breaking news
Rajanna
-
ఆపదలో ఆదుకున్నది కేటీఆర్ అన్న మాత్రమే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టకాలంలో తమకు అండగా నిలిచి, దేవుడిలా ఆదుకున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రమేనని నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు తమను కేవలం వాడుకున్నారే తప్ప ఎలాంటి సాయం యలేదని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ గోపాల్ కుటుంబ సభ్యులు మాట్లాడూతూ... ‘మమ్మల్ని అందరూ రాజకీయంగా వాడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మా వద్దకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోయారే తప్ప సహాయం చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా పక్క ఊరికి (రెండు కిలోమీటర్ల దూరంలోకి) వచ్చినా కనీసం పరామర్శించలేదు. మీకు రూ. 20 కోట్లు ఇప్పిస్తా’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ, రూపాయి సాయం చేయలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారి పీఏలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. బండి సంజయ్ విజయసంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా మమ్మల్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదని తెలిపారు.కుటుంబ సభ్యుడిలా అండగానిలిచిన కేటీఆర్ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కేటీఆర్ అన్న స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూశారు. ‘నేను మీ ఇంట్లో పెద్ద అన్నలాంటివాడిని, ఆస్పత్రి ఖర్చులు, ఆర్థికసాయం ఏది కావాలన్నా నేను చూసుకుంటా’ అని ధైర్యం చెప్పారని తెలిపారు. ‘చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పరామర్శించిన ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమే అని, కల్వకుంట్ల కవిత అక్క కూడా మాతో మాట్లాడి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ కుటుంబానికి కష్ట సమయంలో నిజమైన అండగా నిలిచింది కేటీఆర్ మాత్రమేనని, అందుకే తాము ఎప్పటికీ ఆయననే నమ్ముతామని స్పష్టం చేశారు. మాట్లాడిన వారిలో గోపాల్ భార్య గంధం లావణ్య, తల్లి బాలవ్వ, కూతుళ్లు అక్షిత, నిఖిత, కొడుకు అభినయ్, తమ్ముడు గొర్రె మహేశ్ ఉన్నారు. -
జిల్లా అంతటా జల్లులు
సిరిసిల్ల: జిల్లా అంతటా మంగళవారం మోస్తరు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బోయినపల్లి మండలంలో 55.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 11.9, చందుర్తి 14.7, వేములవాడరూరల్ 42.7, వేములవాడ 44.5, సిరిసిల్ల 15.3, కోనరావుపేట 43.6, వీర్నపల్లి 38.9, ఎల్లారెడ్డిపేట 10.4, గంభీరావుపేట 15.6, ముస్తాబాద్ 19.9, తంగళ్లపల్లి 20.2, ఇల్లంతకుంట 13.2 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 26.6 మి.మీ నమోదైంది. జిల్లాలో మంగళవారం వరకు సాధారణ వర్షపాతం 335.1 మి.మీ కాగా, ఇప్పటి వరకు 236.9 మి.మీ వర్షం కురిసింది. జిల్లా అంతటా 29మి.మీ లోటు వర్ష ఉంది. కాగా, బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలుసిరిసిల్ల: మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, యువత డ్రగ్స్కు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారిని గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో స్నేహభావంసిరిసిల్ల అర్బన్: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ చటర్జీ అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్ధాపూర్ బెటాలియన్లో ఇంటర్ కంపెనీస్ అన్నుయల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరై మాట్లాడారు. సిబ్బందిలో ఒత్తిడి తగ్గించేందుకు ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బహుమతులు అందిస్తున్నట్లు వివరించారు. క్రీడా పోటీలతో విధి నిర్వహణలో సిబ్బంది చురుకుగా పనిచేస్తారన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాసు, ఎస్.సురేశ్, ఎం.రాజు, ఆర్ఐలు రామబ్రహ్మం, శ్రీనివాస్, కుమారస్వామి, శ్యాంరావు పాల్గొన్నారు. కథల పోటీల్లో జాతీయస్థాయి బహుమతి గంభీరావుపేట(సిరిసిల్ల): ఉషాబాల పత్రిక వారు నిర్వహించిన పిల్లల కథల పోటీల్లో గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పర్ష వర్షిక జాతీయ స్థాయి బహుమతికి ఎంపికై ంది. తాను రాసిన పట్టుదల అనే కథ అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన ఓ విద్యార్థి జీవితాన్ని కథ రూపంలో రాసి జాతీయస్థాయికి ఎంపికై ంది. రిషికను హెచ్ఎం గంగారాం, ఉపాధ్యాయులు అభినందించారు. ఎంజేపీటీబీసీలో నేడు స్పాట్ అడ్మిషన్లుసిరిసిల్ల: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీ సీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ సుస్మిత తెలిపారు. సిరిసిల్ల ఎంజేపీటీబీసీ సంక్షేమ గురుకులంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని వివరించారు. బీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడునని, ఎస్సెస్సీలో 450 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్పాట్ అడ్మిషన్కు రావాలని పేర్కొన్నారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఈవీ బస్సు
మెట్పల్లి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 8 మంది ప్రయాణకులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు మంగళవారం ఉదయం 3.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం ఐదు గంటలకు మెట్పల్లి సమీపంలోకి రాగానే.. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న షౌకత్ అలీ, పంకజ్, అక్షయ్, నదీమ్, ఖదీర్, రాజు, జుబేర్, ప్రవీణ్ గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని జగిత్యాలకు తరలించారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గాయపడ్డ ప్రయాణీకులు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం 8 మంది ప్రయాణికులకు గాయాలు -
ప్రైవేట్ పాఠశాల వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని యావర్రోడ్లో.. అటవీశాఖ కార్యాలయం సమీపంలో కృష్ణానగర్ వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల వాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం ఢీకొంది. కృష్ణానగర్కు చెందిన ఓ ప్రైవేటు వాహనం 20 మంది విద్యార్థులతో కొత్తబస్టాండ్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తోంది. అదే సమయంలో పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే యావర్లో సంఘటన జరగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఉన్న వారంతా చిన్నారులను చేరదీశారు. ప్రైవేట్ వాహన డ్రైవర్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చక్రాల సుదర్శన్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ మారంపల్లి నరేశ్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు -
ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన పిట్ల రాములు(41) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాములు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్, గడ్డి కట్టల మిషన్ తీసుకున్నాడు. ఆశించిన స్థాయిలో పని దొరక్కపోవడంతో ఇప్పటి వరకు ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు. ఫైనాన్స్ వారు ట్రాక్టర్ను తీసుకెళ్తారేమోనని మానసిక ఆందోళనకు గురయ్యాడు. తాను చనిపోతే ఆర్థిక సమస్యలు ఉండవని గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ముందే గుర్తిస్తే హెపటైటిస్ దూరం
సిరిసిల్లటౌన్: లక్షణాలను ముందే గుర్తిస్తే హైపటైటిస్ వ్యాధిని దరి చేరకుండా చేయొచ్చని నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీధర్గౌడ్ అన్నారు. మంగళవారం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లాసుపత్రిలో కాలేయ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన మాట్లాడారు. కాలేయానికి సోకే హెపటైటిస్–బి, సి వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. నిరంతరం రోగుల సేవలో ఉండే హెల్త్ కేర్ వర్కర్లు ముందస్తు జాగ్రత్తగా టీకా తీసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ, హెల్త్ కేర్ వర్కర్లకు హెపటైటిస్–బి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నాగేందర్బాబు, ఆర్ఎంవో డాక్టర్ సుమన్మోహన్రావు, హెచ్ఓడీ డాక్టర్ నాగన్న తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
వేములవాడ: ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రతీ ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ను సందర్శించారు. వివిధ విభాగాలు, పలు రికార్డులు తనిఖీ చేశారు. పెండింగ్, విచారణలో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పోలీస్శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరిస్తూ, వారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి, పేకాట మొదలగు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. నేడు వేములవాడకు మంత్రి రాక వేములవాడ: రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం రాత్రి వేములవాడకు చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30న వేములవాడ భీమన్న ఆలయంలో జరిగే వరుణయాగంలో పాల్గొంటారని, అనంతరం రూ.1.65 కోట్లతో వేములవాడ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఈనెల 30,31, ఆగస్టు 1న మూడు రోజులపాటు వరుణయాగాలు నిర్వహిస్తున్న క్రమంలో గర్భగుడి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. -
తప్పుల సవరణే సవాల్
● ఎన్యూమరేషన్ ఫారాల్లో పొరపాట్లు ● దిద్దుబాటు బాధ్యతల్లో స్వచ్ఛంద సేవకులువేములవాడ: ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుంది. ఎన్యూమరేషన్ ఫారాలలో పలు రకాల తప్పులు దొర్లడంతో వాటిని సరిదిద్దడం సిబ్బందికి సవాలుగా మారింది. దరఖాస్తుదారులతో పాటు బీఎల్ఏలు, బీఎల్వోలు పూర్తి చేసిన ఫామ్స్లలోనూ తప్పులు దొర్లడంతో వాటిని సవరించేందుకు స్వచ్ఛంద సేవకులు తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఫామ్స్ నింపడం సులువని, దిద్దడం తలనొప్పిగా మారిందని వాపోతున్నారు. అవగాహన లోపం ఓటర్ల నుంచి స్వీకరించిన ఫారాలలో పలుచోట్ల అసంపూర్తి వివరాలు, తప్పుడు సమాచారం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఓటరు వివరాల కాలమ్లో పాత, కొత్త ఎపిక్ సంఖ్యలు తారుమారు కావడం, కుటుంబ సభ్యులు, బంధుత్వాల వివరాలు సక్రమంగా పూరించకపోవడం, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం సంఖ్యలను తప్పుగా రాయడం, వివాహమై వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాల నమోదులో స్పష్టత లేకపోవడం, కొన్ని చోట్ల ఆధార్ సంఖ్యలు, ఫోన్ నంబర్లు అరకొరగా నమోదు చేయడంతో ప్రక్రియ మందగించింది. స్వచ్ఛంద సేవకుల సేవలు అమోఘం ఎన్యూమరేషన్ ఫారాలలో తప్పులను సరిదిద్దేందుకు స్వచ్ఛంద సేవకుల సేవలను తహసీల్దారు కార్యాలయంలో వినియోగించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటి నుంచి తెప్పించిన ఫారాల్లోని తప్పులను సరిచూడడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడం వంటి పనుల్లో పలువురు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మూడో తేదీ చివరి అవకాశం ఎస్ఐఆర్ ఫారాల దాఖలు, దిద్దుబాట్లకు ఆగస్టు 3 వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమ ఓటు వివరాల్లో ఏమైనా తప్పులు, మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్వో లేదా అధికారిక పోర్టల్ ద్వారా సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. -
అంతర్జాతీయంగా రాణిస్తా
హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నా. పతకాలు సాధించలేదు. జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. టేబుల్టెన్నిస్లో అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించేలా ఎదగడం నా లక్ష్యం. – అన్విక్ష్ నందన్ జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా పోటీల్లో రాణిస్తాను. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లో రాణించాను. భవిష్యత్లో గొప్ప క్రీడాకారిణిగా మారాలని ఉంది. – ఎ.అనన్య -
జాతీయ వేదికపై కరీంనగర్ కెరటాలు
● నేషనల్ టేబుల్ టెన్నిస్ బరిలో జిల్లా క్రీడాకారులు ● ఆగస్టు 16 నుంచి 23 వరకు కాన్పూర్లో పోటీలుఢిల్లీ, డయ్యూడామన్, తమిళనాడులో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. పతకం సాధించలేదు. ఈ సారి తప్పకుండా పతకం సాధిస్తా. టేబుల్ టెన్నిస్లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిరోజూ సాధన చేస్తున్నా. – ఎల్లా అవనిరెడ్డి రాష్ట్రస్థాయి పోటీల్లో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. చీఫ్ మినిస్టర్స్ కప్లో 3వ స్థానం సాధించాను. జిల్లాస్థాయి పోటీల్లో 19 పతకాలు గెలుచుకున్నాను. ప్రస్తుతం జరుగనున్న పోటీల్లో పతకం సాధించడమే నా లక్ష్యం. – కటికిరెడ్డి అద్వికనాథ్ కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్థానిక స్పోర్ట్స్ అకాడమీకి చెందిన టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు వచ్చే ఆగస్టులో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగే నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్–2026కు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్రీడాకారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు కఠినమైన సాధన చేస్తున్నారు. -
కార్గో లేక కష్టాలు
● వేములవాడ బస్టాండ్లో నిలిచిన సేవలు ● పట్టించుకోని అధికారులువేములవాడ: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్లో కార్గో ప్యాకేజ్/పార్శిల్ సేవలు అందుబాటులో లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ కార్గో సేవలు ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు అత్యవసరంగా ఏదైనా పార్శిల్ పంపాలన్నా, బయటి నుంచి వచ్చే పార్శిళ్లను తీసుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పార్శిల్ పంపాలన్నా 12 కిలోమీటర్ల దూరంలోని సిరిసిల్ల, 35 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో సమయంతో పాటు రవాణా భారం పడుతోందని స్థానికులు వాపోతున్నారు. బస్టాండ్లో అన్ని వసతులు ఉన్నా, డిపో అధికారులు కార్గో కౌంటర్ నిర్వహణను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియలో ఉంది వేములవాడ బస్టాండ్లో కార్గో పార్సిల్ సర్వీసు సేవలు నిలిచిపోయాయి. మూడుసార్లు టెండర్ కాగా సరైన గిడ్ రాకపోవడంతో రద్దయింది. మరోసారి టెండర్ నిర్వహించి ప్రయాణికులు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – బోనాల శ్రీనివాస్, డీఎం, వేములవాడ -
ఫంక్షన్కు వెళ్లి.. రైల్వే ట్రాక్ వద్ద శవమై..
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం సత్తక్కపల్లి శివారులో రైలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేటకు చెందిన మామిడి రాజగంగారాం(60)గా గుర్తించారు. రాజగంగారాం కమ్మర్పల్లి సమీపంలోని నాగాపూర్లో ఓ ఫంక్షన్ వచ్చినట్లు సమాచారం. అక్కడ మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించడంతో కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెట్టిపల్లి శ్రీకాంత్ (38) మంగళవారం ఓ ఇంట్లో కరెంట్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వెంకట్రాజంను వివరణ కోరగా, శ్రీకాంత్ ఫిట్స్తో మృతిచెందాడని, ఇప్పటి వరకు మృతుడి బంధువుల నుంచి ఏలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తానని తెలిపారు. బండరాయి మీద పడి కూలీ మృతిమానకొండూర్: గంగిపల్లి గ్రామ శివారులో రెడ్డి కొమురయ్య(52) అనే కూలీ పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి బావిలోనే దుర్మరణం చెందాడు. గంగిపల్లి గ్రామ శివారులో కొండపల్కల గ్రామానికి చెందిన బాపురెడ్డి వ్యవసాయ బావిలో పూడిక తొలగింపు పనులు క్రేన్ సహాయంతో చేపట్టారు. బావిలోకి దిగిన కొమురయ్య తోటి కూలీలతో పని చేస్తున్న సమయంలో క్రేన్ బకెట్(డబ్బా) నుంచి బండరాయి జారి అతడి తలపై పడింది. తీవ్ర గాయాలతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మానకొండూర్ సీఐ పి.శ్రీలత ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తేనే మృతదేహాన్ని కరీంనగర్కు తరలించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేయగా.. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని సీఐ మృతదేహాన్ని కరీంనగర్కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. అందరికీ వివాహమైంది. కోనరావుపేటలో ఒకరికి డెంగీ కోనరావుపేట(వేములవాడ): మండలకేంద్రంలో ఒకరికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు వైధ్యాధికారులు గుర్తించారు. సదరు వ్యక్తి కొద్ది రోజులక్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా రక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మండల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటా సర్వే చేపడుతున్నారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
● టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తంగళ్లపల్లి: నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేరెళ్ల ఘటన బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అనంతరం బాధితులు పెంట బానయ్య, కోల హరీశ్ తదితరులను పరామర్శించారు. తాను కేవలం పరామర్శించి వెళ్లేందుకు రాలేదని, నేరెళ్ల ఘటన బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం అందేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పార్టీ నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని నమ్మబలికి ఓట్లు దండుకున్నారని, ప్రభుత్వంలోకి వచ్చాక వారిని మరిచారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం ఉన్నా బాధితులకు న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అంతకముందు కవిత కాన్వాయ్కి జిల్లా శివారులోని జిల్లెల్ల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లెల్లలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు సుమలత సుధాకర్ శర్మ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ మజీద్, మండల ఇన్చార్జి చెరుకుపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
● 120 గ్రాముల గంజాయి స్వాదీనం జగిత్యాలక్రైం: జగిత్యాల శివారు మోతె శ్మశానవాటిక ఎదురుగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చూపారు. పట్టణ శివారు లింగంపేటకు చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్బోర్డుకు చెందిన గజ్జెల అజయ్, లక్ష్మీపూర్కు చెందిన ఆలకుంట్ల గణేశ్, తులసీనగర్కు చెందిన ఏళ్ల మనోజ్ ఇటీవల ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వెళ్లి 120 గ్రాముల గంజాయి కొనుక్కుని వచ్చి మోతె శ్మశాన వాటిక వద్ద విక్రయిస్తున్నారు. వారిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకుని 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు సిరిసిల్ల: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.2,000 జరిమానా విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పునిచ్చారు. ఎస్పీ మహేశ్ బీ గీతే కథనం ప్రకారం.. సిరిసిల్లకు చెందిన బూర్ల చంద్రశేఖర్ ఓ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి కేసు దర్యాప్తు చేసి చంద్రశేఖర్ను రిమాండ్కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా ఏఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్సైలు రవీందర్నాయుడు, శ్రవణ్యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ జనార్ధన్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పీపీ రజినీకాంత్ వాదించారు. న్యాయమూర్తి సాక్ష్యాలు పరిశీలించి నిందితుడికి జైలు, జరిమానా విధించారు. ధాన్యం బకాయిలు చెల్లించాలివేములవాడరూరల్: రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. మంగళవారం మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో వే ములవాడ రూరల్ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంలో ఎంతమంది రైతులు నష్టపోయా రు, బాధ్యులపై ఎం చర్యలు తీసుకుంటున్నారనే వి షయాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డి మాండ్ చేశారు. మర్రిపల్లి, మల్లారం, నూకలమర్రి రైతులు బకాయిల కోసం ఆందోళనలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం దురదష్టకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీని వాస్, జిల్లా కార్యదర్శి సురేందర్రావు, ఓబీసీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్బాబు, కౌన్సిల్ సభ్యుడు జక్కుల తిరుపతి, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలు వేయాలి
వేములవాడరూరల్: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం వేములవాడ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.సాయికుమార్ సూచించారు. జూలై 23 నాటికి జిల్లాలో సాధారణంగా 283.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 190.4 మి.మీ నమోదై, 33 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలోని 13 మండలాలకు 11 మండలాల్లో లోటు వర్షపాతం, రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా రుద్రంగిలో 48 శాతం, ఇల్లంతకుంట 46, తంగళ్లపల్లి 44, సిరిసిల్ల 43, బోయినపల్లి 38, వేములవాడరూరల్ 36, వీర్నపల్లి 16, కోనరావుపేటలో 18 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లా సగటు భూగర్భ జల మట్టం గతేడాదితో పోలిస్తే 2.91 మీటర్లు లోతుకు వెళ్లిందని వివరించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు వేసుకోవడం ఉత్తమమన్నారు. అవసరమైన చోట డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులు వినియోగించాలని సూచించారు. భూగర్భ జలాల మట్టం ఇలా.. మండలం మీటర్లు వేములవాడఅర్బన్ 21.38 సిరిసిల్ల 18.38వీర్నపల్లి 18.06ఎల్లారెడ్డిపేట 17.74గంభీరావుపేట 13.16 తంగళ్లపల్లి 12.54ముస్తాబాద్ 12.04కోనరావుపేట 11.54రుద్రంగి 10.44ఇల్లంతకుంట 9.22చందుర్తి 8.53వేములవాడరూరల్ 8.10బోయినపల్లి 7.82 -
కూరగాయల సాగుతో ఆదాయం
వేములవాడఅర్బన్: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా కూరగాయలు సాగు చేసి మంచి ఆదాయం పొందాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కాలానికి అనుగుణంగా తీరొక్క కూరగాయలు సాగు చేస్తున్న వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన రైతు చెరుకు తిరుపతి వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం సందర్శించారు. వర్షాలు లేనందున తనకున్న ఐదెకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేస్తానని, 30 గుంటల్లో కూరగాయలు సాగుచేస్తున్నట్లు కలెక్టర్కు రైతు తెలిపాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తిరుపతి కూరగాయలు సాగు చేయడాన్ని చూసి కలెక్టర్ అభినందించారు. మిగతా రైతులు కూడా ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. ఉద్యానవన, ఇతర శాఖల నుంచి వచ్చే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకముందు మారుపాక రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు ఆదర్శ రైతులను సన్మానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని, మార్కెట్ డిమాండ్, నేలకు అనుకూలమైన పంటలు సాగు చేయాలన్నారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కుమార్ పాల్గొన్నారు. -
క్రీడాప్రాంగణంలో శవం పూడ్చివేత
సైదాపూర్: ఆరెపల్లిలోని తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలో మంగళవారం శవాన్ని పూడ్చివేసిన ఘటనతో క్రీడాకారులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన లొల్లేటి భిక్షపతి మృతిచెందగా.. మృతదేహాన్ని ఆరెపల్లి తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలోనే పూడ్చేశారని గ్రామస్తులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే శ్మశాన వాటిక ఉన్నా.. కాల్చకుండా ఎదురుగా ఉన్న క్రీడాప్రాంగణంలో పూడ్చేశారు. ఈ ఏడాది వర్షాల్లేక.. చెరువులోకి నీరు రాక మైదానం ఆటలకు అనుకూలమైంది. నెల రోజులుగా ఈ క్రీడాప్రాంగణంలో సైదాపూర్, వెన్కెపల్లి, జాగీర్పల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం, వెన్నంపల్లి గ్రామాలతోపాటు మానకొండూర్ నియోజకవర్గం నుంచి కూడా క్రీడాకారులు వచ్చి క్రికెట్ టోర్నమెంట్, క్రీడలు నిర్వహించుకున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాల్లో ఎక్కడ ఆట స్థలం లేదు. కేవలం ఆరెపల్లి క్రీడాప్రాంగణంలో మాత్రమే మైదానం ఉండడంతో.. మైదానాన్ని చదును చేసుకొని రోజూ క్రీడలు నిర్వహించుకుంటున్నారు. పంచాయతీ అధికారులు, పాలకులు చర్యలు తీసుకొని క్రీడాప్రాంగణాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు, క్రీడాకారులు కోరుతున్నారు. -
ధాన్యం కొను‘గోల్మాల్’ డీఎం సస్పెన్షన్
జిల్లాలో ధాన్యం కొను‘గోల్మాల్’ వ్యవహారంలో మరి కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు గతేడాది గన్నీ సంచుల లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ, ఒక్కో కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద రూ.3వేల నుంచి రూ.5వేల వ రకు వసూలు చేశారు. సదరు అవుట్ సోర్సింగ్ ఉ ద్యోగి ధాన్యం కొను‘గోల్మాల్’ వ్యవహారంలో చే తివాటాన్ని ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. అత డి అక్రమాలు బయటకు రాకుండా ఉన్నతాధికారు ల స్థాయిలో మేనేజ్ చేసినట్లు సమాచారం. ఇప్పటి కేపలువురు అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లపై చర్యలేవీ? ధాన్యం కొనుగోళ్లలో 13 లారీల ధాన్యం పక్కదారి పట్టించారు. ఇందులో 12 లారీల ధాన్యం వేములవాడ ప్రాంతానికి చెందినవి కాగా, ఒక్క లారీ సిరిసిల్ల ప్రాంతానికి చెందినది. ఒక్క లారీకి సంబంధించిన ఆదిత్య లారీ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి అతన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచారు. మరి ఆ 12 లారీల ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. సదరు ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ తన పలుకుబడితో పౌరసరఫరాల శాఖ అధికారులను మేనేజ్ చేశారనే ఆరోపణలున్నాయి. జరిమానాతో వదిలేశారు కోనరావుపేట మండలం మర్తనపేటకు చెందిన వినాయక రైస్ మిల్లుకు చెందిన ఏపీ 16టీసీ 9677 నంబరు గల లారీ ఇటీవల ధాన్యం లోడుతో సిరిసిల్ల శివారు చంద్రంపేట వద్ద పార్కింగ్ చేసి ఉంది. లారీలోని ధాన్యాన్ని తరలించేందుకు వే బిల్లు ఏమీ లేక పోవడంతో డ్రైవర్ పరార్ అయ్యారు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టి 800 బస్తాల లోడుతో ఉన్న లారీని రాఘవేంద్ర రైస్ మిల్లులో సీజ్ చేసి ఉంచారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు రూ.50వేలు జరిమానాతో ఆ లారీని వదిలి వేసినట్లు సమాచారం. ఈ కేసులో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ఎలాంటి వే బిల్లు లేకుండా, మరో రైస్ మిల్లుకు వడ్లను తరలించడంపై రూ.50వేల జరిమానాతో వదిలేయడం అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు.. అటు అధికా రులు ఇటు రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్నాయి. సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొను‘గోల్మాల్’ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిరిసిల్ల అపరెల్ పార్క్ గోదాం ఇన్చార్జి ఉత్కం గోపాల్తో చేతులు కలిపి 13 లారీల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో నర్సింహారెడ్డిని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సరెండర్ చేయగా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్గా గోపాల్ను నియమించినట్లు సమాచారం. ఆయన ఒకట్రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. -
డీఎం అవుట్ !
ధాన్యం కొనుగోల్మాల్..● పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి సరెండర్ ● డీసీఎస్వోకు జిల్లా మేనేజర్గా అదనపు బాధ్యతలుసిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు కొలిక్కి రావడం లేదు. కంచె చేను మేసిన చందంగా రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ.. ఆ శాఖకు సరెండర్ చేశారు. అతని స్థానంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటికే పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి షోకాజ్ నోటీసు అందుకున్నారు. అతను ఇచ్చిన సమాధానంతో జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అతన్ని సరెండర్ చేయగా.. మరిన్ని అవినీతి మరకలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారి బ్యాంకు ఖాతాలోకి రూ.5లక్షలు! ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న గోదాం ఇన్చార్జి ఉత్కం విజయ్ ద్వారా జిల్లా స్థాయి అధికారి బ్యాంకు అకౌంట్కు రూ.5లక్షలు నెఫ్ట్ ద్వారా బదిలీ అయినట్లు సమాచారం. 13 లారీల వడ్లను పక్కదారి పట్టించిన తరువాతే.. ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఆ రూ.5లక్షల్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ డీఎంను సరెండర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులే తొలి ఫిర్యాదుదారులు సిరిసిల్ల అపెరల్ పార్క్లో 86 బస్తాల ధాన్యం పక్కదారి పట్టాయని తొలుత ఫిర్యాదు చేసిన గోదాం ఇన్చార్జి విజయ్ 13 లారీల వడ్లు పక్కదారి పట్టేందుకు అసలు సూత్రధారి. ఈ ఘటనలపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుల బ్యాంకు అకౌంట్ నుంచి జిల్లా స్థాయి అధికారి ఖాతాకు రూ.5లక్షలు బదిలీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు అధికారిని సరెండర్ చేసినట్లు తెలిసింది. ఫిర్యాదుదారులే అక్రమాల్లో భాగస్వాములైనట్లు సమాచారం. మరికొందరు అధికారులకు భాగస్వామ్యం ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. నిందితులకు కండిషన్ బెయిల్ ! ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్టయిన ఆరుగురికి ఇటీవల కండిషన్ బెయిల్ మంజూరైంది. జైలు నుంచి వచ్చిన అపెరల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్, వేములవాడరూరల్ అచ్చన్నపల్లికి చెందిన వాసాల గణేశ్, రుద్రంగి మండలం మానాలకు చెందిన ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి అలియాస్ నర్సిరెడ్డి, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ ఆఫీస్లో పనిచేసే కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన కమ్మరి రాజశేఖర్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పీఏసీఎస్(సింగిల్ విండో) ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గాజుల నవీన్, వేములవాడ చెందిన రైస్మిల్లర్ చేపూరి మధుకర్లకు కండిషన్ బెయిల్ వచ్చింది. వీరు ప్రతీ శనివారం సిరిసిల్ల పోలీస్స్టేషన్లో సంతకాలు చేయాల్సి ఉంది. సస్పెన్షన్లు.. నోటీసులు.. లైసెన్స్ల తొలగింపు ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఏడుగురు జైలుకు వెళ్లి బెయిల్పై రాగా.. పౌరసరఫరాలశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి కమ్మరి రాజశేఖర్, కోనరావుపేట మండలం మల్కపేట ఐకేపీ సెంటర్ బుక్కీపర్ జంగిటి శ్రీనివాస్, ఐకేపీ వీఓఏ పి.పర్శరాములు, రుద్రంగిలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గడ్డం నర్సిరెడ్డి, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పీఏసీఎస్ నిర్వాహకుడు గాజుల నవీన్, జిల్లా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వేణు, కోనరావుపేట ఐకేపీ ఏపీఎం రాజేశంను, సిరిసిల్ల సింగిల్విండో సెక్రటరీ బి.నరేశ్ను, ఐకేపీ సీసీ శ్రీదేవి, వీర్నపల్లి ఐకేపీ ఏపీఎం దేవరాజులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ సస్పెండ్ చేశారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు, జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని ఆదిత్య లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టారు. రుద్రంగి మండలం మానాలకు చెందిన గడ్డం స్వామి అలియాస్ నర్సారెడ్డికి చెందిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫెర్టిలైజర్, సీడ్స్ షాపు లైసెన్సులను రద్దు చేశారు. వేములవాడలోని మల్లికార్జున రైస్మిల్లు పారిశ్రామిక లైసెన్స్ రద్దుకు నోటీసులు జారీ చేశారు. తాజా పరిణామాలతో ధాన్యం కొను‘గోల్మాల్’ జిల్లా అధికార యంత్రాంగాన్ని కుదిపేస్తోంది. -
ఇసుక తోడేస్తున్నారు..
