Rajanna
-
ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని ధర్నా
సిరిసిల్లటౌన్: తమ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని బొంగులకింది తండా ప్రజలు కోరారు. మంగళవారం కలెక్టరేట్కు తరలొచ్చి ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ను తమ తండాను ప్రత్యేక పంచాయతీగా చేయాలని కోరగా ప్రపోజల్ పంపినట్లు ప్రకటించారన్నారు. కానీ, అదే పార్టీలోని కొందరు తమ స్వార్థం కోసం రాజ్నాయక్ తండాతో పాటు తమ తండాను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి తాము రాజ్నాయక్ తండా జీపీలో ఉండటం లేదని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం పంచాయతీ ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారని, ఈ క్రమంలో తమ డిమాండ్ను గుర్తించి తమ తండాను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని బి. శ్రీనివాస్, భాస్కర్ తదితరులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. -
రాములోరి కల్యాణం ఘనంగా జరిపించాలి
● ఆర్డీవో రాజేశ్వర్ వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు సీతారాముల కల్యాణోత్సవాలను గతంలోకంటే ఘనంగా జరిపించాలని, ఇందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆర్డీవో రాజేశ్వర్ సూచించారు. మంగళవారం చైర్మన్ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శ్రీరామనవమి రోజు రాజన్న ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణానికి అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి మాట్లాడుతూ, శ్రీరామనవమికి వచ్చే భక్తులకు తాగునీటి సరఫరా, క్యూ లైన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, రవాణా, పారిశుధ్యం, ఫైర్, కల్యాణ వేదికలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖను కోరారు. భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలతో ఉపాధి
● పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు సిరిసిల్ల: నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ వినియోగంతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, స్వయం ఉపాధి పథకాలు, ఉపాధి అవకాశాలపై మంగళవారం కలెక్టరేట్లో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐ, డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిరంగంలో రాణించాలన్నారు. మార్కెట్లో వస్తున్న నూతన టెక్నాలజీ, యంత్రాలు అప్డేట్పై ఎప్పటి కప్పుడు సమాచారం ఉండాలని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) అమలు చేస్తుందని, ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. డీఆర్డీవో శేషాద్రి, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భారతి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి
● ఎస్పీ మహేశ్ బీ.గీతే కోనరావుపేట(వేములవాడ): సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే అన్నారు. మంగళవారం కోనరావుపేట పోలీస్స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, కేసుల వివరాలు పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్ల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పెట్రోలింగ్ సమయంలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. విజుబుల్ పోలీసింగ్లో భా గంగా తరచూ గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతూ సైబర్ నేరాలు, బెట్టింగ్, గేమింగ్ యాప్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్రెడ్డి, ట్రెయినీ ఎస్సై రాహుల్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. కఠినంగా శిక్షించాలివేములవాడ: రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాపు ఇస్రాయల్ను ఈనెల 24న హైదరాబాద్లోని చంపాపేట్లో దస్తగిరి అనే వ్యక్తి దారుణంగా హత్య చేయడంపై మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును అమల్లోకి తీసుకువచ్చి రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్గౌడ్, రేగుల దేవేందర్, పొత్తూరు అనిల్కుమార్, పిట్టల మనోహర్, పెంట రాజు, పురుషోత్తం, గోపికృష్ణ, ప్రతాప సంతోష్, గడ్డం సత్యనారాయణరెడ్డి, గోగికారి శ్రీనివాస్, గొంటి శంకర్, కటకం జనార్దన్, రేగుల రాజకుమార్, గుజ్జే మనోహర్, పంపరి శంకర్, అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, కనికరపు శ్రీనివాస్, హరీశ్, నాగేంద్రబాబు, పొత్తూరి మల్లేశ్, అన్నపూర్ణ పాల్గొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు వైష్ణవిఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రహీంఖాన్పేట ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పయ్యావుల వైష్ణవి జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. ఈనెల 27 నుంచి బిహార్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా వైష్ణవిని కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఆది శ్రీనివాస్, పాట్రన్ కేకే మహేందర్రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ నర శ్రీనివాసరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సాన బాబు, మామిడి శ్రీనివాసు అభినందించారు. ప్రత్యేక పథకాలు అందించాలిసిరిసిల్లటౌన్: తమ సామాజికవర్గం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించాలని ఎరుకల ఏకలవ్య జిల్లా అధ్యక్షుడు కోనేటి సాయన్న కోరారు. మంగళవారం సంఘం ఎన్నికల అనంతరం కార్యవర్గంతో పాటు ప్రెస్క్లబ్లో సమావేశం ని ర్వహించారు. 13 మండలాల అధ్యక్షులు, ప్రఽ దాన కార్యదర్శులు సమావేశానికి విచ్చేసి నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కా ర్యదర్శిగా మొగలి ధర్మరాజు, మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలిగా కుర్ర సావిత్రి, ఉపాధ్యక్షులు మానుపాటి పరశురాములు, అనుముల దేవయ్య, కార్యదర్శి సుల్తాన్ తిరుపతి, కార్యవర్గ సభ్యులు కోలేటి రమేశ్, సుల్తాన్, శేఖర్, మొగిలి నాగరాజు, కట్ట శంకర్, నిమ్మల కనకయ్య, నిమ్మ రాజయ్య, మొగలి రాజశేఖర్, బిజిలి కనకరాజు, వానపాటి తిరుపతి, మొగిలి రవి, బండి యాదగిరి పాల్గొన్నారు. -
‘మాయదారి’ రోగాలు !
● తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు ● వారసులకు ఉద్యోగాలు ● జిల్లాలో అక్రమంగా నియామకాలు ● వరుసగా వెలుగుచూస్తున్న మోసాలుసిరిసిల్ల: కొందరు ఉద్యోగులకు రిటైర్మెంట్కు ఆరేడేళ్ల ముందు మాయదారి రోగాలు వస్తున్నాయి. అప్పటి వరకు ఠంఛన్గా విధులకు హాజరైన వారు ఇక అక్కడి నుంచి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్తూ వివిధ రకాలు చికిత్సలు పొందుతున్నారు. కాదు..కాదు.. చికిత్స పొందినట్లు మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. చదవండి మీకే తెలుస్తుంది. అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ తాము పనిచేయలేమని తమ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది జిల్లాలోని కొందరు ఉద్యోగులకు అంటుకున్న అసలు మాయదారి రోగం. ఇప్పటి వరకు ఇలా చాలా మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో తమ వారసులను ప్రభుత్వ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. లేని రోగాలను తెచ్చుకుని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లను ‘కొని’తెచ్చుకున్న వైనాలు జిల్లాలో కొన్ని వెలుగులోకి రాగ.. అనేక సంఘటనలు ఇంకా మరుగునపడి ఉన్నాయి. జిల్లాలో సాగుతున్న అక్రమాలపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు(రిటైర్మెంట్ గడువు) ఇంకా ఆరు, ఏడు ఏళ్లు ఉందనగా.. దీర్ఘకాలిక సెలవులోకి వెళ్తారు. మెడికల్ లీవ్ పెడతారు. తరువాత కొన్ని నెలలపాటు అనారోగ్య సమస్యలు చూపుతూ వివిధ చికిత్సలు పొందినట్లు, ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించుకుని, మందులు వాడినట్లు రికార్డులు సృష్టిస్తారు. ఆ మెడికల్ రిపోర్టులకు బలాన్నిచ్చేలా హైదరాబాద్లోని పెద్ద పెద్ద ఆస్పత్రులకు, ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందినట్లుగా మరిన్ని సర్టిఫికెట్లు సాధించుకుంటారు. వీటిని ఆసరా చేసుకుని, ఇక తాము ఉద్యోగం చేసేందుకు అనర్హులమని, అనారోగ్య సమస్యలతో విధులు చేయలేమని అర్జీ పెట్టుకుంటారు. మానవతా దృక్పథంతో తమ వారసులకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటారు. వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ఉద్యోగుల వారసులకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అధికారం జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీకి ఉంటుంది. ఈ కమిటీలో ఆయా ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, డీఎంహెచ్వో, ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకులతో కూడిన కమిటీ ఉంటుంది. ఈ కమిటీ పర్యవేక్షణలో అర్జీ పెట్టుకున్న ఉద్యోగి పనిచేయలేని స్థితిలో ఉన్నారా.. అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అది నిజమే అయితే కమిటీ సిపార్సు మేరకు కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సదరు ఉద్యోగి వారసులకు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. ప్రభుత్వ జీవో ఆధారంగా అనేక మంది ఇలా వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నారు. ‘సెస్’లో ఏం జరుగుతోంది..!? జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ఉద్యోగులు తమ పిల్లలకు వారసత్వంగా ఉద్యోగాలను ఇప్పించే విధానం లేదు. ‘సెస్’లో పనిచేసే ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఉంటాయి. కానీ ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్ ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఉద్యోగులు ‘సెస్’ పాలకవర్గం అండదండలతో అక్రమ విధానంలో ఉద్యోగాలు పొందారు. ‘మాయదారి’ రోగాలను ‘కొని’తెచ్చుకుని ‘సెస్’ ఉన్నతాధికారులను, మెడికల్బోర్డు సభ్యులను డబ్బులతో కొనేసి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తండ్రి ఉద్యోగాన్ని వారసత్వంగా మెడికల్గ్రౌండ్స్(అనారోగ్య సమస్యలతో) సాధించుకున్నారు. ‘సెస్’లో వారసత్వ ఉద్యోగాలు సాధించుకున్న కొందరు నిజంగానే మెడికల్ అన్ఫిట్ కావడంతో ఉద్యోగాల్లో చేరగా.. అనేక మంది మాత్రం అన్నీ సవ్యంగా ఉన్నా.. అక్రమ పద్ధతుల్లో ‘సెస్’లో ఉద్యోగాలు సాధించి రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్నారు. జిల్లా పరిధిలోనే జీవితకాలం ఉద్యోగం కావడంతో కడుపులో చల్లకదలకుండా ‘సెస్’ పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చే 11 ఏళ్లకు సరిపోయేంత మంది వారసులు వివిధ ఖాళీ పోస్టుల్లో ఉద్యోగులుగా చేరిపోయారు. ‘సెస్’ డైరెక్టర్లు, ఉన్నతాధికారుల అండదండలతో అక్రమమార్గంలో విధుల్లో చేరారు. ఏ విచారణ లేకుండా దర్జాగా డ్యూటీ చేస్తున్నారు. తనిఖీలు లేకుండానే ఉద్యోగాలు..? జిల్లాలో దశాబ్దకాలంగా ‘సెస్’తోపాటు, రెవెన్యూ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లో మెడికల్ ఇన్వాలిడేషన్ గ్రౌండ్స్లో ఉద్యోగాలు పొందిన వారిపై ఎలాంటి విచారణ లేకపోవడంతో ఏళ్లుగా ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. కొందరైతే నకిలీ విద్యార్హతల(బోగస్) సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది.. ప్రమోషన్లు పొందినట్లు సమాచారం. ఏది ఏమైనా ‘సెస్’ లాంటి సంస్థతోపాటు ప్రభుత్వ శాఖల్లో తండ్రి ఉద్యోగాన్ని పొందిన వారిపై విచారణ చేపడితే పశువైద్యశాఖ తరహాలో తప్పుడు ధ్రువీకరణపత్రాల భాగోతాలు బయటపడనున్నాయి. ఇటీవల వెలుగుచూసిన ఘటనలు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి పశువైద్యశాలలో పనిచేస్తున్న కొమురయ్య తాను పనిచేయలేని స్థితిలో ఉన్నానని తన కొడుకుకు ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు ఏడు నెలల కిందట మెడికల్ ధ్రువీకరణపత్రాలతో అర్జీ పెట్టుకున్నాడు. దీనిపై జిల్లా స్థాయి కమిటీ పరిశీలించింది. అధికారుల పరిశీలనలో మెడికల్ సర్టిఫికెట్లు తప్పుగా ఉన్నట్లు అనుమానించారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించారు. కొమురయ్య సమర్పించిన వైద్యుల ధ్రువీకరణపత్రాల ఆధారంగా చేపట్టిన రహస్య విచారణలో ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులు, వారి మెడికల్ సర్టిఫికెట్లు, ఆస్పత్రి లోగో, ఐఎంఏలో వైద్యుల వివరాలు అన్నీ తప్పుడు పత్రాలుగా నిర్ధారణ అయింది. దీన్ని సీరియస్గా పరిగణించిన కలెక్టర్, కొమురయ్యపై పోలీసు కేసు నమోదు చేయించారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పశువైద్యశాలలో అటెండర్గా పనిచేసే కె.దేవమ్మ 2024 జూన్ 1న మెడికల్ ఇన్వాలిడేషన్కు తప్పుడు ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు చేయగా.. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. కరీంనగర్కు చెందిన డాక్టర్ జి.కిరణ్ ఏడీ, డీఎం(గ్యాస్టో) డాక్టర్ రవికుమార్, పి.శరత్రెడ్డి వద్ద వైద్యపరీక్షలు చేయించుకున్నట్లుగా, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లుగా తప్పు డు పత్రాలను సమర్పించినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేవమ్మను కలెక్టర్ సస్పెండ్ చేశారు. దరఖాస్తులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వడం లేదు మెడికల్ ఇన్వాలిడేషన్ గ్రౌండ్స్లో ఒకటి, రెండు దరఖాస్తులు వచ్చాయి. కానీ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగులు చనిపోయిన ఘటనల్లో ఐదు కారుణ్య నియామకాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మెడికల్ గ్రౌండ్స్లో గతంలో ఏం జరిగిందో మా పాలకవర్గానికి సంబంధం లేదు. ఇప్పుడైతే ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వం కూడా. – చిక్కాల రామారావు, ‘సెస్’ చైర్మన్, సిరిసిల్ల, -
పరీక్షలు బాగా రాయాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడరూరల్: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మంగళవారం హన్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీ, స్టోర్ రూం, తరగతి గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. వచ్చే సంవత్సరం అడ్మిషన్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే పీహెచ్సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించా రు. అనంతరం లింగంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల బరువు, ఎత్తు వివరాల రిజిస్టర్ను పరిశీలించారు. నాణ్యమైన పోష్టికాహారం అందజేయాలని సూచించారు. టోకెన్ పద్ధతిలో కొనుగోళ్లు సిరిసిల్ల: యాసంగి సీజన్లో వరికోతలపై హర్వెస్టర్ యజమానులతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి నియంత్రిత విధానంలో కోతలు జరిగేలా చూడాలని, టోకెన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవరం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రైతులంతా ఒకేసారి ధాన్యం తీసుకువచ్చి ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలన్నారు. కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. లారీల్లో మాత్రమే ధాన్యం తరలించాలని స్పష్టం చేశారు. కొనుగోళ్లపై ఫిర్యాదుల నమోదుకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, డీఎస్వో వసంతలక్ష్మి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రజిత, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, మార్కెటింగ్ శాఖ డీఎం ప్రకాష్, డీసీవో రామకృష్ణ, డీఏవో రామారావు, తూనికలు కొలతల అధికారి రూపేశ్ పాల్గొన్నారు. నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలోని మధ్యమానేరు, అనంతగిరి జలాశయాల్లో ముంపునకు గురైన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ముంపు గ్రామాలైన గుర్రంవానిపల్లి, చీర్లవంచ, చింతలఠాణా, కొదురుపాక, రుద్రవరం, సంకెపల్లి, ఆరెపల్లి, తదితర గ్రామాల నిర్వాసితులు ఏప్రిల్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. -
బస్టాండ్లో పోలీసుల తనిఖీలు
సిరిసిల్ల: అది సిరిసిల్ల పాతబస్టాండ్.. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో సికింద్రాబాద్కు వెళ్లే మొదటి బస్సు అప్పుడే చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన మహిళా కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుల్, ఎస్సై ఆ బస్సులోకి ప్రవేశించి ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆధార్కార్డును చెక్ చేస్తూ వివరాలు ఆరా తీశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించారు. తమ డిమాండ్ల సాధనకు ఆశవర్కర్లు ‘చలో అసెంబ్లీ’ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. చివరికి 16 మంది ఆశకార్యకర్తలను సిరిసిల్ల ఠాణాకు తరలించారు. -
ఎండిన పొలంపై వడగండ్ల దాడి
● అకాలవర్షంతో దెబ్బతిన్న పంటలు ● జిల్లాలో భారీగా పంటనష్టం ● చందుర్తిలో 500 ఎకరాలకు పైగానే.. ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు తిప్పని భూమేశ్. తనకున్న ఎనిమిదెకరాల్లో ఏడున్నర ఎకరాల్లో వరిసాగు చేశాడు. మిగతా 20 గుంటల్లో నువ్వు సాగుచేశాడు. 6 ఎకరాల వరిపొలం మరో 20 రోజుల్లో కోత దశలో ఉంది. శుక్రవారం కురిసిన వడగండ్ల వానకు సగానికి పైగా వడ్లు రాలిపోయాయి. ఇప్పటికే ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాడు. సగానికి పైగా పంట దెబ్బతినడంతో పెట్టుబడి చేతికి రాదన్న బెంగతో ఉన్నాడు.చందుర్తి(వేములవాడ): నీరు లేక పొలాలు ఎండి పోగా.. వడగండ్ల వాన దాడితో రైతులు మరింత నష్టపోయారు. జిల్లాలో భారీ స్థాయిలో పంట నష్టం ఏర్పడింది. చందుర్తి మండలంలో దాదాపు 500 ఎకరాలకు పైగా వరిపంట నష్టం ఏర్పడింది. ముస్తాబాద్, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో వరిపంటకు తీవ్రస్థాయిలో నష్టం ఏర్పడింది. మరో 20 రోజుల్లో పంట కోతకు రానుండగా అకాలవర్షానికి పంట నేలపాలైంది. వడగండ్ల వానతో వరిపొలాలు నేలకొరిగిపోగా.. మామిడికాయలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో నష్టం తెలియనుంది. నీరు లేక సగానికి పైగా పంట ఎండిపోయిందని, వడగండ్ల వానతో మిగిలిన సగం కూడా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.25వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. -
● రేషన్ కార్డు కోసం పేర్లు డిలీట్ చేసుకున్న కొత్త జంటలు ● రాజీవ్ యువ వికాసం, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య శ్రీ పథకాలకు దూరం ● రేషన్కార్డులు వచ్చే వరకు పథకాలు లేనట్లే ● లబోదిబోమంటున్న అర్హులైన లబ్ధిదారులు
ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్ కార్డు జారీచేయలేదు. పాతకార్డులో పేరు ఉండక, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తోందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు.సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. జారీ విషయంలో ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్కార్డు నుంచి చాలామంది పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది. కొత్త కార్డులొస్తాయని ఆశతో... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వివాహం అయినవారు రేషన్కార్డు పొందేందుకు, తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా.. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు. -
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిల
న్యాయం చేయండి మాది సిరిసిల్లలోని రాజీవ్నగర్. ఆరు నెలల కింద ఇద్దరు వచ్చి నా దగ్గర రూ.20వేలు తీసుకున్నారు. ఒకరు ప్రకాశ్రావు వకీలు వద్ద పనిచేస్తానని, మరొకరు పోలీస్ అని చెప్పారు. నా బంగారం తాకట్టుపెట్టి ఆ డబ్బులు ఇచ్చాను. నాకు న్యాయం చేయాలి. – కోన లక్ష్మి, సిరిసిల్ల పింఛన్ ఇప్పించాలి మాది గంభీరావుపేట మండలం. నాకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది. కొద్దిరోజుల క్రితం నా ఖాతాలో రూ. 50వేలు జమయ్యాయి. అది నాకు తెల్వదు. బ్యాంక్ వాళ్లు నా అకౌంటు ఫ్రీజ్ చేశారు. బ్యాంకు అఽధికారులను అడిగితే పోలీసోళ్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నాకు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు కావాలంటే తీసుకోవడానికి వీల్లేకుండా ఉంది. – మేర్గు లక్ష్మి, గంభీరావుపేట బ్యాటరీ వీల్చైర్ ఇప్పించండి నాకు 14 సంవత్సరాలు. మాది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్. డీఎంవో వ్యాధితో బాధపడుతున్నాను. నేను నడవలేను. నాకు బ్యాటరీ వీల్చైర్ ఇప్పించాలి. ఇది వరకు కూడా దరఖాస్తు ఇచ్చాం. కలెక్టర్ సార్ దయచూపాలి. – మహమూద్, ఎల్లారెడ్డిపేటస్కూటీ ఇప్పించాలి మాది సిరిసిల్ల శివారులోని సర్దాపూర్. పుట్టుకతో దివ్యాంగురాలిని. పూర్తిగా నడవలేని స్థితి. గతంలో కూడా పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేశాం. మూడు చక్రాల స్కూటీని అందించాలి. – మట్టె దివ్య, సర్దాపూర్ మందులు కొరత తీర్చాలి జిల్లా ఆస్పత్రిలో మందుల కొరతను తీర్చాలి. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలు బయట డబ్బులు పెట్టి మందులు కొంటున్నారు. కొంతమంది సిబ్బంది రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – అన్నల్దాస్ గణేష్, సిరిసిల్ల -
ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు
సిరిసిల్ల: జిల్లాలో ఎనిమిది మందికి కారుణ్య నియామకపత్రాలను కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా అందించారు. జెడ్పీ ఉద్యోగులు ఇటీవల అకాల మరణంతో వారి కుటుంబ సభ్యులకు వారసత్వంగా కారుణ్య పథకంలో నియమించారు. ఈమేరకు కర్ర సాత్విక, తాటికొండ శ్రీజ, అనగందుల వెంకటేశ్, ఆరుట్ల/మధునాల స్నేహ, ఎస్.వెన్నెల, తీగల మంజులత, మల్లారపు సహజ, వొల్లాద్రి రక్షితకు నియామకపత్రాలను అందించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో శేషాద్రి పాల్గొన్నారు. టీబీ నియంత్రణ అందరి బాధ్యత సిరిసిల్లటౌన్: జిల్లాలో క్షయ(టీబీ) నియంత్రణలో పౌరులు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లి, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్వో రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పది పరీక్షలు తనిఖీ సిరిసిల్లఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర పరిశీలకుడు రాజీవ్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 మంది హాజరైనట్లు డీఈవో జనార్దన్రావు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్లలోని విజ్ఞానవర్ధిని హైస్కూల్, డీఈవో వేములవాడలోని హంసిని డీజీ హైస్కూల్, చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్, గౌతమ్ హైస్కూల్, వేములవాడ బాలికల హైస్కూల్, కోనరావుపేట మండలం ధర్మారం హైస్కూలోని కేంద్రాలను తనిఖీ చేశారు. -
గ్రీవెన్స్ డేకు 13 ఫిర్యాదులు
సిరిసిల్లక్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ మహేశ్ బీ.గీతే తెలిపారు. బాధితులతో మాట్లాడిన అనంతరం అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. బీడీ కార్మికుల ఆస్పత్రి ఏర్పాటు చేయాలి కోనరావుపేట(వేములవాడ): సిరిసిల్లలో బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు జవ్వాజి విమల కోరారు. మల్కపేటలో సోమవారం మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా మంది కార్మికులకు అందడం లేదన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కొమ్ము సుభద్ర, ఎర్రోళ్ల ఎల్లవ్వ, కంబంపెల్లి వరలక్ష్మి, భవాని, దేవేంద్ర, లక్ష్మి, భూమయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు. అంజన్న ఆలయ ఇన్చార్జి ఈవోగా శ్రీనివాస్ వేములవాడఅర్బన్: అగ్రహారం శ్రీహనుమాన్ ఆల య అడిషనల్ ఇన్చార్జి ఈవోగా నాగారపు శ్రీనివా స్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఈవో మారుతీ బదిలీపై వెళ్లారు. ఈనెల 28న హుండీ లెక్కించనున్నట్లు తెలిపారు. ఐడీఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాజు సిరిసిల్ల: ఇండియన్ డెంటల్ అసోసియేషన్(ఐడీఏ) జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పి.రాజు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్.సతీశ్కుమార్, కోశాధికారిగా డాక్టర్ డి.శ్యాంసుందర్రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఐడీఏ జిల్లా తొలికార్యవర్గ ప్రమాణస్వీకారం ఐడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డీఎన్ స్వామి, కార్యదర్శి డాక్టర్ డి.చలపతిరావు, కార్యదర్శి డాక్టర్ డి.నవీన్ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డీఎన్ స్వామి మాట్లాడుతూ వృత్తిపరమైన అభివృద్ధిని పెంపొందించడానికి నోటి ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించాలన్నారు. జిల్లా దంతవైద్యులు శివరామకృష్ణ, పూర్ణచందర్, గోపీకృష్ణ, కె.రాజేందర్, సంతోష్, ఎం.రాజేందర్, నరేశ్, ఓం బ్రహ్మం, వెంకటేశ్, వంశీ, ఎ.సంతోష్, విజయకుమార్, రమ్య, స్నేహ, ఆకాంక్ష, స్రవంతి, ప్రియాంక, గీత, త్రిసంధ్య, లహరి, చందన, నిఖిత, జయశ్రీ, శిల్ప పాల్గొన్నారు. సెమిస్టర్ పరీక్షలు బహిష్కరిస్తాం వేములవాడఅర్బన్: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో సెమిస్టర్ పరీక్షలు బహిష్కరిస్తామని శాతవాహన యూ నివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఎస్యూ రిజి స్ట్రార్ రవికుమార్కు వినతిపత్రం ఇచ్చారు. సుప్మా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడు తూ రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ తేదీలను ప్రకటించవద్దని కోరామన్నారు. పరీక్షల తేదీలను ప్రకటించి నిర్వహణకు ముందుకొస్తే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు అయాచితుల జితేందర్రావు, విష్ణు ఉన్నారు. నేడు కేంద్ర పథకాలపై అవగాహనసిరిసిల్లకల్చరల్: కేంద్రం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ, పీఎం విశ్వకర్మ, పీఎం ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం, పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజేస్ స్కీమ్, పీఎం ఇంటర్న్షిప్ తదితర పథకాలపై మంగళవారం కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పరి శ్రమల శాఖ జిల్లా మేనేజర్ హనుమంతు తెలి పారు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలిసి నిర్వహించే సదస్సుకు నిరుద్యోగ యువత హాజరుకావాలని కోరారు. -
ఇది ‘కేటీఆర్.. ఓ టీస్టాల్’ కథా చిత్రం!
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ చిరు వ్యాపారి.. కేటీఆర్ పేరుతో నడుపుకుంటున్న టీ కొట్టు డబ్బాను అధికారులు ఇటీవల ఎన్నికల సమయంలో మూసివేయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాపారికి కేటీఆర్ అండగా నిలిచారు. మళ్లీ టీకొట్టు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. గత నెలలో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మఘాట్ వద్ద కేటీఆర్ పేరు, ఫొటోతో ఉన్న టీస్టాల్ను అధికారులు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేదన్న సాకుతో ఫిబ్రవరి 19న మూయించారు. అయితే బీఆర్ఎస్ అభిమానులు, కేటీఆర్ అనుచరులు అదే రోజు సాయంత్రమే హోటల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్తో టీస్టాల్ను తెరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న సాయంత్రం టీస్టాల్ డబ్బాకు అనుమతి లేదని పేర్కొంటూ మున్సిపల్ అధికారులు ఆ డబ్బాను పోలీస్ రక్షణ మధ్య తొలగించి, ట్రాక్టర్పై మరోచోటికి తరలించారు. ఈ చర్యతో శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, బత్తుల శ్రీనివాస్కు ఫోన్ చేసి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇచి్చన మాట ప్రకారం ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా శ్రీనివాస్కు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులతో మరోచోట హోటల్ పెట్టుకోవాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. కేటీఆర్ సలహాతో పట్టణంలోని గాం«దీచౌక్లో శ్రీనివాస్ కొత్తగా టీస్టాల్ను కేటీఆర్ పేరుతో ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేటీఆర్, ఎమ్మెల్సీ రమణతో కలసి శ్రీనివాస్ టీస్టాల్ను ప్రారంభించారు. -
చి‘వరి’కి మేతగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలు నీరందక చి‘వరి’కి మూగజీవాలకు మేతగా మారుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల రైతుల వరప్రదాయిని సింగసముద్రం ఆయకట్టు కింద సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సింగసముద్రంలో 24 ఫీట్ల వరకు నీరు ఉండగా, ఈ నీటితో 1,600 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సి ఉంది. చివరి భూముల్లోని పంటలు చేతికి రావాలనే ఉద్దేశ్యంతో నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు సమావేశమై వెయ్యి ఎకరాలకే తైబందీ విధించుకున్నారు. అయినా నీరు అందక పంటలు ఎడిపోతున్నాయి. రాచర్లబొప్పాపూర్ శివారులోని పంట పొలాల్లో ఆదివారం మేకలు, గొర్రెలు మేయడం కనిపించింది. -
గెలవాల్సిందే..
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 202513 అసెంబ్లీ స్థానాలుమధ్యాహ్న కార్మికుల నిలువు దోపిడీ ● ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వహకులైన కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తోందని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్ విమర్శించారు. గంభీరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మూడు మండలాల కార్మికులు ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఎదుట ఆందోళనకు దిగారు. లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10వేల జీతాన్ని ఇస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయలేదన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.30చొప్పున, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భోజన నిర్వహణ కమిటీ ప్రతినిధులు మణెమ్మ, బొడ్డు నర్సమ్మ, భాగ్య, గంగవ్వ, దేవలక్ష్మి, జ్యోతి, లక్ష్మి, మల్లవ్వ, బాలమణి, రేఖ, మహేశ్వరి పాల్గొన్నారు. ఉద్యమకారులకు స్వాగతం వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని తెలంగాణచౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య బస్సుయాత్రకు ఉద్యమ కళాకారులకు రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి ఆదివారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి, మొక్కులు చెల్లించుకున్నారు. ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనకయ్య, బొడ్డు రాములు, శ్రీనివాస్, వారాల దేవయ్య, హనుమాన్, శంకరయ్య, నారయణ, చందు, రాజేశం, లక్ష్మీనారాయణ, రమేశ్ తదితరులు ఉన్నారు. ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయాలి సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ..చేపట్టిన చైతన్య యాత్ర ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరింది. ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, రూ.26వేలు పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఏప్రిల్ 21న సికింద్రాబాద్లో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వెంగళ శ్రీనివాస్, గోనె ఎల్లప్ప, కుసుమ విష్ణు, ఐలయ్య, లక్ష్మణ్, వెంకటేశ్, శంకర్, గంగరాజం పాల్గొన్నారు. శాకాహారంతో శాంతియుత సమాజంసిరిసిల్లకల్చరల్: శాకాహారంతోనే మానవ సమాజంలో సాధు జీవనం సాధ్యమవుతోందని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ రాష్ట్ర బాధ్యుడు విజయభాస్కర్రెడ్డి పేర్కొన్నారు. మూమెంట్ స్థానిక శాఖ ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అనాగరిక సమాజం నుంచి ఆధునిక నాగరికత వైపు మనిషి పురోగమిస్తున్నా మాంసాహారం తీసుకోవడంతో అశాంతి చెలరేగుతోందన్నారు. జంతుహింసతో ప్రకృతి సమతూకం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాకాహారం తీసుకోవడం ద్వారా సమాజం శాంతియుతంగా పరిణామం చెందుతోందన్నారు. దాదాపు 1200 మంది శాకాహారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేముల యాదగౌడ్, మల్యాల కళావతి, జక్కని భూపతి, చిక్కుడు రాజయ్య, జక్కని శివప్రసాద్, బొల్లి సురేశ్, గుడ్ల పావని, సామల గీత, లక్ష్మక్క, బల్యాల రాజు, గడ్డం మనోజ్, గడప శారద, సుజాత, కోళ్ల లక్ష్మి, పాల్గొన్నారు. 25న సాహిత్య సమాలోచన సదస్సు సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ సౌజన్యంతో మానేరు రచయితల సంఘం, అ గ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా 25, 26 తేదీల్లో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం సాహిత్యంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రజతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టా నం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తార ని వెల్లడించారు. కేసీఆర్కు కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదుమాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు. చెక్పోస్టులు పెట్టి మరీ: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెక్పోస్టులు పెట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్, తీగల బ్రిడ్జి వంటి ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్ను అడిగితే.. కాంగ్రెస్ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు. ఒక తరాన్ని పరిచయం చేశారు బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ పేర్కొన్నారు. పకేసీఆర్ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. శ్రీఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్ లీడర్గా ఎదిగారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, మనోహర్రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్, నాయకులు రాజేశంగౌడ్, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్రావు, గెల్లు శ్రీనివాస్యాదవ్, దావ వసంత, రాకేశ్, తుల ఉమ, కోలేటి దామోదర్, హరీశ్ శంకర్, పొన్నం అనిల్గౌడ్ పాల్గొన్నారు. జోష్నింపిన బైక్ ర్యాలీ అంతకుముందు కేటీఆర్కు ఘనస్వాగతం పలికిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నిండింది. ప్రతిపాదనలు కాదు.. పరిహారం ఇవ్వండిముస్తాబాద్(సిరిసిల్ల): వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయడం కాకుండా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం బందనకల్, వెంకట్రావుపల్లి, మొర్రాపూర్ తండాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను అమలు చేయాలన్నారు. అంజాగౌడ్, రమేశ్రెడ్డి, సంతోష్రెడ్డి, నరేశ్, శ్రీనివాస్రావు, వెంకటేశ్, క్రాంతి, మహేందర్, శంకర్, కార్తీక్, కృష్ణ ఉన్నారు. వడగళ్లతో 500 ఎకరాల్లో నష్టం●● సర్వే చేపట్టిన వ్యవసాయాధికారులు ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలో వడగళ్ల వానతో 500 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. బందనకల్, వెంకట్రావుపల్లి, మల్లాపూర్తండాల్లో శనివారం రాత్రి కురిసిన వడగళ్లవానతో సుమారు 500 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆదివారం మూడు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం రాలిపోయిన పంటల వివరాలను సేకరించి రైతుల పేర్లను నమోదు చేసుకున్నట్లు ఏఈవో రేవతి తెలిపారు. శ్రీనగర్ కాలనీలో మురికి కాల్వను పరిశీలిస్తున్న కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: చెత్తను, మురికి కాల్వలను నిత్యం శుభ్రం చేయాలని, సిరిసిల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్ కమాన్ వద్ద డ్రెయినేజీని, శ్రీనగర్కాలనీ, పద్మనగర్, కొత్తచెరువు ప్రాంతాలను ఆదివారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురికి కాల్వల్లో ఎక్కడా నీరు నిలవకుండా వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురికి నీరు వెళ్లేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పద్మనగర్లోని మురికినీటి శుద్ధి(ఈటీపీ) ప్లాంట్ను పరిశీలించారు. కొత్తచెరువు వద్ద పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెత్తా చెదారం, గడ్డి వ్యర్థాలు తొలగించాలని, నాలాలోని పూడిక తొలగించాలని, మురుగునీరు నిలిచిన ప్రదేశాల్లో ఆయిల్బాల్స్, పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. పందులు కనిపించ వద్దుపందుల పెంపకం కోసం ఐదెకరాలు ఇచ్చామని.. అయినా పట్టణంలో ఎందుకు కనిపిస్తున్నాయని మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్కాలనీలో పర్యటించగా.. డ్రెయినేజీ సమస్యను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనగర్కాలనీలో నిర్మించే రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి, మొక్కలు పెట్టించాలని ఆదేశించారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మాజీ కౌన్సిలర్ ముడపు శ్రీదేవి, మున్సిపల్ పర్యావరణ ఇంజినీరు రఘు, సానిటరీ అధికారులు పాల్గొన్నారు. న్యూస్రీల్కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల: పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, మళ్లీ వచ్చేది కేసీఆర్ పాలనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీవైనగర్ షాదీఖానాలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ పండుగ సందర్భంగా పేదలకు అందించే రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కానుకలను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్లు, చిరువ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా.. ఓ భరోసా ఉండేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి 1.40 లక్షల మంది ముస్లిం పిల్లలకు చదువు చెప్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లౌకికపాలన అందించిందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు జిందం కళాచక్రపాణి, గూడూరి ప్రవీణ్, దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, ఏనుగు మనోహర్రెడ్డి, సిద్దం వేణు, రాఘవరెడ్డి, జక్కుల నాగరాజు, బండ నర్సయ్యయాదవ్, చంద్రయ్యగౌడ్, మజీద్ కమిటీ అధ్యక్షుడు స య్యద్ షమీ, ముస్లిం పెద్దలు యూసుఫ్, సలీం, సత్తార్, అక్రమ్, ఫయాజ్, చాంద్పాషా, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం నాయకులు ఘర్షణ ఇఫ్తార్ విందు సందర్భంగా షాదీఖానాలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కేటీఆర్ వేదికపైకి రాగానే సత్తార్, సోహెల్, చాంద్పాషాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేటీఆర్ సమక్షంలో ఇరువర్గాలు గొడవకు దిగడంతో తోపులాట జరిగింది. కేటీఆర్ జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. ఇటీవల మజీద్ కమిటీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండు వర్గాలుగా ముస్లింలు చీలిపోయి ఈ ఘటనకు దారితీసింది. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెక్పోస్టులు పెట్టి కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారు: గంగుల ఉద్యమ వ్యతిరేకి చేతిలో రాష్ట్ర పగ్గాలు: ఈశ్వర్ కేసీఆర్ ఒక తరాన్ని పరిచయం చేశారు: వినోద్కుమార్ జోష్ నింపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీ, సమావేశం సిరిసిల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పందులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్కుమార్ ఝాఉద్యమ వ్యతిరేకి చేతిలో.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటా రో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సా ధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సి న బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు. -
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
● బీజేపీ కుట్రలను తిప్పికొడదాం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్లటౌన్: అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని, దాని ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. స్థానిక కె–కన్వన్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్గాంధీ పాదయాత్రతో దేశంలోని వివక్షను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో బీజేపీ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ విధివిధానాలు ఎండగడుతూ ముందుకుపోవాలని కార్యకర్తలకు సూచించారు. కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొడుతూనే.. వాటికి చట్టబద్ధత కల్పించామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్బిన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ రుద్రా సంతోష్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆవేశ్ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి వేములవాడఅర్బన్: ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం మారుపాక, గుర్రంవానిపల్లిల్లో రూ.2.25కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలకు ఆదివారం భూమిపూజ చేశారు. విప్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు మిడ్మానేరులో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాలను పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచించారు. పార్టీ మండలాధ్యక్షుడు పిల్లి కనకయ్య ఉన్నారు. -
చెత్తశుద్ధి కరువాయే..
