Family
-
జీవ వనరుల కేంద్రాల స్థాపనపై శిక్షణ
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటానికి.. తెగుళ్ల నియంత్రణ, నేల/మొక్కల ఆరోగ్య నిర్వహణ కోసం రసాయనేతర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్ఐపీహెచ్ఎం) వివిధ తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతలు, ఉత్పాదకాలను అభివృద్ధి చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఈ సంస్థ ఏర్పాటైంది. దేశంలో సేంద్రియ / ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో భాగంగా రైతులకు నాణ్యమైన జీవన ఎరువులు, ద్రావణాలు, కషాయాలు వంటి జీవ ఉత్పాదకాలను అందించే జీవ వనరుల కేంద్రాల (బీఆర్సీల) స్థాపనపై సంపూర్ణ అవగాహన కలిగించటానికి ఎన్ఐపీహెచ్ఎం ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనుంది. తక్కువ ఖర్చుతో కూడిన జీవ ఉత్పాదకాలు, వాటి ఉత్పత్తి సాంకేతికతల గురించి అవగాహన కలిగిస్తారు. ప్రగతిశీల రైతులు, ఎఫ్పీఓలు / స్వయం సహాయక బృందాలు/ కృషి సఖిలు, విస్తరణ అధికారులు, సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఫీజు, భోజన, వసతి సదుపాయాల వివరాల కోసం ఎన్ఐపీహెచ్ఎం వెబ్సైట్ చూడొచ్చు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: dirphmniphm-ap@nic.in - damodar.kammari@gov.in -
‘నూకలు’ చెల్లిన కలుపు!
వరి పొలాల్లో కలుపు నివారణకు రైతులు రసాయనిక గడ్డి మందులు / కలుపు మందులు పిచికారీ చెయ్యటం రివాజు. అయితే, ప్రస్తుత రబీ పంట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నీరు నిల్వగట్టే పద్ధతిలో వరి సాగు చేసే కొందరు వరి రైతులు ఒక సరికొత్త ప్రయోగం చేసి కలుపుపై నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. కలుపు మందులకు బదులుగా వరి బియ్యం నూకలను నాట్లు వేసిన పొలంలో చల్లి కలుపు మొలవకుండా అడ్డుకున్నారు. ఎకరానికి రూ. 5 వేలకు పైగా రైతులకు ఖర్చు తగ్గటంతో పాటు పర్యావరణానికి మేలు జరిగింది. ప్రముఖ రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) చెప్పిన ఈ చిట్కా సూపర్ హిట్ అయ్యింది. వరి నాటిన మొదటి 3 రోజుల్లో ఒకసారి, 25వ రోజు మరోసారి ఎకరానికి 100 కిలోల చొప్పున వరి బియ్యం నూక (రెండుసార్లు కలిపి ఎకరానికి 200 కిలోలు) చల్లాలని ఆయన సూచించారు. ఈ ఆవిష్కరణపై జనవరి 6న ‘సాక్షి సాగుబడి’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ దారులతో పాటు రసాయనిక ఎరువులు వాడే రైతులు, సమస్యాత్మక చౌడు భూముల్లో వరి పండించే రైతులు కూడా సత్ఫలితాలు పొందుతుండటం విశేషం. వరి నూకలు లేకపోతే ధాన్యాన్ని మరపట్టించి పొట్టుతో సహా పొలంలో చల్లినా కలుపు సమస్య తీరిందని రైతులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దీనిపై అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నూకలు కలుపును ఎలా నియంత్రిస్తాయంటే?నూకలు చల్లితే కలుపు నియంత్రణ జరగటానికి వెనుక శాస్త్రీయత ఏమిటి అని ప్రశ్నించినప్పుడు తన పేరు వెల్లడించటానికి అంగీకరించని ఒక సీనియర్ శాస్త్రవేత్త ఇలా వ్యాఖ్యానించారు: ‘నూకలను వరి పొలాల్లో చల్లితే కలుపు నివారణకు సహాయపడుతుంది. ఒక రకమైన ఆచ్ఛాదన పొర (మల్చింగ్ లేయర్) ఏర్పడుతుంది. ఈ పొర సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. కలుపు మొక్కల పెరుగుదలను అణచివేస్తుంది. కలుపు విత్తనాలు మొలకెత్తలేవు. పొలంలో నిల్వగట్టిన నీటి ఆవిరి నష్టం, నేల కోత తగ్గుతుంది. నేల ఆరోగ్యం మెరుగవుతుంది. పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. అయితే, వరి పొలాల్లో నూకలు చల్లితే ఏమవుతుందనే అంశంపై శాస్త్రీయంగా పటిష్టమైన అధ్యయనాలు ఇప్పటి వరకు జరగలేదు. వరి పొట్టు బయోచార్ను పొలంలో చల్లినా కూడా ఈ ఫలితాలు వస్తాయి. ఈ విషయం పరిశోధనల్లో ఇప్పటికే నిర్ధారణైంది.’యూరియాతో నూకలు చల్లితే మోకాళ్ల ఎత్తు తుంగ పోయింది!రెండు పొలాల్లో మొత్తం 10.5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎకరానికి 1 బస్తా డీఏపీ, మూడు సార్లు కలిపి 2.5 బస్తాల యూరియా, అర బస్తా పొటాష్ వాడుతుంటాను. ఈ రబీ సీజన్లో 4.5 ఎకరాల పొలంలో డ్రమ్సీడర్తో ‘ఆర్ఎన్ఆర్31479’ వరి విత్తనాలు వేశాను. తుంగ మోకాళ్ల ఎత్తు పెరిగింది. వరి మొక్కలు దానికి సగం ఎత్తులోనే ఉన్నాయి. పంట పోయినట్లే నని దున్నేద్దాం అనుకున్నా. ఆ దశలో చింతల వెంకటరెడ్డి గారు నూకల గురించి చెప్పింది విని 4.5 ఎకరాల్లో 170 కిలోల సన్న (చీరు) నూకలను 3 కట్టల యూరియాలో కలిపి చల్లా. వారం రోజుల తర్వాత నుంచి తుంగ వాడిపోవటం మొదలైంది. కొన్నాళ్లలో తుంగ పూర్తిగా నేలవాలింది. వరి మొక్కలు మాత్రం ఏపుగా పెరిగాయి. కోతల నాటికి తుంగ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. పోయిందనుకున్న పొలంలో ఎకరానికి 35 బస్తాలు పండింది. అందరితో పాటు నేనూ ఆశ్చర్యపోయాను. మరో 6 ఎకరాల్లో ‘కేఎన్ఎం 12368’ వరి నాట్లు వేశాను. తుంగ, ఇతర కలుపు లేకపోయినా రెండో దఫా వేసే 3 కట్టల యూరియాతో పాటు 150 కిలోల నూకలు కలిపి చల్లాను. పంట బాగా పెరిగి కోతకు వచ్చింది. ఎకరానికి 45 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. చివరి విడత యూరియా, పొటాష్ వెయ్యాల్సిన అవసరం రాలేదు. నూకల వల్ల పురుగుమందులు, ఫంగిసైడ్స్ చల్లాల్సిన అవసరం రాలేదు. పురుగుమందుల ఖర్చే ఎకరానికి రూ. 5 వేలు మిగిలాయి. క్వింటా నూకలకు రూ.1,800 వరకు ఖర్చవుతున్నది. అయినా, వీటిని చల్లటం వల్ల తుంగ వంటి మొండి కలుపు కూడా పోవటం ఒక్కటే కాదు ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. – వల్లభనేని వెంకట్రావు (81793 84318), లింగగిరి, హుజూర్నగర్ మం., సూర్యాపేట జిల్లాచౌడు సమస్య తగ్గింది.. కలుపు మొలవ లేదు..మాది 2 ఎకరాల చౌడు పొలం. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. చింతల వెంకటరెడ్డి గారు చెప్పినట్లు కలుపు నివారణకు నూకలు చల్లితే మంచి ఫలితాలు వచ్చాయి. 1.25 ఎకరాల వరి పొలంలో రెండు దఫాలుగా ఎకరానికి 100 కిలోల చొప్పున నూకలు చల్లాను. తుంగ, గరిక తదితర కలుపు మొలవలేదు. అంతేకాదు, చౌడు వల్ల ప్రతి ఏటా మొక్కలు చాలా చనిపోయేవి. కానీ, నూకలు వేశాక మొక్కలన్నీ బతికాయి. 30 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. మరో, 75 సెంట్ల వరి పొలంలో నూకలు ఒక్కసారే వేశాను. రెండోసారి వెయ్యలేదు. మొక్కలు 20% పోయాయి. ఇంకా పంట కొయ్య లేదు. నూకలు చల్లిన తర్వాత కొన్ని రోజులకు మురుగు వాసన వస్తుంది. అయితే, కలుపు పెరగదు. కలుపు మందులు కొట్టినా కలుపు అంతో ఇంతో వస్తూనే ఉంటుంది. నూకలు కలుపు రాకుండా చెయ్యటంతో పాటు చౌడు సమస్యలను కూడా తగ్గించాయి. –చిన్నపరెడ్డి నరసింహారెడ్డి (94406 86885), తిమ్మంపేట, జఫర్గఢ్ మం., జనగామ జిల్లాశాస్త్రీయ పరిశోధన చెయ్యాలిఇవన్నీ కూడా మన సంప్రదాయ వైద్యంలో చెప్పే విషయాల వంటివి. ఏదైనా ఫలితాలనిస్తే దాన్ని మనము ఆలోచించాలి, అయితే, కొందరు రైతులు బాగుంది అంటున్నారు కాబట్టి, ఇంకా విస్తృత స్థాయిలో పరీక్షించాలి. క్రమబద్ధ శాస్త్రీయ పరిశోధన చేయకుండా దీన్ని మనం సిఫార్సు చేయటం సాధ్యం కాదు. – డాక్టర్ చెన్నబోయిన దామోదర రాజు, అధిపతి–ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధనా సంస్థ, ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.ఎకరానికి 50 కిలోలు చల్లిన పొలాల్లోనూ కలుపు రాలేదువరి పొలాల్లో నూకలు చల్లితే కలుపు సమస్య తీరిపోవటం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని ఈ రబీ పంట కాలంలో తొలిసారి నా అనుభవంలో రుజువైంది. 1.25 ఎకరం పడావు భూమిని సిద్ధం చేసి నాట్లు వేశాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నాం. నాట్లేసిన రెండో రోజు, 25వ రోజు వంద కిలోల చొప్పున వరి బియ్యం నూకలు చల్లాం. మా పొలంలో కలుపు అసలు రాలేదు. పంట ఎర్రబడకుండా ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉంది. త్వరలో కోతకు రానుంది. పొలాన్ని వీడియోతీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే, అనుసరించిన 60–70 మంది రైతులు ఫోన్ చేసి తమ అనుభవాలు చెప్పారు. ఎకరానికి 50 కిలోల నూకలు వేసిన పొలాల్లో కూడా కలుపు నివారణ జరిగింది. నాట్లేసిన తర్వాత 10–26 రోజులకు నూకలు చల్లిన పొలాల్లోనూ కొత్తగా కలుపు పుట్టలేదు. మా తమ్ముడు పొలంలో కనీసం రెండుసార్లు కలుపు తీయిస్తాడు. నాట్లేసిన 20 రోజులకు ఒకసారి కలుపు తీసినాక ఒకే ఒక్కసారి ఎకరానికి వంద కిలోలు నూకలు చల్లినా కలుపు మళ్లీ రాలేదు. చౌడు భూముల్లో ఆర్గానిక్ వరి సాగు చేసే పొలాల్లో నూకలు చల్లినా కలుపు రాలేదు. మొక్కలు చనిపోవటం, ఎరుపు రంగుకు మారటం కూడా జరగలేదని రైతులు చెబితే ఆశ్చర్యం కలిగింది. కలుపు మందులు కేన్సర్ కారకాలని చెబుతున్న నేపథ్యంలో నూకలతో కలుపు నివారణ ఆవిష్కరణను సీవీఆర్ అందించటం సంతోషదాయకం. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లి నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
ఆమె... అతని హు‘షారు’
దేశవిదేశాల పుస్తకాలు చదువుకున్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదువుకున్నారు. ఆ మహా మేధావి హృదయాన్ని చదివిన సవితా అంబేడ్కర్ ‘మై లైఫ్విత్ డా.అంబ్కేడర్’ పుస్తకం రాశారు. బాబా సాహెబ్ ఆమెను ప్రేమగా ‘షారు’ అని పిలుచుకునేవారు. భారత రాజ్యాంగ పితామహుడిని, ప్రపంచ మేధావులలో ఒకరైన అంబేడ్కర్ వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించే పుస్తకం... మై లైఫ్ విత్ డా.అంబేడ్కర్...అంబేడ్కర్తో తన వివాహం గురించి ‘మై లైఫ్ విత్ డా.అంబేడ్కర్’లో ఇలా రాశారు సవిత...‘‘డా.అంబేడ్కర్ను చూసి నేను పూర్తిగా ముగ్ధురాలైనప్పటికీ, ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉన్నప్పటికీ, ఆయనకు భార్య కావాలనే కోరిక మాత్రం నాకు కచ్చితంగా లేదు. రోజంతా డాక్టర్ అంబేడ్కర్ లేఖ గురించి, ఆయన వివాహ ప్రతిపాదన గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నాలో గందరగోళపు తుఫాను చెలరేగింది. ముస్సోరీలో డా. అంబేడ్కర్, సవితా అంబేడ్కర్ అంతటి మహనీయుడి ప్రతిపాదనను ఎలా కాదనగలను? అవునని ఎలా చెప్పగలను?నేను అంగీకరించడానికి కారణం ఒక్కటే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాబా సాహెబ్ ఆరోగ్యం మెరుగుపడాలి. నేను డాక్టర్ బాబా సాహెబ్ జీవితంలో ఏకమై ఆయనలో లీనమైపోవాలని గట్టిగా సంకల్పించుకున్నాను’’గృహజీవిత విశేషాలు...బాబా సాహెబ్కు సవిత అంటే ఎంతో ఇష్టం. ఆమెకు బహుమతులు పంపించేవారు. ప్రేమలేఖలు రాశారు. ‘షారు’ అని ప్రేమగా పిలుచుకునేవారు. 1948లో వారి వివాహం తర్వాత సవితా అంబేడ్కర్ అయిన శారద నిరంతరం అపారమైన భక్తి శ్రద్ధలతో బాబా సాహెబ్కు సేవ చేయడం ప్రారంభించారు. ఆమె పుట్టింటి పేరు శారదా కబీర్. వారి గృహజీవితంలోని కొన్ని విశేషాలు అంబేడ్కర్లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రేమతో వండిన ఇంటి భోజనాన్ని ఆస్వాదించేవారు. చమత్కారాలతో, పిట్ట కథలతో సన్నిహితులను నవ్వించేవారు బాబాసాహెబ్.ముంబైలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో... అక్కడ కేవలం రెండు కుర్చీలు మాత్రమే ఉండడంతో 85 ఏళ్ల రావు బహదూర్ బోలేను తన ఒడిలో కూర్చోమని ఆహ్వానించారు బాబాసాహెబ్ అంబేడ్కర్. అంబేడ్కర్గా జీవిస్తాను... అంబేడ్కర్గా మరణిస్తానుభార్యతో కలిసి టీ తాగుతూ బౌద్ధమతంపై లోతైన చర్చలు జరిపేవారు అంబేడ్కర్. దళితుల దుస్థితిని చూసినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునేవారు. తను, తన భార్య ఆకలితో పడుకోవలసి వచ్చినా సరే, ఇంట్లోని ఆహార నిల్వలన్నిటినీ తన పేద అతిథులకు పంచి పెట్టడానికి ఎంత మాత్రం వెనకాడేవారు కాదు. జవహార్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మంత్రి అయిన తరువాత కూడా దళితులు, మహిళల కోసం భారతదేశాన్ని మరింత సమానత్వం కలిగిన దేశంగా మార్చాలనే తన ప్రయత్నంలో ఆయన వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉన్నారు. డా. అంబేడ్కర్, సవితా అంబేడ్కర్ నాగ్పూర్లో బౌద్ధమత దీక్ష చేపట్టిన దృశ్యం లోక్సభకు జరిగిన రెండు ఎన్నికలలో అంబేడ్కర్ ఓడిపోయారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆయనకు వ్యతిరేకంగా చేసిన రాజకీయ కుతంత్రాల ఫలితమే ఇది’ అని సవిత అభి్రపాయపడ్డారు. బాబా సాహెబ్కు సవితపై ఉన్న ప్రేమ, తన జీవితంలో ఆమె పాత్ర, ఈ దంపతుల మేధోపరమైన అనుకూలతలు, బౌద్ధమతంలోకి మారాలనే వారి ఉమ్మడి నిర్ణయం...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ‘మై లైఫ్ విత్ డా.అంబేడ్కర్’ ఉపకరిస్తుంది. ‘నేను అంబేడ్కర్గా జీవిస్తాను. అంబేడ్కర్గానే మరణిస్తాను’ అని పుస్తకం చివర్లో రాశారు సవితా అంబేడ్కర్. -
గరిట పట్టిద్దాం
వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. చదువులకు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం. కుకింగ్, మనీ మేనేజ్మెంట్, క్రియేటివ్ ఆర్ట్స్, రీ సైక్లింగ్, ఫిజికల్ యాక్టివిటీస్, నేచర్ లైఫ్, గ్లోబల్ ఎక్స్పోజర్, వెల్బీయింగ్ క్లాసెస్, కమ్యూనికేషన్, డిజటల్ అండ్ టెక్నాలజీ స్కిల్స్.. ఇవన్నీ పాఠాలుగా కాకుండా వివిధ రకాల అంశాలలో అవగాహన కలిగించడానికి మేలైన సమయం. ఈ వేసవిలో పిల్లలకు వినోదాన్ని కూడా ఇచ్చే అంశాలపై నిపుణుల సూచనలతో వరుస కథనాలు.వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. నచ్చిన ఆటలు, మెచ్చిన వినోదం.. వీటితోనే కాలక్షేపం చేయడం కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం కూడా. ఆ జాబితాలో ముందుగా వంటింట్లోకి తీసుకెళదాం. పిల్లలను కుదురుగా ఉంచేది, ఏకాగ్రతను పెంచేది, సహనాన్ని, టీమ్ వర్క్ని పరిచయం చేసే పాకశాస్త్రాన్ని పరిచయం చేద్దాం.. రోజూ అమ్మ చేసే వంటకు ఏదో వంక పెట్టే పిల్లలు ఉంటారు. ఒక వంట తయారు చేస్తే, మరోటి అడిగే వారూ ఉంటారు. ఇష్టమైనవన్నీ తయారుచేసి, సమయానికి బాక్స్ కట్టి ఇచ్చే అమ్మ పని తెలియాలంటే ఇదో చక్కని మార్గం కూడా. ‘అమ్మో! వంటింటిని పిల్లలకు అప్పజెప్పడమా!’ అని భయపడకుండా పిల్లల చేత గరిట పట్టిస్తే ఏమేం జరుగుతుందో తెలుసుకుందాం.. → రుచుల ఆస్వాదనవంట పాత్రలు, అందుకు ఉపయోగించే వివిధ రకాల సాధనాలు ముందుగా పరిచయం అవుతాయి. ఆ తర్వాత వంట దినుసులు, కూరగాయలు, ఆకుకూరల పట్ల అవగాహన పెరుగుతుంది. వేటితో ఏ తరహా వంటకాలు తయారు చేయచ్చు, రుచులను కలపడం వంటి ప్రక్రియల్లో పాల్గొంటారు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుంది. ఒక సాధారణ పదార్థాన్ని కొత్తగా ఎలా రూ΄÷ందించవచ్చు, అనే ఆలోచన కూడా వారిలో అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా ఇటాలియన్ , జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ వంటకాలనూ పరిచయం చేయవచ్చు. దీనివల్ల పిల్లల్లో ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది.→ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతాము తయారు చేసిన వంటకాన్ని కుటుంబ సభ్యులు రుచి చూసి, ప్రశంసిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న వయసులోనే ‘నేను చేయగలను‘ అనే భావన అలవాటు అవుతుంది. ఇంటì పనుల్లో తామూ భాగస్వాములు అవుతారు. వంట భారంగా కాకుండా సులభంగా చేసేలా ప్రోత్సహించవచ్చు.→ జట్టుగా విజయం కుకింగ్ క్లాసులలో చేరితే పిల్లలు గ్రూప్స్గా పనిచేస్తారు. ఇది వారికి టీమ్వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ను నేర్పిస్తుంది. ఇతరులతో కలిసి పని చేయడం, బాధ్యతలు పంచుకోవడం వంటి లక్షణాలు పెరుగుతాయి.→ సమతుల్యత సాధనవంట సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వంటలో ఉపయోగించే పదార్థం తక్కువైతే ఎలా మార్చాలి, రుచిని ఎలా సర్దుబాటు చేయాలి... ఇవన్నీ పిల్లల్లో సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలియజేస్తుంది.→ మంచి అలవాట్లుముఖ్యంగా వంట చేయడం ద్వారా పిల్లలు ఆహార విలువ తెలుసుకుంటారు. ఏ పదార్థం ఆరోగ్యానికి మంచిది, ఏయే పోషకాలు వేటి ద్వారా లభిస్తాయి,.. వంటి విషయాలు అర్థమవుతాయి. వృథాను అరికట్టడం, మిగిలిన పదార్థాలను తిరిగి ఎలా ఉపయోగించడం, శుభ్రతను ఎందుకు పాటించాలి.. వంటి విషయాల్లో అవగాహన కలుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి.→ బాధ్యత పెరుగుతుందివంట చేయడం ద్వారా పిల్లలు స్వతంత్రంగా పని చేయడం నేర్చుకుంటారు. తమ పనిని తామే పూర్తి చేయడం, శుభ్రత పాటించడం వంటి బాధ్యతలు అలవాటు అవుతాయి. అంతేకాదు, వంట పనిలో భాగంగా వస్తువులను శుభ్రపరచడం, సర్దడం వంటి పనులూ నేర్చుకుంటారు. అదే సమయంలో గ్యాస్, ఎలక్ట్రిక్, కటర్స్.. వంటి వాడకంలో రక్షిత చర్యల గురించి అవగాహన కల్పించవచ్చు. ఇంట్లో వీలు కావడం లేదు అనుకునేవారు కుకింగ్ క్యాంప్స్లో చేర్పించవచ్చు. వంటల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. వంట ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమనూ, ఆనందాన్ని, రుచుల ఆస్వాదననూ పరిచయం చేయవచ్చు. ఇది పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది కూడా.వంట.. వ్యక్తిత్వ వికాస పాఠంపిల్లలు వంట నేర్చుకోవడం ద్వారా ఒక సమగ్రమైన అవగాహన కలుగుతుంది. ఒక డిష్ను ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుస్తుంది. ప్రతి వంటకం తయారీకి పట్టే సమయం వారిలో ఆలోచనాశక్తిని, సహనాన్ని పెంచుతుంది. జంక్ ఫుడ్ ఎందుకు తీసుకోవద్దో తెలుస్తుంది. వంట అంటే ఆడవాళ్లు మాత్రమే చేసేది కాదని కుటుంబంలో అందరూ చేయవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో తెలుస్తుంది. అయితే, వంట పని ఒక భారంగా కాకుండా వినోదాత్మకంగా మార్చగలిగితే పిల్లలు జాయ్ఫుల్గా రుచుల తయారీ పట్ల దృష్టి పెడతారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల చేత వంటను ఫన్గా చేయించవచ్చు. ఎక్కువ మంది పిల్లలతో కలిసి పాల్గొనేలా చేయాలంటే..అందుకు కిడ్స్ కుకింగ్ క్యాంప్స్ పిల్లలకు వినోదంతో పాటు విలువైన నైపుణ్యాలనూ నేర్పిస్తున్నాయి. – మీరా గిరిజ తాడిమేటి, చెఫ్సాక్షి ‘హెల్త్ ప్లస్’ ఈపేపర్లో...పిల్లలకు వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహార పదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే ప్రత్యేక కథనం... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్..!
ఎండాకాలం చల్లని ప్రయాణాలు చేయాల్సిందే అనుకుంటారు. కానీ, చాలా మందికి ఎక్కడికి వెళ్లాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ అయ్యేవారికి కూర్గ్ ఒక పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్. తొలిసారి వెళ్లినా కూడా చాలా నేచురల్గా అనిపిస్తుంది.కూర్గ్లో రోడ్ల పక్కనే కాఫీ ప్లాంటేషన్స్ మధ్య మధ్యలో జలపాతాలు, చిన్న చిన్న ఇళ్లతో కలిసి ఒక కామ్ అండ్ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. ఉదయం వేళలో వీచే గాలి కాఫీ ఘుమఘుమలను మోసుకొచ్చే మెసెంజర్లా మారి΄ోతుంది.సందర్శనీయ స్థలాలుఅబ్బే ఫాల్స్ దగ్గర నీరు పడే శబ్దంలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. రాజాస్ సీట్ నుండి వ్యాలీ చూస్తూ సూర్యోదయం మెల్లిగా విస్తరించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర నేచర్ మధ్య రిలాక్స్ అయ్యే అవకాశం లభిస్తుంది.ఏం తినాలి?కూర్గ్ స్టైల్ మీల్స్లో స్పైసెస్ మైల్డ్గా, ఫ్లేవర్ రిచ్గా ఉంటాయి. ఇక్కడి నాన్ వెజ్ వంటకాలకు స్థానిక మసాలాలే ప్రత్యేకత. ఫ్రెష్ కాఫీ సిప్ చేస్తూ అక్కడి వైబ్ను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు.ఎప్పుడు వెళ్లాలి?అక్టోబర్ నుంచి మార్చి వరకు వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అయితే చాలా మంది ఎండాకాలంలో కూడా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. చలికాలంలో అయితే మిస్ట్, గ్రీనరీ, కూల్ బ్రీజ్ కలిసి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఎండాకాలం ఒక ప్రశాంతమైన అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు, చల్లదనం కోసం కూర్గ్ వెళ్లవచ్చు.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్లైట్లో సుమారు 90 నిమిషాలు ప్రయాణించాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5–6 గంటలు ప్రయాణించి కూర్గ్కు చేరుకోవచ్చు. కూర్గ్లో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటే గాలిలో కాఫీ సువాసన, ప్రశాంతత గుర్తుకొస్తాయి. అక్కడి స్లో లైఫ్ మనసులో చిరకాలం నిలిచిపోతుంది. బాలి, ఇండోనేషియా..!కొన్ని ప్రదేశాల్లో మొదటి అడుగు వేయగానే మనసు తేలికపడిపోతుంది. అలాంటి ఫీలింగ్ను కలిగించే ఒక అందమైన ప్రదేశమే ఇండోనేషియాలోని బాలి. ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ట్రిప్ చేసే ట్రావెలర్స్కు కూడా సులభంగా కనెక్ట్ అయ్యే వైబ్ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడి ప్రతీ చిన్న మూమెంట్లో ఒక రిలాక్స్డ్ ఫ్లో ఉంటుంది.బాలి రోడ్ సైడ్లో కొబ్బరి చెట్లు, ఆలయాలు, చిన్న కేఫ్స్ కలిసి ఒక నేచురల్ రిథమ్ను క్రియేట్ చేస్తాయి. ఉదయం వేళలో పలచని సూర్యకాంతి, సాయంత్ర వేళలో సముద్రం పక్కనే చల్లని గాలి.. ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని చాలా కంఫర్టబుల్గా మార్చేస్తాయి. నడుస్తూ చూస్తూ వెళ్తే టైమ్ స్లోగా అయి΄ోయిన ఫీలింగ్ కలుగుతుంది.సందర్శనీయ స్థలాలుఉబుద్లో గ్రీనరీ మధ్య ఉన్న ఆలయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. తనాహ్ లాట్ ఆలయం సముద్రం పక్కన నిలిచిన దృశ్యంలో ఒక కామ్ ప్రెజెన్స్ ఉంటుంది. ఉలువాటు ఆలయం దగ్గర క్లిఫ్స్ మీద వేవ్స్ చూస్తూ ఉండటం ఒక స్మూత్ ఎక్స్పీరియెన్స్గా మిగిలిపోతుంది.ఏం తినాలి?బాలిలో నాసి గొరేంగ్ అనే రైస్ డిష్ వార్మ్గా, లైట్ స్పైసెస్తో చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. సాటే స్టిక్స్ ఫ్రెష్గా గ్రిల్ చేసి పక్కన సాస్తో సర్వ్ చేస్తారు. ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసులు అక్కడ నేచురల్గా రిఫ్రెషింగ్ ఫీలింగ్ను ఇస్తాయి.ఎప్పుడు వెళ్లాలి?ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వెదర్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ సమయంలో బీచ్ వాక్స్, టెంపుల్ విజిట్స్, స్ట్రీట్స్లో నడవడం ఇవన్నీ మంచి మెమోరీస్గా మిగిలిపోతాయి. స్థానికులు నవ్వుతూ పలకరిస్తారు, దీంతో ఈ ప్రదేశం అందరికీ నచ్చేలా అనిపిస్తుంది.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుంచి బాలి కి కనెక్టింగ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. ట్రావెల్ టైమ్ సుమారు 10 నుంచి 12 గంటలు ఉంటుంది. ఎయిర్పోఒర్ట్ నుంచి సిటీకి వెళ్లే రోడ్ జర్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది.బాలీలో గడిపిన సమయం ఓ అందమైన జ్ఞాపకంలా గుర్తుండిపోతుంది. అక్కడి స్లో లైఫ్ రిథమ్ మనసులో మరికొంత కాలం అలాగే నిలిచిపోతుంది.(చదవండి: సమ్మర్లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్గా..!) -
గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!
విదేశాల్లో ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్. మా అబ్బాయి ఫారెన్లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ వాస్తవ జీతంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంతగూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్లో వెంటాడతాయి. చాలామంది అక్కడ కొత్త లైఫ్స్టైల్కి అడ్జెస్ట్ కాలేక మరోపక్క తమవాళ్లను వదిలేసి వచ్చేశామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక..తిరిగి సొంత గడ్డకి పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్టూ అలానే భారత్కి గోడకు కొట్టి బంతిలా తిరిగొచ్చేశాడు. తాను ఎందుకలో వచ్చేశాడో చెబుతుంటే..అమ్మో విదేశాలకా అని అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే. ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తానెలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్ని మధ్యలో వదిలేసి భారత్కి వచ్చాశాడో సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించాడు. ఆ పోస్ట్లో మానవ్ షా..తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్లు చెప్పాడు. అంతేగాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్ బిందాస్గా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అవేమి అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తాను నేషనల్ హెల్త్ సర్వీస్లో పనిచేస్తుండేవాడినని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 టు 5 ఉద్యోగ సంస్కృతికి బంధీ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా..స్వేచ్ఛలేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్గా చెప్పాలంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే..అప్పటికే చక్కగా సెటిల్ అయిన లైఫ్, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. తాను తన ఇంటికి దూరంగా ఉండటంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్ వచ్చేదని అన్నాడు. వాటన్నింటిని ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకుని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంలో సంపాదించినంత కాకపోయినా..తన వాళ్లతో హాయిగా గడపగలనన్నా ఆ ఆలోచనే సంతోషంలో ముంచెత్తుందని చెబుతున్నాడు. అలాగే తక్కువ జీతమే అయినా..చక్కగా పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందివ్వగలనని అన్నాడు. అన్నింటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకుతానని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయానికి మద్దతిస్తూ..వెస్ట్రన్ డ్రీమ్ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లు ఉంటుందే తప్ప..ఎన్నో ఆనందాల క్షణాలను కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలానే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లు చెప్పడం విశేషం. View this post on Instagram A post shared by Manav Shah (@physiomanav) (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..) -
సమ్మర్లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్గా..!
దక్షిణ భారతదేశంలో ఎండాకాలం వేడిని భరించలేం అనుకుంటారు. కానీ, వేసవిలోనూ సౌత్లో కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. వాతావరణం ఆహ్లాదంగా, వినసొంపైన పాటలా సాగిపోతుంది. చిక్మగళూరు నుంచి వల్పరై వరకు అటు నుంచి అరకు వరకు.. ఈ ప్రదేశాలు వేడిలో కూడా చల్లని ప్రయాణపు ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ చల్లదనాన్ని ఆస్వాదిస్తే వేసవి వేడిని ఇట్టే మర్చిపోతాం. చిరుగాలి పంచే చల్లదనం, నేలంతా పరుచుకున్న పచ్చదనం, మధ్య మధ్యలో మేఘాల నడక .. ఇవన్నీ కలిసి ఈ వేసవిని చిల్గా మార్చేస్తాయి.చిక్మగళూరుకర్ణాటకలోని చిక్మగళూరులో ఉదయ వేళలో కాఫీ తోటల మధ్య రోజు మొదలవుతుంది. పొగ మంచు మధ్య నుంచి ప్రకాశించే వెలుగు, స్లోప్స్ మీద పడిన నీడలు ఇవన్నీ కలిసి ఒక సాఫ్ట్గా ఉండే దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి. స్థానిక ముల్లయనగిరి పర్వత రేఖలు చూసినప్పుడు భూమిపై ఒక జెంటిల్ ఎలివేషన్లా అనిపిస్తుంది.తమిళనాడులోని వల్పరైలో రోడ్డుపై నడవడం అనేది టీ ఎస్టేట్స్ మధ్య ఒక ఎండ్లెస్ గ్రీన్ కారిడార్లో నడవడంలా ఉంటుంది. చుట్టూ ఉన్న స్లోప్స్ మీద ప్లాంటేషన్ లైన్స్ ఒక రిథమ్లో కనిపిస్తాయి. మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న జలపాతాలు, రోడ్డు పక్కన నడిచే సమయంలో వీచే గాలిం ఒక నిశ్చలమైన దశ్యాన్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ ప్రతీ టర్న్లో ఒక వ్యాలీ కనిపిస్తుంది. ప్రతీ వ్యాలీలో ఒక సైలెంట్ స్పేస్ ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు ప్రదేశాలకు ప్రయాణం.. చాలా సులభంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు బెంగుళూరు వరకు ప్లైట్లో చేరడం, ఇంకొన్ని ప్రదేశాలను చేరుకునేందుకు కోయంబత్తూరు వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో వెళ్లినప్పుడు ప్రతి టర్న్లో ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది.రోడ్డు పక్కనే చెట్లు, మధ్య మధ్యలో కనిపించే వ్యాలీస్, గాలిలో మారి΄ోయే ఉష్ణోగ్రతలు ఇవన్నీ ప్రయాణాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?ఈ హిల్ స్టేషన్స్లో పెద్ద బిల్డింగ్స్ కన్నా చిన్న హోమ్ స్టేలు, కాటేజీలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ స్టే చేయడం అంటే గాలి మధ్య కాఫీ సువాసనలు పీల్చుతూ , ప్రకృతి పలికించే స్వరాలను వింటూ సమయం గడపడం లాంటిదే.ఇక్కడ ప్రతి మూమెంట్ మెల్లిగా నడుస్తుంది. సాయంత్రం అయితే స్లోప్స్పై వెలుగు తగ్గుతూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.అరకు లోయ అరకు లోయలో ప్రయాణం అంటే కాఫీ తోటల మధ్య నడిచే కథల మధ్య వెళ్లడంలా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్లినప్పుడు టన్నెల్స్ నుంచి బయటికి వచ్చిన ప్రతీసారి కొత్త దృశ్యం కనిపిస్తుంది. వ్యాలీ మధ్య గ్రామాలు, పక్కన హిల్స్, మధ్య నడిచే గాలి ఇవన్నీ కలిసి ఒక మధురమైన అనుభూతిని అందిస్తాయి. కాఫీ అరోమా గాలిలో కలిసినప్పుడు ప్రతి మూమెంట్ ఇంకా గుర్తుగా నిలిచిపోతుంది.ఏం చూడాలి?ఉదయం వేళలో పొగ మంచు మధ్య నడవడం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది.గాలిలో మాయిశ్చర్ టచ్, చెట్ల మధ్య నడిచే వెలుగు ఇవన్నీ కలిసి ఒక నిశ్చలమైన దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి.మధ్యాహ్నంలో టీ ఎస్టేట్స్ మధ్య తిరగడం, ఫారెస్ట్ ఎడ్జెస్లో కూర్చుని గాలిని ఎంజాయ్ చేయడం ఈ చిన్న మూమెంట్స్ ప్రయాణంలో గుర్తుగా నిలిచిపోతాయి.సాయంత్రం అయితే సన్సెట్ చూడటం, ఆకాశం రంగులు మారడం చూస్తూ సమయం గడపడం ఒక సైలెంట్ ఎక్స్పీరియెన్స్లా ఉంటుంది.ఏం తినాలి?ఈ ప్రదేశాలలో భోజనం కడుపుతోపాటు మనసును సంతోషపెట్టేలా ఉంటుంది. లోకల్ కర్రీస్, కొబ్బరితో చేసిన వంటలు, తాజా మసాలాలతో చేసిన వంటకాలుఇవన్నీ కలిసి భోజనాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.కాఫీ ప్లాంటేషన్ దగ్గర దొరికే ఫ్రెష్ కాఫీని సిప్ చేస్తే ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. చల్లని వాతావరణంలో హాట్ ఫుడ్ తినడం ఒక సౌఖ్యమైన ఫీలింగ్ను ఇస్తుంది.యాక్టివిటీస్మార్నింగ్ సమయంలో సూర్యోదయం చూడటం, పొగమంచులో నడవడం, అడవుల నుంచి వచ్చే శబ్దాలను వినడం, సైట్ సీయింగ్, స్థానికులతో మాట్లాడటం, లోకల్ మార్కెట్లో తిరగడం, హిల్ స్లోప్స్లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ ఈ ప్రదేశాలలో చేయాల్సిన యాక్టివిటీస్లో కొన్ని మాత్రమే. ఎం. జి.కిశోర్, ప్రయాణికుడు.. (చదవండి: ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!) -
కమల్ హాసన్ సౌందర్య చిట్కా..! ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి..
నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్ తనయగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గాయనిగా, నటిగా నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. శృతి ఎప్పటికప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన టిప్స్ షేర్ చేస్తూ..ఆరోగ్యంపై స్ప్రుహను కలిగిస్తుంటారామె. అలానే ఈసారి తన జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో షేర్ చేస్తూ..ఆ విషయంలో తన తండ్రి ఇచ్చిన సౌందర్య చిట్కా గురించి మాట్లాడింది. ఆ చిట్కా చాలా బాగా పనిచేస్తుందని, దాన్ని గట్టిగా నమ్ముతానంటూ ఆ బ్యూటి టిప్ గురించి వివరించింది. ఇంతకీ ఏంటా సౌందర్య చిట్కా అంటే..కూలీ నటి శృతి తాను ఆయిల్ని ఎంతో ఇష్టపడతానని, దీన్ని ఒంటికి, జుట్టుకి రాసుకుంటానని అన్నారామె. ఇదేమి రెసిపీ లాంటిది కాకపోయినా..ఎంతో ఇష్టమని అంటోంది. నువ్వులు, కొబ్బరి నూనెతో కలగలసిన నూనె అంటే మహా ఇష్టమని, ఇది చర్మానికి, జుట్టుకి బాగా పనిచేస్తుందని తన నాన్నే(కమల హాసన్) స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చింది. నిపుణులు ఏమంటున్నారంటే..జుట్టు ఆరోగ్యానికి నువ్వులు వల్ల కలిగే అనేక ప్రయోజనాల కారణంగా సాంప్రదాయంగానూ, ఆధునికంగా కేశ సంరక్షణకు ది బెస్ట్ అని అన్నారు. దీనిలో అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో నిండి ఉంటుందని తెలిపారు. తలకు తీవ్రంగా తేమను అందించి జుట్టు కుదుళ్లను బలపరిచి, పెరుగుదలను ప్రేరేపిస్తుందని అన్నారు. దీనిలో సహజంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని, వివిధ చర్మ సమస్యలను అరికట్టి..జుట్టు పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. అలాగే ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని డల్గా కానివ్వకుండా నిరోధిస్తాయని అన్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్లు తలకు రక్తప్రసరణను అందించి జుట్టు ఆరోగ్యానికి, విశ్రాంతికి సహాయపడతాయని చెప్పారు. అంతేగాదు ఆయుర్వేదం ప్రకారం..అన్ని నూనెల్లోకెల్లా నువ్వులు నూనె అత్యంత శ్రేష్టమైనదని అన్నారు. ఈ నువ్వుల నూనెని సౌందర్యం, ఔషధ ఉత్పత్తులలో వినియోగిస్తారని చెబుతున్నారు. సాంప్రదాయకంగా, నువ్వుల నూనె నాడీ వ్యవస్థపై వెచ్చదనాన్ని, ప్రశాంతతను కలిగించే ప్రభావాలను కలిగి ఉండటం వల్ల అత్యంత ప్రభావవంతమైన నూనెగా పేరుగాంచింది. అంతేగాదు ఆయుర్వేదం నువ్వుల నూనెను నూనెలకే రాజుగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాధికారకాలను నిర్మూలించి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శక్తిని సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తుందని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..) -
సామాజిక బాధ్యత అంటే ఇదే..!
రోడ్డుపై అనునిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఇది సర్వసాధారణ. కానీ క్షణంలో స్పందించి చేతనైన సాయం అందిస్తే..ప్రాణాలను రక్షించిన వాళ్లం అవుతాం. అయితే అందుకు ఎవ్వరూ ముందుకురారు. పోలీసు కేసులని, రిస్క్ అని భయంతో దూరంగా ఉండిపోతారు. కొందరు ముందుకొచ్చినా..మిగతా వాళ్లు సహకరించకపోవడంతో వెనకడుగువేస్తుంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం దీనిపై అవగాహన కార్యక్రమాలతో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది కూడా. కానీ ఈ అమ్మాయి దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించి ఘెర ప్రమాదాన్ని తప్పించింది.ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో అందుకు సంబంధించిన ఘటన రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోని గమనించకపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఆ మహిళను తప్పించబోయి ఆ ఆటోనే ఆమెపై బోర్లపడింది. స్కూల్ నుంచి వస్తున్న ఆ చిన్నారి రెప్పపాటులో స్పందించి ఒక్కసారిగా ఆ ఆటోని ఎత్తేసింది. అదంతా సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యింది. దాన్ని చూసిన సిటీ కమిషనర్ ఆ విద్యార్థిని పిలిపించి మరి ఆమె సాహసాన్ని మెచ్చుకోవడమే గాక సన్మానం చేసి అభినందించారు. ఇదీ సామాజిక బాధ్యతంటే అని నొక్కి చెప్పారు సిటీ కమిషనర్. *కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది ✊ అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన… pic.twitter.com/MqTuaqpGKh— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 12, 2026 (చదవండి: Asha Bhosle and Lata Mangeshkar: తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!) -
అక్కాచెల్లెళ్లు తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!
దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె. అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్కాస్ట్లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు. ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..గతేడాది ఆర్జే అన్మోల్, అతని భార్య నటి అమృతరావు హోస్ట్ చేసిన 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్కాస్ట్తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు. View this post on Instagram A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar) "నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం. ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె. కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు. భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్గ్రీన్ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె. View this post on Instagram A post shared by RJ Anmol 🇮🇳 (@rjanmol27) (చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!) -
ఎన్నడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ..!
బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశాభోంస్లే ఎనిమిది దశాబ్దాలుగా సాగిన నేపథ్య గాన వృత్తికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎందరో అభిమానుల మనసు దోచుకున్న ఆ మధుర స్వరం 92 ఏళ్ల వయసులో ఏప్రిల్ 12, 2026న నిశబ్దంగా మారిపోయింది. బహుళ అవయవాల వైఫల్యం కారణంగా గాయని ఆశా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా యావత్తు ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆ గాయని మిగిల్చిన కొన్ని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుందామా..79 ఏళ్ల వయసులో ఆశా మనీష్ మల్హోత్రా కోసం ర్యాంప్పై నడచి తనదైన శైలి, హుందాతనంతో అందర్నీ ఆశ్చర్యపరించారామె. దాని గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసని అంటున్నారు మనీష్ మల్హోత్రా నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ. తన షోలలో ఒకదానిలో ఆమె నడిచిన తీరును గుర్తుచేసుకుంటూ, ఆయన సోషల్ మీడియా పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. నా ఫ్యాషన్ వీక్ షోలో మీరు ఉన్నప్పటి చిత్రాలు ఇవి అంటూ నాటి ఫోటోలను షేర్ చేస్తూ..ర్యాంప్పై ఒక్కసారైన నడవాలన్నదే నా కోరిక అని నాతో చెప్పారు.ఆ నిమిత్తమై మేము మిమ్మల్ని సాధరంగా అడిగినప్పుడూ.. మీరు వెంటనే అంగీకరించిఎంతో హుందాగా, స్టైలిష్గా సంతోషంగా నడిచారు. మీరు అలా ర్యాంప్పై నడవగానే..ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అది నేనెప్పుడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ. మీరు ఎప్పటికీ మా హృదయలో పదిలంగా ఉంటారు అంటూ మల్హోత్రా తన పోస్ట్ని ముగించారు. కాగా, ఆశా భోంస్లే పార్థివ దేహాన్ని ముంబైలోని లోయర్ పరేల్లో ఉన్న ఆమె ఇంటికి తీసుకెవెళ్లారు. పార్థివ దేహాన్ని సోమవారం(ఏప్రిల్ 13, 2026) మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!) -
వధూవరులకు ‘దేవతాశీర్వాదం’
ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుకలో అరుదైన దృశ్యం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. సాధారణంగా జరిగే పెళ్లి వేడుకలకంటే భిన్నంగా, ఈ పెళ్లిలో దేవతలే దివి నుంచి దిగివచ్చినట్లుగా అనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ పెళ్లిలో, పెళ్లి కూతురి బంధువులు శివపార్వతులు, మహావిష్ణుమూర్తుల వేషధారణలో వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వినూత్న ఆశీర్వాద కార్యక్రమం పెళ్లి వేడుకకు మరింత శోభను తీసుకొచి్చంది. పెళ్లికి వచి్చనవారు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. -
వేయి యుద్ధాల విజేత
ఆమె పాడటానికి పోరాడింది. జీవించడానికి పోరాడింది. ‘సింగిల్ మదర్’గా పిల్లల్ని పెంచడానికి పోరాడింది. తన కంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని రెండో వివాహం చేసుకొని లోకంతో పోరాడింది. పాటకు చిరునామాగా ఎదిగిన సొంత అక్కను ఎదిరించి తన ఉనికి చాటుకోవడానికి పోరాడింది. ఆశా భోంస్లే తన అంతిమ శ్వాస వరకూ పోరాడుతూనే ఉంది. ప్రతి యుద్ధాన్ని గెలుస్తూనే ఉంది. ఆమె జీవితం అసామాన్యం. ఆమెకే సాధ్యం.తన సొంత అక్క లతా మంగేష్కర్ లానే ఆశా భోంస్లేకు కూడా చదువు లేదు. షోలాపూర్లో వీరి కుటుంబం ఉన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఫీజ్ కట్టలేక అక్కచెల్లెళ్లు ఇద్దరూ బడికి వెళ్లడం మానేశారు. నలుగురు అక్కచెల్లెళ్లు లత, ఆశ, ఉష, మీన... ఒక తమ్ముడు హృదయనాథ్... మొత్తం అయిదుగురు సంతానం. తమ్ముడు శారీరకంగా బలహీనుడు. తండ్రి దీనానాథ్ మరణానంతరం కుటుంబాన్ని మోయాల్సిన భారం లత తీసుకుంది. బొంబైలో చాలీ చాలని జీవితం మొదలైంది. ఆ సమయంలోనే ఆశాకు ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఆశా భోంస్లేది తన అక్కలాగా ఒద్దిక స్వభావం కాదు. స్వేచ్ఛ, సాహసం, తెగింపు ఆమె సొంతం. ఆకాశానికి తొందరగా ఎగిరి ఏమేమి వింతలున్నాయో చూద్దామని కోరిక. ఆ కోరిక ఆమెను తన కంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన గణ్పత్రావు భోంస్లేతో ప్రేమ వివాహం చేసుకునేలా ప్రేరేపించింది. గణ్పత్రావు అప్పుడప్పుడే సంగీతంలో ఎదుగుతున్న లతా మంగేష్కర్కు మేనేజర్. ఈ పెళ్లి లతాను శరాఘాతంగా తాకింది. మంగేష్కర్ కుటుంబ పరువు గంగలో కలిసిందని లతాకు అనిపించింది. ఈ పెద్ద సంసారంలో నుంచి బయటపడే వాకిలి దొరికిందని ఆశా భావించింది. కాని ఈ నిర్ణయం ఆశాను జీవితాంతం వెంటాడింది. అత్తగారింటిలో నానా బాధలు పడింది. చిన్న వయసులో ఇద్దరు పిల్లల్ని కని, ఆ తర్వాత మూడోసారి గర్భంతో ఉండగా ఇక ఆత్మహత్య చేసు కోలేక ఇంటి నుంచి పారిపోయింది. అయితే లత ఆమెను అడుగు పెట్టనివ్వలేదు. సినిమా రంగం ఇంకా ఆమెను గుర్తించనే లేదు. 18 ఏళ్లు కూడా నిండని గాయని, ముగ్గురు పిల్లల తల్లి, సినిమా రంగంలో నిలదొక్కుకోవాలి. ఆశా తన పోరాటం మొదలెట్టింది.క్లబ్ సాంగ్స్ కనికరంఆ రోజుల్లో ‘వ్యక్తిత్వం’ చాలా ప్రధానం. హీరోయిన్ వ్యక్తిత్వం, ఆమెకు పాడే గాయని వ్యక్తిత్వం పాత్రను బట్టి, పాటను బట్టి వెల్లడి అవుతాయి. హీరోయిన్ కు లతా మంగేష్కర్ పాడేది. అవి ‘వ్యక్తిత్వం’ ఉన్న పాటలు. కాని వేంప్లు ఉంటారు. వాళ్లకు ఎవరు పాడాలి? ఆశా భోంస్లేకు పిలుపు వచ్చింది. అలాంటి పాటలు పాడితే లోకం ఏమనుకుంటుంది? బతకడానికి దోవ చూపని లోకం ఏమనుకుంటే ఏమిటి... అని ఆశా రంగంలోకి దిగింది. ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ (‘శ్రీ 420’)లో నాదిరా పాట గుర్తు ఉందా? అది ఆశా పాడింది. అప్పుడే అదృష్టవశాత్తు హెలెన్ రంగ ప్రవేశం చేసింది. ఆమె డాన్సింగ్ గర్ల్. ఆమెకు సరిపడా డాన్సింగ్ వాయిస్ కావాలి. ఆశా భోంస్లే ఈ అవకాశాన్ని అందుకుంది. ఆశా ఫీల్డ్లో నిలవడానికి హెలెన్ డాన్స్, హెలెన్ డాన్స్లో రాణించడానికి ఆశా గొంతు ఒకరికి ఒకరు సాయం చేసుకున్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్లో లెక్కలేనన్ని హిట్ పాటలు వచ్చాయి. ‘పియా తూ అబ్ తో ఆజా’... ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ‘డాన్ ’లో ‘అయ్ మేరా దిల్ ΄్యార్ కా దీవానా’.... మెరుపుతీగ.నయ్యర్ సహకారంఎంత చెప్పినా ఎన్ని చేసినా సినిమా రంగం మగవారి సామ్రాజ్యం. ఇక్కడ ఎవరో ఒకరు అండగా ఉంటే తప్ప ఎదగడం కష్టం. అయితే ప్రతిభ లేకపోతే ఎవరూ అండగా నిలవరు. ఆశాకు ప్రతిభ ఉన్నా లతాకు భయపడి అవకాశాలు ఇవ్వడానికి జంకేవారు. ఆ రోజుల్లో ఆశా కోసం నిలబడిన వాడు సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్. లతాతో అస్సలు పాడించడానికి ఇష్టపడని ఈ మొండివాడు ఆశాకు పాటల దారులు పరిచాడు. ఆమె గొంతు చేరగల ఎత్తులకు చేర్చాడు. వీరిద్దరూ కలిసి లెక్కలేనన్ని హిట్స్ ఇచ్చారు. ‘జాయియే ఆప్ కహా జాయేంగే’ (మేరే సనమ్), ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’ (నయా దౌర్), ‘ఆయియే మెహర్బాన్ ’ (హౌరా బ్రిడ్జ్), ‘ఆవో హుజూర్ తుమ్కో’ (కిస్మత్)... ఎన్నని. ‘కాశ్మీర్ కీ కలీ’లో రఫీ, ఆశాలు చేసిన మేజిక్ ఓ.పి. నయ్యర్ వల్ల సాధ్యమైందే. అయితే నయ్యర్ ఆశా ఘనతను చాటాడే తప్ప గాయనిగా ఆశా స్టేటస్ పెంచలేకపోయాడు. దానికి ఖయ్యాం కావాల్సి వచ్చింది.ఉమ్రావ్ జాన్ కీ అదాఒక ఛాలెంజింగ్ వ్యక్తిత్వం మరో ఛాలెంజింగ్ గాయనికి జీవితం ఇవ్వడం ఇండియన్ స్క్రీన్ మీదే జరిగింది. ఉమ్రావ్ జాన్ అనే ‘తవాయిఫ్’ (దర్బారు గాయక నర్తకి) జీవితాన్ని సినిమాగా తీసినప్పుడు ఆమెకు మేచ్ అయ్యే గొంతు ఆశాదే అని భావించాడు సంగీత దర్శకుడు ఖయ్యాం. అప్పటివరకూ గజల్స్ను లతా మాత్రమే పాడాలనుకునేవారు. కాని ఖయ్యాం ఆశాతో పాడించాడు. ‘దిల్ చీజ్ క్యా హై ఆప్ మేరే జాన్ లీజియే’... ఉమ్రావ్ జాన్లో ఈ పాట ఆశాను జాతీయ గాయనిగా మార్చింది. జాతీయ పురస్కారం తెచ్చి పెట్టింది. తన సుదీర్ఘ పోరాటంతో తాను కేవలం క్లబ్ సాంగ్స్ గాయని కాదనీ ఉత్కృష్ట గాయని అని ఆశా నిరూపించింది.ఆర్.డి. బర్మన్ శకంఆ తర్వాత ఆర్.డి. బర్మన్ వచ్చి ఆశా గొంతు ఎంత వర్సటైలో లోకానికి చూపించాడు. ‘తీస్రీ మంజిల్’లో ‘ఆజా ఆజా మై హూ ΄్యార్ తేరా’ సంచలనం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక పాట ముళ్లు లేని గులాబి పువ్వులా శోభిస్తూనే ఉంది. అది – ‘చురాలియా హై తుమ్ మేరే దిల్కో’. తర్వాతి రోజుల్లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ జోడీకి గుల్జార్ తోడయ్యాక ఇంకా గొప్ప పాటలు చోటు చేసుకున్నాయి. ‘మేరా కుచ్ సామాన్ ’ (ఇజాజత్)... ‘రోజ్ రోజ్ ఆంఖో తలే’ (జీవా)... అభిరుచి ఉన్న రసజ్ఞులను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగులో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జీవితం సప్త సాగర గీతం’ ఒక మనోహర గీతం.పాట... వంటస్త్రీకి ఆర్థిక స్వాతంత్రం, ఆత్మనిర్భరత ఉండాలని భావించిన ఆశా భోంస్లే గాయనిగా కొనసాగుతూనే వ్యాపార రంగంలో కూడా తన ప్రతిభ చూపింది. ఆమె స్వయంగా గొప్ప వంటగత్తె. అందుకని దేశంలోనే కాదు దుబాయ్లో కూడా అనేక రెస్టరెంట్లను ప్రారంభించింది. ఆమె అన్ని రెస్టరెంట్లు గొప్ప జనాదరణ ΄÷ందుతున్నాయి. జీవితంలో బంధాల రుచి కూడా ఉండాలని భావించిన ఆమె ఆ తర్వాతి రోజుల్లో అక్క లతాతో సయోధ్య చేసుకోగలిగింది.ఉత్సాహ స్వరంజీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ఆశా తన స్వరంలో ఉత్సాహాన్ని తప్పిపోనివ్వ లేదు. లైవ్షోస్ చేస్తూ ప్రపంచాన్ని చుట్టిందామె. నాటి తరంతో నేటి తరం వరకూ పని చేసింది. ఏ.ఆర్. రెహమాన్ ‘రంగీలా’ పాటలు సూపర్ హిట్ కావడానికి ఆశా భోంస్లే గళం ఒక కారణం. దక్షణాదిలో ఇళయరాజా సంగీతంలో చాలా పాటలు పాడిందామె. ‘నా అభిమాన గాయని ఆశా’ అని ఇళయరాజా చెప్పుకున్నారు. ఆయన సంగీతంలో ఆశా పాడిన ‘ఓ ప్రేమా’ (అశ్వమే థం) పాట చాలా బాగుంటుంది. కృష్ణవంశీ తీసిన ‘చందమామ’లో ఆశా పాట ‘నాలో ఊహలకు నాలో ఊసులకు’ చాలా బాగుంటుంది. ఆశా భోంస్లే జీవితం ఓటమికి వెరువకు అని చెప్తుంది. జీవన గీతాన్ని కొనసాగిస్తూ ఉండమని ఉపదేశం ఇస్తుంటుంది. ఆశా నోట తెలుగు పాటఆశా భోంస్లే హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళం వంటి 20కి పైగా భాషల్లో సుమారు 11,000లకు పై చిలుకు పాటలు పాడారు. అంతేకాదు అన్ని పాటలు పాడినందుకుగానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సొంతం చేసుకున్నారామె. అయితే తెలుగులో ఆమె తక్కువ పాటలు పాడినప్పటికీ అన్నీ ఆల్ టైమ్ హిట్స్గా నిలవడంతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకున్నారు ఆశా భోంస్లే. తెలుగులో ఎంతో మధురంగా ఆమె పాడిన పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టులో ఉంటాయనడం అతిశయోక్తి కాదు. మంచు మోహన్ బాబు, జయప్రద జోడీగా దాసరి నారా యణరావు దర్శకత్వం వహించిన ‘పాలు–నీళ్లు’ (1981) తెలుగులో ఆమెకు తొలి చిత్రం. ఈ మూవీలో ‘ఇది మౌనగీతం ఒక మూగరాగం పాడింది...’ అనే పాటని ఆలపించారు. ‘చిన్ని కృష్ణుడు’ (1988) చిత్రంలో ‘జీవితం సప్త సాగరం..’, ‘అశ్వమేథం’ (1992) మూవీలో ‘సీతాకాలం ప్రేమకు, ఓ ప్రేమ’ వంటి పాటలు ఆలపించారు. అలాగే ‘ప్రేమకు ప్రేమంటే తెలుసా’ (1995) సినిమాలో ‘జలంధి మధి..’, ‘పవిత్ర బంధం’ (1996) చిత్రంలో ‘ఐస్సలకిడి..’ పాట ఆలపించారు. అదే విధంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన ‘ఇద్దరు’ (1997) మూవీలో ‘వెన్నెల..’ పాట పాడారామె. కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చందమామ’ సినిమాలో ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు...’ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెలోడీ సాంగ్ని ఇప్పటికీ యువత తెగ ఇష్టపడుతుంటారు.అవార్డులుఅద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆశా భోంస్లే తన ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ‘ఉమ్రావ్ జాన్ ’ సినిమా కోసం పాడిన ‘దిల్ చీజ్ క్యా హై...’ పాటకి బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా 1981లో, ‘ఇజ్జత్’ చిత్రంలో పాడిన ‘మేరా కుచ్ సమాన్ ...’ సాంగ్కి బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్గా 1986లో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు ఆశా భోంస్లే. అదే విధంగా చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ని (2000) అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి 2008లో ‘పద్మ విభూషణ్’ అవార్డు సొంతం చేసుకున్నారు. అదే విధంగా 2001లో ఫిల్మ్ ఫేర్ నుంచి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 18 మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులు, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు.ఐదొందలు పందెం...తన కెరీర్లో ఎన్నో వేలకు పైగా పాటలు పాడిన ఆశా భోంస్లేకి ఓ పాట సవాల్ విసిరిందంటే విశేషమనే చె΄్పాలి. షమ్మీ కపూర్, ఆశా పరేఖ్, హెలెన్, ప్రేమనాథ్, ఇఫ్తేకర్, ప్రేమ్ చోప్రా ప్రధాన పాత్రల్లో విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తీస్రీ మంజిల్’. నాసిర్ హుస్సేన్ నిర్మించిన ఈ సినిమా 1966 అక్టోబరు 21న విడుదలైంది. ఆర్డీ బర్మన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని హిట్ సాంగ్ ‘అహహ ఆజా...’ పాటను మహ్మద్ రఫీతో కలిసి పాడారు ఆశా భోంస్లే. ఈ పాట పల్లవి ఆఖరున వచ్చే ‘అహహ ఆజా అఅ ఆజా..’ను విభిన్నంగా పాడాల్సి వచ్చిందట. అయితే అనుకున్నట్లు రాకపోవడంతో వేరే శైలిలో చేద్దామని ఆర్డీ బర్మన్ ఆమెను అడిగారట.. ‘వేరేలా అవసరం లేదు... నేను పాడగలను’ అన్నారట ఆశా. ‘అహహ ఆజా..’ను మహ్మద్ రఫీ బాగా పాడగలడని నాసిర్ హుస్సేన్, ఆయన కన్నా ఆశా భోంస్లే బాగా పాడగలదంటూ ఆర్డీ బర్మన్ సరదాగా రికార్డింగ్ స్టూడియోలోనే రూ. 500 పందెం వేసుకున్నారట. ఈ పాట సమయంలో బర్మన్ –ఆశా æ మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి దారి తీసింది. 1980లో వీరి పెళ్లి జరిగింది. 1994లో ఆర్డీ బర్మన్ మృతి చెందారు.– ఖదీర్ -
'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!
