీ విధానాన్ని పరిశీలించిన ఆయన, నాణ్యతను మరింత మెరుగుపరిచి భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అన్న దానం విభాగంలో భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ, ప్రసా ద్, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు పాల్గొన్నారు. కోడిగుడ్లు నిర్ణీత తేదీల్లోనే తీసుకోవాలి వడమాలపేట (పుత్తూరు): ఏజెన్సీ వారు అందజేసే కోడిగుడ్లను నిర్ణీత తేదీల్లో అంగన్వాడీ కేంద్రాల వారు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు తీసుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మణ్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన వడమాలపేట అంగన్వాడీ కేంద్రం, బాలుర ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని, రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో 324 కోడిగుడ్లు అధనంగా ఉండడాన్ని గుర్తించి, ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరారు. 15 రోజులకు ఒకసారి కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా అవి చెడిపోతున్నాయని, అందువల్ల ప్రతి 7 రోజులకు ఒకసారి కోడిగుడ్లు తీసుకోవాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక రిజిస్ట్రర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరపాలక బడ్జెట్ రూ.289.07 కోట్లు చిత్తూరు అర్బన్: నగరపాలక సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.289.07 కోట్లతో బడ్జెట్ను రూపొందించింది. మంగళవారం మేయర్ అముద అధ్యక్షతన జరిగిన నగరపాలక కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం లభించింది. మొత్తం జమలు రూ.296 కోట్లుగా అంచనా వేయగా, వ్యయం రూ.270.78 కోట్లుగా నిర్ణయించారు. అభివృద్ధి పనులకు రూ.25.57 కోట్లు కేటాయించారు. పేదవాడల అభివృద్ధికి రూ.10 కోట్లు, ఎస్సీలకు రూ.1.83 కోట్లు, ఎస్టీలకు రూ.1.91 కోట్లు, సీ్త్ర శిశు సంక్షేమానికి రూ.1.27 కోట్లు, విభిన్న ప్రతిభావంతులకు రూ.76 లక్షలు కేటాయించారు. ఇక ‘ప్రత్యేక’ పాలన! చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీలోని పాలకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర పురపాలన పరిపాలన శాఖ మంగళవారం ప్రతులు జారీచేసింది. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్తో పాటు పలమనేరు నగరి, పుత్తూరు మునిసిపాలిటీల్లోని పాలకవర్గాలకు (కౌన్సిల్) ఈనెల 17న గడువు ముగుస్తోంది. కుప్పం మునిసిపాలిటీకి సెప్టెంబర్ వరకు గడువు ఉంది. 2020లో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం.. ఆపై కరోనాతో 2021న ఎన్నికలు పూర్తవడం తెలిసిందే. ఐదేళ్లపాటు పట్టణాలను పాలించిన పాలకుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం ముగ్గు చూపింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణను కొన్ని రోజులపాటు వాయిదా వేయడం మంచిదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది పూర్తిగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులతో నెట్టుకొచ్చే దిశగానే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కు కలెక్టర్ సుమిత్కుమార్ను ప్రత్యేక అధికారిగా.. పలమనేరు, నగరి, పుత్తూరు... ప్రత్యేక అధికారులుగా నియమించారు. -
విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దు
నగరి : విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని, హాస్టల్ వార్డెన్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ప్రతాప్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన నగరిలోని పలు హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆహార పదార్థాలను స్వయంగా రుచిచూసి వాటి నాణ్యతపై ఆరా తీశారు. గుడ్ల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. నగరి బీసీ హాస్టల్ను సందర్శించిన ఆయన ప్రహరీ లోపల ఇతరులకు చెందిన వాహనాలను ఉంచడాన్ని, వాటి కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతుండడాన్ని గమనించి హాస్టల్ వార్డన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ హాస్టల్లో టిఫిన్ రుచిచూసి చట్నీ నాణ్యత కొంచం పెంచాలని సూచించారు. కీళపట్టు పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రేషన్ షాపులు, అంగన్న్వాడీ కేంద్రాల్లో సరుకుల పంపిణీ, నిల్వలపై విచారణ జరిపారు. ఆయన తనిఖీకి వస్తున్నారనే సమాచారంతో పలువురు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆయన వెంట సీ్త్ర,శిసు సంక్షేమ శాఖ పీడీ వెంకటేశ్వరి, డీఎస్ఓ శంకరయ్య, ఎంఈవోలు శ్రీదేవి, నమశ్శివాయం, సీడీపీవో ఇందిరాప్రియదర్శిని పాల్గొన్నారు. కీళపట్టులో ఆహారాన్ని రుచి చూస్తున్న ఫుడ్ కమిషన్ చైర్మన్ అంగన్వాడీ సెంటర్లో రికార్డులు తనిఖీ చేస్తున్న ఫుడ్ కమిషన్ చైర్మన్ -
పొగపొయ్యే దిక్కా?
గ్యాస్ గుబులు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ఉధృతం అవుతోంది. దీంతో నౌకాశ్రయాలు మూతపడ్డాయి. వెరసి క్రూడ్ ఆయిల్..గ్యాస్ దిగుమతి ఆగింది. ఫలితంగా దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు తరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాపార సిలిండర్ల సరఫరా నిలిపివేతకు గ్యాస్ డీలర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో హోటళ్లు మూత వేస్తారా? లేక కట్టెల పొయ్యిలపై ఆధారపడతారా? అన్న సంశయం నెలకొంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఆ ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలు విధించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆపివేయాలని మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో వినియోగ దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక నగరాల్లో మంగళవారం ఉదయం నుంచే కమర్షియల్ సిలిండర్ల బుకింగ్ నిలిపివేసినట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ కమర్షియల్ సిలిండర్లు సరఫరా నిలిపివేయాలని డీలర్లకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉంది. అయితే అస్పత్రులు, వసతి గృహాలకు మాత్రం కమర్షియల్ సిలిండర్లు సరఫరా కొనసాగేలా కేంద్రం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. గ్యాస్ సంక్షోభం తప్పదా? యుద్ధం ప్రభావంతో గ్యాస్ సంక్షోభం ఏర్పడే ప్రమా దం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో హోటళ్లు మూసివేసినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు, పర్యాటకులు తిరుపతికి వచ్చి వెళుతుంటారు. భక్తులు, పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిరుతిళ్లు దుకాణాలు వెలిశాయి. తిరుపతి జిల్లాలో 25,800 కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. ఇందులో ఒక్క తిరుపతిలోనే 50 శాతానికిపైగా కమర్షియల్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. ప్రతి నెలా లక్షకుపైగా సిలిండర్ల అవసరం ఉందని అంచనా. ప్రచారంలో ఉన్నట్టు కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆపేస్తే.. తిరుపతి జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉంది. అదే జరిగితే.. భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చిత్తూరు జిల్లాలో సుమారు 12 వేల సిలిండర్లకుపైగా ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తే కాణిపాక వరసిద్ధివినాయకు స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల వరకై తే ఇప్పటి వరకు ఎటువంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపైనా ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. -