కోనరావుపేట(వేములవాడ): అనుమతి మూడెకరాలు తీసుకుంటే.. పది ఎకరాలకు మించి ఇసుక తోడుతున్నారు. మూలవాగు పరిసరాల్లో వ్యవసాయ బావులు, బోరుబావుల్లో నీటి ఊటలు ఇంకిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక క్వారీ పేరిట అనుమతులు ఒక చోట తీసుకొని.. తవ్వకాలు మరో చోట చేపట్టి సహజ వనరులను కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడని రైతులు సోమవారం ఆందోళనబాట పట్టారు. ఇసుక వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు. గతంలో అనుమతులు రద్దు కోనరావుపేట మండలం బావుసాయిపేట–మామి డిపల్లి మద్య మూలవాగు ప్రవహిస్తుంది. గతంలో బావుసాయిపేటకు చెందిన సర్వేనంబర్ 83సీలో చీటి అశోక్రావుకు చెందిన భూమిలో ఇసుక మేటలు పెట్టాయని వాటిని తొలగించుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. అందులోంచి ఇసుకను తరలించగా ఆ సమయంలో అధిక వర్షాలు కురిసి ఆ ప్రాంతం ముంపునకు గురైంది. దీంతో ఆ ప్రాంత రైతులు తమను ఆదుకోవాలంటూ అప్పటి కలెక్టర్ను కోరగా ఇసుక రీచ్ అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3.30 ఎకరాలలో అనుమతి ఈ యేడాది 3.30 ఎకరాలలో 16వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం మే 26న అనుమతులు తీసుకున్నారు. పట్టా భూమిలో కాకుండా మూలవాగులో 10 నుంచి 12 ఎకరాలలో రెండు నెలలుగా తవ్వకాలు చేపడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అనుమతులకు మించి ఇసుక తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. -
నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత
● బాధితులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ పరామర్శ ● న్యాయపోరాటానికి అండగా ఆర్థికసాయంసాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నేరెళ్లలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం రేపిన నేరెళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆమె వస్తున్నారు. 2017లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడి 9 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడి ఇటీవల కన్నుమూసిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను కవిత మంగళవారం ఉదయం 10.30 గంటలకు పరామర్శిస్తారు. కొంతకాలం క్రితం నేరెళ్ల బాధితులు కవితను కలిసి తమ గోడు చెప్పుకోగా వారికి అన్నివిధాల అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి న్యాయపోరాటానికి కొంత సాయం అందించారు. నేరెళ్ల దురాగతంలో భాగస్వాములుగా ఉన్న వారికి న్యాయపరంగా శిక్షపడే వరకు బాధితులకు వెన్నంటి ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం ఆమె బాధితుల కుటుంబాలతో మాట్లాడుతారు. ఘటన నేపథ్యం మిడ్ మానేరు రిజర్వాయర్లో ముంపునకు గురయ్యే మానేరునదిలో ఇసుక తవ్వకాలకు 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నేతలు మానేరు నది నుంచి పెద్దఎత్తున ఇసుక తీసి లారీల్లో హైదరాబాద్ తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలతో సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2017 జూలై 2న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన రైతు బదనపు భూమయ్య చనిపోయారు. భూమయ్య మరణంతో భగ్గుమన్న గ్రామస్తులు నేరెళ్లలో ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా గ్రామానికి చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కరీంనగర్ జైలుకు తరలించిన తర్వాత 8 మంది బాధితుల్లో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరిశీలనలో థర్డ్ డిగ్రీ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి పోలీసుల చిత్ర హింసల నుంచి బాధితులు ఇప్పటికీ కోలుకోలేదు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ ఇటీవల మృతిచెందారు. మరో బాధితుడు పెంట బాణయ్య కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నాడు. మిగతా వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. -
సీపీఎస్ రద్దే ధ్యేయం
సిరిసిల్ల అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు.. ఓపీఎస్ పునరుద్ధరణే ధ్యేయంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన జనజాగరణ యాత్ర 17వ రోజు సోమవారం సిరిసిల్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్నర్మీటింగ్ నిర్వహించారు. ఆగస్టు 23న చేపట్టే చలో హైదరాబాద్ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, గడ్డం వెంకటేశ్, మహాదేవ్, చంద్రకాంత్, పీఆర్టీయూ, టీపీటీఎఫ్ జిల్లా నాయకులు దుమాల రమానాథ్రెడ్డి, కిషన్, ఎస్టీయూ సదానందం పాల్గొన్నారు. -
హెచ్చుతగ్గులుగా ఉంది
నేను చాలా ఏళ్లుగా సిరిసిల్లలో కారీలు అమ్ముతూ ఉపాధి పొందుతున్న. నాలుగు రోజుల క్రితం తీవ్రమైన జలుబుతో జ్వరం వచ్చింది. అచేతనంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి వచ్చిన. టెస్టులు చేసిండ్రు. జ్వరం తగ్గుతూ..మళ్లీ వస్తోంది. – అబ్దుల్ రషీద్, కారీ విక్రయదారుడు, సిరిసిల్ల విరోచనాలు మా బాబు సుశాంత్కు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. వెంటనే వాంతులు అయ్యాయి. తగ్గడానికి మందు వేస్తే విరోచనాలు మొదలయ్యాయి. ఆలస్యం చేయకుండా ఆదివారం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చినం. – పుల్లూరి సుశాంత్, ముస్తాబాద్ చికిత్స అందిస్తాం జ్వరాలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రోగులకు చికిత్స అందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్ఎస్లు, యాంటిబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. – డాక్టర్ సుమన్ మోహన్రావు, ఆర్ఎంవో -
ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్ మోసాలు
● ఓపెన్ చేయొద్దని పోలీసుల సూచన వేములవాడ: సైబర్ మోసాలు రోజుకో తీరున జరుగుతున్నాయి. షాపింగ్పై డిస్కౌంట్లు, బంపర్డ్రా వచ్చిందంటూ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులు తాజాగా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందంటూ వాట్సాప్లో ఆర్టీవో పేరట మెసేజ్లు పంపుతున్నారు. ఆ టెక్ట్స్ ఫైల్ను ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతుండడంతో వేములవాడ పట్టణంలో సోమవారం వైరల్గా మారింది. పట్టణానికి చెందిన సురేష్కు ఆదివారం ఈ మెసేజ్ రాగా.. ఓపెన్ చేయడంతో ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన సురేష్ స్థానికంగా ఉన్న సోషల్మీడియా గ్రూప్లలో ఇలాంటి మెసేజ్ వస్తుందని అలర్ట్ చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. -
చైన్స్నాచింగ్కు విఫలయత్నం
● మహిళ కేకలు వేయడంతో పరారైన ఆగంతకుడుబోయినపల్లి(చొప్పదండి): కిరాణ స్టోర్లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ లాగేందుకు ఓ ఆగంతకుడు యత్నించగా.. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కొండం విజయ తన కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉంది. మొదట హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి సిగరెట్ కొనుగోలు చేసి వెళ్లాడు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో ఆగంతకుడు పరారయ్యాడు. బాధితురాలు కొండం విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
ధాన్యం డబ్బులు ఇప్పించండి
● 30 మంది రైతులు.. 3 గంటలపాటు ఆందోళన ● పది రోజుల్లో న్యాయం చేస్తామన్న అధికారులువేములవాడరూరల్: ధాన్యం డబ్బులు రావడం లేదని.. న్యాయం చేయండి అంటూ రైతులు నిర్మాణంలో ఉన్న ఇంటిపైకి ఎక్కి సోమవారం నిరసన తెలిపారు. మూడు గంటలపాటు ఆందోళన చేపట్టగా అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో శాంతించారు. రైతులు, అధికారులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, నూకలమర్రి, మల్లారం గ్రామాలకు చెందిన దాదాపు 46 మంది రైతులు వేములవాడ సొసైటీకి 7 లారీల ధాన్యం విక్రయించారు. ఈ ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.52 లక్షలు రావాల్సి ఉంది. సొసైటీ ద్వారా జిల్లా కేంద్రంలోని ఓ గోదాంకు వెళ్లింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మధుకర్ ఆ ధాన్యాన్ని పక్కదోవ పట్టించాడు. ఈ విషయంలో సదరు వ్యక్తిపై కేసు నమోదుకావడంతోపాటు రిమాండ్కు తరలించారు. ఈక్రమంలోనే రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమకావడం లేదు. మధుకర్ వేములవాడలో నిర్మిస్తున్న ఇంటిపైకి ఎక్కిన రైతులు దాదాపు మూడు గంటలపాటు నిరసన తెలిపారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, డీసీవో బుచ్చిబాబు, తహసీల్దార్లు జయంత్, అబుబాకర్లు అక్కడికి వెళ్లి 10 రోజుల్లో డబ్బులు జమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీనివాస్, మల్లారం మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి, మల్లారం ఉపసర్పంచ్ కొంపెల్లి శ్రీకాంత్, నూకలమర్రి ఉపసర్పంచ్ శంకరయ్యగౌడ్ ఉన్నారు. -
భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలి
గోదావరిఖని: బొగ్గుగనుల్లో భద్రతా ప్రమాణాలు మరింత పటిష్టంగా అమలు చేయాలని ధన్బాద్కు చెందిన డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్తాహ్ అన్నారు. సోమవారం రాత్రి ఎన్టీపీసీ శ్రీమయి కన్వెన్షన్ హాల్లో జరిగిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ముందుగా గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల ఆత్మకుశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రమాదాల్లేని సింగరేణిగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. సింగరేణి డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ మాట్లాడుతూ గనుల్లో పటిష్టమైన రక్షణ చర్యలు అమలు చేస్తున్నామని, రక్షణకు పెద్దపీట వే స్తున్నామన్నారు. డీవైడీజీఎంఎస్ అధికారులు క న్న న్, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, తిరుమల్రావు, వెంకన్న, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు సీ తారామయ్య, జనక్ప్రసాద్ పాల్గొన్నారు. పలుగనులకు రక్షణ బహుమతులు అందజేశారు. -
వాంతులు.. జ్వరాలు
సిరిసిల్లటౌన్: జిల్లాలో ప్రతీ ఇంట్లో జ్వరపీడితులు ఉన్నారు. పడకేసిన పారిశుధ్య నిర్వహణ.. పెరిగిన దోమలతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రోడ్లపైనే పారుతున్న డ్రెయినేజీలు.. జనావాసాల మధ్య ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లోనూ తీవ్ర మార్పులతో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం 700 మంది వరకు రోగులు ఓపీలో వైద్యసేవలు పొందుతున్నారంటే జ్వరాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో విషజ్వరాలపై ఫోకస్. ఇవీ పాటించాలి 24 గంటలు వైద్యసేవలు జిల్లా ఆస్పత్రిలో మూడు షిఫ్టుల్లో 24గంటలు వైద్యసేవలు అందిస్తున్నారు. జూలైలో 68 మంది జ్వరపీడితులు ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందారు. పిల్లల వార్డులో 53 మంది ఐపీగా చికిత్స పొందారు. ఇక జీజీహెచ్ టెస్టుకు 1,800, మలేరియా టెస్టులకు 1,800 కిట్లు చికెన్గున్యాకు టీ–హబ్లో 500 కిట్లు అందుబాటులో ఉన్నాయి. జ్వరాలకు సంబంధించిన ఐవీఎఫ్(12వేలు), పారాసిటమాల్ టాబ్లెట్స్(2.60లక్షలు), ఇంజక్షన్లు(7,200), యాంటిబయాటిక్స్(13) చొప్పున అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సి వస్తే అన్నిరకలా రక్తనమూనాలు 59 అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మలేరియా, టైఫాయిడ్, డెంగీ కేసులు రాలేదని పేర్కొన్నారు. -
బావిని పూడ్చారు
బావుసాయిపేట ఇసుక తవ్వకాలకు సమీపంలో మూలవాగులో ఉన్న వ్యవసాయ బావిని పూడ్చివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మా భూమి నుంచే మరింత ఇసు కను తీస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. – కర్నాల శ్రీకాంత్, బావుసాయిపేటఇసుకరీచ్ రద్దు చేయాలి బావుసాయిపేటలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్తో పొలాలు దెబ్బతింటున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన వరదతో పంటలు మునిగిపోయాయి. ఇప్పుడు కూడా అలాగే తవ్వడంతో భారీ వర్షాలు వస్తే ఈ ప్రాంతంలోని పంట పొలాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. – దువ్వల రాములు, బావుసాయిపేట మా పరిధిలోకి రాదు బావుసాయిపేటలోని ఇసుక క్వారీ మా పరిధిలోకి రాదు. క్వారీకి టీజీఎండీసీ అనుమతులు తీసుకున్నారు. అనుమతులున్న చోటనే తవ్వకాలు చేపట్టాలి. రెవెన్యూ అధికారులను ఫీల్డ్ వద్దకు పంపించి విచారణ చేపడతాం. మరో చోట ఇసుకను తవ్వితే చర్యలు తీసుకుంటాం. – వరలక్ష్మి, తహసీల్దార్, కోనరావుపేట -
తండ్రి మృతి.. కూతుళ్లు అనాథలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రెండేళ్ల క్రితం తల్లి.. నేడు తండ్రి మృతిచెందడంతో ముగ్గురు కూతుళ్లు అనాథలయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పోతుగల్కు చెందిన జిల్లెల వెంకటేశ్(45) రైస్మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. భార్య వినోద రెండేళ్ల క్రితం క్యాన్సర్తో మృతిచెందింది. ముగ్గురు పిల్లలను అన్నీ తానై పోషించిన వెంకటేశ్ మూత్రపిండాల వ్యాధికి గురికావడంతో రూ.8లక్షల వరకు అప్పుచేసి చికిత్స అందించారు. అయినా వ్యాధి నయంకాక ఆదివారం రాత్రి మరణించాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ముగ్గురు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్కి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి రూ.25 వేల నగదును పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు క్రాంతి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు. ఉపసర్పంచ్ కోల కృష్ణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.కల్యాణకట్టలో అదనపు వసూళ్లపై ఫిర్యాదువేములవాడ: రాజన్న ఆలయ కల్యాణకట్టలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ వరంగల్కు చెందిన భక్తురాలు హసీనా ఆలయ ఈవో రమాదేవికి సోమవారం ఫిర్యాదు చేశారు. యాకూబ్భాష, హసీనా కుటుంబ సభ్యులతో కలిసి తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణకట్టకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వెంకటేశ్ అనే నాయీబ్రాహ్మణుడు అధికారిక రుసుంపై అదనంగా రూ.50 ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. నగదు లేదని చెప్పడంతో రూ.50 ఫోన్పే చేయాలని బలవంతం చేయడంతో పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్పెద్దపల్లి: కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ను సస్పెన్షన్ చేస్తూ ఇంటర్మీడియట్ డైరెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేశారు. ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించే సమయంలో అనుచిత ప్రవర్తన, కార్యాలయ క్రమశిక్షణ పాటించకపోవడం తదితర ఆరోపణలు రావడంతో క్రమశిక్షణా చర్యలు సిఫార్సు చేయడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. -
సీఎమ్మార్ లక్ష్యం పూర్తి చేయండి
సిరిసిల్ల: రైస్మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను గడువులోగా అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో సోమవారం రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వేలం వేసిన ధాన్యం బకాయిలు గడువులోగా చెల్లించాలని, గత సీజన్లో సీఎమ్మార్ ఇవ్వడంలో జాప్యం చేయొద్దని సూచించారు. రోజువారీ లక్ష్యాలు నిర్ణయించి, సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, ఎఫ్సీఐ జిల్లా మేనేజర్ రవిప్రకాశ్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి బుచ్చిబాబు, రైస్మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు చేపూరి నాగరాజు, గరిపల్లి ప్రభాకర్, పబ్బ నాగరాజు ఉన్నారు. చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలి చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. నాలుగు రకాల చెత్త డబ్బాలను పరిశీలించారు. ఆకుపచ్చ డబ్బా తడి చెత్త, నీలం డబ్బా పొడి చెత్త, ఎరుపు డబ్బా శానిటరీ చెత్త, నలుపు రంగు డబ్బా హానికరమైన ప్రత్యేకమైన చెత్త కోసం వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. డీఎల్పీవో నరేశ్, సచ్ఛభారత్ మిషన్ జిల్లా కో–ఆర్డినేటర్ సురేశ్ పాల్గొన్నారు. -
మీరాబాయి చాను
బంగారు స్ఫూర్తి...కరీంనగర్స్పోర్ట్స్: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత వెయిట్లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెయిట్లిఫ్టింగ్లో రాణించాలని కలలు కంటున్న యువ క్రీడాకారుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపుతోంది. సరైన శిక్షణ, కఠోరసాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె విజయం ఉమ్మడి జిల్లా వెయిట్ లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రపంచ వేదికపై విజయాలు సాధించవచ్చని మీరాబాయి మరోసారి నిరూపించారని కొనియాడారు.కామన్వెల్త్ పతకంతో మీరాబాయి చాను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న శృతి (కరీంనగర్) మీరాబాయి చాను విజయం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తాను. ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. – ఎం సాయిదుర్గ, జాతీయ వెయిట్లిఫ్టర్ -
పేద విద్యార్థికి ఉచిత ఇంజినీరింగ్ సీటు
● ముందుకొచ్చిన జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యంతిమ్మాపూర్/ముస్తాబాద్: ఆ తల్లి చివరి కోరిక నెరవేరింది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును ఇంజినీరింగ్ చదివించలేకపోతున్నానని ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కరీంనగర్లోని జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం స్పందించింది. మానవత్వంతో ఆ తల్లి చివరి కోరికను నెరవేర్చింది. ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన బండి లావణ్య పదిహేను రోజుల క్రితం కొడుకు ఇంజినీరింగ్ చదువుకు ఫీజు చెల్లించలేకపోతున్నానని మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య భర్త రవీందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ సంఘటనపై సాక్షి ఈనెల 24న ‘చితికి పోతున్నారు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల యజమాని జువ్వాడి సాగర్రావు స్పందించారు. వికాస్కు జ్యోతిష్మతి కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లపాటు హాస్టల్ వసతి కూడా ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికాస్.. చైర్మన్ జువ్వాడి సాగర్రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్సాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు బైరి శ్రీనివాస్గౌడ్, ఆశాగౌడ్, సావిత్రి తదితరులు సాగర్రావు, సుమిత్సాయిలకు, సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
చట్టపరిధిలో న్యాయం చేయాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయాలని, ఫిర్యాదుదారులపై మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 17 మంది బాధితుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఠాణాల ఎస్హెచ్వోలతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించేలా చూస్తామన్నారు. ఆధునిక విధానాలతో అధిక దిగుబడులు తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఆధునిక విధానంలో సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం రైతు విత్తన మేళా నిర్వహించారు. అఫ్జల్ బేగం మాట్లాడుతూ ఆరుతడి పంటల ప్రాధాన్యత గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి సంజీవ్, సర్పంచ్ మోర లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. పనిచేసే వారికి గుర్తింపు వేములవాడ: పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని ఈవో రమాదేవి పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులను అందజేశారు. పారువెల్లి భానుశర్మ ప్రధాన అర్చకులుగా, కూరగాయల శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్గా, మేకల వెంకటేశ్ జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. డీఈవో నవీన్ తదితరులు పాల్గొన్నారు. 29న జావలిన్ డే ఎంపిక పోటీలు సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జావలిన్ డే ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. పట్ట ణంలోని బతుకమ్మఘాట్ వద్ద నిర్వహించే జా వలిన్, పరుగుపందేల ఎంపిక పోటీలకు అండర్–6 నుంచి అండర్–20లోపు మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 7న హనుమకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 30 నుంచి వరుణయాగం వేములవాడ: భీమన్న ఆలయంలో మూడు రోజులపాటు వరుణయాగం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి సోమవారం తెలిపారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 1 వరకు వరుణయాగాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, భీమేశ్వర ఆలయంలో రుశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ యాగం నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యుత్ సరఫరాలో లోపాలు అధిగమించాలిసిరిసిల్లటౌన్: విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్ సూచించారు. సిరిసిల్లలోని జిల్లా విద్యుత్శాఖ సర్కిల్ ఆఫీస్లో సోమవారం సమీక్షించారు. రైతులకు ఇస్తున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులు, ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రాలు, కొత్త పరిశ్రమలకు సరఫరా చేస్తున్న లైన్లు, కొత్త సర్వీసుల మంజూరుపై ఆరా తీశారు. చీఫ్ ఇంజినీర్ అశోక్, ఎస్ఈ వేణుమాధవ్, డీఈలు అంజయ్య, వెంకటరమణ పాల్గొన్నారు. -
వెన్నెలవాడగా మార్చుతాం
వేములవాడ: పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణ బ్యూటిఫికేషన్లో భాగంగా రూ.2.65కోట్లతో సెంట్రల్ లైటింగ్ను సోమవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, స్థానిక కౌన్సిలర్ అనితలతో కలిసి ప్రారంభించారు. వెన్నెలవాడగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదటి, రెండో బైపాస్రోడ్లలోని ప్రధాన ప్రాంతాల్లో 150 స్తంభాలు, 300 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 82 విద్యుత్ స్తంభాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ ఆధునికీకరణకు రూ.1.60కోట్లు కేటాయించామన్నారు. బస్టాండ్లో దిగిన ప్రయాణికులు సులభంగా ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు 45 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం బద్దిపోచమ్మ ఆలయం, భారీ శివుడి విగ్రహం, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. -
జోరుగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్ జిల్లా కేంద్రానికి తలమాణికంగా మారుతుందని చెప్పుకుంటున్న మానేరు రివర్ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం మరింత భూమి అవసరమైంది. తాజాగా నదికి ఎడమవైపున 8.05 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రూ.410 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నీటిపారుదల, పర్యాటక శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రూ.300 కోట్ల వరకు నీటిపారుదల శాఖ భరించగా, మిగిలిన నిధులను పర్యాటకశాఖ వెచ్చించనుంది. గుజరాత్లోని సబర్మతీ నదీ తీరం స్ఫూర్తిగా గత ప్రభుత్వం మానేరు తీరాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టింది. నదికి రెండు వైపులా కాంక్రీట్ గోడలు నిర్మించి తీరాన్ని రెండువైపులా పర్యాటపరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో చేపట్టిన మానేరు రివర్ఫ్రంట్ పురోగతి ప్రభుత్వం మారిన కొన్ని నెలల తర్వాత పర్యావరణ, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నెమ్మదించింది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాధాన్యం ఇవ్వడంతో పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. రూ.40 కోట్ల చెల్లింపునకు సిద్ధం మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా ఎడమవైపు (నగరం వైపు) 8.05 ఎకరాల స్థలం అవసరం అయింది. నదీతీరం వైపు తవ్వేందుకు స్థలం కావాల్సి వచ్చింది. ఈ మేరకు తొలుత అధికారులు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఎంత స్థలం కావాలి అన్న విషయంలో పలు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో తొలిదశలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా సిద్ధమైనా.. ఆఖరు నిమిషంలో నోటిఫికేషన్ విడుదల కాకుండా నిలిచిపోయింది. చివరికి రెవెన్యూ డిపార్ట్మెంట్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)లు విషయాన్ని కొలిక్కి తీసుకురావడంతో 8.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే.. ఈ మొత్తం భూమికి యజమానులకు దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా మంత్రులంతా పనులపై నిరంతరం ఆరా తీస్తుండటంతో భూసేకరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తొలి దశలో 82శాతం పనులు పూర్తి.. రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు, రెండో దశలో 6.25 కిలో మీటర్ల మేర ఇరువైపులా అభివృద్ధి చేయనున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటుంది. స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులు చేపడుతోంది. తొలిదశ పనుల్లో ఇప్పటి వరకు 82 శాతం పూర్తయ్యాయి. 3.75 కి.మీ ప్రొటెక్షన్ వాల్లో ఎడమవైపు 3.5 కి.మీ మేర, కుడివైపు 3.25 కి.మీ మేర గోడ నిర్మాణం అయిపోయింది. మరో 250 మీటర్ల మేర పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రొటెక్షన్ వాల్స్కు ఇరువైపులా మట్టితో నిర్మించిన కట్ట పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా రూ.277 కోట్లను నీటిపారుదల శాఖ పనులకోసం వెచ్చించింది. ఇందులో భాగంగా తీగల వంతెన పక్కన నిర్మించనున్న చెక్ డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటికి బిగించేందుకు అధికారులు గేట్లు కూడా తీసుకువచ్చారు. ఈ గేట్లతోనే మానేరు రివర్ఫ్రంట్లో నీటిని నియంత్రించనున్నారు. ఇటీవల కలెక్టర్ చిత్రా మిశ్రా సైతం మానేరు రివర్ ఫ్రంట్ విషయంలో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బ్యూటిఫికేషన్ వర్క్స్, రైలింగ్, గార్డెనింగ్ వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్, టూరిజం కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్భరో
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. ఆదివారం బీవైనగర్లోని పార్టీ కార్యాలయంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం పద్మ, జిల్లా నాయకులు కోల శ్రీనివాస్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదాలతో రావొద్దు..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కలెక్టర్.. పోలీసు విభాగానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భూ సమస్యలకు సంబంధించిన ఎలాంటి వివాదాలూ తమ వద్దకు తీసుకురావద్దని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎదుట పోలీసులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు గమనించకుండా వెళ్లిన వారికి ప్రజావాణి లేదా రెవెన్యూ విభాగానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితులు ప్రజావాణి బాట పడుతున్నారు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, ఆస్తి పంపకాలు, అద్దె గొడవలు, సివిల్ వివాదాల విషయాల్లో పోలీసులు కలగజేసుకోరు. కానీ.. ఈ వివాదాల నేపథ్యంలో ఏవైనా గొడవలు, కొట్లాటలు, ఇతర హింసాత్మక చర్యలు తలెత్తితే మాత్రం వారి జోక్యం అనివార్యం. ఇటీవల పెద్దపల్లి డీసీపీ కూడా ఎలాంటి భూవివాదాల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఠాణాల ఎదుట ఈ బోర్డులు వెలిశాయి. నాటి వివాదమే కారణమా..? ఇటీవల రెవెన్యూ, పోలీసు శాఖలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు పోలీసులు దారి తప్పుతున్నారని, ఎవరు ఏమేం చేస్తున్నారో తనకు అంతా తెలుసని, ప్రతీ ఒక్క పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ పోలీస్ శాఖకు నేరుగా హెచ్చరికలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ హెచ్చరికలను డిపార్ట్మెంట్లోని కొందరు స్వాగతించగా.. మరికొందరు విభేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెజారిటీ పోలీసులు కలెక్టర్ తీరుపై అసంతప్తిగానే ఉన్నా.. బయటకు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖలో రెవెన్యూ విభాగానికి చెందిన భూ సమస్యల ఫిర్యాదులు తీసుకోకూడదంటూ పెద్దపల్లి డీసీపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామే తప్ప.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బోర్డులు ఏర్పాటు చేయలేదని పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. పోలీసు శిక్షణకు పరస్పర దూరం రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య దూరం లేదని పైకి చెబుతున్నా.. వారి చర్యలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పోలీసు ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు కనిపించలేదు. అదే పెద్దపల్లిలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పోలీసు విభాగం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఈ రెండు కార్యక్రమాల్లో సంబంధిత విభాగాలు పాల్గొనలేకపోవడానికి కారణం సమాచార లోపమా..? లేక రెండు విభాగాల మధ్య పెరుగుతున్న దూరమా..? అనే విషయంపై ఎవరూ స్పష్టతఇవ్వడం లేదు. మొత్తానికి రెండు విభాగాల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో మాత్రం చర్చ మొదలైంది. పోలీస్స్టేషన్ల ఎదుట బోర్డులు పెట్టిన జిల్లా పోలీస్ యంత్రాంగం అలాంటి సమస్యలుంటే రెవెన్యూ విభాగానికి వెళ్లాలని సలహా ఇటీవల కలెక్టర్ ‘క్లాస్’తోనే ఫ్లెక్సీలు వెలిశాయన్న చర్చ అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్న పోలీసులు పోలీసు అభ్యర్థుల శిక్షణ కార్యక్రమాల్లో పరస్పర దూరం -
ప్రజా ప్రభుత్వంలో మెరుగైన రవాణా సౌకర్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి (వేములవాడ): రెండు జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం చందుర్తి మండలం ఎన్గల్ గ్రామం నుంచి నిజాబామాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రం వరకు బస్సును ప్రారంభించి మాట్లాడారు. సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ మార్గంలో మళ్లీ బస్సు సర్వీస్ ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. ప్రజా ప్రభుత్వంలో వేములవాడ డిపోకు 20 కొత్త బస్సులు అందించామన్నారు. వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను విస్తరిస్తున్నట్లు వివరించారు. సర్పంచ్ అసనిపర్తి శోభారాణి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్, జిల్లా పధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా, నాయకులు గసికంటి ప్రభాకర్, లాండే తిరుపతి, ఎదురుగట్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
తుది దశకు మూలవాగు బ్రిడ్జి
వేములవాడ మూలవాగుపై మూడో బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. ‘ముచ్చటగా’ మూడుసార్లు నిర్మాణ దశలోనే కూలిపోయి తీవ్ర విమర్శలపాలైన ఈ వంతెన.. నేడు పటిష్టంగా రూపుదిద్దుకుంది. గతంలో కాంట్రాక్టర్ల అజాగ్రత్త, ఇంజినీరింగ్ లోపాల వల్ల వంతెన కూలిపోవడంతో ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. విప్ ఆది శ్రీనివాస్ చొరవతో లోపాలను సరిదిద్ది రూ.6 కోట్లు మిగులు పనులకు, రూ.6.90 కోట్లు భూసేకరణకు నిధులు మంజూరు చేయించి పనులు వేగవంతం చేశారు. మూడో బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రాజన్న భక్తులు, స్థానికులకు మూలవాగు వద్ద ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. – వేములవాడ -
అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుంటుంటారనీ, భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఈవో రమాదేవి హెచ్చరించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయంలో నాయీబ్రాహ్మణులతో మాట్లాడారు. భక్తులను నగదు అడుగుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలోకి రావడంతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందన్నారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా నేరుగా ఆలయ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఈవో జయకుమారి, నాగుల మహేశ్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, రాజేందర్ పాల్గొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించాలిసిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: పేద విద్యార్థులకు బకాయిపెట్టిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి డిమాండ్ చేశా రు. విద్యార్థుల హక్కుల సాధనకు ‘ఫీజు బకాయి– బీజేపీ లడాయి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. జింక అనిల్, రాజ్కుమార్, పెద్దూరి పరశురాంగౌడ్, కోడం శివప్రసాద్, చిందం నరేశ్, జితేందర్రెడ్డి, మల్లడపాట భాస్కర్ పాల్గొన్నారు. నైపుణ్యాలు వెలికి తీసేందుకు క్రీడలు దోహదంసిరిసిల్లఅర్బన్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడాపోటీలు దోహదపడుతాయని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీరా రాందాస్ అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు త్రోబాల్, పురుషులకు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాలీబాల్ పోటీల్లో 30, త్రోబాల్లో 7 జట్లు పాల్గొంటాయని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్రెడ్డి, సురేశ్, ప్రభాకర్, బీజేపీ నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తికి అనుకూలం.. వరికి ప్రతికూలం
సిరిసిల్ల: జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పత్తి పంటకు అనుకూలమైన వర్షాలు పడుతుండగా.. వరికి మాత్రం ప్రతికూలంగా ఉంది. జిల్లాలో కురుస్తున్న చిరు జల్లులతో అన్నదాతలు ఖరీఫ్ సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటికే వరినారు ఎదగడంతో నీటి కోసం నిరీక్షించిన రైతులు చిన్న పాటి వర్షం జల్లులు పడడంతో ఆశతో నాట్లు వేస్తున్నారు. బోర్లలో నీరున్న రైతులు ఇప్పటికే వరినాట్లు వేయగా, తుకం పోసి పడిగాపులు కాస్తున్న రైతులు కొద్ది పాటి వర్షాలు పడడంతో నాట్లు వేస్తున్నారు. 2.48 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో వానాకాలంలో పంట లు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వరి 1,91,366 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. కానీ కాలం లేక, వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటి వరకు సుమారు లక్ష ఎకరాల్లో వరి వేశారు. 47,120 ఎకరాల్లో పత్తి, 3,430 ఎకరాల్లో మొక్కజొన్న వేయగా, ఇతర అన్ని పంటలు కలిపి 5,593 ఎకరాల్లో వేశారు. జిల్లాలో 665 చెరువులు ఉండగా, ఏ చెరువులోనూ వర్షం నీరు చేరలేదు. జిల్లాలోని జలాశయాలన్నీ నీరు లేక వెలవెలబోతుండడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించలేమని నీటిపారుదలశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోని మానేరువాగు, వేములవాడ మూ లవాగుల్లో నీరు లేక ఎడారిగా మారాయి. వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికార యంత్రాంగం ప్రచారం చేస్తుంది. కానీ, అలవాటుగా మారిన వరి సాగుపైనే అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. వారం రోజు లుగా చిరు జల్లులు కురుస్తుండడంతో వానాకాలంపై ఆశలతో వరి నాట్లు వేస్తున్నారు. పత్తి రైతులు మాత్రం అంతరకృషితో ముందుకు సాగుతున్నారు. జిల్లా అంతటా వర్షాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం వర్షం జల్లులు కురి శాయి. అత్యధికంగా వేములవాడ రూరల్లో 33.6 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 3.9, చందుర్తి 26.9, బోయినపల్లి 19.8, వేములవాడ 11.3, సిరిసిల్ల 2.5, కోనరావుపేట 11.3, వీర్నపల్లి 5.5, ఎల్లారెడ్డిపేట 5.3, గంభీరావుపేట 14.6, ముస్తాబాద్ 8.9, తంగళ్లపల్లి 3.1, ఇల్లంతకుంటలో 1.1 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 11.4 మి.మీ నమోదైంది. రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో 51 శాతం లోటు వర్షపాతం ఉంది. పత్తికి అనుకూలంగా.. కొద్దిపాటి వర్షం రావడంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మరోవైపు పత్తి రైతులు కలుపు తీస్తూ డౌరాలు కొడుతూ ఎరువులు వేస్తున్నారు. జిల్లాలో పత్తికి అనుకూలంగా ఉండగా, పంటను రక్షించుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. నల్లరేగడి నేలల్లో పత్తి మొక్కలు ఏపుగా ఎదిగాయి. వరి సాగు చేయాలని ఆశిస్తున్న రైతులకు సాగునీటి లభ్యతపై అనుమానాలున్నాయి. మొక్కజొన్న, కందులు, పెసర, బబ్బెర వంటి పంటలు వేసుకో వాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. వరి వద్దంటూనే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఎకరం కూడా ఖాళీగా ఉంచవద్దని అధికారులు చెబుతున్నారు. నీరు లేకుంటే ఏ పంట అయినా దిగుబడి రాదని, వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ఈ వర్షాకా లం కలిసి రాకపోవడంతో భిన్నమైన పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. -
28న నేరెళ్లకు కవిత
తంగళ్లపల్లి: మండలంలోని నేరెళ్ల గ్రామానికి ఈనెల 28న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్నట్లు మండల ఇన్చార్జి చెరుకుపల్లి శైలజ తెలిపారు. ఇటీవల మృతి చెందిన నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. వాసరవేణికి జాతీయ పురస్కారంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వాసరవేణి పర్శరాములు తెలుగు భాషా సాహిత్యానికి చేస్తున్న కృషి, బాల సాహిత్యంలో రచన, పరిశోధనలకు గాను జాతీయ తెలుగు విశేష ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. పర్శరాములు కొంతకాలంగా తెలుగు భాషా సంస్కృతి, అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. వీటిని గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, పల్లె భాషలో ప్రజల కష్టాలు, చిన్నారుల గాథల గురించి అనేక పరిశోధనలు చేయడం జరిగిందన్నారు. 20కి పైగా పుస్తకాలు రచించి బాల సాహిత్యంలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవి ద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారని, 500కు పైగా వ్యాసాలు రాశారన్నారు. జూలై 28న న్యూఢిల్లీలో అవార్డు అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పర్శరాములును రచయితలు జలపాల శంకరయ్య, మహేశ్వరశర్మ, లక్ష్మయ్య, మ హేందర్, నీలకంఠం, దేవరాజు అభినందించారు. -
దేశ గౌరవ ప్రతీక కార్గిల్ దివస్
సిరిసిల్లటౌన్: కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ను భారత సేనలు మట్టికరిపించిన విజయ్ దివస్ జూలై 26 దేశ గౌరవానికి ప్రతీక అని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ అన్నారు. బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో పట్టణంలోని కార్గిల్లేక్పై వైజయంతి యుద్ధ ట్యాంకు వద్ద అమర జవాన్లకు నివాళి అర్పించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ధైర్యంతో పోరాడి 527 మంది వీరులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. అనంతరం పట్టణంలోని మాజీ సైనికులను సన్మానించారు. కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, ఎర్రం మహేశ్, శీలం రాజు, నవీన్యాదవ్, నాగుల శ్రీనివాస్, గాజుల వేణు, వేముల వైశాలి, మోర శ్రీహరి, అంకారాపు రాజు, చేపూరి అశోక్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. -
లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేసి !
ప్రజలు వ్యాయామ చేసేందుకు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక ఎక్కడికక్కడ విరిగిపోయి కనిపిస్తున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.80లక్షలతో 16 ప్రాంతాల్లో ఓపెమ్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పనికిరాకుండా పోయాయి. పాడయిన పరికరాలను చాలా రోజులుగా మరమ్మతు చేపట్టడం లేదు. పరికరాలు సరిగా లేక వ్యాయామం చేయలేకపోతున్నామని ఉదయం వాకింగ్ వెళ్లేవారు, క్రీడాకారులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సిరిసిల్ల అర్బన్ -
వేద విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
వేములవాడ: వేద విద్యావ్యాప్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వేములవాడలో ఐదు ఎకరాలు ఎంపిక చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న క్షేత్రంలో ఐదు రోజులు కొనసాగిన వేద–స్మార్త ఆగమ విద్వత్ సదస్సు శనివారం ముగిసింది. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేద, సంస్కృత పాఠశాలల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి, అధ్యాపకులకు స న్మానించారు. ఈనెల 21న ప్రారంభమైన ఈ మహోత్సవాలు 25న పూర్తయ్యాయి. ఈవో రమాదేవి, డీఈవో నవీన్ పాల్గొన్నారు. వేద సంస్కృతి పరిరక్షణ దేశ నలుమూలల నుంచి వేదపండితులు వేములవాడకు రావడం గర్వకారణమన్నారు. వేద సంస్కృతి పరిరక్షణకు ఏటా మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి వేదాలతోపాటు మరిన్ని శాస్త్రాల పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. అనువంశిక అర్చకులకు ప్రాధాన్యం వేములవాడ దేవస్థానంలో అర్చక నియామకాల విషయంలో అనువంశిక అర్చకులకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు విప్ తెలిపారు. గతంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నియామక ప్రక్రియలో మొత్తం 191 పోస్టులను భర్తీ చేయగా, వాటిలో వేములవాడకు 21 పోస్టులు కేటాయించగా.. 10 పోస్టులు అనువంశిక అర్చకులకు లభించాయని తెలిపారు. వేములవాడలోని 128 అనువంశిక అర్చక కుటుంబాల నుంచి కనీసం ఒక్కో విద్యార్థిని వేద పాఠశాలలో చేర్పించి వేద విద్యను అభ్యసించేలా కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. పరీక్షల ఫలితాలు ఐదు రోజుల వేద–స్మార్త పరీక్షా మహోత్సవాల్లో మొత్తం 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 124 మంది ఉత్తీర్ణత సాధించారు. 40 మంది పరీక్షాధికారులు పరీక్షలను నిర్వహించారు. అనుత్తీర్ణులైన ఆరుగురు విద్యార్థులు నిరుత్సాహపడకుండా వచ్చే ఏడాది మరింత కృషి చేసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయశర్మ, ఈవో రమాదేవి, డీఈవో నవీన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముగిసిన జాతీయస్థాయి వేద–స్మార్త పరీక్షలు విద్యార్థులకు పట్టాలు.. అధ్యాపకులకు సన్మానం -
పట్టుదల..కృషి.. శ్యామ్ప్రసాద్లాల్
సిరిసిల్ల: పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చని ఐఏఎస్ అధికారి శ్యాంప్రసాద్లాల్ ప్రస్థానం సాక్ష్యం. సాధారణ మధ్యతరగతి పద్మశాలి కుటుంబంలో పుట్టి.. సర్కారు బడిలో అక్షరాలు దిద్దిన విద్యార్థి.. నేడు ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. దేశంలోనే అత్యున్నతమైన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్)కు ఎంపికవడం ఎంతో మంది కల. ఆ కలను కొంతమంది సాధిస్తారు. ఈ కోవాలోకి వస్తారు జి.వి.శ్యాంప్రసాద్లాల్. రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా ఉద్యోగంలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ సాధించిన గాజుల వెంకట శ్యాంప్రసాద్లాల్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 1995లో డిప్యూటీ తహసీల్దార్గా.. 1995లో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా గ్రూప్–2లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్గా 1995 జూలై 31న విధుల్లో చేరారు. 1996 ఆగస్ట్ 1న గంభీరావుపేటలో డిప్యూటీ తహసీల్దార్గా విధుల్లో చేరి 1998 డిసెంబరు వరకు పనిచేశారు. తహసీల్దార్గా పదోన్నతి పొంది 1998లో బోయినపల్లి, 2003లో సిరిసిల్ల, 2004లో పెద్దపల్లి, 2005లో హుజూరాబాద్, 2006లో కరీంనగర్, 2008లో కాటారం, కోరుట్ల తహసీల్దార్గా పనిచేశారు. 2009లో కొద్ది నెలలపాటు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తహసీల్దార్గా, ఆ తరువాత 2010లో కోరుట్ల తహసీల్దార్గా పనిచేశారు. 2011 మార్చిలో డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందారు. వరంగల్లో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, 2013లో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్గా పనిచేశారు. 2014లో వరంగల్లో ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసర్గా పనిచేశారు. 2014లోనే నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవోగా, 2016లో సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేశారు. 2017లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొంది జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేశారు. 2019లో అదనపు కలెక్టర్గా పదోన్నతి పొంది కరీంనగర్లో పనిచేశారు. 2023లో పెద్దపల్లి అదనపు కలెక్టర్గా పనిచేశారు. 2024లో మహాత్మా జ్యోతిభాపూలే విద్యాసంస్థ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన శ్యాంప్రసాద్ లాల్ 2026 జనవరిలో ఐఏఎస్గా కన్ఫార్మ్ అయి.. నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్గా విధుల్లో చేరారు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా చేరి విధులు నిర్వహిస్తున్నారు.తల్లిదండ్రులు: సత్యవతి (బీడీ కార్మికురాలు), గాజుల రాజేశం(రజనిశ్రీ) ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ రంగస్థల నటుడు, నాట్యాచార్యుడు. భార్య, పిల్లలు: మాధవి కుమారి, మేఘాంశ్ ప్రసాద్, ప్రీతమ్ ప్రసాద్ పెళ్లి: 1995 మే 3న (సిరిసిల్ల అత్తగారి ఊరు) పేరులో ప్రత్యేకతలు: గాజుల వెంకట శ్యాంప్రసాద్లాల్(తాత వెంకటయ్య పేరు కలిసి వచ్చేలా వెంకట, నవంబరు 14న జన్మించిన నేపథ్యంలో జవహర్‘లాల్’ను పేరు చివర వాళ్ల నాన్న రజనిశ్రీ పెట్టడం విశేషం) హాబీలు: సాహిత్యం చదవడం, షటిల్ ఆడడం, పాటలు వినడం. జర్నలిస్ట్గా: ‘వాన కురిసింది.. పుడమి మురిసింది’ అంటూ.. ఉత్తమ శీర్షికలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఐఏఎస్ వరకు.. అంచెలంచెలుగా ఎదిగిన హుస్నాబాద్ కుర్రాడు యువతకు స్ఫూర్తి జి.వి.శ్యాంప్రసాద్లాల్ ప్రస్థానంహుస్నాబాద్ టు హైదరాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో 1969 నవంబరు 14న జన్మించారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, 1984లో పదో తరగతి, 1986లో ఇంటర్ పూర్తి చేశారు. 1989లో సిద్దిపేటలో బీఎస్సీ, 1991లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ(తెలుగు) పూర్తి చేశారు. 1992లో జర్నలిజం చేసిన ఆయన 1992లో ఓ దినపత్రిలో సబ్ ఎడిటర్గా చేరారు. -
కార్గిల్ కీర్తి.. యువతకు స్ఫూర్తి
సిరిసిల్ల: అది... 1999. ఇండియా–పాకిస్థాన్ సరిహద్దుల్లో భీకరయుద్ధం. భారత భూభాగంలోకి పాకిస్థాన్ ప్రేరేపిత చొరబాటుదారులు చొరబడ్డారు. భారత సైన్యం వీరోచిత పోరాటం సాగించింది. రెండు నెలలపాటు సాగిన భీకర యుద్ధంలో సుమారు 500 మంది భారత జవానులు అసువులు బాశారు. కార్గిల్ పర్వత శ్రేణులను ఆక్రమించిన పాకిస్థాన్ చొరబాటుదారుల నుంచి మన భూభా గాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంది. భారత సైన్యం విజయం సాధించిన రోజు జూలై 26. మన సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా, భారత జవానుల త్యాగానికి చిహ్నంగా ఏటా జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారు. 27 ఏళ్ల కిందట జరిగి న కార్గిల్యుద్ధంలో పాల్గొన్న వైజయంతి యుద్ధ ట్యాంక్ను 2002లో సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. కార్గిల్ లేక్గా వర్ధన్కుంట సిరిసిల్లకు పశ్చిమదిశలో ఊరిలోకి ప్రవేశించే దారి లోనే వర్ధన్కుంట ఉంది. వర్ధన్కుంటకు కార్గిల్లేక్గా 2002లో నామకరణం చేశారు. కార్గిల్యుద్ధంలో అమరుల స్ఫూర్తిగా వైజయంతి యుద్ధ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చెన్నమనేని విద్యాసాగర్రావు అప్పటి భారత రక్షణశాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్, రక్షణశాఖ అధికారులతో చర్చించి యుద్ధ ట్యాంక్ ఏర్పాటుకు కృషి చేశారు. మున్సిపల్ అప్పటి చైర్మన్ ఆడెపు రవీందర్ గద్దె నిర్మాణానికి అప్పట్లో రూ.4లక్షలు వెచ్చించారు. 40 టన్నుల బరువైన ఆ యుద్ధ ట్యాంక్ను ఢిల్లీ నుంచి సిరిసిల్లకు తెప్పించేందుకు అప్పటి మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఢిల్లీకి వెళ్లారు. అభివృద్ధికి అడుగులు కార్గిల్లేక్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యానవనం, బోటింగ్ సదుపాయం, కుర్చీలు, విశ్రాంతి బెంచీలు, వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. లేక్ సమీపంలోనే సాయిబాబా, అయ్యప్ప ఆలయాలు ఉండడంతో పర్యాటక శోభ వస్తుందని ఆశించారు. కానీ చాలా కాలంగా నిర్లక్ష్యపు జాడలు కనిపిస్తున్నాయి. కార్గిల్ లేక్ అభివృద్ధికి రూ.21.10 లక్షలు కేటాయించి కొన్ని పనులు చేశారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ‘అమృత్’ 2.0లో రూ.1.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కార్గిల్ లేక్ కట్ట మరమ్మతులు, మురికినీటిని కట్టడి చేసే పనులు, డ్రెయినేజీలు, సుందరీకరణ పనులు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, చైర్పర్సన్ జిందం కళాచక్రపాణితో కలిసి సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. నేటి తరానికి స్ఫూర్తి వైజయంతి యుద్ధట్యాంక్ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పర్యాటక స్థలంగా మార్చితే పట్టణ వాసులకు, కొత్తగా పట్టణానికి వచ్చే వారికి సైనికుల తెగువ స్ఫూర్తినిస్తోంది. కార్గిల్ యుద్ధం జరిగిన నాటి సంగతులను గుర్తుకు తెచ్చేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ కార్గిల్లేక్ ఆత్మహత్యలకు వేదికగా మారింది. కొంతమేరకు భూమి ఆక్రమణలకు గురైంది. చెరువుకట్ట సైతం కబ్జా కోరల్లో చిక్కింది. కబ్జాలు తొలగించి అభివృద్ధి చేస్తే.. సిరిసిల్లకు అదనపు అందం చేకూరనుంది. సైనికుల విజయ పతాక కార్గిల్ లేక్ 27 ఏళ్ల కిందట పోరాటం 24 ఏళ్ల కిందట వైజయంతి యుద్ధ ట్యాంకర్ ఏర్పాటు ఏటా సిరిసిల్లలో కార్గిల్ విజయ్ దివస్ -
భీమన్న సన్నిధిలో నాగరాజు
వేములవాడ: తొలి ఏకాదశి శనివారం నాడు భీమన్న ఆలయం ఎదుట నాగుపాము కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ జగదీశ్ పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేశారు. భీమన్న ఆలయం ఎదుట తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొన్న వేళ నాగుపాము ప్రత్యక్షమైంది. పామును గమనించిన భక్తులు భయాందోళనకు గురికాగా.. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీశ్ వెంటనే అక్కడికి చేరుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. జగదీశ్ సమయస్ఫూర్తితో స్పందించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా వెంటనే అటవీశాఖ, శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని కోరారు. చిన్నారిని బలిగొన్న కేన్సర్జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన మోటూరి తేజాన్ష్ (7) కేన్సర్తో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మాటూరి మహేశ్, రాధ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు తేజాన్ష్. మహేశ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం తేజాన్ష్ అనారోగ్యం బారినపడడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించారు. వారు కేన్సర్గా గుర్తించారు. తేజాన్స్కు నాలుగు నెలలుగా హైదరాబాద్లో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. శనివారం స్వగ్రామంలో బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. వెయిటర్, హెవీ డ్రైవర్ పోస్టులు ఈనెల 28న ఇంటర్వ్యూలువేములవాడ: యూఏఈలోని ప్రముఖ ‘జీటీఎం కేటరింగ్’ సంస్థలో వెయిటర్లు, హెవీ డ్రైవర్ల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ సంస్థ ప్రతినిధి చీటి సతీశ్రావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు జీటీఎం ఇంటర్నేషనల్కు చెందిన అన్ని శాఖల కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. ఉద్యోగాలు: వెయిటర్లు, హెవీ డ్రైవర్లు(చెల్లుబాటు అయ్యే యూఏఈ లైసెన్స్ తప్పనిసరి). వయోపరిమితి 21 నుంచి 40 ఏళ్లు. వేతనం : వెయిటర్లకు నెలకు ఏఈడీ 1,200(సుమారు రూ.32వేలు), హెవీ డ్రైవర్లకు ఏఈడీ 3,500(సుమారు రూ.93వేలు). ఇతర సౌకర్యాలు: ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు ఉచిత వీసా, ఫ్లైట్ టికెట్(100 శాతం ఉచిత నియామకం, ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు) అందిస్తారు. అర్హతలు–నిబంధనలు : ఆంగ్లంలో మాట్లాడటం, వెయిటర్గా అనుభవం ఉన్నవారు అర్హులు. శరీరంలో బయటకు కనిపించే టాటూలు ఉండకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ పాస్పోర్ట్, అప్డేటెడ్ సీవీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని చీటి సతీష్రావు కోరారు. మరిన్ని వివరాలకు.. సికింద్రాబాద్లో 8332052299, నిజామాబాద్లో 8686860999, ఆర్మూర్లో 8332062299, జగిత్యాలలో 8332042299, సిరిసిల్లలో 9391661522 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఒక గొప్ప వేదిక
ఖోఖో మాలో టీమ్ స్పిరిట్ను పెంచుతుంది. ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలో నేర్పుతుంది. మేము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదిక. గతంలో డిస్ట్రిక్ లెవల్ ఆడాను. ప్రస్తుతం క్లస్టర్లో ఆడుతున్నారు. ఫ్యూచర్లో ఇండియన్ టీం కు ఆడాలని ఉంది. – జ్యోషిత, అండర్ 14 విభాగం తెలంగాణలోని స్కూల్ జట్లతో పోటీ పడటం కొత్త అనుభూతిని ఇస్తోంది. మైదానంలో మేమంతా క్రీడాకారులమే, ఇక్కడ రాష్ట్రాల బేధం లేదు. మహిళలు ఏ రంగంలోనైనా దూసుకుపోగలరని చెప్పడానికి మా పరుగే నిదర్శనం. రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న. – పూజ్య, రాప్తాడు, అనంతపురం, అండర్ 14 విభాగం అండర్–19లో మా టీం ఫైనల్కు చేరింది. ఆడపిల్లలు ఆటల్లో రాణించలేరు అనే పాత ఆలోచనలను మార్చడానికే ఇక్కడికి వచ్చాం. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించి పంపించారు. గెలిచి తీరుతాం. గతంలో ఒకసారి రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొన్నా. ఖేలో ఇండియాలో పతకం సాధించాలని ఉంది. – కావ్యసుధ, వయ్యారావుపేట, అనకాపల్లి అండర్ 19 విభాగం -
ఏటా కార్గిల్ దివస్ నిర్వహిస్తాం
ఏటా జూలై 26న కార్గిల్ దివస్ నిర్వహిస్తాం. దేశరక్షణలో ప్రాణాలొడ్డిన వీరసైనికులకు నివాళి అర్పిస్తాం. నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా 2002లో అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్రావు చొరవతో వైజయంతి యుద్ధట్యాంక్ను ఢిల్లీ నుంచి తెప్పించారు. మున్సిపల్ నిధులతో కార్గిల్లేక్పై వేదికను ఏర్పాటు చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఇటీవల నిధులు కేటాయించారు. సుందరీకరణ పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల పట్ట ణానికి కార్గిల్ లేక్ ఐకాన్గా నిలుస్తోంది. – ఆడెపు రవీందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ -
ఆరుతడి పంటలు వేయాలి
● జిల్లా ఉద్యాన అధికారి శరత్బాబు బోయినపల్లి/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లఅర్బన్: ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన మేర కురవడం లేదని రైతులు నీరు తక్కువ తీసుకునే ఆరుతడి పంటలు సాగుచేయాలని జిల్లా ఉద్యాన అధికారి శరత్బాబు కోరారు. మండలంలోని వెంకట్రావుపల్లిలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ ఇరువాల సంధ్య, తహసీల్దార్ షరీఫ్ మొయినొ ద్దీన్, ఎంఏవో ప్రణిత, ఏపీవో సబిత, ఏఈవో రవళి, కార్యదర్శి మల్లేశ్ పాల్గొన్నారు. 36 శాతం లోటు వర్షపాతం ఎల్లారెడ్డిపేట మండలంలో 36 శాతం లోటు వర్షపాతం నమోదైందని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం తెలిపారు. ఈ వర్షం వరిపంటకు సరిపోదని పెసర, కంది, రాగులు, నువ్వులు, కూరగాయలు, ఆయిల్పామ్ సాగుచేసుకోవాలని సూచించారు. రాగులు, నువ్వుల విత్తనాలు టీవీకే వేములవాడలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఎంపీడీవో సత్తయ్య, తహసీల్దార్ సుజాత, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, ఉపసర్పంచ్ బందారపు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రగుడులో ఏఈవో రాజ్కుమార్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇరిగేషన్శాఖ ఏఈ రాహుల్, స్థానిక కౌన్సిలర్ బూర బాలమల్లు, రైతులు పాల్గొన్నారు. 29న హుండీ లెక్కింపు వేములవాడ: భీమన్నకు భక్తులు హుండీలలో సమర్పించిన కట్నాలను ఈనెల 29న భీమేశ్వర సదన్లో లెక్కించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఇంటర్ విద్యార్థినికి ‘యూనివర్సల్’ ప్రశంసలు చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 470 మార్కులకు 468 సాధించిన శ్రీరాం శ్రీహితకు హైదరాబాద్కు చెందిన యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ ప్రశంసాపత్రం అందించారు. హైదరాబాద్లో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని విజయానికి కృషిచేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సేవలను అభినందించారు. విద్యార్థుల గర్జనకు తలొగ్గిన కేంద్రం సిరిసిల్లటౌన్: దేశ యువత, విద్యార్థుల గర్జనకు కేంద్రం తలొగ్గిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. విద్యార్థులు, ప్రతిపక్షాల డిమాండ్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్పై అవాక్కులు, చెవాక్కులు పేలడం మానుకోవాలని హితవు పలికారు. అటు కొడుకు భగీరథ్ కేసు, మరో వైపు కరీంనగర్లో వరుస చోరీల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక బండి సంజయ్ కేటీఆర్పై విమర్శలు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, న్యాలకొండ రాఘవరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, అడిచెర్ల సాయి, బూర బాలు, గెంట్యాల శ్రీనివాస్, రాములు, కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. కోతుల బెడదకు చెక్బోయినపల్లి(చొప్పదండి): వెంకట్రావుపల్లిలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు సర్పంచ్ ఇరువాల సంధ్య–మహేందర్ ఆధ్వర్యంలో తీర్మానించారు. ఈక్రమంలో రోజుకు 50 నుంచి 60 కోతులను బోనులో బంధించి అడవిలో వదులుతున్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే పోలీస్శాఖ పరంగా చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. జిల్లా ఆఫీస్ ఆవరణలోని పరేడ్ మైదానంలో శనివారం జిల్లా ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, హోమ్గార్డ్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, నిత్యం కనీసం అరగంట నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. బయట ఆహారాన్ని వీలైనంత మేరకు తినొద్దని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతూ జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు మధుకర్, సురేష్, రమేశ్, ఆర్ఎస్సైలు రా జు, శ్రవణ్యాదవ్, దిలీప్, సాయికిరణ్ పాల్గొన్నారు. -
అభిషేకం.. పారాయణం
సిరిసిల్లటౌన్: తొలి ఏకాదశి పర్వదినాన్ని జిల్లా కేంద్రంలో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సుప్రభాతసేవ, అభిషేకం, సహస్ర విష్ణుపారాయణం జరిగాయి. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు రవీందర్, లక్ష్మణ్, అర్చకులు మాడంరాజు కృష్ణమాచారి, శ్రీకాంత్చారి, వర్ధనాచారి పాల్గొన్నారు. గాంధీనగర్ హనుమాన్ ఆలయంలో రుక్మిణి విఠలేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు.కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ సిరిసిల్లటౌన్: నీట్ పేపర్ లీకేజీ, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలోని మృతులకు నివాళిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఆకునూరి బాలరాజు, రాగుల జగన్, సత్యం, చందు పాల్గొన్నారు. -
షాపు కూల్చివేతపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
● కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ కమిషనర్కు నోటీసులు వేములవాడ: 17వ వార్డు కౌన్సిలర్ కొండ్లెపు ముత్యంకు చెందిన భీమన్న ఆలయం ముందున్న షాపు కూల్చివేత ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్లకు ఈనెల 24న నోటీసులు జారీ చేసింది. బాధితుడు ముత్యం శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తదితర అంశాలతో నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని కమిషన్ ఆదేశించినట్లు తెలిపారు. తాను నిర్వహిస్తున్న షాపును కక్షపూరితంగా కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో గత నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. తన ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. కౌన్సిలర్లు మైలారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్ ఉన్నారు. -
వర్దీ దందా!
