breaking news
Rajanna
-
కిస్సా కుర్సీ కా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని భావించినప్పటికీ రాత్రికి రాత్రి పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్09, మజ్లిస్03, ఏఐఎఫ్బీ02, స్వతంత్రులు04, ఎక్స్ అఫీషియో 02 (ఇద్దరు ఎమ్మెల్యేలు)తో కలిపి తమకు 34 బలముందని చెప్పిన కాంగ్రెస్.. తెల్లవారే సరికి బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతిని తమవైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఈ సంఖ్య పెంచడానికి సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు వరకు అంతా పర్యవేక్షించాల్సి వచ్చింది. రోజంతా హైడ్రామా 15 డివిజన్ నుంచి ఏఐఎఫ్బీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికై న విప్పల సాయిజ్యోతి తొలుత బీజేపీలో చేరి ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్ గూటికి చేరింది. ఆమె పార్టీ మారడం వెనక సీఎం కార్యాలయంతోపాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు కృషి ఎంతో ఉంది. ఆదివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయిజ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్బీ నాయకులు ఆమె ఇంటికి విప్ నోటీసు అంటించారు. ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీలో చేరాక పార్టీ ఎలా మారతారంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య సాయిజ్యోతిని హైదరాబాద్లోని కాంగ్రెస్ శిబిరానికి తరలించగా, అక్కడ ఆమె మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల, ఇండిపెండెంట్ కొమురయ్యతో కలిసి కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలం 35కు చేరుకుంది. మేయర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా లేక ఇండిపెండెంట్గా ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ● జమ్మికుంట మున్సిపాలిటీలోనూ హంగ్ ఉత్కంఠను రేపింది. మొత్తం 30 సీట్లలో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ 10, బీజేపీ 04, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్లో ఒక కౌన్సిలర్ వెళ్లి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. కాంగ్రెస్ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01, బీఆర్ఎస్ రెబల్1 కలిపి మొత్తం 15 స్థానాలతో మున్సిపాలిటీ వశపరుచుకోవాలని చూసినా మేజిక్ ఫిగర్ చేరలేదు. దీంతో బలపరీక్ష వాయిదా వేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. ● జగిత్యాల జిల్లా రాయికల్లో 12 సీట్లున్నాయి. బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒక సీటు గెలిచారు. కరీంనగర్ తరహాలోనే ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ జట్టు కట్టి బీజేపీ ఆశలకు గండికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ● 26 సీట్లున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా.. బీఆర్ఎస్ 06, కాంగ్రెస్ 06, స్వతంత్రులు 04 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు పెట్టుకున్నాయి. దీంతో బీజేపీకి మున్సిపాలిటీపై ఆశలు సన్నగిల్లాయి. ● ఇక పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్, రామగుండం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో స్పష్టమైన మె జారిటీ రావడంతో కాంగ్రెస్ పాలకవర్గాలను ఏ ర్పాటు చేయనుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగరేయనుంది. ఇండిపెండెంట్ల జోరు..! హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పంట పండింది. వీరి మద్దతు కీలకమవడంతో పార్టీలు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. కరీంనగర్ లాంటి చోట డబ్బుతో పాటు ఫార్చునర్ కారు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లతో బేరసారాలు రూ.కోట్లకు చేరాయి. -
అంతా లాంఛనమే..
సిరిసిల్లటౌన్/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. చైర్పర్సన్, వైస్చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు నిర్ణయం మేరకు చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నిక పూర్తికానుంది. వేములవాడలో 28 వార్డులకు 13 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్రులు, ఒకరు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో హస్తం బలం 16కు చేరింది. వేములవాడ మున్సిపల్ పీఠంపై తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగురనుంది. ఇక్కడ విప్ ఆది శ్రీనివాస్ నిర్ణయం మేరకు చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక పూర్తికానుంది. ఇప్పటికే శిబిరంలో ఉన్న రెండు మున్సిపాలిటీల కౌన్సిలర్లు సోమవా రం సిరిసిల్ల, వేములవాడలకు చేరుకుంటున్నారు. మున్సిపల్ ఆఫీస్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 12.30 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్లను ఎన్నికోనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి రెండు మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. నిబంధనల మేరకు సీట్ల కేటాయింపులు, ప్రమాణ స్వీకారం చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను కోరం ఆధారంగా నిర్వహిస్తారు. చైర్పర్సన్, వైస్చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయా అన్న అంశం సస్పెన్స్గా మిగిలింది. క్యాంపుఫైర్తో జోష్ వేమువాడ మున్సిపల్ పీఠంపై కూర్చునేది ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలనుంది. మున్సిపల్ ఆఫీ స్లో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారో త్సవం ఉంటుందని కమిషనర్ సంపత్కుమార్ తెలి పారు. ఆర్డీవో రాధాభాయి నేతృత్వంలో ముందుగా ప్రమాణ స్వీకారం, అనంతరం చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. అత్యధిక మెజార్టీకే చైర్మన్ గిరి.. హ్యాట్రిక్ విజేతకు వైస్చైర్మన్ ! మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలు పొందిన 15వ వార్డు కౌన్సిలర్ పుల్కం రాజు(875 ఓట్లు)కు చైర్మన్ గిరి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హ్యాట్రిక్ విక్టరీ సాధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ నరాల శేఖర్ కాంగ్రెస్లో చేరడంతో ఆయనకు వైస్చైర్మన్ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ క్యాంప్ఫైర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. క్యాంప్ ఫైర్తో సరదాగా గడుపుతున్నారు. -
నేతన్న కుటుంబానికి సర్కారు బాసట
సిరిసిల్లటౌన్: కుటుంబ అవసరాలకు చేసిన అప్పుల బాధతో మనస్తాపంతో గుండె ఆగిన నేతన్న కుటుంబానికి సర్కారు బాసటగా నిలుస్తోంది. బాధిత కుటుంబం దీనావస్థపై ఆదివారం ‘సాక్షి’ మెయిన్లో ప్రచురితమైన ‘అప్పులతో ఆగిన నేతన్న గుండె’ అనే వార్తకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పందించారు. వెంటనే చేనేత, జౌళిశాఖ అధికారులతో విచారణ జరిపించారు. పట్టణంలోని పోచమ్మవీధిలోని పవర్లూమ్ కార్మికుడు వెంగళ ప్రసాద్(45) కుటుంబాన్ని చేనేత జౌళి శాఖ కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు పరామర్శించారు. ఆ కుటుంబానికి నేతన్నబీమా రూ.5లక్షలు, ప్రధానమంత్రి జీవనజ్యోతి బ్యాంక్ ఖాతా ద్వారా రూ.2లక్షలు బీమా వర్తించే అవకాశం ఉందన్నా రు. తక్షణ సాయం కింద తహసీల్దార్ ద్వారా రూ.20 వేలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరగా అందించేలా ఇందిరమ్మహౌసింగ్ శాఖ పీడీకి తెలుపుతామన్నారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తామన్నారు. చేనేత జౌళిశాఖ ఏడీ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందుతుందని తెలిపారు. -
నేటి ప్రజావాణి రద్దు
సిరిసిల్లటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం ప్రకటించారు. వేములవాడ మహాశివరాత్రి జాతర, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొటోకాల్ ఉన్న వారెవ్వరూ రాజన్నను దర్శించుకునే అవకాశాలు లేనప్పు డు ఓ ప్రైవేట్ వ్యక్తి ఎలా దర్శించుకుంటారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రశ్నించారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ భీమన్న ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించి, ఇక్కడే దర్శనం చేసుకుని వెళ్లారన్నారు. అయితే సదరు వ్యక్తి ఎలా రాజన్న గుడిలో పూజలు చేస్తారని ప్రశ్నించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించి బాధ్యలపై చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. సిరిసిల్లటౌన్: సిరిసిల్లకు చెందిన పవర్ లిఫ్టర్ నేహా రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సీనియర్స్ విభాగంలో పాల్గొన్నారు. స్వాట్స్–110 కేజీ, బెంచ్ 47.50 కేజీ, డెడ్లిఫ్ట్ 132.50కేజీలు లిఫ్ట్ చేసి బహుమతులు సాధించారు. వీర్నపల్లి(సిరిసిల్ల): ఆధ్యాత్మికవేత్త, గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ముక్తార్పాషా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని, విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. -
చైర్మన్ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్లటౌన్/వేములవాడ: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికకు చేస్తున్న ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, అధికారులు శ్రీనివాసాచారి, అన్సార్ తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో బాలుడిపై జరిగిన దాడి సంఘటన దురదృష్టకరమని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. బాలుడిపై దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి పోలీస్ సూచనలతో మెడికో లీగల్ కేసు కింద ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో బాలుడికి వైద్యపరీక్షలు చేయించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన వెంటనే అంగన్వాడీ టీచర్ను పిలిపించి ఆరా తీయనగా సంఘటనపై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీఎన్ఎస్ 118 సబ్సేక్షన్ 1, బాలల న్యాయచట్టం సెక్షన్ 75 ప్రకారం వెంకటాపూర్లోని రెండో అంగన్వాడీ కేంద్రం టీచర్ జాజాల రాణిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలుడికి ఎల్వీ ప్రసాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించి, హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. షోకాజ్ నోటీస్కు అంగన్వాడీ టీచర్ వివరణ సంతృప్తికరంగా లేదని.. పూర్తిస్థాయిలో విచారణకు జిల్లా సంక్షేమాధికారితోపాటు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్కు సూచించినట్లు తెలిపారు. విచారణ నివేదిక అనంతరం అంగన్వాడీ రాణిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సురక్షితంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదుగుతారని, ఎవరూ ఎలాంటి అపోహలకు లోనుకావద్దని కోరారు. నాణ్యమైన పోషకాహారం అందిస్తూ బాలల హక్కులను కాపాడడంలో జిల్లా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. -
హంగ్ ఆర్భాటాలు
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు రాయికల్, మెట్పల్లి, జమ్మికుంటలో పరిస్థితి భిన్నంగా మారింది. ఎన్నికల ఫలితాల వరకు మాటల కత్తులు దూసుకున్న పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్ కోసం పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. ముఖ్యంగా 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో 30 సీట్లు బీజేపీ గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్బీ 2 చొప్పున గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లలో నలుగురు చేరడంతో బీజేపీ బలం 34కు చేరింది. వీరికి స్థానిక ఎంపీ బండి సంజయ్ ఎక్స్అఫీషియో ఓటు తోడవడంతో బలం 35కు పెరిగింది. ఈ క్రమంలోనే మేయర్ పీఠం కాంగ్రెస్కు రావాలని అధికార పార్టీ వ్యూహాలు రచించింది. బీఆర్ఎస్, మజ్లిస్తో కలిసి అవగాహనకు వచ్చింది. కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 5, ఎంఐఎం 3, ఏఐఎఫ్బీ 2, ఎక్స్అఫీషియో ఇద్దరితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు (గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ) ఓటుతో సంఖ్యాబలం 35 ఉందంటున్నారు. ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి విషయంలో రెండు కూటములు తమ వైపే ఉన్నారని వాదిస్తున్నారు. ఈ పంచాయితీ ప్రస్తుతం సీఎం కార్యాలయానికి చేరడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. మేయర్ పీఠం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. -
మహా జనాభిషేకం
వేములవాడ: మహాశివరాత్రి వేడుకలకు భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో వస్తున్నారు. గుడి చెరువులోని ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకున్నారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో మొదటిసారి భీమన్న ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్జిత సేవలు రద్దు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసి, లఘు దర్శనాలకు అనుమతించారు. గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చన నిర్వహిస్తున్నారు. 1,500 మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే ఉత్సవాలు ప్రారంభించారు. వైభవంగా వేడుకలు ప్రారంభం మూడు రోజులపాటు భీమన్న ఆలయంతోపాటు రాజన్న ఆలయంలో ఏకాంత సేవలతో ఈ వేడుకలు వైభవంగా కొనసాగనున్నాయి. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభించారు. 5 గంటలకు ప్రాతఃకాల పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీస్వామి వారికి మహానివేదన సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున డిప్యూటీ ఈవో లోకనాథం, అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ అధికారులకు పూలమాలవేసి స్వాగతం పలికారు. గర్భగుడిలో పూజలు నిర్వహించి, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ టీటీడీ తరఫున వేములవాడ దేవస్థానానికి గత 28 ఏళ్లుగా పట్టువస్త్రాలు తీసుకొస్తున్నామని, స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు వీల్చైర్లు మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. జాతర పరిసర ప్రాంతాల్లో 10 హెల్ప్డెస్క్లు, బేబీఫీడింగ్ రూమ్ను ప్రారంభించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రధాన ప్రవేశ ద్వారాలు, హెల్ప్డెస్క్ల వద్ద 100 వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. భక్తులకు తాగునీరు అందించేందుకు స్టీల్ గ్లాసులను వినియోగిస్తున్నారు. భక్తులు దారి తప్పకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ జాతర ఏర్పాట్లు, సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల సహాయంతో భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. -
సంజీవయ్య జీవితం ఆదర్శం
● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్సిరిసిల్లటౌన్: అట్టడుగు వర్గాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన దామోదరం సంజీవయ్య భావితరాలకు స్ఫూర్తి అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, శాలివాహన రాష్ట్ర నాయకులు నెల్లుట కనకయ్య, ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి దశరథం, ఎస్సీ సబ్ ప్లాన్ అధ్యక్షులు కంసాల మల్లేశం, నాయకులు రెడ్డిమల్ల భాను, కొంపెల్లి విజయ్కుమార్, బిట్ల ప్రసాద్, పంగ రవి, సిరిగిరి రమేశ్, పెరుమాండ్ల సంతోష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేసే వరకు పోరాడుతాం వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు చేసే వరకు పోరాడుతామని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. పద్మశాలీ సంఘంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ ఇవ్వకుండా తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, రేగుల రాజ్కుమార్, వాసం మల్లేశంయాదవ్, వెంకన్న, నర్సయ్య, బిళ్ల కృష్ణ, శ్యాంసుందర్, నామాల శేఖర్ పాల్గొన్నారు. 22న గురుకుల ప్రవేశ పరీక్ష సిరిసిల్ల అర్బన్: తెలంగాణ సంక్షేమ గురుకులంలో 2026–27 సంవత్సరానికి 5, 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్లలో ప్రవేశానికి ఈనెల 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయ అధికారి థెరిస్సా తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకు కేటాయించిన పరీక్ష సెంటర్లకు చేరుకోవాలన్నారు. హాల్టికెట్తోపాటు అఫ్లికేషన్ ఫారం, బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింట్ పెన్ వెంట తీసుకుని రావాలని సూచించారు. కవితల పోటీల్లో విశ్వసాహితీ ప్రశంసాపత్రం సిరిసిల్లఅర్బన్: జాతీయ సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీల్లో పెరుక రాజుకు ప్రశంసాపత్రం లభించింది. ఈ పోటీల్లో సుమారు 400 మంది కవులు పాల్గొనగా 20 కవితలను ఎంపిక చేశారు. పెరుక రాజు మొదటి వరుసలో నిలిచి విశ్వసాహితీ కళావేదిక ప్రశంసాపత్రం అందుకున్నట్లు తెలిపారు. కోతులు పట్టేందుకు విరాళం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లిలో కోతుల బెడదను తప్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కుల సంఘాల వారీగా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారం సర్పంచ్ కొండ రమేశ్గౌడ్కు యాదవసంఘం ప్రతి నిధులు రూ.20వేలు అందజేశారు. కోతులను పట్టేవారితో ఇప్పటికే రూ.3.40 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. -
పీఠం ఎవరికో !
సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎన్నికకు ఈనెల 16న సమావేశం కానున్నారు. అయితే సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ మహిళకు రిజర్వేషన్ కాగా.. ఆశావహులు కూడా అత్యధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల మున్సిపల్పై వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేయగా.. సోమవారం చైర్పర్సన్ ఎన్నిక జరుగనుంది. ఈమేరకు ఎన్నికల్లో గెలిచిన 27 మంది నూతన కౌన్సిలర్లు శుక్రవారమే క్యాంపునకు వెళ్లారు. మూడు రోజులపాటు క్యాంపులోనే ఉండి.. సోమవారం నేరుగా మున్సిపల్ ఆఫీస్కు చేరుకుంటారు. ఈక్రమంలోనే ఈసారి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనని సస్పెన్స్ కొనసాగుతోంది. వరుసగా మూడోసారి బీఆర్ఎస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వద్దకు గెలిచిన 27 మంది కౌన్సిలర్లు తరలివెళ్లారు. సిరిసిల్లలో చైర్పర్సన్ ఎవరనేది కేటీఆర్ ప్రకటించనున్నారు. ఈమేరకు చైర్పర్సన్ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గతంలో రెండు పర్యాయాలు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ కొలువుదీరింది. రెండు సార్లు వరుసగా సామల పావని, జిందం కళను స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఆమేరకే రెండుసార్లు పాలకవర్గం ఏర్పాటైంది. రెండు దఫాల్లో కేటీఆర్ మంత్రిగా సిరిసిల్లను అభివృద్ధి పథంలో నడిపించగా.. ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీ ఇచ్చారు. గతంలో కన్నా ఎక్కువ మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. వైస్చైర్మన్ గిరిపై కూడా.. చైర్పర్సన్ తర్వాత వైస్చైర్మన్ పదవిపై కూడా చాలా మంది ఆశావహులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కౌన్సిల్లో రెండు, అంతకన్నా ఎక్కువ పర్యాయాలు గెలిచిన వారు వైస్చైర్మన్ పదవిపై ఆశగా చూస్తున్నారు. సీనియర్ కౌన్సిలర్లు గుడ్ల శ్రీనివాస్, బుర్ర నారాయణగౌడ్, దార్ల సందీప్ ఉన్నారు. కాగా విలీన గ్రామాల నుంచి ఎన్నికై వారిలోనూ వైస్చైర్మన్ పదవి కావాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నట్లు సమాచారం. విలీన గ్రామాల నుంచి బుర్ర మల్లికార్జున్, దొంతవేని కళ్యాణి, లింగంపల్లి భాగ్యలక్ష్మి రేసులో ఉన్నట్లు చర్చసాగుతోంది. పట్టణం నుంచి సీనియర్లు, విలీన గ్రామాల నుంచి రేసులో ఉన్న వారిలో ఎవరికి వైస్చైర్మన్ ఇచ్చినా సమ్మతమే అన్నట్లు అధిష్టానం దృష్టిలో వేసినట్లు తెలిసింది. కేటీఆర్ నిర్ణయమే ఫైనల్ చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎంపికలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. గతంలో రెండు పర్యాయాలు ఆయనే పార్టీ కౌన్సిలర్లతో సమావేశమై అందరి సమ్మతంతో పదవులు కట్టబెట్టారు. ఈసారి కూడా కేటీఆర్ ఆశీర్వాదం తమకు దక్కాలంటూ హైదరాబాద్ క్యాంపునకు వెళ్లిన అభ్యర్థులు కోరుకుంటున్నారు. రెండోసారి చైర్పర్సన్గా జిందం కళను కొనసాగిస్తారా.. కొత్తవారికి అవకాశం ఇస్తారా.. అనేది సోమవారం తెలియనుంది. ఇక వైస్చైర్మన్గా సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారో.. విలీన గ్రామాల కౌన్సిలర్ల మొర ఆలకిస్తారో కేటీఆర్ తేల్చనున్నారు. చైర్పర్సన్గా జనరల్ మహిళకు రిజర్వ్ ఉండగా వైస్చైర్మన్గా పురుషులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చసాగుతోంది. పదవుల అప్పగింతపై ఆదివారం రాత్రి వరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే క్యాంపులో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. బరిలో ఆ‘నలుగురు’ తాజా, మాజీ చైర్ పర్సన్ జిందం కళను రెండోసారి చైర్పర్స న్ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే బరిలో ఉన్న మిగతా ముగ్గురు సైతం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చైర్పర్సన్ రేసులో తాజా, మాజీ చైర్పర్సన్ జిందం కళతోపాటు తాజా, మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్ సతీమణి మంచె రేణుక, మాజీ చైర్పర్సన్ గుండ్లపెల్లి సరోజన కోడలు గుండ్లపెల్లి నీరజ, సెస్ డైరెక్టర్, అర్బన్బ్యాంకు మాజీ చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ సతీమణి దార్నం అరుణ ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఎన్నికై న వారిలోనూ ఒకరిద్దరు చైర్ పర్సన్ రేసులో ఉన్నట్లు తెలిసింది. -
అందుబాటులో అంబులెన్స్లు
వేములవాడఅర్బన్: మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు స్థానికంగా ఏడు 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ తెలిపారు. ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనం ఉందని అందులో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. భక్తులు అత్యవసర వైద్యసహాయం కోసం 108కు ఫోన్ చేయాలని కోరారు. వేములవాడలోని ఈవో కార్యాలయం, శివార్చన, హెలికాప్టర్ ల్యాండింగ్ ఏరియా, వేములవాడ ఏరియా ఆస్పత్రి, భీమేశ్వర సదన్, నాంపల్లిగుట్టపై అంబులెన్స్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ నయీమ జహా, 108 సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, అనిల్కుమార్, రాజు, నవీన్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
● కార్యకర్తకు షోకాజ్ నోటీస్ ● విచారణ చేపట్టిన మానవహక్కుల సంఘం
అంగన్వాడీ కేంద్రం సీజ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని అంగన్వాడీ టీచర్ మూడేళ్ల బాలుడిని చితకబాదిన ఘటనపై శుక్రవారం అంగన్వాడీ ఉన్నతాధికారులు, రాష్ట్ర మానవహక్కుల సంఘం విచారణ చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ అధికారులు సీజ్ చేశారు. వెంకటాపూర్కు చెందిన కొంపెల్లి లక్ష్మి–విజయ్ దంపతుల కుమారుడు విద్వాన్ష్ అల్లరి చేస్తున్నాడని టీచర్ కొట్టింది. బాలుడు తీవ్రంగా గాయపడడంతో తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. మానవహక్కుల సంఘం స్పందించి వెంటనే వివరణ ఇవ్వాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఐసీడీఎస్ సీడీపీవో ఉమారాణి, టీచర్ సల్వాని రాణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మానవహక్కుల కమిషన్ స్వయంగా విచారణ ప్రారంభించింది. బాలుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వైద్య నివేదిక ఆధారంగా అంగన్వాడీ టీచర్పై తీసుకున్న క్రిమినల్, శాఖాపరమైన చర్యలపై విచారించారు. పోలీస్ దర్యాప్తు, ఎఫ్ఐఆర్, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల భద్రతకు తీసుకున్న చర్యలపై మార్చి 9లోపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను కమిషనర్ ఆదేశించినట్లు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ సరిత తెలిపారు. -
ఆధ్యాత్మిక కేంద్రంలో హస్తం హవా
వేములవాడ/వేములవాడరూరల్: ఆధ్యాత్మిక కేంద్రం వేములవాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 28 వార్డులకు 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 8 సీట్లకే పరిమితం కాగా, బీఆర్ఎస్ ఐదు స్థానాల్లో, ఇద్దరు స్వతంత్రులు విజ యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపులో ఉండగా, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు శుక్రవారం క్యాంపునకు తరలివెళ్లారు. కాంగ్రెస్లోకి మరో ముగ్గురు వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులకు గాను 13 వార్డుల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు అభ్యర్థులు తోడయ్యారు. స్వతంత్రులుగా గెలిచిన కుమ్మరి శిరీష, ఆలె శ్రీనివాస్లతోపాటు బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన నరాల శేఖర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 16 సీట్లకు పెరిగింది. ఒక్కటి నుంచి 13కు కాంగ్రెస్ వేములవాడ మున్సిపాలిటీకి 2020లో జరిగిన ఎన్నికల్లో వేములవాడ 1వ వార్డు నుంచి సంగ హన్మవ్వ మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఒకే స్థానంతో ఐదేళ్లు పోరాడిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 13 స్థానాలకు ఎగబాకింది. విలీన గ్రామాల్లో హస్తం వేములవాడలో విలీనమైన శాత్రాజుపల్లి, అయ్యోరుపల్లి, కోనాయపల్లి, నాంపల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ గాలి వీచింది. విలీన గ్రామాల్లో 4 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 స్వతంత్రులు విజయం సాధించారు. వేములవాడ మున్సిపల్గా ఏర్పడ్డ తొలిసారి బీజేపీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోగా.. అప్పుడు నామాల ఉమ, రెండోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున రామతీర్థపు మాధవి చైర్పర్సన్లు అయ్యారు. మూడోసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. -
డ్యూటీలో పోలీస్ కపుల్స్
భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే. ఇద్దరికీ ఒకేచోట ఎలక్షన్ డ్యూటీ. అయితే, ఇద్దరం కలిసి ఎన్నికల విధులు నిర్వర్తించడం మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సరదాగా చెప్పారు. పెద్దపల్లి రూరల్ ఎస్సైగా మల్లేశ్, మహిళా ఠాణా ఎస్సైగా రాజమణికి పెద్దపల్లి మున్సిపల్ కౌంటింగ్ విధులు కేటాయించారు. పోలీస్కపుల్స్ కావడంతో పోలీసు అధికారులు అందరూ విధుల్లో ఉన్న దంపతులను చూసి స్వీట్ మెమోరీ అని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
మహాజాతరకు సర్వం సన్నద్ధం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఏర్పాట్లు పరిశీలనవేములవాడ: ఈనెల 14, 15, 16 తేదీల్లో వేములవాడలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు సిద్ధమైనట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్సాయి, అదనపు కలెక్టర్ నగేశ్లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జాతర గ్రౌండ్ పరిసరాలు, శివార్చన వేదిక, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టాయిలెట్లు, చలువ పందిళ్లు, జలప్రసాదం పంపిణీ కేంద్రాలు, క్యూలైన్లు, భీమేశ్వర ఆలయం పరిసరాలు పరిశీలించారు. అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్డీవో రాధాభాయి, ఈవో రమాదేవి, డీఆర్డీవో గీత, ఆర్అండ్బీ ఈఈ నరసింహచారి, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ కిశోర్, సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, ఆలయ ఈఈ రాజేశ్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ అన్వర్, ఇంట్రా ఈఈ సుమలత, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు. మహాజాతరకు 1200 మందితో బందోబస్తు భీమేశ్వర ఆలయంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా 1200 మంది పోలీస్ సిబ్బందితో భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఏఎస్పీ రుత్విక్సాయితో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్కు తెలియజేయాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఓపికతో సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. దొంగతనాలు, చైన్స్నాచింగ్ నేరాలను అరికట్టేందుకు క్రైమ్ పార్టీలు నిరంతరం నిఘా ఉంచాలన్నారు. మహిళల రక్షణ కోసం షీటీం బృందాలు విధుల్లో ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు జాతరకు భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. -
నాలుగోసారి..