టోల్ప్లాజా వద్ద ఘర్షణ
సాక్షి, టాస్క్ఫోర్స్: బంగారుపాళెం మండలంలోని మహాసముద్రం టోల్ప్లాజా వద్ద సోమ వారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న కారు టోల్ప్లాజా వద్ద సిబ్బంది ఆపి టోల్ఫీజు చెల్లించాలని సూచించారు. దీంతో కారులో ఉన్న వ్యక్తులు తాము టీడీపీకి చెందిన వారమని, తమ వాహనాన్నే పంపరా..? అంటూ సిబ్బందిపై దాడికి పూనుకున్నారు. అక్కడే ఉన్న మరికొందరు అడ్డుకున్నట్లు తెలిపారు. కారులో ఉన్న వ్యక్తులు సిబ్బందిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన శోభ మృతి కార్వేటినగరం: మండలంలోని అమ్మపల్లి క్రాస్ వద్ద ఈనెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన శోభ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలం కేంద్రంలోని చాకలివాని గుంట ఎస్టీ కాలనీకి చెందిన అరుణ్, శోభ దంపతులతో పాటు ఏడాది చిన్నారి దీపికతో కలసి చికిత్స కోసం పల్లిపట్టుకు వెళ్తున్నారు. ఆ సమయంలో కేఎం పురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో వస్తూ వెనుక నుంచి ఢీకొట్టారు. రోడ్డుపై పడిన శోభ తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి దీప ఒంటరిగా మిగిలింది. తల్లిలేని బిడ్డను చూసి గ్రామస్తులు బోరున విలపించడం గుండెల్ని పిండేసింది. ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి – మరొక్కరికి తీవ్రగాయాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆగి ఉన్న ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చిత్తూరు మండలం, ఒబ్బన్నగుంట వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. మండలంలోని ఒబ్బన్నగుంట వద్ద ఓ ట్రాక్టర్ పంక్చర్ అయ్యింది. దీంతో బండిని రోడ్డు పక్కకు పెట్టి..డ్రైవర్ కాపలా ఉన్నాడు. ఈ క్రమంలో తుమ్మింద గ్రామానికి చెందిన సంజయ్ (18), చిన్నరాజు (22) చిత్తూరు నుంచి తుమ్మింద వైపు వస్తూ ట్రాక్టర్ వెనుక వైపు బలంగా ఢీకొట్టారు. సంజయ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చిన్నరా జు తలకు తీవ్ర గాయలు కావడంతో తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాలూకా ఎస్ఐ అశోక్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సంజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనానికి లైట్ లేకపోవడం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్ఐ పేర్కొన్నారు. గరుడ వారధిపై ద్విచక్ర , భారీ వాహనాలు నిషేధం తిరుపతి క్రైం : నగరంలోని గరుడవారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ రవాణావాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి స్మార్ట్ సిటీ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం జూమ్ మీటింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి అంశాలతో పాటు గరుడ వారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రమాదాల వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. -
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్, కెప్టెన్ పి.సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో పర్యటించారు. కలెక్టరేట్లోని సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆ శాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సైనికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదన్నారు. చిత్తూరు జిల్లా మాజీ సైనికుల సంఘం నిర్మించిన యుద్ధస్మారకానికి డైరెక్టర్ రూ.2,72,550 చెక్కును అందజేశారు. జెడ్పీ కార్యాలయం ఎదురుగా సైనిక్ భవనం నిర్మానానికి 5 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. మాజీ సైనికులు, సంఘ ప్రతినిధులతో భేటీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు, వైఎస్సార్సీపీ ఉద్యోగ, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. -
విజయశ్రీ!
చిత్తూరు: పక్కా ప్రణాళికతో కష్టపడి చదివితే విజయం తప్పకుండా వరిస్తుందని.. అదుకు తానే సాక్షి అని పలమనేరు మండలంలోని జరావారిపల్లికి చెందిన జయశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు తాను చదివిన పట్టణంలోని ఎలీనా బెట్టిని స్కూల్ యాజమాన్యం ఆమెకు సోమవారం అభినందన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ తాను సివిల్స్ ఫలితాల్లో 360 ర్యాంక్ సాధించానన్నారు. గతంలో రెండు సార్లు ఇదే పరీక్షలో విఫలమైనా ఈ దఫా పట్టుదలతో ఉత్తమ ర్యాంక్ సాధించినట్టు వెల్లడించారు. జరావారిపల్లి గ్రామానికి చెందిన తాను పేద రైతు కుటుంబంలో పుట్టానని, తల్లిదండ్రులు మునెమ్మ, శ్రీరాములురెడ్డి తనచదువు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తుచేసుకున్నారు. తాను అందరిలాగే ప్రాథమిక, ఉన్నత విద్యను స్థానికంగానే చదివానని.. ఆపై పులివెందుల జేఎస్టీయూలో ఉన్నత విద్యనభ్యసించినట్టు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా చదివి సివిల్స్లో విజయం సాధించినట్టు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సివిల్స్లో విజయం సాధించాలని ఆకాక్షించారు. -
మా సమస్యలు అయ్యేలే..పొయ్యేలే!
పలమనేరు: ‘మా సమస్యలు అయ్యేలే..