92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మరణంతో, ప్రపంచం వేలాది పాటలు పాడిన ఒక గాత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, హుందాతనానికి, ఫ్యాషన్ శైలికి కంచుకోట అయినా ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అంటున్నారు ఫ్యాషన్ నిపుణుల. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'దమ్ మరో దమ్' వంటి అనేక హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన ఆమె ఆహార్యం పరంగా నిరంతరం కొత్తదనాన్ని కోరుకునేవారని చెబుతున్నారు. మరి ఆశా ఫ్యాషన్ పరంగా ఎలాంటివి ఇష్టపడేవారు, చీరల సెలక్షన్ తదితర విశేషాల గురించి తెలుసుకుందామా..!.రూపం పరంగా రాజీపడని విధంగా రెడీ అయ్యేవారట. వాటిలో అత్యంత హైలెట్ అయ్యేవి ఆమె చీరలు. ఆమె వార్డ్రోబ్ మొత్తం మహారాష్ట్ర సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆమె తరుచుగా మందపాటి బంగారు జరీ అంచులతో కూడిన ఐవరీ క్రీమ్ లేదా పాస్టల్ రంగులో ఉండే బరువైన పట్టు లేదా కాటన్ సిల్క్ చీరలనే ఇష్టపడేవారట. ముక్కుపుడక..ఇక ఆశాలో మరో ప్రత్యేకత ముక్కుపుడక. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర ముక్కుపుడక లేకుండా అలంకరణ పూర్తి చేసేవారు కాదట. ఇది ఆమె మూలాల నేపథ్యాన్ని, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఇలా ఆమె పండుగలు, పర్వదినాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం మహారాష్ట్ర శైలి ముక్కుపుడకనే ధరించేవారట. ముఖాన కచ్చితంగా ఎర్రటి బొట్టు గుండ్రంగా పెద్దదిగా ఉండాల్సిందేనట. ఇది ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు గాయని ఆశ అనేక వరుసల ముత్యాల హారాలు, బరువైన బంగారు లేదా వజ్రాల ఆభరణాలు లేకుండా బయటకు వచ్చేవారు కాదట. సింపుల్గా చెప్పాలంటే సాంప్రదాయన్ని, ఆధునికతను మేళవించేలా ఆభరణాలను ఎంచుకునేవారట. అంతేగాదు ఆమెను అభిమానులు ఎక్కువగా సొగసైన చీరలు, చక్కగా చుట్టిన కొప్పులోనే గుర్తించుకుంటారు. చెప్పాలంటే అభిమానుల హృదయంలో తన వేషధారణ నాటుకుని పోయేలా ఆహార్యాన్ని మెయింటైన్ చేసేవారు. పైగ మహారాష్ట్ర ప్రజలు ఆమెను ముద్దుగా 'ఆశా తాయ్'(తాయ్ అంటే మహారాష్ట్రలో అక్క అని అర్థం) అని పిలుచుకుంటుంటారు. అంతేగాదు ఆమె ప్రసిద్ధ పాప్ సంగీతం.. 1997లో లెస్లే లూయిస్తో కలిసి 'జనం సంఝా కరో' అనే విలక్షణమైన పాటను విడుదల చేసే టైంలో కూడా పాశ్చాత్య దుస్తులను ధరించడానికి ఒప్పుకోలేదు. మ్యూజిక్కి వేషధారణతో పనిలేదని, జనాల మనసుకు హత్తుకుందా లేదా అనేది ముఖ్యం అని అన్నారు. చివరి వరకు ఆశా తన సంగీత కచేరీలలో ఎర్రటి బొట్టు, అందమైన మహారాష్ట్ర చీరలతోనే విలక్షణంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) (చదవండి: ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..) -
ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..
ప్రముఖ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో ఛాతీ ఇన్ఫెక్షన్తో కన్నుమూశారు. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎంత తీవ్రతరంగా ఉంటాయి, అలాగే సత్వరమే చికిత్స అందించడం ఎంత కీలకం అని చెప్పే ఘటన ఇది. నిజానికి గాయని ఆశా ఛాతీ ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి..చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఛాతీ ఇన్ఫెక్షన్ అంత ప్రమాదకరమైనదా..?, వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.ఆశా భోంస్లేని తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమస్యలకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించినా..వయసు పైబడటంతో ఆ ఇన్ఫెక్షన్ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి చివరికి ఆశా భోంస్లే మరణానికి దారితీసిందని వెల్లడించారు వైద్యులు.ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే..ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళాలకు సోకే ఇన్ఫెక్షన్. వీటిలో సర్వసాధారణమైన రకాలు శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయిన బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కణజాల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా. ఈ పరిస్థితులు శరీరంలో వాపు, శ్లేష్మం పేరుకుపోవడం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. 90 ఏళ్లు పైబడిన వారిలో, ఒక 'సాధారణ' ఛాతీ ఇన్ఫెక్షన్ సైతం కూడా ప్రాణాంతకం కావచ్చు.ప్రభావం ఎలా ఉంటుందంటే..ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతుందిబలహీనమైన కండరాలు దగ్గడం, యు శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయితక్కువ రోగనిరోధక శక్తి కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందిశరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో గుండెపై భారం పెరుగుతుందిఈ పరిస్థితుల్లో, శరీరం తరచుగా తన శక్తిలో ఎక్కువ భాగాన్ని కేవలం శ్వాస తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మాత్రమే ఉపయోగించే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల ఇతర అవయవాలకు శక్తి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బహుళ అవయవాల ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అందుకే తీవ్రమైన అలసట (నీరసం) వంటి లక్షణాలు కేవలం దుష్ప్రభావాలు మాత్రమే కావు, అవి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పే సూచన అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.ఇక్కడ ఆశా భోంస్లే విషయంలో ఇన్ఫెక్షన్తో పాటు అప్పటికే తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండిటి కలయిక రోగి పరిస్థితిని క్రిటికల్ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు రాత్రికి రాత్రే తీవ్రం కావడం చాలా అరుదు. అవి తరచుగా తేలికపాటి, సులభంగా గుర్తించలేని లక్షణాలతో ప్రారంభమవుతాయి. వృద్ధులలో, దీర్ఘకాలిక దగ్గు, స్వల్ప శ్వాస ఇబ్బంది, తక్కువ స్థాయి జ్వరం, గందరగోళం లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి అనారోగ్య సంకేతాలను అందిస్తుంది. యువకులతో పోలిస్తే, వృద్ధుల్లో ఎల్లప్పుడూ వ్యాధికి సంబంధించిన సాధారణ, స్పష్టమైన లక్షణాలను చూపించకపోవచ్చని అందువల్లే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా అయితే ఆకలి తగ్గడం, నీరసం లేదా ఆకస్మిక అలసట వంటివి కొన్నిసార్లు వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలుగా (red flags) ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో, కుటుంబ సభ్యులు ఈ మార్పులను వృద్ధాప్య సహజ లక్షణాలుగా పొరబడి, వైద్య సహాయం తీసుకోవడంలో జాప్యం చేస్తుంటారని అన్నారు.నివారణ..ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా అనారోగ్య ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక శ్వాసకోశ సంబంధిత లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఆశా భోంస్లే గారి ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా శరీరం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం అని అంటున్నారు. అలాగే అరుదుగా మాత్రమే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు తీవ్రరూపం దాల్చుతాయని, పైగా తేలికపాటి లక్షణాలతో కొట్టిపారేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: రెండేళ్లుగా వ్యాన్లోనే బందీ..! పాపం చివరికి..) -
రెండేళ్లుగా వ్యాన్లోనే బందీ..! పాపం చివరికి..
కొన్ని ఘటనలు ఎంత అమానుషంగా ఉంటాయంటే మనిషన్నవాడే కనుమరుగైపోతున్నట్లుగా ఉంటుంది. కన్నతండ్రే ఘోరంగా ప్రవర్తించడం చూస్తుంటే..చిన్నచిన్న జంతువులే తమ పిల్లలను కంటికిరెప్పలా కాచుకుంటాయే మరి విచక్షణ జ్ఞానం ఉన్న మనకేమవుతోందో అర్థమవడం లేదు. స్వలాభం, స్వప్రయోజనం ఇంతేనా జీవితం. ఒక మనిషిని బాధపెడితేనే మనం సుఖంగా ఉంటాం. ఈ ప్రకృతి నినాదం జంతువులు అర్థ చేసుక్నుట్లు స్వార్థపూరిత మనుషులకు అర్థం కాదేమో కాబోలు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే పాపం ఆ పసివాడికి కన్నతండ్రే దారుణంగా విధించిన శిక్ష తెలిస్తే..ఏ మనిషివిరా నువ్వు అన్నంత కోపం కట్టలు తెంచుకుంటుంది. అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్లోని హాగెన్బాచ్ గ్రామంలో, నవంబర్ 2024 నుంచి తొమ్మిదేళ్ల బాలుడు యుటిలిటీ వ్యాన్లో బంధించబడ్డాడు. ఆ సమీపంలోనొ ఒక వ్యక్తి ఆ వ్యాన్ నుంచి బాలుడి అరుపుల్లా వినిపిస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి రాగానే అక్కడే నిరుపయోగంలోని ఓ వ్యాన్ కనిపించింది. అందులో బాలుడి అరుపులేంటి అన్నట్లుగా నమ్మశక్యంగా చూశారు. చివరకి ఆ వ్యాన్ చుట్టూ ఉన్న చెత్తను తొలగించి బలవంతంగా డోర్ తెరవగా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అక్కడ ఆ బాలుడు నగ్నంగా తీవ్ర పోషకాహార లోపంతో కనపించాడు. అలా కూర్చొనే ఉండటంతో నడవలేని స్థితికి వచ్చేసి ఉన్న పసివాడిని చూసి పోలీసులే దిగ్బ్రాంతి చెందారు. కదలికలు లేకుండా అన్నేళ్లు అలా నిర్బందించి ఉండటం వల్ల అతడిలో కలికలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ వ్యాను స్విట్జర్లాండ్, జర్మనీ సరిహద్దులకు సమీపంలో హాగెన్బాక్లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా..భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. తండ్రే దీనంతటికి కారణమని తేలింది. ఏడేళ్ల వయసున్న బాలుడిని తన భార్య మెంటల్ ఆస్పత్రిలో చేర్చించాలి ఫోర్స్ చేసిందని, గత్యంతరం లేక ఇలా వ్యాన్లో దాచినట్లుగా తండ్రి చెప్పాడు. తీరా అతడి భార్యను విచారిస్తే..తనకసలు ఆ బాలుడి గురించి ఏమి తెలియదని బుకాయించింది. అనుమానంతో పోలీసులు ఆ దపంతులపై పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఆ బాలుడికి 12 ఏళ్ల సోదరి కూడా ఉందని తెలిసింది. అంతేగాదు స్కూల్లో మంచిప్రతిభ కనబర్చేవాడని, అలాగే అతడికి ఎటువంటి మానసిక సమస్యలు లేవని వెల్లడించారు పోలీసులుఆమెను కూడా రెండేళ్లక్రితం అంటే పదేళ్ల వయసులో సామాజిక సేవల సంరక్షణలో ఉంచినట్లు వెల్లడైంది. అయితే ఆ బాలుడు విచారణలో తన తండ్రి తన భార్యతో సమస్యలున్నాయని, అందువల్ల తానిలా బంధింపబడక తప్పలేదని చెప్పుకొచ్చాడు. అతడికి తండ్రే స్వయంగా రెండుసార్లు ఆహారం, వాటిర్ బాటిల్స్ విండో గుండా విసిరేవాడని చెప్పుకొచ్చాడు. ఆ బాలుడు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లలోనే మలమూత్రాదులు వెళ్లేవాడినని చెబుతుంటే..మరి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయారు పోలీసులు. 2024లో చేసిన చివరి స్నానం..ఇక అక్కడ నుచి అలానే వ్యాన్లో మగ్గిపోయాడు ఆ పసివాడు. దీంతో పోలీసులు ఆ బాలుడి తండ్రిపై అపహరణ, మైనర్ సంరక్షణలో విఫలమవ్వడం తదిరత కేసులన్నిటిని నమోదు చేసి అరెస్టు చేశారు. అంతేగాదు ఇందుకు సహకరించిన ఆమె భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఆ పసివాడికి ఇది జీవితాంత ఓ పీడకలలా వెంటాడుతుంది. అంతతొందరగా బయటపడి..అందరి పిల్లల్లా హాయిగా జీవితాన్ని గపడానికి చాలా ఏళ్లే పట్టొచ్చు. (చదవండి: స్లాబ్లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...) -
స్లాబ్లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇల్లు కొలిమిలా అనిపించడం మనకు చిరపరిచితమే. ఫ్యాన్లు పూర్తి వేగంతో తిరుగుతున్నా గాలి సరిపోనట్టుగా ఉక్కపోతగా అనిపిస్తుంది. దానికి కారణం... ఇంటి పైకప్పు నుంచి వెలువడే వేడి , ఇంటి పైకప్పు రోజంతా వేడిని పీల్చుకుని, దానిని నెమ్మదిగా మన నివాస స్థలంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. అదే మనకు తీవ్రమైన తాపాన్ని కలిగిస్తుంది. తత్ఫలితంగా పుట్టే భరించలేని ఉక్కపోత నుంచి ఎయిర్ కండిషనర్లు ఉపశమనం కలిగిస్తాయి, కానీ అవి జేబుకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా చిల్లులు పెడతాయి. ఏటా అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్న పరిస్థితుల్లో.. విద్యుత్ పై ఎక్కువ ఆధారపడకుండానే మన ఇల్లు చల్లగా మార్చగలిగితే ఎంత బాగుంటుందో కదా... ఊహకే ఆనందాన్ని ఇచ్చే ఈ భావన వాస్తవంలో సాధ్యమేనా? అంటే ఒక సులభమైన, కాలపరీక్షకు నిలిచిన శీతలీకరణ చిట్కా ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని సంప్రదాయ పద్ధతిలో నిర్మాణాలు సాగించేవారు చెబుతున్నారు.వంటికి... ఇంటికీ కూడా... ఫిల్లర్ స్లాబ్ఈ సమస్యకు సమాధానం సాదాసీదా మట్టి కుండల రూపంలోనే ఉంది. వంటిని చల్లబరిచే చల్లని నీటి కోసం ఫ్రిజ్ కు బదులు మట్టి కుండను ఎలా నమ్ముతున్నామో అలాగే ఇంటి చల్లదనానికి కూడా అవే ఉపకరిస్తాయి అని అంటోంది ఫిల్లర్ స్లాబ్ అనే నిర్మాణ శైలి. ఫిల్లర్ స్లాబ్ అనే పేరున్న ఈ పురాతన నిర్మాణ పద్ధతి ఓ సాంప్రదాయ జ్ఞానాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువస్తోంది. ఈ పద్ధతిలో, కాంక్రీటు పోయడానికి ముందు మట్టి కుండలను పైకప్పు లోపల తలక్రిందులుగా ఉంచుతారు. నిర్మాణం గట్టిపడిన తర్వాత, ఈ కుండలు స్లాబ్ లోపల చిన్న గాలి గదులను సృష్టిస్తాయి. ఈ గదులు సహజమైన ఇన్సులేషన్గా పనిచేస్తాయి, పైకప్పు నుంచి ఇంటిలోకి వేడి బదిలీని నెమ్మదింపజేస్తాయి. తక్కువ కాంక్రీటు వాడకంతో, పైకప్పు మొదటి నుంచే తక్కువ వేడిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది దాని స్వభావ రీత్యా, వేడి చొచ్చుకుపోవడాన్ని మట్టి, నిరోధిస్తుంది. ఫలితం? ఎలాంటి యాంత్రిక జోక్యం లేకుండానే, ఇళ్లు చెప్పుకోదగిన రీతిలో చల్లగా ఉంటాయి, కొన్నిసార్లు ఇతర సాధారణ నిర్మాణ శైలి ఇళ్లతో పోలిస్తే 50 శాతం ఎక్కువ కూడా చల్లగా ఉంటాయి. అంతేకాకుండా మట్టి కుండలు అందుబాటు ధర్లోనే లభిస్తాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇందులో ఎలాంటి సంక్లిష్టమైన సాంకేతికత లేదు ఇది కేవలం సాంప్రదాయ జ్ఞానంలో పాతుకుపోయిన ఆలోచనాత్మకమైన రూపకల్పన మాత్రమే. దీనివల్ల కలిగే ప్రయోజనాలు సౌకర్యానికి మించి ఉంటాయి. ఇళ్లలో వేడి తగ్గడం అంటే ఎయిర్ కండిషనర్లపై ఆధారపడటం తగ్గడం, దీనివల్ల విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా, ఇది నివాస గృహాలకు మాత్రమే కాక భూగ్రహానికి కూడా గణనీయమైన రీతిలో మంచి మార్పును తీసుకురాగలదు. ఆసక్తికరంగా, వేసవిలో ఇళ్లను చల్లగా ఉంచే అవే గాలి బుడగలు శీతాకాలంలో వెచ్చదనాన్ని నిలుపుకోవడానికి కూడా సహాయపడతాయి, తద్వారా నివాసాలు ఏడాది పొడవునా మరింత సౌకర్యవంతంగా మారతాయి. ఆధునిక నిర్మాణం తరచుగా వాతావరణానికి అనుగుణమైన రూపకల్పనను విస్మరిస్తుంది. మరోవైపు ఎయిర్ కండిషనర్ల వాడకం సర్వసాధారణం కాకముందే, దేశవ్యాప్తంగా సాంప్రదాయ వాస్తుశిల్పం అప్పటికే తెలివైన, సుస్థిరమైన మార్గాలలో పర్యావరణానికి అనుగుణంగా మారుతోంది.ఆధునిక సమస్యలకు పరిష్కారాలు ఎల్లప్పుడూ కొత్తవిగానే ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఫిల్లర్ స్లాబ్ వంటి పద్ధతుల పునరుజ్జీవనం మనకు గుర్తు చేస్తుంది. నగరాలు వేడెక్కుతూ, ఇంధన అవసరాలు పెరుగుతున్న కొద్దీ, మనం నిర్మించే విధానంలో చేసే చిన్న మార్పులు, మనం జీవించే విధానంలో పెద్ద మార్పులకు దారితీయగలవు. ఒక మట్టి కుండ వంటి అత్యంత సాధారణ చవకైన వస్తువు చల్లదనాన్ని సౌకర్యాన్ని అందిస్తూనే పర్యావరణ నష్టాన్ని కూడా నివారించే శక్తి కలిగి ఉంది అని మనం గుర్తిస్తే...మన నివాసాలు బాగుంటాయి..భవిష్యత్తు భధ్రంగా ఉంటుంది.(చదవండి: స్నేహితుడి కోసం ఏకంగా రూ. 37 లక్షల లగ్జరీ కారులో..!) -
అత్యంత విశిష్టత కలిగిన ప్రాంతం..కానీ అక్కడకు వెళ్లాలంటే..!
పిల్లలూ! మన దేశంలో కేవలం చారిత్రక, పర్యాటక ప్రదేశాలే కాదు. విశిష్టత కలిగిన అనేక ప్రాంతాలున్నాయి. అందులో ఒకటి ‘నాథూ లా’. ఇది హిమాలయాలలోని డోంగ్క్యా శ్రేణిలో, టిబెట్లోని చైనా యాడాంగ్ కౌంటీకి, భారత రాష్ట్రమైన సిక్కింకు మధ్య ఉన్న ఒక పర్వత మార్గం. 4,310 మీటర్లు అంటే సుమారు 14,140 అడుగులు ఎత్తులో ఈ మార్గం ఉంది. 1950లలో సిక్కిం రాజ్యంలో జరిగే వాణిజ్యం కోసం ఈ మార్గాన్ని వినియోగించేవారు. 1962 నాటి చైనా–భారత యుద్ధం తర్వాత చైనా, భారతదేశాలు దౌత్యపరంగా ఈ మార్గాన్ని మూసివేశాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. తర్వాతి కొన్ని దశాబ్దాల్లో రెండు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో 2006లో నాథూ లాను తిరిగి తెరిచారు. దీంతో కైలాస పర్వతం, మానస సరోవర యాత్రకు ఒక ప్రత్యామ్నాయ మార్గం లభించింది. అయితే భారీ మంచు కురవడం వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా సరిహద్దు వాణిజ్యం సంవత్సరానికి 7 నుండి 8 నెలల పాటు మాత్రమే సాధ్యమవుతుంది. నాథూ లా భారత్–చైనా దేశాల సైన్యాల మధ్య ఉన్న ఐదు సరిహద్దు సిబ్బంది సమావేశ కేంద్రాలలో ఒకటి.భారత్–చైనా మధ్య ఉత్తరాల బట్వాడా కూడా ఈ మార్గంలో సాగుతుంది. గురువారాలు, ఆదివారాలలో ఉదయం 8:30 గంటలకు కేవలం 3 నిమిషాల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది. నాథూ లాలోని షెరాతాంగ్ సరిహద్దు పోస్ట్ వద్ద ఆయా దేశాల తపాలా సిబ్బంది ఉత్తరాలను తీసుకుంటారు. ఈమెయిల్, ఇంటర్నెట్ రావడంతో ప్రస్తుతం ఉత్తరాలు రాసేవారి సంఖ్య తగ్గినా, మన దేశంలోని టిబెటన్ శరణార్థులు లేదా సరిహద్దుకు ఇరువైపులా బంధువులు ఉన్న స్థానికులు ఇంకా ఈ సేవల్ని వాడుతున్నారు. కొన్నిసార్లు ఏ ఉత్తరాలూ లేకపోయినా తపాలా సిబ్బంది ఖాళీ సంచులు అటూఇటూ మార్చుకుంటారు. ఈ ప్రదేశాన్ని చూడాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఒక రోజు ముందుగా అనుమతులు పొందిన తర్వాత, భారత పౌరులు మాత్రమే గురువారం నుంచి ఆదివారం వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించగలరు. -
రేంజ్ మారినా.. మారిపోని ఫ్రెండే ఇతడు..!
స్నేహానికి ఉన్న శక్తి మరొకటి లేదు. ట్రెండ్ మారినా..స్టేటస్ మారినా..ఫ్రెండ్ మారడు అనేందుకు ఈ వ్యక్తే నిదర్శనం. ఎంత పెద్ద హోదాలో చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నా.. కేవలం తన స్నేహితుడి కోసం నిస్వార్థంగా చేస్తున్న అతడి సాయం చూస్తే..కళ్లల్లో నీళ్లు తిరుగతాయ్..!. ఇంతకీ అతడేం చేశాడంటే..గురుగ్రామ్లో ఒక విలాసవంతమైన కారు డిక్కీలో బేకరీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో అంత ఆసక్తికరమైనది ఏం ఉందంటే.. హర్ష్ చౌహన్ అనే అకౌంట్ నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఆ వ్యక్తి తన ఖరీదైన కారు డిక్కీని తెరిచి, అమ్మకానికి ఉంచిన బేకరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. నీద్గగర రూ. 37 లక్షల ఖరీదు చేసే కారు ఉంది మరి ఇదేంటన్ యూజర్ చౌహన్ అడగ్గా..తాను జర్మనీలో మెడికల్ రీసెర్చ్ సైంటిస్టునని బాంబు పేలుస్తాడు. ఇదంతా కేవలం తన స్నేహితుడికి మద్దతు ఇచ్చేందుకని కూల్గా చెబుతాడు. వైరల్ అవుతున్న వీడియోలోని కథ నిజమేనా కాదా అని పలువురు మీడియా ఔత్సాహికులు ఆరా తీయగా..అతడు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన రీసెర్చ్ సైంటిస్ట్ అవధేష్ అని తేలింది. అతడితో మాట్లాడగా..తాను జర్మనీలో మూడేళ్లుగా మెడికల్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నాని, ప్రస్తుతం ఉద్యోగానికి బ్రేక్ తీసుకున్నట్లు అవధేష్ పేర్కొన్నాడు.ఆ నేపథ్యంలోనే తన కారుని తాత్కాలిక చట్కారా ఆన్ వీల్స్' అనే స్టాల్గా ఉపయోగించి బేకర్ ఉత్పత్తులు అమ్ముతూ.. స్నేహితుడికి ఫుడ్ వ్యాపారంలో సాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక్కడ భారత్లో తన స్నేహితుడు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక..తాను తిరిగి జర్మనీకి వెళ్లిపోతానని చెబుతుండటం విశేషం. అందుకు సుమారు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపాడు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా..మారిపోని ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. స్నేహం కోసం కొందరు ఎంత దూరమైన వెళ్తారు. అలాంటి వ్యక్తులను పొందడం అనేది కొన్ని కోట్ల కన్నా విలువైన సంపద అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు అతడి నిస్వార్థ సేవకు మాటల్లేవ్ బ్రో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Harsh Chauhan • Raw Life (@otherharsh) (చదవండి: ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!) -
'ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!
పొద్దున్నే స్కూల్కి లేదా ఉద్యోగాలకో, ఫంక్షన్లకో వెళ్ళేముందు ముఖానికి పౌడర్ రాసుకుంటారా? ఇలా రాసుకోవడం ఎలా మొదలైంది? అసలు ఫేస్ పౌడర్ కథేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పౌడర్ ప్రాచీన ఈజిప్ట్ నుండి వచ్చింది. పురావస్తు అవశేషాలు, రసాయన విశ్లేషణల ప్రకారం క్రీ.పూ.2000–1200 మధ్య కాలంలో అప్పటి ప్రజలు ముఖానికి పౌడర్ రాసుకున్నట్లు చరిత్రకారులు గుర్తించారు. ప్రాచీన ఈజిప్షియన్ల సమాధుల్లో దొరికిన సౌందర్య సాధనాల్లో పౌడర్ కూడా ఉండటం విశేషం. ఆ రోజుల్లో పురుషులు, మహిళలు తమ చెంపల కోసం ఎర్ర గైరిక్ నుండి తయారు చేసిన పౌడర్ బ్లష్ను ఉపయోగించేవారు. ముఖానికి వేసుకునే పౌడర్కు ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆ రోజుల్లో భావించేవారు. ఆధునిక కాలంలో మేకప్ను స్థిరపరచడానికి, చర్మాన్ని మెరిచేలా చేయడానికి పౌడర్ను ఉపయోగిస్తారు. 1980లు మరియు 90లలో పౌడర్ చివరకు మేకప్ను సెట్ చేయడానికి ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది. ఈ రోజుల్లో చాలామంది పౌడర్ కచ్చితంగా వాడుతున్నారు. ఫేస్ పౌడర్లు రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది. ఒకటి లూజ్ పౌడర్. ఇది జిడ్డు చర్మంలోని అదనపు తేమను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. మరొకటి ప్రెస్డ్ పౌడర్. ఇది మచ్చలను కప్పిపుచ్చడానికి పనికొస్తుంది. (చదవండి: అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?) -
అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?
ఇది పరీక్షల కాలం. పిల్లలతోపాటు పెద్దలూ హడావిడి పడుతుంటారు. అసలీ పరీక్షలు ఎవరు కనిపెట్టారంటూ కొందరు పిల్లలు విసుక్కుంటుంటారు. లిఖిత పూర్వక పరీక్షలు కనిపెట్టిన దేశం ఏదో తెలుసా? చైనా. అవును! ప్రామాణికతో కూడిన లిఖిత పరీక్షలను మొదట చైనాలో అమలు చేశారు. వీటిని ‘కేజు’ అని పిలిచేవారు. సుయి రాజవంశం క్రీ.శ. 605లో ఉద్భవించింది. దాని వారసురాలైన టాంగ్ రాజవంశం, వు జెటియాన్ పాలనలో పరీక్షా విధానం మొదలైంది. సాంగ్ రాజవంశం కాలంలో కేవలం గొప్ప ఇళ్ల వాళ్లే కీలక అధికారుల స్థానాలు తీసుకోకుండా సామాన్యులు కూడా అధికారులు అయ్యేందుకు వీలుగా పరీక్షలు నిర్వహించేవారు. కన్ఫ్యూషియస్ క్లాసిక్స్ను సిలబస్గా చదువుకుని పరీక్షలకు కూచునేవారు. అలా పాసైన వారికి ఉద్యోగాలు దక్కేవి. 13వ శతాబ్దంలో మంగోల్ యువాన్ రాజవంశం ప్రారంభంలో ఈ పరీక్షలకు ఒక చిన్న అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత మంగోలులకు అనుకూలంగా, దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా ఉండే ప్రాతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. కాలక్రమంలో ఆధునిక పరీక్షలు చైనాతో పాటు అన్నీ దేశాలలోకి వచ్చాయి. -
మంచి రక్తప్రసరణ కోసం..!
మంచి రక్త ప్రసరణకు, మానిసిక ప్రశాంతతకు యోగాలో చాలామంచి ఆసనాలు ఉన్నాయి. అవి క్రమం తప్పకుండా వేస్తుండటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా మానసికంగానూ బలోపేతం అవుతారని చెబుతున్నారు యోగా నిపుణులు. మరి అవేంటో చూద్దామా..!మరీచాసనం..చేయు విధానం.. మ్యాట్పై కూర్చొని రెండు కాళ్లను నిటారుగా చాచి దండాసనంలో ఉండాలి. ఎడమ కాలిని మడిచి, ఎడమపాదాన్ని కుడితొడపై ఉంచాలి. ∙ఎడమ మోకాలిని ఎడమచేతితో చుట్టి పట్టుకుని, రెండు చేతులను వెనుకకు తీసుకెళ్లి లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శ్వాస వదులుతూ మెల్లగా కుడి వైపుకు తిరగాలి. ఈ స్థితిలో 10–15 సెకన్లు ఉండాలి. తర్వాత మామూలు స్థితికి వచ్చి, మరోవైపు చేయాలి.ఉపయోగాలు.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెన్నెముక, నడుము బలపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.జాగ్రత్తలు.. 1. వెన్ను నొప్పి లేదా డిస్క్ సమస్యలున్నవారు ఈ ఆసనం చేయకూడదు. 2. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ ఆసనం చేయకూడదు.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ ఒత్తిడి పరార్నిత్యం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పరారవుతుంది. ద్యానం ఒత్తిడిని తగ్గించి.. ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా క్షణాల్లో దానికి పరిష్కారాన్ని వెతకగలిగే సామర్థ్యం మెరుగుపడుతుంది. కనుక ప్రతి రోజూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలన్నది నిపుణుల సూచన.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి!
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్న ప్రస్తుత రోజుల్లో, అసలు సిలిండర్తోనే పనిలేకుండా వంట చేసుకునే సరికొత్త రోజులు రాబోతున్నాయి. మన దేశంలోనే తయారైన ఓ అధునాతన ‘హైడ్రోజన్ స్టవ్’ ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ తో ఏమాత్రం సంబంధం లేకుండా, పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంగా పనిచేసే ఈ పొయ్యి భవిష్యత్తులో మన వంటగదుల రూపురేఖలనే పూర్తిగా మార్చేయబోతోంది.సంప్రదాయ గ్యాస్ పొయ్యిల మాదిరిగా ఇది సిలిండర్పై ఆధారపడదు. కేటలిటిక్ హైడ్రోజన్ బర్నర్ టెక్నాలజీతో పనిచేసే ఈ స్టవ్ నూరు శాతం పర్యావరణ హితమైనది. దీనివల్ల వంట చేసేటప్పుడు ఎలాంటి పొగ రాదు. కార్బన్ మోనాక్సైడ్ లాంటి హానికరమైన విషవాయువులు అసలే వెలువడవు. రెండు బర్నర్లు, ఆకర్షణీయమైన స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చే ఈ టేబుల్-టాప్ స్టవ్ ఎలాంటి శబ్దం, ప్రకంపనలు లేకుండా చాలా ప్రశాంతంగా పనిచేస్తుంది. అతి తక్కువ మంటతోనే ఇది వంటకు కావాల్సిన వేడిని పాత్రకు సమానంగా అందిస్తుంది.హైడ్రోజన్ వాయువును వాడుతున్నందున భద్రత విషయంలో కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. ఫ్లేమ్ అరెస్టర్, ప్రెజర్ రెగ్యులేషన్ సిస్టమ్, హైడ్రోజన్ కు అనువైన వాల్వ్స్ లాంటి కట్టుదిట్టమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. అయితే, దీని ధర సుమారు రూ. 1,50,000 ఉండటంతో ప్రస్తుతానికి ఇది సామాన్యులకు అందుబాటులో లేదు. కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, డిఫెన్స్ క్యాంటీన్లు, రీసెర్చ్ ల్యాబ్లు, పారిశ్రామిక వంటగదులలో దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ విరివిగా అందుబాటులోకి వచ్చి, ఉత్పత్తి ఖర్చు తగ్గితే ప్రతి ఇంట్లోనూ ఈ అత్యాధునిక పొయ్యిలు దర్శనమివ్వడం ఖాయం.ఇది కూడా చదవండి: ‘దళపతి’కి భారీ షాక్.. బరిలో ఇంతమంది ‘విజయ్’లా? -
నీరు-మీరు కిడ్నీ-డీ–హైడ్రేషన్...బ్లడ్ రిలేషన్
ఇటీవల వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలను కొలిచే మెర్క్యూరీ స్కేలుపై ఎండ తీవ్రత పైపైకి ఎగబాకుతోంది. ఎండ తీవ్రత ఎక్కువవుతున్న కొద్దీ దేహంలోని కొన్ని కీలక అవయవాల మీద ‘డీ–హైడ్రేషన్ స్ట్రెస్’ కూడా పెరుగుతూ పోతుంది. అందులో మరింత కీలకమైనవి మన మూత్రపిండాలు. అందుకే మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో కిడ్నీ సమస్యలతో హాస్పిటల్స్కు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుంటుంది. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఇక్కడ కాస్త సమస్య ఏమిటంటే... వేసవి తీవ్రతవల్ల... దాంతో కలిగే డీ–హైడ్రేషన్ కారణంగా కిడ్నీపై పడే ఒత్తిడి అంత త్వరగా గుర్తించడానికి కుదరదు. అందుకే ఎండ్ ఆర్గాన్ అయిన మూత్రపిండాలపై పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ వేసవిలో కిడ్నీ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే చేయాల్సినవీ, తెలుసుకోవాల్సినవి ఏమిటో చూద్దాం.కిడ్నీలు దేహంలోని నీరు, అందులోని అనవసర లవణాలూ, విషాలూ (టాక్సిన్స్) వంటి వాటిని వడబోసి, వ్యర్థాలను బయటకు పంపుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటితో ఖనిజ లవణాలను తిరిగి దేహానికే పంపించడం ద్వారా ఎలక్ట్రొలైట్ బ్యాలెన్స్ అనే కీలకమైన బాధ్యతలను నెరవేరుస్తుంటాయి. ప్రతికూల ప్రభావం చూపే ఎండ తీవ్రత... ఎవరైనా వ్యక్తి ఎండ తీవ్రత తాలూకు అధిక ఉష్ణోగ్రతలకు అదేపనిగా చాలాసేపు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు అతడి దేహం నుంచి చెమట రూపంలో చాలా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంటాడు. అలా అతడు కోల్పోయిన ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే రక్తం కొంత చిక్కబడిపోవడంతో రక్తప్రవాహం అంత సాఫీగా ప్రవహించకపోవచ్చు. దాంతో కిడ్నీలకు తగినంత రక్తం అందక వాటిపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీ పనితీరు కాస్తంత కుంటుపడే అవకాశముంటుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) అంటారు.ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ... పెరిగే ఏకేఐ, కిడ్నీ స్టోన్స్ల ముప్పు... ఎండతీవ్రతకు ఎంతగా ఎక్స్పోజ్ అవుతుంటే... అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ముప్పు అంతగా పెరుగుతుంది. వాతావరణంలో వేడిమి పెరుగుతున్న కొద్దీ కిడ్నీపై దాని దుష్ప్రభావాలు కనీసం 20% నుంచి 30% వరకు పెరుగుతుంటుంది. అంతేకాదు... కిడ్నీలో రాళ్లు, మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ – యూటీఐ)ల ముప్పు కూడా పెరుగుతుంది. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ సమస్య చాలాకాలం పాటు కొనసాగితే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ వంటి తీవ్రమైన సమస్యకు దారితీసే ముప్పూ ఉంటుంది.రాళ్లు ఎందుకు పెరుగుతాయంటే... దేహంలో నీటి మోతాదులు తగ్గగానే లవణాల గాఢత పెరుగుతుంది. దాంతో లవణాలు రాళ్లలా మారతాయి. అందుకే దేహంలో నీటి మోతాదులు తగ్గుతున్న కొద్దీ కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు పెరుగుతుంది.యూటీఐలు మహిళల్లో ఎక్కువ... కిడ్నీ ఇంజ్యూరీ కేసులు పురుషుల్లో ఎక్కువ... దేహ నిర్మాణపరంగా (అనటామికల్గా) చూసినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ పొడవు కాస్త తక్కువగా ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐలు) మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కిడ్నీ ఇంజ్యూరీ కేసులు మాత్రం పురుషుల్లోనే ఎక్కువ. (మొత్తం కేసుల్లో దాదాపు 65% నుంచి 75%వరకు పురుషులవే).ఈ లక్షణాలను గమనిస్తూ ఉండాలి... మునపటి కంటే మూత్రం తక్కువగా వస్తుండటం, మూత్రం చాలా చిక్కటి రంగు (డార్క్ కలర్)తో రావడం, ముఖం/కాళ్లలో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్), ఏదీ తినలేకపోవడం, మూత్రవిసర్జనలో నొప్పి / ఇబ్బంది వంటి లక్షణాలు తగ్గకుండా అదేపనిగా కొనసాగుతూ ఉన్నప్పుడు డాక్టర్ను కలవడం మంచిది.నివారణ కోసం... అది అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీ (ఏకేఐ) సమస్య అయినా, కిడ్నీలో రాళ్లు లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్ల సమస్య అయినా... దేహం కోల్పోయిన నీటి మోతాదును ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండటమే నివారణ. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగుతూ ఉండటంతో పాటు వీలును బట్టి కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, కొద్దిగాఉప్పుతో నిమ్మరసాలు వంటి ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పినివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) వాడకూడదు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారైతే ఎట్టిపరిస్థితుల్లో వాటిని వాడకపోవడమే మంచిది. తప్పనిసరిగా వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. డా‘‘ రవికుమార్ ఎ.వి.సీనియర్ కన్సల్టెంట్యూరాలజిస్ట్ –కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్∙తెలుసుకుందాం55% ప్లాస్మా... ఇందులో లవణాలు, ప్రోటీన్లు, ఇమ్యూనోగ్లోబ్యులిన్లు ఉండి ప్రాణాలను రక్షించే వ్యాధి నిరోధక వ్యవస్థ తాలూకు కణాలను కలిగి ఉంటాయి.కాంపోనెంట్లు... వాటి ఉపయోగాలు... 90% రక్తంలోని 90 శాతంలో నీరే ఉంటుంది.45% ఫార్మ్డ్ ఎలిమెంట్లు ఇందులో ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆ వేర్వేరు కాంపోనెంట్లలోని పదార్థాలూ విధులవి...1,50,000 నుంచి 4,00,000ప్లేట్లెట్లు శరీరానికి ఏదైనా గాయం తగిలి, రక్తస్రావం జరుగుతుంటే రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు. వీటి సంఖ్య ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్కు (ఎమ్ఎమ్ క్యూబ్కు 1,50,000 నుంచి 4,00,000 ఉండాలి. వీటి సంఖ్య తగ్గుతున్న కొద్దీ అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. లేదా గాయం తగిలినప్పుడు ఎంతకీ రక్తం గడ్డకట్టక అలా రక్తస్రావం జరుగుతూ పోయి ప్రాణాపాయం కలగవచ్చు.8% సాల్ట్స్, హార్మోన్లు, ప్రోటీన్లు, బైకార్బొనేట్ అయాన్లు ఉంటాయి. ఇందులో లవణాల అయాన్లతోనే మెదడునుంచి వచ్చే ఆదేశాలు వివిధ అవయవాలకు చేరుతుంటాయి. హార్మోన్లు కీలకమైన జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. ఇక బైకార్బొనేట్ అయాన్లు వివిధ రకాల ఆమ్ల, క్షార పదార్థాలను విరిచేసి, మామూలుగా చేస్తాయి. (న్యూట్రలైజ్ చేస్తాయి).4.3 నుంచి 5.9 మిలియన్లు పురుషుల్లో ఉండాల్సిన నార్మల్ ఎర్రరక్తకణాలు 4.3 నుంచి 5.9 మిలియన్స్ పర్ ఎమ్ఎమ్ క్యూబ్... అలాగే మహిళల్లోనైతే 3.5 నుంచి 5.5 మిలియన్స్ పర్ ఎమ్ఎమ్ క్యూబ్ ఉండాలి. దీని కంటే ఎర్రరక్తకణాల్లో హీమోగ్లోబిన్ మోతాదులను తెలుసుకోవడం అవసరం అది పురుషుల్లో ప్రతి డెసీలీటర్కు 13.5 నుంచి 17.5 గ్రాములూ, ప్రతి డెసిలీటర్కు మహిళల్లో 12.0 నుంచి 16.0 గ్రాములు ఉండాలి. ఇదే రక్తాన్ని ఎర్రగా కనిపించేలా చేస్తూ, జీవకణాలన్నింటికీ ఆక్సిజన్ను చేరవేస్తుంటుంది. అలాగే వెలువడే వ్యర్థాలు, కాలుష్యాలను బయటకు చేరవేసేవి కూడా ఆర్బీసీనే.4,500 నుంచి 11,000తెల్లరక్తకణాలు ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ (ఎమ్ఎమ్)లో 4,500 నుంచి 11,000 ఉండాలి. మన శరీరాన్ని బయటి నుంచి దాడి చేసే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడే రక్షణ కణాలు ఈ తెల్లరక్తకణాలే. ఇందులో మళ్లీ ఐదు రకాల కణాలుంటాయి. అవి... ∙న్యూట్రోఫిల్స్ : ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగైలనుంచి రక్షిస్తాయి. ∙లింఫోసైట్స్ : ఇవి కొన్ని రకాల వైరస్ల నుంచి, క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ∙మోనోసైట్స్ : చెడిపోయిన కణాలను నిర్మూలించి, ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులనుంచి ఇవి మన శరీరాన్ని కాపాడతాయి. ∙ఇజినోఫిల్స్ : ఇవి కొన్ని రకాల పరాన్న జీవుల నుంచి, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ∙బేసోఫిల్స్ : ఇవి అలర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి.రక్తం నిర్వహించే విధులివి...→ ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్గా మారాక అన్ని కణాలకూ దాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్తో పాటు అమైనోయాసిడ్స్, ఫాటీయాసిడ్స్నూ కణాలన్నింటికీ అందజేస్తుంది. → రక్తంలోని గ్లూకోజ్ వల్ల శరీరంలో శక్తిని ఇచ్చే జీవక్రియలు జరుగుతాయి. దీన్నే మెటబాలిజమ్ అంటారు. ఈ క్రమంలో కార్బన్–డై–ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ యాసిడ్ వంటి కొన్ని కాలుష్యాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచేందుకు ఉద్దేశించిన మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసేది కూడా రక్తమే. రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి. ఈæ కీలకమైన కార్యకలాపాలన్నీ నిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని కట్టడి చేయడానికి మన శరీరం కృషి చేస్తుంది. రక్తస్రావం మొదలుకాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపేందుకు ప్లేట్లెట్స్ తోడ్పడతాయి.డాక్టర్ బోయెళ్ల పవన్ కుమార్సీనియర్ హెమటాలజిస్ట్ – మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ: యాసీన్ -
రాజా విజిల్ వేస్తే అది పాటైపోవులేరా!
‘ఈ కాలపు కుర్రవాళ్లు అన్నింటికీ విజిల్స్ వేస్తున్నారు. ఎదుటివాళ్ల గొప్పతనాన్ని విజిల్ వేసి చెబుతున్నారు. కాని ఎదుటి వారు మీ గురించి విజిల్ వేసేలా మీరు ఎదగాలి. నేనొకసారి విజిల్ వేశాను. అది నన్నే గొప్పగా నిలబెట్టింది’ అన్నారు ఇళయరాజా ఇటీవలి హైదరాబాద్ ప్రదర్శనలో! ఆయన విజిల్ ఎప్పుడు వేశారు? అది ఎలా ఆయనను గొప్పగా నిలబెట్టింది? చదవండి...ఇళయరాజా ఇటీవల జరిగిన హైదరాబాద్ మ్యూజికల్ నైట్లో కుర్రకారును ఉద్దేశిస్తూ ఒక అనుభవం పంచుకున్నారు. కచ్చేరి జరుగుతుండగా ప్రేక్షకుల్లోని కొందరు యువకులు అదేపనిగా విజిల్స్ వేస్తుంటే విని ‘మీ విజిల్స్ని వేస్ట్ చేయకండి. మీరు విజిల్ వేస్తే అదొక గొప్ప సందర్భం కాగలగాలి’ అంటూ తన జీవితంలో జరిగిన ఒక ఘటన చెప్పారు.‘1984లో నాకు ఆపరేషన్ (హెర్నియా) జరిగింది. నెల రోజుల పాటు ఏమీ పాడొద్దన్నాడు డాక్టర్. నేను పాడి కదా పాటను సింగర్స్కు నేర్పించాలి. అది చేయకూడదన్న మాట. సరేనని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. కాని ఒకరోజు నిర్మాత పంజు అరుణాచలం వచ్చారు. ఆయన నన్ను సంగీత దర్శకుణ్ణి చేసిన ఆత్మీయుడు. ఆయన తీసిన ‘అన్నాక్కిళ్లి’తో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ‘ఏంటన్నయ్యా... ఇలా వచ్చారు’ అనంటే ‘ఏం చెప్పమంటావు. నువ్వు రెస్ట్లో ఉన్నావు. నా సినిమా (రజనీకాంత్ను పెట్టి తీస్తున్న ‘తంబిక్కు ఎంద ఊరు’) షూటింగ్ ఆగిపోయింది. రజనీకాంత్ ఊటీలో వెయిట్ చేస్తున్నాడు. ఒక పాటను షూట్ చేసి అతను వేరే షూటింగ్కు వెళ్లాలి. నాకు మళ్లీ అతని డేట్స్ దొరకవు. నువ్వు పాట చేయాలి ఎలాగైనా’ అన్నాడాయన. నేను పెద్ద ధర్మసంకటంలో పడ్డాను. ఒకవైపు ఆరోగ్యం. మరోవైపు నా గాడ్ఫాదర్. సరే... డాక్టర్ పాడొద్దని కదా అన్నాడు అని... నేను మెల్లగా మంచం మీద సర్దుకు కూచుని విజిల్ వేస్తూ పాట ట్యూన్ ఇచ్చాను. పంజు గారు (ఆయన గీత రచయిత కూడా) వెంటనే పల్లవి రాశారు. విజిల్లోనే చరణాలు ఇచ్చాను. వాటినీ రాసేశారు. ‘ఇక రికార్డింగ్ ఎలా చేస్తావు?’ అనడిగారాయన. నా కండక్టర్ని ఇంటికి పిలిచి నోట్స్ ఇచ్చాను. వెంటనే రికార్డింగ్ అరేంజ్ చేసి బాలూ చేత పాడించమని చెప్పాను. నేను ఇంటి దగ్గర ల్యాండ్లైన్ రిసీవర్ ఆన్లో పెట్టి దాని గుండా అక్కడ ఏం జరుగుతోందో వింటూ, పాట మొదట్లో ఆలాపన ఉంటే అది కూడా విజిల్లోనే చెప్పి రికార్డు చేయించాను. ఆ పాటే ‘కాదలిన్ దీపం ఒండ్రు’. ఆ పాట రజనీకాంత్కూ నాకూ ఎంత హిట్ అంటే రేడియోలో ఇప్పటికీ ఎక్కువసార్లు రిక్వెస్ట్ వచ్చే పాట అది. నేను ఒకసారి విజిల్ వేస్తే ఏమయ్యిందో చూడండి. మీరు విజిల్ వేస్తే అంత ఘనంగా ఉండాలి’ అన్నారాయన ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య.మనం ఉద్యోగం చేస్తున్నా, ఉపాధిలో ఉన్నా, చదువుకుంటున్నా, కళారంగంలో ఉన్నా మనం ఎదుగుతూ ఎదుటివారి గొప్పదనాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. మనం అలాగే ఉండి ఎదుటివారి గొప్పదనానికి మురిసిపోతూ, అయోగ్యుల వెంట మూక స్వభావంతో తిరుగుతూ ఉండరాదని ఇళయరాజా భావం. ఇది గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం. -
యముడితో కీర్తిమంతుడి యుద్ధం
పూర్వం కాశీక్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని, ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు పాలించేవాడు. ఒకనాడు కీర్తిమంతుడికి వేట మీద కోరిక పుట్టి, అడవిలో వసిష్ఠాశ్రమ పరిసరాలకు వెళ్లాడు. అప్పుడది వైశాఖమాసం. వసిష్ఠ మహర్షి శిష్యులందరూ వైశాఖమాస ధర్మాలను ఆచరిస్తూ సందడిగా కనిపించారు. వైశాఖమాస ధర్మకార్యాలను అప్రతిహితంగా కొనసాగించడానికి వసిష్ఠ మహర్షి అప్పటికే ఆశ్రమానికి చేరువలో బాటసారుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం, వారు సేదదీరడానికి అనువుగా చలువ పందిరితో ఒక విడిది మంటపం ఏర్పాటు చేశాడు. వసిష్ఠుడి శిష్యుల్లో కొందరు చలివేంద్రం వద్ద నిలబడి బాటసారుల దప్పిక తీరుస్తున్నారు. ఇంకొందరు విడిది మంటపంలో ఉన్నవారికి రసభరితమైన పండ్లు అందిస్తున్నారు. మరికొందరు సేదదీరుతున్న బాటసారులకు విసనకర్రలతో గాలి విసురుతూ సపర్యలు చేస్తున్నారు. ఇదంతా చూసిన కీర్తిమంతుడు ఆశ్చర్యపోయాడు. వసిష్ఠుడి శిష్యులను సమీపించి, ‘మునికుమారులారా! మీరంతా ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.‘రాజా! మేమంతా వసిష్ఠ మహర్షి శిష్యులం. ఆయన ఆదేశం మేరకు వైశాఖ ధర్మాలను నెరవేరుస్తున్నాం’ అని బదులిచ్చారు.‘ఏదైనా క్రతువులో భాగంగా ఈ పనులన్నీ చేస్తున్నారా? ఏ దేవత ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నారు? దీనివల్ల ఫలితమేమిటి?’ అడిగాడు కీర్తిమంతుడు.‘రాజా! గురువు ఆజ్ఞ మేరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. వివరాలేవీ మాకు తెలియవు. ఆయనను కలుసుకుని, నేరుగా అడిగితే, ఆయనే చెప్పగలరు’ అని చెప్పారు శిష్యులు.కీర్తిమంతుడు వసిష్ఠాశ్రమంలోకి ప్రవేశించి, వసిష్ఠ మహర్షికి నమస్కరించాడు. ‘మహర్షీ! నేను ఇటువైపుగా వస్తుంటే, మీ శిష్యులందరూ బాటసారులకు కని విని ఎరుగని సపర్యలు చేస్తూ కనిపించారు. ఇది ఏమైనా ప్రత్యేకమైన క్రతువా? దీని వల్ల ఫలితమేమిటి? మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది’ అని అభ్యర్థించాడు.వసిష్ఠుడు కీర్తిమంతుడి జిజ్ఞాసకు సంతోషించాడు.‘రాజా! నా శిష్యులు చేస్తున్నవన్నీ వైశాఖమాస ధర్మాలు. వైశాఖమాసంలో మానవులందరూ తప్పనిసరిగా ఆచరించాల్సినవి– స్నానం, దానం. ఎన్ని ధర్మాలను ఆచరించినా, స్నాన దానాలను ఆచరించని మానవులు శ్రీహరికి ప్రీతిపాత్రులు కాలేరు. వైశాఖధర్మాలు సులభసాధ్యాలు. దప్పిగొన్న వారికి నీరు ఇవ్వడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అలసిన వారికి విశ్రాంతి పొందడానికి ఏర్పాట్లు చేయడం వంటి సామాన్య చర్యలే వైశాఖధర్మాలు. వీటిని ఆచరించిన మానవులకు శ్రీహరి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది’ అని చెప్పాడు.కీర్తిమంతుడు సంతోషంతో వసిష్ఠుడికి కృతజ్ఞతలు తెలుపుకొని, తన రాజధానికి చేరుకున్నాడు. మరునాడే తన భటులతో రాజ్యమంతటా ఇలా చాటింపు వేయించాడు: ‘నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎనిమిదేళ్ల పైబడిన బాలలు మొదలుకొని వృద్ధుల వరకు వైశాఖమాసంలో అనుదినం స్నానం చేయాలి. సంపన్నులు చలివేంద్రాలను, బాటసారులకు భోజనశాలలను, విడిది మందిరాలను ఏర్పాటు చేయాలి. స్నాన దానాలు చేయనివారికి కఠిన శిక్షలు తప్పవు’. కీర్తిమంతుడి రాజ్యంలో ప్రజలందరూ రాజాజ్ఞను తు.చ. తప్పకుండా పాటించసాగారు. రాజ్యంలో ఎవరూ ధర్మం తప్పనందున కాలంతీరి ఎవరు మరణించినా, వారందరూ నేరుగా విష్ణులోకానికి పోతున్నారు. యమలోకానికి వెళ్లేవారు ఎవరూ లేకపోయారు.ఇదే పరిస్థితి కొనసాగితే తన ఉనికికే ముప్పు వస్తుందని తలచిన యముడు తన పరివారంతో బయలుదేరి, కీర్తమంతుడి రాజ్యాన్ని ముట్టడించాడు. యుద్ధానికి పిలుపుగా భీకర శంఖారావం చేశాడు.కీర్తిమంతుడు సైన్య సమేతంగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఉభయ సైన్యాలకు భీకర పోరు సాగింది. కీర్తిమంతుడు తన శక్తిమంతమైన బాణాలతో యమదూతలను రణరంగం నుంచి తరిమికొట్టాడు. యముడు నేరుగా కీర్తిమంతుడితో తలపడ్డాడు. తీక్షణమైన బాణాలతో కీర్తిమంతుడిని నొప్పించి, సింహనాదం చేశాడు. కీర్తిమంతుడు మూడు బాణాలతో యముడి ధనుస్సును విరిచేశాడు.ఆగ్రహించిన యముడు కాలదండాన్ని తీసుకుని, కీర్తిమంతుడిపైకి విసిరాడు.తన భక్తుడైన కీర్తిమంతుడి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఆ చక్రం శరవేగంతో దూసుకొచ్చి, కాలదండాన్ని విసిరికొట్టింది. అది యముడి మీదకొచ్చింది. ఈ పరిణామానికి దేవతలంతా హాహాకారాలు చేసి, యముడిని క్షమించమని ప్రార్థించడంతో విష్ణువు తన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కీర్తిమంతుడి చేతిలో ఎదురైన ఓటమికి తలవంచుకుని, యముడు తిరిగి తన లోకానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
గర్భం దాలుస్తున్నాను... కానీ...