జగిత్యాల: గత మూడు పర్యాయాలు దేవేందర్నాయక్ కౌన్సిలర్గా గెలుపొంది మళ్లీ నాలుగోసారి సైతం విజయం సాధించి రికార్డు సృష్టించారు. దేవేందర్నాయక్ ఎస్టీ రిజర్వేషన్ నుంచి పోటీ చేస్తుంటారు. జగిత్యాలలో మొదటిసారి 2వ వార్డు నుంచి, రెండోసారి 9వ వార్డు, మూడోసారి 48వ వార్డు, ఈసారి 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొంది రికార్డు సృష్టించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక్క బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి వరుసగా కౌన్సిలర్గా గెలుపొందుతూ వస్తున్నారు. -
రాజన్న జాతర చూసొద్దాం
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 14 నుంచి 16 వరకు మహాశివరాత్రి వేడుకలు భీమన్న క్షేత్రంలో వైభవంగా జరుపనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా 2 లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ● రూ.1.96 కోట్లతో ఏర్పాట్లు మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం రూ.1.96కోట్లతో భారీ ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఈసారి భీమేశ్వరాలయంలో వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే ఐదు ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. భద్రత కోసం అడుగడుగునా సీసీ కెమెరాలు బిగించారు. భక్తులకు ఉచితంగా టిఫిన్స్, తాగునీరు, బటర్మిల్క్ పాకెట్లను సరఫరా చేయనున్నారు. ● చారిత్రక విశిష్టత క్రీస్తుశకం 750 నుంచి 973 వరకు చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరికి పూర్వమే శాతవాహనులు పరిపాలించినట్లు ఆధారాలు ఉన్నట్లు చెబుతుంటారు. శాతవాహనుల కాలం నాటికే వేములవాడలో జైనులు, బౌద్ధుల ఆచార వ్యవహారాలు తెలిపే విగ్రహాలు అనేకం నేటికి ఉన్నాయి. ● దర్శనీయ స్థలాలు మహాశివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. భీమేశ్వరస్వామి దర్శనాలు, కోడెమొక్కులు మాత్రమే అనుమతిస్తారు. భీమన్న ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాలస్వామి, నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ● శివరాత్రి పూజలు మహాజాతర సందర్భంగా భీమన్న ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే జాతర ఉత్సవాల సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ఉచిత దర్శనంతోపాటు రూ.300 చెల్లించి వీఐపీ దర్శనం, రూ.50 చెల్లించి స్పెషల్ దర్శనాలు, రూ.100 చెల్లించి కోడెమొక్కులు, రూ.200 స్పెషల్ కోడె మొక్కులు, రూ.300 శీఘ్రదర్శనం టికెట్లపై దర్శనం చేసుకోవచ్చు. ● కోడె మొక్కు విశిష్టత సంతానం లేని దంపతులు కొడుకు పుడితే కోడె కట్టేస్తామని రాజన్నకు మొక్కుంకుంటారు. సంతానం కలిగిన తర్వాత వేములవాడకు చేరుకుని స్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకుంటారు. వ్యవసాయం బాగుండాలని మొక్కుకునే రైతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు నిజకోడెలను స్వామి వారికి అప్పగించి మొక్కులు తీర్చుకుంటారు. ● ఉచిత భోజనం..టిఫిన్ మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు స్థానిక ట్రస్టుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్స్లో ఉచితంగా భోజన సౌకర్యం, పార్వతీపురంలో ఉచిత భోజన వసతి, టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు 6 లక్షల నీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆరు రాజన్న జలప్రసాదాల సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. ● అత్యవసర సేవలు జాతర పర్వదినాల సందర్బంగా పోలీస్ కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశారు. అమ్మవారి కాంప్లెక్స్, నందీశ్వర కాంప్లెక్స్లో తాత్కాలిక వైద్యశాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలు, వసతిగదుల వద్ద నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్తోపాటు 13 మంది నోడల్ ఆఫీసర్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ నియమించారు. మొబైల్ అంబులెన్స్, ఫైర్ సేవలు సైతం అందుబాటులోకి తెచ్చారు. 1,600 మంది పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. దర్శిద్దాం..తరిద్దాం 2 లక్షల మంది వస్తారని అంచనా రూ.1.96 కోట్లతో ఏర్పాట్లు నేటి నుంచి భీమన్న ఆలయంలో ఉత్సవాలు షురూ పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్సమాచార ఫోన్ నంబర్లు ఇవీ.. ఏఎస్పీ రుత్విక్సాయి : 87126 56412 ఈవో రమాదేవి : 94910 00743 వైద్యాధికారి రజిత : 70975 57119 ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ : 99592 25926 టౌన్ సీఐ వీరప్రసాద్ : 87126 56413ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్కు 150 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్లు దూరంలో వేములవాడ పట్టణం ఉంది. రాజన్నను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండు నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. రైల్వేసౌకర్యం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సిద్దిపేట మీదుగా, వరంగల్ నుంచి వచ్చే వారు కరీంనగర్ మీదుగా వేములవాడకు రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా గుడిచెరువు కట్టకింద ప్రత్యేక బస్టాండు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కౌంటర్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు 850 బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. లోకల్లో 14 ఉచిత బస్సులు నడిపించనున్నారు. -
● బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తంసిరిసిల్ల క్రైం: పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, అదే సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసి, ఒకరిపై ఒకరు దాడులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వెబ్కాస్టింగ్ సెంటర్ పరిశీలన
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ సెంటర్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలోని సినారె కళామందిరాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా వెబ్కాస్టింగ్ సెంటర్లో పరిశీలించారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, శ్రావణ్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11(ఆర్డీ13 ఎల్ఎం6) కాలువ పనులు పూర్తిచేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం నాలుగో రోజుకు చేరాయి. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజీపేట, తంగళ్లపల్లి మండలం సర్సింహులపల్లి సహా 12 గ్రామాల రైతులు దీక్షలో పాల్గొన్నారు. 13 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతులు కరికె నవీన్ కుమార్, సేరు ఎల్లం, శ్రీనివాస్, అశోక్, పర్శరాములు, వెంకట్రెడ్డి, అనిల్, యాద ఎల్లయ్య, కమటం రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘మా కాలేజీ – మా తల్లి చెట్టు’ అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల ప్రాంగణంలో ఏళ్లనాటి వృక్షాన్ని కాలేజీ తల్లి చెట్టుగా గుర్తించి మొక్కల రక్షణకు ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ధర్మపురి, అధ్యాపకులు సుచరణ్, శ్రావణ్కుమార్, ఆది విష్ణు, భిక్షమయ్య, మనోహర్, శ్రీనివాస్, కృష్ణప్రసాద్, మహేశ్, జగన్నాథం, భార్గవి, దీపిక, రమ్య, రవీందర్, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల్లోకి మీడియాను అనుమతించకపోవడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్దకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మీడియాను కౌంటింగ్ కేంద్రంలోకి పంపించాలని అధికారులను, పోలీసులను కోరారు. పరిస్థితి చేజారేలా కన్పించడంతో వెంటనే అధికారులు స్పందించి మీడియాను అనుమతిస్తామని చెప్పడంతో రాజకీయ నాయకులు వెనుదిరిగారు. వేములవాడలో మండల పరిషత్ ఎదుట రోడ్డుపై జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో రాధాభాయి వారి వద్దకు చేరుకుని ఇద్దరి చొప్పున కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. -
రాజీనామా చేసి.. ఆపై గెలిచి..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప ఆ పదవికి రాజీనామా చేశారు. తర్వాత మున్సిపల్ 7వ వార్డు నుంచి బరిలో నిలిచి 261 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదేవిధంగా 26వ వార్డు కౌన్సిలర్ పదవికి ఏఐబీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని వదులుకొని బరిలో నిలిచిన కుక్క శ్రావణ్.. 52 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 2014 ఎన్నికల్లో 8వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై న స్వరూప.. వైస్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో 3 ఓట్లతో పరాజయం పాలయ్యారు. మార్కెట్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అయితే ఈసారి చైర్పర్సన్ పదవి వరిస్తుందన్న ఆశతో ఉన్నారు. -
కమలం పైచేయి
క్యాంప్నకు వెళ్లిన బీజేపీ అభ్యర్థులు వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 8 సీట్లు కై వసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లారు. కార్పొరేషన్లోమున్సిపాలిటీల్లోశనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టణాల ఓటర్లు వైవిధ్య తీర్పునిచ్చారు. బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీకి అధిక స్థానాలు కట్టబెట్టి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ను రెండు చోట్ల ముందంజలో నిలబెట్టారు. మూడు చోట్ల బీజేపీకి అధికస్థానాలు అప్పగించి అనూహ్య ఫలితాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉండగా.. 9 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, రామగుండం నగరపాలక సంస్థ కాంగ్రెస్ వశమైంది. ధర్మపురి మున్సిపాలిటీని హస్తం క్లీన్స్వీప్ చేసింది. జగిత్యాలలో స్వతంత్రులు అధికస్థానాలు గెలిచి జోరుమీదున్నారు. ● 66 డివిజన్లు ఉన్న స్మార్ట్సిటీ కరీంనగర్లో 30స్థానాలు గెలుచుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్ పీఠం బీజేపీ వశమవడం నల్లేరు మీద నడకలా ఉంది. దీనికితోడు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం మూడు ఎక్స్ అఫిషియో ఓట్లు వీరికి తోడుగా ఉన్నాయి. ఇప్పటికే పదిమంది వరకు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని కేంద్ర సహాయమంత్రి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ● చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులకు కాంగ్రెస్ 10స్థానాలు కై వసం చేసుకుంది. 30 వార్డులున్న హుజూరాబాద్ మున్సిపాలిటీలో 16 స్థానాలతో కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జమ్మికుంటలో 30 సీట్లకు 12 స్థానాలు బీఆర్ఎస్, 10 సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నాయి. బీజేపీ నలుగురు, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. సంఖ్యాపరంగా బీఆర్ఎస్కి ఆధిక్యమున్నా.. చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగానే ఉంది. బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో గులాబీ పార్టీ మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ● 60 డివిజన్లు ఉన్న రామగుండం కార్పొరేషన్లో 38 స్థానాలు గెలిచి కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 13, బీజేపీ 01 స్థానంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా మొత్తంలో మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీలను కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. ● రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 స్థానాలకు 27 సీట్లు గెలుచుకుని బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 06, బీజేపీ 05 స్థానాల్లో తరువాతి స్థానాల్లో నిలిచాయి. వేములవాడలో 28 సీట్లకు 13 స్థానాల్లో హస్తం విజయకేతనం ఎగరేసింది. ఇక్కడ బీజేపీ 08 స్థానాలు, బీఆర్ఎస్ 5, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. జగిత్యాలలో స్వతంత్రుల హవా జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 స్థానాలకు గాను 23 కాంగ్రెస్ గెలుచుకుంది. 23 మందిలో ఏడుగురు జీవన్రెడ్డి వర్గీయులు కాగా, 16 మంది సంజయ్ వర్గీయులు. 15 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. మొత్తం మీద 18 చోట్ల సంజయ్ వర్గీయులు, 17 చోట్ల జీవన్రెడ్డి వర్గీయలు గెలుపొందారు. వీరి మధ్య సయోధ్యకు చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ 06, బీఆర్ఎస్ 04, ఎంఐఎం 02 సీట్ల చొప్పున అభ్యర్థులు గెలిచారు. 33 స్థానాలున్న కోరుట్లలో కాంగ్రెస్ 18 సీట్లు సాధించి మున్సిపాలిటీని వశపరరచుకుంది. 26 స్థానాలున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 12 స్థానాలున్న రాయికల్లో 5 చోట్ల బీజేపీ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఽ15 స్థానాలు ధర్మపురిలో 15 స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది. హంగ్ అయినా ఆధిపత్య పార్టీలకే మెట్పల్లి, రాయికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 26 స్థానాలున్న మెట్పల్లిలో 03 సీట్లతో కాంగ్రెస్ మూడోస్థానంలో నిలవగా.. 12 సీట్లున్న రాయికల్లో బీఆర్ఎస్తో సమానంగా 03 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. ఈ రెండుచోట్ల బీజేపీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక 30 సీట్లున్న జమ్మికుంటలో 12 బీఆర్ఎస్ గెలచుకుంది. 10 స్థానాలతో కాంగ్రెస్ రెండో ప్లేసులో నిలిచింది. నలుగురు స్వతంత్రులు, నలుగురు బీజేపీ అభ్యర్థులు కీలకమయ్యారు. ఇక్కడా బీఆర్ఎస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.సిరిసిల్ల : 39 బీఆర్ఎస్ : 27 కాంగ్రెస్ : 06 బీజేపీ : 05 స్వతంత్రులు : 01 వేములవాడ : 28 కాంగ్రెస్ : 13 బీజేపీ : 08 బీఆర్ఎస్ : 05 స్వతంత్రులు : 02 -
ఓటమెరగని నేత..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మేజర్ పంచాయతీకి మూడుసార్లు వార్డు సభ్యుడిగా.. ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్గా.. ఇప్పుడు మూడోసారి ఎన్నికై నూగిల్ల మల్లయ్య ఓటమి ఎరగని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లో కౌన్సిలర్గా ఎన్నికయ్యాక హంగ్ ఏర్పడింది. అనూహ్య పరిణామాల మధ్య మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నూగిల్ల మల్లయ్యనే వరించింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో తాను గతంలో ఎన్నికై న వార్డు నుంచి రిజర్వేషన్ కలిసి రాక 21వ వార్డులో పోటీ చేసి విజయం సాధించారు. ఆ వార్డులో గెలిస్తే చైర్పర్సన్! పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వార్డుగా 21వ వార్డు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే.. ఈ వార్డు నుంచి గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ మమతారెడ్డి చైర్పర్సన్గా వ్యవహరించారు. ఈసారి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అంటూ నూగిల్ల మల్లయ్య పేరును ఎమ్మెల్యే విజయరమణారావు ప్రకటించారు. దీంతో ఆయన కూడా 21వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. -
టికెట్ దక్కకున్నా.. ప్రజామోదం దక్కింది..
జగిత్యాలటౌన్: టికెట్ దక్కకపోయినా ప్రజామోదం మాత్రం దక్కింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలు వెలువడ్డాయి. 22వ వార్డులో బీజేపీ టికెట్ ఆశించిన అరవ లక్ష్మి(బిట్టు)కి టికెట్ రాకపోవడంతో.. పార్టీ నాయకులకు ఫోన్ చేసిన లక్ష్మి కుమారుడు బోరున విలపించాడు. అనంతరం లక్ష్మి రెబల్గా బరిలోకి దిగారు. స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 26వ వార్డులో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమకు చివరి నిమిషంలో టికెట్ దక్కక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె కుమారుడు శ్రీధర్ బోరున విలపిస్తూ పార్టీ నేతలకు ఫోన్ చేసి తానేం పాపం చేశానని నిలదీశాడు. రెబల్గా బరిలోకి దిగి ప్రజామోదంతో గెలుపొందారు. తల్లులకు టికెట్లు రాక ఆవేదనకు లోనైన వారి కుమారులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఇద్దరూ ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించడం జగిత్యాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ టికెట్ కంటే ప్రజాభిమానమే గొప్పదని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయని చర్చించుకుంటున్నారు. -
అమ్మా.. నీకే అంకితం..
రాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డులో 70 ఏళ్ల మచ్చ గంగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి 223 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలింగ్ కేంద్రంలో కుమారుడు శేఖర్ ఆమె కాళ్లకు దండం పెడుతూ.. ఈ గెలుపు నీకు అంకితమనడం అందరి హృదయాలను కదిలించింది. వరుస గెలుపులుహుజూరాబాద్: మేజర్ గ్రామ పంచాయతీ హుజూరాబాద్ మున్సిపల్గా ఏర్పాటైన నుంచి పట్టణంలోని సూపర్బజార్ ఏరియా 26 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య–నర్సింహారెడ్డి వరసగా 2006, 2014, 2020, 2026 మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. డిపాజిట్ దక్కని మాజీ చైర్మన్రాయికల్: రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు 7వ వార్డులో పోటీ చేయగా.. డిపాజిట్ సైతం దక్కలేదు. బీఆర్ఎస్కు చెందిన ఎలిగేటి లలితకు 565 ఓట్లు రాగా.. మోర హన్మండ్లుకు 109, బీజేపీ అభ్యర్థి సామాల్ల రాజేశంకు 36, కోన రాజుకు 46 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాయికల్లో అత్యధికం.. 702 ఓట్లురాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో 4వ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్యకు అత్యధికంగా 702 ఓట్లు రాగా.. అత్యల్పంగా 8వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి మ్యాకల జనార్దన్కు కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ ఓటమి రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 7వ వార్డులో మోర హన్మండ్లు ఎలిగేటి లతికపై, 9వ వార్డులో రమాదేవి బత్తిని మహేశ్వరిపై పరాజయం పాలయ్యారు. అంతస్తు ముందు.. అభిమానం నెగ్గిందిసిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో అంతస్తుల ముందు అభిమానం గెలిచింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలోని 33వ వార్డులో బీజేపీ నుంచి పోటీ చేసిన కొండ వర్షిణి దంపతులకు ఉండడానికి భవనం లేదు. భర్త నరేశ్కు పెద్దల నుంచి వచ్చిన పది సాంచాలను నడిపిస్తూ సాధారణ జీవితం సాగిస్తున్నారు. చాలా ఏళ్లుగా బీజేపీకి విధేయంగా పని చేస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి అండదండలు లేవు. వీరి సేవలను గుర్తించి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి దార అశోక్పై 67 ఓట్ల మెజార్టీతో వర్షిణి గెలిచారు. ఈ విషయం సిరిసిల్లలో హాట్ టాపిక్గా మారింది. -
నాడు మేయర్.. నేడు కార్పొరేటర్గా ఓటమి..
గోదావరిఖని: రామగుండం నగరపాలక మేయర్గా పని చేసిన డాక్టర్ బంగి అనిల్కుమార్ నేడు కార్పొరేటర్గా ఓటమి పాలయ్యారు. 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్కుమార్ పోటీలో ఉన్నారు. ఈసారి కూడా మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీపీఐ అభ్యర్థి మార్కపురి సూర్య చేతిలో ఓటమి పాలయ్యారు. 119 ఓట్ల మెజార్టీతో సూర్య గెలుపొందారు. మేయర్గా పని చేసి మళ్లీ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన అనిల్కుమార్.. సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమిపాలు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డబ్బులు పంచుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత పోలీసులు చేరుకొని తనిఖీలు నిర్వహించడం.. సీపీఐ అభ్యర్థి జేబులో రూ.48వేలు దొరకడం.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మైనస్గా మారిందనే చర్చ జరుగుతోంది. -
చెరోటి
● సిరిసిల్లలో గులాబీ గుబాళింపు ● వేములవాడలో హస్తం కై వసం ● కార్మిక క్షేత్రంలో కారు హ్యాట్రిక్ విజయం ● ఆధ్యాత్మిక క్షేత్రంలో విలక్షణ తీర్పుసిరిసిల్లటౌన్: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరోటి కైవసం చేసుకున్నాయి. సిరిసిల్లలో వరుసగా మూడోసారి గులాబీ పార్టీ తన పట్టు నిలుపుకుంది. వేములవాడ తొలిసారి హస్తం పార్టీకి దక్కింది. సిరిసిల్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్నంబర్లకే చతికిలపడ్డాయి. వేములవాడలో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ సాగింది. సిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరాల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కార్మిక క్షేత్రంలో కారు హవా సిరిసిల్ల మున్సిపల్లో 39 వార్డులకు.. 27 వార్డుల్లో బీఆర్ఎస్, 6 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీజేపీ, స్వతంత్రులు ఒక్క స్థానంలో విజయం సాధించారు. సీపీఎం, జనసేన, ఏఐఎఫ్బీ పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. మూడోసారి బీఆర్ఎస్ ఖాతాలో సిరిసిల్ల మున్సిపాలిటీ చేరింది. చైర్పర్సన్, వైస్చైర్మన్ స్థానాలపై గురి సిరిసిల్లలో మెజార్టీ వార్డుల్లో విజయం సాఽధించిన బీఆర్ఎస్లో మున్సిపల్ చైర్పర్సన్ స్థానంపై పలువురు అభ్యర్థులు గురిపెట్టారు. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సతీ మణి జిందం కళ చైర్పర్సన్గా 2020లో గెలిచి ఐదేళ్లు పాలించారు. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి సామల పావని ఐదేళ్లు పరిపాలించారు. ప్రస్తుతం మళ్లీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. చైర్పర్సన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు నిర్ణయించనుండడంతో ఆశా వహకులు ఆయన నిర్ణయం కోసం ఆశగా చూస్తున్నారు. ఈక్రమంలో మరికొందరు విద్యావంతులైన బీసీ మహిళలు చైర్పర్సన్గా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వైస్చైర్మన్ స్థానం కోసం సీనియర్ నాయకులు పోటీపడుతున్నారు. ఈనెల 16న ప్రమాణ స్వీకారం, చైర్పర్సన్ ఎన్నిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికను ఈనెల 16న నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఈక్రమంలోనే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. నేరుగా సోమవారం జరిగే ప్రమాణ స్వీకారానికి రానున్నారు. ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు స్థానిక సినారె కళామందిరంలో భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. ఉదయం 7.30 గంటల నుంచే అభ్యర్థులు, వారి తరఫున కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రాలకు చేరుకున్నారు. మూడు అంచెల భద్రత మధ్య తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు తర్వాత బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్రూమ్ నుంచి తెచ్చి ఓట్లు లెక్కించారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాలు అందించి సోమవారం జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఎన్నికల పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. -
ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు
నా భర్త గెలుపు కోసం వెన్నంటే ఉండి పోరాటం చేశానని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాడజనం మా ఆయనను గెలిపించారని.. భర్త విజయం సాధించిన వార్త విని పరుగులతో వచ్చింది భార్య. ఆ క్షణం భర్త గుండైపె వాలి ఆనందంతో ఏడ్వసాగింది. తల్లి సైతం గారాల కొడుకును చూసి ముద్దులు ెపెడుతూ కన్నీరుతెచ్చుకుంది. ఈసన్నివేశం చూస్తూ గెలిచిన అభ్యర్థులంతా ఒక్కసారిగా వారి ప్రేమను చూస్తూ ఉండిపోయారు. పెద్దపల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి పాగాల శ్రీకాంత్ గెలుపుతో తల్లి, భార్య, కూతురు, బంధువులు, కాలనీవాసుల ఆనందం ఆకాశాన్నంటింది. కౌంటింగ్ కేంద్రం బయట ఒకరికొకరు తమ మద్దతుదారులు గెలిచారంటూ సంబురాల్లో మునిగిపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కాంగ్రెస్దే జోరు
● సుల్తానాబాద్లో రెండు ఓట్లు తిరస్కరణ సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పడ్డాయి. రామగుండం కార్పొరేషన్లో 467 ఓట్లకు 220 కాంగ్రెస్కు, 92 బీఆర్ఎస్కు, 46 బీజేపీకి పడ్డాయి. సింహానికి 45,ీ ససీపీఐకి 2, జనసేనకు 3, స్వతంత్రులకు 31 ఓట్లు పడ్డాయి. 28 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 65 ఓట్లు పోలవ్వగా, అందులో రెండు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 63 ఓట్లలో కాంగ్రెస్కు 31, బీఆర్ఎస్కు 14, బీజేపీకి 07, ఏఐఎఫ్బీకి 7, ఇండిపెండెంట్లకు 4 ఓట్లు పడ్డాయి. పెద్దపల్లిలో మొత్తం 215 ఓట్లలో కాంగ్రెస్కు 133, బీఆర్ఎస్కు 34, బీజేపీకి 19, ఇతరులకు 29 ఓట్లు పడ్డాయి. మంథనిలో 49 ఓట్లకు కాంగ్రెస్కు 30, బీఆర్ఎస్కు 12, ఏఐఎఫ్బీకి 2, ఇండిపెండెంట్లకు 5 ఓట్లు పడ్డాయి. నోటాకు 847.. సాక్షి పెద్దపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి మద్దతు తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దేశంలో నిర్బంధ ఓటింగ్ వ్యవస్థ లేదు. దీంత వివిధ కారణాలతో చాలామంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోంది. దీంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు నోటా (నన్ ఆఫ్ ది ఎబౌట్)ను తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. దీంతో రామగుండం కార్పొరేషన్లో 736 మంది, మంథనిలో 34మంది, పెద్దపల్లిలో 77మంది నోటాను వినియోగించుకున్నారు. సుల్తానాబాద్లో ఒక్కరు కూడా నోటాహక్కు వినియోగించుకోలేదు. పెద్దపల్లిలో ఒక ఓటరు పోస్టల్ బ్యాలెట్లో నోటాకు ఓటు వేయడం గమనార్హం. చెల్లని ఓట్లు 1,640 సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పలువురు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. బ్యాలెట్ పత్రంలో సరైన విధంగా స్వస్తిక్ సింబల్ వేయకపోవడం, ఓటువేసిన వారు తప్పుగా మలచటం తదితర కారణాలతో రామగుండం కార్పొరేషన్లో 1,163 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పెద్దపల్లిలో 288, సుల్తానాబాద్లో 101, మంథనిలో 88 ఓట్లు మొత్తంగా 1,640 ఓట్లు చెల్లకుండా పోయాయి. -
నేడు తేలనున్న భవితవ్యం
● నిఘా నీడలో ఓట్ల లెక్కింపు ● రెండు రౌండ్లలో ఫలితాలుమున్సిపాలిటీ వార్డులు టేబుళ్లు రౌండ్లు సిరిసిల్ల 39 39 02 వేములవాడ 28 28 02సిరిసిల్లటౌన్/వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ ముగియగా.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈమేరకు జిల్లా అధి కారులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో సినారె కళామందిరాల్లో ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సాయుధ పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు సాగనుంది. రెండు రౌండ్లలో లెక్కింపు రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. సిరిసిల్లలో 39 టేబుళ్లు, వేములవాడలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. సిరిసిల్లలో ఒక్కో వార్డులో సగటున 1500 ఓట్లు ఉండగా.. రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. వేములవాడలో సగటున ఒక్కో వార్డులో 1400 ఓట్లు ఉండగా.. ఇక్కడ కూడా రెండు రౌండ్లలో ఫలితాలు వెల్లడికానున్నాయి. రీకౌంటింగ్ ఉన్న వార్డుల్లో మరో గంట అదనపు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. మున్సిపాలిటీ పోలైన అభ్యర్థులు కౌంటింగ్ సిరిసిల్ల 63,562 174 156 వేములవాడ 31,881 113 101 -
ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత
● బందోబస్తులో 250 మంది పోలీసులు ● విజయోత్సవ ర్యాలీలు నిషేధం ● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల క్రైం: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల, వేములవాడల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. 250 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ర్యాలీలు తీయొద్దని సూచించారు. మహాశివరాత్రికి పకడ్బందీగా భద్రత మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జాతర ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భీమేశ్వర ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, నాంపల్లి, అగ్రహారం ఆలయాల వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా వంటి చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెంచా లని, లౌడ్స్పీకర్ల ద్వారా భక్తులకు సూచనలు అందించాలని ఆదేశించారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు వీరప్రసాద్, కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్, రవి, నాగేశ్వరరావు, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, రమేశ్ ఉన్నారు. -
బాగా పని చేశారు
● మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఖాయం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు బాగా పనిచేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్సారార్ ఫంక్షన్హాల్లో గురువారం 28 వార్డుల అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పట్టణంలో తిరిగిన సమయంలో చాలా సమస్యలు గుర్తించామని, వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 16 నుంచి 19 వరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సౌజన్యంతో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ఉపాధ్యక్షుడు కోళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అజ్మీర రాందాస్, ఈసీ మెంబర్ మైలారం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ ఉన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్–సిరిసిల్ల ఆర్టీసీ బస్సు నామాపూర్ మీదుగా నడిపే సర్వీస్ను గురువారం ప్రారంభించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డికి గ్రామస్తులు చేసిన విజ్ఞప్తితో ఆర్టీసీ అధికారులు స్పందించి, సర్వీస్ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్ కొమురయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. మూడో రోజుకు రైతుల రిలే నిరాహార దీక్షతంగళ్లపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11(ఆర్డీ3 ఎల్ఎం6) కాలువ పనులు పూర్తి చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం మూడో రోజుకు చేరాయి. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజీపేట, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి సహా 12 గ్రామాల రైతులు దీక్షలో పాల్గొన్నారు. 14 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. కోతులను పట్టేందుకు విరాళాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలోని కోతులను ఊరు దాటించేందుకు ఇంటికి రూ.250 చొప్పున ఇవ్వాలని ఇప్పటికే గ్రామసభలో తీర్మానించారు. ఈమేరకు అంబేడ్కర్నగర్కు చెందిన మాదిగ సంఘం తరఫున అధ్యక్షుడు ఎల్లయ్య గురువారం రూ.50వేలను సర్పంచ్ ఎలగందుల నర్సింలుకు అందజేశారు. గ్రామానికి చెందిన శ్రీవేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు, రైతు చర్చా మండలి అధ్యక్షుడు గుండం సుధాకర్రెడ్డి తమ కులస్తుల తరఫున రూ.50వేలు, యాదవ సంఘం తరఫున రూ.12,250 నగదును ఆ సంఘం అధ్యక్షుడు బొల్లు భూమయ్య సర్పంచ్కు అందించారు. -
మూడోసారి గులాబీ రెపరెపలు
● సిరిసిల్లను అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ ● ప్రజలు కేటీఆర్ వెంట నిలిచారు ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీపై ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని తెలంగాణ భవన్లో గురువారం ప్రెస్మీట్లో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగస్వాములైన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. వస్త్రపరిశ్రమ యజమానులు, ఆసాములను బెదిరించారన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వబోమని భయపెట్టారని పేర్కొన్నారు. కానీ సిరిసిల్ల ప్రజలు కేటీఆర్పై నమ్మకం ఉంచి తమ పార్టీకి మరోసారి పట్టం కట్టబోతున్నారన్నారు. రేపటి ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు చెంపపెట్టుగా మారబోతున్నాయన్నారు. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, మ్యాన రవి, ఎం.డి.సత్తార్, రామాగౌడ్, మల్లికార్జున్ పాల్గొన్నారు. -
లెక్కలేస్తున్నారు
● ఫలితాలపై ఉత్కంఠ ● సిరిసిల్ల, వేములవాడల్లో చర్చ ● పురపీఠాలు ఎవరిపరమో.. ● ఎంతో ధీమా .. అంతే భయంసిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట్ల లెక్కలు తీస్తున్నారు. పంపిణీ చేసిన డబ్బులు ఎంత.. వచ్చే ఓట్లు ఎన్ని అని అంచనాల్లో గురువారం మునిగితేలారు. అనుచరులు, అనుయాయులతో రోజంతా చర్చలు జరిపారు. గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నా అంతకుమించి భయం మాత్రం లోలోన ఉంది. సిరిసిల్లలో 39 వార్డులకు 170 మంది, వేములవాడలో 28 వార్డులకు 113 మంది పోటీ చేశారు. బుధవారం ఎన్నికలు ముగియడంతో ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. అనుచరులు మాత్రం ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి వచ్చే ఓట్లను అంచనా వేస్తున్నారు. ఖరీదైన ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా ఖరీదుగా మారాయి. గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడకుండా ముందుకెళ్లారు. సిరిసిల్లలోని ఓ వార్డులోని ప్రధాన పార్టీ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.10వేల చొప్పున పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో ఏకగ్రీవమైన సదరు అభ్యర్థి ఇప్పుడు గెలుపే లక్ష్యంగా ముందుగా ఓటుకు రూ.5వేలు ఇవ్వగా.. ప్రధాన ప్రత్యర్థి రూ.7వేలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మరో రూ.5వేల చొప్పున పంపిణీ చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గుర్తులను నమ్ముకోగా, ఇండిపెండెంట్లు మాత్రం డబ్బులను నమ్ముకుని ముందుకెళ్లారు. మొత్తంగా సిరిసిల్లలో రెండు రోజుల్లో రూ.25కోట్ల వరకు ఓటర్లకు పంపిణీ చేసినట్లు అంచనా. అతి తక్కువగా కొన్ని రిజర్వు వార్డుల్లో రూ.500 చొప్పున పంపిణీ చేశారు. వేములవాడలో మొత్తంగా రూ.15కోట్ల వరకు ఖర్చు చేసినట్లు భావిస్తున్నారు. భూములను అమ్మి, ఇళ్లను కుదవపెట్టి మరీ బరిలో దిగారు. ఓట్లు సీట్లపై అంచనాలు సిరిసిల్ల, వేములవాడల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఎవరికీ వారు ఓట్లు అంచనా వేస్తున్నారు. అనుచరులు చెప్పే మాటలు నమ్మి ఽధీమాగా ఉన్నారు. కొందరు ఉత్కంఠగా ఫలితాల కోసం నిరీక్షిస్తుంటే ఇంకొందరు విజయం సాధించినట్లు భాస్తున్నారు. పెరిగిన ఓటింగ్ ఎవరికీ అనుకూలం సిరిసిల్లలోని కొన్ని వార్డుల్లో పోలింగ్శాతం 81 నుంచి 86 శాతం వరకు నమోదైంది. మరికొన్ని వార్డుల్లో 66 నుంచి 72 శాతంలోపే నమోదుకావడం గమనార్హం. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలంగా వస్తుందని ఎవరి ధీమాలో వారు ఉన్నారు. 1, 9, 10, 22, 31, 32, 34 వార్డుల్లో పోలింగ్ 83 నుంచి 89 శాతంగా నమోదైంది. 5, 6, 17, 18, 27, 28, 39 వార్డుల్లో పోలింగ్ 65 నుంచి 70 శాతంలోపే నమోదైంది. రగుడు, సర్ధాపూర్, ముష్టిపల్లి, చిన్నబోనాలు, పెద్దబోనాల, గోపాల్నగర్, టీఆర్నగర్, బీవై నగర్, సుందరయ్యనగర్లలోని వార్డుల్లో అత్యధికంగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతనగర్, గాంధీనగర్, అంబేడ్కర్నగర్, పత్తిపాకవీధి, సుభాష్నగర్, నెహ్రూనగర్లలో ఓటేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఓటింగ్శైలి తమ గెలుపోటములపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందోనని అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు. -
పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్
● ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ సినారె కళామందిరాల్లో గురువారం మాక్ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో సినారె కళామందిరాల్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచామని, ఇప్పటికే ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారని వివరించారు. ఒక్కో వార్డుకు ఒక టేబుల్ చొప్పున.. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, మూడు టేబుళ్లకు కలిపి ఒక ఆర్ఓ, ఏఆర్ఓ ఉంటారని వివరించారు. సిరిసిల్లలో 39 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 78 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, వేములవాడలో 28 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 56 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించినట్లు తెలిపారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, ఎన్నికల విభాగం అధికారులు శ్రీనివాసాచారి, మీర్జా ఫసహత్ అలీ బేగ్, అన్సార్ తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజెషన్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రక్రియను కలెక్టర్ పూర్తి చేశారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఈడీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్, జాతర కమిటీ చైర్పర్సన్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గురువారం అన్ని శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తించి విజయవంతం చేయాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో, వేములవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, క్యూలైన్ల వద్ద మూడు షిఫ్టుల్లో సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భీమన్న ఆలయం, ప్రసాదం కౌంటర్, పార్కింగ్ స్థలాలు ఇతర చోట్ల వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్లతో సిద్ధంగా ఉండాలని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జాతర పరిసరాల్లో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా చూడాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు, వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
● కనీస వేతనాలు అమలు చేయాలి ● సిరిసిల్లలో కార్మిక సంఘాల డిమాండ్ ● ఆర్డీవోకు వినతిపత్రం అందజేతసిరిసిల్లటౌన్/తంగళ్లపల్లి/గంభీరావుపేట: కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. నాయకులు కడారి రాములు, పోచయ్య, వడ్డెపెల్లి లక్ష్మణ్, కోడం రమణ, జువ్వాజి విమల, ఆకుల రాములు, సోమిశెట్టి దశరథం పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దని ఐసీఈయూ అధ్యక్షుడు దినకర్, ప్రధాన కార్యదర్శి రాపెల్లి శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలోని ఎల్ఐసీ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. కేంద్రానివి కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ తంగళ్లపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తే సహించం తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ఉపాధిహామీ కార్మి కులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. నాయకుడు గుంటి వేణు మాట్లాడుతూ ఉపాధిహామీలో సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల ధర్నా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గంభీరావుపేటలోని పంచాయతీ కార్మికులు మండల పరిషత్ ఎదుట ధర్నా చేపటి, వినతిపత్రం అందించారు. -
ఓటెత్తిన మహిళా చైతన్యం
● ‘పుర’పోరు ప్రశాంతం ● సిరిసిల్లలో 77.55 శాతం ● వేములవాడలో 77.99 శాతం ● గతంలో కంటే తగ్గిన పోలింగ్ ● 2020 మున్సిపల్ ఎన్నికల్లో 81.38 శాతం ● 2014 ఎన్నికల్లో 80.36 శాతం ● వెల్లువెత్తిన మహిళా చైతన్యం ● రేపు ఓట్ల లెక్కింపువేములవాడలో బారులుతీరిన మహిళలుమున్సిపల్ ఓటర్లు పోలైనఓట్లు 9 గంటలు 11 గంటలు 1 గంట 3 గంటలు తుది ఓటింగ్ సిరిసిల్ల 81,959 63,562 8.01 23.14 43.57 61.17 77.55 వేములవాడ 40,877 31,881 14.06 35.35 55.68 69.69 77.99 మొత్తం 1,22,836 95,443 10.02 27.20 47.60 64.01 77.77 పోలింగ్ సరళి ఇదీ..సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న ఘటనలు మినహా రీపోలింగ్ లేకుండా సాఫీగా సాగాయి. మహిళా ఓటర్ల చైతన్యం వెల్లువెత్తింది. సిరిసిల్లలో 77.55 శాతం, వేములవాడలో 77.99 శాతం పోలింగ్ నమోదైంది. రెండు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 1,22,836 మంది ఉండగా.. 95,443 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో 81.38 శాతం, 2014లో 80.36 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 77.77 శాతానికి పడిపోయింది. సిరి సిల్లలో 39 వార్డులకు 170 మంది, వేములవాడలో 28 వార్డులకు 133 మంది బరిలో నిలిచారు. ఫలి తాలు రేపు తేలనున్నాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఎస్పీ నాగేంద్రచారి పోలింగ్ సరళిని పరిశీలించారు. నిదానంగా మొదలైన పోలింగ్ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోలింగ్ నిదానంగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనా పెద్దగా ఓటర్లు ఎవరూ రాలేదు. 9 గంటల వరకు పోలింగ్ కేంద్రాల ముందు క్యూలైన్లు కనిపించాయి. 11 గంటల వరకు ఓటర్ల రద్దీ పెరిగింది. ఒంటి గంట వరకు సగం మంది ఓటర్లు వేశారు. సిరిసిల్లలో ఒక్కో వార్డుకు మూడు పోలింగ్ కేంద్రాలు, వేములవాడలో రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఐదు నుంచి పదిహేను నిమిషాల్లోపే ఓటు వేసి వెనుదిరగడం విశేషం. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి సిరిసిల్లలో 117 పోలింగ్ కేంద్రాలు, వేములవాడలో 58 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుచరులతో సందడి చేశారు. ఓటర్ల వద్దకు ఆటోలు, కార్లను పంపించి కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని 175 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ చేశారు. చెదురుమదురు ఘటనలు సిరిసిల్ల 39వ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. 30వ వార్డులోనూ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగగా.. పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి తనను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం లేదని రోడ్డుపై బైఠాయించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. వెల్లువెత్తిన మహిళా చైతన్యం రెండు మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో పోలింగ్లో పాల్గొనడం విశేషం. సిరిసిల్లలో పురుషులు 30,466 మంది ఓటుహక్కు వినియోగించుకుంటే మహిళలు 33,091 మంది, ఇతరులు ఐదుగురు ఓటేశారు. పురుషుల ఓటింగ్ శాతం 76.28 ఉండగా.. మహిళల ఓటింగ్ శాతం 78.77 శాతం ఉంది. వేములవాడలో 14,801 మంది పురుషులు ఓట్లు వేయగా.. మహిళా ఓటర్లు 17,070, ఇతరులు 10 మంది వేశారు. ఇక్కడ పురుషుల ఓటింగ్ శాతం 75.59 ఉంటే.. మహిళా ఓటింగ్ శాతం 80.22 ఉంది. రేపు ఓట్ల లెక్కింపు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని సినారె కళామందిరాల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని 39వ వార్డులో అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు ముదిరి దాడుల వరకు వెళ్లింది. ఇరువర్గాల తోపులాటలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. ఫలించని దొంగ ఓటు ప్రయత్నం వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడి భార్య రెండోసారి ఓటు వేయడానికి రావడంతో కాంగ్రెస్ ఏజెంట్లు అడ్డుచెప్పారు. అప్పటికే కాంగ్రెస్కు చెందిన ఓ నాయకుడు పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో మహిళ రెండోసారి ఓటు వేయడానికి రావడంపై ఇరు పార్టీలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, దూషణలకు దిగారు. కొద్దిసేపు తోపులాటలు, కుమ్ములాటలతో ఆ ప్రాంతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు వచ్చి మహిళ రెండోసారి ఓటు వేయడానికి రాగా పోలింగ్ ఆఫీసర్ అనుమతించలేదన్నారు. దొంగ ఓట్లు వేయలేదని వివరించారు. వేములవాడలో ప్రశాంతం వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు కనిపించాయి. 28 వార్డులకు 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 77.99 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆర్డీవో రాధాభాయి, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ తెలిపారు. కొన్ని వార్డుల్లో పోలింగ్శాతం 80 శాతం దాటగా, మరికొన్ని వార్డుల్లో సగటు పోలింగ్ 71.95 నమోదైంది. మూడో వార్డులో అత్యధికంగా 86.74 శాతం, 11వ వార్డులో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఏఎన్ఎంలతో మాట్లాడున్న అదనపు కలెక్టర్ నగేశ్ గోపాల్నగర్లో ఓటేసేందుకు వచ్చిన వృద్ధురాలు -
ఓట్ల జగడం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 58వ డివిజన్ జిల్లా పరిషత్ పోలింగ్బూత్లో బీఆర్ఎస్ నేతలు తమఓట్లు వేశారంటూ బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇది లాఠీచార్జ్కు దారి తీసింది. 32వ డివిజన్లో ఎంఐఎం, బీఆర్ఎస్ అభ్యర్థుల వర్గీయులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 33వ డివిజన్లో దొంగ ఓట్లు పడ్డయని ప్రచారం జరిగినా.. దాన్ని మున్సిపల్ కమిషనర్ ఖండించారు. 28 డివిజన్లో తమ నేతలను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 49వ డివిజన్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్రెడ్డి సెల్ఫోన్ లాక్కుని బీజేపీ నాయకులు పగులగొట్టారని ఆరోపించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థి భర్త ఎన్నం ప్రకాశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 36వ డివిజన్లో పోలీసులతో స్వతంత్ర అభ్యర్థి యాదయ్య వాగ్వాదానికి దిగారు. 27 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బంధువు అయిన పోలీసు తమపై చేయి చేసుకున్నారని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆరోపించాడు. పెద్దపల్లి జిల్లాలో.. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు అభ్యర్థి రజని కష్ణమూర్తి ఫొటోల గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్పు పంపిణీ చేశారంటూ బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, మనోహర్రెడ్డి అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎనిమిదోకాలనీ 17వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో అధికారుల వద్ద ఉండాల్సిన ఓటింగ్ లిస్టు బయటికి వచ్చిందని బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా జగిత్యాలలోని 31వ వార్డులో ఎంఐఎం బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. 26వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన బాపురపు చంద్రశేఖర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో 12వ వార్డులో ఓ అంగన్వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు. జగిత్యాల 27వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల 2వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఏకంగా ఒకరినొకరు తోసుకున్నారు. కోరుట్లలో 27 వార్డులో స్వతంత్ర అభ్యర్థి తన ఎన్నికల గుర్తు అయిన ఆపిల్ పండ్లు పంచుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వేములవాడ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి తనను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓ ఎస్సై సపోర్టు చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ సతీమణి పోలింగ్ ఏజెంట్గా మరో వ్యక్తి ఐడీ కార్డు మెడలో వేసుకుని ఓట్లు అడిగినట్లు కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు. -
బాధ్యత నెరవేర్చాం
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: మున్సిపాలిటీ ఎన్నికల్లో యువత ఓటెత్తారు. కొత్తగా ఓటుహక్కు వచ్చిన వారు ఉత్సాహంగా పాల్గొనగా.. వృద్ధులు తమ అనుభవ పాఠాలు చెబుతూ క్యూలైన్లో కనిపించారు. ఇటు యువత.. అటు అనుభవజ్ఞులైన వృద్ధులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు భారీగా క్యూలైన్లో నిల్చున్నారు. ఓటరుచైతన్యంపై ‘సాక్షి’ పలకరించగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓటుహక్కును వినియోగించుకోవాలనే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా సిరిసిల్లకు వచ్చిన. వార్డుల్లో సమస్యల పరిష్కా రం, అభివృద్ధి సాధారణమే. కానీ యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పించే నాయకత్వం బలపడాలి. – ఆర్.సుప్రియ, అకౌంటెంట్ మొదటిసారి ఓటేసిన. ఎంతో ఉత్సాహంగా ఉంది. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కును సరైన నాయకులకు బలపరిచిన. వార్డులో స్నేహంగా ఉంటూ అభివృద్ధి సాధించాలి. ప్రజాసేవలో ఎల్లప్పుడు ఉండేవారే గెలవాలి. – బొడ్డు ప్రవళిక, సిరిసిల్ల -
మర్తనపేటలో గొర్రైపె చిరుత దాడి
కోనరావుపేట/చందుర్తి(వేములవాడ): మండలంలోని మర్తనపేటలో చిరుతదాడి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం మేకను చంపిన ఘటన మరువకముందే మళ్లీ దాడి చేయడంతో గొర్లకాపరులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన ఏశ కనకయ్య, ఎగుర్ల రమేశ్ తమ గొర్లను తీసుకుని చింతగుండుచెరువు ప్రాంతంలోని మేతకు వెళ్లారు. చిరుతపులి దాడి చేసి రెండు మేకలను ఎత్తుకెళ్లింది. వరుసదాడులతో భయం మర్తనపేటలో నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దాడి చేయడంతో గొర్లకాపరులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం మరిమడ్లలో ఓ పందిపై దాడి చేసింది. అంతకుముందు శివంగాలపల్లి, వట్టిమల్ల గ్రామాల్లో దాడిచేసిన సంఘటనలు ఉన్నాయి. చిరుతపులి వరుస దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ చూపి చిరుత బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. దేవుని తండా శివారులో మేకలపై చిరుత దాడి చందుర్తి మండలం దేవునితండా శివారులోని అటవీ ప్రాంతంలో మేకలపై చిరుత బుధవారం దాడి చేసింది. నూనవత్ గోపాల్కు చెందిన మేకలపై చిరుత దాడి చేసింది. ఒక మేకను తినగా, మరో రెండు మేకలను గాయపర్చిందని గోపాల్ వాపోయాడు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తండావాసులు తెలిపారు. -
కిలోమీటర్ నడిసొచ్చిన
నేను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటుమాత్రం వేస్తాను. 60 ఏళ్లు దాటిన ఇప్పటికీ భూపతినగర్ నుంచి కిలోమీటర్ నడిచి వచ్చి ఓటువేస్తాను. ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. – కర్నే వసంత, భూపతినగర్ ఎప్పుడు ఓట్లు వచ్చిన నా మనుమల సహాయంతో వచ్చి ఓటేస్తాను. నాకు 88 ఏండ్లు దగ్గరికి వచ్చినటికి ఓటు ఎప్పుడూ మరువలేను. ఈ వయసులో కూడా ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. – పలుక నర్సయ్య, పెద్దూరు -
డిమాండ్ల సాధనే లక్ష్యం
● నేడు శ్రామికుల దేశవ్యాప్త సమ్మె ● కార్మిక, వ్యవసాయ చట్టాల పరిరక్షణే ధ్యేయం ● ఏకతాటిపైకి ట్రేడ్ యూనియన్లుసిరిసిల్లటౌన్: హక్కుల రక్షణ.. సమస్యల పరిష్కారం కోసం శ్రామికవర్గాలు గురువారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్రం ప్రభుత్వం కార్మిక, కర్షక చట్టాలను కుదించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అధిక ధరల తగ్గింపు ీతదితర డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, అన్నిరంగాల కార్మికుల మద్దతుతో నేడు దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మినహా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాల్లో సమ్మె చేపట్టనున్నాయి. జిల్లాలో దాదాపు ఎనభైశాతం కార్మిక, కర్షక వర్గాలకు చెందిన వారున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ విస్తరించి ఉండగా నేతకార్మిక కుటుంబాలు 16వేల వరకు ఉన్నాయి. దీనికితోడు బీడీ పరిశ్రమ సైతం విస్తరించి ఉంది. కార్మిక, కర్షక ఖిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మికచట్టాల రద్దుపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సైతం పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాయి. వస్త్రపరిశ్రమలో పనిచేస్తున్న వార్పిన్, కాటన్వస్త్రం, పాలిస్టర్వస్త్రం ఉత్పత్తి కార్మికుల కూలీ ఒప్పందానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ ఉంది. కార్మికుల వివరాలు(సుమారు) బీడీ 86,000 పవర్లూమ్ 15,000 గ్రామపంచాయతీ 1,300 అంగన్వాడీలు 500 ఆశకార్యకర్తలు 450 మున్సిపల్ 700 గార్మెంట్స్ 1,300 హమాలీ 2,500 మధ్యాహ్నం భోజనం 600 రైతులు 1,13,000 భవన కార్మికులు 5,000 -
సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
నేతకార్మికుల జీవితాలను మెరుగుపర్చేందుకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి. కనీ స వేతనం రూ.26వేలు, యూ భై ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలి. వర్కర్ టు ఓనర్ పథకం ప్రారంభించాలి. – మూశం రమేశ్, పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి. వీ బీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి. సిరిసిల్ల పవర్లూమ్ రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. – గుంటి వేణు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు -
● నవోత్సాహంలో యువత ● అనుభవాలు చెప్పిన వృద్ధులు
గతంలో కంటే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. పోలింగ్ బూతుల్లో వసతులు కల్పించారు. మా రోజుల్లో ఇలా వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఇప్పుడు సహాయకులను అందుబాటులోకి తేవడం మంచిగుంది. – ఆకునూరి కిష్టయ్య, అంబేడ్కర్నగర్ హైదరాబాద్లో బీటెక్ థర్డియర్ చదువుతున్నా. ఓటుహక్కు వినియోగించుకోవడం బాధ్యత కాబట్టి వచ్చాను. నిజాయితీపరులను ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. – రాపెల్లి రాజ్కుమార్, బీటెక్ విద్యార్థి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఓటేస్తాను. నాకు చేతకాకపోయినా నా కుటుంబ సభ్యుల సహాయంతో ఓటేస్తాను. ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ ఓటు వేయడం సంతోషంగా ఉంది. – కౌసల్య, చంద్రంపేట -
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
● ఎన్పీడీసీఎల్ చైర్పర్సన్ వేణుగోపాలాచారి ఓదెల(పెద్దపల్లి): విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్ చైర్పర్సన్ వేణుగోపాలాచారి ఆదేశించారు. పొత్కపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో మంగళవారం జరిగిన వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో వేణుగోపాలాచారి మాట్లాడారు. వేలాడే తీగలు, 11 కేవీ విద్యుత్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. జీలకుంట సర్పంచ్ రాగిడి మంగ.. ప్రస్తుతం విద్యుత్ సబ్స్టేషన్ జీలకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉందని, పేరు, స్థలం మార్చాలని చైర్పర్సన్కు వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్కో డీఈఈ బ్రహ్మచారి, ఏడీ రవీందర్, ఏఈఈలు మోహన్నాయక్, శ్రీనివాస్, చంద్రశేఖర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎవరొస్తారో.. ఏమిస్తారో
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వేములవాడలో జరుగుతున్నది ప్రచారమా? లేక ప్రజాస్వామ్యం ఖూనీనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 28 వార్డుల్లో ఓటర్ల ఇళ్ల తలుపులు తెరిచే ఉన్నాయి. లైట్లు ఆన్లోనే ఉన్నాయి. కానీ, ఆ వెలుగు ప్రజాస్వామ్యానికి కాదు, డబ్బు రాజకీయాలకు. అభివృద్ధి మాటలు పోస్టర్లకే పరిమితం కాగా, ఓటు విలువ మాత్రం రాత్రికి రాత్రి పెరుగుతోంది. గడప దాటే ప్రతీసారి ప్రజాస్వామ్యం మెడపై కత్తి పడుతున్న పరిస్థితి. ఓటరు మనసు కాదు.. ఓటరు జేబే రాజకీయమయ్యింది. హామీలు కాదు, చేతికి అందేదే ప్రమాణం. వీధుల్లో నినాదాలు వినిపిస్తున్నా, గల్లీల్లో మాత్రం లెక్కలు జరుగుతున్నాయి. ‘ఈసారి ఎంత?’ అన్న ప్రశ్నే కేంద్రంగా మారింది. ఇది ఎన్నికల పోరాటం కాదు.. ప్రజాస్వామ్య ఖూనీకి తెరలేపిన రాత్రి జాగరణగా మారుతోంది. ఒకవైపు అభ్యర్థుల హడావుడి, మరోవైపు ఓటర్ల ఎదురుచూపులు, అభ్యర్థుల అనుయాయుల పంపకాలు, ఈ మధ్యలో రాజ్యాంగ విలువలు మౌనంగా రక్తం కారుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. ఈనెల 7న దొంగలు వరదవెల్లికి చెందిన కొంకటి తిరుపతి ఇంటి తాళం పగులగొట్టి వెండి పూజా వస్తువులు ఎత్తుకెళ్లారు. అనంతరం బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సాక్ష్యాల ఆధారంగా నిందితుల్లో ఒకరు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన కంచు శివశంకర్, సిరిసిల్ల సంజీవయ్యనగర్కు చెందిన వ్యక్తి, ప్రస్తుతం వేములవాడ సుభాష్నగర్లో ఉంటున్న సామల్ల బాలకిషన్గా గుర్తించారు. ఇద్దరిని మంగళవారం కొదురుపాక చౌరస్తాలో పట్టుకున్నారు. వారి నుంచి 30 తులాల వెండి ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరలించినట్లు సీఐ వివరించారు. త్వరగా కేసు ఛేదించిన ఎస్సై రమాకాంత్, ప్రింగర్ ప్రింట్ ఎస్సై క్రాంతి, సిబ్బంది కోటి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేశ్ను సీఐ తదితరులు అభినందించారు. -
స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
సిరిసిల్ల/వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ కోరారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడలోని పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఎస్ఈసీ నిబంధనలకు మేరకు విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించామని తెలిపారు. మొబైల్కు అనుమతి లేదు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. దివ్యాంగులకు ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ నెల 13న సిరిసిల్ల, వేములవాడ సినారే కళామందిర్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్కుమార్, తహసీల్దార్లు మహేశ్కుమార్, జయంత్కుమార్, నోడల్ అధికారులు జగన్మోహన్రెడ్డి, శ్రీనివాసాచారి, భారతి, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. -
ఓటేద్దాం
● సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ● పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది .. 175 కేంద్రాలు ● ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,22,836 మంది ఓటర్లునేడు పుర పోరుసిరిసిల్లలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సిబ్బందిసిరిసిల్ల/వేములవాడ: జిల్లాలో మున్సి పల్ ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సిరిసిల్లలోని గీతానగర్ హైస్కూల్, వేములవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు నియమితులైన 957 మంది అధికారులు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలతో మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 1,22,836 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఇప్పటికే పోల్చిట్టీలు పంపిణీ చేశారు. సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా.. 170 మంది, వేములవాడలో 28 వార్డులకు 113 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డులకు రెండు.. మూడు.. సిరిసిల్లలో ఒక్కో వార్డుకు మూడు.. వేములవాడలో ఒక్కో వార్డుకు రెండు పోలింగ్ స్టేషన్ల చొప్పున ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు దూరంగా ఉండడంతో వేములవాడలో మరో రెండు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది మంగళవారమే రిసెప్షన్ సెంటర్లకు చేరుకోగా.. పోలింగ్ సామగ్రిని అందించారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలతో ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సామగ్రిని సరిచూసుకుని ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. విలీన గ్రామాల్లో ఎన్నికల సందడి సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో విలీనమైన 12 గ్రామాల్లో రెండో సారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సిరిసిల్లలో విలీనమైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్ధాపూర్, వేములవాడలో విలీనమైన మారుపాక, తిప్పాపూర్, శాత్రాజ్పల్లి, కోనాయపల్లి, అయ్యోరుపల్లెలు గతంలో గ్రామాలుగా ఉండేవి. గత మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో విలీనం కావడంతో వార్డుల వారీగా పురపోరు సందడి నెలకొంది. కేంద్రాల వద్ద పటిష్ట భద్రత సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 163 బీఎన్ఎస్ (144 సెక్షన్)ను విధించి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో 48 సెన్సిటివ్, 17 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు మున్సిపాలిటీల్లోని 175 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాదాబాయి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణం సిరిసిల్ల వేములవాడ బీఆర్ఎస్ 39 28 కాంగ్రెస్ 39 28 సీపీఐ/ సీపీఎం 03 03 ఇతరులు 14 07 ఇండిపెండెంట్ 36 19మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు పోలింగ్కేంద్రాలు సిబ్బంది సిరిసిల్ల 39 81,959 117 576 వేములవాడ 28 40,877 58 381 -
గిట్టుబాటు లేక.. నిరుపయోగంగా వదిలేసి..
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లోని పార్కింగ్ స్టాండ్ నిరుపయోగంగా మారింది. దీనిద్వారా సమకూరే ఆదాయాన్ని పరిశీలించకుండా రైల్వే ఉన్నతాధికారులు ఊహాజనిత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ మొత్తానికే టెండర్లు ఆహ్వానించడంతో అధిక మొత్తంలో కోట్చేస్తున్న కాంట్రాక్టర్లు.. ఆశించిన ఆదాయం రాక కొద్దికాలానికే పార్కింగ్ స్టాండ్ను మూసివేస్తున్నారు. దీనిద్వారా రైల్వేకు నష్టాలు వస్తున్నాయి. ఎన్ఎస్జీ–4 కేటగిరీలో రామగుండం భారతీయ రైల్వేలో నాన్ సబర్బన్ గ్రేడ్ (ఎన్ఎస్జీ)–4 కేటగిరీలో రామగుండం రైల్వేస్టేషన్ ఉంది. ఎన్ఎస్జీతోపాటు సబర్బన్ గ్రేడ్(ఎస్జీ), హాల్ట్ గ్రేడ్(హెచ్జీ) వంటి కేటగిరీలు రైల్వేలో ఉంటాయి. ఎన్ఎస్జీ–4 కేటగిరీ మధ్యస్థ స్థాయి (మంచి ఆదాయం, ఎక్కువ సంఖ్యలో రైళ్ల హాల్టింగ్) ఉంటే మంచిస్థాయి స్టేషన్గా పరిగణిస్తారు. ప్రతీరోజు గరిష్టంగా ఐదువేల మంది ప్రయాణికులు, 80 పైబడి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదాయం రాక వదిలించుకున్న గత కాంట్రాక్టర్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేసేందుకు వేర్వేరుగా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఒక పార్కింగ్ స్టాండ్ నిర్వహణ బాధ్యతలను గతేడాది జూలై 2024లో ఓ కాంట్రాక్టర్ మూడేళ్ల కాలానికి రూ.7,30,125(18శాతం జీఎస్టీతో కలిపి) టెండర్ పొందాడు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించక రెండు నెలల్లోనే తప్పుకున్నాడు. జనవరి 19న మరోసారి రూ.3,47,062.74కు టెండర్లు ఆహ్వానించగా.. ఒకరు రూ.3,46,370, మరొకరు రూ.3,45,678 కోట్చేశారు. రైల్వేశాఖ నిర్ణయించిన ఆదాయం రాకపోవడంతో ఆ టెండర్లు ఖరారు చేయకుండా హోల్డ్లో ఉంచినట్లు సమాచారం. ఊహాజనిత నివేదికల ఆధారంగా టెండర్లు నష్టపోతున్న వాహన పార్కింగ్ స్టాండ్ కాంట్రాక్టర్లు ఆదాయం కోల్పోతున్న రైల్వే శాఖ -
చెట్టుకు ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ వ్యాన్
మల్లాపూర్: మండలంలోని ఒబులాపూర్ శివారు ఎల్లమ్మ ఆలయ సమీపంలో మెట్పల్లి నుంచి విద్యార్థులతో వస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్ చెట్టును ఢీకొంది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే క్రమంలో ఘటన చోటుచేసుకుంది. వ్యాన్ స్వల్పంగా ధ్వంసమైంది. ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. సాయంత్రం స్కూల్ ముగిశాక విద్యార్థులతో ఇళ్లకు బయలుదేరిన వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో బస్సు ముందు వరుసలో కూర్చున్న రెండో తరగతి విద్యార్థి గడ్డం అనీష్కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని అంబులెన్స్లో మెట్పల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. -
సమస్య తలెత్తకుండా చర్యలు
కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి సరఫరా, సమస్యలపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తాం. తద్వారా లోపాలపై స్పష్టత వస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తాం. సర్వే ఆదివారం ప్రారంభమైంది. ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటాం. – బి.శైలజారాణి, ఎంపీడీవో రామగిరి తాగునీటి ఇబ్బందులు రానివ్వం వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదే శించాం. మిషన్ భగీరథతోపాటు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులు ఈనెల ఒకటి నుంచి 20వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
ఒక్కటే లాభదాయకం
ఒక పార్కింగ్ స్టాండ్ మూతపడింది. నేను నిర్వహించే రెండో స్టాండులో వాహనాలు అధికంగా పార్క్ చేస్తున్నారు. ఒత్తిడి బాగా పెరుగుతోంది. షెడ్డు బయట వాహనాలు పార్క్ చేయాల్సి వస్తోంది. ఒకటే పార్కింగ్ స్టాండ్ ఏర్పాటు చేసి ఒకేటెండరు పిలిస్తే బాగుంటుంది. – రియాజ్, పార్కింగ్ స్టాండ్ సబ్ కాంట్రాక్టర్ పార్కింగ్ స్టాండ్ నిర్వహణ గిట్టుబాటు కావడంలేదు. అందుకే కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేస్తున్నారు. రైల్వే ఆదాయం కోల్పోతోంది. దీనిపై రైల్వేశాఖ పునరాలోచించాలి. ఏసీ వెయిటింగ్ హాల్ను కూడా వినియోగంలోకి తేవాలి. – అనుమాస శ్రీనివాస్, డీఆర్యూసీసీ ప్రతినిధి -
సౌదీ అరేబియాలో పోచంపేట వాసి మృతి
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన పొలాస రాజేశం (53) ఈనెల 5న సౌదీ అరేబియాలో విద్యుత్ షాక్ తగిలి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోచంపేటకు చెందిన పొలాస రాజేశం నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. ఈనెల 5న తోటలో పనిచేస్తుండగా విద్యుత్షాక్ తగిలి మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి చేస్తున్నట్లు సర్పంచ్ రెంటం జగదీశ్ తెలిపారు. అదుపుతప్పి బోల్తాపడిన కారు కోనరావుపేట: మండల కేంద్రం నుంచి నిమ్మపల్లికి వెళ్లే దారిలో గద్దెగుట్ట వద్ద కారు అదుపుతప్పి ఓ ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. నిమ్మపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బుర్ర కృష్ణప్రసాద్ ఉదయం 8 గంటలకు తన కారులో పాఠశాలకు వెళ్తుండగా, వెంకట్రావుపేట శివారులోని గద్దెగట్టు చెరువు ప్రాంతంలో కారు అదుపుతప్పి పొలంలో పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడిని 108లో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిరుతదాడిలో మేక మృతిపై విచారణకోనరావుపేట: కోనరావుపేట మండలం మర్తనపేట అటవీ ప్రాంతంలో ఇటీవల చిరుత దాడిలో మేక మృతిచెందిన ఘటనపై మంగళవారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. రాజన్నగొల్లపల్లి గ్రామానికి చెందిన గొర్లకాపరి రమేశ్ మేకను చిరుతపులి మర్తనపేట– పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చంపింది. ఈ విషయమై డెప్యూటీ ఎఫ్ఆర్వో మోహన్లాల్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గొర్లకాపరులు, రైతులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్కరు కాకుండా ఇద్దరుముగ్గురు కలిసి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భర్తకు అస్వస్థతసిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని 39వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి చిటికెన విజయ భర్త చిటికెన సత్తయ్య మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తీసుకెళ్లారు. నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, వైద్య శివప్రసాద్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి సత్తయ్య పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
కోరుట్లలో వెండి ప్రతిమలు పట్టివేత
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల తనిఖీల్లో భాగంగా స్సెషల్ టీం అదికారులు కోరుట్లలోని ఓ వార్డులోని ఓ ఇంట్లో తనిఖీలు చేశారు. ఓటర్లకు పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉన్న 712 శ్రీవేంకటేశ్వర స్వామి వెండి పూత ప్రతిమలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వార్డుకు చెందిన వ్యక్తి ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వెండి ప్రతిమలు తెప్పించారనే సమాచారంతో ఎన్నికల ప్రత్యేక తనిఖీ బృందం సోదాలు చేసింది. వెండిపూత బిల్లలతో, జీసస్ ఫొటోఫ్రేమ్స్, 270 ఫిట్బాక్సులు పట్టుబడ్డాయి. పట్టణంలో స్పెషల్ టీం వాహన తనిఖీల్లో రూ.60 వేలు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. -
గుర్తుకొస్తున్నాయి..!
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి మంద మకరంద్ మంగళవారం జిల్లా కేంద్రంలోని 39వ వార్డులో 115,116,117వ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సిరిసిల్లలో తాను చిన్నప్పుడు చదువుకున్న కాకతీయ ఇంగ్లిష్మీడియం స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం విశేషం. జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్ చిన్నప్పుడు సిరిసిల్లలో చదువుకున్నారు. ఆయన అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులు మకరంద్కు పూలతో స్వాగతం పలికారు. స్కూల్ కరస్పాండెంట్ గుగ్గిళ్ల జగన్గౌడ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. స్కూల్లో కలియ తిరిగి చిన్ననాటి సంగతులను మకరంద్ గుర్తు చేసుకున్నారు. అనంతరం సిరిసిల్ల గీతానగర్ హైస్కూల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మకరంద్ పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గితేవేములవాడ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. వేములవాడ పరిధిలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా 800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం టౌన్ పోలీస్స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులు, సిబ్బందికు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో 17 రూట్ మొబైల్స్, 6 జోనల్ టీమ్స్, 4 రిజర్వ్ టీమ్స్, 2 స్ట్రయికింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్ వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద, రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న ఘటన ఎదురైనా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 163 బీఎన్ఎస్ఎస్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి, ఏఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
మనస్సు ఊరుకో‘లేఖ’
సిరిసిల్ల: అగో.. అప్పుడే తెల్లారుతోంది.. చలి గాలి వీస్తుంది.. సూర్యకిరణాలు నేలను తాకుతున్నాయి. మంచుదుప్పటి తొలగిపోతుంది. క్షణాలు గడుస్తున్నాయి. కాలం కరిగిపోతుంది.. మరో ఐదేళ్లపాటు మనల్ని పాలించే మున్సిపల్ కౌన్సిలర్లను ఎన్నుకునే అరుదైన అవకాశం రానే వచ్చింది. ఈ రోజు ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే రాజువి.. నువ్వే మంత్రివి. శ్రీనిస్వార్థ ప్రజాసేవకున్ని ఎన్నుకోండి..శ్రీ మీ సమస్యలను తన సమస్యలుగా భావించే వారికి ఓటువేయండిశ్రీ.. అంటూ.. వారం రోజులుగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా మైకు పెట్టి మరీ చెప్పారు. వాళ్లు చెప్పిన మాటలు.. వాగ్దానాలు మీ మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. నేతలంతా ఓటరు చుట్టూ చేరి.. చేతులు జోడించి ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఇదే. మరి లే.. నువ్వే లెవ్వు.. లేచి నిర్లక్ష్యాన్ని వీడు.. మీ పోలింగ్ కేంద్రం వైపు ఇగ నడువు.. నీ ఓటు అస్త్రాన్ని సంధించు.. నీ ఓటు ఓ మంచి పాలనకు బాట అవ్వాలి. స్వార్థపరులకు వేటు కావాలి. మన వీధిని.. మన వాడను బాగు చేసే అభ్యర్థికి ఓటు వెయ్యి. ఇయ్యాల ఓట్లు వేసే రోజు కావడంతో నా మనసు ఊరుకో లేక ఇదంతా చెబుతున్నా..! ఇంతకీ నేను ఎవరో మీకు చెప్పనే లేదు కదా.. మీరంతా అప్పుడప్పుడూ వచ్చే మీ మున్సిపల్ ఆఫీస్ను. మీ పొరపాటు.. కావద్దు చేటు.. నేతల మాటల గారడి.. అరచేతిలో వైకుంఠం చూపించేవారిని నమ్మకండి. వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, బిర్యాణీకో.. ఓ చీర, వెండి కై న్కో మీ విలువైన ఓటును అమ్మకండి. అందుకే చెబుతున్నా.. తస్మాత్ జాగ్రత్త. 72 ఏళ్లుగా మిమ్మల్ని.. నన్ను పాలిస్తున్న నేతలు ఏం ఒ రగబెట్టారు. ‘నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వా ళ్ల ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. కులం, మ తం, ప్రాంతం, ప్రగతి పాఠాలను బోధిస్తూ మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపాలను గమనించండి. స్వార్థపరులు, అవినీతి పరులకు ఓ ట్లు వేసి నా దగ్గరికి పంపిస్తే, మీకు ఐదేళ్లు బాధలు తప్పవు. మీకు సేవ చేసే నిస్వార్థ నాయకున్ని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటును వేయండి. ఏ పార్టీ వాడన్నది ముఖ్యం కాదు.. ఏపాటివాడో అని ఆలోచించండి. మన వీధులకు సి మెంట్ రోడ్లు, మురికి కాల్వలు, నల్లానీరు, వంటి వసతులు కావాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలి.మీ క్షేమం, నా అభివృద్ధిని చూసుకునే మంచి నేతలు అందలమెక్కాలి. అన్నీ ఆలోచించి బ్యాలెట్ పత్రంపై ఓటు వేయండి. ఆఖరు మాట చివరగా ఒక్క మాట.. పోటీలో ఉన్నవాళ్లలో మంచి అభ్యర్థిని గుర్తించండి. ఎప్పుడైనా మీ బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. మీ అంతరాత్మ ‘సాక్షి’గా ఓటు వే యండి. ఇక లేవండి.. ఓటేసేందుకు టైమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లి వచ్చే ఐదేళ్లకు పురపాలకులను ఎన్నుకోండి. ఇంతసేపు మీ అమూల్య మైన సమయాన్ని వెచ్చించి నా విన్నపాన్ని విన్న మీ అందరికీ పది వేల దండాలు.. ఇక ఉంటాను. ఇట్లు మీ అందరి సంక్షేమాన్ని కోరే మీ.. మున్సిపల్ ఆఫీస్ -
ఓటు విలువ పెరిగింది!