జలవనరులను రక్షించుకోవాలి వేములవాడఅర్బన్: జలవనరులను రక్షించుకోవాలని ఉమ్మడి జిల్లా యూత్ అధికారి వెంకట రాంబాబు కోరారు. అగ్రహారం డిగ్రీ కాలే జీలో శనివారం అవగాహన కల్పించారు. ● సిరిసిల్ల బల్దియా.. పరిశుభ్రత లేదయా ● పేరుకుపోతున్న డస్ట్బిన్స్ ● కంపుకొడుతున్న అంతర్గతకాలనీలు ● గత స్వచ్ఛకీర్తి కొనసాగేనా..?మోరీలు కంపుకొడుతున్నాయి మోరీలు కంపు కొడుతున్నాయి. మా వీధిలో చెత్త వేయడానికి డస్ట్బిన్స్ లేక రోడ్డు పక్కనే పడేస్తున్నారు. ఇక మోరీల్లో బాటిళ్లు, డైపర్స్ పడేయడంతో నీరు నిలుస్తుంది. వర్షం పడితే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంటుంది. – మసూరి గోపి, అనంతనగర్ టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలి మా వాడలో మోరీలోంచి తీసిన సిల్టును మూడు రోజుజులైనా తొలగించడం లేదు. చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసేందుకు అధికారులు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. – బియ్యంకార్ శ్రీనివాస్, సిద్దులవాడ చెత్త సేకరణపై దృష్టి పెట్టాలి వార్డుల్లో చెత్తసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో పారిశుధ్య పనులు బాగా జరిగేవి. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. వార్డులకు ప్రత్యేక ఆఫీసర్లు ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. – సుల్తాన్ బాలరాజు, 12వ వార్డు నిర్లక్ష్యం లేదు పట్టణంలో పారిశుధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. నిత్యం ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరిస్తున్నాం. అన్ని వార్డుల్లో ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే ప్రజలు ‘సిటిజెన్ బడ్డీ’ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే పరిష్కరిస్తాం. స్వచ్ఛ సిరిసిల్ల కీర్తి కొనసాగుతుంది. – ఎస్.సమ్మయ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ● ఇది సిరిసిల్లలో నిత్యం ఇంటింటికి వెళ్లి పారిశుధ్య సిబ్బంది ట్రాక్టర్లో చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి, హానికర చెత్తలుగా విడదీసి ప్రజలు అందిస్తుంటారు. 39 వార్డుల్లో నిత్యం 40 టన్నులకు పైగా చెత్త వస్తుంటుంది. ● ఇది కొత్తబస్టాండ్ ప్రాంగణంలోని చెత్తడబ్బాలు. ఇందులో ఒకటి విరిగిపోయి నిరుపయోగంగా మారింది. అప్పట్లో వీటి కోసం సుమారు రూ.15లక్షలు వెచ్చించారు. వీటితోపాటు పట్టణ వ్యాప్తంగా లిఫ్టింగ్ డస్ట్బిన్లు, సాధారణ డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. కానీ చాలా డస్ట్బిన్లు ప్రస్తుతం పాడయ్యాయి. సిరిసిల్ల మున్సిపల్ సమాచారం జనాభా : 1.11 లక్షలు వార్డులు : 39 శానిటేషన్ సిబ్బంది : 277 ప్రతిరోజు చెత్త ఉత్పత్తి : 52 మెట్రిక్ టన్నులు సేకరిస్తున్న చెత్త : 48 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు ప్లాస్టిక్ పదార్థాల ఉత్పత్తి : 12 టన్నులు -
నేడు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
● ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్రావు కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీకన్వెన్షన్ ఫంక్షన్హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
వడగండ్లు మిగిల్చిన క డగండ్లు
సిరిసిల్ల: జిల్లాలో శనివారం సాయంత్రం వడగళ్ల వాన పడింది. కోనరావుపేట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లో ఓ మోస్తరు రాళ్లవాన పడింది. రాళ్లవానలతో పొట్టదశలో ఉన్న వరి పొలాలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో తుంపరతో కూడిన జల్లు కురిసింది. జిల్లా అంతటా అకాల వర్షాలు కురిశాయి. కోనరావుపేట: మండలంలోని గొల్లపల్లి (వట్టిమల్ల), భుక్యారెడ్డితండా, కనగర్తి, సుద్దాల గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. గొల్లపల్లికి చెందిన సుంక భూమయ్య, దుప్యా నాయక్, వంకాయల రమేశ్, శ్రీనివాస్ తదితర రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ముస్తాబాద్: మండలంలోని బందనకల్, వెంకట్రావుపల్లి, మొర్రాపూర్ తండాల్లో వడగండ్ల వాన కురిసింది. బందనకల్లో వరిపంట దెబ్బతిందని రైతులు రమేశ్రెడ్డి, రామచంద్రారెడ్డి తెలిపారు. మొర్రాపూర్లో వడగండ్లకు పొట్టదశకు వచ్చిన వరి దెబ్బతిందని రైతు కపూర్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. బందనకల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఇల్లంతకుంట: మండలంలోని రామాజీపేట, ఓబులాపూర్లో రాళ్లతో కూడిన వర్షం పడింది. గాలిపల్లి, ఇల్లంతకుంట, వల్లంపట్ల, అనంతారం గ్రామాల్లో వర్షం అరగంటపాటు కురిసింది. కోతకు వచ్చిన పంటపొలాలు దెబ్బతిన్నాయి. రుద్రంగి(వేములవాడ): వడగండ్ల వానకు మండలంలోని మామిడితోటలకు తీవ్ర నష్టం జరిగింది. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. పంటనష్టంపై అధికారుల సర్వే చందుర్తి/వీర్నపల్లి: చందుర్తి మండలం సనుగుల, జోగాపూర్, మల్యాల, చందుర్తి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి అనూష, ఆర్ఐ శ్రీనివాస్, ఏఈవోలు శనివారం సర్వేచేశారు. వర్షానికి మండలంలోని సనుగులలో 35, జోగాపూర్లో 25, మల్యాలలో 20, చందుర్తిలో 10 ఎకరాలలో వరిపంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. వీర్నపల్లి మండలం శాంతినగర్లో మండల వ్యవసాయాధికారి జయ పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ 35 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. రైతులు లక్పతినాయక్, తిరుపతి, మోహన్, రాజు ఉన్నారు. -
వేములవాడలో అంబేడ్కర్ కాంస్య విగ్రహం
● రూ.16లక్షలతో ఏర్పాటు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: వేములవాడలో అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు రూ.16లక్షలు మంజూరు చేసి, టెండర్లు పిలిచామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్లో శనివారం మహనీయుల జయంతి వేడుకలపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జగ్జీవన్రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల పోస్టర్లు తయారు చేయాలన్నారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, ఇన్చార్జి ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజా మనోహర్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఏఎస్డబ్ల్యూవో విజయలక్ష్మి, వివిధ ఎస్సీ, ఎస్టీ కులసంఘాల నాయకులు రా గుల రాములు, గుంటి వేణు, బొలుమాల శంకర్, బడే స్వామిదాస్, జక్కుల యాదగిరి, కొమ్ము బాల య్య, కె.సుధాకర్, మేకల కమలాకర్ పాల్గొన్నారు. -
పర్యాటకాభివృద్ధికి కృషి చేయండి
● అసెంబ్లీలో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: జిల్లాలో పర్యాటకాభివృద్ధికి నిధులు విడుదల చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ మిడ్మానేరు, రాజన్న గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓసారి వేములవాడ ప్రాంతాన్ని పర్యటించాలని విన్నవించారు. నాంపల్లిగుట్టపైకి రోప్వే ఏర్పాటుతో భక్తులకు సులభంగా దర్శనభాగ్యం కలిగే అవకాశం ఉందన్నారు. హరితహోటల్ను ఆధునికీకరించాలని కోరారు. వేములవాడ ప్రాంతంలోని అనుబంధ మామిడిపల్లి సీతారామస్వామి, సనుగుల గోవిందరాజులస్వామి, రుద్రంగి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, పోతారంలోని లొంకరామేశ్వరస్వామి, నాగారం సీతారామ ఆలయం, మన్నెగూడెం, భీమారం ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. పర్యాటకాభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. పేపర్ లీకులు.. నోటిఫికేషన్లు వాయిదా ● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి సిరిసిల్లటౌన్: పోటీపరీక్షల పేపర్ లీకులు..నోటిఫికేషన్ల వాయిదాలు తప్ప పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిందేమీ లేదని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల రాక్షసపాలన నుంచి విముక్తి కోరిన తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సంక్షేమం అంటే ఏంటో చూపించారన్నారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై అసెంబ్లీలో తీర్మానం చేయడమే ఆయా వర్గాలపై కాంగ్రెస్కు ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్రెడ్డి, సోనియాగాంధీలపై చిల్లర, మల్లర ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పట్ట ణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, కాముని వనిత, వెల్ముల స్వరూపరెడ్డి, గోనె ఎల్లప్ప, బైరినేని రాము, గంభీరావుపేట ప్రశాంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ది నిరంకుశ పాలన సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధుల కేటాయింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారు మాట్లాడుతూ బడ్జెట్లో విద్యారంగానికి 25 శాతం నిధులు కేటాయించాలని కోరారు. స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం రివ్యూ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు మానాల అరుణ్, ఎస్కే బాబాషేక్, సికింధర్, కంచర్ల రవిగౌడ్, కనుకుంట్ల వెంకటరమణ ఉన్నారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభంలో గుర్తిస్తే నివారించవచ్చు ● స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ అరుణశ్రీ తంగళ్లపల్లి(సిరిసిల్ల): కుష్ఠు వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే అంగవైకల్యం నుంచి కాపాడవచ్చని స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నేరెళ్ల పీహెచ్సీ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్సీడీసీ లిప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపేయిన్ (కుష్టు వ్యాధి నివారణ ప్రచారం)ను శనివారం పరిశీలించారు. జిల్లెల్ల హెల్త్ సబ్సెంటర్ను తనిఖీ చేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె.అనిత, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక, డీపీఎంవోలు సీహెచ్.శ్రీనివాస్, ఈ.దేవ్సింగ్, సూపర్వైజర్ రాజేందర్ పాల్గొన్నారు. -
యారన్ సబ్సిడీ విడుదల చేయాలి
● పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ సిరిసిల్ల: నేతకార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్ అమృత్లాల్ కార్మిక భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. 2023లో కార్మికులు నేసిన బతుకమ్మ చీరల 10 శాతం యారన్ సబ్సిడీ పెండింగ్లో ఉందన్నారు. ప్రస్తుతం వస్త్రపరిశ్రమ సరిగ్గా నడువక కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణాధ్యక్షుడు నక్క దేవదాస్ మాట్లాడుతూ వస్త్రపరిశ్రమ సమస్యలపై అధికారులు కార్మికులతో మాట్లాడడం లేదని యజమానులతో మాట్లాడి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అన్నల్దాస్ గణేశ్, సూరం పద్మ, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. -
హిందీ పరీక్షకు 17 మంది గైర్హాజరు
సిరిసిల్ల/సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో శనివారం జరిగిన పదోతరగతి హిందీ పరీక్షకు 17 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో జనార్దన్రావు తెలిపారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిశీలించారు. గీతానగర్ బాలికల జెడ్పీ హైస్కూల్, శివనగర్లోని కుసుమ రామయ్య హైస్కూల్లోని కేంద్రాలను ఎస్పీ మహేశ్ బీ.గీతే తనిఖీ చేశారు. డీఈవో జనార్దన్రావు -
రైతన్నకు గుండె‘కోత’
సిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయానికి 17 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. రాత్రి 12.30 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. కానీ అప్రకటిత కోతలతో పొలాలు పారడం లేదు. మధ్యలో కరెంట్ పోతే.. రైతులు పొలాల వద్దకు మళ్లీ వెళ్లకుండా రాత్రి నిద్రపోవడంతో పొలం పారడం లేదు. నిరాటంకంగా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వైపు లోవోల్టేజీ సమస్యలతో కూడిన కరెంట్ సరఫరా అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లపై విద్యుత్ వినియోగ భారం పడి కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే.. రీప్లేస్ చేసేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది. ఫలితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని బోర్లు, మోటార్లు నడవడం లేదు. ఒక్కసారి పొలం ఆరితే.. మళ్లీ పారడం కష్టమవుతుంది. ఎండలు మండిపోతున్న దశలో కరెంట్ కష్టాలు ఇబ్బందిగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) విద్యుత్ పంపిణీ చేస్తుండగా.. ఎనీ్పడీసీఎల్ అధికారులు విద్యుత్ సబ్స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారు. సబ్స్టేషన్లలో మరమ్మతుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే చివరి దశలో వరి మడి.. తడి ఆరి రైతులు తల్లడిల్లుతున్నారు. పక్షమైతే పంట చేతికి జిల్లా వ్యాప్తంగా మరో పక్షం రోజుల్లో వరి పంట చేతికి అందుతుంది. యాసంగి సీజన్లో 1,82,256 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి పంట 1,78,350 ఎకరాల్లో సాగైంది. గతంతో పోలి్చతే జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఎత్తిపోయి 20 శాతం మేరకు పంటలు పొట్టదశలో ఎండిపోయాయి. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో చేతికందే దశలో పొలాలు తడారుతున్నాయి. ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేవు జిల్లా వ్యాప్తంగా వి ద్యుత్ సరఫరాలో ఇబ్బందులేమీ లేవు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఎప్పటిలాగే అందిస్తున్నాం. ఎక్కడైనా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే మార్చుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు ఆరు వాహనాలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడూ సరఫరాలో అంతరాయం సహజంగానే ఉంటుంది. విద్యుత్ కోతలు ఏమీ లేవు. – విజయేందర్రెడ్డి ‘సెస్’ఎండీ, సిరిసిల్ల -
అకాల వర్షం.. అన్నదాత ఆగం
● వట్టిమల్లలో వడగండ్ల వాన ● పలు చోట్ల విరిగిన చెట్లువేములవాడ/చందుర్తి/కోనరావుపేట: జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షంతో అన్నదాతలు ఆగమయ్యారు. పొట్టదశకు వచ్చిన వరిపంట చేతికి అందకుండా పోతుందని ఆందోళన చెందారు. వేములవాడ పట్టణంలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. కోనరావుపేట మండలం వట్టిమల్లలో చెట్లు నేలకూలాయి. నిమ్మపల్లి, అజ్మీరతండా, కమ్మరిపేటతండా, రెడ్డితండా, వట్టిమల్ల గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. చేతికొచ్చిన వరి పంటలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తీగలు తెగిపడడంతో నిజామాబాదు, కనగర్తి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/ఇల్లంతకుంట: ముస్తాబాద్ మండలం పోతుగల్, నామాపూర్, గూడూరులలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దుమాల, రాగట్లపల్లి, నారాయణపూర్, బండలింగంపల్లి, ఎల్లారెడ్డిపేట, రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్, రాజన్నపేట, అల్మాస్పూర్, అక్కపల్లి గ్రామాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. వీర్నపల్లి మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, వెంకట్రావుపల్లి, వెల్జీపురం, ఇల్లంతకుంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
ఊరూవాడ చెప్పుకోవాలి
● రైతు రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన ● గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం ● లబ్ధిదారుల వివరాలు, పేర్ల ముద్రణకు రంగం సిద్ధం ● జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ ● ఉగాది నాటికి ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: చేసింది చెప్పుకోవాలి.. అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ప్రభుత్వం కన్నా అధిక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అమలు చేశామని, ఈ విషయాలను గ్రామస్తులు చర్చించుకునే విధంగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసం లబ్ధిదారుల పేర్లను గ్రామంలోని ముఖ్యవీధుల్లో ప్రదర్శించడం, తద్వారా తాము చేసిన పనులకు ఇంటింటికి తెలియజేయడం, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తాపత్రయంతో వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురు యువతకు నియామక పత్రాలు ప్రభుత్వ పెద్దలు స్వయంగా అందజేస్తున్న తరహాలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఏం చేస్తారు? రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేస్తోంది. అదే సమయంలో తాము అత్యధిక నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించామన్నది కాంగ్రెస్ వాదన. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా అమలు తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే, ప్రతిపక్షాల వాదనలను సమర్థంగా తిప్పికొట్టేందుకే ప్రభుత్వం తాము చేసిన పనులను ఊరూ, వాడా చెప్పుకునేలా ఈ ఆలోచనకు తెరతీసింది. ప్రతీ గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది? ఆ రైతు పేరు, మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉగాదిలోగా టెండర్లు, ముద్రణ పూర్తి కావాలన్న లక్ష్యంతో కలెక్టర్లు, వ్యవసాయాశాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల రైతుల పూర్తి వివరాలు గణాంకాలతో సహా సిద్ధం చేశారు. టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాఽయశాఖ అధికారులు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల్లో రైతుల పేర్ల ముద్రణకు ఫ్లెక్సీ టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ టెండర్కు అనుకున్నంత ప్రచారం జరగలేదు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన టెండర్లను ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ముద్రణకు ఆదేశాలివ్వనున్నారు. ఆరుగడుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ ఫ్లెక్సీలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలు ఫ్లెక్సీలో ఉండనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఫ్లెక్సీలను గ్రామాల్లో కూడళ్లలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.46 లక్షల మంది రైతులకు మూడు నుంచి నాలుగు దశల్లో ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. వీరికి దాదాపు రూ.రెండువేల కోట్ల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత మాఫీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ స్వరూపం జిల్లా రుణమాఫీ మాఫీ అయిన పొందిన మొత్తం రూ.కోట్లు రైతులు కరీంనగర్ 70,348 536.55 జగిత్యాల 80,515 721.74 పెద్దపల్లి 51,827 379.52 రాజన్నసిరిసిల్ల 43,770 346.16 -
కరెంట్ కట్కట!
ఇతను గుగులోత్ రవి. వీర్నపల్లి మండలం భూక్యాతండాకు చెందిన గిరిజన రైతు. యాసంగి సీజన్లో రెండు ఎకరాల్లో వరిపంట వేశాడు. పంట పొట్టదశలో ఉండగా.. త్రీఫేజ్ కరెంట్ సరఫరా సరిగ్గా లేక అర ఎకరం పొలం ఎండిపోయింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, కరెంట్ సరఫరాలో అంతరాయంతో పొలం ఎండిపోయింది. ఇతను రుద్రంగికి చెందిన చిట్టిపాక మల్లయ్య. తనకున్న 60 గుంటలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. బోరులో పుష్కలంగా నీరున్నా కరెంట్ కోతలు, లోవోల్టేజీతో మోటారు నడవడం లేదు. ఫలితంగా పొలం పారడం లేదు. పొట్టదశలో ఉన్న పొలం ఎండిపోతుంది. లోవోల్టేజీ కరెంట్తో పలుమార్లు మోటార్లు కాలిపోయాయి.ఎండుతున్న పంటలు●● కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు ● తడారుతున్న వరిపొలాలు ● ఆందోళనలో రైతులు ● చి‘వరి’కి తిప్పలే..ఇతను ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన చిన్ని అంజిరెడ్డి. ఏడు ఎకరాలను పోత్గల్కు చెంది రైతు వద్ద కౌలుకు తీసుకుని వరిపంట వేశాడు. రెండు బోర్లలో ఒకటి ఎండిపోవడంతో ఒకటే పోస్తుంది. త్రీఫేజ్ కరెంట్ సరిగ్గా రాకపోవడంతో పొలం పారడం లేదు. అందరి బోర్లు నడవడంతో అంజి రెడ్డి పొలం పారడం లేదు. దీంతో జనరేటర్ను అద్దెకు తీసుకుని గంటకు ఆరు నుంచి ఎనిమిది గుంటల పొలాన్ని పారిస్తున్నాడు. రోజుకు డీజిల్, జనరేటర్ అద్దె రూ.2వేలు అవుతుంది.. ఇలా జిల్లా వ్యాప్తంగా రైతులు ‘కరెంట్’ కష్టాలు ఎదుర్కొంటున్నారు.సిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయానికి 17 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. రాత్రి 12.30 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. కానీ అప్రకటిత కోతలతో పొలాలు పారడం లేదు. మధ్యలో కరెంట్ పోతే.. రైతులు పొలాల వద్దకు మళ్లీ వెళ్లకుండా రాత్రి నిద్రపోవడంతో పొలం పారడం లేదు. నిరాటంకంగా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వైపు లోవోల్టేజీ సమస్యలతో కూడిన కరెంట్ సరఫరా అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లపై విద్యుత్ వినియోగ భారం పడి కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే.. రీప్లేస్ చేసేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది. ఫలితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని బోర్లు, మోటార్లు నడవడం లేదు. ఒక్కసారి పొలం ఆరితే.. మళ్లీ పారడం కష్టమవుతుంది. ఎండలు మండిపోతున్న దశలో కరెంట్ కష్టాలు ఇబ్బందిగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) విద్యుత్ పంపిణీ చేస్తుండగా.. ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సబ్స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారు. సబ్స్టేషన్లలో మరమ్మతుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే చివరి దశలో వరి మడి.. తడి ఆరి రైతులు తల్లడిల్లుతున్నారు. పంట చేతికి జిల్లా వ్యాప్తంగా మరో పక్షం రోజుల్లో వరి పంట చేతికి అందుతుంది. యాసంగి సీజన్లో 1,82,256 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి పంట 1,78,350 ఎకరాల్లో సాగైంది. గతంతో పోల్చితే జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఎత్తిపోయి 20 శాతం మేరకు పంటలు పొట్టదశలో ఎండిపోయాయి. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో చేతికందే దశలో పొలాలు తడారుతున్నాయి. ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేవు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులేమీ లేవు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఎప్పటిలాగే అందిస్తున్నాం. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే మార్చుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు ఆరు వాహనాలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడూ సరఫరాలో అంతరాయం సహజంగానే ఉంటుంది. విద్యుత్ కోతలు ఏమీ లేవు. – విజయేందర్రెడ్డి ‘సెస్’ ఎండీ, సిరిసిల్లజిల్లా విద్యుత్ సమాచారం గ్రామాలు : 260 వ్యవసాయ కనెక్షన్లు : 78,611 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు : 9,928 వ్యవసాయ ఫీడర్లు : 175 మిశ్రమ ఫీడర్లు : 90 వరి విస్తీర్ణం : 1,78,350 ఎకరాలు విద్యుత్ సబ్స్టేషన్లు : 72 -
‘పది’ పరీక్షలు ప్రారంభం
సిరిసిల్లఎడ్యుకేషన్/తంగళ్లపల్లి/బోయినపల్లి/వేములవాడఅర్బన్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం తెలుగు పరీక్షకు 6,766 మంది విద్యార్థులకు 6,752 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పర్యవేక్షించారు. మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పరీక్షల నియంత్రణ సహాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలోని కేంద్రాలు తనిఖీ చేశారు. బోయినపల్లి హైస్కూల్, వేములవాడ కిడ్స్ కాన్వెంట్, వేములవాడ హైస్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లోని కేంద్రాలను జిల్లా విద్యాధికారి జనార్దన్రావు తనిఖీ చేశారు. ఆటో ఏర్పాటు చేసిన యూత్ నాయకుడు తంగళ్లపల్లి మండలం మండెపల్లి డబుల్ బెడ్రూమ్ సముదాయం(కేసీఆర్ నగర్)లోని పదో తరగతి విద్యార్థుల కోసం యూత్ నాయకుడు కట్ట రవికుమార్ రెండు ఆటోలను ఏర్పాటు చేశాడు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అటు గొర్రెలు.. ఇటు విద్యార్థులు బోయినపల్లి మండలకేంద్రంలోని హైస్కూల్లోని పదోతరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. మరో వైపు గొర్రెలు స్కూల్ ఆవరణలోకి ప్రవేశించాయి. హైస్కూల్కు ప్రహరీ లేకపోవడంతో గ్రౌండ్లోకి పశువులు, మేకలు, గొర్రెలు ప్రవేశిస్తున్నాయి.● తొలిరోజు 6,752 మంది హాజరు -
రైతుల రిలే నిరాహార దీక్ష విరమణ
ఇల్లంతకుంట(మానకొండూర్): రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఎల్ఎం–6 కాల్వ పనులు పూర్తి చేయాలని కోరుతూ 19 రోజులుగా పెద్దలింగాపూర్లో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం విరమించారు. స్థానిక తహసీల్దార్ ఫారుక్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా అధికారుల ఆదేశాలతో దీక్షా శిబిరానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. కాల్వపనులకు, భూకేటాయింపులకు నిధులు మంజూరయ్యాయని మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని తెలపడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్టు డీఈ సీతారాం, ఆర్ఐ షఫీ, రైతులు అశోక్, నర్సయ్య, గాదె మధుసూదన్, కరికె నవీన్, లక్ష్మి, అనిత, రేణ పాల్గొన్నారు. అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం సిరిసిల్లకల్చరల్: చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ అదనపు సంచాలకుడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 30ఏళ్లలోపు వయసు, చేనేతరంగంలో పదేళ్ల అనుభవం ఉన్న వారుఅర్హులు అని పేర్కొన్నారు. డిజైనర్లు పాతికేళ్లలోపు వయసుతోపాటు డిజైన్ల రంగంలో కనీసం ఐదేళ్లకు తగ్గకుండా అనుభవం గల వారు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న చేనేత కళాకారులు, డిజైనర్లు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, తగిన శాంపిళ్లతో ఏప్రిల్ 15లోపు జౌళి శాఖ ఆఫీస్లో అందజేయాలని తెలిపారు. వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి ● సీనియర్ సివిల్ జడ్జి రాఽధికా జైశ్వాల్ సిరిసిల్లటౌన్: పౌరులు వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రాధికా జైశ్వాల్ పేర్కొన్నారు. స్థానిక విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ భవన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా ఫోరంలో రూ.కోటి వరకు, రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో రూ.కోటి నుంచి రూ.10కోట్ల వరకు, జాతీయ వినియోగదారుల కమిషన్లో రూ.10కోట్లు ఆపైన ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని వివరించారు. వస్తువు కొనుగోలు చేసిన సమయంలో తీసుకున్న బిల్లు ఉండాలన్నారు. లోక్ అదాలత్ మెంబర్లు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్.మల్లేశ్యాదవ్, సొసైటీ అధ్యక్షుడు పబ్బతి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. మగ్గంవర్క్తో మహిళలు ఆర్థికంగా ఎదగాలి● నాబార్డ్ ఏజీఎం శ్రీకాంత్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మగ్గం వర్క్ శిక్షణను పూర్తి చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్డ్ ఏజీఎం శ్రీకాంత్ కోరారు. ఎల్లారెడ్డిపేటలోని ఐకేపీ ఆఫీస్లో నాబార్డ్, స్పందన సేవా సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. మహిళలు చేస్తున్న మగ్గంవర్క్ను పరిశీలించి అభినందించారు. డీడీఎంలు జయప్రకాశ్, దిలీప్చంద్ర, ఏపీఎం మల్లేశం, స్పందన సొసైటీ సీఈవో శోభారెడ్డి, సీసీలు, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. వయోవృద్ధులపై నిర్లక్ష్యం తగదు ఇల్లంతకుంట(మానకొండూర్): వయోవృద్ధులపై సంతానం నిర్లక్ష్యం చేయొద్దని, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే పిల్లలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధి కారి లక్ష్మీరాజం హెచ్చరించారు. మండలంలోని గాలిపల్లిలో శుక్రవారం వయోవృద్ధుల సమావేశంలో మాట్లాడారు. వయోవృద్ధులను సంతానం నిర్లక్ష్యం చేస్తే జిల్లా అధికారులు, ట్రిబ్యునల్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మహిళా సాధికారత కోఆర్డినేటర్ రోజా, జెండర్ స్పెషలిస్ట్ దేవిక, అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ పాల్గొన్నారు. -
కార్డు రాక పరేషాన్
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారం గ్రామానికి చెందిన గూడెపు రాము–కవిత. గత జనవరి 26న నిర్వహించిన గ్రామసభలో తమ కుమారుడు శర్వింద్ పేరును రేషన్కార్డులో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రేషన్కార్డు ప్రొసీడింగ్ కాపీ అందగా.. అందులో రాము, కవితల పేర్లు తొలగించి వాళ్ల కుమారుడు శర్వింద్ ఒక్కడి పేరిటనే రేషన్కార్డు మంజూరు చేశారు. కార్డులో తమ పేర్లు లేకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి కొత్త రేషన్కార్డు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు రాలేదు. ● ఏళ్లుగా ఎదురుచూపులే.. ● కొత్తగా పెళ్లయిన దంపతులకు అందని బియ్యం ● పిల్లలు పెరిగినా కార్డుల్లో లేని పేర్లు ● జిల్లాలో 25వేల దరఖాస్తులు ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మందాటి రేఖ. రేషన్కార్డులో వీరి దంపతుల పేర్లు ఉన్నాయి. కానీ పిల్లల పేర్లు లేవు. దీంతో 2020లో తన కొడుకు హిమాన్ష్ పేరు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ దరఖాస్తు పెండింగ్లోనే ఉంది. ఇటీవల తన కూతురు శ్రీయాన్షి పేరు సైతం కార్డులో నమోదు చేయాలని రెండో దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదటి దరఖాస్తు పెండింగ్లో ఉండడంతో రెండో దరఖాస్తు ఆన్లైన్లో స్వీకరించడం లేదు. ఫలితంగా వీరి పిల్లల పేర్లు రేషన్కార్డులో నమోదుకావడం లేదు. ఇలా జిల్లాలో ఓ వైపు కొత్త రేషన్కార్డులు రాక, ఉన్న కార్డులలో పిల్లల పేర్లు నమోదుకాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా ఉంది జిల్లాలోని కొత్త రేషన్కార్డుల వ్యవహారం. తమ కార్డుల్లో పిల్లల పేర్లు నమోదుచేయాలని దరఖాస్తు చేసుకుంటే తల్లిదండ్రుల పేర్లు తొలగించి పిల్లలనే యజమానులుగా పేర్కొంటూ మంజూరు చేయడంతో అవాక్కవడం పెద్దల వంతైంది. ఇలాంటి వింత సంఘటనలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన పైలట్ గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారంలో కనిపిస్తాయి. ఈ గ్రామంలో కొత్తగా మంజూరైన 37 కార్డులలో 5 కార్డులు ఒంటరి మహిళల పేరుతో రాగా మిగతా కార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు తొలగించి పిల్లలనే యజమానులుగా పేర్కొంటూ మంజూరుకావడం విడ్డూరంగా ఉంది. రేషన్కార్డుల మంజూరులో అనేక తప్పిదాలు జరగడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. 25వేల దరఖాస్తులు కొత్తగా రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. ప్రజాపాలనలో నూతన రేషన్కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల వ్యాప్తంగా రేషన్కా ర్డుల కోసం దాదాపు 25వేల దరఖాస్తులు వచ్చి నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఇందులో కొత్త పెళ్లయిన దంపతులు, పిల్లల పేర్లు లేని వారు అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు గత నాలుగైదు ఏళ్లుగా రేషన్కార్డులు మంజూరుకాక, పిల్లల పేర్లు నమోదుకాకపోవడంతో వారికి బియ్యం అందడం లేదు. వీటితోపాటు ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం రెండు శాఖ లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఆయా శాఖల అధికారులు దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత కార్డులు మంజూరుకానున్నట్లు సమాచారం. 1.73 లక్షల కార్డులు.. 3,300 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 13 మండలాల వ్యాప్తంగా 1,73,745 రేషన్కార్డులున్నాయి. 4,97,103 కుటుంబాలు ఉండగా వీరి కోసం 3,300 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతీ నెల వస్తోంది. ఆయా కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే గ్రామపంచాయతీల సెక్రటరీలు, ఇతర ఉద్యోగుల ద్వారా సమాచారం అందడంతోనే వారి పేర్లు తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా పేర్లు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు.డీఎస్వోలో పెండింగ్ ఉన్నాయి రేషన్కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశాం. మా దగ్గర పెండింగ్ లేవు. ఆన్లైన్ చేసిన దరఖాస్తులు డీఎస్వోలో పెండింగ్ ఉన్నా యి. ఎప్పుడు మంజూరవుతాయో సమాచారం లేదు. – సుజాత, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్జిల్లాలో రేషన్కార్డుల సమాచారం రేషన్కార్డులు : 1,73,745 కుటుంబాలు : 4,97,103 నెలవారీ బియ్యం కోటా : 3,300 మెట్రిక్ టన్నులు కొత్త దరఖాస్తులు : 25 వేలు -
తెలంగాణలో పలు చోట్ల వర్ష బీభత్సం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది.మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి వడగళ్ల వాన కురిసింది. కాగజ్ నగర్లో దుకాణాలపై కప్పులు కూడా ఎగిరిపోయాయి. పోచమ్మ గుడి ముందున్న సుమారు 150 ఏళ్ల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు.జగిత్యాల జిల్లాలో వాతావరణం చల్లబడటంతో ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊరట చెందారు. రాళ్లవానతో అక్కడక్కడా మామిడి రైతులకు నష్టం. వాటిల్లింది. గాలి దుమారానికి పిందెలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఎలిగేడు మండలం దూళికట్టలో వడగళ్ల వాన పడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి రామడుగు మల్యాల మండలాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురుస్తోంది. -
ఉపాధి హామీలో మెరుగు..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకన్నా మెరుగ్గా ఉండటం విశేషం. ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలను కల్పించడంలో సక్సెస్ అయ్యారు.ర్యాంకు జిల్లా లక్ష్యం కల్పించిన శాతం (లక్షల్లో) పనిదినాలు 2 కరీంనగర్ 28.4 26.1 92.1 8 సిరిసిల్ల 21.8 19.6 90.0 12 జగిత్యాల 40.0 35.7 89.4 14 పెద్దపల్లి 25.5 22.8 89.4 -
మహిళల అభివృద్ధికి కృషి
● సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్వేములవాడఅర్బన్/రుద్రంగి(వేములవాడ): మహిళలను కోటీశ్వరులు చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వేములవాడరూరల్ మండల పరిధిలో రూ.9లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ 23చెక్కులు, అర్బన్ మండలానికి రూ.5.50 లక్షల విలువ చేసే 26 చెక్కులు పంపిణీ చేశారు. రుద్రంగి రైతువేదికలో 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. బడ్జెట్లో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మర్రిపల్లి రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. 42శాతం రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. పుట్టినగడ్డ రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు రుద్రంగి మండల పరిధిలో అనేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని పేర్కొన్నారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్లు విజయ ప్రకాశ్రావు, ఎండీ అబూబకార్, ఎంపీడీవో రాజీవ్మల్హోత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పిల్లి కనుకయ్య, వకుళభరణం శ్రీనివాస్, రుద్రంగిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీలత, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, గట్ల మీనయ్య, తర్రె మనోహర్ పాల్గొన్నారు. -
జీడీడీపీలో అంతంతే..
ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు కరీంనగర్ 30.216 12 పెద్దపల్లి 27,649 13 జగిత్యాల 24,011 18 సిరిసిల్ల 13,981 29 -
టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల: జిల్లాలో టోకెన్ పద్ధతిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 2.50లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా ఉందన్నారు. ఈసారి ఐకేపీ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని అన్నా రు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, తేమ యంత్రాలు ,ప్యాడీ క్లీనర్లు, టార్ఫాలిన్లు కొనుగోలు కేంద్రాలకు ఎన్ని అందిస్తున్నారో పూర్తి వివరాలు నివేదిక అందించాలని ఆదేశించారు. డీఎస్వో పి.వసంతలక్ష్మీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘సెస్’ పరిధిలో సోలార్ హబ్● ఇండో– జర్మన్ సహకారంతో జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు ● డీపీఆర్కు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాలు సిరిసిల్ల: ఇండో– జర్మన్ సహకారంతో జిల్లాలో విద్యుత్ పంపిణీ చేసే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల భాగస్వామ్యంతో సోలార్ హబ్గా మార్చేందుకు జర్మన్ సహకారం పొందనున్నారు. గత ఏడాది వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి రాష్ట్ర సహకార, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిశారు. అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంస్థ(ఐఏకే) అగ్రర్ కన్సల్టింగ్ జీఎంబీహెచ్ జర్మనీ సంస్థ చీఫ్ స్వెన్ గెల్హార్ నేతత్వంలో మంత్రి తుమ్మ ల నాగేశ్వర్రావుతో చర్చించారు. తెలంగాణ లో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో పునరుత్పాదక శక్తికి, సౌరశక్తి(సోలార్)గా మార్చడానికి సెస్ పరిధిలోని 253,501 విద్యుత్ వినియోగదారులను సౌరశక్తి ఉత్పత్తిదారులుగా మార్చడం లక్ష్యంగా పాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు నిధులు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు, ఇండో–జర్మన్ సహకారంతో జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ (కేఎఫ్డబ్ల్యూ) ద్వారా వస్తాయని అంచనా వేశారు. సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో సోలార్హబ్ ప్రాజెక్టుకు డీపీఆర్ను సమర్పించాలని మంత్రి కోరారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లాలో ‘సెస్’ విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. -
‘పది’ పరీక్షలకు రెడీ
● జిల్లాలో 35 కేంద్రాలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ● హెల్ప్లైన్ నంబర్ 94414 40849సిరిసిల్ల ఎడ్యుకేషన్/చందుర్తి: నేటినుంచి జరిగే పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30గంటలకు ముగియనున్నాయి. వచ్చేనెల నాలుగో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి 1,452 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,144 మంది, ఆదర్శ పాఠశాలల నుంచి 590 మంది, కేజీబీవీల నుంచి 508, గురుకుల విద్యాలయాల నుంచి 1,074 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణపై గురువారం జిల్లా విద్యాధికారి జనార్దన్రావు తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు పరీక్షకేంద్రాలను తెలుసుకునేందుకు వీలుగా హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటిలో 5సీ సెంటర్లుగా ఉన్నాయని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లాకేంద్రంలోని గీతానగర్ బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్, తంగళ్లపల్లి, వెంకంపేట, ఇల్లంతకుంటలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. క్యూఆర్ కోడ్తో బుక్లెట్ ఈ సారి పరీక్షలకు క్యూఆర్ కోడ్తో ముద్రించిన 24పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. తొలిసారిగా ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాలపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. దీంతో ప్రశ్నపత్రం లీక్ అయినా ఏ సెంటర్ నుంచి లీక్ అయ్యిందో సలువుగా తెలిసే ఆవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్లో విద్యార్థికి సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11పేపర్లు ఉండేవి. ఈసారి ఏడు పేపర్లే ఉండనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయోలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో 12పేజీల బుక్లెట్తో నిర్వహించనున్నారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఐదు నిమిషాలు మినహాయింపు కూడా ఇచ్చారు. కేంద్రానికి 100మీటర్ల వరకు 144సెక్షన్ అమలులో ఉండనుంది. -
నేతన్నల విషయంలో సర్కారు నిర్లక్ష్యం
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనే త, పవర్లూం రంగాలపై నిర్లక్ష్యం చూపిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ విమర్శించారు. చేనేత, పవర్లూమ్ రంగాల కు బడ్జెట్లో రూ.371కోట్లు కేటాయించడంపై యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల నేతన్నచౌక్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత, పవర్లూం రంగానికి బడ్జెట్లో కేవలం రూ.371 కోట్లు మాత్రమే కేటాయించి, నేతన్నలకు మొండిచేయి చూపారన్నారు. గత 15నెలలుగా చేనేత, పవర్లూం రంగాల్లో సంక్షోభం నెలకొని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 30మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చేనేత– పవర్లూం రంగాలకు 2వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలను ఐక్యంచేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు అన్నల్దాస్ గణే శ్, పవర్లూం వర్కర్స్ యూని యన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, వార్ఫి న్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుమ్మరికుంట కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికతో సుస్థిర పాలన ముస్తాబాద్(సిరిసిల్ల): ఒకే దేశం ఒకే ఎన్నికతో దేశంలో సుస్థిర పరిపాలన జరిగి అభివృద్ధి జరగుతుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ బీజేపీ కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మనదేశంలో వివిధ రాష్ట్రాలలో విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పరిపాలన సులభమై, పథకాలు ప్రజలదరికీ చేరుతాయన్నారు. ప్రతిసారి ఎన్నికల కోడ్ రావడం, వివిధ దశలలో ఎన్నికలను నిర్వహించడం ద్వారా దేశానికి ఆర్థికంగా భారమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్రెడ్డి, శ్రీనివాస్రావు, క్రాంతి, నరేశ్, మహేందర్, వెంకన్న, మహేశ్వర్, పద్మ, బాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సురేశ్, భగత్, కార్తీక్, కృష్ణ పాల్గొన్నారు. రాజన్న తలనీలాల సేకరణ టెండర్లు వాయిదా వేములవాడ: వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలు సేకరణకు మూడోసారి నిర్వహించిన టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఈవో కొప్పుల వినోద్రెడ్డి గురువారం తెలిపారు. తిరిగి నిర్వహించే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. గత రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్ ఏప్రిల్ 11తో ముగియనుంది. గతసారి రూ.19.01కోట్లతో రెండేళ్లకు టెండర్ దక్కించుకున్నారు. తీరా రూ.10 కోట్ల మేర కాంట్రాక్టర్ బాకీపడగా, ఇటీవల రూ.2.50 కోట్లు చెల్లించి ఆలయ అధికారులు పోగుచేసిన తలనీలాలను తీసుకెళ్లారు. మిగతా డబ్బులు ఎప్పుడి చెల్లిస్తాడో..? ఏమో అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ తగ్గడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని నాయీబ్రాహ్మణులు అంటున్నారు. మొత్తానికి రాజన్నకు ఈసారి తలనీలాల సేకరణలో గండి పడనుందని చెప్పుకుంటున్నారు. అధికారులు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. విదేశీ విద్య స్కాలర్షిప్లకు దరఖాస్తులు ఆహ్వానం సిరిసిల్ల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల నుండి విదేశీ విద్య స్కాలర్ షిప్ల కోసం దరఖాస్తులను కోరుతున్నామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజా మనోహర్రావు గురువారం తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులకు రూ.20లక్షల వరకు స్కాలర్ షిప్లు అందిస్తారని ఆయన వివరించారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు ఆఫీస పని వేళల్లో 79893 84801 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఆదాయం అంతంతే..
● తలసరి ఆదాయంలో పెద్దపల్లి టాప్ ● అటవీ విస్తీర్ణంలో కరీంనగర్ లాస్ట్, ఉపాధి హామీలో భేష్ ● తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025లో వెల్లడిగనుల ద్వారా ఆదాయం ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.సాక్షి, పెద్దపల్లి: జిల్లాల పురోగతికి సూచికగా భావించే స్థూల జిల్లా దేశీయోత్పత్తి విలువ(జీడీడీపీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పర్వాలేదన్నట్లుగా ఉండగా.. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల మినహా మిగతా జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. అర్బన్ జనాభాలో కరీంనగర్లో 3లక్షలు, రామగుండంలో 2.5లక్షలు, జగిత్యాలలో లక్షమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లా విస్తీర్ణంలో అత్యల్పంగా అడవులు కలిగి ఉండి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలవగా, ఖనిజాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ఉమ్మడి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్– 2025లో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. జిల్లా టార్గెట్ వసూలైంది (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) పెద్దపల్లి 2,465.99 2,264.30 సిరిసిల్ల 1,465.07 1,342.18 కరీంనగర్ 12,872.16 10,658.72 జగిత్యాల 2,259.05 1,356.26 -
‘నిమ్మకాయల బాబా’ బాగోతం బట్టబయలు.. మహిళలకు మత్తుమందు ఇచ్చి..
సాక్షి, సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా బాబా ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా బాగోతాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ ఫేక్ బాబా ఆటకట్టించారు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే వ్యక్తి.. సమస్యలను పరిష్కరిస్తానంటూ.. ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించి.. ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ ఫేక్ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగించేవాడు.. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
శరభ.. శరభ
వేములవాడ: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో శివకల్యాణోత్సవాలకు ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల్లో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్ల వివాహ వేడుకను తిలకించి పులకించిపోతారు. కానీ వేములవాడలో శివకల్యాణం సందర్భంగా అత్యధిక మంది శివుడిని పెళ్లాడటం ఆనవాయితీ. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తే స్వామినే పెళ్లాడుతామని మొక్కుకుంటారు. ఆ నమ్మకంతో కష్టాలు తొలగిపోయిన వారు ఏటా శివకల్యాణోత్సవం సందర్భంగా త్రిశూలం పట్టుకొని స్వామిని వివాహమాడుతుంటారు. శివకల్యాణోత్సవాల్లో ఆకట్టుకునే మరో ప్రత్యేకత వీరశైవులు (జంగమయ్యలు) వీరభద్రుడికి ఆహ్వానం పలికే వేడుక. వీరభద్రుడికి వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడి జంగమయ్యలు పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరశైవ అర్చకులు దండకాలు (ఖడ్గాలు) వేస్తూ స్వామిని ఆహ్వానిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో పట్టణానికి చెందిన 28 కుటుంబాలు పాల్గొంటాయి. స్మార్థ వైదిక పద్ధతిని అనుసరించి.. రాష్ట్రంలోని మిగతా శైవక్షేత్రాలలో ‘కారణాగమము’అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు చేస్తుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం ‘స్మార్థ వైదిక’పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీరాజరాజేశ్వరుల వివాహం జరిపిస్తుంటారు.ఈశ్వరుడు తపస్సులో ఉండగా, మన్మథుడు తన బాణాన్ని సంధించి తపస్సును భగ్నం చేశాడని, దీంతో ఈశ్వరునికి కోపమొచ్చి మన్మథున్ని త్రినేత్రంతో దహనం చేశాడని, అందుకోసమే కామదహనం తర్వాత మరుసటి రోజున ఈశ్వరుడు పార్వతిని కల్యాణం చేసుకుంటాడని అర్చకులు చెబుతున్నారు. ఇల్లు సల్లంగుండాలని.. ఏటా రాజన్నను పెళ్లాడే శివపార్వతులు ముందుగా ఇల్లు సల్లంగుండాలని రుద్రాక్ష పూజ చేసుకుంటారు. తమ ఆరోగ్యాలు బాగుండాలని, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని, కుటుంబ సమస్యలు తీరాలని, మానసిక పరిస్థితులు మెరుగుపడాలని ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న వారంతా వయో, లింగభేదం లేకుండా ఇక్కడి వీరశైవులతో రుద్రాక్షపూజ నిర్వహించుకుంటారు. అనంతరం రాజన్న కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఇక్కడి వీరశైవులు వీరికి ప్రత్యేక పూజలు చేసి రుద్రాక్షధారణ నిర్వహిస్తారు. అనంతరం వారంతా రాజన్న సేవలో తపించడంతోపాటు తమతమ కుటుంబ వ్యవహారాల్లోనూ కొనసాగుతుంటుంటారు. రాజన్నకు ఉచిత ప్రచార కర్తలుగా పని చేస్తుంటారు. -
రెవె‘న్యూ’ అధికారులు !
● కలెక్టర్ మార్క్ బదిలీలు ● 9 మంది తహసీల్దార్లు.. 14 మంది డిప్యూటీ తహసీల్దార్లకు స్థానచలనం ● అదనపు కలెక్టర్ విధుల్లో చేరిన మరుసటి రోజే చర్యలు ● భారీ బదిలీలతో రెవెన్యూలో కుదుపు సిరిసిల్ల: జిల్లా రెవెన్యూశాఖ బదిలీలతో కుదుపునకు గురైంది. ఏకకాలంలో ఇంత పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరగడం ఈమధ్య కాలంలో ఇదే కావడం విశేషం. జిల్లా ఆవిర్భవించినప్పటి నుంచి ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. 9 మంది తహసీల్దార్లు, 14 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్కుమార్ ఝా మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ మార్క్ బదిలీలు అనే చర్చ సాగుతోంది. ఇటీవల బదిలీపై వచ్చి విధుల్లో చేరిన వారిని సైతం మళ్లీ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో రెవె‘న్యూ’ అధికారులే కనిపిస్తున్నారు. బదిలీ అయిన డిప్యూటీ తహసీల్దార్లు వీరే.. జిల్లాలో 14 మంది డిప్యూటీ తహసీల్దార్(డీటీ)లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీర్నపల్లి డీటీ డి.మారుతీరెడ్డిని గంభీరావుపేటకు బదిలీ చేస్తూ తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్లో ఎలక్షన్స్(ఎపిక్) విభాగంలో పనిచేసే ఎండీ ముక్తార్పాషాను వీర్నపల్లికి బదిలీ చేస్తూ తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గంభీరావుపేట డీటీ సయ్యద్ అఫ్జల్ రహమాన్ను కలెక్టరేట్ ఎన్నికల విభాగానికి బదిలీ చేశారు. ప్రత్యేక ఉపకలెక్టర్ ఆఫీస్లో డీటీగా పనిచేసే వి.మురళీకృష్ణను ఎల్లారెడ్డిపేట డీటీగా నియమించారు. కలెక్టరేట్లోని పౌరసరఫరాల విభాగంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసే సీహెచ్ రవీంద్రాచారిని కలెక్టరేట్లోని ఎస్డీసీ ఆఫీస్లో డీటీగా, బోయినపల్లి డిప్యూటీ తహసీల్దార్ ఎ.దివ్యాజ్యోతిని సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్లో డీటీగా నియమించారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసే జి.అపర్ణను ముస్తాబాద్ డిప్యూటీ తహసీల్దార్గా బదిలీ చేశారు. ముస్తాబాద్ డీటీ ఎన్.భూపేశ్కుమార్ను బోయినపల్లి డీటీగా, కలెక్టరేట్లో పౌరసరఫరాల విభాగంలోని డీటీ కె.నవీన్కుమార్ను సిరిసిల్ల ఎస్డీసీ ఆఫీస్లో డీటీగా నియమించారు. సిరిసిల్ల ఎస్డీసీ ఆఫీస్లోని డీటీ కె.సురేశ్కుమార్ను వేములవాడ డిప్యూటీ తహసీల్దార్గా బదిలీ చేశారు. వేములవాడ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసే జి.రజితను కలెక్టరేట్ పౌరసరఫరాల విభాగం డీటీగా నియమించారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్లో డీటీగా పనిచేసే కె.మోహన్రావును రుద్రంగి డీటీగా, రుద్రంగి డీటీగా పనిచేసే బి.యాదగిరిని సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్గా నియమించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల నుంచి తంగళ్లపల్లి మండలం చీర్లవంచ ముంపు గ్రామం వరకు మానేరువాగు వెంబడి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇల్లంతకుంట మండలంలో బిక్కవాగు, కోనరావుపేట మండలంలో మూలవాగు పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా రాత్రి వేళల్లో సాగుతోంది. ఇసుక అక్రమ రవాణా కట్టడికి కలెక్టర్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా.. దందా సాగుతూనే ఉంది. మరోవైపు మొరం తరలింపులు, అక్రమ మైనింగ్లు సాగుతున్నాయి. మరోవైపు రేషన్బియ్యం పక్కదారి పట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు జిల్లాలో రేషన్బియ్యం అక్రమాలపై కేసులు నమోదుచేస్తున్నారు. రేషన్బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పనిని పోలీసులు చేస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం వైఫల్యంతోనే ఇవి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను ఎత్తిచూపడంలో రెవెన్యూ అధికారులు విఫలమైనట్లు ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా భారీ ఎత్తున బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు భావిస్తున్నారు. అదనపు కలెక్టర్ విధుల్లో చేరిన వెంటనే... జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ 45 రోజులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి.. సోమవారం విధుల్లో చేరారు. ఆయన విధుల్లో చేరిన మరుసటి రోజే 9 మంది తహసీల్దార్లను, 14 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ సెలవులో ఉండగా ఆ బాధ్యతలను పర్యవేక్షించిన కలెక్టర్ రెవెన్యూ అధికారుల పనితీరును నిషితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూశాఖలో భారీగా బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. జిల్లాలో మరికొందరు రెవెన్యూ అధికారులు, ఆర్ఐలు, రెవెన్యూ ఆఫీస్లో సిబ్బందిని కూడా బదిలీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
భక్తుల చెంతకే సీతారాముల తలంబ్రాలు
● సిరిసిల్ల డీఎం ప్రకాశ్రావు సిరిసిల్లటౌన్: శ్రీరామనవమి సందర్బంగా భక్తుల చెంతకే భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలనుకార్గో ద్వారా అందిస్తున్నామని ఆర్టీసీ సిరిసిల్ల డీఎం ప్రకాశ్రావు తెలిపారు. స్థానిక బస్స్టేషన్లో బుధవారం తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించారు. బుకింగ్ కోసం 91542 98576, 91542 98577, 94924 48189 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ‘డబుల్’ లబ్ధిదారుల నుంచి తాళాలు వాపస్ ఇల్లంతకుంట(మానకొండూర్): అనుమతి లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ప్రవేశించిన వారి నుంచి తాళాలను తహసీల్దార్ ఫారుక్ తీసుకున్నారు. కొందరు లబ్ధిదారులు ఇళ్ల పంపిణీలో జాప్యం చేస్తున్నారని మంగళవారం ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్సై శ్రీకాంత్గౌడ్, ఆర్ఐ షఫీ, వీఆర్వో సింగారెడ్డిలతో కలిసి మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను పరిశీలించి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం తహసీల్దార్ ఆఫీస్కు అక్రమంగా ప్రవేశించిన లబ్ధిదారులను పిలిపించి నచ్చజెప్పారు. మౌలిక వసతులు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతులమీదుగా అందజేస్తామని హామీ ఇచ్చారు. టీబీ నిర్మూలనకు కృషి చేయాలి ● టీబీ అలర్ట్ ఇండియా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాను టీబీ రహితంగా మార్చడానికి కృషి చేయాలని టీబీ అలర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రోగ్రాం అధికారి దండుబోయిన శ్రీనివాస్ కోరారు. మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్, బండలింగంపల్లి, కిషన్దాస్పేట, ఎల్లారెడ్డిపేట, రాచర్లబొప్పాపూర్ సబ్సెంటర్ల వైద్య సిబ్బందితో టీబీ నివారణపై స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అవగాహన కల్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అధికసంఖ్యలో కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయన్నారు. టీబీని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీబీ వ్యాధి నిర్మూలనకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాలు ఎంపిక చేయగా.. రాజన్నసిరిసిల్ల ఒక్కటన్నారు. టీబీ బారిన పడి జయించిన వారిని టీబీ చాంపియన్గా గుర్తించి శిక్షణ ఇచ్చి ప్రచారం చేయాలని సూచించారు. వైద్యాధికారి సారియా అంజుమ్, టీబీ సూపర్వైజర్ పద్మ, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. సీఎమ్మార్ లక్ష్యం పూర్తి చేయాలి ● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాలోని రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలోని రైస్మిల్లర్లు రబీ సీజన్ 2023–24లో దిగుమతి చేసుకున్న 2,56,343 టన్నుల ధాన్యానికి 1,74,313 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 1,43,656 టన్నులు ఇచ్చారని వివరించారు. ఖరీఫ్ 2024–25 సీజన్లో దిగుమతి చేసుకున్న ధాన్యం 2,11,572 టన్నులకు బియ్యం 1,42,150 టన్నులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి దాకా 21,103 టన్నులు మాత్రమే అందించారని పేర్కొన్నారు. రైస్మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని, రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించి, సమీక్షించాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. డీఎస్వో వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, రైస్మిల్లర్ల ప్రతినిధులు గరిపెల్లి ప్రభాకర్, మల్లేశం, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అనవసర హంగామా లేకుండా వాస్తవికత అద్దంపట్టేలా బడ్జెట్ను రూపొందించారన్నారు. రైతులు, మహిళలు, దళిత, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు 10.01 శాతంగా నమోదైందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 దేశ తలసరి ఆదాయం కంటే 1.8 రెట్లు అధికంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. రాజన్నకు రూ.100కోట్లపై కృతజ్ఞతలు రాష్ట్ర బడ్జెట్లో వేములవాడ రాజన్నకు రూ.100 కోట్లు కేటాయించడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయం, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. బీసీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి స్పీకర్ గడ్డం ప్రసాద్ను శాలువాతో సత్కరించారు. నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలి వేములవాడఅర్బన్: వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి సరఫరా ల్యాబ్ను బుధవారం పరిశీలించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజీ వివరాలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఇంటింటికీ నల్లా నీరు వచ్చేలా చూడాలన్నారు. నీటి నాణ్యతను రోజూ నాలుగు సార్లు పరిశీలించాలని సూచించారు. మిషన్ భగీరథ ఇంజినీర్లు జానకి, శేఖర్రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై హర్షంసిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మ్యాన ప్రసాద్, గడ్డం నర్సయ్య, నీలి రవీందర్, గంభీరావుపేట ప్రశాంత్, వంతడ్పుల రాము, గోనె ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు పెద్దపీట
కరీంనగర్ స్మార్ట్సిటీ రూ.101 కోట్లుస్పోర్ట్స్ స్కూల్ వరంగల్– కరీంనగర్ రూ.41 కోట్లుసాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ 2025–26లో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులకే పెద్దపీట వేసింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, తాయిలాల ప్రకటనకు ఈసారి ప్రభుత్వం దూరంగా ఉంది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, పాత ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులకు పెద్దపీట వేసింది. కాళేశ్వరం, ఎల్లంపల్లి, వరదకాల్వల నిర్వహణకు నిధుల విడుదల చేయడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పత్తిపాక ప్రాజెక్టుపై ప్రకటన లేకపోవడం, జగిత్యాల మెడికల్ కాలేజీ నిధులు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి మిగిలిన బకాయిల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. శాతవాహన వర్సిటీకి, కరీంనగర్ స్మార్ట్సిటీకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. మానేరు రివర్ఫ్రంట్కు నిధులు కేటాయించకపోవడం విశేషం. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో రూ.2,685 కోట్లు ప్రగతిపద్దులో కేటాయించడం చెప్పుకోదగిన అంశం. కేటాయింపులు ఇలా.. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) నుంచి మిడ్మానేరును కలిపే వరద కాల్వకు రూ.299.16 కోట్లు పూర్తి కాని పనుల కోసం వాడనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.349.66 కోట్లు స్టేజ్–2లో పూర్తిచేయాల్సిన పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. ● మానేరు ప్రాజెక్టుకు రూ.లక్ష, బొగ్గులవాగు (మంథని): రూ.34 లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్: రూ.2.23 కోట్లు, చిన్న కాళేశ్వరం రూ.0, కాళేశ్వరం రూ.2,685 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఈ నిధులను పలుఅభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. కానీ.. అంతా ఆశించిన పత్తిపాక ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం ఉమ్మడి జిల్లా వాసులను నిరాశకు గురిచేసింది. ● శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా విద్యాలయాలైన కరీంనగర్–వరంగల్లకు కలిపి రూ.41 కోట్లు ప్రకటించింది. ● అదే సమయంలో కరీంనగర్లోని ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. మొత్తం రూ.800 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు వాస్తవానికి ఈఏడాది మేలో పూర్తవాల్సి ఉంది. గత ప్రభుత్వం రెండు విడదలుగా ఒకసారి రూ.310 కోట్లు మరోసారి రూ.234 కోట్లు మొత్తం కలిపి రూ.545 కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేసింది. దీనికి టూరిజం వాళ్లు మరో రూ.100 కోట్లు కలపాల్సి ఉంది. కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం, కొత్త కేటాయింపులు లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొంది. గతంలో రూ.210 కోట్లు విడుదలవగా, ఇటీవల మరో రూ.130 కోట్ల వరకు విడుదలయ్యాయని తెలిసింది. ● కరీంనగర్ స్మార్ట్సిటీ ప్రాజెక్టు రూ.101 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లకు సాయం కింద ఏమీ కేటాయించలేదు. ● ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.12,500 కోట్లు కేటాయించింది. పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారుల చొప్పున ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ప్రస్తు తం కేటాయింపుల ప్రకారం..చూసినపుడు119 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గంలో దాదా పు 2100 ఇండ్లకే ఈ సాయం సరిపోతుంది. ● ఇక ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కొండగట్టులకు ఎలాంటి ప్రకటన లేకపోవడం భక్తులను నిరాశకు గురిచేసింది. ● కీలకమైన కాకతీయ కాల్వల ఆధునికీకరణ, కల్వల ప్రాజెక్ట్ లకు నిధులు ఇవ్వకపోవడంపైనా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సంక్షేమం, సాగునీటి రంగానికి నిధులు ఎల్లంపల్లి, వరదకాల్వకు కేటాయింపులు కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యధికంగా.. మానేరు రివర్ ఫ్రంట్కు రిక్తహస్తమే కరీంనగర్ స్మార్ట్సిటీకి రూ.101 కోట్లు 2025–26 బడ్జెట్లో కానరాని కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన -
గంజాయిని నిర్మూలిస్తాం
చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు చందుర్తి(వేములవాడ): గంజాయి నిర్మూలనకు పోలీస్శాఖ ఉక్కుపాదం మోపుతోందని చందుర్తి సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి సర్కిల్ ఆఫీస్లో గంజాయి కేసులలో నిందితులకు బుధవారం సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ నిందితులు తమ ప్రవృత్తిని మార్చుకోవాలని సూచించారు. లేకపోతే హిస్టరీషీట్స్, పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పాత నేరస్తులపై నిఘా ఉంటుందని తెలిపారు. గంజాయి సేవించిన, రవాణా చేసిన, క్రయవిక్రయాలు కొనసాగించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి పరీక్షలు నిర్వహణకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి సహకారంతోనే రవాణాదారులను, విక్రయదారులను పట్టుకుంటామని వివరించారు. చందుర్తి ఎస్సై అంజయ్య, ప్రొబేషనరీ ఎస్సై అనిల్కుమార్, సిబ్బంది ఉన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి
సిరిసిల్లటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధివిధానాలు మానుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో సవరణలు చేయాలని కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తామన్న రూ.4వేల జీవన భృతి వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు. అసంఘటిత కార్మిక రంగానికి బోర్డులను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ఈనెల 29న రాష్ట్ర బీడీ కార్మిక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించే మహాసభను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు సుధీర్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలివేరి కృష్ణయ్య, మహిళా కార్యకర్తలు మంజుల, కీర్తి పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. సింగారంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. మండలంలోని నారాయణపూర్కు చెందిన అనరాసి దేవరాజు తన ఆటోలో సుమారు 10 క్వింటాళ్ల బియ్యాన్ని గంభీరావుపేట మండలం లింగన్నపేట రైస్మిల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి బియ్యం తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేసి దేవరాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అక్రమ పట్టాదారుడు అరెస్ట్
● తహసీల్దార్తోపాటు ముగ్గురిపై కేసు చందుర్తి(వేములవాడ): పట్టాదారులకు తెలియకుండా భూమిని అక్రమ పట్టా చేసుకున్న వ్యక్తితోపాటు తహసీల్దార్, వీఆర్వోపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు. ఎస్సై అంజయ్య తెలిపిన వివరాలు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి వెంకటరాములుకు చెందిన 73 సర్వేనంబర్లో 2.08 ఎకరాల భూమిని, అదే సర్వేనంబర్లోని దొంగరి శంకర్కు చెందిన 2.07 ఎకరాలను అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి రాములు ఉరప్ చిన్నరాములు 4.15 ఎకరాల పట్టా చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో అక్రమ పట్టా చేసుకున్న ఈర్లపల్లి రాములుతోపాటు పట్టాచేసిన అప్పటి తహసీల్దార్ రాజగోపాల్రావు, వీఆర్వో రాజేశంలపై కేసు నమోదు చేశారు. అక్రమ పట్టా చేసుకున్న రాములును పోలీసులు అదుపులోకి తీసుకోగా, తహసీల్దార్, వీఆర్వోలు పరారీలో ఉన్నారు. త్వరలోనే పట్టుకోనున్నట్లు ఎస్సై తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం● రూ.50వేలు ఆర్థికసాయం అందించిన కలెక్టర్ సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాలో అంగోతు రాములు ఇల్లు బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంట్లో నిల్వచేసిన ధా న్యం, వంట సామగ్రి, బట్టలు బూడిదయ్యాయి. రాములు కుమారుడు గణేశ్ చదువుకుంటున్న సర్టిఫికెట్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పరామర్శించారు. ఈ విషయం కలెక్టర్ సందీప్కుమార్ ఝా దృష్టికి వెళ్లడంతో వెంటనే ప్రభుత్వం తరఫున రూ.50వేల చెక్కును అందజేశారు. రాజన్న సేవలో ఎమ్మెల్సీ అంజిరెడ్డివేములవాడ: రాజన్నను ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ టౌన్ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలు అందించి సత్కరించారు. -
ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!
