Rajanna
-
రోడ్డుపై సామాజిక బాధ్యతగా వెళ్లాలి
కోనరావుపేట(వేములవాడ): రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సామాజిక బాధ్యతగా ప్రయాణించాలని విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 18 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మండలంలోని నిజామాబాద్లో సోమవారం అరైవ్.. అలైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం, డీజీపీల సందేశం వినిపించారు. గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీని ఏర్పాటుచేసి, ప్ర తిజ్ఞ చేయించారు. విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పూర్తిలో జిల్లా ప్రథమస్థానంలో ఉండడంపై కలెక్టర్ను అభినందించారు. జాగ్రత్తగా వెళ్లాలి.. కలెక్టర్ కుటుంబ బాధ్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సహాయం అందించే వారికి ప్రభుత్వం రహవీర్ కింద రూ.25వేలు సహాయం అందిస్తుందని తెలిపారు. రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలి పారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంకెన్డ్రైవ్తోనే జరుగుతున్నాయన్నారు. గ్రామ రోడ్సేఫ్టీ కమిటీ గుంతలు, వీధిదీపాల సమస్య, రోడ్ల వెంట బావులపై నివేదిక ఇవ్వాలన్నారు. సర్పంచులు శ్రీహరి, దేవరాజు, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, ఎంఈవో మురళీనాయక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజావాణి వినండి
● వివిధ సమస్యలపై 270 దరఖాస్తుల రాక ● అర్జీలు పెండింగ్ పెట్టొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్లఅర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీగా బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యను కలెక్టర్కు విన్నవించుకునేందుకు వస్తున్నారు. ఈ సోమవారం వివిధ సమస్యలపై 270 మంది దరఖాస్తులు అందజేశారు. ఈ అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.పెద్దూరు శివారులోని సర్వేనంబర్ 408లోని 14 గుంటల భూమిని వివిధ అభివృద్ధి పనులకు తీసుకున్నారు. ఇందులో సుమారు ఆరుగురు రైతులు భూమి కోల్పోయాం. మాకు మరో ప్రాంతంలో భూమి లేదా పరిహారం ఇప్పించాలి. – పెద్దూరు భూ బాధితులుమాది చంద్రంపేట. నాకున్న రెండు బ్యాంకు ఖాతాల ద్వారా నెలకు రూ.2,500 చొప్పున సహార క్రెడిట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకులో జమచేశాను. ఆ డబ్బుల కాలపరిమితి ముగిసింది. నా ఖాతాలో జమయిన డబ్బులు ఇప్పించండి. – సుద్దాల ఎల్లవ్వ, చంద్రంపేటతంగళ్లపల్లి మండలం చింతల్ఠాణా గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు సరిపోవడం లేదు. గతంలో మంజూరు చేసిన ట్రాక్టర్ ఈఎంఐలు, విద్యుత్ బకాయిలు ఉన్నాయి. జీపీ ఉద్యోగుల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటికీ గ్రామపంచాయతీ గ్రాంట్ సరిపోవడం లేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మా గ్రామపంచాయతీకి అదనపు గ్రాంట్ మంజూరు చేయాలి. – గుర్రం అనసూర్య, సర్పంచ్, చింతల్ఠాణా -
యూనిక్ టోకరా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మొన్న సహారా, నిన్న మెటా ఫండ్, నేడు యూనిక్.. సంస్థల పేరు ఏదైనా అందరి లక్ష్యం ఒకటే.. ఏదో ఒకరకంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆపై మొహం చాటేయడం. తాజాగా యూనిక్ అనే ఉత్తారాదికి చెందిన సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ స్కాంకు పాల్పడిందని ఖాతాదారులు, ఏజెంట్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి ఇప్పుడు వారిని రేపు..మాపు.. అంటూ తిప్పుకుంటుందని బాధితులు వాపోతున్నారు. ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ తీయని మాటలు చెప్పిన సంస్థ తీరా గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి డబ్బు చెల్లించకపోవడంతో బాధితులంతా ఏజెంట్ల ఇళ్ల మీదకు వస్తున్నారు. దీంతో ఏజెంట్లంతా కంగారుపడి యూనిక్ సంస్థపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించుకున్నారు. వీరంతా కలిసి ఇటీవల కరీంనగర్లో సమావేశం పెట్టుకుని డిపాజిటర్ల డబ్బులు వెనక్కి తీసుకురావాలని నిర్ణయించారు. అసలేం జరిగింది? వాస్తవానికి ఇది ఫైనాన్స్ సంస్థ కాదు. దీని వ్యవహారం చూస్తుంటే మల్టీలెవల్ మార్కెటింగ్ను తలపిస్తోంది. పదకొండేళ్ల క్రితం అంటే 2015 నుంచి ఇది తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం ఆరేళ్లలో మీ డబ్బులు రెట్టింపు చేస్తామంటూ కస్టమర్లకు ఎరవేసింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్తోపాటు, నల్లగొండ జిల్లాలో భారీగా డిపాజిట్లు సేకరించింది. సంస్థ కార్యకలాపాలు, హామీలకు ఆకర్షితులైన పలువురు ఈ సంస్థలో ఏజెంట్లుగా చేరారు. సంస్థ లక్ష్యాలు సామాన్యులకు వివరించి.. కేవలం ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. 24 గంటలు అదే పనిలో ఉండి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు కట్టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. కరోనా నాటికి డిపాజిటర్ల మెచ్యూరిటీ గడువు పూర్తయింది. అయినా యూనిక్ సంస్థ డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో బాధితులు, ఏజెంట్లు అంతా కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మెటాను మించిన యూనిక్.. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంస్థ ఇటీవలి కాలంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు.. గతంలో కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన జీబీఆర్ క్రిప్టో కరెన్సీ రూ.100 కోట్ల వరకు కరీంనగర్ నుంచి వసూలు చేసింది. అనంతరం ఇదే కరీంనగర్ కేంద్రంగా ఓ మాజీ కార్పొరేటర్ ఏకంగా మెటాఫండ్ పేరుతో రూ.300 కోట్ల వరకు ప్రజల నుంచి సేకరించారు. ఈ డబ్బులు ఏకంగా దేశం దాటి పోయాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పోలీసులు అరెస్టు చేసినా.. డబ్బుల రికవరీలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. తాజాగా ‘యూనిక్’ కేసులో రూ.500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ విషయమై జిల్లాలో పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేసులు పెడితే.. డబ్బులు వెనక్కి రావంటూ నేటికీ యూనిక్ సంస్థ ప్రతినిధులు డిపాజిటర్లను మభ్యపెడుతున్నారు. -
నాందేడ్ ముఠా పనేనా!
● గత ఫిబ్రవరి 26న నాందేడ్లో ఘటన ● ఆ ఘటనలోనూ వాడింది ఇదే వాహనంగా అనుమానం ● ఏటీఎం మిషిన్ చోరీపై వేగంగా దర్యాప్తు ● కూపీ లాగుతున్న పోలీసులు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషిన్ అపహరణపై పో లీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా డాటాను విశ్లేషిస్తున్నారు. బ్యాంకు నుంచి డాటా రావాల్సి ఉందని సమాచారం. సంఘటన జరిగిన రోజు ఏటీఎం మిషిన్ వద్ద గల సీసీ కెమెరాల డాటా కొంత మేరకు షార్ట్ సర్క్యూట్కు గురైంది. దీంతో డాటా కోసం పోలీసులు ముంబైలోని హెడ్క్వార్టర్ను సంప్రదించినట్లు తెలిసింది. వారి నుంచి పూర్తిస్థాయి డాటా రాగానే నిందితులను గుర్తించే అవకాశం ఉంది. ఆ దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. బ్యాంకు డాటా కోసం ఏటీఎం మిషిన్ వద్ద బ్యాంకు అధికారులు అమర్చిన సీసీ కెమెరాలతోపాటు ఇతర పరికరాలకు సంబంధించిన డాటా రావాల్సి ఉంది. బ్యాంకు ప్రధా న కార్యాలయం ముంబైలో ఉండడంతో అక్కడి నుంచి పూర్తిస్థాయి డాటాను తెప్పించేందుకు బ్యాంకు అధికారులు పోలీసులకు సహకరిస్తున్నారు. నాందేడ్లో ఇదే తరహా చోరీ మహారాష్ట్రలోని నాందేడ్లో ఇదే తరహా ఘటన గత ఫిబ్రవరి 26న జరిగింది. నాందేడ్లో ఇదే బొలేరో వాహనంతో ముగ్గురు వ్యక్తులు వెళ్లి అక్కడి ఏటీఎం మిషిన్ను అపహరించారు. అక్కడ, ఇక్కడ ఒకే వాహనం వాడడంతో దొంగలను గుర్తించడం పోలీ సులకు సులువుగా మారింది. మహారాష్ట్ర పోలీసులతో జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు టచ్లో ఉండి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రకు వెళ్లిన ప్రత్యేక బృందం నాందేడ్లో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకునేందుకు 12 ప్రత్యేక బృందాల్లోని ఒక పోలీసు బృందం అక్కడికి వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడ జరిగిన సంఘటన తర్వాత పరిణామాలు సేకరించడానికి వెళ్లినట్లు సమాచారం. ఫేక్ నంబర్ప్లేట్తో బురిడీ ఏటీఎం మెషిన్ దొంగతనానికి ఉపయోగించిన బొలెరో వాహనానికి ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎం మిషన్ అపహరణపై పోలీసుల దర్యాప్తు వేగంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లోగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఫలితాల్లో చిట్టచివర
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇంటర్ ఫలితాల్లో జిల్లా ర్యాంక్తో గంభీరావుపేట, కోనరావుపేట జూనియర్ కాలేజీలు పోటీపడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా చిట్టిచివరి స్థానంలో జిల్లా నిలిస్తే.. జిల్లా వ్యాప్తంగా అట్టడుగు ఫలితాలు గంభీరావుపేట, కోనరావుపేట జూనియర్ కళాశాలలు సాధించాయి. గంభీరావుపేట కాలేజీ ఫస్టియర్లో 14 శాతం, సెకండియర్లో 12 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కోనరావుపేట కాలేజీ పది శాతం, మోడల్స్కూల్ 11 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బోధన లోపమా.. నిర్లక్ష్యమా.. ఇంటర్ ఫలితాలపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల పనితీరుపై మండిపడుతున్నారు. సకల సౌకర్యాలు, పూర్తి స్థాయి అ ధ్యాపకులు ఉన్నప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితాల వెనుకంజకు కారణాలేంటి ? బోధనలో నాణ్యత కంటే సిలబస్ పూర్తి చేయడంపైనే లెక్చరర్లు దృష్టి కేంద్రీకరించడంతో విద్యార్థుల్లో పునాది బలహీనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యాపకులపై పర్యవేక్షణ లేకపోవడం, పనితీరు ఆధారంగా సమీక్షలు చేయకపోవడం లోపంగా కనిపిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే బేసిక్ కాన్సెప్ట్స్పై అవగాహన లేకపోవడం ఇంటర్ ఫలితాలపై ప్రభావం చూపుతోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా తమ ఫెయిల్యూర్కు కారణాలపై సమీక్షించుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఇయర్ విద్యార్థులు ఉత్తీర్ణత గంభీరావుపేట కాలేజీ.. ఫస్టియర్ 131 19 సెకండియర్ 114 14 కోనరావుపేట కాలేజీ.. ఫస్టియర్ 95 10 సెకండియర్ 105 19 మోడల్ స్కూల్.. ఫస్టియర్ 135 15 సెకండియర్ 108 39 -
గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులు
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 33 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులకు వెంటనే తెలియజేసి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రత వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. ఇల్లంతకుంటలోని గ్రామపంచా యతీ ఆవరణలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహ న పెంపు కోసం అరైవ్ అలైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సర్పంచ్ మామిడి రాజు, ఎస్సై అశోక్, ఏఎస్సై రాజయ్య, ఉపసర్పంచ్ నాగరాజుశర్మ, కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్కు పూర్వవైభవం తీసుకొస్తామని ము న్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవా రం అధికారులతో కలిసి విగ్రహ ప్రాంగణం, కూడలి పరిశీలించారు. మంగళవారం నిర్వహించే జయంతి సందర్భంగా వాటర్ ఫౌంటేయిన్, ఇతరత్ర లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ దార్నం అరుణ, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ పాల్గొన్నారు. 19న హిందూ సమ్మేళనం వేములవాడ: ఈనెల 19న వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే హిందూ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హిందువులు తరలిరావాలని హిందూ సమ్మేళన సమితి నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ కోరారు. హిందూ సమ్మేళన సభ రాష్ట్రీయ స్వయం సేవక సంగ్ దశాబ్ది ఉత్సవం సందర్భంగా 19న సాయంత్రం 5 గంటలకు జరిగే సభ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. నాయకులు డాక్టర్ కే.మనోహర్, బుస్స శ్రీనివాస్, మోటూరి మధు, రేగుల మల్లికార్జున్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పోషకాహారంపై అవగాహనసిరిసిల్లటౌన్/గంభీరావుపేట/తంగళ్లపల్లి: పోషణ పక్వాడలో భాగంగా సోమవారం పలు మండలాల్లో వంటల పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గణేశనగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం గురించి ఐసీడీఎస్ కార్యకర్తలు అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ కార్యకర్త వింధ్యారాణి, ఏఎన్ఎం నందిని పాల్గొన్నారు. గంభీరావుపేట, లింగన్నపేట, తంగళ్లపల్లి మండలం వేణుగోపాల్పూర్ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు వనిత, రేణుక, సుశ్మిత, సర్పంచ్లు మల్లుగారి పద్మ, పిట్ల ఎల్లయ్య, జూపల్లి రమాదేవి, ఉపసర్పంచ్లు కమలాకర్రెడ్డి, నర్సింలు, అంగన్వాడీ టీచర్లు భాగ్య, రాధమ్మ, శ్రావణి, శోభ, ఉమారాణి, సునీత, వనజ, గీతబాల, రజని, పద్మ పాల్గొన్నారు. -
సీసీ కెమెరాల ప్రభావం పడింది
సీసీ కెమెరాల ప్రభావం విద్యార్థులపై పడింది. విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారు. కొంతమంది విద్యార్థులు తరగతులకు తరచూ గైర్హాజరయ్యారు. ఉత్తమ ఫలితాల కోసం నిరంతరం కృషి చేశాం. స్లిప్టెస్టులు, పరీక్షలు రాసే విధానం గురించి అవగాహన కల్పించాం. భవిష్యత్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం. – గజానంద్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, గంభీరావుపేటచాలా మంది విద్యార్థులు సక్రమంగా కాలేజీకి రాలే దు. ఎక్కువ మందికి హాజ రుశాతం జీరోగానే ఉంది. కళాశాలకు రాకపోవడంతో పాఠాలు వినలేకపోయారు. పరీక్షల్లో కూడా ఏమి రాయలేకపోయారు. ఈ కారణంగానే కళాశాల ఉత్తీర్ణత శాతం పడిపోయింది. – రాజయ్య, కోనరావుపేట కళాశాల ప్రిన్సిపాల్ -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
● ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డిగంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వేసవి నేపథ్యంలో నిరంతరం, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి సూచించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్లను సోమవారం తనిఖీ చేశారు. సబ్స్టేషన్లోని యార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటిని నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించినట్లు తెలిపారు. గతంలో సెస్ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా 2–3 ఫీడర్లను అనుసంధానించడంతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు కలిగేవన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.1.5 కోట్లతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ భిక్షపతి, డీఈ అంజయ్య, ఏడీఈ శ్రీనివాస్, రాజలింగం, ఏఈ పృథ్వీధర్గౌడ్, ఏఈ ఆనందర్, రాజేందర్ ఉన్నారు. సబ్స్టేషన్ ఇట్లనే ఉంటుందా?ఎల్లారెడ్డిపేట 33/11 కేవీ సబ్స్టేషన్ను తనిఖీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి సబ్స్టేషన్ పరిసరాలు పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడం, అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ నెల రోజుల్లో వస్తానని.. సబ్స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. -
అక్కాచెల్లెళ్లు.. సరస్వతీ పుత్రికలు
సిరిసిల్లటౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న కొలనూర్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. కోనరావుపేట మండలం కొలనూరుకు చెందిన గోరింటాల జ్యోతి–రమేశ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రమేశ్ సిరిసిల్లలో పవర్లూం వర్కర్గా పనిచేస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లు సిరిసిల్లలోని జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నారు. ధరణి బైపీసీ(433), పూజ 492 (ఎంపీఎస్డబ్ల్యూ), పల్లవి 490(ఎంపీఎస్డబ్ల్యూ) సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, అధ్యాపకులు ఇంటికెళ్లి సన్మానించారు. -
నిండు వేసవిలో నీటిధారలు !
మల్కపేట రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు వెళ్తున్న నీరుకనగర్తి వద్ద కాల్వలో పారుతున్న గోదావరి జలాలుసిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు సముద్ర మట్టానికి 1,250 అడుగుల ఎత్తులో ఉన్న మెట్టప్రాంతాలు. ఇక్కడ భూములకు నీరు లేక.. బావులు తవ్వితే బండలు.. బోర్లు వేస్తే దుమ్ము లేసే దుస్థితి. వందలాది అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాని వైనం. దశాబ్దాల కిందట ఇక్కడి యువతకు ఉపాధి లేక దుబాయి.. ముంబాయికి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే పరిస్థితులు. ఇప్పుడు కాలం మారింది. ఉన్న ఊరిలోనే మెరుగైన ఉపాధికి బాటలు పడుతున్నాయి. ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలు రాజన్నసిరిసిల్ల జిల్లాకు చేరాయి. నిండు వేసవిలో గోదావరి జలధారలు పారుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల పుణ్యమా అని మధ్యమానేరు జలాశయానికి, వేములవాడ మండలం ఫాజుల్నగర్ రిజర్వాయర్కు, కూడెల్లి ద్వారా ఎగువమానేరుకు, రంగనాయకసాగర్ ద్వారా ముస్తాబాద్ ప్రాంతాలకు గోదావరి జలాలు చేరడంతో పసిడి పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ఎగువ మానేరు కాల్వల నీరు సాగుతుంది. ఇల్లంతకుంటలో అన్నపూర్ణ రిజర్వాయర్ సాగు నీరు అందిస్తుంది. తంగళ్లపల్లి మండలంలోని గ్రామాలకు రంగనాయకసాగర్ చేరింది. ఇలా జలం మెట్ట భూములకు చేరడంతో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాసంగి సీజన్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఒక్క వరి పంటనే 1,83,850 ఎకరాల్లో సాగైంది అంటే.. అది గోదావరి జలాల చలువే. మండే ఎండల్లో గోదావరి జలాలు జిల్లాలో పంటలకు ప్రాణం పోశాయి. -
బాలికలదే హవా
● చివరి స్థానంలో జిల్లా ● రాష్ట్రస్థాయిలో 35వ స్థానం ● సెకండియర్లో 58.69 శాతం ● ఫస్టియర్లో 49.05 శాతంసిరిసిల్ల: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం వెల్లడించారు. జిల్లా ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 49.05 ఉత్తీర్ణత శాతంతో అట్టడుగు స్థానంలో ఉండగా.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ 58.69 శాతంతో ఆఖరు స్థానం దక్కింది. బాలుర కంటే.. బాలికలు కాస్త మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఆఖరు స్థానం జిల్లాకు రావడం విద్యారంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చివరి స్థానం 35వ ర్యాంకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జిల్లాలోని విద్యారంగ పరిస్థితి అద్దం పడుతుంది. జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినులు మెరుగైన మార్కులతో సత్తా చాటుకున్నారు. కేజీబీవీ వేములవాడలో ఏఐఎంఎల్ ఫస్టియర్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్లో 328 మంది విదార్థులు పరీక్షలు రాయగా.. 278 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 478 మంది పరీక్షలు రాయగా.. 400 మంది ఉత్తీర్ణత సాధించారని జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫస్టియర్ 437 మంది పరీక్షలు రాయగా.. 327 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సెకండియర్లో 417 మంది పరీక్షలు రాయగా.. 354 మంది పాస్ అయ్యారు. బద్దెనపల్లి సాంఘిక గురుకుల కశాశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా సమన్వయకర్త జె.జె.థెరిస్సా తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థి కె.శశికుమార్ ఎంపీసీలో 982/1000 మార్కులు సాధించారు. మొదటి సంవత్సవరంలో ఎస్.శ్రీహిత ఎంపీసీలో 463/470 మార్కులు సాధించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 13 నుంచి 21 వరకు రోజూ రెండు పూటలా నిర్వహిస్తారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25 వరకు రెండు పూటలా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 నుంచి 20 వరకు విద్యార్థి చదివిన కాలేజీల్లోనే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆన్లైన్లో చెల్లించరాదని డీఐఈవో తెలిపారు.జి.శ్యామల, కేజీబీవీ మర్రిపల్లి 984/1000, బైపీసీ మమత, కేజీబీవీ, మర్రిపల్లి 466/470కీర్తన, కేజీబీవీ, సిరిసిల్ల 436/440, బైపీసీగడిల మమత, కేజీబీవీ రుద్రంగి 466/470, ఎంపీసీఎం.శ్రీజ, కేజీబీవీ, సిరిసిల్ల 435/440సీ.హెచ్.దివ్యచైత్ర, కేజీబీవీ, తంగళ్లపల్లి 488/500ఎల్.శృతిక, కేజీబీవీ, తంగళ్లపల్లి 490/500జి.గాయత్రీ, కేజీబీవీ, బోయినపల్లి 482/500 -
రెవెన్యూలో బదిలీల కుదుపు!
● ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డీటీలు బదిలీ ● వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్ ● రెవెన్యూ పరిపాలన బలోపేతం కోసం బదిలీలుబోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో పరిపాలన బలోపేతానికి రెవెన్యూశాఖలో తాత్కాలిక బదిలీలు చేపట్టారు. బదిలీలపై బ్యాన్ ఉండడంతో డిప్యూటేషన్పై బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లను డిప్యూటేషన్ చేస్తూ కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు జరిగిన చోట్లలో తాత్కాలిక బదిలీలుగానే పేర్కొన్నారు. బదిలీలు వీరికే.. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఎన్.శ్రీనివాస్ను గంభీరావుపేట తహసీల్దార్గా, సూపరింటెండెంట్–ఈ కలెక్టరేట్గా, వెయిటింగ్లో ఉన్న టి.వైశాలిని వీర్నపల్లి తహసీల్దార్గా, సూపరింటెండెంట్–డీ కలెక్టరేట్గా డిప్యూటేషన్ వేశారు. ఇల్లంతకుంట తహసీల్దార్ ఎం.ఏ.ఫారుక్ను ముస్తాబాద్ తహసీల్దార్, బోయినపల్లి తహసీల్దార్ కాలె నారాయణరెడ్డిని వీర్నపల్లి తహసీల్దార్గా డిప్యూటేషన్ వేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ హెచ్అండ్ఐగా ఉన్న ఎం.డి.షరీఫ్ మొయినొద్దీన్ను డిప్యూటేషన్పై బోయినపల్లి తహసీల్దార్గా, ముస్తాబాద్ తహసీల్దార్ బి.రాంచందర్ను సూపరింటెండెంట్ కలెక్టరేట్ హెచ్ అండ్ఐగా డిప్యూటేషన్ వేశారు. సూపరింటెండెంట్–డీ కలెక్టరేట్గా విధులు నిర్వహిస్తున్న ఆర్.సురేశ్ను ఇల్లంతకుంట తహసీల్దార్గా నియమించారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్–ఈగా ఉన్న జి.వేణును ఎల్లారెడ్డిపేట డిప్యూటీ తహసీల్దార్గా డిప్యూటేషన్, ఎల్లారెడ్డిపేట డీటీ వి.మురళీకృష్ణను తంగళ్లపల్లి డిప్యూటీ తహసీల్దార్గా డిప్యూటేషన్ వేశారు. కాగా త్వరలో మరికొంతమంది ఆర్ఐలను, డీటీలకు బదిలీల తాకిడి ఉంటుందని అనుకుంటున్నారు. సతాయింపులకు చెక్పడేనా? కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు వివిధ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజలను సతాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల విషయంలో ఏదో వంకతో జాప్యం చేయాలని చూస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘ఇందిరమ్మ’తో సంతోషం
కోనరావుపేట/రుద్రంగి/వేములవాడరూరల్: ఇందిరమ్మ ఇళ్లతో గ్రామాల్లోని నిరుపేదల కుటుంబాల్లో సంతోషం కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి గృహాల ప్రవేశాలకు హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, సర్పంచులు బోయిని దేవరాజు, అప్పాల భూషణం, బానోత్ నరేశ్, గండి లక్ష్మీనారాయణ, సతీష్కుమార్, అడ్డిక లక్ష్మి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాశ్, ఏఎంసీల చైర్మన్లు చెలుకల తిరుపతి, రొండి రాజు, రూరల్ పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, బొడ్డు రాములు పాల్గొన్నారు. బస్సు ప్రారంభం ఇల్లంతకుంట(మానకొండూర్): సిరిసిల్ల ఆర్టీసీ బస్టాండ్ నుంచి బోటుమీదపల్లె, సిరికొండ, దాచారం, పెద్దలింగాపురం మీదుగా ఇల్లంతకుంట వరకు ప్రయాణించే బస్సును ఆదివారం సర్పంచ్ గౌరవేణి శివాని ప్రారంభించారు. నెల రోజుల క్రితం ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాశ్రావు గ్రామాల సర్పంచుల ప్రతిపాదన మేరకు రూట్ సర్వే చేశారు. మండలంలోని బోటుమీదిపల్లెకు బస్సు చేరుకోగానే సర్పంచ్ గౌరవేని శివాని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సిరికొండలో సర్పంచ్ గొడుగు విఠల్ ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి దాచారం మీదుగా ఇల్లంతకుంటకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంది. ప్రతి రోజు రెండు ట్రిప్పులు నడుస్తుందని డ్రైవర్, కండక్టర్లు నర్సయ్య, గణేశ్ తెలిపారు. మేడే కరపత్రం ఆవిష్కరణ సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రెస్భవన్లో ఆదివారం 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి దశరథం ఆవిష్కరించారు. దశరథం మాట్లాడుతూ మేడే సంబరాల వెనుక అనేకమంది కార్మికుల ప్రాణత్యాగాలు దాగి ఉన్నాయన్నారు. సిరిసిల్లలోని జూనియర్ కాలేజీ మైదానం నుంచి పాతబస్టాండ్, పెద్దబజార్ల మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టీయూ న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కిశోర్, భామండ్ల రవీందర్, కూరపాటి సతీశ్, గుజ్జ దేవదాస్, రవి, సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు. రైస్మిల్లులో రేషన్ బియ్యంవేములవాడఅర్బన్: వేములవాడ పట్టణం చెక్కపల్లిరోడ్డులోని హరిహర రైస్మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. దాదాపు 450 క్వింటాళ్ల రేషన్ సన్నబియ్యం ఉన్నట్లుగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 గంటల పాటు అధికారులు తనిఖీ నిర్వహించి కేసు నమోదు చేశారు. రైస్మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ సన్న బియ్యం పట్టుబడగా క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా తరలిపోయిన తీరుపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దాడుల్లో విజిలెన్స్ సీఐ ప్రశాంతరావు, తహసీల్దార్ దినేశ్రెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రజారోగ్య రక్షణలో కెమిస్ట్ల బాధ్యత గొప్పది
సిరిసిల్ల: ప్రజారోగ్య పరిరక్షణలో మెడికల్(కెమిస్ట్) దుకాణదారుల బాధ్యత గొప్పదని ఔషధ నియంత్రణశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జూకంటి రాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్, కార్యక్ర మ నోడల్ అధికారి రాజు మాట్లాడుతూ మందుల దుర్వినియోగం చేయొద్దని, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యాంటీబయోటిక్స్ మందుల వాడకంపై అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ జిల్లాలో బాల, బాలికల నిష్పత్తిలో తేడా ఉందని, అబార్షన్కు సంబంధించిన మందుల విక్రయాలపై నిఘా ఉంచా మన్నారు. ఎవరూ తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరించాలని కెమిస్ట్లతో ప్రతిజ్ఞ చేయించారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రో గ్రాం ఆఫీసర్ సంపత్కుమార్, ఈగల్ ఫోర్స్ టీం రా జమౌళి, నవీన్, మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రధా న కార్యదర్శి బోడ రవీందర్, గౌరవ అధ్యక్షుడు చేపూరి జనార్దన్, చేపూరి బుచ్చయ్య పాల్గొన్నారు. -
డ్రగ్స్తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభంసిరిసిల్ల: డ్రగ్స్తో కలిగే నష్టాలపై యువతకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సిరిసిల్ల శివారులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్తో కలిగే నష్టాలపై వైద్య విద్యార్థులు ఫ్లాష్మాబ్ షో ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. డ్రగ్స్తో కలిగే నష్టాలు, భవిష్యత్లో వచ్చే ఇబ్బందులపై వైద్యవిద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. పనులు గడువులోగా పూర్తి చేయాలి మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యకళాశాల భవనం, బాలుర, బాలిక హాస్టళ్లు, మెస్ ఇతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్అండ్బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఈఈ నరసింహాచారి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరీ, వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, ఆర్ఎంవో సంతోష్కుమార్, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ ఉన్నారు. డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం డీ–అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు భవన పనులను పరిశీలించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, ఆర్ఎంవో సంతోష్కుమార్, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. అన్నదానసత్రం పనుల్లో వేగం పెంచాలి వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న ఆలయ అన్నదానసత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నూతన అన్నదానసత్రం పనులను ఆర్అండ్బీ సీఈ రాజేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, ఆలయ ఇన్చార్జి ఈవో అంజనారెడ్డి, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్కుమార్ ఉన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల పనేనా !