పొయ్యేలే’ అంటూ అర్జీదారులు నిట్టూర్చారు. సోమవారం పలమనేరు ఆర్డీవో వద్దకు వచ్చిన అర్జీల్లో 90శాతం రెవెన్యూకి సంబంధించినవే. వీటిల్లో 80 శాతం సర్వే సమస్యలే. ఒకే సర్వే నంబరులోని భూమిని సంబంధిత యజమాని విక్రయించి సబ్ డివిజన్ అయ్యి పట్టాదార్ పాసుపుస్తకం వచ్చినా వాటిని సైతం రికార్డుల్లో ఎక్కించకుండా వదిలేశారు. దీంతో గతంలో పట్టా భూములను అమ్మినవాళ్లే మళ్లీ అదే భూములను అమ్ముకునేలా రెవెన్యూ అధికారులే మార్గం చూపించారు. ఇలాంటి ఘటనలు మొరం రెవెన్యూలోనే భారీగా ఉన్నాయి. అన్న చెప్పాడా అయితే ఓకే! బైరెడ్డిపల్లి మండలం, నెల్లిపట్ల దళితవాడకు చెందిన సంపూర్ణమ్మకు గతంలో సర్వే నం.392లో గ్రామకంఠం ఒకటిన్నర సెంట్లు ఇంటి పట్టా ఇచ్చారు. అయితే ఆ స్థలానికి పక్కనున్న వారు తమకు దారి కావాలని బాధితులను ఇబ్బంది పెట్టారు. దీనిపై బాధితులు స్థానిక ఆర్డీవోను ఆశ్రయించగా ఆమె స్వయంగా పరిశీలించి పట్టాదారుకు హక్కు ఉందని తేల్చారు. అయితే దారి అడుగుతున్న వ్యక్తులు కూటమి సానుభూతిపరులు కావడంతో వారు వెళ్లి అక్కడి అధికార పార్టీ నేతను కలిసి జరిగింది చెప్పారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు ఆ మండల తహసీల్దార్ కథ మొత్తం మార్చేసి ఆర్డీవోకు ఓ నివేదిక ఇచ్చేశారు. ఆర్డీవో సైతం బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూస్తే కూటమి నేతల ప్రాభల్యం రెవెన్యూ శాఖపై ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్జీదారులు ముందుగా వారి దగ్గరికి వెళ్లాల్సిందే సాధారణంగా ఆయా మండలాల్లోని అర్జీదారులు సోమవారం గ్రీవెన్స్డేకు వెళ్లడం మాములే. కానీ కూటమి పాలన మొదలయ్యాక ఆయా మండలాల్లోని అధికార పార్టీ నేతల గుప్పిట్లో తహసీల్దార్లు తోలు బొమ్మలుగా మారారు. తహసీల్దార్ ఆఫీసులకుమే అర్జీ వెళ్లినా ఆయా తహసీల్దార్లు అన్నతో మాట్లాడుకో ఎందుకబ్బా అనే మాట వినిపిస్తోంది. కాదంటే వారి సమస్య కొండెక్కడం గ్యారెంటీ. ఇలా చట్టాలను ఖాతరు చేయకుండా కేవలం అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ యంత్రాంగం కీలుబొమ్మలుగా మారినందునే వాదన బలంగా వినిపిస్తోంది. -
కుప్పంలోనే అధిక సమస్యలు
చిత్తూరు కలెక్టరేట్ : కుప్పం నుంచే అధికంగా రెవెన్యూ సమస్యలు నమోదవుతున్నాయని ఇన్చార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమీక్ష మండలి సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ‘రెవెన్యూ సమస్యల పరిష్కారం జఠిలంగా ఎందుకు మారుతోందని అన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు, సర్వేయర్ల నిర్లిప్త వైఖరితో ప్రజలు అవస్థలు పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పం డివిజన్లో అధికంగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయన్నారు. ‘అపోలో ఆస్పత్రి సేవలు చైన్నె, హైదరాబాద్లో బాగుంటున్నా.. చిత్తూరులోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవల్లో ఆశించిన ఫలితం లేదు ఎందుకని ప్రశ్నించారు. చిత్తూరులోని అపోలో ఆస్పత్రి నిర్వహణలో లోపాలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలో గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వేసవిలో ఎక్కడా తాగునీటికి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు అమలుచేయాలన్నారు. సిబ్బంది కొరత అధిగమిస్తాం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాలజగన్మోహన్ మాట్లాడుతూ అపోలో ఆస్పత్రిలో నియమించిన అభివృద్ధి కమిటీ సభ్యుల వినతుల్ని సైతం యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ అమరావతి నుంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి నూతన ఆర్టీసీ సర్వీసును ప్రారంభించాలన్నారు. రేషన్ దుకాణాల్లో అవకతవకలపై ఆధారాలతో పట్టించినా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. నగర మేయర్ అముద, చూడా చైర్ పర్సన్ హేమలత, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్రాజు, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
ఐరాల: మండంలోని నెల్లిమందపల్లెకు చెందిన శతాధిక వృద్ధురాలు సుందరమ్మ(101) సోమవారం ఉదయం మృతి చెందారు. ఈమె భర్త చెన్నప్ప మాజీ సైనికుడు. 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఇందులో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. వృద్ధాప్యంలోనూ తన పని చేసుకునేవారు. సుందరమ్మ కుమారుడి వద్దనే ఉండేవారు. ఆమె మరణవార్త తెలిసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చిత్తూరు అర్బన్: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి చిత్తూరు కోర్టు భారీ జరిమానా విధించింది. చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న ఏడుగురు పట్టుబడ్డారు. ట్రాఫిక్ ఇన్న్స్పెక్టర్ జి. నిత్యబాబు బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని సోమవారం చిత్తూరు ప్రథమ స్పెషల్ జ్యుడీషియల్ రెండో తరగతి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కె.పరిమళదేవి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించారు. అందులో ఇద్దరికి జరిమానాతో పాటు కోర్టులో ఒకరోజు సాధారణ శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని ట్రాఫిక్ ఇన్న్స్పెక్టర్ జి.నిత్యబాబు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.; త్రుటిలో తప్పిన పెను ప్రమాదం యాదమరి: పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మండల పరిధి 12 కమ్మపల్లి గ్రామంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కానీ ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. సోమవారం స్థానిక పాడి రైతులు పాలను తీసుకుని పాల కేంద్రానికి వెళ్తున్నారు. అదే సమయంలో గ్రామ నడిబొడ్డున వెళ్తున్న విద్యుత్ హై టెన్షన్ లైన్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. అక్కడున్న వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో విద్యుత్ తీగలు ఎవరి మీదా పడలేదు. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. చేతికందే ఎత్తులో విద్యుత్ తీగలున్నా .. వాటిని మార్చాలని మొరపెట్టుకుంటున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు. -
మామిడి మొక్కల నరికివేత
ఐరాల: మండలంలోని కస్తూరినాయనపల్లె సమీపంలోని మామిడి తోటలో 15 మామిడి చెట్లు నరికివేయడంపై సోమవారం ఫిర్యాదు అందినట్లు ఏఎస్ఐ వేణుగోపాల్నాయుడు తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కస్తూరినాయనపల్లెకు చెందిన ఇంద్రావతి, వైఎస్.గేటుకు చెందిన వరప్రసాద్, నీరజాక్షలు నాయుడుకు ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ సదరు భూమిలో సర్వే చేయడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఇందులో ఇంద్రావతి, యామినికి స్వల్పగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 15 మామిడి చెట్లను నరికివేసినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై వరప్రసాద్, నీరజాక్షులనాయుడు సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నరికివేసిన మామిడి చెట్లను పరిశీలించారు. దీనిపై ఏఎస్ఐ తహసీల్దార్ లోకేశ్వరికి సమాచారం ఇచ్చారు. సర్వే చేసిన అనంతరం ఎవరి భూమిలో మామిడి చెట్లను నరికివేశారో నిర్థారిస్తామని తహసీల్దార్ తెలిపినట్లు ఏఎస్ఐ చెప్పారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి గుడుపల్లె: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని సాలచింతనపల్లె గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ కథనం.. మండలంలోని కోడిగానిపల్లెకి చెందిన రాధాకృష్ణ తన సొంత పనులు చూసుకుని ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో సాలచింతనపల్లె సమీపంలోని రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాధాకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. -
కౌండిన్యలో చిరుత!