● ఓటుకు రూ.5వేలు.. మందు బాటిల్, స్వీట్ బాక్స్లు, వెండి రింగులు అదనం ● అంతా గప్ చుప్ ప్రచారం ● కాళ్లు మొక్కుతూ.. నోట్లు ఇస్తూ.. ● జిల్లాలో పొరుగు రాష్ట్రాల మద్యం పంపిణీ ● సిరిసిల్ల, వేములవాడలో విందులే విందులు సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు ఖరీదైపోయాయి. గతానికి భిన్నంగా ఈసారి ఓటు విలువను అభ్యర్థులు పోటాపోటీగా పెంచేశారు. ఓటర్లకు నోట్లు ఇస్తూ.. కాళ్లు మొక్కుతూ.. ఓటును అభ్యర్థించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మంగళవారం రోజంతా ఎన్నికల ప్రచారం అంతా గప్చుప్గా సాగింది. మైక్లు లేకుండా ప్రచార ఆర్భాటం లేకుండా.. అభ్యర్థులు వారి అనుయాయులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రలోభాలను గుమ్మరించారు. సోమవారం రాత్రి ఓ అభ్యర్థి ఓటర్లకు రూ.3వేల చొప్పున ఇవ్వడంతో తెల్లారేసరికి అదే వార్డుకు చెందిన మరో ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.5వేల చొప్పున పంపిణీ ప్రారంభించారు. దీంతో తొలుత పంపిణీ ప్రారంభించిన అభ్యర్థి మళ్లీ తిరిగి రూ.2వేలు చొప్పున అందిస్తూ.. మందు బాటిళ్లు, స్వీట్ బాక్స్లు ఇచ్చారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందు కావడంతో అభ్యర్థులంతా పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు తెగాయి. యువకులకు మందు, విందులు ఇచ్చారు. కొందరైతే ఇంటికో ఫుల్బాటిల్ పంపారు. మరికొందరు అభ్యర్థులు మాంసహారాన్ని సైతం వంట చేయించి మరి ఇంటింటికి పంపించారు. సిరిసిల్ల, వేములవాడల్లో 67 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతా రహస్య ప్రచారం చేశారు. కొన్ని వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఏ మాత్రం తగ్గకుండా ప్రలోభాలకు పోటీగా తెరలేపారు. ఓటర్లకు పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారింది. గోవా, చండీగఢ్, పాండిచ్చెరీ వంటి ప్రాంతాలకు చెందిన పన్నుల రహిత మద్యాన్ని దిగుమతి చేసి పంపిణీ చేశారు. తక్కువ ధరకే పొరుగు రాష్ట్రాల మద్యాన్ని ఎన్నికల కోసం తెప్పించి పంపిణీ చేయడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు రోజు ఎక్కడా చూసిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా విందులు ఇచ్చారు. కొందరు అభ్యర్థులు ఖరీదైన చీరలు, వెండి నాణేలు, వెండి రింగులు అందిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కోక్కరు సగటున రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించడం విశేషం. ఏది ఏమైనా నేడు ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. -
అయితే మరమ్మతు.. లేదంటే ప్రత్యామ్నాయం
పెద్దపల్లి/రామగిరి: వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈమేరకు తాగునీటి పైపులైన్లు, విద్యుత్ మోటార్లు, చేతిపంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, తాగునీటి బావులు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేసేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశాలతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు హ్యాబిటేషన్ల వారీగా పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. ప్రతీ తాగునీటి పథకం పరిశీలించి, తగిన మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేయనున్నారు. తక్షణ మరమ్మతుల కోసం నిధులు మంజూరవుతాయని చెబుతున్నారు. 20రోజుల పాటు సర్వే జిల్లాలోని అన్ని ఆవాసాల్లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నుంచి 20వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ గ్రామంలో తాగునీటి వన రుల స్థితిగతులు, పనిచేయని పథకాలు, లీకేజీలు, మోటార్ల పరిస్థితి, పైపులైన్ లోపాలను గుర్తిస్తారు. ఆ తర్వాత అవసరమైన మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. జిల్లాలో దాదాపు 12,000 వరకు ప్రభుత్వ బోరుబావులు(చేతిపంపులు – పవర్ బోర్లతో కలిపి) ఉన్నాయని అంచనా. ఇందులో 450 – 500 వరకు బోరుబావులను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులు గుర్తించారు. ప్రత్యామ్నాయాలు గత మూడేళ్లలో ప్రతీవేసవిలో తలెత్తిన తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వచ్చే వేసవిలో తాగునీటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు బోరుమోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అద్దెకు తీసుకునేందుకు వీలుగా పబ్లిక్ బోర్లను ముందుగానే గుర్తించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్కు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మంచినీటి ట్యాంకుల పరిసరాలు, తాగునీటి సరఫరాను పరిశీలిస్తారు. తాగునీటి సమస్య ఏర్పాడకుండా ముందస్తు తీసుకోవాల్సిన చర్యలపై పంచాయితీ కార్యదర్శులకు సూచనలిస్తారు. -
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలన
వేములవాడ: మహాశివరాత్రి జాతరలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి భక్తులకు సాఫీగా స్వామివారికి దర్శనం చేయించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి, ఆర్డీవో రాధాబాయి ఆలయ అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను మంగళవారం రాత్రి భీమన్న ఆలయంలో పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, ఆర్అండ్బీ డీఈ శాంతయ్య, డీఈ మైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘మహా’ జాతరలో మెరుగైన వైద్యసేవలుసిరిసిల్ల: వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. శనివారం నుంచి సోమవారం వరకు వేములవాడలో జాతర సందర్భంగా మూడు రోజుల పాటు రేయింబవళ్లు విధుల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకుని భక్తులకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు సంపత్, రామకృష్ణ, అనిత, నయిమా జహా, జిల్లాలోని పీహెచ్సీల డాక్టర్లు, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
భీమన్న సేవలో కాశీవిశ్వనాథ మందిర్ అర్చకులు
వేములవాడ: వేములవాడ భీమేశ్వరస్వామిని మంగళవారం కాశీవిశ్వనాథ మందిర్ ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ జోషి దర్శించుకున్నారు. వేములవాడకు చేరుకున్న ఆయనకు విప్ ఆది శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలపై వేధింపుల నియంత్రణ కమిటీలుసిరిసిల్ల: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నియంత్రణ చట్టం–2013ను పక్కాగా అమలు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం కోరారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తోపాటు భారీ జరిమానా విధిస్తామన్నారు. మహిళలను ముట్టుకోవడం, అనవసరంగా తాకాలనుకోవడం, శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరడం, ఆశించడం లైంగికపరమైన మాటలు మాట్లాడటం, లైంగిక సంబంధ చిత్రాలు చూపించడం ఈ చట్టం కింద నేరాలుగా పరిగణించబడి క్రిమినల్ చర్యలతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తారని హెచ్చరించారు. మహిళలు పని చేసే చోట ఇబ్బందులు ఎదుర్కొంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి సమాచారం ఇవ్వాలన్నారు. కమిటీ వెంటనే విచారణ చేపట్టి, బాధితులకు కావాల్సిన సహకారం అందిస్తుందన్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలిఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాక పరిసర ప్రాంతాల రైతులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సూచించారు. మంగళవారం గ్రామస్తులతో మాట్లాడారు. రేపాక పక్కనున్న కోహెడ, బస్వాపూర్ గుట్టల ప్రాంతాల్లో పులి సంచారం ఉందని, రైతులు రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లవద్దని, పశువులను ఇళ్ల వద్దే కట్టేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలో టాంటాం వేయించి ప్రజలందరికీ పులి సంచారం తెలిసేలా చేయాలన్నారు. ఫారెస్ట్ అధికారులు శ్రావణ్కుమార్, సిబ్బంది, సర్పంచ్ కథ మల్లేశం పాల్గొన్నారు. -
మా నాన్నను కాపాడండి
చందుర్తి(వేములవాడ): రెక్కాడితేనే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని కొద్ది రోజులుగా విధి వెంటాడుతోంది. పది నెలల క్రితం తల్లి కేన్సర్తో మృతిచెందగా.. ఇప్పుడు తండ్రి గుండె సంబంధిత వ్యాధితో ప్రభుత్వాస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఖరీధైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబానికి అండగా నిలిచే దిక్కులేక ఆ ఇంటి పెద్దబిడ్డ తన తండ్రిని కాపాడాలని వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన మ్యాదరి విజయ, లక్ష్మణ్ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు పావని(16), కుమారులు నితిన్(12), రిషిత్(10). ఈ దంపతులు ఇద్దరు కూలీ పనిచేసి జీవించేవారు. గతేడాది తల్లి విజయకు నోటి కేన్సర్ వచ్చింది. వ్యాధి ముదిరి 10 నెలల క్రితం మృతిచెందింది. తండ్రి అన్నీతానై పిల్లలను సాదుకుంటున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. రెండు రోజులుగా మంచం పట్టడంతో 16 ఏళ్ల కూతురు పావని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి గుండె పంపింగ్ సరిగ్గా లేదని.. ఇక్కడ వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేవని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది చెప్పారు. అయితే ఎలాంటి దిక్కులేని ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వాస్పత్రిలో తండ్రి మంచం పక్కన కూర్చొని ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. దాతలు 95423 96066లో సంప్రదించి, ఆదుకోవాలని కోరుతుంది. పది నెలల క్రితం కేన్సర్తో తల్లి మృతి నేడు ప్రాణాపాయ స్థితిలో తండ్రి ఆదుకోవాలని వేడుకుంటున్న కూతురు -
పెట్టుబడులపై అవగాహన
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధ్యాపకులు మహేశ్, జగన్నాథం, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ, వక్త గణేశ్ మాట్లాడారు. భవిష్యత్లో డబ్బులు సంపాదించడం ఎలా, వాటిని ఏ విధంగా పొదుపు చేస్తే లాభాలు ఆర్జించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తకు డాక్టరేట్కరీంనగర్రూరల్: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసిన కల్వల శేఖర్కు వ్యవసాయ విద్యలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ సాత్నకోత్సవంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రభు పింగళి పట్టాను అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పని చేస్తున్న శేఖర్.. ఉత్తర తెలంగాణలోని నేలల్లో అధిక భాస్వరం తగ్గించి చేసే యాజమాన్య పద్ధతులు, ప్రధాన పంటలను ప్లాంటర్తో ఎత్తు మడుల్లో సాగు చేస్తే అధిక వర్షాలు, తేమ తక్కువగా ఉన్న సందర్భాల్లో కలిగే పంట నష్టాలను కచ్చితంగా తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతిచెందాడు. టౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన అన్న వరుణ్ (26) సోలార్ సిస్టం కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటిపై సోలార్ సిస్టం అమర్చేందుకు స్లాబ్పైకి ఎక్కిన క్రమంలో ఇంటిపై నుంచి వెళ్లే 11 కేవీ వైర్లు తాకి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన ఇంటి యజమాని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి అన్న వినయ్కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. బావిలో దూకి మహిళ ఆత్మహత్య మేడిపల్లి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొంబర్రావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. తొంబర్రావుపేటకు చెందిన సంగ రాజు (52) కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కుమారుడు రమేశ్, కూతురు ధరణి ఉన్నారు. సంగ రాజు భర్త చిన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. -
ఇల్లంతకుంటకు బస్సు ప్రారంభం
ఇల్లంతకుంట(మానకొండూర్): వెంకట్రావుపల్లి మీదుగా ఇల్లంతకుంటకు సిద్దిపేట బస్సు సోమవారం ప్రారంభంకాగా వెంకట్రావుపల్లి, ఇల్లంతకుంట, గ్రామాల సర్పంచులు చల్ల నవీన్ రెడ్డి, మామిడి రాజు ప్రారంభించారు. మండల ప్రజలు కాంగ్రెస్ నాయకులు, ఇల్లంతకుంటకు బస్సు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట డిపో మేనేజరలకు పలుమార్లు విజ్ఞప్తి చేయగా నాలుగేళ్ల తర్వాత ఇల్లంతకుంటకు ిపునః ప్రారంభమైంది. బస్సు ప్రారంభం కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కే భాస్కర్ రెడ్డి, నాయకులు గుడిసె ఐలయ్య, మామిడి సంజీవ్, నాగరాజు శర్మ, మామిడి నరేశ్, బిళ్లవేని రమేశ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మందరాజు, తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలక్రైం: జగిత్యాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డిపై పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 35మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పనిచేసి.. ప్రస్తుతం అధికార దాహంతో కాంగ్రెస్ బీఫామ్లు తెచ్చుకుని.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం సరికాదని కరపత్రాలు ముద్రించి న్యూస్పేపర్ల ద్వారా పంపిణీ చేశారు. దీనిపై 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బోనగాని ఉషశ్రీ ఫిర్యాదు మేరకు స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక లారీ పట్టివేతఇబ్రహీంపట్నం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలకేంద్రానికి చెందిన లారీ యజమాని ఇస్లావత్ శంకర్, డ్రైవర్ బూక్య వంశీ వేంపల్లి శివారు గోదావరి నది నుంచి లారీలో ఇసుకను అనుమతి లేకుండా నింపుకొని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టుకున్నామని, గ్రామ పంచాయతీ అధికారి సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే అంశంపై మూడురోజుల వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్ క్యూ ఎల్కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్ పర్సన్ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్, అకడమిక్ ఇన్చార్జి ఇజాజ్ఖాన్, హెచ్వోడీ శశికాంత్, నవ్య, షాకీర్, శిరీష పాల్గొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఫలితాలు విడుదల సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నవంబర్– 2025లో జరిగిన యూజీ (సీబీసీఎస్) (ఆర్19) మొదటి సెమిస్టర్ (బ్యాక్లాగ్), మూడవ, ఐదవ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. www. satavahana.ac.in వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. -
తడారిన గుండెలకు..పసిహృదయాల స్పర్శ
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎవరూ లేరని ఆ గుండెలు తడారిపోయాయి. మలివయసులో అనాథ వృద్ధాశ్రమంలో సేద తీరుతున్న వారిని పసిహృదయాలు తట్టిలేపాయి. వృద్ధుల అనుభవాలు.. విద్యార్థుల పలకరింపులతో రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని మా అనాథ వృద్ధాశ్రమం అనుబంధాల వేదికగా నిలిచింది. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో భాగమైన జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ‘మా’ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సోమవారం సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పసిపిల్లల ఆప్యాయతను చూసిన ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దమనసు చూస్తామని ఊహించలేదంటూ పలువురు కన్నీరుపెట్టారు. కుటుంబాలకు దూరంగా జీవి స్తున్న తమకు ఈ పిల్లల రాక ఓ పండుగలా మారిందన్నారు. వృద్ధులపై మన బాధ్యత ఏమిటో గుర్తు చేసేలా ఈ సందర్శన నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 25 కిలోల సన్నబియ్యం అందించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం భూస లక్ష్మణ్, తెలుగు సబ్జెక్టు టీచర్ శివకుమార్ పాల్గొన్నారు. అనాథ వృద్ధులను పలకరించిన విద్యార్థులు వృద్ధుల జ్ఞాపకాలు.. విద్యార్థుల పలకరింపులు అనుబంధాల వేదికగా మా అనాథ వృద్ధాశ్రమం -
హోరెత్తిన డిజిటల్ ప్రచారం
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ఈసారి సోషల్మీడియాలో హోరెత్తింది. యూత్ను టార్గెట్ చేస్తూ ఆకట్టుకునేలా వీడియోలు చేసి సోషల్మీడియాలో వదిలారు. వీరు.. వారు.. అనే తేడా లేకుండా అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారానికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను వాడుకున్నారు. తమ వార్డులో చేయబోయే పనులు తెలుపుతూ యూట్యూబ్లో షార్ట్ వీడియోలను రిలీజ్ చేశారు. మరికొందరు తమ వార్డు పరిధిలోని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ట్రెండింగ్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా వీడియోలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ ప్రచార పద్ధతులూ మారుతున్నాయి. నిన్నటి వరకు వీధివీధి ప్రచారం, గోడలపై వాల్పోస్టర్లే ప్రధాన ఆయుధాలైతే ఇప్పుడు అభ్యర్థులు మొబైల్ స్క్రీన్నే ప్రచారవేదికగా మార్చేశారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో మున్సి పల్ ఎన్నికలకు డిజిటల్ రంగు పులుముకుంది. వార్డుకో గ్రూపు ప్రతీ వార్డుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు, రోజుకో వీడియో, గంటకో పోస్టు ఓటరిని నేరుగా కలవాల న్న ప్రయత్నంలో సోషల్మీడియాను వేదికగా చేసుకున్నారు. ‘నా పని చూడండి.. నా మాట వినండి’ అంటూ అభ్యర్థులు స్వయంగా వీడియోల్లో దర్శనమిస్తున్నారు. కొందరైతే కుటుంబసభ్యులతో కలిసి రీల్స్ తీస్తూ స్థానిక గ్రూప్లలో ప్రచారం చేస్తున్నా రు. ఇక రాజకీయ విమర్శలకు సైతం సోషల్మీడియానే వేదికగా నిలుస్తుంది. ఒకప్పుడు సభల్లోనే వినిపించిన హామీలు ఇప్పుడు స్టేటస్లుగా మారి ఓటర్ల చేతిలోని మొబైల్పోన్లలో కనిపిస్తున్నాయి. రీల్స్లో హామీలు యువ ఓటర్లే టార్గెట్ ట్రెండింగ్ సాంగ్స్తో ప్రజల్లోకి.. వీడియోలతో విజన్ చూపుతుండ్రు -
శ్రీచైతన్య విద్యార్థులకు ఘన స్వాగతం
కరీంనగర్టౌన్: మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులకు కరీంనగర్లో ఘన స్వాగతం లభించింది. కళాశాలకు చెందిన బి.సంధ్య, కె.అజయ్ అనే విద్యార్థులు 2026 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపునకు ఎన్నికయ్యారు. సుమారు 40 రోజులపాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, దేశ ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కళాశాలకు చెందిన సంధ్య కర్తవ్యపత్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన ఆ ఇద్దరితో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9టీ బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం చేసి యాజమాన్యం తరఫున రూ.25,000 చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణారెడ్డి, ఎన్సీసీపీఐ స్టాఫ్ పి.అశోక్, కేర్ టేకర్ జి.రాజేందర్, 9 తెలంగాణ బెటాలియన్ సుబేదారు విజయ్కుమార్, హవల్దార్ పీవీరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలి
కోనరావుపేట: ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చకుండా అలాగే కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ రమేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవోకు సమ్మె నోటీసు అందజేత వీర్నపల్లి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఈనెల చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా మండల గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీలేఖకు నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్మిక సంఘం అధ్యక్షుడు నర్సయ్య, కార్మికులు కమల్, శ్రీను, శేఖర్, రమేశ్, నరేశ్, మల్లేశం, ఎల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కరపత్రం ఆవిష్కరణ బోయినపల్లి: మండలకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈనెల 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని రూపొందించిన కరపత్రాలను సీఐటీయూ నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులకు గుదిబండలా మారిన లేబర్ కోడ్లను రద్దు చేయడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామంచ అశోక్, కార్మికులు లచ్చయ్య, అంజయ్య, శంకరవ్వ, రాములు పాల్గొన్నారు. -
ప్రచారం బంద్.. ప్రలోభాలు షురూ !
సిరిసిల్ల: ఒక్కరోజు గడిస్తే.. చాలు.. పురపాలకులు ఎవరో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే సమయం మొదలైంది. ప్రచార ఆర్భాటాలు ఎలా ఉన్నా ఈ ఒక్క రోజు రాత్రి పోల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్లే విజేతలవుతారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లకు నజరానాలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికలను పంచభూతాలు శాసిస్తున్నాయి. ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఎంతో కీలకమైంది. నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటూ.. బరిలో నిలిచిన అభ్యర్థులను అనుచరులు.. ఆత్మీయులు హెచ్చరిస్తున్నారు. అంతులేని హామీలు ఎన్నికల్లో గెలిస్తే... మీ సామాజికవర్గానికి సంఘ భవనాలు నిర్మించి ఇస్తామని, మీ వాడకు సిమెంట్ రోడ్డు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ఆడబిడ్డ పుడితే రూ.10వేలు, బాబు పుడితే రూ.5వేలు ఇస్తామంటూ హామీలిచ్చారు. మద్యం మత్తు ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ప్రచారంలో అలసి, సొలసిన నేతలకు, కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ బీరు, బ్రాంది, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో మందు విక్రయాలు బాగా పెరిగి ద్వితీయశ్రేణి నాయకులు మత్తులో జోగుతున్నారు. ముంచెత్తుతున్న డబ్బు రాజకీయాలంటే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయింది. లాభసాటి వ్యాపారంలా మారింది. ఎంత వెచ్చించాం... ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణమే ఇప్పుడు కనిపిస్తుంది. దీంతో కాసులున్న వారికే పార్టీలు టికెట్ ఇవ్వగా.. ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బు పంపిణీనే నమ్ముకున్నారు. ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో వార్డులో అభ్యర్థులు రూ.40లక్షల నుంచి రూ.60లక్షల వరకు పంపిణీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. వీధికో తీరు.. తాయిలాలు వేరయా కొందరు అభ్యర్థులు రోజూ బీరు, బిర్యాణీ అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు ఓటర్లకు బంగారం ఉంగరాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు పెద్ద ఎత్తున చీరలు దిగుమతి చేసే మహిళలకు బహుమతిగా ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రతీ ఇంటికి 25 కిలోల జై శ్రీరాం బియ్యం బస్తాలను పంపిణీ చేస్తున్నారు. యువకులకు విహారయాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఓటర్లకు వెండి వస్తువులను కానుకలుగా సమర్పిస్తున్నారు. మరికొందరు అనుచరులకు భవిష్యత్లో కాంట్రాక్టు పనులు ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. బల్దియా ఎన్నికల్లో ధనప్రవాహం మరీ ఎక్కువైంది. గెలుపే లక్ష్యంగా అందరూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈసారి ఓటర్లను ఈ పంచభూతాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు.. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తమవుతుంది. పురపోరులో ‘పంచ’భూతాలు -
కార్మికులే కీలకం!