నాకు 30 సంవత్సరాలు. మా పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి నేను గర్భం దాల్చుతున్నాను, కానీ రెండు నుంచి మూడు నెలల్లోనే మిస్క్యారేజ్ అవుతోంది. ఇది మూడుసార్లకు పైగా జరిగింది. మాకు ఒక హెల్దీ బేబీ కావాలి. దీనికి కారణం ఏమిటి? ఎలా ట్రీట్ చేయాలి?– సుజాత, విజయవాడ.మూడుసార్లకు పైగా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే ప్రతిసారి ఎందుకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరిశీలనలో ముందుగా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. అసలు స్కాన్ చేయించారా లేదా, ఎన్ని రోజులకు లేదా ఎన్ని వారాలకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవాలి. రెండు నెలలు పూరై్తన తర్వాత జరుగుతుందా, లేక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన వెంటనే జరుగుతుందా అన్నది కూడా అడగాలి. అలాగే స్కాన్ లో బేబీ హార్ట్బీట్ ఫార్మేషన్ ఉందా లేదా, ఒకసారి హార్ట్బీట్ వచ్చి పోయాక మిస్క్యారేజ్ అవుతోందా అన్నది కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా పరిశీలించాలి. సాధారణంగా మొదటి మూడు నెలల్లో, అంటే 12 వారాల లోపల రిపీటెడ్గా మిస్క్యారేజ్ కావడానికి కారణాలు; అలాగే మూడు నెలల తర్వాత మిస్క్యారేజ్ కావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పేషెంట్కు మొదటి మూడు నెలల్లోనే జరుగుతోంది కాబట్టి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ముందుగా తల్లికి, తండ్రికి జెనెటిక్ పరీక్షలు చేసి, జెనెటిక్ సమస్యలు ఉన్నాయా అని చెక్ చేయాలి. అలాగే మిస్క్యారేజ్ అయినప్పుడు బయటికి వచ్చిన టిష్యూ ఉంటే దానికి కూడా జెనెటిక్ పరీక్షలు చేసి, ఏదైనా జెనెటిక్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా ఉంటే జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా సరైన మార్గదర్శకాలు తీసుకోవచ్చు. వయస్సు కూడా చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం లేదా తండ్రి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల మిస్క్యారేజ్ వచ్చే ప్రమాదం కొంచెం పెరుగుతుంది. అలాగే మధుమేహం ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా, లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలించాలి. ముఖ్యంగా రక్త సంబంధిత లేదా ఇతర శరీర వ్యవస్థల సమస్యలు ఉన్నా కూడా మిస్క్యారేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక స్కాన్ ద్వారా గర్భసంచి ఆకారం ఎలా ఉంది అన్నది చూడాలి. గర్భసంచిలో ఏదైనా నిర్మాణ లోపం ఉందా లేదా గర్భసంచి ఆకారం సాధారణంగా ఉందా అన్నది చెక్ చేయాలి. మంచి స్కాన్ ద్వారా గర్భసంచిలో ఏదైనా పొర లాంటిది ఉండి, దాని వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న ప్రొసీజర్ ద్వారా దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం రక్తం గడ్డకట్టే సమస్యలు. వీటిని థ్రాంబోఫీలియాస్ అని అంటారు. అంటే రక్తంలో ఉండే గడ్డకట్టే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భానికి సరైన రక్తప్రసరణ జరగక మిస్క్యారేజ్ కావచ్చు. ఇందులో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, ఏదైనా తేడా ఉంటే దానికి సరైన మందులు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసినా కూడా కారణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాలను అనెక్స్ప్లెయిన్ మిస్క్యారేజ్ అంటారు. అయినప్పటికీ, చిన్న చిన్న కారణాలు గుర్తించినా వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నించి, భవిష్యత్తులో ఒక హెల్దీ బేబీ కోసం తల్లిదండ్రులు డాక్టర్ కలిసి ప్రయత్నించవచ్చు. ∙మేని మాటశరీరం ‘తనను తానే శుభ్రం’ చేసుకుంటుంది!రోజూ స్నానం చేస్తూ శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటున్నారని అనుకుంటున్నారా? కానీ, అసలు క్లీనింగ్ మాత్రం లోపలే జరుగుతోంది! మన శరీరంలో ‘అటో ఫాగీ’ ప్రక్రియ నిరంతరాయంగా పనిచేస్తూ, పాడైన కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రపోతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ‘ఇన్నర్ క్లీనింగ్’ స్పీడ్ మరింత పెరుగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
సింహం దిద్దుబాటు
సుమధుర వనానికి రాజు సింహం. అది జీవులను కన్న బిడ్డల్లా చూసుకునేది. ఏ జంతువో, పక్షో ఆపదలో ఉంటే ఆదుకునేది. కాని, సరైన సమయంలో చేయకపోవటం దాని బలహీనత. ఈ తీరు మార్చుకోమని మంత్రి ఎలుగుబంటి సింహానికి సలహా ఇస్తుండేది. కాని, ఎలుగుబంటి సలహాను సింహం పట్టించుకునేది కాదు. ప్రతిఏటా సింహం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుండేవి. సింహం అభిమాని ఏనుగు పొరుగు అడవి నుంచి ఆ వేడుకలకు తప్పక వచ్చేది. ఎప్పటిలా ఆ ఏడాది కూడా సింహం పుట్టినరోజుకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. పొరుగు అడవి నుంచి వేడుకలకు ఏనుగు బయలుదేరింది. సుమధుర వనానికి చేరగానే ఒంటికి ఉన్న బురద, దుమ్ము, ధూళి శుభ్రం చేసుకోవాలని దారిలో కనిపించిన చెరువులోకి దిగి స్నానం చేసింది. ఆ చెరువులో ఒక చెడ్డ మొసలి ఉండేది. స్నానం చేసి తిరిగి వెళుతున్న ఏనుగుపై మొసలి కన్ను పడింది. అది ఏనుగు కాలిని నోటకరిచి నీటిలోకి గుంజింది. మొసలితో పోరాడిన ఏనుగు తప్పించుకుని, ఒడ్డుకు చేరుకుంది. రంపంలాంటి మొసలి దంతాలు గుచ్చుకుని, గాయమై రక్తం కారింది. కాలి నొప్పితో ముందుకు అడుగులు వేయలేకపోయింది. కుంటుకుంటూ కొద్ది దూరం నడిచి, ఒక మర్రిచెట్టు కింద కూర్చుంది. ఏనుగు పరిస్థితి గమనించిన దారిన పోయే జంతువులు వైద్యుడు కోతికి సమాచారం అందించాయి. కోతి వెంటనే మందుల సంచి భుజాన వేసుకొని, తన సహాయకుడైన మరో కోతితో ఏనుగు వద్దకు వెళ్లింది. కాలి నుంచి కారుతున్న రక్తాన్ని శుభ్రం చేసి, పసరు మందు పూసి, కట్టు కట్టింది. ప్రతి ఏటా మృగరాజు సింహం పుట్టినరోజు వేడుకలకు వచ్చే ఏనుగు సుమధుర వనంలోని జంతువులు, పక్షులకు పరిచయమే!కాకి వచ్చి మృగరాజుకు ఏనుగు మర్రిచెట్టు కింద గాయంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం అందించింది. సింహం స్పందించలేదు.విషయం తెలిసిన మంత్రి ఎలుగుబంటి, నక్క, ఒంటె వెంటనే ఏనుగు వద్దకు వెళ్లాయి. ఏనుగును పరామర్శించి వేడుకకు వెనుతిరిగాయి. ఏనుగు పరిస్థితిని సింహానికి వివరించింది ఎలుగుబంటి.సింహం మౌనంగా ఉండిపోయింది.సింహం మర్నాడు వెళ్లి ఏనుగును చూస్తుందని భావించింది ఎలుగుబంటి.రెండు రోజులు గడిచినా ఏనుగుని చూడటానికి సింహం కదల్లేదు.సింహం వెళ్లి అభిమాని ఏనుగును పలకరించలేదని చెడుగా గుసగుసలు ప్రారంభించాయి అడవి జీవులు.ఆ సంగతి సింహం చెవిలో పడింది. మరునాడు ఉదయాన్నే సింహం ఒంటరిగా వెళ్లి, ఏనుగుని కలిసింది.‘‘మిత్రమా! ధైర్యంగా ఉండు. నీకు మేమున్నాం!’’ అంది సింహం.ఏనుగు తినటానికి అరటి గెలలు, చెరుకు గడలు తెప్పించింది.వైద్యుడు కోతిని దగ్గరికి తీసుకుని, ‘‘మిత్రమా! నీకు ఎలాంటి మూలికలు కావాలన్నా, సహకారం కావాలన్నా ఏర్పాటు చేస్తాను! ఏనుగుకు నాణ్యమైన చికిత్స అందించు’’ అంది సింహం. ‘‘రాజా! ఇప్పుడు ఏనుగు గాయం మానిపోయింది. రేపటి నుంచి మునపటిలా నడుస్తుంది!’’ అంది కోతి.ఆలస్యంగా ఏనుగు వద్దకు పోయినందుకు అప్పటికే సింహానికి చెడ్డపేరు రానే వచ్చింది.‘‘ప్రభూ! చేయాల్సిన పని అవసరం లేని సమయంలో చేస్తే, అది ఎంత గొప్ప పనైనా ఎవరినీ ఆకట్టుకోదు. ఆ పనికి విలువ, గుర్తింపు కూడా ఉండదు. చేసిన పనికి ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు నష్టం కూడా జరగొచ్చు!’’ అంది ఎలుగుబంటి.గాయం మాని నడుస్తున్న ఏనుగును సింహం తన ఇంటికి తీసుకువెళ్లింది. ప్రేమతో గొప్ప విందు ఇచ్చింది. ఖరీదైన కానుకలిచ్చి తన పరివారంతో అడవి చివరి వరకు వెంటవెళ్లి సాగనంపింది. ఆభిమానిని ఆదరించిన సింహాన్ని మెచ్చుకున్నాయి అడవి జీవులు. ఈ పని ముందుగానే చేసుంటే తన విలువ మరింత పెరిగేదని తెలుసుకుంది సింహం.తన తప్పు దిద్దుకుంటూ, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయడం మొదలుపెట్టింది. తీరు మార్చుకున్న సింహం త్వరలోనే గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంది. -
క్లూషియల్: బిలియనీర్ అనుమానాస్పద మృతి
‘శ్రీవాత్సవ బిజినెస్ ఎంపైర్ టవర్స్..‘ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవాత్సవ అనుమానాస్పదంగా మరణించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వందమందిలో ఒకరైన అతని మరణం సంచలనమైంది. పరిశోధన మొదలైంది.ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యబృందం తీవ్రమైన ఒత్తిడి వల్ల మరణించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఎన్ఐఏ– స్పెషల్ ఏజెంట్ అభిమన్యుని రంగంలోకి దించింది. హైదరాబాద్ చేరుకున్నాడు అభిమన్యు. టైమ్ అర్ధరాత్రి రెండు గంటలు. ఆ చాంబర్లో కమిషనర్ ప్రద్యుమ్న, శ్రీవాత్సవ భార్య, అభిమన్యు ఉన్నారు.‘‘సారీ మిసెస్ శ్రీవాత్సవ గారు! ఈ టైమ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. శ్రీవాత్సవగారు ఏ విషయంలోనైనా టెన్షన్ ఫీలవ్వడం గమనించారా?’’ అడిగాడు అభిమన్యు.‘‘లేదు, తను స్ట్రెస్ ఫీలవ్వడం ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ టైమ్లో అయిదు వందల కోట్ల నష్టం ఎదురైనప్పుడే తేలిగ్గా తీసుకున్నారు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ. తనకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ‘‘బెదిరింపులకు భయపడడు. చాలా మొండి మనిషి.’’ మిసెస్ శ్రీవాత్సవ చెప్పింది.అభిమన్యు ఆలోచనలో పడ్డాడు. ‘శ్రీవాత్సవను ఒత్తిడికి గురిచేసిన విషయం ఏమై ఉంటుంది?’శ్రీవాత్సవ ఫోన్ను అన్లాక్ చేసి; ఫోన్ డేటాను పరిశీలించాడు. అనుమానించదగినది ఏదీ కనిపించలేదు. చాంబర్లో అనుమానం కలిగించేవేవీ కనిపించలేదు. స్టాఫ్ను విచారించాడు. అభిమన్యు దృష్టి ‘కీ చైన్’ మీద పడింది. శ్రీవాత్సవ పిడికిట్లో వుంది. సిక్స్ నైన్ అనే అంకెలు ఉన్న కీ చైన్. ఎలాంటి కీ లేదు.ఆ కీ చైన్ మిసెస్ శ్రీవాత్సవకి చూపించి, ‘‘దీని గురించి చెప్పగలరా?’’ అని అడిగాడు.‘‘లాస్ట్ వీక్ స్విట్జర్లండ్ వెళ్లినప్పుడు తెచ్చుకున్నాడు. అంతకు మించి విశేషమేమీ లేదు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ.‘‘కేసు క్లోజ్ చేయాల్సిందేనా?’’ కమిషనర్ అడిగాడు.‘‘కేసు ఇప్పుడే మొదలైంది’’ అంటూ అభిమన్యు కీ ఎక్కడ కొన్నదో చెక్ చేశాడు. ఆ చైన్ శ్రీవాత్సవ క్యాష్ పే చేసి కొన్నట్టు తేలింది. అవి ప్రత్యేకంగా ఆర్డర్ చేసి, తమ లక్కీ నంబర్లు కలిసొచ్చేలా ఆర్డర్ చేస్తారు. ఈ అంకెల్లో ఏదో ఉంది!అభిమన్యు ఆలోచిస్తూనే నేమ్ ప్లేట్ వైపు చూసి వెంటనే మిసెస్ శ్రీవాత్సవకు ఫోన్చేసి, ‘‘క్షమించండి. ఈ టైమ్లో డిస్టర్బ్ చేసినందుకు. మీ వారికి న్యూమరాలజీ మీద నమ్మకం ఉందా?’’ అడిగాడు.‘‘ఉంది. తన పేరును శ్రీవాత్సవ్ గా మార్చుకోవడానికి కారణం అదే...’ అని ఇంకేదో చెప్పబోతుండగా, ‘‘థాంక్యూ’’ అని ఫోన్ పెట్టేసి, కమిషనర్ వైపు తిరిగి ‘‘అర్జెంట్ గా స్విట్జర్లాండ్ వెళ్ళాలి... ఈ సిక్స్ నైన్ కీ చైన్కు, స్విట్జర్లండ్కు సంబంధం ఉంది.. నైన్ అంకె శ్రీవాత్సవ పేరు.. సిక్స్ అంకె...’’ అని ఆగి, వెంటనే ‘‘గాటిట్...’’ అని కమిషనర్ వైపు తిరిగాడు.‘‘శ్రీవాత్సవ ఒక్కడే స్విట్జర్లండ్ వెళ్లాడు. బిజినెస్ పనిమీద కాదు. స్విస్ బ్యాంకులు శ్రీవాత్సవలాంటి బిలియనీర్లకి కామధేనువులు. శ్రీవాత్సవ తెలివైన వ్యాపారవేత్త. సిక్స్ అంకె ‘లాకర్’ను సూచిస్తుంది. ఏదో క్లూ కీ చైన్లో ఉంది.’’ అన్నాడు.స్విట్జర్లండ్...మిసెస్ శ్రీవాస్తవ తరఫున లీగల్ డాక్యమెంట్లు సమర్పించడంతో స్విస్ బ్యాంకు లాకర్ను ఓపెన్ చేశారు.లాకర్లో విదేశాల్లో కొన్న ఖరీదైన ఫోన్. అందులో ఒకే కాంటాక్ట్– సెక్రటరీ మాయ నంబర్. శ్రీవాత్సవ రికార్డ్ చేసిన వాయిస్.‘‘మీరు నా వాయిస్ వినేసరికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవరికీ భయపడను. ఒక బలహీన క్షణంలో సెక్రటరీతో నా సంబంధం నన్ను ట్రాప్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా నాకున్న పరిచయాలు వాడుకోవాలని చూసింది. మేము సన్నిహితంగా ఉన్న వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేసింది. హోంమంత్రిని, రక్షణ శాఖ అధికారులను పరిచయం చేయమంది. లేకపోతే వీడియోలు బహిర్గతం చేస్తానని బెదిరించింది. వీడియోలు బయటకు వస్తే నా కంపెనీ షేర్లు పడిపోతాయి. నా సంస్థల మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. అలా అని దేశ రక్షణను పణంగా పెట్టను. నా మరణాన్ని పరిశోధించడానికి మీరొస్తారని తెలుసు...’’ ఒకవిధంగా శ్రీవాత్సవ మరణవాంగ్మూలం.శ్రీవాత్సవ స్విట్జర్లండ్కు రావడానికి కారణం తెలిసిపోయింది. అప్పటికే పారిపోయే ప్రయత్నంలో ఉన్న మాయను అరెస్ట్ చేశారు. అభిమన్యు సూచన మేరకు శ్రీవాత్సవ సెక్రటరీ మాయ– అతడు మరణించిన విషయం తెలుసుకుని, అతని కోటు జేబులో ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు’’ అన్న వార్త మీడియాలో ఫ్లాష్ అయ్యింది.ఎన్ఐఏ కార్యాలయం..మాయ ఎదురుగా అభిమన్యు.‘‘చాలా సిల్లీ పెట్టీ కేసు కదూ! నువ్వు బయట కనబడితే జనం, పోలీసులు వదలరు. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. రికార్డుల్లో లేని ఖైదీవి. నీ కోసం మీ వాళ్ళు కూడా గాలిస్తారు. లైఫ్లో హనీ ట్రాప్ చేయకుండా, శ్రీవాత్సవ ఆత్మ శాంతించేలా నీకు ఈ శిక్ష ...’’అభిమన్యు ఇంటరాగేషన్ సెల్ నుంచి బయటకు నడిచాడు. -
ఈ వారం కథ: పోడుస్తున్న పోద్దు
‘‘నువ్వెప్పుడైనా నిలువుటద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావా?’’ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చి, అవీ ఇవీ చెపుతూ వున్నట్టుండి ఇలా వ్యక్తిగతమైన ప్రశ్న వేసిన తులసి కేసి ఆశ్చర్యంగా చూసింది ప్రగతి.‘‘అద్దంలో చూసుకోవడం రోజూ అందరూ చేసే పనే కదా? నా గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావ్?’’‘‘నువ్వు ప్రత్యేకం కాబట్టి. నిన్ను చూసుకుని నువ్వే మోహించేటంత, ముట్టుకొంటే డాగు పడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడిచ్చాడు. సినిమాతారలకు మించిన సహజ సౌందర్యం నీది. కానీ ఏం లాభం? దాన్ని అడవికాసిన వెన్నెల చేస్తున్నావ్. ఈ వయసులో ఓ బాయ్ఫ్రెండు, బాడీగార్డు, ప్రేమ – దోమ ఎఫైరూ –ఎంజాయ్మెంటూ, థ్రిల్లూ – గిల్లూ... ఇలాంటివేం లేకుండా జీవితాన్ని చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తుంటే ఆశ్చర్యమే కాదు – జాలేస్తోంది కూడా...’’‘‘తులసీ, ఇలా క్లాస్ పీకడానికా నన్నిక్కడికి తీసుకొచ్చింది?’’ ప్రగతి అసహనంగా చూసింది.‘‘సారీ, నీ మంచి కోరి చెబుతున్న నన్నర్థం చేసుకో. ‘ఓ ప్రేమ లేఖ – ప్రపోజలూ, అచ్చటా – ముచ్చటా దేనికీ నోచుకోని దరిద్రగొట్టు బతుకుల్ని మాకెందుకిచ్చావు దేవుడా!’ అని ఏడ్చే నాలాంటి అమ్మాయిలు ఎందరున్నారో నీకు తెలియదు. ఎందుకంటే కొమ్ములు తిరిగిన కుర్ర హీరోలు వెర్రివాళ్ళలా వెంటపడుతున్న అదృష్ట జాతకురాలివి నువ్వు. కానీ దేవుడు నీకు యిచ్చిన వరానికి ఏమాత్రం గర్వపడక ఇంత రిజర్వ్డ్గా మడిగట్టుకుని ఉండడానికి కారణం తెలుసుకుందామని, ఇలా వసంతంలాంటి వయసును వ్యర్థం చేసుకుంటే, ఆ తర్వాత పోగొట్టుకున్న దానికోసం ఎంత పరితపించినా ప్రయోజనం ఉండదని చెప్పడానికే...’’‘‘చెప్పింది చాలు. నా బుర్ర తినకు. నేనే పొరపాటూ చేయడం లేదు. నా తీరు, నా దారి చాలా తృప్తికరంగానూ. ప్రశాంతంగానూ వున్నాయి.’’ ‘‘కాదు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు చెబుతున్నావ్. నీ మనస్సాక్షిగా నిజం చెప్పు. నీకు ఎప్పుడూ శృంగారపరమైన ఊహలూ, కవ్వించే కలలూ రావడం లేదూ? ఒంటరిగా ఉన్నప్పుడు వయస్సు పోరుతో మానసికంగా పులకింతలూ, గిలిగింతలూ కలగడం లేదూ? అబ్బాయిలు నీకేసి అదే పనిగా ఆరాధనాపూర్వకంగా చూస్తూంటే నీకే ‘ఫీలింగ్స్’ కలగడం లేదంటే నేను చస్తే నమ్మను...’’‘‘నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొచ్చిన నష్టం లేదు. అనవసరమైన విషయాలు ప్రస్తావించి నన్ను విసిగించకు’’‘‘పిచ్చి పిల్లా, నేను చెప్పేవన్నీ వయోధర్మాలు, మర్మాలూ! కాని, సర్వసామాన్యమైన పచ్చినిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావ్. ఈ కాలంలో హైస్కూల్ దశలోనే ఆడపిల్లలు ప్రేమపిచ్చితో రెచ్చిపోతూ మొబైల్స్ని వదలడం లేదంటే – ఇంజనీరింగ్ ఫైనల్కొచ్చి నువ్వింత బుద్ధిగా వుండడం సాధ్యమా? నువ్వు మరోలా అనుకోకపోతే నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతున్నాను – ఇంతవరకు ఏ మగధీరుణ్ని చూసినా నీ మనస్సు చలించలేదా? నా మీద ఒట్టేసి చెప్పు’’లేదన్నట్టు ప్రగతి అడ్డంగా తల ఆడించింది.‘‘యూ ఆర్ రియల్లీ గ్రేట్. అయితే నువ్వెంతగా పట్టించుకోకపోయినా నీ లాంటి అందాలరాశికి నిన్ను వెంటాడే మృగాళ్ల వల్ల ముప్పు రావచ్చు. మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం కదా! ప్రేమను అంగీకరించని నేరానికి ఎంతమంది అమాయక యువతులు యాసిడ్ దాడులకు, కత్తిపోట్లకు, అఘాయిత్యాలకు బలి అవుతున్నారో! అందుచేత నీలాంటి బుద్ధిమంతురాలికి భద్రత అవసరం. ప్రేమరొంపిలో దిగమనను కాని, నువ్వంటే పడిచచ్చే బకరాల్లో ఒకణ్ణి ఎంచుకొని ఊరిస్తుంటే చాలు నీ రక్షణ సంగతి వాడు చూసుకుంటాడు...’’‘‘తులసీ, నాకిలాంటి చెత్త సలహాలివ్వకు ఏకపక్షంగా నా జోలికి ఎవరొచ్చినా. ఆ పోకిరీగాళ్లకు బుద్ధి చెప్పగలననే ధైర్యం నాకుంది...’’ ప్రగతి మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది.‘‘సెభాష్. నువ్వు నాకు నచ్చావ్. అలాగే మా అన్నకూ తెగ నచ్చేశావ్..’’‘‘మీ అన్నెవడు? అతగాడికి నాకూ ఏం సంబంధం?’’ ప్రగతి ప్రశ్నల్లో కరకుదనానికి తులసి తుళ్లిపడింది.‘‘కోప్పడకుండా పూర్తిగా విను. మా అన్నంటే నా కజిన్. పేరు భూపతి. నా కోసం కాలేజీకి వచ్చినప్పుడెప్పుడైనా చూసుంటావ్. అచ్చం సినిమా హీరోలా వుంటాడు. ఆపైన కోటీశ్వరుడు. ఈ నెక్లెస్ మొన్న రాఖీ కట్టిన సందర్భంగా వాడిచ్చిందే...’’‘‘అయితే ఏమిటి? సూటిగా చెప్పు’’ ప్రగతి మొహం ఎర్రబడ్డం తులసి గమనించింది.‘‘కూల్ డౌన్ ప్రగతీ. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడైన మా అన్న మీద పడుతున్న వాళ్లందరినీ కాదని నువ్వంటే ఇష్టపడుతున్నాడు.వాడెంత మర్యాదస్తుడంటే – నీ ఎదుటపడి ‘ఐ లవ్ యు’ అని చెప్పలేక నిన్ను పరిచయం చేస్తే చాలని నన్ను చంపుకొని తింటున్నాడు...’’‘‘అర్థమైంది. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విషయం చెప్పడానికా ఇంత ‘బిల్డప్’ ఇచ్చావ్? మీ అన్నకు నిర్మొహమాటంగా చెప్పు. నా మీద ఎలాంటి పిచ్చి భ్రమలూ పెట్టుకోవద్దని!, అతను అపర కుబేరుడైనా, నలకూబరుడైనా నా మనసు చలించదనీ, ప్రేమ నాకు ఆమడ దూరమనీ! పాపం మీ అన్నకు దూతికగా నువ్వు చాలా శ్రమపడ్డావు చాలు. ఇక పద క్లాసుకు టైమవుతోంది...’’ అంటూ విసుగ్గా విసురుగా పైకి లేచింది ప్రగతి. ఆమె నిగ్రహానికి, మనోబలానికి విస్తుపోయిన తులసి ఇంకేం చెప్పినా వినదని మౌనంగా ప్రగతి వెంట కాలేజ్ వైపు నడిచింది...ఎంత నచ్చజెప్పినా, బతిమాలినా కనీసం భూపతి ఎదుటపడ్డానికి కూడా అంగీకరించని ప్రగతి దృఢవైఖరి తులసి అహాన్ని దెబ్బతీసింది. భూపతి మెప్పు కోసం అతణ్ణి ప్రగతిని నీడలా వెంటాడమని, అందుకు తాను సహకరిస్తానని తులసి అతనికి మాటిచ్చి ప్రోత్సహించింది. తులసి కోసమనే వంకతో తరచుగా కాలేజీకి వస్తూ భూపతి ప్రగతి పెడమొహం పెట్టినా పరిచయం చేసుకున్నాడు. ఎన్నోసార్లు తన కారులో ‘లిఫ్ట్’ ఇచ్చే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డాడు, బలవంతపెట్టాడు కూడా. పిక్నిక్కనీ, కార్తిక వనసమారాధనకనీ, పుట్టిన రోజనీ... ఇలా వివిధ సందర్భాలకు తులసితో కలిసి ఆహ్వానించినా, అన్నిటినీ ప్రగతి తిరస్కరించింది. ప్రగతి సినిమాకో, షాపింగ్ కో, ఏదైనా సభకో... ఎక్కడికెళ్లినా ఆ సమాచారం ముందుగా తెలుసుకొని అక్కడ ప్రత్యక్షమై అతి మర్యాదలు చెయ్యబోయే భూపతిని ఆమె కటువుగా హెచ్చరించింది. తులసి పుట్టినరోజు వేడుకకు మాత్రం స్నేహితురాళ్ల బలవంతం మీద వాళ్లతో కలిసి వెళ్లిన ప్రగతికి అక్కడ కూడా భూపతి పీడ తప్పలేదు. ప్రగతికి అతి ప్రాధాన్యమిచ్చి, పాడడం రాదన్నా పాటలు పాడమని వేధించి, వద్దంటుంటే చనువుగా కేకు తినిపించి, ఆమెకు ప్రత్యేకంగా వీడియో ఏర్పాటు చేసి, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న భూపతి హింసను భరించలేక – తలనొప్పి సాకుతో మధ్యలోనే ప్రగతి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. కారులో డ్రాప్ చేస్తానని భూపతి వెంటబడితే ఆమె అందరిముందు చీదరించుకోవడంతో ఆ పురుష పుంగవుడికి తల కొట్టేసినట్టయింది. ఆ సంఘటనతో అతను తోక తొక్కిన త్రాచులా రెచ్చిపోయాడు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆమెను ఫ్రెండ్స్ ముందు అసభ్య పదజాలంతో వేధించడమే గాక ఆమె శీలం మీద బురద చల్లే పుకార్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు.భూపతి ఆవూళ్లో రెండు థియేటర్లు, జిల్లా అంతటా పెట్రోలు బంకులూ, మద్యం దుకాణాలూ వగైరావున్న సంపన్నవ్యాపారి శ్రీపతి ఏకైక పుత్రరత్నమనీ, పోలీసులను కూడా శాసించే యువ రాజకీయవేత్తనీ, అతనికి లేని వ్యసనం లేదనీ తెలిసిన ప్రగతి అతని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి, అతని సంగతి తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ అనసూయమ్మ చెవిన వేసింది. ఆవిడ కంగారుపడి ఎప్పటి నుంచో అనుకుంటున్న దగ్గర సంబంధం – సాఫ్ట్ వేర్ ఇంజినీరు, అన్ని విధాలా యోగ్యుడు అయిన వివేక్తో పెళ్లి నిశ్చయించి, ముహూర్తం కూడా పెట్టించింది.తులసి ద్వారా ప్రగతి పెళ్లి వార్త తెలిసిన భూపతి తనకు దక్కని ప్రగతిని ఎవరికీ దక్కనివ్వనన్నాడు. దారికాసి ప్రగతిని అటకాయించి మంచిగా తనతో పెళ్లికి అంగీకరిస్తే కళ్లలో పెట్టుకొని చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆమె ‘ఛీ’ కొట్టి తిరస్కరించడంతో ఇరవై నాలుగు గంటలలోగా ఆమె వివేక్తో పెళ్లి రద్దు చేసుకొని తనకు ఓకే చెప్పకపోతే ఆమె అంతు చూస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులను లెక్కచెయ్యకుండా గడువులోగా ఎటువంటి సమాధానమూ చెప్పని ప్రగతి ముందు అతను ప్రత్యక్షమై కొన్ని ఫోటోలు ఆమె చేతికిచ్చి, ఆ కాపీలు వివేక్కి పంపిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. అవి మార్ఫింగ్ చేసిన కొన్ని ప్రగతి అర్ధనగ్న చిత్రాలు, మరికొన్ని ఆమె భూపతి కౌగిలిలో ఉన్నవీ! ఆ ఫోటోలు చూసిన ప్రగతి అగ్నిహోత్రమైంది. ఆమె మనోనేత్రాల ముందు అలాంటి బెదింపులకు బలయిన తల్లి ప్రతిమ దీనగాథ కదలాడింది...ప్రతిమ గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి పీజీ చెయ్యడానికి వాల్తేరు వెళ్లింది. ఆమె పేరుకు తగ్గ బంగారు బొమ్మ. ఇంట్లో వాళ్లకిచ్చిన హామీకి తలవొగ్గి ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకోని ప్రతిమ మంచిగాయని అనే విషయం లేడీస్ హాస్టల్ అంతటికీ తెలిసింది. ఫ్రెండ్స్ బలవంతం మీద యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండు మూడుసార్లు పాల్గొన్న ఆమె సమ్మోహన గానం ఆమెను అభినందించడానికి వచ్చిన మోహన్ని పరిచయం చేసింది. అతను ఇంజినీరింగ్ విద్యార్థి. పాటలు రాయడమే కాకుండా మధురంగా స్వరకల్పన చేయగల సంగీతజ్ఞుడుగా అప్పటికే అతనికి కేంపస్లో మంచిపేరుంది. క్రమంగా అతని పాటల్ని ఆమె పాడ్డం, పరస్పర ప్రశంసలు – వాళ్ల ప్రేమకు దారి తీశాయి. వలపు చిగురించి, ప్రేమలేఖలు పుష్పించి, వాళ్ల అనుబంధం మధుమాసమై పరిమళించింది. ఇటు భీమిలి బీచ్ నుంచి అటు సింహాచలం వరకు ఎందరో ప్రేమికుల్ని చూసిన సంకేత స్థలాలన్నీ వాళ్ల ప్రణయానికి విహారవేదికలయ్యాయి. ‘మరో చరిత్ర’లో బాలు–స్వప్నల్లా రాళ్ల మీద కాకపోయినా ఆ ప్రేమ జంట ఇసుకలో తమ పేర్లను ఎన్నోసార్లు రాసుకొన్నారు...ప్రతిమ మోహన్ల ప్రేమాయణానికి అసూయపడిన ప్రతిమ రూమ్మేట్ రజని ఆ సంగతిని ప్రతిమ తల్లిదండ్రులకు తెలియపరచింది. అప్పటికే గాలివార్తను విన్నా, ప్రతిమ మీద నమ్మకంతో దానిని పట్టించుకోని వాళ్లు రజని ఇచ్చిన సమాచారంతో ఆ పొగ వెనక నిప్పు వుందని నిర్ధారించుకొని ఆగమేఘాల మీద వాల్తేరు వెళ్లి, ఉన్నపళంగా ప్రతిమను ఇంటికి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కూతురు గోడు వినకుండా ఆమెను ప్రభాకర్ అనే ఇంజినీరుకిచ్చి ఆ మూడు ముళ్లూ వేయించి, ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా ప్రభాకర్ సాహచర్యంలో సంసార పర్వంలో ఏ లోటు లేని ప్రతిమ గతాన్ని, మోహన్ని పూర్తిగా మర్చిపోయింది. ఓ ఆడపిల్లకు తల్లయింది.నాలుగేళ్లు ఆనందంగా గడిచిన తర్వాత అనూహ్యంగా ఆ ఇంటిలో మోహన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రభాకర్ పనిచేస్తున్న ఆఫీసుకు కొత్తగా వచ్చిన అతణ్ని ఆయన లంచ్కి పిలిచాడట! తనెవరో ఎరగనట్టున్న ప్రతిమను చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ లేని సమయంలో వచ్చి గతాన్ని గుర్తుచేశాడు. ప్రతిమకేమైందో తెలియక ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరకు కల్లబొల్లి కబుర్లతో తనకు చేరబడిన రజనినే పెళ్లిచేసుకున్నాననీ, కాని ఆమె నరకాన్ని చూపిస్తోందనీ ఆమెకు విడాకులిచ్చి తిరిగి ప్రతిమను చేసుకుంటాననీ ప్రపోజ్ చేశాడు. చేజారిన పెన్నిధి అదృష్టం కొద్దీ తిరిగి ఇలా కంటపడిందనీ, తను చెయ్యని తప్పును అర్ధం చేసుకొని తమ ప్రేమకు ప్రాణం పొయ్యమనీ అర్థించాడు. అతని రాకకూ కోరికకూ అప్రతిభురాలైన ప్రతిమ అతనికి చేతులెత్తి దణ్ణంపెట్టి పచ్చని తమ సంసారంలో చిచ్చు పెట్టవద్దనీ, తనను మరచిపొమ్మనీ వేడుకొంది. కాని అతను పట్టువిడిచి పెట్టకుండా ఆమె తనతో రావడానికి అంగీకరించకపోతే తను భద్రంగా దాచివుంచిన ఆమె ప్రేమలేఖల్ని ప్రభాకర్కి చూపిస్తానని బెదిరించాడు. మోహన్తో ఎప్పుడూ హద్దు మీరకపోయినా అతని బ్లాక్ మెయిలింగ్కి భయపడిపోయిన ప్రతిమ పసిగుడ్డును తల్లి చేతుల్లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది!తనకు యుక్తవయసు వచ్చిన తర్వాత తల్లి మరణ రహస్యాన్ని చెప్పిన అమ్మమ్మ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఎన్నడూ ప్రేమవ్యవహారంలో చిక్కుకోనని తన చేత ఒట్టేయించుకొంది. నాన్న స్పందన తెలుసుకోకుండానే ‘అమ్మ అనవసరంగా ఉద్రేకపడింది. అప్పటి కథ పునరావృతం కాకూడదు. నేను అమ్మలా చేయని తప్పుకు బేలనై బెదిరిపోక, ఈ తరం స్త్రీ అబల కాదనీ చీకటిని చీల్చుకొని వచ్చే పొడుస్తున్న పొద్దు లాంటిదనీ నిరూపిస్తాను. భూపతి ఆట కట్టిస్తాను..’ అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా నేరుగా కాబోయే భర్త వివేక్ దగ్గరకు వెళ్లింది. భూపతి బ్లాక్ మెయిలింగ్ గురించి చెప్పి ఆ ఫోటోలను సిగ్గుపడకుండా అతనికి చూపించింది. నిజానిజాలను తెలసుకొని తన నిజాయితీ పట్ల నమ్మకముంటే మాత్రమే తనను పెళ్లి చేసుకోమని, నిర్ణయాన్ని అతనికే విడిచి పెడుతున్నాననీ నిర్భయంగా చెప్పింది. ప్రగతి సాహసోపేతమైన చర్యకు ఆశ్చర్యపోయిన వివేక్ ఆమెకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ – ‘‘డార్లింగ్, నీ ధైర్యాన్నిఅభినందిస్తున్నాను. నీలాంటి సాహసి అయిన ప్రేయసి తోడుంటే జీవితంలో నాకు అసాధ్యాలుండవు. నిన్ను నిస్సందేహంగా నా దానిని చేసుకుంటాను. పద, ఈ ఫొటోలు స్టేషన్లో చూపించి ఈ దారుణానికి కారకుడైన భూపతిని నిర్భయ కేసు కింద అరెష్టు చేయిద్దాం...’’ అంటూ ఆమెకు చేయి అందించాడు. ప్రగతి ఆనందంగా అతని చేతినందుకొని ముందుకు నడిచింది...! -
కథాకళి: కొత్త పొరుగు
మా పై ఫ్లాట్లోకి ఎవరో కొత్తగా అద్దెకి వచ్చారు. పైనుంచి చప్పుళ్ళు వినిపించసాగాయి. ‘‘నిన్న రాత్రి ఆ చప్పుళ్ళకి నాకు నిద్రపడితే ఒట్టు.’’ మర్నాడు మావారికి చెప్పాను.చక్రాల కుర్చీని తోసుకుంటూ బ్రేక్ఫాస్ట్ బల్ల దగ్గరికి వెళ్ళాను. పై ఫ్లాట్ నుంచి వచ్చిన ఆమ్లెట్, చికెన్ సేండ్విచ్లు చూపించి మావారు చెప్పారు. ‘‘అదృష్టం. ఫ్రెండ్లీ పీపుల్.’’రెండు రాత్రుల తర్వాత పై ఫ్లాట్లోంచి మళ్ళీ అరుపులు వినిపించాయి.‘‘భార్యాభర్తల పోట్లాట.’’ మావారు చెప్పారు.‘‘వాళ్ళకి ఫర్నిచర్ సర్దిన అలసట తీరినట్లుంది.’’ నవ్వుతూ చెప్పాను.మరో రెండు రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక మావారితో కబుర్లు చెప్తూ కాఫీ తాగసాగాను. డోర్ బెల్ మోగడంతో మావారు వెళ్ళి తలుపు తెరిస్తే ఓ ముప్ఫై ఏళ్ళ యువతి బయట నించుని కనిపించింది. ఆమె చేతుల్లో ఓ పసిబిడ్డ ఉంది.‘‘హలో. గుడ్ మార్నింగ్. మేము మీ పై అపార్ట్మెంట్కి అద్దెకి వచ్చాం. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండటంతో ప్రైవసీ బావుందని దీన్ని తీసుకున్నాం.’’ నవ్వుతూ చెప్పింది.‘‘రండి. పాప పేరేమిటి?’’ నవ్వుతూ ఆహ్వానించాను.ఆమె చెప్పాక మావారు నన్ను పరిచయం చేసి చెప్పారు.‘‘థాంక్స్. సేండ్విచెస్ చాలా రుచిగా ఉన్నాయి.’’‘‘మీకు బాగా శబ్దాలు వినిపించి ఉంటాయి. అపాలజీగా వాటిని పంపాను.’’‘‘మీ పిల్లల్ని మా ఆవిడ దగ్గర వదిలి మీరు షాపింగ్కి కాని, ఎక్కడికైనా వెళ్ళచ్చు.’’ మావారు సూచించారు.‘‘ఓ. థాంక్స్. అత్యంత అవసరమైతే తప్ప మీకా శ్రమ ఇవ్వను. మీ కాలికి ఏమైంది?’’ ఆమె నా కాలికి ఉన్న కట్టుని చూసి అడిగింది.‘‘పడ్డాను. సూపర్ బజార్లో పిల్లలు అరటిపళ్ళని నేలమీద పడేశారు. చితికిన అరటిపళ్ళు రోడ్ మీద ఒలికిన ఆయిల్ కన్నా ప్రమాదం. వాటి మీద కాలు వేసి జారిపడడంతో కుడికాలు విరిగింది. ఇంకో మూడు వారాల దాకా అది అతుక్కోదని డాక్టర్ చెప్పాడు.’’ జవాబు చెప్పాను.‘‘అందులో మన అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా లేదు. ఐయాం సారీ. ప్లీజ్ గెట్వెల్ సూన్.’’ ఆమె చెప్పింది.‘‘తలకి తగలకపోవడం అదృష్టం.’’ మావారు చెప్పారు.∙∙∙ఆ రాత్రి మావారికి పై ఫ్లాట్నుంచి వినిపించే ఏడుపుకి మెలకువ వచ్చి నన్ను లేపారు. అది ఆమె ఏడుపుగా గుర్తించాను. ఆమె భర్త అరుపులు వినిపించాయి. ఆ ఏడుపు కొద్దిసేపు విని ఆయన విసుగ్గా అరిచారు.‘‘ఈ కొత్త పొరుగు న్యూసెన్స్ ఏమిటి? మన సెక్రటరీతో చెప్పి వాళ్ళని ఖాళీ చేయించాలి. నాకు రేపు ప్రజంటేషన్ కూడా ఉంది.’’ కోపంగా చెప్పారు.మర్నాడు ఉదయం మావారు వెళ్ళాక ఇంటర్నల్ ఇంటర్కమ్ మోగింది. ఆమె నుంచి ఆ కాల్. ఇద్దరం ఒకరినొకరం పలకరించుకున్నాక ఆమె అడిగింది.‘‘నేను ఈ సందు చివర కార్నర్ స్టోర్కి వెళ్ళిరావాలి. నేను వచ్చేదాకా మా అమ్మాయిని మీ దగ్గర ఉంచుకుంటారా? సరిగ్గా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను.’’‘‘తప్పకుండా. తీసుకురండి.’’‘‘నిద్రపోతోంది. లేస్తే ఎవరూ కనపడకపోతే ఏడుస్తుందని.’’వెంటనే చక్రాల కుర్చీలో తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాను. నాలుగైదు నిమిషాల్లో భుజం మీద చిన్నపాపతో ఆమె వచ్చింది. రబ్బర్ షీట్ కూడా తెచ్చింది. గెస్ట్ రూమ్లోని మంచాన్ని చూపించాను.‘‘థాంక్స్ ఎలాట్.’’ పాపని పడుకోబెట్టి వెళ్ళిపోయింది.ఆమె చెప్పినట్లుగా ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది.‘‘మా అమ్మాయి లేవలేదుగా?’’‘‘లేదు.’’‘‘లేవదని తెలుసు. థాంక్స్ అగైన్.’’ కేరీ బేగ్తో పైకి వెళ్తూ చెప్పింది.∙∙∙ఆ రాత్రి పైనుంచి మళ్ళీ మాకు పోట్లాటతో మొదలై కొట్టిన చప్పుళ్ళు, తాగుబోతు మగ గొంతు వినిపించాయి. దాంతోపాటు ఆమె ఏడుపు కూడా.‘‘రేపు ఆ ఇంటాయనకి ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏమిటని అడుగుతాను.’’ మావారు కోపంగా అరిచారు.మర్నాడు ఉదయం డోర్ బెల్ మోగింది. చక్రాల కుర్చీని తోసుకుంటూ వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా వాచ్మేన్. భయంగా మెట్లవైపు చూపించాడు. లుంగీలోని ఓ ముప్ఫై ఐదేళ్ళ వ్యక్తి ఆఖరు మెట్టు మీద పడున్నాడు. అతని మెడ అసహజ రీతిలో తిరిగి ఉండడంతో అతను జీవించిలేడని గ్రహించాను.‘‘సెక్రటరీని పిలుచుకురా.’’ భయంగా అరిచాను.సెక్రటరీ డాక్టర్కి, పోలీసులకి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేలోగా కింది మెట్టు మీద పడున్న అతన్ని పరిశీలనగా చూశాను.అతని అరిపాదాలకి చితికిన అరటిపళ్ళ గుజ్జు అంటుకుని కనిపించింది.చూస్తే పై మెట్ల మీద చాలా చోట్ల ఆ గుజ్జు కనిపించింది!క్రితం రోజు ఆమె నా దగ్గర తన కూతుర్ని ఉంచి షాప్కి వెళ్ళి తెచ్చిన కేరీ బేగ్లో అరటి పళ్ళు చూశానని గుర్తొచ్చింది! -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
విజయవాడ దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రభావిత మదనజనక సోదరీ..’ అంటూ గాయని శ్రీలలిత పాడిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాగ్ చేయడంతో వైరల్గా మారింది. శ్రీలలిత తల్లి భమిడిపాటి సత్యవాణి ఈ సంతోషాన్ని పంచుకుంటూ, శ్రీలలిత చిన్ననాటి నుంచి తను తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.‘‘పాప పుట్టినప్పుడు తను ఏ స్థాయికి వెళ్లాలి అనుకున్నానో, ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు శ్రీనికేత్, తర్వాత శ్రీలలిత. మావారు భమిడిపాటి రాజశేఖర్ బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బిహార్లో ఉన్నాం. నాకు మా పిల్లల నెలల వయసు నుంచే వారిని సంగీతంలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండేది. మా పుట్టిల్లు, మెట్టిల్లు వైపు పాతికమంది వరకు సంగీత విద్వాంసులు ఉన్నారు. నేనూ సంగీతం క్లాసులు తీసుకుంటాను. పిల్లలు స్టేజీపైన ప్రదర్శన ఇవ్వడానికి వారిలో భయం ఉండకూడదు. అందుకని, చిన్నప్పుడే బేబీ షోలలో పాల్గొనేలా చేసేదాన్ని. లలితకు ఎనిమిది నెలల వయసులో చీరకట్టి, పెళ్లికూతురులా రెడీ చేసి, బేబీ షోలో స్టేజీపైన నిలబెట్టాను. ఆ వయసులోనే తనకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. కూరగాయలతోనూ డ్రెస్సులు కుట్టి, వేసి, షోలకు తీసుకెళ్లేదాన్ని. నాకు మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి పాప డ్రెస్సులన్నీ నేనే కుట్టేదాన్ని. బొమ్మలను తయారుచేసి ఇచ్చేదాన్ని. పాప రెండేళ్ల వయసులో తణుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా ఎటు మారినా, ఎక్కడ పిల్లల ప్రదర్శన జరిగినా, అక్కడకు శ్రీలలితను తీసుకెళ్లేదాన్ని. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) ఒడిలో కూర్చోబెట్టుకొని...పాప మూడేళ్ల వయసులో ఓ షోలో పాల్గొనడానికి ఇంగ్లిష్ రైమ్ నేర్పించాను. కాని, అక్కడకు వెళ్లాక లింగాష్టకం పాడింది. ‘మూడేళ్ల వయసులో ఎలా పాడింది’ అంటూ అందరితో సహా నేనూ ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అనిపించింది. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాప అటూ ఇటూ వెళ్లకుండా ఒడిలో కూర్చోబెట్టుకొని, శ్లోకాలు, స్తోత్రాలు చదువుతుండేదాన్ని. తను కూడా వాటిని వింటూ, పాడుతూ అమ్మవారికి పూలు పెడుతూ అలాగే కూర్చొనేది. ఒడిలో కూర్చోబెట్టుకొని రోజూ స్తోత్రాలు చదవడం వల్ల, అవన్నీ గుర్తుపెట్టుకుని, అలవోకగా పాడేసిందని అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ‘పాట’ తన చెవిన పడాలి అని తపించేదాన్ని. మూడేళ్ల వయసులోనే...మూడేళ్ల వయసులో నేను తీసుకునే మ్యూజిక్ క్లాస్ తను తీసుకుంటాననేది. నా పని ముగించుకొని, క్లాస్కు వచ్చేసరికి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పాడుతుండేది. ఒక సిరీస్ అంతా ఘంటసాల పాటలు పాడించాం. ఇంట్లో ఓ మైకు ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం అయ్యిందంటే మా అందరి ప్రోగ్రామ్ పాటలే! View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati)దీక్ష తీసుకునేవాళ్లం..మా బంధువుల్లో చాలా మంది నన్ను కొంచెం విసుక్కునేవారు ‘ఏంటో నువ్వు, పిల్లకు పాత తరంలోలాగా లంగా జాకెట్టు, పెద్ద బొట్టు.. అమ్మాయిని ట్రెండ్కు తగినట్టుగా పెంచడం లేదు..’ అనేవారు. వాటిని పట్టించుకునేదాన్ని కాదు. లలిత అంటే నాకు అమ్మవారు. అలాగే ఉండాలనుకునేదాన్ని. బాలసుబ్రహ్మణ్యం, కోటిగారు ‘లలిత పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్టు’ ఉంది అనేవారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అక్కడకు నేను, మావారు వెళ్లిపోయి, ఓ పక్కన కాళ్లు లాగేస్తున్నా నిల్చుండేవాళ్లం. తను ఎక్కడెక్కడ పాడింది, ఎవరితో పాడింది, ఎవరెవరు తనను ప్రోత్సహించారు– అవన్నీ ఫొటో ఆల్బమ్గా చేసి, తనతో పాటు తీసుకెళ్లి, అక్కడున్నవారికి చూపించేవాళ్లం. సంగీతంలో లలిత ఉన్నత దశకు చేరుకోవాలనే తపన తప్ప మరింకేమీ లేదు. ఇన్నేళ్లలో మేం ఒక్క సినిమాకి వెళ్లింది లేదు, టీవీ చూసింది లేదు, ఒక యాత్రకు వెళ్లింది లేదు. సాధన మానకూడదు..ఏ రియాల్టి షో అయినా నేను, లలితనే వెళ్లేవాళ్లం. షో ముగించుకొని బయల్దేరేసరికి చాలాసార్లు అర్ధరాత్రి దాటిపోయేది. విదేశాలకు, ఏ ఊరు వెళ్లాలన్నా మా వారు వెంట వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఉండి, టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి, 90 శాతం మార్కులు తెచ్చుకుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. లలిత పుట్టకముందు మా ప్రపంచం సంగీతం. పుట్టాక మా ప్రపంచం అంతా లలితనే అయిపోయింది. తను ఎక్కడా డల్ అవకుండా చూసేవాళ్లం. ఎవరో ప్రోత్సహించడం లేదనో, ప్రైజు రాలేదనో ఆలోచన పెట్టుకోవద్దని, ప్రాక్టీస్ ఎప్పుడూ మానద్దని చెప్పేవాళ్లం. ఆరేళ్లపాటు యూ ట్యూబ్లో..దసరా రోజుల్లో అమ్మవారి దీక్ష తీసుకుంటాను. నాతో పాటు శ్రీలలిత కూడా దీక్ష తీసుకుంటుంది. కరోనా సమయంలో మా అబ్బాయి చెల్లెలి కోసం యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేశాడు. ఆరేళ్లపాటు వరుసగా శ్రీలలితతో సాంగ్స్ చేయించాం. దుర్గా నవరాత్రుల సందర్భంగా చేసిన పాటలకు మంచి పేరొచ్చింది. కాంతారా పాటకు అన్నాచెల్లెళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) మా అబ్బాయి మంగళూరులో ధార్మిక పాఠశాలను ప్రారంభించాడు. అమ్మాయి పెళ్లి చేసి, అత్తగారింటికి పంపించాక ఇప్పుడు మా జర్నీని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాం. పిల్లలకు సంగీతం క్లాసులు చెబుతుంటాను. బొమ్మలు చేస్తుంటాను.’’ అని చెప్పారు సత్యవాణి.∙ నిర్మలారెడ్డి -
హెయిర్ కట్.. 2కోట్లు!