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం సెంటర్లోని మిషన్ చోరీకి గురవడంతో మండల కేంద్రం ఉలిక్కిపడింది. కామారెడ్డి– సిరిసిల్ల ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎం సెంటర్లోని మిషన్ను దొంగలు గొలుసులతో లాక్కెళ్లిన సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండాకాలంలో దొంగల బెడద సాధారణంగా ఉంటుంది. కానీ ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల పనేనని చర్చ సాగుతోంది. ఈ సంఘటనను ఎస్పీ మహేశ్ బీ గీతే సీరియస్గా తీసుకున్నారు. దొంగలను పట్టుకోవడానికి 12 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సీసీ పుటేజీల ఆధారంగా.. ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన దొంగలు ఎటువైపు పారిపోయారనే దానిపై పోలీసులు సీసీ పుటేజీల ఆదారంగా ముందుకెళ్తున్నారు. పోలీస్ జాగిలాలు ఎల్లారెడ్డిపేట నుంచి రాగట్లపల్లి వరకు వెళ్లి ఆగిపోయాయి. దొంగలు మిషన్ డబ్బాలను పడేసిన అక్కపల్లి శివారులోని బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయ సమీపం వరకూ వెళ్లాయి. అంతకంటే ముందుకు జాగిలాలు వెళ్లలేకపోతున్నాయి. రెండు సంఘటనలు వీరి పనేనా ? ఎల్లారెడ్డిపేటలో ఏటీఎంను మిషన్ను అపహరించుకెళ్లిన దొంగలు వెళ్తూ.. వెళ్తూ వీర్నపల్లి మండలం బంజరులో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఈ రెండు సంఘటనలు ఒకేరోజు కొద్ది సమయంం తేడాలోనే జరగడంతో పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చింది ఎంత మంది? ఏటీఎం దొంగతనానికి వచ్చింది ఎంతమంది అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. మిషన్ సుమారు క్వింటాల్ బరువు ఉంటుందంటున్నారు. నలుగురు దొంగల ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందనే అనుమానాలున్నాయి. మిషన్లో ఒక రోజు ముందే అందులో రూ.6.06లక్షలు ఉంచినట్లు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ముందుగానే దొంగలు రేక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. పాత నేరస్తుల విచారణ పలు దొంగతనాలలో గతంలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కొత్తగా దొంగల ముఠాలు ఏమైనా ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయా.. అసలు ఈ ఘటనకు పాల్పడింది.. అంతర్రాష్ట్ర లేక అంత జిల్లానా, లేక స్థానిక దొంగలా పనేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. స్వయంగా ఎస్పీ మహేశ్ బీ గీతే ఈ దొంగతనం సంఘటనపై విచారణ చేస్తున్నారు. సరిహద్దుల్లో అప్రమత్తం ఏటీఎం మిషన్ డబ్బాను అక్కపల్లి శివారులో వదిలేసి అక్కడి నుంచి ఎటువైపు వెళ్లి ఉంటారనే దానిపై పోలీసులు ప్రధాన దృష్టి సారించారు. వీర్నపల్లి–సిరికొండ మీదుగా నిజామాబాద్ వైపు వెళ్లి ఉంటారా.. కోనరావుపేట నుంచి జగిత్యాల వైపు వెళ్లి ఉంటారా.. కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ వైపు పారిపోయి ఉంటారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే అన్ని జిల్లాల సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ల వద్ద ప్రత్యేక పోలీసులను నియమించి వాహనాల తనిఖీతో పాటు అనుమానిత వ్యక్తులను పట్టుకొని విచారిస్తున్నారు. -
బతకాలి.. విజయాన్ని వెతకాలి..!
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026శంకరపట్నం: సక్సెస్కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్ మెట్రోవాటర్బోర్డు ఎండీ కోరెం అశోక్రెడ్డి. ఇంటర్ ఫెయిలైన అశోక్రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1 సాధించారు. ప్రస్తుత కన్ఫార్మ్డ్ ఐఏఎస్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి మొలంగూర్ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివారు. సెకండియర్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్ఫార్మ్డ్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్రెడ్డి అంటున్నారు.మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్.. ఎంటెక్ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్గేట్స్.. బోర్డు ఎగ్జామ్ రాయని సచిన్ టెండూల్కర్.. ఆటోడ్రైవర్గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి ఇంటర్ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్ ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్గేట్స్.. సత్యశంకర్.. మనోజ్కుమార్శర్మ.. కోరెం అశోక్రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లో...36,4269,0547,4248,1067,69918,2514,7484,3064,0604,04618,17515,123జగిత్యాలరాజన్నసిరిసిల్లపెద్దపల్లికరీంనగర్‘సత్యశంకర్.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్ వరకు చదువుకుని ఆటో డ్రైవర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’‘మనోజ్కుమార్శర్మ.. మధ్యప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పనిచేస్తున్నారు.’‘మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. తొలుత ఓ కంపెనీని స్థాపించి తీవ్రంగా నష్టపోయారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్పై తనకున్న కోరిక, విషయ పరిజ్ఞానం మైక్రోసాఫ్ట్ పేరిట సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించేలా చేసింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే.’ ‘సచిన్ టెండూల్కర్ పదిలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా తనకు ఇష్టమైన క్రికెట్ ఆటలో చరిత్ర సృష్టించారు. పదహారేళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి క్రికెట్ ప్రపంచానికి దేవుడయ్యారు’ ‘విజయ్ వర్షన్..తుషార్ సుమెరా.. హరియాణాకు చెందిన ఐఏఎస్ అధికారి ఏకంగా 35సార్లు పరీక్షలు రాసి విఫలమైనా చివరికి 2021లో సివిల్స్ 70వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. గుజరాత్లోని ఐఏఎస్ అధికారి పదోతరగతి ఆంగ్లంలో 35, గణితంలో 36, సైన్సులో 38 మార్కులే సాధించారు. తర్వాత తన లక్ష్యం సివిల్స్పై పెట్టి అనుకున్నది సాధించారు.’ -
పూలే జీవితం ఆదర్శం
సిరిసిల్లటౌన్: మహాత్మ జ్యోతిబా పూలే జీవితం అన్ని తరాలకు ఆదర్శనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆనాడు సమాజంలో జరుగుతున్న వివక్షకి వ్యతిరేకంగా పూలే పోరాడారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తన వద్ద విద్యాశాఖను ఉంచుకొని పెను మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్రంలోని రేషన్కార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని తెలిపారు. నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను విడుదల చేసిందన్నారు. ఇందిరమ్మ చీరల ఆర్డర్లను మన ప్రాంతంలో ఇవ్వడం జరిగిందన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమం చేసిన వారికి అండగ ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షు డు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, కాముని వనిత పాల్గొన్నారు. నివాళి అర్పించిన కలెక్టర్ సిరిసిల్ల: కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చిత్రపటానికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ జిల్లా అధికారి సౌజన్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణానికి రండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ గ్రామస్తులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్కు శనివారం ఆహ్వానపత్రిక అందజేశారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో కలిసి ఈనెల 18, 19, 20 తేదీలలో జరిగే విగ్రహ ప్రతిష్ట, కల్యాణ వేడుకలకు రావాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, నాయకులు ఇల్లందుల శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి, కృష్ణ, శివ, సతీశ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డ్రైవింగ్లో సర్టిఫైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న వెయ్యి డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 23న నిర్వహించే పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేసేందుకు డ్రైవింగ్ శిక్షణ సంస్థ ఐటీడీఆర్, టైడ్స్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ దురై మురగన్ తెలిపారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పది రోజుల సర్టిఫైడ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సమాచారం కోసం 89854 31720లో, http://www.tidessircilla.com వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈఈ భిక్షపతి, డీఈఈ అంజయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ప్రజాబాటను శనివారం నిర్వహించారు. ఏడీఈ శ్రీనివాస్, ఏఈఈ పృథ్వీధర్గౌడ్, సర్పంచ్ సోమారపు శరవిందు పాల్గొన్నారు. సొంతింటి కలను నెరవేర్చుతున్నాం ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరబేగం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాల అధ్యక్షులు సద్దిలక్ష్మారెడ్డి, ప్రవీణ్ టోనీ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలివేములవాడరూరల్: హిందువులు ఏకమై సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు పరమేశ్ అన్నా రు. మండలంలోని లింగంపల్లిలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపు చూస్తున్నాయన్నారు. సమావేశాన్ని బొల్లారం, హన్మాజిపేట, మల్లారం, జయవరం, లింగంపల్లి గ్రామస్తులు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మధు, మల్లిఖార్జున్, మల్లయ్య పాల్గొన్నారు. -
చౌడాలమ్మకు మొక్కులు
కోనరావుపేట: కొండాపూర్లో చౌడాలమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూజలు చేశారు. తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు గంభీరావుపేట(సిరిసిల్ల): తాగునీటి సమస్య పరిష్కరించాలని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని దోసలగూడెం కాలనీవాసులు శుక్రవారం రోడ్డెక్కారు. బస్టాండ్ సమీపంలో ఖాళీ బిందెలతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ వారం రోజులుగా తమ కాలనీలో నీరు రావడం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, నాయకులు మద్దెల రాజనర్సు, పిట్ల రఘు, ప్రవీణ్కుమార్, చక్రధర్, వంశీ, కిషన్, అనంతరాములు పాల్గొన్నారు. కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలి సిరిసిల్ల: కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలని లెప్రసీ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రాజు కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత ఆధ్వర్యంలో పీహెచ్సీల వైద్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. రాజు మాట్లాడుతూ కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. లెప్రసీ లక్షణాలను ప్రచారం చేయాలన్నారు. అంతకుముందు సుందరయ్యనగర్, అంబేడ్కర్నగర్, తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లెప్రసీపై అవగాహన కల్పించారు. రాష్ట్ర పరిశీలకుల బృందం సీనియర్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వరాచారి, సకలరెడ్డి, సురేందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, డాక్టర్ సంపత్, డాక్టర్ రామకృష్ణ, డీపీఎంవో దేవిసింగ్ పాల్గొన్నారు. ఆయుర్వేదిక్ వైద్యశిబిరం సిరిసిల్లటౌన్: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆయుష్ హోమియోపతి డే సందర్భంగా ఉచిత ఆయుర్వేదిక్ ఆరో గ్య శిబిరాన్ని సిరిసిల్లలోని యూహెచ్సీలో శుక్రవారం నిర్వహించారు. అంబేడ్కర్నగర్లో నిర్వహించిన ఆయుర్వేదిక్ వైద్యశిబిరాన్ని డీఎంహెచ్వో రజిత ప్రారంభించారు. వైద్యాధికారి రేఖ, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. ‘మన ఇసుక మన వాహనం’ వినియోగించుకోవాలి బోయినపల్లి(చొప్పదండి): ఇసుక తరలింపులో పారదర్శకత కోసం అమలు చేస్తున్న ‘మన ఇసుక– మన వాహనం’ వినియోగించుకోవాలని జిల్లా మైనింగ్ ఏడీ క్రాంతికుమార్ కోరారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం ట్రాక్టర్ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్ణీతపత్రాలు జత చేసి.. ఆన్లైన్ విధానం ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే వీలు ఉందన్నారు. తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి, ఆర్ఐ మనోజ్కుమార్ ఉన్నారు. -
అప్రమత్తతే రక్ష
వడదెబ్బ నుంచి రక్షణకు బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలిగంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రం గంభీరావుపేట, లింగన్నపేట మధ్య మానేరువాగుపై నిర్మించతలపెట్టిన హైలెవల్ వంతెన పనులను వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మానేరువాగు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మళ్లీ వానాకాలంలో వాగు ఉప్పొంగి రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయేలా ఉన్నాయన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మల్లేశంయాదవ్, దేవేందర్యాదవ్, సత్యనారాయణ, వాజిద్ హుస్సేన్, ఎల్లం, శ్రీనివాస్, విగ్నేశ్గౌడ్, మోహన్, నర్సింలు, దుర్గేశ్, రవీందర్నాయక్, నరేశ్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: ఎండల నుంచి రక్షణకు అప్రమత్తంగా ఉంటూ.. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్వో) రజిత సూచించారు. అధిక ఉష్ణోగ్రతలతో శరీరంలో నీటినిల్వలు తగ్గే ప్రమాదం ఉందని.. తరచూ నీటిని తాగాలని సూచించారు. ఎండలు దంచికొడుతుండడంతో రక్షణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలపై జిల్లా వైద్యాధికారి ‘సాక్షి’కి వివరించారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంతో ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు. శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి మండుటెండలకు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంటాయి. ఫలితంగా శరీరంలో నీటిశాతం పడిపోవడంతో డీహైడ్రేషన్తోపాటు జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, విరోచనాలు, రక్తపోటు(బీపీ)లో హెచ్చుతగ్గులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సమస్యలు, వేడిదద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండదెబ్బకు గురయ్యే వారికి జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన చికిత్స లభిస్తుంది. ఎండాకాలం జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సరైన జాగ్రత్తలు తప్పనిసరి ఎండాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు తలనొప్పి తొలి హెచ్చరికగా భావించా లి. వెంటనే తగ్గకుంటే డాక్టర్ను సంప్రదించా లి. ఈకాలంలో ఒత్తిడి, నిద్రలేమి, చికాకు, ఉత్సాహం తగ్గడం, నీరసించిపోవడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే డాక్టర్ను సంప్రదించాలి. సరిపడా నీరు తాగాలి వేసవిలో చాలా మందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం, గాలిలో తేమశాతం తక్కువగా ఉండటం వంటి కారణాలతో శరీరం నుంచి నీరు బయటకు ఎక్కువగా పోతుంటుంది. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు కండరాలు పట్టేస్తాయి. కండరాలకు శరీరం నుంచి తగిన ఆక్సిజన్ అందనప్పుడు ఇతరమార్గంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో ల్యాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కిడ్నీలపై ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నీళ్ల విరోచనాలు కూడా కిడ్నీలు పాడవడానికి కారణమవుతాయి. చల్లని పానీయాలు సేవించొద్దు ఎండాకాలంలో అతిచల్లని నీటిని, శీతల పానీయాలు అస్సలు సేవించొద్దు. ఎండ నుంచి వచ్చిన వారు సాధారణ నీరు తాగడం శ్రేయస్కరం. చల్లని నీరు, రసాలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. అతిగా వ్యాయామం చేయడం సరికాదు. తగిన విరామంతో సరిపడినంత నీరు తీసుకుంటూ.. వ్యాయామం చేయాలి. ఎండలో తిరిగొచ్చిన వారు వెంటనే చల్లని నీటిని సేవించినా, స్నానం చేసినా రక్తనాలాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి -
‘అరైవ్..అలైవ్’ నిర్వహించాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల క్రైం: జిల్లాలోని ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్’ నిర్వహించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించే కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మంచి ప్రవర్తనతో జీవిస్తున్న వారిపై షీట్స్ తొలగిస్తామని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గోల్డెన్ అవర్లో తక్షణ సహాయం అందించేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు. కౌన్సిలర్ల ఆటవిడుపు సిరిసిల్లటౌన్: కేసిఆర్ కప్లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. చైర్పర్సన్ వర్సెస్ వైస్చైర్మన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చైర్పర్సన్ టీం గెలిచింది. -
వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి
బోయినపల్లి(చొప్పదండి): విద్యుత్ వినియోగదారుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరించాలని నిజామాబాద్ సీజీఆర్ఎఫ్ చైర్మన్–11, టీజీఎన్పీడీసీల్ ఎరుకల నారాయణ సూచించారు. బోయినపల్లిలోని రైతువేదికలో బోయినపల్లి, కోనరావుపేట, వేములవాడ అర్బన్ మండలాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక శుక్రవారం నిర్వహించారు. మొదట సర్పంచులు ఏనుగుల కనకయ్య, కౌడగాని వెంకటేశ్, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరారు. లూజ్వైర్లు ఉన్న చోట మిడిల్పోల్స్, రోడ్ల వెంట చిన్నపోల్స్ తీసి, పెద్దపోల్స్ వేయాలని కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లు తొలగించాలని విన్నవించారు. టీజీఎన్పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ షేర్ల సత్యనారాయణ, సీజీఆర్ఎఫ్ మెంబర్ మర్రిపెల్లి రాజాగౌడ్, ఎస్ఈ భిక్షపతి, డీఈ వెంకటరమణ, ఏడీఈ అనిల్కుమార్, ఏఈ ప్రశాంత్, కిసాన్సంఘ్ నాయకులు సంపత్రావు పాల్గొన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణను సిరిసిల్ల పౌరసంక్షేమ సంఘం అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చేకోట అనిల్కుమార్, టెక్స్టైల్స్ పార్క్ అసోసియేషన్ లక్ష్మీనారాయణ, బుజ్జ భూమేశ్ సత్కరించారు. -
‘సహస్ర’కు తోటి విద్యార్థుల చేయూత
సిరిసిల్లటౌన్: చిన్నారి అంబటి సహస్ర అనా రోగ్యం బారిన పడగా తోటి విద్యార్థులు చేయూతనందించారు. సిరిసిల్లకు చెందిన నేతకార్మిక దంపతులు అంబటి వర్ష–వేణుకు ఇద్దరు కూతుళ్లు అమృత, సహస్ర, కొడుకు అన్విత్. పెద్దకూతురు అమృత ఐదేళ్ల క్రితం లివర్ పాడై చనిపోయింది. ఫిబ్రవరిలో చిన్న కూతురు సహస్ర లివర్ వ్యాధి బారిన పడటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. వైద్యులు రూ.20లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడంతో అచేతనస్థితిలో ఉన్న వేణు దంపతుల దీనగాథను సాక్షిలో ‘అయ్యో పాపం సహస్ర’ శీర్షికను ప్రచురించింది. దీంతో పలువురు స్పందించి ఆర్థికసాయం అందించారు. సహస్ర చదువుకునే మహర్షి హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రూ.55వేలు జమచేసి అందజేశారు. సహస్ర తల్లి కూతురుకు లివర్ ఇవ్వడంతో ఇద్దరూ కోలుకుంటున్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బూర శ్రీనివాస్ మాట్లాడుతూ సహస్రకు వచ్చే అకాడమీలో ఫీజు తీసుకోబోమన్నారు. ప్రిన్సిపాల్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
● మంత్రి అడ్లూరికి శాతవాహన విద్యార్థుల ఫిర్యాదు ● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు ఫోన్ ● మొత్తం వివాదంపై విచారణ చేపట్టాలని కోరిన మంత్రి ● ఘటనపై పోలీసులకు ప్రొఫెసర్ సుజాత ఫిర్యాదు ● అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్ కుమార్, బాటనీ పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ ఉమేశ్కుమార్ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తనను అర్బన్ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్షాట్లు, వారి ఫోన్ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్నైన తనను అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు. -
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఆరోగ్య‘యోగం’సిరిసిల్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యం కనీసం అరగంట పాటు యోగా సాధన చేయాలని కోరారు. అనంతరం యోగాసనాలు వేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, డీవైఎస్వో రాందాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు, –8లోu ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్లోకి 9,900 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేసినట్లు డీఈ ఉపేందర్ తెలిపారు.ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వీస్తాయి. ఎండ తీవ్రంగా ఉంటుంది. -
షాపింగ్ క‘మాల్’కు కళ్లెం
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్మాల్ నిబంధనలు అతిక్రమణ నిజమేనని అధికారుల విచారణలో తేలింది. స్థానిక భావనరుషినగర్ ఏరియాలో కొద్ది రోజుల క్రితం వాసవి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. జీ+3 రెసిడెన్షియల్ అనుమతులతో భవనాన్ని నిర్మించారు. ఇందులోని రెండు ఫ్లోర్లలో వాసవి షాపింగ్మాల్ను నిర్వహిస్తున్నారు. షాపింగ్మాల్ నిర్వహణలో నిబంధనల అతిక్రమణపై ఈనెల 2న ‘సాక్షి’లో ‘షాపింగ్ క‘మాల్’ పేరుతో కథనాన్ని ప్రచురితమైంది. దీనికి జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు స్పందించారు. గురువారం షాపింగ్ మాల్ను సందర్శించి సీజ్ చేశారు. డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ దాడులు రెసిడెన్షియల్ భవనంలో యజమాని కమర్షియల్కు అద్దెకివ్వడంతోపాటు అనుమతి లేకుండానే నాలుగో అంతస్తును నిర్మించినట్లు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. వెంటనే భవన యజమానికి నోటీసులు అందించి సీజ్ చేశారు. ఇక షాపింగ్మాల్ నిర్వహణకు సెల్ఫ్ అసెస్మెంట్లో ట్రేడింగ్ లైసెన్స్ పొందడం, పార్కింగ్ లేకపోవడం, ఫైర్సేఫ్టీ వంటి అంశాలను పరిశీలించారు. మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం అనుమతులు సరిగ్గా లేనందున భవనాన్ని పూర్తిగా సీజ్ చేస్తున్న క్రమంలో షాపింగ్మాల్ నిర్వాహకులు షిఫ్టింగ్ కోసం పదిహేను రోజులు గడువు కోరారు. మాల్లో పనిచేస్తున్న పదుల సంఖ్యలో సిబ్బంది, షాపింగ్మాల్ ఇంకో చోటుకు మార్చుకునేందుకుగాను అధికారులు అవకాశం కల్పించారు. నిబంధనలు పాటించాల్సిందే – ఆర్డీవో వెంకటేశ్వర్లు కమర్షియల్ భవన యజమానులు, వ్యాపారులు, వ్యాపారసంస్థలు మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం అనుమతులు పొందాలని డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ టీం ఆఫీసర్, ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. భవనం అనుమతులు మూడు ఫ్లోర్లకే ఉందని, అనుమతి లేకుండానే నాలుగో అంతస్తు నిర్మించారన్నారు. షాపింగ్మాల్ నిర్వాహకులు కూడా నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ నుంచి ఇప్పటికే నోటీసులు అందించి గురువారం తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ టీమ్లో డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా, ఫైర్ ఆఫీసర్ నరేందర్, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
సాదాసీదాకు మోక్షం
● ఆరేళ్లుగా అన్నదాతల నిరీక్షణ ● సాదా బైనామాలపై రైతుల ఆశలు ● కొత్త మార్గదర్శకాలు జారీ ● 15,056 మంది రైతుల నిరీక్షణఇతను కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన ఎల్లాల లింగారెడ్డి. ఇతను సర్వే నంబరు 488లో 13 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారు. సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అవకాశం కల్పించగానే 2020 అక్టోబరు 28న మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేశాడు. కానీ ఇప్పటి వరకు అతని దరఖాస్తుకు మోక్షం లభించలేదు. ధరణి రావడంతో ఆ దరఖాస్తులకు మోక్షం లభించలేదు. ఇప్పుడు భూభారతిలో ఆశలు చిగురించాయి. ఇతను కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన వంగపల్లి పర్శరాములు. పర్శరాములు సర్వే నంబరు 213లో 1.15 ఎకరాల భూమిని సాదాబైనామా ద్వారా కొని, సాగు చేసుకుంటున్నారు. కానీ ఇతని పేరిట భూమి మార్పిడి కాలేదు. మీసేవ కేంద్రం ద్వారా సాదాబైనామాతో మ్యూటేషన్కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ మోక్షం లభించలేదు. ఇలాంటి వారు జిల్లాలో 15వేల మంది రైతులు ఉన్నారు. సిరిసిల్ల: సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలో సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15,056 మంది రైతులు దరఖాస్తు చేసుకుని, ఎదురుచూస్తున్నారు. ఆరేళ్లుగా ఎదురుచూపులే రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబరు 12న సాదాబైనామాలకు అవకాశం కల్పించింది. 2020 అక్టోబరు 31తో గడువు ముగిసిపోయినా.. నవంబరు 10 వరకు పొడగించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో 15,056 మంది రైతులు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. మొన్నటి వరకు అమలులో ఉన్న కొత్త రెవెన్యూ చట్టంలో సాదాబైనామాల ఊసే లేదు. సాదాబైనామాలు ఉన్నా రికార్డుల్లో మార్పులు, చేర్పులు వీలు కాలేదు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం సాదాబైనామాలతో హక్కులు కల్పించే అవకాశం ఉంది. సర్కారు నిర్ణయంపై ఆశలు సాదా బైనామాలకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించడంతో దరఖాస్తులు చేసుకున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల ప్రభుత్వం నూతనంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్కుమార్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం 2020 అక్టోబరు 12వ తేదీ నుంచి నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి సాదాబైనామాలు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో దరఖాస్తుల వెల్లువ జిల్లాలో సాదాబైనామాల కోసం అత్యధికంగా కోనరావుపేట మండలంలో 2,690 మంది దరఖాస్తు చేశారు. అత్యల్పంగా రుద్రంగిలో 162 దరఖాస్తులు చేసుకున్నారు. వీర్నపల్లి మండలంలో 379, బోయినపల్లిలో 764, చందుర్తిలో 1,259, గంభీరావుపేటలో 1,403, ఇల్లంతకుంటలో 1,536, ముస్తాబాద్లో 1,685, సిరిసిల్లలో 428, తంగళ్లపల్లిలో 1,776, వేములవాడలో 675, వేములవాడరూరల్లో 1,072, ఎల్లారెడ్డిపేటలో 1,227 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఆన్లైన్ కష్టాలు సాదాబైనామాల అమలుకు మీసేవ కేంద్రాల్లో నేరుగా దరఖాస్తు చేశారు. భూమి అమ్మిన వ్యక్తి వివరాలతోపాటు కొనుగోలు చేసిన వారి సమాచారం, సర్వేనంబరు, ఆధార్కార్డు నంబర్, పొటో, ఫింగర్ప్రింట్, లేదా ఐరిష్ నమోదు చేసి మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్లో వీటిని అప్లోడ్ చేశారు. గ్రామ కంఠం స్థలాలకు సర్వేనంబరు లేక ఆన్లైన్లో నమోదు కాలేదు. ధరణి పోర్టల్లో కొన్ని సర్వే నంబర్లు నమోదు కాలేదు. దీంతో సాదాబైనామా పత్రం ఉన్నా ఆన్లైన్లో నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. -
రోగ నిర్ధారణతో మెరుగైన వైద్యం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేసి, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం రోగులను కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించారు. ఎయిడ్స్ నియంత్రణపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఎన్పీడీసీఎల్ సీఈ బుస్స అశోక్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ విజయ్భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతికి ఏర్పాట్లు సిరిసిల్లటౌన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతిని ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈమేరకు జయంతి పోస్టర్లను గురువారం ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావుతో కలిసి ఆవిష్కరించారు. జయంతి వేడుకలకు వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పాల్గొన్నారు. ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని వారు ఆదేశించారు. నేడు మెగా హోమియో శిబిరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుష్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హోమియోపతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈమేరకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వ్యాధులు రాకుండా ఏం చేయాలి, వచ్చిన వ్యాధులను ఎలా నివారించుకోవాలో యోగా ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం అంబేడ్కర్నగర్ పీహెచ్సీలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
నిస్సహాయులకు సాయం చేయడమే లక్ష్యం
● జాన్ 2న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి/రుద్రంగి(వేములవాడ): నిస్సహాయులకు సాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, రుద్రంగి మండలాల్లోని పలువురు లబ్ధిదారులకు గురువారం సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చందుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.18.47లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేద కుంటుంబంలోని కుటుంబ పెద్దకు బీమా కల్పించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2006లో నిర్వహించిన ప్రజాపథంలో చందుర్తి మండలం మల్యాలకు వచ్చిన క్రమంలో ఈ ప్రాంత సమస్యలు అడిగి తెలుసుకున్నారని గుర్తు చేశారు. అప్పుడే చందుర్తి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు మంజూరు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్తో తనకున్న అనుబంధంతోనే రెండు కాలేజీలు, ఎల్లంపల్లి నీరు, వేములవాడ – కోరుట్లకు డబుల్ రోడ్డు తీసుకొచ్చానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి సహకారంతో వేములవాడ–కోరుట్లకు త్రీలేన్స్ రోడ్డుకు రూ.156 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. నిరుపేదలకు ఎల్వోసీలు అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు సా గుతున్నాయని వివరించారు. కాలేజీ ఇన్చార్జి ప్రి న్సిపాల్ కృష్ణాకర్, చందుర్తి సర్పంచ్ పులి సత్తయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో లెంకల రాధ, పంచా యతీరాజ్ డీఈ పవన్కుమారి, సర్పంచ్లు కటకం మల్లేశం, మోకినపల్లి దేవరాజు, దూది శ్రీనివా స్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా కార్యదర్శి గొట్లె ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ముస్కు మకుందరెడ్డి పాల్గొన్నారు. -