● నేత, బీడీకార్మికుల చుట్టూ నేతల ప్రదక్షిణలు ● గెలుపోటముల నిర్ణేతలు వీరే.. ● రెండు మున్సిపాలిటీల్లో ప్రభావంసిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో నేతల గెలుపోటములను నేత, బీడీకార్మికులు శాసించే స్థాయిలో ఉన్నారు. కార్మికక్షేత్రంగా పేరొందిన సిరిసిల్లలో నేతకార్మికులు, బీడీ కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉండగా, ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో బీడీకార్మికులు, బీసీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పురపోరులో బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలను మార్చడంలో కార్మికులు కీలకంగా మారారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు కార్మికుల ఇళ్లకు క్యూ కట్టారు. సిరిసిల్లలో అన్ని వార్డుల్లోనూ... సిరిసిల్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోను నేతకార్మికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మున్సిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేయగా.. ఐదు గ్రామాలు మినహా చంద్రంపేట, రాజీవ్నగర్లోనూ పవర్లూమ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పవర్లూమ్స్ నడిపే నేతకార్మికులు ఉండడంతో వాళ్ల ఓట్లు కీలకంగా మారాయి. పట్టణంలో మొత్తం ఓటర్లు 81,959 మంది ఉండగా నేతకార్మిక కుటుంబాలవి 36,093 ఓట్లు, బీడీ కార్మికులవి 23,811 ఓట్లు ఉన్నాయి. నేతకార్మికులతోపాటు బీడీ కార్మికులు ప్రభావం చూపనుండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు వారి ఇళ్లకు వెళ్లి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సిరిసిల్లలో పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ ఉండడంతో ప్రతీసారి ఎన్నికల ఫలితాలను వారే శాసిస్తారు. కార్మికుల సమస్యలే ఎజెండాగా... రెండు మున్సిపాలిటీల్లో కీలకమైన కార్మికుల ఓట్ల కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా వారి సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేశారు. సిరిసిల్లలో బీడీకార్మిక ఆస్పత్రి ప్రతిపాదనలోనే ఉండగా, వేములవాడ శివారులోని బీడీ కార్మిక ఆస్పత్రి పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతుంది. నేతకార్మికులు ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అద్దె ఇంటి సమస్యలు నేత, బీడీకార్మికులను వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకంపై కార్మికులు కోటి ఆశలు పెట్టుకున్నారు. బీడీ, నేతకార్మికులకు ఆసరా పెన్షన్ వస్తుండగా ఇంకా కొందరికి రావడం లేదు. దీంతో పెన్షన్ల కోసం క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మున్సిపాలిటీలో మొ త్తం 40,877 మంది ఓటర్లు ఉండగా.. బీసీ ఓటర్లు 25,771 మంది, 11,028 మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరితోపాటు మున్నూరుకాపు సామాజికవర్గం ఇక్కడ ప్రభావం చూపే శక్తిగా ఉంది.మున్సిపాలిటీ మొత్తం బీడీ నేత సిరిసిల్ల 81,959 23,811 36,093 వేములవాడ 40,877 11,028 – బరిలో ఇలా.. మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు సిరిసిల్ల 39 170 వేములవాడ 28 113 -
రూట్ మార్చిన దొంగలు
బోయినపల్లి(చొప్పదండి)/ఇల్లంతకుంట(మానకొండూర్): దొంగలు రూట్ మార్చారు! సాధారణంగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడడం పరిపాటి. కానీ ఇటీవల తమ టార్గెట్ వ్యవసాయబావులు, బోర్లు, ఆలయాలను ఎంచుకుంటున్నారు. గ్రామంలో ఉండే ఇళ్ల కంటే శివారు ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీ చేయడం సులభంగా భావించి ఉంటారు. జిల్లాలో ఇటీవల జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. వరుస చోరీలు బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన చెట్టుకింది చంద్రశేఖర్, గోగూరి దామోదర్రెడ్డి, దయ్యాల చంద్రశేఖర్, కొమురయ్య, గంగారెడ్డి వంటి దాదాపు 20 మంది రైతుల విద్యుత్తీగలను ఈనెల 2న గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ● వారం క్రితం విలాసాగర్ జీపీ స్టార్టర్ డబ్బ నుంచి 50 మీటర్ల వైరు చోరీ చేశారు. అదే గ్రామానికి చెందిన పైండ్ల చందు పొలం వద్ద వంద మీటర్ల వైరు ఎత్తుకెళ్లారు. బాలపోచయ్యకు చెందిన విద్యుత్తీగలు చోరీ చేశారు. సెస్ సంస్థకు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. ● కొదురుపాక, వెంకట్రావుపల్లి పరిసరాల్లో 2025 ఏప్రిల్లో 6వేల మీటర్లకు పైగా అల్యూమినియం విద్యుత్ వైర్ ఎత్తుకెళ్లారు. నీలోజిపల్లి శ్మశానవాటిక, ఎస్సీకాలనీల్లో విద్యుత్పోల్స్కు బిగించిన వైరును సైతం ఎత్తుకెళ్లారు. విద్యుత్ తీగలు ఎత్తుకెళ్లడంతో దహన సంస్కారాల సమయంలో ఇబ్బంది అవుతుందని గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ సెస్ చైర్మన్, ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో కొత్త వైర్ను బిగింపజేశారు. ఆలయాలే టార్గెట్ ఇల్లంతకుంట మండలంలోని ఆలయాలను టార్గెట్ చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయాలు ఊరి శివారులో ఉండడం.. అక్కడ ఎవరూ ఉండకపోవడంతో దొంగలకు కలిసొస్తుంది. దొంగల బెడదను తట్టుకోలేక పలు గ్రామాల్లో రాత్రి వేళ కాపలా ఉంటున్నారు. మండలంలోని వెల్జీపురంలో 15 రోజుల క్రితం ఎల్లమ్మగుడి, అదే గ్రామంలోని పెద్దమ్మగుడిలో దొంగలుపడ్డారు. అమ్మవార్ల పుస్తెలు, మెట్టెలు ఎత్తుకెళ్లారు. హుండీలను కూడా దొంగలించారు. అదే గ్రామంలోని నలుగురు రైతుల వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్ల నుంచి బోరుమోటార్ వరకు ఉండే విద్యుత్తీగలను కట్ చేసి ఎత్తుకెళ్లారు. వారం క్రితం ముస్కానిపేటలో ఓ ఇంటిలో పట్టపగలే దొంగలు పడి మూడు తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకెళ్లారు. గత జనవరి 25వ తేదీ రాత్రి ఎర్రనర్సుపల్లెలోని పెద్దమ్మగుడిలో పుస్తె, మెట్టెలు ఎత్తుకెళ్లారు. అదేరోజు ఎర్రనర్సుపల్లి, రహీంఖాన్పేట గ్రామపంచాయతీల నల్లాల బావి మోటార్వైర్తోపాటు గ్రామంలోని ఐదుగురు రైతుల వ్యవసాయ బోరు మోటర్ల వైర్ కట్ చేసి తీసుకెళ్లారు. తాజాగా జనవరి 31వ తేదీ రాత్రి రహీంఖాన్పేట ఎల్లమ్మగుడి, ఇల్లంతకుంట పెద్దమ్మ గుడిలో దొంగలు పడి పుస్తె, మెట్టెలు ఎత్తుకెళ్లారు. -
ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోయింది
● అంధ విద్యార్థికి పీహెచ్డీలో అడ్మిషన్ ● సోదరులిద్దరూ అంధులే.. ఇల్లంతకుంట(మానకొండూర్): పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు అంధ విద్యార్థి అజిత్కుమార్. పీహెచ్సీ ప్రవేశ పరీక్షలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించి పీహెచ్డీ అడ్మిషన్కు అర్హత సాధించాడు. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన ఎలగందుల అజిత్కుమార్ పుట్టుకతో అంధుడు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సోషియలాజీలో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి పీహెచ్డీ అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష రాశారు. ఇతని తమ్ముడు ఎలగందుల రంజిత్కుమార్ కూడా అంధుడే. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇతను పదో తరగతిలో రాష్ట్రంలో అంధ విద్యార్థులలో 8.7 గ్రేడ్ సాధించారు. అప్పుడు మంత్రి సీతక్క చేతుల మీదుగా రూ.5వేల ప్రభుత్వ పారితోషకం అందుకున్నారు. వీరిద్దరూ ఇల్లంతకుంట ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్ కుమారులు. -
గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత ఠాణాల అధికారులకు పంపించి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్లలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్ను, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందించాలని, మౌళిక వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాబాయి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): వసతిగృహాల్లోని విద్యార్థుల చదువుపై దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పోతుగల్ జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో సోమవారం పరిశీలించారు. పోతుగల్ హాస్టల్లో ఉండి పదోతరగతి చదువుతున్న 18 మంది విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి, హెచ్ఎం రాధాకిషన్రావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా మల్లన్న కల్యాణం కోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారంలో మల్లికార్జునస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఉండ్రుగుట్ట మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను ఈనెల 3 నుంచి నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పెద్దపట్నం ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నామని మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ దివ్య అన్నారు. మండలంలోని మొర్రాయిపల్లె, చీకోడు, నామాపూర్ గ్రామాలను సోమవారం సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్న నీటి వనరులను పరిశీలించామని తెలిపారు. నీటి సరఫరాకు కావాల్సిన మెయింటెన్స్కు నిధులు అందించాలని సర్పంచులు కోరారు. కార్యక్రమంలో ఎంపీవో వాహిద్, సర్పంచులు మెంగని శ్రీనివాస్, బొమ్మెన అంజనేయులు, అనిల్, పంచాయతీ కార్యదర్శులున్నారు. సిరిసిల్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025–26 జిల్లా స్థాయి పోటీలు ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడలశాఖ అధికారి రాందాస్ తెలిపారు. పట్టణ పరిధిలోని రాజీవ్నగర్ మినీస్టేడియంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీలు కొనసాగుతాయని వివరించారు. చెస్, బాల్ బ్యాడ్మింటన్, షిటిల్ బ్యాడ్మింటన్, యోగామ్యాట్స్, క్యారం కై న్స్, సైకిల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సంబంధిత పరికరాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 94402 39783లో సంప్రదించాలని కోరారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ/వేములవాడరూరల్: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో పనులు చేయకుండా పడావుపడ్డ పనులను పట్టాలెక్కించానన్నారు. రాజన్న ఆలయం, పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బైక్పై తిరిగి.. డోలు వాయించి విప్ ఆది శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి గల్లీల్లో బైక్పై తిరిగి ప్రచారం చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. విలీన గ్రామం శాత్రాజుపల్లిలో కార్నర్ మీటింగ్ సందర్భంగా డోలు వాయించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
ఆర్థిక అవగాహన పెంపొందించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత పోస్టర్లను కలెక్టర్ సోమవారం జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ) సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనను కల్పించేందుకు ఆర్బీఐ ఈనెల 9 నుంచి 13 వరకు వారోత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. ఆర్బీఐ, బ్యాంకులు ఎప్పుడూ మెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపదన్నారు. ఖాతా వివరాలు, పాస్వర్డ్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగే కాల్స్ చేయదని స్పష్టం చేశారు. లీడ్బ్యాంక్ మేనేజర్ ఎన్.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మూడో విడత ర్యాండమైజెషన్ను ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి పూర్తి చేశారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, నోడల్ అధికారి భారతి, ఈడీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేయాలి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ, కొండాపూర్, మద్దికుంట, బద్దెనపల్లి, తంగళ్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో ఆరా తీశారు. హౌసింగ్ డీఈఈ సాజిద్, ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, డీఈఈ శాంతయ్య, జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ కిశోర్కుమార్ పాల్గొన్నారు. పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే సిరిసిల్ల, వేములవాడల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈనెల 11న సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా పారిశుధ్యం పనులు మెరుగ్గా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వేములవాడ మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈనెల 14 నుంచి 16 వరకు వేములవాడను 20 జోన్లుగా విభజించి ప్రతీ జోన్కు ఒక పంచాయతీ కార్యదర్శిని ఇన్చార్జీగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అందరూ ఈనెల 13 నుంచి 17 వరకు వేములవాడలో సేవలు అందించాలని ఆదేశించారు. డీఆర్డీవో మచ్చ గీత, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు. -
పటిష్ట బందోబస్తు
● స్వేచ్ఛగా ఓటేయాలి ● మూడు అంచెల్లో పోలీస్ రక్షణ ● 811 మంది పోలీసులు, రెండు ప్లటూన్ల బలగాలతో భద్రత ● అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ● 131 మంది పాత నేరస్తుల బైండోవర్ ● ‘సాక్షి’తో ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మూడు అంచెల్లో పోలీసు రక్షణ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో బందోబస్తు ఏర్పాట్లు, జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను, ఎన్నికల నిర్వహణ ప్రణాళికను ‘సాక్షి’కి సోమవారం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై నిఘాసిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో 117 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 34 సెన్సిటివ్, 11 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వేములవాడలో 28 వార్డుల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 14 సెన్సిటివ్, 6 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సున్నితమైన కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. రెండు మున్సిపాలిటీల్లోని 175 పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. మొబైల్ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించం. నిరంతరం తనిఖీలుఎన్నికల షెడ్యూల్ వెలువడగానే జనవరి 27 నుంచి జిల్లాలో ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేశాం. సిరిసిల్ల పరిధిలో మూడు, వేములవాడ పరిధిలో మూడు చెక్పోస్టుల్లో రేయింబవళ్లు తనిఖీలు నిర్వహించాం. మరో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఒక్కో పట్టణంలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేశాం. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులకు నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించాం. ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించాం. డబ్బులు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రూట్ మొబైల్ పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. అనుమానితుల బైండోవర్నేరచరిత గల అనుమానితులను 131 మందిని ముందుజాగ్రత్తగా బైండోవర్ చేశాం. చెక్పోస్టు తనిఖీల్లో ఇప్పటికే రూ.31.70 లక్షల నగదు, 2.4 కిలోల వెండిని సీజ్ చేశాం. 21 కేసులు మద్యం(238 లీటర్లు) పట్టుకున్నాం. పట్టణాల పరిధిలో పలు బెల్ట్షాపులను సీజ్ చేశాం. జిల్లాలో లైసెన్స్ ఉన్న వారి ఆయుధాలను డిపాజిట్ చేయించుకున్నాం. మూడు అంచెల్లో బందోబస్తుమూడు అంచెల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 811 మంది పోలీసులు, రెండు ప్లటూ న్ల టీజీఎస్ఎఫ్ సాయుధ బలగాలతో ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల వరకు ఎవ రూ ప్రచారం చేయరాదు. రెండు, మూడు పో లింగ్ కేంద్రాలను కలిపి ఒక్క ఎస్సై పర్యవేక్షణ లో ఉంటుంది. సిరిసిల్లలో 8, వేములవాడలో 6 జోన్లుగా విభజించాం. సీఐల పర్యవేక్షణలో స్ట్రై కింగ్ఫోర్స్ ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడల్లో డీఎస్పీల ఆధ్వర్యంలో రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది. స్వేచ్ఛగా ఓటేయాలిఓటర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లు వేయాలి. ఎన్నికల నేపథ్యంలో 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలులో ఉంటుంది. ఎన్నికలు జరిగే 11వ తేదీ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పోలీస్ ఆంక్షలు అమలులో ఉంటాయి. డయల్ 100కు ఫిర్యాదు చేయవచ్చు. ఎస్పీ ఆఫీస్లో ఒకటి, కలెక్టరేట్లో మరో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాం. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైనా చేయవచ్చు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల సిబ్బందితో కలిసి పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ భద్రతసిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరాల్లో స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటు చేశాం. ఎన్నికలు ముగియగానే అక్కడే బ్యాలెట్ బాక్స్లను భద్రపరుస్తాం. 13వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశాం. అక్కడ సైతం మూడు అంచెల్లో పోలీస్ రక్షణ చర్యలు తీసుకుంటాం. ఎన్నికల అధికారులు జారీ చేసిన పాసులు ఉన్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తాం. -
దుబాయ్లో కంచర్ల యువకుడి ఆత్మహత్య
వీర్నపల్లి(సిరిసిల్ల): ఉపాధి కోసం ఏడాది క్రితం గల్ఫ్ వెళ్లిన యువకుడు అక్కడ తనువు చాలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో విషాదం నింపింది. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేశ్ (22) దుబాయ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాకేశ్ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేక, ఇంటి నిర్మాణానికి చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడం, అప్పులు తీరే మార్గం కనిపించక కొంతకాలంగా మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న తల్లి లక్ష్మి, సోదరుడు సతీశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్పంచ్ సామర్ల దేవరాజు, వడ్డెర సంఘం నాయకులు గోగుల రమేశ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాకేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని టీఆర్నగర్కు చెందిన షేక్ నయూం(43) ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నయూం ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. తల్లి జరీనాబేగం ఈనెల 7న రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో నయూం నర్సింగాపూర్ శివారు ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించాడు. నయూంకు భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తల్లి వద్దే ఉంటున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. గుండెపోటుతో వృద్ధుడి మృతికొడిమ్యాల(చొప్పదండి): మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి గ్రామానికి చెందిన చిన్న శంకరయ్య అనే వృద్ధుడు అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా కొడిమ్యాల బస్టాండ్ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్న్స్కు స్థానికులు సమాచారం అందించగా 108 సిబ్బంది శంకరయ్యను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. -
అభ్యర్థుల ఆఖరి పోరాటం
సిరిసిల్ల: జిల్లాలో పురపోరు తుది అంకానికి చేరుకుంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అన్ని రాజకీయ పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ఆరు రోజులుగా మైకులతో ఇంటింటా ప్రచారం సాగించారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరుగుతుండగా.. ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెర పడుతుంది. అసలు వ్యూహాల అమలుకు ఇప్పుడే రంగం సిద్ధమవుతుంది. ఓటర్లను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేశారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు ఓటర్లకు ‘త్రీ–ఎం’ఫార్ములాను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఓటర్ల ప్రసన్నం కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులంతా పోటీ పడుతున్నారు. ఎవరికీ వారు గల్లీల్లో తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసిపోనుంది. దీంతో త్రీ–ఎం ఫార్ములా.. నేరుగా ఓటర్ల ఇంటికే మద్యం(ఎం), మాంసం(ఎం), మనీ(ఎం) అందించేందుకు సిద్ధమయ్యారు. వార్డుల్లో ప్రచారం ఎలా ఉన్నా.. చివరి రెండురోజుల్లో వ్యూహత్మకంగా ‘త్రీ–ఎం’ ఫార్ములను అనుసరించేందుకు రెడీ అయ్యారు. సిరిసిల్లలో 14 వార్డుల్లో త్రిముఖ పోటీ ఉండగా, 10 వార్డుల్లో చతుర్ముఖ, మరో తొమ్మిది వార్డుల్లో పంచముఖ, ఆరు వార్డుల్లో బహుముఖ పోటీ సాగుతుంది. వేములవాడలోని 28 వార్డుల్లోనూ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఎన్నికలను చాలెంజ్గా తీసుకున్న అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఓటర్లకు గిప్ట్లు, పార్టీ గుర్తులతో కూడిన ఖరీదైన బొమ్మలను పంపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రచారంలో పోటా పోటీ.. ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడల్లో ప్రచారాన్ని అన్ని పార్టీలు జోరుగా సాగిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్తో ప్రచార సభలు నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ వార్డుల్లో రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ నుంచి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ సిరిసిల్ల, వేములవాడలో ప్రచారం చేశారు. విప్ ఆది శ్రీనివాస్ వేములవాడలో ఉండి ఎన్నికల ప్రచారం చేసి, వ్యూహాలు రచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత సన్నిహితులతో అభ్యర్థులు ఆఖరి ప్రయత్నంగా ఓటర్లకు త్రీ–ఎం పార్మూలా అమలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ స్టేషన్లు ఓటర్ల సంఖ్య సిరిసిల్ల 39 170 117 81,959 వేములవాడ 28 113 58 40,877 -
అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం
రామగుండం: కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్రావు అన్నారు. ఆదివారం అబాది రామగుండంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ లింగాపూర్ గ్రామం కార్పొరేషన్లో విలీనం కావడంతో పట్టణీకరణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన ఇతరత్రా అభివృద్ధి పనులు అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమన్నారు. అబాది రామగుండం, లింగాపూర్ గ్రామ రైతులకు శాశ్వతంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
● వేములవాడలో మాంసం మాయ
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): కార్పొరేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్సిటీ(ఎఫ్సీఐ)టౌన్షిప్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ 2000–01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్ సమావేశం ఆదివారం హైదరాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్సీఐ టౌన్షిప్లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రానైట్ లారీ నుంచి పడిన బండరాయిచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ స్టేజీ వద్ద హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్ క్వారీ నుంచి ఆసిఫ్నగర్కు కటింగ్ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు. వేములవాడ: ఆదివారం అంటే చికెన్, మటన్ ప్రియులు ప్రత్యేకంగా రుచి వైపు మగ్గుతారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ఈ ఆదివారమే చివరిది కావడంతో మటన్, చికెన్ బిర్యాని పొట్లాలతో అభ్యర్థులు తమ వార్డుల్లో హడావుడి చేస్తూ వారి అనుయాయులు, ఓటర్లకు ముందస్తు పండుగ చూపించారు. మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11న జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇంటింటి ప్రచారంతోపాటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం వేములవాడలోని పలు వార్డుల్లో మటన్, చికెన్ పొట్లాల పంపిణీ జోరుగా సాగింది. ఒకవైపు అభివృద్ధి హామీలు, మరోవైపు సంక్షేమ పథకాల మాటలు వినిపిస్తుండగా మరోవైపు పొట్లాల రాజకీయాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓటు వేయించే ముందు కడుపు నింపితే సరిపోతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయినా ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్స్ దగ్గర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఆదివారం మాత్రం చాలా ఇళ్లలో రాజకీయ రుచితో భోజనాలు జరిగాయని మాత్రం చెప్పొచ్చు. పంపకాలకు ప్లాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇక అసలు పంపకాలపై దృష్టి సారించనున్నారు. కుల సంఘాలు, యూత్, మహిళా సంఘాలు, గ్రూపులవారీగా పంపకాలు జరిపేందుకు ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్: వారంతా బంధువులు. ఒకే కులానికి చెందిన వివిధ పార్టీల నాయకులు. మున్పిపల్ ఎన్నికల్లో మాత్రం వైరివర్గాలుగా మారిపోయారు. ఆయా పార్టీల నుంచి కార్పొరేటర్ స్థానానికి పోటీపడుతున్నారు. నగరపాలకసంస్థలో సం్ఙకులశ్రీ సమరానికి వేదికగా మారింది 23వ డివిజన్. పోటీలో ఉన్న ప్రత్యర్థులంతా మున్నూరుకాపులు కావడమే ఆ డివిజన్ స్పెషల్. నగరంలోని 23వ డివిజన్ స్థానానికి మున్నూరు కాపు కులస్తులే పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, బీజేపీ నుంచి పాదం శివరాజ్, కాంగ్రెస్ నుంచి గుమ్మడి రాజ్కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. వీరంతా కూడా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పైగా బంధువులు కావడంతో ఆ డివిజన్ ప్రస్తుత ఎన్నికల్లో స్పెషల్గా మారింది. 1, 2, 36వ డివిజన్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. కాకపోతే 1వ డివిజన్లో ఐదుగురు అభ్యర్థులకు గాను నలుగురు, 2వ డివిజన్లో ఆరుగురిలో ఐదుగురు, 36వ డివిజన్లో ఏడుగురిలో ఆరుగురు మున్నూరుకాపులే పోటీలో ఉండడం విశేషం. నగరంలో ఈ సం‘కుల’ సమరం ఆసక్తి రేపుతోంది. కరీంనగర్ కార్పొరేషన్: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్ నగరపాలకసంస్థ 36వ డివిజన్లోని మారుతినగర్కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు. మున్సిపల్ పోరు.. నాన్వెజ్ జోరుబంధువులే ప్రత్యర్థులు -
సిరిసిల్ల అభివృద్ధి మా బాధ్యత
సిరిసిల్ల/వేములవాడ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదు.. ఇబ్బందుల పాలు చేస్తుంది.. అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కసిగా పని చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసా య, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని అంబేడ్కర్ సర్కిల్ వద్ద మున్సిపల్ ఎన్నికల ప్ర చార సభలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్తో కలిసి ప్రసంగించారు. నేతకార్మిక సంక్షేమానికి నిధులు విడుదల చేయకుండా గత ప్ర భుత్వం నిర్లక్ష్యం చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.350 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. నేతన్న సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్కు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఇది కేటీఆర్ అహంకారానికి, పేదల ఆత్మగౌరవానికి పోటీ అని మంత్రి అన్నారు. కాంగ్రెస్కు పట్టంకట్టి ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి గౌరవాన్ని కాపాడాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నేతన్నలకు దీర్ఘకాలిక మేలు జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, సిరిసిల్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి సీఎంకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. విప్ ఆది మాట్లాడుతూ, పద్మశాలీ భవనం, మార్కండేయ ఆలయం పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సీఎం తర్వాత అధికారం మీ సీనన్నకే ‘సీఎం తర్వాత మీ ఆది సీనన్నదే అధికారమని, వే ములవాడ అభివృద్ధికి ఆది అడిగితే ఎవరైనా చేయాల్సిందే’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అ న్నారు. ఆదివారం పట్టణంలోని సుభాష్నగర్ చౌరస్తాలో రోడ్షోలో ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ము ల స్వరూపారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, అభ్యర్థులు ఇప్పపూల మమత, నీలం మమత, సిరిగిరి సంగీత, సాగారం వెంకటస్వామి, మస్తాన్, నాయకులు శ్రీనాథ్, నర్సయ్య, సూర దేవరాజు, చక్రధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
వేములవాడ: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ రుత్విక్సాయి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వేములవాడలో స్పెషల్ పోలీసు బలగాలతో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి మేయిన్రోడ్డు గుండా మార్కెట్యార్డు జంక్షన్ వరకు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్మార్చ్ నిర్వహించామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. టౌన్ సీఐ వీరప్రసాద్, ఆర్ఐ సురేశ్, ఎస్సైలు రామ్మోహన్, రాజు, శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
మౌనమే అయితే..
కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల ప్రచారంతో మొదలైన నా వాయిస్ ఓవర్ ప్రయాణం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకూ విస్తరించింది. ప్రధాన పార్టీలే కాదు.. స్వతంత్ర అభ్యర్థులూ శ్రీఈ వాయిస్ కావాలిశ్రీ అంటున్నారు. రామగుండమే కాదు.. మంథని, మంచిర్యాలలోనే నా గొంతు వినిపించింది. ఎన్నికల ప్రచారానికే కాకుండా.. ఆలయాల ప్రారంభం, బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాపార–వాణిజ్య ప్రకటనల వరకూ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్గా సేవలందించాను. 1986 నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. సుమారు 4వేల వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. దివంగత సీఎం వైఎస్సార్ హాజరైన 4 బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ సభకు వాయిస్ ఇవ్వడం నా జీవితంలో మైలు రాళ్లు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశా. అరకొర జీతంతోపాటు, కళా రంగం ఇచ్చిన ఆదాయం నా కుటుంబ జీవనాన్ని పెద్దగా ఇబ్బందులు లేకుండా నడిపించింది. ఇప్పుడు రిటైర్ అయ్యాను. అనుభవం, సేవాభావం, అంకితభావం ఉన్న కళాకారులను గుర్తించి, గౌరవంతోపాటు స్థిరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఎందుకంటే కళాకారుడి గొంతు మౌనమైతే.. చరిత్రే మౌనమవుతుంది. – మేజిక్రాజా, వాయిస్ ఓవర్ కళాకారుడు, గోదావరిఖని -
రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి
సిరిసిల్ల: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయింది.. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఏం అభివృద్ధి పనులు చేసిందో చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం మంచి పనులు చేయకుండానే ఓట్లు అడిగే నైతిక హక్కుల ఆ పార్టీ అభ్యర్థులకు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మొన్నటి గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ మరోసారి అదే రుజువైందన్నారు. అయినా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మూడు రోజులు ఇక్కడే ఉండి, వార్డుల్లో ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి సాధ్యమంటున్నారని, నిజానికి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్తో అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మున్సిపాలిటీలకు 14,15వ ఆర్థికం సంఘం ద్వారా నిధులు ఇస్తున్నారని, ఉచితంగా సన్న బియ్యం పంపుతున్నారని, అమృత్ పథకంతో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఇచ్చిన భరోసాతో ఓటర్లు కమలం గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. నాయకులు తిరుపతిరెడ్డి, నటరాజ్గౌడ్, సంజీవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు మహాశయులారా
కోల్సిటీ(రామగుండం): పొద్దున లేచించి మొదలు.. రాత్రి వరకూ గల్లీలన్నీ పాటలతో మార్మోగుతున్నాయి. మైకుల శబ్దం, వాహనాల గర్జన మధ్య శ్రీపలానా గుర్తుకే మన ఓటుశ్రీ అని వినిపించే జానపద పాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. వాటికి చిన్నారులు స్టెప్పులు వేస్తుంటే.. పెద్దలు చిరునవ్వుతో తలూపుతున్నారు. అయితే, అభ్యర్థుల పేర్లకన్నా ముందే ఓటర్ల చెవుల్లో నాటుకుపోయే స్వరాల వెనుక ఉన్నవారు ఎవరు? ఒక్క పాటతో గల్లీని కదిలించే ఆ గొంతులు ఎలా ఉంటాయి? ఎన్నికల రణరంగంలో వాహనాలపై తిరుగుతూ రాత్రింబవళ్లు స్వరం వినిపిస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసే గాయకుల కథ ఇదే. ఓటు రాజకీయాల మధ్య నడిచే కళాకారుల కనబడని ప్రయాణమిది. కళను కాపాడాలంటే కళాకారులను నిలబెట్టాల్సిందే అంటున్నారు. లేదంటే పాట మిగులుతుంది కానీ.. పాట పుట్టిన గొంతు కష్టాల్లోనే కరిగిపోతుంది. మూడు దశాబ్దాలుగా కళనే శ్వాసగా, జీవనాధారంగా నమ్ముకున్నాడు. డప్పు ప్లేయర్గా, గాయకుడిగా, నృత్య మాస్టర్గా, రచయితగా తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చైతన్య గీతాలు, ఉద్యమ గీతాలు అందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతిబింబించే బహుజన గీతాలు, ప్రజల్ని కదిలించే ప్రచార గీతాలు రచించి పాడారు. కళను నమ్ముకున్నా.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించే ఆదాయం సమకూరడంలేదు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అవి జీవనానికి భరోసా ఇవ్వలేకపోయాయి. – గాజుల రమేశ్, డప్పు కళాకారుడు, గోదావరిఖని -
నేను.. నా పోరాటం
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ‘విప్లవ పార్టీలో దళ సభ్యుడిగా మొదలైన నా ప్రయాణం గడ్చిరోలికి చేరింది. ఇస్రోజీవాడి నుంచి గడ్చిరోలి వరకు విప్లవ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. అంతకు మించి సంతృప్తి.. కాలక్రమంలో గడ్చిరోలి నుంచి.. అబూజ్మడ్ అడవులకు చేరి.. అక్కడే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వైనం.. తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఘటనలకు సాక్ష్యం చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ జీవిత చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో తొలి ఆత్మకథ చందర్దే కావడం విశేషం. ఎన్కౌంటర్కు ముందు తాను రాసుకున్న విప్లవ ఆత్మకథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది’. ఈనెల 5న ఎన్కౌంటర్లో చనిపోయిన సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్– మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు(57) అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మృతదేహం కామారెడ్డి జిల్లాలోని ఆయన సొంత ఊరు ఇస్రోజివాడికి ఆదివారం తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు మాజీ నక్సలైట్లు హాజరయ్యారు. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలు, పాటలతో ఆయన అంత్యక్రియలు సాగాయి. ప్రభాకర్ ఆత్మకథలోని కొన్ని ముఖ్య ఘటనలు.. ● మావోయిస్టు ఉద్యమకారుడు స్వామి తన ఆత్మకథలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు. ఇస్రోజీవాడిలో జరిగిన ఒక సంఘటన చందర్ను అడవిబాట పట్టేలా చేసింది. గ్రామంలోని మాలి పటేల్, ఇతర పెత్తందార్లకు వ్యతిరేకంగా చేస్తున్న విప్లవ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని పోలీసులతో గ్రామస్తులను పోలీస్స్టేషన్లో బంధించారు. పోలీసులకు లొంగిపోవాలని, లేదా అడవిబాట పట్టాలని సభ్యులపై ఒత్తిడి తేగా.. ఆ కుట్రను ఛేదించారు. ● 1991లో పూర్తిస్థాయిలో అప్పటి పీపుల్స్వార్లో చేరిపోయారు. 1991 నుంచి 33 నెలలపాటు కామారెడ్డి దళంలో పనిచేశారు. తర్వాత దళ అవసరం రీత్యా సిర్నాపల్లి దళంలో సభ్యుడికి చేరి, కమాండర్, డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్రావును 1998లో మందుపాతర పేల్చి చంపిన ఘటనలో ముగ్గురితో కలిసి తాను అంబూష్లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఘటన రాంచందర్ చేసినట్లు ప్రచారం జరగ్గా.. ఆ రాంచందర్ వన్పల్లి ఎన్కౌంటర్లో మరణించాడు. కానీ, లోకేటి చందర్రావు అలియాస్ స్వామి నాయకత్వంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు. ● 1999లో కోనరావుపేట మండలం మరిమడ్లలో పోలీసులను గుర్తించడంలో విఫలమైన తమ సెంట్రీ విఫలమయ్యాడని, దీంతో పోలీసులు సమీపించగానే ముందుగా కాల్పులు జరపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రాణనష్టం, కిట్బ్యాగుల నష్టం ఏమీ కాలేదని, మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. ● 1999 నుంచి 2000 వరకు కామారెడ్డి ఏరియాకు ఇన్చార్జిగా, 2000 నుంచి 2003 వరకు సిరిసిల్ల ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 2003లో దండకారణ్యం వెళ్లారు. అక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో ఎజేడ్సీలోకి, 2011లో దక్షిణ సబ్ జోన్ నుంచి పశ్చిమ సబ్ జోన్కు వెళ్లారు. ఇక్కడే 2020 వరకు సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, ఉత్తర గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జిగా పనిచేశారు. 2020 నుంచి 2024 వరకు పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ప్రభారిగా పనిచేశారు. ● ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆయన పని చేసిన కాలంలో జరిగిన ఘటనలు, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం పడ్కల్లో జరిగిన ఎన్కౌంటర్ను, తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితం, భార్యాపిల్లల జీవనం, సాయుధ పోరాటం, పేదల ప్రజలపై దండకారణ్యంలో చేసిన ప్రజాపోరాటాలను తన ఆత్మకథలో సమగ్రంగా వివరించారు. కొసా దాదా అంత్యక్రియలకు హాజరైన స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో సెప్టెంబరు 25న జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కొసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల్లో స్వామి పాల్గొని కడసారి చూపులు చూసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో సెప్టెంబరు 21న పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కొసా, ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. సెప్టెంబరు 25న గోపాల్రావుపల్లెలో కొసా దాదా అంత్యక్రియల్లో అంత్యంత రహస్యంగా స్వామి పాల్గొని అగ్రనేతకు నివాళి అర్పించడం విశేషం. పోలీసుల నిఘా మధ్య, ఆయన గోపాల్రావుపల్లెకు చేరుకుని అంత్యక్రియల్లో ఎవరూ గుర్తించకుండా పాల్గొని వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోరాట క్షేత్రంగా ఆత్మకథ పోరాట క్షేత్రంగా తన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లు, వారి కులాలు, నేపథ్యాలను స్వామి గుర్తు పెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతోంది. కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడని స్వామి ఆత్మకథ స్పష్టం చేస్తుంది. కన్నీటి వీడ్కోలు మా ఊరు ఇస్రోజివాడి అంటూ.. స్వామి తన అజ్ఞాత జీవితాన్ని ఆవిష్కరించారు. తల్లి పేరు లోకేటి కిష్టాబాయి, తండ్రి వీరన్న, నలుగురు సంతానంలో నేను నాలుగో వాడిని. మా పెద్ద అక్క గంగబాయి, ఆ తరువాత ఇద్దరు అన్నలు రాజేశ్వర్రావు, మానిక్రావు, నేను చిన్నోడిని చందర్రావును. నేను 1969లో జన్మించాను. అంటూ.. తాను 6వ తరగతి పాస్ అయ్యాయని.. రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్)లో పని చేస్తూ.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్కు వచ్చిన హెలీకాప్టర్ను కూల్చడం నుంచి మొదలు పెడితే.. అనేక హింసాత్మక ఘటనలను ఉటంకించారు. 35 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగించిన స్వామి తుదకు ఎన్కౌంటర్లో అమరుడై.. సొంత ఊరికి చేరితే కన్నీటితో వీడ్కోలు పలికింది ఇస్రోజివాడి. 22 ఏళ్ల ప్రాయంలో అడవిబాట దళ సభ్యుడిగా మొదలైన ప్రయాణం ఎన్నెన్నో దాడులు.. యుద్ధరీతులు ముందే ఆత్మకథలో ఆవిష్కరించిన స్వామి సోషల్ మీడియాలో వైరల్ -
ఎలక్షన్ స్నాక్స్
సిరిసిల్లటౌన్: పదేళ్లుగా వంటలతో జీవనం సాగిస్తున్న నేత కుటుంబానికి ఎన్నికల వేళ ఉపాధి లభిస్తోంది. సిరిసిల్ల అనంతనగర్ ప్రాంతానికి చెందిన అల్లాడి లక్ష్మి–చంద్రశేఖర్, కుందారపు పుష్పలత కుటుంబాలు ఎన్నికల నేపథ్యంలో వస్తున్న వంటల ఆర్డర్లతో బిజీగా ఉంటున్నారు. ఆదివారం కావడం, మరోవైపు ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజుతో తెరపడనుండటంతో పెద్దసంఖ్యలో వచ్చిన ఆర్డర్లను ఇలా కస్టమర్లకు అందిస్తున్నారు. వాడకట్టులో ఎన్నికల వేడి రగులుతున్న తరుణంలో వీరి ఇంట్లో వంటల గుమగుమలు ఆ ప్రాంత వాసులను ముగ్దులు చేయడం కనిపించింది. -
నిరుద్యోగులకు అండగా కోడింగ్ ట్యూటర్
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు కోడింగ్ ట్యూటర్ అండగా ఉంటుందని కోడింగ్ ట్యూటర్ నిర్వాహకులు ఫణిరాజ్ జాలిగామ అన్నారు. ఐటీ రంగంలోకి రావాలనుకునే అభ్యర్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులకు కోడింగ్, స్కిల్ మేనేజ్మెంట్పై ఆదివారం కరీంనగర్లోని శ్వేత హోటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఫణిరాజ్ జాలిగామ మాట్లాడుతూ యువతకు ఐటీ రంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు, గ్రాడ్యుయేషన్ పూర్తయి నాలుగైదేళ్లు గ్యాప్ ఉన్న వారు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కోచింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో కోడింగ్ నేర్చుకునేందుకు ఇంటర్న్షిప్ చేస్తే లాభా లేంటనే అంశంపై వివరించారు. కోడింగ్, స్కిల్స్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోడింగ్ట్యూటర్ ఆఫీస్కు 9 నెలల పాటు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. కోచింగ్ పూర్తయిన తర్వాత ఎంప్లాయీమెంట్ రాకపోయినా తమ కంపెనీలోనే అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. -
కళకు జీవితమిస్తే..