జుట్టు ఉన్న ఆమె ఎన్ని ముడులైనా వేస్తుందట....అలానే ఓ యువతి తన కురులను మరింత అందంగా.. ఆకట్టుకునేలా మార్చుకోవాలనుకుంది..దీనికోసం స్టార్ హోటల్లోని ఓ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. ఎలా చేయాలో హెయిర్ డ్రెస్సర్కు చెప్పింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది..అందం మాట అటుంచి..ఉన్న జుట్టును కోల్పోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని, పరిహారం అందించాలని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. పెద్ద మొత్తంలో పరిహారాన్ని కోరింది..ఏడేళ్ల పాటు ఈ కేసు సాగింది. ఓ హెయిర్ కట్ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది..చివరకు పరిహారం విషయంలో కీలక తీర్పుతో కేసు ముగిసింది.ఢిల్లీకి చెందిన ఆశ్నా రాయ్ ఓ కార్పొరేట్ ఉద్యోగి. ఓ ప్రముఖ హోటల్లోని బ్యూటీ సెలూన్కి వెళ్లి...తన జుట్టును చివరి నుంచి నాలుగు అంగుళాలు కత్తిరించాలని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. పైనుంచి కిందికి నాలుగు అంగు ళాలు మాత్రమే జుట్టు మిగిలింది. దీనిపై నిర్వాహకులను నిలదీసింది..‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..’ అని ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. న్యాయపోరాటం ప్రారంభంఆశ్నారాయ్ 2018లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. సేవల్లో లోపంపై ఫిర్యాదు చేసింది. మానసికంగా తాను పడిన ఆవేదనను వెళ్లగక్కింది. మోడలింగ్, సినిమా రంగాల్లోకి అడుగు పెట్టాలనుకున్నానని..తన జుట్టు కారణంగా ఉన్న ఉపాధి అవకాశాలు పోయాయని, కొత్తవి చేజారాయని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ అనంతరం ఆమెకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుఆ తీర్పును సవాల్ చేస్తూ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సేవల లోపంపై కమిషన్ నిర్ధారణను ‘సుప్రీం’ సమర్థించింది..కానీ ‘పరిహారాన్ని కేవలం డిమాండ్ ఆధారంగా కాకుండా, సరైన ఆధారాలతో నిర్ణయించాలని స్పష్టం చేసింది. కేసును తిరిగి కమిషన్కు పంపింది. మరోసారి విచారించి రూ. 2 కోట్ల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలపై సందేహాలుబాధితురాలి వాదనతో యాజమాన్యం ఏకీభవించ లేదు. సమర్పించిన పత్రాలన్నీ ఫొటోకాపీలేనని, వాటికి విశ్వసనీయత లేదని వాదించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనకు పరిహారం చెల్లింపులో సాంకేతిక అంశాలు అడ్డంకి కాకూడదని బాధితురాలు వేడుకుంది. తన పత్రాల్లో లోపాలు లేవని పేర్కొంది. తుది తీర్పు.. కీలక సందేశంరూ.కోట్లలో నష్ట పరిహారం కోరినా విశ్వసనీయ ఆధారాలు సమర్పించలేదని ఆశ్నా రాయ్ను ‘సుప్రీం’ తప్పుబట్టింది. ఆమె సమర్పించిన పత్రాల్లోని లోపాలను ఎత్తి చూపింది. ‘‘కేవలం ఊహాగానాలు లేదా వ్యక్తిగత భావాల ఆధారంగా భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించలేం, నష్టం జరిగినట్టు స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాలు ఉండాలి’’ అని బెంచ్ స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల పరిహారం ఆర్డర్ను రద్దు చే సింది. రూ. 25 లక్షలు తుది పరిహారంగా ప్రకటించింది. సేవల్లో లోపం ఉంటే పరిహారం కోరే హక్కు ఉంది..అయితే తగిన, బలమైన సాక్ష్యాలు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ‘న్యాయం భావోద్వేగాలపై కాదు, ఆధారాలపై నిలబడాలి’ అనే సూత్రాన్ని ఈ కేసు మరోసారి బలంగా తెలియజేసింది. మరోవైపు, ఈ తీర్పు పరిహారం నిర్ణయంలో మార్గదర్శకంగా నిలవనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అమెరికాకు చెందిన జోనథాన్ లీ రిచెస్ ప్రపంచంలోనే అత్యధిక వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇతను సుమారుగా 2,600 పై చిలుకు కేసులు వేసినట్టు సమాచారం. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై కూడా కేసులు దాఖలు చేశాడు..అతను బిల్గేట్స్, జార్జ్బుష్ వంటి ప్రముఖులే కాదు.. ఈఫిల్టవర్, చివరికి ఫ్లూటో గ్రహం తనపై ప్రభావం చూపిందని ఆ గ్రహంపై కూడా కేసు వేశాడు. ఇలా నిత్యం ఏదో ఒక కేసు దాఖలు చేసి వార్తల్లో నిలవడంతో గిన్నిస్ బుక్ సైతం ఇతని పేరును రికార్డుల్లోకెక్కించింది.తన ప్రమేయం లేకుండా పేరు నమోదు చేశారంటూ గిన్నిస్ బుక్ నిర్వాహకులపై సైతం రిచెస్ కేసు వేయడం విశేషం. ఎక్కువ కేసులు సరైన ఆధారాలు లేవని, అసంబద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టేశాయి. అర్థం,పర్థం లేని అంశాలపై కేసులు వేసి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని తీవ్రమైన హెచ్చరికలు సైతం జారీ చేశాయి. ఓ కేసులో ఇతను శిక్షను సైతం అనుభవించాడు. అతడి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా ప్రవరిస్తున్నాడని పలువురు విమర్శించారు. దిలీప్ మాదిరెడ్డి -
పుష్పవిలాసం... ఉద్యాన వినోదం
ప్రకృతి ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. టులిప్పూల నేల నెదర్లాండ్స్లోని క్యూకెన్ హాఫ్ గార్డెన్ సందర్శకుల కోసం ముస్తాబయింది. మార్చి 19న ప్రారంభమైన ఈ పూలతోట వేడుకను మే 10 వరకు వీక్షించవచ్చు. పెరటితోట స్థాయి నుంచి ప్రపంచ వేదికగా మారిన ఈ అందమైన పూలవనం చరిత్ర చాలా పురాతనమైంది. ఈ తోట 1949లో చిన్నగా మొదలై, నేటికి 34 హెక్టార్లకు చేరుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తోంది.డచ్ భాషలో ‘క్యూకెన్ హాఫ్’ అంటే వంటింటి తోట అని అర్థం. పదిహేనో శతాబ్దంలో కౌంటెస్ జాకోబా వాన్ బీరెన్ తన వంటింటి ఉపయోగం కోసం ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆమె 1417 నుంచి 1433 వరకు బావేరియా–స్ట్రాబింగ్, హాలండ్, జీలండ్ కౌంటెస్, హైనాట్ కౌంటెస్గా ఉన్నారు. డచ్ ఈస్టిండియా కంపెనీలో కెప్టెన్గా పనిచేసి, 1627లో పదవీ విరమణ చేసిన తర్వాత, ఆడ్రియన్ మార్టెన్ బ్లాక్ క్యూకెన్ హాఫ్ కోటలోకి మారారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడే ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. అనంతరం ఎన్నో ఏళ్ల తరువాత 1857లో ప్రసిద్ధ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్లు జాన్ డేవిడ్ జోచర్, అతని కుమారుడు లూయిస్ పాల్ జోచర్ కోట చుట్టూ పార్కును రూపొందించారు. వీరు డిజైన్ చేసిన ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ శైలే నేటి ఆధునిక క్యూకెన్హాఫ్ తోటలకు పునాది.ఈ ఆధునిక క్యూకెన్ హాఫ్ చరిత్ర 1949లో మొదలైంది. అప్పటి లిస్సే మేయర్ నేతృత్వంలో 20 మంది డచ్ పూల పెంపకందారులు ఏకమై, నెదర్లాండ్స్ పూల ఎగుమతులను ప్రోత్సహించేందుకు దీనిని ఒక ప్రదర్శన కేంద్రంగా మార్చారు. మొదటిసారిగా 1950లో ఈ తోటలోకి పర్యాటకులను అనుమతించగా, తొలి ఏడాదిలోనే 2.36 లక్షల మంది సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి శరదృతువులో 32 హెక్టార్ల విస్తీర్ణంలో, తోటమాలులు 70 లక్షల టులిప్ పూల మొక్కలను ఒక ప్రత్యేకమైన డిజైన్ లో చేతులతో నాటుతారు. ఇందులో సుమారుగా 800 రకాల విభిన్నమైన టులిప్ మొక్కలు ఉంటాయి. వీటిని నాటడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది.టులిప్ తోటలతో పాటు క్యూకెన్ హాఫ్లో ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ గార్డెన్, జాపనీస్ ల్యాండ్స్కేప్ గార్డెన్, స్ప్రింగ్ మెడో, నేచురల్ గార్డెన్, చారిత్రక వనాలు, గార్డెన్ మేజ్ వంటి ప్రతి ఏడాది ప్రత్యేకంగా నాటే అనేక అందమైన తోటలు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో రంగురంగుల పూల మధ్య ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి, చరిత్రను ఆస్వాదించాలనుకునే వారికి క్యూకెన్ హాఫ్ ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అంతేకాదు నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పూల పరిశ్రమకు ఒక సజీవ ప్రదర్శనశాల ఈ ఫ్లవర్ గార్డెన్స్. -
మండుటెండల్లో... అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..!
వేసవి వచ్చేసింది. ఎండలు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతుండటం వల్ల ఇటీవలి ఏడాదుల్లో వేసవులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదల ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఆ ప్రభావం భూమ్మీద ప్రతిచోటా పడుతోంది. నడి వేసవిలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తాకిడి పెరుగుతున్నాయి. వేసవిలో ఎండల బాధ ఒకవైపు అయితే, మరోవైపు ఎండలతో పాటు ఇబ్బంది పెట్టే రకరకాల ఆరోగ్య సమస్యలు జనాలను సతమతం చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వేసవి తాపం నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో ఆరుబయటకు వెళ్లడం క్షేమంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండల ధాటి ఎలా ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు సహా రకరకాల వృత్తుల్లోని వారు నడివేసవి మధ్యాహ్న వేళల్లో కూడా ఆరుబయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి తీవ్రత నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వేసవిలో వడదెబ్బ బారినపడటం; దాహార్తి తట్టుకోలేక వీథుల్లో అపరిశుభ్ర పరిసరాల్లో దొరికే చెరకు రసం, పండ్లరసాలు వంటివి తాగడం వల్ల జీర్ణకోశ సమస్యల బారినపడటం; ఎండ ధాటికి చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండల ధాటికి తోడు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా జనాలను బాధిస్తాయి.వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ సోకడం; శరీరమంతా చెమటకాయలు పుట్టుకొచ్చి చర్మం మంటపెట్టడం; విపరీతమైన చెమటల వల్ల ఒంట్లోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్ ఏర్పడటం; వేడి వాతావరణంగా అలసట, నీరసం; చర్మంపై ర్యాష్, దురదలు, ఇన్ఫెక్షన్లు పెరగడం; కళ్లు పొడిబారి ఎర్రబడటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు ఏర్పడటం; ఎండ వేడి నుంచి సేదదీరడానికి ఈతకొలనుల్లోకి దిగితే, వాటిలోని నీటి కాలుష్యం వల్ల చెవులకు, ఇన్ఫెక్షన్లు సోకడం; ఉబ్బసం రోగులకు సమస్య తీవ్రం కావడం; రకరకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం; నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల రకరకాల జీర్ణకోశ సమస్యలు కలగడం వంటి సమస్యలు బాధిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒకవేళ ఈ సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయడం, అవసరమైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.వడదెబ్బ బారిన పడొద్దు...వేసవిలో ఎండ వేడి వల్ల తలెత్తే సమస్యల్లో తీవ్రమైనది వడదెబ్బ. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ప్రాంతాల్లో వడదెబ్బ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఒక్కోసారి వడదెబ్బ ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, ధారాళంగా గాలి సోకని ప్రదేశాల్లో ఉండటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మితిమీరిన శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావచ్చు. తలనొప్పి, తలతిరగడం, విపరీతమైన నిస్సత్తువ, అలసట, చర్మం పొడిబారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లేదా మలబద్ధకం ఏర్పడటం, గందరగోళానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి రోజూ తగినంత నీరు తాగడం, కొబ్బరినీరు, మజ్జిగ, తాజా పండ్లరసాలు తాగడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించడం, చలవ కళ్లద్దాలు పెట్టుకోవడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తగ్గాలంటే, కెఫీన్ పానీయాలు, మద్యపానం బాగా తగ్గించుకోవాలి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వడదెబ్బ సోకవచ్చు. అలాంటప్పుడు వడదెబ్బ సోకిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. ఫ్యాన్ లేదా ఏసీ కింద ఉంచాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. చల్లని నీళ్లు లేదా ఓఆర్ఎస్ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమై, స్పృహకోల్పోయే పరిస్థితులు ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.జీర్ణకోశ సమస్యలు...వేసవిలోని వేడి వాతావరణంలో వండిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండదు. పగలు వండిన ఆహారం సాయంత్రానికే పాడైపోతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం వండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. అలాగే, అపరిశుభ్ర పరిసరాల్లోని పండ్లరసాలు, చెరకురసం బండ్ల వద్ద పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. అపరిశుభ్ర పరిసరాల్లో పాడైన ఆహారం తీసుకున్నా, పానీయాలు తీసుకున్నా వేసవిలో జీర్ణకోశ సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కలుషిత ఆహార పానీయాల కారణంగా వేసవిలో టైఫాయిడ్, అతిసార వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమైనా ఎక్కువసేపు నిల్వ ఉన్నది తినకపోవడమే మంచిది. తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే వేసవిలో జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ వాంతులు, విరోచనాలు, జ్వరం, తలతిరగడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తితే, డీహైడ్రేషన్ వల్ల నీరసించిపోకుండా ఉండటానికి ఓఆర్ఎస్ తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు వాడుకోవడం తప్పనిసరి.వేసవిలో దోమల బెడదవేసవిలో కూడా కొన్నిచోట్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే చోట్ల, పరిసరాల్లో మురుగునీటి గుంతలు ఉండే పరిసరాల్లో దోమలు విజృంభిస్తాయి. వేసవి రాత్రుళ్లలో గాలి సోకడం కోసం చాలామంది ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచుతారు. ఇవి దోమలకు రాచమార్గంగా ఉంటాయి. కిటికీలు తెరిచినా, దోమల బెడద లేకుండా ఉండాలంటే, కిటికీలకు దోమలు చొరబడని రీతిలో తెరలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరానికి క్రీమ్స్ రాసుకోవాలి. దోమల బారిన పడితే డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యా«ధులు సోకితే జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.వేసవిలో కంటి సమస్యలువేసవిలో ఎండ తీవ్రతకు రకరకాల కంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు దుమ్ము« దూళి కాలుష్యం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, తరచుగా పుసులు రావడం, కళ్లు మంటపెట్టడం, కళ్ల వాపు, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కలగడం, కనుపాపపై పుండుç ఏర్పడం వంటి సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని అలెర్జీల వల్ల, ఇంకొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పదేపదే చేతితో కళ్లు రుద్దకుండా ఉండాలి.కళ్లు తుడుచుకోవడానికి శుభ్రమైన పొడి రుమాలు లేదా న్యాప్కిన్ వాడుకోవాలి. కళ్లు బాగా ఎర్రబడటం, పుసులు రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటివైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. వేసవిలో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అతినీలలోహిత కిరణాలను వడగట్టగలిగే చలవ కళ్లద్దాలను ధరించడం మంచిది. అలాగే, నేరుగా ఎండ కళ్ల మీద పడకుండా ఉండటానికి గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిది.ఎండల ధాటిని మనం ఎలాగూ తగ్గించలేం. కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి తగినట్లుగా వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఇంట్లో ఎవరో ఒకరు వడదెబ్బ బారినపడి, తీవ్ర అనారోగ్యానికి లోను కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే కొద్ది ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే, ఎండల వేడి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, సురక్షితంగా ఉండవచ్చు. చర్మ సమస్యలువేసవిలో ఎండలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కందిపోవడం, చెమటలు ఎక్కువై చెమటకాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చెమటకాయలను నివారించుకోవాలంటే రోజుకు రెండు మూడుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పొడిగా తుడుచుకున్న తర్వాత వదులుగా ఉండేలా చెమటను తేలికగా పీల్చుకునే కాటన్ దుస్తులు ధరించాలి. ఉక్కపోత ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది. అప్పటికీ చెమటకాయలు ఉంటే, ఉపశమనానికి ప్రిక్లీహీట్ పౌడర్ లేదా కేలమైన్ లోషన్ వాడటం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. సన్స్క్రీన్ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది.రోజూ తగినంత మంచినీరు, కొబ్బరినీరు, పానకం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేలా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలే కాకుండా, చర్మానికి రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుంది. రోజూ శుభ్రంగా స్నానం చేయడం, చర్మం పొడిగా ఉండేట్లు చూసుకోవడం, గాలిసోకి చెమటను పీల్చుకునేలా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే, వారు వాడే తువ్వాళ్లు, దుస్తులు వేరుగా ఉంచి, ఉతకడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలపై తగిన చికిత్స తీసుకోవాలి.వృద్ధులకు జాగ్రత్తలువేసవిలో వృద్ధులు మరింతగా ఇబ్బంది పడతారు. ఎండల ధాటికి వృద్ధులు త్వరగా అలసట చెంది, నీరసించిపోతారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. వేసవిలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కగలుగుతారు.⇒ వేసవిలో వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తరచు మంచినీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగడం మంచిది.⇒ చక్కగా గాలి వచ్చే గదుల్లో ఉండాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది.⇒ ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.⇒ బీపీ, సుగర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనపై వేళకు మందులు వేసుకోవాలి.⇒ ఉప్పు, నూనెలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.⇒ తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి.⇒ విపరీతంగా చెమటలు పోయడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.పిల్లలకు జాగ్రత్తలువేసవి తీవ్రత ఆరోగ్యవంతులైన పెద్దలకే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు వేసవిలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే, వేసవి తాపం నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.⇒ పిల్లలు ఆటల్లో పడితే ఆకలి దప్పులను మరచిపోతారు. వేసవిలో దాహంగా ఉన్నా, లేకపోయినా పిల్లల చేత మంచినీళ్లు, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగిస్తూ ఉండాలి.⇒ పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆటలు ఆడనివ్వకండి.⇒ ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ లేదా గొడుగు వాడాలి.⇒ పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారంతో పాటు పుచ్చకాయలు, కీరదోసకాయలు, పెరుగు వంటివి ఇవ్వడం మంచిది.⇒ పిల్లలకు వేసవిలో తేలికపాటి వదులైన కాటన్ దుస్తులు వేయడం మంచిది.⇒ చెమటకాయల నివారణ కోసం తరచు స్నానం చేయించాలి. స్నానం తర్వాత శరీరం పూర్తిగా పొడిగా ఉండేలా తుడిచాక దుస్తులు తొడగాలి.⇒ పిల్లల్లో అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఎండ తీవ్రత ఎప్పుడు ప్రమాదకరం?వేసవిలో ఎండ తీవ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినప్పటి నుంచి సమస్యలు పెరుగుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎండల ధాటి 40–45 డిగ్రీలకు చేరుకుంటే, ప్రమాద స్థాయి మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరినప్పుడు బయట ఎక్కువసేపు ఉంటే త్వరగా అలసట, నీరసం ముంచుకొచ్చి, డీహైడ్రేషన్కు లోనవడం, వాంతులు, తలతిరగడం, వడదెబ్బకు లోనవడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.5–42.5 డిగ్రీల వరకు; తెలంగాణలో 41.5 నుంచి 43.5 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉస్ణోగ్రతలు 45–47 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. -
ఎనర్జిటిక్ కలర్స్ అవీ!
ట్రెడిషనల్ నుంచి ట్రెండీ మోడ్రన్ లుక్స్ వరకు, ప్రతి స్టయిల్ను తన స్మైల్తో స్పెషల్గా మార్చేసే నటి శ్రీలీల. ఇందుకోసం ఆమె ఫాలో అయ్యే ఆ సింపుల్, స్టయిలింగ్ టిప్స్ ఇప్పుడు మీకోసం!‘డల్ కలర్స్ కంటే వైబ్రెంట్ కలర్స్ నన్ను మరింత ఎనర్జిటిక్గా ఉంచుతాయి. ఒకవైపు ట్రెడిషనల్ లంగా ఓణీ, మరోవైపు మోడ్రన్ కోఆర్డ్ సెట్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇష్టం. కాని, నేను వేసుకునేది ఏదైనా, అది నా డ్యాన్స్ కి అడ్డురాకూడదు. అంత కంఫర్టబుల్గా ఉండాలి. ఇక షూటింగ్స్ వల్ల ఎంత బిజీగా ఉన్నా నా స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండటానికి విటమిన్–సి సీరమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ని అస్సలు మిస్ చేయను. అదే నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్! – శ్రీలీలజ్యూలరీ బ్రాండ్: కశ్నీవాచీ ధర రూ. 2,999, హ్యాండ్ పీస్ ధర రూ. 2,299, నెక్ పీస్ ధర రూ. 1,299డ్రెస్.. బ్రాండ్: ఛవీ అగర్వాల్ ధర రూ. 40,500స్టయిల్కు సమయం వచ్చింది!చేతిపై ఈ వాచ్ పడితే, అది టైమ్ చెప్పడమే కాదు, స్టయిల్ కూడా చూపిస్తుంది! సాధారణంగా వాచ్ అంటే టైమ్ చూడటానికే అనుకుంటాం, కాని, ఇది ‘ నేను జ్యూలరీ కూడా!’ అని గర్వంగా చెప్తుంది. చిన్న డయల్ చుట్టూ మెరిసే రాళ్లు, నాజూకైన చైన్ డిజైన్ తో చేతికి తొడుక్కున్న క్షణంలోనే లుక్కి స్పెషల్ గ్లామ్ టచ్ వచ్చేస్తుంది. టైమ్ చూసే ముందు, అందరూ మీ చేతినే చూసేలా చేసే చిన్న మాయ ఇదే.ట్రెడిషినల్, వెస్ట్రన్ వేర్, ఆఫీస్ వేర్, పార్టీ వేర్తో ఇలా ఏ సందర్భానికైనా ఇది ఈజీగా సెట్ అవుతుంది. అయితే, జ్యూలరీ వాచ్ వేసుకున్నప్పుడు చేతికి బ్యాంగిల్స్ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే, ఈ వాచే షో స్టాపర్ కదా! అలాగే, స్లీవ్ కొంచెం పైకి ఉండే డ్రెస్సులు లేదా తక్కువ స్లీవ్ ఉంటే, ఇది మరింత హైలైట్ అవుతుంది. అలా మొత్తానికి, ఈ జ్యూలరీ వాచ్ స్టయిల్కు టైమ్ స్టార్ట్ అయింది! మార్కెట్లోనూ, ఆన్ లైన్ లోనూ ఆక్సిడైజ్డ్, మోడర్న్, ఫంకీ ఏ డిజైన్స్ కావాలన్నా ఇవి సులభంగా లభిస్తాయి. -
అందమైన సైలెంట్ లైఫ్!
గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేస్తూ, రంగుల ప్రపంచంలో తన ప్రయాణాన్ని ఎంతో హుందాగా కొనసాగిస్తున్న తెలుగమ్మాయి నటి ఆనంది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే..నా పేరు అది కాదు..నా అసలు పేరు రక్షిత. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక ‘ఆనంది’గా మారాను. నేను పుట్టి పెరిగింది వరంగల్లో. పక్కా తెలంగాణ అమ్మాయినే అయినా, చెన్నై వెళ్లాక తమిళ సంస్కృతికి కూడా బాగా కనెక్ట్ అయిపోయాను.బాల్యం ఇచ్చిన బలం!చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్లలో స్టేజ్పైకి వెళ్లాలంటే కాళ్లు వణికేవి. అలాంటిది, ఈ రోజు వేలమంది చూసే వెండితెరపై కనిపిస్తున్నానంటే అది కేవలం నాపై నాకు ఉన్న నమ్మకమే. హాస్టల్ లైఫ్లో ఫ్రెండ్స్తో కలిసి చేసిన అల్లరి, రాత్రిపూట దొంగచాటుగా తినడం వంటి చిన్న చిన్న సాహసాలు కూడా నన్ను మానసికంగాస్ట్రాంగ్గా చేశాయి.నా చాయిస్ సైలెంట్ లైఫ్!సినిమాల్లో నేను ఎంత సైలెంట్గా కనిపిస్తానో, నిజ జీవితంలో కూడా అంతే. పార్టీలకు వెళ్లడం కంటే షూటింగ్ అయిపోగానే నా గదిలో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా చిన్నదే. సోక్రటీస్తో నా వివాహం 2021లో చాలా సింపుల్గా జరిగింది. నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ లో ప్రొఫైల్లోనే ఉండాలని నేను కోరుకుంటాను.ఒక్క సినిమా, జీవితాన్ని మార్చింది!‘బస్టాప్’ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. కానీ ‘కాయల్’ సినిమా నా కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత అందరూ నన్ను ‘కాయల్ ఆనంది’ అని పిలవడం మొదలుపెట్టారు. అది నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు.పుస్తకాలే నా ప్రపంచం!నేను ఒక పక్కా బుక్వర్మ్. నా బ్యాగ్లో ఎప్పుడూ ఒక పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా హారర్, సస్పె¯Œ ్స, థ్రిల్లర్ నవలలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.నో డైట్!ఫుడ్లో తెలంగాణ వంటకాలు, ముఖ్యంగా పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. డైట్ పేరుతో నన్ను నేను కష్టపెట్టుకోను. మితంగా తినడం, సింపుల్గా జీవించడం నా స్టైల్.పవర్ఫుల్ పాత్రలు!సినిమాల్లో ‘విలేజ్ గర్ల్’ పాత్రలే ఎక్కువగా వచ్చినా, ‘జాంబీ రెడ్డి’లాంటి సినిమాలతో నాలోని మరో కోణాన్ని చూపించగలిగాను. నటిగా ఏ ఒక్క ఇమేజ్కో పరిమితం కాకుండా, భవిష్యత్తులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా ఒక పవర్ఫుల్ పీరియడ్ డ్రామాలో నటించాలన్నదే నా ఆశ. -
అందం పందెంలో పసిపిల్లలు
చిన్నారులు సైతం అందంపై మక్కువ పెంచుకుంటున్నారు. స్కిన్ కేర్ రొటీన్లలో మునిగిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆకర్షణీయమైన బ్యూటీ ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావంతో చిన్నారులు కూడా తమ స్కూల్ బ్యాగ్లలో ఖరీదైన కాస్మెటిక్స్ని క్యారీ చేస్తున్నారు. వీరినే నిపుణులు ‘సెఫోరా కిడ్స్’గా పిలుస్తున్నారు.స్కిన్ కేర్ అవసరమా?కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లల బాల్యాన్ని పణంగా పెడుతున్నాయంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్ ఆల్ఫా అంటే 2010–2020 మధ్య జన్మించిన పిల్లలు ఖరీదైన మాయిశ్చరైజర్లు, వృద్ధాప్య ఛాయలను తగ్గించే సీరమ్లను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ట్రెండ్ని అవకాశంగా మలచుకుంటోంది కాస్మెటిక్స్ రంగం. అసలు ఈ బేబీ–ఫేస్ బ్యూటీ ధోరణి గత ఏడాది ఒక కంపెనీ పసిబిడ్డల కోసం ప్రత్యేకంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను తీసుకురావడంతో మొదలైంది. మూడేళ్ల పిల్లల నుంచి వాడవచ్చునంటూ పలు రకాల ఫేస్ మాస్క్లను తను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ బ్యూటీ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులకు స్కిన్ కేర్ అవసరమా అంటూ ప్రపంచ వ్యాప్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా!కంపెనీలు ఇప్పుడు పసిపిల్లల కోసం కూడా మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. పెద్ద రిటైల్ స్టోర్లు తమ దుకాణాల మధ్యలో పిల్లలను ఆకర్షించేలా అందమైన బొమ్మలతో కూడిన సౌందర్య ఉత్పత్తులను పెడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్కి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నాయి. స్కిన్ ఫ్లుయెన్సర్లు అని పిలిచే చిన్నపిల్లలు ఈ ఉత్పత్తులను ఎలా వాడాలో చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం దీనికి కారణమైంది. పిల్లలు ఒకసారి శోధించగానే అధునాతన ఆల్గారిథమ్లు వారికి మరిన్ని బ్యూటీ టిప్స్, ఇన్ ఫ్లుయెన్సర్ల వీడియోలను చూపిస్తున్నాయి. ఈ వీడియోలు పిల్లలను ఆ అలవాట్లను అనుకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. గణాంకాల ప్రకారం, పిల్లల స్కిన్ కేర్ మార్కెట్ 2028 నాటికి రూ. 380 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కాస్మెటి కోరెక్సియాసౌందర్య ఉత్పత్తులు పిల్లలకు అందం అంటే ఏమిటో తెలియకముందే, రూపానికి ఏదో మెరుగుదల అవసరమనే సందేశాన్ని తెలియకుండానే పంపిస్తాయి. డిజిటల్ ప్రపంచంలో పదేళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఇతర పిల్లలను చూసి ప్రభావితమవుతున్నారు. దీనివల్ల కాస్మెటికోరెక్సియా అనే కొత్త మానసిక సమస్య పుట్టుకొచ్చింది. అంటే సౌందర్య ఉత్పత్తులు, చర్మ సంరక్షణ పట్ల అతిగా, పిచ్చిగా ఆసక్తి చూపడం. ఇలాంటి పద్ధతులకు చిన్నప్పుడే అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఒత్తిడి, పోలికలు పెరుగుతాయి. ఈ ధోరణి వల్ల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ, వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారుతున్నారు. గుడ్డిగా నమ్మొద్దుపసిబిడ్డలకు ΄ పౌష్టికాహారం, నిద్ర, ఆటలే ఉత్తమ స్కిన్ కేర్ అని సూచిస్తున్నారు స్కిన్కేర్ నిపుణులు. స్కిన్ కేర్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించకూడదంటున్నారు. సౌందర్య సాధనాల పరంగా పసిబిడ్డలకు స్కిన్ కేర్ అవసరం లేదంటున్నారు. ఫేస్ మాస్క్లు, స్క్రబ్లు, షీట్ మాస్క్ల వంటి బ్యూటీ ఉత్పత్తులను పరిచయం చేయడం వారి వయస్సుకి తగినది కాదని చెబుతున్నారు. అనవసరమైన ఉత్పత్తులు వాడటం వల్ల చికాకు, అలర్జీలు, దద్దుర్లు లేదా దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చనంటున్నారు. రంగురంగుల ΄్యాకేజింగ్, సోషల్ మీడియా ఆల్గారిథమ్ల వెనుక, పిల్లలు కోలుకోలేని శారీరక చర్మసమస్యలు, కాస్మెటికోరెక్సియా వంటి తీవ్రమైన మానసిక ఆందోళనలు దాగి ఉన్నాయి. అందుకే అత్యంత హానికరమైన మార్కెటింగ్ వ్యూహంలో చిక్కుకోకుండా పిల్లలను కాపాడుకోవాలి. అందంపై ఉండే సామాజిక దృక్పథాన్ని మార్చాలి. కాస్మెటిక్స్కి దూరంగా ఉంచాలి.పిల్లలకు కాస్మొటిక్స్ వాడకూడదు...చాలామంది తల్లుల్లో ఒక ఆలోచన ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు మంచి రంగులో ఉన్నారు. తర్వాత కలర్ తగ్గిందేమిటి అనుకుంటారు. దీంతో స్కిన్ కేర్ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చుండ్రు వస్తుందని, స్మెల్ బాగుంటుందని హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. మేకప్ కోసం ఇతర ప్రొడక్ట్స్ వాడే వారుంటారు. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సౌందర్య ఉత్పాదనలను ఉపయోగించకూడదు. రంగు తక్కువ ఉన్నారనో, ఇంకా బాగా కనిపిస్తారనో ఆలోచనతో వివిధ రకాల సబ్బులు, కాస్మొటిక్స్ ఉపయోగిస్తే వారి లేత చర్మంపైన దద్దుర్లు రావడం, ఇరిటేషన్ కలగడం.. వంటివి సంభవించవచ్చు. ఆరుబయట బాగా ఆడే పిల్లలకు మినరల్ బేస్డ్ సన్స్క్రీన్ మాత్రమే ఉపయోగించాలి.డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్– జంబుల రమాదేవి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!
జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్ చెప్పకనే చెప్పేసింది. ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది. వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. భర్త నో అన్నాడు. ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. View this post on Instagram A post shared by History Facts & Stories (@howhistorylooks) Crazy what having someone who won't give up on you can do for you. This is will forever be a beautiful story https://t.co/UH7Jzd0TEL— Bhuti Olishayayo Ikhekhe (@BantuMthabela_) April 11, 2026 -
గర్భిణీలు చేపలు తినకూడదా?
గర్భం ధరించి మొదలు పండంటి పాపాయిని ప్రసవించే దాకా ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. గర్భిణీలు తీసుకోనే ఆహారం, అపోహలపై ఈవిషయాలను తెలుసుకోవాలి.గర్భిణులు ఇద్దరి కోసం తినాలలా? నిజం ఏమిటంటే అవసరం లేదు. మోతాదు కంటే పోషక విలువలపై దృష్టి ముఖ్యం.బొప్పాయి, పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుంది? నిజమేనా? నిజం లేదు. బాగా పండిన బొప్పాయి, పైనాపిల్ తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితమే.కుంకుమపువ్వు తింటే బిడ్డ తెల్లగా పుడతారు. బిడ్డ చర్మం రంగు తల్లిదండ్రుల జీన్స్పైనే ఆధారపడి ఉంటుంది.చేపలు అస్సలు తినకూడదు. చేపలలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డ మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి.నెయ్యి ఎక్కువగా తింటే సుఖ ప్రసవం అవుతుంది : ఇందుకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్ -
మండే ఎండల్లో జొన్న అంబలి.. ఒంటికి చలవ
వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుత పానీయం జొన్న అంబలి. ఇది శరీరానికి చలువ చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది, అలాగే మలబద్ధకం, డీహైడ్రేషన్ సమస్యలకు అద్భుతమైన నివారణ. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. తయారీ ఎలా అంటే..!ముందుగా రెండు స్పూన్ల జొన్న పిండిని తీసుకుని నీళ్లలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఈ నీటిలో ముందుగా కలుపుకున్న పిండిని వేసి చిక్కబడేవరకు 5 నుంచి 10 నిమిషాల పాటు గరిటతో తిప్పుతుండాలి. చివరగా సరిపడా ఉప్పువేసుకుంటే అంబలి రెడీ అవుతుంది. అంబలి మరింత రుచిగా ఉండాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డైట్. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరగా ఆకలివేయదు. ఇదీ చదవండి : 75 హార్డ్ ఛాలెంజ్: బోహో గర్ల్ కృతిక వెయిట్ లాస్ జర్నీ -
ఇది... మన దేశంలో మొట్ట మొదటి పెట్రోల్ పంపు
ముంబైలోని హ్యూస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్ట మొదటి పెట్రోల్ పంపుకు సంబంధించి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తప్ప వీడియోలు చూసే అవకాశం చా....లా తక్కువ. అయితే ఏ.ఐ. తలచుకుంటే వీడియోలకు కొరతా! మన మొట్టమొదటి పెట్రోల్ పంప్కు సంబంధించిన ఏఐ–జనరేటెడ్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. చేతితో నడిపే డిస్పెన్సర్ల నుండి నేటీ హై–స్పీడ్ ఫ్యుయలింగ్ స్టేషన్ల వరకు మారుతున్న కాలం, పెట్రోల్కు పెరుగుతున్న డిమాండ్, రాకెట్ వేగంతో పట్టణ వృద్ధి... ఈ అంశాలను ప్రతిబింబిస్తూ, భారతదేశపు ఆటోమోటివ్ పరిణామంలో నగరం ఎలా కేంద్రంగా నిలిచిందో చూపే వీడియో క్లిప్ ఇది. చరిత్ర, సాంకేతిక అద్భుతంతో రూపొందించిన ఈ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహా’ అంటున్నారు. ఆరోజుల్లో రోడ్లపై పెద్దగా వాహనాలు కనిపించేవి కావు. అందుకే పెట్రోల్కు డిమాండ్ అంతగా ఉండేది కాదు. ఈ వీడియో క్లిప్ ఆ కాలాన్ని కళ్లకు కడుతుంది. సూట్, టోపీ ధరించిన ఇద్దరు వ్యక్తులు కారులో రాగా, ధోతీ, ధరించిన భారతీయుడు చేతితో పనిచేసే డిస్పెన్సర్ను ఉపయోగించి కారులో పెట్రోల్ నింపుతూ కనిపిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాటి ప్రశాంతమైన ముంబైని ఆవిష్కరించే వీడియో క్లిప్ ఇది. -
ఫ్రెండ్లీ బెంగళూరు
సామాజిక అంశాలలో మహిళల భాగస్వామ్యం, భద్రత, వృత్తిపరమైన అంశాలు... మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొని నగరాలను మూల్యాంకనం చేసి టాప్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా (టీసిడబ్ల్యూ) ఒక నివేదికను రూపొందించింది. నగరాలకు ర్యాంకులు ఇచ్చింది...→ కీలక అంశాలైన సోషల్ ఇన్క్లూజన్ స్కోర్ (ఎస్ఐఎస్), ఇండస్ట్రియల్ ఇన్క్లూజన్ స్కోర్ (ఐఐఎస్) ఆధారంగా ర్యాంక్లు ఇస్తారు. ‘ఎస్ఐఎస్’ అనేది సమాజంలో మహిళల ప్రాతినిధ్యం, భద్రత, జీవన యోగ్యతలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక ‘ఐఐఎస్’ మహిళల ఉద్యోగావకాశాలు, ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.→ మహిళల భద్రతా, ఉద్యోగావకాశాలు, జీవన విధానం వంటి కారణాల వల్ల బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. 53.2 సిటీ ఇంక్లూజన్ స్కోర్ (సీఐఎస్) సాధించింది.మెరుగైన పోలీసింగ్ నుండి మెరుగైన ప్రజా మౌలిక సదుపాయల వరకు, బెంగళూరు ఉమెన్–ఫ్రెండ్లీ పట్టణ జీవనానికి బెంచ్మార్క్గా నిలిచింది→ చెన్నై 49.8 సీఐఎస్ స్కోర్తో రెండవ స్థానంలో నిలిచింది. భద్రతా, ప్రజా రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాలలో రాణించింది.→ పుణే (46.2), హైదరాబాద్ (46), ముంబై(44.4) మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. → ఈ సంవత్సరం అత్యంత వేగంగా పురోగమించిన నగరాల్లో గురుగ్రామ్ ఒకటి. → దిల్లీ, గురుగ్రామ్, నోయిడా వంటి నగరాలు మహిళలకు వృత్తిపరమైన అవకాశాలు అందించినప్పటికీ, భద్రత, ధరలు, రోజువారీ రవాణా సౌకర్యాల విషయంలో వెనకబడి ఉన్నాయి.→ సోషల్ ఇన్క్లూజన్ స్కోర్(ఎస్ఐఎస్), ఇండస్ట్రీయల్ ఇన్క్లూజన్ స్కోర్(ఐఐఎస్)... ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత పాటించడంలో కోల్కతా, హైదరాబాద్, పుణేలాంటి కొన్ని నగరాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సామాజిక, పారిశ్రామిక సమ్మిళితత్వం నిరంతరం కలిసి సాగుతూ మహిళల ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాయి,ముంబైలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ముంబై అత్యధిక పారిశ్రామిక సమ్మిళిత స్కోర్ ఉన్నప్పటికీ, దాని సామాజిక సమ్మిళిత స్కోర్ 38.44తో వెనకబడి ఉంది. పుష్కలమైన ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ అధిక జీవన వ్యయాలు, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు ఉన్నాయి. -
సైకిల్... స్పీడ్గన్
హైదరాబాద్లోని ఓల్డ్ బోయినపల్లి వాసి జి.వి.శ్రీనివాస్రెడ్డి ఐదేళ్లలో 52 వేల కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేసి, 3 సూపర్ రాండోన్నూర్ టైటిల్స్ సాధించారు. 200 కిలోమీటర్లను కేవలం ఆరున్నర గంటలలో పూర్తి చేసి, ‘స్పీడ్గన్’ అని అభినందనలు అందుకున్నారు. సైకిల్ రైడింగ్ ద్వారా జీవనశైలిలో వచ్చిన మార్పులు, క్రమశిక్షణతో చేసిన సాధన, మెరుగైన జీవనవిధానానికి ఎలా చేరువ చేస్తుందో తన అనుభవాల ద్వారా పంచుకున్నారు..‘‘2021 నుండి 2025 వరకు సైక్లింగ్ ప్రయాణం నాలో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది. కోవిడ్ సమయంలో హాబీగా ప్రారంభమై, నెమ్మదిగా నా జీవనశైలిని మార్చింది. ప్రతిరోజూ మరికొన్ని అదనపు కిలోమీటర్లు రైడ్ చేయాలనే దృఢ సంకల్పాన్ని నాలో పెంచింది. వేళకు పని, నిద్ర, పోషకాహార విషయంలో క్రమశిక్షణను అలవాటు చేసింది. లక్ష్య సాధన పట్ల నిబద్ధతతో ఉండేలా చేయడమేకాదు బాడీని, మైండ్ను ఫిట్గా మార్చింది.స్పీడ్గన్గా పిలుపు...యూరోప్లో ఉండగా ఈ సైకిల్ రైడ్ నాకు పరిచయం అయ్యింది. నేనున్న సిటీలో అక్కడ ఎవరిని చూసినా సైకిల్మీదే ప్రయాణిస్తుంటారు. అక్కడ ఉన్నన్ని రోజులు మార్కెట్కి అయినా, ఆఫీస్కి అయినా సైకిల్పైనే వెళ్లేవాడిని. కోవిడ్కు ముందు హైదరాబాద్కి వచ్చేశాను. ఇక్కడి ట్రాఫిక్ చూశాక సైక్లింగ్ రూట్స్ సపరేట్గా లేకపోవడంతో ఇబ్బందిగా అనిపించింది. దీంతో జిమ్కి వెళ్లేవాడిని. కోవిడ్ సమయంలో జిమ్లు మూతపడ్డాయి. అప్పుడు వాహనాలేవీ రోడ్లమీదకు వచ్చే వీలు లేదు. కానీ, సైక్లింగ్ చేస్తున్నవారిని పోలీసులు ఆపడం లేదు. దీంతో మళ్లీ నా సైకిల్ రైడ్ వైపు వచ్చేశాను. ప్రతిరోజూ 50–60 కిలోమీటర్లు సైకిల్పై జర్నీ చేసేవాడిని. ఆ సమయంలోనే సైక్లింగ్ క్లబ్లలో చేరాను. అలా, ముందు కాలనీల్లో మొదలైన ఈ రైడ్ తర్వాత రైడర్స్ క్లబ్లో చేరే వరకు వెళ్లింది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే సూపర్ రాండోన్నూర్ టైటిల్ వరుసగా మూడుసార్లు గెలుచుకున్నాను. దీంతో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ రైడ్ నా శారీరక సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక దృఢత్వాన్ని కూడా మెరుగుపరచింది. 200 కి.మీ దూరాన్ని కేవలం 6 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశాను. అంటే సగటున 31.2 కిలోమీటర్ల వేగంతో రైడ్ పూర్తి చేశాను. రైడ్లో నా వేగం చూసి స్నేహితులు, సహచరులు నన్ను ‘స్పీడ్ గన్’ అని పిలిచేవారు. రైడ్లో ఎక్కువ శాతం ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడిని. వాటిలో తెలంగాణలోని ఆదిలాబాద్ ఒకటి. ఆదిలాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో రాత్రుల్లోనూ రైడ్ కొనసాగించాను. ఇందుకు నాతోటి రైడ్ మిత్రులు కూడా తమ సహకారాన్ని అందించారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన ఆ సమయంలోనే ఎక్కువ పొందాను. అందమైన జలపాతాలు, లోయలు, శిఖరాలు, సన్నని రోడ్డు మార్గాలు, హైవేలు.. అన్నీ సైకిల్ రైడ్ ద్వారానే వీక్షించాను. విదేశాలలో పొల్యూషన్ ఫ్రీ, పర్యావరణ పరిరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కాలుష్య నివారణకు సైకిల్ రైడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. శరీరం ఫిట్గా ఉండటానికీ ఇది మంచి అలవాటు. ఈ విషయాన్ని నలుగురికి తెలియజెప్పాలనే ఈ రైడ్లో పాల్గొంటుంటాను. ఇప్పటికి 52 వేల కిలోమీటర్లకు పైగా రీచ్ అయ్యాను. మరిన్ని థీమ్ బేస్డ్ రైడ్స్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలనుకుంటున్నాను. సహ జీవిత భాగస్వామ్యం...ఈ సైకిల్ రైడ్ అభిరుచిలో నన్ను నేను మలుచుకోవడానికి నా భార్య ప్రతిమ చాలా సహకరించింది. ‘రైడ్కు వెళుతున్నాను’ అని చెప్పగానే నాకు ఏమేం అవసరమో అన్నీ సరమకూర్చేది. తెల్లవారుజామున లేచి, నేను తీసుకోవాల్సిన ఫుడ్తో పాటు, అన్ని ఏర్పాట్లు చూసుకునేది. తిరిగి నేను సురక్షితంగా వచ్చేవరకు ఎదురు చూసేది. ముఖ్యంగా రాత్రి రైడ్స్ సమయంలో హైవేలు, అడవులు, తెలియని మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ నెట్వర్క్ కూడా అందుబాటులో ఉండేది కాదు. నా అభిరుచికి ఆమెను టెన్షన్ పెట్టక తప్పేది కాదు. ఆమె అండ లేకపోతే నా ఈ ప్రయాణం విజయవంతం అయ్యేది కాదు. నా ఈ విజయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇది కేవలం రోడ్డు మార్గంలో చేసే సైకిల్ ప్రయాణం కాదు, నా ఆరోగ్యాన్ని, సమర్థతను, పట్టుదలను పెంచిన జర్నీ కూడా’’ అని వివరించారు ఈ రైడర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సారీ... విసిగి వేసారి...
ఆ రాత్రి...వైట్హౌజ్లోకి వచ్చిన రిపబ్లికన్ పార్టీ అతి ముఖ్య కీలక మోస్ట్ ఇంపార్టెంట్ నాయకులు రోనాల్డ్ ఢామ్ డీమ్, కేనాల్డ్ బోనల్డ్, రెనాల్డ్లు గాఢ నిద్రలో ఉన్న ట్రంప్ను నిద్ర లేపారు.‘నాన్సెన్స్... ఇప్పుడొచ్చారేమిటి!!!!’ అని గట్టిగా అరిచాడు ట్రంప్.‘వార్లో తలమునకలై క్షణం తీరిక లేకుండా అలిసిసొలిసి పోయి ఉన్నారు కదా... మీరు కాస్త రిలాక్స్ కావడానికి, అలా షికార్కు తీసుకువెళదాం. అంతకు మించి ఏంలేదు’ అని చెప్పారు త్రీ లీడర్స్.‘షికార్ కంటే నాకు వార్ అంటేనే ఇష్టం’ అంటూ లేని మీసం మెలేశాడు ట్రంప్.‘అలా అంటే ఎలా? మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. మీరు హుషారుగా ఉంటేనే కదా వార్ పదికాలాల పాటు జరుగుతుంది. వార్ వీలైనంత ఎక్కువ కాలం పాటు జరగాలంటే మీరు రిలాక్స్ కావాల్సిందే... మాతో రావాల్సిందే...’ మూకుమ్మడి రిక్వెస్ట్ చేశారు ముగ్గురు. ట్రంప్ తన పార్టీ లీడర్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి హెలికాప్టర్లో ఒక నిర్జన ప్రదేశానికి వచ్చాడు. మధ్యాహ్నం అయింది.ట్రంప్కు విపరీతంగా ఆకలి అవుతోంది, ‘కనీసం కాఫీ కూడా లేదు’ అని కడుపు తడుముకున్నాడు.‘ఏమైనా కావాలా?’ అని అడిగారు ఆ ముగ్గురు.‘ధమ్ బిర్యానీ విత్ ఇరానీ చాయ్, పది కిలోల పుల్లారెడ్డి, మల్లారెడ్డి స్వీట్లు...’ ఇలా చెప్పుకుంటూ పోయాడు ట్రంప్.‘పాలు, చక్కెర ఉన్నాయి. ఇరానీ చాయ్ తయారుచేసుకోవచ్చు. కిలోల కొద్ది చికెన్, మసాల దినుసుల ఉన్నాయి. వేడి వేడిగా ధమ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏమున్నాయంటే...’ అని చెప్పుకుంటూ పోతున్నారు త్రీ లీడర్స్.‘మనం తయారుచేసుకోవడమేమిటి!!!’ అని ఫైర్ మీద గుగ్గిలం అయ్యాడు ట్రంప్.‘ఎప్పుడూ రెస్టారెంట్ నుంచి రెడీమెడ్ ఫుడ్ తెచ్చుకొని తినడం ఏం బాగుంటుంది. అలా తినీ తినీ మొహం మొత్తింది. అందుకే కాస్త చేంజ్గా మనమే వంట చేసుకుందాం...’ అన్నారు త్రీ లీడర్స్.‘మీకు వంట వచ్చా?’ అని అడిగాడు ట్రంప్.‘రాదు’ అన్నారు ముగ్గురు.‘మరి ఏ ధైర్యంతో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారయ్యా?’ ఒంటికాలి మీద లేచి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు ట్రంప్.తనకు తానే పైకి లేచి ‘ఇక తప్పుతుందా’ అని అని వంట చేయడాని రెడీ అయ్యాడు ట్రంప్.వంట కోసం పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాడు.‘అరే... ఇంతకీ గ్యాస్ స్టవ్ ఎక్కడ?... అర్జంటుగా తేవండి’ అని అరిచాడు ట్రంప్.‘మీ వార్ పుణ్యమా అని గ్యాస్ లేదు స్టవ్ లేదు... కన్నీళ్లు, కట్టెల మంటలే ఉన్నాయి’ అన్నారు ఆ ముగ్గురు.‘మీ ముఖం మండిపోను... గ్యాస్ స్టవ్ లేకుండా ఏ ధైర్యంతో నన్ను తీసుకువచ్చారయ్యా’ నలుదిక్కులూ అదిరిపోయేలా గర్జించాడు ట్రంప్.‘మనం వెదకాలే కాని ఇక్కడ బోలెడు కట్టెలు దొరుకుతాయి. వాటితో బేషుగ్గా వంట చేసుకోవచ్చు’ అన్నారు త్రీ లీడర్స్.ఆ నలుగురు ఆ ఎడారిలాంటి ప్రాంతంలో గంటల కొద్దీ వెదికినా ఒక్క కట్టెపుల్ల కూడా కనిపించలేదు పాపం!ఏడ్పించడం తప్ప ఎప్పుడూ ఏడ్వని ట్రంప్ ఆకలి బాధ తట్టుకోలేక ఫస్ట్ టైమ్ భోరుమని బిగ్గరగా ఏడ్చాడు!– యాకుబ్ పాషా -
అమ్మ కడుపు చల్లగా...
గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి నవజాత శిశువుల ఆరోగ్యం వరకు తల్లీబిడ్డలు చల్లగా ఉండేలా కృషి చేస్తోంది డా.అపర్ణ హెగ్డే ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ... ఆర్మ్మాన్. ప్రతి ఇంటిలో చిన్నదో, పెద్దదో సెల్ఫోన్ ఉంటుంది. ఆ సెల్ఫోన్నే వేదికగా చేసుకొని పేదింటి గర్భిణి మహిళలకు వారం, వారం సలహాలు ఇవ్వడంతో పాటు హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇస్తోంది ఆర్మ్మాన్...‘ప్రసూతి, నవజాత శిశు మరణాలు చాలా వరకు నివారించదగినవే అయినా నివారించలేకపోతున్నాం’ అంటున్న యూరోగైనకాలజిస్ట్ అపర్ణ హెగ్డే తల్లులు, నవజాత శిశువుల మరణాలను నివారించడానికి ‘అర్మ్మ్యాన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ‘క్షేత్రస్థాయిలో తక్కువ వనరులతో ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్నారు హెల్త్ వర్కర్లు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మురికివాడలలోని మహిళలకు సకాలంలో వైద్యసహాయం అందడం సవాలుగా మారింది. ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను దగ్గరి నుంచి చూడడం వల్లే తగిన పరిష్కారాల కోసం ఆర్మ్మాన్కు శ్రీకారం చుట్టాను’ అంటున్నారు అపర్ణ హెగ్డే.వారే స్ఫూర్తి....ప్రజారోగ్య వ్యవస్థకు చోదకశక్తిగా ఉన్న ఆశా కార్యకర్తలు అనే హెల్త్ వర్కర్లు అపర్ణకు స్ఫూర్తి. ‘ఆశాకార్యకర్తలు శ్రమజీవులు. పనిభారాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. ఒక గర్భిణి స్త్రీని లేదా నవజాత శిశువును చూడడానికి మండే ఎండలను, వర్షాలను వారు లెక్క చేయరు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలనే తపనతో కర్తవ్యదీక్షతో ముందుకు వెళతారు. వారు పొలాల గుండా, అడవుల గుండా మండే ఎండల్లో గంటల తరబడి నడిచిపోవడం చూశాను. గర్భిణులు, బాలింతలకు నిజంగా ఏమి అవసరమో వారు మాకు చెబుతుంటారు. మేము ఏదైనా మార్పు తెచ్చామంటే దానికి వారే మూలకారకులు’ అంటున్నారు అపర్ణ.మొబైల్ ఫోన్ వేదికగా...గర్భిణి స్త్రీలకు, మూడు సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు తగిన సూచనలు, ముందుజాగ్రత్తలు చెప్పి వారు సమస్యల బారిన పడకుండా చూస్తోంది ఆర్మ్మాన్. దీని కోసం ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్నే ఆసరాగా చేసుకుంటోంది. గర్భిణులు, బాలింతలు తమకు ఏమైనా సమస్యలు ఉంటే అందుబాటులో ఉన్న మొబైల్తో సమాచారాన్ని అందిస్తే చాలు ఆర్మ్మాన్ కార్యకర్తలు రంగంలోకి దిగుతారు. ప్రమాదకరమైన కేసులను ముందుగానే గుర్తించి తెలియజేసేలా హెల్త్వర్కర్లకు తగిన శిక్షణ ఇస్తోంది ఆర్మ్మాన్.మార్పు వస్తోంది...‘ఆర్మ్మాన్ వల్ల మార్పు వచ్చిందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో సమాధానం ఇస్తున్నారు అపర్ణ హెగ్డే. గర్భధారణ మధ్య విరామం అవసరం అని ‘ఆర్మ్మాన్’ విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రభావంతో రేణుక అనే మహిళ తన భర్తను కుటుంబ నియంత్రణకు అంగీకరించేలా ఒప్పించింది. దిల్లీలోని కళ్యాన్పురి మురికివాడల్లో నివసించే భాటియ భార్య శిశువుకు జన్మనిచ్చి చనిపోయింది. నవజాత శిశువును ఎలా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పర్యవేక్షించాలి, అనేదానిపై భాటియాకు బొత్తిగా అవగాహన లేదు. నవజాత శిశువుకు సంబంధించి ‘ఆర్మ్మాన్’ ఇచ్చిన సూచనలు, సలహాలు ఆయనకు ఎంతో ఉపకరించాయి.గర్భిణిగా ఉన్నప్పుడు ఖుష్బు శ్రీవాస్తవ, ఆరోగ్యకరమైన ప్రసవానికి సంబంధించి వారానికి ఒకసారి ‘ఆర్మ్మాన్’ నుంచి వచ్చే వాయిస్ కాల్స్ వినేది. మాత్రల వాడకం నుంచి తీసుకునే ఆహారం వరకు ఆ సలహాలు ఖుష్బుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయి. పోషకాహార ప్రాముఖ్యతను గట్టిగా చెప్పాయి. ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ఖుష్బుకు గర్భస్రావం అయింది. ‘గతంలో నేను వాయిస్ కాల్స్ విని ఉంటే నాకు గర్భస్రావం కాకుండా ఉండేది’ అంటుది ఖుష్బు.‘ఆర్మ్మాన్’ ప్రభావం గురించి చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైట్ రిబ్బన్ అలయెన్స్మన దేశంలో ప్రసూతి మరణాల నివారణ, నవజాత శిశువుల ఆరోగ్యం....మొదలైన లక్ష్యాలతో 1999లో ‘వైట్ రిబ్బన్ అలయెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది. కస్తుర్బా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ‘సేఫ్ మదర్ హుడ్ డే’ నిర్వహించుకోవాలని ‘వైట్ రిబ్బన్ అలయెన్స్’ నిర్ణయించింది.సామాజిక హోదాతో సంబంధం లేకుండా...ప్రసవ సమయంలో ఏ స్త్రీ ప్రాణాలు కోల్పోకూడదు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల ఏ బిడ్డా ప్రాణాలు కోల్పోకూడదు. తల్లులు, పిల్లల ఆరోగ్యం వారు ఎక్కడ పుట్టారు, వారి కుటుంబాలు ఎంత సంపాదిస్తున్నాయి, సమీపంలో క్లీనిక్ ఉందా, అనేదానిపై ఆధారపడకూడదు. ప్రతి స్త్రీ తన కులం, వర్గం, సామాజిక హోదాతో సంబంధం లేకుండా తన కోసం, తన బిడ్డ కోసం సరైన నిర్ణయం తీసుకునే సాధికారత ఉండాలి. ప్రభుత్వాలు మా సాంకేతికతను స్వీకరించడం మాత్రమే కాకుండా దానిని తమ సొంతం చేసుకొని, మెరుగు పరిచి జాతీయ ఆరోగ్య వ్యవస్థలకు అనుసంధానిస్తున్నాయి. తద్వారా మహిళల ఆరోగ్యం రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రాధాన్యతగా మారుతుంది.– అపర్ణ హెగ్డే -
పట్టుదలకు ప్రతిరూపం పాయల్
నిరాశ, నిస్పృహలు అనేవి ఓటమికి క్లోజ్ ఫ్రెండ్స్. ఆశ, ఆత్మవిశ్వాసం అనేవి విజయానికి క్లోజ్ ఫ్రెండ్స్. కాళ్లు, చేతులు లేని పాయల్ నాగ్ ఆశ, ఆత్మవిశ్వాసాలతో స్నేహం చేసింది. బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఫైనల్లో తన ఆరాధ్య దేవతలాంటి శీతల్దేవిని ఓడించి స్వర్ణం గెలుచుకుంది పద్దెనిమిదేళ్ల పాయల్ నాగ్. ఇది కేవలం విజయం మాత్రమే కాదు. క్రీడలకు అతీతమైన అనుభూతి.ఒకప్పుడు శీతల్దేవి గురించి విని పాయల్ పులకించిపోయేది. ఆమె వీడియోలు అదేపనిగా చూసేది. ‘శీతల్దేవిలా పేరు తెచ్చుకోవాలి’ అని కల కనేది. ఆ కల నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అయితే అది అదృష్టంతో వచ్చిన విజయం కాదు. అంకితభావం, కష్టపడేతత్వంతో వచ్చిన విజయం...అనాథాశ్రమంలో...ఒడిశాకు చెందిన పాయల్ తండ్రి కూలి. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన విద్యుత్ ప్రమాదంలో నాలుగు అవయవాలను కోల్పోయింది పాయల్. పోషించే స్థోమత లేక తల్లిదండ్రులు ఆమెను అనాథాశ్రమంలో చేర్పించారు. దురదృష్టం సంగతి ఎలా ఉన్నప్పటికీ పాయల్ నిరాశ చీకట్లో మగ్గిపోలేదు. ఎప్పుడూ చురుగ్గా ఉండేది. పాయల్ తన నోటితో పెయింటింగ్ వేస్తున్న ఒక వైరల్ వీడియో కోచ్ కుల్దీప్ కుమార్ వేద్వాన్ దృష్టిని ఆకర్షించింది. పాయల్లోని ప్రతిభను గుర్తించి కత్రాలోని తన అకాడమీకి తీసుకువచ్చాడు. పాయల్ కోసం ప్రత్యేకంగా విల్లు తయారుచేయించాడు. ఆర్చరీలో ఆమెను తీర్చిదిద్దాడు.భుజం, నోటితో...విల్లును పట్టుకోవడానికి కాళ్లను ఉపయోగిస్తుంది శీతల్దేవి. ఆమెలా కాకుండా తన భుజం, నోటిని ఉపయోగించి విల్లును సంధిస్తుంది పాయల్. ఇదేమీ అంత సులువైన విషయం కాదు. బోలెడు కష్టపడాలి. సహనం ఉండాలి. ఆ రెండు పాయల్లో ఉండడం వల్లే ఆర్చరీలో అద్భుత ప్రతిభ చూపగలుగుతోంది.బ్యాంకాక్లో పాయల్ పాల్గొన్న ఈవెంట్ తన మొదటి సీనియర్ అంతర్జాతీయ ఈవెంట్ అయినప్పటికీ శీతల్ను ఓడించడం ఇదే మొదటి సారి కాదు. జైపూర్లో 2025లో జరిగిన పారా ఆర్చరీ నేషనల్స్లో శీతల్ను స్వల్ప తేడాతో ఓడించింది.ఇక బ్యాంకాక్ విషయానికి వస్తే...శీతల్కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా పాయల్ ప్రశాంతంగా విజయాన్ని కైవసం చేసుకుంది.ఇద్దరి గురువు ఒకరే...శీతల్తో పాటు, పాయల్ను ఆర్చరీలో తీర్చిదిద్దిన వ్యక్తి కుల్దీప్ కుమార్ వేద్వాన్. ఆయన ఒక రైతు కుమారుడు. ఆ రైతు ఎలాంటి వ్యక్తి అంటే... ‘నీ దగ్గర సంపద లేకపోవచ్చు. వనరులు లేకపోవచ్చు. నీ మీద నీకు మాత్రం గట్టి నమ్మకం ఉండాలి’ అని నమ్మిన వ్యక్తి.తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్న వేద్వాన్ ఇతరులకు కూడా దారి చూపుతున్నాడు. శీతల్, పాయల్లాంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేశాడు.Payal Nag.Daughter of a daily-wage mason from Odisha. Electrocuted at the age of eight. Lost all four limbs.And then, found a bow.Spotted through her paintings by coach Kuldeep Vedwan, the same man who shaped world champion Sheetal Devi. Defeated her idol Sheetal Devi at… pic.twitter.com/KdWGcuAJ9X— anand mahindra (@anandmahindra) April 6, 2026 -
విజేతలు రైతమ్మలు..
మహిళా రైతులకు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని సమర్థవంతంగా, సుస్థిరంగా పెంపొందించే పద్ధతులపై అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) పరిశోధకుల బృందం అధ్యయనం నిర్వహించింది. ఫ్రాంటియర్స్ ఇన్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ పత్రికలో ఇటీవల ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, మన మహిళా రైతులు నిజమైన వాతావరణ మార్పులను తట్టుకునే శక్తియుక్తులను పెంపొందించుకోవాలంటే వారికి ఏవో కొన్ని సాంకేతికతలను ఉన్నత స్థాయి నుంచి అందించటం ఒక్కటే సరిపోదు. వారికి సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేసి అందించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. భారత దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో విభిన్న కేస్ స్టడీలను ఐఆర్ఆర్ఐ విశ్లేషించి ఈ విషయాన్ని నిర్థారించింది. ఆ వివరాలు చూద్దాం...వాతావరణ సంక్షోభం దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయం చేసే కోట్లాది మంది మహిళలను కూడా ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ రంగంలో అహరహం శ్రమించటంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మహిళా రైతులు అడుగడుగునా ‘లింగ–వివక్ష’ను ఎదుర్కొంటున్నారు. వారు అధిగమించాల్సిన సామాజిక అడ్డంకులను పరిగణనలోకి తీసుకోకుండా, వారికి కొత్త సాంకేతికతతో కూడిన పనిముట్లను అందించటం వల్ల ప్రయోజనం ఉండటం లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఫ్రాంటియర్స్ ఇన్ సస్టయినబుల్ ఫుడ్ సిస్టమ్స్ పత్రికలో ఇటీవల ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిజంగా ఉపయోగపడే సామర్థ్యాలను మనం పెంపొందించుకోవాలంటే, విడివిడి సాంకేతికతలను అందించడం ఆపి, అనేక ఆవిష్కరణలను కలిపి గంపగుత్తగా అందించడం ప్రారంభించాలి. ఎక్కడో ఉండే నిపుణులు తమకు తోచినట్లు సిద్ధం చేసిన సాంకేతికతను రైతుకు బదిలీ చేసే సాంప్రదాయ అధికార కేంద్రీకృత వ్యవసాయ విస్తరణ నమూనా మహిళా రైతుల విషయంలో విఫలమవుతోందని ఈ పరిశోధన తేల్చింది. దానికి బదులుగా, సామాజిక పరిస్థితులు, అవసరాల ఆధారిత సాంకేతిక విధానాన్ని అమలు చెయ్యాలని సూచించింది. అంటే, విత్తనం లేదా ట్రాక్టర్ కేవలం మహిళా రైతులకు, పురుష రైతులకు ఒకేలా ఉపయోగపడే ఒక తటస్థ సాంకేతికత కాదని గుర్తించడం.. సామాజిక సంబంధాలు, సాంస్కృతిక నియమాలు, ఆ సమాజంలోని సంస్థాగత అధికార స్థితిగతులపై దాని విజయం ఆధారపడి ఉంటుందని గుర్తించటం అవసరమని అధ్యయనం పేర్కొంది. ఈ భావనను నిరూపించడానికి అధ్యయనంలో భాగంగా ఐఆర్ఆర్ఐ పరిశోధకులు భారతదేశవ్యాప్తంగా నాలుగు విభిన్న కేస్ స్టడీలను విశ్లేషించారు. సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేయడం ద్వారా మహిళా రైతులు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వైపు సమర్థవంతంగా, సుస్థిరంగా ఎలా మారగలరో ఈ అధ్యయనం వెల్లడించింది. విజ్ఞాన శాస్త్రం, భూ హక్కులపై అవగాహనతో చౌడుపై పోరాటంగుజరాత్లోని భావనగర్ ఉప్పునీటి చిత్తడి నేలల్లో పర్యావరణ ఒత్తిళ్లు, సామాజిక అసమానతలు విడదీయరానివని ఉత్థాన్ అనే సంస్థ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ట్రస్ట్ నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా) గుర్తించింది. ఈ ప్రాంతంలోని మహిళలు నేల లవణీయతతోను, చట్టపరమైన భూమి హక్కుల లేమితో కూడా పోరాడుతున్నారు. భూమి హక్కులు లేకపోవడంతో వారు ప్రభుత్వ రుణాలను లేదా దీర్ఘకాలిక వ్యవసాయ వనరులను సులభంగా పొందలేకపోతున్నారు. ఉత్థాన్ రూపొందించిన నూతన ఆవిష్కరణల ప్యాకేజీ ప్రత్యేకమైనది. ఇది నేల పరీక్ష, సేంద్రియ ఎరువులు వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను, సామాజిక–చట్టపరమైన సాధికారతతో జత చేసింది. బ్లాక్–స్థాయి రెవెన్యూ కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు తోడ్పడే ‘కృషి సఖు’లు (మహిళా సామాజిక రిసోర్స్ పర్సన్లు), పారాలీగల్ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పారాలీగల్ కార్యకర్తలు భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించిన చిక్కుముడులను అధిగమించడంలో మహిళా రైతులకు సహాయపడ్డారు. కృషి సఖులు ప్రామాణిక పంటల సాగు పద్ధతులన్నిటినీ బోధించారు. ఈ విధానం ఒక ‘సోదరభావాన్ని‘ సృష్టించింది. దీనిలో మహిళలు తమ తోటివారి నుంచి నేర్చుకున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు, వారిపై వారి భర్తలకున్న విశ్వసనీయతను గణనీయంగా పెంచింది.ఆవాల కోసం అనుభవజ్ఞానాన్ని, మార్కెట్లను నిర్మించటంఉత్తర ప్రదేశ్లోని ఉత్తర మైదాన ప్రాంతాల్లో గ్రామీణ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ) నీటి ఒత్తిడిని తట్టుకునే, పోషకాలు అధికంగా కలిగి ఉండే ‘పూసా మస్టర్డ్ 30’ అనే బయోఫోర్టిఫైడ్ ఆవాలు రకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఒక మహిళ తన పంటను సరసమైన ధరకు అమ్ముకోవడానికి మార్గం లేనప్పుడు, కేవలం మెరుగైన విత్తనాన్ని అందించడం నిరుపయోగమని పరిశోధకులు పేర్కొన్నారు. జీఎఫ్ఐ ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. ఈ విత్తనాలతో పాటు ఇతర ఆవిష్కరణల ప్యాకేజీని కలిపి అందించటంపై దృష్టి సారించింది. వారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీల) ద్వారా మార్కెట్ అనుసంధానాలతోపాటు సాంకేతిక శిక్షణ ఇప్పించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి అవగాహన పర్యటనలను నిర్వహించడం ద్వారా, వారు శాస్త్రీయ నైపుణ్యాన్ని రైతులు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. తద్వారా మహిళా రైతులు నిపుణులతో నేరుగా సంభాషించడానికి వీలు కలిగింది. ఈ మార్కెట్ అనుసంధానాలను కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఎఫ్పీఓలు, ఎస్హెచ్జీల ద్వారా ఏర్పడిన సామూహిక భాగస్వామ్యం మహిళా రైతులకు బలాన్నిచ్చింది. మహిళలు తమ ఇళ్లలో, సమాజాలలో తమ అభిప్రాయాలను మరింత స్పష్టంగా వ్యక్తపరచడానికి ఈ సాధికారత సహాయపడింది.ముందడుగు ఎలా?మహిళా రైతుల సాధికారత కృషిలో సజావుగా ముందుకు సాగాలంటే మనం తప్పక చేయవలసినవి ఇవేనని ఐఆర్ఆర్ఐ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు: ఎంత సమయం?: అమల్లోకి తెచ్చే సేంద్రియ వ్యవసాయం వంటి నూతన వ్యవసాయ సాంకేతికతలు ఒక మహిళా రైతు వెచ్చించే సమయాన్ని, శ్రమను ఎలా ప్రభావితం చేస్తాయో క్రమపద్ధతిలో అంచనా వేయాలి. అందరికీ భాగస్వామ్యం: ఇంటి బాధ్యతలను పునఃపంపిణీ చేయడానికి పురుషులను భాగస్వాములను చేసే లింగ పరివర్తన విధానాలను అవలంబించాలి. వ్యవస్థకు మద్దతు: భూమి హక్కులు, మార్కెట్ అందుబాటు, స్వయం సహాయక బృందాలు వంటి సామూహిక వేదికలలో సాంకేతికత వేరూనుకునేలా చెయ్యాలి. సాంకేతిక, సంస్థాగత అంశాలతో సామాజిక అంశాలను అనుసంధానించడం ద్వారా, తదుపరి తరం వాతావరణ అనుకూల వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక సాధనాలు కేవలం ఒక షెడ్డుకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆహార భద్రతకు వెన్నెముక అయిన మహిళలకు వాస్తవంగా సాధికారత కల్పించేలా నిర్థారణగా చెయ్యొచ్చు. పరిశోధకులు చెప్పినట్లుగా, ‘వ్యవస్థాగత ఏర్పాట్లు (సంస్థలు, పంపిణీ యంత్రాంగాలు, ప్రోత్సాహకాలు), సామాజిక సంబంధాలు (నియమాలు, గుర్తింపులు, శ్రమ పంపిణీ, సామాజిక అభ్యసనం) ఏకకాలంలో రూపాంతరం చెందినప్పుడు మాత్రమే సుస్థిరమైన ఆవిష్కరణ ఆవిర్భవిస్తుంది’. తోటివారి నుంచి నేర్చుకోవటం ఐఆర్ఆర్ఐ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, తోటి వారి నుంచి నేర్చుకోవడం ఎంత ప్రభావవంతంగా ఉందో తేలింది. అన్ని సందర్భాల్లోనూ, తమలాంటి వారు విజయం సాధించడాన్ని చూసినప్పుడు రైతులు ఆ కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి ఎక్కువ మొగ్గు చూపారు. గుజరాత్లో తమ భార్యలైన మహిళా రైతులు అమలు చేసిన ప్రత్యేక సాగు పద్ధతుల వల్ల కలిగిన స్పష్టమైన ఫలితాలను కళ్లారా చూసిన పురుషులు, తొలుత సందేహాలు లేవనెత్తినా, చివరికి వారికి మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు తాను పాల్గొనే సమావేశాలను పట్టించుకోని తన భర్త, చివరికి ఆమెతో ‘ఇంటి పనుల గురించి చింతించకు.. నీ సమావేశంపై దృష్టి పెట్టు’ అని చెప్పినట్లు ఒక మహిళా రైతు సంబరంగా గుర్తుచేసుకుంది. నమ్మకాన్ని పెంపొందించటం, సామూహిక కార్యాచరణ, నాయకత్వ శిక్షణ వంటి సామాజిక మద్దతు వల్లనే ఈ సాంకేతికతలు వేళ్లూనుకోవడానికి దోహదపడింది. భవిష్యత్తు వైపు చూస్తూ...వాతావరణ మార్పులను దీటుగా తట్టుకొని నిలిచే ‘క్లైమేట్ స్మార్ట్’ వ్యవసాయం నిజంగా ‘స్మార్ట్’గా ఉండాలంటే, దానిని స్థానిక సమాజంతో కలిసి ఏమేమి చెయ్యాల్లో ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని ఈ అధ్యయనం నిర్ధారించింది. దీనికి కేవలం సాంకేతికతను బదిలీ చేసి చేతులు దులుపుకోవటం నుండి, మహిళల అనుభవాలను పరిగణనలోకి తీసుకునే సహాయక వ్యవస్థలను జోడించడం వైపు మార్పు రావటం అవసరం.విభిన్న పంటల సాగు నిర్ణయాలుమహారాష్ట్రలోని ధరాశివ్ కరువు ప్రాంతంలో స్వయం శిక్షణ ప్రయోగ (ఎస్ఎస్పీ) స్వచ్ఛంద సంస్థ మహిళల నేతృత్వంలో వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలిచే వ్యవసాయ నమూనా పద్ధతులను అమలు చేయించింది. ఈ ప్రాజెక్ట్ విప్లవాత్మకమైనది. ఎందుకంటే ఇది అధిక పెట్టుబడి అవసరమయ్యే వాణిజ్య పంటల నుంచి రైతుల దృష్టిని ఉద్దేశపూర్వకంగా మళ్లించింది. తక్కువ నీటి వినియోగానికి సంబంధించి స్థానికంగా అమల్లో ఉన్న పద్ధతులను ఉపయోగించి చిరుధాన్యాలు, కూరగాయల వంటి వైవిధ్యభరితమైన ఆహార పంటల వైపు మళ్లించింది. మహిళా రైతులకు రైతుగా ఉండాల్సిన మౌలిక గుర్తింపు సమస్యను పరిష్కరించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. మహిళలను వ్యవసాయ నిర్ణయాలు తీసుకునే ప్రాథమిక నిర్ణయాధికారులుగా, ఆవిష్కర్తలుగా నిలబెట్టింది. కేవలం కూలీలుగా మిగిలిపోయిన వారిని వ్యవసాయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే మహిళా రైతు నాయకులుగా మారడానికి సహాయపడింది. నాయకత్వ శిక్షణ ఇచ్చారు. సూక్ష్మ పెట్టుబడుల కోసం కమ్యూనిటీ రిసైలియన్స్ ఫండ్ ఏర్పాటు జరిగాయి. రైతులు –స్థానిక ప్రభుత్వ అధికారుల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు మహిళా కృషి సంవాద్ సహాయకుల(కేఎస్ఎస్ల)ను నియమించారు. ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మహిళలు ఆహార పంటల ఉత్పాదకతలో 10–15% పెరుగుదల సాధించారు. దీనితో పాటు మహిళా రైతు కుటుంబాల నెలవారీ పొదుపు బాగా పెరిగింది. ఇది ఇంట్లో వారి మధ్య సంబంధాలను మార్చివేసింది. పురుషులు తమ భార్యలను తమతో పాటు సమాన భాగస్వాములుగా గుర్తించటం ప్రారంభించారు.సమ్మిళిత శిక్షణా విధానంపశ్చిమ బెంగాల్లోని తూర్పు గంగా మైదాన ప్రాంతంలో పనిచేసే సత్మిలే సతీష్ క్లబ్ ఓ పాతాగర్ (ఎస్ఎస్సీఓపీ) స్వచ్ఛంద సంస్థ ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయం అమలులో ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులపై దృష్టి సారించింది. సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ వ్యవస్థ సాంద్రతీకరణ (ఎస్ఆర్ఎఫ్ఎస్ఐ) ప్రాజెక్ట్ను చేపట్టింది. దుక్కి చెయ్యకుండా వ్యవసాయం చెయ్యటం, యంత్రంతో వరి నాట్లు, బహుళ పంటల విత్తనాలను విత్తే పరికరాలను వాడటం వంటి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్కువ దృష్టి పెట్టినప్పటికీ, దీనిలోని ఆడా మగా తేగా లేకుండా రైతులందరికీ శిక్షణ ఇచ్చే సమ్మిళిత శిక్షణా విధానం ఉపయోగపడింది. సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉండే భారీ యంత్రాలు వంటి రంగాలలోకి మహిళా రైతులు ప్రవేశించడానికి వీలు కల్పించింది. రైతులు తాము కొనుగోలు చేయలేని ఖరీదైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు వీలు కల్పించే కస్టమ్–హైరింగ్ కేంద్రాల వ్యాపార కార్యకలాపాలపై, ఎరువులను సమర్థవంతంగా వాడటం, నీటిపారుదలలో మెళకువలపై శిక్షణ ఇచ్చారు. పురుషులు ఎక్కువగా దృష్టి సారించే ఇటువంటి సాంకేతికతలలో మహిళలకు శిక్షణ ఇచ్చినప్పుడు, వారు సమాజంలో ఆదర్శప్రాయులుగా గుర్తింపు పొందారు. ఈ మహిళల్లో 80% కంటే ఎక్కువ మంది ఏయే రకాల పంటలు సాగు చెయ్యాలనే నిర్ణయాలలో తమ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు.ఏవో కొన్ని సాంకేతికతలను పై నుంచి అందించటం ఒక్కటే సరిపోదువారితో కలిసి పనిచేస్తూ వారికి అవసరమైన నైపుణ్యాలను అందించాలిసాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును సమన్వయంతో అందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి∙4 రాష్ట్రాల్లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) జరిపిన అధ్యయనంలో వెల్లడిపొంచి ఉన్న ప్రమాదాలుమహిళా రైతుల సాధికారతలో ఈ విజయాలు సాధించినప్పటికీ, రకరకాల వ్యవసాయ సాంకేతికతలతో కూడిన ప్యాకేజీలను అమలు చేసిన విధానంలో ఐఆర్ఆర్ఐ పరిశోధకులు అనేక లోపాలను గుర్తించారు. ఈ ప్యాకేజీల ఏర్పాటు ఉద్దేశపూర్వకంగా కాకుండా తాత్కాలికంగా జరిగింది. సంస్థలు మొదట సాంకేతికతపై దృష్టి సారించాయి. అక్కడి రైతుల్లో సామాజిక మద్దతు పొందటాన్ని రెండో ప్రాధాన్యత గల ఆలోచనగా పరిగణించాయి. చదవండి: జీవన ఎరువులతో సేద్యానికి జీవంవేతనం లేని సంరక్షణ పనుల భారం ఒక ప్రధాన ఆందోళన. మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టిన 60 శాతం ప్రాజెక్టుల వల్ల మహిళా రైతులకు కొత్త బాధ్యతలను జోడించడం ద్వారా వాస్తవానికి వారి పని–జీవిత సమతుల్యతను మరింత దిగజార్చాయని ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గుజరాత్లో కనిపించే సేంద్రియ వ్యవసాయం వాతావరణానికి అనుకూలమైనదే అయినప్పటికీ, జీవన ఎరువులు, వర్మీకంపోస్ట్ తయారీకి అధిక శ్రమ అవసరం. అప్పటికే ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చూసుకుంటున్న మహిళలపై ఈ ఎరువుల తయారీ పనులు మరింత భారాన్ని మోపుతుంది. అంతేకాకుండా, అంతర్లీనంగా ఉన్న పురుషాధికార నిర్మాణాలను పరిష్కరించకుండా, మహిళా రైతులకు పనులు పెంచే ఉపరితల ప్రయత్నాల వల్ల వారిని మరింత కృంగదీయటానికి దారితీసే ప్రమాదాన్ని ఈ అధ్యయనం ఎత్తి చూపింది. అనేక సందర్భాల్లో (ఎస్ఎస్పీ మినహా) పురుషులతో సంప్రదింపులు కొరవడ్డాయి. భర్తలు, కమ్యూనిటీ నాయకులు ఈ సంభాషణలో పాలుపంచుకోకపోతే, మహిళలు ఇంటా బయటా వారి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల శిక్షణలో పాల్గొనలేకపోవచ్చు.– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..!
వారు ఎంచుకున్నది కాదు.. కోరుకున్నది అంతకన్నా కాదు... కానీ భారీ మూల్యాన్ని మాత్రం చెల్లించుకోక తప్పట్లేదు. ఇరాన్లోని ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, అంతర్గత అశాంతి కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పిల్లలు, మహిళలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంక్షోభంపై అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది...యుద్ధం ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు 340 మంది పిల్లలు యుద్ధ దాడుల్లో మరణించగా, 1,767 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న షజరే తయీబే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. మినాబ్ నగరంలో కాకుండా, ఇతర ఐదు వేర్వేరు ప్రాంతాల్లోని పాఠశాలలపై జరిగిన దాడుల్లో మరో 12 మంది పిల్లలు చనిపోయారు. వీరంతా 7 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నపిల్లలే.మధ్యప్రాచ్య వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది గర్భిణీ స్త్రీలు యుద్ధ నీడలో ఉన్నారు. సరైన వైద్యం లేక రోడ్లపై, కార్లలో, కిక్కిరిసిన శిబిరాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి.చమురు ధరల్లో పెరుగుదల వల్ల వ్యాక్సిన్లు, పోషకాహార ఉత్పత్తుల తయారీ, సరఫరాలో 6 నెలల వరకు ఆలస్యం కావచ్చని యూనిసెఫ్ అంచనా వేస్తోంది.బాంబు దాడులు, తరలింపు ఆదేశాల వల్ల మొత్తం 12 లక్షల మంది పిల్లలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు.ఏ యుద్ధమైనా సరే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. అది ఒక దేశపు సామాజిక పునాదులను, ముఖ్యంగా మహిళలు, పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అభద్రతా భావం మహిళల జీవితాల్ని ప్రభావితం చేస్తే, యుద్ధం నేర్పిన భయం, ఆకలి, కోల్పోయిన బాల్యం పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. యుద్ధం అనేది కేవలం ఆయుధాల పోరాటం కాదు, అది కోట్లాది మంది అమాయకుల కన్నీటి గాథ. (చదవండి: అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..! అలా గాలిలోనే..) -
'సమోసా' ఎక్కడి వంటకమో తెలుసా..?!
"సమోసా" అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ చిరుతిండి బయటకు కరకరలాడుతూ..లోపల కారంగా స్పైసీగా ఉంటుంది. వీధి ధుకాణాలలో ప్రధాన స్నాక్స్ ఐటెం ఇది. వేడి వేడి టీ తోపాటు ఒక్క సమోసా తింటే అబ్బా ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ప్రజాదరణ కలిగిన ఈ వంటకం మన భారతదేశానికి చెందిన వంటకం కాదట. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.ఈ సమోస మూలాలకు సంబంధించిన కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సమోసా స్టోరీ గురించి చరిత్ర, పురావస్తు శాస్త్రలలో పీహెచ్డీ చేసిన పరిశోధకుడు, రచయితగా చెప్పుకునే డాక్టర్ ఎంఎఫ్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆయన తన పోస్ట్లో సమోసా మెదట ఎలా ఉండేది, మన పాకనిపుణులను దాని తయారీని ఎలా మార్చారు వంటి వాటి గురించి సవివరంగా రాసుకొచ్చారు. 1500..1510ల మధ్య రాసిన పర్షియన్ తాళప్రత్రం గ్రంథలో దీని గురించి సవివరంగా రాసి ఉందని చెబుతున్నాడు. ఈ గ్రంథం ఆధారంగా అత్యధికంగా తినే వీధి ఆహారమైన సమోసా 500 ఏళ్ల నాటి వంటకంగా పేర్కొన్నాడు. బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో పర్షియన్ భాషలో ఈ సమోసా వంటకం గురించి రాసి ఉందని తెలిపాడు. ఈ చిరుతిండి అప్పట్లో చాలా భిన్నమైన రూపాన్ని కలిగి ఉండేదని చెప్పాడు. నాటి పూర్వీకులు ఈ వంటకాన్ని కాల్చిన వంకాయ గుజ్జు, ఎండు అల్లం, గొర్రె మాంసం, వంటివి నూనెల వేయించి..దాన్ని లోపలి స్టఫ్గా పెట్టి వండేవారని పేర్కొన్నాడు. కానీ మనం ప్రస్తుతం చూసే సమోసాలు అందుకు చాలా విభిన్నం. ఇప్పుడు వాటిల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయల కూర వంటివి స్టఫ్గా పెట్టి వండేస్తున్నాం. పైగా జతగా వేయించిన పచ్చిమిర్చి ఇస్తుంటాం. నిజానికి అప్పుడు ఇలా ఈ రెండూ ఉండేవి కావని అన్నారు. ఆ తాళ్లపత్రాల ఆధారంగా మొఘల్ చక్రవర్తి అక్బర్, టిప్పు సుల్తాన్ చేతుల మీదుగా ప్రయాణించి..మన దేశంలోకి వచ్చిందని చెప్పారు. వీధి చిరుతిండిగా దొరకక ముందు నాటి సమోసా ఇది.. అని అన్నారు. అంటే ఇది రాజరికపు వంటకంగా మొదలై వీధి దుకాణపు ఫేమస్ స్నాక్స్ ఐటెంగా మారిందని చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..అంటే ఈ సమోసా మన దేశంలోకి వలస వచ్చిందన్న మాట అని హాస్యస్పదంగా పోస్టులు పెట్టారు.మితంగానే మంచిది..ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం.. సమోసాలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉంటాయనేది వాస్తవం. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్ ఉంటుందని అంచనా. ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే..ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుThe samosa is one of the most eaten street foods on the planet. This is a 500-year-old recipe for it, written in Persian in a manuscript sitting in the British Museum.The manuscript is called the Ni'matnama, the Book of Delights, written between 1501-1510 AD, for the Sultan of… pic.twitter.com/uEjIe77zQl— Dr. M.F. Khan (@Dr_TheHistories) April 8, 2026 (చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..) -
చిన్నారి కిడ్నీలో పెద్ద రాయి.. శస్త్రచికిత్స లేకుండానే..
సాధారణంగా పెద్దవారిలో కనిపించే కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు పసిపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని బీదర్కు చెందిన ఏడాది వయసున్న బాలుడికి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి కోత లేకుండా కిడ్నీలోని 10 మిమీ రాయిని తొలగించి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు అద్భుత విజయాన్ని సాధించారు.బీదర్కు చెందిన ఒక ఏడాది బాలుడు విపరీతమైన ఏడుపు, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో బాలుడి ఎడమ కిడ్నీలో 10 మిమీ పరిమాణం ఉన్న రాయి ఉన్నట్లు తేలింది. తదుపరి చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్లోని ఏఐఎన్యూ ఆసుపత్రికి తీసుకువచ్చారు.అధునాతన చికిత్స - 'ఈఎస్డబ్ల్యూఎల్' (ESWL):బాలుడు చాలా చిన్నవాడు కావడం, సాధారణ సర్జరీ వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యాధునిక ఎక్స్ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ESWL) పద్ధతిని ఎంచుకుంది.కోత లేని వైద్యం: ఈ పద్ధతిలో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కేవలం 'లిథోట్రిప్టర్' యంత్రాన్ని ఉపయోగించి హై-ఎనర్జీ షాక్ వేవ్స్ ద్వారా రాయిని ఇసుక రేణువులంత చిన్న ముక్కలుగా పొడి చేశారు.సురక్షితం: అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగించడం వల్ల బాలుడికి రేడియేషన్ ముప్పు కలగకుండా జాగ్రత్త పడ్డారు.వేగవంతంగా కోలుకోవడం: చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే బాలుడు మామూలు స్థితికి వచ్చి పాలు తాగడం ప్రారంభించాడు. అదే రోజు డిశ్చార్జ్ కూడా చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ మాట్లాడుతూ.. "పిల్లల విషయంలో సర్జరీ వల్ల కలిగే గాయాన్ని తగ్గించడమే మా ప్రాధాన్యత. ఈ ఆధునిక పద్ధతి వల్ల ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా, అత్యంత సురక్షితంగా రాయిని తొలగించగలిగాము," అని తెలిపారు.ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి. మాట్లాడుతూ.. "ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చిన్నారుల్లో కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి. చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి పద్ధతులు వారి శరీర నిర్మాణానికి ఇబ్బంది కలిగించవచ్చు. అటువంటి సమయాల్లో ఈఎస్డబ్ల్యూఎల్ అత్యంత ప్రభావవంతమైన మార్గం," అని పేర్కొన్నారు. కాగా, నెల రోజుల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుడి కిడ్నీలో రాయి పూర్తిగా తొలగిపోయిందని, అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ మల్లికార్జున సి, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్దేశ్పాండ్య హేమేష్, ESWL టెక్నీషియన్ (చదవండి: ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?) -
ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి మోటార్ న్యూరాన్ వ్యాధితో మృతి చెందారు. ఏప్రిల్ 9, 2026న, అతను మరణించినట్లు ఆయన భార్య నవోమి షీహాన్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. ఆయన గత రాత్రి నార్తర్న్ ఐర్లాండ్ హాస్పిస్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపింది. ఆయనకు ఫిబ్రవరి 1, 2023న అతనికి మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు, అక్కడ అద్భుతమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. నయం చేయలేని ఈ వ్యాధి కారణంగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నటుడిని పొట్టనబెట్టుకున్న మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే..?, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ..పేరు సూచించినట్లుగా, మోటార్ న్యూరాన్ వ్యాధి (MND) అనేది న్యూరాన్లు, చలనశీలతకు సంబంధించిన ఒక వ్యాధి. క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, MND అనేది మోటార్ న్యూరాన్లను నాశనం చేసే నరాల సంబంధిత రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది. ఈ న్యూరాన్లు మింగడం, మాట్లాడటం, నడవడం, శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాయి.సింపుల్గా చెప్పాలంటే.. మెదడులోని న్యూరాన్ల (ఎగువ మోటార్ న్యూరాన్లు) నుంచి వచ్చే సందేశాలు సాధారణంగా వెన్నుపాములోని న్యూరాన్లకు (దిగువ మోటార్ న్యూరాన్లు) ప్రసారం చేయబడతాయి. అక్కడి నుంచి, సందేశాలు శరీరంలోని కండరాలకు చేరి, అవి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. కండరాలు దిగువ మోటార్ న్యూరాన్ల నుంచి సందేశాలను అందుకోలేనప్పుడు, అవి బలహీనపడి కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, దిగువ మోటార్ న్యూరాన్లు ఎగువ మోటార్ న్యూరాన్ల నుంచి సంకేతాలను అందుకోలేనప్పుడు, కండరాలు బిగుసుకుపోతాయి, దీనివల్ల స్వచ్ఛంద కదలికలు నెమ్మది నెమ్మదిగా కష్టంగా మారతాయి.కాలక్రమేణా, రోగి నడిచే సామర్థ్యాన్ని లేదా శరీర కదలికలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మోటార్ న్యూరాన్ వ్యాధులకు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంతకంతకు తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి, కాలక్రమేణా దీని తీవ్రత పెరుగుతుంది.అయితే, కొన్ని చికిత్సలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై ప్రభావాన్ని తగ్గించగలవు, కానీ మోటార్ న్యూరాన్లు వారాలు, నెలల తరబడి క్షీణిస్తూనే ఉంటాయి, చివరికి రోగిని అంగవైకల్యానికి గురిచేసి, మరణానికి దారితీస్తాయి.మోటార్ న్యూరాన్ వ్యాధుల లక్షణాలుMND లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి క్రమంగా పెరగవచ్చు. మాటలు తడబడటంకాళ్ళలో బలహీనతకండరాలు అదరడంబరువు తగ్గడంపట్టు బలహీనపడటంఅసంకల్పితంగా ఏడవడం లేదా నవ్వడం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందినిద్రకు భంగం కలగడంఊపిరి ఆడకపోవడంగందరగోళంపదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంఉదయం పూట తలనొప్పిఅలసటవాస్తవానికి ఈ వ్యాధికి కచ్చితమైన లక్షణం అంటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు. కాలక్రమేణా మోటార్ న్యూరాన్లు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. MND వంశపారంపర్యంగా రావచ్చు, అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించవచ్చు. ఒకే ఒక్క జన్యు మార్పు కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావడానికి కారణం కావచ్చు.MND సాధారణంగా 60 మరియు 70 ఏళ్ల వయస్సు గల వారిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్కోసారి ఇది పెద్దలు పిల్లలను కూడా ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తికి దగ్గరి బంధువుకు ఈ వ్యాధి లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే సంబంధిత రుగ్మత ఉంటే, ఆ వ్యక్తికి MND వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.(చదవండి: నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..) -
నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..
ఆరోగ్యకరమైన, కాతివంతమైన చర్మం కావాలంటే సరైన కేర్ అవనరం. అందుకు సులభమైన మార్గం మనం ఇంట్లోనే సహజంగా ఫేస్ ప్యాక్ను తయారు చేసుకోవడం. తద్వారా ఎలాంటి దుష్ప్రభావలు లేని మంచి కాంతివంతమైన, మెరిసే చర్మాన్ని ఈజీగా పొందొచ్చు. అదెలాగో నటి ప్రియాంక చోప్రా తల్లి, డాక్టర్ మధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ సౌందర్య చిట్కా ఏంటో చూసేద్దామా..!ప్రియాంక తల్లి డాక్టర్ మధు మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు ఫేస్వాష్ కానీ సోప్ కానీ వాడలేదు. అప్పుడప్పుడు నేను స్ర్కబ్స్ ఉపయోగిస్తాను. ఇలా చేస్తే డెడ్ సెల్స్ పోయి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నేను ఎప్పుడు హెల్దీ స్కిస్నే మెయింటెస్ చేస్తాను. ఏ చర్మ సమస్యలకైనా నా కూతురు నేన ఈ ఫేస్ ప్యాక్నే వాడతాం. ఈ ప్యాక్లో పసుపు, శెనగపిండి వంటి పదార్ధాల వలన చర్మానికి మంచి గ్లోయింగ్ రావడమే గాక తాజాగా కనిపిస్తుంది. " అంటూ ఆ ప్యాక్ చేసుకునే విధానం గురించి వివరించారామె. ఎలా చేసుకోవాలంటే..ఒక గిన్నెలోకిలోకి 2 టేబుల్స్పున్ల శెనగపిండి, డ్రై స్కిన్ ఉంటే ఇంట్లో చేసిన క్రీమ్, తాజా పెరుగు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంత వరకు ఉంచితే చాలు. ఆ తర్వాత ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో ట్రై చేసి చూడండి మరి... View this post on Instagram A post shared by Dr Madhu Akhouri Chopra (@drmadhuakhourichopra) (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..!
కొన్ని చోట్ల చాలా వింతైన ఆచారాలు ఉంటాయి. అవి వినడానికి ఎంత వింతగా అనిపించినా..వాటి వెనుకున్న మర్మం చాలా ఆశ్చర్యానికిలోనూ చేయడమే గాక ఆధ్యాత్మికంగా ఆలోచింప చేసేలా ఉంటాయి. అలానే ఇక్కడ ఓ గ్రామంలోని ఖననం చేసే పద్ధతులు ఎంత వింతగా ఉంటాయంటే..నోట మాటరాదు. వామ్మో..! ఇదేం పద్ధతి అనిపించేలా ఉంటుంది.ఆ విచ్రితమైన పద్ధతి ఇండోనేషియాలోని బాలిలోని ట్రున్యాన్ గ్రామం ఆచరిస్తోంది. అక్కడ మృతదేహాలను ఖననం చేసే పద్ధతి చాలా విభిన్నంగా ఉంటుంది. అక్కడ మరణాన్ని భూగర్భంలో దాచరు, అగ్నిలో దహించరు, దానికి బదులుగా బహిరంగంగా గాలిలోకి వదులుతారు. బటూర్ సరస్సు కాల్డెరా ఒడ్డున ఉన్న ఈ బాలి గ్రామం, ప్రధాన బాలి హిందూ ఆచారాల కంటే పురాతనమైన ఖనన పద్ధతులను అనుసరిస్తోంది. ఇక్కడ మరణానికి భయపడరు, దాన్ని జీవిత చక్రంలో ఒక భాగంగా భావిస్తారు. అదొక అనుభవంగా అంగీకరిస్తారు. త్రున్యాన్ చేరుకోవడం అంత సులభం కాదు. బటూర్ సర్సుల మీదుగా పడవలో 15 నిమిషాల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి నిశ్చలమైన వాతావరణ ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఖనన పద్ధతిని మెపాసా అని పిలుస్తారు. దహనం లేదా ఖననం చేయడానికి బదులుగా, మృతదేహాన్ని పవిత్రమైన తారు మెన్యాన్ చెట్టు కింద ఆరుబయట ఉంచుతారు. మృతదేహాలను కడిగి, ముఖం కనపడేలా తెల్లటి వస్త్రంలో చుడతారు. ఆ తర్వాత వాటిని సాధారణ వెదురు బోనులో ఉంచుతారు. . వ్యక్తిగత వస్తువులు, కొన్నిసార్లు ఫోటోలు కూడా వాటి పక్కనే ఉంచుతారు. ఇలా వివాహం చేసుకుని సహజపద్ధతిలో మరణించిన వారిని మాత్రమే ఇక్కడికి తీసుకువస్తారు. పిల్లలు, అవివాహితులు, లేదా ప్రమాదాలలో మరణించిన వారిని వేరే ఖనన ప్రదేశాలకు తీసుకువెళ్తారు. అంతేగాదు ఇక్కడ మృతదేహాల సంఖ్య కూడా పరిమితంగానే ఉంటుంది. కేవలం 11 వెదురు బోనులు మాత్రమే ఉంటాయి. కొత్త మృతదేహం వచ్చినప్పుడు, స్థలం నిండిపోయినప్పుడు అత్యంత పురాతన అవశేషాలను గౌరవప్రదంగా తొలగిస్తారు. పుర్రెలను సమీపంలోని రాతి వేదికపై ఉంచుతారు. ఎముకలను ఆ ప్రదేశం చుట్టూ అమర్చుతారు. అయితే ఆ మెన్యాన్ చెట్టు పేరు మీదుగానే ఆ గ్రామానికి పేర్కొచ్చింది. ఇది సువాసన వెదజల్లే చెట్టు. ఇది మృతదేహం కుళ్లిపోవడం వల్లే వచ్చే దుర్వాసనను తటస్థీకరిస్తుందిన స్థానికులు నమ్మకం. ఆశ్చర్యకరంగా అక్కడకు వచ్చే సందర్శకులకు సైతం అక్కడ ఎలాంటి చెడువాసన రాకపోవడం గమనార్హం. దీనికి గల కారణం..ట్రున్యాన్ ప్రజలకు, శరీరం అనేది వ్యక్తి కాదు. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, మిగిలింది కేవలం ఒక పాత్ర మాత్రమే, ఇక అవసరం లేని బట్టల లాంటిది. ఇది పునర్జన్మ అనే నమ్మకానికి సంబంధించినది. ఇక్కడ మరణం అంతం కాదు, కేవలం ఒక పరివర్తన. ఈ బహిరంగ ప్రక్రియ దిగ్భ్రాంతి కలిగించడానికి ఉద్దేశించినది కాదు, కానీ ఎలాంటి జోక్యం లేకుండా ప్రకృతి తన పని తాను చేసుకునేందుకు వీలు కల్పించడం కోసం అని అక్కడ ప్రజల నమ్మకం . అలాగే ఇక్కడ కొన్ని ఆచారాలకు మహిళలను అనుమతించరు. View this post on Instagram A post shared by Holy Violence (@holy.violence) (చదవండి: ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!) -
ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని ఊహించలేదు..! : దీపికా కక్కర్
దీపికా కక్కర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది వైద్యులు ఆమె కాలేయం దగ్గర టెన్నిస్ బంతి పరిమాణంలో కేన్సర్ గడ్డ ఉందని నిర్థారించినట్లు తెలిపారామె. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ గడ్డతోపాటు కాలేయంలో 22 శాతం తొలగించారు. హమ్మయ్యా బయటపడ్డాను అనుకునేలోపే ఆ వ్యాధి మరోసారి తిరగబట్టి గట్టి షాకిచ్చింది. దీంతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ..కనీసం మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నాననంటూ తన గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంది. అంతేగాదు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఇరకాటంలో పడేస్తాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.నటి దీపికా కాకర్కు కాలేయం దగ్గర 1.3 సెం.మీ సిస్ట్ మళ్లీ రావడంతో మరో శస్త్ర చికిత్స జరిగింది. కాలేయ కేన్సర్కు చికిత్స పొందుతున్న దీపికాకు ఈ కేన్సర్ మళ్లీ తిరగబెట్టడం ఒక భావోద్వేగపరమైన ఎదురుదెబ్బగా మారిందామెకు. ఈ మేరకు పోస్ట్లో ఊహించన ఈ మలుపు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని పంచుకున్నారు. తన ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా మాతృత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వాపోయారు. తన కొడుకు రుహాన్తో సమయం గడపలేకపోతున్నాన్న బాధ తనను కలిచివేస్తోందని అంటోంది. ఆస్పత్రి సందర్శనలే దినచర్యగా మారిపోవడంతో అలిసిపోతున్నానని అంటోంది. ఇక తన భర్త షోయబ్ తన కారణంగా పనులతో బిజీ అయిపోయాడని చెప్పుకొచ్చింది. ఆస్పత్రిలో ఉంటే రుహాన్ చూడలేను పోనీ ఇంటికి వస్తే చికిత్సతో అలిసిపోయి పడుకుంటాను అంతే ఇది తన దినచర్యను పూర్తిగా మార్చేసిందన్నారు. నిజానికి అనారోగ్యంతో ఉన్నప్పుడే మనం బలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. కానీ ఊహించని విధంగా మరోసారి ఈ కేన్సర్ తిరగబెట్టడం ఒకింత బాధ, భయం ఆవరించాయని కన్నీటి పర్యంతమైంది. ఒకరకంగా ఈ పరిస్థితి తన ఆరోగ్యం, జీవనశైలి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసిందన్నారు. మన శరీరాలు చలా సంక్లిష్టమైనవి, బలమైనవి, ప్రతిరోజు వివిధ చికిత్సలు తట్టుకుంటున్నందుకు అవి నిజంగా గొప్పవి అని మెచ్చుకుంది. ఏ అనారోగ్యం వచ్చినా..మన శరీరంలో హార్మోన్లు ఎంతలా మార్పులు చెందినా..మన జీవితాలను సజావుగా గడుపుతామని అన్నారు. తనలా మళ్లీ మళ్లీ సిస్ట్ వచ్చినా కొందరితో మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎదుర్కొనేలా తనను తాను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు దీపికా. అలాగే అనారోగ్యం కారణంగా క్రమం తప్పకుండా వ్లాగ్లో పోస్ట్లు పెట్టలేకపోతున్నానని అన్నారు. తన చుట్టూ ఉన్నవారు నవ్వుతూనే ఉంటున్నారు కానీ, లోపల ఎంత ఆందోళన ఉందో గ్రహించగలను, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య ఎంత బాధపడుతున్నారో ఊహించగలను అంటూ తన పోస్ట్ని ముగించింది.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..
ఈ ఏజ్లో అంత కష్టతరమైన వ్యాయామాలు మావల్ల కాదు అనే వాళ్లకు ఈ బామ్మే ఆదర్శం. చేయాలనే గట్టి సంకల్పం ఉంటే వయసు అనేది పెద్ద సమ్య కాదని ఈ బామ్మని చూస్తే తెలుస్తుంది. పెద్ద వయసువారైన సులభంగా క్లిష్టమైన వ్యాయమాలు చేయాలంటే కేవలం ఓపిక, నిలకడే అత్యంత కీలకం అని ఈ సూపర్ బామ్మని చూస్తే అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియో క్లిప్లో కనిపిస్తున్న మహిళ పేరు అమృత్ కౌర్. 75 ఏళ్ల వయసులో మరింత బలంగా ఉండేందుకు చిన్నపాటి కదలికల కోసం వ్యాయమాలు చేస్తూ కనిపిస్తుంటుందామె. ముఖ్యంగా ఆ వృద్ధాప్య వయసులో పుష్ అప్లు చేసేందుకు పడ్డ శ్రమ చూస్తే..నోరెళ్ల బెట్టడం ఖాయం. మొదట కొన్నింటి సాయంతో పుష్ అప్లు చేస్తుంటుంది. ఆ తర్వాత మోకాళ్లు, చిన్న పరికరాల సాయంతో పుష్ అప్లు చేస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేటి సాయం లేకుండా సునాయాసంగా పుష్ అప్లు చేస్తుంటుంద. నిలకడతో చేస్తూ ఉంటే..ఎంత కష్టమైన వ్యాయామాలైన ఈజీగా చేసేయొచ్చని ఈ బామ్మని చూస్తే అర్థమవుతుంది. ఈ బామ్మ జస్ట్ 12 వారాల్లో పుష్ అప్లో పట్టు సాధించింది. రోజు జిమ్కి వచ్చేవారు సైతం సిగ్గుపడేలా ఎంత అద్భుతంగా చేసిందో చూస్తే మాటలు రావు. నెటిజన్లు ఇకపై ఎలాంటి సాకులు చెప్పకండి ఈ బామ్మని చూసి స్ఫూర్తి పొందండి, అమ్మో బామ్మ నువ్వు చాలా గ్రేట్ అని రకరకాలు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Amrit Kaur | Strong at 75 ❤️ (@getfitwithdadi) (చదవండి: ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..) -
యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్కు అరుదైన గౌరవం
హెయిర్ రిస్టోరేషన్ వైద్య సేవల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ Eugenix Hair Sciences సంస్థకు National Accreditation Board for Hospitals & Healthcare Providers (NABH) గుర్తింపు లభించింది. ఈ సంస్థకు చెందిన గురుగ్రామ్ ఫ్లాగ్షిప్ క్లినిక్ ప్రతిష్టాత్మక అక్డ్రిడిటేషన్ గుర్తింపు, సంస్థ నాణ్యత, పేషెంట్ సేఫ్టీ, క్లినికల్ ఎక్సలెన్స్ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందనీ నిర్వాహకులు తెలిపారు.NABH అక్డ్రిడిటేషన్ అనేది సాధారణ గుర్తింపు కాదనీ పేషెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోటోకాల్స్, క్లినికల్ కమ్యూనికేషన్, మెడికేషన్ సేఫ్టీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్, సర్జికల్ సేఫ్టీ వంటి కీలక అంశాల్లో 600కి పైగా ప్రమాణాల ఆధారంగా జరుగే కఠినమైన మూల్యాంకనం తర్వాత మాత్రమే ఈ గుర్తింపు లభిస్తుందని వివరించారు. ఈ గుర్తింపుతో గురుగ్రామ్ క్లినిక్, అంతర్జాతీయ పేషెంట్ సేఫ్టీ గోల్స్ (IPSG) ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నట్లు ధృవీకరించారు.ఈ క్లినిక్ యూజెనిక్స్ ప్రధాన క్లినికల్ ఎక్సలెన్స్, రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్గా పనిచేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రంలో అధునాతన సర్జికల్ సదుపాయాలు, అమెరికా, జర్మనీ నుంచి దిగుమతి చేసిన మాంటిస్ మైక్రోస్కోప్స్, హై-మ్యాగ్నిఫికేషన్ లూప్స్ — అందుబాటులో ఉన్నాయి. డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు, సీనియర్ ఫిజీషియన్లు కలిసిన మల్టీడిసిప్లినరీ టీమ్ ఇక్కడ సేవలు అందిస్తోంది. సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ డా. ప్రదీప్ సేథి మాట్లాడుతూ…“ఈ NABH గుర్తింపు మా సంస్థలో నెలకొల్పిన క్లినికల్ ఎక్సలెన్స్ కల్చర్కు, పేషెంట్ సేఫ్టీపై మా దృష్టికి ప్రతిబింబం. శాస్త్రీయ నైపుణ్యం, ఆర్టిస్టిక్ అప్రోచ్ కలయికతో ప్రతి రోగికి ఉత్తమ ఫలితాలు అందించడమే మా లక్ష్యం,” అని తెలిపారు. “మా గురుగ్రామ్ సెంటర్ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రూపకల్పన చేశాం. ఈ అక్డ్రిడిటేషన్ మా సిస్టమ్స్, ప్రాసెస్లు, పేషెంట్-ఫస్ట్ అప్రోచ్కు మరింత బలాన్ని ఇచ్చింది,” అని కో-ఫౌండర్ డా. అరికా బన్సాల్ అన్నారు.(చదవండి: ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..) -
హ్యాపీ హప్చీ
గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాడీ సేఫ్టీ... మొదలైన వాటి గురించి ఒకటికి రెండుసార్లు చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదని గ్రహించిన డా. కనిక, అన్నిరకాలుగా పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ‘హాప్చి’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ‘హప్చి’ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది...ఒకరోజు కుమారుడితో సరదాగా మాట్లాడుతూ...‘స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు?’ అని అడిగారు కనిక. ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ అని క్యాజువల్గా చెప్పి పరుగెత్తాడు ఆ పిల్లాడు. ఆ సమయంలో ఆమె ఆలోచనలన్నీ ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ చుట్టే తిరిగాయి. ‘అక్కడ ఏమి నేర్చుకున్నారు? అది మాత్రమే సరిపోతుందా? నిజజీవిత పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యం పిల్లలకు చేరుతుందా?’... ఇలా ఎన్నోరకాలుగా ఆలోచించారు. ఆ ఆలోచనలే ‘హప్చీ’ ఆవిర్భావానికి కారణం అయ్యాయి.హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్2020లో ఐఐఎం బెంగళూరులోని ఎన్ఎస్ఆర్సిఇఎల్లోని ఉమెన్ స్టార్టప్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకున్నారు కనిక. ఒక సంవత్సరం తరువాత కనిక నేతృత్వంలో పిల్లల భద్రత, జీవన నైపుణ్యాలు, మానసిక శ్రేయస్సుపై దృష్టి సారించే ప్రత్యేక సంస్థ ‘హప్చి’ ఆవిర్భవించింది. ‘హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్ అని అర్థం. పిల్లలు సంతోషంగా, భద్రంగా ఉండేలా చూడడమే మా లక్ష్యం’ అంటున్న కనిక పిల్లల భద్రతపై ‘స్మార్ట్ బీ సేఫ్’ ‘టైమ్ టు వాయిస్ మై ఛాయిస్’లాంటి ఎన్నో పుస్తకాలు రాశారు. వర్క్షాప్లు నిర్వహించారు.స్పందన లేదు...వన్–టైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కు పరిమితం కాకుండా ఏడాదిపాటు రకరకాల డిజిటల్ టూల్స్తో స్కూల్ ప్రోగ్రామ్స్లో భాగమయ్యే మోడల్ని ‘హప్చి’ ప్రవేశ పెట్టింది.మొదట్లో పాఠశాలల నుంచి కనికకు పెద్దగా స్పందన లభించలేదు. బాడీ సేఫ్టీ, వేధింపుల వంటి అంశాలపై చర్చలు నిర్వహించడానికి చాలా పాఠశాలలు విముఖత చూపాయి. కొన్ని పాఠశాలల వారు వర్క్షాప్లకు అనుమతించినా ఆ తరువాత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతకు సంబంధించిన చొరవ ఒకేవైపు నుంచి కాకుండా ఇరువైపులా ఉండాలని ఆలోచించారు కనిక.వారి సహకారంతో...మార్పు రావాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం అని ఆలోచించిన కనిక ఆ వైపుగా దృష్టి పెట్టి విజయం సాధించారు. ‘హ్యాప్సేఫ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘హ్యాప్సేఫ్’ ప్రోగ్రామ్లో భాగంగా 1 నుంచి 11 తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అబ్యూజ్ ప్రివెన్షన్, బుల్లీయింగ్ ప్రివెన్షన్, ఆన్లైన్ భద్రత, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం... మొదలైన కీలక అంశాలపై పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు. కేవలం ఒకసారి అవగాహన కల్పించే స్థాయిని దాటి విద్యాభ్యాసంలో ప్రతి దశలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగమయ్యేలా ఆచరణాత్మక నైపుణ్యాలను అందించే పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు.ఎంతో మార్పుఎన్నో పాఠశాలలపై ‘హప్చి’ ఎంతో ప్రభావాన్ని చూపించింది. అలాంటి పాఠశాలల్లో ‘హోరైజన్ గురుకుల్’ ఒకటి. ‘మా స్కూల్లో హప్చి ఎంతో మార్పు తెచ్చింది. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడానికి సంబంధించి, శరీర భద్రత, భావోద్వేగ అవగాహన విషయాలలో మార్పు ప్రత్యేకంగా కనిపించింది’ అంటుంది న్యూహోరైజన్ గురుకుల్ టీచర్ జాస్మిన్ పడ్డా. ఫరీదాబాద్(హరియాణా)లోని సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కనిక మెడిసిన్ చేశారు. తండ్రి కోరుకున్నట్లే డాక్టర్ అయ్యారు. ఆ తరువాత హెల్త్కేర్ మేనేజ్మెంట్లోకి మారారు. -
దోమలకూ ఓ టేస్ట్ ఉంది!