రైతన్నల చెంతకు విద్యుత్ సేవలు
వేములవాడ: రైతుల చెంతకు విద్యుత్ సేవలు వస్తున్నాయని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ చేపట్టిన పొలంబాట గురువారం 15వ వార్డు పరిధిలోని లాలపల్లిలో నిర్వహించారు. విద్యు త్ శాఖ ఏఈ సిద్ధార్థతో కలిసి చైర్మన్ రాజు పొలాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడం వంటి పనులు చేయాలని సూచించారు. కిలోమీటర్ పరిధిలో కొత్త కనెక్షన్లు పొందేందుకు రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సిరిసిల్ల: విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకుడు, పీడీఎస్యూ సంస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 54వ వర్ధంతి సభలను ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు లోకిని రమేశ్ తెలిపారు. స్థానిక వికాస్ డిగ్రీ కాలేజీ వద్ద గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. రమేశ్ మాట్లాడుతూ జార్జిరెడ్డి పోరాటమార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్, జిల్లా నాయకులు అభిలాశ్, ఆనంద్, రవి, శ్రీకాంత్, చరణ్, కావ్య, మౌనిక పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్లో ఎంపవర్మెంట్ 24/7, కేలిబర్ కంపెనీలు పాల్గొన్నాయి. 50 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థినులు ఎంపికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్ జయ అభినందించారు. ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్ల పంపిణీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వార్షిక ప్రత్యేక శిబిరాల్లో చురుగ్గా వలంటీర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జయ మాట్లాడుతూ సామాజిక సేవ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహానా ఇఫత్, ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్ర ధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిధర్రెడ్డిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ స్కూల్లో బోధనేతర సిబ్బందిని కేటాయించాలివేములవాడరూరల్: ప్రతీ పాఠశాలలో ఒక్కరినైనా బోధనేతర సిబ్బందిని నియమించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్ కోరారు. ఎస్టీయూ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం వేములవాడలోని ప్రభుత్వ హైస్కూల్లో గురువారం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, ప్రీపైమరీ తరగతులను ప్రారంభించాలని కోరారు. యాదగిరి, రామంచ రవీందర్, బత్తిని సత్యనారాయణగౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకతకే మన ఇసుక వాహనం అమలు
కోనరావుపేట(వేములవాడ): ఇసుక తరలింపులో పారదర్శకత కోసమే మన ఇసుక వాహనం అమలు చేస్తున్నామని, గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మైనింగ్ ఏడీ క్రాంతికుమార్ పేర్కొ న్నారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం, అప్లికేషన్ డౌన్లోడ్, ఆన్లైన్లో అనుమతులు జారీ తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మండల పరిషత్ కార్యాలయంలో పంచా యతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులకు గురువారం అవగాహన కల్పించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్ల నుంచే ఇసుక తరలించాలన్నారు. ఇసుక తరలింపులో నేరుగా కూపన్లు ఇచ్చే విధానం నుంచి ఆన్లైన్ ద్వారా పొందే విధానం అమలుచేస్తామని, ఇసుక కేటాయింపు, తరలింపు పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, సూపరింటెండెంట్ శంకర్రెడ్డి, ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
వీర్నపల్లి: అటవీ సంపదనకు కాపాడుకోవడంతో పాటు వన్యప్రాణులను సంరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ బీట్ అధికారి కిరణ్ అన్నారు. బుధవారం వీర్నపల్లి మండలం బాబాయి చెరువుతండాలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో అటవీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఉపాధి పనులు చేసే సమయంలో కూలీలు వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులు కనిపిస్తే వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. అటవీ శాఖ సిబ్బందితో పాటు గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. -
మహిళా సంరక్షణకు పెద్దపీట
సిరిసిల్లటౌన్: మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాలల్లో బుధవారం సురక్షిత మాతృత్వ సంరక్షణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ వివిధ శాఖలకు అప్పగించారన్నారు. ప్రజలకు ఇప్పటివరకు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయడం, భవిష్యత్లో చేపట్టాల్సిన పనులపై ఒక నివేదిక సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హెచ్చరించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ గర్భిణుల వివరాలు ఆస్పత్రుల్లో నమోదు కావాలని, వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని సూచించారు. పిల్లలకు తల్లిపాలు ఇచ్చేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలోని 552 మంది అంగన్వాడీ కేంద్రాల బాధ్యులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య శాఖ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాతృ సంరక్షణపై పట్టణంలో డీఎంహెచ్వో రజిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. -
ధర్మాసుపత్రిలో అధర్మాలు
● డయాలసిస్ రోగి కుటుంబంపై దాడి ● క్షతగాత్రుడి కుటుంబసభ్యులపై సిబ్బంది దురుసు ప్రవర్తనసిరిసిల్లటౌన్: జిల్లాసుపత్రిలో ధర్మం గాడితప్పుతోంది. వైద్యం కోసం వచ్చే పేదలపై రెండు రోజులుగా సిబ్బంది ప్రవర్తన హద్దులు దాటి దాడుల వరకు వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన దేవరాజు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మూడ్రోజుల క్రితం డయాలసిస్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకురాగా పేరు నమోదు చేసుకునే సమయంలో సిబ్బందితో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుందని, అనంతరం కొందరు సిబ్బంది తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకున్నామని, పోలీస్స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యంపై నిరసన సిరిసిల్లకు చెందిన అల్వాల భాస్కర్ బైక్పై నుంచి పడి కాలు విరగగా.. బంధువులు మంగళవారం రాత్రి జిల్లాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యం అందించాలని కోరుతున్న తరుణంలో అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భాస్కర్ కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఈ రెండు ఘటనల్లో నిజానిజాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాదితులు ఉన్నతాధికారులను కోరారు. ఈవిషయమై జిల్లాసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా రెండు సంఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బిల్లుల ‘పంచాయితీ’
● జీపీల బకాయి విద్యుత్ బిల్లులు రూ.400కోట్లు ● నూతన పాలకవర్గాలకు పెనుభారంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇటీవల కొలువుదీరిన గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలకు విద్యుత్ బిల్లుల బకాయిలు కలవరపెడుతున్నాయి. కొన్నేళ్లుగా విద్యుత్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదలకాకపోవడంతో పెండింగ్లోనే ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ‘సెస్’ సంస్థ(ప్రస్తుత ఎన్పీడీసీఎల్)కు గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు రూ.400 కోట్లు బకాయిలు పడ్డాయి. ఈ బిల్లులు చెల్లించడం నూతన పాలకవర్గాలకు తలకుమించిన భారంగా మారింది. అదే విధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలుపుకొని రూ.701 కోట్లకు పైగా బకాయిలు పడ్డట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. బకాయిలపై ఎన్పీడీసీఎల్ ప్రత్యేక పోకస్తో ముందుకుపోనున్నట్లు సీఎండీ వరుణ్రెడ్డి ప్రకటించారు. దీంతో పంచాయతీ పాలకవర్గాల్లో బిల్లులు ఎలా చెల్లించేదని ఆందోళన మొదలైంది. నిధులు లేక నీరసం జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా.. రూ.400 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు పడ్డాయి. జీపీలలో నిధులు లేకపోవడం, వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పంచాయతీల్లోని మల్టీపర్పస్ వర్కర్లకు, చెత్తసేకరణకు ఉపయోగించే ట్రాక్టర్ నిర్వహణకే సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులకు నిధులు ఉండడం లేదు. బకాయిల భారం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు సిరిసిల్ల సెస్ సంస్థ విద్యుత్ సేవలు అందించింది. సెస్ సంస్థ ఎన్పీడీసీఎల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసింది. ఇలా సేవలు అందించినందుకు కొంత మొత్తంలో లాభాలు సైతం తీసుకుంది. అయితే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. గ్రామాల్లోని వీధిదీపాలు, నీటి సరఫరా మోటార్ల బిల్లులు ప్రతీ నెల లక్షల్లోనే వస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.701 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయి. వివరాలు ఇలా.. గ్రామపంచాయతీలు : 260బకాయి బిల్లులు : రూ.400 కోట్లు మున్సిపాలిటీలు : 02విద్యుత్ బకాయిలు : రూ.115 కోట్లు జిల్లా వ్యాప్తంగా సెస్కు బకాయిలు : రూ.701 కోట్లు -
నిధులు లేవు.. పన్నులు సరిపోవు
గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామంలోని పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, సిబ్బంది జీతభత్యాలు, వీధిలైట్ల మరమ్మతులకే సరిపోవడం లేదు. పాత విద్యుత్ బకాయిలు చెల్లించడం తలకు మించిన భారమవుతుంది. ప్రభుత్వ కరెంట్ బిల్లుల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. – ఎలగందుల నర్సింలు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ బకాయిలతో ఇబ్బందులు జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు రూ.701 కోట్లకు పైగానే సెస్కు బకాయిలు ఉన్నాయి. గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలు, వినియోగదారులు బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇబ్బందిగా ఉంది. జీపీలకు వచ్చే ఆదాయం నిర్వహణకే సరిపోతున్నాయి. ప్రభుత్వమే బకాయిలు చెల్లించి జీపీల మనుగడకు సహకరించాలి. – ఇల్లందుల గీతాంజలి, రాచర్లబొప్పాపూర్ సర్పంచ్ -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధిహామీ కూలీలు పని చేసే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీవో గీత అన్నారు. బోయినపల్లి మండలంలోని మల్కాపూర్, బోయినపల్లి, రామన్నపేట గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం పరిశీలించారు. కూలీలకు పని వద్ద సౌకర్యాల ఏర్పాటు తప్పనిసరి అన్నారు. అలాగే ఎన్ఎంఎంఎస్ హాజరు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. డీఆర్డీవో వెంట ఎంపీడీవో బీమా జయశీల, బోయినపల్లి సర్పంచ్ నల్ల మోహన్, ఈజీఎస్ ఏపీవో వనం సబిత, పంచాయతీ కార్యదర్శులు, ఈసీలు, టీఏ, ఎఫ్ఏలున్నారు. -
కూరగాయలు సాగుకు ప్రత్యేక చర్యలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్లటౌన్: కూరగాయల సాగు పెంచేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. కూరగాయల సాగుకు ప్రోత్సాహంపై కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ నుంచి జిల్లాకు వచ్చిన 1250 విత్తనాల ప్యాకెట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారి శరత్ బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి గోవర్దన్, పీఏసీఎస్ కూరగాయల వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి గర్భిణులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. మాతా, శిశు మరణాలు, తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు జిల్లాలో జరగకూడదన్నారు. జిల్లా వైద్యాధికారి రజిత, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీఎన్జీ ఏర్పాటుపై సమీక్ష జిల్లాలో పీఎన్జీ (పైప్డ్ నాచురల్ గ్యాస్) కనెక్షన్ల ఏర్పాటుపై కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఐవోసీఎల్ అధికారి రాహుల్ సింగ్, పౌర సరఫరాల శాఖ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్యలు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పీఎన్జీ (పైప్డ్ నాచురల్ గ్యాస్) ద్వారా సరఫరా అవుతుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. త్వరలోనే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఎన్ జీ ద్వారా సరఫరా చేయనున్నామని అధికారులు వివరించారు. -
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సిరిసిల్ల నంబర్వన్
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు 40 శాతం పూర్తి చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా హౌజింగ్ పీడీ వెంకటమాధవరావు తెలిపారు. ఈమేరకు బుధవారం ఒక పత్రిక ప్రకటన విడుదలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.లబ్దిదారులకు ప్రజా ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోంది. ఇండ్లు పూర్తి చేసుకుంటున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఇప్పటిదాకా రూ. 161 కోట్లకుపైగా ఆర్థిక సహాయం జమ చేసి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలిచిందన్నారు. లబ్దిదారులు పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాల వేడుకలు చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు 3,570 స్లాబ్ లెవెల్లో ఉండగా, 1,419 (దాదాపు 40 శాతం) పూర్తి అయ్యాయని, ఇంకా 2,151 ఇళ్లు తుది దశలో ఉన్నాయని వివరించారు. పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంసిరిసిల్లటౌన్: పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీపీఐ ఆవిర్భావం నుంచి అలుపెరుగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. సీపీఐ మాస్ క్యాంపెయిన్లో భాగంగా బుధవారం సిరిసిల్లలో గడపగడప ప్రచారం చేపట్టారు. ప్రజానిధిని సేకరిస్తూ మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో సీపీఐ ముందుంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి నిధుల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఆర్డీవోగా ఉప్పుల శ్రీధర్సిరిసిల్ల అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో)గా ఉప్పుల శ్రీధర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ డీఆర్డీవోగా వ్యవహరిస్తున్న శ్రీధర్ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేయగా, సిరిసిల్ల డీఆర్డీవో గీతను కరీంనగర్కు బదిలీ చేశారు.‘కేసీఆర్ కప్’ను విజయవంతం చేయాలితంగళ్లపల్లి: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరి ట జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. బుధవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఈనెల 10నుంచి 17వరకు టోర్నమెంట్ నిర్వహించనున్న క్రీడామైదానాన్ని పరిశీలించారు. యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజాబింకర్ రాజన్న, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
సిరిసిల్ల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిలాకేంద్రంలోని సిక్కువాడలో మంగళవారం తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సరైనపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్షాపులు నిర్వహిస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసి 15 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డకోవడం, ప్రజలకు భద్రతాభావం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి రవాణాపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సాగుపనుల్లో ఉపయోగించుకోవాలి
వేములవాడఅర్బన్: రాజన్న కోడెలను సంరక్షించి, వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకోవాలని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేములవాడ మున్సిపల్ పరి ధి తిప్పాపూర్లోని రాజన్న గోశాలలోని 210 జతల కోడెలను మంగళవారం రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు తిప్పాపూర్ గోశాలలోని కోడెలను ఉచి తంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడెలను పక్కదారి పట్టించి, ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ అర్హులైన రైతులకు మాత్రమే కోడెలు పంపిణీ చేస్తున్నామన్నారు. దరఖాస్తులను వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు తనిఖీ చేసిన తర్వాతనే అర్హులకు కోడెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడెలను అధికారులు తనిఖీ చేస్తారని తెలిపారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గడ్డి, నీరు అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. -
మన ఆరోగ్యం మన చేతుల్లోనే
● జిల్లా వైద్యాధికారి రజితసిరిసిల్ల: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలన్నారు. నిత్యం వ్యాయాయం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. డిప్యూటీ డెమో రాజ్కుమార్, స్థానిక వైద్యాధికారి సాహితి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన అవసరం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మిషన్ వాత్సల్యలో భాగంగా మండలంలోని బద్దెనపల్లి జెడ్పీ హైస్కూల్లో మంగళవారం పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత మాట్లాడుతూ పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రులు, సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనాథలు, విడిచిపెట్టిన పిల్లలు కనిపిస్తే 1098కు సమాచారం అందించాలని కోరారు. చైల్డ్ హెల్ప్లైన్ ప్రతినిధి శ్యామల, ఎంఈవో, హెడ్మాస్టర్ భూక్యా రాజునాయక్ పాల్గొన్నారు. 9న మినీ జాబ్మేళా సిరిసిల్ల: కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కేంద్రంలో ఈనెల 9న మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ మంగళవారం తెలిపారు. టాంకాం, శ్రీని అగ్రిల్యాబ్, సమర్థనం దివ్యాంగు ల సంస్థలు మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నాయని వివరించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వేతనంతో ఉపాధి కల్పిస్తాయని తెలిపారు. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఉపాధి కల్పన ఆఫీస్కు గురువారం ఉదయం 11 గంటలకు రావాలని కోరారు. వివరాలకు 79891 80001, 63648 63213, 98853 46768లో సంప్రదించాలని సూచించారు. ‘ప్రజాబాట’తో విద్యుత్ సమస్యల పరిష్కారం తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాబాట నిర్వహిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సిరిసిల్ల డివిజన్ ఇంజినీర్ అంజయ్య తెలిపారు. మండలంలోని లక్ష్మీపూర్లో మంగళవారం విద్యుత్ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. అంజయ్య మాట్లాడుతూ ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు వంటి పనులు చేపడుతున్నట్లు వివరించారు. గ్రామంలో లో–వోల్టేజీ సమస్య ఉందని, అదనంగా రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఉపసర్పంచ్ చీమల పరుశురాం, ఏడీఈ గోపి, ఏఈ మధుకర్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలు, విద్యుత్ శాఖ ప్రతినిధులు కుశాల్, భూపతిరెడ్డి, రైతులు మల్లారెడ్డి, శంకర్, అజయ్, కరుణాకర్రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. మూల్యాంకన భత్యం చెల్లించాలిసిరిసిల్లటౌన్: పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ భత్యం, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీటీజేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సిరిసిల్లలోని మూల్కాంకన కేంద్రం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో మంగళవారం మెరుపు సమ్మె చేపట్టారు. 2025 మార్చిలో నిర్వహించిన ఎస్సెస్సీ స్పాట్ రెమ్యూనరేషన్, అక్టోబర్ 2024లో నిర్వహించిన కులగణన రెమ్యూనరేషన్ బిల్లులు ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎడ్ల కిషన్, బోయన్నగారి నారాయణ, గుండమనేని మహేందర్రావు, జంగిటి రాజు, అవురం సుధాకర్రెడ్డి, వంగ తిరుపతి, వికృతి అంజయ్య, రేవోజు సదానందం, మొగిలి లక్ష్మణ్ పాల్గొన్నారు. పట్టుపరిశ్రమ కేంద్రం సందర్శనగంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కోళ్లమద్దిలో గల పట్టుపరిశ్రమ కేంద్రాన్ని మంగళవారం పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. పట్టుపరిశ్రమ పరిధిలోని భూమిని, మల్బరీ సాగుకు అనువైన స్థలాన్ని గుర్తించారు. మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం తదితర అంశాలపై చర్చించారు. బెంగళూర్, మైసూర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మల్లికార్జున్, వినోద్యాదవ్, సెరీకల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ లత, ఏడీ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాకో ఆప్షన్ ప్లీజ్ !
సిరిసిల్లటౌన్: బల్దియాలో నెలకొన్న కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎంపికలో అధిష్ఠానం నిర్ణయంపై ఆశావహుల్లో విమర్శలున్నా కేటీఆర్పై ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నలుగురు పేర్లను పార్టీ పెద్దలు ప్రకటించగా కొందరు దానికి కట్టుబడి ఉండగా మరికొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకంతో నామినేషన్లు వేశారు. నాలుగు కోఆప్షన్ స్థానాలకు బీఆర్ఎస్ నుంచి 13 నామినేషన్లు రావడంతో రాజకీయ రసకందాయంపై కథనం. 4 పదవులు.. 13 నామినేషన్లు సిరిసిల్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకా నికి నామినేషన్ల దరఖాస్తుకు మంగళవారంతో గడు వు ముగిసింది. మున్సిపల్పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడంతో ఆ పార్టీకి చెందిన వారే కోఆప్షన్ సభ్యులుగా కౌన్సిల్ ఎన్నుకోనుంది. చాలా రోజు లుగా పదవులు ఆశిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, యువనాయకులు, సీనియర్ నాయకులు కేటీఆర్ తమకు కోఆప్షన్ అవకాశం ఇస్తారని నమ్మకంతో ఉంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 13 నామినేషన్లు దాఖలయ్యాయి. జనరల్ స్థానం నుంచి పోటీలో ఉన్న నంది శంకర్(2) నామినేషన్లు దాఖలు చేయగా మిగతా వారు కొండ అనూష, గుగ్గిళ్ల అంజయ్య, పాతూరి రాజిరెడ్డి, గడ్డం కళావతి ఒక్కో నామినేషన్ సమర్పించారు. మైనార్టీ నుంచి రెండు పదవులకు ఎం.డి.ఆస్మా, అంజద్ అలీ, సయ్యద్ తస్లీం, ఎం.డి. అఫ్రోజ్, షేక్ భాషు, షేక్ ముస్కాన్లు నామినేషన్లు వేసినట్లు కమిషనర్ ఖదీర్పాషా తెలిపారు. కేటీఆర్పై గంపెడాశలు గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంలో 39 వార్డుల్లో 27 మంది పార్టీ అభ్యర్థులు గెలిచారు. చైర్పర్సన్గా జిందం కళ, వైస్చైర్మన్గా దార్ల సందీప్లను కేటీఆర్ నియమించారు. ఇక మిగిలింది మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రమే. కోఆప్షన్ నోటిఫికేషన్ రావడంతో మాజీ ప్రజాప్రతినిధులు, తాజా నేతలు ఆయా పదవులపై కన్నేశారు. కాగా ఇటీవలే పార్టీ పెద్దలు కోఆప్షన్ సభ్యులుగా మాజీ కౌన్సిలర్లు కొండ అనూష, సయ్యద్ తస్లీం, నంది శంకర్, యువ నాయకుడు సయ్యద్ సోహైల్ పేర్లను ప్రకటించారు. దీంతో ఇన్నిరోజులు ఆశగా ఉన్న నేతల్లో నిరాశ పేరుకుపోయింది. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ త్వరలోనే వస్తే.. కోఆప్షన్ సభ్యుల పేర్ల జాబితా మార్చుతారన్న ఆశతో మరికొందరు ఎదురుచూస్తున్నారు. ఆ నలుగురి ప్రకటన ఇలా.. పార్టీకి విధేయులుగా ఉంటుండడంతోనే కొండ అనూష, సయ్యద్ తస్లీం, నంది శంకర్, సయ్యద్ సోహైల్ పేర్లను ప్రతిపాదించనట్లు తెలిసింది. కొండ అనూష, నంది శంకర్ కౌన్సిలర్గా పనిచేసి పార్టీ నిర్ణయం మేరకు తదుపరి ఎన్నికల్లో ఇతరులకు అవకాశం ఇచ్చారు. సయ్యద్ తస్లీం మైనార్టీ ఓట్లు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. సోహైల్ పార్టీకి మొదటి నుంచి యువనాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి సాధిఖ్ సైతం గతంలో కోఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ‘నేను దశాబ్దకాలంగా పార్టీకి విధేయంగా పనిచేస్తున్న. ఎన్నిక ఏదైనా పార్టీ గెలుపులో భాగస్వామ్యమవుతున్న. అయినా నాకు గుర్తింపు రాలేదు. పార్టీ నుంచి నా పేరు ప్రకటన రాకపోవడం బాధగా ఉంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి నామినేషన్ వేయలేదు. మీ నిర్ణయం మీదే ఉంది. ఇది ఓ సీనియర్ మైనార్టీ నేత ఆవేదన.’‘అన్నా.. నేను రెండు సార్లు కౌన్సిలర్గా చేసిన. మూడోసారి టికెట్ వద్దంటే మీ మాటపై ఊరుకున్న. మా సేవలు గుర్తిస్తామన్నారు. నలుగురు ముందు మాటిచ్చారు. కోఆప్షన్ పదవి నాకు ఇస్తారనుకున్నాం. పార్టీ నుంచి అనధికారికంగా వచ్చిన ప్రకటనలో నా పేరు లేదు.’ ఇది పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆవేదన.’ -
రైతుల ప్రయోజనాలకు పెద్దపీట
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రుద్రంగి(వేములవాడ): ప్రజా ప్రభుత్వంలో రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్నలకు క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రుద్రంగి సబ్స్టేషన్లో ఇటీవల ఒక బ్రేకర్ అమర్చినట్లు తెలిపారు. తహసీల్దార్ పుష్పలత, ఎస్సై మోతీరాంనాయక్, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాశ్, డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేం ఎవరికీ ఫోన్లు చేయం
డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరినా మేం ఎవ్వరికీ ఫోన్లు చేయం. ఎప్పుడైనా తనిఖీల్లో పట్టుబడితే జరిమానాలు విధిస్తాం. గడువు తీరిన లైసెన్స్లతో వస్తే నిబంధనల మేరకు జరిమానాలు విధించి లైసెన్స్లే కాని, ఇతర ఏ పత్రాల గడువు తీరినా మేం జరిమానాలు విధిస్తాం. ఆర్టీవో ఆఫీస్ నుంచి ఎవరికీ ఫోన్లు వెళ్లవు. ఈ విషయంలో ఎవరైనా మా శాఖ పేరు చెప్పి మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. యూపీఏ చెల్లింపులు కాబట్టి మోసగాళ్ల ఆటను సులభంగా కట్టడి చేయవచ్చు. – వి.లక్ష్మణ్, జిల్లా రవాణాశాఖ అధికారి -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీఎంలు, ఐకేపీ కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, బుక్ కీపర్లకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,389, కామన్ రకానికి క్వింటాలుకు రూ.2,369గా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. జిల్లాలో ఈ సీజన్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేయనున్న 136 కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు వేయించాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. తూకం వేసే యంత్రాలు, తేమ శాతం చూపే యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీబ్యాగ్స్ సరిపడా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఏఈవో ధ్రువీకరించిన తరువాత ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యం పంపించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో మచ్చ గీత, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు, పౌర సరఫరాలశాఖ డీఎం నర్సింహారెడ్డి, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తదితరులు పాల్గొన్నారు. -
నేతన్నల క్షీరాభిషేకం
సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సిరిసిల్ల నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, బూట్ల నవీన్ మాట్లాడారు. పవర్లూమ్ పరిశ్రమకు కొనసాగుతున్న కేటగిరీ–3 మీటర్లను తొలగించి కేటగిరీ–4 అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, గోవిందు రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నా
ఆరు నెలల క్రితమే ఉద్యోగ విరమణ చేశాను. గ్రాట్యుటీ, ఈఎల్స్, జీపీఎఫ్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నాను. ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ముప్పై ఏళ్లకు పైగా ఉపాధ్యాయునిగా పనిచేశాను. గౌరవంగా రావాల్సిన బకాయిలు సకాలంలో రాకపోవడంతో ఉద్యోగ విరమణ చేసిన నాలాంటి వారు ఆవేదనకు గురవుతున్నారు. – నందెల్లి రఘు, విశ్రాంత ఉపాధ్యాయుడు, ముస్తాబాద్జీవితకాలం ప్రజాసేవలో అంకితమై పనిచేసిన ఉద్యోగులకు, రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రెండేళ్లుగా రిటైర్డ్ అయిన 500 మందికి ఒక్క రూపాయి రాలేదు. అందుకే సంఘంగా ఏర్పడి, ఉద్యోగుల హక్కు అయిన బకాయిలు సాధించేందుకు పోరాటం చేస్తున్నాం. మానవతా దృక్పథంతో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.– మల్లారపు పురుషోత్తం, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఘనంగా పునఃప్రతిష్టాపన
గంభీరావుపేట: గజసింగవరంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వరస్వామి పునర్ ప్రతిష్టానోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కొండూరి రవీందర్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, సెస్ వైస్చైర్మన్ దార్ల సందీప్, కొమిరిశెట్టి లక్ష్మణ్, లక్ష్మణ్రావు, సర్పంచ్ విమల హాజరయ్యా రు. మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పూజలు చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక సిరిసిల్ల అర్బన్: రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నుంచి 25 మంది విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అండర్–20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్కు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు ఈనెల 11, 12 తేదీల్లో హన్మకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, అశోక్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
నివేదిక ఇవ్వరు.. నిజాలు చెప్పరు !
సిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్బన్బ్యాంక్లో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన ఆరు క్లర్క్ పోస్టుల్లో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు వచ్చిన కథనాలపై స్పందించిన అధికారులు నివేదిక ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. తొలుత మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా నివేదిక ఆలస్యమైందని చెప్పినా అధికారులు ఏప్రిల్ మొదటి వారం గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. పాలకవర్గంలోని కీలక నేతలే భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వెలుగుచూసింది. ఆరు క్లర్క్ పోస్టులకు మొత్తంగా రూ.24లక్షల వరకు వసూలు చేసినట్లు ‘సాక్షి’లో మార్చి 26న కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా సహకార అధికారి స్పందిస్తూ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సదరు బ్యాంకు అధికారులను ఆదేశించారు. మరోవైపు అక్రమ నియామకాలపై నిగ్గు తేల్చేందుకు సహకారశాఖకు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాములును నియమించారు. రాములు అర్బన్ బ్యాంకును సందర్శించి ఆరా తీశారు. పెండింగ్లోనే ఆ రెండు పోస్టులు సహకార అర్బన్ బ్యాంకులో రెండు మేనేజర్ పోస్టులు, ఆరు క్లర్క్ పోస్టుల భర్తీకి 2025 అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేశారు. మేనేజర్ పోస్టులకు నలుగురు, క్లర్క్ పోస్టులకు 63 మంది దరఖాస్తు చేశారు. ఆరు నెలల తర్వాత నియామకాలు చేపట్టారు. ఆరుగురు క్లర్క్లను నియమించి, మేనేజర్ పోస్టులను పెండింగ్లో పెట్టారు. మరో దఫా.. ఆ రెండు పోస్టులను భర్తీ చేయాలని, దానికి వేరే‘లెక్క’ వసూలు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆరుగురు నియామకంలో బ్యాంకు అభివృద్ధిని కాంక్షించకుండా.. పైరవీలతో పైసలు తీసుకుని భర్తీ చేయడం చర్చనీయాంశమైంది. పర్మినెంట్ అవుతాయనే ఆశతో.. అర్బన్ బ్యాంకులో ఉద్యోగమంటే స్థానికంగానే అందుబాటులో ఉంటూ.. హాయిగా చేసుకోవచ్చనే నమ్మకంతోనే ఆరుగురు అభ్యర్థులు పాలకవర్గంలోని ఓ కీలక నేత చుట్టూ తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగాలు సాధించారు. ఆ ఉద్యోగం రూ.15వేలు జీతమే ఉండగా భవిష్యత్లో పర్మినెంట్ అవుతుందనే ఆశతోనే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఉద్యోగాలు సాధించిన నవీన్, శివచరణ్, గీత, అనామిక, స్వేత, మజీరొద్దీన్లో మేం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు సాగలేదని పేర్కొంటూ వ్యక్తిగతంగా పత్రాలు రాయించుకున్నట్లు సమాచారం. ముడుపుల పంపకాల్లో విబేధాలు అర్బన్బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలకు పాల్ప డ్డారు. ఆరుగురు అభ్యర్థులను పాలకవర్గంలోని కీలక డైరెక్టర్లు ప్రతిపాదించారు. ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లుగా సదరు డైరెక్టర్లు ప్రకటించి రూ.18 లక్షలను పాలకవర్గంలోని అందరికీ పంపకాలు చేపట్టారు. కానీ తెరచాటుగా మరో రూ.6లక్షలు వసూలైనట్లు తెలిసి విభేదాలు పొడచూపడంతో ఈ వసూళ్లపర్వం వెలుగులోకి వచ్చింది. -
విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థల పరిశీలన
సిరిసిల్ల/చందుర్తి(వేములవాడ): జిల్లాలో కొత్తగా మూడు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్, చందుర్తి మండలం లింగంపేట, ఎన్గల్ గ్రామాల్లోనూ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థలాలను ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ప్రాజెక్ట్స్) వి.మోహన్రావు సోమవారం పరిశీలించారు. మోహన్రావు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సబ్స్టేషన్ ఏర్పాటుతో లో వోల్టేజీ సమస్యలు తగ్గి, సరఫరా వ్యవస్థ బలపడుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు భూమి అనుకూలంగా ఉందా? లేదా ? భూసార పరీక్షలు చేయించాలని పరిశీలించారు. సిరిసిల్ల సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీరు(ఆపరేషన్స్) బి.భిక్షపతి, డీఈఈ అంజయ్య ఉన్నారు. -
ఇలా తవ్వారు.. అలా వదిలేశారు !
సిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ వద్ద తాగునీటి పైపులైన్ లీకేజీ ఏర్పడడంతో మరమ్మతుల కోసం అధికారులు నెల రోజుల క్రితం తవ్వారు. అక్కడ ప్రమాద హెచ్చరికబోర్డులు పెట్టి ఇలా వదిలేశారు. సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళ వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉండగా పట్టణ ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీరు లీకేజీ అవుతుండడంతో అందులో పిల్లలు దిగి ఆటలాడుతూ కలుషితం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు విజయవంతం చేయాలి
ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలిసిరిసిల్ల ఎడ్యుకేషన్/సిరిసిల్ల టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణిని పీఆర్టీయూ ప్ర తినిధులు కోరారు. చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి దంపతులను సన్మానించారు. యూని యన్ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు దుబ్బాక ప్రభాక ర్, గుర్రం మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, జక్కని నవీ న్, గడ్డం శంకర్, యేముల ప్రతాప్, భగవాన్, జయరామ్, షఫీ, చంద్రశేఖర్, సాంబారెడ్డి, కూతురి కరుణాకర్రెడ్డి, శ్రీనివాస్ వెంగళ మ హేశ్, సత్యనారాయణ, ఆనంద్, పూర్ణచందర్, చిన్నభూమయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు. తగ్గిన సమ్మక్క ఆదాయం వేములవాడఅర్బన్: రెండేళ్లకోసారి జరిగే సమ్మ క్క జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆదాయం ఈసారి రూ.3కోట్లు తగ్గింది. 2019–20లో రూ.85కోట్లు, 2021–22లో రూ.87కోట్లు, 2023–24లో రూ.11కోట్లు, 2025–26లో రూ.116కోట్లు సమకూరింది. 2025–26లో హుండీ ద్వారా రూ.28కోట్లు, కో డెమొక్కుల ద్వారా రూ.21కోట్లు, వడ్డీలు రూ.20కోట్లు, ప్రసాద విక్రయాలు రూ.20 కోట్లు, లీజులు లైసెన్సులు రూ.15కోట్లు, కల్యాణం రూ.3కోట్లు, బ్రేక్ దర్శనం శీఘ్ర ద ర్శనం రూ.3కోట్లు, ధర్మశాలల అద్దె రూ.3 కోట్లు, కేశఖండనం రూ.2కోట్లు, బద్దిపోచమ్మ ఆలయం రూ.కోటితో కలిసి రూ.116కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు. -
కల్తీ ఆహారంపై ఉక్కుపాదం
సిరిసిల్లటౌన్: కల్తీఆహారంపై ఉక్కుపాదం మోపుతామని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ హెచ్చరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆహార భద్రత చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలు కల్తీ ఆహారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకుంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. డీఎంహెచ్వో రజిత మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. జిల్లా ఆహార భద్రత అధికారి అనూష మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల అథారిటీ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఐ)నిర్వహించే ఆహార భద్రత ప్రమాణాల గురించి వివరించారు. జిల్లా వెల్ఫేర్ అధికారి లక్ష్మీరాజం, ఆశాలు, అంగనవాడీ టీచర్లు పాల్గొన్నారు. -
‘విరమణ’కు విలువేది..
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ ఉద్యోగం చేసినన్ని రోజులు ఓ భరోసా. రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెల పింఛన్ వస్తుందనే ధీమా. అంతేకాకుండా రిటైర్మెంట్ సమయంలో వచ్చే బెనిఫిట్స్తో చక్కటి ఇల్లు కొనుక్కోవాలని కొందరు.. పిల్లలకు డబ్బులు ఇవ్వాలని మరికొందరు కలలు కంటారు. కానీ రెండేళ్లుగా ఉద్యోగ విరమణ తర్వాత బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. తమ జీవితకాలంలో ముప్పై నుంచి నలభై ఏళ్లు సేవ చేసి.. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత గ్రాట్యుటీ, పీఎఫ్, టీఎస్జీఎల్ఐ, జీఎఫ్, ఫైనల్ ఈఎల్స్, ఫైనల్ పేమెంట్ అందక ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి ప్రభుత్వం రూ.50 లక్షల నుంచి రూ.80లక్షల వరకు బకాయి పడింది. ఇలా జిల్లాలో 500 మంది వరకు విశ్రాంత ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. శాపంగా విరమణ పొడగింపు ప్రభుత్వం ఉద్యోగికి 58 ఏళ్లు నిండగానే విరమణ ఇస్తుంది. దానిని 61 ఏళ్లకు పెంచింది. దీంతో మూడేళ్లపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వారు 61 ఏళ్లు పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందడంతో బకాయిల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024 మార్చి నుంచి ఫిబ్రవరి 2026 వరకు దాదాపు 500 మంది అధికారులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో ఎవరికీ కూడా బకాయిలు రాక ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. విశ్రాంత ఉద్యోగుల రందీ రెండేళ్లుగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. జీవితాంతం కష్టపడిన దానికి విరమణ తర్వాత వచ్చే బకాయిలపైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కొందరు ఉద్యోగులు ఇంటిని నిర్మించుకోవాలని, మరికొందరు ఆరోగ్యం బాగు చేయించుకోవాలని ఎదురుచూస్తున్నారు. గ్రాట్యుటీ డబ్బులతో కూతురు పెళ్లి చేయాలనుకున్న ఓ స్కూల్ అసిస్టెంట్ ఇంటా పెళ్లి ఆగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఓ జూనియర్ అసిస్టెంట్ మెరుగైన వైద్యం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కోర్టు గడప తడితేనే బకాయిలా ! జిల్లాలో విశ్రాంత ఉద్యోగులలో కొందరు బకాయిల కోసం కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల హక్కు అయిన బకాయిలను భేషరతుగా చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశించడంతో జిల్లాలో 30 మంది వరకు బకాయిలు పొందారు. మరో 50 మంది కోర్టుకు ఇటీవల వెళ్లారు. కోర్టులు ఆదేశించిన బకాయిలు రాని వారు మరోసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేయడంతో మరో 10 మందికి బకాయిలు అందాయి. విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు జిల్లాలో ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరు ప్రస్తుతం అధికారులు, కోర్టుల వద్దకు వెళ్తూ బకాయిల సాధనలో మునిగిపోయారు. -
ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 253 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలన్నారు. తంగళ్లపల్లిలోని ఇంటి నంబర్ 9–74పై లోక్ అదాలత్ డిక్రీ అమలు చేసి నా పేరిట మ్యూటేషన్ చేయాలని ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను అమలు చేయకుండా ఆలస్యం చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా సదరు అధికారులపై విచారణ చేపట్టి, నాకు న్యాయం చేయండి. – వీర్ల అలియాస్ కూడ లక్ష్మి, సిరిసిల్ల వేములవాడ మండలం కొడుముంజ ఆర్అండ్ఆర్ కాలనీలోని 15 గుంటల ప్రభుత్వ భూమిని గ్రామపంచాయతీ తీర్మానంతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలి. – కొడుముంజ గ్రామస్తులు మాది సిరిసిల్ల పరిధిలోని ఒకటో వార్డు రగుడు. మా ఊరిలో రబీ, ఖరీఫ్ సీజన్లలో 700 నుంచి 900 క్వింటాళ్ల వరకు వడ్లు పండిస్తున్నాము. వడ్లు ఆరబెట్టడానికి ఇబ్బందిగా ఉంది. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం మూడెకరాలు కేటాయించాలి. – రగుడు అభివృద్ధి కమిటీ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలి. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలు సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. – పెద్దూరు, డబుల్ బెడ్రూమ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు -
అభివృద్ధే ధ్యేయం
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిషత్లో సోమవారం 140 మందికి రూ.38,08,500 విలువైన సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కిష్టారావుపల్లి జీపీ నూతన భవన ప్రారంభోత్సవం, పత్తికుంటపల్లిలోని ఫంక్షన్హాలు పనులను ప్రారంభించారు. ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐరెడ్డి చైతన్య, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీపీలు వి.వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కె.భాస్కర్రెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ పాశం రాజేందర్రెడ్డి, సర్పంచులు జక్కుల మల్లవ్వ తిరుపతి, మామిడి రాజు, అరుకాల నవీన్కుమార్, నేరెళ్ల విజయ్గౌడ్, అనంతగిరి టెంపుల్ చైర్మన్ కోలాపురి అంతగిరి, ఏఎంసీ వైస్చైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతీ కార్యకర్త కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. బీజేపీ 47వ స్థాపన దివస్ సందర్భంగా సోమవారం జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. గోపి మాట్లాడుతూ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీని మరింత బలపర్చడానికి కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: ఇబ్బందులు పడుతున్న వస్త్రోత్పత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతపై సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో సోమవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. తమ విద్యుత్ కనెక్షన్లు మూడో కేటగిరీలో ఉండడంతో ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన విద్యుత్ రాాయితీ అందడం లేదన్న విషయాన్ని ఈనెల 2న ఎన్పీడీసీఎల్ సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ వస్త్రోత్పత్తిదారుల విద్యుత్ మీటర్లకు నాలుగో కేటగిరీకి మార్చి సమస్యను పరిష్కరించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంకాలపు రవి, కళ్యాణపు సుభాష్, దూడం శంకర్, గోవిందు రవి, దూస భూమయ్య, బొద్దుల సుదర్శన్, మండల సత్యం తదితరులు పాల్గొన్నారు. భీమన్న సేవలో ఎస్పీవేములవాడఅర్బన్/సిరిసిల్లక్రైం: భీమేశ్వరస్వామివారిని ఎస్పీ మహేశ్ బీ గీతే సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజు ఉన్నారు. నిర్భయంగా ఫిర్యాదు చేయాలి మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీటీమ్ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. మార్చిలో మూడు ఎఫ్ఐఆర్లు, నాలుగు పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వేధింపులు ఎదురైతే వెంటనే 87126 56425లో సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
పోలీసులమని చెప్పి కారులో తరలింపు
సిరిసిల్లక్రైం: వేములవాడలో వృద్ధ దంపతులను పోలీసులమని చెప్పి సోమవారం కారులో తీసుకెళ్లిన సంఘటన సంచలనం రేపింది. బాధితులు వేములవాడకు చెందిన దోర్నాల రమేశ్, యశోద దంపతులు తెలిపిన వివరాలు. సోమవారం ఉదయం ఇంట్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు తాము సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ ఠాణా పోలీసులమని చెప్పి.. వెంటనే తీసుకెళ్లాల్సి ఉందని బెదిరింపులకు పాల్పడ్డారు. టిఫిన్ తింటామన్న ఒప్పుకోకుండా నంబర్ప్లేట్ లేని కారులో తీసుకెళ్లారు. చిన్నకోడూర్కు తీసుకెళ్తున్నామని చెప్పి సిద్దిపేట ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ‘రెడ్డి’ అనే అధికారి పేరుతో ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ కొడుకు వివాహ విషయంలో కొంత వివాదం ఉంది. కొడుకు, కోడలు ఏడాదిన్నరగా వేర్వేరుగా ఉంటున్నారు. వారి వివాహ సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వాలని లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. అయితే వేములవాడలోని ఇంట్లో కొన్ని, బ్యాంకులో కొన్ని ఆభరణాలు ఉన్నాయని చెప్పగా.. వెంటనే ముట్టజెప్పాలని సదరు వ్యక్తులు హుకూం జారీ చేశారు. అక్కడి నుంచి ఏపీ 36 ఏడబ్ల్యూ 1380 అనే వాహనంలో వేములవాడకు తీసుకొచ్చారు. ఇంట్లో, బ్యాంకులో ఉన్న బంగారం తీసుకురావాలని ఒత్తిడి చేశారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. ఇంట్లోకి వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నామని భోజనం చేస్తామన్నాం. అదే సమయంలో బంధువులు, స్థానిక వార్డు కౌన్సిలర్ బాలకృష్ణరాజుకు సమాచారం ఇచ్చాం. వారు సకాలంలో వచ్చి పోలీసులం అని బెదిరింపులకు దిగిన వ్యక్తులను నిలదీశారు. అదే సమయంలో చిన్నకోడూర్ ఎస్సై నంబర్ నుంచి రమేశ్కు ఫోన్ రావడంతో అక్కడే ఉన్న లాయర్ గెంట్యాల భూమేశ్ జోక్యం చేసుకోవడంతో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు అదే కారులో వెనుదిరిగారు. జరిగిన ఘటనపై రక్షణ కల్పించాలని కోరుతూ బాధితుడు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులమని చెప్పి ప్రైవేట్ వాహనాల్లో తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అల్లాడిపోతున్న మూగజీవాలు
● వన్యప్రాణుల దాహార్తి తీరేదెలా? ● ఖాళీగానే సాసర్ పిట్లు ● కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం కోనరావుపేట(వేములవాడ): ఎండలు మండిపోతున్నాయి. అటవిలోని నీటివనరులు చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. అడవి జంతువులకు నీళ్లు దొరక్క అల్లాడిపోతున్నాయి. వన్యప్రాణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటవీజంతువుల దాహం తీర్చేందుకు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో అడవిలో సాసర్ పిట్సు ఏర్పాటు చేశారు. ఏటా వేసవికి ముందే వీటిని శుభ్రం చేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని నింపాల్సి ఉంటుంది. కానీ ఈ వేసవిలో పిట్స్ చెత్తాచెదారంతో నిండిపోయాయి. వృథాగా 40 సాసర్ పిట్స్ అటవీ లోతట్టు ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోవడంతో దాహార్తిని తీర్చుకునేందుకు జింకలు, కోతులు, నెమళ్లు, అడవిపందులతోపాటు ఇతర వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కోనరావుపేట మండల కేంద్రంతోపాటు మరిమడ్ల, శివంగాలపల్లి, ఏగ్లాస్పూర్, నిజామాబాద్, వట్టిమల్ల, కంచర్ల, అడవిపదిర, పోతిరెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుమారు 40 సాసర్ పిట్స్ నీరు లేక బోసిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన ఉన్న అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
అకాల వర్షం... అపార నష్టం
కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడ్డ వడగండ్ల వాన రైతులకు కడగండ్లే మిగిల్చాయి. పొట్టదశలో ఉన్న వరిపై వడగండ్లు కుప్పలుగా కురవడంతో పంట పాడైంది. పచ్చనిపైరు నేలవాలింది. కోతకు వచ్చిన వరి రాలిపోయింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో దాదాపు 200 ఎకరాల్లోని పంట దాదాపు 90 శాతం రాలిపోయింది. వీర్నపల్లిలో భారీ నష్టం వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వీర్నపల్లి మండలం శాంతినగర్, అడవిపదిర, లాల్సింగ్తండా, వన్పల్లి, గర్జనపల్లి, సీతారాంనాయక్తండా, ఎర్రగడ్డతండాల్లో వడగండ్ల వానకు వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. మండల కేంద్రంలో గాలుల తీవ్రతకు గోడలు కూలి వాహనాలపై పడ్డాయి. బండి శ్రీహరికి చెందిన ఆటో, మైపాల్కు చెందిన కారు ధ్వంసమయ్యాయి. వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, ఉప సర్పంచ్ జక్కుల నరేశ్ ఇతర గ్రామాల సర్పంచులతో కలిసి జేసీబీ సాయంతో రోడ్లపై పడిన చెట్లను తొలగింపజేశారు. పంటలు పరిశీలించిన అధికారులు వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను వీర్నపల్లి ఏఈవో ఫజిలుద్దీన్, గర్జనపల్లి ఏఈవో రమణారావు పరిశీలించారు. గర్జనపల్లి, ఎర్రగడ్డతండా, రంగంపేట, శాంతినగర్, లాల్సింగ్తండాల్లో వివరాలు సేకరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం మండలంలో 350 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవాలి మరిమడ్లలో వడగండ్ల వానతో నష్టోపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి కడారి రాములు కోరారు. పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. సగ్గుపట్ల దేవయ్య, పడగొల్ల మల్లేశం, భీమాశంకర్, భగవాన్రెడ్డి, డప్పుల అశోక్, డప్పుల రాజయ్య, డప్పుల అనిల్ ఉన్నారు. రైతులను ఆదుకుంటాం అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని విప్ ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ వరలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్పాషా, మాజీ జెడ్పీటీసీ బండ నర్సయ్య, నాయకులు కర్రోళ్ల భాస్కర్, మల్లేశం ఉన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి వేములవాడ: నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణ శివారు చెక్కపల్లిరోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్, 132/33 కేవీ సబ్స్టేషన్లను ఆదివారం తనిఖీ చేశారు. వరుణ్రెడ్డి మాట్లాడుతూ గత ఐదు రోజుల్లోనే జిల్లాలో 250 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గతంలో సెస్ ద్వారా 1400 కనెక్షన్లు మాత్రమే ఇవ్వగా మరో 2500 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సిరిసిల్ల మగ్గాల కార్మికుల విద్యుత్ బిల్లుల సమస్య పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేటగిరీ–3 కింద బిల్లింగ్ అవుతున్న వాటిని 4ఏ కిందకు మారుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీపొలంబాట్ఙ నిర్వహిస్తున్నామన్నారు. అగ్రహారం ఫీడర్లో ఫాల్ట్ పాసింగ్ ఇండికేటర్లను సీఎండీ పరిశీలించారు. వేములవాడ సబ్డివిజన్ కార్యాలయాన్ని సందర్శించి వినియోగదారులకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పేపర్లెస్ లావాదేవీల కోసం సిరిసిల్ల సర్కిల్లో సాప్(ఎస్ఏపీ) అప్లికేషన్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. -
కొలువులమ్మా.. కొలువులు!
శాతవాహన గాథలు–3సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అర్బన్ నక్సలైట్లు, విద్యార్థుల ఆందోళనలు, దళితులపై వివక్ష తదితర వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న శాతవాహన యూనివర్సిటీలో మరో దుమారం చెలరేగుతోంది. యూనివర్సిటీలో అంతా తానై షాడో వీసీలా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ నియామకాల్లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోస్టుకు ఇంత రేటు అంటూ ఫిక్స్ చేసి మరీ నియామకాల్లో అంతా తానై వ్యవహరిస్తున్నాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు, దళితులపై వివక్ష అన్న ఆరోపణలపై యూనివర్సిటీ మొత్తం రాజకీయ రణంగంగా మారింది. ప్రొఫెసర్ సుజాత వైపు కొందరు.. వీసీ ఉమేశ్ వైపు మరికొందరు చేరి ఎవరికి వారు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. సంతోషంగా విక్రయం.. అతను రాజకీయ పలుకుబడితో వర్సిటీలో చేరా డు. ఒక రకంగా అతనే షాడో వీసీ అన్న పేరుంది. అందుకే శాతవాహన యూనివర్సిటీలో ఎంత సీని యర్ ప్రొఫెసర్ అయినా సరే అతని జోలికి వెళ్లరు. అతను ఏం చెప్పినా.. స్థాయి మరిచి తూ.చా తప్పకుండా పాటిస్తారు. చిన్నస్థాయి ఉద్యోగుల విష యం చెప్పనక్కర్లేదు. పొరపాటున అతనికి వ్యతిరేకంగా స్వరం పెంచితే ఇక అంతే.. మరో విభాగాని కి బదిలీ చేసి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. అతని వ్యవహారం, పలుకుబడి తెలిశాక.. అతనితో అంతా అనివార్యంగా సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. అలాంటి వ్యక్తి కొంతకాలంగా ఔట్సోర్సింగ్ కొలువుల భర్తీని సొమ్ము చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఇవేమీ పర్మినెంట్ పోస్టులు కావు. కాకపోతే నెల తిరిగే నాటికి జీతం ఠంఛన్గా వస్తుందన్న భరోసా ఉంది. అందుకే ఈ పోస్టులకు ఉన్న డిమాండ్తో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు తీసుకుని కొలువులు పెట్టిస్తున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 15కుపైగా పోస్టులు ఇలా తన పరపతితో సంతోషంగా అమ్ముకున్నాడన్న విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసింది. అయినా కీలక పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఉంచడంతో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీలక పోస్టుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ మరోవైపు తనపై వ్యక్తిగత కక్షలతో అర్బన్ నక్సల్ అంటూ వేధించడం, వరుసగా పదవుల నుంచి తప్పించడంపై కలత చెందిన సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఇటీవల ఎస్సీ కమిషన్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదివారం వరకు వరుస సెలవుల నేపథ్యంలో ఈ విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం నుంచి ఈ ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ విచారణ జరిపి, చర్యలు చేపట్టనుంది. తొలుత కరీంనగర్ కలెక్టర్, సీపీకి నోటీసులు జారీ చేయనున్నామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పీఏ శ్రీధర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే ఈ వారంలో ఎస్సీ కమిషన్ సభ్యులు యూనివర్సిటీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. -
జగ్జీవన్రామ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం
సిరిసిల్ల అర్బన్: దేశ మాజీ ఉప ప్రధాని, దివంగత బాబు జగ్జీవన్రామ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జగ్జీవన్రామ్ జయంతి ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్రామ్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. జగ్జీవన్రామ్ కూతురు మీరాకుమారి లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బాబు జగ్జీవన్రామ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న పాల్గొన్నారు. -
గోదావరి జలం.. జీవాలకు తీరిన దాహం
లింగంకుంటలోకి వస్తున్న గోదావరి జలాలతో దాహం తీర్చుకుంటున్న మూగజీవాలు ముస్తాబాద్(సిరిసిల్ల): మండుతున్న ఎండలతో మనుషులే ఇబ్బంది పడుతుండగా.. ఊరికి దూరంగా ఉండే మూగజీవాల సంగతి సరేసరి. తడారుతున్న గొంతులకు ఇప్పుడు గోదావరి జలాలు వరంగా మారాయి. ముస్తాబాద్ మండలం లింగంకుంట, పెద్దచెరువుల్లోకి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి. దీంతో ఇటు పంట పొలాలకే కాకుండా మూగజీవాల దాహార్తిని తీర్చుతున్నాయి. -
అన్ని సేవలు ఆన్లైన్లోనే..
● విద్యుత్ సేవలకు ‘మీసేవ’ల్లో దరఖాస్తు ● అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ 1912 ● సమస్యలపై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్ 79016 28348 ● ‘సాక్షి’తో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.భిక్షపతిసిరిసిల్ల: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మీసేవ ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుందని ఎన్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) బి.భిక్షపతి తెలిపారు. గ్రామాల్లో ఉండే కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 56 ఏళ్లుగా సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సేవలు అందిస్తున్న ‘సెస్’ సంస్థ లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడంతో ఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సేవలను అందిస్తోందని వివరించారు. ఎన్పీడీసీఎల్లో అమలవుతున్న అన్ని ఆధునిక విధానాలు రాజన్నసిరిసిల్ల జిల్లా సర్కిల్లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సిరిసిల్ల సర్కిల్లో కొత్తగా అమలవుతున్న విద్యుత్ విధానాలపై ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఎస్యూ వీసీ ఉమేశ్ కుమార్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగాల నియామకం, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కొలువుల ఆశ చూపించి పేదల వద్ద రూ.లక్షలు వసూలు చేయడం హేయం. ఆయన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఫుల్ టైం ఈసీ లేకుండా ప్రొఫెసర్లను నియమించడంపైనా విచారణ జరిపించాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అవన్నీ నిరాధార ఆరోపణలు శాతవాహన వర్సిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. నేను వచ్చాక వర్సిటీలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. లా, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. క్యాంపస్లో ఔట్సోర్సింగ్ పోస్టులు అమ్ముకుంటున్నారన్నది కేవలం నిరాధార ఆరోపణలు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదు. – ఉమేశ్కుమార్, వైస్ చాన్స్లర్ -
రాజన్న ఆలయానికి విరాళాలు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు తమ వంతు సహకారం అందజేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన జొన్నగాని రాజేశ్గౌడ్–సరిత దంపతులు ఆలయ అభివృద్ధి నిధికి రూ.లక్ష విరాళం అందజేశారు. అలాగే సిద్దిపేటకు చెందిన భక్తుడు ఆకుల నితేందర్ కుటుంబ సభ్యులు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏఈవో శ్రావణ్, పర్యవేక్షకులు వెంకటప్రసాద్, అకౌంట్ అడ్వయిజర్ ఆగమరావు, జూనియర్ అసిస్టెంట్ మమత ఉన్నారు. -
సామాన్యుడి సొంతింటి కల సాకారం
● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల అర్బన్: సామాన్యుడి సొంతింటి కల సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్నగర్లో ఆదివారం నిర్వహించిన ఎండీ మున్నీబేగం, రెహానా, నూర్జహాన్ బేగం ఇందిరమ్మ గృహప్రవేశాలకు హాజరయ్యారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, కౌన్సిలర్ లాయక్ సుల్తానా తాజ్, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, దేవదాస్, తాజ్, రఫీక్ పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: పెరెంట్స్ పే రెంటల్ చట్టం–2026లోని లోపాలను ప్రభుత్వం సవరించాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య కోరారు. సిరిసిల్లలోని వయోవృద్ధుల కేర్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కోడం నారాయణ, దేవదాస్, ఎల్లయ్య, జనపాల శంకరయ్య పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: జిల్లాలో రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిరిసిల్ల సూపరింటెండెంట్ ఇంజినీర్ బి.భిక్షపతి తెలిపారు. కేవలం ఐదు రోజుల్లోనే సుమారు 240 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 14,00 సర్వీసులు మాత్రమే మంజూరయ్యాయని, జూన్ నాటికి 2,160 పెండింగ్లో ఉన్న అన్ని సర్వీసులను మంజూరు చేస్తానమన్నారు. బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం ఎల్ఎండీకి 2,000, కుడి కాలువకు 450, ఎడమ కాలువకు 5, మిషన్భగీరథకు 45 క్యూసెక్కుల మేర నీరు తరలుతోంది. -
లీగల్ నోటీసులు పంపుతున్నాం
కొందరు పనిగట్టుకుని వర్సిటీలో దళిత సిబ్బంది, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లంటూ విషప్రచారం చేస్తున్నారు. అందుకే, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాను. ఈ దుష్ప్రచారానికి కారకులను గుర్తించి లీగల్ నోటీసులు పంపుతున్నాం. సివిల్, క్రిమినల్ చర్యలకూ వెనకాడేది లేదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, వ్యక్తిత్వ హననంపై వెనక్కి తగ్గేది లేదు. వర్సిటీలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై సోమవారం పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం. – ఫ్రొఫెసర్ సుజాత, సోషియాలజీ విభాగాధిపతి -
వర్సిటీ ప్రతిష్టకు విఘాతం
పోలీస్ ఉన్నతాధికారులు కరీంనగర్లో అర్బన్ నక్సలైట్లు లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై యూనివర్సిటీ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వర్సిటీలో ఇష్టానుసార నియామకాలు, కొత్త నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలను ప్రశ్నిస్తే ఇలా అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ ప్రకటనలు చేయడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉంది. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడఅర్బన్/రుద్రంగి: పుణ్యక్షేత్రం నుంచి మరో పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సులను ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కాళేశ్వరం, యాదగిరిగుట్టకు బస్సులను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ట్లాడి వేములవాడకు, సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యా ల, కరీంనగర్, కోరుట్ల డిపోల నుంచి బస్సు స ర్వీసులు పెంచాలని కోరినట్లు తెలిపారు. వేములవాడ బస్టాండ్ ఆధునికీరణకు రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట బస్సుస్టేషన్లను ఆధునికరిస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ పు ల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమి టీ చైర్మన్ రొండి రాజు, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కౌన్సిలర్ ఎల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో సురక్షిత సమాజంసీసీ కెమెరాలతో సురక్షిత సమాజం సాధ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన మార్గం గోపిని అభినందించారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్ పాల్గొన్నారు. -
నిరంతర నిఘా!