పలమనేరు: కౌండిన్య అభయారణ్యంలో ఇప్పుడు చిరుతల సంచారం ఎక్కువైంది. అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కౌండిన్య అడవికి ఆనుకొని ఉన్న నెల్లిపట్ల పంచాయతీ ఓటేరుపాళెం, నల్లగుట్లపల్లిల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. కాగా అక్కడి పొలాల వద్ద నివాసముంటున్న గౌస్బాషాకు చెందిన దూడపై ఇటీవల చిరుత దాడిచేసింది. వాటి మాటేంటి? రెండేళ్ల క్రితం గంకొండ అడవిలో చిరుతపులి మృతి చెందింది. దీంతో కౌండిన్యలో చిరుతలున్నట్టు ఇక్కడి ఫారెస్ట్ అధికారులు నిర్థారించుకున్నారు. ఆపై కై గల్ అడవిలోని తోటకనుమ బీట్లో ఓ చిరుతపులి మేకల మందపై పడి అదే గ్రామానికి చెందిన శంకరప్ప మేకను తినేసింది. బంగారుపాళెం అడవుల్లో ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చులోపడి మృతిచెందింది. రెండేళ్ల క్రితం వీకోట మండలంలోని నాయకనేరి వద్ద రోడ్డు దాటుతూ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మరో చిరుత మృతిన చెందింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే రెండు చిరుతలు మృతిచెందగా మరో నాలుగు చిరుతలు కౌండిన్యలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పదిదాకా హైనా(దుమ్ములగొండి)లున్నట్టు తెలుస్తోంది. చిరుతుల సంతతి పెరిగినట్టే కౌండిన్య అభయారణ్యానికి ఆనుకుని పలమనేరు నియోజకవర్గంలోని మండిపేటకోటూరు, చెత్తపెంట, ఊసరపెంట, కాలువపల్లి, తిమ్మయ్యగారిపల్లి, వెంగంవారిపల్లి, తోటకనుమ, కై గల్, గాంధీనగర్ం జగమర్ల గ్రామాలున్నాయి. బంగారుపాళెం మండలం కీరమంద, టేకుమంద తమిళనాడు రాష్ట్రానికి చెందిన సైనగుంట్ల, అరవట్ల, మోర్థనా, గుండ్లపల్లి, జిట్టిపల్లి, ధనకొండపల్లి, జంగాళపల్లిలున్నాయి. ఇక పెద్దపంజాణి, సోమల మండలాల్లోని అడవులు కౌండిన్యకు సమీపంలోనివే. కౌండిన్యకు దక్షిణంగా ఉన్న తమిళనాడు గ్రామం ఎర్తాంగళ్లో నాలుగేళ్ల క్రితం ఓ ఇంటిలోకి చిరుత దూరి ముగ్గురిని గాయపరిచింది. గతంలో కడతట్లపల్లి వద్ద ఓ పశువును చంపేసింది. అదే విధంగా గాంధీనగర్లో మేతకెళ్లిన పాడి ఆవు బలైంది. -
అర్జీదారుల ఆక్రందన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులతో కలెక్టరేట్ జనసముద్రాన్ని తలపించింది. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. సమస్యలను అర్జీల రూపంలో అందజేసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్లు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులను పిలిచి అక్కడికక్కడే వివరణ కోరాదు. క్షేత్ర స్థాయిలో మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెండింగ్లో పట్టాదారు పాసు పుస్తకం పలమనేరు మండలం, బాగ్యప్పగారిపల్లెకు చెందిన వై.నారాయణ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో తన సమస్యను విన్నవించుకున్నారు. సర్వే నం.38,35/6,41/1 లో తన భూమికి సంబంధించి పట్టా ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ను వేడుకుంటే ఇష్టం ఉన్న వాళ్ల వద్దకెళ్లి చెప్పుకో.. న్యాయం చేసేది లేదంటూ అలసత్వంగా సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.పీఎం చిత్రపటంతో నిరసన తన భూ సమస్య పరిష్కరించాలంటూ 75 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణ యాదవ్ కలెక్టరేట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటంతో నిరసన చేపట్టారు. యాదమరిమండలం, మాదిరెడ్డిపల్లిలో సర్వే నం.26/1లో 4.87 ఎకరాల భూమి ఓ మాజీ సైనికుడు భార్య పేరుతో డీకేటీ పట్టా మంజూరైందన్నారు. అనంతరం ఆ భూమిని తాను కొనుగోలు చేశానన్నారు. 1990లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రుణం పొంది, 2010 లో పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్రమంగా పన్ను చెల్లిస్తున్నానని, అయినా తన భూమికి సంబంధించి ఆన్లైన్లో నమోదైన అక్రమ పేర్లను తొలగించలేదన్నారు. తన సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు నమోదు చేసినట్లు బాధితుడు వెల్లడించారు. మద్యం షాపు తొలగించాలి గంగాధరనెల్లూరు మండలం, పెద్దకాలవ గ్రామం (టానా సర్కిల్, ఎన్టీఆర్ కాలనీ వద్ద) ఇళ్ల మధ్యలో మద్యం షాపు పెట్టారని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు బాధితురాలు విజయలక్ష్మి, గ్రామస్తులు వెల్లడించారు. ఉదయం 6 నుంచి రాత్రి 12.30 గంటల వరకు షాపు నడుపుతున్నారని చెప్పారు. మహిళలు, పాఠశాల, కళాశాలకు వెళ్లే మహిళలు మందుబాబుల ఆగడాలకు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. ఆ షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో విద్య, రూప, మహిత, పద్మ, తులసి, ఉష పాల్గొన్నారు.ఇళ్ల పట్టాల కోసం నిరీక్షణ గంగాధరనెల్లూరు మండలం, కొత్త ఎన్హెచ్ కాలనీకి చెందిన బాబు, తదితరులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తాము గత 30 ఏళ్లుగా సర్వే నం.571/1 లో నివసిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటికీ తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదని వాపోయారు. కొందరు అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేస్తున్నారని వారు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తమ గ్రామ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరారు. -
అపోలో సహకారంతో ఉచిత కార్పొరేట్ వైద్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అపోలో సహకారంతో పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్టు జిల్లా రవాణశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్, నూతన హంగులు దిద్దిన అత్యవసర విభాగాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రిని అపోలో సంస్థ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. రోగి ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని వైద్య సేవలను మెరుగుపరిచే చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైన సందర్భాల్లో చైన్నె, బెంగళూరు నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ మాట్లాడుతూ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన బాధితులకు తక్షణమే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ ట్రామా కేర్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ విభాగంలో 60 పడకలను అత్యవసర వైద్య సేవల కోసం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్లో అత్యాధునిక వెంటిలేటర్లు, హీమోడైనమిక్ మానిటరింగ్ సిస్టమ్స్, డిజిటల్ ఎక్స్రే, పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ విభాగంలోనే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, అపోలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ హెచ్.వినోద్భట్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, ఏఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె అగస్టీన్, యూనిట్ హెడ్ ఎస్.బాలరాజ్, డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ పాల్గొన్నారు. -
మహిళా సాధికారతతో సమాజ వికాసం
చిత్తూరు కలెక్టరేట్: మహిళా సాధికారతతోనే సమాజ వికాసం లభిస్తుందని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ అన్నారు. ఆదివారం నాగయ్యకళాక్షేత్రంలో ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా, జిల్లా మహిళా సమాఖ్య శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు మనోధైర్యంతోజీవించాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మహిళలకు ఆర్థిక చేయూత చెక్కులు, యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. మేయర్ అముద, డీఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, ఏఎస్పీ రాజశేఖర్రాజు, జిల్లా సీ్త్ర సంక్షేమ శాఖ చైర్మన్ భారతి, పీడీలు శ్రీదేవి, వెంకటేశ్వరి, రవీంద్ర పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో.. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సీ్త్ర సంక్షేమ శాఖ చైర్మన్ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడారు. మహిళా సాధికారతే నిజమైన పురోగతి అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సీ్త్ర సంక్షేమ శాఖ చైర్మన్ భారతి జెడ్పీలోని మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు. జెడ్పీలో మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ -
బాబు పాలనలో మృత్యుఘోష
పాలసముద్రం: రాష్ట్రంలో రెండేళ్ల చంద్రబాబు పరిపాలన అధ్వానంగా తయారైందని, కల్తీ పాలు తాగి అమాయకులు చనిపోయారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. ఆదివారం క్రిష్ణజమ్మపురంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగి జనం చనిపోవడానికి బాబు అసమర్థ పాలనే కారణమ న్నారు. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమై ఇద్దరు చనిపోయారని, 70 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. టీడీపీ పాలన మృత్యుఘోషగా మారిందన్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబునాయుడు ప్రభు త్వం బొక్కబోర్లా పడిందన్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ప్రజలు ఉన్నారని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అసెంబ్లీలో కులం, మతం, దేవుడి గురించి మా ట్లాడుతూ ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ మండల కన్వీనర్ సుబ్రమణ్యరెడ్డి, పద్మనాథనాయుడు, సుబ్రమణ్యంరెడ్డి, ఆముదాల సర్పంచ్ అనురేఖమదివానన్, రవిరెడ్డి, షణ్ముగరెడ్డి, క్రిష్ణయ్య, వేణు, కుప్పారెడ్డి పాల్గొన్నారు. -
వార్డెన్లు పద్ధతి మార్చుకోవాలబ్బా!