ఇరవై ఐదేళ్లు.. ఇదొక సాధారణ కాలం కాదు. కళనే శ్వాసగా, పాటనే ఆయుధంగా మలుచుకుని సాగించిన పోరాట కాలం. కమాన్పూర్ మండలం రొమ్మికుంట గ్రామానికి చెందిన పులిపాక బాలయ్య అనే కాళాకారుడు కళాకారుడిగా అనేక సేవలు చేశాడు. పాటలు రాయడం నుంచి వేదికలపై పాడటం వరకూ ప్రజల మధ్య చైతన్యం నింపే కార్యక్రమాల నుంచి సామాజిక సందేశాల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యమ గీతాల ద్వారా ప్రజల గుండెల్లో స్పందన రేపాడు. ఉద్యమాల వేడి వేదికలపై కనిపించినా.. జీవితంలో కష్టాలే ఎదురయ్యాయి. ఇంతకాలం కళకు అంకితమై ఉన్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వెంటాడుతోంది. ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ,చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కళాకారుడి ప్రతిభను చూసే సమాజం, అతడి బతుకును చూడడం మరిచిపోతుందంటున్నాడు. ఉద్యమాల సమయంలో అవసరమైన కళాకారులు.. ఆ ఉద్యమం ఫలించిన తర్వాత పక్కన పడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించాలని, కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నాడు. – పులిపాక బానయ్య, పాటల రచయిత, కమాన్పూర్ -
సుస్థిరం.. రామగుండం
రామగుండం: శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా.. రామగుండం ప్రాంతంలో పర్యటించారని, ఆయన అడుగుజాడలతో జలఊటలు ఏర్పడ్డాయని, అవే రామునిగుండాలు కావడంతో దీనికి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ముడిసరుకుల లభ్యతతో విద్యుత్ కేంద్రాలకు నిలయంగా మారింది. విద్యుత్ రంగంలో దేశవ్యాప్త ఖ్యాతి గడిచింది. భిన్నవర్గాల ఓటర్ల సమ్మేళనంగానూ అవతరించింది. రామగుండంలో ఒకే రైల్వేస్టేషన్ ఉన్నా.. గోదావరిఖనిలో పోలీస్ కమిషరేట్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా.. వాటిపేరు రామగుండంపైనే ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం రామగుండం అంటేనే గుర్తింపు లభిస్తుంది. మద్యం పట్టివేతసిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని భావనరుషినగర్లో రామగిరి దిలీప్ అక్రమంగా రూ.4,537 విలువ గల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. అతడి నుంచి మద్యం సీసాలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. -
పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి
చిగురుమామిడి: కోహెడ మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారంతో చిగురుమామిడి మండలంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కోహెడ మండల అటవీప్రాంతంలో పెద్దపులి తిష్టవేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారని తెలిపారు. పులి కదలికలు చిగురుమామిడి మండల సరిహద్దులకు చేరువలో ఉండటంతో రానున్న రెండు రోజులు రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, చుట్టుపక్కల రైతులతో కలిసి వెళ్లాలని సూచించారు. పులికదలికలు కనిపించినా, పశువులపై దాడిచేసి చంపినట్లు కనిపించినా తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇస్రో సైంటిస్టుగా కొడిమ్యాల యువకుడుకరీంనగర్టౌన్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్, ఉమారాణిల కుమారుడు రాజసింహ జగిత్యాలలో 10 వ తరగతి, వరంగల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశా డు. జేఈఈ అడ్వాన్స్ ద్వారా కేరళ తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ సీటు సాధించాడు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇస్రో సైంటిస్టుగా ఎంపికయ్యాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రాజసింహను అభినందించారు. -
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదివారం వెల్లడించారు. ఎన్నికల కోడ్ విడుదల అయిన వెంటనే పక్కా ప్రణాళికతో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని సినారె కళామందిరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి ఏర్పాట్లు పరిశీలించామని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే, సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కలిపి జోనల్ ఆఫీసర్స్ 21, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 4, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లు 12 ఏర్పాటు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు 140, వేములవాడలో 70 మందిని నియమించారు. ఓపీవో 630 మందిని నియామకం చేశారు. రెండు పట్టణాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది 700 మందిని నియమించారు. ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తదితర గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. బల్దియా ఎన్నికలపై పటిష్ట నిఘాసిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చెక్పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, డబ్బు, మద్యం పంపిణీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు 5 గంటలలోపు మున్సిపల్ పరిధిని విడిచిపోవాలని సూచించారు. మంత్రుల వాహనాలు తనిఖీ వేములవాడఅర్బన్/సిరిసిల్లఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ– కరీంనగర్ ప్రధాన రహదారిలోని సంకెపల్లిలో చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆదివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వాహనాలను సంకెపల్లి, రగుడు చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీ చేశారు. -
అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’..
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్ అవుతుంటారు.. కానీ వీహెచ్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు. -
ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘రేవంత్ బీజేపీ మనిషే.. బడేభాయ్ తమ్ముడే.. ఏనాడూ కాంగ్రెస్ మనిషి కాలేడు.. ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే.. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్ను తిట్టుడే పనిగా పెట్టుకుండు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డితోపాటు, సిరిసిల్లలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒక్కటి ఇచ్చి సీటు, గౌరవం లేకుండా చేసి మగవాళ్ల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తుండని విమర్శించారు. స్టూవర్టుపురం దొంగలుకాంగ్రెసోళ్లు ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామని ఓట్లేయించుకున్నారని, ఎక్కువ అడిగితే మెడలో ఉన్న పుస్తెలు లాక్కెళ్లే దండుపాళ్యం, స్టూవర్టుపురం దొంగల ముఠాలుగా తయారయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్గా అవకాశమిచ్చి బాన్సువాడ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఇచ్చిన కేసీఆర్ను, కారు గుర్తుపై ఓటేసి గెలిపించిన ప్రజలను దగా చేసి రేవంత్రెడ్డి కింద చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డికి రోషముంటే రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. పార్టీ మారిన పోచారంపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్కు ఫిర్యాదు చేస్తే, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పాడని, మరి బీఆర్ఎస్లో ఉంటే ఈ వేదిక మీద తన పక్కన ఎందుకు లేడని ప్రశ్నించారు. కులం.. మతం బువ్వ పెట్టవు‘బీడీ కార్మికులు తంబాకు వాసనతో ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కుటుంబ పోషణకు మగవాళ్లకు తోడుగా కొంతైనా సంపాదించాలని శ్రమిస్తారు. చిన్నప్పుడు దుబ్బాకలో ఓ శాలోళ్ల ఇంట్లో ఉండి చదువుకున్న కేసీఆర్కు బీడీకార్మికుల బాధలన్నీ తెలిసే రూ.2 వేలు ఆసరా పెన్షన్ను కల్పించాడు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం బువ్వ పెట్టవని, మంచి గుణం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే.. మంచి జరుగుతుందన్నారు. మా కులపోడు.. మా మతపోడు అని ఎన్నికల్లో ఓట్లు వేయొద్దన్నారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాలని, వాళ్ల బతుకుల్లో మార్పు రావాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెసోళ్లు బతుకమ్మ చీరలను బంద్ చేసి నేతన్నల బతుకులను ఆగం చేశారన్నారు. ‘నా మీద కోపంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తారట.. మనకు జిల్లాలు వద్దా.. పాలన ప్రజలకు చేరువ కావద్దా..’ అని అడిగారు. తొండి సంజయ్ ఏం చేశారు?కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్కి తొండి సంజయ్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి.. సిరిసిల్లకు ఏమైనా చేశాడా? రాష్ట్రానికి ఏమైనా తెచ్చాడా? అని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు. మనకు మంచి చేసే వాళ్లకే ఓట్లు వేయాలని, మోసం చేసే వాళ్లకు కాదన్నారు. పలువురు నాయకులు ఇతర పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరగా.. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్షిందే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.బాన్సువాడలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న కేటీఆర్ -
అనుమానం పెనుభూతమై..
● గొడ్డలితో నరికి.. కత్తితో గొంతుకోసి ● భార్యను దారుణంగా చంపిన భర్త ● నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జగిత్యాలక్రైం: మూడుముళ్లు వేసి.. ఏడడుగులు వేసి.. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను అనుమానిస్తూ.. ఆమైపె కక్ష పెంచుకుని నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి.. కత్తితో గొంతు కోసి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో శనివారం వేకువజామున వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్కు చెందిన అదరవేని మల్లయ్యతో 30 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణ శివారు ఉప్పరిపేటకు చెందిన సత్తవ్వతో వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా మల్లయ్య భార్యను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిస అయిన మల్లయ్య సత్తవ్వను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు పంచాయితీలు జరిగాయి. వేధింపులు భరించలేని సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయినా వేధించడంతో తల్లిగారింటికి వెళ్లి కొన్నేళ్లు అక్కడే ఉంది. మూడేళ్ల క్రితం పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరిని కలిపారు. అప్పటినుంచి సత్తవ్వ పిల్లలను చూసుకుంటూ.. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. కుమారుడు హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న కూతురు నాలుగురోజుల క్రితం తన ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. దీనిని అదునుగా చేసుకున్న మల్లయ్య.. శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సత్తవ్వను గొడ్డలితో నరికాడు. సత్తవ్వ సృహ కోల్పోవడంతో కూరగాయల కత్తితో గొంతు కోశాడు. విచక్షణరహితంగా శరీరంపై పొడిచాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకుని అక్కడినుంచి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరుడు గడ్డం చిన్నమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. లక్ష్మీపూర్లో విషాదం ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడు, కూతురును ఉన్నత చదువులు చదివిస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయంత్రం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడు మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. -
వన్యప్రాణుల దాడులు.. అందని పరిహారం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులకు పంటలకుతోడు పాడి ఉంటేనే ఆర్థికంగా స్థిరపడతారు. అయితే ఇటీవల జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని రైతులకు వన్యప్రాణుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెట్టి ఆవులు, గేదెలు కొని పాలు విక్రయించి అప్పుల నుంచి గట్టెక్కుదామనుకుంటే వన్యప్రాణుల దాడులతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. విచారణ చేపడుతున్న ఫారెస్ట్ అధికారులు నివేదిక సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు. బాధితులకు మాత్రం పరిహారం రావడం లేదు. సంఘటనలు ఇలా.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో అటవీ విస్తరించి ఉంటుంది. అటవీని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇటీవల వన్యప్రాణుల దాడులు పెరిగాయి. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఐదు చిరుతపులులు, పలు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఇటీవల ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లో చిరుతల దాడుల్లో గేదెలు చనిపోయాయి. ఆరు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన పది సంఘటనల్లో లేగదూడలు మృతిచెందాయి. వీరిలో ఎవరికీ ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదు. ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, గాలిపల్లి గ్రామాల్లో ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపల్లిచెరువుతండాలో ఆరు నెలల్లో చిరుతల దాడిలో మూడు లేగదూడలు, ఎలుగుబంట్ల దాడిలో రెండు దూడలు చనిపోయాయి. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఎస్సై చల్లా వెంక్రట్రాజం తెలిపారు. మృతునికి 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మెడలో రుద్రాక్ష, ఇతర మాలలు ధరించి ఉన్నాడు. మతిస్థిమితం సరిగ్గా లేక.. కాగితాలు ఏరుకునేవాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే 87126 56417లో సంప్రదించాలని కోరారు. ● పత్తిపాకలో దొంగతనం ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని మెన్నెని వెంకటనర్సింగరావు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. వెంకటనర్సింగరావు తన ఇంటికి తాళాలు వేసి పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చిచూడగా తాళం పగులకొట్టి కనిపించింది. లోనికి వెళ్లిచూడగా.. బీరువా ధ్వంసమై ఉంది. అందులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుడికి సంబంధించిన 19 గ్రాముల బంగారు ఆభరణాలు, 510 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీం పోలీసులు వేలిముద్రలు సేకరించారు. 25ఏళ్లుగా స్వామివారి కానుకలు ఇక్కడే.. పత్తిపాకలో 2000–2001 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటినుంచి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమకూరే కట్నకానుకలను మాజీ సర్పంచ్ వెంకటనర్సింగరావు ఇంట్లోనే భద్రపర్చుతున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చిన కట్నకానుకలనూ ఆయన ఇంట్లో ఉంచేందుకు భక్తులు రాగా.. తాను స్థానికంగా ఉండడం లేదు, వేరేవారి ఇంట్లో భద్రపర్చాలని చెప్పారు. అయినా, గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లోనే ఆభరణాలు భద్రతపరిచారు. దొంగలు ఈ ఆభరణాలతోపాటు వాటి తాలూకు జాబితా కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బంగారం, వెండి ఎంతుందనే సమాచారం తెలియడం లేదు. దీనిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ స్పష్టత ఇవ్వలేదు. సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో శనివారం రెండు వేర్వేరు సంఘటనల్లో రూ.4లక్షలు సీజ్ చేశారు. జగిత్యాలకు చెందిన శ్రీనాథ్ తన కారులో వస్తుండగా పోలీసుల తనిఖీల్లో రూ.2లక్షలు నగదు పట్టుబడిందని సిరిసిల్లటౌన్ సీఐ కృష్ణ తెలిపారు. వేములవాడ మండలం ఎదురుగట్ల నుంచి చిగురు వినోద్ సిరిసిల్ల వస్తుండగా స్థానిక చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.2లక్షలు నగదు తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. -
భీమన్నకు పట్టువస్త్రాలు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరీ సేవా సమితి భక్తి కార్యక్రమం రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు బద్దిపోచమ్మ అమ్మవారికి సారెను శనివారం సమర్పించారు. ఆలయ ఈవో రమాదేవి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఏఈవోలు శ్రావణ్కుమార్, అశోక్కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, పురాణం వంశీ పాల్గొన్నారు. అత్యవసర వేళల్లో అందుబాటులో ఉండాలి సిరిసిల్లటౌన్: క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చే అత్యవసర సమయాల్లో 108 సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్వో రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను శనివారం తనిఖీ చేపట్టారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనం వచ్చిన సందర్భంగా వాహనంలోని అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు. శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా మేనేజర్ అరుణ్కుమార్కు సూచించారు. 108 జిల్లా మేనేజర్ అరుణ్కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్కుమార్, పోచంపల్లి పర్శరాములు, బండారి స్వాతి, బుర్ర వెంకటేశ్ పాల్గొన్నారు. కొదురుపాకలో స్థల పరిశీలన బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాకలో బస్టాండ్ నిర్మాణానికి కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం రాజు శనివారం స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో బస్టాండ్, బస్టాప్ నిర్మాణం గురించి కొదురుపాక సర్పంచ్ కత్తెరపాక మంజుల ఆధ్వర్యంలో ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంత్రి సూచనలతో ఆర్ఎం కొదురుపాకలో స్థలాన్ని పరిశీలించారు. మహాశివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు వేములవాడఅర్బన్: వేములవాడలో మూడు రోజులు జరిగే మహాశివరాత్రి జాతరకు 600 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు తెలిపారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్లో శనివారం సమావేశమయ్యారు. కరీంనగర్–వేములవాడ రూట్లో 58 బస్సులు, కోరుట్ల –వేములవాడ 38, మెట్పల్లి–వేములవాడ 69, జేబీఎస్–వేములవాడ 49, వేములవాడ–కొండగట్లు 15, వరంగల్–వేములవాడ 131, వేములవాడ–సిరిసిల్ల 18, నిర్మల్–వేములవాడ 85, ఆర్మూర్–వేములవాడ 90, నిజామాబాద్–వేములవాడ 22, కామారెడ్డి–వేములవాడ 25 బస్సులు నడిపించనున్నట్లు వివరించారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు. ప్రశ్నించే గొంతుక సీపీఎం సిరిసిల్లటౌన్: మున్సిపాలీటీలో ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతుకై న సీపీఎంను ఆదరించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కై లాబ్బాబు కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం సిరిసిల్లలో ప్రచారం చేశారు. సీపీఎం పోరాటంతోనే సుందరయ్యనగర్, బీవై నగర్లలో పేదలకు ఇళ్లు దక్కాయన్నారు. పవర్లూమ్ కార్మికుల కూలి కోసం పోరాడామని గుర్తు చేశారు. 21వ వార్డు కోడం రమణ, 33వ వార్డు ఎలిగేటి రాజశేఖర్, 34వ వార్డు రాపెల్లి రమేశ్లను గెలిపించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, ఎర్రవల్లి నాగరాజు, గురిజాల శ్రీధర్, సూరం పద్మ పాల్గొన్నారు. -
మత్తు కోసం ఏవిల్ ఇంజెక్షన్లు !
● చెట్లపొదల్లో వెలుగుచూసిన సిరంజీలు, ఆంపుల్స్ ముస్తాబాద్ (సిరిసిల్ల): యువత మత్తు కోసం రోజుకో మార్గాన్ని కనిపెడుతున్నారు. తక్కువ ధరకు లభించే ఇంజెక్షన్లు తీసుకుంటూ మత్తులో జోగుతున్నారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ న్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం శివారులో తెర్లుమద్ది, బందనకల్ గ్రామాల మధ్య చెట్ల పొదల్లో వాడి పడేసిన సిరంజిలు, ఆంపుల్స్ కవర్లు ప్రత్యక్షమయ్యాయి. ఫిజీషియన్ సమక్షంలోనే ఇచ్చే ఈ ఇంజెక్షన్లు ఇలా ఆరుబయట, చెట్లపొదల్లో పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మత్తు కోసమే వాడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలోనే మత్తు కోసం దగ్గు మందు తాగేవారు. మత్తు కోసం ఇలాంటి మార్గాలు ఎంచుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల క్రైం: మున్సిపల్ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి తరలిస్తున్న మద్యంను సిరిసిల్ల టౌన్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. పట్టణంలోని సుభాష్నగర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేయగా.. రూ.19,008 విలువైన మద్యం, బైక్, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దార్నం అరుణ, దార్నం లక్ష్మీనారాయణ, మల్లికార్జున వైన్స్, రాచమల్లు రాముపై కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. -
ప్రచారం బంద్
48కలెక్టర్ గరీమా అగ్రవాల్ గంటల ముందేసిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు ప్రణాళికతో పూర్తి చేయాలని, ప్రచారాన్ని పోలింగ్కు 48 గంటల ముందే బంద్ చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, నోడల్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, పోలింగ్ కేంద్రం బయట ఒక సీసీ కెమెరా ఉండాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, మచ్చ గీత, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, తహసీల్దార్లు మహేశ్కుమార్, జయంత్కుమార్, అధికారులు ప్రవీణ్, మీర్జా ఫసహత్ అలీ బేగ్, అన్సార్ పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు 13న జరుగుతుందని, ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో కౌంటింగ్ విధులపై ఆర్వో, ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చారు. సిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత వార్డుల వారీగా ఓట్లు లెక్కించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యే వారు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్లోని ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆదివారం కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. నోడల్ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
డబ్బులు రాలేవు
రెండు నెలల కింద ఎలుగుబంటి దాడి చేయడంతో లేగదూడ చనిపోయింది. అధికారులు వచ్చి చూసిండ్రు. నివేదిక రాసుకొని పోయిండ్రు. పైసలు అయితే రాలేవు. – భూక్య తిరుపతినాయక్, గుంటపల్లిచెరువుతండా, గిరిజన రైతు నివేదికలు పంపిస్తున్నాం ఇటీవల జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టి నివేదికలు పంపించాం. పరిహా రం రైతులకు వస్తుంది. గతంలోనూ పలువురు రైతుల పశువులపై దాడి జరిగిన సంఘటనల్లో పరిహారం వచ్చింది. ఆలస్యమైనప్పటికీ పరిహారం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. – మోహన్లాల్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ -
పల్లెనేతలు!
‘పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. రేషన్బియ్యం నుంచి గృహనిర్మాణాల వరకు ప్రధాని నరేంద్రమోదీ నిధులు పంపుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలు చెప్పడం లేదు. ఈ విషయాలు వివరించి ఓటర్లను దేశం కోసం.. ధర్మం కోసం బీజేపీని గెలిపించాలని కోరాలి..’ ఇది కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ప్రభుత్వం మనదే ఉంది. ఇంకా మూడేళ్లు అధికారం మనదే. అభివృద్ధి, సంక్షేమం మనతోనే సాధ్యమని చెప్పండి. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నాం. వచ్చే మూడేళ్లలోనూ ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికతో ముందుకు సాగుదాం. కాంగ్రెస్పై ప్రజల్లో విశ్వాసం ఉంది. చేసింది చెప్పుకోవాలి.. చేసేది చెప్పి ఒప్పించాలి..’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడలో పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు. -
పాలిసెట్తో ఉజ్వల భవిత
కరీంనగర్టౌన్: ప్రస్తుతం పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో మెదులుతుంది. చాలా మంది ఇంటర్ చదవడానికి ఆసక్తి చూపుతారు. సంప్రదాయ చదువులు కాకుండా.. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగవకాశాలు కావాలనుకునేవారికి పాల్టెక్నిక్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని విద్యానిపుణులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాలిసెట్– 2026 ప్రవేశపరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు అవకాశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 40,701 మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 13,156, జగిత్యాల 12,298, పెద్దపల్లి 7,495, రాజన్న సిరిసిల్ల 7,752 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో టెక్నికల్ రంగం వైపు అడుగులు వేయాలనుకునే వారు పాలిసెట్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాటారం, హుస్నాబాద్, సిరిసిల్ల(ఆగ్రహారం), కోరుట్ల, కరీంనగర్ జిల్లాకేంద్రాల్లో పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో 480 సీట్లు, హుస్నాబాద్, కాటారం, కోరుట్ల, కరీంనగర్ కళాశాలల్లో 5 కోర్సులకు 66 చొప్పున 330 సీట్లున్నాయి. ఆసక్తిగల విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.300 అపరాద రుసుముతో ఏప్రిల్ 22 వరకు ఫీజు చెల్లించొచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక చేస్తారు. మూడేళ్ల కోర్సులో ప్రతిభచాటిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెన్కో, ఎన్టీపీసీ, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, సింగరేణి, ఐవోసీఎల్, బీహెచ్ఈఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నికల్ శిక్షకులుగా చేరవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 20 వరకు అవకాశం.. మే 13న ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,701 మంది ఎస్సెస్సీ విద్యార్థులు ఉపాధి, ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి పాల్టెక్నిక్ విద్య తోడ్పడుతుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగకరం. తక్కువ ఫీజు చెల్లించి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. మూడేళ్ల కోర్సులో ఆరు నెలలు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఇది విద్యార్థుల్లో అవగాహన పెంచుతుంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. – డి.శోభారాణి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20 రూ.100 అపరాధ రుసుంతో ఏప్రిల్ 21 ప్రవేశపరీక్ష నిర్వహించే తేదీ మే 13 -
స్వామి.. ఓ సంచలనమే
సిరిసిల్ల: మావోయిస్టు చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ హయాంలో సిరిసిల్ల ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడిచింది. పీపుల్స్వార్(ప్రస్తుత మావోయిస్టు) పార్టీ పశ్చిమ డివిజన్ కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడి రెండేళ్లపాటు పనిచేశారు. తన కాలంలో భారీగా రిక్రూట్మెంట్స్తో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేటి చందర్రావు(57) గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వామితోపాటు ఏడుగురు మరణించారు. ఈ ఎన్కౌంటర్లో పోలీస్ కమాండో కానిస్టేబుల్ దీపక్ చిన్నమదవి మంద్రా(38) ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడికి చెందిన చందర్ రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. కోనరావుపేట ఎస్సైపై కాల్పులు 1998లో కోనరావుపేట ఎస్సైగా ఉన్న ముసిపట్ల శ్రీనివాస్గౌడ్ పోలీసు బలగాలతో శివారు అడవుల్లోకి కూంబింగ్కు వెళ్లారు. ఎగ్లాస్పూర్కు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిమ్మపల్లి వైపు వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న మావోయిస్టు స్వామి దళం పోలీసులపై మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారు. కూంబింగ్లో ముందు వరుసలో వస్తున్న శ్రీనివాస్గౌడ్ అక్కడికక్కడే మరణించారు. మరికొందరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు. ● అదే ఏడాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు కెనాల్ పక్కన హోంగార్డు శ్రీనివాసరాజు కోవర్టుకు పాల్పడుతున్నాడని కాల్చి చంపారు. ● కోనరావుపేట మండలం వట్టిమల్లలో 1997, జూలై 28న మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సాయుధ నక్సలైట్లతో నిర్వహించారు. వట్టిమల్ల వేదికగా జనాన్ని సమీకరించి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. వట్టిమల్లకు వచ్చే నాలుగు దారుల్లోనూ సాయుధ నక్సలైట్లతో మందుపాతరలు అమర్చి మూడు గంటలపాటు పొద్దంతా సమావేశాన్ని నిర్వహించడం అప్పట్లో ఓ సంచలనం. ● వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం మరిమడ్లలో అటవీశాఖ కాంట్రాక్టర్ల ద్వారా తునికాకు సేకరణ చేసింది. కూలీలకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించి సేకరించిన తునికాకును నిల్వ చేశారు. రూ.కోటి విలువైన తునికాకును లారీల్లో మధ్యప్రదేశ్కు అమ్మేసి ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని గ్రామాభివృద్ధికి, కొంత ఉద్యమ అవసరాలకు వినియోగించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ● 1999లో కోనరావుపేట మండలం నిజామాబాద్లో ప్రజాకోర్టును నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మీడియాను తెప్పించి ప్రజాకోర్టును ఏర్పాటు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీ సానుభూతిపరుడు భానును, కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన నాగరాజు గర్జనపల్లి అడవుల్లో పట్టుకుని కాల్చి చంపారు. అప్పట్లో పీపుల్స్వార్కు, జనశక్తి పార్టీలకు మధ్య వైరుధ్యాలు ఉండేవి. ఆధిపత్య పోరులో భాగంగా జనశక్తికి చెందిన ఇద్దరిని కాల్చిచంపారు. ఇంకా అనేక హింసాత్మక ఘటనలకు, భౌతికదాడులకు, సంచలన ఘటనలకు పడ్కల్ స్వామి కేంద్రబిందువుగా నిలిచారు. పడ్కల్ స్వామిగా గుర్తింపు 1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న స్వామి ఏనాడు ఇంటి ముఖం చూడలేదు. 1993లో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడ్కల్లో సిర్నాపల్లి దళం సేదతీరుతుండగా పోలీసులు దాడి చేశారు. ఆ సంఘటనలో డిప్యూటీ దళకమాండర్ సంజీవ్, గోపి, క్రాంతి మరణించారు. పడ్కల్లో పోలీసులతో రెండు రోజులపాటు ఒక్కడే పోరాడి ఒక్క కానిస్టేబుల్ను కాల్చి చంపారు. అప్పటి డీజీపీ పడ్కల్కు రావడం విశేషం. స్వామి ఉన్న ఇంటికి నిప్పు పెట్టగా ఏకే 47తో కాల్పులు జరిపి పోలీసులు వెనక్కి తగ్గగానే తప్పించుకున్నారు. అప్పట్లో ఇదో సంచనం. అప్పటి నుంచి పడ్కల్ స్వామిగా లోకేటి చందర్రావుకు గుర్తింపు. ఆయన భార్య సులోచన అలియాస్ నవనీత పార్టీలో పనిచేస్తూనే 2016లో అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు రమేశ్ ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. రమేశ్ భార్య బుజ్జి అలియాస్ కమలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామి ఎన్కౌంటర్ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాబల్య గ్రామాల్లో శనివారం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవశ్యకతపై ప్రసంగం సిరిసిల్లలో చర్చనీయ ఘటనలు గొడ్చిరోలి ఎన్కౌంటర్లో మృతి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్న మాజీలు, సానుభూతిపరులు -
ఎవరికెవరు ఏమవుతారో..?!
జగిత్యాలటౌన్: జగిత్యాల బల్దియా ఎన్నికల ప్రచారంలో వింత పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తన అనుచరులైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఎర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో ఓట ర్లు విస్తుపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ పా ర్టీ ఫిరాయింపుపై ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్ను కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని మీడియా ముఖంగా ప్రకటించిన ఎమ్మె ల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీ సీనియర్ నాయకుడు స్వతంత్రులకు మద్దతుగా ప్రచారం చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ‘ఉపాధి’ ప్రచారం పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికలు అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పెద్దపల్లిలో పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. చైర్పర్సన్ అభ్యర్థిగా ముందుకొచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్బ్లాక్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కళాబృందాలతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారశైలిని చూసిన ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు.. మంథని ప్రాంతం నుంచి కళాకారులను రప్పించి ప్రచారం హోరెత్తిస్తున్నారు. వార్డుల్లో ప్రచారం చేస్తే రూ.200 పలువురు అభ్యర్థులు తమగుర్తుతో వార్డుల్లో ప్రచారం చేసేందుకు అదేవార్డుకు చెందిన వారితోనే తిరుగుతున్నారు. వీధుల్లో జెండాలు పట్టుకుని రెండుగంటల పాటు ఇలా తిరిగితే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తున్నారు. ఇలాంటి ప్రజలు పొద్దున ఒకరికి, మధ్యాహ్నం మరొకరిని, రాత్రిపూట ఇంకొకరికి వారివారి జెండాలు, గుర్తులు పట్టుకుని ‘జై అభ్యర్థి.. జై పార్టీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయం గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు జనాల్ని పోగేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మీరు మాతో ప్రచారానికి రండి అని అడిగితే.. ‘ఇప్పుడు పలానా అభ్యర్థికి మద్దతుగా వెళ్తున్నాం.. మీరు రెండు గంటల తర్వాత ప్రచారం చేసుకోండి’ అంటూ అభ్యర్థులకు స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. ఓట్ల పండుగ పుణ్యాన మహిళలకు ఇలా రోజుకు కనీసం రూ.600 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది. పెద్దపల్లిరూరల్: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటారు. కానీ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి.. తమకు మద్దతుగా 150 మందిని సమీకరించారు. తన వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ, వారందరినీ సమీపంలోని మరోవార్డు అభ్యర్థి.. తన మద్దతుదారుల కోసం ఏర్పాటు చేసుకున్న భోజనం తినేందుకు పంపించాడు. అదే సమయంలో ఆ అభ్యర్థి మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. వీరంతా ఎవరు? ఎందుకొస్తున్నారోనని సదరు అభ్యర్థితో సహా ఆయన మద్దతుదారులెవరికీ అంతుబట్టలేదు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అని ఆరా తీయగా.. పొరుగువార్డుకు చెందిన ఓ నాయకుడని తేలింది. ‘మీ అందరికీ తలా రూ.200 చొప్పున డబ్బులు ఇవ్వమని అతడికి డబ్బులు ఇచ్చా.. మీరంతా ఆయన వద్దకే వెళ్లి తీసుకోండి’ అని చెప్పి వెనక్కి పంపిచేశాడు. ‘అరే.. మా అవసరానికి తగ్గట్టుగా భోజనం సిద్ధం చేసుకుంటే.. మాకు సంబంధం లేనివ్యక్తులను ఇలా పంపడమేంటో’ అని సదరు అభ్యర్థి వాపోయాడు. ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.ఒకరి ప్రచారం.. మరొకరి భోజనం! అధికార పార్టీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రచారం స్వతంత్రులకు అధికార పార్టీ నాయకుడి ప్రచారం జగిత్యాలలో వింత పరిస్థితి -
మహిళలకు ఫ్రీ బస్సుపై కేటీఆర్ వ్యతిరేకం
సిరిసిల్ల అర్బన్: మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడంపై కేటీఆర్ పదే పదే తప్పుపడుతున్నారని, ఫ్రీ బస్సు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారా? అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అడిగారు. జ్యోతినగర్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఎలుక తిరుపతి పాల్గొన్నారు. -
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
● ఆరుగురు ప్రయాణికులు, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు ● బోల్తా పడ్డ యూరియా లారీ పగిలిన ఆర్టీసీ బస్సు అద్దాలు బోల్తా పడ్డ యూరియా లారీ శంకరపట్నం: తాడికల్ గ్రామంలో శనివారం యూరియా లారీ, ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొంది. ప్రయాణికులు, స్థానికుల వివరాల ప్రకారం.. తాడికల్ సహకార సంఘానికి యూరియా లోడ్తో వస్తున్న లారీ వెనుక హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు 70 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తోంది. తాడికల్కు చేరుకున్న క్రమంలో యూరియా లారీని ఇసుక లారీ ఢీకొట్టిడంతో యూరియా లారీ బోల్తా పడింది. యూరియా లారీ వెనకాల వస్తున్న హుజూరాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సును సైతం ఇసుక లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యూరియా లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారమందించారు. ఆలస్యం కావడంతో ఆటోలో కొందరిని హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేశవపట్నం పోలీసులు చేరుకొని 108 వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు -
కాంగ్రెస్తోనే బీసీలకు న్యాయం
సిరిసిల్లటౌన్/వేములవాడ: కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు, మహిళలకు న్యాయం జరిగిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో శనివారం ప్రచారం చేశారు. వేములవాడను జర్మనీ రమేశ్బాబుతో వెనుకపడేశారని, వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఆది శ్రీనివాస్ ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారన్నారు. వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేశారు. నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, చీటి ఉమేశ్రావు, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు. -
మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
కరీంనగర్రూరల్: మూడేళ్లక్రితం కుటుంబకలహాలతో ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు ఆధునిక టెక్నాలజీతో నేపాల్లోని ఖాఠ్మాండులో గుర్తించి శనివారం కరీంనగర్కు తీసుకొచ్చారు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు వివరాలు గోదావరిఖనికి చెందిన పస్తం సురేశ్(32)కు దుర్శేడ్కు చెందిన అనూషతో వివాహమైంది. మూడేళ్లక్రితం అత్తగారింటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్రూరల్పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక విచారణతోపాటు ఆధునిక సాంకేతిక సాయంతో సురేశ్ విశాఖపట్నం,నేపాల్దేశంలోని ఖాఠ్మాండులో నివసిస్తున్నట్లు గుర్తించారు. చివరకు వివిధ ప్రయత్నాల ద్వారా సురేశ్ను పట్టుకుని శనివారం పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిస్సింగ్కేసును చేధించిన పోలీసులను సీఐ నిరంజన్రెడ్డి అభినందించారు. -
అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’..