సిరిసిల్లటౌన్: కార్మిక క్షేత్రం వస్త్ర, బీడీ పరిశ్రమలకు నిలయం. ఈ రెండు పరిశ్రమలను నమ్ముకొని జిల్లా కేంద్రంలో 90 శాతం కుటుంబాలు బతుకుతున్నాయి. వస్త్రపరిశ్రమలో అందరికీ ఒకే రకమైన కూలి డబ్బులు లభిస్తుండగా.. బీడీ పరిశ్రమలోనే వింత పరిస్థితులు ఉన్నాయి. బీడీకార్మికుల అవసరాన్ని బట్టి వర్దీ(నగదు చెల్లింపు) దందా వేళ్లూనుకుంది. బీడీలు అప్పజెప్పిన వెంటనే డబ్బులు ఇస్తున్నామని అసలు వేతనం కంటే తక్కువ చెల్లిస్తుంటారు. లైసెన్సులు లేకుండానే అక్రమంగా బీడీల తయారీ కేంద్రాలను నడుపుతున్నారు. రోజువారీ నగదు ఆశ చూపిస్తూ మహిళా కార్మికులతో బీడీలు చుట్టిస్తూ రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.వందల కోట్ల జీరో వ్యాపారం సాగుతోంది. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కార్మికక్షేత్రంలో వర్ద్దీ దందాపై ఫోకస్ కథనం. భువనగిరి, హైదరాబాద్ కేంద్రాలుగా దందా జిల్లా వ్యాప్తంగా సుమారు 2లక్షల మంది కార్మికులు బీడీ తయారీతో ఉపాధి పొందుతున్నారు. వర్దీ బీడీలను భువనగిరి, హైదరాబాద్ ప్రాంతాల వ్యాపారులు తయారు చేయిస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలో గుట్టుగా వర్దీ బీడీ వ్యాపార కేంద్రం నిర్వహిస్తున్నట్లు సమాచారం. లైసెన్స్డ్ కంపెనీలు వేయి బీడీలకు రూ. 275.25 చెల్లిస్తుండగా.. వర్దీ బీడీ యజమానులు వేయి బీడీలకు రూ.230 మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే వీరు రోజువారీగా నగదు ఇస్తుండడంతో కార్మికులు సైతం తమ అవసరాలు తీరుతున్నాయనే ఉద్దేశంతో వర్దీ బీడీలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తతంగంపై కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నా కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కార్మికులకు, ప్రభుత్వానికి నష్టం ఇలా.. -
రాజన్నకు మరో రూ.99.40 కోట్లు
● ఇప్పటికే రూ.150 కోట్లతో పనులు ● వివరాలు వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే రూ.150కోట్లతో పనులు మొదలుకాగా.. మొత్త ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.249.40 కోట్లకు చేరుకున్నట్లు వివరించారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.50కోట్లు, 2024–25లో రూ.100 కోట్లు విడుదల చేయగా.. తాజాగా రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాలను ఆధునికీకరించడం లక్ష్యమన్నారు. ఇప్పటికే రాజన్న ఆలయంలో 45 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ నిధులతో మిగిలిన నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆలయ పరిసరాల సుందరీకరణ పనులు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ పూర్తయితే ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక రంగంలోనూ వేములవాడ ప్రాధాన్యం సంతరించుకుంటుందన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
రెక్కల కష్టం వృథా
ఒకప్పుడు నెలలో అన్ని దినాలు బీడీలతో ఉపాధి పొందేవాళ్లం. ఇప్పుడు పెద్ద కంపెనీల్లో పీఎఫ్, ఈఎస్ఐ పథకాలకు అర్హులమైనా నిత్యం పని దొరకడం లేదు. ఫలితంగా రోజువారీ నగదు కూలీ కోసం వర్దీ బీడీలతో కార్మికులు రెక్కల కష్టాన్ని వృథా చేస్తున్నాం. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి. – దాసరి రూప, బీడి కార్మికురాలు కార్మికుల సంక్షేమం పట్టించుకోవాలి జిల్లా అధికారులు బీడీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలి. వర్దీ బీడీలతో కార్మికులకు పని దొరుకుతుంది కానీ ప్రభుత్వం, కార్మికులకు నష్టం జరుగుతుంది. లైసెన్స్ లేకుండా సాగుతున్న అక్రమ వ్యాపారం మూసేయాలి. – సూరం పద్మ, బీడీ కార్మిక నేత టేకేదారులే మధ్యవర్తులు జిల్లాలోని పలువురు బ డా కంపెనీల టేకేదారులు వర్దీ బీడీలతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులకు లై సెన్స్డ్ కంపెనీల బీడీల తయారీ చూపిస్తూ అధికశాతం వర్దీ బీడీలను చేయిస్తున్నారు. అన్బ్రాండ్ కంపెనీలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. – మూశం రమేశ్, బీడీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు -
పట్టుదల..కృషి.. శ్యామ్ప్రసాద్లాల్
సిరిసిల్ల: ప్రభుత్వ బడిలో ఓనమాలు దిద్దిన విద్యార్థి.. ఐఏఎస్ వరకు ఎదిగారు. పట్టుదల.. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్గా చేరిన జి.వి.శ్యామ్ప్రసాదలాల్ క్రమంగా కన్ఫర్డ్ ఐఏఎస్ వరకు ఎదిగారు. చదువులో పట్టుదల.. విధుల్లో నిబద్ధత ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధిస్తామనేందుకు శ్యామ్ప్రసాద్లాల్ నిలువెత్తు సాక్ష్యం. ఏ ప్రాంతమైనా.. ఏ స్థాయిలో పని చేసిన తనదైన శైలితో ముందుకెళ్తున్న ఐఏఎస్ అధికారి శ్యామ్ప్రసాద్లాల్ స్ఫూర్తిదాయక కథనం..– వివరాలు 8లో.. -
వేములవాడలో 10 అడుగుల నాగుపాము కలకలం..
కరీంనగర్, రాజన్న సిరిసిల్లా: జిల్లాలో ఓ పాము కలకలం రేపింది. వేములవాడలో భీమేశ్వర ఆలయం ముందున్న బెల్లం దుకాణం సమీపంలో దాదాపు 10 అడుగుల పాము ప్రత్యక్షం అయ్యింది. దీంతో ఆలయంలోని భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే స్నేక్ క్యాచర్ జగదీశ్వర్ తీవ్రంగా శ్రమించి, సాహసోపేతంగా ఆ పామును పట్టుకోవడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. -
సర్కారు బడికి రోబోటిక్ టీచర్!
సిరిసిల్ల టౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ బడి విద్యార్థులకు తెలంగాణలోనే మొదటి హ్యూమనాయిడ్ రోబో టీచర్ను అందించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఈ పుట్టినరోజున అత్యాధునిక రోబోను పాఠశాలకు బహుమతిగా అందజేశారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడం కోసం ఈ రోబోను తెలంగాణలోనే తొలి ప్రయోగంగా ప్రవేశపెట్టామన్నారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ రోబో విద్యాబోధనలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్తో రోబోటిక్ టీచర్ నేరుగా మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులు అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సర్కారు బడి విద్యార్థులు చిన్న వయసు నుంచే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ద్వారా రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతపై ఆసక్తి పెంచేందుకు దోహదం చేసింది. -
రెండేళ్ల కిందటే..
జిల్లా పరిధిలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే ‘సెస్’ సంస్థ అధికారులు రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదిత రోడ్డులో ఉన్న విద్యుత్లైన్లు, హైటెన్షన్ లైన్ల షిఫ్టింగ్కు అయ్యే ఖర్చు అంచనాలను క్షేత్రస్థాయి సర్వేలు చేయాలని ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ అందించే ధృవ కన్సల్టెన్సీ ఏజెన్సీతో సంయుక్త సర్వేలు చేయాలని ‘సెస్’ మేనేజింగ్ డైరెక్టర్ను నేషనల్ హైవే విభాగం ఈఈ ఆదేశించారు. ఈమేరకు క్షేత్రస్థాయి సర్వేలు రెండేళ్ల కిందటే నిర్వహించారు. ఈ రోడ్డు నిర్మాణంతో సిరిసిల్ల–సిద్దిపేట మధ్య ఉన్న వంకర రోడ్డుకు మోక్షం కలుగుతుంది. -
● జిల్లాలో విచ్చలవిడిగా విడినూనెల విక్రయాలు ● అదనపు ఆదాయంపై వ్యాపారుల దృష్టి ● పట్టించుకోని ఫుడ్సేఫ్టీ అధికారులు
కల్తీకాగుతోంది !వేములవాడ: తొలి ఏకాదశికి పిండి వంటలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇదే అవకాశంగా వ్యాపారులు కల్తీ నూనెల విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లను పోలిన స్టిక్కర్లు వేసి.. సెకండ్ క్వాలిటీ ఆయిల్ విక్రయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత జరుగుతున్నా ఫుడ్సేఫ్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసే సమయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఆహారభద్రత లైసెన్స్) నంబర్, తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాలు ఇలా.. వేములవాడలో నూనె దుకాణాలు : 12రెండు నెలల్లో సేకరించిన శాంపిల్స్ : 05నమోదైన కేసులు : 01 కేసు పెండింగ్తనిఖీలు చేస్తాం పండుగ సందర్భంగా ఎక్కువ మంది పిండివంటలు చేసుకుంటుంటారు. షాపుల్లో తనిఖీలు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి. – అనూష, ఫుడ్సేఫ్టీ అధికారి, సిరిసిల్ల -
గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలించొద్దు
● ఎంవీఐ వంశీధర్ సిరిసిల్లటౌన్: ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వా హనాలపై విజి లెన్స్ అధికారులు శుక్రవారం కొరడా ఝుళిపించారు. శుక్రవారం కలెక్టర్ చౌరస్తా, వేములవాడ, కొదరుపాక ప్రాంతాల్లో సిరిసిల్ల ఎంవీఐ వంశీధర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను తరలిస్తున్న నాలుగు సరుకు రవాణా వాహనాలను సీజ్ చేసినట్టు ఎంవీఐ వంశీధర్ తెలిపారు. పర్మిట్ లేని లారీ, ఫిట్నెస్ లేని ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని 20 వాహనాలపై కేసులు బుక్ చేసినట్టు వివరించారు. తనిఖీల్లో సాగర్, నిఖిల్కుమార్రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగురు వైద్యుల బదిలీ
వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలోని ఆరుగురు వైద్యులు బదిలీ అయ్యారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ స్టేషన్ఘన్పూర్కు బదిలీ కాగా ఇన్చార్జి సూపరిండెంట్గా డాక్టర్ సుభాషిణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆస్పత్రిలో మొత్తం ఆరుగురు వైద్యులు సూపరింటెండెంట్ రవీందర్, అనిల్కుమార్ ఆర్థోపెడిక్, డాక్టర్ తిరుపతి అనస్థీషియా, డాక్టర్ రత్నమాల కంటి వైద్యనిపుణులు ఎల్లారెడ్డిపేటకు బదిలీ అయ్యారు. డాక్టర్ ప్రణతి ధర్మపురికి, డాక్టర్ పరమేశ్వరీ దుబ్బాకకు బదిలీ అయ్యారు. వేములవాడ ఏరియా ఆస్పత్రికి డాక్టర్ జ్యోతి, డాక్టర్ ఝాన్సి బదిలీపై వచ్చారు. -
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రలో ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నా యకులు కేక్లు కోసి స్వీట్లు పంచారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్, రాష్ట్ర నాయకుడు గూడూరి ప్రవీణ్, అర్బన్బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, కుంభాల మ ల్లారెడ్డి పాల్గొన్నారు. సిరిసిల్ల కోర్టు ప్రాంగణంలో బీఆర్ఎస్ లీగల్సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్రావు పాల్గొన్నారు. జిల్లా దివ్యాంగ సమితి ఆధ్వర్యంలో చేసిన వేడుకల్లో దొంతినేని చంద్రారావు, నీరటి రాజు, నరేశ్, శోభారాణి పాల్గొన్నారు. విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు రాజీవ్నగర్లో గిప్ట్ ఏ స్మైల్లో భాగంగా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్యలక్ష్మి, దొంతినేని కళ్యాణి అశోక్రావు, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం మండల భూపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ చీరల డబ్బులు ఇప్పించాలి
సిరిసిల్లటౌన్: ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇందిరా మహిళాశక్తి చీరల బిల్లుల బకాయిలు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం టెక్స్టైల్ ఏడీకి వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ యజ మానులు ఆసాములకు, కార్మికులకు ప్ర తీ వారం పూర్తిస్థాయిలో కూలీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది కొనుగో లు చేసిన చీరలకు 60 శాతం డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుత చీరలకు ఒక్క రూపా యి కూడా రాలేదన్నారు. బూర శ్రీనివాస్, సామల జగన్, రాపెల్లి శ్రీహరి, ఒడ్డేపల్లి కిష న్, బింగి సంపత్, సామనపల్లి ప్రభాకర్, సందుపట్ల పోచమల్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. కోనోకార్పస్ చెట్ల తొలగింపు వేములవాడ: పట్టణంలోని రెండో బైపాస్రోడ్డులో ప ర్యావరణా నికి హాని కలి గించే కోనోకార్పస్ చెట్లను మున్సిపల్ అధికారులు శుక్రవారం తొలగించారు. డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు వస్తుండడంతో స్థాని కుల ఆందోళనతో వీటిని తొలగిస్తున్నారు. మానస పిల్లల ఆస్పత్రి తనిఖీ సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని మానస పిల్లల ఆస్పత్రిలో శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ చేపట్టింది. రోగుల నుంచి అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుపై ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆస్పత్రిని తనిఖీ చేసింది. చికిత్స విధానాలు, బిల్లులు, వసూలు చేసిన చార్జీలు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. సమగ్ర నివేదికను జిల్లా అధికారులకు సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తనిఖీలో వైద్యులు నాగేందర్బాబు, సౌమ్య, పూర్ణచందర్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుపై డీఎస్పీ విచారణ మానస పిల్లల ఆస్పత్రిలోని కొందరిపై వచ్చి న ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుపై సిరిసిల్ల డీఎస్పీ నా గేంద్రచారి విచారణ చేపట్టారు. ఆస్పత్రిని సందర్శించి ఫిర్యాదుదారుల ఫిటిషన్ ఆధారంగా సాక్ష్యులను విచారించారు. ఎస్టీ, ఎస్టీ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జయశీల కోరారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో రైతులకు సలహాలు ఇచ్చారు. ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతో గండిలచ్చపేటను ‘మోడల్ విలేజ్’(ఆదర్శ గ్రామం)గా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. మాజీ సర్పంచ్ బామగారి పర్శయ్య, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, మండల వ్యవసాయాధికారి సంజీవ్, ఇరిగేషన్ ఏఈ హిమబింధు, ఏపీవో రాజనర్సయ్య, సర్పంచ్ జంగిటి అంజయ్య, ఉపసర్పంచ్ భాను, పంచాయతీ కార్యదర్శి జి.వాణి పాల్గొన్నారు. ఆరుతడి పంటలు వేయండి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందునా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం కోరారు. మండలంలోని దుమాలలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో రైతులకు అవగాహన కల్పించారు. అఫ్జల్ బేగం మాట్లాడుతూ లోటు వర్షపాతం ఉన్నందునా రాగులు, నువ్వులు వేసుకోవాలన్నారు. ఎంపీడీవో సత్తయ్య మాట్లాడుతూ జలసిరిలో భాగంగా ప్రతీ ఇంటికి ఇంకుడుగుంత, బోరుబావి వద్ద రీచార్జ్ స్ట్రక్చర్, ఫామ్పాండ్స్, ఊతకుంటలను నిర్మించుకోవాలని కోరారు. తహసీల్దార్ సుజాత, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్ పాల్గొన్నారు. -
కరీంనగర్–పిట్లం రోడ్డుకు మోక్షం ఏదీ?
కరీంనగర్–పిట్లం రహదారిని సిరిసిల్ల, కామారెడ్డి మీదుగా నిర్మించాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. అటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వైపు నేరుగా జాతీయ రహదారి భాగ్యం కలుగుతుంది. జిల్లాకు రెండు జాతీయ రహదారులు వస్తాయి. ఫలితంగా వేములవాడ, సిరిసిల్ల పట్టణాలతోపాటు పల్లెలకు బహుముఖ ప్రయోజనం దక్కనుంది. రోడ్డు నిర్వహణ బాధ్యతలను నేషనల్ హైవే అథారిటీ పరిధిలో ఉండడంతో జిల్లాలో మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంతటి ప్రాధాన్యత గల జాతీయ రహదారుల నిర్మాణాలపై ఇప్పటికై నా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టిసారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
సర్వే స్థాయిలో సిద్దిపేట రోడ్డు
సిరిసిల్ల–సిద్దిపేట జిల్లా కేంద్రాల మధ్య మూలమలుపులను నివారించేందుకు నిర్మించనున్న జాతీయ రహదారి 365–బీ రోడ్డు పనులు సర్వేస్థాయిలోనే ఆగిపోయాయి. సూర్యాపేట–కోరుట్ల మధ్య జనగామ, చేర్యాల, దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సూర్యాపేట నుంచి దుద్దెడ వరకు ఫోర్లేన్ పనులు ముగింపు దశకు చేరాయి. కొత్తగా సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు 54 కిలోమీటర్ల ఫోర్లేన్ నిర్మాణానికి డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) సిద్ధమవుతోంది. ఈ రోడ్డుతో సూర్యాపేట వద్ద ఉన్న హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి–65తో కోరుట్ల వద్ద ఉన్న జగదల్పూర్(ఛత్తీస్గఢ్) జాతీయ రహదారి–63తో అనుసంధానమవుతుంది. ఈ లక్ష్యంతో కొత్తగా సూర్యాపేట–కోరుట్ల మధ్య 249 కిలోమీటర్ల జాతీయ రహదారిని ప్రతిపాదించారు. సర్వేలు సైతం పూర్తయ్యాయి. -
సర్వేతోనే స్టాప్ !
● జిల్లాకు జాతీయ రహదారి కరువు ● నిలిచిన సిరిసిల్ల–సిద్దిపేట రోడ్డు ● ప్రతిపాదనల్లోనే కరీంనగర్–పిట్లం ఫోర్లేన్ ● రూ.1,745 కోట్లతో రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు ● తొమ్మిదేళ్లుగా వీడని గ్రహణంసిరిసిల్ల: కార్మిక, ధార్మిక క్షేత్రంగా భాసిల్లుతున్న జిల్లాకు ఒక్క జాతీయ రహదారి దిక్కులేదు. పొరుగున ఉన్న కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు దశాబ్దాల కిందటే దరిచేరాయి. జిల్లాకు రెండు జాతీయ రహదారులు వస్తాయని, ఫోర్లేన్ రోడ్లు రూపుదిద్దుకుంటాయని గతంలో నేతలు ప్రకటించిన మాటలు నీటిమీద రాతలయ్యాయి. తొమ్మిదేళ్లుగా జాతీయ రహదారులకు అడుగులు పడడం లేదు. సిద్దిపేట నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు ప్రతిపాదించిన ఎన్హెచ్–365–బీ రోడ్డు పనులు సర్వే స్థాయిలోనే నిలిచిపోయాయి. తొమ్మిదేళ్లుగా ప్రతిపాదనల్లోనే... నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) జిల్లాలోని రెండు ప్రధాన రహదారులను నేషనల్ హైవేలుగా 2017లో గుర్తించింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల అభివృద్ధికి జాతీయ రహదారులు బాసటగా నిలుస్తాయని జిల్లా ప్రజలు భావించారు. కానీ తొమ్మిదేళ్లుగా పాలకులు జాతీయ రహదారుల నిర్మాణంపై ఊరిస్తూనే ఉన్నారు.నోటిఫికేషన్ జారీ సిద్దిపేట జిల్లా దుద్దెడ నుంచి రగుడు వరకు 54 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల విభాగం భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఎస్.వో.3514(ఈ) తేదీ 23.11.2016, మోర్త్ లెటర్ నంబరు ఆర్డబ్ల్యూ/హెచ్వైడీ/ఎన్హెచ్–365/130 కేఎం, 184/సీఆర్వో/775 తేదీ: 18.12.2023 ప్రకారం లెటర్ నంబరు ఈఈ/ఎన్హెచ్/ఎస్డీపీటీ/ఎన్హెచ్ /365బీ/2024–25/553 తేదీ: 08.10.2024 ద్వారా సంయుక్త సర్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి. -
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026
స్పోర్ట్స్ మీట్ సిరిసిల్లటౌన్: కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్యా విధానాలు లోపభూయిష్టంగా తయారయ్యాయని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాసంస్థల బంద్ చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్, ఆర్ఎస్ఎఫ్ రాష్ట అధ్యక్షుడు అంగూరి రంజిత్ మద్దతు తెలిపారు. సిరిసిల్ల అర్బన్: నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు క్రీడాపోటీలతో మానసికోల్లాసం కలుగుతుందని 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ పేర్కొన్నారు. సర్ధాపూర్లోని 17వ బెటాలియన్లో శుక్రవారం ఇంటర్ కంపెనీ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. అడిషనల్ కమాండెంట్ ఎం.ఐ.సురేష్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్.సురేష్, ఎం.రాజు, ఆర్ఐలు రాంబ్రహ్మం, కుమారస్వామి, శ్రీనివాస్, శ్యాంప్రసాద్, వసంతరావు పాల్గొన్నారు.సిరిసిల్ల అర్బన్: పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం బోనాలు తీశారు. విద్యార్థినులు అమ్మవారిగా.. విద్యార్థులు పోతురాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. డప్పుచప్పుళ్ల మధ్య పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. హెచ్ఎం చక్రవర్తుల రమాదేవి, ఏఏపీసీ చైర్పర్సన్ తిప్పవరం సుధ, ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్, శ్రీనివాస్, మాధవి, ఉమ, రాజమల్లు, రవికుమార్, వాణిశ్రీ, వీణ, శంకర్, మహేశ్ పాల్గొన్నారు. నిరసన.. బంద్ బోనం.. వైభోగం -
ఆలయ పనులు ప్రణాళికతో పూర్తి చేయాలి
సిరిసిల్ల/వేములవాడ/వేములవాడఅర్బన్: వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(వీటీఏడీఏ) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడలో కొనసాగుతున్న పనులను శుక్రవారం పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లో వీటీఏడీఏ అధికారులతో సమీక్షించారు. ప్రతీ పనికి గడువు నిర్ణయించి పూర్తి చేయాలన్నారు. శ్రీరాజరాజేశ్వర ఆలయానికి చెందిన నూతన గోశాలకు స్థలం కేటాయింపు, మిగతా పనుల పురోగతిని రెవెన్యూ, పశుసంవర్థకశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్, పర్యాటక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 ఫీట్ల రహదారి విస్తరణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. రహదారి నిర్మాణం, ఇరువైపులా మురుగు కాలువ నిర్మాణం, ఇతర పనులను నిర్ధేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఆర్అండ్బీ ఈఈ నరసింహచారి, పర్యాటకశాఖ ఎస్ఈ సరిత, పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి, ఆలయ ఈఈ రాజేశ్, నీటి పారుదల ఈఈ దయాకర్, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, ఎన్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. నీటివనరులు ఉన్న రైతులు మినహా మిగతా వ్యవసాయ భూములు ఖాళీగా వదిలేయకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాల విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు నిర్ణీత గడువులోపు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, జిల్లా విద్యాధికారి మొండయ్య, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ఉద్యానవనశాఖ అధికారి శరత్బాబు, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆరుతడి పంటల సాగుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన వేములవాడ మండలం అగ్రహారం శివారులోని తెట్టకుంట, మారుపాక గ్రామాల్లోని ఎఫ్సీఐ గోదాముల నిర్మాణానికి స్థలాలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. అనంతరం చింతాల్ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ వద్ద వేములవాడ ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్టార్ కార్యాలయాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో కుమారి, తహసీల్దార్ జయంత్కుమార్ ఉన్నారు. -
సిరిసిల్ల: ‘నా చావుకి ప్రధాని మోదీనే కారణం’
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తన చావుకు ప్రధాని నరేంద్రమోదీ కారణమంటూ సూసైడ్నోట్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కలకలం రేపింది. సర్(ఎస్ఐఆర్) ఫామ్పై సూసైడ్నోట్ రాసి చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రధాని మోదీ తన చావుకు ఎందుకు కారణమో ఆ నోట్లో వివరించలేదు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన పిట్ల వంశీ(25) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టి యర్ వరకు చదువుకున్న వంశీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు అక్కడితోనే ఆపేసి పెయింటింగ్ పని చేసేవాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మృతుడి తండ్రి పిట్ల బాలయ్య ఫిర్యాదు మేరకు తల్లి తిట్టిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. అంత్యక్రియల ఖర్చులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.20వేలు పంపించారు. వంశీ కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. అంత్యక్రియల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా శ్మశానవాటిక వద్దకు వెళ్లారు. నా చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణం SIR ఫాం మీద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వంశీ అనే యువకుడునా చావుకు కేవలం ప్రధాని నరేంద్ర మోదీ కారణమని, ఎవరిని ఏం… pic.twitter.com/kU98biYIbX— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026 -
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు
సిరిసిల్ల: వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వక్ఫ్ ఆస్తులు, భూముల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి గొట్టె జయశ్రీ, భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ కుమారస్వామి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్బాబు, కే.ఎస్.బి.కుమారి, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, కమిషనర్లు ఖదీర్పాషా, లోకేశ్, జిల్లా మైనార్టీ అధికారి అయేషా, సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్వీవీ స్వామి, జిల్లా సంక్షేమాధికారి కుమారస్వామి పాల్గొన్నారు.కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తి సర్పంచ్ మల్యాల స్వామిదాస్ తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ బడిలో చేర్పించారు. స్వామిదాస్కు ముగ్గురు కూతుళ్లు. మొదటి కూతురు తేజస్విని గురుకులంలో పదో తరగతి చదువుతోంది. రెండో కూతురు ఝాన్సీ గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో నాలుగో తరగతి, మూడో కూతురు ప్రతిభ అదే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నీటి వృథాను అరి కట్టి, పొదుపు చేసేందుకు బోర్వెల్ రీచార్జ్ ఫిట్స్ ఉపయోగపడతాయని జిల్లా గ్రామీణా భివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలో గురువారం బోర్వెల్ రీచార్జ్ ఫిట్ పనులను ప్రారంభించారు. సర్పంచ్ సుజాత, ఏపీడీ నర్సింలు, ఎంపీడీవో సత్త య్య, ఏపీవో కొమురయ్య, కార్యదర్శి ప్రవల్లిక, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రయ్య పాల్గొన్నారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి 30 మంది తరలింపువీర్నపల్లి(సిరిసిల్ల): ఉచిత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలం నుంచి 30 మందిని ఆపరేషన్ల కోసం సిరిసిల్లలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మండల మాజీ అధ్యక్షుడు శ్రీరామ్నాయక్, పార్టీ గ్రామాధ్యక్షుడు కముటం నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి ఉన్నారు. రూ.1,325కే మీటర్వేములవాడ/వేములవాడరూరల్: నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. రాజు మాట్లాడుతూ నూతన కనెక్షన్ కావాలనుకున్న వినియోగదారులు రూ.1,325 ఎన్పీడీసీఎల్ అధికారులకు చెల్లించాలన్నారు. కౌన్సిలర్ తూం మధు, టీజీఎన్పీడీఎల్ డీఈ వెంకటరమణ, ఏఈ సిద్దార్థ పాల్గొన్నారు. చిరుజల్లులుసిరిసిల్ల: జిల్లాలో గురువారం చిరుజల్లులు కురిశాయి. తుంపర్లతో కూడిన కొద్దిపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా రుద్రంగిలో 8.1 మిల్లీమీటర్ల వర్షం పడగా.. చందుర్తిలో 2.6, బోయినపల్లిలో 0.2, వేములవాడలో 0.4, సిరిసిల్లలో 2.3, కోనరావుపేటలో 0.5, వీర్నపల్లిలో 2.0, గంభీరావుపేటలో 0.4, ముస్తాబాద్లో 3.8, తంగళ్లపల్లిలో 2.2, ఇల్లంతకుంటలో 1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వేములవాడ రూరల్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వర్షం జల్లులు పెద్దగా పడలేదు. వాతావరణం సాధారణంగా ఉంది. -
చితికి పోతున్నారు!