శాతవాహన గాథలు–2సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో దళితులపై అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుమారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ విషయంలో వైస్ చాన్స్లర్ వర్గం, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాతల వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైస్ చాన్స్లర్కు అనుకూలంగా కొందరు పీహెచ్డీ స్కాలర్స్ ముందుకు వస్తుండగా.. ఫ్రొఫెసర్ సుజాతకు దళిత సంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకులు అండగా నిలుస్తున్నారు. కొంతకాలంగా యూనివర్సిటీలో వీసీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై చర్చ జరగాలంటూ, అవసరమైతే జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వింత నిర్ణయాలపై విస్మయం క్యాంపస్లోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలపై ఇటు సిబ్బంది, అటు విద్యార్థులు మండిపడుతున్నారు. సీసీ టీవీల్లో పరిశీలిస్తూ వీసీ పలువురు విద్యార్థులు, సిబ్బందిని నేరుగా తన చాంబర్కు పిలిపిస్తూ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో 800మంది విద్యార్థులు ఉంటే దాదాపు 200కుపై సీసీ కెమెరాలు ఉన్నాయని అంటున్నారు. చివరికి క్యాంటీన్లోనూ ఆడియో రికార్డ్ చేసే కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిసెంబరు మొదటివారంలో హాజరుశాతం, లైబ్రరీ పనివేళలపై ఆంక్షలపై క్యాంపస్లో వందలాది విద్యార్థులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. పదే పదే పోలీసులను క్యాంపస్లోకి తీసుకువచ్చి తమలో భయానక వాతావరణ సృష్టిస్తున్నారని విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వీసీ ఉమేశ్కుమార్ను వివరణ కోరగా.. క్యాంపస్లో సీసీ కెమెరాలు కేవలం విద్యార్థుల భద్రత కోసమే ఏర్పాటు చేశాం. వర్సిటీలో వేధింపులు, అక్రమాలు అంటూ కొందరు చేస్తున్న ప్రచారం కేవలం నిరాధారం’ అని ఖండించారు. -
సీపీ ప్రకటనను స్వాగతిస్తున్నాం
వర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ల నిందలు వేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో యూనివర్సిటీ అకడమిక్ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న వ్యక్తులపై వీసీ, రిజిస్ట్రార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో అర్బన్ నక్సలైట్లు లేరని సీపీ గౌస్ ఆలం ప్రకటనను స్వాగతిస్తున్నాం. పోలీస్ ఉన్నతాధికారులు ఒకవైపు కరీంనగర్ లో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. – అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): పార్టీ పటిష్టతకు కృషిచేయాలని కాంగ్రెస్లో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని బోటుమీదపల్లి సర్పంచ్ గౌరవేణి శివానిసుమన్తోపాటు ఉపసర్పంచ్ గౌరవేణి లతిక, వార్డు సభ్యుడు పరశురాములు, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దుర్ముట్ల పరుశరాములు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీలు వి.వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, సర్పంచులు మామిడి రాజు, అరుకాల నవీన్కుమార్, కాత మల్లేశం, నేరెళ్ల విజయ్గౌడ్, మంజుల రమేశ్ పాల్గొన్నారు. డయల్ 100 కాల్స్పై వెంటనే స్పందించాలిచందుర్తి(వేములవాడ): డయల్ 100 కాల్స్పై వెంటనే స్పందిస్తూ.. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహన సిబ్బంది చేరుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. చందుర్తి పోలీస్స్టేషన్ను శనివారం తనిఖీ చేశారు. ఠాణాలోని రికార్డులను, కేసుల వివరాలు పరిశీలించారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ ఉన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్లో మోడల్ ఇందిరమ్మ ఇల్లు, నామాపూర్లో ఇందిరమ్మగృహాలను హౌసింగ్ పీడీ వెంకటమాధవరావుతో కలిసి శనివారం ప్రారంభించారు. పీడీ వెంకట మాధవరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.200 కోట్లను జిల్లాలో లబ్ధిదారులకు చెల్లించినట్లు తెలిపారు. డీఈ సాజిద్, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సర్పంచులు మట్ట వెంకటేశ్వర్రెడ్డి, అనిల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ కోకన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి, తహసీల్దార్ రామ్చందర్, ఎంపీడీవో లచ్చాలు, ఏఈ మనీశ్, కొండం రాజిరెడ్డి, వైస్చైర్మన్ వెల్ముల రామ్రెడ్డి పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: ఈనెల 6న జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. అండర్–20 బాల, బాలికలు, మెన్ అండ్ ఉమెన్కు 100, 200, 400, 800, 1500, 5కేఎం, 10 కేఎం మీటర్లు పరుగుపందెంతో పాటు త్రోస్ అండ్ జంప్స్ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజేతలను ఈనెల 11, 12 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ‘పవర్’లూమ్స్కు ఊరట !సిరిసిల్ల: స్థానిక వస్త్రపరిశ్రమకు భారీ ఊరట ల భించింది. 25 హెచ్పీల కంటే తక్కువ లోడ్ను గల ఉన్న వస్త్రోత్పత్తి యూనిట్లను కేటగిరీ–3 నుంచి మినహాయిస్తూ కేటగిరీ–4కు మార్పిడి చేశారు. దీంతో ఆయా యూనిట్ల యజమానులకు 60 శాతం మేరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. సిరిసిల్లలోని 600 పరిశ్రమ య జమానులకు మేలు కలిగేలా కేటగిరీ మార్పిడి చేసినట్లు ఎన్పీడీసీఎల్ సిరిసిల్ల సర్కిల్ ఎస్ఈ భిక్షపతి శనివారం తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా గుర్తిస్తూ కేటగిరీ మార్పు చేసినట్లు వెల్లడించారు. వస్త్రపరిశ్రమలో ఈ మార్పుతో ఉత్పత్తి వ్యయం తగ్గిపోయి స్థానిక నేతకార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఈఎస్ పేర్కొన్నారు. ఇంకా కేటగిరీ మార్పు కోసం అర్హులైన పరిశ్రమల యజమానులు ఎన్పీడీసీఎల్ అధికారులను సంప్రదిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి కేటగిరీ మార్పునకు అవకాశం కల్పిస్తామని భిక్షపతి వివరించారు. రూ.20కోట్ల విద్యుత్ సామగ్రి సిద్ధం వేసవి నిర్వహణలో భాగంగా జిల్లాకు రూ.20కోట్ల విలువైన విద్యుత్ సామగ్రిని అందుబాటులోకి తెచ్చామని ఎస్ఈ భిక్షపతి వివరించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశాలతో ‘సెస్’ పెద్దూరు స్టోర్స్కు రూ.10కోట్ల విలువైన సామగ్రి ఇప్పటికే చేరగా.. మరో రూ.10కోట్ల విలువైన సామగ్రి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో 120 కి.మీ. కండక్టర్ వైర్లు, 110 ట్రాన్స్ఫార్మర్ల నిల్వ సిద్ధమైందన్నారు. ఎన్పీడీసీఎల్ సిబ్బంది రక్షణకు అవసరమైన భద్రతా సామగ్రి అందుబాటులోకి వచ్చిందన్నారు. -
‘సెస్’ సంస్థను రక్షించాలి
● ఎన్పీడీసీఎల్లో విలీనం వద్దు ● సిరిసిల్ల ‘సెస్’ మహాజన సభలో ఏకగ్రీవ తీర్మానాలుసిరిసిల్ల: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)ను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, 56 ఏళ్లుగా విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్న సంస్థ ఉసురుతీయొద్దని ‘సెస్’ పాలకవర్గం, విలేజీ ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. జిల్లా కేంద్రం శివారులోని మణికంఠ ఫంక్షన్హాల్లో శనివారం ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన 52వ మహాజన సభ జరిగింది. రామారావు మాట్లాడుతూ జిల్లాలో 77 విద్యుత్ సబ్స్టేషన్లు ఉండగా.. కొత్తగా 12 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, మరో 21 సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు చేశామన్నారు. ‘సెస్’లో 411 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, సగటున 646 సర్వీసులకు క్షేత్రస్థాయి సిబ్బంది ఒకరు పనిచేస్తున్నారని తెలిపారు. గతేడాది కొత్తగా 106 ట్రాన్స్ఫార్మర్లను అమర్చామన్నారు. 2023 నుంచి 429 ట్రాన్స్ఫార్మర్లను అమర్చి 99.22 కిలోమీటర్ల 11 కే.వీ.విద్యుత్ లైన్లను, 13.99 కిలోమీటర్ల 6.3 కే.వీ.లైన్లను, 247.75 కిలోమీటర్ల త్రీ ఫేజ్ లైన్లను వేశామని వివరించారు. అవినీతిపై విచారణకు సిద్ధం సెస్లో ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికై న పాలకవర్గం ఉండగా కావాలనే తొక్కిపెట్టారని ఆరోపించారు. సంస్థను రక్షించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘సెస్’ను కాపాడాలని కోరుతూ విలేజీ ప్రతినిధులు తీర్మానపత్రాలను పాలకవర్గానికి అందించారు. వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి ర మాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్రెడ్డి, గౌరినేని నారాయణరావు, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాస్రావు, ఆకుల గంగారాం, రేగులపాటి హరిచరణ్రావు, ఆకుల దేవరాజు, కొట్టెపల్లి సుధాకర్ పాల్గొన్నారు. -
పట్టణ సుందరీకరణే లక్ష్యం
● మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ● గుడి చెరువు పనులు పరిశీలన వేములవాడ: పట్టణ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. గుడిచెరువు అభివృద్ధి పనులు, చెరువులోకి మురికినీరు చేరకుండా మూలవాగు వరకు చేపట్టిన అండర్గ్రౌండ్ పైపులైన్ పనులను శుక్రవారం పరిశీలించారు. చైర్మన్ రాజు మాట్లాడుతూ గుడి చెరువు కలుషితం కాకుండా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు. వైస్చైర్మన్ నరాల శేఖర్, 17వ వార్డు కౌన్సిలర్ ముత్యం, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
వివాదాల వర్సిటీ..!
వర్సిటీ గాథలు–1సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివా దాలకు నిలయంగా మారుతోంది. క్రమశిక్షణ పేరిట కొంతకాలంగా వీసీ ఉమేశ్కుమార్ తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు నిరసన బాట పట్టగా.. తాజాగా దళితులే లక్ష్యంగా వేధిస్తున్నారంటూ ఏకంగా ప్రొఫెసర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. దళిత మ హిళనైన తనను కొంతకాలంగా తన అసంబద్ధ చర్యలతో వేధిస్తున్నారంటూ తెలంగాణ విద్యాకమిషన్ సలహా కమిటీ సభ్యురాలు, సోషియాలజీ విభాగాధిప తి సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ క మిషన్కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అకారణంగా తనను, మ రికొందరు దళిత విద్యార్థులను అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రచారం చేయడం తన మనోభావాలను దెబ్బతీసిందని ఫి ర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు తెలంగా ణలో మావోయిస్టులు లేరంటూ డీజీపీ ప్రకటిస్తుంటే.. తమను అర్బన్ నక్సలైట్లంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తున్న వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా అటవీ అధికారి బాలమణి వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు, అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ అధికారి బాలమణి కోరారు. వీర్నపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పరిశీలించారు. డీఎఫ్వో బాలమణి మాట్లాడుతూ అటవీ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించాలన్నారు. జంతువుల పాదముద్రలు, విసర్జనలు, సంచార ఆనవాళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు. ప్రమాద సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి, సెక్షన్ అధికారులు రంజిత్కుమార్, సకారం, పద్మలత, బీట్ అధికారులు కిరణ్, రజిత, సతీశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కోడెల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవేములవాడఅర్బన్: భీమేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఓ కోడె నీరసంగా ఉన్నట్లు గమనించిన ఈవో రమాదేవి వెంటనే స్పందించారు. గోశాలకు తరలించి వైద్యం అందేలా చూశారు. ఈవో మాట్లాడుతూ భక్తులు తెచ్చే కోడెల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. -
వేసవి నష్ట నియంత్రణకు చర్యలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: వేసవి వడగాలులతో నష్టాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆశకార్యకర్త నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అందరి దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. రద్దీగా ఉంటే ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఉపాధిహామీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. మూగ జీవాల కోసం తొట్లలో నీరు పోయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ గోశాలపై పశువైద్య, సంవర్ధకశాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, వైద్యాధికారి రజిత, వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, డీఆర్డీవో గీత, మిషన్ భగీరథ అధికారులు అన్వర్, సుమలత, జిల్లా పంచాయతీ అధికారి షరీపొద్దీన్, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కమిషనర్ ఖదీర్పాషా పాల్గొన్నారు. పొద్దుతిరుగుడు సేకరణకు ఏర్పాట్లు జిల్లాలో పొద్దుతిరుగుడు గింజల సేకరణకు ఏర్పాట్లు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కల్టెరేట్లో మార్కెటింగ్, వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో సమీక్షించారు. పొద్దుతిరుగుడు గింజలను క్వింటాల్కు రూ.7,721 మద్దతు ధర ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, మార్క్ ఫెడ్ డీఎం హబీబ్, సహకార శాఖ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. కలెక్టరేట్లో డీఎల్టీసీ సమావేశం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ టెలికాం కమిటీ(డీఎల్టీసీ) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. డిజిటల్ భారత్ నిధి(డీబీఎన్), రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, టెలికాం టవర్లకు విద్యుత్ సరఫరా, భారత్ నెట్ ఇన్ఫ్రా, కాల్ బీ ఫోర్ యూ డీజీ మొబైల్ అప్లికేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్న సందర్భంగా ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా టీ ఫైబర్, బీఎస్ఎన్ఎల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీఓ గీత, టీ ఫైబర్, బీఎస్ఎన్ఎల్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. -
అయోమయం
హడావుడిసిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఆఫీస్ వద్ద బుధవారం హడావుడి.. అయోమయం నెలకొంది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తన సిబ్బంది, పోలీసులతో ‘సెస్’ ఆఫీస్కు చేరుకున్నారు. ‘సెస్’ ఎండీ భిక్షపతి, డీఈఈలతో సమావేశమయ్యారు. టీజీఈఆర్సీ ఆదేశాలతో ‘సెస్’ పరిధిలో విద్యుత్ సేవలను ఎన్పీడీసీఎల్ చూస్తుందని, ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ విధానం కొనసాగుతోందని స్పష్టం చేశారు. అమలులోకి ఎన్పీడీసీఎల్ విధానాలు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలకు సమాయత్తం కావాలని ఆదేశించారు. ఓవర్లోడ్ ఉన్న 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, ఒకే బ్రేకర్పై ఉన్న రెండు ఫీడర్లను అదనపు బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 2,491 సర్వీసులను మంజూరు చేయాలని, ఎన్పీడీసీఎల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఒక్క కిలోవాట్కు రూ.1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యుత్ సిబ్బంది భద్రతకు భరోసా కల్పించే ఎన్పీడీసీఎల్ పరిధిలో అమలవుతున్న రూ.కోటి ప్రమాదబీమా ‘సెస్’ ఉద్యోగులకూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సర్వీసుల మంజూరు మీసేవ కేంద్రాలు, గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అమలు చేయాలన్నారు. ఈ నెల జీతభత్యాలు సైతం ‘సెస్’ సిబ్బందికి ఎన్పీడీసీఎల్ చెల్లిస్తుందని, పెండింగ్లో ఉన్న బకాయిలు ఇస్తామని సీఎండీ స్పష్టం చేశారు. ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ సీఈ ప్రభాకర్, సీఈలు కిషన్, బుస్సా అశోక్, కరీంనగర్ ఎస్ఈ రవీందర్ ఉన్నారు. పోలీస్ వలయంలో ‘సెస్’ ఆఫీస్ ఎన్పీడీసీఎల్ అధికారులు సిరిసిల్లకు రాగానే వారి ఎన్ఫోర్స్మెంట్ సీఐ, ఎస్సై, సిబ్బందితోపాటు సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, స్థానిక పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ‘సెస్’ పాలకవర్గం నుంచి ప్రతిఘటన ఉంటుందనే అనుమానంతో ముందస్తు సమాచారం లేకుండానే వచ్చారు. ఇదీ ‘సెస్’ లైసెన్స్ కథ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సంస్థకు ఐదేళ్లకోసారి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఈఆర్సీ) లైసెన్స్ను రెన్యూవల్ చేస్తుంది. 2021లో జారీచేసిన లైసెన్స్ గడువు 2026 మార్చి 31తో ముగిసిపోయింది. ‘సెస్’ పాలకవర్గం ఎండీ ద్వారా 2025 డిసెంబరులో లైసెన్స్ రెన్యూవల్ కోసం ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో గడువు మంగళవారంతో తీరిపోయింది. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు ‘సెస్’ సంస్థను స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఇలా.. ‘సెస్’లో అవినీతి ఉందని, పాలకవర్గం ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయనే అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెస్ పాలకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే ఉండడంతో ఈ చర్యలకు దిగినట్లు విమర్శలు ఉన్నాయి. ‘సెస్’ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఇటీవల సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క భట్టి, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి విన్నవించారు. కానీ ముందే నిర్ణయించిన ప్రకారం ‘సెస్’ లైసెన్స్ను రెన్యూవల్ చేయలేదని భావిస్తున్నారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సత్వర సేవలు అందిస్తాం. ఎన్పీడీసీఎల్ విధానాలు అమలు చేస్తాం. ఒకే విధమైన ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అవినీతి రహితంగా సేవలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమాదబీమా ఉంటుంది. టీఈఆర్సీ ఆదేశాలు వచ్చే వరకు ‘సెస్’ పరిధిలో ఎన్పీడీసీఎల్ సేవలు అందుతాయి. – కర్నాటి వరుణ్రెడ్డి, సీఎండీ, ఎన్పీడీసీఎల్ -
షాపింగ్ కమాల్
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీ అధికారులు బడా వ్యాపారులకో లెక్క.. చిరువ్యాపారులకు రీతిలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటైన వాసవి వస్త్రాలయం షాపింగ్మాల్ విషయమే వీరి వైఖరికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ బడావ్యాపారి తమ వ్యాపారసంస్థ ఏర్పాటులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే మిన్నకుండడంపై విమర్శలు వస్తున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్ స్టోరీ. ఎందుకింత ఉదాసీనత? బల్దియాకు ఆదాయం వచ్చే భవనం, ట్రేడ్లైసెన్సులు అందించే అంశంలో కంచె చేను మేస్తున్న చందంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ నిబంధనలకు నీళ్లొదిలిన ఓ బడావ్యాపారి తమదైన శైలిలో బల్దియా ఆదాయానికి గండికొడుతున్నారు. పట్టణంలోని భావనరుషినగర్ ప్రాంతంలో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారీ జీ+4 అంతస్తుల్లో భవనం నిర్మించారు. దీనికి రెసిడెన్షియల్ భవనంగా అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే రూ.కోట్లు వెచ్చించి సదరు బడావ్యాపారి తమ వస్త్ర వ్యాపారంలో భాగంగా బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభించారు. దీనికి నామమాత్రంగా సెల్ఫ్ అసెస్మెంట్గా ట్రేడ్లైసెన్స్ పొందారు. రెసిడెన్షియల్ భవనంలో వస్త్రాలయం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈవిషయంపై నెల రోజులుగా బల్దియా అధికారులకు ఫిర్యాదులు అందినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మొదటి నుంచి వివాదమే.. వాసవి వస్త్రాలయం వ్యాపారి తీరు షాప్ ప్రారంభానికి ముందు నుంచే వివాదాస్పదంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రారంభానికి వారం రోజుల ముందే పట్టణంలోని ప్రధాన డివైడర్లు, జంక్షన్లు, ప్రధాన ఏరియాల్లో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వాటికి అనుమతులు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక వస్త్రాలయం ప్రారంభానికి ఇద్దరు సినీతారలను తీసుకొచ్చారు. ఇందుకు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, డప్పుకళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కమర్షియల్ భవనంలో నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతులు పొందాల్సి ఉంది. కానీ ఇవేవి పట్టింపులేకుండా దర్జాగా రెసిడెన్షియల్ అనుమతులున్న భవనంలో షాపింగ్మాల్ను ప్రారంభించారు. ఇందుకు పలువురు పెద్దమనుషుల సహకారంతో సదరు వ్యాపారి తతంగం నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతేఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు పరిశీలించారు. డయల్ 100 కాల్స్కు స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని పదిర వద్ద గల ఇసుకరీచ్ను తనిఖీ చేశారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఎస్సై రాహుల్రెడ్డి ఉన్నారు. జిల్లాలో పోలీస్యాక్ట్ సిరిసిల్ల క్రైం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్యాక్ట్–1861ను ఈనెల 30 వరకు అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. డీజే వినియోగం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే కార్యకలాపాలు చేపట్టరాదని హెచ్చరించారు. -
కోతులు, కుక్కల బెడద నుంచి రక్షించండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కోతులు, కుక్కల బెడద నుంచి గ్రామస్తులను రక్షించాలని బీజేపీ నాయకులు బుధవారంసర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, కార్యదర్శి సంతోష్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలో కోతులు, కుక్కల దాడిలో అనేక మంది గాయపడ్డారన్నారు. నాలుగు రోజుల క్రితం కోతుల దాడిలో గాలిపెల్లి దేవవ్వ గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కుక్కల దాడిలో నీరటి విష్ణుప్రసాద్, లింగమ్మగారి భాస్కర్లకు కూడా గాయాలైనట్లు వివరించారు. కోతులు, కుక్కల బెడద తొలగించాలని కోరారు. నాయకులు ముత్యాల చంద్రారెడ్డి, ల్యాగాల సతీశ్, చల్ల పద్మారెడ్డి, వంగ బాపురెడ్డి, కొండాపురం సత్యంరెడ్డి, విభూది హనుమంత్, మారావేణి రంజిత్కుమార్, భిక్షపతి పాల్గొన్నారు. వేములవాడ: రాజన్న ఆలయ డీఈవోగా నియమితులైన భాస్కర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. యాదగిరిగుట్ట డీఈవోగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ను దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల రాజన్న ఆలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆమేరకు వేములవాడకు చేరుకుని భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈవో రమాదేవి ఉన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని ముస్కానిపేట, ఆరేపల్లి, కేసన్నపల్లి, దాచారం గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలకొరిగిన మక్కచేను పంటను మండల వ్యవసాయాధికారి సందీప్ బుధవారం పరిశీలించారు. కేసనపల్లి సర్పంచ్ పోతరాజు చంటి, వ్యవసాయ విస్తరణ అధికారి గంగ, అభిషేక్, రైతు రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కోఆప్షన్ నామినేషన్ షురూ..సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం సిరిసిల్ల బల్దియాలో కోఆప్షన్ సందడి షురువైంది. నాలుగు కోఆప్షన్ సభ్యుల కోసం బుధవారం నుంచి మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా నామినేషన్లను ఆహ్వానించారు. మైనార్టీ మహిళ కోటాకు చెందిన కోఆప్షన్ పోస్టు కోసం ఎం.డి.ఆస్మా బుధవారం బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశారు. బుధవారం ఒకే నామినేషన్ వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. మూడు నెలల బియ్యం కోటా విడుదలసిరిసిల్ల: జిల్లాలోని రేషన్ కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యం కోటా విడుదలైందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు బుధవారం తెలిపారు. జిల్లాలోని 1,95,554 కుటుంబాలకు చెందిన రేషన్కార్డుదారులకు 1,11,721.65 క్వింటాళ్ల సన్న బియ్యం మంజూరైనట్లు వివరించారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల రేషన్ బియ్యం తీసుకెళ్లాలని కోరారు. అంత్యోదయ కార్డులున్న వారికి కిలో చక్కెరను రూ.13.50 అందిస్తారని వివరించారు. మైనార్టీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు సిరిసిల్ల: మైనార్టీ యువకులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా అల్పసంఖ్యాక సంక్షేమాధికారి భారతి బుధవారం తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీలకు చెందిన అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, విదేశీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 99499 10328లో సంప్రదించాలన్నారు. -
చర్చనీయాంశమైన చైన్స్నాచింగ్
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్స్టేషన్ వెనకాల గల పాతబజార్లో సోమవారం రాత్రి జరిగిన చైన్స్నాచింగ్ ఘటన పాతబజార్తో పాటు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. దీనిని సీరియస్గా పరిగణిస్తూ పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాకింగ్ చేస్తుండగా.. స్వశక్తి సంఘాల ముఖ్య ప్రతినిధి కోల కుసుమకుమారి.. సోమవారం సాయంత్రం వేళ అల్పాహారం చేసింది. ఆ తర్వాత తన ఇంటి ఎదుట కాసేపు వాకింగ్ చేసింది. ఆ వీధిలోని పల్లెర్ల శ్రీనివాస్ ఇంటి ఎదుట పొరుగు మహిళలతో ముచ్చటిస్తోంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని యువకుడు అక్కా అని పిలుస్తూ కుసుమ వద్దకు వస్తూనే మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడును కట్టర్తోకట్ చేసి పట్టుకొని పరుగులుపెట్టాడు. అప్పటికే ప్రధాన రోడ్డుపై పల్సర్ బైక్తో సిద్ధంగా ఉన్న మరోవ్యక్తితో కలిసి క్షణాల్లో మాయమయ్యాడు. సినీఫక్కీగా జరిగిన ఘటనతో అర్ధగంట వరకు బాధితురాలు తేరుకోలేకపోయింది. గ్రూపు లీడర్ కావడంతో అక్కా అని పిలుస్తూ వచ్చిన వ్యక్తిని గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. కాలనీలో అంధకారం కాలనీలో వీధిదీపాలు వెలుగడంలేదు. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. సీసీ కెమెరాలు లేవు. దీంతోనే నిందితుడు చాకచాక్యంగా తనపని ముగించుకొని వెళ్లిపోయాడు. ఘటనకు ముందు సదరు వ్యక్తి ఒకసారి పాతబజార్కాలనీ చివరి వరకు రెక్కీచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. చైన్స్నాచింగ్పై డీసీపీ విచారణ రామగుండం: స్థానిక పాతబజార్లో సోమవారం రాత్రి జరిగిన చైన్స్నాచింగ్పై పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. బాధితురాలు కోల కుసుమకుమారితో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం ఎస్సై సంధ్యారాణి తదితరులు ఉన్నారు. కాగా, పోలీస్స్టేషన్ వెనకాలే చైన్స్నాచింగ్ ఘటన జరగడాన్ని పోలీసు యంత్రాంగం సీరియస్గా పరిగణిస్తోంది. పాతబజార్కాలనీలో కలకలం నిందితుల వేటలో పోలీస్యంత్రాంగం విచారణ చేపట్టాం పాతబజార్కాలనీలో ఇప్పటివరకు చైన్స్నాచింగ్లు చోటుచేసుకోలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. పలుప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. ఆరుబయటకు వెళ్లే మహిళలు చాలాజాగ్రత్తలు పాటించాలి. – రమేశ్, ఏసీపీ, గోదావరిఖని -
రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల పోటీలకు 20 మంది ఎంపిక
సిరిసిల్లఅర్బన్ : జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో 20 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికయ్యారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిదిలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో సుమారు 50 మంది పాల్గొనగా 10 మంది బాలురు, 10 మంది బాలికలు ఎంపికయ్యారని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికై న విద్యార్థులు 27 ఏప్రిల్ 2026 నుంచి 1 మే 2026 వరకు జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మినీ స్టేడియం వాలీబాల్ అకాడమీ కోచ్లు, వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే ప్రధాన ఎజెండా