● యాసంగి కొనుగోళ్లు ఐకేపీలకే.. ● సహకార సంఘాలకు ‘నో చాన్స్’ ● జిల్లాలో 259 కేంద్రాలు ● గతంలో ఐకేపీ 44, ప్యాక్స్ కేంద్రాలు 202 ● డీసీఎంఎస్ కేంద్రాలు 9, మెప్మా కేంద్రాలు 4సిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్లకు మహిళా సంఘాలను సిద్ధం చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) అధికారులకు సమాచారం అందించారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1,78,350 ఎకరాల్లో వరి సాగుచేశారు. 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గతేడాదిత యాసంగి సీజన్లో 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) ఆధ్వర్యంలోనే 202 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) పరిధిలో 44 కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 9, మెప్మా పరిధిలో 4 కేంద్రాలను ప్రారంభించి వడ్లను కొన్నారు. ఈ ఏడాది మాత్రం ఎక్కువ స్థానాల్లో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే మహిళా సంఘాలను పర్యవేక్షించే డీఆర్డీఏ అధికారులకు జిల్లా ముఖ్య అధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మహిళా సంఘాలతో సాధ్యమేనా..? గతేడాది ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఐరిష్(కంటిపాప) నమోదు విధానాన్ని అమలు చేశారు. భోగస్ రైతులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. అసలైన రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 170 ఐరిష్ మిషన్లు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మరో పక్షం రోజుల్లో వరికోతలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలు చేపట్టాలనే నిర్ణయం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు మాత్రం సింగిల్విండోలకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలు ఇవ్వకుండా మహిళా సంఘాలకే ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐకేపీ కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేయాలనే నిర్ణయాన్ని మెజార్టీ పీఏసీఎస్(పాక్స్)లు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం సహకారం సంఘాలకు ఎన్నికై న పాలకవర్గాలు లేవు. ప్రభుత్వ ఆదేశాలతో ఆరు నెలలు పొడగింపు సంఘాలు పర్సన్ ఇన్చార్జి కమిటీలు ఉన్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉంటాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఐకేపీ కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. కానీ కాలక్రమంలో ఐకేపీ కేంద్రాల సంఖ్యను తగ్గిస్తూ పీఏసీఎస్లకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ వచ్చారు. దీంతో జిల్లాలో సహకార సంఘాలదే అగ్రస్థానమైంది. మళ్లీ ఇప్పుడు మహిళలకు ఆ బాధ్యతలను ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా స్పష్టత రాలేదు ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమక్షంలో సమావేశం జరగాల్సి ఉంది. ఆ సమావేశం జరిగితే కొనుగోళ్ల బాధ్యత ఎవరిదో తెలుస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. గతంలో ఐకేపీ కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. మహిళా సంఘాలకే ధాన్యం కొనుగోళ్ల బాధ్యతపై స్పష్టత రాలేదు. – శేషాద్రి, డీఆర్డీవో సహకార సంఘాలకే అప్పగించండి వేములవాడఅర్బన్: సహకార సంఘాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేసేలా చూడాలని జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విన్నవించారు. బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు అవినీతికి తావు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగాయన్నారు. 2010లో అప్పటి మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ చొరవతో సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. పీఏసీఎస్ చైర్మన్లు, నాయకులు గుండారపు కృష్ణారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, బండ నర్సయ్య, భాస్కర్గౌడ్, దేవదాస్ ఉన్నారు. -
ఒకే దేశం.. ఒకే ఎన్నికపై దృష్టి
తంగళ్లపల్లి: ఒకే ఓటు..ఒకే దేశం.. ఒకే ఎన్నిక బీజేపీ దృష్టికోణమని ఆ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా ఇన్చార్జి మల్లారపు సంతోష్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. మల్లారపు సంతోష్రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు మాట్లాడారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడంతో ఖర్చులు తగ్గించవచ్చన్నారు. జమిలీ ఎన్నికలను బీజేపీ 1984 మేనిఫెస్టోలో ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు. కన్వీనర్ రెడ్డిమల్ల సుఖేందర్, కోకన్వీనర్ మోర శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కార్యదర్శి ఆశీర్వాద్, ఉపాధ్యక్షుడు గోనెపల్లి శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు కోసిని వినయ్, ఓబీసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, నాయకులు బొలగం భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
● రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిసిరిసిల్లటౌన్: ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని ఆఫీస్లో బుధవారం నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పేదరెడ్డీలను దృష్టిలో పెట్టుకొని రూ.10వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో పేద రెడ్డీలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. తీన్మార్ మల్లయ్య రెడ్డీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్రెడ్డి, కూతురు వెంకట్రెడ్డి, లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మడుపు ప్రమోదరెడ్డి, మహిళా సంయుక్త కార్యదర్శి దుండ్ర జలజారెడ్డి, సంయుక్త కార్యదర్శులు ముసుకు తిరుపతిరెడ్డి, ఏమిరెడ్డి కనకారెడ్డి, జువ్వెంతుల లక్ష్మారెడ్డి, మంద బాల్రెడ్డి పాల్గొన్నారు. న్యాయం చేయండి సిరిసిల్లటౌన్: ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ప్రజాప్రతినిధి భర్త ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని సిరిసిల్లకు చెందిన మచ్చ ప్రభాకర్ కుటుంబం మున్సిపల్ ఎదుట బుధవారం బైటాయించింది. వారు మీడియాతో మాట్లాడారు. నెహ్రూనగర్కు చెందిన ప్రభాకర్ ఇంటి పక్కనే మాజీ కౌన్సిలర్ ఇల్లు ఉంది. తమకు సంబంధించిన స్థలంలో కొంతభాగాన్ని తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈవిషయంలో తమకు న్యాయం కావాలని ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారితో మున్సిపల్ అధికారులు మాట్లాడి ఇంటికి పంపించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్కు చెందిన కమటం ఉదయ్(35) మానేరువాగులోకి చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. ఇంటి నుంచి రెండు రోజుల క్రితం వెళ్లిన వ్యక్తి వాగులో శవమై తేలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. ఉదయ్ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 17న సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజుల నుంచి ఉదయ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో గాలించారు. ఈక్రమంలోనే బుధవారం మానేరువాగులో శవమై తేలినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఉదయ్గా గుర్తించారు. చేపలు పడుతున్న క్రమంలో అదుపుతప్పి వాగులో పడి నీట మునిగినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య సరళ, ఇద్దరు కూతుళ్లు అత్విక, అశ్విక ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేతముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని రామలక్ష్మణపల్లి మానేరువాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు. ముస్తాబాద్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బి.సురేశ్ను రిమాండ్ తరలించామని, ట్రాక్టర్ల యజమానులతోపాటు మరో డ్రైవర్పై కేసులు నమోదు చేశామన్నారు. -
దురలవాట్లకు దూరంగా ఉండాలి
● సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ ● నేతన్నలకు సామూహిక కౌన్సెలింగ్సిరిసిల్ల: నేతకార్మికులు దురలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి ఆహారం తీసుకుంటూ.. ఆరో గ్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సూచించారు. స్థానిక కార్మికవాడలో జిల్లా జనరల్ ఆస్పత్రి మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్విని యోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. పవర్లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు మహిళాశక్తి చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చిందని వివరించారు. నేతన్నలు మానసిక, శారీరక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. తంబాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. మరమగ్గాల పారిశ్రామికులు దూస ప్రసాద్, మైండ్ కేర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, రాపెళ్లి లత, కొండ ఉమ, బూర శ్రీమతి పాల్గొన్నారు. -
విద్యతోనే విచక్షణ
● డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి సిరిసిల్లఎడ్యుకేషన్: విద్యతోనే విచక్షణ, జ్ఞానం వస్తాయని డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో జరిగిన పదో తరగతి వీడ్కోలు సమావేశానికి హాజరై మాట్లాడారు. విద్యతోనే జీవితాన్ని సరైన దిశలో మలుచుకునే అవకాశం లభిస్తుందన్నారు. వ్యక్తిగత జీవితంతోపాటు సమాజ వికాసానికి దోహదపడుతుందన్నారు. ఇష్టపడి చదివితే విజయాలు దరిచేరుతాయని పేర్కొన్నారు. హెచ్ఎం మోతిలాల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉమా, మాజీ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, స్టాప్ సెక్రెటరీ మల్లేశం పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలి
● అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదంపై హర్షం ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు సిరిసిల్ల: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 29 నుంచి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో మంగళవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరారు. చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ శ్రీనివాస్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించకుంటే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతర్మంతర్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. అనం తరం స్వీట్లు పంచి, టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు తడక కమలాకర్, బొప్ప దేవయ్య, చొక్కాల రాముముదిరాజ్, గోలి వెంకటరమణ, జగ్గాని మల్లేశ్యాదవ్, సమ్మెట రవి, ఇల్లంతకుంట తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లలో శాసీ్త్రయతను పాటించాలి బీసీ రిజర్వేషన్లలో శాసీ్త్రయతను పాటించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించడంపై హర్షం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కోరారు. -
అప్రమత్తతతోనే అదుపులో శాంతిభద్రతలు
● ఎస్పీ మహేశ్ బి.గీతే ● తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ తంగళ్లపల్లి(సిరిసిల్ల): అధికారుల అప్రమత్తతతోనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. తంగళ్లపల్లి పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. సీజ్చేసిన వాహనాలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి కేసులు త్వరగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. డయల్ 100, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్ ఉన్నారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక అవసరం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: పరిపాలన సామర్థ్యం పెంచేందుకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక అవసరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్ల మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడమే లక్ష్యమన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కారెడ్ల మల్లారెడ్డి, సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పనులు చేపట్టాలి ● డీఆర్డీవో పీడీ శేషాద్రి చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పనులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని డీఆర్డీవో శేషాద్రి కోరారు. మండలంలోని మర్రిగడ్డలో చేపట్టిన ఫీడర్చానల్, కోళ్ల ఫారం షెడ్ పనులను మంగళవారం పరిశీలించారు. కూలీల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న ఉపాధిహామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. పనిచేసే చోట కూలీలకు వసతులు కల్పించాలని సూచించారు. ఉపాధిహామీ ఏపీవో రాజయ్య, మర్రిగడ్డ గ్రామ కార్యదర్శి కవిత ఉన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవాలి ● వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ వేములవాడఅర్బన్: 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ కోరారు. తహసీల్దార్ ఆఫీస్లో వివిధ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. కొత్త ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. తహసీల్దార్ మహేశ్కుమార్, పార్టీల ప్రతినిధులు పొలాస నరేందర్, రాము, రామస్వామి తదితరులు ఉన్నారు. ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం చేయండి కోనరావుపేట(వేములవాడ): వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, ధర్మారంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. మాతాశిశు, అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాలపై సమీక్షించారు. మండల వైద్యాధికారి వేణుమాధవ్, ప్రోగ్రాం అధికారులు అనిత, సంపత్, రామకృష్ణ, సూపర్వైజర్లు రషీద్, సువర్ణ, మెర్సీ ఉన్నారు. -
అన్నం పెట్టిన అమ్మలకు చిరుకానుక
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమకు ఇన్నాళ్లు పాఠశాలలో రుచికరమైన మధ్యాహ్న భోజనం వండి పెట్టిన అమ్మలకు మండలంలోని జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు కృతజ్ఞతను చాటుకున్నారు. తమకు ఆరో తరగతి నుంచి రుచికరమైన భోజనం వండి పెడుతున్న మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు మంగళవారం చీరలు బహూకరించి తమ ప్రేమను చాటారు. విద్యార్థులు మాట్లాడుతూ ఐదేళ్లుగా తమను కన్నతల్లి లాగా చూసుకొని కడుపునిండా అన్నంపెట్టారని కొనియాడారు. అనంతరం ఆఫీస్ సబార్డినేట్ సంతోష్కు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం జోగినపల్లి అనురాధ అభినందించారు. -
విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● కుక్కకాటుకు గురైన బాలికకు పరామర్శ సిరిసిల్ల: కుక్కకాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. చిన్నబోనాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టెముక్కల సువర్ణపై సోమవారం వీధికుక్క దాడి చేసింది. విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం విద్యార్థినిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్బ్యాంక్ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలి వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో తాగునీటి సరఫరా, వేసవి ప్రణాళికపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలను ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడ్మానేర్, అప్పర్మానేర్ నుంచి తాగునీరు వేములవాడలోని గుర్రంవానిపల్లి 120 ఎంఎల్డీ, గంభీరావుపేట మండలంలోని కోళ్లమద్ది 7 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి 300 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతుందని, 75 ఆవాసాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈలు జానకి, శేఖర్రెడ్డి, రాము, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సమాచారం ఇవ్వండి వేములవాడఅర్బన్: ఎల్ఆర్ఎస్–2020 దరఖాస్తుదారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. వేములవాడ నందికమాన్ ప్రాంతంలోని అంజన డెవలపర్స్కు సంబంధించిన శ్రీనివాస్ తన వెంచర్లో మొత్తం 11.25 ఎకరాల భూమి ఉండగా, అందులో 117 ప్లాట్స్ చేశారు. 1.06 ఎకరాలు పార్క్ కోసం వదిలినట్లు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంచర్ను జిల్లా కలెక్టర్, ఎల్ఆర్ఎస్ జిల్లా చైర్మన్ సందీప్కుమార్ ఝా, కమిటీ సభ్యులు ఆర్డీవో రాజేశ్వర్, పీఆర్, ఆర్ఆండ్బీ ఈఈలు, నీటీపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, డీటీసీపీవో అన్సర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
‘డబుల్’ ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారులు
ఇల్లంతకుంట(మానకొండూర్): తమకు డబుల్ బెడ్రూము ఇళ్లను అధికారులు ఇచ్చేలా లేరనుకుని మండల కేంద్రానికి చెందిన 10 మంది లబ్ధిదారులు మంగళవారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ప్రవేశించారు. ఇళ్లకు అధికారులు వేసిన తాళాలు పగులకొట్టి వెళ్లారు. వారు మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఇళ్లు కేటాయించిన అధికారులు ఇప్పటి వరకు అప్పగించలేదన్నారు. సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. అద్దె ఇళ్ల ఇబ్బందులు తప్పించుకునేందుకు తాము తమకే వచ్చి, ఖాళీగా ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లినట్లు చెప్పారు. ‘డబుల్’ ఇళ్ల పరిధిలో 163 సెక్షన్ అమలు ఇల్లంతకుంటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ఎవరూ వెళ్లకూడదని, ఆ ప్రాంతంలో 163 సెక్షన్ అమలులో ఉంటుందని తహసీల్దార్ ఫారుఖ్ మంగళవారం రాత్రి ప్రకటనలో తెలిపారు. ఆ ఇళ్ల చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండకూడదని పేర్కొన్నారు. -
న్యాయం చేయండి
● మండుటెండలో ఆరుగంటల పాటు ధర్నా ● పోలీసుల హామీతో విరమణ బోయినపల్లి(చొప్పదండి): ఇల్లు లేదు. భూమి లేదు.. బతుకుదెరువు లేదు.. ఇంటి పెద్ద చనిపోయాడు.. మాకు న్యాయం చేయండి సారు.. అంటూ ట్రాక్టర్ ఢీకొని సోమవారం రాత్రి మృతి చెందిన సురకాని మల్లేశం కుటుంబీకులు, బంధువులు మంగళవారం బోయినపల్లిలో ధర్నాకు దిగారు. మృతుడి భార్య గంగాజల ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఎండలో బైటాయించడం చూసేవారిని కంట తడి పెట్టించింది. గంగాధర మండలం ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం కొంతకాలంగా బోయినపల్లిలో ఉంటూ గొర్రెలకాపరిగా ఉపాధి పొందుతున్నాడు. గొర్రెలమంద వద్దకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొని మృతిచెందాడు. ఈక్రమంలో తమ కుటుంబా నికి న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసుస్టేషన్ వద్దకు మృతుని కుటుంబసభ్యులు, బంధువులు చే రుకున్నారు. ప్రమాద కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్ను అరెస్టు చేయాలని కోరారు. అక్కడి నుంచి బోయినపల్లి–గంగాధర ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టా రు. వేములవాడ రూరల్, టౌన్ సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, ఎస్సై పృథ్వీధర్గౌడ్, మారుతితో పాటు దాదాపు 50 మంది సిబ్బంది అక్కడికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. దాదాపు ఆరు గంటల పాటు ధర్నా కొనసాగింది. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సైతం ఽసంఘటన స్థలం వద్దకు వచ్చి వాకబు చేశా రు. చివరికి సాయంత్రం ఆరు గంటల సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామమని పోలీసుల హామీతో ధర్నా విరమించారు. -
ఏక్ భారత్.. శ్రేష్ట భారత్
వేములవాడఅర్బన్: వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏక్ భారత్.. శ్రేష్ట భారత్లో భాగంగా మంగళవారం వేషధారణలతో పాఠశాలకు హాజరయ్యారు. హెచ్ఎం శ్రీకాంత్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వీసు పర్సన్ సస్పెన్షన్ చందుర్తి(వేములవాడ): మండలంలోని నర్సింగపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వీసు పర్సన్గా పనిచేస్తున్న బండి రాకేశ్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మండల విద్యాధికారి వినయ్కుమార్ తెలిపారు. పాఠశాల ఆవరణలో మద్యం తాగుతూ విద్యార్థులను చెడు వ్యవసనాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ దేశానికి వెళ్లిన ఓ వలస జీవి రోడ్డు ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన మహ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ కుటుంబ సభ్యులు కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజుపల్లి రహదారిలోని తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థినిలు క్రీడాపోటీల్లో ప్రతిభ చూపారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్వైకేఎస్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీలో రమ్య, శైలజ, శృతి, రోజా, గౌతమి, గీతాంజలి, శృతి, వాలీబాల్లో శ్రావణి, కీర్తి, వెన్నెల, శ్రీజ, ప్రవళ్లిక, నేహ, రన్నరప్ జట్టులో హారిక, మానస, కావ్య, శృతి, అఖిల, అక్షయ, మాళవిక, 200 మీటర్ల రేసులో వర్షిత, చైత్రిక విజయం సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ సుమలత, దేవిక, అభినందించారు. దుబాయ్లో ఉద్యోగాలు.. ఐటీఐలో రిజిస్ట్రేషన్లు సిరిసిల్లకల్చరల్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ఆధ్వర్యంలో నైపుణ్యం గల నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఈమేరకు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(దుబాయి)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సరిత ప్రకటనలో తెలిపారు. సిరామిక్ కాప్టర్జూనియర్ ప్రాసెస్ ఆపరేటర్, ప్రెస్ మెకానిక్, పాలిసింగ్ మెకానిక్, డిజైనర్, ప్రొడక్షన్ సూపర్వైజర్, బాడీ ప్రిపరేషన్ ఇన్చార్జ్, పోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, షవల్ ఆపరేటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.tomcom.telanga na.gov.in వెబ్సైట్లో లేదా 94400 49937లో సంప్రదించాలని సూచించారు. -
ట్రాన్స్ఫార్మర్ కాలిపోలే రైతులు డబ్బులు కట్టాలా..
మా కొడుకు ప్రణీత్రెడ్డి 2023లో విద్యుత్ ప్రమాదంలో గాయపడ్డాడు. మా ఇంటి పక్కనే వద్దనంగా విద్యుత్లైన్ వేశారు. కోతులను కొట్టేందుకు ఇంటిపైకి వెళ్లిన మా కొడుకు కరెంట్ షాక్ తగిలి 80 శాతం గాయాలయ్యాయి. ప్రాణాలకు గ్యారంటీ లేదన్నారు. రూ.20లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. ‘సెస్’ సంస్థ ఒక్కపైసా పరిహారం కూడా ఇవ్వలేదు. – ప్రణీత్ తల్లి, పదిర గ్రామం ట్రాన్స్పార్మర్ కాలిపోతే.. రైతులే మోటారు ఇంత అని డబ్బులు వసూలు చేసి ‘సెస్’ సిబ్బందికి ఇస్తున్నారు. ‘సెస్’కు ఐదు వాహనాలు ఉన్నా ప్రైవేటు వాహనాల్లో ట్రాన్స్ఫార్మర్ తెస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ పనిచేయదు. మీటింగ్ల సమాచారం ఇవ్వరు. విద్యుత్ ప్రజావాణి మొక్కుబడిగా నిర్వహించి ఫొటోలు దిగుతున్నారు. ‘సెస్’ సంస్థ రూ.కోట్ల అప్పుల్లో ఉంది. ఆస్తులను కోల్పోతుంది. – జోగినిపల్లి సంపత్రావు, నర్సింగాపూర్ జిల్లాలో 140 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. 124 హె చ్పీల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని హెచ్టీ బిల్లింగ్ చేస్తున్నారు. ఎల్టీ బిల్లింగ్ను హెచ్టీగా మార్చడంతో ఎక్కువ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. దీన్ని సవరించాలని చెప్పినా ‘సెస్’ అధికారులు పట్టించుకోవడం లేదు. బిల్లు కట్టకుంటే డిస్కనెక్షన్ చేస్తున్నారు. దీంతో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లకు నష్టం జరుగుతుంది. సిటిజన్ చార్టర్ను ‘సెస్’లో అమలు చేయడం లేదు. – గర్రిపెల్లి ప్రభాకర్, సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమలో బ్యాక్ బిల్లింగ్ పేరిట గతంలో వినియోగించిన విద్యుత్కు ఇప్పుడు బిల్లులు వేస్తున్నారు. ఒక్కో మరమగ్గాల పరిశ్రమ రూ.లక్షల్లో బ్యాక్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని విద్యుత్ కట్ చేస్తున్నారు. పాతికేళ్లుగా అమలులో ఉన్న 50 శాతం విద్యుత్ రాయితీలో పరిశ్రమ నడిచింది. ఇప్పుడు కొత్తగా బ్యాక్ బిల్లింగ్ వేయడం సరికాదు. ఈఆర్సీ చొరవ చూపి బ్యాక్ బిల్లింగ్ను రద్దుచేసి వస్త్రపరిశ్రమను రక్షించాలి. – తాటిపాముల దామోదర్, సిరిసిల్ల సంస్థలో 20 ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగులు పాతుకుపోయారు. వారిని బదిలీ చేయకుండా ఉన్నతాధికారులు, పాలకవర్గం మీకు మేము.. మాకు మీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతులు, వినియోగదారులు విద్యుత్ సమస్యలతో వస్తే అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. సరిగ్గా డ్యూటీలు చేయకుండా రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. ‘సెస్’ సంస్థను ఎన్పీడీసీఎల్లో కలపాలి. – దేవయ్య, ఎల్లారెడ్డిపేట మధ్యమానేరు ముంపు గ్రామాల్లోని రూ.కోట్ల విలువైన విద్యు త్ పరికరాలను అమ్మేసి సొ మ్ము చేసుకున్నారు. కేంద్రం అ మలు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీని ‘సెస్’ సంస్థ ఎందుకు ప్రోత్సహించడం లేదు. సంస్థ స్వ యం సమృద్ధి సాధించడం లేదు. సిక్ యూనిట్లకు వన్టై మ్ సెటిల్మెంట్లు చేసి మొండి బకాయిలను వసూలు చేయాలి. ఆదర్శ ‘సెస్’ను ఎన్పీడీసీఎల్లో కలపాల నే డిమాండ్ వస్తుందంటే పాలకవర్గం ఆలోచించాలి. – పులి లక్ష్మీపతిగౌడ్, స్తంభంపల్లి ‘సెస్’ సంస్థలో ఒకప్పుడు సే వా భావం ఉండేది. ఇప్పుడు లేదు. 124 కేవీ విద్యుత్ రైస్ మిల్లులకు శాపంగా మారింది. నేను అదనంగా రూ.5లక్షలు చె ల్లించాను. మా ఊరిలో బైరి దుర్గయ్య అనే దళితుడు రూ.7,600 చెల్లించి 2 పోల్స్ కావాలంటే ఇవ్వలేదు. కానీ అతని పేరిట మెటీరియల్ డ్రా చేశారు. దీనికి బాధ్యులు ఎవరు? ఊరిలో లోవోల్టేజీ సమస్య ఉందని, ఓ ట్రాన్స్ఫార్మర్ వేయాలంటే పట్టించుకోవ డం లేదు. సంస్థలో పని చేసే వారు కరువయ్యారు. – వెన్నమనేని వంశీకృష్ణరావు, మర్తనపేటప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు నష్టం ముంపు గ్రామాల్లోని మెటీరియల్ ఏమైంది -
అంతా స్వాహాకారమే
● ‘సెస్’లో అవినీతిపై సభ్యుల ఆగ్రహం ● ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలని డిమాండ్ ● పాలకవర్గాల అవినీతి, అక్రమాలతోనే సంస్థ పతనం ● విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఆ‘వేదనలు’సిరిసిల్ల: యాభై ఏళ్ల క్రితం సిరిసిల్ల ప్రాంతంలో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో నేడు అంతా స్వాహాకారమే రాజ్యమేలుతోందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సెస్’ పాలకవర్గాల అవినీతి, అక్రమాలతో పాలన సాగిస్తున్నాయన్నారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ‘సెస్’ 2025–2026 వార్షిక ఆదాయం సవరణపై మంగళవారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు, ‘సెస్’ గ్రామీణ ప్రతినిధులు పాల్గొని సంస్థ పని తీరును ఎండగట్టారు. ఇంత నిర్లక్ష్యమా.. జిల్లాలో విద్యుత్ లూజ్ వైర్లతో రైతులు ట్రాక్టర్తో దున్నే పరిస్థితి లేదని, హార్వెస్టర్లతో వరికోతలు కోసేందుకు ఇబ్బందిగా మారిందని, మిడిల్ పోల్స్ను వేసి లూజ్ వైర్లను సరిచేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ పంపిణీలో లైన్ లాస్ కేవలం ‘సెస్’ సిబ్బంది కనుసన్నల్లోనే విద్యుత్ చౌర్యం జరుగుతోందన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మరోటి వేయాలంటే ట్రాన్స్పోర్టు పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన గ్రామాల్లో విద్యుత ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు ఇతర పరికరాలను దొంగచాటుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. పవర్లూమ్స్కు విద్యుత్ సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. బదిలీలు లేకుండా 20 ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోవడంతో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తున్నాం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కంటే మెరుగైన విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్నామన్నారు. 26 నెలల తమ పాలనలో రూ.11కోట్లు ఉన్న డిమాండ్ను రూ.22కోట్లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి 5 హెచ్పీల వరకు విద్యుత్ ఉచితంగా ఉందని, కానీ ఎక్కువ మంది రైతులు 7.5 హెచ్పీలు, 10 హెచ్పీలు, 12.5 హెచ్పీలు, 15 హెచ్పీలు విని యోగిస్తుండడంతో విద్యుత్ లైన్లాస్ వస్తోందని వివరించారు. టారిఫ్ రేట్లను ప్రతీ యూనిట్కు పది పైసలు తగ్గించాలని, సభలో రాజకీయ కక్షలతో కొందరు అవినీతి ఆరోపణలు చేశారన్నారు. ‘సెస్’ ఎండీ విజయేందర్రెడ్డి ముందుగా ‘సెస్’ వార్షిక నివేదకను, విద్యుత్ కొనుగోలు, పంపిణీ లెక్కలను వివరించారు. సభలో సభ్యులు చెప్పిన అంశాలను, అవినీతి ఆరోపణలను నోట్ చేసుకున్నామని, విచా రణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా రు. టీజీఈఆర్సీ మెంబర్ సెక్రటరీ వి.రామచందర్, ‘సెస్’ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, మల్లుగారి రవీందర్రెడ్డి, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, కొట్టెపల్లి సుధాకర్, ఆకుల గంగారాజం, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
చేనేతకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
● హ్యాండ్లూమ్, పవర్లూమ్స్కు రూ.2వేల కోట్లు ఇవ్వాలి ● ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కార్మికనేతల వినతిసిరిసిల్లటౌన్: చేనేత, పవర్లూమ్స్ రంగాలకు రూ.2వేల కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ కోరారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ బృందం అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి బట్టి విక్రమార్కను వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి సోమవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ చేనేత, పవర్లూమ్ పరిశ్రమల్లో సంక్షోభంతో 15 నెలల్లోనే దాదాపు 30 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సిరిసిల్లలో ఇప్పటికే పూర్తయిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని కో రారు. కూరపాటి రమేశ్, కోడం రమణ ఉన్నారు. గురుకులాల్లో గీజర్లు ఏర్పాటు చేయండి– అసెంబ్లీలో విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: గురుకుల విద్యాలయాల్లో సోలార్ ఆధారిత గీజర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శాసనసభలో గురుకులాల నిర్వహణపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ ఈమేరకు విన్నవించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రాధాన్యత ఉన్న అన్ని గురుకులాల్లో తక్షణమే గీజర్లను ఏర్పాటు చేయాలని శాసనసభ వేదికగా ప్రభుత్వానికి సూచించారు. స్పందించిన మంత్రి సీతక్క తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
అనీమియా ముక్త్ భారత్ను విజయవంతం చేయాలి
● డీఎంహెచ్వో రజిత సిరిసిల్ల/బోయినపల్లి/తంగళ్లపల్లి: అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో జిల్లాలోని పీహెచ్సీల ఫార్మసిస్ట్లకు ‘అనీమియా ముక్త్ భారత్’పై సోమవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ఐరన్ పోలిక్ ఆసిడ్(ఐఎఫ్ఏ) మాత్రల సరఫ రా, చైన్ మేనేజ్మెంట్పై ఫార్మసిస్టులు అవగా హన పెంచుకోవాలని సూచించారు. బోయినపల్లి మండలం విలాసాగర్ ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో రజిత, తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్సీ పరిధిలోని జిల్లెల్ల గ్రామాన్ని వైద్యాధికారులు కె.అనిత, రామకృష్ణ సందర్శించారు. -
రోడ్డుపై నిర్మాణంతో ఇబ్బందులు
జిల్లా కేంద్రం శాంతినగర్ రెండోవార్డులో ఒకరు రోడ్డుపై అడ్డంగా నిర్మాణం చేపట్టారు. ఈ విషయంలో అధికారులు మోఖ పరిశీలన చేయకుండానే సదరు వ్యక్తికి పర్మిషన్ ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై సదరు వ్యక్తి అట్రాసిటీ కేసులు పెట్టించాడు. రోడ్డుకు అడ్డంగా నిర్మాణంతో నెలరోజులుగా కాలనీలో మురుగునీరు పోకుండా ఉంటోంది. కలెక్టర్ సార్ స్పందించి వెంటనే మోఖపై విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేయాలి. – భీమనాథిని మల్లేశం, మాదాసు నర్సయ్య, చిట్యాల మల్లవ్వ, మధు -
ఎన్హెచ్ 563లో కొత్త మలుపు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర.. రెండు రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక జాతీయ రహదారి ఎన్హెచ్ 563 టెండర్ కొత్త మలుపు తిరిగింది. గత జూలైలో కరీంనగర్–జగిత్యాల సెక్షన్కు సంబంధించి రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) టెండర్ల అంచనా వ్యయాలు ఖరారు అయ్యాయి. దాదాపు రూ.2,227 కోట్లతో టెండరుకు అంచనా వ్యయం కూడా రూపొందాయి. ఈ మేరకు టెండర్లు వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ సాంకేతిక కారణాలతో పాత అంచనాలతో రూపొందించిన టెండర్లు రద్దు అయ్యాయి. తాజాగా రూ.1,779 కోట్లతో ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచారు. మొత్తం 58.86 కిమీ పొడవైన ఈ రహదారి కరీంనగర్ బైపాస్ (కొత్తపల్లి సమీపంలో) నుంచి జగిత్యాల వరకు నాలుగు లేన్ల రహదారిగా వేయనున్నారు. గతంలో ఈ రహదారి ఖర్చు ప్రతీ కిలోమీటరుకు రూ.37 కోట్ల వరకు అంచనా వ్యయంగా ఉండటం గమనార్హం. అధునాతన సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ జాతీయ రహదారి నిర్మాణం కానుంది. ఈ మార్గంలో దాదాపు 241 హెక్టార్ల భూసేకరణ కోసం దాదాపు రూ.387 కోట్ల నిధులు కేటాయించారు. వాస్తవానికి గతంలో అంచనా వ్యయం రూ.1,503 కోట్లు మాత్రమే. (వీటికి జీఎస్టీ, భూసేకరణ కలుపుకుంటే అది రూ.2,227 కోట్ల వరకు చేరింది.) తాజాగా టెండరు ప్రకారం.. రూ.1,779 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన రూ.276 కోట్ల అంచనా వ్యయం పెరిగిందని సమాచారం. తాజా టెండర్ అంచనా వ్యయంలో జీఎస్టీ కలిసిందా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మార్కెట్లో పలు ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం పెరిగి ఉండవచ్చని సమాచారం. వేగంగా రహదారి పనులు.. ఈ సెక్షన్లో కీలకమైన కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. గతంలో మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ పనులు చేపట్టారు. తెలంగాణలో హైదరాబాద్ తరువాత ముఖ్య నగరాలైన వరంగల్– కరీంనగర్ పట్టణాలను కలిపే 68 కి.మీల ప్రతిష్టాత్మక రహదారి. దీన్ని 2025 జూలై నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం సమీపంలో టోల్గేట్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అదే సమయంలో మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి వద్ద నిర్మించతలపెట్టిన బైపాస్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జగిత్యాల–కరీంనగర్ సెక్షన్ పాత టెండరు రద్దు సాంకేతిక కారణాలతోనే రద్దయినట్లు సమాచారం తాజాగా రూ.1,779 కోట్లతో మరో టెండరు రూ.276 కోట్ల వరకు పెరిగిన అంచనా వ్యయం వేగంగా కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులు వరంగల్–కరీంనగర్ సెక్షన్ దూరం 68 కి.మీ అంచనా రూ.2,146 కోట్లు గడువు 16–7–2025 మానకొండూరు బైపాస్ 9.44 కి.మీ తాడికల్ బైపాస్ 6.65 కిమీ హుజూరాబాద్ బైపాస్ 15.05 ఎల్కతుర్తి బైపాస్ 4.60 కిమీ హసన్పర్తి బైపాస్ 9.57 కిమీ మైనర్ జంక్షన్లు 29కరీంనగర్–జగిత్యాల సెక్షన్ దూరం 58.8 కిమీ అంచనా రూ.1,779 కోట్లు (జీఎస్టీపై స్పష్టత రావాల్సి ఉంది) బ్రిడ్జిలు 24 ఆర్వోబీ/ఆర్యూబీ 03 మేజర్ జంక్షన్లు 27 మైనర్ జంక్షన్లు 29 టోల్ప్లాజా గంగాధర– తుర్కాశీనగర్ సమీపంలో (అంచనా) ట్రక్ బే టోల్ప్లాజా సమీపంలోనే (2 కి.మీలోపే) రెస్ట్ ఏరియా జగిత్యాల సమీపంలో.. -
ప్రజా‘వాణి’ వినండి
సిరిసిల్లటౌన్: ప్రజావాణికి వచ్చే బాధితుల సమస్యలు విని, పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 113 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రెవెన్యూకు 49 దరఖాస్తులు వచ్చాయి. డీఆర్డీవో శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అర్జీలపై నిర్లక్ష్యం చూపొద్దు కలెక్టర్ సందీప్కుమార్ ఝా 113 దరఖాస్తుల స్వీకరణ -
‘ఖేలో ఇండియా’ పారా గేమ్స్కు జిల్లా క్రీడాకారులు
సిరిసిల్ల: ఢిల్లీలో జరిగే ‘ఖేలో ఇండియా’ పారా గేమ్స్కు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన మిట్టపల్లి అర్చన(46), వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన భూక్యా సక్కుబాయి(40) ఢిల్లీలో ఈనెల 20 నుంచి 27 వరకు జరిగే పోటీలకు ఎంపికయ్యారు. వీరిని కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా క్రీడల అధికారి అజ్మీరా రాందాస్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సోమవారం అభినందించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి● కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడఅర్బన్: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. వేములవాడ ఏరియా ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను, రోగులకు అందుతును సేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రి భవన నమూనాలో ఉన్న విధంగా వార్డులు, గదులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తదితరులు ఉన్నారు. మోడల్స్కూల్లో ఎన్సీఈఆర్టీ బృందం ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలో ని రహీంఖాన్పేట ప్రభుత్వ మోడల్స్కూల్ ను సోమవారం ఎన్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకు డు జగన్ సందర్శించారు. రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల పనితీరు పరిశీలిస్తున్నట్లు తెలి పారు. విద్యార్థుల ఎస్ఏ పరీక్షలు, బేస్లైన్ టెస్ట్, మిడ్లైన్ టెస్టు, టీచర్స్ డైరీలు, ఐఎఫ్బీ ప్యానెల్ పనితీరు పరిశీలించారు. ప్రిన్సిపాల్ గంగాధర్, సీఆర్పీ నర్సయ్య ఉన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక సిరిసిల్లటౌన్: జిల్లాస్థాయి తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఎంపిక పోటీలు సోమవారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జరిగాయి. పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ ఆజాద్ ప్రారంభించారు. 14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు జరిగాయి. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈనెల 23న జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలి పారు. పీఈటీలు కడారి అశోక్, మహేందర్, నవీన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కన్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బట్ట సంచులే ముద్దు తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణాన్ని కాపాడేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెడ్మాస్ట ర్ అనురాధ మాట్లాడుతూ ప్లాస్టిక్ బూతాన్ని తరిమివేయాలని కోరారు. విద్యార్థులకు బట్టసంచులను అందజేశారు. టీచర్లు రాజేశ్వరరావు, శారద, రమేశ్, శైలజ, శిరీష, పద్మ, రవీందర్రెడ్డి, సుమలత, సంతోష్ తదితరులు ఉన్నారు. -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెంలో శ్రీపద్మావతీవేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విష్ణు సహస్ర పారాయణం చేశారు. పూర్ణాహుతి, బలిహరణం చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ శాశ్వత చైర్మన్ చిట్నేని వెంకటేశ్వర్రావు, అధ్యక్షుడు గంభీరావుపేట బాలయ్య, సరిత, రఘుపతిరావు, అంజన్రావు, శ్రీనివాస్రావు, శ్రీధర్, గిరి, విద్యాసాగర్రావు, విష్ణు, మల్లేశ్, లక్ష్మయ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
టెక్స్టైల్ పార్క్ తెరిపించండి
● వర్కర్ టు ఓనర్ పథకం ప్రారంభించాలి ● రైతులకు నష్టపరిహారం చెల్లించాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీసిరిసిల్లటౌన్: సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్ను ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు. జిల్లా కేంద్రం నెహ్రూనగర్లోని అంభా భవాని ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్లలో లక్షలాది మంది కార్మికులు నివసిస్తున్నారని, వైద్యం కోసం ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, పవర్లూమ్ కార్మికుల కోసం వర్కర్ టు ఓనర్ పథకానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. సీయూ భూములు అమ్మొద్దు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములు విక్రయించాలని రాష్ట్ర సర్కారు చూస్తోందన్నారు. యూనివర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, ఎర్రవల్లి నాగరాజు, ముక్తి కాంత అశోక్, అన్నల్దాస్ గణేష్, మల్లారపు ప్రశాంత్, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టెక్స్టైల్పార్క్ సందర్శన తంగళ్లపల్లి(సిరిసిల్ల): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్టైల్ పార్కును ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జాన్వెస్లీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి టెక్స్టైల్ పార్కు పరిస్థితి ప్రస్తుతం దీనావస్థలో ఉందన్నారు. వేలాది కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన టెక్స్టైల్ పార్కులో సగానికిపైగా పరిశ్రమలు మూతబడి ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి టెక్స్టైల్ పార్కులో మూతబడిన పరిశ్రమలు తెరిపించాలని కోరారు. ‘గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుంది’ ఇల్లంతకుంట(మానకొండూర్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
ట్యాంకర్ నీటికి రూ.700
రోజు 500 మీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకుంటున్నం. మా కాలనీలో ఇరవై గడపల మందిమి సొంతంగా బోరు వేయించుకున్నాం. దానిలో నీరు అడుగంటింది. మున్సిపాల్టీలోల్లకు చెబితే సమస్య తీరడం లేదు. నీళ్లకు ఇంత కష్టం ఎన్నడూ రాలేదు. ఒక్క ట్యాంకర్కు రూ.700 పెట్టి కొనాల్సి వస్తోంది. – వాగుమడి సుమలత, గుర్రపుకాలనీ భగీరథ నీళ్లే దిక్కు మా కాలనీలో 20 కుటుంబాలు ఉంటున్నాయి. మా కు మిషన్ భగీరథ వస్తేనే మంచినీళ్లు.. లేదంటే బావుల్లోని నీళ్లు తాగుతాం. చా లా ఏడాది సంది మిషన్ భగీరథ నీళ్లు రావడం లే దు. వ్యవసాయ బావులు, బోర్ల నుంచి నీళ్లు తె చ్చుకుని తాగుతున్నాం. మున్సిపల్లో చెప్పినా లాభం లేదు. మా ఏరియాలో మోర్లు తీయడం లేదు. – కొంపెల్లి కళ, మాలపల్లె, పెద్దూరు పవర్బోరు పాడైంది మా పల్లెలో సుమారు 100 కుటుంబాలున్నాయి. అందరికీ కలిపి మూడు బోర్లు. ఒకటి మజీద్ది, రెండు మున్సిపల్ పవర్బోర్లు. వాటిలో ఒక మున్సిపల్ బోరు ఎండిపోయింది. పవర్బోరు పైపులైన్ పాడైంది. అందరం రౌతుకొట్టుకుని బతికేటోళ్లం. ట్యాంకర్ నీళ్లు కొనుక్కోలేము. అధికారులు స్పందించాలి. – సయ్యద్ రుక్సార్బేగం, తుర్కాశిపల్లి నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ సిరిసిల్లలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాం. నీళ్లు రాని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తాం. ప్రత్యేకంగా సమ్మర్ప్లాన్ అమలు చేస్తాం. తాగునీటి సమస్యపై చర్యలు తీసుకునేందుకు కార్యాలయంలో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశాం. 78935 93330కు ఫోన్ చేస్తే సత్వరమే పరిష్కరిస్తాం. – ఎస్.సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ -
భక్తులకు ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు
● ఎస్పీ మహేశ్ బి.గీతే ● వేములవాడలో పర్యటన వేములవాడ: రాజన్న కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బి.గీతే పేర్కొన్నారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి, ఈఈ రాజేశ్, టౌన్ సీఐ వీరప్రసాద్లతో కలిసి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు, కల్యాణ మండపం, గోశాల, ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100 డయల్ చేయాలన్నారు. రాజన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈవో స్వామి వారి ప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు. -
సెలవు పూట..నిరసన బాట
సిరిసిల్లటౌన్: పండుగ పూట ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన బాట పట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలయ్యే వరకు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు వాయిదా వేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ దీక్షలో బడుగు లింగయ్య, మంగలి చంద్రమౌళి, శావనపల్లి బాలయ్య, కృష్ణభగవాన్, మల్లారపు నరేష్, ప్రశాంత్ పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయండి సిరిసిల్లటౌన్: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయాలని పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ నాగార్జున ఈనెల 18న సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న సదస్సుకు హాజరుకా వాలని కోరారు. విద్యుత్ సరఫరా, లూజ్వైర్లు, సకాలంలో ఫ్యూజులు వేయకుండా డిపాజిట్ కట్టిన కరెంటు పోల్ వేయకున్నా, ట్రాన్స్ఫార్మర్లు వేయకున్నా, బిల్లుల్లో తేడాలున్నా ఫిర్యా దు చేయవచ్చని తెలిపారు. కరెంట్షాక్తో ప శువులు చనిపోతే రూ.40వేలు, మనుషులు చనిపోతే రూ.5లక్షలు పరిహారం పొందవచ్చని వివరించారు. కుసుమ గణేశ్, చిప్ప దేవదాస్, వేముల పోశెట్టి, నల్ల మురళి, దొంతుల ప్రతా ప్, వేముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎండుతున్న పంటలను కాపాడాలి ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలో చివరి దశలో ఉన్న వరిపంటలను కాపాడాలని గన్నెవారిపల్లి, పోతుగల్, నిమ్మవారిపల్లి గ్రామాల రైతులు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు ఆదివారం విన్నవించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, పోతుగల్ మాజీ సర్పంచ్ తన్నీరు గౌతంరావు, ఏఎంసీ వైస్చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డిలతో పంటల పరిస్థితిని చర్చించారు. నెల రోజులైతే పంట కోతలకు వస్తాయని, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ పెద్దచెరువు నుంచి నీటిని విడుదల చేస్తే 300 ఎకరాల్లో వరిపంట చేతికొస్తుందని, లేదంటే లక్షలాది రూపాయలు నష్టపోతామని రైతులు గన్నె నర్సింలు, బాల్నర్సయ్య, అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి నీటిని ఎక్కువగా విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామని బాల్రెడ్డి తోపాటు ఇతర నాయకులు హమీ ఇచ్చారు. -
ఆపద వస్తే అండగా నిలుస్తాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● సీఎమ్మార్ఎఫ్ చెక్కులు పంపిణీ చందుర్తి/రుద్రంగి/కోనరావుపేట(వేములవాడ): ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని లబ్ధిదారులకు ఆదివారం సీఎమ్మార్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చందుర్తిలో 24 మందికి రూ.9.61లక్షలు, కోనరావుపేటలో రూ.8.38లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు. కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, పార్టీ మంలాల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, తర్రె మనోహర్, షేక్ ఫిరోజ్పాషా, ఏఎంసీ చైర్మన్లు చెలుకల తిరుపతి, ఎల్లయ్య, వైస్చైర్మన్లు బొజ్జ మల్లేశం, ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సంతుపూరి బాలకృష్టారెడ్డి, జలపతి తదితరులు పాల్గొన్నారు. వారిదే స్ట్రాంగ్ బంధం వేములవాడ: గల్లీలో లొల్లి... ఢిల్లీలో దోస్తి అన్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీల బంధం కొనసాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై వేములవాడలోని తన నివాసంలో కౌంటర్ ఇచ్చారు. మంత్రి బండి సంజయ్ మాటలు పరిశీలిస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ బంధం స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. గతంలో కేంద్రంలో ఈడీ, రాష్ట్రంలో ఐటీ, సీబీఐ, పోలీసులను అడ్డం పెట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. 15 నెలల క్రితం ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనంతరం సీఎమ్మార్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రాజన్నకు పట్టువస్త్రాలువేములవాడ: శివకల్యాణం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భేరి పూజ, దేవత ఆహ్వానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
గ్రూపు రాజకీయాలు వద్దు
సిరిసిల్లటౌన్: పార్టీలో గ్రూప్ రాజకీయాలు వద్దు..చేస్తే నేను సహించ.. ఇదే నా హెచ్చరిక అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. సిరిసిల్లలోని మున్నూరుకాపు సంఘంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనది బీజేపీ వర్గమని, నరేంద్రమోదీ గ్రూపుగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పనిచేస్తే.. అల్ఫోర్స్ నరేందర్రెడ్డి ఓటమికి కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడు బీజేపీ నేతలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజలపై కేసులు పెట్టించారన్నారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంటే అప్పటి మంత్రి కేటీఆర్ అధికారులను బెదిరించి ఫలితాలు తారుమారు చేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అర్బన్ నక్సల్స్ కన్నా డేంజర్ అంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పల్లెలకు అందించిన నిధులపై విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై ప్రజలు కోపంతో ఉన్నారని.. ఈ తరుణంలో పార్టీకి నష్టం పరిచేలా ఎవరూ ప్రవర్తించినా సహించబోమన్నారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒక్కటై ఢిల్లీలో చీకటి పొత్తు కుదుర్చుకున్నాయన్నారు. కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలకు నిధుల్లేవంటూనే మంత్రుల బినామీలైన కాంట్రాక్టర్లకు బిల్లులు ముట్టజెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల దళంలో ఉత్సాహం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హాజరవడం కమల దళంలో ఉత్సాహాన్ని నింపింది. స్థానిక కల్టెరేట్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్ర్యాలీగా తరలివచ్చారు. అభిమానులు బండి సంజయ్ తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమానికి వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గల్లోని బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ రాష్ర నాయకుడు మేర్గు హన్మంతు, వేములవాడ ఇన్చార్జి చెన్నమనేని వికాస్రావు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పొట్టి శ్రీరాములుకు వ్యతిరేకి బీజేపీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సిరిసిల్లలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం -
గొంతెండుతోంది
● సిరిసిల్ల మున్సిపాలిటీలో తాగునీటి గోస ● శివారు పల్లెల్లో కన్నీటి కష్టాలు ● విలీన గ్రామాల్లో ‘మిషన్ ట్రబుల్’ ● నీరింకిన బోర్లు..పాడయిన మోటార్లు ● ప్ర‘జల’ కష్టాలపై ప్రణాళిక లేమి ● జిల్లా కేంద్రంలో దాహం..దాహంసిరిసిల్లటౌన్: ఎండాకాలం ఆరంభంలోనే కార్మికక్షేత్రం సిరిసిల్లలో నీటి కటకట మొదలైంది. మున్సిపల్ విలీన గ్రామాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. శివారు ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల్లో మిషన్ భగీరథ ద్వారా అందాల్సిన తాగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్బోర్లు నిర్వహణ లోపంతో పనిచేయడం లేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నీటి కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. ప్రణాళిక లేమితో కష్టాలు తలాపునే మానేరు నది పారుతున్నా ఏళ్లుగా సిరిసిల్లలో తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఏటా వేసవిలో నీటి కోసం మున్సిపల్ ప్రజలు ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని ఏరియాల్లో వందల మీటర్ల దూరం నడిచి నెత్తిన బిందెలతో తాగు, ఇతర అవసరాలకు నీరు తెచ్చుకుంటున్నారు. సిరిసిల్లలో మున్సిపల్కు సంబంధించిన 450 పవర్బోర్లు ఉన్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యంతో ప్రస్తుతం అవి పాడయ్యాయి. వాటిని మరమ్మతు చేయడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. ప్రతిరోజు సిరిసిల్ల వ్యాప్తంగా ప్రజల అవసరాలకు 16 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తారు. ఇందులో 8 ఎంఎల్డీ మిషన్ భగీరథ, 8 ఎంఎల్డీ పవర్బోర్ల ద్వారా సరఫరా జరుగుతోంది. వార్డుల్లో నీటికష్టాలు ఇలా.. ● విద్యానగర్, సుభాష్నగర్, సాయినగర్, పద్మనగర్, నీళ్లట్యాంకుల పరిధిలో నల్లానీరు సరఫరా అవుతోంది. ● కార్మికవాడలు బీవైనగర్, తారకరామనగర్, సుందరయ్యనగర్, ఇందిరానగర్, గణేశ్నగర్, శివనగర్, ప్రగతినగర్, జేపీనగర్తోపాటు విలీన గ్రామాలు చంద్రంపేట, రగుడు, రాజీవ్నగర్, పెద్దూరు, శివారు పల్లెల ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ● ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం లేదని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ● పెద్దూరు, రగుడులోని చాలా ప్రాంతాల ప్రజలు ఇప్పటికే మున్సిపల్ అధికారులకు, జిల్లా కలెక్టరేట్లో పలుసార్లు ఫిర్యాదులు చేసినా ప్ర‘జల’ కష్టాలు తీరకపోవడం గమనార్హం. సిరిసిల్లలో మిషన్ భగీరథ స్వరూపం జనాభా : 1,10,000వార్డులు : 39నివాసాలు : 31,601ప్రస్తుతం ఉన్న నల్లాలు : 16,510పైపులైన్ పొడవు : 139.80 కిలోమీటర్లు అంతర్గత పైపులైన్ : 130.5 కిలోమీటర్లు ప్రధాన పైపులైన్ : 9.5 కిలోమీటర్లు నిర్మాణ వ్యయం : రూ.60కోట్లు ఈ ఫొటో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గుర్రపుకాలనీవాసుల కన్నీళ్ల కష్టాలకు నిలువెత్తు సాక్ష్యం. తమ కాలనీలో ముప్పై గడపలు ఉండగా.. రెండు పవర్బోర్లతో నీళ్లు అందేవి. పక్షం రోజులుగా రెండూ పాడయ్యాయి. 500 మీటర్ల దూరంలో ఉండే పొలాల్లోంచి ఇలా నీళ్లు ఎత్తుకొస్తున్నారు. ఇది సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మొదటి వార్డులోనిది. చంద్రంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాగునీటి సరఫరా అందకపోవడంతో ఇలా ఇంటి ముందు యజమానితో మాట్లాడి పాఠశాలకు పైపుద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ఈవిషయం మున్సిపల్ టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇది రగుడు ప్రాంతంలోని బోరు. దీని ద్వారానే నిత్యం వందలాది మంది నీరు తీసుకెళ్లేవారు. బోరులో నీరు ఎండిపోయి ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..?