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్ అవుతుంటారు.. కానీ వీహెచ్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు. -
జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్స్
సిరిసిల్ల: రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన 7వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి బి.బేలా గోల్డ్మెడల్తో పాటు మరో రెండు పతకాలు సాధించారు. అజ్మీర్లో ఫిబ్రవరి 2న జరిగిన పోటీల్లో బేలా ఐదు కిలోమీటర్ల నడక పోటీలో గోల్డ్ మెడల్, 500 మీటర్ల పరుగుపందెంలో సిల్వర్, వెయ్యి మీటర్ల పరుగుపందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. 40–44 ఏళ్ల గ్రూప్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. స్పోర్ట్స్ డ్రెస్ను బహుమతిగా అందించారు. బేలాను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి బొడ్డు నారాయణ, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ అభినందించారు. -
ఆరోగ్యం పైలం!
పరీక్షల కాలం..హుజూరాబాద్/కరీంనగర్ స్పోర్ట్స్: వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పక్షం రోజుల్లో ఇంటర్, నెల రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పుస్తకాలతో యుద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతూ.. అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఏడాదిలో విన్న పాఠాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షలు ఉన్నాయని చదవడమే కాదు.. ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోవాలని, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దని, నిద్రముఖ్యమని సూచిస్తున్నారు. – వివరాలు 8లో.. -
పదేళ్లలో గాలికొదిలేసిన పనులు చేస్తున్నా
● గతంలో వేములవాడను పట్టించుకోలేదు ● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: పదేళ్లుగా గాలికి వదిలేసిన పనులను తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో ముందుకు తీసుకెళ్తూ.. వేములవాడను వెన్నెలవాడగా మార్చేందుకు కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 1 నుంచి 28వ వార్డు వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వేములవాడలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కౌన్సిలర్లను తమ పార్టీకి ఇస్తే వేములవాడను టెంపుల్సిటీగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే సీఎం రేవంత్రెడ్డితో కొట్లాడి నిధులు తీసుకొస్తానన్నారు. వారు గెలిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది మీరు ఆలోచించాలని కోరారు. పదేళ్లు అధికా రంలో ఉండి మూలవాగు బ్రిడ్జి కూడా కట్టలేదన్నా రు. రాజన్నగుడిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే మురుగుకాలువలో వేసినట్లేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సిరిసిల్ల/వేములవాడ: ఎన్నికల సిబ్బంది బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల అధికారు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. ఆర్డీవో రాధాబాయి, ట్రై నింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, డీఈవో జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, తహసీల్దార్ జయంత్కుమార్ ఉన్నారు. జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్థానిక సినారె కళామందిర్లో రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్రెడ్డితో కలిసి శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నోడల్ అధికారి మల్లికార్జునరావు, ట్రైనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అనదపు కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ చంద్రయ్యలతో కలిసి సమీక్షించారు. ఫస్టియర్ 4,046, సెకండియర్ 4,060 మంది హాజ రవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. డీఐఈవో శరత్కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వేణు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డులకు ఆన్లైన్ దరఖాస్తులు 2026–2028 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చే యాలని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడున్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈనెల 28తో ముగియనుందని, అర్హత గల జర్నలిస్టులకు కొత్తకార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. భక్తులు ఇబ్బందులు పడొద్దు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భీమేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రాధాభాయితో కలిసి పరిశీలించారు. వీఐపీ దర్శనాల కోసం చేసిన ప్రత్యేక ద్వారం, బారికేడ్లను పరిశీలించిన ఈఈ రాజేశ్కు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదం కౌంటర్ ఏర్పా టు చేయాలని సూచించారు. మొబైల్ టాయిలెట్ల సంఖ్య పెంచాలన్నారు. కోడెల టికెట్ కౌంటర్, పందిర్లు, శివార్చన స్టేజీ పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ ఉన్నారు. -
మహాజాతరకు పటిష్ట భద్రత
● ఎస్పీ మహేశ్ బీ గీతే వేములవాడ: మహాశివరాత్రి జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. భీమన్న ఆలయంలో శుక్రవారం ప రిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. పట్టణంలోని ప్రధాన మార్గాల్లో రూట్మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఎస్పీ రుత్విక్సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆలయ ఈఈ రాజేశ్, డీఈ మహిపాల్రెడ్డి, ఏఈ రాంకిషన్రావు ఉన్నారు. రగుడు చెక్ పోస్ట్ తనిఖీసిరిసిల్ల క్రైం: రగుడు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఎస్పీ మహేశ్ బీ గీతే శుక్రవారం తనిఖీ చేశారు. వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించారు. చెస్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 8న కరీంనగర్లో ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంకరీంనగర్: జిల్లాలోని యువతకు ఐటీరంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటలకు, కరీంనగర్లోని శ్వేత హోటల్లో కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి... గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఎలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. ఈ కార్యక్రమం డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 89888 87333 నంబర్కి ఫోన్చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందన్నారు. -
వెబ్ కాస్టింగ్
పోలింగ్ కేంద్రాల్లో ● 175 పోలింగ్ కేంద్రాలు.. 1,212 మంది సిబ్బంది ● 48 సెన్సిటివ్, 17 క్రిటికల్ సెంటర్స్ ● ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం ● ‘సాక్షి’తో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ఎన్నికల నిర్వహణ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసారి క్యూఆర్ కోడ్ ద్వారా ప్రశ్నావళిని ఇచ్చాం. ఆ ప్రశ్నావళిలో ఎన్నికల సిబ్బంది సమర్థత వెలుగు చూస్తుంది. ఎన్నికల నిర్వహణపై అవగాహన లోపం ఉన్న వారికి మళ్లీ శిక్షణ ఇచ్చాం. ఇలా పూర్తి అవగాహనతో సిబ్బంది ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తయింది. మూడోసారి ర్యాండమైజేషన్ చేసిన తర్వాతే సిబ్బందికి పోలింగ్ కేంద్రాల కేటాయింపులు ఉంటాయి. ఓట్లలెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తాం. మాక్ కౌంటింగ్ను నిర్వహిస్తాం. సిరిసిల్లలో ఓట్ల లెక్కింపు కొత్తబస్టాండులోని సినారె కళామందిరంలో, వేములవాడలోనూ సినారె కళామందిరంలో జరుగుతుంది.సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రతీ ఒక్క ఓటరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటుహక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు చేశామని, ఫామ్–12 ద్వారా దరఖాస్తును సమర్పించి ఓటుహక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ‘సాక్షి’తో శుక్రవారం మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..48 సెన్సిటివ్, 17 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు రెండు మున్సిపాలిటీల్లో 48 సెన్సిటివ్, 17 క్రిటికల్ పోలింగ్స్టేషన్లు ఉన్నట్లు పోలీస్శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జిల్లా పోలీసులు చేస్తారు. 175 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఉంటుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తారు. 1,212 మంది సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్ని కల నిర్వహణకు 1,212 మందిని నియమించాం. నామినేషన్ల కోసం మూడు వార్డులకు ఒక్కో ఆర్వోను నియమించాం. సిరిసిల్లలో 13, వేములవాడలో 10 మందిని నియమించాం. ఎన్నికల నిర్వహణకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవోలతోపాటు ముగ్గురు ఓపీవోలు ఉంటారు. 20 శాతం అదనపు సిబ్బందిని రిజ ర్వులో ఉంచాం. ఓట్ల లెక్కింపునకు 243 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బంది అందరూ శిక్షణకు హాజరయ్యారు. సిరిసిల్లలో 8, వేములవాడ 6 జోన్లుగా విభజించి ఎన్నికలను నిర్వహిస్తున్నాం. 23 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించాం. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందించాం. శని, ఆదివా రాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ముందుగా ఫామ్–12 సమర్పించిన సిబ్బందికే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. జిల్లాలో రూ.26.70 లక్షలు సీజ్ చేశాం సిరిసిల్ల, వేములవాడ పట్టణాల శివారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. లెక్కలు చూపకుండా తరలిస్తున్న రూ.26.70లక్షల మేరకు సీజ్ చేశాం. క్షేత్రస్థాయిలో సిరిసిల్లలో మూడు, వేములవాడలో మూడు తనిఖీ బృందాలతో నిఘా ఉంచాం. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధల మేరకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటుహక్కును వినియోగించుకోవాలి.సిరిసిల్లలో 39 వార్డులు 117 పోలింగ్ స్టేషన్లు, వేములవాడలో 28 వార్డులు, 58 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సిరిసిల్లలో 81,959 మంది, వేములవాడలో 40,877 మంది ఓటర్లు ఉన్నారు. దివ్యాంగులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేలా ర్యాంపులు ఏర్పాటు చేశాం. బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటర్లకు స్లిప్స్ పంపిణీ చేయడం ద్వారా ఓటు వేయాలనే ఆలోచన వస్తుంది. ఇప్పటికే అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని సూచించాం. డిగ్రీ కాలేజీల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. -
కాంగ్రెస్కు ఓటేస్తే జిల్లా పోతది
● సిరిసిల్లకు కేసీఆర్ సముద్రాన్ని తెచ్చాడు ● నేతన్నలను కడుపులో పెట్టుకున్నాడు ● బీడీ కార్మికులకు ఆసరా అయ్యాడు ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల/వేములవాడ/సిరిసిల్లఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జిల్లా పోతదని, నా మీద కోపంతో జిల్లాను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పెద్దూరు బాబాజీకాలనీ, పెద్దూరు చౌరస్తా, తారకరామానగర్, విద్యానగర్, సుభాష్నగర్, నేతన్నచౌక్, పద్మనగర్, చంద్రంపేటతోపాటు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ బస్టాండు, అమరవీరుల స్తూపం, తెలంగాణచౌక్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పెన్షన్లను పెంచలేదు, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, రైతుబంధు ఇవ్వలేదు, కల్యాణలక్ష్మీలో తులం బంగారం ఇవ్వలేదు, కేసీఆర్ కిట్టు లేదన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందే ఉందన్నారు. మానేరు వాగులోకి సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ, వ్యవసాయ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అపెరల్ పార్క్.. కేసీఆర్ నిధులిస్తే.. నేను మంత్రిగా చేశానని గుర్తు చేశారు. నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీరలు నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు తగ్గించాలనే లక్ష్యంతో రూ.3,400కోట్లతో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెస్ ఆ పథకాన్ని రద్దు చేసిందన్నారు. చెయ్యి గుర్తును గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు వస్త్రోత్పత్తిదారులను బెదిరిస్తున్నారన్నారు. బిడ్డా.. ఇది కేటీఆర్ అడ్డా.. బిల్లులు ఇవ్వము.. ఆర్డర్లు ఇవ్వమంటే గల్లా పట్టి నిలదీస్తామన్నారు. సిరిసిల్ల గులాబీ కంచుకోట అని మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేసి మరోసారి నిరూపించాలని కోరారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉండి బండి సంజయ్ సిరిసిల్లకు, రాజన్నకు ఒక్కపైసానైనా తెచ్చాడా అని కేటీఆర్ నిలదీశారు. గుడి ముందు బిచ్చగాళ్లలాగా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మీ దయతోనే మంత్రిని అయిన.. సీఎం కేసీఆర్ చొరవతో జిల్లాను సాధించుకున్నామని.. ఇప్పటికే చాలా పనులు చేసుకున్నాం.. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి.. అవి చేయించే బాధ్యత తనదేనన్నారు. దండం పెట్టి చెబుతున్నా.. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, తుల ఉమా, చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే..మోసానికి వేసినట్లే కాంగ్రెస్కు ఓటువేస్తే మోసానికి వేసినట్లేనని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. విలీన గ్రామాలను పట్టణంలో కలిపితే అభివృద్ధి చెందుతాయనుకున్నామే తప్ప మరే ఉద్దేశం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చుకుందామన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఓటు ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. -
ఆకట్టుకున్న సృజన టెక్ ఫెస్ట్
వేములవాడఅర్బన్: అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాలిటెక్నిక్ సృజన టెక్ ఫెస్ట్–2026 నిర్వహించారు. కోరుట్ల, అగ్రహారం కళాశాలల విద్యార్థులు మోకానికల్, టెక్స్టైల్ విభాగంలో తయారు చేసిన ప్రాజెక్ట్లు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ ప్రభాకరా చారి, అధ్యాపకులు శంకరయ్య, శరణ్య, అంజలి, కనకయ్య పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ఎండీ.షఫీయొద్దీన్ అధికారులు, సర్పంచులకు సూచించారు. వీర్నపల్లిలోని రైతువేదికలో శుక్రవారం సమావేశమయ్యారు. ఎంపీడీవో శ్రీలేఖ, అధికారులు సుమలత, అన్వర్, భీరయ్య, పావని, రాము, అనిల్, కార్తికేయ పాల్గొన్నారు. సిరిసిల్ల ఎడ్యుకేషన్: హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్గౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హేతుబద్ధీకరణ కోసం తెచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. వికృతి లక్ష్మీనారాయణ, బండారి మల్లేశం, పులి రాంగోపాల్గౌడ్, ఇటికాల సుధాకర్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: తమ సామాజిక వర్గంపై సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆలిండియా వెలమ అసోసియేషన్(ఐవా) ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాస్రావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. త్వరలోనే వెలమ సమరభేరి ద్వారా తమ నిరసనను వినిపిస్తామన్నారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. నాయకులు సరీన్గాంధీరావు, మోచినేని శ్రీనివాస్రావు, రోకండ్ల వెంకటేశ్వర్రావు, వంశీకృష్ణారావు, కలకుంట్ల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మోడల్స్కూల్ విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివి అత్యున్నత ఫలితాలు సాధించాలని బీటీఆర్ ఫౌండేషన్ అధినేత బెద్రం తిరుపతిరెడ్డి కోరారు. మండలంలోని రహీంఖాన్పేట మోడల్స్కూల్ విద్యార్థులు 94 మందికి ‘సాక్షి’ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ను శుక్రవారం పంపిణీ చేశారు. సాక్షి స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగాధర్, రహీంఖాన్పేట ఉపసర్పంచ్ గడ్డమీది పద్మ, శ్రీకాంత్గౌడ్, ప్రసన్నకుమార్, అనిల్కుమార్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: కుక్కల సంఖ్య పెరగకుండా చికిత్స చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా తెలిపారు. ఏనిమల్ బర్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతున్న కుక్కలను శుక్రవారం ఏబీసీ సెంటర్కు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధికుక్కలను గుర్తించి అవసరమైన చికిత్స చేసిన అనంతరం తిరిగి వదిలేస్తున్నట్లు తెలిపారు. -
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్లోనే..
రామగుండం: రామగుండం నగరంలోని 30వ డివిజన్పైనే అందరి దృష్టి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ డివిజన్లో ముగ్గురు ముఖ్యులు అయోధ్యనగర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి కాగా, ఇటీవల అంతర్గాం మండల పరిధిలోకి తన ఓటును బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. కాగా దీని పక్కనున్న 28వ డివిజన్ అబాది రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పీసీసీ ప్రోటోకాల్ చైర్మన్, ఏఐసీసీ ప్రతినిధి హర్కర వేణుగోపాల్రావు ఓటరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 30వ డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ముగ్గురు ముఖ్యుల ఆధిపత్యాన్ని స్పష్టం చేయనుందనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కోలేటి దామోదర్కౌశికహరివేణుగోపాల్రావుమక్కాన్సింగ్ రామగుండంలో సర్వత్రా ఆసక్తికర చర్చ -
ఇంటికొస్తున్నామని.. అంతలోనే దూరమై
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి ● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని దుర్మరణం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరామని ఫోన్లో చెప్పిన ఇద్దరు యువకులు.. అంతలోనే ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి– తారుపల్లి గ్రామాల మధ్యలో క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓదెల మండల పొత్కపల్లికి చెందిన పచ్చిక నాగఫణీందర్రెడ్డి(28) పెద్దరాతుపల్లిలో సోలార్ ప్లాంట్లో టెక్నీషియన్గా పని చేస్తుండగా, పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం సురేశ్(27)వ్యవసాయం చేస్తాడు. ఫణీందర్రెడ్డి విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా, సురేశ్ కాల్వశ్రీరాంపూర్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తూ ఇద్దరూ ఎదురెదురుగా ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కాగా సురేశ్కు వివాహం జరిగి ఏడాది కూడా దాటలేదు. ఫణీందర్రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇద్దరు యువకుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు
● అర్ధంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టాం ● మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ● ‘సాక్షి’తో రామగుండం బల్దియా మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కోల్సిటీ(రామగుండం): రామగుండం మొదటి మున్సిపల్ చైర్మన్గా పలు అభివృద్ధి పనులు, సంస్కరణలు చేపట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సోమారపు సత్యనారాయణ. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా పని చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గెస్ట్ ఫాకల్టీగా ఐఏఎస్ హోదా కలిగిన అధికారులకు పాఠాలు బోధించగల విజ్ఞానం ఆయన సొంతం. ఇంజినీరింగ్తోపాటు ఎంబీఏ చదివిన ఆయన తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్మెంట్ నైపుణ్యంతో చేపట్టిన పనులు మున్సిపల్ చైర్మన్ పదవికే వన్నె తెచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సత్యనారాయణను మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించగా నాటి అనుభవాలు, విశేషాలను ఇలా పంచుకున్నారు. సోమారపు సత్యనారాయణ రామగుండం మొదటి చైర్మన్గా ఎన్నికైనప్పు డు ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం? పాలకవర్గం లేకపోవడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్న కాలంలో చైర్మన్గా ఎన్నికయ్యాను. సింగరేణి నీటి సరఫరా తప్ప మున్సిపల్ నీళ్లు లేవు. అక్కడక్కడా ఉన్న బోర్వెల్ నీరే ఆధారం. డ్రైనేజీ వ్యవస్థ, సరైన రోడ్లు కూడా లేవు. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు ఇంటి పన్ను లేకపోవడంతో నిధులు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లారు..? ముందుగా నిధుల కొరత అధిగమించే ప్రయత్నం చేశాను. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు నంబర్లు ఇచ్చి నామమాత్రపు పన్ను విధించాం. దగ్గరున్న బ్యాంకుల్లో కట్టుకోవడానికి వీలుగా చలానాలు పంపిణీ చేశాం. ఆ రశీదుల కారణంగానే తర్వాత కాలంలో వారికి సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులు పొందడానికి రామగుండంకు అర్హత ఉండగా, నాటి సీఎంను ఒప్పించి ముందుగానే నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపట్టాం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? తాగునీటి సరఫరాపై ముందు దృష్టిపెట్టాను. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా అర్ధాంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టి, హెడ్ వర్క్స్, ట్యాంకులు నిర్మించడంతో మున్సిపల్ నీటి సరఫరా ప్రారంభమైంది. ఆ తర్వాత 24 గంటల నీటి సరఫరా చేసి దేశం దృష్టిని ఆకర్షించేలా చేయగలిగాను. ఆ తర్వాత దేనిపై దృష్టి పెట్టారు? పారిశుధ్యం దృష్టి పెట్టాను. శానిటేషన్తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దేశంలోనే మొదటిసారిగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరిగింది. చెత్త ఏరుకొని జీవించే వారిని గుర్తించి, వారికి పరుగు పందెం నిర్వహించి శారీరక సామథ్యం ఉన్నవారికి ఉచితంగా రిక్షాలు ఇచ్చి ఇంటింటా చెత్త సేకరించడం జరిగింది. అలాగే ఎడ్ల బండ్లతో చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆటోలు ఇచ్చాం. స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించాం. వాటికి మున్సిపల్ నుంచి అద్దె చెల్లించడం ద్వారా ఒకపక్క ఉపాధి పొందడంతోపాటు మరో పక్క రుణం తీరిపోయి, వారే ఆ వాహనాలకు యజమానులయ్యారు. రోడ్లు, కాలువలను ఎలా అభివృద్ధి చేశారు? మున్సిపాలిటీలో నిధుల్లేవు, పబ్లిక్, ప్రయివేట్ పార్టీసిపేషన్ అంటే నగరపాలక సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో 80: 20 ప్రాతిపదికన ఎవరూ ముందుకొస్తే అక్కడ రోడ్లు, కాలువలు నిర్మించాం. నా చొరవతో నాటి ముఖ్యమంత్రి డీఎఫ్ఐడీ నిధులు రామగుండంకు మంజూరు చేయడంతో రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం దొరికింది. వినూత్నంగా ఆలోచించి చేపట్టిన పనులేవి? పట్టణానికి తగినట్టుగా దేశంలోనే మొదటిసారిగా బేబీ డ్రెయిన్లతో కాలువల నిర్మాణం చేపట్టాం. డ్రై వెదర్ డ్రెయిన్, ఫెర్రో సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణం నా హయాంలో చేపట్టడం జరిగింది. అత్యంత మన్నికతో వేసిన సీసీ రోడ్లు కొన్ని చోట్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీటర్లు ఏర్పాటు చేసి వాడిన నీటికే బిల్లు తీసుకున్నాం. జనన, మరణ ధ్రు వీకరణ పత్రాలు కొరియర్ ద్వారా ఇంటికే పంపాం. పైరవీలకు తావు లేకుండా జరిగింది. కొత్త వెలుగు కోసం ఏం చర్యలు తీసుకున్నారు? చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఇక్కడ సరైన వసతులు లేవని ఇతర ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్తున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేలా మున్సిపల్ కార్యాలయ భవనం, వినూత్న డిజైన్తో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మించాను. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ భవనానికి నిధులు మంజూరు చేయించి పునాది వేశాను. తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఇంటి ముందుకే చెత్త బండి రావడం తదితర సౌకర్యాలు సమకూరడంతో ఇళ్ల నిర్మాణం పెరిగింది. స్వశక్తి మహిళలకు సీఆర్సీ భవనం నిర్మించి, వారితో సూపర్ మార్కెట్లు పెట్టించాం. నేపాల్ నుంచి నిపుణులను రప్పించి టోపీలు కుట్టించే శిక్షణ ఇప్పించాను. మలుపు అనే పథకం ద్వారా వందల మందికి చెప్పులు కుట్టే శిక్షణ ఇప్పించాను. ఇలా అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను. మీ పనులు ప్రభావితం చేశాయా? చేశాయి. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది స్టడీ టూర్లో భాగంగా రామగుండం సందర్శించారు. మున్సిపల్ విద్యుత్ బిల్లుల్లో రామగుండంకు రూ.25లక్షలు నేను రికవరీ చేసిన విధానం నచ్చి, అలాగే చేయాలని అన్ని మున్సిపాలిటీలకు నాటి ముఖ్యమంత్రి సర్క్యులర్ జారీ చేయించారు. రాగ్పిక్కర్ విధానం, 24 గంటల నీటి సరఫరా తీరును అనేక మంది పరిశీలించి వెళ్లారు. చైర్మన్గా గొప్పగా భావించేది ఏది? మురికివాడలను అభివృద్ధి చేయడం అన్నింటి కంటే ఎక్కువగా చెప్పుకోతగ్గది. నాడు రామగుండంలో 45 నోటిఫైడ్ 47 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉండేవి. నేను చేపట్టిన పనులతో అవి ఇప్పుడు స్లమ్స్లా కనబడతలేవు. గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అవార్డులకు ఎప్పుడూ నామినేషన్ వేయలేదు. కానీ, చేంజ్ మేనేజ్మెంట్ ఫోరంలో దేశంలో కేవలం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేయగా, అందులో నేను ఒక్కడిని కావడం నాకు ఇచ్చిన పెద్ద గుర్తింపుగా భావిస్తున్న. ఏమైనా సలహాలు ఇస్తారా? ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం పని చేసుకుంటూ పోతారు. -
జనరలైనా.. తగ్గేదే లే..
● ఆసక్తికరంగా 63వ డివిజన్ పోరు కరీంనగర్ కార్పొరేషన్: మహిళా రిజర్వేషన్కే ఆ నాయకురాళ్లు పరిమితం కాలేదు. జనరల్ అంటే పురుషులకు కేటాయించినట్లు కాదంటూ, తాము బరిలోకి దిగి ఆ మహిళలు పోరుకు సై అన్నారు. నగరంలోని 63వ డివిజన్ పోరు ఆసక్తికరంగా మారింది. డివిజన్ రిజర్వేషన్ బీసీ జనరల్ అయినప్పటికి మూడు ప్రధాన పార్టీల నుంచి అతివలే బరిలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ గందె మాధవి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ కర్రె పావని, బీజేపీ నుంచి దేశ శిల్ప పోటీపడుతున్నారు. డివిజన్ నుంచి మొత్తం నలుగురు పోటీలో ఉండగా.. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీసీ ఉద్యమ నేత కేశిపెద్ది శ్రీధర్రాజు బరిలో నిలిచారు. -
రూ.200 పుచ్చుకో... జెండా పట్టుకో !
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ, పొలిమేర గ్రామాల్లోని మహిళలకు ఉపాధి పుష్కలంగా లభిస్తుంది. నామినేషన్లపర్వం ముగిసిపోయి బుధవారం నుంచి ప్రచారం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక మహిళలతోపాటు పొరుగున్న ఉన్న పల్లెల నుంచి రూ.200 చొప్పున కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తెచ్చుకుంటున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థులు వెనుక ఉంటూ.. ‘.. మన అన్నకే ఓటేయాలి’, ‘అన్న గెలుపుతోనే వార్డు అభివృద్ధి’ అంటూ నినాదాలు చేయా లి. వీరు వచ్చిపోయేందుకు ఆటోలు పెడుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి అభ్యర్థి ఇంటి వద్ద లేదా తన వార్డు ఆఫీస్ వద్ద భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు ఖర్చు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
మెట్పల్లిరూరల్: విద్యుత్షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన సబ్బని గణేశ్ రైతు. పంటకు అడవి పందుల బెడద ఉందని బుధవారం రాత్రి సమయంలో పొలం వద్దకు కాపలా కోసమని అదే గ్రామానికి చెందిన వినోద్, సురేశ్ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ ప్రాంతంలో చీకటి ఉందని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ లైట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో విద్యుత్ షాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంట ఉన్న వినోద్, సురేశ్ మెట్పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ప్రమాదమని తెలిసినా.. గణేశ్కు సహకరించిన వినోద్, సురేశ్పై మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 12 రోజుల్లో ఇద్దరి మృతిరుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విషజ్వరాలు ప్రబలు తున్నాయి. 12 రోజుల్లో ఇద్దరు విషజ్వరంతో మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషజ్వరం, రక్తకణాలు తగ్గిపోయి బోయిని రాములు అనే వ్యక్తి జనవరి 25న మృతిచెందగా విషజ్వరం, రక్తకణాలు పడిపోయి, జాండీస్తో కట్కూరి సంజీవ్(48) గురువారం మృతిచెందారు. ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షలు చేసి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంజీవ్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సంజీవ్కు తల్లి లక్ష్మి, భార్య మంజూల, కొడుకులు వంశీ(25), సన్ని(19), శ్రావణ్(16) ఉన్నారు. గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ శివారు గోదావరినదిలో గురువారం గుర్తుతెలియని లభించినట్లు ఎస్సై వెంకటస్వామి పేర్కొన్నారు. మృతుడికి సుమారు 40 ఏళ్ల వయసు ఉంటుందని, ఆకు పచ్చ రంగు ఫుల్ టీ షర్ట్, దానిలో తెలుపు రంగు, లేత ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్, కుడి చేతికి 3 స్టార్ టాటూస్, ఎడమ చేతికి టీ, ఎం, ఎన్ ఇంగ్లిష్ అక్షరాలను టాటూ వేయించుకున్నాడు. ఆచూకీ తెలిసినవారు 87126 56527 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. ఈనెల 2న గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కాగా రెండురోజుల వ్యవధిలో మరో మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది. బెల్ట్షాపు మూసివేతచిగురుమామిడి: మండలంలోని ఓ గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు మద్యం సేవించిన ఘటనపై తిమ్మాపూర్ సర్కిల్ ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. గురువారం పాఠశాలకు సమీపంలో ఉన్న బెల్ట్షాపును మూసివేయించారు. విచ్చలవిడిగా బెల్ట్షాపులు కొనసాగుతున్నాయని, ఒక్కటి మూసివేసినంత మాత్రాన, మిగతా వాటి పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మిగతా వాటిపైనా చర్యలు తీసుకుని, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
తహసీల్ ఆఫీస్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ గిరిజన మహిళా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. ముస్తాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సేవాలాల్తండాకు చెందిన ధరంసోత్ రాజవ్వ గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. గమనించిన స్థానికులు రాజవ్వను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రాజవ్వ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజవ్వ మాట్లాడుతూ తండాలో సర్వే నంబర్లు 79, 196లలోని భూమిలో 50 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామన్నారు. ఈ భూమిని మరొకరి పేరుపై తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే సమాచారంతో ఇక్కడికొచ్చామన్నారు. దీనిని అడ్డుకోవా లని అధికారులను కోరామన్నారు. ఆ భూమి ని ఇతరులపై రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈవిషయంపై తహసీల్దార్ రామచంద్రం మాట్లాడుతూ సదరు సర్వేనంబర్లపై వచ్చిన ఫిర్యాదు మేరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశామని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని రాజవ్వ, ఆమె కుటుంబ సభ్యులు కోరారు. -
నువ్వక్కడ.. నేనిక్కడ!
● బల్దియా బరిలో భార్యాభర్తలు కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచేందుకు భార్యభర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్వేరు డివిజన్లలో భార్యాభర్తలు పోటీచేసి గెలుపొందిన సంఘటనలు గతంలో ఉండగా, ఈ సారి నగరంలో మూడు జంటలు బల్దియా పోరులో నిలిచాయి. బీఆర్ఎస్ నుంచి 47వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ఆమె భర్త బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ 21వ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. 58వ డివిజన్ నుంచి దుడ్డెల శ్రీధర్, 57వ డివిజన్ నుంచి ఆయన భార్య దుడ్డెల మంజుల పోటీకి దిగారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వీరు, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 46వ డివిజన్ నుంచి మాజీ కౌన్సిలర్ వరాల నారాయణ, 13వ డివిజన్ నుంచి ఆయన భార్య వరాల అనసూయ స్వతంత్రులు పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికి, రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. -
మాదిగలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తరు
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్పార్టీకే ఓటు వేయాలని మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరుకాపు భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగతో కలిసి మాట్లాడారు. మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయత్వాన్ని బలపర్చాలని రామకృష్ణ కోరారు. సామాజిక న్యాయం, దళిత వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు అందే భవాని, కవ్వంపల్లి రవి, కూడెల్లి ప్రవీణ్ కుమార్, సప్పి పోశయ్య, ఎలుకంటి జనార్దన్, బొడ్డు రాములు, కృష్ణపెల్లి రాజలింగం, జంగాపల్లి రాజనర్సు, చిలుక రాజేశ్, తాటిపల్లి బాబు, గాలి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
అనాథ చిన్నారుల ఇళ్లకు అధికారులు
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల, రంగంపేట గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల దీనస్థితిపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అనాథ గువ్వలు’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఆదేశాలతో ఐసీపీఎస్ కౌన్సిలర్ భార్గవి, అంగన్వాడీ మండల సూపర్వైజర్ మమత గురువారం చిన్నారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. రంగంపేటలో అంకమల్ల అశ్విత, కంచర్లలో ఇందు, లాస్యల కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారులు వృద్ధులైన తమ నానమ్మ, అమ్మమ్మల వద్ద ఉంటున్నారని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ సాయం కోసం నివేదిక పంపిస్తామని తెలిపారు. -
తైబజార్ లేని మున్సిపాలిటీ జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉంది. ఏ మున్సిపాలిటీలోనైనా తైబజార్ వసూలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం తైబజార్ వసూలు చేయరు. కూరగాయల వ్యాపారులైనా.. తోపుడు బండ్ల వ్యాపారులైనా.. రోడ్లపై చిన్నచిన్న వస్తువులను ఎవరైనా అమ్ముకోవచ్చు. ఇలాంటి వారికి తైబజార్ లేకపోవడం ఎంతో వెలుసుబాటు కలిగిస్తోంది. పైగా వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మున్సిపాలిటీలో అప్పటి పాలకవర్గం రూ.200కే నల్లా కనెక్షన్ అమలు చేశారు. అప్పటినుంచి అదే అమలువుతోంది. ఏ మున్సిపాలిటిలోనైనా నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే కొంతమొత్తం వసూలు చేస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.200కే కనెక్షన్ ఇస్తున్నారు. రైతులు, వ్యాపారులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కొనసాగుతున్న రూ.200కే నల్లా కనెక్షన్ -
పంచిన మద్యం సీసాలు వైన్స్షాపుల్లోకి..