పలమనేరు: ‘హాస్టల్లో ఉన్నవాళ్లంతా పేద పిల్లలు. వారికి సేవ చేసి మంచి భవిష్యత్తును అందించాలిగానీ.. ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎట్టా? ముఖ్యంగా వార్డెన్లు పద్ధతి మార్చుకోవాలబ్బా. లేకుంటే చర్య లు తప్పవు, మీపై ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్లీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మళ్లీ నన్ను తిట్టుకుంటారు. ఇవన్నీ అవసరమా’ అంటూ ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ వియప్రతాప్రెడ్డి హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఆదివారం ఆయన పట్ట ణంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లను తనిఖీ చేశారు. పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి ద్వారా చీటీలు రాసి అందులో వారు రాసిన ఫిర్యాదుల ఆధారంగా విచారించారు. మదనపల్లెలో ఐదారు హాస్టళ్లను చూశానని, అవి బాగున్నాయని, ఇక్కడ మాత్రం పరిస్థితి బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ–1 హాస్టల్పై ఎక్కువగా సమస్యలున్నట్టు తెలుస్తోందన్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేస్తే బాగుంటుందన్నారు. ఇప్పటికై నా వార్డెన్లు మారాలని సూచించారు. హాస్టళ్లలో ఏదైనా సమస్యలుంటే తమశాఖ వాట్సాప్ నం.9490551117కు వీడియోలు తీసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ట్రాన్స్ఫార్మర్ల తొలగింపు
రేణిగుంట సమీపంలోని జీపాళెంలో అతిపెద్ద జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్ పరిధిలో సొంత ఇళ్లులేని అనేక మందికి జీపాళెం జగనన్న కాలనీల్లో ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి పక్కాగృహ నిర్మాణానికి నిధులు సైతం మంజూరు చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీపాళెం జగన్న కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రెండింటిని అధికారులే తొలగించినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో చోట కొత్తది తీసేసి ఆ స్థానంలో పాత ట్రాన్స్ఫార్మ ర్ని ఏర్పాటు చేశారు. దీనిపై ట్రాన్స్కో అధికారుల ను ప్రశ్నిస్తే.. ‘మిమ్మల్ని అడిగి చేయాలా? మీ అను మతి తీసుకోవాలా? మా ఇష్టం, మీరెవరు అడిగేందుకు’ అని బెదిరించినట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనేక చోట్ల విద్యుత్ వైర్లు కూడా తొలగించడంతో కరెంటు సరఫరా లేక అనేక మంది లబ్ధిదారులు తిరిగి తిరుపతికి చేరు కుని అద్దె నివాసంలో జీవనం సాగిస్తున్నారు. ఇలా రేణిగుంట మండలంని అడుసుపాళెంతోపాటు, నగరి, పలమనేరు, చిత్తూరు పరిధిలోని జగనన్న కాలనీల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తొలగించి, ఆ స్థానంలో పాతవి పెట్టినట్లు లబ్ధిదారులు వెల్లడిస్తున్నారు. చిత్తూరు పరిధిలోని ఓ జగనన్న కాలనీలో అయితే టీడీపీ శ్రేణులు దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసి న వాటిని టీడీపీ కార్యకర్తలే అపహరించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బోర్లు వాటి కేసింగ్ కేబుల్, నీటి తొట్టెల కోసం ఏర్పాటుచేసిన కమ్మి, కొన్ని ఇనుప సామాన్లు మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటుచేసిన ఐరన్ స్టీల్ను చోరీ చేసినట్లు వివరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జగనన్న కాలనీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. గత వైఎస్సార్సీపీ హయాంలో కల్పించిన మౌలిక వసతులన్నింటినీ లబ్ధిదారులకు దూరం చేస్తోంది. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను సైతం పట్టించుకోవటం లేదు. ఫలితంగా జగనన్న కాలనీల్లో నివాసం ఉంటున్న నిరుపేదలు నరకం అనుభవిస్తున్నారు. నీరుగార్చడమే లక్ష్యం గూడు లేని ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల్పించాలనే ఉన్నత ఆశయంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న కాలనీలకు శ్రీకారం చుట్టారు. భూములను కొనుగోలు చేసి మరీ పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం పక్కాగృహాలు నిర్మాణం చేపట్టి కొత్తగా ఊర్లనే నిర్మించారు. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి అత్యాధునికంగా మౌలిక వసతులు కల్పించారు. అందులో భాగంగా తాగు నీటి కోసం బోర్లు వేసి కుళాయిలు ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చి ఇంటింటికీ కరెంటు కనెక్షన్ ఇప్పించారు. కాలనీల్లో రోడ్ల నిర్మాణం కోసం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న కాలనీలపై ప్రతీకార చర్యలకు పూనుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటికి కటకట జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన అనేక బోర్లు పనిచేయడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నింటికి విద్యుత్ సౌకర్యం లేక పోవడం, మరి కొన్నింటి మీటర్లు, స్టార్టర్లు చోరీకి గురయ్యాయని చెబుతున్నారు. అలాగే కొన్ని చోట్ల భూగర్భ జల మట్టం పడిపోవడంతో నీటి కొరత ఏర్పడుతోందని వివరిస్తున్నారు. ఫలితంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలోని అనేక జగనన్న కాలనీల్లో తాగునీటికి కటకటలాడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోతే ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనేక కాలనీల్లో రోడ్లు లేక కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే కాలనీలు బురదమయంగా మారుతున్నాయి. కాలనీల్లో పిచ్చి మొక్కలు తొలగించే వారు కూడా కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీలపై కక్ష సాధింపులో భాగంగా అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల తీరుతో కాలనీల్లో నివాసం ఉంటున్న వారు సైతం తిరిగి అద్దె నివాసాల్లోకి చేరుకోవాల్సి పరిస్థితి. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలను పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.పేదల ఇళ్లపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ముడుపులు ఇస్తేనే విద్యుత్ కనెక్షన్ శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్నగర్, టైలర్స్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో ఇంటికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే లబ్ధిదారులు ముడుపులు చెల్లించాల్సి వస్తోంది. కనీసం రూ.70వేలు చెల్లిస్తేనే కరెంట్ కనెక్షన్ ఇస్తామని ట్రాన్స్కో సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు చెప్పేది ఒక్కటే. విద్యుత్ పోల్ ఏర్పాటు చేసుకుంటావా? వైర్లు లాక్కుంటావా? అని అడుగుతున్నారు. అందుకు అంగీకరిస్తే మళ్లీ రూ.70వేలు ముట్టజెప్పాల్సిన పరిస్థితి. అలా రూ.70వేల చొప్పున చెల్లించి కరెంట్ కనెక్షన్ తీసుకున్నట్లు ముగ్గురు లబ్ధిదారులు వెల్లడించారు. -
కుప్పం డివిజన్లో పోలీసుల బదిలీ