జమ్మికుంట(హుజూరాబాద్): పరిపక్వతలేని ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణం తీసింది. ఇరు కుటుంబాల్లో ఎలాంటి నిర్బంధాలు లేవని, వారి ఫిర్యాదులతో తెలుస్తోంది. అయినా ఎందుకు ప్రాణాలు తీసుకున్నారో తేలాల్సి ఉందనే సందేహం కలుగుతోంది. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పాపయ్యపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై శనివారం రాత్రి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మెనుగు రాహుల్ (18)కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఏరుచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)తో పరిచయం ఏర్పడింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన రాహుల్ హైదరాబాద్లో ఎల్ఈడీ బల్బస్ ఈవెంట్ వర్క్స్ చేస్తుంటాడు. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి వద్ద ఉంటున్నాడు. శ్వేత కరీంనగర్లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్ కళాశాలకు వచ్చింది. కాగా శనివారం రాత్రి ఇద్దరూ జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివారులోని రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. గూడ్స్ డ్రైవర్ హారన్ మోగించినా పట్టాల పైనుంచి జరగకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య ప్రేమ ఎక్కడ, ఎలా చిగురించిందో తెలియదుగానీ, ఇద్దరూ ఏ నిర్బంధాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాజు ఫిర్యాదు ఇవ్వగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలియదని మృతురాలి తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఏదిఏమైనా ఇద్దరి ఆత్మహత్య ఘటన కారణాలు లేకుండా మిస్టరీగా మారింది. ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్, రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి ఆదివారం తెలిపారు. -
బెట్టింగ్తో భవిష్యత్ నాశనం
సిరిసిల్లక్రైం: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచనతో బెట్టింగ్ చేయడంతో భవిష్యత్ నాశనమవుతుందని ఎస్పీ మహేశ్ బి.గీతే పేర్కొన్నారు. యాప్స్లలో బెట్టింగ్కు పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వీటికి అలవాటు పడి యువత ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు. సోషల్మీడియా వేదికగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్లను ప్రమోట్ చేసే వారి సమాచారం అందించాలని కోరారు. నిఘా కఠినం చేసి బెట్టింగ్ తదితరాలను యువతకు తెలిపే వారిపై కేసు నమోదు చేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామన్నారు. ● ఎస్పీ మహేశ్ బి.గీతే -
చేనేత అద్భుతాలు
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు ● నిందితుల్లో నలుగురు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే ● మరింత మంది కోసం గాలిస్తున్న టీసీఎస్బీ ● విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటున్న విదేశాంగశాఖ ● నిందితులపై కరీంనగర్ పోలీసుల లుక్ అవుట్ నోటీసులుసిరిసిల్ల: సృజనాత్మకతతో చేనేత కళాకారుడు తన వృత్తికే వన్నె తెస్తున్నాడు. దారం పోగులతో అబ్బురపరిచేలా వస్త్రాలపై చిత్రాలు నేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. అగ్గి పెట్టెలో పట్టే చీర, ఉంగరంలోంచి దూరిపోయే చీరలను నేసి అబ్బుర పరిచాడు. వెల్ది హరిప్రసాద్ కళాత్మక వస్త్రోత్పత్తులపై సండే స్పెషల్..● సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ సృజన ● ప్రశంసించిన ప్రధాని మోదీ ● తిలకించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 8లోu -
సభ్యత్వ నమోదులో ముందంజ
● జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలి ● మహిళా కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి సుగుణ సిరిసిల్లటౌన్: సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని, అదే స్ఫూర్తితో జిల్లాను రాష్ట్రంలోనే ముందువరుసలో నిలపాలని మహిళా కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి సుగుణ పేర్కొన్నారు. డీసీసీ ఆఫీస్లో శనివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గత సెప్టెంబర్ 15 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, రాష్ట్ర నాయకులు గోవిందమ్మ, సుమలత, ఏఎంసీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, కాంగ్రెస్ యూనియన్ నాయకురాలు మడుపు శ్రీదేవి, బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరాబేగం, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా జనరల్ సెక్రెటరీ కోడం అరుణ, సుధా రోజా, లత, హారికరెడ్డి, వనిత, సానియా, లత పాల్గొన్నారు. 21న హుండీలు లెక్కింపు సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని శివసాయిబాబా ఆలయంలో ఈనెల 21న హుండీలు లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు హుండీల లెక్కింపు ఉంటుందని ప్రజలు పాల్గొనాలని కోరారు. నేడు నీటి సరఫరాలో అంతరాయం వేములవాడఅర్బన్: వేములవాడ మండలం తెట్టకుంట శివారు 120 ఎంఎల్డీ నీటిశుద్ధి కేంద్రంలోని తాగునీటి పంప్హౌస్లో మరమ్మతులు చేపడుతున్నట్లు మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శేఖర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా ఆదివారం వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి మున్సిపాలిటీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. తిరిగి సోమవారం యథావిధిగా నీటి సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూచాళ్లు ఎత్తుకుపోతుంటారు. కానీ అన్నీ తెలిసిన యువతకు కొలువుల గాలమేసి విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మనుషులను సంతలో పశువుల్లా విక్రయించే వారి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని భా
ఎలా తరలిస్తారు? గుజరాత్ పోరుబందర్కు చెందిన హితేశ్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రాజశేఖర్ ఈ మానవ అక్రమ రవాణాలో కింగ్పిన్లని పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. మార్చి 10, 11 తేదీల్లో బాధితులను మయన్మార్లోని మైవాడీ జిల్లా నుంచి థాయ్లాండ్లోని మైసోట్ నగరానికి, ఆ పై మన దేశ రాజధాని ఢిల్లీకి తరలించాయి. అక్కడ నుంచి వచ్చిన బాధితుల ద్వారా సీబీఐ, ఎన్ఐఏ, రాష్ట్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ)లు మోసం ఎలా జరిగిందో వివరాలు రాబట్టాయి. ఆయా ఏజెన్సీలకు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల్లో కొలువుల కోసం చూస్తున్న అమాయకులకు తొలుత టెలీగ్రామ్ యాప్లో లింకులు పంపుతారు. అనంతరం వీరికి జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ, టైపింగ్ స్పీడ్ పరీక్షించి ఎంపిక చేస్తారు. వీరినుంచి రూ.3లక్షల వరకు ఉద్యోగం ఇచ్చినందుకు వసూలు చేస్తారు. ఇవ్వని వారినీ ఏమీ అనకుండా ఉచితంగా విమాన టికెట్ పంపుతారు. తీరా థాయ్లాండ్ వెళ్లాక..అక్కడ అవసరాన్ని బట్టి.. మయన్మార్, థాయ్లాండ్, లావోస్లకు సరఫరా చేస్తారు. పాస్పోర్టు లాక్కుని సైబర్ నేరాలు చేయాలని చిత్రహింసలకు గురిచేస్తారు. -
ప్రజాసేవతోనే ఆత్మసంతృప్తి
● ఎన్ఆర్ఐ డాక్టర్ లక్ష్మణ్రావు ● 873 మందికి ఉచిత పరీక్షలు ● 70 మందికి కంటి ఆపరేషన్లు ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసేవతోనే ఆత్మసంతృప్తి కలుగుతుందని, పురిటిగడ్డ రుణం తీర్చుకునే అవకాశం లభించిందని అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ అయ్యప్ప ఆలయంలో పది రోజులు నిర్వహించిన కంటి మెగా వైద్యశిబిరం శనివారం ముగిసింది. డాక్టర్ లక్ష్మణ్రావు మాట్లాడుతూ అమెరికాలో 40 ఏళ్లుగా ఫిజీషియన్గా పనిచేశానన్నారు. మాతృదేశంలో సేవ చేయాలని కల్వకుంట్ల రమాదేవి జ్ఞాపకార్థం శంకర నేత్రాలయ సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 873 మందికి కంటి పరీక్షలు చేసి, ఇక్కడే 70 మందికి కంటి ఆపరేషన్లు చేసినట్లు వివరించారు. మరో 113 మందిని చైన్నెకి రిఫర్ చేశామన్నారు. అయ్యప్ప ఆలయంలో రూ.3లక్షలతో వాటర్ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. లక్ష్మణ్రావును ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ శంకర్, రాజుగురుస్వామి సత్కరించారు. నవీన్రావు, సడిమెల ఎల్లం, నాగరాజు, సంతోష్, గిరి, నందు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం
వేములవాడ: వేములవాడలో రోడ్లపైనే కూరగాయలు అమ్ముకుంటున్న వైనంపై ‘సాక్షి’లో ఈనెల 15న ‘రోడ్లపైనే విక్రయాలు’ శీర్షికను కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ శనివారం వివరణ ఇచ్చారు. శామకుంటలో నిర్మించిన భవనంలో వంద మంది వ్యాపారులకు అవకాశం కల్పించామని, తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని, బైపాస్రోడ్డులోనే వ్యాపారులు, స్థానికులకు సౌకర్యాలతో రూ.40లక్షలతో ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ● వేములవాడ కమిషనర్ అన్వేశ్ -
భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోం
● ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి వేములవాడ: రాజన్న దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోబోమని ఈవో కొప్పుల వినోద్రెడ్డి హెచ్చరించారు. ఆలయ పరిసరాల్లోని బెల్లం, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాలను శనివారం పరిశీలించారు. బెల్లం ముద్దలను పరిశీలించి, తూకం వేసి చూశారు. కొబ్బరికాయ కొట్టే స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఏఈవోలు శ్రవణ్, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కూరగాయల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వంతెన కోసం మహాధర్నాగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, లింగన్నపేటల మధ్య మానేరువాగుపై హైలెవల్ వంతెన పనుల్లో వేగం పెంచాలని కోరుతూ పలు పార్టీల నాయకులు శనివారం మహాధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ పనులను చూస్తుంటే రానున్న వర్షాకాలం వరకు కూడా పనులు పూర్తయ్యేలా లేవన్నారు. శివసేన రాష్ట్ర నాయకులు గౌటె గణేశ్, బీజేపీ జిల్లా నాయకులు కొక్కు దేవేందర్యాదవ్, పెద్దూరి పర్శాగౌడ్, కృష్ణకాంత్యాదవ్, శ్రావణ్యాదవ్, దేవాగౌడ్, ప్రజా బంధు పార్టీ జిల్లా నాయకుడు దోసల చంద్రం, పార్థసారధిశర్మ తదితరులు పాల్గొన్నారు. -
సీఎమ్మార్ఎఫ్ చెక్కుల అక్రమదందాపై విచారణ చేపట్టాలి
● జెడ్పీ మాజీ వైస్చైర్మన్ సిద్ధం వేణు ఇల్లంతకుంట(మానకొండూర్): మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కేంద్రంగానే సీఎమ్మార్ఎఫ్ చెక్కుల అక్రమదందా కొనసాగుతోందని, నియోజకవర్గంలో రూ.50లక్షల వరకు చెక్కులు చేతులు మారాయని జెడ్పీ మాజీ వైస్చైర్మన్ సిద్ధం వేణు ఆరోపించారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంటలోని బీఆర్ఎస్ ఆఫీస్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. రహీంఖాన్పేటలో అక్రమంగా చెక్కు డ్రా చేసుకున్న సంఘటనలో అసలు వ్యక్తిని వదిలి గ్రామస్థాయి కార్యకర్తను సస్పెండ్ చేశారన్నారు. బెజ్జంకి, వల్లంపట్ల గ్రామాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఏసీబీ అధికారులతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. బొల్లం వెంకన్న, ఎండీ సాదుల్, కూనబోయిన రఘు, కూస నరేశ్, చదువాల పర్శరామ్, సత్యం పాల్గొన్నారు. -
వస్త్రోత్పత్తి ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయండి
● నూలును వస్త్రోత్పత్తిదారులు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు ● టెస్కో సీజీఎం వెంకటేశ్వర్రావు ● సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులతో సమీక్ష సిరిసిల్ల: ప్రభుత్వం ఇచ్చిన వస్త్రోత్పత్తి ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని టెస్కో చీఫ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్రావు కోరారు. స్థానిక ఇంది రానగర్ ఏఎంసీ గోదాంలో శనివారం వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాలు, మహిళాశక్తి చీరల ఉత్పత్తులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటికే స్కూల్ యూనిఫామ్స్కు సంబంధించి 1.05 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చామని, మహిళాశక్తి చీరలకు సంబంధించి 2.12 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించినట్లు తెలిపారు. నూలు డిపో ద్వారా పరిమితమైన మ్యాక్స్లకు సరఫరా అవుతుందని, ఆర్థికంగా ఉన్న యజమానులు నేరుగా కొనుగోలు చేసి వస్త్రాలను తయారు చేయాలన్నారు. టెస్కో జీఎం అశోక్రావు మాట్లాడుతూ ఇతర వస్త్రాల ఉత్పత్తులను పక్కన పెట్టి ప్రభుత్వం అందించిన ఆర్డర్ల బట్టను ఉత్పత్తి చేయాలని కోరారు. ఆర్డర్లను ఆలస్యం చేస్తే.. భవిష్యత్లో ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకు రాకుండా పోతాయని వివరించారు. ముందుగా ఆర్వీఎం వస్త్రాలను అందించాలని కోరారు. ఓఎస్డీ హిమజకుమార్, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, డీవో రవీందర్రెడ్డి, నూలు డిపో ఇన్చార్జి శంకరయ్య, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు గోవిందు రవి, తాటిపాముల దామోదర్, బూట్ల నవీన్కుమార్, మండల బాలరాజు, యెల్దండి శంకర్, వేముల దామోదర్, చిమ్మని ప్రకాశ్, బీమని రామచంద్రం పాల్గొన్నారు. -
కమనీయం.. నృసింహుని కల్యాణం
రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని శ్రీ ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణాన్ని శుక్రవారం గంగపుత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం గంగపుత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు దేశవేని ధర్మేందర్, సభ్యులు భూమయ్య, శ్రీనివాస్, భూమేశ్, గంగాధర్, విక్రమ్, వినోద్, రాజశేఖర్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): ముస్కానిపేటలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా ఆలయంలో వివిధ హోమాలు, పూజాకార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయం వద్ద అన్నదాన చేశారు. ఆలయ చైర్మన్ బద్దం హనుమంతరెడ్డి, కార్యవర్గం, గ్రామ ప్రముఖులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. -
కాల్వ పనులు పూర్తి చేయండి
● కేంద్రమంత్రికి వినతిపత్రం ఇల్లంతకుంట(మానకొండూర్): రంగనాయకసాగర్ నుంచి ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఎల్ఎం–6 కాల్వ పనులు పూర్తి చేసేందుకు సహకరించాలని దీక్ష చేస్తున్న రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు విన్నవించారు. కరీంనగర్లో శుక్రవా రం కలిసి ఈమేరకు వినతిపత్రం అందించి మాట్లాడారు. గత పన్నెండు రోజులుగా దీక్ష చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రెండు కిలోమీటర్ల కాల్వ పూర్తిచేస్తే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని 9,500 ఎకరా లకు సాగునీరు అందుతుందన్నారు. భూమల్ల అనిల్కుమార్, వెన్నమనేని శ్రీధర్రావు, అమ్ముల అశోక్, పయ్యావుల బాలయ్య, గాదె మధుసూదన్, మల్లేశం ఉన్నారు. నేడు గౌరపూర్ణిమ వేడుకలు సిరిసిల్లకల్చరల్: అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని నూతన ఆలయ ప్రాంగణంలో శ్రీగౌర పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ స్థానిక ఇన్చార్జి ప్రాణనాథ అచ్యుతానంద్ దాస్ తెలిపారు. సిరిసిల్లలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా నిర్వహించే వేడుకలో హైదరాబాద్ నుంచి సుమారు 150 మందితోపాటు స్థానిక పరిసర గ్రామాల నుంచి 2వేలకు పైగా భక్తులు వస్తున్నారని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడికి జలాభిషేకం, ఫల పంచామృతాభిషేకాలు, హరినామ సంకీర్తనలు నిర్వహిస్తామని వివరించారు. ఇస్కాన్ ప్రతి నిధులు మంగళారపు ప్రభాకర్ పాల్గొన్నారు. నేడు ‘సఖీ’ కేంద్రం పోస్టులకు ఇంటర్వ్యూ సిరిసిల్ల: సఖీ కేంద్రంలోని పోస్టులకు శనివారం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం శుక్రవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో క్రీడాపోటీలు సిరిసిల్లకల్చరల్: నెహ్రూ యువకేంద్రం, బీసీ యూత్ అసోసియేషన్ సంయుక్తంగా ఆది, సోమవారాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్వైకే మాజీ వలంటీర్ గంగిపెల్లి స్వామికుమార్ తెలిపారు. అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే స్పోర్ట్స్మీట్లో వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, షాట్పుట్, రన్నింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వారు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల జట్లు 81214 58893, 95153 99531లలో సంప్రదించాలని సూచించారు. నేత్రపర్వంగా రథోత్సవం చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం కనులపండువగా సాగింది. ఆలయంలో ఉదయం 10 గంటల వరకు నిత్యారాధన, 10.30 గంటలకు రథహోమం, పూర్ణాహుతి, రథ బలిహరణ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం జరిపించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండ లక్ష్మ ణ్గౌడ్, గౌరవ అధ్యక్షుడు ఏనుగు లచ్చిరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కటకం చంద్రయ్య, నాయకులు మల్యాల గంగనర్సయ్య, లింగంపల్లి బాబు, అంబాల శ్రీకాంత్, గంప పవన్, కటకం రవి, అటుకుల మధు, గ్రామస్తులు పాల్గొన్నారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య, ప్రొబేషనరీ ఎస్సై అనిల్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. -
● మార్కెట్లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ తేడాలు ● అధికారుల తనిఖీలు కరువు ● నేడు వినియోగదారుల దినోత్సవం
సిరిసిల్లకల్చరల్: మార్కెట్లో అడుగడుగునా మోసాలే. తూకం నుంచి మొదలుపెడితే వస్తువు నాణ్యత వరకు అంతా ౖపైపె మెరుగులే. వ్యాపారం చేసేందుకు ప్రసారం చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా వస్తువుల నాణ్యత ఉండడం లేదు. నిర్ధిష్ట పరిణామాల ప్రకారం వస్తువులు సైతం లభించడం లేదు. ఫలితంగా వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. అవగాహన లేక వినియోగదారులు తమ హక్కుల కోసం పోరాడడం అటుంచితే కనీసం ప్రశ్నించడం లేదు. మార్కెట్లో దొరికిందే వస్తువు.. చెప్పిందే ధరగా నడుస్తోంది. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మార్కెట్లో జరుగుతున్న మోసాలపై ‘సాక్షి’ ఫోకస్. ఆన్లైన్ మోసాలు.. ఆధునిక చట్టాలు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయడం తయారీదారుడి బాధ్యత.. లోపం లేని వస్తు సేవలు పొందడం కొనుగోలుదారుడి ప్రధాన హక్కు. అయితే ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కొనుగోలుదారులను మోసం చేస్తూనే ఉన్నారు. అయితే నష్టపోయిన వినియోగదారులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1986లో వినియోగదారుల చట్టం తీసుకొచ్చింది. కాలక్రమేన వ్యాపార సరళిలో మార్పులు వచ్చాయి. ఆన్లైన్లో కొనుగోళ్లు పెరిగిపోయాయి. కొత్త రకం మోసాలకు తెరలేచిన వేళ 2019లో దీనికి అనుబంధంగా మరో కొత్త చట్టాన్ని అమలు చేసింది. అక్రమ వాణిజ్య పద్ధతులు, మోసపూరిత ప్రకటనలపై కొరడా ఝుళిపించేలా చట్టాలను రూపొందించింది. వినియోగదారుల రక్షణ మండళ్లు, మధ్యవర్తిత్వ ప్యానెళ్ల ఏర్పాటుతోపాటు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, వీడియో కాన్ఫరెన్స్లో కేసుల పరిష్కారం వంటి కొత్త విధానాలను పొందుపరిచింది. వినియోగదారుల ఫోరాన్ని ఇలా ఆశ్రయించాలి కొన్న వస్తువులో నాణ్యతలోపం, సేవల్లో నిర్లక్ష్యం, తూకంలో తేడా, నకిలీవస్తువు.. అని గుర్తించిన పక్షంలో సదరు వ్యాపారీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. రూ.20లక్షలలోపు పరిహారానికి జిల్లా ఫోరంలో, రూ.కోటి లోపు రాష్ట్ర ఫోరంలో, అంతకుమించి పరిహారం కోసం జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో జాడ లేని వినియోగదారుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన జిల్లాల్లో వినియోగదారుల కమిషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఇప్పటికీ కొత్త జిల్లాల్లో కమిషన్లు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఫోరం కమిషన్గా పరిణామం చెందింది. కానీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఏళ్లుగా కమిషన్కు చైర్మన్ను నియమించలేదు. కమిషన్లో సరిపడినంత సిబ్బంది లేరు. ఇప్పటికీ 720 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సగటున నెలకు 21 నుంచి 25 కేసులు నమోదవుతున్నాయి. చట్టంపై అవగాహన పెంచాలి వినియోగదారుల హక్కులను రక్షించేందుకు రూపొందించిన చట్టంపై మొదట్లో కొంత ప్రచారం జరిగింది. కానీ కొన్నేళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అవగాహన పెంచాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా రక్షణ మండళ్లను ఏర్పాటు చేయాలి. చట్టంపై అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు రూపొందించాలి. వ్యాపార సంస్థల్లో సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలి. ప్రజలు కూడా ఈ చట్టాన్ని వినియోగించుకునేందుకు ముందుకు రావాలి. – బియ్యంకార్ శ్రీనివాస్, పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడుఅంతా కనికట్టు.. మోసం కనిపెట్టు ఓవైపు పెట్రోలు కల్తీ ..మరోవైపు కొలతల్లో తేడాలు...అంతేకాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం.. ఇదీ ఉమ్మడి జిల్లాలో అధిక శాతం పెట్రోలు బంకుల్లో పరిస్థితి. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం..అవగాహన లోపం.. బంకుల యాజమాన్యాలకు కలసివస్తోంది. 8లోu -
రాష్ట్రంలో రాక్షస పాలన
● కేసీఆర్పై సీఎం వ్యాఖ్యలు శోచనీయం ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ● సిరిసిల్లలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనంసిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు, మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అక్రమాలను, అరాచక పాలనను ఎండగడుతున్న జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం హేయమైన చర్యగా విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాష్ట్ర సమితి పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, నాయకులు బొల్లి రామ్మోహన్, గజభీంకార్ రాజన్న, పడిగల రాజు పాల్గొన్నారు. -
● ఎండాకాలంలో అటవీజంతువులకు అండగా.. ● నీటికుండీలు ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు ● నిత్యం ట్యాంకర్ల ద్వారా నింపుతున్న వైనం ● జిల్లాలో 78 నీటి తొట్టీలు ● మండు వేసవిలో దాహార్తి తీర్చుకుంటున్న వన్యప్రాణులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎండాకాలంలో అటవీలోనూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. వాగులు, వంకలు, చెలిమెల్లో నీరింకిపోయింది. ఈక్రమంలో దాహార్తి తీర్చుకునేందుకు అటవీ జంతువులు అల్లాడుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గ్రామాల శివారులోని పంటపొలాలకు నీటి కోసం వన్యప్రాణులు వస్తున్నాయి. ఈక్రమంలో రైతులు పెడుతున్న విద్యుత్ కంచెలకు తాకి కరెంట్ షాక్తో చనిపోతున్నాయి. ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు అటవీశాఖ అధికారులు ముందుకొచ్చారు. అడవిలోనే వన్యప్రాణులు దప్పిక తీర్చుకోవడానికి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు రేంజ్ల పరిధిలో 78 నీటి కుండీలను ఏర్పాటు చేసి వాటికి తాగునీరు అందిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పశ్చిమ డివిజన్లో దట్టమైన అటవీ ప్రాంతం రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉంది. ఇక్కడ పచ్చని అడవి విస్తరించి ఉండడంతో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో వన్యప్రాణులు బతుకుతున్నాయి. వర్షాకాలం, శీతాకాలాల్లో అటవీలోని నీటివనరుల్లో దాహార్తి తీర్చుకునేవి. ప్రస్తుతం ఎండలు ముదిరిపోవడంతో ఫారెస్ట్లోని నీటి వనరులు అడుగంటిపోయాయి. ఆకురాలే కాలంలో అడవిలో ఆహారం దొరక్క, నీరు లేక జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మజంగల్, చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, జగిత్యాల జిల్లా మల్యాల ప్రాంతాల్లో వన్యప్రాణులు చనిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కోతులు నీటి కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. అటవీ జంతువులు గ్రామాల్లోకి నీటి కోసం రావడం ప్రమాదాలకు గురి కావడం జరుగుతోంది. దీంతో గ్రామీణులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వన్యప్రాణుల ఇబ్బందులను గుర్తించిన అధికారులు దట్టమైన అడవిలో నీటి తొట్టిలను ఏర్పాటు చేసి నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. రెండు రేంజ్ల పరిధిలో.. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు ఫారెస్ట్ రేంజ్లు సిరిసిల్ల, వేములవాడ. సిరిసిల్ల రేంజ్ పరిధిలో 58 నీటితొట్టీలు, సాసర్లను నిర్మించారు. వీటిలో నీటిని నింపేందుకు 3 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వేములవాడ రేంజ్ పరిధిలో 20 నీటి తొట్టిలను గతంలోనే ఏర్పాటు చేశారు. అవే తొట్టిలలో అధికారులు నిత్యం నీరు నింపుతూ.. వన్యప్రాణుల దహార్తిని తీర్చుతున్నారు. కాగా ఎల్లంపల్లి కాలువల ద్వారా వేములవాడ రేంజ్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కాలువలు ఉండడం మూలంగా అక్కడే జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నట్లు అధికారులు చెపుతున్నారు. దాహార్తిని తీరుస్తున్నాం.. ఎండాకాలంలో అడవిలో నీటి వనరులు ఎండిపోతుంటాయి. ఈ నేపథ్యంలో అటవీ జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటితొట్టీలు, సాసర్లను నిర్మించి, ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. వన్యప్రాణులు కుండీల వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా.. శాఖాపరంగా నీటితొట్టీలను ఏర్పాటు చేస్తున్నాం. వన్యప్రాణుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీహరిప్రసాద్, సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి -
అందని దారం.. వ్రస్తోత్పత్తి ఆగం
సిరిసిల్ల: సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులు, చేనేత, జౌళిశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపం.. వ్రస్తోత్పత్తికి శాపంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే వ్రస్తోత్పత్తి ఆర్డర్లకు నూలు (దారం) సరఫరా చేస్తామని ముందుగా అధికారులు ప్రకటించి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశారు. కానీ, సిరిసిల్లలో వ్రస్తోత్పత్తికి అవసరమైన నూలును సకాలంలో అందించడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈనెల 15 నాటికి అందించాల్సిన ఆర్వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వ్రస్తాల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది. సిరిసిల్లలోని పాతికవేల మరమగ్గాల (పవర్లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వ్రస్తాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. దానికి అవసరమైన నూలు అందించలేదు. దీంతో గడువులోగా వ్రస్తాల తయారీ కష్టంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి గండి స్కూళ్లు తెరిచే నాటికి (జూన్ మొదటి వారంలో) అన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లోని పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు డిసెంబర్లో సిరిసిల్ల నేతన్నలకు కోటి ఐదు లక్షల మీటర్ల వ్రస్తాల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి అవసరమైన నూలును డిపో ద్వారా అందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయి.. సిరిసిల్లలోని నేతన్నలకు వేములవాడలోని నూలు డిపో ద్వారా నూలు సరఫరా అయ్యే సరికి ఫిబ్రవరి అయింది. వచ్చిన నూలుకు ఆసాములు పది శాతం మేరకు డీడీలు చెల్లించి, నూలు తీసుకుని వచ్చి భీములుగా పోసి సాంచాలపైకి ఎక్కించారు. ప్రస్తుతం పది లక్షల మీటర్ల వస్త్రాలు సిద్ధంగా ఉండగా.. భీములపై మరో పది లక్షల మీటర్ల వస్త్రం రెడీ అవుతోంది. మొత్తంగా 20 లక్షల మీటర్లు మరో వారంలోగా సిద్ధమైనా.. ఈ నెలాఖరులోగా 50 శాతం వ్రస్తోత్పత్తి లక్ష్యం అసాధ్యమే. ఈ లెక్కన వ్రస్తాల సేకరణ పూర్తయి, యూనిఫామ్స్ కుట్టి, బడి తెరిచే నాటికి రెండు జతల డ్రెస్సులు అందించాలనే లక్ష్యం సాధించడం కష్టంగానే ఉంది.సమస్య ఏంటంటే..!ప్రభుత్వం టెస్కో ద్వారా సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ (మ్యాక్స్)లకు వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం, ఇక్కడ మాస్టర్ వీవర్స్ (యజమానులు) నూలును కొనుగోలు చేసి ఆసాముల (పవర్లూమ్స్ యజమానులు)కు ఇవ్వడం, వారు సాంచాలు నడుపుతూ, కార్మికులతో పని చేయిస్తూ.. బట్ట నేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా నాణ్యమైన నూలు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు సకాలంలో అందించలేదు. ఇప్పుడు ప్రైవేటుగా కొనుగోలు చేసి స్కూల్ యూనిఫామ్స్ బట్టను నేయాలని యజమానులను జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఆలస్యంగా నూలు ఆర్డర్లు ఇవ్వడంతో వ్రస్తోత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇటీవల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సిరిసిల్ల కలెక్టరేట్లో వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఈనెల 15లోగా 50 శాతం బట్ట ఇవ్వాలని కోరారు. కానీ ఆ మేరకు సిరిసిల్లలో వ్రస్తాల నిల్వలు లేవు.మహిళాశక్తి చీరల ఊసేది?సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 8న ఇందిరా మహిళా శక్తి పేరిట స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75 కోట్లు ఉంటుంది. కానీ, దానికి సంబంధించిన నూలును ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. మొదటి విడతకే మోక్షం లేక వ్రస్తోత్పత్తిదారులు రెండో విడత ఆర్డర్లు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగుల), వెప్ట్ (అడ్డం కోముల పోగుల) నూలు అందుబాటులో ఉండటం లేదు. వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను మగ్గంపై నేసే అవకాశం ఉంది. ఒకటి ఉండి ఒకటి లేక వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతుండగా, ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి మరింత ఆలస్యం కానుంది.ఆలస్యమైనా లక్ష్యం సాధిస్తాంకొంత ఆలస్యమైనా వ్రస్తోత్పత్తిలో లక్ష్యం సాధిస్తాం. ఈ మేరకు సిరిసిల్లలోని వ్రస్తోత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా నూలు డిపో ఏర్పాటు చేసి నూలు సరఫరా చేస్తున్నాం. ప్రైవేటుగా కూడా నూలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పాం. డిపో ద్వారా అందరికీ నూలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటాం. – వులిశె అశోక్రావు, టెస్కో జీఎం, హైదరాబాద్ -
పనిచేసే వారికి గుర్తింపు
● బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్కు చెందిన దుంపెన స్రవంతిని బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషిచేయాలని కోరారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డిలకు స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.అద్దె వాహనానికి దరఖాస్తులుసిరిసిల్లకల్చరల్: సీ్త్ర, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న బాల రక్షాభవన్ కార్యకలాపాల కోసం అద్దె ప్రాతిపదికన వాహనం కావాలని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం ప్రకటనలో కోరారు. ఆసక్తిగల వాహన యజమానులు ఈనెల 18లోపు కలెక్టరేట్లోని సంక్షేమాధికారి ఆఫీస్లో రూ.2500 డీడీతో ప్రతిపాదనలు అందజేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్ అవసరం ఉందని డీడబ్ల్యూవో లక్ష్మీరాజం తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యార్హతతోపాటు లైసెన్స్, బ్యాడ్జ్ ఉండాలని పేర్కొన్నారు. ఈనెల 18లోపు దరఖాస్తులను డీడబ్ల్యూవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉపాధి పనులు తనిఖీ వీర్నపల్లి(సిరిసిల్ల): మండలకేంద్రంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను డీఆర్డీవో శేషాద్రి, హెచ్ఆర్ మేనేజర్ నాగరాజుతో కలిసి గురువారం తనిఖీ చేశారు. వారు కూలీలతో మాట్లాడుతూ... కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా ఉదయమే త్వరగా పనులు పూర్తిచేసుకోవాలని సూచించారు. అనంతరం మండల కార్యాలయంలో సాంకేతిక సహాయకులతో సమీక్ష నిర్వహించి కూలీల సంఖ్యను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీహరి, సాంకేతిక సహాయకులు అనిత, గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
సూరీడు ‘మార్చి’ఫాస్ట్
జిల్లాలో ఈనెల 10 నుంచి 13 వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలుజిల్లా 10 11 12 13 కరీంనగర్ 38.1 38.7 39.9 39.4 జగిత్యాల 38.6 39.1 40.3 39.9 పెద్దపల్లి 39.3 39.6 40.3 40.0 సిరిసిల్ల 39.8 39.5 40.0 38.7 జగిత్యాలఅగ్రికల్చర్/కరీంనగర్అర్బన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 14 నుంచి 17 వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వడగాలులు వీచే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. 15న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
భూకబ్జాలపై సీరియస్
● బాధితులకు న్యాయం జరిగేలా చూస్తా ● గంజాయి నిర్మూలనే లక్ష్యం ● యువత చదువుతో ఉన్నతంగా ఎదగాలి ● జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే ● సాక్షి ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడిసిరిసిల్లక్రైం: జిల్లాలో భూకబ్జాలపై సీరియస్గా వ్యవహరిస్తూనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే పేర్కొన్నారు. గంజాయిని నిర్మూలించడం.. గెట్టు పంచాయితీలు న్యాయపరంగా పరిష్కరించడం.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ బి.గీతే ‘సాక్షి’తో మాట్లాడారు. ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. -
వందశాతం పన్నులు వసూలు చేయాలి
సిరిసిల్ల: వంద శాతం ఇంటి పన్నులు ఈనెలాఖరులోగా వసూలు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల పంచా యతీ అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్నుల వసూళ్ల లక్ష్యం సాధించాలన్నారు. ఆస్తి పన్ను చెల్లించని వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, అవసరమైన చోట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్నుల విలువ పెంచాలని, రీ అసెస్మెంట్ చేసి వసూలు చేయాలని సూచించారు. సకాలంలో ట్రేడ్లైసెన్స్ రెన్యూవల్ జరిగేలా చూడాలని, ట్రేడ్లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే సీజ్ చేయాలన్నారు. మల్టీపర్పస్ సిబ్బంది వేతనాలు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని తెలిపారు. పారిశుధ్యంపై దృష్టి సారించాలి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో అపరిశుభ్రత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లను రెగ్యులర్గా శుభ్రం చేయాలని, ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్త సేకరించాలని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన 25 శాతం రీబేట్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, డీఎల్పీవో నరేశ్, డీటీసీపీవో అన్సార్, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలి కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
ఫిర్యాదులపై స్పందించాలి
● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి చందుర్తి(వేములవాడ): పోలీస్స్టేషన్లో వివిధ స మస్యలపై వచ్చిన ఫిర్యాదు చేసే వారిపై మర్యాదగా వ్యవహరిస్తూ పరిష్కరించాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి కోరారు. చందుర్తి ఠాణాను గురువారం తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. కేసుల రికార్డులు, జీడీబుక్లను పరిశీలించా రు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని, స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. కానిస్టేబుళ్లు తమ విధులను సమయానికి అనుగుణంగా నిర్వర్తించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చందుర్తి సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య పాల్గొన్నారు. -
పైసలు పడ్డాయా !