ఈ ఫొటోలో అనాథలైన చిన్నారులు బాలసాని నందీశ్వర్, మనస్వినిలది ముస్తాబాద్. నెల క్రితం వీరి తండ్రి బాలసాని బాలరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం బాలరాజు భార్య కరుణ క్యాన్సర్తో మరణించింది. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. బాలరాజుపై ఆధారపడ్డ తల్లిదండ్రులు గౌరవ్వ, నారాగౌడ్ల రోదనలు నిత్యకృత్యమయ్యాయి. తల్లి లేని పిల్లలను, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాలరాజు.. ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విలవిల్లాడుతోంది. ఈ చిత్రంలో దీనంగా కనిపిస్తున్న వారి పేర్లు అనమేని రజిత, ఆమె అత్త మల్లవ్వ, కూతురు సహస్ర. వీరిది ముస్తాబాద్ మండలం పోతుగల్. రజిత భర్త ఆంజనేయులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పనులతోపాటు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించిన ఆంజనేయులు అప్పులు కూడా చేశాడు. అప్పులబాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకోగా.. కుటుంబ భారం రజితపై పడింది. దివ్యాంగురాలైన కూతురును ఇంటి వద్ద అత్త చూసుకుంటుండగా, కుమారుడు రాంచరణ్ను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించింది. ప్రభుత్వం సాయమందిస్తే ఽధైర్యంగా కుటుంబాన్ని పోషించుకుంటానంటోంది.ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారులు బండి వికాస్, వినయ్. వీరిది ముస్తాబాద్ మండలం ఆవునూర్. పెద్దకొడుకు వికాస్కు ఎప్సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. బీటెక్ ఫీజు చెల్లించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడం.. అప్పుల బాధ తీవ్రం కావడంతో తల్లి రజిత వారం క్రితం ఆత్మహత్య చేసుకుంది. భర్త రవీందర్ దుబాయ్ వెళ్లగా సరైన ఉపాధి లభించలేదు. తల్లి లేకపోవడంతో ఇప్పుడు వికాస్, విజయ్ల బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. -
‘నీట్’ వ్యవహారంపై భగ్గుమన్న కాంగ్రెస్
సిరిసిల్లటౌన్: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కోట్లాది మంది ఆందోళనకు దిగితే కేంద్ర ప్రభుత్వం మిన్నకుంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈమేరకు గురువారం సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులపై లాఠీచార్జీ చేయించడం అప్రజాస్వామ్యమన్నారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వంశీ తన ఆత్మహత్యకు ప్రధాని నరేంద్రమోదీ కారణమని సూసైడ్నోట్ రాయడంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, నాయకులు వేముల దామోదర్, ఎం.డి.రియాజ్, రాగుల రాములు, బొప్ప దేవయ్య, వెల్దండి దేవదాస్ పాల్గొన్నారు. -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడాలి
● ఎంఈవోలు ప్రతీ స్కూల్ను తనిఖీ చేయాలి ● రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ)పై డీఈవో మొండయ్య, కో–ఆర్డినేటర్లతో కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. పీజీఐలో భాగంగా జిల్లాకు వివిధ అంశాల్లో వచ్చిన గ్రేడింగ్, పా యింట్స్పై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్లలో ప్రతిభ చూపేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా విద్యాధికారి తమ పరిధిలోని ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు షెడ్యూల్డ్ ప్రకారం అన్ని విద్యాలయాల్లో తనిఖీ చేసి.. ఆ వివరాలు నమోదు చేయాలన్నారు. టీచర్ల ట్రైనింగ్ వివరాలు, అన్ని విద్యాలయాల్లో కంప్యూటర్లు, ట్యాబ్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఐఎఫ్బీ ప్యానెల్స్, టాయిలెట్స్, తరగతి గదులు, మైదానం, ఇతర సదుపాయాల పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంపై.. జిల్లాలో ఎల్నినో ప్రభావంపై రైతులకు గ్రామ సభల్లో అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షపాతం లోటు, భూగర్భజలాల తగ్గుదల, రిజర్వాయర్లలో వర్షం నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రత్యేకాధికారులు గ్రామసభల్లో పాల్గొనాలి మండల ప్రత్యేకాధికారి వారానికి కనీసం రెండు గ్రామసభలకు హాజరై రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులతో స మన్వయం చేసుకుంటూ ఆరుతడి, ప్రత్యామ్నా య పంటలపై అవగాహన కల్పించాలన్నారు. జలసిరిలో రూపొందించిన యాక్షన్ప్లాన్ అమలు చేయాలన్నారు. ఫామ్పాండ్స్, బోర్వెల్ రీచార్జ్, నీటి సంరక్షణ పనులను పెద్ద సంఖ్యలో గ్రౌండింగ్ చేసి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించాలన్నారు. జలసిరి పనులకు సంబంధించి నూతన ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్ బేగం పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం బియ్యాల సమ్మయ్య ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో దొంగలు చొరబడి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని, బాధితులు కాల్వశ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గంజాయి పట్టివేతబుగ్గారం: మండలంలోని క్రాస్ రోడ్డు సమీపంలో గురువారం 60 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి మండలకేంద్రానికి చెందిన కొండవేణి రాజ్కుమార్ అనే యువకుడు గంజాయితో పట్టుబడినట్లు ఎస్సై జి.సతీష్ తెలిపారు. నిందితుడి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీఏ గనిలో ప్రమాదం.. కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలు రామగిరి: ఏపీఏ గనిలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. వెన్సర్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు గుంట మల్లేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. గనిలో 3వ సిమ్లో రూఫ్ బోల్ట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో యంత్రానికి సంబంధించిన బిట్ విరిగి మల్లేశ్ తలపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్ను ఆర్జీ–3 ఏరియా సెంటినరికాలనీ డీస్పెన్సరికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం కరీంనగర్లోని ప్రైవేట్ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై అదికారులు ఆరా తీస్తున్నారు. -
రెండుసార్లు సర్పంచ్.. సాయం కోసం ఎదురుచూపు
కొడిమ్యాల: ఆయన రెండుసార్లు సర్పంచ్గా కొనసాగారు. పదేళ్లపాటు ప్రజాసేవకు పాటుపడ్డారు. పదిమందికి సహాయపడిన ఆయన చేతులు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఆయన.. దాతలు సాధ్యమైనంత సాయం చేయాలని వేడుకుంటున్నాడు. అతడే మండలంలోని తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ చెట్టుపల్లి హరేందర్. హరేందర్కి ఇద్దరు కూతుళ్లు. ఉన్నంతలో ఇద్దరికీ వివాహం చేశాడు. పదేళ్లపాటు సర్పంచ్గా కొనసాగినప్పటికీ నయాపైసా కూడబెట్టుకోలేకపోయారు. కొద్దికాలంగా కడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంబారిన పడగా.. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఖర్చులు భారంగా మారడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇల్లు తప్ప ఏమిలేదని అతని సన్నిహితులు తెలిపారు. దాతలు స్పందించి తోచినంత సహాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు రూ.52వేల ఆర్థిక సహాయాన్ని ఆయన భార్యకు అందించారు. హరేందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హరెందర్ కుటుంబానికి దాతలు అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, కృష్ణారావు, వెంకటేష్, నరేందర్ రెడ్డి, మల్లేశం, మహేష్, సత్యం, మల్లేశ్ యాదవ్ కోరారు. అనారోగ్యం బారిన తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ వైద్య ఖర్చులకు చేయిచాస్తున్న హరేందర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం ఇల్లు తప్ప గుంట భూమిలేక తల్లడిల్లుతున్న ఇల్లాలు -
వరినాట్లకు వలస కూలీలు
మంథనిరూరల్: ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు లేక ఆలస్యమైన వరినాట్లు ఒకేసారి ముమ్మరం కావడంతో రైతులు వలస కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు పక్క గ్రామాల్లోని కూలీలను ఉపయోగించుకోగా రెండేళ్లుగా జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. దీంతో ఇటు సమయం, అటు డబ్బు ఆదా అవుతుందనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరతతో.. వర్షాకాలం ప్రారంభమై ఖరీఫ్ సీజన్ పంటల సాగు మొదలైన క్రమంలో కూలీల కొరత రైతులను వెంటాడుతోంది. నాట్లు వేయడం, కలుపు తీయడంలాంటి పనులకు ఎక్కువగా కూలీలనే వినియోగిస్తుంటారు. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం, రెండు రోజులుగా సాగు చేసుకునేలా వర్షం పడటంతో ఒకేసారి నాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో రైతులకు స్థానిక కూలీలు దొరకపోవడంతో వలస కూలీలతోనే నాట్లు వేయిస్తున్నారు. ఆంధ్రా, బీహార్ నుంచి వలస ఆంధ్రా, బీహార్, ఉత్తర్ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన కూలీలను ఇక్కడకు తీసుకువచ్చి వరినాట్లు వేయిస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కావు. ఈక్రమంలో ఉపాధి కోసం రెండు మూడేళ్లుగా ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. రెండు మాసాలు ఇక్కడ కూలీలు పని చేసి ఆగస్టు చివరి మాసంలో తమ ప్రాంతాలకు వెళ్లిపోతామని ఓ వలస కూలీ తెలిపారు. ఎకరాకు రూ.5వేలు చెల్లింపు సాధారణంగా వరినాట్ల సమయంలో ఒక్కో కూలీకి రూ.300 నుంచి రూ.400ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎకరం పొలాన్ని 10–15 ఒకపూటలో నాటు వేస్తారు. కానీ వలస కూలీలు మాత్రం గుత్తగా ఎకరాకు రూ.5వేలు తీసుకొని నాటు వేస్తారు. ఒకరోజులో వలస కూలీలు పది మంది బ్యాచ్ సుమారు ఐదు ఎకరాల్లో నాటు వేస్తారని చెబుతున్నారు. లోకల్ కూలీలకంటే వలస కూలీలు వేగంగా నాట్లు వేయడం పట్ల రైతులు వారివైపు మొగ్గు చూపుతున్నారు. పద్ధతి ప్రకారం నాటు వేయడంతోనే.. ఆంధ్రా, బీహార్, ఉత్తరప్రదేశ్లాంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చే కూలీలు నాట్లు వేయడంతో శిక్షణ పొంది ఉంటారు. సాధారణంగా పంట దిగుబడి నాట్లు వేసే పద్ధతిపై కూడా ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. లోకల్ కూలీల కంటే వలస కూలీలు ఒక్క పద్ధతితో నాట్లు వేస్తారని, దీంతో పంట దిగుబడిపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఎక్కువగా రైతులు వలస కూలీలతో నాట్లు వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పది ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్న. నాటు వేసేందుకు పొలం జంబు కొట్టి సిద్దం చేసిన. రెండేళ్లుగా వలస కూలీలతోనే నాట్లు వేయిస్తున్న. వారు ఒక పద్ధతిలో నాటు పెడుతరు. దీంతో వరి పంటకు ఎలాంటి తెగుళ్లు రావు. పిలకలను పద్దతిగా నాటకపోతే దోమపోటు వస్తుంది. వలస కూలీలతో నాటు వేయిస్తే ఎలాంటి నష్టం ఉండదు. పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. – గుమాసి వెంకటేశ్, రైతు, స్వర్ణపల్లి వ్యవసాయ పనులకు కూలీల కొరత ఆంధ్రా, బీహార్ కూలీలతో వరి నాట్లు ఎకరాకు రూ.5వేలు చెల్లింపు -
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
ఇంద్రవెల్లి(ఆదిలాబాద్): విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న తెలిపారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలం లాల్టెకిడి గ్రామానికి చెందిన జాదవ్ సురేందర్ విదేశాల్లో వెళ్లి ఉద్యోగం కోసం జగిత్యాల జిల్లా వాల్గొండకు చెందిన ఏజెంట్ శ్రీనివాస్గౌడ్ను సంప్రదించాడు. రూ.4.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పి అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ ప్రభాకర్ను పరిచయం చేశాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని సురేందర్ను నమ్మించారు. గతేడాది జూన్ 11 నుంచి విడతల వారీగా ఇద్దరికి ఫోన్ పే ద్వారా రూ.4,31,800 పంపించాడు. వేర్వేరు కారణాలు చెప్పడంతో మళ్లీ ఫోన్ పే ద్వారా రూ.2.20 లక్షలతో మొత్తం రూ.6,51,800 చెల్లించాడు. డబ్బులు తీసుకుని విదేశాలకు పంపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని జాదవ్ సురేందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏజెంట్ శ్రీనివాస్గౌడ్, ఇస్లావత్ ప్రభాకర్ను అరెస్ట్ చేశారు. ఉట్నూర్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరి రిమాండ్ -
యువకుడి ఆత్మహత్య.. ఉద్రిక్తం
ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లటౌన్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన యువకుడు పిట్ల వంశీ ఆత్మహత్యతో స్వగ్రామంతోపాటు సిరిసిల్లలో హై అలర్ట్ నెలకొంది. ప్రధాని మోదీ తన మృతికి కారకుడిగా పేర్కొంటూ సూసైడ్నోట్ రాయడంతో మృతుడి స్వగ్రామం గొల్లపల్లి, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ● గొల్లపల్లిలో బీఆర్ఎస్ ర్యాలీ వంశీ ఆత్మహత్య చేసుకోగా.. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరామర్శించారు. ఆగయ్య మాట్లాడుతూ వంశీని కేంద్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. పేయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడని, యువకుడి మృతితో ఆ కుటుంబం వీధిన పడిందన్నారు. యువకుడి కుటుంబానికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఫ్లకార్డులతో ర్యాలీ తీశారు. సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సర్పంచ్ కొండ రమేశ్గౌడ్, అందె సుభాష్ ఉన్నారు. ● అండగా ఉంటాం వంశీ కుటుంబానికి అండగా ఉంటామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గౌస్, శ్రీనివాసరెడ్డి, గుడ్ల శ్రీనివాస్ ఉన్నారు. ● సంగీతం పరామర్శ మృతుడు వంశీ కుటుంబ సభ్యులను జిల్లా ఆస్పత్రి వద్ద డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కాగా మార్చురీ గదిలో ఉన్న వంశీ మృతదేహాన్ని చూడటానికి ఆస్పత్రి సెక్యూరిటీ కొద్ది సేపు ఒప్పుకోకపోవడం చర్చనీయాంశమైంది. ● పోలీసుల మోహరింపు తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ సూసైడ్ నోట్ రాయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొల్లపల్లిలో పోలీసు బలగాలు మోహరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించాలని యువకులు భావించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ జోక్యం చేసుకోవడంతో బస్టాండ్ నుంచి ఇంటి వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. రాచర్లగొల్లపల్లి, సిరిసిల్లల్లో బందోబస్తు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మద్దతు -
ట్రినిటీలో ఫ్రెషర్స్ డే వేడుకలు
కరీంనగర్కల్చరల్: ట్రినిటీ జూనియర్ కళాశాలలో 2026–28 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన వేదికలపై నిర్వహించిన కార్యక్రమానికి కళా శాల ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జగిత్యాల డిప్యూటీ కలెక్టర్, ట్రినిటీ పూర్వ విద్యార్థిని కన్నం హరిణి, గ్రూప్–1లో విజ యం సాధించిన సందవేణి ప్రియాంక, బింగి కీర్తన ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మనోహర్రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో వేలాది మంది విద్యార్థులను ఇంజినీర్లు, వైద్యులు, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దామని తెలిపారు. ట్రినిటీలో చదివిన తన ప్రయాణమే నేటి విజయానికి పునాది అని హరిణి పేర్కొన్నారు. అనంతరం గ్రూప్స్లో విజ యం సాధించిన పూర్వ విద్యార్థులు, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన ఇంటర్ విద్యార్థులు, నీట్, జేఈఈ, ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకర్లు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సన్మానించింది. -
అందుబాటులోకి మూడో రైల్వే లైన్
రామగుండం: కాజీపేట–బల్హర్షా గ్రాండ్ ట్రంక్ రూట్లో దశాబ్దకాలం వ్యవధిలో మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులను ఈనెల 22వ తేదీన పూర్తి చేసి కమిషనర్ ఆఫ్ రైల్వే సెఫ్టీ మాధవి, డీఆర్ఎం గోపాలకృష్ణన్ సమక్షంలో ట్రయల్రన్ నిర్వహించిన మీదట పూర్తిస్థాయి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో కాజీపేట–బల్హర్ష మధ్య 203 కి.మీ.దూరంలో ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనులకు అనుమతులు మంజూరయ్యాయి. 203 కిలోమీటర్లు రూ.3,000 వేల కోట్ల వ్యయంతో నిర్మించే మూడో రైల్వేలైన్ రాష్ట్ర పరిధిలో 159 కి.మీ., మహారాష్ట్ర పరిధిలో 44 కి.మీ ఉంది. కాగా తొలుత 2016లో ట్రిప్లింగ్ పనులు ప్రారంభించి రాఘవపురం–మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల వ్యవధిలో ట్రిప్లింగ్ పనులు అదే ఏడాది పూర్తి చేశారు. ఈ క్రమంలో దశల వారీగా విభాగాలుగా పనులు నిర్వహిస్తూ ఈనెల 22న చివరగా ఆసిఫాబాద్రోడ్–కాగజ్నగర్ మధ్యలో పెద్దవాగు బిబ్రానది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ట్రాక్ వేగ సామర్థ్యాన్ని పరిశీలించిన మీదట రైల్వే ఉన్నతాధికారుల బృందం పచ్చ జెండా ఊపడంతో గ్రాంట్ రూట్లో మూడవ రైల్వే లైన్ ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. కాజీపేట–బల్హార్ష రూట్లో రైల్వే ట్రాక్ రన్నింగ్ సామర్థ్యం 130 కిలోమీటర్లు -
గుండెపోటుతో ఉప్పుమడుగు సీఈవో మృతి
రాయికల్: రాయికల్ మండలం ఉప్పుమడుగు సహకార సంఘం సీఈవో సుతారి తిరుపతి (56) గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన తిరుపతి ఉదయం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. తిరుపతి మృతిపై జిల్లా సహకార సంఘ అధికారి మనోజ్, డీజీఎం సత్యప్రసాద్, మాజీ మంత్రి జీవన్రెడ్డి, సహకార సంఘం సీఈవోలు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషజ్వరంతో బాలుడి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన కాముని వరుణ్తేజ (6) విష జ్వరంతో గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన కాముని అర్జయ్య, సరిత చిన్న కుమారుడు వరుణ్ తేజ యూకేజీ చదువుతున్నాడు. బుధవారం జ్వరం రావడంతో తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు కరీంనగర్కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేకాలనీకి చెందిన మరో బాలిక విషజ్వరంతో అపస్మారకస్థితికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపట్టారు. ఆటో పైనుంచి పడి కార్మికుడు మృతికరీంనగర్క్రైం: నగరంలో డిజిటల్ నేమ్బోర్డు ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా ఓ కార్మికుడు కిందపడి చనిపోయాడు. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన కామారెడ్డి సురేందర్(45) కోతిరాంపూర్లో నివాసముంటూ స్క్రాప్షాపులో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విధులకు వెళ్లాడు. 11గంటల సమయంలో ఆటోట్రాలీలో భారీ డిజిటల్ నేమ్బోర్డు తీసుకెళ్లే క్రమంలో కోతిరాంపూర్లో డ్రైవర్ చింతల సిద్దార్థ్ వాహనాన్ని నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపాడు. సురేందర్ ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
26న అరుణాచలం యాత్ర
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ తీర్ధయాత్రల్లో భాగంగా కరీంనగర్ 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 26న అరుణాచలం యాత్రకు బయలుదేరుతుందని కరీంనగర్ 1డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, కంచి, అరుణాచలం, శ్రీరంగం, మదురై, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలు చేసుకుని ఈనెల 31న సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.7,300, పిల్లలకు రూ.5,475గా టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7382849352, 9959225920 నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. 24 గంటల్లోనే చోరీ కేసు ఛేదన ● నిందితుడి అరెస్ట్.. రూ.1.25 లక్షలు స్వాధీనం కరీంనగర్క్రైం: నగరంలోని త్రీ టౌన్ పరిధిలో జరిగిన చోరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం తులసీనగర్, వావిలాలపల్లికి చెందిన తోట రోహిత్ ఈ నెల 22న తన తల్లితో కలిసి డిమార్ట్కు షాపింగ్కు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచిన రూ.4.80 లక్షల నగదు అపహరించి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు దేవనవేణి మహేశ్గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని, రూ.1.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్ చేశారు. కేసును ఛేదించిన త్రీటౌన్ ఎస్సై బి.చేరాలు, కానిస్టేబుల్ కె.ప్రశాంత్ను సీఐ తిరుమల్ అభినందించారు. పేకాటరాయుళ్ల అరెస్టు● రూ.43,540 నగదు స్వాధీనం మంథని: మంథని మండలం గుంజపడుగు గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులతో పాటు రూ.43,504 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు ఇతర వస్తువులను మంథని పోలీస్స్టేషన్ అధికారులకు అప్పగించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వాహనాల వేలంగోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని పోలీస్ వాహనాలకు సంబంధించిన పాత స్పేర్ పార్ట్స్, టైర్లు, బ్యాటరీలు, ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్లకు ఈనెల 27న వేలం పాట నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఆసక్తి గల వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఎంటీవో మల్లేశం 8712656616 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
తొలిసారి ప్రభుత్వం నిర్వహణ
ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారి దేశవ్యాప్త వేదపరీక్షలు నిర్వహిస్తున్నారు. 4 వేదాలు, 11 శాఖలకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. 147 మంది విద్యార్థులు, 35 మంది పరీక్షాధికారుల పాల్గొన్నారు. 5 రాష్ట్రాల నుంచి విద్యార్థులు, 5 రాష్ట్రాల నుంచి పరీక్షాధికారులు. డిజిటల్ విధానంలో పారదర్శక మూల్యాంకనం చేస్తున్నాం. జూలై 25న ఫలితాలు, జాతీయ–అంతర్జాతీయ గుర్తింపు పొందిన జయపత్రిక, సర్టిఫికెట్ ప్రదానం చేస్తాం. – ఆంజనేయశర్మ, వేద పాఠశాల ప్రిన్సిపాల్, వేములవాడ -
తుపాకీతో బెదిరించి.. దుప్పటితో బంధించి
కరీంనగర్క్రైం: నిషిరాత్రిలో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి మరో భారీచోరీ జరిగింది. భగత్నగర్లోని ఓ ఇంట్లో చొరబడిన దుండగులు ఇంట్లోవారిని డమ్మీ తుపాకీతో బెదిరించి, ఆపై బంధించి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని భగత్నగర్లో అజ్మత్అలీ భార్య మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలకు ఇంటి ఆవరణలో లైట్లు ఆఫ్ చేసేందుకు బయటకొచ్చాడు. అప్పటికే కారిడార్లో మాటువేసి ఉన్న 6 నుంచి 8మంది గుర్తు తెలియని దుండగులు అలీపై దాడి చేశారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించారు. హాల్లోకి ఈడ్చుకెళ్లి బెడ్షీట్లతో బంధించారు. నోటికి గుడ్డ కట్టి టీవీ శబ్దాన్ని పెంచారు. బెడ్రూమ్లో ఉన్న మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలనూ అదే విధంగా బంధించారు. అల్మారా తెరిచి రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్ఫోన్లు అపహరించారు. ఇంట్లో అద్దెకుంటున్న వినోద్, మహ్మద్ గౌసోద్దీన్లకు చెందిన రెండు బైక్లను తీసుకుని పరారయ్యారు. మెల్లిగా తేరుకున్న బాధితులు బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం చోరీ జరిగిన ఇంట్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు, పాదముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దుండగులు వదిలివెళ్లిన డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ– ఢిల్లీ ప్రాంతానికి చెందినట్లుగా, హిందీలో మాట్లాడినట్లు బాధితులు పోలీసులకు వివరించారు. తెలిసినవారి హస్తం ఉందా? ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని నిందితులు నేరుగా వెళ్లి చోరీచేసిన తీరు, కుటుంబ సభ్యుల కదలికలపై వారికున్న స్పష్టమైన అవగాహనను బట్టి బాధితులకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించిన సీపీ గౌస్ ఆలం ఘటనాస్థలాన్ని సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరుపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దుండగులు నగరంలోకి ఏ మార్గంలో వచ్చారు..? దోపిడీ అనంతరం ఏ దిశగా వెళ్లారు, దొంగిలించిన బైక్లను ఎక్కడ వదిలివేశారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారింది. సమీపంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, టోల్ప్లాజాలు, పెట్రోల్ బంకుల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వరంగల్ వైపుగా పారిపోయిన నిందితులు నిందితులు దొంగతనం అనంతరం వరంగల్ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. రెండు వాహనాలపై ఐదుగురు వెళ్లి సిరిసిల్ల బై పాస్ రోడ్డులో ఉన్న బంక్లో పెట్రోల్ పోయించుకున్నట్లు గుర్తించారు. వరంగల్ రూట్లో పెద్దపాపయ్యపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి గ్రామీణరోడ్ల గుండా ప్రయాణించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 8 మంది వచ్చి ఉంటే, ఐదుగురు మాత్రమే రెండు బై కులపై వరంగల్ వైపునకు వెళ్తే.. మిగితా ముగ్గురు ఎటువైపు వెళ్లారనేదానిపై విచారణ చేస్తున్నారు. -
గోదాము నిర్మాణానికి స్థలం పరిశీలన
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ వేములవాడఅర్బన్: వేములవాడ మండలం మారుపాక శివారులో సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణానికి స్థలాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గోదాం నిర్మాణానికి అవసరమైన అనువైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. భూముల రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్కుమార్, ఆర్ఐ శ్రీధర్ ఉన్నారు. -
అమెరికా వేదికపై ఒగ్గుకథ
వేములవాడ/వేములవాడరూరల్: తెలంగాణ జానపద కళారూపం ఒగ్గుకథ ఖండాంతరాలు దాటనుంది. ఒగ్గుకథా సామ్రాట్ దివంగత మిద్దె రాములు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన మనుమడు మిద్దె వినీత్, తండ్రి పరశురాములుతో కలిసి అమెరికాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. శ్రీసిలికానాంధ్రశ్రీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నట్లు వినీత్ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నట్లు చెప్పారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 1 వరకు అమెరికాలోని కాపిఫోర్నియా రాష్ట్రంలోని ఆక్లాండ్ ఏరినాలో నిర్వహించే వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ‘సిలికానాంధ్ర’ వేడుకల్లో మిద్దె వినీత్ ప్రదర్శన -
మల్కపేట.. నీటి వేట
కోనరావుపేట మండలం మల్కపేటలో 3 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్లో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీరుంది. ఈ రిజర్వాయర్కు మళ్లీ మధ్యమానేరు జలాశయమే ఆధారం. మధ్యమానేరు బ్యాక్వాటర్ను సొరంగం ద్వారా మల్కపేట వరకు మళ్లించి అక్కడి నుంచి పంపింగ్ చేస్తే మల్కపేట రిజర్వాయర్ నిండుతుంది. గతేడాది సాగునీటికి రైతుల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది మధ్యమానేరు నుంచి పంపింగ్ లేకపోవడంతో మల్కపేట జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయలేమని అధికారులు ప్రకటించారు. దీంతో మల్కపేట జలాశయం పరిధిలోని రైతులు సాగునీటి వేటలో పడ్డారు. ఈ రిజర్వాయర్కు మధ్యమానేరు తప్ప మరో ఆధారం లేదు. -
అడుగంటిన జలాశయాలు
● డెడ్ స్టోరేజీలో ప్రాజెక్టులు ● సాగునీరు ఇవ్వలేమంటున్న అధికారులు ● వానాకాలం సాగు లేనట్టే ● వేములవాడలో 21.38 మీటర్ల లోతులో నీటి ఊటలు జిల్లాలో ఏకై న భారీ ప్రాజెక్టు మధ్యమానేరు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 27.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ జలాశ యం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. ఇందులోకి ఎస్సారెస్పీ వరదకాల్వతో గ్రావి టీ ద్వారా నీరు చేరే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసినా మానేరువాగు పొంగితే నీరు చేరుతుంది. కాళేశ్వరం పంపులు ప్రారంభించకపోవడంతో మధ్యమానేరు జలాశయంలో ప్రస్తుతం 7.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగు అవసరాలకు వినియోగిస్తామని అధికారులు ప్రకటించారు.ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద నిర్మించిన అన్నపూర్ణ జలాశయం సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.45 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్కు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంది. నీరు లేక ఎగువ ప్రాంతాలకు పంపింగ్ అసాధ్యమవుతుంది. అన్నపూర్ణ జలాశయానికి ప్రధాన ఆధారం మధ్యమానేరు కావడంతో అక్కడ తగినంత నీరు లేక అన్నపూర్ణ ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండగా.. తగినంత నీరు నిల్వ లేక.. అధికారులు చేతులెత్తెశారు. సిరిసిల్ల: మెట్టప్రాంత రైతుల వానాకాలం సాగు ఆశలు ఆవిరయ్యాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురువకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉన్న జిల్లాలో ఈ వర్షాకాలంలో 11 రోజులు మాత్రమే చిరుజల్లులు కురిశాయి. ఫలితంగా వర్షాకాలం పంటలకు నీరు విడుదల చేయబోమని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. జిల్లాలోని జలాశయాలు.. సాగునీటి వనరుల తాజా పరిస్థితులపై ‘సాక్షి’ ఫోకస్. -
ఎండిన ఎగువ మానేరు
గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిజాం జమానాలో ఈ జలాశయాన్ని నిర్మించారు. ఈ జలాశయానికి సిద్దిపేట జిల్లాలోని కూడెల్లివాగు, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచవాగులు ఆధారం. వర్షాలు లేక వాగులు పారక జలాశయంలో ప్రస్తుతం 0.612 టీఎంసీల నీరుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ప్రారంభిస్తే గోదావరి జలాలు కూడెల్లివాగు ద్వారా వచ్చి ఎగువ మానేరులో చేరే అవకాశం ఉంది. కానీ మధ్యమానేరులోనే నీటి నిల్వలు లేక కూడెల్లి వాగు పారే అవకాశం లేదు. వర్షాలు సమృద్ధిగా పడితేనే ఎగువ మానేరు నిండే పరిస్థితులు. ఈ జలాశయంపై ఆధారపడిన 10 వేల ఎకరాలకు కన్నీరే దిక్కవుతుంది. -
దొంగిలించిన బైక్ల గుర్తింపు
దోపిడీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుండగులు ఎత్తుకెళ్లిన రెండు బైక్లు హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో లభ్యమయ్యాయి. గ్రామ శివారులో అనుమానాస్పదంగా రెండు బైక్లు ఉన్నాయని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వెంటనే హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు జి.కరుణాకర్, శ్రీనివాస్ పరిశీలించారు. దోపిడీకి పాల్పడిన ముఠా హుజూరాబాద్ ప్రాంతానికి చెందినదేనా? లేక పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా బైక్లను అక్కడ వదిలేసిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వరకు ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలోని సీసీ కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రెక్కీ చేశారా? నగర నడిఒడ్డున ఉండే భగత్నగర్కు నేరుగా వచ్చి దోపిడీ చేయడంపై అనుమానం వ్యక్తం అవుతోంది. దోపిడీకి ముందుగానే కొద్దిరోజులు రెక్కీ చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత నగదు, బంగారం బాధితులు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కీలకంగా సర్జికల్ గ్లౌజ్ నిందితులు దోపిడీకి సర్జికల్ గ్లౌజులు వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్జికల్ గ్లౌజ్ ముక్కలు లభ్యమైనట్లు తెలిసింది. దీని ఆధారంగా నిందితులు అప్పటికప్పుడే గ్లౌజులు కొని ఉంటారనే కోణంలో నగరంలోని అన్ని మెడికల్షాపుల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. గతంలో హుజూరాబాద్ ప్రాంతంలో జరిగిన బంగారం దోపిడీ నిందితుడిని సర్జికల్ గ్లౌజ్ పట్టించింది.హుజూరాబాద్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్లు -
రాజన్న క్షేత్రంలో వేద పరీక్ష
● తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ● వాల్యుయేషన్.. కంప్యూటర్ డిజిటలైజేషన్ ● సర్టిఫికెట్ల ప్రదానం వేములవాడ: దక్షిణకాశీలోని రాజరాజేశ్వరసన్నిధిలో జాతీయస్థాయి వేద పరీక్షలు నిర్వహిస్తున్నారు. అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈనెల 21 నుంచి 25 వరకు జరుగుతున్న ఈ పరీక్షల్లో 4 వేదాలు, 11 శాఖలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మొత్తం 170 మంది ఈ పరీక్షల్లో పాల్గొంటుండగా.. 147 మంది విద్యార్థులు, 35 మంది పరీక్షాధికారులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేద విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన పరీక్షాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ద్వారా పారదర్శకంగా మార్కులు కేటాయిస్తారు. ఈనెల 25న ఫలితాలు ప్రకటించి, ఉత్తీర్ణులైన వారికి ‘జయపత్రిక’ (సర్టిఫికెట్) అందజేస్తారు. ఈ సర్టిఫికెట్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండడం విశేషం. రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం(కాణ్వశాఖ, మాధ్యందిన శాఖ), కృష్ణ యజుర్వేదం – మైత్రాయణి శాఖ, సామవేదం(కౌథుమ శాఖ, రాణాయణి శాఖ), సామవేదం – జైమినీయ శాఖ, అధర్వవేదం (శౌనక శాఖ, పైప్పలాద శాఖ), స్మార్తం (అశ్వలాయన, ఆపస్తంబ సూత్రాలు), వేద అంత్యాక్షరి. -
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