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఓ వార్డులో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం ముగ్గురు అభ్యర్థులు అడిగినవారికి లేదనకుండా మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ముగ్గురు ఇచ్చిన మందును ఒకేరోజూ తాగలేకపోతున్నారు. దీంతో వారు కొత్త ఐడియాకు తెరతీశారు. ఒక అభ్యర్థి ఇచ్చిన మందును ఆ రోజు తాగి.. మిగిలిన అభ్యర్థులు ఇచ్చిన మందు బాటిళ్లను వైన్స్షాపులకు తీసుకెళ్లి ఇచ్చి నగదు తీసుకుంటున్నారు. ఇలా సమకూరిన డబ్బులను తలాకొంత పంచుకుంటుండడం విశేషం. ప్రచారంలో భాగంగా వచ్చిన మద్యం బాటిళ్లను ఇచ్చి డబ్బులు తీసుకెళ్లడంతో వైన్స్షాపు నిర్వాహకులు నివ్వెరపోతున్నారు. కండువాలు మారుతున్నాయ్.. కొందరు కార్యకర్తలు ఉదయం ఒకపార్టీకి.. మధ్యాహ్నం మరోపార్టీకి.. సాయంత్రం ఇంకో పార్టీకి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎప్పడికప్పుడు కండువాలు మారుస్తూ.. పోటీలో ఉన్న అభ్యర్థులను కంగారుపెడుతున్నారు. మహిళాసంఘాల సభ్యులైతే ఎవరు ప్రచారానికి రమ్మంటే వారివెంట వెళ్తున్నారు. అభ్యర్థులు కూడా కార్నర్ మీటింగ్లకు మహిళాసంఘాల సభ్యులను తరలిస్తున్నారు. వీరికి ఆయా పార్టీల వారు రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నట్లు సమాచారం. పొద్దంతా మూడు పూటల మూడు పార్టీల ప్రచారంలో పాల్గొంటే ఎంత తక్కువనుకున్నా రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతోంది. కొంతమంది మహిళా సంఘాల ప్రతినిధులు బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి ‘మీరేమీ అనుకోవద్దు.. మేం మీకే ఓటు వేయిస్తాం..’ కేవలం డబ్బుల కోసం ఓ పూట ప్రచారానికి వెళుతున్నామని చెబుతుండడం గమనార్హం. బాటిళ్లు ఇచ్చి నగదు తీసుకుంటున్న వైనం ఒక్కోరోజు ఒక్కో అభ్యర్థి పంచిన మద్యం సేవనం మిగిలిన వారు ఇచ్చిన బాటిళ్లకు వచ్చిన డబ్బులు తలాకొంత -
ఆరుగురు బంగారం దొంగలు, వ్యాపారి అరెస్ట్
మెట్పల్లి: మెట్పల్లి ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులు.. వారు తెచ్చిన సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో మెట్పల్లి ప్రాంతంలో ఆరుచోట్ల దొంగతనాలు జరిగాయి. మెట్పల్లి శివారులో వన్నెల గంగుపై పట్టపగలే దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఇలా వరుస దొంగతనాలు జరగడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు.. నిందితుల కోసం డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్కుమార్, ఎస్సైలు కిరణ్కుమార్, అనిల్, నవీన్తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మెట్పల్లి, నిజామాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్ట నిందితులను గుర్తించారు. అప్పటినుంచి వారి కోసం గాలిస్తుండగా గురువారం మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ వద్ద పండుగ రమేశ్, పల్లెపు రమేశ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులు గుంజె గంగాధర్, గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరితోపాటు దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న వ్యాపారి ఇందూరి రాకేశ్ను అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి 15 తులాల బంగారు, 32తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతంగా చేధించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. నిందితులపై అనేక కేసులు అరెస్టయిన నిందితుల్లో నలుగురిపై గతంలో పలు స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కిరణ్పై 35, పండుగ రమేశ్పై 23, గంగాధర్పై 16, పల్లెపు రమేశ్పై 13 కేసులున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్కుమార్ -
కోతులు పోవాలి
మురికి తొలగాలి..సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలో మురికినీటి సమస్య పరిష్కారం కావాలి.. కోతుల బెడద తొలగిపోవాలి.. కుక్కలతో భయం..భయంగా బతుకుతున్నాం.. ఇక ట్రాఫిక్ సమస్య చెప్పలేనిదిగా ఉంది.. చిన్నపాటి వర్షానికి పట్టణాన్ని వరద ముంచెత్తుతోంది.. అంటూ పట్టణ ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సమస్యలపై గురువారం స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్లో డిబేట్ నిర్వహించింది. పలువురు పట్టణ పౌరులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గళం ఎత్తారు. సిరిసిల్ల పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి.. ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలపై గొంతు విప్పారు. నిజాయితీ పాలన అందించే నాయకత్వం.. పట్టణాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసే దూరదృష్టి గల నాయకులనే ఎన్నుకుంటామని చెప్పారు. సిరిసిల్ల ప్రజలు చెప్పిన ఎజెండా అంశాలు వారి మాటల్లోనే.. ట్రాఫిక్ సమస్య తీరాలి నిజాయితీ పాలన రావాలి ఇది సిరిసిల్ల ప్రజల ఎజెండా ‘సాక్షి’ డిబేట్లో పట్టణ పౌరులు -
కాంగ్రెస్ జెండా ఎగరాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/చొప్పదండి: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది. పట్టం కట్టి.. పనులు చేయించుకోండి అనంతరం వేదిక మీదకు వచ్చిన సీఎం రేవంత్ బీజేపీ–బీఆర్ఎస్ల బంధంపై నిప్పులు చెరిగా రు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778కోట్లు ఇచ్చామన్నా రు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్కు రూ.1,489కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరించాలని సీఎంను కోరారు. రోడ్డు విస్తరించి, యంగ్ ఇండియా స్కూల్ ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల సమస్యలు ఇచ్చారని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడు తూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనల్ని చూసి కేంద్రం కూడా కులగణనకు తలవంచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే పట్టం కట్టాలని కోరారు. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్ ఫ్రంట్, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోర డం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో 8 సీట్లలో గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టా లని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కల్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజలకు మధ్యకు వస్తోందన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడు తూ.. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మా ట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో చొ ప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. రూ.240కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాలకు నిధులతోపాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు టీటీడీ రూ.35కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, విజ యరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
సమన్వయం అవసరం
రోడ్ల వెంట చెట్ల విషయంలో సెస్, మున్సిపల్ అధికారుల్లో సమన్వయం లోపించింది. చెట్లు పెరిగి విద్యుత్ తీగలను తాకుతున్నాయి. వాటిని ముట్టుకుంటే షాక్ వస్తుందని తొలగిస్తే.. అధికారులు ఇబ్బందులు పెడుతుండ్రు. ఇరు శాఖల అఽధికారులు చెట్లు విషయంలో బాధ్యతగా ఉండాలి. – కముటాల రాఘవేందర్ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం నూరుశాతం కొనసాగించాలి. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులు వాడి డ్రైనేజీల్లో పడేస్తున్నారు. దీంతో డ్రైనేజీల్లో నీరు ప్రవాహం లేక మురుగు రోడ్లపై పారుతుంది. శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. పట్టణంలో గ్రీనరీని పెంచాలి. కొత్త పాలకవర్గం నిజాయితీ తో అభివృద్ధి చేపట్టాలి. – గుండెల్లి రవీందర్ సిరిసిల్లలోని ప్రధాన డ్రైనేనీ నీరు పాతబస్టాండు ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడి ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంతో వర్షాకాలంలో కాలనీలు, వ్యాపారం సంస్థలు మునిగిపోతున్నాయి. పట్టణం మొత్తంగా అన్ని వార్డుల్లో నూరుశాతం వసతులు కల్పించాలి. ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. – నంగునూరి శ్రీకాంత్ పట్టణం అభివృద్ధి పథంలో ముందుండాలంటే సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవాలి. ఒక్క రోజు జరిగే లబ్ధికి చూసుకోవద్దు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండే వారినే ఎన్నుకోవాలి. మంచినీటి సరఫరాలో సమస్య తీర్చాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. – గెంట్యాల గోపి -
నిబంధనల మేరకు పనిచేయాలి
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్సిరిసిల్ల: నియమావళికి అనుగుణంగా అధికా రులు విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సూచించా రు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ స్కూల్లో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం గీతానగర్ హైస్కూల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓటర్లు 18 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తర్వాత సామగ్రిని జిల్లా సినారె కళామందిర్లోని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించాలని తెలిపారు. వసతులు కల్పించాలి పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య హైస్కూల్లోని కేంద్రాలను పరిశీలించారు. దివ్యాంగులకు ర్యాంప్, పోలింగ్ అధికారులు, సిబ్బందికి తాగునీరు, టాయిలెట్స్ వసతి కల్పించాలని ఆదేశించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై మార్గదర్శనం చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20267హుండీ ఆదాయం రూ.1.72కోట్లువేములవాడ: భీమన్నకు హుండీల ద్వారా రూ.1,72,76,469 నగదు, బంగారం 75 గ్రాములు, వెండి 6.800 కిలోలు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. సిరిసిల్ల: ప్రభుత్వ విద్యాసంస్థల్లోని 14ఏళ్ల లోపు పిల్లలకు వైద్యపరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబు సూచించారు. లోపాలు గుర్తించి, వైద్యశాలకు పంపించాలన్నారు.వాతావరణం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి. -
అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. సిరిసిల్ల మున్సి పల్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును గురువారం తని ఖీ చేశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్ప టి నుంచి ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలి పారు. రూ.26.70 లక్షల నగదు, 85.695 లీట ర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. 127 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు. సిరిసిల్లక్రైం: ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అధికంగా సొమ్ము తీసుకెళ్తున్న వారిపై పోలీ సుల నిఘా తీవ్రమైంది. దీనిలో భాగంగా గు రువారం జిల్లాలో పోలీసులు చేపట్టిన తని ఖీల్లో రూ.4లక్షల నగదు పట్టుబడింది. సిద్దిపే ట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన పురుమడ్ల వెంకట్రెడ్డి తన కారులో వస్తున్నా డు. ఈక్రమంలో సిరిసిల్ల శివారులోని మానేరు బ్రిడ్జి చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీ లు చేపట్టారు. తనిఖీల్లో ఎస్ఎస్ఈ టీమ్ ఇన్చార్జి శ్రీకాంత్ పంచుల సమక్షంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. గురువారం ఎల్ఎండీకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా 150 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్మానేరులో నీటిమట్టం 24.755 టీఎంసీలకు చేరింది. గంభీరావుపేట(సిరిసిల్ల): వేసవి సమీపిస్తుండడంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి షర్ఫొద్దీన్ సూచించారు. గంభీరావుపేట మండల పరిషత్లో గురువారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటికొరత ఉన్న గ్రామాలను, కాలనీలను గుర్తించాలన్నారు. ఎంపీడీవో రాజేందర్, అధికారులు సుమలత, రాము, పావని, జయసుధ, ఎంపీవో సుధాకర్, ప్రేమ్చందర్, వేణు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీలో ఓటర్ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ఎ.ఏ.ఖదీర్పాషా తెలిపారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మున్సిపల్ ఆఫీస్లో ఓటర్ సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు పట్టణంలోని లాడ్జీలు, సత్రాల ధరలు పెంచొద్దని ము న్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ ప్రకటనలో కోరారు. లాడ్జ్ ధరలు పెంచి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాశివరాత్రికి రూ.1.96 కోట్లతో పనులువేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు రూ.1.96కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఈవో రమాదేవి గురువారం తెలిపారు. ఉప ఆలయాలు, ఆర్చిగేట్లకు రంగులు, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, తాత్కాలిక క్యూలైన్లు, స్నానాల కోసం షవర్లు, పార్కింగ్ ఏరియాలో టాయిలెట్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అద్దె ప్రాతిపదిక నీటిట్యాంకర్లు, ఇనుప బారీకేడ్లు, భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు, సీసీ కెమెరాల బిగింపు, మినీబస్సుల అలంకరణ, నాంపల్లి ఆలయం వద్ద తాత్కాలిక లైట్లు తదితర పనులు చేయనున్నట్లు తెలిపారు. -
నేతన్నల పొట్టకొట్టిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
సిరిసిల్ల: నేతన్నల పొట్టకొట్టిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు కోరారు. సిరిసిల్లలో గురువారం కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ నేతన్నలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు రూ.3400 కోట్లతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పద్మశాలీ భవన్కు ఐదెకరాల భూమిని కేటాయించి రూ.5కోట్లు ఇస్తే.. కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వకుండా.. పనిని మధ్యలో ఆపేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. రెండేళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. జిల్లాను రద్దు చేస్తారట నాపై కోపంతో రేవంత్రెడ్డి జిల్లాను రద్దు చేస్తారట అని కేటీఆర్ అన్నారు. జిల్లాను రద్దు చేసే వాళ్లకు ఓట్లు వేద్దామా.. అని అడిగారు. సిరిసిల్లలో కొంతమేరకు అభివృద్ధి చేశానని, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న పెన్షన్లు, ఇళ్లు, రోడ్లు, మురికికాల్వలు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల ఇన్చార్జి తుల ఉమ, కొండూరి రవీందర్రావు, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, శరత్రావు, అక్కరాజు శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ మాటలతో మోసపోకండి సిరిసిల్లఅర్బన్: కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ కోరారు. జ్యోతినగర్, 11, 24వ వార్డుల్లో పర్యటించారు. కేటీఆర్ మాట్లాడుతూ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేశారన్నారు. జ్యోతినగర్ను దత్తత తీసుకొని వసతుల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే మరోసారి మోసపోయినట్లే..
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మరోసారి మోసపోయినట్లేనని, ఆరు గ్యారంటీల పేరిట 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి రెండేళ్లలో ఒక్క హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం చెబుతున్నారని, కానీ ఇప్పటికి ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలని అన్నారు. రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో వేయడానికి మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయేంత వరకుఆశ చూపించి, మరోసారి మోసం చేయడానికే రేవంత్రెడ్డి ఈ మాట చెబుతున్నారని ఆరోపించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ హించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.. కేసీఆర్ను తిట్టడం దేనికి? ‘ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్న ప్పుడు చేతనైతే ప్రజలకు మంచి చేయాలి..ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ గత సీఎం కేసీఆర్ను తిట్టవలసిన అవసరం ఏముంది? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడడం, అబద్ధాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటేయాలి. గత పదేళ్లపాటు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచి్చన పార్టీకి, రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి’అని కేటీఆర్ చెప్పారు. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మీ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఒక్కరికైనా రేవంత్రెడ్డి తులం బంగారం ఇచ్చారా? (బంగారం కొనలేదని, నా భార్య నన్ను తిడుతోందంటూ కేటీఆర్ నవ్వులు పూయించారు) నేతన్నల బతుకులను బజారున పడేశారు.బతుకమ్మ చీరలతో ఉపాధి పొందిన కార్మికులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. 12 ఏళ్లలో ఏమీ చేయలేని బీజేపీ నేతలు గుడిముందు బిచ్చగాళ్లలాగా.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు’అని కేటీఆర్ అన్నారు. ప్రచారంలో భాగంగా సిరిసిల్లలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. చిన్నారిని బుజ్జగిస్తూ, ఆడిస్తూ.. సిరిసిల్లలో ఒకటో వార్డు జ్యోతినగర్లో నిర్వహించిన భేటీలో ఓ మహిళ వద్ద ఉన్న చిన్నారిని కేటీఆర్ తీసుకుని బుజ్జగించి, ఆడించారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయితే సూపర్.. ఇదే జనం మాట: కేటీఆర్
సాక్షి,రాజన్న: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రెండేళ్లలో అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నిస్తే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అంటున్నారు. ఉచిత ప్రయాణం అంటే స్త్రీలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు రెట్టింపు చార్జీ వసూలు చేయడమేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యతల్ని బుజాన వేసుకున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గురువారం కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ ఒకటవ వార్డు జ్యోతి నగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు. పెంచలేదు. ఎన్నికల తరువాత రైతుబంధు అంటున్నారు. రైతు బంద్కి ఎన్నికలకు ఏం సంబంధం..? ఫ్రీ స్కూటి ఇస్తానని, ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు. నాపై కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట.మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అంటున్నారు. జ్యోతినగర్ అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. కేసీఆర్ కిట్ తీసివేశారు, కేసీఆర్ పేరు ఉందని తీసేస్తారా..? అవసరమైతే ఇందిరమ్మ కిట్ అని పేరుపెట్టి, కొనసాగించాలి.కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, ఉన్న పథకాలు తీసేశారు.ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపించండి, జ్యోతినగర్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పే అవకాశం ఇదే’అని వ్యాఖ్యానించారు. -
యూరియా ఏదయా
● అవసరాన అన్నదాతకు ఇదేం అవస్థ ● యాప్లో జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వ సున్నా ● ఏవోల నిర్లక్ష్యం.. పడకేసిన పర్యవేక్షణకరీంనగర్ అర్బన్: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. యూరియా అక్రమ రవాణాకు చెక్ పెడుతూ ప్రభుత్వం యాప్ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1నుంచి సదరు విధానం అమలవుతుండగా తదనుగుణ పర్యవేక్షణ లేమి రైతులకు గుదిబండగా మారింది. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని చెబుతున్నా వ్యవసాయ శాఖ అసలు యూరియా నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత అవసరమనే కోణంలో ప్రణాళిక లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అత్యవసర వేళ ఇదేం కొరత యాసంగి సీజన్కు గానూ జిల్లాలో 2,59,065 ఎకరాల్లో వరి సాగవగా, 29,396 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అన్ని పంటలు కలిపి 2,89,017 ఎకరాలు సాగులో ఉంది. ఈ సమయంలో వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ రైతులు మాత్రం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరగడం, పడిగాపులు కాయడం ఆందోళనకర పరిణామం. ఆయా పంటలకు మూడు దశల్లో అంటే విడతల వారీగా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఎకరానికి ఒక బస్తా మాత్రమే బుక్ కానుంది. జిల్లావ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రంతో పాటు 16 మండలాలుండగా ఎక్కడా కూడా యూరియా బస్తా ఒక్కటి లేదని యాప్ స్పష్టం చేస్తోంది. అవసరమైన సమయంలో యూరియా వేస్తేనే పంటకు బలం కాగా దిగుబడి రానుంది. ఎన్నికల విధుల్లో ఏవోలు.. ఇండెంట్ పెట్టేదెవరు వాస్తవానికి యూరియా నిల్వలను అనుసరించి ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టడం మండల వ్యవసాయ అధికారుల విధి. జిల్లాలో మాత్రం ఏ ఒక్క ఏవో కూడ తదనుగుణంగా విధులు నిర్వహించడం లేదనడానికి యాపే తార్కాణం. పలువురు ఏవోలు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తుండగా విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు పుష్కలం. మున్సిపల్ ఎన్నికల్లో విధులు కేటాయించగా యూరియా నిల్వలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు షరామామూలే. యూరియా పక్కదారి? యూరియా పక్కదారి పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ సర్వే నంబర్లో ఏ పంట సాగు చేశారనేది యాప్లో నమోదు కాలేదు. క్రాప్ బుకింగ్ వివరాలు నమోదుకాకపోవడంతో అక్రమార్కులు సాగులో లేని భూముల వివరాలతో యూరియా బుక్ చేస్తూ వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది. సాగులో లేని భూములు వేల ఎకరాలుండగా భవనాలు, రోడ్లు, ప్లాట్లు, దేవాలయాలు ఇతర నిర్మాణాలు ఉన్నా భూములూ ఉండగా యాప్పై అవగాహన ఉన్న అక్రమార్కులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
మహాజాతరను విజయవంతం చేయాలి
● జాతర ఏర్పాట్లపై సమీక్ష వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. జాతర మహోత్సవాలపై ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ రుత్విక్సాయి, ఈఈ రాజేశ్ బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. -
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మద్యం తాగొద్దని తల్లి హితవు చెప్పినా వినకుండా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీ రాజీవ్ నగర్ తండాకు చెందిన గుగులోతు రవి నాయక్(28) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రవినాయక్ తండ్రి అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లితో కలిసి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతున్నాడు. అయితే, మద్యం తాగద్దని తల్లి చేప్పినా వినలేదు. మద్యం తాగినప్పుడు మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించేవాడు. ఈక్రమంలో ఈనెల 3న మద్యం తాగివచ్చి తల్లితో గొడవపడ్డాడు. ఆ తర్వాత తల్లి తనకూతురు ఇంటికి వెళ్లగా.. మనస్తాపం చెందిన రవినాయక్ ఇంట్లోని ఇనుపరాడ్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ● కల్వచర్లలో యువకుడి ఆత్మహత్య రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ పరిధి గోకుల్నగర్కు చెందిన బాదం రవికిరణ్(21) గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. రవికిరణ్ కొద్దిరోజులుగా ఉపాధి లేదని బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపం చెంది మంగళవారం గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్కు ఆ తర్వాత హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన శనిగారపు బుచ్చిరాజు (60) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డినట్లు పోలీసులు తెలి పారు. వారి కథనం ప్రకారం.. బుచ్చిరాజుకు కొన్నాళ్లుగా మతిస్థిమితం సరిగా ఉడడం లేదు. కుటుంబసభ్యులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుచ్చిరాజు భర్త లింగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కోదండ రామాలయంలో చోరీజగిత్యాలరూరల్: జగిత్యాల శివారు ధరూర్ క్యాంప్లో.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీకోదండరామాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగే పురోహితులు గుడికి తాళం వేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాతోపాటు, దేవతలపై ఉన్న పావుకిలో వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ పూజారి జగన్మోహనాచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
జల్సాల కోసం దొంగతనాలు
పాలకుర్తి(రామగుండం): జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడు. బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో ఇటీవల జరిగిన చోరీకేసులో అరెస్ట్ చేయడంతో నిందితుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ బసంత్నగర్ ఠాణాలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ రాంనగర్లో నివాసం ఉండే సాయి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఇనుపరాడు సాయంతో తాళాలు పగులగొట్టడంలో నేర్పరి. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు చేస్తున్నాడు. పదేళ్లలో పలు చోరీలు చేయగా 13కుపైగా కేసులు నమోదయ్యాయి. గతనెల 28న రాత్రి బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో వెండి కిరీటాలు, వెండి హస్తాలు, వెండి కళ్లు, నామాలతో కూడిన సీతమ్మ పుస్తెలు చోరీకి గురయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీధర్.. క్లూస్టీం సాయంతో వేలిముద్రలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. పాత నేరస్తుడు సాయిపై నిఘా ఉంచారు. తాను చోరీచేసిన వస్తువులు విక్రయించేందుకు వెళ్తున్నాడనే పక్కా సమాచారంతో ధర్మారం క్రాస్రోడ్డు వద్ద నిఘావేసి అదుపులోకి తీసుకున్నారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం రిమాండ్కు తరలించనున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీధర్తోపాటు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శరత్, క్లూస్టీం కానిస్టేబుల్ రాజేశ్ను ఏసీపీ అభినందించారు. నగదు పారితోషికం అందజేశారు. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు నిందితుడిని అరెస్ట్ చేసిన బసంత్నగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ -
నా కొడుకును స్వగ్రామానికి రప్పించండి
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధి కోసం సౌదీఅరేబియాకు వెళ్లి ఏజెంట్ మోసంతో అక్కడి జైలులో మగ్గుతున్న తన కొడుకు కమటం వెంకటేశంను విడిపించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లికి చెందిన కాంతవ్వ ఎస్పీ మహేశ్ బీ గీతేను కోరింది. బూర్గుపల్లికి చెందిన వెంకటేశ్కు ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ నమ్మబలికి సౌదీఅరేబియాకు పంపాడని తెలిపింది. పక్కా పని చూపకుండా రహస్యంగా చేసే పని చూపడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేశారని కాంతవ్వ వాపోయింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్తోపాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందించినట్లు తెలిపింది. ఈక్రమంలో బక్కి వెంకటయ్య రాసిన లేఖను ఎస్పీకి అందచేశామంది. ఏజెంట్ శేఖర్తోపాటు అతనికి సహకరిస్తున్న పెద్ద మనుషులపై చర్యలు తీసుకోవాలని కాంతవ్వ కోరింది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తడగొండ సత్యరాజ్వర్మ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు తడగొండ నర్సింగ్బాబు ఉన్నారు. -
చిన్నారి ప్రాణాలతో చెలగాటం
● ఊపిరాడకుండ గుడ్డపేగులో చుట్టి యాచన ● వేములవాడలో పట్టుకున్న అధికారులు ● పోలీసులకు ఫిర్యాదు వేములవాడ: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో మూడు నెలల పసికందును గుడ్డలో చుట్టి భక్తుల వద్ద డబ్బులు యాచిస్తున్న ఓ మహిళను వేములవాడలో అధికారులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత వృద్ధులను సంక్షేమ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళ తన భుజాన ఓ గుడ్డను వేసుకొని యాచిస్తుండడం గమనించారు. ఆమె వద్దకు వెళ్లి చూడగా ఆ గడ్డులో చిన్నారి ఉండడంతో అవాక్కయ్యారు. వేములవాడ శివారులోని తిప్పాపూర్ ఎల్ల మ్మగుడి వద్ద గుడారాలు వేసుకొని ఉన్న సారవ్వ అనే మహిళ మూడు నెలల క్రితం ఆడ కూతురికి జన్మనిచ్చింది. ఆ మూడు నెలల పాపను పట్టుకొని రాజన్న ఆలయ పరిసరాల్లో భక్తుల వద్ద యాచిస్తోంది. గుడ్డ పేగులో పసిపాపను చుట్టి యాచిస్తున్న తీరు గమనించిన అధికారులు ఆమెను విచారించారు. మూడు నెలల పాపను ఊపిరి ఆడకుండా గుడ్డలో చుట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఇలాంటి వారు అనేక మంది అడుక్కోవడమే వృత్తిగా బతుకుతున్నారు. ఇప్పటికే చాలా మందిలో మార్పు తీసుకొచ్చిన అధికారులకు వీరిలో మార్పు తీసుకురావడం సాధ్యం కావడం లేదు. గుడికి కాపలా..ఇల్లంతకుంట: అవును మీరు చదివింది నిజమే. ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ముది రాజ్ కులస్తులు తమ కులదైవం పెద్దమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి కాపలా కాశారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లోని పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుండడంతో కులస్తులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. -
పాఠశాలలో మద్యం కలకలం
● జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘటన చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఓ జిల్లాపరిషత్ పాఠశాలలో కొందరు విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగిన సంఘటన చర్చనీయాంశమైంది. 8వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఈనెల 3న భోజన విరామ సమయంలో బయటకు వెళ్లి ఒక మద్యం బాటిల్, కూల్డ్రింక్ తెచ్చుకుని పాఠశాలలోనే సేవించినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాల హెచ్ఎం బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జరిగిన సంఘటనపై చర్చించారు. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయులు వారి కదలికలను ఎందుకు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేయాలని సర్పంచ్ సూచించారు. పాఠశాల సమీపంలోనే కొందరు బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారని, వాటిని మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై హెచ్ఎంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. వరకట్నం వేధింపులకు వివాహిత బలిబోయినపల్లి(చొప్పదండి): ఇద్దరు కుమారులు పుట్టాక భర్త పెట్టే అదనపు కట్నం వేధింపులు భరించలేక బోయినపల్లికి చెందిన దొంతరవేణి నర్మద(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎన్.రమాకాంత్ తెలి పారు. బోయినపల్లికి చెందిన నర్మదకు ఐదేళ్ల క్రితం మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన దొంతరవేణి నరేశ్తో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లయిన ఏడాది తర్వాత అదనంగా రూ.2లక్షలు కట్నం తీసుకురావాలని నర్మదను భర్త వేధించేవాడు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని భార్య పిల్లలను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్తానంటే నరేశ్ మామ ఊరుమడ్ల రాజయ్య డబ్బులు వెచ్చించి పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సైతం నరేశ్ వైఖరిలో మార్పు రాకపోగా.. ఫోన్లో భార్యను కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. తీవ్ర మానసిక వేదనకు గురైన నర్మద మంగళవారం బోయినపల్లిలోని తన తల్లిగారింట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నర్మద తండ్రి ఊరుమడ్ల రాజయ్య ఫిర్యాదుతో దొంతరవేణి నరేశ్పై కేసు నమోదు చేశారు. దరఖాస్తులు ఆహ్వానంవిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు డిప్లొమా అప్రెంటిషిప్ కోసం అర్హతున్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్ధులు ఈనెల 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
శోకసంద్రం మధ్య ముగ్గురు కూలీల అంత్యక్రియలు
బోరున విలపిస్తున్న మంగళారపు లలిత భర్త, కూతుళ్లు, కుమారుడు విలపిస్తున్న రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందిన మంగళారపు లలిత, పెద్దిరెడ్డి గంగు, సంపంగి సాయమ్మ, రొడ్డ వైష్ణవికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మంగళారపు లలిత మృతదేహం వద్ద భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు బోరున విలపించారు. పిల్లలకు అమ్మ లేని లోటును ఎలా తీర్చాలి అంటూ.. ధర్మరాజు కన్నీటి పర్యంతమయ్యారు. గంగు మృతదేహం వద్ద కొడుకు, కూతుళ్లు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు పోశయ్య, అనిత, అక్కాచెల్లెల్లు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సంపంగి సాయమ్మ భర్త ఎల్లయ్య దుబాయ్ నుంచి బయల్దేరాడు. ఆయన రాగానే ఆమెకు అంత్యక్రియలు చేయనున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడిపి నలుగురు కూలీల మృతికి కారణమైన డ్రైవర్ ఎర్రంశెట్టి గంగాధర్పై సంపంగి లక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి సీఐ అనిల్కుమార్ తెలిపారు. దుబాయ్ నుంచి బయలుదేరిన సంపంగి సాయమ్మ భర్త ఆయన వచ్చాకే అంత్యక్రియలు చేసే అవకాశం -
పరిహారం కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
మల్లాపూర్ : కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా.. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో మృత్యువాత పడిన నలుగురి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ మండలంలోని మొగిలిపేటలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మెట్పల్లి –ఖానాపూర్ రహదారిపై ధర్నా చేశారు. పసుపు ఏరడానికి కూలీలను తీసుకెళ్లిన ఎర్రంశెట్టి గంగా ధర్ నిర్లక్ష్యంతోనే ట్రాక్టర్ అదుపుతప్పిందన్నారు. లలిత, గంగు, సాయమ్మ, వైష్ణవి కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల ఎస్సైలు అనిల్, కిరణ్, చిరంజీవి మొగిలిపేటకు చేరుకొని పోలీసులు గంగాధర్ కుటుంబసభ్యులతో మాట్లాడి మృతుల కుటుంబాకు రూ.6.50లక్షల చొప్పున పరిహారంతోపాటు రూ.15వేల చొప్పున దహనసంస్కారాలకు ఇచ్చేందుకు ఒప్పించారు. తక్షణ పరిహారంగా రూ.50వేలు అందించడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
కంటిపాపను కాపాడండి
కరీంనగర్: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ వచ్చిందని సంబురపడ్డారు. కూలి చేస్తేనే కడుపునిండే కుటుంబం అయినా తమ కూతురు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ అంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. వెంటనే వైద్యం అందిస్తేనే బతికే పరిస్థితులు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు కావడంతో తమ కూతురు వైద్యానికి దాతలు సాయం చేసి ఆదుకోవాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన రౌతు సంపత్–రాజేశ్వరీ దంపతులకు శ్రేయన్షి సంతానం. ఏడాదిన్నర వయస్సున్న శ్రేయన్షి తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితికి చేరింది. హార్ట్ సమస్యతోపాటు బ్లడ్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కు సోకడంతో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి చికిత్సకు రూ.5లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. కూలి పని చేసే కుటుంబం కావడంతో ఇంత భారీ మొత్తాన్ని భరించే స్థోమత లేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే బంధువులు, పరిచయస్తుల వద్ద రూ.లక్ష వరకు అప్పు తెచ్చి చికిత్స అందిస్తున్నారు. మిగతా డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దాతలు చేసే సహాయం తమ కూతురి ప్రాణానిన నిలబెడుతుందని ఆ నిరుపేద తల్లిదండ్రులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు ఫోన్పే లేదా గూగుల్పే 91603 89464, 99120 20718లో ఆర్థిక సహాయం చేయాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆదుకోవాలని తల్లిదండ్రుల విన్నపం ప్రాణాపాయ స్థితిలో చిన్నారి