● సెల్ఫోన్కు మెసేజ్ వస్తే చాలు అలర్ట్ ● సర్వే డబ్బులు వచ్చాయేమోనని తనిఖీ ● సమగ్ర కుటుంబ సర్వే పూర్తయి మూడు నెలలు ● సిబ్బందికి అందని పారితోషికం ● ఇటీవల కలెక్టర్కు మొరపెట్టుకున్న ఆపరేటర్లుసిరిసిల్ల: ట్రింగ్మని మెసేజ్ సౌండ్ వస్తే చాలు సెల్ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు.. డబ్బులు జమకాలేదని తెలుసుకొని ఉసూరుమంటున్నారు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బంది. సర్వే పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా పారితోషికం డబ్బులు రాకపోవడంతో ఇటీవల కొందరు జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ఝాకు ప్రజావాణిలో విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా 1,488 మంది ఎన్యూమరేటర్లు, 160 మంది సూపర్వైజర్లు, 1,300 మంది కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. వీరంతా పారితోషికం కోసం ఎదురుచూస్తున్నారు. 45 రోజులు సర్వే పనులు జిల్లా వ్యాప్తంగా 45 రోజులపాటు సామాజిక సర్వే చేపట్టారు. ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సీవోలు, డీఆర్డీఏ సిబ్బంది, జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు భాగస్వాములయ్యారు. ఎన్యూమరేటర్కు రూ.10వేలు, సూపర్వైజర్కు రూ.12వేలు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.12వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుని.. సామాజిక సర్వేలో భాగస్వాములైన అందరి బ్యాంకు అకౌంట్ నంబర్లను మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు సేకరించారు. సర్వే పూర్తయిన తరువాత డబ్బులు వస్తాయని జిల్లాస్థాయి అధికారులు నమ్మకంగా చెప్పడంతో ఎంతో ఆశతో సర్వేను సమగ్రంగా సకాలంలో పూర్తిచేశారు. నవంబరు, డిసెంబరు నెలల్లో సర్వే పూర్తి కాగా.. పారితోషికం మాత్రం రాలేదు.సర్వే స్వరూపం గ్రామాలు: 261 పట్టణాలు: సిరిసిల్ల, వేములవాడ మండలాలు : 12 కుటుంబాలు : 1,90,626 జనాభా : 5,52,037 ఎన్యూమరేటర్ బ్లాక్లు : 1,468 ఎన్యూమరేటర్లు : 1,488 సూపర్వైజర్లు : 160 కంప్యూటర్ ఆపరేటర్లు : 1,300ప్రభుత్వానికి నివేదిక అందించాం జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, ఆపరేటర్లకు సంబంధించిన పారితోషికం కోసం ప్రభుత్వానికి నివేదిక అందించాం. సబ్ట్రెజరీ ద్వారా టోకెన్ నంబరు పడింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే.. వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తాం. డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అది మా పరిధిలో లేదు. – పీబీ శ్రీనివాసాచారి, జిల్లా ప్రణాళికాధికారి -
వేసవిలో జాగ్రత్తలు వివరించాలి
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం పీహెచ్సీల వైద్యులతో సమావేశమయ్యారు. డీఎంహెచ్వో మాట్లాడు తూ వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యాలను సాధించా లని, వ్యాక్సినేషన్ చేయాలని, ఆస్పత్రిలో ప్రసవాలు, గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహారలోపం లేకుండా చూడాలన్నారు. అవసరమైన మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు అనిత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాల్వపనులు పూర్తి చేయండి ఇల్లంతకుంట(మానకొండూర్): కాల్వపనులు పూర్తి చేసి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల రైతులను ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నారం నర్సయ్య కోరారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో 11 రోజులుగా రైతులు చేస్తున్న రిలేనిరాహార దీక్షలను గురువారం సందర్శించి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న 3 కిలోమీటర్ల కాల్వ పనులు పూర్తి చేస్తే 9,500 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. మున్సిపల్ దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ కోసం నిర్మించిన దుకాణాల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్య ప్రకటనలో తెలిపారు. పట్టణంలో గుర్తింపు గల వీధివిక్రయదారులు తమ గుర్తింపుకార్డులు, వెండింగ్ ఫొటో, పాస్పోర్టు సైజు ఫొటోతో దరఖాస్తులను ఈనెల 20లోపు మెప్మా సెక్షన్లో అందించాలని కోరారు. డ్రా పద్ధతిలో దుకాణాలు అందజేయనున్నట్లు తెలిపారు. 21న హుండీల లెక్కింపు సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని ఆలయాల్లో ఈనెల 21న హుండీల లెక్కింపు చేపడుతున్నట్లు ఈవో మారుతీరావు తెలిపారు. ఈమేరకు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు పోచమ్మ ఆలయం, ఉదయం 11.30 గంటలకు శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీవిశ్వనాథ ఆలయాల్లో హుండీలు లెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఎం రాజీలేని పోరాటాలు చేస్తోందని సీఐటీయూ కన్వీనర్ కోడం రమణ పేర్కొన్నారు. ముస్తాబాద్లో గురువారం కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 16న సిరిసిల్లలో సీపీఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉందన్నారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ వస్తున్నట్లు తెలిపారు. అన్నల్దాస్ గణేశ్, గీస భిక్షపతి, నరేశ్, రమేశ్, దేవయ్య, బాబు, లక్ష్మణ్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికవేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర విభాగం విద్యార్థులు ‘కాంపాక్ట్ డిస్క్ యూజ్ ఏ డిప్రాక్షన్ గ్రేటింగ్’ అనే అంశంపై చేసిన పరిశోధన రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. పరిశోధనలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. -
సిరిసిల్లలో చీకట్లు తొలగిస్తాం
● వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం ● మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సిరిసిల్ల: జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు లేక చీకట్లు కమ్ముకుంటున్నాయని ‘చీకట్లో సిరిసిల్ల’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య రగుడు జంక్షన్లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయని తెలిపారు. త్వరలో అక్కడ లైట్లు వెలుగుతాయని వివరించారు. సిరిసిల్ల పట్టణ శివారు ప్రాంతాల్లో వీధిదీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కలెక్టర్ అనుమతితో నిధులు మంజూరు చేయించి 39 వార్డుల్లోనూ వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘సాక్షి’ కథనంతో వీధి దీపాల ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. -
వెంకన్న ఆస్తుల పరిరక్షణకు చర్యలు
సిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ సహాయ కమిషనర్ ఎన్.సుప్రియ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని సర్వే నంబర్ 1578లో సుమారు 40 ఏళ్ల క్రితం అక్రమంగా నిర్మించిన 23 నుంచి 30 నివాసాలను సందర్శించి మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రతీ ఇంటికి రూ.1000 డ్యామేజ్ సూట్ కింద పేమెంట్ చేయాలని కోరారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో రూ.1.60లక్షలతో కొత్తగా నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణానికి శాఖాపరంగా పనులు పూర్తి చేస్తామని, భక్తులు కూడా సాయం అందించాలని కోరారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో మారుతిరావు, శివసాయిబాబా ఆలయ ఈవో శ్రీనివాస్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఏఈవో పీసరి రవీందర్, మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్రెడ్డి, తీగల శేఖర్గౌడ్, చేపూరి నాగరాజు, అర్చకులు మాడంరాజు కృష్ణమాచారి, వర్దనాచారి తదితరులు పాల్గొన్నారు. -
‘పది’లో ప్రథమ స్థానమే లక్ష్యం
● పరీక్షలపై పరేషాన్ వద్దు ● విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలి ● మేధస్సుకు మార్కులు కొలమానం కాదు ● జిల్లా విద్యాధికారి జనార్దన్రావు సిరిసిల్లఎడ్యుకేషన్: అభ్యసించడం నుంచి కొనుక్కోవడం వైపు విద్యా విధానం పయనిస్తున్న తీరు బాధాకరమని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు అన్నారు. ఇటీవల డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. పరీక్షల్లో రాణించాలంటే.. విద్యార్థులు పరీక్షల్లో రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా చూడాలి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పిల్లల ప్రగతిని పరిశీలించడం తల్లిదండ్రులకు పెను సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు కచ్చితంగా విద్యార్థుల ప్రగతిపై దృష్టి పెట్టాలి. అప్పుడే మంచి విలువలతో కూడిన విద్య, విజ్ఞానం పిల్లలకు చేరువవుతుంది. మార్కులు కొలమానం కాదు విద్యార్థులకు వివిధ పరీక్షల్లో వచ్చే మార్కులను కొలమానంగా చూపుతూ కార్పొరేట్ స్కూళ్లు చదువును వ్యాపారంగా మార్చాయి. మార్కుల పరంగా కాకుండా మాట్లాడే తీరు, సంభాషణ విధానంలో ప్రావీణ్యతను కలిగి ఉండేలా పరిశీలన జరగాలి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందుతుంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెరుగైన ఫలితాలు సాధించి.. పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఇప్పటికే మూడో స్థానంలో ఉంది. మరింత మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించేందుకు కృషి చేస్తాం. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేశాం. పరీక్ష నిర్వహణపై.. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు 35 కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్షలు సజావుగా జరిగేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్స్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్తోపాటు జిల్లా కలెక్టర్, డీఈవో, పరీక్షల నియంత్రణ అధికారి, రాష్ట్ర పరిశీలకులు విధుల్లో ఉండి మాస్ కాపీయింగ్ జరగకుండా పర్యవేక్షిస్తారు. సందేహాల నివృత్తికి.. విద్యార్థులకు పరీక్షల సమయంలో తలెత్తే సందేహాలపై 94414 40849 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ పరీక్షల్లో మమేకమయ్యేలా చూడాలి. మార్కుల విధానం మంచిదే.. పదో తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ రద్దుచేసి మార్కుల విధానం స్వాగతించే అంశం. ఇంటర్నల్ మార్కుల విషయంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాలయాలు ఇష్టారీతిగా విద్యార్థులకు మార్కులు వేశాయి. జీపీఏ విధానం రద్దు చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. మార్కుల కోసం అభ్యసన చేయాలని విద్యార్థులపై పదేపదే ఒత్తిడి చేసే విధానం తగ్గించాలి. వారికి అర్థమయ్యే రీతిలో సలహాలు, సూచనలు చేస్తూ మంచి ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలి. పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత శాతం2021–22 96.34 2022–23 94.37 2023–24 98.27 శాతం ఈ ఏడాది జిల్లాలో పరీక్ష రాయనున్న మొత్తం విద్యార్థులు 6,768 -
కిడ్నీలు పదిలమేనా?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పేయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం. – 8లో... రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చులయ్యాయి. విజయేందర్రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్రెడ్డికి జితేందర్రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న అన్నయ్యకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. -
ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని అర్హులందరూ ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ఝా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం టీఫైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించారు. అనంతరం నేరెళ్ల పీహెచ్సీని తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే నేరెళ్ల టీజీఆర్ఎస్ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులకు రాగిజావ ఇస్తుండగా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ప్రిన్సిపాల్ రాధను ఆదేశించారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీవో మీర్జా అఫ్జల్ బేగ్, మెడికల్ ఆఫీసర్ చంద్రికారెడ్డి, సిబ్బంది ఉన్నారు. నేడు మినీ జాబ్ మేళాసిరిసిల్లకల్చరల్: ప్రైవేట్ కంపెనీ వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలు భర్తీకి గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల జిరాక్స్ప్రతులతో నేరుగా హాజరు కావాలన్నారు. ఎంపికై నవారికి రూ.15 వేల నుంచి రూ.20వేల నెలసరి వేతనంతో పాటు ఉచిత భోజనవసతి కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హతలున్న మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 70935 14418 లేదా 90003 85863 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నక్కవాగులోకి గోదావరి జలాలు ముస్తాబాద్(సిరిసిల్ల): వేసవిలో ఎండుతున్న పంటలకు గోదావరి జలాలు ఊపిరిపోస్తున్నాయి. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది, సేవాలాల్తండా, గన్నెవారిపల్లె, పోతుగల్ గ్రామాల్లో నక్కవాగు, ఎల్లమ్మ వాగు పరివాహాక ప్రాంతాల్లో వేసిన వరిపంటలు ఎండుతున్నాయి. దీంతో మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్ల మీదుగా ప్రాజెక్టు కెనాల్తో నీటిని నక్కవాగులోకి వదిలారు. ఈమేరకు కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ప్రాజెక్టు ఎస్ఈతో చర్చించి, మల్లన్నసాగర్ నీటిని నక్కవాగులోకి వదిలేలా చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి తెలిపారు. నక్కవాగులోకి జలాలు రాగానే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లోకి నీరు వచ్చిందని పేర్కొన్నారు. 24 గంటలు.. 14 ఆపరేషన్లువేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 24 గంటల్లో 14 రకాల ఆపరేషన్లు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. 11 మంది గర్భిణులకు డెలివరీలు చేశారు. అందులో ఆరు ఆపరేషన్లు, ఐదు సాధారణ కాన్పులు. ఇద్దరికి గర్భసంచి, ముగ్గురికి కంటి, ముగ్గురికి జనరల్ ఆపరేషన్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని, వైద్యులు అందుబాటులో ఉన్నారని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
సరిపడా నీరు తాగాలి
● అవసరమైతేనే బయటకు వెళ్లాలి ● మార్చి నుంచే మండుతున్న ఎండలు ● వడదెబ్బకు గురైతే వెంటనే చికిత్స తీసుకోవాలి ● వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి ● ‘సాక్షి’తో డీఎంహెచ్వో రజిత సిరిసిల్లటౌన్: ‘ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటినుంచి జూన్ మాసం ప్రథమార్థం వరకు సూర్యతాపం కొనసాగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ప్రజలు తగినంత నీటిని తీసుకుంటూ, శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవాలి’ అని డీఎంహెచ్వో డాక్టర్ రజిత పేర్కొన్నారు. వేసవిలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం ‘సాక్షి’కి వివరించారు. శరీర ఉష్ణోగ్రత పెరిగితే.. ఎండలు ఎక్కువైనప్పుడు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. దీంతో శరీరంలో నీరు బాగా పోవడం వల్ల డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)తో పాటుగా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, విరేచనాలు, గుండెలయలో మార్పులు, రక్తపోటు(బీపీ)లో హెచ్చుతగ్గులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సమస్యలు, వేడి దద్దుర్లు(హీట్ ర్యాషెస్) వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత ఆక్సిజన్ అవసరం వేసవిలో సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడంతో పాటు, గాలిలో తేమశాతం తక్కువగా ఉండి శరీరం నుంచి బయటకు ఎక్కువగా విసర్జిస్తుంది. దీంతో పలురకాల సమస్యలు వస్తాయి. మన శరీరంలో కండరాలకు తగిన ఆక్సిజన్ అవసరం. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు కండరాలు పట్టేస్తాయి. కండరాలకు శరీరం నుంచి తగిన ఆక్సిజన్ అందనప్పుడు ఇతర మార్గంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో ల్యాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కిడ్నీలపై ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ల విరేచనాలతో కూడా కిడ్నీలు పాడవడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రోగులు జాగ్రత్తగా ఉండాలి బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే డాక్టర్ను సంప్రదించి వారి సూచనలను పాటించాలి. వేసవిలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు తలనొప్పి తొలి హెచ్చరికగా భావించాలి. వెంటనే తగ్గకుంటే డాక్టర్ను సంప్రదించాలి. ఈకాలంలో ఒత్తిడి, నిద్రలేమి, చికాకు, ఉత్సాహం తగ్గడం, నీరసించిపోవడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. సాధారణ నీరు.. వ్యాయామం వేసవిలో అతిచల్లని నీటిని అస్సలు తాగొద్దు. అతిగా వ్యాయామం కూడా చేయడం సరికాదు. తగిన విరామంతో సరిపడా నీరు తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఇక చల్లని నీటితో స్నానం చేయడం, శరీర భాగాలను కడుక్కోవడం సరికాదు. ఎండల్లో తిరిగొచ్చిన వారు ఒక్కసారిగా చల్లని నీటిని తాగితే.. స్నానం చేస్తే రక్తనాళాలు కుచించుకుపోయే అవకాశం ఉంటుంది. దీంతో గుండెపోటుకు గురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఎండ నుంచి వచ్చిన వారు సాధారణ నీరు తాగడం శ్రేయస్కరం. చల్లని నీరు, రసాలు తీసుకోవడంతో గొంతు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. జాగ్రత్తలు.. రోజూ ఎండలో కాకుండా నీడ ప్రదేశాల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇన్నాలి. శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా నీరు తాగాలి. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. సీ విటమిన్ పుష్కలంగా ఉండే పదార్థాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలి. ఇక కాటన్, పలుచటి వస్త్రాలు ధరించడం మంచిది. పనికి వెళ్లిన వారు ఏకధాటిగా ఎండలో ఉండకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. మండుటెండలకు బయటకు వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతుంటాయి. వాటిని తీసుకుంటే అనారోగ్యాన్ని పొందడం ఖాయం. తాజా ఆహారమే తీసుకోవాలి. వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వడదెబ్బకు గురైన వ్యక్తులను చల్ల ని ప్రదేశాల్లో ఉంచాలి. సాల్టెడ్ బటర్ మిల్క్ లేదా గ్లూకోజ్ వాటర్తో పాటు పుష్కలంగా నీటిని తీసుకోవాలి. వడదెబ్బతో బాధపడుతున్న వ్యక్తులను చల్లటి నీటితో స్పాంజ్ చేయాలి. అయినా మెరుగుదల కనపడకపోతే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అర్హత గల వైద్యుడితో చికిత్స పొందాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా మెరుగైన వైద్యసేవలు పొందవచ్చు. -
జిల్లా రుణ ప్రణాళిక రూ.3,948.01 కోట్లు
● వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ సందీప్కుమార్ ఝా మంగళవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వార్షిక రు ణ ప్రణాళికను నాబార్డు అంచనాల మేరకు రూ. 3,948.01 కోట్లుగా నిర్ధారించారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) జిల్లాలోని బ్యాంకులకు ఈ ఏడాది రూ.3,203 కోట్ల రు ణ సాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. గతేడాది లక్ష్యంతో పోల్చితే ఇది 23 శాతం అ ధికమని వార్షిక నివేదికలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి పొటెన్షి యల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్(పీఎల్పీ)ను విడుదల చే శారు. ఇందులో అగ్రభాగం వ్యవసాయ రంగానికి రూ.3,189.07 కోట్లు కేటాయించగా, సూక్ష్మ, చి న్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 612.30కోట్లు, ఎగుమతుల రంగానికి రూ. 3.20కోట్లు, విద్యా రుణాలకు రూ.28.0కోట్లు, గృహనిర్మాణాలకు రూ.40.04 కోట్లు, సామాజిక మౌ లిక సదుపాయాలకు రూ.10.80 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.31.10 కోట్లు ఇతర రంగాలకు కలిపి రూ.33.50 కోట్ల రుణాలను అందించి జిల్లా ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని ఆ కాంక్షించారు. కార్యక్రమంలో నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ ఎం.దిలీప్ చంద్ర, డీఆర్డీవో బి.శేషాద్రి, లీడ్ జిల్లా మేనేజర్ టీఎన్ మల్లికార్జునరావు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి సిరిసిల్ల: ఉత్తమ బోధనతో పాటు విద్యార్థుల ఆ రోగ్యం ఎంతో ముఖ్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకులాన్ని మంగళవారం సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే వివరాలను తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు ఎలా రాస్తున్నారు అని అడిగారు. విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో 338 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశామని డీఎంహెచ్వో రజిత వివరించారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారిని హైదరాబాద్ సరోజినీదేవి ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.సంపత్కుమార్, ఆర్బీఎస్కే. ప్రోగ్రాం ఆఫీసర్ డా.నయీంజహాన్ షేక్, మెడికల్ ఆఫీసర్ కృష్ణవేణి తదితరులు ఉన్నారు. -
క్రమబద్ధీకరణ అయ్యేనా?
● ఈనెలాఖరు వరకు గడువు ● 42,942 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ● ఫీజులో 25 శాతం రాయితీ ● ప్రాసెస్లో 34,229 అర్జీలుముస్తాబాద్(సిరిసిల్ల): అనధికార లేఅవుట్లు, అనుమతులు లేని ప్లాట్ల క్రమబద్ధీకరణకు స్పందన లభించడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏడాదిగా ఎల్ఆర్ఎస్ అర్జీలను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన ప్రక్రియ అనుకున్న స్థాయిలో ముందుకుసాగడం లేదు. దీంతో ప్రభుత్వం ఈనెల 31లోగా పాట్ల క్రమబద్ధీకరణకు గడువు విధించింది. గడువులోగా ఫీజులు చెల్లించిన వారికి 25శాతం రాయితీ ప్రకటించింది. దీనిపై ప్లాట్ల యజమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. దరఖాస్తుల వడబోత జిల్లాలో గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు ఆహ్వానించగా రూ.వెయ్యి చెల్లించినవారు 42,942 మంది ఉన్నారు. వీరి పూర్తి వివరాలను ప్రస్తుతం అధికారులు వడబోసి అందరికీ సమాచారం అందించారు. అందులోంచి 34,229 దరఖాస్తులకు ప్రాసెస్ మొదలు పెట్టారు. వీరి ప్లాట్లను రెగ్యులర్ చేసేందుకు ఫీజు చెల్లించేలా గ్రామపంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు లేఅవుట్ స్థలాలను కొనుగోలు చేసిన వారికి సిబ్బంది, ఉద్యోగులు ఫోన్లో సమాచారం ఇస్తున్నారు. 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని చెబుతున్నారు. 2020లో చేసుకున్న దరఖాస్తుదారులు తమ ప్లాట్లను విక్రయించినా, రిజిస్ట్రేషన్ సమయంలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినా సరిపోతుందనే అవకాశం ఇచ్చారు. దీనిపై సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నంబర్ 18002331495 ఏర్పాటు చేశారు. క్రమబద్ధీకరణపై నిఘా ఎల్ఆర్ఎల్లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ఆచితూచి అనుమతులు ఇస్తున్నారు. చెరువులు, కుంటలకు 200 మీటర్లలోపు ఉన్న వాటిని రెగ్యులర్ చేయరు. అలాగే బఫర్జోన్, ఎఫ్టీఎల్, నీటివనరులు, వాగులు, నదుల వద్ద ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించే సమయంలో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న లేఅవుట్లలో ఎన్ని డీటీసీపీ అనుమతులు పొందాయో తెలుసుకుంటున్నారు. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశారు. మున్సిపల్, పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం రెగ్యులర్ చేసే ప్లాట్ల వివరాలకు సంబంధించి ఫీజు ఎంత మేరకు నిర్ణయించారో తెలుసుకునేందుకు, స్థలాల యజమానులు తమ ఫోన్ నంబర్లతో మీసేవలో విచారణ చేస్తే ఎంతమేరకు ప్రభుత్వం ఫీజు విధించిందో తెలుసుకోవచ్చు. రెగ్యులర్ కాని ప్లాట్లతో పాట్లే ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోని స్థలాల యజమానులు భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులు సూచించిన విధంగా ఆన్లైన్లో వచ్చే ఫీజును చెల్లించని పక్షంలో, భవిష్యత్లో అక్కడ నిర్మాణాలకు అనుమతులు లభించవు. క్రమబద్ధీకరించని స్థలాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతులు ఉండబోవు. జిల్లాలో ప్రస్తుతం 8,713 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. యజమానులపై భారం సమాచారం ఇస్తున్నాం ముస్తాబాద్లో 757 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. అందరికీ సమాచారం ఇస్తున్నాం. పంచాయతీలోనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశాం. అప్పటికప్పుడే నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం. – రమేశ్, ముస్తాబాద్ మేజర్ పంచాయతీ ఈవో వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి డీటీసీపీ అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇవ్వడం మంచిదే. భవిష్యత్లో ప్లాట్ల వ్యాపారాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తే సామన్యులకు నష్టం జరుగదు. – లింగం, ముస్తాబాద్ ప్లాటు కొనుగోలు చేసిన యజమానులు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణతో భారం మోసే పరిస్థితులు వచ్చాయి. అక్రమ లేఅవుట్లు వేసిన వారి వద్ద ఎలాంటి విచారణ చేయకుండా, ముఖ్యంగా డీటీసీపీ అనుమతులు ఉన్నాయో, లేదో చూసుకోకుండా ప్లాట్లు కొని పాట్లు పడుతున్నారు. రియల్ వ్యాపారులు, వెంచర్ల యజమానులు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులు చేసే పరిస్థితుల్లో లేరు. వారు బాగానే ఉన్న, ప్లాట్లు కొన్న తామే ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. 150 గజాల స్థలం ఉన్న వారికి సుమారు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు ఫీజు వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి క్రమబద్ధీకరణ ఒక మార్గం కాగా, ప్లాట్లు కొన్నవారే అంతిమంగా నష్టపోతున్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
వేములవాడ: వేములవాడ కోర్టులో నెలకొన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోర్ట్ పోలియో జడ్జి నామవరపు రాజేశ్వరరావును మంగళవారం హైకోర్టులో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ, వేములవాడకు అడిషనల్ కోర్టు మంజూరు చేయాలని, తదితర సమస్యలపై జడ్జికి వివరించినట్లు తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, న్యాయవాదులు నక్క దివాకర్, పంపరి శంకర్, గుజ్జే మనోహర్ ఉన్నారు. వివరాలు పక్కాగా నమోదు చేయాలి సిరిసిల్ల: రికార్డుల్లో స్కానింగ్ వివరాలు పక్కాగా నమోదు చేయాలని పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంపత్కుమార్ అన్నారు. స్పెషల్డ్రైవ్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని స్పష్టం చేశారు. స్కానింగ్ సెంటర్లలో రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో డాక్టర్లు రాజ్కుమార్, శీలాశిరీష, హెచ్ఈ బాలయ్య, ఉమెన్ వెల్ఫేర్ దేవిక, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్లకల్చరల్: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండో విడతలో దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 31 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్న్షిప్నకు ఎంపికై న విద్యార్థులకు ప్రతి నెలా రూ.5వేల భత్యం అందజేస్తారని పరిశ్రమల శాఖ సంచాలకుడు డాక్టర్ జి.మల్సూర్ తెలిపారు. ఏడాది పాటు సాగే ఇంటర్న్షిప్లో ఆరునెలల పాటు ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. 21 నుంచి 24 ఏళ్ల వయస్సు, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉండి, వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. pminternship. mca. gov. in అభ్యర్థులు తమ వివరాలు పొందుపరచాలని, మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ 18001 16090 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. విద్యారంగానికి నిధులు కేటాయించాలిసిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించగా వక్తలు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుచేసి ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. లేకుంటే సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గుండెల్లి కళ్యాణ్కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సంపత్కుమార్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, ఐ ద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల, సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముశం రమేశ్, మల్లారపు ప్రశాంత్, జాలపల్లి మనోజ్కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన, సాయిభరత్, శ్రీధర్, తల్లిదండ్రుల సంఘం నాయకులు సత్యం, రవి, తదితరులు పాల్గొన్నారు. -
లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి
రాజన్న: తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమాండెంట్ గా పనిచేస్తున్న గంగారం మరణించడం జరిగింది. నిన్న ఓ అపార్ట్మెంట్లో డిన్నర్ కు వెళ్లాడు గంగారం. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశాడు గంగారం.అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో.. కమాండెంట్ గంగారం పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు గంగారం. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గంట తర్వాత ప్రకటించారు వైద్యులు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేటీఆర్ సంతాపంతెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంతాపం తెలియజేశారు. గంగారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం ప్రమాదవశాత్తు జరిగిన లిప్టు ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారాయన. -
జిల్లా పంచాయతీ అధికారిగా షర్ఫుద్దీన్
సిరిసిల్ల: జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా షర్ఫుద్దీన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హన్మకొండ జిల్లా పరకాల డీఎల్పీవోగా పనిచేస్తున్న ఫర్ఫుద్దీన్ను పదోన్నతిపై డీపీవోగా నియమించింది. గతంలో సిరిసిల్ల డీపీవోగా ఎ.రవీందర్ను ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో డీపీవోగా షర్ఫుద్దీన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు కలెక్టర్ సందీప్కుమార్ ఝాను సోమవారం కలిసి విధుల్లో చేరారు. చెక్పోస్టుల ఏర్పాటుతో ఏఎంసీకి ఆదాయం ● పోతుగల్ ఏఎంసీ చైర్పర్సన్ రాణిముస్తాబాద్(సిరిసిల్ల): మార్కెట్ కమిటీ చెక్పోస్టుల ఏర్పాటుతో పోతుగల్ ఏఎంసీకి వచ్చే ఆదాయం పెరుగుతుందని చైర్పర్సన్ తలారి రాణి అభిప్రాయపడ్డారు. పోతుగల్ ఏఎంసీ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. రాణి మాట్లాడుతూ ముస్తాబాద్లో శాశ్వతంగా చెక్పోస్టు ఏర్పాటుకు పంచాయతీ సహకారం తీసుకోవాలని సూచించారు. రైస్మిల్లుల యజమానులతో చర్చించి ఫీజులు వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఆవునూర్లో కొత్తగా చెక్పోస్టు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదాం నిర్మాణానికి తీర్మానించారు. వైస్చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, డైరెక్టర్లు కొమురయ్య, క్యారం రాజు, శంకర్, ప్రతాప్రెడ్డి, బుచ్చయ్య, రాజయ్య, సారగొండ రాంరెడ్డి, యాదగిరిరెడ్డి, మున్నా, కార్యదర్శి హరినాథ్, నిషాంత్ పాల్గొన్నారు. పల్లె దవాఖానాలో వైద్యసేవలు ప్రారంభం ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు పల్లె దవాఖానాకు మార్పిడి చేస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి రజిత తెలిపారు. స్థానిక పీహెచ్సీని పల్లె దవాఖానాలోకి సోమవారం మార్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో రజిత మాట్లాడుతూ 50 పడకల ఆస్పత్రి సేవలు అమలులోకి వచ్చే వరకు పల్లె దవాఖానాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు అందుతాయని తెలిపారు. పెద్దలింగాపురంలోని పీహెచ్సీలో వైద్యసేవలు అందుతాయని తెలిపారు. జిల్లా వైద్యాధికారులు ప్రేమ్, సంపత్, ఇల్లంతకుంట పీహెచ్సీ డాక్టర్ జీవనజ్యోతి, హెచ్ఈవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పవర్లిఫ్టింగ్ చాంపియన్గా నేహా సిరిసిల్లటౌన్: జాతీయ పవర్లిఫ్టింగ్లో సిరిసిల్లకు చెందిన నేహా చాంపియన్గా నిలిచారు. ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన పవర్లిఫ్టింగ్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించినట్లు ఆమె తెలిపారు. కోచ్లు శేఖర్, సత్య, నిఖిల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఐఐహెచ్టీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం● చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావుసిరిసిల్ల: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు జి.రాఘవరావు సోమవారం తెలిపారు. ఐఐహెచ్టీలో ఫస్టియర్(2025–2026)లో ప్రవేశానికి 60 సీట్లు ఉన్నాయని వివరించారు. మూడేళ్ల(ఆరు సెమిస్టర్ల) కోర్సులో ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణులు, 2025 జూలై 1 నాటికి 23 ఏళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్ల వయసు వరకు అనుమతిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 2025 ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. వివరాలకు హిమజకుమార్ 90300 79242లో సంప్రదించాలని సూచించారు. -
మహిళలు..