కుప్పం: కుప్పం పోలీసు డివిజన్ పరిధిలో నాలుగు మండలాల పోలీసు స్టేషన్ పరిధిలోని పనిచేస్తున్న 32 మంది సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. కుప్పం అర్బన్ పోలీసు స్టేషన్ పనిచేస్తున్న 10 మంది కానిస్టేబుల్స్ను ఒకే సారి బదిలీ చేశారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేయని వారిని సైతం ఈ బదిలీల్లో నియోజకవర్గం నుంచి ఇతర పోలీసు స్టేషన్లకు పంపారు. 32 మంది ఒకే సారి బదిలీ కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. గుడుపల్లె మండలం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. గత రెండు నెలలుగా ఆ పోస్టు భర్తీ కాలేదు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ చిత్తూరు కలెక్టరేట్: ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిధుల దుర్వినియోగం! సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలోని వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో చేపట్టిన ఆధునికీకరణ పనులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంహెచ్ఓ చాంబర్, సీసీ చాంబర్, సమావేశ మందిరం ఆధునికీకరణ పేరుతో దాదాపు రూ.29 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఏ పనైనా రూ.5 లక్షలు దాటితే తప్పనిసరిగా టెండర్ పిలవాల్సి ఉంది. నిబంధనలను తప్పించుకునేందుకు పనులను ఆరు ముక్కలుగా విభజించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పనిని రూ.4.99 లక్షల చొప్పున చూపిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టినట్లు సమాచారం. డీఎంహెచ్ఓ చాంబర్కే రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రెండు గదుల పనులకు మరో రూ.14 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ పనులకు సంబంధించిన నిధులు ఇప్పటికే కాంట్రాక్టర్ ఖాతాకు జమ అయ్యాయి. అయితే వైద్య పరికరాలు, మందులు, మాత్రలు, ప్రజలకు అవసరమైన వైద్య సేవల కోసం వినియోగించాల్సిన ఎన్హెచ్ఎం నిధులను ఇలా కార్యాలయ గదుల అలంకరణకు మళ్లించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయ ల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మ ద్ తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉద యం 8.30–9.30 గంటల మధ్య 79931 47979 నంబర్కు ఫోన్ చేయాలని వివరించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చిత్తూరు కలెక్టరేట్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం తెలి పారు. ఆదివారం కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 వ తేదీన అంబేడ్కర్ జయంతి వేడుకలు గ్రామీణ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరఫున ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైనా, అలాగే ఉద్యోగోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించకపోయినా వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వాటి పరిష్కారానికి సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు వినాయకం, అదనపు కార్యదర్శి సంతానం, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, నవీన్, రాజా, నరే ష్, దేవరాజులు పాల్గొన్నారు. -
నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్మ్డ్ రిజర్వు(ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. నేడు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం చిత్తూరు కలెక్టరేట్: జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సమీక్షించేందుకు ఈ నెల 9 వ తేదీ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లోని వివేకానంద భవన్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షకు ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ముఖ్య అతిథిగా పా ల్గొంటారన్నారు. సమీక్షలో జెడ్పీ నిధులు, తాగునీటి సరఫరా, ఇంజినీరింగ్ శాఖల పనితీరు, ఉపాధి హామీ పథకం, రెవెన్యూ అంశాలు, వ్యవసాయం, అనుబంధ శాఖలు, వైద్యం, విద్యాశాఖల పురోగతిపై చర్చిస్తామ ని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమగ్ర నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళం కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఓ దాత నిత్య అన్నదానం ట్రస్ట్కి విరాళం అందజేశారు. బెంగళూరుకు చెందిన అచ్చయ్ గోపీనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలకు స్వామివారి దర్శనం ఏర్పాటుచేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏఈఓ రవీంద్రబా బు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, బాలాజీనాయుడు పాల్గొన్నారు. -
హేళనలే ప్రేరణ
ఈమె పేరు తేజస్విని. మధ్యతరగతి కుటుంబం. ‘‘అమ్మాయి కదా ఏం సాధిస్తుంది.. ఎవరికై నా ఇచ్చి పెళ్లి చేసేండి’’ అంటూ చుట్టుపక్కల వారు తన తల్లిదండ్రులకు ఇచ్చే ఉచిత సలహాలు విని రగిలిపోయారు. అప్పుడే పోలీస్ కావాలనే ఆమె లక్ష్యం నిర్దేశించుకున్నారు. హైదరాబాద్కు వెళ్లి రోజుకు 15 గంటలకు తగ్గకుండా కోచింగ్ తీసుకున్నారు. ఎస్ఐ ఉద్యోగం సాధించాలని కష్టపడ్డారు. అయితే మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం దక్కలేదు. ఈ మేరకు హేళనలు ఎదురవడంతో కసితో ముందుకు సాగారు. చివరకు ఎస్ఐగా ఎంపికయ్యారు. 18 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి కార్వేటినగరం పోలీస్స్టేషనన్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఎందరో యువతులకు స్ఫూర్తినిస్తున్నారు. – కార్వేటినగరం -
చిత్తూరు
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026శతాబ్దాలుగా వంటింటి కుందేళ్లంటూ అణచివేతకు గురయ్యారు. సతీసహగమనం వంటి దురాచారాలకు బలయ్యారు. కట్టుబాట్ల నడుమ దిక్కుతోచక కొట్టుమిట్టాడారు. సంప్రదాయాల కింద నలిగిపోయారు. వివక్షతో విసిగివేసారిపోయారు. చివరకు నిద్ర లేచింది మహిళాలోకం అంటూ జూలు విదిల్చారు. ఆత్మవిశ్వాసంతో ఆధిపత్య శృంఖలాలను తెంచుకున్నారు. మనోధైర్యంతో ముందడుగు వేశారు. అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆకాశంలో సగమని నిరూపించుకుంటున్నారు. పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అంతరిక్షం వరక విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఆధునిక సమాజంలో అత్యుత్తమంగా ఎదుగుతున్నారు. ఇఫ్తార్ సహర్ ఆదివారం (సా) సోమవారం (ఉ) చిత్తూరు 6–28 5–05చిత్తూరు అర్బన్: మహిళలకు ఎందులోనూ తక్కువ కాదని, ప్రధానంగా రాజకీయాల్లో పురుషులకు సమానంగా ఆడపడుచులకు పాలన హక్కు ఉండాల్సిందేనంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆలస్యం అమృతం విషం అన్నట్టు 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశారు. ఫలితంగా జిల్లాలోని పురపాలనలో ఆమె ఆధిపత్యానికి శ్రీకారం చుట్టారు. అడవిలో కట్టెలు కొట్టుకుని తీసుకువచ్చి, వాటిని అమ్మితే తప్ప జీవనం గడవని ఓ సాధారణ మహిళ అముదను చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్గా కూర్చోబెట్టారు. చిత్తూరులోని 25 మంది మహిళలను కార్పొరేటర్లుగా గెలిపించారు. ఉమ్మడి జిల్లాలోని పుంగనూరులో 31 వార్డులకు గానూ 17 స్థానాలను అతివలకే అప్పగించారు. ఇక పలమనేరులో 13, పుత్తూరులో 16, నగరిలో 14 వార్డుల్లో ఆమెకు పట్టం కట్టారు. తిరుపతి కార్పొరేషన్లో సైతం 24 మంది ఆడపడుచులకు కార్పొరేటర్లుగా పదవులు కట్టబెట్టారు. బీసీ మహిళ శిరీషకు తిరునగర ప్రథమ పౌరురాలి గౌరవం కల్పించారు. -
స్థానికంగా వణుకు!