సిరిసిల్ల/చందుర్తి/వేములవాడఅర్బన్: ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చందుర్తి మండలం మల్యాలలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై బుధవారం నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు స్వల్పకాలిక పంటలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజలు సాగు చేయాలని సూచించారు. సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీరు అడుగుకు చేరుకుందని, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని తెలిపారు. ప్రతీ ఇంట్లో ఇంకుడుగుంతలు, బోర్వెల్ రీచార్జీలు, రైతులు పొలాల వద్ద ఫామ్పాండ్స్, బోర్వెల్ రీచార్జీ పనులు చేయాలని సూచించారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ మందాల శారద, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఉద్యావనశాఖ అధికారి శరత్బాబు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి దయాకర్, ఆర్డీవో కుమారి, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి మండలంలోని మల్యాలలో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు బిల్లులు ఎంత మేరకు వచ్చాయో తెలుసుకున్నారు. ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులు పరిశీలన మూడపల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కలెక్టర పరిశీలించారు. ఏ గదులు ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకున్నారు. కూలీల సంఖ్య పెంచుకొని గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మూడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. భూముల రీసర్వే కచ్చితత్వంతో చేయాలి భూముల రీసర్వే కచ్చితత్వంతో చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. వేములవాడ మండలం చంద్రగిరిలో భూభారతి కింద రోవర్ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఏడీ సర్వే శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్కుమార్ ఉన్నారు. నాణ్యతతో సమాచారం సేకరించాలి జిల్లాలో ఫీల్డ్ ఫంక్షనరీలు నాణ్యతతో సమాచారం సేకరించాలని జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో జనగణన–2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్బుక్ ఫీల్డ్ ఫంక్షనరీలకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ డీసీహెచ్ బీ పోర్టల్, మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించి విలేజ్ డైరెక్టరీ(వీడీ), టౌన్ డైరెక్టరీ(టీడీ) సమాచారాన్ని సమయానుకూలంగా నాణ్యతతో సేకరించాలన్నారు. విలేజ్ డైరెక్టరీ సమాచారాన్ని 2025 డిసెంబరు 31ని ప్రామాణిక తేదీగా తీసుకుని, రెవెన్యూ గ్రామాల వారీగా మొబైల్ అప్లికేషన్ ద్వారా జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు ఆఫీసర్ల పర్యవేక్షణలో సేకరించాలని ఆదేశించారు. ఈ సమాచార సేకరణ ప్రక్రియ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబరు 8వ వరకు నిర్వహించాలన్నారు. విలేజ్ డైరెక్టరీలో విద్య, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు తదితర వివరాలు నమోదు చేయాలన్నారు. సీపీవో పీ.బీ.శ్రీనివాసాచారి, అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్వి అప్రజాస్వామిక చర్యలు
సిరిసిల్లటౌన్: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలకు దిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపి మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణను గాలికొదిలేసిన ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారన్నారు. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలను వదిలేసిన రాహుల్గాంధీ రోడ్డుపై రాజకీయాలు చేశారన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి దేశంలో అశాంతి, విధ్వంసకర పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో విద్యార్థులకు జాబ్మేళాలు, స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. పోలీస్ వర్సెస్ బీజేపీ బీజేపీ నాయకులు అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించిన అనంతరం ఏఐసీసీ నాయకుడు రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి రెండుసార్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల దృష్టి మళ్లించి రాహుల్గాంధీ ఫ్లెక్సీని దహనం చేశారు. బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్నాయక్, ధార్మిక ప్రకోష్ట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
3 నిమిషాల్లో రూ.3.50 లక్షలు మాయం
వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మూడు నిమిషాల్లో రూ.3.50లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఈ సంఘటన వేములవాడలో బుధవారం కలకలం రేపింది. వేములవాడ రూరల్ మండలం బాలరాజ్పల్లికి చెందిన నాగరాజు తన ఇంటి నుంచి రూ.2.40లక్షలు తీసుకొని వేములవాడకు వచ్చారు. వేములవాడలోని కేడీసీసీ బ్యాంకు నుంచి మరో రూ.1.10 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. మొత్తం డబ్బులను తన బైక్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని పట్టణంలోని విద్యానగర్లోని మాజీ సర్పంచ్ నేదూరి రాజు నివాసానికి చేరుకున్నారు. బైక్ను ఇంటి ముందు నిలిపి ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే నాగరాజును అనుసరిస్తున్న ముగ్గురు దొంగలు రెండు బైక్లపై అక్కడికి చేరుకొని బైక్ ట్యాంక్ కవర్లో ఉన్న రూ.3.50 లక్షలను తీసుకొని పరారయ్యారు. ఇంట్లో నుంచి వచ్చిన నాగరాజు నగదు లేకపోవడాన్ని గమనించి షాక్కు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటీజీని పరిశీలించారు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని తల్లగడ ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. వేములవాడలో బైక్ నుంచి డబ్బులు చోరీ ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ముఠా పనిగా అనుమానం రంగంలోకి పోలీసులు -
దొంగల బీభత్సం
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, వేములవాడల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. సిటీలో పీఎంజే జువెల్లరీస్ దోపిడీ ఘటన మరవక ముందే నగరం మరోసారి ఉలిక్కిపడింది. మంగళవారం కరీంనగర్లోని భగత్నగర్లోని ఓ ఇంట్లో చొరబడిన దుండగులు ఇంట్లో వారిని డమ్మీ తుపాకీతో బెదిరించి, ఆపై బంధించి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. రూ.25లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్ఫోన్లు అపహరించారు. ఇంటి ఎదుట పార్క్చేసి ఉన్న రెండు బైక్లను తీసుకుని పరారయ్యారు. బైక్లను హుజూరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో నగరంలోని వావిలాలపల్లి తులసీనగర్లో పగటి పూట ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.4.80 లక్షల నగదును అపహరించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మూడు నిమిషాల్లో రూ.3.50లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని తల్లగడ ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వేములవాడ జాతరగ్రౌండ్లో దొంగలు హల్చల్ చేశారు. ఆషాఢ మాసం నేపథ్యంలో మూసివేసి ఉన్న డేరా షాపులను లక్ష్యంగా చేసుకుని ఒకే రాత్రి ఆరు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. – కరీంనగర్క్రైం/వేములవాడ – వివరాలు 8లోu -
ప్రజాస్వామ్య స్ఫూర్తికి బీజేపీ తూట్లు
సిరిసిల్ల: పన్నెండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో బుధవారం డీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నీట్ పరీక్షలను ముందుగా 23 లక్షల మంది రాయగా.. ఆ పరీక్ష రద్దుతో 20 లక్షల మంది మాత్రమే రాశారన్నారు. ప్రభుత్వ వైఖరితో 3 లక్షల మంది భవిష్యత్ను కోల్పోయారన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి నేతలు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయన్నారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాల య చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, నాయకులు ఫకృద్దీన్, కూస రవీందర్, పుల్కం రాజు, కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఫిరోజ్పాషా, ఆడెపు చంద్రకళ, యెల్లె లక్ష్మీనారా యణ, ఏఎంసీ చైర్మన్లు వెల్ముల స్వరూపారెడ్డి, రొడ్డ రాజు పాల్గొన్నారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి సిరిసిల్లటౌన్: నీట్–2026 విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకులు రషీద్, రిషి, మనోజ్, భువనేశ్వర్, నిఖిల్, చందు, చరణ్, అరుణ్, వినయ్, శ్రీశాంక్, లవేశ్వర్, సాయి, తౌహీద్ పాల్గొన్నారు. -
మూలవాగు.. కాలమైతే సాగు
కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండితే.. వేములవాడ మూలవాగు పారుతుంది. రుద్రంగి మండల రైతులకు భూగర్భ జలాలు పెరుగుతాయి. 2,500 ఎకరాల ఆయకట్టు ఉన్న మూలవాగు నీరు లేక వెలవెలబోతోంది. నిజా మాబాద్ జిల్లా సిరికొండ మండలం అటవీ ప్రాంతాల్లో వర్షాలు పడితే మూలవాగు నిండుతుంది. వర్షాధారం తప్ప మరో ఆధారం మూలవాగుకు లేదు. చిన్నబోతున్న చిన్ననీటి వనరులు జిల్లాలో 656 చిన్ననీటి వనరులు(చెరువులు) ఉండగా.. ఒక్క చెరువులోనూ చుక్కనీరు చేరలేదు. ఈ వానాకాలంలో బలమైన వర్షాలు ఒక్కటి పడలేదు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది. బోర్లలో నీరున్న రైతులు నార్లు పోసి నాట్లు వేస్తుండగా.. బావులపై ఆధారపడిన రైతులు క్రేన్ల సాయంతో పూడిక తీస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. వేములవాడ అర్బన్ మండలంలో 21.38 మీటర్ల లోతులో నీటి ఊటలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు నీరిచ్చిన బోర్లు ఎత్తిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి జిల్లాలో రైతుల ఖరీఫ్ ఆశలు ఆవిరవుతున్నాయి. -
‘తెలంగాణ జలసిరి’ ప్రారంభం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): భూగర్భ జలమట్టాలను పెంపే లక్ష్యంగా నేరెళ్ల పంచాయతీలో ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పొన్నం లక్ష్మ ణ్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీవో) లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్షపు నీరు వృథా కాకుండా బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలు, మ్యాజిక్ పిట్స్, ఫామ్పాండ్స్, పర్కోలేషన్ ట్యాంకులు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీడీ నరసింహులు, ఇన్చార్జి ఏపీవో రాజనర్సయ్య, హెచ్ఆర్ రాపోలు నాగరాజు, కార్యదర్శి సంతోష్కుమార్, ఉపసర్పంచ్ రాజమణి పాల్గొన్నారు. భీమన్న సేవలో జూనియర్ సివిల్ జడ్జి వేములవాడ: భీమన్నను ఆంధ్రప్రదేశ్లోని అమరావతి జూనియర్ సివిల్ జడ్జి లిఖిత కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు జి.శ్రీనివాస్శర్మ, ప్రొటోకాల్ పర్యవేక్షకులు పెరుక శ్రీనివాస్ పాల్గొన్నారు. మున్సిపాలిటీలో మైసమ్మ పండుగ సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో మైసమ్మతల్లి బోనాల పండుగను బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పాల్గొన్నారు. స్థానిక కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజపూర్ణచందర్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్వేకు సహకరించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): జాతీయ గణాంకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్–2026)’కు ప్రజలు సహకరించాలని ఉమ్మడి జిల్లా గణాంకశాఖ అధికారి గుర్రం శ్రీనివాస్గౌడ్ కోరారు. మండలంలోని గోపాలరావుపల్లె గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుండు ప్రేమతో కలిసి బుధవారం సర్వే కరపత్రాలను విడుదల చేశారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మికశక్తి భాగస్వామ్యంపై విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకే ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్ గొట్ల ఎల్లయ్యయాదవ్, పంచాయతీ కార్యదర్శి గంగుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. బీసీ స్టడీసర్కిల్కు దరఖాస్తులు ఆహ్వానం సిరిసిల్ల: బీసీ స్టడీసర్కిల్లో నిరుద్యోగ యువతకు ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్–1, 2, 3, 4 పరీక్షలతోపాటు బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేరిక్రూట్మెంట్, పోలీస్ నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. వివరాలకు 08723–223004లో సంప్రదించాలని తెలిపారు. -
ఆరు దుకాణాల్లో చోరీ
వేములవాడ: పట్టణంలోని జాతరగ్రౌండ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆషాఢ మాసం నేపథ్యంలో మూసివేసి ఉన్న డేరా షాపులను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకే రాత్రిలో ఆరు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. షాపుల తాళాలు పగులగొట్టి లోపల ఉన్న నగదు, విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చిన వ్యాపారులు చోరీ జరిగిన విషయం గుర్తించి షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. బస్సును తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్కోరుట్ల: పట్టణంలోని బస్టాండ్ నుంచి ఓ బస్సును మంగళవారం తీసుకెళ్లిన ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన నిందితుడు కందుల సాంబయ్యను అరెస్టు చేసినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. బస్సును తీసుకెళ్లడంతోపాటు నిర్లక్ష్యంగా నడిపి పలువురికి ఢీకొట్టి గాయపరిచినందుకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. పాముకాటుతో గీతకార్మికుడి మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో బుధవారం గీత కార్మికుడు గుగ్గిళ్ల శ్రీనివాస్గౌడ్(46) పాముకాటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి పాము కాటు వేయగా.. బుధవారం ఉదయం శ్రీనివాస్ నోటి నుంచి నురుగలు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలిసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. ఈమేరకు పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. 13వ వార్డులో మున్సిపల్ లేఅవుట్ స్థలాన్ని, రోడ్డును కొందరు ఆక్రమించారని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కమిటీ సభ్యులు సోమ నాగరాజు, నల్ల చంద్రమౌళి, కాడ రమేశ్ పాల్గొన్నారు. -
ఇళ్లలో సంహారం.. రోడ్డుపై వ్యాపారం
వేములవాడరూరల్: అసలే వర్షాకాలం.. వ్యాధుల కాలం. వేములవాడ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా, రోడ్డు పక్కన దుమ్ము, ధూళిలో మటన్ విక్రయాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారుల చర్యలు శూన్యం. పట్టణంలో ఆలయం నుంచి బ్రిడ్జి వరకు ప్రధాన రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు మటన్ విక్రయాలు జరుపుతున్నారు. వీటిపై దుమ్ము, ధూళి చేరుతోంది. వానకాలం కావడంతో ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. తూనికలు, కొలతల అధికారులు ఎక్కడ..? మటన్, చికెన్ వ్యాపారులు అధిక ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసిన మటన్, చికెన్ తూకంలో తేడాలు వస్తున్నట్లు, తూనికలు, కొలతల అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిలో ఒకసారి చుట్టపుచూపుగా కొన్ని దుకాణాలకు తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగితాల్లోనే స్లాటర్ హౌస్ మటన్ వ్యాపారులు జీవాలను వధించేందుకు మున్సిపల్ తరుఫున స్లాటర్ హౌజ్ ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ అధికారి ముందుగా జీవాలను పరిశీలించి ఆరోగ్యంగా ఉంటేనే వాటిపై ముద్ర వేసి వ్యాపారులకు అప్పగిస్తారు. కానీ, పట్టణంలో 50కి పైగా మటన్ దుకాణాలు ఉండగా, స్లాటర్హౌజ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ఇళకల వద్దే వ్యాపారులు జీవాలను వధించి రోడ్లపై విక్రయిస్తున్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అనే విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. -
రేషన్ అక్రమాలకు కళ్లెం
● లబ్ధిదారుల ఈ–కేవైసీ నమోదు ● ఈ నెలాఖరు వరకు గడువు ● ఇప్పటికే 81 శాతం పూర్తిసిరిసిల్ల: ప్రజాపంపిణీలో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతికంగా కట్టడి చేస్తోంది. రేషన్కార్డులపై సన్నబియ్యం అందిస్తుండడంతో అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకే చేరేలా ముందుకు సాగుతోంది. ఇందుకోసం రేషన్కార్డుదారుడు విధిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) నమోదు చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. జూలై నెలఖరులోగా ప్రతీ రేషన్కార్డుదారుడు స్థానికంగా ఉన్న రేషన్షాపుల్లో వేలిముద్రలు వేసి ఈ–కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయినా.. కార్డుదారులు స్థానికంగా లేకపోయినా.. సరుకులు పొందకుండా ఈ–కేవైసీ ద్వారా నియంత్రిస్తున్నారు. రేషన్కార్డులో పేర్లు ఉన్న విధిగా వేలిముద్ర వేయాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా రేషన్షాపులను ఇప్పుడు తెరిచి ఉంచారు. రేషన్కార్డుదారులు ఆ షాపుల్లోకి వెళ్లి ఈ–కేవైసీ నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 81 శాతం ఈ–కేవైసీ పూర్తయింది. ఆగస్టులో మూడు నెలల బియ్యం పంపిణీకి ఏర్పాట్లు ఆగస్టులో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ–కేవైసీ పూర్తయితే వచ్చిన డే టా ఆధారంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెల ల బియ్యాన్ని అందించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఈనెల 25 వరకు స్పష్టత రానుంది. వర్షాకాలంలో ఇబ్బందులు రానీయకుండా ఉండేందుకు మూ డు నెలల రేషన్బియ్యం ఒకేసారి గతంలో లాగే ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం రేషన్షాపుల్లో సన్నబియ్యం అందించడంతో రేషన్కార్డులు ఉన్న అందరూ ఆసక్తిగా బియ్యం తీసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులోని ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఈ–కేవైసీ పూర్తికాగానే ఒక్క నెల బియ్యం ఇస్తారా? మూడు నెలలది ఇస్తారా? అనేది తేలుతుందని అధికారులు భావిస్తున్నారు.గ్రామాలు: 260, రేషన్ షాపులు: 345 రేషన్కార్డులు : 1,96,092 అంత్యోదయ కార్డులు: 13,830 ప్రతీ నెల సరఫరా అయ్యే బియ్యం: 3,965 టన్నులు ప్రతీ నెల బియ్యం పొందే వారు : 5,55,920 -
కుక్కల దడ.. కోతుల బెడద
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కుక్క, కోతి, ఎలుక, పిల్లి కాటుకు గురైన వారు.. నెల కుక్క కోతి పిల్లి ఎలుక జనవరి 87 14 02 04 ఫిబ్రవరి 58 20 04 12 మార్చి 53 28 15 18 ఏప్రిల్ 41 12 03 04 మే 93 13 08 03 జూన్ 59 20 07 07 మొత్తం 391 107 39 48 ఇళ్లపై, పండ్ల చెట్ల మీద కోతులు గుంపుగా ఉంటున్నాయి. ఇంటి ముందుకు వస్తే చాలు మీద దూకుతున్నాయి. కోతులతో ఇబ్బందిగా మారింది. వాటి బెడద తప్పించాలి. – లచ్చయ్య, గొల్లపల్లె తెల్లారగానే కోతులు ఎక్కడ మీద దూకుతాయో అని భయంతో చేతిలో కట్టె పట్టుకుని వెళ్తున్నం. పిల్లలు ఇంటి బయటకు వస్తే చాలు మీద దూకుతున్నాయి. కోతులతో భయంగా ఉంది. – కనుకయ్య, నాంపల్లి కుక్క, కోతి, పిల్లి, ఎలుక కాటుకు గురైనవారు నిర్లక్ష్యం చేయొద్దు. వేములవాడ ఏరియా ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నా యి. ఆస్పత్రిలో సంప్రదించి వైద్యుల సూచనల ప్రకారం డోస్లు వాడాలి. – రవీందర్, సూపరింటెండెంట్, వేములవాడ ఏరియా ఆస్పత్రివేములవాడఅర్బన్: గతంలో అడవిలో కోతులకు పండ్లు ఫలాలు దొరికితే తిని అక్కడే ఉండేవి. ప్రస్తుతం అడవుల్లో పండ్ల చెట్లు తగ్గి ఆహారం దొరక్కపోవడంతో పల్లెలు, పట్టణాల బాట పట్టాయి. ఉదయం లేస్తే చాలు ఇంటి ముందు కోతుల మందలు ఉంటున్నాయని జనం ఆవేదన చెందుతున్నారు. ఇళ్లలో పండ్ల చెట్లపై ఉంటూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోతున్నారు. అవి మందగా కనిపిస్తే చాలూ జనం పరుగులు పెడుతున్నారు. అలాగే పట్టణాలు, పల్లెల్లో జనాలను కుక్కలు హడలెత్తిస్తున్నాయి. రోజుకు కనీసం ఇద్దరు ముగ్గురినైనా కరుస్తున్నాయి. అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
వేములవాడఅర్బన్: ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలని డీఎంహెచ్వో ఏంజెలా అల్ఫ్రెడ్ అన్నారు. వేములవాడ మండలం చీర్లవంచలో మంగళవారం నిర్వహించిన డ్రై డే కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలోని నివాస ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, ఇంటింటి పరిసరాలను తనిఖీ చేసి, దోమల నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా వ్యాధుల నివారణకు ప్రతీ మంగళ, శుక్రవారాలు తప్పనిసరిగా డ్రై డే నిర్వహించాలన్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో పనులు పూర్తి చేయండి
వేములవాడ: అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని విప్ ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు. నియోజకవర్గ పరిధిలో సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ గ్రాంట్లు తదితర పనుల పురోగతిపై మంగళవారం తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనులు ఎక్కడ ఆలస్యమవుతున్నాయో గుర్తించి వాటిని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సిరిసిల్ల ఈఈ సుదర్శన్రెడ్డి, వేములవాడ డీఈ విష్ణువర్ధన్, చందుర్తి డీఈ పవనకుమారి, కోరుట్ల డీఈ సత్యనారాయణ, ఏఈలు మనోహర్, అంజయ్య, సాయితేజ, జగదీశ్, సుచరిత్ తదితరులు పాల్గొన్నారు. పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధిభూమిపూజ చేస్తున్న చైర్పర్సన్ కళ తదితరులు సిరిసిల్లటౌన్: పక్కా ప్రణాళికతో సిరిసిల్ల పట్టణ సర్వతోముఖాభివృద్ధి చేపడుతామని మున్సి పల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. స్థానిక 19వ వార్డులో సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో సమస్యను ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్రావు ప్రత్యేక నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి రూ.6 లక్షలు విడుదల చేయించారన్నారు. మరో రూ.3 లక్షలు మున్సిపల్ జనరల్ ఫండ్తో పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వార్డుల్లో రోడ్లు, మురికి కాలువలు పూర్తిస్థాయిలో నిర్మించేలా ప్రణాళిక చేపడతామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ పాషా, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ పరిధి రాచర్లగొల్లపల్లిలోని రాచర్ల జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలన్నారు. ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేయాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్ సీఐ వెంకటేశ్, ఎస్సై రాహుల్రెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా మంగళవారం శ్రీముసురుశ్రీవర్షం కురిసింది. అత్యధికంగా వేములవాడలో 43.8 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 20.3, చందుర్తి 16.2, వేములవాడరూరల్ 26.6, బోయినపల్లి 15.7, సిరిసిల్ల 30.4, కోనరావుపేట 27.4, వీర్నపల్లి 21.6, ఎల్లారెడ్డిపేట 25.7, గంభీరావుపేట 10.7, ముస్తాబాద్ 19.1, తంగళ్లపల్లి 31.1, ఇల్లంతకుంట 14.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 23.3 మి.మీ నమోదైంది. కాగా ముసురువానతో సిరిసిల్లలోని తోతట్టుప్రాంతాలు మురికిమయమయ్యాయి. మురికి కాల్వల్లోని నీరు రోడ్లపైకి రావడంతో కంపువాసన వ్యాపించింది. వేములవాడలోనూ ఇలాగే ముంపు ప్రాంతాల్లో కంపు కొట్టింది. -
రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయొద్దు
సిరిసిల్ల: జిల్లాలోని రహదారులపై భారీ వాహనాలను పార్కింగ్ చేయొద్దని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో రోడ్డు భద్రత చర్యలపై అధికారులతో సమీక్షించారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ జాతీయ రహదారుల వెంట గుర్తించిన బ్లాక్ స్పాట్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ఆరా తీశారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఆర్అండ్బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ మొగిలి, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. 80 శాతం డిజిటలైజేషన్ పూర్తి జిల్లాలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 80 శాతం పూర్తి అయిందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తమ పరిధిలో పర్యవేక్షణ చేయాలని, రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా మీటింగ్లు పెట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్బాబు, కేఎస్బీ కుమారి, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. -
చట్టపరిధిలో సత్వర న్యాయం
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● గ్రీవెన్స్ డేకు 36 ఫిర్యాదులు సిరిసిల్ల: జిల్లాలో బాధితులకు చట్టపరిధిలో సత్వర న్యాయం అందించేందుకు పోలీస్శాఖ కృషి చేస్తోందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించగా 36 మంది వారి సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలుబెట్టుకుంటూ సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులపై ఎస్హెచ్వోలకు ఫోన్చేసి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. 61 మంది బాలకార్మికులకు విముక్తిసిరిసిల్ల: జిల్లాలో 20 రోజుల్లో 61 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించామని, పిల్లలతో పని చేయిస్తున్న 17 మందిపై కేసులు నమోదు చేశామని అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం ‘ఆపరేషన్ ముస్కాన్’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జిల్లాలోని పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. జూలై 1 నుంచి 31 వరకు పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక, విద్య, బాలల రక్షణ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 20 రోజులలో 61 మంది పిల్లలు పనిలో ఉన్నట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పనిచేయిస్తున్న 17 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. డీసీఆర్బీ డీఎస్పీ భాస్కర్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఎస్సైలు ప్రేమానందం, లక్పతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇన్చార్జి డీపీఆర్వోగా శ్రీనివాసాచారిసిరిసిల్ల అర్బన్: ఇన్చార్జి డీపీఆర్వోగా శ్రీనివాసాచారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనారోగ్య కారణాలతో ఇక్కడ పనిచేస్తున్న డీపీఆర్వో ఏడుకొండలు సెలవులో వెళ్లగా ఆయన స్థానంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసాచారి కలెక్టర్ ఆదేశాలతో బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీకి అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
సమగ్ర అభివృద్ధే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): అన్ని వర్గాల అభ్యున్నతి, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథఽకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి రైతువేదిక మండలంలోని 45 మంది లబ్ధిదారులకు రూ.12.59లక్షల చెక్కులను అందజేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని దేవుని, జలపతి తండాల్లోని బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు కాంగ్రెస్లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముష్కు ముకుందరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, బానాల రవీందర్రెడ్డి, సంతుపూరి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకర ఉపాధి.. అతివల విజయదారి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేస్తున్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రం స్థానిక మహిళా సంఘాల సహకారంతో, ప్రభుత్వం మంజూరు చేసిన రుణంతో ‘కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్’(స్వచ్ఛమైన గానుగ నూనె కేంద్రం) ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే తాము వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ముందడుగు వేశారు. మహిళా సంఘాల ద్వారా రుణం మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఈ యూనిట్ స్థాపనకు పునాది వేసింది. ఇందిరా మహిళాశక్తి పథకం కింద తంగళ్లపల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణం మంజూరైంది. ఈ నిధులతో అధునాతన సాంకేతికతతో కూడిన కోల్డ్ ప్రెస్ ఆయిల్(గానుగ) యంత్రాలను కొనుగోలు చేశారు. మహిళలంతా ఒక సమూహంగా ఏర్పడి, పక్కా ప్రణాళికతో ఈ యూనిట్ను లాభదాయకమైన ఉపాధిమార్గంగా మార్చుకున్నారు. ఉపాధి.. ఆరోగ్యం ప్రస్తుత మార్కెట్లో లభించే కెమికల్స్ కలిసిన రీఫైండ్ నూనెలతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. దీన్ని గమనించిన తంగళ్లపల్లి మహిళా సంఘం సభ్యులు స్వచ్ఛమైన గానుగ నూనెను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కోల్డ్ ప్రెస్ యూనిట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వేరుశనగ, నువ్వులు, కుసుమలు, కొబ్బరి నుంచి ఎలాంటి రసాయనాలు కలపకుండా, తక్కువ ఉష్ణోగ్రత వద్ద నూనెను సేకరిస్తారు. ఈ నూనె వినియోగించడం ద్వారా గుండెజబ్బుల ముప్పు తగ్గడమే కాకుండా, శరీర రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ యూనిట్ను విస్తరించి.. మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని గ్రూప్ సభ్యులు చెబుతున్నారు. కలెక్టర్ అభినందనలు ఈ కోల్డ్ప్రెస్ ఆయిల్ యూనిట్ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రారంభించిన సందర్భంగా మహిళల నిర్ణయాన్ని అభినందించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతోపాటు సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. -
ఆలకించండి.. ఆదుకోండి
● కలెక్టర్కు విన్నవించిన అర్జీదారులు ● సత్వరమే పరిష్కరించాలి.. ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు అర్జీదారులు జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్కు విన్నవించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి తమ విన్నపాలతో తరలివచ్చారు. క్యూలో నిల్చొని తమ బాధలను కలెక్టర్కు తెలిపి ఆదుకోవాలని కోరారు. దాదాపు 175 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి 10 దరఖాస్తులు రాగా సిరిసిల్లలో 6, వేములవాడలో 4 వచ్చాయి.మాది సిరిసిల్లలోని సుందరయ్యనగర్. నా భర్త శ్రీధర్. మాకు ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు మానసిక అంగవైకల్యంతో జన్మించింది. ఈమెతో సుమారు 14 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. ఆమె ఆరోగ్య రీత్య ఏమి చేయలేకపోతున్నాం. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి. – గజ్జెల్లి మమత–శ్రీధర్, సుందరయ్యనగర్మాది తంగళ్లపల్లి మండలం పద్మనగర్. 2021లో నీటి సమస్య ఉందని అధికారుల అనుమతితో నా సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుసార్లు ప్రజావాణిలో బిల్లుల కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా బిల్లులు మంజూరు చేయండి. – ముడారి పోచయ్య, పద్మనగర్ మాజీ సర్పంచ్నేను దివ్యాంగురాలిని. గతంలో దివ్యాంగురాలు పెన్షన్ వచ్చింది. కానీ 30 శాతం మాత్రమే వైకల్యం ఉందని పెన్షన్ రద్దు చేశారు. అయితే నేను ఒంటరి మహిళను. ఒంటరి మహిళ పెన్షన్ ఇప్పించండి. – ఆడెపు చిలుకవ్వ, నెహ్రూనగర్ సిరిసిల్లమాది ఇల్లంతకుంట మండలం రేపాక పరిధిలోని చింతలకుంటపల్లి. మాకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. రేపాక శివారులో బోయిని బాలయ్య, దుర్గయ్య వద్ద 25 ఏళ్ల క్రితం ఆరుగురం కలిసి 2.17 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. ఆ భూమిని మిగులు భూమికింద నమోదు చేశారు. సర్వేయర్తో హద్దులు చేసి మాకు పట్టాచేయాలి. – చింతలకుంటపల్లి(ఇల్లంతకుంట)మాది కోనరావుపేట మండల పరిధిలోని జై సేవాలాల్ఊరు తండా. మాకు గత ప్రభుత్వం పోడు భూముల పట్టాలు ఇచ్చింది. భూమిని చదును చేసుకొని పంటలు సాగుచేసుకుంటున్నాం. అటవీశాఖ అధికారులు మా భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మా భూములకు హద్దులు ఏర్పాటు చేయండి. – జైసేవాలాల్ తండా, గ్రామస్తులుకోడిగుడ్డు ధర మార్కెట్లో రూ.8.50 వరకు ఉంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లు రూ.6 మాత్రమే. ఒక్కో గుడ్డుపై అదనంగా రూ.2.50 మధ్యాహ్న భోజన కార్మికులపై భారం పడుతుంది. కాబట్టి కోడిగుడ్డుకు బదులుగా అరటిపండు అందించేలా అనుమతి ఇవ్వండి. – మధ్యాహ్న భోజన సంఘం నిర్వాహకులు -
రాజన్న సిరిసిల్ల
గరిష్టం/కనిష్టం29.0/24.0మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 20267వేములవాడ/వేములవాడరూరల్: పేదలు, ప్రయాణికులకు రూ.5లకే అందిస్తున్న మధ్యా హ్న భోజనం క్యాంటీన్ను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు సోమవారం తనిఖీ చేశారు.ఎల్లారెడ్డిపేట: స్థానిక జెడ్పీ హైస్కూల్లో సోమవారం యోగా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఐదు రోజులపాటు కొనసాగనున్నట్లు కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు.ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వీస్తాయి. -