మనీరాణులు!● మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సులు ● బస్సుల కొనుగోలుకు రూ.14.10 కోట్లు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు ● ఏడేళ్లపాటు సమాఖ్యలకు ప్రతీనెల రూ.77వేలు చెల్లించనున్న ఆర్టీసీ ● ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు ● ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్న మహిళలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది. -
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
● ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● 153 దరఖాస్తుల స్వీకరణసిరిసిల్లటౌన్: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ సమస్యలపై 153 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రెవెన్యూకు 62 అర్జీలు వచ్చాయి. సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయ్, డీఆర్డీవో శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. వయోధికుల చట్టాలపై అవగాహన అవసరంవయోధికుల పోషణ, సంక్షేమచట్టాలపై పౌరులు, సీనియర్ సిటిజెన్స్కు అవగాహన అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వయోధికుల చట్టంలోని అంశాలను తెలుగులో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య, ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సంఘం బాధ్యులు దొంత దేవదాసు, అంకారపు జ్ఞానోబా, వికృతి ముత్తయ్య, ముకుందం పాల్గొన్నారు. అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ సిరిసిల్ల: జిల్లాలో అట్రాసిటీ కేసులలో పరిహారాన్ని బాధితులకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో నమోదైన కేసుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలు 46 మంది బాధితులకు రూ.36.87లక్షలు వారి ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ముస్తాబాద్ మండలంలో మూడు, కోనరావుపేటలో ఆరు, వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో 12, సిరిసిల్ల మండలంలో ఐదు, చందుర్తిలో మూడు, బోయినపల్లిలో నాలుగు, తంగళ్లపల్లి మండలంలో ఐదు, గంభీరావుపేటలో రెండు, ఎల్లారెడ్డిపేటలో రెండు, ఇల్లంతకుంట మండలంలో మూడు, జగిత్యాల జిల్లాలో ఒకరికి పరిహారం సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ వివరించారు.చెరువులు నింపాలి వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని దొంపిచెరువు, పామిరెడ్డి చెరువులను డీ6, డీ7 కెనాల్ ద్వారా నింపాలి. ప్రస్తుతం చెరువుల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో నీటికష్టాలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించాలి. – గుడిసె విష్ణువర్ధన్, వట్టెంల -
గుర్తుకొస్తున్నాయి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో గతంలో ముంపునకు గురైన ఇళ్లు, ఇతర నిర్మాణాలు పైకి తేలాయి. నిర్వాసితులు తమ ఇళ్లను చూసి గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. కూలిన ఇళ్లు, పైకప్పులు లేని గోడలను చూసి పలువురు కళ్లు చెమర్చుతున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రాజెక్టులో నీరు అడుగంటుతుండడంతో సమీప గ్రామాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పంటపొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.3 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. -
టార్గెట్ నంబర్ వన్
● వంద శాతం లక్ష్యంగా ముందుకు.. ● పన్ను వసూలులో ప్రణాళికతో ముందుకు.. ● సిరిసిల్లలో 82 శాతం.. వేములవాడలో 72 శాతం వసూలు సిరిసిల్లటౌన్/వేములవాడ: పన్నుల వసూళ్లలో అగ్రస్థానమే లక్ష్యంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ముందుకెళ్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రస్థాయిలో సిరిసిల్ల బల్దియా అగ్రస్థానం సాధించిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు. వేములవాడలోనూ వందశాతం లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్లలో 82 శాతం, వేములవాడలో 72 శాతం పన్నులు వసూలు చేసిన అధికారులు ఈనెలాఖరులోగా వంద శాతం చేరుకోవాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. లక్ష్యం రూ.6.32కోట్లు వసూలు రూ.5.18కోట్లు సిరిసిల్ల మున్సిపల్కు సంబంధించిన పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న తరుణంలో ఆయన సూచనలతో గత ఆర్థిక సంవత్సరాల్లో సాధించిన నూరుశాతం పన్నుల వసూళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. మున్సిపల్లో లోటు బడ్జెట్ తీర్చడంతోపాటు గతకీర్తిని కొనసాగించడమే లక్ష్యంగా ప్రైవేటు ఆస్తుల పన్నుల వసూలుకు చర్యలు తీసుకుంటుంది. సిరిసిల్ల పట్టణంలో నివాసగృహాల పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. రెసిడెన్షియల్, నాన్రెసిడెన్షియల్, ఇతర ఆస్తులకు సంబంధించిన పన్నులు రూ.6.32కోట్లు ఉండగా ఇప్పటికే రూ.5.18 కోట్లు సుమారుగా 82 శాతం వసూలయ్యాయి. ఆదాయంపై వినూత్న విధానాలు బల్దియా ఆదాయవనరుల పెంపుపై అధికారులు దృష్టి సారించారు. పరిశుభ్ర పట్టణంగా కీర్తిపొందిన సిరిసిల్ల వీధుల్లో చెత్తను వేయడం నిషేధించారు. నిబంధన ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రతీ దుకాణం నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు విధిగా ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.300 వరకు యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక మున్సిపల్ ఆస్తులు ఆక్రమించడం అంటే రోడ్డుపై టేలాలు వేయడం, వ్యాపారాలు చేయడం, ఫుట్పాత్లు ఆక్రమించడం తదితర అంశాలపై కూడా నిత్యం దాడులు చేస్తూ ఆదాయం పెంచారు. గృహాల పన్నులే కాకుండా ట్రేడ్లైసెన్సులు, తాగునీరు తదితర పన్నులు పూర్తిస్థాయిలో వసూలు చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. 39 వార్డులు..14 బృందాలు పన్నుల వసూలుకు 39 వార్డుల్లో 14 మంది బిల్కలెక్టర్లతో గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరి తో పాటు ఒక వార్డు ఆఫీసర్, ఒక సూపర్వైజర్తో పాటు అవసరమైన వార్డుల్లో మరికొంత మంది సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో పన్నులు వసూలు చేస్తున్నారు. పట్టణంలో రెసిడెన్షియల్ 18,113, నాన్రెసిడెన్షియల్ 2,569, ఇతర ఆస్తులు 2,805 మొత్తంగా 23,487 ఉన్నాయి. పన్నుల వసూళ్లకు మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్య నేతృత్వంలో సిబ్బంది ఫిబ్రవరి నుంచే కార్యాచరణ చేపట్టారు. అభివృద్ధి.. పన్నుల చెల్లింపు అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలోనే ముందంజలో సిరిసిల్ల ఖ్యాతి గడించింది. అన్నివార్డుల్లో రోడ్లు, మోరీల నిర్మాణం, ఎల్ఈడీ వీధిదీపాలు, ప్రధాన రోడ్లవెంట పచ్చదనంతో పట్టణం అభివృద్ధి సాధించింది. పట్టణాన్ని చూడగానే ఆహా అనిపించే డివైడర్లు, మానేరుతీరంలో బతుకమ్మ ఘాట్, మ్యూజికల్ ఫౌంటేయిన్, పట్టణం దశదిశలా ఏర్పాటైన పార్కులతో సిరిసిల్ల మహానగరాలకు తీసిపోని విధంగా ఆవిర్భవించింది. దీంతో ప్రజలు కూడా తమవంతుగా పన్నుల వసూళ్లలో బల్దియాకు దన్నుగా నిలుస్తున్నారు. వేములవాడలో 72 శాతం వసూలు వేములవాడ మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆస్తిపన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సం మార్చి 31తో ముగియనుండటంతో ఆస్తిపన్ను వసూలుపై అధికారులు దృష్టిపెట్టారు. వేములవాడ మున్సిపల్, విలీన గ్రామాలు కలిపి 28 వార్డులు ఉన్నాయి. ప్రతీ వార్డులో ప్రతి రోజు అధికారులు ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. ఈ ఆస్తి పన్నుల వసూళ్ల కోసం 5 ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 72 శాతం వసూలు వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 72 శాతం ఆస్తిపన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.4.32 కోట్లు లక్ష్యం కాగా.. రూ.3.11కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.1.21కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వేములవాడ రాజన్న ఆలయం నుంచి ఆస్తి పన్ను రూ.1.09కోట్లు వసూలు చేశారు. ఇప్పటి వరకు మున్సిపల్ ఆస్తి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.4.20 కోట్లు వసూలయ్యాయి. మిగతా ఆస్తిపన్నులు ఈనెలాఖరు వరకు పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు ముందుకెళ్తున్నారు. జిల్లాలో ఆస్తులు ఇలా.. ఆస్తి సిరిసిల్ల వేములవాడ గృహాలు 18,113 11,371 కమర్షియల్ 2,569 2,266 ఇతరాలు 2,805 1,052 రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు 45 207 కేంద్ర ప్రభుత్వ ఆస్తులు – 01 మొత్తం ఆస్తులు 23,532 14,897మొదటి స్థానం సాధిస్తాం పన్నుల వసూళ్లలో కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆదర్శ విధానాలు అవలంబిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్నాం. నెలాఖరు వరకు నూరుశాతం వసూళ్లు చేసి నంబర్ వన్ స్థానాన్ని సాధిస్తాం. డీఈఈ, ఏఈలు, టీపీవో, టీపీబీవో, ఆర్ఐ, ఆర్వోలు, బిల్కలెక్టర్లు ఇలా 39 మంది నిత్యం పన్నులు వసూలు చేస్తున్నారు. – ఎస్.సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల వందశాతం పూర్తి చేస్తాం వేములవాడ మున్సిపల్లో ఆస్తిపన్ను స్పెషల్డ్రైవ్ ఏర్పాటు చేసి పన్నుల కోసం ప్రత్యేకాధికారులను కేటాయించి 72 శాతం ఆస్తి పన్ను వసూలు చేశాం. మార్చి నెలాఖరు వరకు వందశాతం ఆస్తిపన్ను వసూలు చేస్తాం. – అన్వేశ్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ -
సార్.. నా బైక్ పల్సర్ 150 సీసీ.. చలాన్ వచ్చింది 220 సీసీకి..
సిరిసిల్లక్రైం: తాను రోడ్డు నిబంధనలు అతిక్రమించకుండానే తన ఫోన్కు మెస్సేజ్ రావడంతో కంగుతిన్నాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తి. తన బైక్ నంబర్ను మరో వాహనదారుడు తన బండికి వేసుకొని ఇష్టారీతిగా తిరుగుతుండడంతో జరిమానాల మీద జరిమానాలు వచ్చి పడుతుండడంతో అసలు యజమాని లబోదిబోమంటున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మోబిన్ తన వాహనాన్ని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. శనివారం తన బైక్ నిబంధనలు అతిక్రమించినట్లు ట్రాఫిక్ చలాన్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూడగా తంగళ్లపల్లి మండలం తాడూరు ఎక్స్ రోడ్ వద్ద హెల్మెట్ లేకపోవడంతో చలాన్ విధించినట్లు మెసేజ్ ఉంది. అసలు తాను అక్కడికి వెళ్లలేదని తన వాహనం పల్సర్ 150 సీసీ కాగా.. చలాన్ వచ్చిన వాహనం పల్సర్ 220 సీసీ అని పేర్కొన్నారు. పోకిరీలు కావాలని తన బైక్ నంబర్ను వారి వాహనానికి బిగించుకొని జిల్లాలో తిరుగుతున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నాడు. -
ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల: జిల్లాలో అనధికార లే–అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా శనివారం తెలిపారు. ఎల్ఆర్ఎస్–2020లో వచ్చిన దరఖాస్తులను క్రబద్ధీకరించుకోవాలని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చన్నారు. ఈనెల 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుంలో 25 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 42,942 దరఖాస్తులు రాగా.. 34,229 ప్రాజెస్ అయ్యాయని, మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. 2020లో దరఖాస్తు చేసుకున్న వారు తమ ప్లాటును రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరారు. ఎల్ఆర్ఎస్పై అనుమానాల నివృత్తికి టోల్ఫ్రీ 18002331495 నంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవద్దు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. నిత్యం పల్లెల్లో ఇసుక కయ్యం జరుగుతోంది. గతంలో స్థానిక అవసరాలకు మానేరు శివారు గ్రామాలకు అక్కడి నుంచే ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతులు ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా మండలానికో ఇసుకరీచ్ మాత్రమే అనుమతించడంతో ఇతర గ్రామాలకు ఇసుక దొరకడం లేదు. అంతేకాకుండా ఇసుక రీచ్ ఉన్న గ్రామంలోని రైతులు తమ బోర్లు, వ్యవసాయబావులు ఎండిపోతున్నాయని ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల పలు మండలాల్లో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. ఇసుక దొరక్క చాలా నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సైతం ఇసుక కొరత వేధిస్తోంది. ఒకప్పుడు ట్రాక్టర్ లోడ్కు రూ.2500 ఉండగా, ప్రస్తుతం రూ.5వేలు పలుకుతోంది. ఇసుక బంగారంతో సమానం కావడం ఇళ్లు నిర్మించుకునే సామన్యులకు భారంగా మారింది. గతంలో ఇలా.. జిల్లాలో గతంలో స్థానిక అవసరాల కోసం సమీపంలోని వనరుల నుంచి ఇసుక తోడేందుకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఆ సమయంలో జిల్లాలో సుమారు 40 చోట్ల ఇసుక తవ్వుకునేందుకు అవకాశం ఉండేది. ఆయా ప్రాంతాల నుంచి ఇసుక తరలింపునకు అధికారికంగా రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చేవారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి, వెంకటాపూర్, బండలింగంపల్లి, వీర్నపల్లి మూలవాగు, కోనరావుపేట మండలం బావుసాయిపేట, మామిడిపల్లి రీచ్ల నుంచి ఇతర గ్రామాలకు తెచ్చుకునేవారు. తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి, గండిలచ్చపేట వద్ద మానేరువాగు, నక్కవాగుల నుంచి అనుమమతులతోనే ఇసుక తోడేవారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్, రామలక్ష్మణపల్లి, తుర్కపల్లి మానేరువాగు నుంచి ఇసుక తీసుకెళ్లేవారు. వేములవాడ, వేములవాడరూరల్ సమీప మూలవాగులో ఇసుకరీచ్ నుంచి సరఫరా అయ్యేది. అంతటా ఆందోళనలు జిల్లాలోని పలు ఇసుకరీచ్ల వద్ద స్థానిక గ్రామస్తులు, రైతులు ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. తమ గ్రామంలోని ట్రాక్టర్లకే అనుమతులు ఇవ్వాలని, ఇతర గ్రామాల ట్రాక్టర్లకు ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు ఇవ్వవద్దని రైతులు, గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని ఇసుక రీచ్కు ఇతర గ్రామాల ట్రాక్టర్లను రావద్దంటూ ఆ గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్ రీచ్ వద్ద సైతం ఇదే పరిస్థితి ఉంది. అయితే వీటి వెనుక స్థానిక ఇసుక వ్యాపారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనలు ఇలాగే కొనసాగితే మండలంలోని ఇతర గ్రామాలకు ఇసుక దొరకని పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటికే ఇసుక కొరతతో జిల్లాలోని నూతన భవన నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. మండలంలో అధికారికంగా ఉన్న రీచ్ నుంచే ఇసుక సరఫరా జరుగుతుంది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచే ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్నాం. ఇసుక ట్రాక్టర్లను ఎవరూ అడ్డుకోవద్దు. ఎవరైనా అడ్డుకుంటే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్, ఎల్లారెడ్డిపేట -
మిడ్మానేరులో కేజ్కల్చర్
● ట్రయల్రన్కు ఫిష్ఇన్ కంపెనీ సన్నాహాలు ● తొలిదశలో 10 కేజెస్ ● విజయవంతమైతే పూర్తిస్థాయి యూనిట్లు ● మూడు కంపెనీలకు 367 ఎకరాలు బోయినపల్లి(చొప్పదండి): మత్స్యసంపద అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో మిడ్మానేరులో ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. మిడ్మానేరు బ్యాక్వాటర్లో అధునాతన టెక్నాలజీతో అమెరికా ఫిష్ఇన్ కంపెనీ కేజెస్తో(పంజరం వలల ద్వారా) ఫిష్ కల్చర్ అభివృద్ధికి బాటలు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మిడ్మానేరు బ్యాక్వాటర్ ఎడ్జ్లో కేజ్కల్చర్ విధానంలో చేపల పెంపకం చేపట్టేందుకు ట్రయల్రన్ పనులు చేపడుతున్నారు. ఇది సక్సెస్ అయితే పూర్తిస్థాయిలో ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 367 ఎకరాలలో.. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ బ్యాక్వాటర్లో కేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిడ్మానేరు బ్యాక్వాటర్లో ఫిష్ఇన్ కంపెనీకి కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకానికి అనుమతులు ఇచ్చారు. మూడు కంపెనీలకు దాదాపు 367 ఎకరాలు భూమిని సేకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 33 ఏళ్లపాటు కేజ్కల్చర్ విధానానికి అనుమతులు ఇచ్చింది. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లకు కుదించిననట్లు సమాచారం. పది పంజరం వలలతో ట్రయల్ రన్ అమెరికా ఫిష్ఇన్ కంపెనీ 600 కేజెస్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. మొదటిషిఫ్టులో 300 కేజేస్ ఏర్పాటు చేసి చేపలు పెంచనున్నారు. ఇందులో భాగంగా 10 కేజేస్తో ట్రయల్రన్ చేయాలని ఫిష్ఇన్ కంపెనీ భావిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఏడాది పాటు 10 పంజరం వలలతో చేపలు పెంపకం చేపట్టి అందులో సక్సెస్ అయితే తదుపరి పూర్తి స్థాయిలో కేజ్ కల్చర్ విధానం అమలు చేయాలని ఆయా కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. తిలాపియా చేపల పెంపకం కేజ్కల్చర్ విధానంలో తిలాపియా చేపల పెంపకం చేపట్టాలని అనుమతులు పొందిన ఫిష్ఇన్ కంపెనీ భావిస్తోంది. ఈరకం చేపలు ఆరు నెలల్లో బ్రీడింగ్ ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఈ రకం చేపను ఎంచుకున్నట్లు సమాచారం. తిలాపియా చేపల పెంపకం కోసం మిడ్మానేరు బ్యాక్వాటర్ చివరిలో చీర్లవంచ పరిసరాల్లో కేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. ఫీడ్ కన్వర్షన్ రేషియో(ఎఫ్సీఆర్) ద్వారా చేపల పెంకంతో తమకు ఎంత లాభం వస్తుందోననే విషయం ట్రయల్రన్ పెంపకం ద్వారా తెలియనుంది. చేపలు ఒకటి, రెండు కిలోలు తీసుకుని ఒక కిలో బరువు ఎదిగితే అప్పుడు కంపెనీకి తగిన లాభం దక్కుతుంది. ఈ రకంగా ఫీడ్ తీసుకుని చేప బరువు పెరిగితే మరిన్ని రకాల యూనిట్లు పెట్టడానికి కంపెనీకి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ట్రయల్రన్ పనులు జరుగుతున్నాయి మిడ్మానేరు బ్యాక్వాటర్ చివరిలో చీర్లవంచ పరిసరాల్లో అమెరికా ఫిష్ఇన్ కంపెనీ కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకం చేపట్టే పనులకు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు పొందింది. ఇందులో భాగంగా కేజ్కల్చర్ ఏర్పాటుకు ట్రయల్రన్ పనులు చేసుకుంటున్నారు. మొదట ఏడాది కాలంలో 10 కేజెస్ ఏర్పాటుతో తిలాపియా చేపలు పెంచనున్నారు. అందుకు సంబంధించిన పనులు చేస్తున్నారు. – సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, సిరిసిల్ల -
9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి వీర్నపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ పనులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసే వరకు పోరాడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. గత ప్రభుత్వం 9వ ప్యాకేజీ పూర్తి చేయకుండానే 11వ ప్యాకేజీకి నిధులు తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మద్దిమల్లలో 9వ ప్యాకేజీ పనులు పూర్తికాక ఎండిపోయిన రాయినిచెరువును శనివారం పరిశీలించి మాట్లాడారు. రాయినిచెరువు ఎండిపోవడంతో ఆయకట్టు పంటలు ఎండిపోతున్నాయన్నారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి రాయినిచెరువుకు రావలసిన పైపులైన్ పనులను కంచర్ల అటవీ ప్రాంతంలో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాలో పర్యటించిన సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తామన్న హామీని అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. అనంతరం మద్దిమల్ల, రంగంపేటల్లో మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పంబాల దేవరాజు, బీజేపీ వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల అధ్యక్షులు లక్పతినాయక్, పొన్నాల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు పిట్ల నాగరాజు, చందుపట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరో రోజుకు రైతుల రిలే నిరాహార దీక్షలు ఇల్లంతకుంట(మానకొండూర్): పెద్దలింగాపూర్లో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం ఆరో రోజుకు చేరాయి. రంగనాయకసాగర్ నుంచి ప్రారంభమైన ఎల్ఎం 6 కెనాల్ అసంపూర్తి పనులు పూర్తి చేయాలని రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వ్యవసాయపనులు చూసుకొని ఉదయం 9 గంటల వరకు దీక్ష శిబిరానికి రావడం సాయంత్రం మళ్లీ పొలం వద్దకు వెళ్లి పనులు చూసుకుంటున్నారు. శిబిరంలో పెద్దలింగాపూర్, రామోజీపేట, చిక్కుడువానిపల్లి, ఎడ్లోనికుంట రైతులు పాల్గొన్నారు. బ్లూకోల్ట్స్ విధులు నిర్వర్తించిన మహిళా పోలీసులు బోయినపల్లి(వేములవాడ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక మహిళా పోలీసులు పింకిల్యాదవ్, సహన శనివారం బ్లూకోల్ట్స్ విధులు నిర్వర్తించారు. పలు గ్రామాల్లో వారు తిరుగుతూ మహిళలతో మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. బీసీ సాధికారత సాధిస్తాం ● జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలయ్య సిరిసిల్లటౌన్: బీసీ సాధికారిత సాధించే వరకు పోరాడుతామని బీసీ సాధికారత సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య పేర్కొన్నారు. సిరిసిల్లలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీసీల సాధికారతతోనే వెనుకబడినవర్గాలు రాణిస్తారన్నారు. శాంతినగర్లోని కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ జిల్లా, మండల నాయకులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో తీగల శేఖర్గౌడ్, గోశిక శ్రీనివాస్, గుజ్జె శివరాం, అన్నారపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలి
వేములవాడ: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలని వేములవాడ జడ్జి జ్యోతిర్మయి కోరా రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోర్టుహాలులో శనివారం మహిళా న్యాయవాదులతో కలిసి కేక్ కట్ చేశారు. జడ్జి మాట్లాడుతూ బాలికలు చదువులపై ఆసక్తి పెంచుకుని అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదన్నారు. మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ, సుజాత, నయీమానాసరి, పద్మ, సరిత, పావని, కోర్టు సిబ్బంది జయ, జగ్మాదాదేవి, జోష్న, కవిత, లత ఉన్నారు. ● వేములవాడ జడ్జి జ్యోతిర్మయి -
గొలుసుకట్టు చెరువులు నింపండి
ఇల్లంతకుంట(మానకొండూర్): రబీలో వేసిన పంటలు ఎండిపోకుండా గొలుసుకట్టు చెరువుల్లో నీరు నింపాలని ఇంజినీరింగ్ అధికారులకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంట మండల పరిషత్లో శనివారం ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నపూర్ణ, మిడ్మానేరు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటితో ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి మండలాల్లోని గొలుసుకట్టు చెరువులను నింపాలని ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అసంపూర్తిగా వదిలిపెట్టిన దాచారం, బోటిమీదిపల్లి, రామాజీపేట, పెద్దలింగాపూర్ గ్రామాల కాల్వ పనులు పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అన్నపూర్ణ ప్రాజెక్టు డీఈ దేవేందర్, ఏఈ సమరసేన, రంగనాయకసాగర్ ప్రాజెక్టు డీఈ సీతారామరాజు, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దలింగాపూర్ కాల్వ పనులకు అంచనాలు సిద్ధం చేయండి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ -
అన్ని రంగాల్లో ముందున్నారు
పెద్దపల్లిరూరల్: సమాజంలో వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు సాంకేతిక రంగంలోనూ ప్రతిభ, నైపుణ్యాలతో ముందుంటున్నారు. వాస్తవానికి పురుషులకంటే మహిళల్లోనే మానసిక స్థైర్యం ఎక్కువ. పాతికేళ్ల పాటు పుట్టింట్లో ఉండి, పెళ్లి తర్వాత మెట్టినింట్లో తనకు అంతగా పరిచయం లేనివారి నడుమ ధైర్యంగా జీవించగలుగుతుంది. చదువులో రాణిస్తున్న మహిళలకు న్యాయవ్యవస్థలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆర్థికావసరాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాకుల వరకు వస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లకు లోనై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నాం. – కె.స్వప్నరాణి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, పెద్దపల్లి -
చెప్పలేను
26బొగ్గుగనిలో సీ్త్ర శక్తిగోదావరిఖని(రామగుండం): సింగరేణికి సీ్త్ర శక్తి తోడైంది. ఇప్పటివరకు పురుష రంగానికే పరిమతమైన సింగరేణి మైనింగ్లో మహిళలు అడుగీడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో మహిళలకు సింగరేణి ఉపాధి అవకాశాలను మరింత పెంచింది. కేవలం కార్యాలయాల్లోనే కాకుండా భూగర్భ గనుల్లో పనిచేసే ఇంజినీర్లు, అండర్ మేనేజర్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు చేరారు. ప్రస్తుతం సంస్థలో 201 మంది అధికారిణులుగా 1,794 మంది మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండు గనులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. సంస్థలో తొలి మహిళా రెస్క్యూ బ్రిగేడియర్గా కొత్తగూడెం పీవీకే–5గనికి చెందిన అండర్మేనేజర్ అంబటి మౌనిక ఎంపికై ంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ జీఎంగా సింగరేణి చరిత్రలోనే తొలిసారి మహిళా అధికారి కవితనాయుడు సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లీష్మెంట్– సీఎస్సార్ జీఎంగా తొలిసారి మరో మహిళా నికోలస్ బెనడిక్ట్, సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే కంపెనీ సెక్రటరీగా సునీతాదేవి, న్యాయ విభాగం బాధ్యతలను డిప్యూటీ జీఎం హోదాలో శిరీషరెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ సుజాత విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఐపీఎస్ల బదిలీలు
● రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా ● కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం ● సిరిసిల్ల ఎస్పీగా గిటే మహేశ్సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు ఐపీఎస్లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం పోలీస్ కమిషనర్గా అంబర్కిశోర్ఝాను నియమించింది. రామగుండం సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులును సీఐడీ ఐజీగా బదిలీచేశారు. కరీంనగర్ సీపీగా గౌస్ ఆలంను నియమించగా, ఇక్కడ పనిచేస్తున్న అభిషేక్ మహంతిని తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేశారు. సిరిసిల్ల ఎస్పీగా మహేశ్బాబాసాహెబ్ను నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న అఖిల్మహాజన్ను ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న పెద్దపల్లి డీసీపీగా పి.కరుణాకర్ను నియమించారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతన హైదరాబాద్లోని ఉమెన్ సేఫ్టీ వింగ్కు బదిలీఅయ్యారు. అంబర్ కిశోర్ ఝా 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంబర్ కిశోర్ ఝా 2011లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ ఏఎస్పీగాను 2012 వరంగల్ ఓఎస్డీ, అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. 2013 అక్టోబరులో వరంగల్ కమిషనర్గా పనిచేశారు. గౌస్ ఆలం.. 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగు ఎస్పీగా పనిచేశారు. అంతకుముందు అక్కడే ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. కాగా.. అంతకుముందు ఏటూరునాగారంలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఈయన బిహార్ రాష్ట్రంలోని గయాకు చెందినవారు. ఐఐటీ ముంబాయ్లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. గిటే మహేశ్ 2020 బ్యాచ్కు చెందిన గిటే మహేశ్ అహ్మదాబాద్ వాసి. తల్లిదండ్రులు కౌలు రైతులు. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అయిన మహేశ్ది పేద కుటుంబమైనా.. కష్టపడి చదివి.. ఐపీఎస్ సాధించారు. తెలంగాణకు కేడర్కు కేటాయించాక.. కరీంనగర్లో ట్రైనీగా విధులు నిర్వహించారు. చొప్పదండి ఎస్ హెచ్వోగా ఆరునెలలపాటు పనిచేశారు. ప్రస్తుతం ములుగు ఓఎస్డీగా ఈయనకు సిరిసిల్ల ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. -
ఆడబిడ్డకు అండగా ‘మా ఊరి మహాలక్ష్మి’
గంగాధర(చొప్పదండి): కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు. పెళ్లికెదిగిన ఆడబిడ్డ భారమవుతుందని తల్లిదండ్రుల ఆవేదనలు. ఊరంతా చందాలు వేసుకొని ఓ ఆడబిడ్డ పెళ్ల్లి చేసిన సంఘటన.. ఓ యువకుడిని ఆలోచింపజేశాయి. మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు కు పునాది వేశాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయిపల్లికి చెందిన రేండ్ల శ్రీనివాస్–పద్మ దంపతులు తమ గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు ఏడేళ్ల క్రితం మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడ బిడ్డ పేరుమీద ఫౌండేషన్ తరఫున రూ.5,116, తల్లిదండ్రుల నుంచి రూ.5,000 సేకరించి సుకన్య సమృద్ధి యోజనలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు 54 మంది ఆడపిల్లల పేరిట డిపాజిట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తండ్రిని కోల్పోయిన కుటుంబాలకు దాతల సహకారంతో ఆర్థికంగా అండగా నిలుస్తున్నా రు. ఏడాదిగా ఆడపిల్లల పెళ్లికి కానుకలు అందిస్తున్నారు. -
క్రీడల్లో చిరుత.. చికిత
కరీంనగర్స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన టి.చికిత విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తోంది. చిన్న వయస్సులోనే వరల్డ్కప్లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం పంజాబ్లోని సోనీపట్లో శిక్షణ పొందుతోంది.చికిత తండ్రి శ్రీనివాస్రావు రైతు. తల్లి శ్రీలత గృహిణి. మార్చి తొలివారంలో బ్యాంకాక్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో కాంస్యం సాధించింది. ఏప్రిల్లో ఫ్లోరిడాలో జరగనున్న వరల్డ్కప్ స్టేజ్–1, మేలో చైనాలో జరిగే వరల్డ్కప్ స్టేజ్– 2 పోటీలకు సిద్ధమవుతోంది. ఒలింపిక్స్లో భారత్కు పతకం సాధిస్తానని చెబుతోంది. -
ఉంది 02
లేదు 91ఉమ్మడి జిల్లాలోని పలువురు మహిళలు ఇంటా, బయట, ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా.. సుమారు 100 మంది వెల్లడించిన అభిప్రాయాలు ఇలా..1మీ ఇంట్లో ఆడ–మగ వివక్ష ఉందా?చెప్పలేను 072అవును 04పనిచేస్తున్న కళాశాల, పని ప్రదేశంలో వివక్ష ఎదుర్కొంటున్నారా?లేదు 7818చెప్పలేను3బస్టాప్ 33మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం?కళాశాల/ ఆఫీసు 08సెల్ఫోన్లో వచ్చే మెసేజ్లు59●4తెలియని వారు 14మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు?తెలిసిన వారే 275అవును 27ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగరీత్యా మహిళగా ఇబ్బందులు తలెత్తుతున్నాయా?లేదు 47 -
వనిత..