చిత్తూరు అర్బన్: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్తో పాటు పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాల్టీలు ఉన్నాయి. కుప్పం మినహా మిగిలిన వాటి పాలకవర్గాలకు ఈనెల 17వ తేదీతో గడువు ముగుస్తుంది. కుప్పం పురపాలక సంఘానికి సైతం సెప్టెంబర్కు గడువు పూర్తవుతుంది. వాస్తవానికి గత ఏడాది నవంబర్లో ఓటర్ల జాబితా, మార్పులు–చేర్పులు పూర్తి చేసి, ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. కానీ, ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేక అధికారులను నియమించి మరో 6 నెలల వరకు వేచి చూద్దా మని భావిస్తున్నట్లు తెలిసింది. ఈనెల 9వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించినా, అది ఎన్నికల వరకు వెళ్లకపోవచ్చని నిపుణులు అభి ప్రాయపడుతున్నారు. సర్పంచ్లకు ‘పంచ్’ చిత్తూరు పూర్వపు జిల్లా ప్రకారం 600 గ్రామ పంచాయతీలకు ఎంపికై న సర్పంచ్ పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే పలు గ్రామా ల్లో చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రభు త్వం బిల్లులు మంజూరు చేయలేదు. పదవిలో ఉన్నప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. మాజీలయ్యాక పంచ్ ఇవ్వడం ఖాయమని సర్పంచ్లు ఓ నిర్ణయానికి వచ్చేశారు. సర్వేల్లో వ్యతిరేకతే కారణమా? రోజుకు మూడు నుంచి నాలుగు పర్యాయాలు ఫోన్ల ద్వారా ప్రభుత్వం వివిధ సర్వేలు చేయిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న ఫ్యీడ్బ్యాక్ను గమనిస్తోంది. విద్యుత్ సరఫరా, సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు ఆగిపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలకు వెన్ను చూపిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తోంది. నిర్ణీత షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే అనుకూల ఫలితం రాకపోవచ్చని అంచనా వేస్తోంది. త్వరలోనే పురపాలకులు.. సర్పంచ్ల పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల నియామకానికి మొగ్గుచూపుతోంది. ‘పరిషత్’పై పరేషాన్ జిల్లా పరిషత్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీల పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ప్రకటన పరిషత్ ఎన్నికల ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా పరిషత్ల పునర్విభజన చేసిన తర్వాతే జెడ్పీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీనికితోడు మరో రెండు నెలల్లో కులగణన ప్రారంభిస్తామని సర్కారు చెప్పడంతో జెడ్పీ ఎన్నికలను సైతం వాయిదా వేస్తున్నారని అర్థమవుతోంది. పేరుకు పునర్విభజన, కులగణన వంటి సాకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదనే ఎన్నికల వైపు మొగ్గడం లేదని తెలుస్తోంది. -
ఎన్సీసీలో మెరిసిన తేజశ్రీ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని తేజశ్రీ ఎన్సీసీలో రాణిస్తోంది. సి–సర్టిఫికెట్ క్యాడెట్గా ప్రతిభ చాటి న ఆ విద్యార్థిని జిల్లాకు, కళాశాలకు గర్వకారణంగా నిలుస్తోంది. ఎన్సీసీలో పలు జాతీయ స్థాయి విజయాలను సొంతం చేసుకున్నారు. తేజశ్రీ ఆర్మీ అటాచ్మెంట్ క్యాంపులో పాల్గొని భారత సైనిక దళాల జీవనశైలిని, వారి కఠిన శిక్షణ పద్ధతులను దేశ రక్షణలో సైనికుల బాధ్యతలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ అనుభవం ఆమెలో దేశ సేవ చేయాలనే దృఢ సంకల్పాన్ని మరింత పెంచింది. సాహస కృత్యాల్లోనూ మేటి కేవలం సైనిక శిక్షణే కాకుండా, మౌంటెనింగ్ శిబిరాల్లోనూ తేజశ్రీ తన సత్తా చాటారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ తదితర సాహస కృత్యాలలో పాల్గొంది. కష్టతరమైన పరిస్థితుల్లో మనుగడ సాగించే నైపుణ్యాలను, శారీరక దృఢత్వాన్ని ఆమె పెంపొందించుకున్నారు. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన అధికారులు, జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఈ ఏడాది మే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎన్సీసీ శిబిరానికి ఎంపిక చేశారు. శనివారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభినందన సభను నిర్వహించి విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జీవనజ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రశ్నపత్రాలకు పకడ్బందీ భద్రత
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మొదటి సెట్ ప్రశ్నపత్రాలు శనివారం చిత్తూరుకు చేరుకున్నాయి. డీఆర్ఓ మోహన్ కుమార్, డీఈఓ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో స్ట్రాంగ్లో రూమ్కు తరలించారు. సాయుధ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించకుండా సీసీ కెమెరాలతో పెట్టినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్లకు తరలింపు డీఆర్ఓ, డీఈఓ పర్యవేక్షణలో పకడ్బందీ భద్రత నడుమ ప్రశ్నపత్రాల బాక్సులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. పరీక్షలు ముగిసే వరకు ఈ ప్రశ్నపత్రాలు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసుల ఆధీనంలోనే ఉంటాయని,షెడ్యూల్ మేరకు నిర్ణీత సమయానికి ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేస్తామని అధికారులు వివరించారు. 144 సెక్షన్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా, పేపర్ లీకేజీ వదంతులు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, ఎంఈఓలు అరుణాచలరెడ్డి, హసన్బాషా పాల్గొన్నారు. -
ముమ్మరంగా తనిఖీలు
చిత్తూరు అర్బన్: అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి.. నేరాలను నివారించడానికి కార్డన్ సెర్చ్ ఉపయోపడుతుందని ఏఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని రైల్వే స్టేషన్ను వన్టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వరతో కలిసి తనిఖీ చేశారు. నిత్యం పోలీసుల తనిఖీల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్ల ద్వారా గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరులో నాటుసారా, వంద గ్రాముల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు టూటౌన్ పరిధిలో సరైన పత్రాలు లేని కారణంగా 5 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. రైల్వేస్టేషన్లో తనిఖీలు చిత్తూరు కార్పొరేషన్: ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా చిత్తూరు రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. అందులో భాగంగా శనివారం ప్లాట్ఫాం, రైళ్లలో పర్యటించి అనుమానితుల బ్యాగులను పరిశీలించారు. అనంతరం ఇన్చార్జి ఎస్ఐ ధర్మేంద్రరాజు, ఏఎస్ఐ అశోక్ మాట్లాడా రు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేర కు వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ తనిఖీ చేశామన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్ర మ రవాణా అంశాలను పరిశీలించామన్నారు. చివరిగా సిబ్బందితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించామని వివరించారు. హెడ్కానిస్టేబుల్ డేవిడ్ పాల్గొన్నారు. పరీక్షల ప్రక్రియ గందరగోళం చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పరీక్షల నిర్వహణను రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోకి తీసుకోవడంతో గందగోళ పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఈఓల అధికారాలను కుదించడం తగదన్నారు. పరీక్షల విధుల కేటాయింపు ప్రక్రియను ఆటోమేషన్ చేయడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. చాలామంది జూనియర్లకు విధులు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. వరసిద్ధునికి వెండి తొండం, హస్తాలు కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం బెంగళూరుకు చెందిన భక్తుడు కిషోర్కుమార్ వెండి తొండం,హస్తాలను విరాళంగా సమర్పించారు. 