వేమన చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ అన్నాడు గాని చెవిలో దోమ అనాలి. దోమల బాధలు మనిషికి ఇంతింత గాదయా అని అందరూ రాత్రయితే అనుకోవడమే. దోమలది సర్వసమాన దృష్టి. ఇంటి యజమానినైనా, ఇంటికొచ్చిన అతిథినైనా ఒకేలాగా చూస్తాయి. అంతు చూస్తాయి. అయితే గమనించి చూస్తే కొందరి దగ్గర ఏవో సిఫార్సు లెటర్సు ఉన్నట్టుగా వారిని తక్కువ కుట్టడం... మరికొందరిని రేషన్ క్యూలో నిలుచున్నవారిలా లెక్కలేనట్టుగా చూసి ఎక్కువ కుట్టడం చేస్తుంటాయి. ‘నా రక్తం తియ్యగా ఉన్నట్టుంది దోమలకి’ అంటూ ఉంటారు ఇలాంటి వాళ్లు. కాని దోమలు కొందరిని ఎక్కువగా కుట్టడం రక్తం తీయగా ఉండటం వల్ల కాదు. దోమలకు మనిషి రుచి రక్తం గురించి పట్టింపు లేదు అయితే అవి మానవ శరీరం నుండి వెలువడే అనేక రకాల జీవసంకేతాలపై ఆధారపడతాయి. వాటిని అధికంగా వెదజల్లే వారిని సులభంగా గుర్తించి వారిని ఎక్కువగా కుడతాయి.మీ నిశ్వాసే మీ గూగుల్ లొకేషన్దోమలు అదేదో గూగుల్ మ్యాప్లో చూసి మిమ్మల్ని గుర్తుపట్టి కుట్టడానికి కారణం మీరు వదిలే నిశ్వాస. అందులోని కార్బన్ డయాక్సైడ్ (íసీఓ2) లో దోమలు గుర్తు పట్టే ప్రత్యేకమైన సెన్సర్లు ఉంటాయి, ఈ సెన్సర్లు వాటికి దారి చూపి మీ దాకా తీసుకొస్తాయి. అంటే మీ నిశ్వాసలో ఎక్కువ మొత్తంలో సీఓ2 ఉంటే మిమ్మల్ని ఈజీగా గుర్తు పట్టి వెంట పడతాయి. పిల్లల కంటే పెద్దలను దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణం పిల్లల కంటే పెద్దలు ఎక్కువ సిఓ2 వదులుతారు. గర్భిణీ స్త్రీల శరీరం నుంచి కూడా ఎక్కువ సీఓ2 విడుదలవుతుంది కాబట్టి వారు దోమల్ని ఎక్కువగా ఆకర్షించవచ్చు. అదేవిధంగా వ్యాయామం చేసిన వారు లేదా మంచి మెటబాలిజం ఉన్న వారు దేహ రసాయనాలు విడుదల చేస్తూ దోమలకు తమ ఆచూకీ ఇస్తారు. ఒకసారి ఆచూకీ తెలుసుకున్నాక ఇక అక్కడే అవి రొద పెడుతూ తిరుగుతాయి.మీది వేడి శరీరమా?దోమలు నిశ్వాసలోని సీఓ2ను గుర్తించి దగ్గరగా వచ్చినట్టే మీది వేడి శరీరం అయితే దానిని కూడా బాగా గుర్తు పడతాయి. దోమలు సూక్ష్మమైన ఉష్ణోగ్రతలను గుర్తిస్తాయి. మానవ చర్మంలో వెచ్చదనాన్ని అవి సులభంగా గుర్తించగలవు. రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉన్న చోట వాటికి వేడి తెలుస్తుంది. అదీగాక కదులుతున్న శరీరం గాలిలోకి ఎక్కువ వేడిని, వాసనను విడుదల చేస్తుంది. దీనిని ఫోన్ కాల్లాగా అందుకుని దోమలు వాలి కుట్టగల కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి కుడతాయి. మనం ఎంత దుప్పటి కప్పుకున్నా కాపు కాచి అందుకే కుడతాయి.మరి బ్లడ్ గ్రూప్ సంగతేంటి?దోమలు కొన్ని నిర్దిష్ట బ్లడ్ గ్రూప్లను ఇష్టపడతాయనే ఒక సాధారణప్రతిపాదన ఉంది. ఏ, బీ, ఏబీ ఇలా ఈ గ్రూపులు ఉన్నావారి కంటే ‘ఓ’ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. అయితే ఈ విషయం ఇంకా సాధికారికంగా నిరూపణ కాలేదు. శాస్త్రవేత్తలు ఈ సంగతి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ముందు చెప్పినట్టు దోమలు ఒక వ్యక్తిపై వాలడానికి రక్తాన్ని గుర్తించడం కంటే శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్ను శరీర వేడి, చర్మం నుండి వెలువడే రసాయన వాసనలనే ఎక్కువ గుర్తిస్తాయి.మీ చర్మం.. దాని మీది బ్యాక్టీరియామిమ్మల్ని దోమలు కుట్టడానికి, మీ చర్మంపైన ఉండే బ్యాక్టీరియాకు సంబంధం ఉంది. మానవ చర్మం సహజంగానే శరీరంలో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాకు నిలయం. ఈ సూక్ష్మజీవులు చెమట, ఇతర జీవన క్రియల సమయంలో రకరకాల రసాయన వాసనలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి వ్యక్తికీ వేరు వేరు బ్యాక్టీరియా స్థాయి వేరు వేరు చర్మ వాసనలు ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు దోమలను ప్రత్యేకంగా ఆకర్షించే వాసనలను ఉత్పత్తి చేయగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి, దీనివల్ల కొందరిని ఇతరుల కంటే ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.దోమ గారి యమా సంగతులు→ దోమలు చాలా వేగంగా రెక్కలు కొడతాయి. ఒక దోమ సెకనుకు సుమారు 500 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది. అందుకే అది చెవి దగ్గరకు వచ్చినప్పుడు మనకు ‘కుయ్’మనే రొద వినిపిస్తుంది. దోమ కుట్టునైనా భరించడం సులభమేమో కానీ ఈ రొద వినడం కష్టం. మనకు సుపరిచితమైనది ఆ గుయ్.. కారం.→ దోమలు పులి, సింహం కంటే ప్రాణాంతకమైన జీవులు. సైజులో చాలా చిన్నగా ఉన్నప్పటికీ మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేసి ప్రాణాలు కబళిస్తాయి. మోటుగా చెప్పాలంటే యుద్ధాల్లో చనిపోయేవారి కంటే దోమకాటుకు చనిపోయేవారి సంఖ్య ఎక్కువ.→ శునకాలే కాదు దోమలు కూడా మిమ్మల్ని దూరం నుంచే వాసన పసిగట్టగలవు. మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్ ద్వారా 10 నుండి 15 మీటర్ల దూరం నుంచే ఇక్కడ మనిషి ఉన్నాడని అవి గ్రహిస్తాయి. ఎగురుకుంటూ వచ్చి కసక్కున కుట్టి వదలుతాయి.→ దోమల్లో మగవి సాధుజీవులు. పాపం ఇవి చెట్ల మీద పుట్ల మీద ఎగురుతూ తేనె లాంటివి తాగి బతుకుతాయి. ఆడ దోమలు అలా కాదు. వాటికి బ్లడ్ కావాలి. గుడ్లు పెట్టడానికి మన రక్తం నుండి ప్రోటీన్ అవసరం కాబట్టి అవి మన రక్తం కోసం వెంట పడతాయి. → దోమలకు చూపు చాలా తక్కువ. కాబట్టి అవి కంటి పరిధిలో అడ్డంగా స్పష్టంగా కనిపించే ఆకారాలను వెతుకుతాయి. ముదురు రంగు దుస్తులు ధరించిన మనిషి వాటికి స్పష్టంగా కనిపిస్తాడు.→ దోమలకు పాదాలు ఇష్టం. అందుకే దోమలు కుట్టే మనిషి కాళ్లు గీరుకుంటూ కనిపిస్తాడు. దోమలు తరచుగా చీలమండలు, పాదాలను కుడతాయి, ఎందుకంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా వాటికి నచ్చిన బలమైన వాసనలను ఉత్పత్తి చేసి వాటికి మనిషి ఆచూకి ఇస్తుంది. ఐస్లాండ్లో దోమ–ప్రమాదంఐస్లాండ్లో దోమలు ఉండవు. కాని ఇటీవల ఒక దోమ కనబడటం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దోమలు జీవించి, పునరుత్పత్తి చేయడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు కావాలి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, ఐస్లాండ్ వంటి చల్లని ప్రాంతాలు కూడా వాటికి మరింత అనుకూలంగా మారుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ జ్వరం, మలేరియా, చికున్ గున్యా వంటివి దోమల ద్వారా ఎక్కడెక్కడకు వ్యాపిస్తాయా అని సైంటిస్ట్లు ఆందోళన చెందుతున్నారు.ఎండాకాలం... దోమల కాలం. మనిషికి మహమ్మారుల నుంచైనా విముక్తి ఉందేమోగాని దోమ నుంచి లేదు. రాత్రయ్యి లైట్ ఆఫ్ చేయగానే ఈ దండు బయలుదేరి చుక్కలు చూపించడం నిత్యకృత్యం. అయితే ఇవి కొందరిని ఎక్కువ కుడతాయి. కొందరిని క్షమించి వదిలిపెడతాయి. కారణాలు తెలిస్తే మీరు ఔరా అంటారు. -
ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..
అత్యంత అరుదుగా ఎదురయ్యే రైడ్ ఇది. దీనికి మాటలతో పనిలేదు. ఈ అసాధారణమైన రైడ్ని టెక్నాలజీ మాటలతో పనిలేకుండానే సమన్వయం అయ్యేలా చేసింది. ఎలా సాగుతుందో అనుకున్న జర్నీ కాస్తా సాంకేతికత అద్భుతమైన ముగింపు ఇచ్చి దివ్యాంగుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. అందుకు సంబంధించని పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ పోస్ట్ని గ్రెయిల్మేకర్ ఇన్నోవేషన్స్ సహ-వ్యవస్థాపకురాలు ఐశ్వర్య టి వి పిళ్లై లింక్డ్ఇన్లో షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఒక రోజు రైడ్ని బుక్ చేసినట్లు తెలిపారు. అది కన్ఫర్మ్ అయ్యింది. డ్రైవర్ చెవిటివాడని, అర్థమైంది. తాను అంధురాలు కాబట్టి ఆ రైడ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉందామెకు. ఆ రైడ్ని రద్దు చేద్దామనుకుంది కానీ ఆ తర్వాత ఏ జరుగుతుందో చూడాలనే కుతుహలంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అనుకున్నట్లుగానే క్యాబ్ వచ్చింది. తాను చేతికర్రతో సహా లోపలికి ఎక్కాను కాబట్టి ఆ డ్రైవర్కి తన పరిస్థితి అర్థమయ్యే ఉంటుందని భావించింది. తాను ఫోన్లో ఏదో టైప్ చేస్తున్నట్లుగా ఓపెన్ చేసి అతడికి ఓటీపీ చూపించింది. ఆ తర్వాత ఆమె తాను వెళ్లే ఆఫీస్ ఎంట్రీ వద్ద నేరుగా దించమని టెక్స్ట్ మెసేజ్ పంపింది. ఆ ఉబర్ డ్రైవర్ అర్థం చేసుకున్నాడు. గమ్యస్థానం రాగానే అతను కారు దిగి ఎవరినో పిలిచాడు. ఆ తర్వాతన ఆమె కారు దిగింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెన ప్రవేశ ద్వారం వద్దకు నడిపించాడు. కించెత్తు సంభాషణ కూడా లేకుండా అంతా అర్థమయ్యేలా సాఫీగా సాగిపోయిందా ఆజర్నీ. ఆ రైడ్కి నిజంగా ఐదు స్టార్లు అంటూ పోస్ట్ని ముగించింది పిళ్లై. నెజిజన్లు కూడా ఈ పోస్ట్పై ప్రశంసల జల్లు కురిపించడమే గాక, వైకల్యాలను అధిగమించేలా చేసిన సాంకేతిక అద్భుతం అని కొనియాడారు.(చదవండి: ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్టాపిక్గా ‘దూద్ పిలాయ్’ ఆచారం!) -
శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?
హిందూ ధర్మంలో దేవతా ఆరాధనకు, క్షేత్ర సందర్శనకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ‘శక్తిపీఠం’, ‘సిద్ధపీఠం’ అనే పదాలను తరచుగా వింటుంటారు. సామాన్య భక్తులకు ఇవి రెండూ ఒకేలా అనిపించినప్పటికీ, వీటి వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వేర్వేరు. శక్తిపీఠాలు మాతా సతీదేవి త్యాగానికి చిహ్నాలైతే, సిద్ధపీఠాలు ఋషులు, మునులు సాధించిన తపఃఫలానికి నిదర్శనాలు. శరీర భాగాలు పడినచోట శక్తి ఆవిర్భవిస్తే.. తపస్సు పండిన చోట సిద్ధి చేకూరుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక వ్యత్యాసాలేమిటో తెలుసుకుందాం..!భారతీయ ఆధ్యాత్మిక భూమికలో శక్తిపీఠాలు, సిద్ధపీఠాలు రెండూ అత్యంత మహిమాన్వితమైనవిగా పరిగణించినప్పటికీ, వాటి ఆవిర్భావం వెనుక భిన్నమైన పౌరాణిక నేపథ్యాలు ఉన్నాయి. శక్తిపీఠాలు ప్రధానంగా మాతా సతీదేవి దేహ త్యాగానికి చిహ్నాలు; శివుడు ఆమె భౌతిక కాయాన్ని మోసుకెళ్తున్న తరుణంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా, భూమిపై ఆ శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు కొన్ని పురాణాల ప్రకారం..108 శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి దేవి భౌతిక అవశేషాల శక్తిని కలిగి ఉండి, భక్తులకు పాప ప్రక్షాళనను, దేవి సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ఈ శక్తిపీఠాలలో ఆ దేవి ప్రత్యక్షంగా, తన నిజ స్వరూపంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శక్తితోపాటు భైరవుడు అంటే శివుడు కూడా ఉంటాడని భావిస్తారు.తపఃఫల సిద్ధి క్షేత్రాలు..సిద్ధపీఠం అంటే ఒక ఋషి, సాధువు, సిద్ధుడు లేదా సాక్షాత్తు ఒక దేవత సుదీర్ఘకాలం పాటు కఠోరమైన తపస్సు ఆచరించి, పరమాత్మ అనుగ్రహాన్ని ΄÷ందిన ప్రదేశం. ఇక్కడ దేవత ఆవిర్భావం దైహికమైన భాగాల వల్ల జరగదు. కేవలం సాధన, ధ్యానం, మంత్రబలం ద్వారా జరుగుతుంది. సిద్ధపీఠాలలో ఆధ్యాత్మిక తరంగాలు అత్యంత బలంగా ఉంటాయి. సాధకులు ఇక్కడ సాధన చేయడం వల్ల త్వరగా ’సిద్ధి’ అంటే జ్ఞానం లేదా శక్తులు పొందుతారు. భక్తుల కోరికలు త్వరగా నెరవేరే ప్రదేశాలుగా వీటిని భావిస్తారు. ఉదాహరణకు, మార్కండేయ మహర్షి తపస్సు చేసిన చోటో లేదా మాతా వైష్ణోదేవి లాంటి క్షేత్రాలను సిద్ధపీఠాలుగా పరిగణించవచ్చు.సిద్ధపీఠాలు దైహికమైన అవశేషాలతో సంబంధం లేకుండా, కఠోరమైన తపస్సు, సాధన ద్వారా ప్రాశస్త్యం పొందిన పుణ్యక్షేత్రాలు. ఒక ఋషి, ముని లేదా దేవత ఏ ప్రదేశంలోనైతే సంవత్సరాల తరబడి ధ్యానం చేసి దైవత్వాన్ని సిద్ధింపజేసుకుంటారో, ఆ ప్రదేశమే సిద్ధపీఠంగా విరాజిల్లుతుంది. వీటికి నిర్ణీత సంఖ్య అంటూ ఉండదు. తపస్సు పండిన ఏ చోటైనా ఇది సాధ్యమే. ఇక్కడ కేంద్రీకృతమై ఉండే తపఃశక్తి, సంకల్ప బలం భక్తులకు అపారమైన మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా, వారు తలపెట్టిన కార్యాలు త్వరితగతిన సిద్ధించేలా అనుగ్రహిస్తాయి. క్లుప్తంగా చె΄్పాలంటే, శక్తిపీఠం దైవస్వరూపాన్ని దర్శింపజేస్తే, సిద్ధపీఠం ఆ దైవత్వాన్ని పొందే మార్గాన్ని సాధనను గుర్తుచేస్తుంది.శక్తిపీఠమైనా, సిద్ధపీఠమైనా అంతిమంగా లభించేది ఆ జగన్మాత అనుగ్రహమే. శక్తిపీఠాలు మనకు ‘త్యాగాన్ని’, ‘భక్తిని’ గుర్తుచేస్తాయి. ఒక దేహాన్ని త్యజించినా ఆ శక్తి అక్షయంగా ఉంటుందని చాటిచెబుతాయి. సిద్ధపీఠాలు మనకు ’క్రమశిక్షణను’, ‘సాధనను’ బోధిస్తాయి. మనం కూడా ఏకాగ్రతతో తపస్సు చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ క్షేత్రాలు నిరూపిస్తాయి. ఈ క్షేత్రాలను సందర్శించేటప్పుడు భౌతికమైన ఆడంబరాల కంటే, ఆధ్యాత్మిక చింతనతో వెళ్లడం ముఖ్యం. అప్పుడే ఆ పీఠాల నుంచి వెలువడే దివ్యశక్తి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది.– పసుపులేటి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్టాపిక్గా ఆ ఆచారం!
మన దేశంలో పెళ్లికి సంబంధించి ప్రాంతాల వారీగా విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇటీవల మార్చి 29న వైవాహిక బంధంతో ఒక్కటైన ఐపీఎస్ జంట పెళ్లి వేడుకలో జరిగిన ‘దూద్ పిలాయ్’ తంతు అందరి దృష్టిని ఆకర్షించడమే గాక చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొడుకు ఊరేగింపునకు ముందు జరిపే ఈ తంతు అత్యంత విలక్షణంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దూద్ పిలాయ్ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.రాజస్థాన్లోని భార్మర్కు చెందిన ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ మార్చి 29న జోధ్పూర్ ఐపీఎస్ అధికారి అన్షిక వర్మను వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్ర పెళ్లికొడుకు ఊరేగింపు వేడుకలో జరిగిన తంతు. ఇక్కడ ఐపీఎస్ అధికారి దూద్ పిలాయ్ ఆ ఆచారంలో పాల్గొనడం. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ తంతుపై ఆసక్తిని రేకెత్తించింది. ‘దూద్ పిలాయ్’ అంటే..దూద్ పిలాయ్ అనేది రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో పాటించే ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ తల్లి తనపల్లు (కొంగు) కింద నుండి కొడుకుకు ప్రతీకాత్మకంగా పాలు ఇచ్చి, ఆశీర్వదించి, బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇది భావోద్వేగపూరితమైన సంప్రదాయం. ఇది కేవలం ప్రతీకాత్మకమైన చర్య. తల్లి కొంగు కింద పాలు తినిపించడం ద్వారా తన పాలు ఇచ్చి పెంచిన ప్రేమను, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. కొడుకు చిన్నతనం నుంచి, వైవాహిక బాధ్యతల్లోకి ప్రవేశిస్తున్నాడని, అతనికి ఆ తల్లి ఆశీస్సులు సదా ఉంటాయని సూచిస్తుంది. ఈ ఆచారం పూర్వకాలం నాటిదట. ఒకప్పుడూ పురాతన కాలంలో, సైనికులు యుద్ధభూమికి వెళ్లే ముందు తల్లి ప్రేమను గుర్తుచేసుకోవడానికి, తల్లి పాలకు గౌరవం ఇస్తూ ఈ ఆచారాన్ని ఆచరించేవారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆచారాన్ని ఎక్కువగా హర్యానా, బీహార్, పశ్చిమ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆచారిస్తారట. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) (చదవండి: ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!) -
ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!
ఉన్నత చదువులు చదివితే కచ్చితంగా లక్షల ప్యాకేజ్లతో పనిచేసే ఉద్యోగాలు చేస్తుండటమో లేదా వ్యవస్థాపకులుగా కోట్లు గడించే రేంజ్లోనో ఉంటారు. అందులోనూ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్లన్నింటిలో ఆల్ ఇండియా టాపర్ సాధించిన వ్యక్తులు అంటే కచ్చింతంగా చాలా పెద్ద పొజిషన్లోనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వ్యక్తి అత్యంత విరుద్ధంగా ఆ మార్గాన్ని ఎంచుకుని ఆయన ఏం చేస్తున్నారో తెలిస్తే..విస్తుపోతారు. ఇలా ఎలా ఇంత పెద్ద అనుహ్య మార్గాన్ని ఎంచుకున్నారా అని ఆశ్చర్యపోతారు. పైగా అతడి కథ ఆలోచింపచేసేలా ఉండటమే గాక విజయానికి అసలైన అర్థం ఏంటో చాటి చెప్పారు.ఆయనే శ్రీష్ జాదవ్. 1968లో జన్మించిన జాదవ్, చిన్న వయస్సు నుంచే విద్యలో అసాధారణ ప్రతిభ కనబరిచేవారు. 1985లో, భారతదేశంలోని అత్యంత పోటీతత్వ పరీక్షలలో ఒకటైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఐఐటీ జేఈఈ))లో ఆయన ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించారు. అలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IITK) చదువుకున్నారు. సోషియాలజీ మినహా అన్నింటిలోనూ 'A' గ్రేడ్లు సాధించి, అద్భుతమైన విద్యా ప్రతిభను కనబరిచారు. అతని పదునైన మేధస్సు, నిలకడైన ప్రతిభ అతన్ని తన కాలంలోని అత్యుత్తమ విద్యార్థులలో ఒకరిగా నిలబెట్టింది. ఆ తర్వాత 1989లో కంప్యూటర్ సైన్స్లో గేట్ (GATE) పరీక్షలో 99.92 అద్భుతమైన పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలిచారు. ఇక అక్కడితో చదువుని ఆపలేదు, పీహెచ్డీ కూడా చేశారు. ఆ తర్వాత సంప్రదాయ ఉద్యోగాలతో సంపాదన బాట పట్టకుండా సమాజ సేవ కోసం సర్వస్వం త్యాగం చేశారు. నిరుపేద విద్యార్థులకు విద్యనందించడం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన సమాజ సేవకు మించింది లేదనే భావంతో అరుణాచల్ ప్రదేశ్లోని నరోత్తమ్నగర్లో ఉన్న రామకృష్ణ మిషన్ పాఠశాలలో రెసిడెంట్ గౌరవ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1996, 1997ల మధ్య రామకృష్ణ మిషన్ శిల్పమందిరంలో గౌరవ లెక్చరర్గా సేవలందించారు. అలాగే 1997-2006 వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ రంగంలో లెక్చరర్గా, కో ఆర్డినేటర్గా సేవలందించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత పెద్ద బాధ్యతలు స్వీకరించి, చివరికి రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి డీన్ ఆఫ్ రీసెర్చ్ మరియు కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయన సమాజానికి చేసిన విశేష సేవలకు గానూ 2009లో ఆయనకు ఐఐటీ కాన్పూర్ 'విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం ప్రదానం చేసింది. అంతేగాదు ఆయన సేవ మార్గాన్నే ఎంచుకున్నా.. విద్య పట్ల ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. కంప్యూటేషనల్ జ్యామితి, గ్రాఫ్ అల్గారిథమ్స్, డిస్క్రీట్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి వాటిలో పరిశోధనలు చేశారు. అంతేగాదు ఆయన బీటెక్ ప్రాజెక్టు ఓ ప్రముఖ కంప్యూటర్ సైన్స్ పరిశోధన సంస్థచే ప్రచురణ కోసం ఎంపిక అవ్వడం విశేషం. కాగా, శ్రీష్ జాదవ్ కథ నిజమైన విజయం సంపాదనలో లేదని, తెలివిగా ఎంచుకోవడంలోనే ఉందని చెబుతోంది. అంతేగాదు సక్సెస్ అంటే సంపద, గుర్తింపు కానే కాదని, ఒక లక్ష్యంతో స్పష్టతతో జీవించడం గురించని చెప్పకనే చెప్పారు శ్రీష్ జాదవ్.(చదవండి: 'బుజ్జి' ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..) -
'బుజ్జి ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..
కొందరు చిన్నారులు వయసు పెరిగే కొద్ది తమలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తారు. ఇంకొందరు బైబర్త్ నైపుణ్యం పెంపొందించుకుంటారు. వయసుకి వారి ప్రదర్శించే ప్రతిభకు పొంతనలేని వారి సామర్థ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తుంది. అలాంటి కోవకు చెందిందే కేరళలోని పాలక్కాడ్కు చెందిన నాలుగేళ్ల పిహు. ఆమె పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఫోటోగ్రఫీలో అసామాన్య ప్రజ్ఞతో ఆకట్టుకుంటోంది. ఆమె ఏ వయసులో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేరళలోని పాలక్కాడ్ నగరానికి చెందిన నాలుగేళ్ల పిహు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్దాస్, తల్లి శ్రీ హేమ శ్రీధరన్ దంపుతుల పెద్ద కుమార్తె. తన వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఆమె మాత్రం తన చిట్టి చేతులతో కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి కెమెరాల పట్ల అసాధారణమైన ఆసక్తిని కనబరుస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్ దాస్ అడుగుజాడల్లో నడిచేస్తోంది. అంత చిన్న వయసులోనే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. పైగా తన టాలెంట్తో ఆ అభిరుచి తన డీఎన్ఏలోనే ఉంది అని చెప్పకనే చెబుతోంది పిహు. కేవలం 18 నెలల వయసులోనే బొమ్మ కెమరా కాకుండా, ఒరిజనల్ కెమెరాను పట్టుకుంది. ఆ పరికరం తన బరువులో దాదాపు సగం బరువు అయినా..ఆమె దానిని జాగ్రత్తగా ఎత్తి తనకు ఇష్టమైన ఏనుగు బొమ్మ ఫోటోని తీసింది. అది చూసిన తల్లిదండ్రులు ఓ చిన్న పసిపాప తీసిన ఫోటోనేనా..? అని విస్తుపోయారు. పైగా అంత చిన్నవయసులోనే కెమెరాలోని రకారకాల లెన్స్లు, గింబల్ వంటి వాటిపై ఆకస్తి చూపించేది. ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందనేది తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. అయితే తల్లిదండ్రులు అంత చిన్నవయసుకు కెమెరా ఎందుకని బొమ్మ కెమెరా ఇచ్చేందుకు యత్నిస్తే అస్సలు ఒప్పుకునేది కాదని చెప్పుకొచ్చారు. ఎలా నేర్చుకుందంటే..పిహు ఫొటోలు అందంగా తీయడం ఎలా నేర్చుకుందంటే..తన స్నేహితుడి బిడ్డ పుట్టినరోజు వేడుకలో సదరాగా ఇచ్చిన చిన్న కెమెరాను ప్రోఫెషనల్ కెమెరా మ్యాన్లు పట్టుకున్నట్లుగా పట్టుకుని ఫొటోలు తీసిందని చెబుతున్నారు ఆమె తండ్రి విపిన్ దాస్. అక్కడే తీస్తున్న ఇతర ఫొటోగ్రాఫర్లను పరిశీలిస్తూ తీయడం నేర్చుకుందని, పైగా ఆ వేడుకలో తీసిన పది ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలా అప్పటి నుంచి పిహు తండ్రి తోపాటు అవుట్డోర్ ఫొటోషూట్లకు వెళ్లడం ప్రారంభించింది. అలాగే తన తల్లి శ్రీహేమ రెండోసారి గర్భవతి అయినప్పుడు తల్లికి ఆ చిన్నారి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్గా మారింది. నేచురల్ వెలుగులో అద్భుతమైన పోర్ట్రెయిట్లను తీసింది ఆ చిన్నారి. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆ చిన్నారికి పేరొచ్చింది అప్పుడే..గతేడాది నవంబర్లో రాజకీయ నాయకుడు, ఎంపీ షఫీ పరంబిల్ ఆమె వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో పిహు పేరు మారుమ్రోగిపోయింది. ఆ వీడియోలో పిహు ఎంపీకి సంబంధించిన కొన్ని ఫొటోలు క్లిక్మనిపించింది. అంత ఎవరా ఆ చిన్నారి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక తన కూతురుకి ఏ యాంగిల్ ఫోటోలు తీస్తే బాగా వస్తాయనే దానిపై మంచి పట్టుందని చెబుతున్నారు విపిన్ దాస్. View this post on Instagram A post shared by Shafi Parambil (@shafi_parambil) ఇవేగాక ఆమె ఇటీవలే, పాలక్కాడ్లోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగే పదిరోజుల వార్షిక రథోత్సవమైన ప్రసిద్ధ కల్పతి రథోత్సవంలో సైతం అద్భుతంగా ఫొటోలు తీసిందన్నారు. అక్కడ కమనీయ దృశ్యాలను చాలా అద్భుతంగా కెమెరాలో బంధించిందని చెప్పారు. అంతేకాదండోయో ఈ చిన్నారి పిహుకి 'cam_girl_pihu' అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. దానిని ఆమె తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు.(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..) -
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..) -
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు -
మా నాన్న ప్రవర్తనతో విసిగిపోయాము!
మా నాన్న గారిది మొదట్నుంచి వింత ధోరణే! ఇంటికి ఎవరైనా తెలిసినవారు, బంధువులు వస్తే అతిగా ప్రవర్తిస్తారు. ఫ్యాన్లు ఫుల్ స్పీడ్తో పెట్టడం, గట్టిగా మాట్లాడటం, వారితో తనకు పెద్ద పదవుల్లో ఉన్నవారంతా తెలుసునని, రోజూ వారితో ఫోన్లో మాట్లాడుతానని గొప్పలు చెబుతారు. ఎవరైనా అప్పు కావాలంటే తన అవసరాలు కూడా చూడకుండా, వారికి డబ్బులివ్వడం, ఏదైనా ఫంక్షన్కు వెళితే, మా తాహతుకు మించి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం కూడా మామూలే. మా నాన్న బలహీనత ఆసరాగా తీసుకుని, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, చాలా గ్రాండ్గా చేయాలని, అప్పైనా చేసి ఖర్చు పెడ్తారు. తనకు పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తెల్సని, తాను తల్చుకుంటే ఏదైనా చేయగలనని, అందరికీ తెలిసేలా చెబుతుంటారు. ఆయన ప్రవర్తన వల్ల, మేము ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, ఒక్కోసారి నల్గురిలో తలెత్తుకోలేకపోతున్నాము. ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం ఈ ఉత్తరం...– రమా కుమారి, బోధన్మీ బాధ అర్థం చేసుకున్నాను. మా ప్రాక్టీసులో ఇలాంటి మనస్తత్వమున్నవారిని తరచుగా చూస్తూనే ఉంటాము. ‘హైపోమేనిక్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేక మనస్తత్వం కలవారు ఇలా ప్రవర్తిస్తారు. ఇది ఒక చిత్రమైన వ్యక్తిత్వ లక్షణం. మన చుట్టూ మీ నాన్న లాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు, ఇంటెన్సిటీలో తేడా అంతే! వీరు మొదట్నుంచీ అతిగా మాట్లాడ్డం, గొప్పలు చెప్పుకోవడం, ఎప్పుడూ ఓవర్ యాక్టివ్గా ఉండటం, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. వీరి గొప్పలు వింటూ ఉంటే, నిజమేమోనన్నంతగా నమ్మిస్తూ ఉంటారు. అయితే వీరికి నోటి దురదే తప్ప, వాస్తవానికి ఇతరులను మోసం చేయాలనే తలంపు సాధారణంగా ఉండదు. ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవాలనే తపన వీరికి ఎక్కువ. ఇలాంటి వారు అతిగా ఊహించుకుని, రకరకాల వ్యాపారాలు మారుస్తూ, అనాలోచితంగా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఆర్థికంగా కూడా నష్టపోతుంటారు. ఎప్పుడూ జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏదైనా కష్టాలొచ్చినా, వారి మొహంలో బాధ, దిగులు కనిపించడం చాలా అరుదు. ఇలాంటి మనస్తత్వం సాధారణంగా జీన్స్ ద్వారా కొందరికి వారసత్వంగా సంక్రమిస్తుంది. మెదడులోని కొన్ని రసాయనాలు అధికంగా పనిచేయడం వల్ల కూడా కొందరిలా ప్రవర్తిస్తారు. తమ ప్రవర్తన వల్ల ఇంట్లో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్న స్పృహ వీరికి ఉండదు. విమర్శిస్తే తట్టుకోలేరు. ఇలాంటి వారు ఒక్కోసారి ‘బైపోలార్ డిసార్డర్’ అనే తీవ్రమైన మానసిక వ్యాధికి కూడా లోనయ్యే అవకాశముంది. మీ నాన్నగారి ప్రవర్తన మరీ శృతిమించి రాగాన పడేట్లయితే, ఒకసారి సైక్రియాట్రిస్టు సలహా తీసుకోండి. ‘మూడ్ స్టెబిలైజర్స్’ అనే కొన్ని మందుల ద్వారా వీరి ప్రవర్తనను చాలా వరకు మార్చే అవకాశముంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఉమెన్ పవర్...పంచ్
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్లు ఫైనల్లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి). కుంచె నుంచి పంచ్ దాకా...చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్లోకి వచ్చింది ప్రీతి పవార్.పానిపట్లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్షిప్స్లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.ఎంతోసేపు ఏడ్చిన తరువాత..రాజస్థాన్లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.‘బాక్సింగ్లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.మట్టి కరిపించేలా...మాజీ ప్రపంచ ఛాంపియన్ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.తాతగారు ససేమిరా అన్నా...జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.కష్టమైనా... ఇష్టంగా!హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. బాక్సింగ్లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్లాండ్కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.అనుకోకుండా వచ్చి...అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్పూర్లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా. ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. -
కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చా..?
సమ్మర్ మొదలైపోయింది. బయట వేడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదీగాక ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ సైతం ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని ముందుగానే హెచ్చరించింది కూడా. అప్పుడే మే నెల రాక మునుపే సూర్యడి భగభగలు మాములుగా లేవు. ఈ సమయంలో అధికంగా తీసుకోవాల్సింది నీరు. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఎక్కువ మంది కొబ్బరి నీళ్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాగే సబ్జా నీళ్లు కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు ఈ రెండిటిని కలిపి తీసుకుంటారు. అసలు ఇలా కలిపి తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..అంటే..వేసవిలో చాలామంది డీహైడ్రేషన్కి గురై మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అందుకు కొబ్బరి నీళ్లు, సబ్జా రెండూ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అసలు వేసవిలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎందుకు అధికంగా ఉంటుందంటే..రికార్డు స్థాయిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు శరీర సాధారణ పనితీరుపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనిని 'హీట్ స్ట్రెస్' లేదా వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికంగా నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూత్రం కూడా చిక్కగా మారుతుంది, దాని రంగును బట్టి శరీరం ఎంత డీహైడ్రేషన్కు గురైందో తెలుస్తుంది. అలాంటి టైంలో మన తీసుకునే ఆహారం శరీరానికి వేడిచేసేవి అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడంపై చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాదు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండేలా చేసుకోవడానికి, వివిధ వనరుల ద్వారా నీటిని తీసుకోవడం అత్యంత అవసరం.కొబ్బరి నీరు: ప్రకృతి అందించే సహజసిద్ధమైన ఔషధం.. కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లు, యు పొటాషియంను అందించే ఒక సహజ జల వనరుగా పేర్కొంటారు. అంతేకాకుండా, దీనికి నిర్విషీకరణ, బాక్టీరియా నిరోధక, పునరుజ్జీవనం, జీర్ణక్రియ, మూత్రవిసర్జన వంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల నుంచి లవణాలను బయటకు పంపడానికి తగినంత నీరు అందనప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, కాబట్టి ఇది వాటిని నివారించగలదు. తరుచుగా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచబడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.కొబ్బరి నీరు జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలపై సానుకూల చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.సబ్జా గింజలు:సబ్జా గింజల్లోని నీటిని శోషించుకునే లక్షణం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ ప్రకారం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఖనిజాలను కలిగి ఉండే పోషక ప్రొఫైల్, మూత్ర సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మూత్రపిండాల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.కొబ్బరి నీరు సబ్జా గింజల కలయికకొబ్బరి నీరు, సబ్జా గింజల సరైన కలయిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని ఆయర్వేదం చెబుతోంది. ఇంటర్నేషనల్ బ్రాజ్ జె యూరల్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ మూత్రంలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది కానీ సబ్జా గింజలు మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయనేందుకు ఆధారాలు లేవు అని పేర్కొంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొబ్బరి నీళ్ళు లేదా తులసి గింజల వంటి సహజసిద్ధమైన హైడ్రేటింగ్ వనరులను సురక్షితంగా తీసుకోవడానికి వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు అనుగుణంగా సురక్షితమైన విధంగా ఎలా తీసుకోవాలో సూచిస్తారని చెబుతున్నారు. అంతేగాదు లోబీపీతో బాధపడేవారు సబ్జాగింజలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..) -
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ సందర్భానికి తగ్గట్టు స్టైలిష్ రెడీ అవ్వడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా హస్తకళలు, భారతీయ సంప్రదాయ వారసత్వ విలువ తెలిపేలా నీతా అలంకరణ ఉంటుంది. తాజాగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్తో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి విశేష పూజలు చేసి, ఆమె ఆవీర్వాదం కోరారామె. ఆలయ దర్శనం కోసం నీతా గులాబీ రంగులోని కుర్తాతో ఎంతో హుందాగా వచ్చారామె. పొడవాటి చేతులతో చుట్టు దుప్పటా దానిపై బంగారు ఎంబ్రాయిడరీ ఆమె లుక్ని మరింత హైలెట్ అయ్యేలా చేసింది. దానికి బంగారు బ్రోకేడ్తో అంచు ఎంబ్రాయిడరీ చేయబడిన స్ట్రెయిట్-ఫిట్ ప్యాంటుతో జత చేసింది. అందుకు తగ్గట్టుగా వదులుగా జుట్టుని వదిలేసి, చక్కటి పాపిడి బొట్టుతో సంప్రదాయంతో మిళితమైన ఆధునిక మహిళలా తళుక్కుమంది. సరళమైన సంప్రదాయ దుస్తులకు అనుగుణంగా మల్టీ-క్యారెట్ కాక్టెయిల్ రింగ్, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు ధరించారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆలయం విశిష్టత..మా కామాఖ్య, లేదా కామేశ్వరి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. ఈ ఆలయం గౌహతిలో ఉంది. భూమిపై ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది అత్యంత పవిత్రమైనది, పురాతనమైనది కూడాతన భద్రతా సిబ్బందితో కలిసి వచ్చిన నీతా అంబానీ, ఈ ఆలయాన్ని సందర్శించి, పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. ఆమె అమ్మవారికి ప్రార్థనలు చేయడం, పూజారులతో మాట్లాడటం, పూజలు నిర్వహించడం, ఆలయంలో ఉన్న భక్తులను పలకరించడం వీడియలో స్పష్టంగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Learner (@decodingeliteclass) (చదవండి: మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..) -
హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..
దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మొదలైంది. పద్నాలుగేళ్ల బాలికలు మొదలుకొని దేశంలో దాదాపు కోటీ పదిహేను లక్షల మంది యువతులకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క సింగిల్డోస్ (మోతాదు)తో మహిళల్లో సర్వైకల్ కేన్సర్ను సమర్థంగా నివారించే (93% నుంచి 100% వరకు రక్షణ కల్పించే) ఈ వ్యాక్సిన్ను ఇవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో విస్తృతంగా మొదలైన ఈ మహిళా ఆరోగ్య సంరక్షణ చర్య ద్వారా అంతర్జాతీయంగా కేన్సర్ నివారణ చర్యలు తీసుకున్న 160 దేశాల్లో మన దేశం కూడా ఒకటి కానుంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కోసం...హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళలను ప్రభావితం ఏలా చేస్తుందంటే... ఇది (హెచ్పీవీ) మహిళల్లో సర్వైకల్ కేన్సర్కు దారితీస్తుంది. సెక్స్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే హెచ్పీవీ ఉండటం వల్లనే తప్పక అది సర్వైకల్ కేన్సర్కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే అది కేన్సర్ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్లో పాల్గొనేవారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా స్త్రీలలో అందునా గ్రామీణ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. ఈ భాగం మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అలా అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల కేన్సర్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫాక్టర్ హెచ్పీవీ వైరస్... హెచ్పీవీ వైరస్ సోకడం సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. మామూలుగానైతే చాలామందిలో హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్కేన్సర్కు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. హెచ్పీవీ వైరస్తో పాటు పొగతాగే అలవాటు ఉండటం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి అంశాలు కూడా సర్వైకల్ కేన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని.నివారణ ఎలా? నివారణకు తొలుత తోడ్పడే పరీక్ష పాప్స్మియర్ అనే వైద్యపరీక్ష. సర్వైకల్ కేన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ అనే వైద్యపరీక్షది చాలా కీలక భూమిక. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, తమ లైంగిక జీవితం ప్రారంభమయ్యాక మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం అవసరం. అంటే చిన్న వయసు బాలికలు తప్ప మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. సర్వైకల్ కేన్సర్ రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దాన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–కేన్సరస్ దశ’ ఉండటం మరో అడ్వాంటేజ్. అంటే అసలు కేన్సర్ రావడానికి పదేళ్ల ముందే దీన్ని కనుగొనే అవకాశమున్నందున... అది కేన్సర్గా పరిణమించకముందే అంటే ‘ప్రీ–కేన్సర్’ దశలోనే నయం చేసుకోవచ్చు. పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం కూడా ఎక్కువే. హెచ్పీవీ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలంటే... గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే కేన్సర్లను నివారించే ఈ వ్యాక్సిన్ను ఎప్పుడు ఇవ్వవచ్చనే విషయంలో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు మేరకు.. పదకొండేళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. తొమ్మిదేళ్లు నిండిన బాలికలు మొదలుకొని 26 ఏళ్ల వరకు మహిళలందరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. అయితే మహిళలకు వాళ్ల వివాహానికి ముందే అంటే... వాళ్లు తమ లైంగిక జీవితాన్ని మొదలు పెట్టకమునుపే దీన్ని ఇప్పించడం అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో 99% మందికి ఈ కేన్సర్ వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి సర్వైకల్ కేన్సర్ ముప్పు తాలూకు ఆందోళన లేకుండా వారు జీవితాంతం నిశ్చింతగా ఉండే నిర్భయత ఈ వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు ఉంటుంది.హెచ్పీవీ వ్యాక్సిన్తో ఇతరత్రా ప్రయోజనాలివే... హెచ్పీవీ వ్యాప్తినిఅరికట్టడంయోని దగ్గర వచ్చే పులిపిరుల(జెనిటల్ వార్ట్స్) సమస్య నుంచి రక్షణ గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణయోని క్యాన్సర్ వంటి మరికొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి నివారణ దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందిమహిళా సమూహాలకు సంయుక్త రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) కలగడంచికిత్స తర్వాత మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు బాగా తగ్గడంతద్వారా జనాభాలోని అందరికీ / ప్రజారోగ్య సంరక్షణకు తోడ్పడటండాక్టర్ సాయిలక్ష్మి డయానా, సీనియర్ కన్సల్టెంట్, గైనిక్ ఆంకాలజిస్ట్ – యాసీన్చదవండి: ‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే.. -
‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..
మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్ సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..
డైనోసార్లు 66 మిలియన్ సంత్సరాల క్రితమే అంతరించిపోయాయి కదా మరి దాని తోలుతో హ్యాండ్ బ్యాగ్ ఎలా సాధ్యం. బతికే ఉన్న జంతవుల తోలు నుంచి తయారు చేశారంటే అవునా అని అనొచ్చుగానీ, అస్సలు భూమ్మీద మనుగడ లేని ఆ జంతువుల తోలుతో చేసిన లేదర్ వ్యాండ్ బ్యాగ్ ఏంటి అని సందేహించకండి. ఎందుకంటే ఇది ముమ్మాటికి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగే. దాని ధర తెలిస్తే విస్తుపోతారు. అసలు దీన్నెలా రూపొందించారు, ఎందుకంత ఖరీదు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ప్రాజెక్టులో భాగంగా నెదర్లాండ్ శాస్త్రవేత్తలు, డిజైనర్లు టైరన్నోసారస్ రెక్స్ శిలాజాలల(డైనోసార్ శిలాజాలు) నుంచి సేకరించిన కొల్లాజెన్ను ఇతర జంతువుల కణాలతో కలిపి ల్యాబ్లో కృత్రిమంగా పెంచారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం మూడు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ది ఆర్గానాయిడ్ కంపెనీ, జెనోమిక్ ఇంజనీరింగ్ సంస్థ ఆర్గానాయిడ్, క్రియేటివ్ ఏజెన్సీ VML అనే మూడు కంపెనీలు 2023లో ఉన్ని మామత్ DNAను గొర్రెల కణాలతో కలిపి ఒక భారీ మీట్బాల్ను తయారు చేసేందుకు పనిచేశాయి. మళ్లీ తాజాగా ఈ బృందం డైనోసార్ అవశేషాల నుంచి పురాతన ప్రోటీన్ శకలాలను సేకరించి, వాటిని ఒక గుర్తుతెలియని జంతువు కణాలలోకి ప్రవేశపెట్టి కొల్లాజెన్ను ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత దానిని తోలుగా మార్చారు. అయితే చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేయడంతో..డచ్ శిలాజ శాస్త్రవేత్త ఇలా వివరణ ఇస్తూ.. వారి అనుమానాలను పటాపంచలు చేశారు. డైనోసార్ ఎముకలలో కొల్లాజెన్ కేవలం శకలాల రూపంలో మాత్రమే మిగిలి ఉంటుందని, దానిని ఉపయోగించి టి-రెక్స్ చర్మాన్ని పునఃసృష్టించలేమని అన్నారు. అలాగే సరిపోలిన ప్రోటీన్లలో కూడా, నిజమైన జంతు తోలుకు దాని విశిష్ట లక్షణాలను ఇచ్చే ఫైబర్ నిర్మాణం లోపిస్తుందని చెప్పారు. సరికొత్త ప్రయోగం చేసేటప్పుడే ఇలాంటి సందేహాలు మాములేనని, అయినా ఇంతవరకు డైనోసార్ చర్మం అనేలా ఎవ్వరూ అంత స్థాయిలో ప్రయోగం చేయలేకపోయారని కూడా అన్నారు. అదీగాక సంప్రదాయ లెదర్ బ్యాగ్లతో పోలిస్తే, ల్యాబ్ తో చేసిన టి. రెక్స్ లెదర్ అత్యంత విలాసవంతమైన వస్తువుగా నిలుస్తుందన్నారు. ఈ డైనోసర్ లెదర్ బ్యాగ్ని మే 11న ఆమ్స్టర్డామ్లోని ఆర్ట్ జూ మ్యూజియంలో సందర్శనకు ఉంచనున్నారట. అంతేగాదు దీన్ని వేలం వేయనున్నట్లు సమాచారం. పైగా దీని ప్రారంభ ధరే రూ. 4 కోట్లు అని చెబుతున్నారు పరిశోధకులు.(చదవండి: Kerala Techie: సాహసమా..? నాటకమా..?: కావాలనే చేసిందా ఆ టెకీ..) -
ఆ టెకీది సాహసమా..? నాటకమా..?
కర్ణాటకలోని మూడవ ఎత్తైన శిఖరం టేడీయాండమోల్ (Tadiandamol) వద్ద ట్రెకింగ్కు వెళ్లి అడవిలో దారి తప్పిన కేరళకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి.ఎస్. శరణ్య కథ సుఖాంతమైంది అనుకుంటే..సర్వత్రా ఈ ఘటనపై అనుమానాలు వెల్లువెత్తాయి. అసలు ఆమె నిజంగానే తప్పిపోయిందా..? నాటకమా.. ? అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టెకీ శర్యణ తానెలా తప్పిపోయిందో చెప్పిన విధం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఈ ఘటనపై పెద్దఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . అసలు ఎందుకిలా అంటే..కేరళలోని కోజికోడ్ జిల్లా, నడపురానికి చెందిన 36 ఏళ్ల ఐటీ నిపుణురాలు శరణ్య, ఏప్రిల్ 2న కర్ణాటకలోని కొడగులో ఉన్న ఎత్తైన శిఖరం తడియండమోల్ను అధిరోహించడానికి బయలుదేరింది. ఆమె తన బృందంతో తప్పిపోయి నాలుగురోజుల తర్వాత రెస్కూ అధికారులు ఆమె ఆచూకుని కనిపెట్టి సురక్షితంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా నాలుగు రోజుల పాటు మనుషులెవ్వరూ వెళ్లలేని ఆ దట్టమైన అడవిలో ఒక్కత్తే ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే ఆమె కేవలం నీళ్లు తాగుతూ ఉండటం మరింత ఆశ్చర్యానికి లోనుచేసింది. ఎందుకంటే రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి తీసుకొచ్చినప్పుడూ.. శరణ్య ముఖంలో ఏ మాత్రం అలసిపోయినట్లు గానీ, తప్పిపోయిన బడలికగానీ కనిపించకపోవడంతో సర్వత్ర అనుమానాలకు దారితీసింది. అదీగాక క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో ఆమె బతికి బయటపడే అవకాశమే లేదు, ఇదంతా ఆమె కావాలనే ఆడిన నాటకంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాదు ఆమె ప్రభుత్వం, ప్రజల విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసినందుకుగానూ శరణ్యపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని బిజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు టెకీ శరణ్య అదృశ్యం కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నపోక్లు పోలీస్ స్టేషన్లో కేను కూడా నమోదైంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు బీజేపీ నాయకులు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కానీ ఒక పిటిషన్గా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీసులు రెస్క్యూలో ఆమెను చూసి మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానాలు కలగలేదని, కానీ ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు రెస్క్యూ పోలీసులు. ట్రెక్కింగ్ వెళ్లినప్పుడూ శరణ్యలా కాకూడదంటే..ఇలా ట్రెక్కింగ్ వంటి సాహసయాత్రలకు వెళ్లేటప్పుడూ..ఎండింగ్ పాయింట్ చేరుకునేవరకూ వెళ్లే మార్గం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల రూట్ మ్యాపును తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా మాన్యువల్ మ్యాప్ను ఫాలో అవ్వాలి. ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ట్రెక్కింగ్లో మంచి అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాహసయాత్రకు సిద్ధమైన ట్రెక్కింగ్ ప్రియులు పర్వతాలపైకి వెళ్లే సమయంలో పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ప్రాంతాల్లో రాళ్లపై నాచు పట్టి ఉండడం వల్ల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు చాలా దృఢంగా ఉండాలి. ట్రెక్కీలు వెళ్లే దారి మధ్యలో ఎండిపోయిన చెట్లు, రాళ్లు, విష పురుగులు, సర్పాలు, కీటకాలు, తేళ్లు ఉంటాయి. కాబట్టి సౌండ్ వచ్చే షూస్ ను వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అలికిడికి దూరంగా వెళ్లిపోతాయి.(చదవండి: మంచు కమలం..ముమ్మాటికీ ఇది అందరూ చూడలేరు!) -
ఇది అందరూ చూడగలిగే పువ్వు కాదు..!