పెద్దపల్లికి బంగారం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ మధ్య జిల్లాలో గాడితప్పుతున్న పోలీసులకు క్లాస్ తీసుకున్న కలెక్టర్ కార్యాలయం ఇటీవల ఇతర జిల్లాల నుంచి వస్తున్న లారీలకు భారీ జరిమానాలు విధిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ కార్యాలయం తీసుకున్న మరో నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. రామగుండంలోని కుందనపల్లి బూడిద లారీల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యేక లెవీ చార్జీలు జిల్లాలో చర్చానీయాంశంగా మారాయి. నిత్యం కుందనపల్లి యాష్పాండ్ నుంచి వందలాది లారీలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ గమ్యస్థానాలకు బయల్దేరుతుంటాయి. అలా బయల్దేరాలంటే ముందు ప్రతీ లారీ రూ.500 లెవీ చార్జీలు చెల్లించాలి. ఈ లెవీ చార్జీలు చెల్లిస్తేనే లారీలు కదులుతాయి. ఎందుకు చేస్తున్నారు? పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తికి నిత్యం వందల టన్నుల బొగ్గు మండించాల్సి వస్తుంది. ఫలితంగా ఉత్పత్తి అయిన బూడిదను కుందనపల్లి చెరువులో కలుపుతారు. ఈ బూడిద గాలిలో కలిసి పరిసరాలను కాలుష్యభరితం చేస్తుంది. బూడిద గాలిలోకి లేవడం వల్ల ఉత్తరాదికి వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. దీంతో పర్యావరణ హితం కోసం ఈ బూడిదను ఇటుకబట్టీలు, రోడ్ల నిర్మాణాల్లో వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం అనివార్యం చేసింది. ఈ నేపథ్యంలో కుందనపల్లి యాష్పాండ్లోని బూడిదకు ఎన్టీపీసీ టెండర్లు పిలిచి, ఇటుకబట్టీ వ్యాపారులకు విక్రయిస్తుంది. కరోనా తరువాత ఈ బూడిదకు డిమాండ్ పెరగడంతో గతంలో పలువురు రాజకీయ నాయకుల జోక్యం చేసుకోవడంతో బూడిద రేట్లు పెరగడం, పరోక్షంగా ఇటుకల ధర కూడా పెరిగింది. కానీ, ప్రస్తుత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రతీ లారీకి లెవీ చార్జీలు వసూలు చేస్తూ దాన్ని జిల్లా మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారని చెప్పడం గమనార్హం. అంతర్గాం తహసీల్దార్ పేరిట.. జనవరి 2024 నుంచి బూడిద లారీలపై లెవీ పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతీ లారీకి రూ.500 చొప్పున లెవీ చార్జీలను కలెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు అంతర్గాం తహసీల్దార్ వసూలు చేస్తున్నారు. రెండేళ్ల కాలంలో దాదాపు 1.24 లక్షల లారీలపై దాదాపు రూ.6.30 కోట్ల వరకు లెవీ చార్జీలు వసూలు చేశారు. వీటిని జిల్లాలోని ఆసుపత్రి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారని కలెక్టర్ కార్యాలయం పలుమార్లు తెలిపింది. ఇదే విషయమై కలెక్టర్ శ్రీహర్షను వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.1,24,220ఫిబ్రవరి 24– అక్టోబర్ 25 వరకుఅక్టోబరు 25– మార్చి 26 వరకుజనవరి 24– మార్చి 26 వరకుజూలై 24– ఏప్రిల్ 25 వరకుఫిబ్రవరి 25– మార్చి 26 వరకుమొత్తంఇటుక బట్టీలకుఖమ్మం దేవరపల్లి హైవేకుగ్రీన్ఫీల్డ్ హైవే కోసంఇటుకబట్టీలకుఇటుక బట్టీలకు(వివరాలు 2026 మార్చి 31 వరకు)అంతర్గాం తహసీల్దార్ పేరిట చెల్లించిన లెవీ చార్జీలు65,72725,81421,2178,0543,408 -
గుడిసెలోనే జీవితం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఉన్న ఇల్లు కూలిపోగా.. ఆ స్థలంలోనే కవర్తో గుడిసె వేసుకొన్ని కాలం వెల్లదీస్తున్నాడీ నిరుపేద. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అదే గుడిసెలో ఉంటున్నారు. పక్కా ఇల్లు ఇస్తే తన జీవితానికి భరోసా దక్కుతుందని నిరుపేద వేడుకుంటున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన దరిపెల్లి చంద్రశేఖర్ ఇన్నాళ్లు ఉంటున్న తన పాత ఇల్లు రెండేళ్ల క్రితం కూలిపోయింది. తర్వాత కొంతకాలం అద్దె ఇంట్లో ఉండగా.. యజమానులు వద్దనడంతో పాత ఇంటి అడుగుభాగంలోనే కవర్లతో గుడిసె వేసుకొని ఉంటున్నాడు. ఎండకు, వానకు ఇబ్బందులు పడుతూ గుడిసెలో కుటుంబం కాలం వెల్లదీస్తున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని చంద్రశేఖర్ కోరుతున్నాడు. -
ఎండుతున్న వరి
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026శంకరపట్నం: ఎండుతున్న ఈ వరి పొలం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్లోని గొర్ల అనిల్, కుమార్ సోదరులది. వీరికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బావి ఆధారంగా సాగు చేస్తారు. నాలుగు ఎకరాలకు నారు పోయగా నీటి లభ్యత లేకపోవడంతో రెండు ఎకరాల్లో నాటు వేశారు. కొద్దిరోజులు సరిపడా నీరందగా.. తర్వాత బావి ఎండిపోయింది. ఫలితంగా రెండు ఎకరాల పంటతో పాటు నారు మొత్తం ఎండిపోతోంది. పెట్టుబడికి రూ.50వేలు అయ్యాయని, ఆదివారం బావి పూడిక తీయించగా మరో రూ.50వేలు అయ్యాయని అన్నదమ్ములు వాపోయారు. ఈ ఇద్దరే కాదు.. మండలవ్యాప్తంగా అన్నదాతలది ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
వాడిపోతున్న పత్తి
ఎల్లారెడ్డిపేట: వర్షాలు లేక వాడిపోతున్న ఈ పత్తిచేను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శివారులోది. గ్రామానికి చెందిన మద్దుల అంజిరెడ్డి తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగుచేశారు. ఇప్పటి వరకు వర్షాలు కురువకపోవడంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మొక్కలు బతికేలా లేవని అంజిరెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే రూ.50వేల పెట్టుబడి పెట్టానని, మరో వారం పరిస్థితి ఇలాగే ఉంటే మొత్తం బీడుగా మారుతుందని వాపోయాడు. ఎల్నినో ప్రభావంతో నీటి వనరుల లభ్యతను చూసుకొని పంటలు వేయాలని, సాగవుతున్న పత్తిని కాపాడుకునేందుకు 2 శాతం యూరి యా ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఏవో రాజశేఖర్ వివరించారు. -
అన్నదాత .. కన్నీటి వెత
కార్తెలు కరుగుతున్నాయి. కాలం వెక్కిరిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయింది. తొలకరితో మురిపించిన వరుణుడు మళ్లీ తొంగి చూడకపోగా.. కోటి ఆశలతో వరినార్లు పోసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మడుల్లోనే నార్లు ముదిరిపోతుండగా.. వ్యవసాయబావులు, బోర్లు ఉన్నవారు ధైర్యం చేసి నాటు వేస్తే.. అప్రకటిత విద్యుత్ కోతలు షాక్నిస్తున్నాయి. పొలానికి నీరందాల్సిన సమయంలో కరెంటు కోతలతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో సరిపడా నీరులేక పంటపొలాలు బీటలు వారుతున్నాయి. పత్తి మొక్కలు చినుకులేక వాడిపోతుండగా.. ఎల్నినో, భూమిలో ఉష్ణోగ్రతల కారణంగా బోరుబావులు వట్టిపోతున్నాయి. వ్యవసాయ బావులు అడుగంటుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగు ఆరంభంలోనే రైతులను కన్నీరు పెట్టిస్తుండగా.. పెట్టుబడి రావడం కూడా కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవారం రోజుల్లో వర్షాలు కురవకుంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఎల్నినో ప్రభావంతో రైతులు పడుతున్న సాగు కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..!!– మరిన్ని కథనాలు 8లోu -
ఓటరు నమోదులో పొరపాట్లు జరగకుండా చూడాలి
డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల అర్బన్: రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదులో పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉందని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కే–కన్వెన్షన్ హాల్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 30 వరకు జిల్లా కార్యవర్గంతోపాటు పట్టణంలోని అన్ని వార్డులు, మండల, గ్రామస్థాయి అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడ టౌన్ నూతన అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఒకే విద్యావిధానం అమలు చేయాలి సిరిసిల్ల అర్బన్: దేశవ్యాప్తంగా ఎస్సెస్సీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అనే తేడాలు లేకుండా ఒకే విద్యావిధానం అమలు చేయాలని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడు రకాల విద్యావ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఎస్సెస్సీ సిలబస్లో చదువుకున్న విద్యార్థులు పెద్ద పోస్టుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. నేడు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగే సన్సాద్ మార్చుకు భారీగా తరలిరావాలని కోరారు. అరుకాల రమేశ్, శ్రీహరి, విద్యాసాగర్, గాంధీబాబు, నరేందర్, శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు. మోదీ విధానాలపై యువతరం పోరాడాలి కోనరావుపేట(వేములవాడ): 2014లో అధికారంలోకి వచ్చేముందు ఏట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతరం జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మోసపూరిత విధానాలపై యువతరం పోరాడాలని కోరారు. మండలం ధర్మారంలో ఆదివారం సీపీఎం మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపుసభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బీజేపీ.. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ అదాని, అంబానీ లాంటి వాళ్లకు దేశ సంపదను కట్టబెడుతున్నారని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేయాలని సోన్ వాంగ్చుక్ 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. సోన్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని ఖండిస్తూ ఈనెల 20న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ిసీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు జవ్వాజి విమల, ఎగమంటి ఎల్లారెడ్డి, ఎర్రవెల్లి నాగరాజు, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు గురిజాల శ్రీధర్, గణేశ్, మల్లారపు ప్రశాంత్, ఎలిగేటి రాజశేఖర్, గీస భిక్షపతి పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిజామాబాద్లో ఎల్నినో ప్రభావం వ్యవసాయరంగంపై చూపే దుష్ప్రభావాలపై రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీజేఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పలు సూచనలు చేశారు. సర్పంచ్ సింగం శ్రీహరి, కార్యదర్శి తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు. -
‘నీరు’గారుతోన్న నిర్లక్ష్యం
● నిత్యం ఎగువ మా‘నీటి’ వృథా ● జలాశయంలో తగ్గుతున్న నీటి మట్టం ● నిధులున్నా.. మరమ్మతులు కరువుగంభీరావుపేట(సిరిసిల్ల): సిరిసిల్ల మెట్ట ప్రాంత వరప్రదాయినీ నర్మాల ఎగువమానేరుకు లీకేజీల బెడద తప్పడం లేదు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ షట్టర్ల లీకేజీలతో సాగునీరు బయటకు వెళ్తోంది. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా జలాశయంలోని నీరు ఇలా కాలువ ద్వారా వృథాగా పోతున్న మరమ్మతు చేయాలన్న ఆలోచన రావడం లేదు. షట్టర్ల మరమ్మతుల కోసం ఏడాది క్రితం దాదాపు రూ.20లక్షలు మంజూరయ్యాయి. అయినా సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదు. వానాకాలం వచ్చినా.. ఎగువన వర్షాలు లేకపోవడంతో జలాశయంలో రోజురోజుకు నీటి మట్టం తగ్గిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా.. ఇప్పుడు 13 అడుగుల నీరు మాత్రమే ఉంది. వానలు లేకపోతే ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీటినైనా సంరక్షించుకునే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎడమ ప్రధానకాలువ షట్టర్ల వద్ద చుక్క నీరు లేదు. కుడి కాలువ వద్ద నీరున్నా వృథా కిందికి వెళ్లిపోతుంది. నిధులున్నా.. పనులు సున్నా.. ఎగువమానేరు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ షట్టర్ల మరమ్మతులకు రూ.20లక్షలు మంజూరై ఏడాది గడుస్తోంది. కానీ పనుల జాడ లేదు. పనులు చేయడానికి నీరు అడ్డంకిగా మారిందని కాంట్రాక్టర్, అధికారులు పేర్కొంటున్నారు. నీటికి అడ్డుకట్ట వేసి పనులు చేయవచ్చునని రైతులు అంటున్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిత్యం రెండు, మూడు మోటార్ల నీరు కిందికి వెళ్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. మరమ్మతు చేపడతాం కుడి కాలువ ప్రధాన షట్టర్ల మరమ్మతులకు రూ.20లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ పనులు చేయడంలో జాప్యం చేస్తున్నారు. మరమ్మతులు చేయడానికి నీటిని నిలిపేందుకు అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా మరమ్మతులు చేసి నీటి వృథాను నియంత్రిస్తాం. – నర్సింగ్, ఇరిగేషన్ డీఈ -
వైభవంగా బోనాలు
వేములవాడలో...సిరిసిల్లలో..బోయినపల్లిలో..వేములవాడ/సిరిసిల్లటౌన్/బోయినపల్లి(వేములవాడ): ఆషాఢ మాసం ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోచమ్మకు బోనాలు తీశారు. వేములవాడలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకుల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. బోనం ఎత్తుకొని మహిళలను ఉత్సాహ పరిచారు. సిరిసిల్లలోని 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేశ్ పోచమ్మతల్లికి బోనం మొక్కులు చెల్లించుకున్నారు. బోయినపల్లిలో పద్మశాలి సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు తీశారు. సర్పంచ్ మోహన్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిల్ల మల్లేశం, తడుక రామానుజం తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినోను ఎదుర్కొందాం
● ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి ● అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి ● ఎల్నినోపై సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపాల్గొన్న ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులుకరీంనగర్కార్పొరేషన్: ‘రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఎల్నినో ప్రభావాన్ని సమష్టిగా అధిగమిద్దాం’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రత్యామ్నాయ కార్యాచరణపై ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాపై సమీక్షించా రు. ఎల్నినో ప్రభావం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భూగర్భజలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ఆరుతడి పంటల ప్రోత్సాహం తదితర అంశాలపై సు దీర్ఘంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా ఆశించినస్థాయిలో వర్షం కురవకపోవచ్చని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ, విద్యుత్శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు వివరించాలన్నారు. రాజకీయాలకతీతంగా ముందుకు రావాలి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలను ఆదుకునేందుకు ముందుకురావాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడుగుంతలు నిర్మించాలని, ఇందుకు కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ ఆలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు చేద్దామన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఎల్నినోను అఽధిగమిద్దామన్నారు. -
తండ్రిని కొట్టిచంపిన తల్లీకొడుకులు
● తాగొచ్చి గొడవ చేస్తున్నాడని దాడి ● చికిత్స పొందుతూ మృతి ముస్తాబాద్(సిరిసిల్ల): తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిపై తల్లీకొడుకులు దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ సంఘటన ముస్తాబాద్ మండలంలో కలకలం రేపింది. సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్రావు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని డబుల్బెడ్రూమ్ కాలనీలో ఉంటున్న మహ్మద్ షాదుల్(45) ఈనెల 16న మద్యం తాగి ఇంటికొచ్చాడు. గొడవ చేస్తున్నాడని అతని కొడుకు అస్రఫిన్ బ్యాట్తో దాడి చేయగా, భార్య హఫీజా కర్రతో కొట్టింది. తల, మెడకు తీవ్ర గాయాలైన షాదుల్ను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్రావు, ఎస్సై జ్యోతి విచారణ చేపట్టారు. రోజు మద్యం సేవించి గొడవ చేస్తున్నాడని, వేధింపులు తాళలేకనే తల్లీకొడుకులు దాడి చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తెలింది. -
గోరింటా మెరిసే.. మగువ మురిసే
విద్యానగర్(కరీంనగర్): పండుగ.. పెళ్లి.. ఆషాఢం.. అంటేనే మగువలకు గోరింటాకు గుర్తుకొస్తుంది. ఒకప్పుడు గోరింటాకు తెంపుకొని చేతుల నిండా సింగారించుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్కు తగ్గట్టుగా డిజైన్లు వేస్తూ ఆకట్టుకునేలా చేతులను సింగారించుకుంటున్నారు. చేతులకు, కాళ్లకు అందంగా అలంకరించుకుంటున్నారు. ఆషాఢం తెలుగు లోగిళ్లలో ఆత్మీయ అనుబంధాలను బలపరుస్తుంది. నిన్నటి వరకు తమ ఇంటి దీపమై వెలిగిన కూతురు మరో ఇంటి కోడలుగా వెళ్లి.. ఆషాఢంలో పుట్టింటికి చేరుతుంది. అత్తవారింటి ముచ్చట్లు పొద్దు ఇట్టే గడిచిపోతుంటుంది. ఆ ముచ్చట్లే మమతలై అరచేతి నిండా గోరింటగా పండుతుంది. అందుకే నవవధువుతోపాటు ఆషాఢంలో ఆడవాళ్లందరూ గోరింటాకు పెట్టుకునేందుకు ప్రాధాన్యతనిస్తారు. -
రాజన్న సేవ.. కొలువుల తోవ
వేములవాడ: రాజన్న సేవలో తరించాలన్న అర్చకుల కల సాకారమైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత దేవాదాయ ధర్మాదాయశాఖ చేపట్టిన భారీ నియామకాల్లో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి 21 పోస్టులు కేటాయించారు. 11 పరిచారకులు, 2 వైష్ణవ అర్చకులు, 2 తమ్మల అర్చకులు, ఒక అసిస్టెంట్ కుక్, ఒక శృతి వాద్యకారుడు, 2 డోలు వాద్యకారులు, 2 సన్నాయి వాద్యకారుల పోస్టులు ఉన్నాయి. ఎంపికై న 21 మంది అభ్యర్థులు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలను అందుకున్నారు. ఆలయాల్లో సిబ్బంది కొరతను అధిగమించడంతోపాటు అర్చక వ్యవస్థను బలోపేతం చేయడం, సంప్రదాయ వాద్య కళాకారులకు ప్రోత్సాహం అందించడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. బస్సులో బంధుగణంతో.. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించింది. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం ఈవో రమాదేవి ఎంపికై న అభ్యర్థులను అభినందిస్తూ, రాజన్న సేవలో అంకితభావంతో పనిచేయాలన్నారు. 21 మందికి ఉద్యోగాలు 14 ఏళ్ల తర్వాత కల సాకారం హైదరాబాద్లో నియామకపత్రాలు అందజేత -
బోనం.. ఆభరణం
విద్యానగర్(కరీంనగర్): కోటిదేవుళ్లకు దీపం పెట్టినా.. గ్రామ దేవతలకు నైవేద్యం మరువని గడ్డ తెలంగాణ. ఆషాఢంలో పల్లె, పట్టణం బోనాల జాతరలతో హోరెత్తుతుంటాయి. డప్పుసప్పుళ్లు.. పోతరాజు విన్యాసాలు.. శివసత్తుల పూనకాలతో పల్లెలు మారుమోగుతుంటాయి. కోడిపెట్టలు, మేకపోతుల బలులతో గ్రామదేవతలను కొలుస్తుంటారు. బోనం.. అనుబంధం కొత్తకుండకు సున్నం.. పసుపు రాసి.. కుంకుమ అద్దుతారు. చందనం చల్లుతారు. వరి లేదా జొన్నన్నంతో నింపిన ఘటానికి మామిడాకులు, వేపరెమ్మలు కడతారు. దీపం వెలిగించటానికి అనుకూలంగా కుండపైన మట్టి మూకుడు పెడతారు. అలా ఘటాలను అలంకరించి.. నలుగురితో కలిసి వెళ్లి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 500 ఏళ్ల క్రితం 500 ఏళ్ల క్రితం మలేరియా వ్యాధితో ప్రాణాలు పోతున్న వేళ మందిని, పిల్లలను రక్షించేందుకు గ్రామదేవతలకు పెట్టిన తొలి బోనం ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆషాఢమాసంలో జగన్మాతకు భక్తితో సమర్పించే భోజన నైవేద్యాలే బోనాలు. గ్రామదేవతలు మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, రేణుక ఎల్లమ్మల రుణం తీర్చుకుంటారు. -
అనుబంధాల పిలుపు
పశువులు బాగుండాలని, పంటలు బాగా పండాలని మేము సీత్లాభవాని వేడుకలు నిర్వహిస్తాం. ఏటా ఆషాఢ మాసంలో ఈ వేడుకలు జరుపుకుంటాం. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో ఒక్కరైన సీత్లాభవాని అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పండుగను గిరిజన గూడేల్లో అందరం కలిసి మెలిసి జరుపుకుంటాం. – అజ్మీర రాజునాయక్, బాకూర్పల్లితండా ఏటా ఆషాఢ మాసంలో సీత్లాభవాని వేడుకలు నిర్వహిస్తాం. ఈ పండుగను గిరిజన గూడేల్లోని అందరం కలిసి జరుపుకుంటాం. ఇంటి వద్దనే నైవేద్యం వండుకొని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తాం. పండుగ ఇలా చేయాలని మా పెద్దల నుంచి తెలుసుకున్నాం. – అజ్మీర సంధ్యారాణి, బ్యాంక్ ఉద్యోగిని, బాకూర్పల్లితండా ఆషాఢం ప్రవేశంతోనే పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పాడిపంటలు బాగుండాలని గిరిజనులు సీత్లాభవాని అమ్మవారిని కొలిస్తే.. పల్లె ప్రజలు పోచమ్మతల్లికి బోనం తీసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అతివలు వర్షాకాలంలో తమ చేతులకు గోరింటాకుతో మరింత సింగారాన్ని అద్దుకుంటున్నారు. ఆషాఢం మాసంలో ఎటూ చూసిన పండుగ వాతావరణం.. ఆధ్యాత్మిక చింతన.. బంధుమిత్రుల కలయికలతో సందడిగా మారిపోతుంది. ఆషాఢ వేడుకలపై ప్రత్యేక కథనాలు. -
టీటీడీకి రూ.కోటి విరాళం
సిరిసిల్ల: ఆధ్యాత్మిక సేవల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పీఎస్కే సంస్థ అధినేత డాక్టర్ పుల్లూరి శ్రీకాంత్ రూ.కోటి విరాళంగా అందించారు. టీటీడీ చేస్తున్న మహాత్తర సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారంగా రూ.కోటి విరాళాన్ని టీటీడీ ట్రస్ట్బోర్డు చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బుధవారం అందించారు. శ్రీవేంకటేశ్వరస్వామి కృపాకటాక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ.. విరాళాన్ని అందించినట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీ.ఆర్.నాయుడు పుష్పగుచ్ఛంతో శ్రీకాంత్ను అభినందించారు. సిరిసిల్లకు చెందిన యువ పారిశ్రామికవేత్త, పీఎస్కే సంస్థ వ్యవస్థాపకుడు పుల్లూరి శ్రీకాంత్ స్టీల్, సిమెంట్ వ్యాపార రంగాన్ని హైదరాబాద్ కేంద్రంగా విస్తరించారు. టీటీడీకి భారీ విరాళం ప్రకటించడంపై శ్రీకాంత్ తల్లిదండ్రులు పుల్లూరి రాధా, కృష్ణమూర్తి దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ దేవదేవుడే శ్రీకాంత్ వ్యాపారాలను ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్కు అందజేసిన సిరిసిల్ల యువ పారిశ్రామికవేత్త -
చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
● ప్రమాదానికి కారణమైన బాలుడిపై కేసు కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన తిపిరెడ్డి చిన్నారెడ్డి(70) గతనెల 25న రోడ్డు ప్రమాదంలో గాయపడి.. అప్పటి నుంచి చికిత్సపొందుతూ శనివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. చిన్నారెడ్డి గత నెల 25న మండలకేంద్రంలోని బస్టాండ్ నుంచి బైక్పై ఇంటికి వస్తుండగా బాలుడు బైక్పై వస్తూ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందారు. చిన్నరెడ్డి కుమారుడు శేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు. చెరువులో మునిగి..వెల్గటూర్: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలుక లస్మయ్య (68) పశువుల కాపరి. రోజూలాగే శుక్రవారం ఉదయం గేదెలు మేపుకుంటూ గ్రామంలోని చిన్న చెరువు వైపు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య కంగారుపడి స్థానికుల సహాయంతో చెరువు వైపు వెళ్లి వెదికింది. అతడి ఆచూకీ కనిపించలేదు. శనివారం ఉదయం చెరువులో వెతకగా లస్మయ్య మృతదేహం లభించింది. గేదెలను చెరువు నుంచి బయటకు పంపించేందుకు నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడని ఆయన భార్య దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ఉమ్రా యాత్రలో ముస్తాబాద్ వాసి మృతిముస్తాబాద్(సిరిసిల్ల): మక్కా యాత్రలో ముస్తాబాద్కు చెందిన మొహమ్మద్ గౌసొద్దీన్(62) గుండెపోటుతో మృతిచెందాడు. ఈమేరకు సౌదీఅరెబియాలో ఉన్న ముస్తాబాద్ వాసులు మృతుడి బంధువులకు సమాచారం అందించారు. ముస్తాబాద్కు చెందిన అటో డ్రైవర్ మొహమ్మద్ గౌసొద్దీన్, ఖాతున్బీ దంపతులు ఈనెల 10న సౌదీ అరేబియాలోని మక్కా ఉమ్రా యాత్రకు వెళ్లారు. సౌదీలోని మక్కా యాత్ర అనంతరం అక్కడే ఉన్న కుమారుడు షాదుల్ వద్దకు ఈనెల 17న గౌసోద్దీన్, ఖాతున్బీలు వెళ్లారు. గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గౌసోద్దీన్ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో భార్య ఖాతున్బీ, కుమారుడు షాదుల్ల రోదనలు మిన్నంటాయి. పవిత్ర ఉమ్రా యాత్రలో గౌసోద్దీన్ తుదిశ్వాస వదిలడాని మైనార్టీ నాయకులు జహంగీర్, అన్వర్లు తెలిపారు. అక్కడే గౌసోద్దీన్ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆరోగ్యకరం
గోరింటాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఒంటిలోని వేడిని తగ్గిస్తుంది. పొలం పనులు చేసేవారు నీటిలో ఎక్కువ సమయం గడుపుతుండడంతో కాళ్లు, చేతులకు చర్మవ్యాధులు వస్తుంటాయి. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. బోధకాల వ్యాధి రాదు. ఆటలమ్మ మచ్చలకు గోరింటాకు ముద్దగా చేసి పూస్తే మంచి ఫలితం ఉంటుంది. గోరింటాకు, ఉసిరి పొడి కలిపి నూరి ఆ ముద్దను తలకు పూసుకుంటే జుట్టు నల్ల బడుతుంది. గోరింటాకు వేసి కాచిన నూనె తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. కృత్రిమంగా తయారు చేసిన కోన్లతో అలర్జీలు వస్తాయి.–వి.సుమన్చందర్రావు, చర్మవ్యాధుల నిపుణుడు, కరీంనగర్ -
సంస్కృత పాఠశాలలో చదివాను
రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వేదపాఠశాలలో వైదిక స్మార్తం చదువుకున్నాను. జూన్ 9న పరిచారిక పరీక్ష నిర్వహించారు. ఈనెల 17న నియమాకపత్రం అందజేశారు. స్వామి సేవచేసే అవకాశం రావడంతో జన్మ ధన్యమైంది. ఈ బాధ్యతను భక్తి, నిబద్ధతతో నిర్వర్తిస్తాను. – శనిగరం నాగేందర్ ప్రసాద్, పరిచారక, వేములవాడ దాదాపు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. మాకు సహకరించిన పెద్దలకు, ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు. చాలా కాలంగా ఈ నియామకాల కోసం ఎదురుచూశాం. ఇప్పుడు రాజన్న ఆలయంలో సేవచేసే అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం, దేవాదాయశాఖ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను. – బూరుగుగడ్డ శ్రీనందన్, వైష్ణవ అర్చక, వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి 21 పోస్టులు కేటాయించడం సంతోషకరం. కొత్తగా నియమితులైన అర్చకులు, పరిచారకులు, వాద్య కళాకారులు ఆలయ సేవలను సమర్థంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తారు. భక్తులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అంకితభావంతో పనిచేయాలి. ఎంపికై న వారికి శుభాకాంక్షలు. – ఎల్.రమాదేవి, ఆలయ ఈవో -
ఫ్యాషన్గా మారింది
సంప్రదాయంగా ఉన్న గోరింటాకు ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. ప్రతి శుభాకార్యానికి చేతుల నిండా రెడీమేడ్గా దొరికే కోన్స్తో పెట్టుకుంటున్నారు. మహిళలు తమ అందాల్ని రెట్టింపు చేసుకోవడానికి దాదాపు అన్ని దేశాల్లో గోరింటాకు పెట్టుకుంటున్నారు. – తొడుపునూరి వాణి, వాసవీనగర్, కరీంనగర్ హిందూ ఆచారాలు ఆరోగ్యదాయకమైనవే. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా చర్మవ్యాధులు రావు. కాళ్ల వేళ్లు, చేతి వేళ్లలో ఫంగస్కు గోరింటాకు మందుగా పనిచేస్తుంది. చర్మవ్యాధుల నిర్మూలనలో దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. – రాచమల్ల అనిత, అశోక్నగర్, కరీంనగర్ -
ఇంకా మా తండాలో చేయలేదు
ఏటా ఆషాఢమాసంలో సీత్లాభవాని వేడుకలు నిర్వహిస్తారు. చాలా చోట్ల ఇప్పటికే జరుగుతున్నాయి. మా తండాలో ఈ మంగళవారం చేయాలని నిర్ణయించారు. బంధుమిత్రులను పిలుచుకుని ఏడుగురు అక్కాచెల్లెళ్లకు పూజలు చేస్తాం. పాడిపంటలు బాగుండాలని కొలుస్తాం. – భూక్యా రెడ్డినాయక్, పెద్దూరుతండా, సిరిసిల్ల మాది కోనరావుపేట మండలం గోవిందరావుపల్లె. గుగులోత్ తండా, డొనబండతండాల్లో ఈ మంగళవారం సీత్లాభవాని వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. కొన్నితండాల్లో గత మంగళవారం చేశారు. అందరం కలిసి వెళ్లి అమ్మవార్లకు పూజలు చేసి అక్కడే వనభోజనాలు చేస్తాం. – గుగులోత్ జగన్నాయక్, గోవిందరావుపల్లెతండా మా లంబాడీ తండాల్లో వనదేవతలను పూజించడం ఆనవాయితీ. ము ఖ్యంగా సీత్లా భవాని వేడుకలు, తీజ్ పండుగలు ముఖ్యమైనవి. తీజ్ పండుగ గిరిజన అమ్మాయిలు చేస్తే.. సీత్లాభవాని వేడుకలు మాత్రం అందరం కలిసి చేసుకుంటాం. – ఇస్లావత్ సుజాత, దేవుడితండా, నిమ్మపల్లి మా గిరిజనులం అందరం కలిసి మెలిసి ఈ పండుగను జరుపుకుంటాం. గిరిజనుల ఐకమత్యానికి ఈ పండుగ నిదర్శనం. పాడిపంటలు బాగుండాలని యాటపిల్లను బలి ఇచ్చి.. పశువులను దాటిస్తుంటాం. – తిరుపతినాయక్, బాకూర్పల్లితండా సర్పంచ్ -
మొబైల్ఫోన్లు కొంటే ఆధార్ ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: సెకండ్హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ఆధార్కార్డుతోపాటు పూర్తి వివరాలు నమోదు చేయాలని, దొంగిలించిన ఫోన్లు కొంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో మొబైల్ ఫోన్ల వ్యాపారులు, రిపేరు షాపుల నిర్వాహకులతో శనివారం సమావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సందర్భాల్లో దొంగలించబడిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అమ్మడానికి, మార్పిడి చేయడానికి వచ్చిన వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్ తెచ్చిన వారి ఆధార్ కార్డ్ జిరాక్స్తోపాటు పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. మొబైల్ ఫోన్ దొంగలను పట్టించడంలో, వారి సమాచారాన్ని అందించడంలో సహకరించిన షాప్ యజమానులకు ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. అందరి సహకారంతోనే మొబైల్ ఫోన్స్ రికవరీలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానాన్ని వరుసగా మూడోసారి నిలిచామన్నారు. ఐటీ కోర్ ఎస్సై కిరణ్కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేశ్, మొబైల్ షాప్స్ యజమానులు పాల్గొన్నారు. -
ఆడుదాం..పాడుదాం..చదువుదాం
ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పటి వరకు సొంతూరిలో తెలిసిన వారి మధ్య.. తల్లిదండ్రుల సమక్షంలో చ దువుకున్న పిల్లలు.. కొత్త ప్రాంతంలో విభిన్న మనస్తత్వం గల పిల్లల మధ్య చదువడం.. భోజనం చేయడం.. నిద్రించేందుకు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి విద్యార్థినిలకు భయం.. బిడియం పోగొట్టేందుకు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం నింపడం.. అందరితో కలిసేలా ‘చెలిమి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉత్సాహంగా..ఉల్లాసంగా.. కస్తూరిబాలో కొత్తగా చేరిన విద్యార్థినులతోపాటు వేసవి సెలవులు ముగిసి విద్యాలయాలకు తిరిగి వచ్చిన వారికి సాధారణంగా ఇంటి మీద బెంగ(హోమ్ సిక్) ఉంటుంది. ఈ సమయంలో వారి మనసు ఇంటి వైపు మళ్లకుండా, చదువుపై ధ్యాస పెట్టేలా అధికారులు ‘చెలిమి’ అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 45 రోజులపాటు రోజుకో అంశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీని కోసం టీచర్లను నియమించారు. ఒక్కో విద్యాలయానికి ఒక్కో టీచర్ తరగతుల అనంతరం గంటపాటు ప్రత్యేకంగా సమయం తీసుకుంటారు. నైపుణ్యం..వ్యక్తిత్వ వికాసం కొత్తగా చేరిన విద్యార్థులలో టాలెంట్ను ప్రోత్సహించేలా కంప్యూటర్, ఆట, పాటలు, చిత్రలేఖనం, క్రాఫ్ట్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. వారిలోని నైపుణ్యాలను వెలికితీయడంతోపాటు సృజనాత్మకతకు పదును పెట్టేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒంటరితనం పోగొడుతూ అందరితో కలివిడిగా తిరిగేలా, కలిసి భోజనం చేసేలా ఉత్సహ పరుస్తారు. కస్తూర్బా విద్యాలయం తమకు అండగా ఉందనే భరోసాను విద్యార్థినులలో పెంపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 కస్తూర్భా విద్యాలయాలలో 3,500 మంది బాలికలు చదువుతున్నారు.వారు వేసిన చిత్రాలతో విద్యార్థినులు బ్యాడ్జీలతో కొత్తగా చేరిన విద్యార్థినులుసోమవారం అత్యవసర ఒప్పందాలు మంగళవారం రండి నాతో కూర్చోండి బుధవారం నా గుర్తింపు చిహ్నం గురువారం నేను కొత్తవాడిని ఫర్వాలేదు శుక్రవారం పుష్పం, దీపం శనివారం ఈరోజు నృత్యం చేద్దాం -
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
● తాగునీటికి ఇబ్బందులు రానీయొద్దు ● ఎల్నినో ప్రభావంపై కలెక్టర్ గరీమా అగ్రవాల్ సమీక్షసిరిసిల్ల: జిల్లాలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో అధికారులతో ఎల్నినో ప్రభావం, నీటినిల్వలపై శనివారం సమీక్షించారు. ఎగువ మానేరులో 0.612 టీఎంసీలు, మల్కపేట రిజర్వాయర్లో 1.33 టీఎంసీలు, అన్నపూర్ణలో 1.45 టీఎంసీలు, మిడ్ మానేరులో 7.44 టీఎంసీల నీరు ఉందన్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందని, ప్రస్తుతం రిజర్వాయర్లలోని నీటిని తాగునీటి కోసం ఉపయోగించాలని స్పష్టం చేశారు. రైతులు వరి బదులుగా స్వల్పకాలిక కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, ఆయిల్పామ్ సాగుచేయాలని సూచించారు. బోర్వెల్స్ సిద్ధం చేయండి అన్ని గ్రామపంచాయతీల పరిధిలో బోర్వెల్స్ రీచార్జ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీపీవో జయశీల, ఇరిగేషన్ అధికారి దయాకర్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, డీఏవో అఫ్జల్బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ పాల్గొన్నారు. జలాశయాల నీటి నిల్వలపై ఆరా తాగునీటికి ఇబ్బందులు కలగకుండా సరఫరా చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలపై ఆరా తీశారు. ఎస్సారెస్పీ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్, మూలవాగు, మానేరువాగు వరదనీటితోపాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేయడం ద్వారా మధ్యమానేరు జలాశయాన్ని నింపడం జరుగుతుందని తెలిపారు. ఎగువ మానేరుకు మల్లన్న సాగర్, కూడవెల్లి, పాల్వంచవాగుల ద్వారా నింపనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ఈఈ దయాకర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ సంతు ప్రకాశ్రావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ అన్వర్, ఇంట్రా ఈఈ సుమలత, డీఈ ప్రశాంత్ పాల్గొన్నారు. ఇందిరమ్మ నిర్మాణాల్లో వేగం పెంచాలి జిల్లావ్యాప్తంగా పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె శనివారం టెలీకాన్ఫరెన్స్లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీపీవో జయశీల పాల్గొన్నారు. సమగ్ర నివేదికలతో రావాలి జిల్లా ఇన్చార్జి మంత్రులు, ప్రత్యేకాధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశాలకు ఆయా శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో రావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం రాత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల, విద్యుత్, మిషన్భగీరథ, పశుసంవర్థక, వైద్య ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
ఏమయ్యాయి?