అన్నింటా ఘనత‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్గా వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ● ఉమెన్స్డే కథనాలను పరిశీలించి ఫైనల్ చేసిన ఏఎస్పీ ● కథనాల పరిశీలన.. ఎంపికపై పలు సూచనలు ● పత్రిక సిబ్బంది కృషి అభినందనీయమన్న ఐపీఎస్ఆడపిల్ల పుట్టిందంటే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లను మహాలక్ష్మిగా కొలుస్తున్నారు. ఊర్లో.. అమ్మాయి పుడితే లక్ష్మీ వచ్చిందంటున్నారు. ఆమె ఒక తల్లి.. కూతురు.. సోదరి.. భార్య.. వీటన్నింటికీ మించి పోరాట యోధురాలు. ఆమె పుట్టుక ఆనందం. ఆమె ఓపికకు వందనం. ఆమె లేనిదే జననం లేదు. ఆమె లేనిదే జీవితం లేదు.. ఈ ప్రపంచానికి మనుగడే లేదు. అన్నింటా ఆమే.. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. చదువులో అగ్రస్థానంలో నిలుస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆవకాయ పెట్టడం నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా నారీ శక్తి కనిపిస్తోంది. కుటుంబానికి తోడుగా నిలుస్తూ.. కష్టాల్లో ఉన్న బతుకుబండిని లాగుతోంది. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనాలు.పత్రికా సిబ్బంది శ్రమ తెలిసిందిఅంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా గెస్ట్ ఎడిటర్గా కరీంనగర్ సాక్షి యూనిట్ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉంది. మనం ఉదయం చదివే దినపత్రికల కోసం 24 గంటలపాటు ఎన్నివ్యవస్థలు పనిచేస్తాయన్న విషయం ఈ రోజు ప్రత్యక్షంగా చూసే వీలుకలిగింది. వార్తల ఎడిటింగ్, ప్రాధాన్యం, పేజీనేషన్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ తదితర అంశాలపై సిబ్బంది పడుతున్న శ్రమ వెలకట్టలేనిది. ఈరోజు స్వయంగా వార్తలను ఎంపిక చేయడం, ఎడిటింగ్ చేయడం ప్రత్యేక అనుభూతి కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి సాక్షి పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ, వేములవాడ -
ఆ నలుగురు.. ‘సిరి’ వెలుగులు
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికవాడల్లో ఏ గడప తట్టినా.. కష్టాలు, కన్నీళ్లు. 2008లో వరుస ఆత్మహత్యలతో కార్మికక్షేత్రం తల్లడిల్లింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ సందీప్కుమార్ సుల్తానియా సిరిసిల్లలో ఉండే విధంగా ఆదేశించారు. ఆత్మహత్యలు ఆగాలని స్పష్టం చేశారు. ఆర్డీవో ఆఫీస్ లోనే మకాం వేసిన కలెక్టర్ ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించారు. పేదరికం, పనిఒత్తిడి, మానసికవేదన, అప్పులేనని నిర్ధారించారు. వారిలో ధైర్యం నింపేందుకు ఓ నలుగురు మహిళలను నియమించారు. వారు క్షేత్రస్థాయిలో ఇల్లిల్లు తిరుగుతూ బాధల్లో ఉన్న కార్మికులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఆ నలుగురే రాపెల్లి లత, బూర శ్రీమతి, వేముల అన్నపూర్ణ, కొండ ఉమ. వీరిని చేనేత జౌళిశాఖ ద్వారా నియమించారు. నిత్యం కార్మికవాడల్లో తిరుగుతూ కౌన్సెలింగ్ నిర్వహించారు. 16 ఏళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారికి ఆ నలుగురు అండగా నిలిచారు. కార్మికవాడలైన బీ.వై.నగర్, సుందరయ్యనగర్, తారకరామనగర్, ఇందిరానగర్, పద్మనగర్, గణేష్నగర్, నెహ్రూనగర్, శాంతినగర్, ప్రగతినగర్లోని కార్మికుల ఇళ్లకు వెళ్తూ వారి కష్టసుఖాలు తెలుసుకోవడవం, కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేయడం వీరివిధి. సైకాలజిస్ట్ పున్నంచందర్తో కలిసి మనోవిసాకాన్ని కలిగించేందుకు అనేక సదస్సులు నిర్వహించారు. అర్హులైన నేతకార్మికులకు అంత్యోదయ కార్డులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, నేతన్నలకు బీమా పథకాలను ఇప్పించడం, వైద్యం చేయించడం వంటి సామాజిక సేవలో ఆ నలుగురు ముందుకు సాగుతున్నారు. -
ఫాస్ట్బౌలర్.. శ్రీవల్లి
ఇల్లంతకుంట/కరీంనగర్ స్పోర్ట్స్ : చిన్ననాటి నుంచి క్రికెట్పై మక్కువ పెంచుకొని జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది కట్ట శ్రీవల్లిరెడ్డి. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట లక్ష్మారెడ్డి– ఉమ దంపతుల చిన్న కూతురు శ్రీవల్లిరెడ్డి మూడో తరగతి నుంచి క్రికెట్పై ఆసక్తి పెంచుకుంది. కూతురు ఇష్టం మేరకు లక్ష్మారెడ్డి హైదరాబాద్లో ప్రత్యేక కోచింగ్ ఇప్పించగా, పాస్ట్ బౌలింగ్లో మెలకువలు నేర్చుకుంది. 2019లో మధ్యప్రదేశ్లో జరిగిన జాతీయస్థాయి పాఠశాల క్రీడా ఫెడరేషన్ క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2022లో పూణెలో నిర్వహించిన అండర్– 19 బాలికల క్రికెట్ పోటీల్లో హెచ్సీఏ తరఫున పాల్గొంది. ఈ జనవరిలో త్రివేండ్రంలో నిర్వహించిన బీసీసీఐ ఉమెన్స్ అండర్–19 వన్డే ట్రోఫీలో, 2024 డిసెంబర్లో అహ్మదాబాద్లో నిర్వహించిన సీనియర్ ఉమెన్ వన్డే టోర్నీలో హైదరాబాద్ తరఫున ప్రాతినిఽథ్యం వహించింది. కాగా.. శ్రీవల్లి కోసం తన తండ్రి ఊరు వదిలి కరీంనగర్, హైదరాబాద్లో ఉంటున్నారు. -
నిరుద్యోగుల ఉపాధికి కార్యాచరణ
● ఎల్ఆర్ఎస్ను ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి స్కిల్ కమిటీ సమావేశం జరిగింది. నిరుద్యోగులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. కలెక్టర్ చైర్మన్గా 16 మంది జిల్లా స్థాయి అధికారులతో కూడిన జిల్లా స్థాయి స్కిల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. భవన నిర్మాణం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలను జిల్లా యువతకు వివరిస్తూ ఉపాధి కల్పనకు ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు. పెన్షన్లు రుణాలకు జమచేస్తే క్రిమినల్ కేసు ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక పింఛన్లను కొన్ని బ్యాంకులు రుణాల కింద జమ చేసుకుంటున్నట్లు తెలిసిందని, పెన్షన్లను రుణాల కిందికి జమ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. రూ.1,519కోట్లు పంట రుణాలు లక్ష్యం కాగా.. డిసెంబరు నాటికి రూ.808కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈనెలాఖరిలోగా పరిష్కరించాలని సూచించారు. 42,942 దరఖాస్తులు 2020లో రాగా 23,515 ఆమోదించామని, 1,230 తిరస్కరించినట్లు తెలిపారు. అధికారుల బృందం దరఖాస్తులు పరిశీలించి అర్హత ఉన్న వాటిని పరిష్కరించాలన్నారు. సమావేశాల్లో జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, డీఆర్డీవో శేషాద్రి, పరిశ్రమలశాఖ జీఎం హన్మంతు, డీఏవో అఫ్జల్ బేగం, ఎల్డీఎం మల్లికార్జున్, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు జనార్దన్, రాజమనోహర్, లీడ్ బ్యాంకు మేనేజర్ టీఎన్ మల్లికార్జున్రావు, యూబీఐ రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి, ఆర్బీఐ ఎల్డీవోవీ సాయితేజ్రెడ్డి, డీటీసీపీ అన్సార్, కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్ పాల్గొన్నారు. -
అమ్మ ప్రోత్సాహంతో సహన ఐఏఎస్
సప్తగిరికాలనీ(కరీంనగర్): సివిల్స్ కొట్టాలన్న కూతురు లక్ష్యానికి వెన్నంటే నిలిచింది ఆ తల్లి.. ఒకసారి ఫెయిలైనా.. రెండోసారి సాధించకున్నా.. సరే అమ్మా అధైర్యపడకూ అంటూ వెన్ను తట్టింది. నువ్వు సాధించగలవు అంటూ ప్రోత్సహించింది. నాలుగోసారి ప్రయత్నంలో ఆ కూతురు ఐఏఎస్ సాధించగా.. ఆ సక్సెస్లో తన తల్లి కీలకమంటోందా కూతురు. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన కొలనుపాక సహన 2023 బ్యాచ్ సివిల్ సర్వీసెస్కు ఎంపికై ంది. తన తల్లి గీత ఇచ్చిన స్ఫూర్తే ఇందుకు కారణమని చెబుతోంది. సహన హైదరాబాద్లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడాదిపాటు ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంది. తరువాత స్థానికంగానే సివిల్స్కు సన్నద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని సాధించింది. 739వ ర్యాంకు సాధించి ప్రస్తుతం శిక్షణలో ఉంది.తల్లి గీతతో కూతురు సహన -
స్నేక్.. షేక్
కరీంనగర్రూరల్: సాధారణంగా మహిళలు బల్లి కనిపిస్తేనే అమ్మో అంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఎలాంటి భయం లేకుండా పాములు పట్టడమే వృత్తిగా ఎంచుకుంది. కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన షేక్ సయిదా భర్త ఖాజామియా 15ఏళ్లక్రితం డెంగీతో చనిపోయాడు. కుటుంబపోషణ కోసం పాములు పడుతోంది. చిన్నప్పుడు తండ్రి సయ్యద్బాబా వద్ద నేర్చుకున్న పాములను పట్టడమే వృత్తిగా మార్చుకుంది. తమ ప్రాంతంలో పాము వచ్చిందని ఎవరైనా ఫోన్చేస్తే రాత్రి పగలు లేకుండా అక్కడికి చేరుకుంటోంది. పాములు పట్టినందుకు వారు ఇచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. పట్టుకున్న పాములను అటవీ శాఖ అధికారులకు అప్పగించడం, లేదా అటవీప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తోంది. సయిదా ప్రస్తుతం అద్దెఇంట్లో ఉంటోంది. పాముకాటుకు గురైతే తన కుటుంబ పరిస్థితి ఏంటని ఆవేదనవ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఆదుకునేందుకు సాయం చేయాలని కోరుతోంది. -
ఎములాడ రాజన్న సేవలో..
వేములవాడ: దైవకార్యంలో మేము సైతం అంటూ మహిళలు ముందుకు సాగుతున్నారు. సొంత ఖర్చులతో వేములవాడకు చేరుకుని హుండీ లెక్కింపులో, భక్తుల సేవలో తరిస్తున్నారు. ఒక్క ఫోన్కాల్ చేస్తే చాలు సొంత ఖర్చులతో రాజన్న సన్నిధికి చేరుకుని సేవలందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా శ్రీలలితా సేవా ట్రస్టు, శివరామకృష్ణ భజన మండలి, శ్రీరాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు దశాబ్దానికిపైగా రాజన్న సేవలో తరిస్తున్నారు. ప్రతీసారి జరిగే హుండీ లెక్కింపుతో పాటు అన్ని పర్వదినాలు, రద్దీ రోజుల్లోనూ వీరు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో సేవా సమితి సభ్యులు వస్తుంటారు. గురువారం నాటి హుండీ కౌంటింగ్లో సుమారు 550మంది మహిళలు పాల్గొన్నారు. ‘మహిళలు ఆలయంలో అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. వారి సేవలకు కృతజ్ఞతగా మధ్యాహ్న భోజనం, రెండు లడ్డూలు, స్వామి వారి దర్శనం కల్పిస్తున్నాం’. అని ఈవో కొప్పుల వినోద్రెడ్డి పేర్కొన్నారు. -
పురుషులకు దీటుగా..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన పింగిళి కృష్ణారెడ్డి–స్వర్ణలత దంపతులకు ఇద్దరు కూతుర్లు. కృష్ణారెడ్డి జేఎన్టీయూ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్. ఆడపిల్లలనే భావనలేకుండా తన కూతుళ్లను పురుషులు దీటుగా చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దారు. పెద్ద కూతు రు స్మిగ్ధ స్థానికంగా 10వ తరగతి, ఇంటర్, హైదరాబాద్లో బీటెక్(మెకానికల్) పూర్తి చేసింది. అమెరికాలో ఎమ్మెస్సీ చేసి ప్రస్తుతం హెచ్1బీ వీసా మీద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు స్నిగ్ధ స్థానికంగా పది, ఇంటర్, ఫామ్ డీ పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందింది. అమెరికాలో ఎమ్మెస్సీ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. -
ఇన్స్టాగ్రామ్ అశ్విని
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్లోని భగత్నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్పాత్పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల క్రితం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రొమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడవడంతో రీల్స్పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది. సిరిసిల్లక్రైం: మహిళలు, విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ అక్క పేరిట జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ను కేటాయించారు. 2024 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలను మమేకం చేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వేధింపులకు గురైతే బాధితులు ఇంట్లో మనిషి మాదిరిగా పోలీస్ అక్కకు చెప్పుకునేలా విధివిధానాలు ఖరారు చేశారు. పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 220 అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన పోలీసులు నాలుగు ఫిర్యాదులు స్వీకరించారు. అందులో మూడు ఈ–పెట్టి కేసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారిక గణంకాలు ఉన్నాయి.బాధితులకు అండగా ‘పోలీస్ అక్క’ -
వనిత.. అన్నింటా ఘనత
చిన్న హోటల్.. పెద్ద బాధ్యత ఊరిపై మమకారం.. సేవకు శ్రీకారంరామగిరి(మంథని): ఊరిపై మమకారంతో సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు రేండ్ల శారద. మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన శారద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన రేండ్ల కుమార్స్వామితో వివాహం జరిగింది. మహిళల నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులను చూసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భర్త సహకరంతో ఆర్ఎస్కే ఆపన్న హస్తం ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామంలోని మహిళలకు ఉచితంగా పరికరాలు అందించారు. మహిళలకు కుట్లు–అల్లికలు, బ్యూటిషియన్, కుట్టు మిషన్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. న్యాక్ సంస్థ ద్వారా సొంత ఖర్చులతో సర్టిఫికెట్స్ను అందించారు. ఒక్కో విడతలో సుమారు 40 మందికి మూడు నెలల పాటు శిక్షణ అందిస్తున్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఐదో బ్యాచ్ కొనసాగుతుంది. నా భర్త సహకారంతో సేవ చేయడం తృప్తిగా ఉంది’.అని శారద వెల్లడించారు. మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం ఆత్మనగర్కు చెందిన బట్టు సుశీల చిన్న హోటల్ నడిపిస్తూ తన కుమారుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. సుశీల, భర్త గంగరాజు గ్రామంలో హోటల్ నడిపించేవారు. 16 ఏళ్ల క్రితం గంగరాజు గుండెపోటుతో మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అతడు చనిపోయిన సమయంలో పిల్లలంతా చిన్నవారే. అప్పటి నుంచి సుశీల నలుగురు పిల్లల బాధ్యతను మోసింది. ప్రస్తుతం పెద్దకుమారుడు సుమన్ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు రంజిత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్ల వివాహం చేసింది. -
స్కానింగ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
సిరిసిల్ల: స్కానింగ్ సెంటర్లలో చేసే స్కానింగ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రోగ్రాం ఆఫీసర్, హెచ్ఎన్ ఇన్చార్జి సంపత్కుమార్ కోరారు. కుటుంబ ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాలతో సిరిసిల్లలోని పలు స్కానింగ్ సెంట ర్లను శుక్రవారం తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టం(పీసీపీఎన్డీటీ) ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సంపత్కుమార్ మాట్లాడుతూ స్కానింగ్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతోపాటు ఆన్లైన్లోనూ నమోదు చేయాలన్నారు. డిప్యూటీ డెమో డాక్టర్ రాజ్కుమార్, డీహెచ్ఈడబ్ల్యూ రోజా, పోలీస్ కానిస్టేబుల్ శ్రీలత, హెచ్ఈ బాలయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మహేశ్ పాల్గొన్నారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగసముద్రం నాలా(పెద్ద కాలువ) ఆయకట్టు భూములకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు, నాయకులు శుక్రవారం రోడ్డెక్కారు. సిద్దిపేట, కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరందక పొలాలు ఎండిపోతున్నాయని, పశువులకు తాగునీరు కూడా అందడం లేదని రైతులు వాపోయారు. నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ద్వారా పెద్ద కాలువకు నీరు విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని కోరారు. వీరి ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఆఫీస్ సబార్డినేట్ సస్పెన్షన్ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని గాలిపెల్లి పశువైద్య కేంద్రం ఆఫీస్ సబార్డినేట్ కె.దేవమ్మను శుక్రవారం సస్పెండ్ చేస్తూ జిల్లా పశువైద్యాధికారి రవీందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దేవమ్మ గతేడాది జూన్లో ముందస్తు రిటైర్మెంట్ కోసం మెడికల్ సర్టిఫికెట్లతో జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. లివర్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు మెడికల్ సర్టిఫికెట్లు జతపరిచింది. దీనిపై జిల్లా అధికారులు విచారించగా దేవమ్మ దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్స్ మోసపూరితమైనవని తేలింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పశువైద్యాధికారి దేవమ్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పులిసంచారంతో భయాందోళన
● గేదైపె దాడి ● పాదముద్రలు గుర్తించిన రైతులు వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం ఫాజుల్నగర్ ఫారెస్టు ప్రాంతంలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు బయటపడ్డాయి. ఫాజుల్నగర్ శివారులో ఓ గేదైపె పులి దాడిచేసిన ఆనవాళ్లు, దాని పాదముద్రలు రైతులు గుర్తించారు. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు రైతులకు సమాచారం వచ్చింది. ఫారెస్టు అధికారులు ఈ ప్రాంతంలో గాలిస్తున్నా పులి ఆనవాళ్లు గుర్తించలేదు. రెండు రోజుల క్రితం ఫాజుల్నగర్కు చెందిన ఉప్పరి నారాయణ అనే రైతు గేదైపె పులి దాడిచేయడం, దాని పాదముద్రలు బయటపడడంతో పులి తిరుగుతున్నట్లు రైతులు గుర్తించారు. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఫారెస్టు అధికారులు పులి తిరుగుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫాజుల్నగర్, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎఫ్ఆర్వో ఖలీలొద్దీన్ను వివరణ కోరగా పూర్తి సమాచారం రేపటి వరకు చెబుతామని దాటవేశారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి ● సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సిరిసిల్లటౌన్: ఎల్ఆర్ఎస్కు 2020లో రూ.వేయి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 25 శాతం రాయితీలో ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్య తెలిపారు. ఈమేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మండల మహిళా సమాఖ్యలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐదు మండల మహిళా సమాఖ్యలకు అవకాశం దక్కడం గమనార్హం. శనివారం రవాణామంత్రి పొన్నం ప్రభాకర్, సీ్త్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమాఖ్యలకు బస్సులు కేటాయించనున్నారు. ఎన్ఆర్ఎల్ఎం సాయంతో.. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈ పథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లెవెలుగు) బస్సులు కొంటారు. ఈ బస్సుల ఆర్సీ బుక్లో మహిళా సమాఖ్య పేరుమీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. వీటి నిర్వహణ ఆర్టీసీ చూసుకుంటుంది. నెలనెలా రూ.77,220 చొప్పున ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఎంపికై న సంఘాలివే.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్నసిరిసిల్లకు 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీచైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు మంత్రుల చేతులమీదుగా కొత్త బస్సులు అందుకోనున్నాయి. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సిరిసిల్లటౌన్: పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కేక్ కోసి సంబరాలు జరిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, డాక్టర్ తడక రవళి, మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, ఎక్స్ ఎంపీపీ సంకినేని లక్ష్మి, మాధవి, జయశ్రీ, భవిత, లావణ్య, సుస్మిత పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్రతిభవేములవాడఅర్బన్: అగ్రహారం ప్ర భుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్రం విద్యార్థులు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్ర తిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. విద్యార్థులు జాషువ, విష్ణు, గంగసాయి, అక్షయ్, వినయ్లు ‘ఇంపాక్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఆన్ బయింగ్ బిహేవియర్ ఆర్ కన్జ్యూమర్ ఎ స్టడీ ఇన్ డిస్ట్రిక్ట్’ అనే అంశంపై రూపొందించిన స్టడీ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అధ్యాపకులు శకుంతల, వైస్ ప్రిన్సిపాల్ లావణ్య, కృష్ణప్రసాద్, శోభారాణి, శ్రీధర్రావు అభినందించారు. -
మహిళా ఉద్యోగుల బోయినపల్లి
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలంలో మహిళా అధికారులు, ఉద్యోగులు అధికంగా ఉన్నారు. రెవెన్యూ, మండల పరిషత్, ఐకేపీ, ఉపాధిహామీ, వైద్య, వ్యవసాయ శాఖల్లో కొలువు దీరారు. ఎంపీడీఓగా భీమ జయశీల, డెప్యూటీ తహసీల్దార్గా దివ్యజ్యోతి, మండల వ్యవసాయ అధికారిగా కె.ప్రణిత, ఈజీఎస్ ఏపీవోగా వనం సబిత, ఐకేపీ ఏపీఎంగా జయసుధ, విలాసాగర్, కొదురుపాక పీహెచ్సీల్లో వైద్యులుగా అనిత, రేణుప్రియాంక.. ఇలా పలు విభాగాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంకిత భావంతో విధులు పంచాయతీరాజ్ శాఖలో వీడీవో, పంచాయతీ కార్యదర్శి, ఈఓపీఆర్డీగా పని చేసి ఇప్పుడు ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నా. వివిధ మండలాల్లో ప్రజలతో మమేకమై అనేక అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిది. – బీమా జయశీల, ఎంపీడీవో, బోయినపల్లి వ్యవసాయంపై మక్కువ వ్యవసాయ అధికారిగా అనేక మండలాల్లో రైతులకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చిన. పని చేసిన ప్రతీ చోట క్షేత్రస్థాయిలో పంట పొలాలు సందర్శించి రైతుల సాధక బాధకలు గుర్తించడం సంతృప్తినిస్తోంది. – కె.ప్రణిత, ఎంఏవో, బోయినపల్లి -
పీఆర్ పోస్టుల్లో వీఆర్వోలను నియమించొద్దు
● జెడ్పీ సీఈవోకు పీఆర్ ఉద్యోగుల సంఘం వినతి సిరిసిల్ల: మండల పరిషత్లోని పంచాయతీరాజ్ పోస్టుల్లో వీఆర్వోలకు అవకాశం కల్పించవద్దని తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్రావు కోరారు. ఈమేరకు జెడ్పీ సీఈవో వినోద్కుమార్కు గురువారం వినతిపత్రం ఇచ్చారు. వేములవాడరూరల్, రుద్రంగి మండల పరిషత్లలో వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించకుండా.. సూపరిటెండెంట్ పోస్టుల్లో నియమించారని పేర్కొన్నారు. ఈ విధానంతో పంచాయతీరాజ్శాఖలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారులు, సిబ్బందిని సన్మానించారు. పీఆర్ ఉద్యోగుల సంఘం నాయకులు రాజిరెడ్డి, రమణ, రమేశ్, పాపారావు ఉన్నారు. -
● దీక్ష విరమించండి ● రంగనాయకసాగర్ ప్రాజెక్టు డీఈ సీతారామ్ ● స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తామన్న రైతులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే అసంపూర్తి కాలువ పనులు ప్రారంభిస్తామని.. దీక్ష విరమించాలని రంగనాయక సాగర్ ప్రాజెక్టు డీఈ సీతారామ్, డీటీ సత్యనారాయణ, ఆర్ఐ షఫీ రైతులను కోరారు. రైతులు దీక్ష చేస్తున్న శిబిరాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. ఎమ్మెల్యే లేదా ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని రైతులు స్పష్టం చేయడంతో అధికారులు వెనుదిరిగారు. కాల్వ పనులు ప్రారంభించాలి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎల్ఎం–6 కెనాల్ పనులు ప్రారంభించకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ హెచ్చరించారు. పెద్దలింగాపూర్లో రైతులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన రూ.3కోట్లు విడుదల చేసి, కాల్వ పనులు ప్రారంభించాలని కోరారు. సీపీఎం నాయకులు గన్నారం నర్సయ్య, జవ్వాజి విమల, రైతులు కరికె నవీన్, గాదె మధుసూదన్, అమ్ముల అశోక్, పయ్యావుల బాలయ్య పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సిరిసిల్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. కలెక్టరేట్లో గురువారం మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ మహిళలకు సమానమైన హక్కులతోపాటు ప్రత్యేకమైన చట్టాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. గృహహింస నిరోధక చట్టం, పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయచట్టం అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటే టోల్ఫ్రీ నంబర్ 181 ద్వారా వైద్యం, న్యాయం, పోలీస్ కౌన్సెలింగ్, షెల్టర్ సహాయాలు కోరవచ్చని వివరించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మలదేవి, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, సఖీ ఇన్చార్జి విజయ, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మిషన్ భగీరథ ఈఈ జానకి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సమరసేన, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, మహిళా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సఖీ కేంద్రం ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం -
దంతవైద్య దినోత్సవం
సిరిసిల్ల: జాతీయ డెంటిస్ట్ డే సందర్భంగా సిరిసిల్లలో గురువారం దంతవైద్యులు ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల అంబేడ్కర్ సర్కిల్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్, వాకింగ్ చేశారు. నోటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇండియన్ డెంటిస్ట్ అసోసియేషన్(ఐడీఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పిన్నా రాజు తెలిపారు. ఐడీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యులు ఎస్.సతీశ్కుమార్, డి.శ్యాంసుందర్రెడ్డి, దంతవైద్యులు విజయ్, రాజేందర్, కె.గోపి, సత్య, అన్వేశ్, సీహెచ్.సంతోష్, పూర్ణచందర్, శివరామకృష్ణ, ఎ.సంతోష్, కీర్తి, ప్రియ, స్నేహ, గీత, ఆకాంక్ష, సంధ్య, రమ్య, లావణ్య, ఎం.రాజేందర్, నరేశ్, శ్రవంతి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
హస్త వైఫల్యం!
● ఎమ్మెల్సీ ఓటమిపై కాంగ్రెస్లో మొదలైన అంతర్మథనం ● చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాలలో ప్రతికూలం ● పెద్దపల్లి జిల్లాలోనే హస్తం పార్టీకి మెజారిటీ ● కరీంనగర్లో అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీల్లో వరుస ఓటమి ● కొంపముంచిన చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు ● పార్టీలో లోపాలపై ముఖ్యమంత్రికి త్వరలో నివేదిక ● నాటి సీఎం తరహాలోనే నేటి సీఎం వ్యాఖ్యలు చేటు చేశాయా?ఎక్కడెక్కడ బలహీనం అంటే? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతను ఎంపిక చేయడం లోకల్ పలువురు నాయకులకు నచ్చలేదు. కీలకమైన కరీంనగర్ నుంచి మరో నాయకుడు ఎదగడం తమ పార్టీలోనే ముగ్గురు ముఖ్యనేతలకు ఇష్టం లేదని ఓటమి అనంతరం నరేందర్రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. గెలవగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారంతో కొందరు ముఖ్యనాయకులు పార్టీ ఎన్ని కల ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా వ్యహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్కు తక్కువ ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగి త్యాల, ధర్మపురి, మానకొండూర్లో తక్కువ ఓట్లు వచ్చాయని సాక్షాత్తూ నరేందర్రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చేందుకు నరేందర్రెడ్డి సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపునకే దారి తీస్తోంది. పార్టీలో సమన్వయ లోపాలు, అనైక్యత, పరస్పర సహకారం కొరవడటం తదితర వైఫల్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు, 2025లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇలా ఏడాదిన్నర కాలంలో కరీంనగర్లో కాంగ్రెస్ వరుసగా ఓడింది. కానీ, ఈసారి ఓటమిపై పార్టీలో ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది. వాస్తవానికి 15 జిల్లాలు, 42 నియోజకవర్గాలలోని గ్రాడ్యుయేట్ల కోసం ఎన్నిక జరిగినా.. ప్రచారం, నామినేషన్, రాజకీయం అంతా కరీంనగర్ కేంద్రంగానే జరిగింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించడం, సిట్టింగ్ సీట్లో ఓటమిపై మునుపెన్నడూ లేని చర్చ నడుస్తోంది. చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు వాస్తవానికి నరేందర్రెడ్డికి తన ప్రత్యర్థి అంజిరెడ్డి(బీజేపీ)కన్నా కేవలం 5,106వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. అదే సమయంలో 28,686 ఓట్లు చెల్లనివి వచ్చాయి. ఈ ఓట్లలో దాదాపు 16వేల ఓట్లు నరేందర్రెడ్డికే పడడం దురదృష్టకరం. అందులోనూ ఆరువేలకుపైగా ఓట్లు కేవలం అంకె ముందు సున్నా వేయడం వల్ల చెల్లకుండా పోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. అదే సమయంలో బీజేపీ జిల్లా, మండలం, గ్రామం, బూత్లెవల్వరకు పోల్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా నిర్వహించింది. ప్రతీ 25మందికి ఒక ఇన్చార్జిని నియమించి, ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో క్యాడర్ సఫలీకృతమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం, ఆధిపత్య పోరు, పోల్ మేనేజ్మెంట్ వైఫల్యాల కారణంగా ఓటరును ప్రసన్నం చేసుకోవడంలో దెబ్బతిన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థికి ఓట్లు వేయించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని నరేందర్రెడ్డి వర్గం ఆరోపిస్తుండటం గమనార్హం. నాడు కేసీఆర్.. నేడు రేవంత్ కరీంనగర్ ఉద్యమాలకు, భావోద్వేగాలకు నిలయమైన జిల్లా. ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పులనివ్వడంలో పరిపాటి. అందుకే, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయాన్ని అందుకుని మంచి జోరు మీదున్న బీఆర్ఎస్కు మొదటి ఎదురుదెబ్బ కరీంనగర్లోనే తగిలింది. 2019 గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించి బీఆర్ఎస్కే కాదు.. రాష్ట్ర రాజకీయాలకే కరీంనగర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇటీవల నరేందర్రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ఈ ఎమ్మెల్సీ గెలవకపోయినా.. తమకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం ఆ వెంటనే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం చర్చానీయాంశంగా మారాయి. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్న మాట వాడటం.. ఆ పార్టీ పరాజయంలో కీలకంగా పనిచేసిన విషయాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. -
రోడ్లు, భవనాల నిర్మాణాల్లో వేగం పెంచండి
● పెండింగ్ పనులు పూర్తి చేయండి ● జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● రహదారులు, భవనాల శాఖ పనుల పురోగతిపై సమీక్ష సిరిసిల్ల: జిల్లాలోని రోడ్లు, భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం ఆర్అండ్బీ ఇంజినీర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 12 రోడ్లు, 8 భవనాలు(వైద్య కళాశాలతో) ఏడు బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భవనాల శాఖ పరిధిలో పెండింగ్ రహదారి పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు ఏదైనా తాత్సారం ఉంటే వివరాలు అందించాలని, ప్రభుత్వానికి లేఖ రాసి బిల్లుల చెల్లింపు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి రోడ్డు నిర్మాణ స్థితిగతుల గురించి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులోకి వచ్చే రోడ్డు పనులు ప్రాధాన్యతతో చేపట్టి పూర్తి చేయాలన్నారు. రోడ్డు నిర్మాణ పనులకు ఎక్కడా ఇసుక సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యత ప్రామాణాలతో చేపట్టాలని అన్నారు. వీర్నపల్లి దగ్గర పాఠశాల సమీపంలో సీసీరోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని కలెక్టర్ సంబంధిత తహసీల్దార్ను ఫోన్లో ఆదేశించారు. ఎన్నికల కోడ్ కూడా ముగిసిందని అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. డీఎంఎఫ్టీ పరిధిలో పెండింగ్ బిల్లుల వివరాలు సమర్పించాలని, వెంటనే చెల్లించనున్నట్లు తెలిపారు. రూ.166 కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని వీటిని నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు, అన్నదానసత్రం, వీర్నపల్లి వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముస్తాబాద్ మండలంలో తహసీల్దార్ ఆఫీస్ నిర్మాణం, కోర్టు భవనాల పనుల టెండర్ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణయ్య, డీఈఈలు శాంతయ్య, కిరణ్కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్రతిభ
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనశాస్త్రం విద్యార్థులు కళాశాల విద్యాశాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుల్లో ప్రతిభ కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. విద్యార్థులు కిరణ్మయి, సిద్ధార్థ, వెంకట్, లావణ్య, శివాణి ‘ఎనాలసిస్ ఆఫ్ ఫైటో కెమికల్స్ ఇన్ సమ్ వెజిటబుల్స్ అండ్ ప్రూట్స్’ అనే అంశంపై రూపొందించిన స్టడీప్రాజెక్ట్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. హైదరాబాద్లోని రీసెర్చ్ రూసా సెంటర్లో విద్యార్థులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమర్పించారు. అధ్యాపకులు కరుణ, వైస్ప్రిన్సిపాల్ లావణ్య, కృష్ణప్రసాద్, శోభారాణి ఉన్నారు. -
గొల్లపల్లి పశువైద్యశాల ఎల్ఎస్వో సస్పెన్షన్
సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి పశువైద్యశాలలో లైవ్స్టాక్ అధికారిగా పనిచేస్తున్న కె.కొమురయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్కుమార్ ఝా గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2024 జనవరి 19న మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకుని కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ పేరిట నకిలీ వైద్యసర్టిఫికెట్లు సృష్టించిన కొమురయ్యపై విచారణ చేపట్టి విధుల నుంచి తప్పించారు. 2017 నుంచి గొల్లపల్లి పశువైద్యశాలలో లైవ్స్టాక్ అధి కారిగా కొమురయ్య పనిచేయడం లేదు. లెటర్హెడ్, స్టాంప్స్, డాక్టర్ సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. నకిలీ వైద్యపత్రాలను సృష్టించిన కొమురయ్యపై ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయడంతోపాటు సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్పై వ్యాఖ్యలు అర్థరహితం ● మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వనిత సిరిసిల్లటౌన్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత పేర్కొన్నారు. సిరిసిల్లలో గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో వేములవాడ ఎమ్మెల్యే జర్మనీలో ఉండేవాడని ప్రజల కష్టసుఖాలను గాలికొదిలేశారన్నారు. కానీ ఆది శ్రీనివాస్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్ దగ్గరికి వెళ్లి ఎండిపోయిన కెనాల్ను చూపించి ఇది వేములవాడలోనే ఉందనడం శోచనీయమన్నారు. అధికారం పోయిందన్న బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలివ్వాలి ● సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ సిరిసిల్లటౌన్: కార్మికులకు కనీస వేతనాలు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవోల డ్రాఫ్టులను సవరించి, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఐదేళ్లకోసారి కనీస వేతనాలను సవరించాల్సి ఉండగా 12 ఏళ్లుగా పెంచడం లేదన్నారు. నాయకులు జిందం కమలాకర్, బెజుగం సురేష్, బత్తుల రమేశ్ పాల్గొన్నారు. నీటి చౌర్యంపై చర్యలు తీసుకోవాలి సిరిసిల్లటౌన్: చంద్రవంక ప్రాజెక్టులో అక్రమంగా మోటార్లు బిగించి జరుగుతున్న నీటిచౌర్యంపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ కులస్తులు కోరారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో అధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. గతంలోనే సెస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు మోటార్లు తొలగించారని, అయినా నీటిచౌర్యం ఆగడం లేదన్నారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం ప్రతినిధులు కనకయ్య, అంజయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎండీకి నీటి విడుదలఎల్ఎండీకి వెళ్తున్న నీరు బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఎల్ఎండీకి 2,500, కుడి కాలువకు 550, ప్యాకేజీ–9 మల్కపేటకు 350, ఎడమ కాలువకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేశారు. మిడ్మానేరు ప్రాజెక్టులో 14.87 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.