2.7 కిలోల వెండి తొండం, హస్తాల విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. దాత కుటుంబానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ నేడు జిల్లాకు రాక చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి ఆదివారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ వెల్లడించారు. శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో చైర్మన్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేస్తారన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలిస్తారని తెలిపారు. రేషన్ షాపుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ తీరును పర్యవేక్షిస్తారని చెప్పారు. -
విద్యార్థులే దేశాభివృద్ధికి పునాది
పూతలపట్టు(యాదమరి): జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థ వేము ఇంజినీరింగ్ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ మాత్లాడుతూ.. దేశాభివృద్ధికి విద్యార్థులే పునాది అని, విద్యార్థులు తమ లక్ష్యాలు సాధించడానికి ఏకాగ్రతతోపాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ మాట్లాడుతూ యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. కష్టపడి పనిచేస్తే అపార అవకాశాలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ నవీన్ కిలారి పిలుపునిచ్చారు. అనంతరం సినీ నటీ అర్చన అయ్యర్ విద్యార్థులతో ముచ్చటించి వేడుకలను మరింత ఉత్సాహంగా తీసుకెళ్లారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.మాట్లాడుతున్న ఎంపీ ప్రసాదరావు విద్యార్థులతో కలసి సినీనటి అర్చన అయ్యర్ నృత్యం -
నిర్లక్ష్యానికి ఒకరు.. వేగానికి మరొకరు బలి
పుత్తూరు: అసలే రాత్రి వేళ.. అందులోనూ నేషనల్ హైవే రోడ్డుపై మలుపు వద్ద ఓ మోటర్ సైకిల్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతుండగా, అతి వేగంతో మరో మోటర్ సైక్లిస్టు ఢీ కొట్టాడు. ఫలితం ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్వేటినగరం అప్పాచారి వీధికి చెందిన ఎం.రవి(45) తమ సమీప బంధువు పెళ్లికి మోటర్ సైకిల్పై బయల్దేరాడు. గొల్లపల్లి హైవే పక్కన ఉన్న కళ్యాణమండపానికి వెళ్లడానికి గొల్లపల్లి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా, పుత్తూరు మండలం ఎగవ గూళూరు గ్రామానికి చెందిన హరి(27) పుత్తూరు నుంచి గ్రామానికి మోటార్ సైకిల్పై వెళ్తూ వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో పుత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న 108 సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్సకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కళ్యాణమండపంలో విషాదఛాయలు అలముకొన్నాయి. నాటు తుపాకులపై దర్యాప్తు చిత్తూరు రూరల్(కాణిపాకం): నాటు తుపాకులపై తాలూకా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో ఓ యువకుడు.. మరో యువకుడిని నాటు తుపాకీతో కాల్చి చంపేసిన విషయం విదితమే. దీనిపై ఎస్పీ తుషార్ డూడీ స్పందించారు. ఎస్ఐ అశోక్కుమార్ తన బృందంతో కలిసి నాటు తుపాకుల పూర్వాపరాలపై దర్యాప్తు చేపట్టారు.మృతులు రవి హరి -
● మహిళా విద్యతోనే సమాజాభివృద్ధి
పుత్తూరు: మహిళలు చదువుకోవడం ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని పుత్తూరు సబ్ కోర్టు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కె.రమ్యసాయి తెలిపారు. శనివారం స్థానిక ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. న్యాయమూర్తి రమ్యసాయి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర కృషితో లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. నేటి తరం మహిళల ఆలోచనా ధృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఆడబిడ్డను విద్యావంతురాలిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. అనంతరం న్యాయమూర్తి రమ్యసాయిని అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలోనే ఉత్తమ విద్యార్థుల మాతృమూర్తులను సన్మానించారు. మహిళా అధ్యాపకులకు మెమోంటోలను అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ బి.చంద్రమౌళి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ కె.శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ మన్యం నరసింహులు, అధ్యాపకులు సుజన, దేవకి, వాణిశ్రీ, గాయత్రి పాల్గొన్నారు. -
మే 1 నుంచి జనగణన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు పకడ్బందీగా కసరత్తు చేపట్టారు. జనగణన నిర్వ హణపై క్షేత్రస్థాయిలో ఆర్డీఓలు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓలకు శిక్షణ ఉండనుంది. జిల్లాలో చేపట్టే జనగణన డిజిట ల్ విధానంలోనే కొనసాగుతుందని కలెక్టరేట్ అధికారులు వెల్లడిన్నారు. ఈ ప్రక్రియకు అధు నాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. భవనాలను గుర్తించి సంఖ్య కేటాయించి యాప్లో వివరాలు అప్లోడ్ చేసేలా చర్య లు చేపడుతున్నారు. ఆన్లైన్లో ‘పది’ హాల్ టికెట్లు చిత్తూరు కలెక్టరేట్ : పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో పొందుపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ నెల 16 వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులు తమ హాల్ టికెట్లను మొబైల్ ఫోన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం కొన్ని రకాల సేవ లు స్క్రీన్ పై కనిపిస్తాయి. అందులో విద్యాసేవలను ఎంపిక చేసుకోవాలి. తర్వాత హాల్టికెట్ డౌన్లోడ్ ఆప్ష న ఎంచుకోవాలి. పుట్టిన తేదీ, అడ్మిషన్ నంబర్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పీఈఎన్)లలో ఏదో ఒకటి నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అలాగే బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో సైతం హాల్టికెట్ పొందవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గుడ్లగూబకు చికిత్స చిత్తూరు కార్పొరేషన్ : అనారోగ్యంతో కిందపడిన గుడ్లగూబకు అటవీశాఖ అధికారులు చికి త్స చేయించారు. శనివారం చిత్తూరు మురకంబట్టు సర్కిల్ సమీపంలో గుడ్లగూబ పడి ఉండగా విశ్రాంత ఏఎస్ఐ రాజేంద్ర గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వెళ్లి గుడ్లగూబకు ఇంజెక్షన్ వేయించినట్లు ఎఫ్బీఓ రెడ్డెప్ప తెలిపారు.