● రూ.51.21 కోట్ల బడ్జెట్కు పచ్చజెండా ● మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ● సిరిసిల్ల కౌన్సిల్ బడ్జెట్ సమావేశం సిరిసిల్లటౌన్: అభివృద్ధే ప్రధాన ఎజెండాగా బడ్జెట్ రూపొందించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మంగళవారం ఆమె అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం ప్రెస్మీట్లో సమావేశం వివరాలను వెల్లడించారు. పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యం మున్సిపల్ కౌన్సిల్ సకల చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 51.21కోట్లు బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పారిశుధ్య, వీధి దీపాల, మంచినీటి సరఫరా నిర్వహణకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. పూర్తి బడ్జెట్లో 10శాతం హరితహారంకు కేటాయించామన్నారు. విలీన, అభివృద్ధి చెందని, మురికివాడల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు 1/3వంతు నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించిందని తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్కు పూలమొక్క అందించి ఆహ్వానం పలికారు. సాధారణ సమావేశంలో వాగ్వాదం బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం మార్చి నెలకు సంబంధించిన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ మాట్లాడుతూ సీఎం ఫొటోలు కౌన్సిల్ హాల్, చైర్పర్సన్ చాంబర్లో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించాలని గతనెల సమావేశంలో సూచించినా పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు మీడియాను ఖచ్చితంగా అనుమతించాలని అన్నారు. అనంతరం ప్రెస్మీట్లో చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా, వచ్చే వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన మురికి కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడం, ఓపెన్ జిమ్ల మరమ్మతు తదితర మౌలిక అవసరాలపై 21 అంశాలతో కూడిన ఎజెండాపై పాలకవర్గ సభ్యులందరితో చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సమావేశంలలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి హాజరై మాట్లాడారు. రెవెన్యూ వ్యయంలో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, రుణాల చెల్లింపు, పారిశుధ్య ప నులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయని, తప్పనిసరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని సూచించారు. మున్సిపల్కు రావాల్సిన పన్నులు 100 శాతం వసూలు చేయడంతో ప్రభు త్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు. ఖాళీగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ గదులు అద్దెకు ఇచ్చేందుకు మరోసారి టెండర్లు పిలువాలని ఆదేశించారు. కొత్త చెరువులో మరమ్మతు పనులు చేయించి, ప్రజలు, పిల్లలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
సర్కారు వైఫల్యంతోనే గురుకుల విద్యార్థి మృతి
సిరిసిల్లటౌన్: సర్కారు వైఫల్యంతోనే గురుకుల విద్యార్థి మృతిచెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో సమస్యలు పెరిగాయన్నారు. విద్యార్థుల భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆరెల్లి వినయ్ కుమార్, ఎండీ అజ్జు, లింగంపల్లి రామ్చరణ్, పవన్, జశ్విత్, ఈశ్వర్, కలీం తదితరులు పాల్గొన్నారు. -
‘మహాలక్ష్మి’తో ఆర్థిక స్వావలంబన
సిరిసిల్ల: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల కొత్త బస్టాండులో మంగళవారం ఉచిత ప్రయాణాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్న మహిళలకు బహుమతులు అందిస్తూ.. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్లకు పైగా పూర్తి అయి రూ.290 కోట్ల ప్రయాణాలు, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉ ద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలి పారు. కార్యక్రమంలో డీఆర్డీవో మచ్చ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశరావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేశ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగణనలో మాస్టర్ ట్రైనర్లు కీలకం జనగణన 2027లో మాస్టర్ ట్రైనర్లు కీలకమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, (సీఎంఎంఎస్), డిజిటల్ విధానం, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్పై మాస్టర్ ట్రైనర్లకు ఇచ్చిన శిక్షణలో మాట్లాడారు. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణనని, మే 11నుంచి జూన్ 9వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. జనగణన సేకరించే వివరాలు కీలకమని అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ మాస్టర్ ట్రైనర్ శివ రామకృష్ణ వివరించారు. శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ పట్టా రద్దు చేయాలి
సిరిసిల్ల: మా పూర్వీకుల భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరుకు చెందిన పలువురు మంగళవారం సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. పెద్దూరు శివారులోని సర్వేనం.402లో ఖాతా నం.501, 344, 100064లో 9.20 ఎకరాల భూమి శ్రీరామల నారాయణ, చీకోటి సత్యనారాయణ, జిన్న పోషవ్వ, ఎల్లవేణి అనసూర్య, చీకోటి లచ్చవ్వ, చీకోటి రాజు, దాసరి దేవయ్య, జిన్న దేవయ్యలకు సంబంధించిన పూర్వీకులదన్నారు. పెద్దూరుకు చెందిన గండ్ర జయసింహారావు అక్రమంగా పట్టా చేయించుకుని ధరణి, భూభారతిలో పేరు మార్పిడి చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశామని వివరించారు. తహసీల్దార్ను కలవాలని కలెక్టర్ సూచించగా తహసీల్దార్ ఆఫీస్కు తరలివచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ అధి కారులు క్షేత్రస్థాయిలో విచారణ న్యాయం చేయాలని, అక్రమ పట్టాను రద్దు చేయాలని కోరారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని రాంనగర్లో నివాసముంటున్న ఇస్లావత్ కిషన్(55) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం జ్యోతిరాంనాయక్ తండాకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్కు వస్తుండగా, అల్గునూర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనకనుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
బకాయిలు చెల్లించాలి
సిరిసిల్లఅర్బన్: విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ను ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు ద్యావనపెల్లి పరమేశ్, జనపాల వెంకటయ్య, ముత్యాల ప్రభాకర్, గోవిందరావు, జీవన్రెడ్డి, ప్రకాశ్రావు, రాజు, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం రూ. 93.52 లక్షలు
వేములవాడ: ఎములాడ రాజన్నకు 18 రోజుల్లో భక్తులు భీమన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సమర్పించుకున్న హుండీల ద్వారా రూ.93,52,748 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మంగళవారం భీమేశ్వర సదన్లో చేపట్టిన లెక్కింపులో 60గ్రాముల బంగారం, 2కిలోల 900 గ్రాముల వెండి సమకూరిందన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ ఏసీ ఆఫీస్ అధికారి రాజమౌళి, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నరేశ్ను కులం పేరుతో దూషించిన సంఘటనపై మంగళవారం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి విచారణ చేపట్టారు. గ్రామంలోని పంచాయతీ ఆఫీస్లో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. విచారణలో గ్రామస్తులు తెలిపిన వివరాలను రికార్డు చేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాణిప్రసాద్కు వంశీ గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డుసిరిసిల్లటౌన్: సిరిసిల్లకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త కందేపి రాణిప్రసాద్ వంశీగ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు పొందారు. హైదరాబాద్కు చెందిన వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర సందర్భంగా సాంస్కృతిక, సాహితీ రంగాల్లో ప్రతిభామూర్తులకు అవార్డులను సోమవారం హైదరాబాద్లో అందజేశారు. వంశీ ఆర్ట్స్ అధినేత వంశీరామరాజు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ఛాన్స్లర్ డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, దూరదర్శన్ డైరెక్టర్ కామేశ్వరి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. సిరిసిల్ల కవులు, రచయితలు ఆమెకు అభినందనలు తెలిపారు. అడవి పదిరలో చిరుత సంచారం వీర్నపల్లి: వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ధర్మారం చెరువు ప్రాంతంలోని మైసమ్మ లొద్ది వద్ద సోమవారం రాత్రి చిరుత ప్రత్యక్షం కావడంతో రైతులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం పెరుగుతుండటంతో అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు. వీర్నపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్ కుమార్, అడవిపదిర బీట్ అధికారి వేణును వివరణ కోరగా అది చిరుత పాద ముద్రలే అని అన్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉచిత ఎంసెట్ కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలి సిరిసిల్ల అర్బన్ : ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో1977–79లో చదివిన పూర్వ విద్యార్థులు నాగుల రవి, పత్తిపాక మదన్, గాజుల ప్రతాప్లు ఏర్పాటు చేసిన ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అధ్యాపకులు బుర్ర వెంకటేశం, సామల వివేకానంద, రవీందర్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దాడులైనా దందా ఆగట్లే
● విచ్చలవిడిగా వంటగ్యాస్ వినియోగం ● తీవ్రతలేని కేసుల నమోదే కారణమా? ● క్రిమినల్ కేసులు నమోదు చేస్తేనే అడ్డుకట్ట ● పాత్రధారులు కాకుండా సూత్రధారులపై చర్యలేవీ? కరీంనగర్అర్బన్: తప్పు చేస్తే అధికారులు పట్టుకుంటున్నారంటే ఎవరికై నా భయమే. కానీ నగరంలో యథేచ్ఛగా వంట గ్యాస్ దందా సాగుతుందంటే లోపమొక్కడా.. తీవ్రత లేని కేసులు నమోదు చేయడమా, అధికారులతో ఉన్న అనుబంధమా..నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట గ్యాస్ పక్కదారి పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటనలకే తప్ప ఆచరణలో ఆమడదూరం. జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు నాలుగు సార్లు తనిఖీలు నిర్వహించగా పట్టుకున్న ప్రతీసారి పదుల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీ చేపట్టారు. జెస్సికా రీఫిలింగ్ సెంటర్లో 6 సిలిండర్లు, 13 హోటల్స్లో ఉపయోగిస్తున్న 21 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. యజమానులపై 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు ఆకారపు దినేశ్రెడ్డి, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సురేందర్, ఎఫ్ఐ శ్రీనివాస్రెడ్డి పాల్గొనగా మెరుపుదాడులు నిర్వహించారు. కానీ, మరోవైపు హోటళ్లలో వినియోగం సాగుతూ..నే ఉండటం విశేషం. సరఫరాదారులపై చర్యలేవీ గ్యాస్ కొరత పుకార్ల క్రమంలో విరివిగా దాడులు నిర్వహిస్తున్న అధికారులు పాత్రధారుల వరకే కేసులను పరిమితం చేస్తున్నారు. అసలు గ్యాస్ సరఫరా చేసిందెవరు, ఏ ఏజెన్సీ నుంచి సరఫరా జరిగింది, సదరు గ్యాస్ సిలిండర్ వినియోగదారుడెవరనే కోణంలో చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సదరు ప్రక్రియలో విచారణ చేసి గ్యాస్ వినియోగదారుల గ్యాస్ కనెక్షన్ రద్దు చేయడం, గ్యాస్ ఏజెన్సీని సీజ్ చేయడం వంటి కఠినచర్యలు చేపడితే బ్లాక్ మార్కెట్ గొడవే ఉండదన్నది సుస్పష్టం. కేవలం హోటళ్లు, రీఫిల్లింగ్ సెంటర్లపై 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సదరు కేసుతో ఒరిగేదేం లేదని ఇటీవల పట్టుబడిన హోటల్ నిర్వాహకుడొకరు చెప్పడం కొసమెరుపు. ఇటీవల ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించారో హెచ్చు హోటళ్లలో వంట గ్యాస్ వినియోగిస్తుండటం చట్టంలోని లోపాలా..? లోపాయికారి ఒప్పందమా..నన్న వాదన వినిపిస్తోంది. అంతటా వంట గ్యాసే వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్కు చేరకుండా చర్యలు చేపట్టామని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి నెలకొంది. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, ప్రముఖ హోటళ్లు, దాబాలు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాల్లో బహిరంగంగా వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. పలు చోట్ల తట్టుసంచులను కప్పి వినియోగిస్తుండగా ప్రముఖ హోటళ్లలో పదుల సంఖ్యలో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. కొందరు చుట్టు పక్కల ప్రాంతాల్లో సిలిండర్లను నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగిస్తున్నారు. కాగా కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని ఇప్పటికే స్పష్టం చేశామని, వంట గ్యాస్ వినియోగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. -
ఆపద సమయాల్లో ముందుండి సేవలందించాలి
సిరిసిల్ల అర్బన్: సమాజానికి ఆపద కలిగినప్పుడు కెడెట్లు ముందుండి సేవలందించాలని 17వ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేశ్ అన్నారు. మంగళవారం సర్దాపూర్ 17వ బెటాలియన్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందం, యువ ఆపద మిత్ర స్కీం కింద ఎన్సీసీ కెడెట్లకు విపత్తు నివారణ, సహాయక చర్యలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్ఎస్సై కె.నరేశ్ నేతృత్వంలో మెడికల్ ఫస్ట్ రెస్పాండర్, సెర్చ్ అండ్ రెస్క్యూ, రోప్ నాట్స్, హిచేన్ రెస్క్యూ ఆపరేషన్లు, వాటర్ రెస్క్యూ, స్విమ్మింగ్, విపత్తుల అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం కెడెట్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వెంకటేశ్, ప్రశాంత్, లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గడువు ముగిసింది.. దిగులు మిగిలింది
● నిఘా వర్గాలకు తెలియదు.. మావోయిస్ట్ పార్టీ చెప్పదు ● కుటుంబ సభ్యుల్లో ఆందోళన ● కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కలవరం ‘వెనకచ్చే ఆవుల్లారా.. ఎర్ర ఆవుల్లారో.. శ్రీరామ రామ చంద్రుడా.. మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామ చంద్రుడా.. ముందచ్చే లేగల్లారా.. ముద్దు లేగల్లారో.. శ్రీరామ రామచంద్రుడా.. మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామ చంద్రుడా.. మందిలో నా కొడుకు ముందుండేటోడే.. శ్రీరామ రామ చంద్రుడా.. గోదారి అలలపై ఎదురీదేటోడే.. శ్రీరామ రామ చంద్రుడా.. కళ్లలో కదిలే కొడుకు కనపడకాపాయే.. శ్రీరామ రామ చంద్రుడా.. ఏ పాపిస్టి కళ్లల్లో కొడుకు పడ్డాడో.. శ్రీరామ రామ చంద్రుడా.. ఏ దేవుడు చెబుతాడో నా కొడుకు జాడ.. శ్రీ రామ రామ చంద్రుడా..’ సిరిసిల్ల: ‘దేశంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజాన్ని అంతమొందించామని, మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మార్చి 31లోగా నక్సలైట్లు లేని దేశంగా తీర్చుదిద్దుతామని పది నెలల కిందటే ప్రకటించిన కేంద్రం ఆ దిశగా భద్రతాదళాలతో దాడులు చేసింది. 12 రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించామని కేంద్ర మంత్రి వెల్లడించారు.’ ‘ఈ ప్రకటనకు ముందే సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ముఖ్య నేతలు లొంగుబాట పట్టారు. కొందరు ఆయుధాలను అప్పగించి, మరికొందరు నిరాయుధులుగా లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మా వోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉంది. అప్పట్లో అడవి బాట పట్టిన ‘అన్నల’ ఆచూకీ ఇప్పటికీ చిక్కడం లేదు. కేంద్రం విధించిన గడువు ముగిసింది. కానీ, విప్లవోద్యమానికి అన్నలను అందించిన కుటుంబాలకు ఇంకా దిగులు మిగిలే ఉంది’. ఆ నలుగురి ఆచూకీ ఏది..? రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చాలా మంది ఆయుధాలు పట్టుకుని సాయుధపోరాట దారుల్లో వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు ఎన్కౌంటర్ కాగా, మరి కొందరు లొంగిపోయారు. మరో నలుగురు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. కానీ ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో.. అసలు సజీవంగా ఉన్నారా..? లేరా.. అనే విషయాన్ని పోలీస్ నిఘా వర్గాలు, మావోయిస్టు పార్టీ వర్గాలు చెప్పడం లేదు. వారి ఆచూకీ తెలియక నాలుగు కుటుంబాల్లో కన్నీరు మిగిలే ఉంది. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు, అరెస్ట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆ నలుగురి ఆచూకీ గల్లంతయింది. అడవిలో అజ్ఞాతంలోనే అదృశ్యమైన వారి కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా.. అనే అంతులేని ప్రశ్నలు ఆ కుటుంబాలను వేధిస్తున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. చదువులో చురుగ్గా ఉండే శ్రీనివాస్ సిద్దిపేటలో చదువుతూనే అడవి బాట పట్టినట్లు భావిస్తున్నారు. 28 ఏళ్లుగా అతడి జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా, తల్లి భూదమ్మ తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు సైతం శ్రీనివాస్ రాకపోవడం విషాదం. నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే.. జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నారు. పదో తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న ఆయన 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక కూతురు శాంతమ్మ. చిన్నోడు చంద్రయ్య అడవిబాట పట్టారు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికి విసిగిపోయారు. చిన్నకొడుకు తలపుల్లో తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతిచెందాడు. తల్లిదండ్రులు, సోదరుడు మరణించినా చంద్రయ్య ఇల్లు ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినె దేవవ్వ ధర్మారంలో ఉన్నారు. 40 ఏళ్లుగా మహేశ్ పేరుతో మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నాడు. చంద్రయ్య ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు దిక్కులు చూస్తున్నారు. చందుర్తి నుంచి దండకారణ్యం చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కాంతారావు అలియాస్ నవీన్ 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. చాలా కాలం మావోయిస్టు పార్టీలో కొరియర్గా పని చేసిన నవీన్ దండకారణ్యంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దండకారణ్యంలో సాయుధ నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. కాంతారావు అలియాస్ నవీన్ ఐదేళ్ల క్రితం ఒడిశాకు వెళ్లినట్లు సమాచారం. కాంతారావు ఆచూకీ 30 ఏళ్లుగా లేక పోవడంతో కుటుంబ సభ్యులు అతను ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడోనని అయోమయానికి గురవుతున్నారు. అజ్ఞాతంలోనే అదృశ్యం జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన చిన్నన్న అలియాస్ బాలసంతుల ఉప్పలయ్య మూడు దశాబ్దాల కిందటే అజ్ఞాతంలోనే అదృశ్యమయ్యాడు. ఆయన సిరిసిల్ల ప్రాంతంలో చిన్నన్న పేరుతో పని చేస్తూ పార్టీ డబ్బులతో పార్టీని వీడి పారిపోయినట్లు ప్రచారం జరిగినా ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నది ఎవరకీ తెలియదు. అజ్ఞాతంలోనే అదృశ్యమయ్యాడు. పోలీస్ రికార్డుల్లో కనిపించని ఆ పేర్లు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను ప్రకటించారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆ నలుగురు అజ్ఞాత వాసుల పేర్లు ఆ జాబితాలో లేవు. జిల్లాకు చెందిన విశ్వనాథ్ (శ్రీనివాస్), బండి చంద్రయ్య(మహేశ్), బత్తుల కాంతయ్య(నవీన్), చిన్నన్న(ఉప్పలయ్య) పేర్లు లేవు. వారంతా ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అటు మావోయిస్టు పార్టీ, లేదా పోలీస్ నిఘా విభాగంపై ఉంది. ‘ఎన్కౌంటర్’ సినిమాలోని ఈ పాట.. ఎదిగిన కొడుకు చదువు కోసం పట్నం వెళ్లి కనిపించకుండా పోవడంతో కొడుకు తలపుల్లో తల్లిపడిన వేదనకు అద్దం పడుతుంది. -
అకాల నష్టం
జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతకు అపార నష్టం కలిగించింది. బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లో 3,580 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేయగా 270 ఎకరాల్లో పంట దెబ్బతింది. కోతకొచ్చిన వరి నేలవాలింది. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. మొక్కజొన్న, వరి, మామిడి రైతులకు కొంత మేరకు నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. – బోయినపల్లి/ఇల్లంతకుంట/చందుర్తి/వీర్నపల్లి -
దుబాయిలో ఉపాధి అవకాశాలు
● ఫ్రీ వీసా.. ఫ్రీ విమాన టికెట్లు ● 2, 3 తేదీల్లో వేములవాడలో ఇంటర్వ్యూలు ● మహమ్మద్ రఫీ, ఎండీ, ఏఆర్ఆర్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ సిరిసిల్ల: దుబాయ్లోని పలు కంపెనీలు ఉచిత వీసా, విమాన టిక్కెట్లు సమకూర్చుతూ ఉపాధి కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ విషయాన్ని వేములవాడకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఏఆర్ఆర్(మ్యాన్పవర్ కన్సల్టెన్సీ) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. దుబాయ్ వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న యువకులకు ఉచితంగా వీసా, విమాన టిక్కెట్ పొందే అవకాశం ఉందన్నారు. 2, 3న ఇంటర్వ్యూలు దుబాయ్(యూఏఈ)లోని క్యాటరింగ్ కంపెనీలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వేములవాడలోని ఏఆర్ఆర్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ ఆఫీస్లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. భోజన వసతి కల్పించి నెలకు 950 దుబాయ్ దిరమ్స్(రూ.25వేలు) జీతం ఉంటుందని తెలిపారు. ఉచిత నివాసం, రవాణా, రోజుకు 9 గంటలు పని ఉంటుందని తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు, ఈసీఎన్ఆర్ పాస్పోర్టు ఉన్న వారు మాత్రమే అర్హులని వివరించారు. ఆసక్తి గల వారు 95505 60910/95506 20505/83411 65239, 96666 22890/ 70754 62519 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమాకాంత్రావు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం హోరాహోరీగా సాగాయి. అధ్యక్షుడిగా ఆవునూరి రమకాంతరావు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 226 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా రమకాంతరావు, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్.వెంకటయ్య, కోశాధికారిగా ఎస్.దేవరాజు ఎన్నికై నట్లు ఎన్నికల అఽధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా గోవర్ధన్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా జి.కిషన్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీలుగా కె.శ్రీనివాస్, బి.కళ్యాణి, లైబ్రరీ సెక్రటరీగా ఎం.పుష్పలత, మహిళా రిప్రజంటేటీవ్గా వై.జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి జగ్గారావు తెలిపారు. నూతన పాలకవర్గం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. -
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్అధికారులకు అభినందన 2న గ్రామ, వార్డుసభలు గృహ సముదాయాల బ్లాక్లను పోర్టల్లో నమోదు చేయాలి జనగణనకు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్లు గుర్తించి సీఎంఎంఎస్(సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) పోర్టల్లో నమోదు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతీ హోలికేరి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న జనగణన కోసం ప్రతీ హౌజ్ లిస్టింగ్ బ్లాక్లో 700 నుంచి 850 వరకు జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి -
వీర్నపల్లిలో పట్టపగలే చోరీ
రెండు సబ్స్టేషన్ల మంజూరు సిరిసిల్ల: జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ లోడ్ను దృష్టిలో ఉంచుకుని రెండు సబ్స్టేషన్లకు సాంకేతిక అనుమతులను ఎన్పీడీసీఎల్ జారీ చేసిందని కరీంనగర్ ఎస్ఈ ఆర్.రవీందర్ సోమవారం తెలిపారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల, తంగళ్లపల్లి మండలం రామన్నపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు అనుమతులు మంజూరైనట్లు ప్రకటించారు. ఈ రెండు సబ్స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ.7.09 కోట్లు వ్యయమవుతుందని వివరించారు. రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలువీర్నపల్లి: మండలంలో సోమవారం రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని బంజేరుకు చెందిన బట్టు వెంకటేశ్ బైక్పై వీర్నపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎదురుగా అదే గ్రామానికి చెందిన మాలోత్ హరిదాస్ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బైక్లు ఢీకొట్టుకున్నాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
‘అమ్మ’లకు అక్షర పరీక్ష
● డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహణ ● ‘ఉల్లాస్’లో పరీక్షలు రాసిన 12,856 మంది మహిళలు సిరిసిల్ల: కొడవళ్లు పట్టిన.. బీడీలు చుట్టిన.. ఉపాధిహామీ పనిలో పలుగు, పారలు, తట్టా బుట్టలు పట్టిన చేతులు ఆదివారం అక్షరాలు రాశాయి. సామాజిక చైతన్యంతో బుద్ధిమాటలు చెప్పిన ‘అమ్మ’లు చిన్నపిల్లల్లా మారి అక్షరాలు రాస్తూ మురిసిపోయారు. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 12,856 మంది అమ్మలు.. అక్కలు.. అక్షరాలు రాసి తమ అక్షర చైతన్యం చాటారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం వయోజన నిరక్షరాస్య మహిళలు ‘ఉల్లాస్’లో పరీక్షలు రాశారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 23,375 మంది నిరక్షరాస్యులైన మహిళలకు అక్షరాలు నేర్పించేందుకు ‘ఉల్లాస్’లో మూడు నెలల క్రితం పుస్తకాలు అందించారు. వారు నేర్చుకున్న అక్షరాలను ఆదివారం పరీక్షల్లో రాశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర వయోజన విద్య ఉపసంచాలకులు ఎం.డీ.నుమాన్, జిల్లా ఉపసంచాలకులు డి.ఆంజనేయులు పరిశీలించారు. డీఆర్డీవో మచ్చ గీత పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఆగస్టులో రెండోదశ పరీక్షలు కనీస విద్య అందరికీ అవసరమని ప్రభుత్వం ‘ఉల్లాస్’ నిర్వహిస్తోందని వయోజన విద్య ఉపసంచాలకులు నుమాన్ తెలిపారు. రెండోదశలో అక్షరమాల పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తామన్నారు. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చేదిద్దే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వ్యాసరచనలో సత్తాచాటిన శ్రీనిధిముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రస్థాయిలో భాషోపాధ్యాయ సంఘం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మండలంలోని నామాపూర్ మోడల్స్కూల్ పదో తరగతి విద్యార్థిని వేదునూని శ్రీనిధి సత్తాచాటింది. హన్మకొండలో జరిగిన వేడుకలో రూ.2వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. శ్రీనిధిని ప్రిన్సిపాల్ కొండల్రెడ్డి, తెలుగు పండితుడు పాక అంజయ్య అభినందించారు. -
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
చందుర్తి(వేములవాడ): కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన చందుర్తి, రుద్రంగి మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరానికి హాజరై మాట్లాడారు. మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మండల శాఖ అధ్యక్షులు మోకిలే విజేందర్, కర్ణవత్తుల వేణు, రాష్ట్ర నాయకులు అల్లాడి రమేశ్, ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కౌడిపల్లి గోపాల్రెడ్డి, జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేశ్ పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: ప్రజాప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8, 9వ వార్డుల నుంచి పలువురు యువకులు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బడుగు భరత్, నాగరాజు, రజనీకాంత్ పాల్గొన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు అవుతుంది. శాంతినగర్లో ఇళ్ల పంపిణీ కోసం 106 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇండ్లను పంపిణీ చేయలేదు. దీంతో ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పటికై నా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలి. – మూషం రమేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
ఉద్యమకారుల అరెస్ట్ అప్రజాస్వామికం
● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పలువురు ఖండించారు. సిరిసిల్లలో ఆదివారం అరెస్టయిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు ఠాణాలో నిరసన తెలిపారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు 250, గజాల భూమి రూ.25 వేల పెన్షన్. సంక్షేమబోర్డు, గుర్తింపుకాార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. అరెస్టు అయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మామిడాల రమణ, కొండ శంకర్, బింగి ఇజ్జగిరి, కొక్కుల ఆంజనేయులు, గుజ్జే దత్తాద్రి, చిలుక శారద పాల్గొన్నారు. -
నిర్మించారు.. వదిలేశారు!