ప్రకృతి కొలుపు.. అనుబంధాల పిలుపుఆ కంప్యూటర్లుబో‘నమో’ పోచమ్మ తల్లి● వైద్య, ఆరోగ్యశాఖలో కంప్యూటర్లు మాయం ● నేషనల్ హెల్త్ మిషన్లో 15 కంప్యూటర్లు మంజూరు ● మూడు పీహెచ్సీలకు... మరో మూడు ఆఫీస్లో వినియోగం ● జాడలేని 9 కంప్యూటర్లుబోనాల జాతరలో గంభీరావుపేట గ్రామస్తులుకరీంనగర్లో గోరింటా వేడుకల్లో మహిళలువీర్నపల్లి మండలంలోని గిరిజనతండాలో సీత్లాభవాని అమ్మవారుమనిషి.. ప్రకృతితో కలిసి జీవించాలన్న సత్యాన్ని మన పండుగలు గుర్తుచేస్తున్నాయి. మానవ మనుగడకు ప్రకృతి సహకారం ఎంత అవసరమో మన ఆచారాలు తట్టి లేపుతున్నాయి. మనిషి ఎప్పుడూ ఒంటరిగా మనుగడ సాగించలేడని.. సామూహిక జీవి అని మన బంధాలు నిరూపిస్తున్నాయి. పండుగలు.. ఆచారాలు.. అనుబంధాల సామూహిక వేడుక ఆషాఢానికి ప్రత్యేకం. ఈ మాసంలో పాడిపంటలు సంవృద్ధిగా ఉండాలని గిరిజనులు సీత్లాభవాని.. పిల్లపాపలు క్షేమంగా ఉండాలని గ్రామదేవతలకు బోనం మొక్కులు.. ఆరోగ్యం బాగుండాలని గోరింటాకు వేడుకలు నిర్వహించుకుంటాం. ఈ సామూహిక అనుబంధాల కలయికకు వేదికగా నిలిచే ఆషాఢ మాసం వేడుకలపై ప్రత్యేక కథనం. – వివరాలు 8లో..సిరిసిల్ల: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)లో నెల రోజుల కిందట మంజూరైన కంప్యూటర్ల లెక్క తేలడం లేదు. జిల్లాకు 15 కంప్యూటర్లను ఎన్హెచ్ఎంలో మంజూరు చేశారు. ఒక్కో కంప్యూటర్ విలువ రూ.లక్షకు పైగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల డేటాను నమోదు చేస్తూ.. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించేందుకు ఉద్దేశించిన కంప్యూటర్లును పూర్తి స్థాయిలో వినియోగించడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తొమ్మిది కంప్యూటర్లు ఏమయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖలో చర్చ సాగుతుంది. మూడు పీహెచ్సీలకు.. జిల్లాలోని మూడు పీహెచ్సీలకు ఎన్హెచ్ఎంలో మంజూరైన కొత్త కంప్యూటర్లను అందించారు. మరో మూడు కంప్యూటర్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లోనే వినియోగిస్తున్నారు. ఇంకా 9 కంప్యూటర్లను ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అసలు వాటిని వినియోగిస్తున్నారా? దాచి ఉంచారా? అనేది అంతుచిక్కడం లేదని ఆ శాఖలోని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో విలువైన 9 కంప్యూటర్లను ఎవరు మాయం చేశారనే చర్చసాగుతుంది. జిల్లా వైద్యాధికారి రజిత బదిలీ కాగా.. ఆమె స్థానంలో ఏంజెలా ఆల్ఫ్రెడ్ జిల్లా వైద్యాధికారిగా ఇటీవల విధుల్లో చేరారు. ఈ సంధికాలంలోనే కంప్యూటర్లు రావడంతో మాయాజాలం చేశారని భావిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో కంప్యూటర్ల విభాగాన్ని నిర్వహించే వారే ఆ కంప్యూటర్లను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యులు శనివారం పోచమ్మ తల్లికి బోనాలు తీశారు. కొత్తకుండిలో అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించారు. ముత్యాలపోచమ్మను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. వైశ్యసంఘం ప్రముఖులు కటకం సత్తయ్య, అల్లా డి శ్రీనివాస్, చేపూరి బుచ్చయ్య, కత్కమ్ సత్తయ్య, కొత్తపల్లి శ్రీని వాస్, రాజూరి వాసుదేవరాజు, ఎల్లంకి వాణి, అల్లాడి దేవి, ఇందిరా జమున, చంద్రకళ, ఉమాదేవి, బాలలక్ష్మి, పుల్లూరి అరుణ, ఎల్లంకి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్, అనంతపల్లి, కోరెం, స్తంభంపల్లి, విలాసాగర్, కొదురుపాక గ్రామాల్లో శనివారం వీవోఏ మహిళా సంఘం భవనాలకు శంకుస్థాపన చేశారు. బోయినపల్లిలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి భూమిపూజ చేసి, పవర్లూమ్ మ్యాక్స్ సొసైటీలో బతుమ్మచీరెల కేంద్రాన్ని సందర్శించారు. డీపీవో జయశీల, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సువీన్యాదవ్, సెస్ డైరెక్టర్ సుధాకర్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మెన్ ముదిగంటి సురేందర్రెడ్డి, ఏపీఎం పవన్కుమార్, డిపో మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బస్సు నడిపిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేములవాడ నుంచి అనంతపల్లి, కోరెం గ్రామాల మీదుగా జగిత్యాల వెళ్లే నూతన బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సును నడిపారు. సిరిసిల్ల: రేషన్కార్డుదారులు జూలై నెలాఖరులోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు శనివారం తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్షాపుల్లో ఈ–కేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సాధారణ లబ్ధిదారులతోపాటు పోర్టబిలిటీ ద్వారా రేషన్సరుకులు పొందుతున్న వారు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో టాప్ మార్కులు సాధించే విద్యార్థులను విమానంలో తిరుపతి తీసుకెళ్తానని గర్జనపల్లి సర్పంచ్ రాకేశ్గౌడ్ ప్రకటించారు. గర్జనపల్లిలోని హైస్కూల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు మాట్లాడారు. గర్జనపల్లిలో చదువుకుని ఎంతో మంది ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చదవాలని కోరారు. మండల స్థాయిలో గ్రామం పేరు నిలబెట్టే విద్యార్థులను విమానంలో తిరుపతి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మధ్యాహ్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న వంటకార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట ఎమ్మార్సీ ఎదుట శనివారం ఆందోళన చేశారు. కొత్తబస్టాండ్ నుంచి ఎమ్మార్సీ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం ఎంఈవో కృష్ణహరికి వినతిపత్రం ఇచ్చారు. -
విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు
ముస్తాబాద్(సిరిసిల్ల): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని డీఈఈ అంజయ్య తెలిపారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది సబ్స్టేషన్లో 5 ఎంవీఏ పీటీఆర్ను శనివారం డీఈఈ ప్రారంభించి మాట్లాడారు. ముస్తాబాద్ మండలంలో ఉన్న సబ్స్టేషన్లలో అదనపు ఎంవీఏ పీటీఆర్లను బిగిస్తున్నామన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు. ఆటంకం లేని కరెంట్ సరఫరా చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏఈ విష్ణుతేజ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అవగాహన
వేములవాడఅర్బన్: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. శుక్రవారం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101కు సమాచారం అందించాలన్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వాటితో మంటలు ఆర్పే విధానంపై మాక్ డ్రిల్ చేసి చూపించారు. వైద్యాధికారి డాక్టర్ తిరుపతి, లీడింగ్ ఫైర్మాన్ కే.వెంకటేశం, దుర్గరాజ్, సాబీర్, శేఖర్, ఉపేందర్, భాస్కర్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: ఫుడ్ పాయిజన్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. జిల్లాసుపత్రితో పాటు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులతో శుక్రవారం మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలు, మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆ దేశించారు. ప్రజలు శుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్లఅర్బన్: జిల్లాలో కాంగ్రెస్ను గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని 8,9,10,11,12,24వ వార్డుల్లో పార్టీ వార్డు అధ్యక్షుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. పట్టణంలోని 39 వార్డుల అధ్యక్షుల కోసం పట్టణ అధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతానికి శ్రమించే నాయకులు, కార్యకర్తలకే అధ్యక్షులుగా అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, అర్హులకు ఫలాలు అందించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, మాజీ వైస్ ఎంపీపీ చల్ల హరికృష్ణ, రాష్ట్ర నాయకులు ఆకునూరి బాలరాజు, యూత్ అధ్యక్షులు దేవరాజ్రెడ్డి, సుంకరి సాయి, ఆడెపు ప్రసాద్, గంగాధర్, రాజేశం, నాగభూషణం, సత్యనారాయణ పాల్గొన్నారు. -
రూ.45 లక్షలతో జామా మజీద్ విస్తరణ
● రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటలో రూ.45 లక్షలతో చారిత్రక జామా మజీద్ విస్తరణ, మరమ్మతు పనులకు శుక్రవారం రాష్ట్ర వక్ఫ్బోర్డు చై ర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ శంకుస్థాపన చే శారు. ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలతో పనులు ప్రారంభించారు. నిత్యం నమాజ్ చేసే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల ను దృష్టిలో పెట్టుకొని జామా మసీదును విశాలంగా విస్తరించి, ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చే యనున్నారు. సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ మాట్లాడుతూ.. గంభీరావుపేట జామా మసీదు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూ ర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మసీదు ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా సుమారు రూ.90 లక్షల వ్యయంతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు. మహ్మద్ మహబూబ్ అలీ, సయ్యద్ జుబైర్, మహ్మద్ అస్లం, సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ, సయ్యద్ అసదుల్లా హుస్సేనీ, హాఫిజ్ అబుల్ కలాం, మహ్మద్ వసీమ్, సయ్యద్ హాష్మీ, సఫీఉద్దీన్ నయీర్, యాసిన్ హుస్సైన్, మహ్మద్ రహీముద్దీన్, మహ్మద్ తాహిర్, సయ్యద్ షరీఫ్, సయ్యద్ విలాయతుల్లా, మహ్మద్ ఆరిఫుద్దీన్, మహ్మద్ నజ్ముద్దీన్, నాసిర్ హుస్సేనీ, మహ్మద్ షాహిద్ అలీ, ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మహ్మద్ తురాబ్ అలీ, పురావస్తు సంరక్షణ నిపుణుడు మీర్ బరఖతుల్లా ఖాన్ పాల్గొన్నారు. -
‘ట్రినిటీ’ ఘన విజయం
కరీంనగర్టౌన్: నీట్ ఫలితాలు శుక్రవారం విడుదల కాగా.. కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించినట్లు కళాశాల ఫౌండర్, చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. డి.అశ్విత 534, జె.శ్రీవైత్రి 512, జె.అశ్విని 491, హనీఫా 486, విష్ణువర్ధన్ 480, ఎన్.కీర్తన 472, ఎం.అక్షయ 460, ఫరీహా తెహరీమ్ 460, ఎ.కావ్య 456, ఎం.అజయ్ 453, యు.శ్రీనిధి 445, పి.కీర్తన 445, షైనీ 443, డి.జ్యోస్న 441, షిఫా మహవీన్ 439, ఎన్.సాత్విక 434, వి.హర్షిత 433, ఎస్.నివేదిత 432, కె.అంజలి 426, జె.సౌమ్య 424, జి.అనుశ్రీ 424, ఎస్.అలేఖ్య 422, కె.వెన్నెల 420, ఇ.అక్షయ 413, ఎ.శ్రుతి 409, ఎన్.దేవిక కృష్ణ 407, వంశీ 405, ఆర్.సాయికిరణ్ 401 అత్యుత్తమ మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. యాజమాన్యం, అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశ్రీచైతన్యశ్రీ సత్తా నీట్–2026 ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు విద్యాసంస్థల అధినేత ఎం.రమేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. 720 మార్కులకు గాను బి.విశ్వజీత్రెడ్డి 575 మార్కులతో కళాశాలలో ప్రథమ స్థానంలో నిలవగా.. జి.అర్చన 492, షేక్ హుస్సేన్ 468, ఎం.సాయిసాత్విక్ 450, ఇ.అఖిల్ 448, ఎన్.భార్గవి 439, ఎన్.స్ఫూర్తిశ్రీ 436, మహేశ్వరి 436, ఎం.సాత్విక 425, సీహెచ్ శ్రీషా 425, శిరీష 424, ఎన్.హారిక 410 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
రాజన్న ఆలయానికి 21 పోస్టులు
వేములవాడ: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 191 అర్చక పోస్టులు భర్తీ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికై న అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ ఎం.హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరిల చేతుల మీదుగా అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి 21 పోస్టులు కేటాయించారు. వీటిలో 11 పరిచారకులు, 2 వైష్ణవ అర్చకులు, 2 తమ్మల అర్చకులు, ఒక అసిస్టెంట్ కుక్, ఒక శృతి వాయిద్యకారుడు, 2 డోలు వాద్యకారులు, 2 సన్నాయి వాద్యకారుల పోస్టులు ఉన్నాయి. 14 ఏండ్ల నిరీక్షణకు తెర.. దాదాపు 14 ఏళ్ల తర్వాత దేవాదాయశాఖలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టారు. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నియామకపు పత్రాలు అందుకునేందుకు వేములవాడ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, భోజన వసతి సహా అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయం నుంచి కల్పించారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి ఎంపికై న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
గంభీరావుపేట/ముస్తాబాద్: సర్ ప్రక్రియపై సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలు, రాజకీయ పార్టీల నాయకులు అప్రమత్తంగా ఉండాలని నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాలరాజుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సర్పంచ్ల సమావేశంలో మాట్లాడారు. సమష్టి కృషితో సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే ముస్తాబాద్లో సర్ ప్రక్రియను పరిశీలించి అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, సర్వర్, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, కొండ శ్రీను, శీలం పద్మ, వెంకటేశ్, గొండయ్య, యాదగిరి, సత్యం, దొరగొల్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రీచ్ వద్దు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఇసుక రీచ్ నిర్వహణకు రైతులు, గ్రామస్తులు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తవ్వకాలను అడ్డుకున్నారు. మామిడిపల్లి మూలవాగు నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారు. సుమారు 70కి పైగా ట్రాక్టర్లు ఒక్కసారిగా రావడంతో గ్రామస్తులు, రైతులు అభ్యంతరం తెలిపారు. భూగర్భ జలాలు తగ్గిపోయి తాగు, సాగునీటి సమస్యతో గ్రామస్తులు, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఒక ప్రాంతానికి మాత్రమే అనుమతి ఇచ్చినా, మరో ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఎస్సై ప్రశాంత్రెడ్డి, డీటీ ప్రవీణ్కుమార్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇసుక తవ్వకాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. -
అంబేడ్కర్ జీ.. హక్కులు దక్కలే..
తరాలుగా జాతి అణచివేతకు ముగింపు పలకాలని తపించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అణగారిన వర్గాలకు ఆసరాగా ఉండేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించాడు. ఇది జరిగి ఏడు దశాబ్దాలవుతున్నా.. ఆ ఫలాలు మాత్రం దళిత వర్గాలకు అందడం లేదు. మహా నేతల జయంతి, వర్ధంతి రోజుల్లో తప్పితే దళితుల గురించి పట్టని ప్రజాప్రతినిధుల పాలనలో దళితుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. సబ్ ప్లాన్ చట్టం తెచ్చామని ప్రకటించుకున్న పాలకులు ఆ నిధులను వేరే పనులకు మళ్లించి ఎక్కడి సమస్యలను అక్కడే పెంచి పోషించారు. ఫలితంగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కరీంనగర్టౌన్: ప్రతీ 3 నెలలకోసారీ దళిత సమస్యలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తాం.. సమస్యలేమైనా ఉంటే సత్వర పరిష్కారానికి చొరవ చూపుతాం.. దళిత వర్గాలకు వెన్నంటి ఉంటామని ప్రకటించడం మంత్రులు, ప్రజాప్రతినిధులకు రివాజుగా మారింది. దళితులపై దాడుల నివారణకు ఏర్పడ్డ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ పక్కాగా పని చేయాల్సింది పోయి నామ్కే వాస్త్ కమిటీగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కొత్త కమిటీ నియామకం జరగలేదు. నగరం నడిబొడ్డున గల అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రెండున్నరేళ్లుగా కోచింగ్ ఉత్త మాటగానే మారింది. బెస్ట్ అవెలెబుల్ స్కీం కింద ఎస్సీ విద్యార్థులకు జిల్లాలో రూ.కోటికి పైగా పెండింగ్ బకాయిలున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ప్రతిష్ఠాపనలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీలింగ్ భూముల పంపిణీ పథకం నత్తనడకన కొనసాగుతోంది. నిరుద్యోగ యువతి, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల ప్రక్రియ ఎండమావిగా మారింది. కోర్టు చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ భవనం కోసం కేటాయించిన 6 గుంటల స్థలాన్ని ఇతరులు ఆక్రమించినా చర్యలు తీసుకోకపోవడం, కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న అంబేడ్కర్ భవన సముదాయానికి కేటాయించిన 19 గుంటలు స్థలం కబ్జా చేసిన వారి కబందా హస్తాల నుంచి నేటికి విముక్తి కల్పించకపోవడం, చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో లీడ్ క్యాప్ భూములను పోలీసు బెటాలియన్కు కట్టబెట్టడం, లోయర్ మానేరు డ్యాంలో ముంపునకు గురైన గ్రామాల బాధితులకు కేటాయించిన స్థలాల్లో పట్టాలిచ్చి రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా హద్దులు చూపకపోవడం, జిల్లావ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూకొనుగోలు పథకం కింద ఎస్సీలకు కేటాయించిన భూములకు సంబంధించి నేటికి అక్కడక్కడ పట్టా పాస్ బుక్లు అందకపోవడం, పట్టాలిచ్చిన వారికి హద్దులు చూపకపోవడం వంటి సమస్యలు కోకొల్లలు. ● జిల్లా కలెక్టర్ చైర్మన్గా, సీపీ, ఏసీపీలు, డీఎస్పీలు, ఆర్డీవో, డీఆర్వో, ప్రజాప్రతినిధులు, సంక్షేమ శాఖ అధికారులు దళిత వర్గాల నుంచి కమిటీని వేసి జిల్లాలో ఎస్సీలకు అమలవుతున్న పథకాలు, భూముల పంపిణీ, ఎస్టీ, ఎస్టీలపై అత్యాచార యత్నాలు, నేరాలు, భౌతిక దాడులు, వేధింపులు తదితర కేసులను పరిశీలించాల్సిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నామమాత్రంగా మిగిలిందనే విమర్శలున్నాయి. ● ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ● ఎస్సీ, ఎస్టీలకు భారీగా లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కొత్తకొత్త రాయితీలు ప్రకటించడం, అనేక కొర్రీలతో నిబంధనలు రూపొందించడంతో నిరుద్యోగ అర్జీదారులు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టడానికే పరిమితమవుతున్నారు. ● చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 513, 514, 516లో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు హయాంలో మలుపు పథ కం ద్వారా లీడ్ క్యాప్ పరిశ్రమను పెట్టి నిరుద్యోగ దళిత యువత, చర్మకారులకు ఉపాధి చూపిస్తామని ప్రభుత్వం 135 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు, అధికారులు అదే స్థలాన్ని నాటి కలెక్టర్ జి.డి.అరుణ హయాంలో పోలీస్ బెటాలియన్ కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. లీడ్ క్యాప్ లొల్లి హైదరాబాద్కు చేరి నేటికి తెగని పంచాయితీగా తయారైంది. ● 25 ఏళ్ల క్రితం ఎల్ఎండీలో ముంపునకు గురైన హస్నాపూర్ గ్రామ దళితులకు ఎస్సారెస్పీ భూమిని నివేశన స్థలాల కోసం కేటాయిస్తూ పట్టాలిచ్చారు. పట్టాలు అందుకున్న వారిలో అనర్హులే చాలామంది ఉన్నారు. ● కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంబేడ్కర్ భవన సముదాయానికి కేటాయిస్తూ అప్పటి జిల్లా కలెక్టర్ సుమితాడావ్రా హయాంలో సర్వే నంబర్ 11404/22లో 19 గుంటల పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. దళిత సంఘాలు అభ్యంతరం తెలపడంతో ప్రహరీ నిర్మించి వృథాగా వదిలేశారు. ● జాతీయ నాయకులైన డా.బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రాంల విగ్రహాలను జిల్లావ్యాప్తంగా ఆయా కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నారు. నిధుల లేమితో జిల్లావ్యాప్తంగా దాదాపు 15 పైగా విగ్రహాలు ముసుగులు తొడిగే ఉన్నాయి. ● నగరం నడిబొడ్డున అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు కొన్నేళ్లుగా ఏడాదిలో 2 కోచింగ్ బ్యాచ్లు జరగాల్సి ఉండగా.. రెండున్నరేళ్లుగా ఒక్క బ్యాచ్ కూడా నిర్వహించలేదు. ● ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అణగారిన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య, హాస్టల్ వసతి కొన్నేళ్లుగా కల్పిస్తున్నారు. మూడేళ్లుగా వారికి రావాల్సిన బకాయిలు విడుదల చేయలేదు. 75 ఏళ్ల రాజ్యాంగంలో హక్కులు డొల్ల నామ్కే వాస్త్ అట్రాసిటీ కమిటీ కదలని భూపంపిణీ పథకం తెగని లీడ్ క్యాప్ భూకేటాయింపు లొల్లి అటకెక్కిన సబ్ ప్లాన్ నిధులు కబ్జాకు గురవుతున్న కమ్యూనిటీ స్థలాలు -
కరీంనగర్దే.. అగ్రస్థానం
జననం.. మరణం..1,7111,1552,8664,7673,1747,9413,032పెద్దపల్లి1,8694,9012,257సిరిసిల్ల7,2191,5707,06247,71122,4186,5283,6743,0243,8273,38818,8713,50415,2508,03110,0848,78711,767మొత్తం7,768జగిత్యాలకరీంనగర్19,53525,293బాలికలుబాలురుమొత్తంమొత్తంమహిళలుపురుషులు -
‘నీట్– 2026’లో అల్ఫోర్స్ ప్రభంజనం
కొత్తపల్లి(కరీంనగర్): నీట్–2026 ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. కరీంనగర్లోని అల్ఫోర్స్ వావిలాలపల్లి ఆద్య భవన్లో విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి అభినందించారు. డి.రిత్విక్ 647 మార్కులతో అత్యున్నతస్థానంలో నిలువగా, సిద్దాంత్ చతుర్వేది 564, సయ్యద్ మలాజుద్దీన్ 557, వసుల శ్రుత్విక 551, గులామ్ మొహమ్మద్ హుస్సేన్ 548, బత్తుల అభిజ్ఞ 541, లింగంపల్లి అనంత్ సాయి 540, నార్ల శ్రీహిత 538, శ్రేయాంశ్ ద్వివేది 537, కొండ్ల అక్షిత 522, బొమ్మవరపు రుత్విక్ 515, జక్కుల శ్రీవైత్రి 512, టి.హర్షిత 509, సిద్ధం సాత్విక 508, ఎ.సత్య బ్రాహ్మిణి 507, బి.అక్షర 505, నిద 502, గుంజేటి రిషిత 501, జహ్రా మాజీద్ 501 మార్కులు సాధించారు. 19 మంది విద్యార్థులు 500, ఆపై మార్కులు సాధించడమే కాకుండా సుమారుగా 100 మంది వివిధ ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలలలో సీట్లు సాధించగలరని తెలిపారు. -
వేగంగా కార్గిల్ లేక్ సుందరీకరణ
● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని కార్గిల్ లేక్ బండ్ సుందరీకరణ పనులు గడువులోగా, నాణ్యతతో పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. అమృత్ 2.0లో రూ.1.32 కోట్లతో కార్గిల్ లేక్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. లేక్ పరిసరాలను పరిశీలించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు కార్గిల్ లేక్ పర్యాటక కేంద్రంగా మారాలన్నారు. కార్గిల్లేక్ లోకి మురుగునీరు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్బాబు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్రావు, డీఎస్పీ కె.నాగేంద్రచారి, తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు. డ్రోన్ ప్రదర్శనను తిలకించిన మంత్రి పట్టణ శివారులోని మల్లన్నగుట్ట వద్ద భారత్ సోలార్, డ్రోన్స్ ఆఫీస్ను కేంద్ర మంత్రి సంజయ్కుమార్ ప్రారంభించారు. డ్రోన్స్ పని తీరును పరిశీలించారు. కేంద్ర మంత్రిని పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షుడు డాక్టర్ గాజుల బాలయ్య సత్కరించారు. మార్కండేయ ఆలయ అభివృద్ధిని నిధులు మంజూరు చేయాలని కోరారు.