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. తనలో ఇముడ్చుకున్న కొన్ని విచిత్రాలు మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తాయి. అలాంటి అరుదైన పుష్పమే ఈ మంచుతామర లేదా మంచు కమలం. అందరికీ దీన్ని చూడటం సాధ్యం కాదు. ఈ మంచు కమలం ఎక్కడ వికసిస్తుందో తెలుసా..!.ఈ మంచు పుష్పం ఐదు నుంచి ఎనమిదేళ్లు పెరిగి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుందట ఈ పర్వత పుష్పం. 'అరుదైన అందం', 'జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే క్షణం' వంటి పదాలు సరిపోతాయేమో ఈ మొక్కను వర్ణించడానికి. దీనిని సాసురియా ఇన్వోలుక్రాటా లేదా సాసురియా లానిసెప్స్ అని కూడా పిలుస్తారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే ఇది అందరు చూగలిగే పువ్వు కాదని అంటుంటారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే కాకుండా హిమాలయాలు, టియాన్షాన్ పర్వతాల్లో నివశించే కొద్దిమందికే ఈ మంచు కమలం గురించి తెలుస్తుందట. ఈ పుష్పం దాదాపు 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పెరుగుతుంది కాబట్టి ఇది తీవ్రమైన చలిలో కూడా జీవించగలదు. అరుదైనది అందమైనది మాత్రమే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగపడే ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. నిజానికి పదివేల కంటే ఎక్కువ ఎత్తులో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, పలుచని గాలి, తీవ్రమైన సూర్యరశ్మి వంటివి దీని మనుగడను కష్టతరం చేస్తాయి. ఆ సవాళ్లన్నింటిని తట్టుకుని పెరుగుతుంది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకం. పైగా ఈ మొక్క తన మనుగడతో గొప్ప జీవన పాఠమే గాక ఈ ప్రకృతిలో ప్రతిది కష్టాలను ఓర్చుకునే తన మనగడను చాటుకోవాల్సిందే అనే విషయం నొక్కి చెబుతోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి...!. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!) -
క్షమించడంతోనే విముక్తి
చాలామంది క్షమించడం అంటే ఎదుటివారు చేసిన తప్పును అంగీకరించడం లేదా వారిని మళ్ళీ దగ్గరకు తీయడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, క్షమించడం అనేది ఎదుటివారి కోసం చేసేది కాదు.. అది మీ కోసం మీరు చేసుకునే 'విముక్తి'. మీ వ్యక్తిత్వం నుండి పగ, ద్వేషం అనే భారాలను తొలగించి, మిమ్మల్ని మీరు ఎలా ఫ్రీ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో చూద్దాం.మీకు అన్యాయం చేసిన వ్యక్తిపై కోపం పెంచుకోవడం అంటే, ఆ వ్యక్తికి మీ మనసులో 'ఉచితంగా రెంట్' (Free Rent) ఇచ్చినట్లే. మీరు పగతో రగిలిపోతున్నంత సేపు, మీ జీవితం ఆ వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. క్షమించడం అంటే ఆ నియంత్రణను తెంచుకుని, మీ 'ప్రశాంతత'ను మీరు తిరిగి పొందడం.పగ - ఒక మానసిక విషం (The Burden of Unforgiveness)మనం ఎవరినైనా క్షమించలేనప్పుడు మన శరీరంలో నిరంతరంCortisol (స్ట్రెస్ హార్మోన్) విడుదలవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను పాడు చేస్తుంది , అది మీ సృజనాత్మకతను చంపేస్తుంది. కోపాన్ని మోయడం అంటే, ఎదుటివారి మీద విసరాలని మండుతున్న నిప్పు కణికను మీ చేతిలో పట్టుకోవడం లాంటిది. కాలేది మీ చేయి మాత్రమే, అవతలి వారికి ఏమీ కాదు.క్షమించడం అంటే ఏమిటి? క్షమించడమంటే 'మర్చిపోవడం' కాదు.జరిగిన విషయాన్ని మీరు మర్చిపోలేరు, కానీ ఆ జ్ఞాపకం మిమ్మల్ని బాధించకుండా చూసుకోవచ్చు.వారు చేసింది తప్పు అని మీకు తెలుసు, కానీ ఆ తప్పు వల్ల మీ వర్తమానం పాడవ్వకూడదు అని మీరు నిర్ణయించుకుంటారు.క్షమించినంత మాత్రాన మీరు ఆ వ్యక్తితో మళ్ళీ స్నేహం చేయక్కర్లేదు. మీరు వారిని దూరం పెట్టవచ్చు, కానీ మనసులో కోపం లేకుండా.మోటివేషన్ మాయ vs సైకాలజికల్ హీలింగ్"మహాత్ముడిలా ఉండు, అందరినీ ప్రేమించు" అని మోటివేషన్ చెప్తుంది. ఇది ఒక్కోసారి ఆచరణలో కష్టం. కానీ సైకాలజీ... "నీ ఆరోగ్యం కోసం, నీ ఎదుగుదల కోసం ఆ విషాన్ని బయటకు కక్కేయ్" అని చెప్తుంది. క్షమించడం అనేది ఒక నైతిక బాధ్యత కంటే, ఒక 'సెల్ఫ్-కేర్' టెక్నిక్.విముక్తి పొందే మార్గంGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, క్షమాగుణాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?Step 1: Break Victim Identity..."నాకు అన్యాయం జరిగింది, నేను బాధితుడిని" అనే ఆలోచనను 'Break' చేయండి. ఆ ఆలోచన మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఆ సంఘటన నుండి బయటకు వచ్చి, మీరు ఒక 'సర్వైవర్' (Survivor) అని గుర్తించండి.Step 2: Build Emotional Detachmentఆ వ్యక్తికి, మీ ఎమోషన్స్ కి మధ్య ఉన్న లింక్ ని 'Build' చేయండి. "వాడు ఇలా అన్నాడు కాబట్టి నేను బాధపడుతున్నాను" అనే వాక్యాన్ని "నేను నా పాత జ్ఞాపకం వల్ల బాధపడుతున్నాను, ఆ వ్యక్తికి ఇప్పుడు నా మీద అధికారం లేదు" అని మార్చుకోండి. మీ మనసును మీరు రీ-వైర్ చేసుకోండి.Step 3: Liberationక్షమించిన తర్వాత మీలో కలిగే ఆ తేలికపాటి భావనను అనుభవించండి. ఇప్పుడు మీ ఎనర్జీ పగ తీర్చుకోవడానికి కాకుండా, మీ 'లెగసీ'ని నిర్మించుకోవడానికి వాడుకోండి. ఇదే 'Beyond' స్టేజ్. ఒక వ్యక్తిని క్షమించిన రోజు మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు.మీ మనసులో భారమెంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీరు ఇంకా ఎవరి మీదైనా కోపం పెంచుకున్నారా? ఆ కోపం వల్ల ఆ వ్యక్తికి ఏమైనా నష్టం జరుగుతోందా లేక మీకేనా?2. ఆ వ్యక్తిని క్షమిస్తే మీ జీవితంలో ఎంత సమయం, ఎంత ఎనర్జీ ఆదా అవుతుంది?3. మీరు మీ పాత గాయాలను మీ వ్యక్తిత్వానికి అలంకారాలుగా మార్చుకుంటారా లేక భారాలుగా మోస్తారా?క్షమించడమే అసలైన వీరత్వం!బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడం అనేది బలవంతుల లక్షణం. మీరు ఒకరిని క్షమించినప్పుడు, మీరు వారిని విడుదల చేయడం లేదు.. ఒక ఖైదీని విడుదల చేస్తున్నారు, ఆ ఖైదీ మరెవరో కాదు..మీరే!"The weak can never forgive. Forgiveness is the attribute of the strong."- Mahatma Gandhi సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత) -
ఆచి తూచి అడుగు వేయండి
మనిషి తన జీవన విధానాలను మెరుగు చేసుకునే పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉంటాడు. భారతీయ వివాహ వ్యవస్థ తిరుగులేనిదే అయినా ఇటీవల లివ్ ఇన్ రిలేషన్– సహజీవన విధానంలో స్త్రీ, పురుషులు జీవించడం పరిపాటి అయ్యింది. అయితే ఇందులో స్త్రీలకు ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయవాది మోనిక అరోర ఫేస్బుక్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవల నా దగ్గరకు వచ్చిన ఒక కేసు నన్ను తీవ్రంగా కలవరపరిచింది. అది సహజీవనం కేసు. ఒక మహిళ దాదాపు 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె ఆ బంధాన్ని ఎంతో నమ్మింది. ఈ పదేళ్ల కాలంలో అతని కోసం సమయాన్ని, యవ్వనాన్ని, భావోద్వేగాలను, శరీరాన్ని అర్పించింది. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఏమీ చెప్పకుండా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో చె΄్పాడు. దాంతో ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలనుకుంది. క్రిమినల్ కేసు పెట్టాలనుకుంది. అతడు చేసిన ఘోరమైన ద్రోహానికి చట్టం అతడిని శిక్షించాలని కోరుకుంది. కాని భావోద్వేగాలు వేరు... చట్టం పని తీరు వేరు. అందుకే లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న, వెళ్లాలనుకున్న స్త్రీలకు, యువతులకు కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను.మీరు ఇది అర్థం చేసుకోండి‘సహజీవనం’ స్త్రీలకు సాధికారత ఇచ్చే సంబంధం అని అనుకుంటారు. ఈ భావన కేవలం అంచనా మాత్రమే అంటాను నేను. ఇది చూడటానికి, పైకి చెప్పుకోవడానికి ఎంపికకూ, స్వేచ్ఛకూ, ఆధునికతకూ తార్కాణం కావచ్చు. కాని ఒకసారి ఏదైనా తేడా జరిగితే నిజమైన కోర్టు గదులలో పరిస్థితి చాలా భిన్నంగా ఎదురవుతుంటుంది. లివ్ ఇన్ రిలేషన్ ఒక్కసారి విచ్ఛిన్నమైనదంటే ఆ సంబంధంలో ఉన్న మహిళకే అధిక నష్టం ఎదురవుతుంది. ఒంటరితనం, బాధ ఆమెను చుట్టుముడతాయి. చట్టపరంగా ఆమెకు దొరికే మద్దతు ఆశించినంతగా ఏమీ ఉండదు. అందుకే లివ్ ఇన్లో ఉన్న... లేదా వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన చట్టపరమైన అంశాలుసమ్మతికి ప్రాధాన్యంఇద్దరు వయోజనులు ఒక సంబంధంలో ఉండాలని నిశ్చయించుకుని, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధంలోకి ప్రవేశిస్తే, అప్పుడు విడిపోవడం నేరంగా పరిగణించబడదు.అది లైంగిక నేరంగా మారదులిన్ ఇన్ రిలేషన్ నుంచి పురుషుడు తప్పుకుంటే, ఆ సంబంధాన్ని విడిచిపెట్టినంత మాత్రాన, అప్పటివరకూ పరస్పర అంగీకారంతో సాగిన శారీరక సంబంధం అత్యాచారంగా మారిపోదు.మోసం, వంచనలకు శిక్షఅయితే లివ్ ఇన్ కోసం మొదటినుంచి మోసం, కుయుక్తి లేదా కేవలం సమ్మతి కోసమే పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసినట్లయితే ఈ అంశం చుట్టూ చట్టపరమైన సహాయం భిన్నంగా ఉండవచ్చు. అయితే ఈ విషయం కూడా స్పష్టంగా నిరూపించబడాలి.రక్షణ గురించిసహజీవన సంబంధం తనంతట తాను వివాహానికి ఉండే చట్టపరమైన రక్షణను కల్పించదు. వివాహం స్త్రీకి సామాజిక మద్దతు, చట్టపరమైన హోదాను ఇస్తుంది. నిలదీయదగ్గ, అమలు చేయదగ్గ హక్కులను స్త్రీకి ఇస్తుంది. భర్త విడిపోవాలంటే భార్య ఉమ్మడి ఇంటి నుంచి రక్షణ, భరణం, చట్టపరమైన పరిహారాలు, సామాజికం గా అవసరమైన మద్దతు, పెద్ద మనుషులను కూచోబెట్టి డిమాండ్స్ చేయడం.. ఇవన్నీ సాధ్యమవుతాయి.మరి లివ్ ఇన్లో?లివ్ ఇన్లో కొన్ని సందర్భాల్లో స్త్రీకి చట్టం నుంచి పరిమిత రక్షణ లభించవచ్చు. కానీ అది వివాహం ద్వారా స్త్రీకు వచ్చే రక్షణతో సమానం కాదు. వివాహ స్వభావం కలిగిన కొన్ని జీవన సంబంధాలను చట్టం రక్షించవచ్చు, కానీ ఆ రక్షణ పరిమితమైనది. పెళ్లి నుంచి విడిపోవాలంటే ఎదురయ్యే సహజమైన పరిణామాలు లివ్ ఇన్ వంటి వ్యవస్థలో మనిషి మనిషికి మారిపోతుంటాయి. అందుకే నేను ఏమంటానంటే⇒ అమ్మాయిలకు ‘నీ శరీరం, నీ ఇష్టం’ అని మనం చెప్పినప్పుడు, ‘విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకో’ అని కూడా వారికి చె΄్పాలి ∙చట్టం నినాదాలను కాపాడదు. చట్టం హక్కులను కాపాడుతుంది. హక్కులు కేవలం భావోద్వేగాల వల్ల రావు ⇒ ఇది నీతిసూత్రాల బోధ అనుకోవడం లేదు. నా కేసులలో నేను పదేపదే చూస్తున్న చట్టపరమైన వాస్తవం గురించి చెబుతున్నాను ⇒ ఒక అమ్మాయి సహజీవనం స్వేచ్ఛ అని నమ్మి అందులోకి ప్రవేశించవచ్చు. కానీ ఆ సంబంధం ముగిసినప్పుడు తనకు వివాహంలోలాగా వచ్చే హక్కు, భరణానికి హామీ, స్పష్టమైన సామాజిక భద్రత, నివాస హక్కులు, భావోద్వేగ ద్రోహానికి సులభమైన చట్టపరమైన పరిష్కారం లేదని ఆమె తెలుసుకోవాలి.అందుకే, అనేక సందర్భాల్లో ‘సహజీవనాలు’ స్త్రీయే అధిక ప్రమాదాన్ని భరించాల్సిన ఒక వ్యవస్థగా పరిణమిస్తాయి. ఇటువంటి బంధంలోకి అడుగుపెట్టే ముందు, ప్రతి యువతి తనను తాను ఈ ప్రశ్నలు తప్పక వేసుకోవాలి.⇒ నా చట్టపరమైన హక్కులు ఏమిటి?⇒ ఒకవేళ అతను నన్ను వదిలి వెళ్లిపోతే నాకు లభించే రక్షణ ఏమిటి?⇒ ఆ బంధానికి సంబంధించిన వాగ్దానాలు నెరవేరకపోతే,నాకు లభించే పరిష్కారం ఏమిటి?⇒ ఇంతటి గాఢమైన మానసిక,శారీరక అంకితభావానికి ప్రతి ఫలంగా నేను కచ్చితంగా ఏమి పొందుతున్నాను? -
ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!
ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు బాధనే కాదు త్రుటిలో పెను ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షిస్తాయి కూడా. ఒక్కోసారి విత్కర పరిస్థితి కూడా వరంగా మారిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ మహిళ కథ. ఆ రోజు ఆమెకు ఆ యాక్సిడెంట్ జరగకపోతే..ప్రాణాలతో ఉండేది కాదు. ఇదేంటి అనుకోకండి ఈ కథ వింటే ఏం జరిగినా మన మంచికే అనే పెద్దల మాట తలపుకు వస్తుంది. అమెరికాలోని ఓవెన్స్ క్రాస్ రోడ్స్కు చెందిన 31 ఏళ్ల మెలిస్సా ఆడమ్స్ తన పెళ్లికి ఒక రోజు ముందు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. రిహార్సల్ డిన్నర్ నుంచి ఇంటికి వస్తుండగా సిగ్నల్ వద్ద ఉన్న ఆమె కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్సి చేసే నిమిత్తం వైద్యులు సీటీ స్కాన్ చేయగా..ఆమె ప్రాణాంతక కేన్సర్ వాధి బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. అది నాలుగో స్టేజ్లో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులైనట్లు అనిపించిందామెకు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోకూడదని ఆమె, తన భాగస్వామి తీర్మానించుకున్నట్లు ఆడమ్స్ పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన రోజుని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఇలా చేసినట్లు తెలిపింది. తర్వాత వైద్యులు ఆమె శరీరంలోని మొత్తం 18 గడ్డలను గుర్తించి, ఆమెకు ఫోలిక్యులర్ డెండ్రిటిక్ సెల్ సార్కోమా (FDCS) అనే అత్యంత అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆ గడ్డలు ఆమె శరీరంలోని గుండె దగ్గర నుంచి పొత్తికడుపు, ఛాతీతో సహా పలుచోట్ల ఉన్నట్లు తెలిపారు. అనేక ఆస్పత్రులు, ఆంకాలజీ క్లినిక్లను సందర్శించిన తర్వాత చివరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు చికిత్సను ప్రారంభించారు. సుమారు 19-20 వారాలు వేచి ఉన్న తర్వాత కీమోథెరపీని ప్రారంభించడంతో తనకు ఉపశమనం, ఆశ కలిగిందని అన్నారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్ సాయం తీసుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు అప్పటికే కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నాయని, నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మొదటి నుంచి ఆసమస్యలు ఉండటంతో అందువల్ల ఇలా అనుకున్నాననే గానీ ఇలా ప్రాణాంతక కేన్సర్ బారిన పడతానని ఊహించలేదని కన్నీటిపర్యంతమైంది. తాను గత కొంతకాలంగా శరీరం అంతా పలు నొప్పులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. కణుతులు అవయవాలపై ఒత్తిడి తేవడం వల్లనేనని ఇప్పుడు అర్థమవుతోందని అంటోంది. వ్యాధి నిర్థారణ తర్వాత తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలంటూ ఇతరులకు సూచనలందిస్తోంది. అస్సలు తనకు గనుక ఆ కారు ప్రమాదం జరిగి ఉండకపోతే..తన అనారోగ్యాన్ని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని అని అంటోందామె.అలాగే తనలాంటి లక్షణాలు ఉన్నా లేక శరీరం ముందుగా ఇచ్చే సంకేతాలనుక్ క్షణ్ణంగా అర్థంచేసుకోమని సూచిస్తోంది. తనలా నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు పలుకుతోంది. ఇక ఆడమ్స్ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
పంటి సంరక్షణే.. ఆరోగ్యానికి రక్ష..!
పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం. కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్కు అంటూ కూల్డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకకపోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్లో బ్రషింగ్కు బదులు బ్రష్ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం. టైటానిక్కు ఐస్బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోకపోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్గా కూల్డ్రింక్స్ చాలా మాల్స్లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు. కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్బాక్సింగ్, ఫుట్బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్ఫ్రూట్లూ, ఐస్క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడటం మేలు.పళ్లను ఓపెనర్గా వాడటం సరికాదు... పిక్నిక్లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్ను తీసుకెళ్లడం మరచిపోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడిపోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్నే వాడాలి. షాంపూ షాచేలు చింపాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్జ్యూస్ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... ఏ సీజన్లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.పరిష్కారం: పండ్లను ఫ్రూట్జ్యూస్లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.కరకరలాడే చిప్స్తో కిరికిరి... చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది. ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.కాఫ్ సిరప్తోనూ దంతక్షయం...చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో పోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.తప్పుడు బ్రష్షింగ్ సరికాదు... చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్బ్రష్ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి. బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడిపోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.ఆ జబ్బుతో పంటికి ముప్పు... కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.ఎంత తక్కువ అయినా ముప్పే... గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్తో ΄ోలిస్తే రెడ్వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి. పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్... చాలామంది ఏదైనా తినగానే టూత్పిక్స్తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలుకొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.పాన్లూ, జర్దా / ఖైనీలు వద్దు... చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం. పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్పరాగ్లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.పెన్సిల్ను కొరకవద్దు... కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్ను గానీ లేదా పెన్ క్యాప్ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే. పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. చదవండి: మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకుపోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. పరిష్కారం: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.- డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ నిర్వహణ యాసీన్ -
మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..
దేశవ్యాప్తంగా కేన్సర్ బాధితుల సంఖ్య రానురాను పెరుగుతూనే ఉంది. అలాంటి ముప్పును ఎదుర్కుంటున్న వాటిలో అభివృధ్ధి పధంతో ఉన్న నగరాలే ముందుండడం ఆందోళన కరం. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే కేన్సర్ కేంద్రంగా మారనుందని ఓ ప్రతిష్టాత్మక ఆసుపత్రి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే...ప్రమాద ఘంటికలు...ఆ గణాంకాలు...హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో కేన్సర్ కేసులు గణనీయంగా పెరగనున్నాయి. హైదరాబాద్లోని పురుషులలో కనిపించే అన్ని రకాల కేన్సర్లలో ఒక్క ప్రోస్టేట్ రూన్సర్ వాటాయే దాదాపు 6.9 శాతంగా ఉంది. తెలంగాణలో నమోదవుతున్న కేన్సర్ కేసుల్ని పరిశీలించి చూస్తే, ఈ 2026లో కేవలం పురుషులలోనే 21,252 కొత్త కేన్సర్ కేసులు నమోదవుతాయని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నమోదు కాబోయే కేన్సర్ కేసుల సంఖ్య 46,762గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో 0 నుంచి 74 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు జీవితకాలంలో కేన్సర్ వచ్చే ముప్పు ప్రతి 8 మందిలో ఒకరికి ఉంటుందని అంచనా. ఇది ముందుగా కేన్సర్ను గుర్తించే మార్గాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను మరింతగా నొక్కి చెబుతోంది.నిర్ధారణ లేకపోతే నివారణ ఎలా?ఇంత తీవ్రంగా వ్యాధి విస్త్రుతి ఉన్నప్పటికీ, కేన్సర్ స్క్రీనింగ్ రేట్ మాత్రం 4 శాతం కంటే దిగువనే ఉండడం ఆందోళనకరం. పెరుగుతున్న కేన్సర్ కేసుల సంఖ్యకు, ముందస్తుగా గుర్తించడంలో ఉన్న పరిమితులకు మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా, చాలా కేసులు వ్యాధి ముదిరిన దశలో నిర్ధారణ అవుతున్నాయి. ఆ దశలలో వచ్చిన రోగులకు చికిత్స ఫలితాలు చాలా అధ్వాన్నంగా ఉంటాయి. చాలా మంది రోగులు కేన్సర్ 4వ దశలో వైద్యులను సంప్రదిస్తున్నారు. దీని ప్రభావం చికిత్స ఫలితాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది, దేశవ్యాప్తంగా ప్రోస్టేట్ కేన్సర్ ముదిరిన కేసులలో దాదాపు 65 శాతం మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.పొగతాగడం, ప్రాసెస్ తినడం...ఈ కేన్సర్ కేసులు సంఖ్య పెరగటానికి మారిన జీవనశైలితో పాటుగా వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. కొవ్వు అధికంగా ఉండే, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం; ఊబకాయం, మధుమేహం, ధూమపానం పెరగటం; కూరగాయల వినియోగం బాగా తగ్గడం వంటివి ఈ న్సర్ విజృంభణకు ముఖ్య కారణాలు. అదే సమయంలో, తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం, మూత్ర ప్రవాహం బలహీనమైన రీతిలో ఉండటం లేదా పెల్విక్ అసౌకర్యం వంటి ప్రోస్టేట్ కేన్సర్ ప్రారంభ లక్షణాలను అవగాహన లోపంతో అలక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటిని వయసుతో పాటు వచ్చే సమస్యలుగా పొరపాటు పడుతుంటారు. ఈ అపోహ వైద్య సహాయం అందుకోవడంలో ఆలస్యానికి దారితీస్తుంది,ప్రారంభంలో గుర్తిస్తే మేలు...‘ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో తీవ్రంగా ఉండదు, అది ప్రాణాంతకంగా మారకముందే దానిని గుర్తించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది,‘ అని జూబ్లీ హిల్స్లోని అపోలో హెల్త్ సిటీ లో మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ గడ్యాల్ పాటిల్ అంటున్నారు. అయితే చాలా మంది మగవారు వ్యాధి లక్షణాలను తరచుగా విస్మరిస్తున్నారనీ, రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవడం లేదని అన్నారాయన. సమస్య తీవ్రమైన తర్వాత హాస్పిటల్ కు వచ్చేసరికి, వ్యాధి ముదిరిపోతోవడం చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తోందన్నారు. అందువల్లే ఫలితాలు అంత అనుకూలంగా ఉండడం లేదన్నారు. ‘‘ 50 ఏళ్ల వయసు దాటిన పురుషులు లేదా ప్రమాద కారకాలు కలిగిన వారు సకాలంలో పరీక్షలు చేయించుకోవడం అనే చిన్న ఆలోచన చేస్తే చాలు..అది ఈ పరిస్థితిని గణనీయంగా మార్చగలదు...‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.ఆవిష్కరణలు కాదు..అవగాహనే ముందుశస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ ఖచ్చితమైన చికిత్సా విధానాలు సహా చికిత్సలలో పురోగతి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, వ్యాధిని చివరి దశలో గుర్తించడాన్ని తగ్గించడంలోనే అసలైన అవకాశం ఉంది. 2026 నాటికి భారతదేశంలో మొత్తం కేన్సర్ మరణాలు దాదాపు 7,05,000కు చేరుకుంటాయని అంచనా వేయగా, రాబోయే దశాబ్దాలలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్న అంచనాలతో హైదరాబాద్ నగర ప్రస్తుత పరిస్థితి ఒక సవాలుగా నిలుస్తోంది. ఈ పరిస్థితిని వ్యాధి విస్త్రుతిని నివారించడం అనేది కొత్త వైద్య ఆవిష్కరణలపై కన్నా, ప్రోస్టేట్ స్క్రీనింగ్ను సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చడం, ముందుగానే వైద్య సంప్రదింపులను ప్రోత్సహించడం, తేలికపాటి లక్షణాలను ప్రారంభ సూచనలుగా పరిగణించి చికిత్స అందించడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.(చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
నిజమైన ధైర్యం, తిరుగులేని శక్తికి కేరాఫ్ ఆమె..!
సకల సౌకర్యాలతో ఎటువంటి వైకల్యం లేకుండా సాధించిన విజయాలను ఎన్నో చూసి ఉంటాం. కానీ కడు పేదరికం, ఓ పక్క వైకల్యంతో సతతమతమై చిన్నారులు..ఏదో సాదించాలన్న ఆశతో బతుకుతున్న వైనం మనల్ని ఎంతగానో కదలిస్తుంది. పైగా అలాంటి వాళ్లు సాధించి విజయాలు అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, ప్రశంసనీయమైనవి కూడా. అలాంటి వ్యక్తులు అసామాన్య ధైర్యానికి, తిరుగలేని శక్తికి అర్థాన్నిచ్చేలా నిలబడతారు, గెలుస్తారు అని చెబుతున్నారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేరణాత్మక కథలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి కూడా మనసుని తాకే సరికొత్త స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకొచ్చారు. తనకు నిరాశనిస్ప్రుహలు కలిగినప్పుడల్లా అలాంటి మహోన్నత వ్యక్తుల వైపుకి చూస్తానంటూ ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అనే పారా ఆర్చరీ కథను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆనంద్ మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. రోజువారీ కూలీ అయిన ఒక మేస్త్రీ కుటుంబంలో జన్మించిన పాయల్ బాల్యం అంతా కష్టాలతో నిండిపోయింది. కేవలం ఎనిమిదేళ్ల వయసులో, విద్యుదాఘాతానికి గురై తన నాలుగు అవయవాలనూ కోల్పోయింది. నిజానికి ఆమె ఎదుర్కొన్న ప్రమాదం జీవితానికి ముగింపు పలికేలా చేసే దారుణమైన ఘటన. అయితే పాయల్ తన పరిస్థితిని ధిక్కరించేలా అద్భుతమైన ఆరంభానికి నాంది పలకడం విశేషం. ఆమె నేరుగా ఈ విలువిద్య శిక్షణలోకి రాలేదు. ఆమె మొదటగా తన ఐడెంటీటిని చిత్రీకరణతో తెచ్చుకుంది. అవయవాలు లేకపోయినా..పట్టుదలతో చిత్రాలు గీయాలన్న ఆమె తాపత్రయం అందర్నీ కట్టిపడేసేది. ఆ విలక్షణ ప్రతిభను శీతల్ దేవికి శిక్షణ ఇచ్చిన కుల్దీప్ వేద్వాన్ గుర్తించారు. ఆమె పట్టుదల, స్ఫూర్తిని గుర్తించి, పారా ఆర్చరీ శిక్షణతో ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గనిర్దేశం చేశారు. అలా అలుపెరగని పట్టుదలతో పాయల్ తన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. కాలక్రమేణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండిటిని పెంపొందించుకుంటూ..ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె సామర్థ్యాలు ప్రపంచానికే తెలిసేల చేసిన కీలక మలుపు ఏప్రిల్ 2026లో బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్. ఆ పోటీల్లో ఫైనల్కు చేరుకుని తన ఆరాధ్య దేవత అయిన శీతల్ దేవిని ఎదుర్కొని, ఓడించింది. అలా ఆ పోటీల్లో పాయల్ స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపైకి అద్భుతంగా అడుగుపెట్టింది. Here is that moment!! Payal Nag receives her GOLD medal at Bangkok and the national anthem plays.And right beside her, Sheetal - gracefully helping move her wheelchair.Two champions. One podium. One unforgettable frame.Pure inspiration. ❤️ pic.twitter.com/wrobtOCSIL— Manas Muduli (@manas_muduli) April 6, 2026 అంతేగాదు ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్గా ఘనత అందుకుంది పాయల్. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ కోచ్ కుల్దీప్ వేద్వాన్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృత్రిమ కాళ్లతో ఆపరేట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్లును తయారుచేశారు. ఇందులో భాగంగా, విల్లును పైకి ఎత్తడంలో సహాయపడటానికి ఆమె కుడి కృత్రిమ కాలుపై ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పరికరాన్ని, అలాగే శీతల్ మాదిరిగానే ఛాతీ నుంచి విల్లును విడుదల చేసే యంత్రాంగాన్ని కూడా అమర్చారు. ఆమెను ఆ పరికరాలకు అలవాటు చేయడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని వేద్వాన్ వెల్లడించారు. పాయల్ కేవలం 2023లో శిక్షణ ప్రారంభించి..జస్ట్ మూడేళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడే స్థాయికి ఎదిగి, విజయకేతనం ఎగరవేసింది. అని పోస్ట్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు తనకు ఎప్పుడైనా నిరాశగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు నిలదొక్కుకోవడానికి, సరైన దృక్పథాన్ని పొందడానికి పాయల్, శీతల్ సక్సెస్ జర్నీల వైపు చూస్తానని అన్నారు. వీళ్లు ఒక్కరోజుకే పరిమితమై స్ఫూర్తిప్రదాతలు కాదని, అసాధారణమైన అడ్డంకులను చేధించిన మహోన్నతమైన క్రీడాకారిణులని, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు మహీంద్రా.Payal Nag.Daughter of a daily-wage mason from Odisha. Electrocuted at the age of eight. Lost all four limbs.And then, found a bow.Spotted through her paintings by coach Kuldeep Vedwan, the same man who shaped world champion Sheetal Devi. Defeated her idol Sheetal Devi at… pic.twitter.com/KdWGcuAJ9X— anand mahindra (@anandmahindra) April 6, 2026 (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
జస్ట్ రెండు నెలల్లో 12 కేజీల బరువు..! నో స్ట్రిక్ట్ డైట్, నో చీట్మీల్స్
బరువు తగ్గడం అనేది కొందరికి సంక్లిష్టమైనది, అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ కొందరికి మాత్రం సాధారణ డైట్తోనే అద్భుతంగా మ్యాజిక్ చేస్తారు. కేవలం నిలకడ, క్రమశిక్షణతో తన ఆహార్యాన్నే మార్చుకుని..స్మార్ట్గా బరువు తగ్గడం ఎలాగో చూపిస్తారు. ఇక్కడ ఇషాన్ కర్దే అలానే బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అదికూడా కేవలం రెండు నెలల్లో ఏకంగా 12 కేజీలు తగ్గాడు. స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వ్యాయామాలు లేవు. ఇషాన్ కర్దే బరువు తగ్గడం అనేది ప్రాథమికంగా నిలకడ, సమతుల్య పోషణ, స్థిరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు. క్రమబద్ధమైన రోజువారీ ఆహారంతో శక్తి స్థాయిలను కాపాడుకుంటూనే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చని వెల్లడించాడు. వివిధ రకాల షార్ట్కట్ డైట్ల వైపుకి పరిగెట్టడం కంటే..సింపుల్గా, ఆరోగ్యప్రదంగా తేలికపాటి వాటితోనే స్మార్ట్గా బరువు తగ్గొచ్చని అంటున్నాడు. తాను నాలుగు పూటలా భోజనాన్ని ఆస్వాదిస్తూనే రెండు నెలల్లో 12 కేజీల దాక బరువు తగ్గానని చెబుతున్నాడు. ఇషాన్ కర్దే తనకు ఉపకరించిన డైట్ప్లాన్ గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నాడు. తాను డైట్ని 90% క్రమం తప్పకుండా పాటించానని, తీరిక లేని రోజుల్లో మధ్యాహ్న భోజనానికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్ ర్యాప్లు/రైస్ బౌల్స్ తీసుకున్నానని చెప్పారు. అయితే చీట్ మీల్స్, చక్కెర, చిప్స్, బిస్కెట్లు వంటివి అస్సలు తీసుకోలేదని వెల్లడించాడు.అల్పాహారంఈషాన్ తన రోజును ప్రోటీన్ ఓట్స్, 150 ml పాలు, 1 స్కూప్ వే ప్రోటీన్తో కూడిన అల్పాహారంతో ప్రారంభించేవాడు. తన భోజనంలో పోషక విలువలను విశ్లేషించి మరి తీసుకునేవాడు. దాని ప్రకారం మొత్తం 35 గ్రాముల ప్రోటీన్, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వులు ఉండేలా కేర్ తీసుకున్నారు. ప్రోటీన్, ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచి మధ్యాహ్నాం పూట నీరసించపోకుండా నివారించేవని అన్నారు.మధ్యాహ్న భోజనంఈషాన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మిశ్రమానికే కట్టుబడి ఉంటూ, కొవ్వు శాతాన్ని కొద్దిగా పెంచాడు. అతని భోజనంలో 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లేదా పనీర్, 2 రోటీలు, తేలికపాటి గ్రేవీ, సలాడ్లు ఉన్నాయి. ఈ భోజనం నుంచి 50 గ్రాముల ప్రోటీన్, 45 నుంచి 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 నుంచి 12 గ్రాముల కొవ్వు అందుతుంది.సాయంత్రం స్నాక్స్..అతను సాయంత్రం ఒక పండు, గుప్పెడు నట్స్, 5 గుడ్డు తెల్లసొన తీసుకునేవాడట. ఇలా తింటే 22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు లభిస్తాయి.రాత్రి భోజనంరోజులో చివరి భోజనంగా, ఈషాన్ తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నాడు. అతను 200 గ్రాముల చికెన్ లేదా పనీర్ సలాడ్ తీసుకున్నాడు, దీనిలో 45 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. అంతేగాదు బరువు తగ్గేందుకు ఎల్లప్పుడూ కష్టతరమైన ఆహారనియమాలు, తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని ఈషాన్ వెయిట్లాస్ జర్నీ రుజువు చేస్తోంది. పైగా ఒక సాధారణ దినచర్యను క్రమంతప్పకుండా పాటించడం అనేది అత్యంత కీలకమని నొక్కి చెబుతోంది కూడా. View this post on Instagram A post shared by Eshaan Karde (@eshaankarde)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?!
మొబైల్, లేదా బుల్లితెర వ్యసనం (స్క్రీన్ అడిక్షన్) మీ మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా, పబ్జీ గేమ్ వ్యసనానికి గురై, తిరిగి బయటకు వచ్చిన ఒక యువకుడి స్ఫూర్తిగాధ మీకోసంస్క్రీన్ అడిక్షన్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆయుర్వేద సూచనలు"నేను 24 గంటలు నిరంతరాయంగా పబ్జీ గేమ్ ఆడేవాడిని. కాలేజీ చదువున మధ్యలో వదిలేశాను. ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని," అని 25 ఏళ్ల చెన్నారెడ్డి చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన పగలు సౌరశక్తి టెక్నీషియన్గా పని చేస్తూ, యోగా బోధిస్తున్నాడు. మరి ఆయనలో మార్పు ఎలా వచ్చింది?స్టాన్ఫర్డ్ లైఫ్స్టైల్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం, రోజుకు రెండు గంటలకుపైగా కాలక్షేపం కోసం మొబైల్ చూసే 18–25 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల్లో మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ మందం తగ్గిపోతుంది. మెదడులోని ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారం వంటి ముఖ్యమైన పనులకు బాధ్యత వహిస్తుందని మనం గుర్తించాలి.రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువ స్క్రీన్ ముందు గడిపే పెద్దవారికి చిత్తభ్రమ, పక్షవాతం, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ఫోన్ వ్యసనం మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది—ఇది కదలికల నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిని నియంత్రిస్తుంది. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణచి, సహజ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది.ఇది మనసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది - ఆందోళన, నిరాశ, నలుగురితో కలవకపోవటం వంటివి పెరుగుతాయి. డా. మణికంటన్ చెప్పినట్లుగా, “ఇప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేసి, మన స్క్రీన్ అలవాట్లను నిజాయితీగా పరిశీలించాల్సిన సమయం వచ్చింది.”స్క్రీన్ అలవాటును తగ్గించడానికి ఆయుర్వేద సూచనలుస్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉందని గుర్తించినవారికి డా. మణికంటన్ కొన్ని ప్రాయోగిక సూచనలు అందిస్తున్నారు:మీ ఇంట్లో కొన్ని ప్రాంతాలను బుల్లితెరకు, ఫోన్లకు నిషేధిత ప్రాంతాలుగా ఏర్పరచండి: ఇంట్లో భోజనపు టేబుల్, పడకగది వంటి ప్రదేశాలలో ఇవి లేకుండా చేయటం అనేది మన మనస్సును వర్తమానంలోకి తెస్తుంది.ఫోన్ లేదా టీవీ ఎంతసేపు చూడాలనే టైమ్ టేబుల్ ముందే వేసుకోండి: అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించండి. ఇది అలవాటుపై నియంత్రణ పెంచుతుంది.ఎంతసేపు వాటిని వినియోగిస్తున్నారనేది గమనించుకోండి: దానికోసం మొబైల్లోనే అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఎంతసేపు ఉపయోగిస్తున్నారో గమనించండి. ఇది మార్పుకు ప్రేరణ ఇస్తుంది.సరైన శ్వాసకు గల శక్తి: కేవలం గాలి పీల్చుకోవటం కాదు, ప్రాణశక్తిని పెంపొందించుకోవటంచెన్నా రెడ్డి కథ, స్క్రీన్ వ్యసనంలో చిక్కుకున్న యువతకు ఆశ చూపుతుంది. 24 గంటల పాటు గేమింగ్, కోపం, చదువు మధ్యలో ఆగిపోవడం—ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 2023 జనవరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించే యువనాయకత్వ శిక్షణ కార్యక్రమంలో చేరాడు.అక్కడ ఆయన సుదర్శన్ క్రియ అనే శక్తివంతమైన శ్వాసక్రియ సాధన నేర్చుకున్నాడు. ఈ సాధనాన్ని ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, మానవతా నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ పరిచయం చేశారు. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, మనస్సులోని పాత అలవాట్లను విడిపిస్తుంది.కొద్ది రోజుల్లోనే చెన్నా రెడ్డి కోపం తగ్గిపోయింది, స్క్రీన్పై ఉన్న ఆకర్షణ క్రమంగా తగ్గింది, మనస్సులో ప్రశాంతత ఏర్పడింది. తరువాత ఆయన తన చదువును 70% మార్కులతో పూర్తి చేసి, యోగా ఉపాధ్యాయుడిగా మారి, సౌరశక్తి రంగంలో కెరీర్ నిర్మించుకున్నాడు.అధికంగా స్క్రీన్ వినియోగిస్తే, దాని ఫలితంగా చాలా సార్లు ఒత్తిడి లేదా ఆందోళన కలుగుతాయి. సుదర్శన క్రియ మన నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది డోపమైన్ ఆధారిత అలవాట్లను కూడా నియంత్రిస్తుంది. స్క్రీన్ వ్యసనం కూడా ఇతర వ్యసనాల్లాగే ఉంటుంది; ఈ సాధన వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఆయుర్వేద సహాయంనస్య చికిత్స: ముక్కులో ఔషధ తైలాన్ని వేసే విధానం. ఉదయం కొన్ని చుక్కలు ‘అణు తైలం’ ఉపయోగించడం మెదడుకు పోషణనిచ్చి, డిజిటల్ అలసటను తగ్గిస్తుంది.మేధ్య రసాయన: బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి వంటి మూలికలతో చేసిన ఈ ఔషధం ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.జీవనశైలిలో మార్పులుప్రతి ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయండి.స్క్రీన్కు బదులుగా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పెయింటింగ్, నడక, ఇరుగుపొరుగువారితో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోండి.ఇవి మెదడుకు సహజ ఆనందాన్ని ఇస్తాయి. క్రమంగా స్క్రీన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.డా. నిషా మణికంటన్, BAMS, MD (AM)ఆయుర్వేద వైద్యురాలు రచయిత సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అంతర్జాతీయ డైరెక్టర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్(చదవండి: -
జీవన ఎరువులతో సేద్యానికి జీవం
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల లభ్యత బాగా తగ్గిపోతుండటంతో పాటు.. వాతావరణ మార్పుతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు సాగు పద్ధతుల్లో తగిన మార్పులు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బత్తాయి సాగులో ద్రవ రూప జీవన ఎరువుల వాడకం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని 60%, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని 50% వరకు తగ్గించుకుంటూనే దిగుబడిని, ఆదాయాన్ని పెంచుకోవటం సాధ్యమేనని ఓ రైతు అనుభవపూర్వకంగా చెబుతున్నారు..బత్తాయి అంటేనే నల్లగొండ జిల్లా గుర్తుకు వస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ఉండే బత్తాయి తోటలు ప్రస్తుతం అనేక సమస్యలతో 40 వేల ఎకరాలకు తగ్గిపోయింది. దశాబ్దాలుగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేలలో పెరిగిన క్షార గుణం వల్ల, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు తగ్గించి, జీవన ఎరువులను ఉపయోగిస్తూ బత్తాయి పంటకు జీవం తెచ్చిన రైతు కట్టెబోయిన శ్రీనివాస్ తోటి రైతులకు మార్గదర్శకంగా నిలిచారు. ఏళ్ల తరబడి వ్యవసాయంలో అతిగా రసాయనిక ఎరువులు వాడకం వల్ల నేలలో సేంద్రియ కర్బనం తగ్గి, దిగుబడులు తగ్గిపోయిన పరిస్ధితుల్లో కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ కోవలోని రైతే గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం బత్తాయి రైతు శ్రీనివాస్. గత 30 ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్న శ్రీనివాస్ సాగులో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. నేలలో సూక్ష్మజీవరాశి నశించటం వల్ల సమస్యలు ఎదురయ్యాయి. నాణ్యమైన దిగుబడులు లేక లాభాలు తగ్గిపోవటంతో శాస్త్రవేత్తల సూచనల మేరకు గత మూడేళ్లుగా జీవన ఎరువులను వాడుతూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులు వాడటం ప్రారంభించారు. నేల సారాన్ని పెంపొందించి పంటలకు పోషకాలందించే జీవన ఎరువులను బత్తాయి తోటకు ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ద్రవ రూప జీవన ఎరువులు..రైతు కట్టెబోయిన శ్రీనివాస్ జీవన ఎరువులైన ట్రై కోడర్మా, బవేరియా, మైకోరైజా, సూడోమోనాస్, వామ్, వేస్ట్ డీ కంపోజర్, పీఎస్బీ, కేఎస్బీ, ఎన్పీకే బ్యాక్టీరియా, జింక్ సాల్యుబుల్ బాక్టీరియా, సీవీడ్ బ్యాక్టీరియా లాంటి సుమారు 40 రకాల ద్రవ రూప జీవన ఎరువుల కల్చర్ను పరిశోధనా కేంద్రాల నుంచి తెచ్చుకొని తన తోటలోనే వాటిని అభివృద్ధి చేసి, దశల వారీగా, అవసరాన్ని బట్టి వాడుతున్నారు. ఒక్కో జీవన ఎరువును ఒక్కో డ్రమ్ములో వేసి, తగినంత నీరు, బెల్లం కలిపి, రోజూ కలియ తిప్పుతూ, వాటిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే వరకు నాలుగైదు రోజులు అలాగే ఉంచి, డ్రిప్, జెట్ల ద్వారా నేరుగా బత్తాయి చెట్లకు అందిస్తున్నారు.మంచి నాణ్యత.. మంచి ధర.. ప్రస్తుతం మార్కెట్లో బత్తాయికి తోటల దగ్గర టన్నుకు రూ. 15 వేల నుంచి 20 వేల లోపు పలుకుతోంది. జీవన ఎరువులతో నాణ్యంగా పండించటంతో సైజు, నిగారింపు, నిల్వ సామర్థ్యం పెరిగాయి. దీంతో శ్రీనివాస్ తోటలో బత్తాయిలకు టన్నుకు రూ. 26–27 వేల ధర పలికింది. సాధారణంగా బత్తాయిలో గరిష్ట దిగుబడులు ఎకరాకు పది టన్నులు. అయితే, సరాసరిన ఐదారు టన్నులకు మించి రావటం లేదు. శ్రీనివాస్ ఎనిమిదిన్నర ఎకరాల (6–10 ఏళ్ల తోట)లో ప్రస్తుత ముందు కత్తెర కోతలో 104 టన్నుల దిగుబడి వచ్చింది. వచ్చే జూన్–జూలై సీజన్లో మరో 60–70 టన్నుల దిగుబడి వస్తుందని శ్రీనివాస్ ఆశిస్తున్నారు. గత మూడేళ్లుగా జీవన ఎరువులతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ఈ తోటను తెలంగాణ ఉద్యానవన శాఖ కమీషనర్ షేక్ యాస్మిన్ భాషా, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శించి రైతును అభినందించటం విశేషం.రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందుల అవసరమూ తగ్గిందిగత మూడేళ్లుగా ద్రవ రూప జీవన ఎరువులను వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. రసాయనిక ఎరువులు 60% తగ్గించాను. పురుగుమందుల అవసరం కూడా 40–50% మేరకు తగ్గింది. రసాయనిక వ్యవసాయంలో సాగు వ్యయం ఎకరానికి రూ. 80 వేల నుంచి లక్ష వరకు అవుతుంది. నాకు పశువుల ఎరువు, ద్రవరూప జీవన ఎరువులతో కలిపి రూ. 50–60 వేలు మాత్రమే అయ్యింది. బత్తాయి అనే కాదు ఏ పంటలకైనా జీవన ఎరువులు పనిచేస్తాయి. మీరూ వాడండని ఇతర రైతులకూ చెబుతున్నా. గత ఏడాది వరకూ పెద్దగా స్పందన లేదు. ఈ ఏడాది దిగుబడులు, కమిషనర్ సందర్శించటం చూసి కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారు.– కట్టెబోయిన శ్రీనివాస్ (98484 53525), బత్తాయి రైతు, బ్రాహ్మణగూడెం, గుర్రంపోడు మం., నల్లగొండ జిల్లా– చింతరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సాక్షి, గుర్రంపోడు, నల్లగొండ జిల్లా -
ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ కరదీపిక
ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న లక్ష్యంతో సమగ్రమైన ట్రైనింగ్ మాన్యువజీల్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇటీవలే వెలువరించింది. ‘రైతులకు సాధికారత కల్పించటం: ప్రకృతి వ్యవసాయ శిక్షణా కిట్ – ఉత్తమ పద్ధతుల మార్గదర్శిని’ పేరుతో రూపొందించారు. ప్రకృతి సేద్య మూల సూత్రాలతో పాటు.. ముఖ్యమైన 22 రకాల పంటల సాగులో క్షేత్రస్థాయిలో ఆచరించదగిన ప్రామాణిక ప్రకృతి సేద్య పద్ధతులను పొందుపరిచారు. నీతి ఆయోగ్ వ్యవసాయం–సాంకేతిక విజ్ఞాన విభాగం ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్, కన్సల్టెంట్ పరెమల్ బనఫర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీన్ని రూపొందించింది.రైతులు, విస్తరణ సిబ్బంది, విధాన నిర్ణేతలకు సుస్థిర వ్యవసాయ విస్తరణ దిశా నిర్దేశం చేయటానికి ఈ శిక్షణా మాన్యువల్, ఉత్తమ ప్రకృతి సేద్య పద్ధతులకు అక్షర రూపం ఇచ్చినట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ పేర్కొన్నారు. డాక్టర్ నీలం పటేల్ ఇలా అన్నారు: ‘దేశవ్యాప్తంగా రైతులు అనుసరిస్తున్న ప్రకృతి సేద్య పద్ధతులు, ఆవిష్కరణలు, సంప్రదాయ విజ్ఞానంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకృతి సేద్య అనుభవాల ఆధారంగా ఈ శిక్షణా మాన్యువల్ను రూపొందించాం. దేశంలో సుస్థిర వ్యవసాయాన్ని విస్తరింపజేయటంలో ఇదొక కీలక ముందడుగు’. ప్రకృతి వ్యవసాయ వారసత్వాన్ని సుసంపన్నం చేసిన సుభాష్ పాలేకర్ (మహారాష్ట్ర), ఎల్. నారాయణరెడ్డి (కర్ణాటక), శ్రీపాద దబోల్కర్, జి. నమ్మాళ్వార్ (తమిళనాడు), దీపక్ సచ్దే (మధ్యప్రదేశ్), భాస్కర్ సావే (గుజరాత్)ల సేవలను ఇందులో ప్రస్తుతించారు. దేశవ్యాప్తంగా ప్రకృతి సేద్య పథకాలు అమలవుతున్నాయని, 9.4 లక్షల హెక్టార్లలో సుమారు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. అధిక దిగుబడి.. అధిక నికరాదాయం!వరిని వరుసగా 4 ఏళ్లు ప్రకృతి వ్యవసాయం (ప్ర.వ్య.)లో పండిస్తే 2023 ఖరీఫ్లో ఎకరానికి 33.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. రసాయన వ్యవసాయం (ర.వ్య.)లో 31.5 క్వింటాళ్లు వచ్చింది. ఈ రెండు ధాన్యాలను క్వింటా రూ.2,040కే విక్రయించారు. ప్ర.వ్య.లో నికరాదాయం రూ.48 వేలు రాగా, రూపాయి ఖర్చుకు 2.3 రూపాయల ఆదాయం వచ్చింది. ర.వ్య.లో నికరాదాయం రూ.35,140 రాగా, రూపాయి ఖర్చుకు 1.2 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. → ప్రధాన పంటలన్నింటిలో సాగు ఖర్చును కనీసం 5–10% తగ్గిస్తుంది. మరికొన్ని పంటల్లో, కొన్ని రాష్ట్రాల్లో 20–55% వరకు తగ్గింది. ∙ప్రకృతి వ్యవసాయం రైతులు, వినియోగదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. → నేలల్లో సేంద్రియ కర్బనం 1947లో 2.5% ఉండేది. ఇప్పటికి 0.4%కి తగ్గింది. ప్రకృతి వ్యవసాయం దీన్ని 45% వరకు పెంచుతుంది. ∙నీరు, విద్యుత్లో 50–60% ఆదా అవుతుంది. ∙కర్బన ఉద్గారాలను 55–85% తగ్గిస్తుంది. ∙పశువులను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచటం రైతులకు లాభదాయకంగా ఉంటుంది.→ పంటల వైవిధ్యం, అంతరపంటలు, బహుళ అంచెల పంటలతో వ్యవసాయా దాయ భద్రత, పోషకాహార భద్రత పెరుగు తాయి. రసాయనిక సేద్యం ఏకపంట సాగుతో పోలిస్తే 20–40% అధిక నికర ఆదాయం వస్తుంది. జీవామృతం.. 48 గంటలు పులిస్తే చాలు!జీవామృతం కోసం పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లం, మట్టిని డ్రమ్ము నీటిలో కలిపిన తర్వాత 2–3 రోజులు పులియబెట్టి పంటలకు వాడుకోడానికి సిద్ధమైనట్లే. కలిపిన 48 గంటల్లో బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది. సిద్ధమైన జీవామృతాన్ని వేసవిలో 7 రోజుల వరకు, శీతాకాలంలో 8–10 రోజుల్లో వాడుకోవచ్చని నీతి ఆయోగ్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ మాన్యువల్ చెబుతోంది.ప్రకృతి సేద్యానికి మార్గదర్శకంరసాయనిక వ్యవసాయానికి ఒక సుస్థిరమైన ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం. ఇటు సంప్రదాయ విజ్ఞానాన్ని అటు ఆధునిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇముడ్చుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రూపొందాయి. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు దీటైన సమాధానాలు ఇవ్వగలవు. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటం సాధ్యమని ఈ పద్ధతులు చాటి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతులకు, విస్తరణ సిబ్బందికి ప్రకృతి సేద్య పద్ధతులపై శిక్షణ ఇవ్వటానికి ఈ మాన్యువల్ మార్గదర్శకంగా నిలుస్తుంది. – ప్రొఫెసర్ రమేశ్ చంద్, వ్యవసాయ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సీనియర్ సభ్యులు -
ఆమె జీవితం..ఆమె ఇష్టం
మీరట్లో ఒక రిటైర్డ్ జడ్జి విడాకులు పొందిన తన కుమార్తెను మేళతాళాలతో ఇంటికి తీసుకువచ్చి అదే తన తీర్పు అన్నాడు. ‘ఐ లవ్ మై డాటర్’ టీ షర్ట్లు ధరించి బంధువులంతా ఆమెను స్వాగతించారు. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తన కంటే 20 ఏళ్లు ఎక్కువ వయసున్న భర్తతో వేగలేకపోతున్న భార్యను విడాకులకు ముందే తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండే తీర్పును వెలువరించింది. వివాహం ఎంతో బాధ్యతతో నిర్వహించాల్సిన బంధం. పురుషుల వ్యవహారశైలిలో మార్పును ఈ రెండు తీర్పులు సూచిస్తున్నాయి.‘వివాహ బంధంలో మా అమ్మాయి ఇబ్బంది పడుతోంది. అది సరయ్యే మార్గం లేదు. ఆమెను బయటకు తేవడమే ఉత్తమం అని భావించాను. అదే నా తీర్పు’ అన్నారు మీరట్కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర కుమార్ శర్మ. శనివారం (ఏప్రిల్ 4న) ఆయన కుమార్తె ప్రణిత వశిష్టకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి ఇంటికి ఆయన తన కూతురుని బ్యాండ్ బాజాలతో, పూలహారాలతో, స్వీట్స్తో ఊరేగింపుగా తీసుకొని వచ్చాడు. బంధువులు అందుకు తోడు నిలిచారు. వీరంతా నల్లటి టీషర్టులు ధరించారు. ఆ టీషర్ట్ల పై ‘ఐ లవ్ మై డాటర్’ అనే నినాదం ఉంది. సమాజానికి విడాకులంటే చిన్న చూపు పోవడానికే ఇదంతా చేయాల్సి వచ్చిందని ఆ తండ్రి తెలియచేశాడు.2018లో వివాహంజ్ఞానేంద్ర కుమార్ శర్మ తన కుమార్తె ప్రణిత వివాహాన్ని 2018లో షాజహాన్పూర్కు చెందిన ఒక ఆర్మీ మేజర్తో జరిపించారు. అయితే పెళ్లయిన నాటి నుంచి భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడు. ఒక బిడ్డ జన్మించినా అతని వైఖరిలోమార్పు లేదు. తండ్రిగా ఇదంతా చూసి ఆమెకు ధైర్యమివ్వడానికి తోడు నిలిచాడు జ్ఞానేంద్ర కుమార్ శర్మ. ‘కుమార్తె బాధలో ఉంటే దాని నుంచి బయట పడేసే బాధ్యత తండ్రిగా నా మీద ఉంది. ఆమె గౌరవాన్ని కాపాడటం ముఖ్యం. ఏ కుమార్తే, తన తల్లిదండ్రులకు బరువు కాదు’ అన్నాడాయన. ప్రణిత పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక సంస్థలో ఫైనాన్షియల్ డైరెక్టర్గా పని చేస్తోంది. ‘మేము భరణం ఆశించలేదు. మాకు వద్దు కూడా’ అన్నారు ఆ తండ్రీ కూతుళ్లు. ‘ఇన్నాళ్లు అత్తగారింటిలో నేను మానసికంగా బలహీనపడుతూ వచ్చాను. దీనికి ముగింపు పలకాలనుకున్నాను. నేను చెప్పేది ఒకటే.... కష్టాలను సహిస్తూ కూచోవద్దు. పరిష్కారం వెతకండి’ అంది ప్రణిత. కళ్లకు కనపడుతున్న ఇలాంటి తీర్పులను చూసి వివాహ వ్యవస్థ లోటుపాట్లను తల్లిదండ్రులు, భార్యాభర్తలు మరింతా మెరుగ్గా సరి చేసుకోవాలి. ఎవరి బాధ్యతలు, హక్కులు వారు తెలుసుకోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. నచ్చిన వ్యక్తితో ఉండొచ్చుమధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియెర్ బెంచ్ ఏప్రిల్ 2న ఇచ్చిన మరో తీర్పు కూడా స్త్రీ నిర్ణయానికి వత్తాసు పలికింది. 40 ఏళ్ల వయసు కలిగిన భర్త తన భార్య కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా అతని 19 ఏళ్ల భార్య కోర్టు ముందు ప్రత్యక్షమైంది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తన సమ్మతం ప్రకారమే మరో వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయానని ఆమె కోర్టుకు తెలిపింది. కోర్టులో భర్త, అత్తామామలు, తల్లిదండ్రుల ఎదుట తన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించింది. దాని ప్రకారం 19 ఏళ్ల వయసున్న తనకు రెట్టింపు వయసున్న భర్తతో జీవించాలని లేదని, ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా భర్త వినక బాధిస్తున్నాడనీ, ఇంటి నుంచి పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు బలవంతంగా మళ్లీ అతని వద్దకే పంపుతున్నారనీ, ఈ నేపథ్యంలో తనకు నచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్లిపోవాలన్నది ఆమె అభ్యర్థన. ఈ వేడుకోలు విన్న కోర్టు ఇప్పటి వివాహంలో ఇంకా విడాకులు జరక్కపోయినా ఆమెను తనకు నచ్చిన వ్యక్తితో ఉండవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. అంతే కాదు ఆమెకు నచ్చిన కుర్రాడిని పిలిచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంది. విడాకులయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని, అంతవరకుగాని ఆ తర్వాత గాని ఆమెను ఏ విధంగానూ బాధించనని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కోర్టు ఆరునెలల పాటు ‘శౌర్య దీదీ’ పరిశీలనలో ఉండాలని ఆమెను ఆదేశించింది. కోర్టు నియమించిన మహిళా అడ్వకేట్ ఆమెతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ ఆరు నెలల పాటు ఆమె జీవితాన్ని పరిశీలిస్తూ ఏదైనా సహాయం కావాలంటే చట్టపరంగా తక్షణం అందిస్తారు. ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ‘శౌర్య దీదీ’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ. -
మన అమెరికన్
స్టూడెంట్ లీడర్గా జాత్యహంకారంపై పోరాడిన రిని సంపత్కు సమస్యల మూలాలు తెలుసు. ఆ సమస్యలపై అలుపెరగని పోరాటం తెలుసు. ‘నేను వలస ప్రజల బిడ్డను’ అని గర్వంగా చెప్పుకునే రినికి ఆత్మగౌరవ నినాదం తెలుసు. తమిళనాడులోని తేనిలో జన్మించిన 31 ఏళ్ల రిని సంపత్, వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా నిలిచారు.ఏడు సంవత్సరాల వయసులో రిని సంపత్ తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. ‘యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యుఎస్సి)లో చదువుకున్న రిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. యుఎస్సీ అధ్యక్షురాలిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. వారి హక్కుల కోసం నినదించారు. జాత్యహంకారాన్ని, వేధింపులను వ్యతిరేకించారు.వారే నిజమైన అర్హులుడెమొక్రటిక్ పార్టీకి చెందిన రిని సంపత్ ప్రభుత్వ కాంట్రాక్టర్. ప్రాథమిక అవసరాలు తీర్చండి’ ‘ఒక కొత్త డీసీ’ నినాదాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ‘నగరవాసులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం, వినాశకరమైన మురుగునీరు పొంగి పొర్లడాన్ని ఆపడం, గుంతలను పూడ్చడం, ధరలను తగ్గించడం అనేవి నా ప్రాధాన్యత అంశాలు. వాషింగ్టన్ డీసీని అందరికీ ఉపయోగపడేలా చేస్తాను. తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారే మేయర్ పదవికి అర్హులు’ అని తన ప్రచార వెబ్సైట్లో పేర్కొన్నారు రిని. వాషింగ్టన్ డీసీని ప్రధానంగా డెమొక్రాట్లు పాలిస్తున్నారు. 1975లో మేయర్ పదవికి ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి రిపబ్లికన్ మేయర్గా ఎవరూ ఎంపిక కాలేదు.ఇదే సరిౖయెన సమయంతాను రాజకీయనాయకురాలు కాదని నొక్కి చెబుతుంటారు రిని. ‘నేను సంప్రదాయ రాజకీయ నాయకురాలిని కాదు. నేను ఒక ఫెడరల్ కాంట్రాక్టర్ని. నా వృత్తిజీవితమంతా ప్రభుత్వ కార్యక్రమాలలో, పౌర సేవలను మెరుగుపర్చడంలో గడిపాను.మనకు ఒక కొత్త వ్యక్తి కావాలినగరానికి సేవలను అందించడంపై అవిశ్రాంతంగా దృష్టి సారించే వ్యక్తికి ఇది సరిౖయెన సమయం. అందుకే నేను మేయర్ రేస్లో ఉన్నాను. మనం కలిసి పనిచేసి, మెరుగైన డీసీని నిర్మించగలమని నమ్ముతున్నాను’ అని ప్రజలను ఉద్దేశించి అంటున్నారు రిని.విజయానికి స్పష్టమైన మార్గంఫిబ్రవరి ఆరంభంలో వచ్చిన మంచుతుఫాన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు. వికలాంగులు ఎక్కడో ఒకచోట చిక్కుకుపోయారు. నిత్యావసర సేవలు అందలేదు. ఉద్యోగులు రకరకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. తన ప్రచారయాత్రలో ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు రిని.‘విజయం సాధించడానికి మనకు స్పష్టమైన మార్గం ఉంది. కేవలం నాలుగు వారాల్లోనే డీసీ చరిత్రలో మేయర్ బ్యాలెట్కు స్థానం సంపాదించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలిచాము. తక్కువ వనరులతో, ప్రజల మద్దతుతో సాగిన ప్రచారం ఇంతటి విజయాన్ని సాధించింది. నగరవ్యాప్తంగా ప్రతి ఓటరును చేరుకోవడానికి అవసరమైన వనరులు మనకు సమకూరి ఉంటే ఇంకా పెద్ద విజయం సాధించవచ్చు’ అంటున్నారు రిని సంపత్. చారిత్రక మైలురాయిమేయర్ ప్రైమరీ ఎన్నిక జూన్ 16న జరగనుండగా, సాధారణ ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. అమెరికా రాజకీయాలలో ప్రాతినిధ్యానికి సంబంధించి రిని ప్రచారం చారిత్రక మైలురాయిగా నిలవనుంది. ఉన్నత స్థాయికి ఎంపికైన పదవులలో భారతీయ అమెరికన్లకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. వారి రాజకీయ భాగస్వామ్యం పెరుగుతున్న తరుణంలో మేయర్ బరిలో రిని సంపత్ నిలవడం విశేషంగా మారింది. మేయర్గా ఎన్నికైతే ఆమె డీసీ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్ అవుతారు. చిన్న వయసులోనే అమెరికాకు వెళ్లినా తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు రిని. ‘మా తాతగారు ఎప్పుడూ నాకు చోదకశక్తిగా, స్ఫూర్తితేజంగా ఉన్నారు’ అంటారు.ఆ శక్తి ఏమిటో నాకు తెలుసువాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి బ్యాలెట్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది. అమెరికా కలను సాకారం చేసుకోవాలనే తపనతో తల్లిదండ్రులతో కలిసి ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చాను. వలసదారుల కుమార్తెగా, కఠోర శ్రమ, పట్టుదలల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఆ విలువలని నగర పాలక సంస్థ(సిటీ హాల్)లోకి తీసుకు రావడానికి, వాషింగ్టన్ వాసులందరికీ సత్ఫలితాలు అందించడానికి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. డీసీ మేయర్ పదవికి నన్ను బ్యాలెట్లో చేర్చడానికి నా పిటిషన్పై 4,500 మందికి పైగా సంతకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు దక్షిణాసియా ప్రజల సహకారం ఎంతో ఉంది. కానీ ప్రభుత్వంలో వారికి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండటం విచారకరం.– రిని సంపత్, మేయర్ అభ్యర్థి, వాషింగ్టన్ డీసీ -
అద్వితీయ అనువాదానికి స్వాగతం!