సిరిసిల్ల అర్బన్: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం సిరిసిల్ల పట్టణ పరిధి లోని శాంతినగర్, పెద్దూరు, రగుడు గ్రామాల్లో డ బుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసింది. పూర్తయిన ఇళ్లు పేదలకు కేటాయించేందుకు ము న్సిపల్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డుల వ్యాప్తంగా 7,363 దరఖాస్తులు వచ్చాయి. వాటిపై రెవెన్యూ, మున్సి పల్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేశారు. లబ్ధిదారులను సైతం ఎంపిక చేశారు. వచ్చిన దరఖాస్తులలో 4,161 మందిని అనర్హులుగా గుర్తించా రు. అర్హులైన 3,202 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టణ పరిధిలోని పెద్దూరు, రగుడు గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా.. శాంతినగర్లో ని ర్మించిన 204 ఇండ్ల కేటాయింపు విషయంలో అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. లబ్ధిదారుల ఎదురుచూపులు ‘డబుల్’ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అధికారులు సర్వేలు చేశారు. వార్డు సభలు నిర్వహించి లబ్ధిదా రులను ఎంపిక చేశారు. రగుడు వద్ద 72, పెద్దూరులో 516 డబుల్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశా రు. శాంతినగర్లో 204 ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో డబుల్ బెడ్రూమ్ కాలనీలో పిచ్చిమొక్కలు మొలి చాయి. కొన్ని ఇళ్ల కిటికి అద్దాలు ధ్వంసమయ్యా యి. కొన్ని భవనాలు చిన్నపాటి వానలకు ఉరుస్తున్నాయి. జనసంచారం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.శాంతినగర్ ‘డబుల్’ కాలనీలో పెరిగిన పిచ్చిమొక్కలు పగిలిపోయిన కిటికి అద్దం -
డబుల్బెడ్రూమ్ కాలనీలో నీటి గోస
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ డబుల్బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో నీటిఎద్దడి నెలకొంది. కేసీఆర్ కాలనీతోపాటు పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలో సైతం నీటికి గోస పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. మిషన్ భగిరథ నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కాలనీల్లో వారం రోజులుగా నీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. కాలనీకి నీటిని అందించే బోరుబావిలో అడుగంటడం, మోటారు కాలిపోవడంతో నీటికి కటకట ఏర్పడిందన్నారు. పంచాయతీ అధికారులు నీటికష్టాలు తీర్చేందుకు నిత్యం ట్యాంకర్ ద్వారా సంపులోకి నీటిని అందిస్తున్నారన్నారు. అయినా నీరు సరిపోవడం లేదన్నారు. బోరు రిపేరు చేసి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ సిబ్బంది తెలిపారు. -
బస్సుల సంఖ్య పెంచండి● మంత్రి పొన్నం ప్రభాకర్కు విప్ ఆది శ్రీనివాస్ విన్నపం
పెన్షన్ డబ్బుల కోసం వచ్చి మృత్యువాతసిరిసిల్ల అర్బన్: పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనం రూపంలో మృత్యువు ఆ వృద్ధురాలిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన దానవేని నర్సవ్వ(80) పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు స్థానిక బైపాస్రోడ్డు పక్కన ఉన్న బ్యాంకుకు వెళ్లింది. పెన్షన్ తీసుకొని ఇంటికొస్తుండగా కామారెడ్డి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాలు విరిగి దూరంలో ఎగిరిపడింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి నర్సవ్వ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బైపాస్ రోడ్డు వెంట గాలించడంతో మృతిచెంది కనిపించింది. నర్సవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులకు రాజన్న కోడెలు
● ఏప్రిల్ 7న పంపిణీ ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేములవాడఅర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాల కోడెలు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ శనివారం తెలిపారు. తిప్పాపూర్లోని గోశాలలో 300 కోడెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 7న రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు కోడెలను పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచి ంచారు. వివిధ ధ్రువీకరణపత్రాలతో https://rajannasiricilla.telan gana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకే జియో ట్యాగింగ్ కోడెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోడెలు తీసుకెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. కో డెలు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అభివృద్ధి పనులు ప్రారంభం
● కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో రూ.25లక్షలతో నిర్మించిన పనులు, శివాజీ విగ్రహాన్ని స్థానిక సర్పంచ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ముస్తాబాద్లో బిజీబిజీ ముస్తాబాద్లో ఎన్ఆర్ఐఈజీఎస్ ద్వారా మంజూరైన నిధులతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ భూమిపూజ చేశారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్రెడ్డి గృహంలో జరిగిన హన్మాన్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండలాల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు, సౌల్ల క్రాంతి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి పాల్గొన్నారు. -
రాజీయే రాజమార్గం
సిరిసిల్లటౌన్/వేములవాడ: రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 14,820 కేసులు పరి ష్కరించినట్లు తెలిపారు. రూ.6,74,41,119 పరిహారంగా ఇప్పించినట్లు వివరించారు. ప్రమాద కేసులు 13, సివిల్ తగాదాలు 17, క్రిమినల్ కేసులు 330, ఎకై ్సజ్ కేసులు 43, చెక్బౌన్స్ కేసులు 20, కుటుంబ తగాదాలు 10, బ్యాంకు కేసులు 45, బీఎస్ఎన్ఎల్ 10, డ్రంకెన్డ్రైవ్ 1,851, ట్రాఫిక్ చలా న్ కేసులు 12,481 పరిష్కారమయ్యాయి. పోక్సో కోర్టు జడ్జి రాధికా జైశ్వాల్, సబ్కోర్టు జడ్జి లక్ష్మణాచారి, ఏఎస్పీ చంద్రయ్య, లోక్అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రావు పాల్గొన్నారు. వేములవాడలో 832 కేసులు జాతీయ లోక్అదాలత్లో 832 కేసులు పరిష్కారమైనట్లు వేములవాడ జూని యర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి తెలిపారు. గొడవపడ్డ అన్నదమ్ములు రాజీ కుదుర్చుకోవడంతో శాలువాతో సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, లోక్ అదాలత్ మెంబర్లు నాగుల సత్యనారాయణ, నక్క దివాకర్, ఏజీపీలు బొడ్డు ప్రశాంత్కుమార్ పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026Iఎల్లారెడ్డిపేట: నారాయణపూర్ శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.వేములవాడ: సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన శివపార్వతులు, హిజ్రాలు శనివారం బద్దిపోచమ్మకు బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. ఎండలు తీవ్రంగా ఉంటాయి. వేడిగాలులు వీస్తాయి. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. -
కష్టంలోనూ తోడునీడగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారి లడ్డూకు రూ.70వేల వేళం పాటపాడా రు. ఈ లడ్డూను గ్రామానికి చెందిన వంగల లింగారెడ్డి–శోభ దంపతులు దక్కించుకున్నారు. బచ్చు మోహన్ రూ.40వేలతో స్వామి వారి వ్రతానికి మెట్లు చేయించారు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రి వైద్యుడు సత్యనారాయణస్వామి రూ.50వేలతో అన్నదానం చేశారు. సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ మోతె మధుసూదన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేరబేగం, వైస్చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, డీటీ ఎలుసాని ప్రవీణ్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
లక్కీ మిరానీ.. మిరాకిల్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్కు చెందిన లక్కీ మిరానీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గుర్తింపు పొందుతున్నాడు. బాల్యంలోనే చూపు కోల్పోయినప్పటికీ, సంకల్పం, క్రమశిక్షణతో చీకటిని జ్ఞాన వెలుగుగా మలచుకుంటూ తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడుతున్న దృష్టి లోపం గల యువకుడిగా లక్కీ మిరానీ రికార్డు సాధించాడు. మిరానీ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 95.80శాతం మార్కులు సాధించాడు. యూజీసీ ఎంట్రెన్స్లో ఆలిండియా 1వ ర్యాంక్ సాధించి, తొలి ప్రయత్నంలోనే యూజీసీ నెట్ క్లియర్ చేశాడు. చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తన ప్రతిభ చాటాడు. గోల్బాల్ క్రీడలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. లక్కీ విజయాల వెనుక అతని తల్లిదండ్రులు దీపక్ మిరానీ, ముస్కాన్ మిరానీ నిలవడం విశేషం. ప్రస్తుతం పాలిటికల్ సైన్స్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్కీ, భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్లో సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
ఎండుతున్న పంటలు
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కళ్ల ఎదుటే పంట పంటలు ఎండుతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు. చిప్పలపల్లిలో యాసంగిలో దాదాపు 900 ఎకరాలలో వరిపంట సాగుచేశారు. భూగర్భ జలాలు అడిగంటి పోవడంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎత్తిపోయాయి. ఇప్పటికే దాదాపు 400 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. చిప్పలపల్లికి శాపం చిప్పలపల్లికి ఎలాంటి నీటి ఆధారం లేదు. ఎగువమానేరు ప్రాజెక్టు కెనాల్ చిప్పలపల్లిలో లేదు. చిప్పలపల్లి గ్రామ సరిహద్దు నుంచి ఎగువమానేరు కెనాల్ వెళ్తున్నా ఈ పొలాలకు చుక్క నీరు కూడా వినియోగించుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు బోరుబావులనే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ఒక్కో రైతు మూడు నుంచి ఐదు బోర్లు వేసి పంటలు సాగు చేస్తున్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టు కెనాల్ చిప్పలపల్లికి మళ్లించాలని గ్రామస్తులు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే మల్లన్నసాగర్ కెనాల్ సైతం నామాపూర్ వరకు ఉండడంతో చిప్పలపల్లి పంట పొలాలకు రావడం లేదు. మల్లన్నసాగర్ జలాలు వస్తాయన్న ఆశ చిప్పలపల్లి రైతుల్లో ఉండగా, అది కూడా నెరవేరలేదు. చిప్పలపల్లిలో కేవలం ఒక ఊర చెరువు ఉన్నప్పటికీ అది వర్షాధారమే. మానేరు ప్రాజెక్టు లేదా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కెనాల్ నీటిని చిప్పలపల్లికి మళ్లిస్తే పుష్కలమైన పంటలు పండుతాయి. చిప్పలపల్లికి ఎలాంటి నీటి వసతి లేదు. యాసంగిలో బోర్లు ఎండిపోయి, చుక్క నీరు లేదు. మల్లన్నసాగర్, ఎగువ మానేరు ప్రాజెక్టు కెనాల్స్ చిప్పలపల్లి వరకు వేయాలి. సాగు, తాగునీటిని అందించాలి. – మాచెట్టి లచ్చయ్య, సర్పంచ్, చిప్పలపల్లి -
యూపీఐ లంచం!
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్క్రైం: సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాన్ని వేగవంతం చేయడంతో పాటు అవినీతి అధికారులకు అనుకూలంగా మారుతోంది. ఒకప్పుడు కవర్లలో, బ్యాగుల్లో దూరే నగదు, బళ్ల కింద నుంచి వెళ్లే లంచాలు ఇప్పుడు ‘స్కాన్ అండ్ పే’ రూపంలో అకౌంట్లలో చెలామణి అవుతున్నాయి. ‘నగదు దొరికితేనే కేసు’ అనే పాత భావన నుంచి తప్పించుకోవడానికి అధికారులు డిజిటల్ మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి మార్గాలపై నిఘా పెట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసదాడులు చేపడుతున్నారు. యూపీఐ ద్వారా లంచం తీసుకున్న అధికారులను ఆధారాలతో సహా పట్టుకుని కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల వద్ద లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ను ఈనెల 16న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ బినామీ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా రూ.14,77,003 లంచం తీసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని విడిచిపెట్టేందుకు యూపీఐ ద్వారా రూ.15వేల లంచం తీసుకున్న కేసులో గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఎస్సైగా పనిచేసిన వెంకటేశ్వర్లును కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈనెల 24న అరెస్టు చేశారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సైగా ఉన్నారు. -
రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
కరీంనగర్లో సినీనటి మెహరిన్ సందడి
కరీంనగర్: కరీంనగర్లో ప్రముఖ సినీనటి మెహరిన్ బుధవారం సందడి చేశారు. సుభాష్నగర్లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్ హాస్పిటల్స్ను ప్రారంభించారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ – చిల్డ్రెన్ సంస్థను కరీంనగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రెన్ ప్రారంభం -
స్కానింగ్ సెంటర్లపై నిఘా
సిరిసిల్ల: గర్భస్థ లింగనిర్ధారణ నిరోధక చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్యాధికారి ఆఫీ స్లో జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. రజిత మాట్లాడుతూ భ్రూణ హత్యలు అరికట్టడానికి, లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేల జరి మానా, మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు తెలిపా రు. మానేరు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, సలహా సంఘం కన్వీనర్, ప్రోగ్రాం ఆఫీసర్ నాగేంద్రబాబు, గైనకాలజిస్ట్ సూచేత లక్ష్మి, డాక్టర్లు సాయికుమార్, ఆదిత్య, రామకృష్ణ, నహీ మ, డిప్యూటీ డెమో రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దు చేయాలి
సిరిసిల్ల అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షనర్లకు తీవ్రంగా నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టంను వెంటనే రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు బలరాం కోరారు. బుధవారం కలెక్టరేట్ వద్ద జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం ప్రకారం 1.1.2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు పీఆర్సీ, డీఆర్లు, పెన్షన్ పెంపుదల ఉండవన్నారు. పెన్షనర్లకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రికి చేరేలా చూడాలని కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు చౌకి సుధాకర్, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
● రాచర్ల బొప్పాపూర్లో విషాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్ డివైడర్ను ఆటో ఢీన్న ఘటనలో చికిత్స పొందుతున్న రాచర్ల బొప్పాపూర్కు చెందిన బొమ్మనవేణి రాజు(39) బుధవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 23న ఉదయం కరీంనగర్ డెయిరీకి చెందిన పాల క్యాన్లతో ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా స్థానిక పాతబస్టాండ్లో ఆటో అదుపుతప్పి కప్పుసాసర్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో రాజు అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువజామున మరణించాడు. మృతునికి భార్య ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. పాముకాటుతో వృద్ధురాలి మృతి ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
బల్దియా లైన్మెన్కు విద్యుత్ షాక్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న బొమ్మకల్కు చెందిన లైన్మెన్ శివ విద్యుత్షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అలుగునూరులో స్ట్రీట్ లైట్ బిగిస్తున్న స మయంలో పక్కనే ఉన్న 11 కేవీ లైన్ తగలడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మేయర్కొలగాని శ్రీనివా స్ వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకొని, శివ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సి పల్ కార్మికులకు భద్రతా పరికరాలు అందించాలని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. విద్యుత్షాక్తో గాయపడిన శివను ఆసుపత్రిలో పరామర్శించారు. రూ.3.46 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తులువీర్నపల్లి(సిరిసిల్ల): ఆన్లైన్ మోసగాళ్ల ఉచ్చులో ప డి ఓ రైతు భారీగా నగదు కోల్పోయిన ఘటన వీర్నపల్లి మండలంలో అడవిపదిరలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన పొలగాని లచ్చయ్యకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. తాము ధని బ్యాంక్ ప్రతినిధులమని నమ్మించారు. భారీ మొత్తంలో లోన్ ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో పలు విడతల్లో రూ.3,46,799 కాజేశారు. నగదు పంపిన తర్వాత సదరు వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లచ్చయ్య పోలీసులను బుధవారం ఆశ్రయించారు. -
వంటగ్యాస్ కొరత లేదు
సిరిసిల్ల: జిల్లాలో వంటగ్యాస్ కృత్రిమ కొరతను సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్.బుచ్చిబాబు హెచ్చరించారు. జిల్లాలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పక్షం రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాలో జాప్యం, పెట్రోల్బంకుల్లో ఇంధన కొరత ఉందని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారిని ‘సాక్షి’ బుధవారం ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...బుకింగ్ల సంఖ్య పెరిగింది పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ సరఫరాలో జాప్యమవుతుందని, వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందని మీడియాలో ప్రచారంతో ప్రజలు హైరానాపడ్డారు. అదనపు సిలిండర్ను ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నారు. జిల్లాలో నెలకు సగటును 2,500 నుంచి 3వేల వరకు సిలిండర్ల రీఫిల్లింగ్ బుకింగ్ జరిగేది. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా 5 వేల సిలిండర్లు బుక్ అయ్యాయి. దీంతో సరఫరాలో జాప్యమవుతుంది. పట్టణాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒక్క సిలిండర్ సరఫరా అవుతుంది. 13 కేసులు బుక్ చేశాం జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో గృహావసరాలకు వాడాల్సిన ఎల్పీజీ గ్యాస్ను కమర్షియల్గా వినియోగిస్తున్నట్లు గుర్తించి 13 కేసులు బుక్ చేశాం. 33 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. ఎవరైన సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా శిక్షిస్తాం. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు 11 ఉండగా.. 1,49,453 కనెక్షన్లు ఉన్నాయి. 685 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి జిల్లాలో 78 పెట్రోల్బంకులు ఉన్నాయి. అంతటా పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్మీడియాలో వస్తున్న వదంతులు, ప్రచారాలు నమ్ముతూ కొన్ని పెట్రోల్బంకుల్లో క్యూ కడుతున్నారు. నిజానికి జిల్లాలో ఇంధన కొరత లేదు. పెట్రోల్ బంకులకు ఐవోసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీ కంపెనీలు అరువుపై ఇంధనాన్ని సరఫరా చేసేవి. ఇప్పుడు యుద్ధంతో నగదు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ పంపిస్తామని చెప్పడంతో కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ఆయా కంపెనీల సేల్స్ ఆఫీసర్లతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. హెల్ప్డెస్క్ ఏర్పాటు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా జిల్లా స్థాయిలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశాం. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలతో కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసి ఆఫీస్ పనివేళల్లో ఫిర్యాదులను నమోదు చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేశారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నాం. ఇంకా ఎవరికై నా సమస్యలు ఉంటే హెల్ప్డెస్క్ 80084 29738లో సంప్రదించవచ్చు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తాం. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం. 239 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 159, ప్యాక్స్ పరిధిలో 72, మెప్మా ఆధ్వర్యంలో 7, డీసీఎంఎస్ పరిధిలో ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. గోదాములను పరిశీలిస్తున్నాం. యాసంగిలో 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. గత అనుభవాల ప్రకారం 2.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచులను సిద్ధం చేస్తున్నాం. జిల్లాలోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు, పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనదారులు హైరానా పడకుండా.. అవసరాలకు మించి నిల్వలు చేయొద్దు. ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో అన్ని జాగ్రత్తలను జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. -
ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మండల కేంద్రంలోని మోడల్ హౌ స్ను బుధవారం ప్రారంభించారు. అనంతర గుండారంలో చెందిన సిద్ధాల అఖిల, కంకణాల శ్రీలత, ఇందిరాల మమత, లకావత్ సునీత ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ ప్రారంభించారు. ఫిల్లర్ రూఫింగ్తో ఖర్చు ఆదా హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌస్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తగ్గించేందుకు, స్లాబ్ నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు ఫిల్లర్ రూఫింగ్ విధానంలో నిర్మించడంపై అధికారులను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 777 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినట్లు తెలి పారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఈ సాజిద్, ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో రాజు పాల్గొన్నారు. భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలి దివ్యాంగ విద్యార్థులు భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మండలకేంద్రంలో భవిత కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ బుధవారం, గురువారం ఐఈఆర్పీ, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపా రు. అనంతరం మండల సమాఖ్య భవనాన్ని పరిశీ లించారు. జూనియర్ కళాశాల మైదానంలో పనులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి పాల్గొన్నారు. సేంద్రియ సాగు చేయండి కోనరావుపేట(వేములవాడ): రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ధర్మారంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో కషాయాలు, సేంద్రియ ఎరువు తయారీ విధానం పశువుల పెంపకం ఇతర అంశాలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, సర్పంచ్ మిర్యాల్కార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
సిరిసిల్లటౌన్: స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం సిరిసిల్లలోని నేతన్నచౌక్లో నిరసన చేపట్టారు. ఎస్.కె. అఫ్రోజ్, సాయి, తేజ, ఎండి అజ్జు, చరణ్, వినయ్, నిఖిల్, శశాంక్, అఖిల్, అభిషేక్, కై లాస్, మనోజ్, వంశీ, నిఖిల్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో బుధవారం కలిసి విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీపీలు గుడిసె ఐలయ్య, వి.వెంకటరమణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్రెడ్డి, ఆకుల సత్యం ఉన్నారు. వేములవాడరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హనుమంతు కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో వేములవాడరూరల్ మండలం బొల్లారంలో ప్రధానమంత్రి ముద్ర యోజనపై బుధవారం అవగాహన కల్పించారు. హనుమంతు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల లక్షణాలు, కొత్త యూనిట్ స్థాపనకు పరిశోధన ఎలా చేయాలి, కేంద్ర పథకాలు పీఎంఎంవై, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈపై అవగాహన కల్పించారు. ట్రైనర్ వంశీకృష్ణ, చార్టర్ అకౌంటెంట్ ఆంజనేయులు, ఈడీసీ మేనేజర్ జయంత్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటశివసాయి పాల్గొన్నారు. ఇల్లంతకుంట/సిరిసిల్ల ఎడ్యుకేషన్: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన జానపద రచయిత, గాయని కట్కూరి స్నేహకు పీపుల్స్ మీడియా పాయింట్ శివంగి ఆత్మీయ పురస్కారాన్ని అందించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ‘అల్లిబిల్లి సోకులాడి చిట్టమ్మి..’ అనే పాటతో స్నేహకు పేరు వచ్చింది. ఇప్పటి వరకు వందకు పైగా పాటలు రాసి, పాడింది. 7న ‘సెస్’ సర్వసభ్య సమావేశంసిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 7న నిర్వహిస్తున్నట్లు ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు బుధవారం తెలిపారు. సిరిసిల్ల శివారులోని సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో ఉదయం 10.30 గంటలకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని వివరించారు. సిరిసిల్ల ‘సెస్’ ఆఫీస్లో బుధవారం పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘సెస్’ జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు పాలకవర్గం నిర్ణయించింది. ‘సెస్’ సభ్యులకు ముందస్తు సమాచారం అందిస్తామని తెలిపారు. -
పంటనష్టం పరిశీలన
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో మంగళవారం కురిసిన వడగండ్ల వానకు జరిగిన పంటనష్టాన్ని బుధవారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఎర్రగడ్డతండా, రంగంపేట, బాబాయిచెరువుతండా, భూక్యాతండా, బావుసింగ్తండా, లాల్సింగ్తండాల్లోని పొలాను పరిశీలించారు. దాదాపు 185 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట పరిశీలనలో వ్యవసాయాధికారి ఫజిలుద్దీన్, రైతులు పాల్గొన్నారు. చందుర్తిలో 50 ఎకరాల్లో పంట నష్టం చందుర్తి(వేములవాడ): మండలంలోని తిమ్మాపూర్, ఆశిరెడ్డిపల్లె, రామన్నపేట, చందుర్తి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు 50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఏఈవోలు బుధవారం పరిశీలించారు. తిమ్మాపూర్లో గడికొప్పుల రాజేశం(6 ఎకరాలు), అట్టపెల్లి సతీశ్(3 ఎకరాలు), పేరుక మల్లేశం(5 ఎకరాలు), బొడ్డు దేవయ్య(2 ఎకరాలు), చందుర్తిలో మెంగని హన్మండ్లు, కోన లక్ష్మణ్, కోన శ్రీనివాస్, మర్రి మల్లేశంతోపాటు పలువురికి చెందిన 34 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఏఈవోలు యోగేశ్వర్, ప్రవీణ్ తెలిపారు. -
నియమించారు!
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026లక్షణంగా● ‘అర్బన్ బ్యాంకు’లో వసూళ్లపర్వం ● ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు వసూలు ● చక్రం తిప్పిన అర్బన్బ్యాంకు కీలక నేత ● 8 పోస్టులకు 67 మంది దరఖాస్తుసిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగులను ‘లక్ష’ణంగా నియమించారు. ప్రతిభ ఉన్న అభ్యర్థులను, బ్యాంకు అభివృద్ధికి పనిచేసే వారిని నియమించాల్సి ఉండగా.. పైరవీలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. గత శుక్రవారం ఆరు కాంట్రాక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 46 మంది హాజరయ్యారు. ఎంపికై న అభ్యర్థులు ఆరుగురు సోమవారం విధుల్లో చేరారు. ఒక్కో కాంట్రాక్టు పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అక్టోబరులో నోటిఫికేషన్ సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ బ్రాంచ్లు ఉన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటల్లో ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. రెండు బ్రాంచ్లలో కలిపి 10 వేల మంది సభ్యులతో ఏటా సుమారు రూ.750 కోట్ల లావాదేవీలతో రూ.125కోట్ల డిపాజిట్లతో రూ.90 కోట్ల రుణాలు అందించింది. వేములవాడ, కరీంనగర్లోనూ కొత్తగా బ్రాంచ్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే సరిపోయేంత సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలోనే రెండు మేనేజర్ పోస్టులు, ఆరు క్లర్క్ పోస్టుల భర్తీకి 2025, అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేశారు. మేనేజర్ పోస్టులకు నలుగురు, క్లర్క్ పోస్టులకు 63 మంది దరఖాస్తు చేశారు. ప్రతిభ ఆధారంగా కాకుండా పైరవీలు, పైసలతో నియామకాలు జరిగినట్లు చర్చ సాగుతోంది. రెండు మేనేజర్ పోస్టులకు అనర్హులు దరఖాస్తు చేయడంతో ఆ పోస్టుల భర్తీని నిలిపివేశారు. సీఈవో పోస్టుకు రెండు సార్లు నోటిఫికేషన్ అర్బన్బ్యాంకులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) నియామకానికి గతంలో రెండుసార్లు నో టిఫికేషన్ ఇచ్చారు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు సీఈవో పత్తిపాక శ్రీనివాస్ 2020లో రిటైర్డు అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ అధికారి శేరి శ్రీనివాస్ను ఇన్చార్జి సీఈవోగా నియమించారు. పనులు, పాలకవర్గం ఒత్తిళ్లతో శ్రీనివాస్ దీర్ఘకాలిక సెలవు పెట్టారు. ఆయన స్థానంలో కరీంనగర్కు చెందిన చీటి ప్రకాశ్రావును సీఈవోగా తీసుకునేందుకు ప్రతిపాదించారు. వాస్తవానికి చీటి ప్రకాశ్రావు మహారాష్ట్రలో 2014 అక్టోబరులో రిటైర్డు అ య్యారు. ఆయన్ని అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో బ్యాంకు సీఈవోగా నియమించారనే ఆరోపణలు న్నాయి. 2021లో ఒక్కసారి, 2022 జూలై 7న మరో సారి బ్యాంకు సీఈవో పోస్టు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. 27 మంది దరఖాస్తు చేశారు. కానీ అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే నియామకాలను పక్కన పెట్టారు. మళ్లీ అక్టోబరులో కాంట్రాక్టు జూనియర్ అసిస్టెంట్(క్లర్క్) పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో అనేక మంది నిరుద్యోగులు ఆశతో దరఖాస్తు చేశారు. ఆ పోస్టులు అమ్ముడుపోవడంతో ప్రతిభ గల నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తుంది.అర్బన్ బ్యాంకు పాలకవర్గంలోని ఓ కీలక నేత వసూళ్లపర్వాన్ని కొనసాగించినట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.3.50లక్షలు తీసుకుంటూ.. పాలకవర్గంలోని వారికి రూ.3 లక్షలే ఇచ్చినట్లు చెప్పాలని, మిగతా రూ.50వేలు ఖర్చులు ఉన్నాయని సదరు కీలకనేత స్పష్టం చేసినట్లు తెలిసింది. మీ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో నియామకమై.. పర్మినెంట్ అవుతాయని, డబ్బుల విషయం బయటకొస్తే మీకే నష్టమంటూ బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. వసూళ్లపర్వంలోనూ తారతమ్యాలు పాలకవర్గంలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ఈ వసూళ్లపర్వంపై సహకార శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
కొత్తగా ఐదు
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026ఎంపికై న విద్యార్థులతో డీఈవో, ఎంఈవోసాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకుంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసివస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రయోజనాలు ఏమిటి? మున్సిపల్, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్తో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నారు. పాతవాటితోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీస్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే, మహిళలకు కేటాయించేవి ఏమిటి, మహిళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారే అంశాలపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏమిటో? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించిఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్ మున్సిపల్, రూరల్తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్ ప్రాంతంతో కరీంనగర్ రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో జగిత్యాల రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కల్యాణ వైభోగమే..
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో మంగళవారం గౌడకులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ–జమదగ్నిల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎదుర్కోలు కార్యక్రమం అనంతరం బైండ్ల పూజారులు నాగవెళ్లి పట్నం వేసి కల్యాణం జరిపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్గౌడ్, రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేరబేగం, సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) -
మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్ల: మహనీయులు బాబు జగ్జీవన్రామ్, బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో జగ్జీవన్రామ్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద రోజూ పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలకు ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలన్నారు. సెస్ అధికారులు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని, వైద్యులు, సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏఎస్పీ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్రెడ్డి, ఏఎస్డబ్ల్యూవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, డీఎంహెచ్వో రజిత, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఉద్యానవన అధికారి శరత్బాబు, ‘సెస్’ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, దళిత సంఘాల నాయకులు కత్తెర దేవదాస్, ఆకునూరి బాలరాజు, రాగుల రాములు, నాలుక సత్యం, బూర యాదగిరి, మేకల కమలాకర్, బాలయ్య, బొడ్డు నారాయణ, లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి బోయినపల్లి: టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని కొదురుపాక పీహెచ్సీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ బాధితులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థికసాయం అందిస్తుందని, వ్యాధి సోకినవారు మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో టీబీ రహిత గ్రామాల కోసం కృషి చేసిన 20 మంది పంచాయతీ కార్యదర్శులు, ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బందిని సన్మానించారు. డీఎంహెచ్వో రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబు, వైద్యులు శంకర్, సత్యనారాయణ, ఆనంద్రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రేణుప్రియాంక, రాజుకుమార్, తహసీల్దార్ నారాయణరెడ్డి, సర్పంచ్ మంజుల, ఎంపీవో శ్రీధర్, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సీతారాముల కల్యాణానికి పటిష్ట భద్రత
● ఎస్పీ మహేశ్ బి గితే వేములవాడఅర్బన్: రాజన్న ఆలయంలో ఈ నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్ బి గితే అధికారులకు సూచించారు. మంగళవారం ఆలయ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలపై దృష్టి సారించి, ట్రాఫిక్ను నియంత్రించేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించవద్దని, పెండింగ్ కేసులు వేగవంతంగా పూర్తి చేసి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని, రోజూ డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వీరప్రసాద్, ఆలయ ఈఈ రాజేశ్, డిఈ రఘునందన్, రామ్ కిషన్రావు తదితరులు పాల్గొన్నారు. -
నేలరాలిన ఆశలు
కోనరావుపేట: బావుసాయిపేటలో..వీర్నపల్లి: భావుసింగ్నాయక్ తండాలో నేలరాలిన వడ్లువీర్నపల్లి/కోనరావుపేట/చందుర్తి: జిల్లాలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో పలుచోట్ల వరిపంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, చేతికొచ్చిన పంట చేజారిపోయిందని పలువురు అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. వీర్నపల్లి మండలం బాబాయ్చెరువు తండా, భావుసింగ్నాయక్ తండా, భూక్య తండా, రంగంపేట తదితర గ్రామాల్లో కోతకు వచ్చిన వరిధాన్యం నేలపాలయింది. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట, కొండాపూర్ గ్రామాల్లో ధాన్యం రాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు బర్కం రమేశ్, నక్క మల్లేశం, కంటె సత్తయ్య, మ్యాకల రేవతి ప్రభుత్వాన్ని కోరారు. చందుర్తి మండలం తిమ్మాపూర్, ఆశిరెడ్డిపల్లె, రామన్నపేట గ్రామాల్లో గాలిపెల్లి వెంకటి, అట్టపల్లి సతీశ్, గడిగోప్పుల రాజశేఖర్, గాలిపల్లి సత్తయ్య తదితర రైతుల పొలాల్లో 30శాతానికి పైగా ధాన్యం రాలిపోవడంతో కుమిలిపోతున్నారు. పొలాలను పరిశీలించి ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపిక
ఇల్లంతకుంట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని హైస్కూల్కు చెందిన బయాలాజికల్ స్కూల్ అసిస్టెంట్ వుడుత మహేశ్ చంద్ర ఫిన్లాండ్ దేశంటీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికయ్యాడు. ఐదురోజుల పాటు ఫిన్లాండ్ దేశంలోని అనేక విద్యాసంస్థలను సందర్శించి ప్రముఖ యూనివర్సిటీలు, ఆధునిక పాఠశాలల్లో ప్రయోగాత్మక ఇన్నోవేటివ్ అప్రోచ్లు, స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ తదితర అంశాల్లో శిక్షణ పొందుతారు. చంద్రశేఖర్ను డీఈవో జగన్మోహన్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు శైలజ, పద్మజ, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, హెచ్ఎం ప్రేమలత, ఉపాధ్యాయులు అభినందించారు. -
గుట్టుగా భ్రూణహత్యలు !
జిల్లా జనాభా 5,52,037 కాగా.. పురుషులు 2,74,109, మహిళలు 2,77,928. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,014 మంది మహిళలు ఉన్నారు. కానీ బాల, బాలికల నిష్పత్తిని పరిశీలిస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆరేళ్లలోపు పిల్లల్లో బాలు రు 25,099 మంది ఉంటే బాలికలు 23,652 మందే ఉన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య 1,447 తక్కువగా ఉంది. జిల్లాలో భ్రూణహత్యలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. అందుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కోనరావుపేట మండలంలో వెయ్యి మంది అబ్బాయిలకు 886 మంది అమ్మాయిలు ఉన్నారు. బోయినపల్లిలో 917 మంది ఉన్నారు. అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో వెయ్యి మంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి జిల్లాలో భ్రూణహత్యలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టినా గుట్టుగా అబార్షన్లు జరుగుతున్నాయి. ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోటిక్ టెక్నిక్స్(పీసీ పీఎన్డీటీ) ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్ యాక్ట్ 1994, అండ్ రూల్స్ 1996 ప్రకారం తల్లి కడుపులోని పసి గుడ్డు లింగ నిర్ధారణను ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్లు వెల్లడించరాదు. గర్భంలో పాప ఎదుగుదల, లోపాలు తెలుసుకునేందుకు స్కానింగ్ ద్వారా పరిశీలించాలి. కానీ కొందరు డాక్టర్లు డబ్బుకు కక్కుర్తిపడి కడుపులోని పాప ఆడో, మగో చెప్పడంతో అబార్షన్లకు అవకాశమిస్తోంది. స్కానింగ్ సెంటర్లు, జనటిక్ సెంటర్లు, రేడియాలజిస్ట్లు తల్లి కడుపులోని బిడ్డ సెక్స్ను చెప్పడం జరుగుతోంది. ఇది నేరమని తెలిసినా పైసల కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. -
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20267కోనరావుపేట: మామిడిపల్లి శ్రీసీతారాముల శోభాయాత్ర సోమవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, టెంకాయలు కొట్టారు. వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 27న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శివార్చన వేదిక వద్ద చలువపందిళ్లు వేస్తున్నారు.ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అంతంతే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మోస్తారు గాలులు వీస్తాయి. -
వెల్లువలా దరఖాస్తులు
● ప్రజావాణికి 167 విన్నపాలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్మాది ముస్తాబాద్ మండలం పోతుగల్. మా సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ కాకుండా ఆమె భర్త శ్రీనివాస్ అన్ని తానంటూ వ్యవహరిస్తున్నాడు. కనీసం వార్డు సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. సర్పంచ్ భర్త వ్యవహారంపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలి. – పోతుగల్ గ్రామ పాలకవర్గ సభ్యులుమాది సిరిసిల్లలోని గణేష్నగ. ముస్తాబాద్లోని పీపుల్స్ ఆస్పత్రిలో గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ ఫెయిల్ కావడంతోపాటు మూత్రనాళం వద్ద తీవ్రగాయం చేయడం జరిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారు డీఎంహెచ్వో సిరిసిల్లకు రెఫర్ చేయగా సంబంధిత మెడికల్ రిపోర్ట్స్ రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. మెడికల్ రిపోర్ట్స్ త్వరగా ఇప్పించండి. – జి.అనూష, సిరిసిల్లసిరిసిల్ల మున్సిపల్ రోడ్డు డివైడర్లపై ఉన్న కోనోకార్పస్ మొక్కలతో అలర్జీలు, శ్వాస సమస్యలు వస్తున్నాయి. డివైడర్లపై మొక్కలు ఏపుగా పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోనో కార్పస్ మొక్కలను తొలగించి ఆ స్థానంలో అనుకూలమైన మొక్కలు నాటాలి. – చెన్నమేని రాజుకుమార్, సిరిసిల్లసిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక పలువురు బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటి కప్పుడు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి 167 దరఖాస్తులు స్వీకరించారు.నా భర్త 20 ఏళ్ల క్రితం మస్కట్లో మృతిచెందాడు. శవం కూడా ఇంటికి రాలేదు. నా ఇద్దరు పిల్లలు సాహరిక, వేణు దివ్యాంగులే. వారి వైద్యఖర్చులకు చాలా వరకు ఖర్చు అవుతున్నాయి. మాది నిరుపేద కుటుంబం. నా పిల్లలకు ఆర్థిక సహాయం చేసి, ఆదుకోవాలి. – కళ్యాణం కొమురవ్వ, దేశాయిపల్లి -
పర్యాటకంలో సిరిసిల్ల
సిరిసిల్ల: రాజన్న భక్తుల రాకతో జిల్లాకు పర్యాటకు ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ని లిచింది. ఏడాది పొడవునా భక్తులు వస్తుండడంతో వేములవాడతోపాటు నాంపల్లిగుట్ట సందడిగా మా రుతుంటుంది. జిల్లాకు 1,68,32,897 మంది పర్యాటకుల రాకతో వేములవాడ టూరిజం గుర్తింపు పొందింది. గతేడాదితో పోల్చితే జిల్లా తలసరి ఆదా యం పెరిగినా రాష్ట్రస్థాయిలో మాత్రం ర్యాంక్ దిగజారింది. 2025లో 28వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 30వ స్థానానికి పడిపోయింది. గోదావరి జలాల రాకతో జిల్లాలో వ్యవసాయరంగంలో ప్రగ తి సాధించింది. అభివృద్ధి సూచికలో స్వల్పంగా మెరుగుపడింది. సగటు వ్యక్తిగత తలసరి ఆదా యం గతేడాది కంటే రూ.42,259 పెరిగింది. 2026 సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా ఆరేళ్లలోపు అమ్మాయిల సంఖ్య తగ్గింది. ఫలితంగా జిల్లాలో పసిగుడ్డులను గుట్టుగా తల్లికడుపులోనే చిదిమేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో వాస్తవాలివీ. అక్షరాస్యతలోనూ అంతంతే.. జిల్లా అక్షరాస్యత 62.71 శాతం ఉండగా.. పురుషుల అక్షరాస్యత 73.5 శాతం, మహిళల అక్షరాస్యత 52.2 శాతంగా ఉంది. ఆరేళ్ల పైబడిన వారి సంఖ్య 5,03,286 మంది ఉండగా. ఇందులో 3,15,611 మంది చదువుకున్నారు. ఇందులో పురుషులు 1,82,296 మంది కాగా, మహిళలు 1,32,665 మంది ఉన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలో జిల్లా 18వ స్థానంలో ఉంది. పనిమంతులు 2,53,918 మంది జిల్లాలో పనిమంతులు 54.10 శాతం ఉన్నారు. జనాభాలో 2,53,918 మంది పనిచేస్తున్నారు. వ్యవసాయదారులు 66,751 మంది కాగా, వ్యవసాయ కూలీలు 1,01,737 మంది ఉన్నారు. పరిమితంగా పనిచేసే వారు 44,745 మంది ఉన్నారు. పనిచేసే అంశంలో రాష్ట్రంలో 30వ స్థానంలో జిల్లా నిలిచింది. గతేడాది ఒక్క వ్యక్తి తలసరి ఆదాయం(ప్రస్తుత ధరల్లో) రూ.2,13,725 ఉండగా.. ఆ ఏడాది రూ.2,55,984 ఉంది. ఒక్క ఏడాదిలోనే వ్యక్తి తలసరి ఆదాయం రూ.42,259 పెరిగింది. జాతీయ స్థాయిలో సగటు వ్యక్తి ఆదాయం రూ.2,19,575 కాగా.. జిల్లా సగటు ఆదాయం అంతకుమించి ఉండడం విశేషం. జిల్లా ఆదాయం రూ.5,363.27 కోట్లతో ఉంది. గుర్తింపు పొందిన పరిశ్రమలు 97 ఉండగా.. 520 మంది ఉద్యోగులు, 402 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా రూ.147.01కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. జిల్లాలో 1,38,992 కుటుంబాలు ఉండగా.. 16,058 కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. జిల్లాలో 4,224 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. వరి, పత్తిదే అగ్రస్థానం వరి, పత్తి పంటలదే అగ్రస్థానం. జిల్లాలో 2,37,373 ఎకరాల్లో వివిధ పంటలు వానాకాలంలో సాగవుతుండగా.. 1,87,688 ఎకరాల్లో వరి, 41,921 ఎకరాల్లో పత్తి పంట వేశారు. జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 80,389 ఉన్నాయి. గృహావసరాల విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 1,78,035 ఉండగా, పరిశ్రమల కనెక్షన్లు 22,255 ఉన్నాయి. జిల్లాలో 666 చెరువులు ఉండగా.. 30,017 ఎకరాలు సాగవుతుంది. వ్యవసాయ అనుబంధంగా పశుసంపద పెరిగింది. గతంలో 4,31,338 పశువులు ఉండగా.. ఈ ఏడాది 5,95,763కి చేరాయి. వస్త్రోత్పత్తి రంగంలోనూ మెరుగుపడినా.. వ్యక్తిగత తలసరి ఆదాయం పెరిగినా.. రాష్ట్రస్థాయిలో చివరి నుంచి నాలుగు స్థానంలో ఉండడం గమనార్హం. -
మిగిలింది రెండు రోజులే..
చందుర్తి(వేములవాడ): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతుభరోసా కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత గల రైతులు తగిన పత్రాలతో స్థానిక రైతువేదికల్లో ఏఈవోల వద్ద ఈనెల 25 వరకు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం విధించిన నిబంధల ప్రకారం జిల్లాలోని 6,283 మంది లబ్ధి పొందనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా రైతుభరోసాకు 1,200 మంది రైతులు దూరమవుతున్నారన్నది అనధికార లెక్కలు మాత్రమే. అయితే యాసంగి పంట సాగు సమయంలో ప్రభుత్వం రైతుభరోసాను అందించలేదు. సోమవారం నుంచి ఎకరం డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. పాత రైతులకే కాకుండా కొత్తగా పట్టా చేయించుకున్న వారికి కూడా పంట పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల పేర్లను తెలుపుతూ వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. 2025 వానాకాలం పంటకు జిల్లాలోని 1,24,292 మంది రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమైంది. కావాల్సిన పత్రాలు ఫిబ్రవరి 28, 2025లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు అర్హులు. రైతుభరోసా అప్లికేషన్ పత్రం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్లతోపాటు రైతు మొబైల్నంబర్ వ్యవసాయాధికారి కార్యాలయానికి తీసుకెళ్లాలి.మండలం రైతులు గంభీరావుపేట 440 ఇల్లంతకుంట 686 ముస్తాబాద్ 441 సిరిసిల్ల 305 తంగళ్లపల్లి 863 వీర్నపల్లి 79 ఎల్లారెడ్డిపేట 1,153 బోయినపల్లి 347 చందుర్తి 221 కోనరావుపేట 659 రుద్రంగి 73 వేములవాడ 705 వేములవాడరూరల్ 311 -
పదిర బ్రిడ్జికి మరమ్మతు
● కొన్ని నెలలుగా ఇబ్బందిపడ్డ ప్రయాణికులు ● ‘సాక్షి’ వరుస కథనాలు ● స్పందించిన అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రోడ్డుపై ఉన్న వంతెనపై పడ్డ భారీ గుంత మరమ్మతు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు ఎనిమిది నెలల క్రితం పదిర వద్ద గల బ్రిడ్జిపై భారీ గుంత పడింది. ఇక్కడ భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో గుంతను మట్టితో పూడ్చి హెచ్చరిక బోర్డు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి పదిర బ్రిడ్జి వద్ద ఒక వాహనం దాటిన తర్వాతే మరో వాహనం వెళ్లాయి. ఈ గుంతతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యా యి. స్పందించిన అధికారులు వంతెన మరమ్మతుకు రూ.3.75లక్షలు మంజూరు చేసి, టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సోమవారం పనులు ప్రారంభించారు. దీంతో వాహనాలను దారి మళ్లించారు. పదిర గ్రామంలో నుంచి హరిదాస్నగర్ పెద్దమ్మగుడి వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు పనులు ముగియడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.బ్రిడ్జి మరమ్మతు పనులు -
సిరిసిల్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఏర్పాటుకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యాలయంలో స్కూల్, జూనియర్ కళాశాల కొనసాగుతున్నట్లు గుర్తించారు. స్కూల్లో విద్యార్థుల సంఖ్య, ఎన్ని గదులు, ఎంత విస్తీర్ణంలో ఉందో ఆరా తీశారు. కాలేజీ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, తహసీల్దార్ మహేశ్కుమార్, హెచ్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ విధానంలో జనగణన జనగణన–2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జనగణనకు సంబంధించిన అంశాలపై చార్జ్ సహాయకులు, సాంకేతిక సహాయకులకు శిక్షణను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ నుంచి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ శ్రేయ, శిరీష తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రం పరిశీలన జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ తనిఖీ చేశారు. పాఠశాలలోని ఏ, బీ విభాగాలను తనిఖీ చేశారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో 7,304 మందికి 11 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు డీఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. సిరిసిల్లటౌన్: విద్య, ఉపాధి హక్కుల కోసం పోరాడుతామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్కుమార్, శ్రీరాముల సంజన, నాయకులు రమేశ్, రమణ, విమల, నవీన్, సతీశ్, శివ, జశ్వంత్ పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ముందుకురావాలని సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి కోరారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మోడల్స్కూల్, కేజీబీవీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లోని విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. వీర్నపల్లి, గొల్లపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఎస్.రంజిత్కుమార్, సకారం, బీట్ అధికారులు కిరణ్, రజిత, సతీశ్, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ అరుణ్కుమార్ పాల్గొన్నారు. కేంద్రియ విద్యాలయంలో అడ్మిషన్లుసిరిసిల్ల: జిల్లాలోని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో 2026–2027 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ ఎన్.శేషప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 2వ తేదీలోగా ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతి అడ్మిషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. 2వ తరగతి, ఆపై తరగతుల కోసం ఆఫ్లైన్ ద్వారా స్కూల్ పనివేళల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు పాఠశాల పనివేళల్లో సంప్రదించవచ్చని కోరారు. -
పారా అథ్లెటిక్స్లో ప్రతిభ
వీర్నపల్లి: మండలంలో జవహర్లాల్నాయక్ తండా పరిధి భంగీరెడ్డితండాకు చెందిన దివ్యాంగురాలు భూక్యా సక్కుబాయి జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో నిర్వహించిన 24వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఎఫ్40 కేటగిరీ షాట్పుట్ పోటీలో 12వ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. సక్కుబాయి దివ్యాంగురాలైనప్పటికీ పట్టుదలతో శ్రమించి, జాతీయ స్థాయిలో జిల్లా పేరు నిలబెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి
బోయినపల్లి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ప్రచారం చేయాలని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పరశురామ్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో రెండురోజులుగా జరుగుతున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ –2026 ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, శిక్షణతో కార్యకర్తలకు సిద్ధాంతపరమైన స్పష్టత, కార్యాచరణలో నైపుణ్యం, సమాజ సేవలో అంకితభావం పెరుగుతుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, మండల ప్రభారీ వైద రామానుజం, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఉదారి నరసింహాచారి, మండల మాజీ అధ్యక్షుడు గుడి రవీందర్రెడ్డి, సర్పంచులు బొంగాని అశోక్గౌడ్, పెంచాల సౌమ్య మహేశ్, నాయకులు జువ్వెంతుల శ్రీనివాస్రెడ్డి, మెరుపుల గంగా ధర్, సంగీత, గంగాధర్చారి, కొనుకటి హరీశ్, కొండం శ్రీనివాస్రెడ్డి, స్వామికుమార్, శరత్చంద్రారెడ్డి, సారంపల్లి రాజు, పాలోజు రాజేంద్రప్రసాద్, అమెరిశెట్టి గంగయ్య, ఇల్లందుల బాలయ్య, జనగం లక్ష్మణ్, సుంకపాక ప్రభు, రజనీకాంత్, ముఖ్యవక్తలు బత్తుల లక్ష్మీనారాయణ, కరెండ్ల మధుకర్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, సంగం నరేశ్ పాల్గొన్నారు. -
● విప్ ఆది శ్రీనివాస్
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంరుద్రంగి(వేములవాడ): ప్రజల అభ్యున్నతి, రైతు సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో రైతులు, పార్టీ నాయకులు 37 నెలల పాటు ప్రతినెలా 22న ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు నిర్వహించి నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూభాగానికి నీరు అందించే ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో సూరమ్మను చేర్చి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి మల్యాల గ్రామంలో రూ.1,737 కోట్లతో ప్రాజెక్టు పనులకు అంకురార్పణ చేశారని, రుద్రంగి నాగారం చెరువు వారి హయాంలోని పూర్తయిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నిల్వ సామర్థ్యాన్ని 150 ఎంసీఎఫ్టీ నుంచి 450 ఎంసీఎఫ్టీ వరకు పెంచే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా రైతాంగానికి నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, వేములవాడ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, చెరువుల అభివృద్ధి, కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
స్థలం లేక.. పనులు సాగక
ఇది సిరిసిల్ల శివారులోని చంద్రంపేట విద్యుత్ సబ్స్టేషన్. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ సబ్స్టేషన్లో రెండు ఫవర్ ట్రాన్స్ఫార్మర్లు(పీటీఆర్) ఉన్నాయి. వీటి పరిధిలో ఆరు ఫీడర్ల ద్వారా సిరిసిల్లకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. కలెక్టరేట్ శివారులో మరో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదన చేశారు. కలెక్టరేట్ వద్ద మరో విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తే.. చంద్రంపేట సబ్స్టేషన్పై భారం తప్పుతుంది. ఇక్కడ ఓవర్లోడ్తో తరచూ సిరిసిల్లలో విద్యుత్ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. రెండో బైపాస్ రోడ్డులో ఒకటి, శాంతినగర్లో మరోటి, సుభాష్నగర్లో మరో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే సిరిసిల్ల పట్టణ విద్యుత్ వినియోగదారుల లోవోల్టేజీ సమస్య తీరుతుంది. -
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
చేనేత రంగంపై చిన్నచూపెందుకు?సిరిసిల్ల: చేనేత, జౌళి రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపిందని, ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. జనాభా ధామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జాతిపితగా కేసీఆర్ను ప్రజలు గుర్తిస్తే.. బూతుపితగా సీఎం రేవంత్రెడ్డి మారారని విమర్శించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో చేనేత, జౌళి రంగానికి రూ.1,200 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.258 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడ్జెట్ను సవరించి చేనేత రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, ‘సెస్’ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీలు గజభీంకార్ రాజన్న, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, నాయకులు బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, సత్తార్, కోడి అంతయ్య, కౌన్సిలర్లు బింగి రాంబాబు, ఎలుక వెంకటేశ్యాదవ్, నాగరాజు, బాలు, నరేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణను అప్పుల్లో నెట్టిండ్రు
● రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ సిరిసిల్లటౌన్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలోని డీసీసీ ఆఫీసులో ఆయన సమక్షంలో గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ–నర్సాగౌడ్ దంపతులతో పాటు పలువురు వార్డు మెంబర్లు కాంగ్రెస్లో చేరగా, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పాలనలో షాడో సీఎంగా ఉన్న కేటీఆర్ తన నియోజకవర్గం అభ్యున్నతిని గాలికి వదిలేశారని ఫలితంగానే గంభీరావుపేట మండలం వెనుకబాటులో కొట్టుమిట్టాడుతుందన్నారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం, కాంగ్రెస్ అందిస్తున్న అభివృద్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపడుతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కటుకం మృత్యుంజయం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, మల్లుగారి నర్సాగౌడ్ పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీట గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని వార్డు సభ్యులు వినతిపత్రం అందించారు. మండల అధ్యక్షుడు హమీద్, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, ప్రశాంత్, అర్జున్, శ్రీమతి, శిరీష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
రెండు గ్రామాలకో సబ్స్టేషన్
జిల్లా పరిధిలో రెండు గ్రామాలకో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు మా లక్ష్యం. ‘సెస్’ పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్లు ఎంతో అవసరం. ఈమేరకు ఎన్పీడీసీఎల్ అధికారులకు నివేదికలు పంపిస్తూ మంజూరు చేయిస్తున్నాం. చాలా గ్రామాల్లో సబ్స్టేషన్ ఏర్పాటుకు వినియోగదారులు భూమిని కేటాయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో స్థలం సమస్య ఉంది. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నాం. స్థలం కేటాయిస్తే సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. – చిక్కాల రామారావు, ‘సెస్’ చైర్మన్, సిరిసిల్ల -
సామాజికాంశాలను కవిత్వీకరించాలి
● ప్రముఖ కవి జూకంటి జగన్నాథం సిరిసిల్ల: కవులు, రచయితలు సామాజికాంశాలను తీసుకుని కవిత్వీకరించాలని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం పేర్కొన్నారు. సిరిసిల్లలోని అక్షర చైతన్య గ్రంథాలయంలో శనివారం మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘మానేటి స్వరం’ పేరుతో ‘ప్రపంచ కవితా దినోత్సవం’ నిర్వహించారు. జూకంటి జగన్నాథం మాట్లాడుతూ 1999లో పారిస్లో జరిగి న యునెస్కో 30వ సర్వసభ్య సమావేశంలో మార్చి 21ని ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. తన చిన్నతనంలో విన్న పాండవ కథలు, హరికథల గురించి వివరించారు. తనను ప్రభా వితం చేసిన జక్కని వెంకటరాజం, కనపర్తి, నిజాం వెంకటేశంలను గుర్తుకు చేసుకున్నారు. పుస్తకాల అధ్యయనం అవసరమన్నారు. పూలే గులాంగిరి, అంబేడ్కర్ను చదవాలని సూచించారు. ‘పాతాళగరిగే’, ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ లోంచి కవితలను వినిపించారు. మారసం 37 ఏండ్ల ప్రస్థానాన్ని ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్ వివరించారు. మారసం వ్యవస్థాపకులు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ ప్రపంచ కవితా దినోత్సవం ఆవిర్భావ, వికాసాల గురించి వివరించారు. మారసం కోశాధికారి, కవులు ఎలగొండ రవి, వెంగళ లక్ష్మణ్, అక్షరచైతన్య గ్రంథాలయ స్థాపకులు నాగుల పూర్ణచందర్, రచయిత, జర్నలిస్ట్ అల్లె రమేశ్, కవులు దూడం గణేశ్, గుండెల్లి వంశీకృష్ణ, తాటిపాముల కిరణ్, వేముల మార్కండేయులు పాల్గొన్నారు. -
దివ్యా.. నీ వెంటే నేను
ఇల్లందకుంట: అతనో ఎస్సై.. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితం. ఈ నెల 17న కడుపునొప్పి బాధ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తట్టుకోలేని ఎస్సై సైతం నీవెంటే నేనంటూ.. శనివారం అత్తగారింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు అనాథలు కాగా.. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన దేసు చంద్రశేఖర్(36) ప్రస్తుతం కరీంనగర్ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన దివ్య(30)తో 2016లో వివాహమైంది. నగరంలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శుభమన్యు(4) అశ్వద్ధామ(7) ఉన్నారు. దివ్య ఆత్మహత్యతో... అన్యోన్యంగా సాగుతున్న వారి జీవన ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దివ్య కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 17వ తేదీన గన్నేరుపువ్వు, ఆకు పసరు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివ్య పుట్టినిల్లు అయిన ఇల్లదంకుంట మండలం సీతంపేటకు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియల సమయంలో దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో దాడికి ప్రయత్నించారు. దివ్య తండ్రి చంద్రశేఖర్ను ఓ గదిలో ఉంచి తాళం వేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు. బట్టలు మార్చుకుంటానని వెళ్లి.. భార్య మృతితో చంద్రశేఖర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మూడో రోజు కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. శనివా రం ఐదవ రోజు కార్యక్రమం జరిగింది. శ్మశాన వాటిక వద్ద కార్యక్రమం పూర్తిచేసుకుని అంతా ఇంటికొచ్చారు. బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ గడియపెట్టుకుని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకున్నాడు. గదిలోంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన సమయంలో చంద్రశేఖర్ తల్లిదండ్రులు, తమ్ముడూ అక్కడే ఉన్నారు. అనాథలైన పిల్లలు భార్య, ఇద్దరు పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగం.. సాఫీగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు కమ్ముకోవడంతో చంద్రశేఖర్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణంగా ప్రేమించే భార్య మృతి చెందడంతో మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని మరవక ముందే ఐదు రోజుల వ్యవధిలో తండ్రి కూడా దూరమవడంతో పదేళ్లలోపు పిల్లలిద్దరూ ‘మమ్మీ,డాడీ’ అంటూ రోదించడం అక్కడివారిని కన్నీరు పెట్టించింది. చంద్రశేఖర్ తమ్ముడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మాధవి వివరించారు. భార్య మృతిని తట్టుకోలేక కరీంనగర్ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న భార్య దివ్య ఐదు రోజుల వ్యవధిలో దంపతుల మృతి అనాథలైన ఇద్దరు చిన్నారులు సీతంపేటలో విషాదంఅదే నా చివరి కోరిక అంటూ..చంద్రశేఖర్ చనిపోవడానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ.. ‘నేను ఒకవేళ చనిపోతే.. నా భార్య పక్కనే నా అంత్యక్రియలు చేయండి’ అంటూ చెప్పాడు. కాసేపటికే ఆత్మహత్య చేసుకోవడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సీతంపేటకు తీసుకొచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించి, దివ్య అంత్యక్రియలు చేసిన చోటే చంద్రశేఖర్ మృతదేహాన్ని ఖననం చేశారు.