మలయాళ సాహిత్యంతో, సినిమాలతో మంచి పరిచయం ఉన్న చదువరులకు ఓ శుభవార్త. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఓ సుప్రసిద్ధ మలయాళ రచన ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 'పద్మభూషణ్' ఎంటి వాసుదేవన్ నాయర్ నాలుగు దశాబ్దాల క్రితం రచించిన మలయాళ నవల 'రెండామూజం'(రెండోసారి - 1984) నవల.. సాహితీ లోకంలో సుప్రసిద్ధం. పురాణపాత్ర భీమసేనుడి దృక్కోణం నుంచి మహాభారత గాథని వినూత్నంగా పాఠకలోకం ముందు ఉంచిన ఈ ఐతిహాసిక నవల కొన్ని దశాబ్దాలుగా మలయాళంలో బెస్ట్ సెల్లర్. పదే పదే పునర్ముద్రణలు పొందడమే కాకుండా ఇప్పటికే ఇంగ్లీషు (సెకండ్ టర్న్, భీమ – లోన్ వారియర్), తమిళం (ఇరండామ్ ఇడమ్), కన్నడం (భీమాయణ)తో సహా వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైన మోస్ట్ పాపులర్ రచన.భీమసేనుడి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ని హీరోగా తీసుకొని, ఆ నవలని వెండితెరకు ఎక్కించాలని ఇప్పటికి దశాబ్దిన్నర క్రితమే పలు ప్రయత్నాలు జరిగాయి. దర్శకులు నిర్మాతలు మారుతూ వచ్చినా దురదృష్టవశాత్తూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనేలేదు. అపరిమితమైన ఆలస్యానికి కినిసిన రచయిత ఎంటి.. చివరకు సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్ళి, నిర్మాతలు తనకిచ్చిన కోటింబాతిక రూపాయల పెద్ద అడ్వాన్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి మరీ, నవల ఆధారంగా తానే రాసిచ్చిన సినిమా స్క్రిప్ట్ని వెనక్కి తీసేసుకున్నారు. ఇది కొద్దిమందికే గుర్తున్న కథ. దాదాపు వెయ్యి కోట్ల పైగా బడ్జెట్తో, 2020 నాటికి రెండు భాగాల సినిమాగా తెలుగు సహా వివిధ భాషల్లో రావాల్సిన ఆ 'రెండామూజం' నవల ఎట్టకేలకు సినిమా కన్నా ముందుగా ఇప్పుడు 'అద్వితీయుని ఆత్మకథ' పేరిట అనువాద రచనగా తెలుగు సాహితీ లోకం ముందుకు వచ్చింది.మలయాళంలో మన 'మిథునం' దర్శకుడునిర్మాల్యం(1973)లాంటి పలు అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించి దాదాపు 60 సినిమాలకు స్క్రిప్టులు రాసిన చరిత్ర ఎంటి వాసుదేవన్ నాయర్ది. రచయిత శ్రీరమణ ప్రసిద్ధ తెలుగు కథ 'మిథునం'ని తెలుగులో కన్నా పుష్కరకాలం ముందే మలయాళంలో 'ఒరు చెరు పుంచిరి'(చిరు నగవు – 2000) పేరిట సినిమాగా రూపొందించిన దర్శకుడు. అందుకు తగ్గట్టే, ఆయన ప్రసిద్ధ మలయాళ నవల ‘రెండామూజం’ తెలుగు అనువాదం ఆవిష్కరణ సైతం సాహితీ ప్రియులైన ముగ్గురు తెలుగు సినీ ప్రముఖుల సాక్షిగా ఏప్రిల్ 5న హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ రచయిత వి.ఆర్.గణపతి తెలుగులో అనువాదం చేసిన ఈ పుస్తకాన్ని నటుడు,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. మంచి పుస్తకాలకు వీలైనంత ప్రచారం కల్పించి, జనంలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఎం.టి. వాసుదేవన్ నాయర్ రచన తెలుగులోకి రావడం ఎంతైనా ఆనందదాయకమని తనికెళ్ళ అన్నారు. ఇటీవల తాను ప్రత్యేకించి ‘హంసవింశతి’ కావ్యాన్ని తెలుగులో ప్రచురింపజేసి, ప్రచారం కల్పించడంతో లభిస్తున్న స్పందన గురించి ప్రస్తావించారు.రచయిత ముళ్ళపూడి వెంకట రమణ గారి సతీమణి – స్వయానా రచయిత్రి అయిన ముళ్ళపూడి శ్రీదేవి మాట్లాడుతూ, 'ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిదేదీ ప్రపంచంలో లేదు' అంటూ వ్యాస భారతంలోని విశేషాలను ప్రస్తావించారు. భీమసేనుడు చెప్పినట్టుగా సాగే ఈ నవల రచయిత బ్నిమ్ మాటల్లో చెప్పాలంటే, “భీమసేనుడి సెల్ఫీ భారతం” అంటూ చమత్కరించారు.మన తెలియని మన భీముడి కోణంలో భారతంరచయిత్రి – కాలమిస్ట్ ప్రొఫెసర్ సి. మృణాళిని ప్రసంగిస్తూ.. దాదాపు పదేళ్ళ పైగా ఎం.టి.తో వ్యక్తిగతంగా తనకున్న సాహితీ అనుబంధాన్నీ, ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన జ్ఞాపకాలనూ పంచుకున్నారు. తెలుగు సాహిత్యలోకానికి భిన్నంగా... బిరుదులతో కాక, “మన ఎం.టి.” అంటూ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించే మలయాళీ సాహిత్య సంస్కృతిని ఆమె ప్రస్తావించారు. అలాగే, ఎం.టి. వాసుదేవన్ నాయర్ కేరళలో స్వస్థలమైన తిరూర్లో ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరుపుతూ వచ్చిన ‘తుంజన్ సాహితీ ఉత్సవం’ తాలూకు గొప్పతనాన్ని వివరించారు. రామాయణ, భారత, భాగవతాలను మలయాళంలో అందించిన ‘మలయాళ ఆది కవి’, ‘ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడు’ అయిన (తుంజత్ రామానుజన్) ఎళుత్తచ్చన్ పేరిట ఆ ఉత్సవాన్ని ఏటా ఎం.టి. అద్భుతంగా జరిపే తీరును మృణాళిని గుర్తు చేసుకున్నారు. “యాదృచ్ఛికంగా ఎం.టి.కీ, నాకూ మధ్య జరిగిన ఆఖరి సంభాషణ కూడా ఈ ‘రెండామూజం’ నవల గురించే! 2022లో క్యాలికట్లో మహాభారతంపై వివిధ భాషలతో వారితో జరిగిన జాతీయ సాహిత్య సదస్సులో పాల్గొన్నప్పుడు ఈ ‘రెండామూజం’ నవల తెలుగు అనువాదం ప్రస్తావన మా మధ్య వచ్చింది. ఈ నవల అప్పటికే ఇంగ్లీషులో అనువాదమైంది. అయితే, ఇంగ్లీషు నుంచి కాక, మలయాళం నుంచే ఆ తెలుగు అనువాదం సాగాలని ఆయన ప్రత్యేకంగా కోరుకున్నారు” అని మృణాళిని తెలిపారు.‘అద్వితీయుని ఆత్మకథ’ పుస్తకాన్ని కూలంకషంగా సమీక్షించిన మృణాళిని, “నటనలో దిలీప్ కుమార్ లాగా, రచనలో ఎం.టి. వాసుదేవన్ నాయర్ అలా! నాటకీయతకు అవకాశం ఉన్నా, ఆ జోలికి పోకుండా, అండర్ ప్లే చేస్తారు. భారతాన్ని ఎం.టి. చూసిన దృష్టి వేరు. గతంలో కొందరు రచయితలు కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ లాంటి పాత్రలను ప్రధానంగా ఎంచుకొని తమదైన పద్ధతిలో భారత కథ రాశారు. కానీ, నూర్గురు కౌరవులను సంహరించడంతో సహా భారతంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ తన మనసులోని మాటలను ఎన్నడూ బయటకు చెప్పుకోని భీమసేనుడి దృష్టి నుంచి ఈ నవల సాగడం విశేషం. పాండవుల్లో ద్వితీయుడైనా, అందరికీ తెలిసిన భుజ పరాక్రమంతో పాటు మానసిక చిత్తవృత్తిలోనూ అద్వితీయుడిగా అనిపించే భీముడి పాత్ర తాలూకు రెండో కోణాన్ని సమాంతరంగా, అద్భుతంగా చెబుతుందీ నవల. ఎంతో పరిశోధించి, వ్యాసభారతంలో లేని అంశాలను కొన్నింటిని జొప్పించడంతో పాటు, వ్యాసుడు నిశ్శబ్దంగా ఉన్నచోట ఆ ఖాళీలను పూరిస్తూ ఎం.టి. ఈ అసాధారణ నవలను మలయాళంలో రచించారు. భారత ఇతిహాస కథలోని మాయలు, మహిమలను పరిహరించి, చాలా సహజంగా, హేతుబద్ధంగా, భీముని సున్నితత్వం, మానసిక చైతన్యం, స్త్రీల మానసిక స్థితిని అర్థం చేసుకొనే తత్వాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తూ ఈ నవల సాగడం గమనార్హం” అంటూ అనేక ఉదాహరణలతో లోతుగా విశ్లేషించారు.అందుకే... ఆ సాహిత్యం, సినిమా అంత విలక్షణం!చలం ‘దోషగుణం’ కథ ఆధారంగా ‘గ్రహణం’ మొదలు పలు ఆంగ్ల రచనల ఆధారంగా ‘అష్టాచెమ్మా’, ‘సారంగపాణి జాతకం’ దాకా పలు చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. “ఇవాళ చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడా ప్రమాదకరంగా చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రలకు సమకాలీనత ముఖ్యం. ఆ దృక్కోణంతో పాత్రలనూ, ఇతిహాసాలనూ ఆవిష్కరించగల రచయితల అవసరం ఉందిప్పుడు. మలయాళ సాహిత్యం, సినిమాల్లో ఆ పనే చేస్తుంటారు. అందుకే అవి విలక్షణంగా నిలుస్తున్నాయి” అని అభిప్రాయపడ్డారు.సినీ నటుడు – రచయిత – దర్శకుడు అవసరాల శ్రీనివాస్ సభలో మాట్లాడుతూ, సాహిత్యంపై తనకున్న అక్కరను పంచుకున్నారు. “తెలుగు సాహిత్యం కోసం బాధపడుతున్నవారితో నేనూ గొంతు కలుపుతున్నా. బహుశా, అందుకే ఇటీవల కాలంలో వివిధ సాహిత్య సమావేశాల్లో నాకూ స్థానమిస్తున్నారు. కోవిడ్ అనంతర కాలంలో చదవడం కొంత తగ్గింది. నేను చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేయడమే కాక, తెలుగు సాహిత్య ప్రచారం కోసం నా వంతు కృషి చేస్తా” అని ఆయన హామీ ఇచ్చారు.పలుకు తేనెల తెలుగు... ‘పాలక్కాడ్’ గణపతి!మలయాళ మాతృక ‘రెండామూజం’ తెలుగు అనువాద రచయిత వి.ఆర్. గణపతి ప్రత్యేకంగా ఈ సభ కోసం కేరళ సరిహద్దు నుంచి హైదరాబాద్కు రావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ వాస్తవ్యులు. తమిళ, మలయాళాల నుంచి తెలుగులోకి పలు అనువాదాలు చేస్తున్న ఆయన ఇప్పటికే ప్రముఖ మలయాళ రచయిత్రి పి. వత్సల రచన ‘ఆగ్నేయం’తో పాటు మరో ప్రసిద్ధ మలయాళ రచయిత ముకుందన్ రచన ‘దైవత్తిండ వికృతిగళ్’ను ‘వైకుంఠపాళి’గా తెలుగులోకి చేశారు. ఇంగ్లీషు నుంచి కాక, ఎం.టి. రచించిన మలయాళ మాతృకనే ఆధారంగా చేసుకొని, సరళమైన తెలుగులో, హాయిగా చదివించేలా ఆయన అనువాదాలు చేయడం విశేషం. మాతృకలోని ఆచారాలు, సంప్రదాయాలు, తిట్లు, సామెతలను అనువదించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావిస్తూనే, ఆయన ఈ తాజా అనువాద ప్రస్థానం విశేషాలను పంచుకున్నారు.“నేను పెరిగింది, చదివింది కరీంనగర్లోనే. తెలుగునాట ఉద్యోగం కూడా చేశాను. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగిగా ఎందరో మిత్రులను సంపాదించుకున్నాను. నిజానికి, ఎం.టి. తన రచనల అనువాదానికి అంత సులభంగా అనుమతినివ్వరు. సినిమా స్క్రిప్టుల కోసం తన వద్దకు వచ్చేవారిని సైతం ఆయన అనేక నెలలు తిప్పించుకొని, వారి శ్రద్ధను పరీక్షించాకనే ఒప్పుకొనేవారు. అలాంటిది... ఆయన సుప్రసిద్ధ రచన ‘రెండామూజం’ తెలుగులోకి చేయాలని ‘కథాప్రపంచం’ కిరణ్ నన్ను కోరినప్పుడు, ‘ఎం.టి. అనుమతి ఇచ్చినప్పుడు కదా’ అని తేలికగా తీసుకున్నా. కానీ, కిరణ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన అనుమతి సాధించి, నాతోనే అనువాదం చేయించారు. నిజానికి, 2024లోనే ఈ అనువాదం పూర్తయింది. ఎం.టి.కి చూపించి, ఆయన ఆశీర్వాదం తీసుకుందామనుకొనే లోగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. మా ఆశ తీరకుండానే ఆయన కన్నుమూయడం మాకు తీరని లోటు” అంటూ ఎం.టి.కి గణపతి నివాళులర్పించారు.మరిన్ని అనువాదాల విందుకు మార్గం!నిజానికి, మలయాళంలో ‘రెండామ్ ఊజం’ (సంధి ప్రక్రియ వల్ల... ‘రెండామూజం’) అంటే... ‘రెండో సారి’ అని అర్థం. అయితే, ఆ పేరును తెలుగు పాఠకలోకానికి సన్నిహితమయ్యేలా అర్థవంతంగా ‘అద్వితీయుని ఆత్మకథ’గా సమర్పించడం అనువాదకుడి శ్రద్ధాభక్తులకు నిదర్శనం. మంచి అభిరుచితో మేలైన పుస్తకాలు ప్రచురించడంలో ముందుంటున్న తిరుపతికి చెందిన ‘కథా ప్రపంచం’ ప్రచురణల అధినేత కిరణ్ ఈ తెలుగు అనువాదాన్ని అందించారు. ఎంతో కాలం, ధనం, శ్రమ వెచ్చించి, పట్టుదలగా ఆయన ఈ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందించడాన్ని తనికెళ్ళ, ఇంద్రగంటి, అవసరాల సహా అతిథులందరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.సీనియర్ జర్నలిస్ట్ రాజేశ్వరీ కల్యాణం సభా నిర్వహణ సాగించిన ఈ సమావేశంలో రచయిత వాసిరెడ్డి నవీన్, బ్నిమ్, సినీ సమాచార సేకర్త పంచకర్ల రమేశ్, సీనియర్ జర్నలిస్టు పద్మశ్రీ, ఆకాశవాణి వార్తావిభాగం జ్యోత్స్న సహా పలువురు సినీ, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. అనువాద రచయితకు పూర్వాశ్రమ మిత్రులు – సహచరులైన ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు పెద్దయెత్తున వచ్చి, ఆయనను అభినందించారు. తిరుపతి ‘కథా ప్రపంచం’ కిరణ్ అతిథులను సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయతను పంచారు. ఎం.టి. వాసుదేవన్ నాయర్ బృహత్తర కృషిగా పేర్కొనే ‘కాలం’ (1969) సహా మరిన్ని నవలలు, కథలను తెలుగులోకి తెచ్చేందుకు ఈ ‘అద్వితీయుని ఆత్మకథ’ ఆవిష్కరణ కొత్త దారులు వేసినట్టే కనిపిస్తోంది. అదే జరిగితే... తెలుగు పాఠక లోకానికి అంతకన్నా అక్షరాల విందు మరేముంటుంది!-రెంటాల జయదేవ -
ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!
ఫస్ట్ టైమ్ యూరోప్కి వెళ్లాలని ప్లాన్ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే సిటీ వైబ్ చాలా కామ్గా, రిలాక్స్గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్ లేకుండా స్మూత్గా అడ్జస్ట్ అయ్యే ప్లేస్లా ఫీలవుతారు. సిటీలో వాక్ చేస్తుంటే పురాతన భవనాలు, రంగురంగుల బాల్కనీలు, కోబుల్ స్టోన్ వీధులు కలిసి ఒక సాఫ్ట్ విజువల్ క్రియేట్ చేస్తాయి. మార్నింగ్ లైట్లో స్ట్రీట్స్ స్లోగా వేక్ అవ్వడం చూస్తే, ఈ ప్లేస్తో కనెక్షన్ నాచురల్గా బిల్డ్ అవుతుంది.సందర్శనీయ స్థలాలు పాత టిబిలిసిలో చిన్న చిన్న ఇరుకైన సందుల్లో నడుస్తూ ఉంటే గతంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. నరికలా కోటకి వెళ్లినప్పుడు సిటీ వ్యూ వైడ్గా కనిపిస్తుంది. బ్రిడ్జ్ ఆఫ్ పీస్ రాత్రి సమయంలో ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. అబానోతుబాని ప్రాంతంలో ట్రెడిషనల్ టిబిలిసి సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి.ఏం తినాలి?ఇక్కడ ఫుడ్ సింపుల్గా కనిపించినా చాలా శాటిస్ఫయింగ్గా ఉంటుంది. ఖాచాపూరిలో కరిగిన చీజ్, సాఫ్ట్ బ్రెడ్తో కలిసి కంఫర్ట్ ఫుడ్లా ఉంటుంది. అలాగే ఖింకలి అనే డంప్లింగ్స్ చాలా జ్యూసీగా ఉంటాయి. వీటిని తినే విధానం కూడా ఒక ప్రత్యేక అనుభవంగా మిగులుతుంది.ఎప్పుడు వెళ్లాలి?స్ప్రింగ్ (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) సమయంలో వాతావరణం చాలా ఫ్రెష్ ఫీల్ను ఇస్తుంది. ఆటమ్లో సిటీ రంగులు చాలా సాఫ్ట్గా, అందంగా మారుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కొన్ని సీజనల్గా అందుబాటులో ఉంటాయి.లేదంటే దుబాయ్ లేదా దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ సులభంగా లభిస్తాయి.ప్రయాణ సమయం సుమారు 7 నుంచి 10 గంటలు.టిబిలిసిలో గడిపే టైమ్ ఫాస్ట్గా వెళ్లి΄ోతుందిం కానీ మెమోరీస్ మాత్రం స్లోగా మనసులో నిలిచి΄ోతాయి. సింపుల్ ట్రిప్ప్లాన్ చేసినా, ఈ నగరం అనుభవం మాత్రం నేచురల్గా స్పెషల్గా మిగిలి΄ోతుంది.హిమాలయాల్లో రహస్య జీవనంహిమాలయ పర్వతాల మధ్య ఒక గుహలో మలచిన పుగ్తాల్ మొనాస్టరీని చూస్తే ఇలాంటి నిర్మాణం సాధ్యమేనా అనిపిస్తుంది. ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి చేరుకోవడం అనేది ఒక ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైన అనుభవం కూడా.కాలం కొత్త రంగులుఈ మోనాస్టరీలో బౌద్ధ సన్యాసుల దినచర్య చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఉదయం ప్రార్థనల శబ్దం పర్వతాల మధ్య ఒక ఎకోలా మార్మోగుతుంది. చుట్టూ గోధుమ రంగులో మెరిసే పర్వతాలు, కింద నిశ్శబ్దంగా సాగే నది... ఈ కాంబినేషన్లో కాసేపు గడిపినా.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ కాలం ఆగిపోయినట్టు జీవితం కొత్త రంగులను అద్దుకున్నట్టుగా అనిపిస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా సాగుతున్న జీవితానికి ఈ ప్రదేశం ఒక స్పీడ్ బ్రేకర్లా పని చేస్తుంది. ప్రకృతితో సహజీవనంఎలక్ట్రిక్ లైట్స్ కన్నా సహజమైన సూర్యోదయానికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గాలి శబ్దం, నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి ఒక నేచురల్ రిథమ్ను క్రియేట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వ్యూస్ను ఆస్వాదిస్తూ, నిశ్శబ్దంలో ప్రకృతి పలికే మాటలను వినడానికి ప్రయత్నిస్తారు.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్ లేదా ట్రెయిన్లో వెళ్లాలి. అక్కడి నుంచి లేహ్కి ఫ్లైట్ తీసుకుని, లేహ్ నుంచి జాన్సా్కర్ ప్రాంతానికి రోడ్డు ప్రయాణం చేయాలి. చివరిగా ఒక చిన్న ట్రెక్ చేసి ఫుగ్తాల్ మొనాస్టరీకి చేరుకోవచ్చు. అయితే ఈ ప్రయాణాన్ని ఒక చెక్లిస్టుగా కాకుండా మనశ్శాంతికి మార్గంగా భావించి ΄్లాన్ చేసుకోవాలి.ఈ ప్రాంతంలో ప్రతి అడుగు ఒక డిస్కవరీలా అనిపిస్తుంది. ఈ రహస్య నిలయం ఈ బౌద్ధ ఆలయం మనసులో చాలా లోతుగా నిలిచి΄ోతుంది. మేఘాలలో దాగిన హరిత స్వర్గం(ఆగుంబే)ప్రకృతిలో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్ టైమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పీరియెన్స్ అవ్వాలి అనుకునే వారి కోసం ఇది ఒక సాఫ్ట్ ఎంట్రీ ఫీల్ ఇస్తుంది. ఈ ప్రదేశం పచ్చదనానికి కేరాఫ్ అడ్రెస్గా అనిపిస్తుంది. రోడ్ జర్నీలోనే మార్పు మొదలవుతుంది. సిటీ సౌండ్స్ తగ్గి, చుట్టూ లష్ ఫారెస్ట్, మిస్ట్తో కప్పబడిన కొండలు కనిపిస్తాయి. ఆగుంబేలో వాక్ చేస్తుంటే ప్రతి కార్నర్లో తడిసిన ఆకుల సువాసన, తాజా గాలి టచ్ క్లియర్గా తెలుస్తుంది.సందర్శనీయ స్థలాలు సన్సెట్ పాయింట్ దగ్గర మెల్లిగా ఆకాశం రంగులు మారడం చూస్తే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ వద్ద చిక్కటి అడవులను పర్యాటకులు బాగా ఇష్టపడుతుంటారు. బర్కానా ఫాల్స్ చుట్టుపక్కల నేచర్ చాలా రా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న ఫారెస్ట్ ట్రైల్స్లో నడిస్తే సైలెన్స్ కూడా ఒక ఎక్స్పీరియెన్స్లా అనిపిస్తుంది.ట్రై చేయాల్సిన ఫుడ్ఇక్కడ ఫుడ్ చాలా సింపుల్గా ఉంటుంది. లోకల్ స్టైల్ మీల్స్ ఫ్రెష్గా సర్వ్ చేస్తారు. హాట్ రైస్, లైట్ కర్రీలు ఇంటి భోజనం ఫీల్ ఇస్తాయి. వర్షాకాలంలో చాయ్తో స్నాక్స్ ఎంజాయ్ చేయడం ఒక మెమరీలా ఉంటుంది.ఎప్పుడు వెళ్లాలి?జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల్లో ఆగుంబే ఒక ఆకు పచ్చ ప్రపంచంలా మారిపోతుంది. చలికాలంలో కూడా ఇక్కడి అందాలు అలరిస్తాయి.ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుండి మంగళూరు లేదా ఉడుపి వరకు ఫ్లైట్ లేదా ట్రైన్లో చేరి, అక్కడి నుండి రోడ్ జర్నీ ద్వారా ఆగుంబే చేరుకోవచ్చు. మొత్తం ట్రావెల్ టైమ్ సుమారు 10–12 గంటలు వరకు ఉంటుంది. ఆగుంబేలో లైఫ్ స్లోగా, నేచర్తో సింక్ అయిన ఫ్లోగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఈ గ్రీనరీ జర్నీలో మీరు ఒక రీల్లో ఉన్నట్టే రియల్ అనుభూతిని పొందుతారు. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు(చదవండి: తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!) -
తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!
మన దేశంలో తయారైన మొట్టమొదటి కారు ఎలా ఉంది.. అసలు మనిషి మొదటగా ఉపయోగించిన రవాణాసాధనం ఎలా ఉండేది.. ఎడ్ల బండి నుంచి ఏరోప్లేన్ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణాసాధనాలన్నింటినీ ఒకే చోట చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేయాలని.. ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వేసవిలో ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ కు వెళ్లడం ఓ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.ఢిల్లీ నుంచి సోహ్నా–గుర్గావ్ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా దాదాపు 63 కిలోమీటరు ప్రయాణిస్తే .... హర్యానా రాష్ట్రం, బిలాస్పూర్ చౌక్, టారు రోడ్లో ఉంది ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల ఇదే!దాదాపు 90 వేల చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియమ్, షాప్లు, రెస్టారెంట్ వసతులు కూడా ఉన్నాయి. రూపకర్త ఎవరు అంటే.. ఢిల్లీ నివాసి తరుణ్ థక్కర్కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. ఆసక్తి, ఉత్సాహం, శోధన నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్కిర్ విషయంలోనూ జరిగింది. గ్రామోఫోన్ల నుంచి టేబుల్ ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలు తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా 2013లో ఈ చారిత్రాత్మక వాహన శాల ఏర్పాటైంది. సినిమా సన్నివేశాలకు వీలుగా!భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో పాత కార్లనూ వీక్షించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్ పంపు, బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్కూడా ఏర్పాటు చేశారు.బస్సుల పాత్ర ఎంతో..మానవ ప్రగతికి బస్సు చక్రం ఎలా ఉపయోగపడిందో తెలియజెప్పవచ్చు. పెద్ద పెద్ద వాహనపరికరాలు గల బస్ డిపోతో పాటు, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... అందుకు సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీని సందర్శించవచ్చు. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. మేఘాలలో తేలిపోమ్మన్నది..సైకిల్, స్కూటర్, మోటార్సైకిల్, మోపెడ్స్... ఒకనాడు సింగిల్గానూ, కపుల్గానూ ప్రయాణించిన ద్విచక్రవాహనాలు ఈ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. వీటితో పాటు చిన్నా, పెద్ద వాహనాలను పోలిన బొమ్మలూ ఇక్కడ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ ఈ మ్యూజియమ్లో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వీటిని చూస్తుంటే పెద్దవాళ్లు తమ చిన్ననాటి రోజుల జ్ఞాపకాల్లో వెళ్లకుండా ఉండలేరు.ఆకాశయానంఎప్పటి నుంచి విమానమార్గంలో మన దేశస్తులు ప్రయాణించారు.. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందింది... దశలవారీగా తెలియజెప్పే విశేషాలన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. మన దేశ విమాయానపరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఒక చక్కని వేదిక. స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న విమానాన్నీ ఇక్కడ చూడవచ్చు.రైలు.. టికెట్లు..రైలు రవాణా మన దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది, నాటి నుంచి నేటి వరకు రైలు మార్గంలో, రైలు తయారీలో వచ్చిన మార్పులు. మొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటయ్యింది, ఎంత సమయం పట్టింది? వివరాలతోపాటు 1930ల నాటి రైల్వే స్టేషన్ ΄ఫ్లాట్ఫామ్ నమూనా, సెలూన్ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి రైలుబండి ఛాయా చిత్రాలు, ట్రెయిన్ టికెట్లు, రైల్వే సిగ్నల్స్, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు.నీటిపైన తేలియాడే...మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఒకే దగ్గర తెలుసుకునే మహత్తర అవకాశంగా ఈ మ్యూజియమ్ను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమం ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ మన కళ్లకు కడుతుంది.ఎక్కడ ఉందంటే...బిలాస్పూర్ – తౌరు రోడ్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ 132 ఆఫ్ ఎన్.హెచ్ 8, బిలాస్పూర్, చౌక్, తౌరు, హర్యానాసందర్శన సమయంఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు (సోమవారం సెలవు) టికెట్ ధర: పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.250, ఫొటోగ్రాఫ్స్ తీసుకునే సౌలభ్యం ఉంది. (చదవండి: 'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!) -
'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!
మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య మైత్రి బంధం చూడగానే షోలో మూవీలోని స్నేహితుల్లా కనిపిస్తారు. అచ్చం అందులో జై, వీరుల (ధర్మేంద్ర, అమితా బచ్చన్) మధ్య సాగే పాటలోని సీన్ గుర్తుకొస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ఒక డిపొ నుంచి షేర్ చేసి ఒక వీడియో అందరి మనసులను హత్తుకుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర రవాణా డ్రైవర్కు భావోద్వేగభరితమైన వీడ్కోలు చిత్రీకరించంది. ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య చోటు చేసుకున్న దృశ్యం. అచ్చం యువకుల మాదిరిగా ఆ సహోద్యోగి పదవీవిరమణ చేస్తున్న తన స్నేహితుడైన బస్సు డ్రైవర్ని భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యం అందర్నీ కదిలిస్తుంది. వృద్ధాప్యం మనసుకే గానీ..ఆప్యాయతను వ్యక్తం చేయడానికి కాదు అన్నట్లుగా తన సహోద్యోగిని ఎత్తుకుని వీడ్కోలు పలుకుతున్న కమనీయ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. అది పనిలో తన చివరి రోజు కావడంతో, ఆ వీడ్కోలు అతను అక్కడ నిర్మించుకున్న జీవితానికి ఒక వేడుకగా మారింది. చూడటానికి చిన్న పనే అయినే ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహబంధాన్ని, గౌరవాన్ని పంచుకున్న జ్ఞాపకాలను ప్రతిబింబించింది. అది సరిగ్గా షోలో మూవీలోని జై వీరుల ఐకానిక్ స్నేహం గుర్తు చేసింది. ముఖ్యంగా దోస్తీ పాటలో ధర్మేంద్ర అమితా బచ్చన్ భుజాలపై కూర్చునే ప్రసిద్ధ సన్నివేశం గుర్తుకు వస్తుంది. రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ, ఏర్పడిన స్నేహాలు, జ్ఞాపకాలు జీవితాంతం నిలిచిపోతాయని ఈ సన్నివేశం చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by _VED_46_..!!❤️ (@__ved_46__) (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత
చాలామంది వయసు పెరుగుతుంటే భయపడతారు, సౌందర్యం తగ్గుతుందని బాధపడతారు. కానీ సైకాలజీ ప్రకారం, వయసు పెరగడం అంటే కేవలం చర్మం ముడతలు పడటం కాదు, అది మీ'పరిపక్వత' (Maturity)శిఖరాగ్రానికి చేరడం.వయసుతో పాటు మీ వ్యక్తిత్వం ఎలా ఒక 'వటవృక్షం'లా మారాలో ఈ ఆర్టికల్లో చూద్దాం.వయసు పెరగడం అనేది ఒక 'బయోలాజికల్ ప్రాసెస్' అయితే, పరిపక్వత చెందడం అనేది ఒక 'సైకలాజికల్ ఛాయిస్'. కొంతమంది 60 ఏళ్లొచ్చినా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు, మరికొంతమంది 30 ఏళ్లకే ఎంతో నిలకడగా ఉంటారు. "Aging Gracefully" అంటే వయసును దాచడం కాదు, ప్రతి ఏటా మీ అనుభవంతో మీ వ్యక్తిత్వానికి కొత్త గౌరవాన్ని అద్దుకోవడం.ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం (Integrity vs Despair)ప్రముఖ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం, వయసు పైబడినప్పుడు మనిషి మనసులో రెండు భావాలు ఉంటాయి:Despair (నిరాశ): "నా జీవితం వృథా అయిపోయింది, నేను ఏమీ సాధించలేదు" అని బాధపడటం.Integrity (పరిపూర్ణత): "నేను నా జీవితాన్ని అర్థవంతంగా గడిపాను, నా తప్పుల నుండి నేర్చుకున్నాను" అని తృప్తి చెందడం.మీరు'Integrity'స్టేజ్ లో ఉండాలంటే, మీ గతాన్ని మీరు ప్రేమించాలి, మీ వర్తమానాన్ని గౌరవించాలి.పరిపక్వత లక్షణాలు (Signs of Maturity)వయసుతో పాటు మీ పర్సనాలిటీలో ఈ మార్పులు రావాలి:Emotional Regulation:చిన్న చిన్న విషయాలకు ఆవేశపడటం తగ్గి, నిశ్శబ్దంగా గమనించే తత్వం పెరుగుతుంది.Detachment (నిర్లిప్తత):ప్రతి విషయంలోనూ తలదూర్చకుండా, ఏది ముఖ్యం ఏది కాదు అనే విచక్షణ జ్ఞానం వస్తుంది.Forgiveness:పాత పగలను, కోపాలను మోయడం ఆపేస్తారు. క్షమించడం అనేది ఎదుటివారి కోసం కాదు, మీ ప్రశాంతత కోసం అని అర్థం చేసుకుంటారు.మోటివేషన్ మాయ vs గ్రేస్ఫుల్ ఏజింగ్"ఎప్పుడూ యంగ్ గా కనిపించు, ముసలితనాన్ని దరిచేరనివ్వకు" అనిమోటివేషన్ మార్కెటింగ్ మాయలో పడేస్తుంది. ఇది మిమ్మల్ని మీ సహజత్వం నుండి దూరం చేస్తుంది. కానీ సైకాలజీ "నీ వయసును గౌరవించు. నీ ముడతలు నువ్వు గెలిచిన యుద్ధాలకు గుర్తులు. నీ జుట్టు రంగు నీ అనుభవానికి సాక్ష్యం" అని చెప్తుంది.వయసుతో పాటు వన్నె తగ్గకుండా..Genius Matrix Hubఫిలాసఫీ ప్రకారం, గ్రేస్ఫుల్ గా ఎదిగే మార్గం ఇది:Step 1: యవ్వనం పట్ల వ్యామోహాన్ని వదిలేయండి"నేను ముసలివాడిని అయిపోతున్నాను" అనే భయాన్ని 'Break' చేయండి. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. మీ మనసు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే (Lifelong Learning), మీరు ఎప్పటికీ యంగ్ గానే ఉంటారు. మీ ఆలోచనల్లోని ముసలితనాన్ని వదిలేయండి.Step 2: Build Knowledge Sharingమీరు ఇన్నాళ్లు సంపాదించిన అనుభవాన్ని 'Build' చేయండి. దాన్ని తర్వాతి తరానికి ఎలా అందించాలో ప్లాన్ చేయండి. మీ పిల్లలకు లేదా మీ శిష్యులకు మీరు ఒక 'రోల్ మోడల్'గా నిలవాలి. మీ పరిపక్వతే మీ చుట్టూ ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వాలి.Step 3: Spiritual Maturityశరీరం బలహీనపడుతున్నా, ఆత్మ బలంగా ఉండాలి. మరణాన్ని చూసి భయపడకుండా, ఒక అద్భుతమైన లెగసీని వదిలి వెళ్తున్నాననే తృప్తితో ఉండటమే 'Beyond' స్టేజ్. మీరు లేకపోయినా మీ సంస్కారం పదికాలాల పాటు ఉండాలి.మీరు ఎలా ఎదుగుతున్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. గడిచిన పదేళ్లలో మీ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు ఏంటి? మీరు ఇంకా పాత కోపాలను మోస్తున్నారా?2. మీ కంటే చిన్నవారు మీ దగ్గరకు సలహా కోసం వస్తున్నారా?3. మీరు వయసును చూసి భయపడుతున్నారా లేక గర్వపడుతున్నారా?పాతబడే కొద్దీ విలువ పెరగాలి!పాతబడే కొద్దీ విలువ తగ్గేది వస్తువులకి మాత్రమే, మనుషులకి కాదు. ఒక పాత పుస్తకం లేదా ఒక పాత వైన్ లాగా మీ విలువ కాలంతో పాటు పెరగాలి. మీ పరిపక్వతే మీ సౌందర్యం. మీ నవ్వులో ఉండే ఆ నిశ్శబ్ద సత్యమే మీ పర్సనాలిటీకి అసలైన లెగసీ."Grow old along with me! The best is yet to be."• Robert Browningసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!
విడాకులు అనగానే మహిళల పరంగా ఒక కళంకంగా చూస్తుంది ఈ సమాజం. అటు అబ్బాయి తరుఫు వాళ్ల నుంచి సమస్యలే వచ్చినా..కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా, అభాగ్యురాలిగా చులకనగా చూస్తుంటుంది. దాని తోడు చుట్టపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు సైతం అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ ఈ తండ్రి కూడా అలానే కూతురికి అండగా నిలబడటమే గాదు ఆ క్షణాన్ని ఒక సంబరంలా సెలబ్రేట్ చేశాడు.ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. ప్రణిత అనే మహిళకు కుటుంబ న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి రిటైర్డ్ జడ్జి కోర్టు ప్రాంగణం వెలుపల డబ్బులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు ప్రణిత ఫోటో తోపాటు "నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె హృదయం, ఆమెనా సర్వస్వం " అని సందేశం ముద్రించిన నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. ప్రణిత కూడా "నా కుటుంబం, నా జీవితం" అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. ఇక ప్రణిత మీరట్కు చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..తాను తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. ఆమెకు 2018లో పంజాబ్లోని జలంధర్లో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన భారత సైన్యంలో మేజర్ అయిన గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాలక్రమేణా, ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుటుంబ న్యాయస్థానానికి చేరగా, ఆ తర్వాత కోర్టు ఆ విడాకులను ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే డాక్టర్ శర్మ ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, మిఠాయిలు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ వింత ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, శర్మ కుటుంబం ఇప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణిత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ప్రణిత తన అత్తగారి ఇంట్లో రోజూ వేధింపులను ఎదుర్కొంటుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తండ్రి అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు. విడాకులు మంజూరైన తర్వాత ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా గడపకుండా, వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.సెలబ్రేషన్స్ ఎందుకంటే..ప్రణిత తండ్రి, రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, ఈ వేడుక వెనుక గల కారణాన్ని వివరించారు. "మా కూతురు పుట్టినప్పుడు డప్పులు వాయించారు. ఒక కూతురి జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె విలువ మారదని చూపించడానికి, ఈ రోజున మళ్ళీ ఇలా డప్పులతో సెలబ్రేట్ చేశాం. అని చెప్పారు.मेरठ: तलाक के बाद बेटी को ढोल-नगाड़ों के साथ घर लाए रिटायर्ड जज#Meerut pic.twitter.com/LpPhkU8aSg— NDTV India (@ndtvindia) April 5, 2026 (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
ప్రోస్టేట్ కేన్సర్ రోగుల్లో సరికొత్త ఆశాకిరణం
ఒక వ్యక్తికి ప్రోస్టేట్ కేన్సర్ వ్యాపించిందని చెప్పినప్పుడు, అతని మొదటి ప్రశ్న సాధారణంగా సమయం గురించి ఉంటుంది. “నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను?” అనేది. ఇన్నేళ్లుగా, అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ చికిత్స ప్రధానంగా జీవన కాలాన్ని ఎంతవరకు పెంచగలదో అనే కోణంలో చర్చించలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ సంభాషణ విస్తరించింది, ఆశాజనకంగా మారింది. ఇప్పుడులక్ష్యం కేవలం జీవితం పొడిగించడం మాత్రమే కాదు, ఆ సమయంలో శక్తి, స్వతంత్రత, రోజువారీ జీవనవిధానాన్ని కాపాడడం కూడా.భారతదేశంలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 37,948 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో గణనీయమైన శాతం కేసులు అధునాతన దశలోనే గుర్తించబడుతున్నాయి, అంటే కేన్సర్ ఇప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. కాలక్రమేణా, చాలామందిలో “కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్” అభివృద్ధి చెందుతుంది, అంటే సాధారణ హార్మోన్ చికిత్సకు స్పందించకుండా వ్యాధి ముందుకు సాగుతుంది.ప్రోస్టేట్ కేన్సర్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కేన్సర్ కణాలు ప్రధానంగా టెస్టోస్టెరోన్ అనే పురుష హార్మోన్పై ఆధారపడి పెరుగుతాయి. అందుకే, ఆండ్రోజెన్ డిప్రైవేషన్ థెరపీ (ADT) — అంటే శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని తగ్గించే చికిత్స — ఇప్పటివరకు ప్రధాన చికిత్సగా ఉపయోగించబడింది. ఇది కేన్సర్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, లక్షణాలను నియంత్రిస్తుంది.అయితే, కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరోన్ స్థాయులు తగ్గినా కూడా కేన్సర్ కణాలు “ఆండ్రోజెన్ రిసెప్టర్పాథ్వే”ను సక్రియం చేసి పెరుగుతూనే ఉంటాయి. ఆండ్రోజెన్ రిసెప్టర్ అనేది కణంలో ఉండే ఒక ప్రోటీన్, ఇది హార్మోన్ సంకేతాలను స్వీకరించి కణానికి పెరగమని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యాధి కొనసాగితే దాన్ని కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్ అంటారు.గత దశాబ్దంలో చికిత్సలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం హార్మోన్ స్థాయులనుతగ్గించడం కాకుండా, ఇప్పుడు “ఆండ్రోజెన్ రిసెప్టర్ పాథ్వే ఇన్హిబిటర్స్” అనే కొత్త ఔషధాలు ఉపయోగిస్తున్నారు. ఇవి కేన్సర్ కణాల్లో జరిగే పెరుగుదల సంకేతాలను నేరుగా అడ్డుకుంటాయి. ఇవిADT తో కలిపి ఉపయోగించినప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెటాస్టాటిక్ హార్మోన్ సెన్సిటివ్ ప్రోస్టేట్ కేన్సర్ పై నిర్వహించిన క్లినికల్ అధ్యయనాలు చూపుతున్నాయి.ఈ రెండు చికిత్సల కలయిక వ్యాధి పురోగతిని గణనీయంగా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా, కాస్ట్రేషన్ రెసిస్టెంట్ దశకు చేరే సమయాన్ని కూడా వాయిదా వేస్తుంది. ముఖ్యంగా ఎముకలకు వ్యాపించినప్పుడు వచ్చే నొప్పి కూడా ఆలస్యంగా వస్తుంది.ఇవి చాలా ముఖ్యమైన ఫలితాలు. ఎందుకంటే వ్యాధి పురోగతిని ఆలస్యం చేయడం అంటే లక్షణాలను నియంత్రిస్తూ, రోజువారీ జీవనాన్ని సజావుగా కొనసాగించే సమయం ఎక్కువగా లభించడం. చాలామందికి ఇది చలనశీలతను కాపాడుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.ఈ కొత్త చికిత్సల మరొక ముఖ్యమైన అంశం వాటి సహన శక్తి (tolerability). అధునాతన కేన్సర్చికిత్సలో తరచుగా కనిపించే అలసట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న రోగులకు, ముఖ్యంగా డయాబెటిస్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఈ సమతుల్యత చాలా ముఖ్యం. కెమోథెరపీ అవసరం లేకుండా మంచి ఫలితాలను ఇస్తున్న ఈ కలయిక చికిత్సలు, తీవ్రమైన చికిత్సలకు అనుకూలం కానీ రోగులకు ఒక మంచి ప్రత్యామ్నాయం.భారతదేశం గ్లోబల్ క్లినికల్ రీసెర్చ్లో పాల్గొనడం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ పరిశోధనల్లో భారతీయ రోగుల భాగస్వామ్యం, చికిత్సల ప్రభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది. ప్రాక్టీస్లో ఆధారిత చికిత్సలను అమలు చేయడానికి దోహదం చేస్తోంది.అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ ఒక తీవ్రమైన నిర్ధారణ అయినప్పటికీ, ఇప్పుడు దీనిని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చికిత్స లక్ష్యం—రోజువారీ జీవనంపై కనిష్ట ప్రభావంతో వ్యాధిని నియంత్రించడం. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న పురుషులు, వారి కుటుంబాల కోసం, వైద్యుడితో సమాచార ఆధారిత, ముందస్తు చర్చ చాలా ముఖ్యమైనది. అందుబాటులో ఉన్న చికిత్సలను అర్థం చేసుకోవడంద్వారా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించుకోవచ్చు. చికిత్స క్లినికల్ ఆధారాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలకు అనుసంధానమైనప్పుడు, జీవితం కేవలం పొడిగించడమే కాకుండా, దాన్ని మెరుగైన విధంగా గడపడం కూడా సాధ్యమవుతుంది.డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కర్కాణా, హైదరాబాద్(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక
అనంత్, రాధికా అంబానీ హెలికాప్టర్లో మహారాష్ట్రలోని నేరల్కు చేరుకుని అక్కడ కృష్ణ కాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆయన పుట్టిన రోజు వేడుకులకు ముందు అనంత్ రాధికలు ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 10న అనంత్కు 31 ఏళ్లు నిండనున్నాయి. పూజ అనంతరం ఆలయంలో ఆవులకు అన్నదనం చేసి, గోసేవ కూడా చేశారు. ఆ తర్వాతక రాధిక అంబానీ భక్తులను పలకరిస్తూ..మిఠాయిల, దుస్తులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ కాళి అమ్మవారి ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Deepender Thakur (@deepender_thakur)కృష్ణుడు, కాళి మాత ఒక్కరేనా..బృందావనంలో ఉండే కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరేనా అంటే..ఒక్కరేనే చెబుతున్నాయి పురాణాలు. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది కలకత్తా, పశ్చిమబెంగాల్లో బాగా కనిపిస్తుంది. అందుకు ఒక పురాణ గాధ కూడా ఉంది. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది. ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు. అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..
20, 30 లేదా 40 ఏళ్ల వయసులో ఉండి వ్యాయామం చేయాలంటే రకరకాల సాకులు చెబుతూ స్కిప్ చేస్తుంటారు. కొన్ని రోజులు మొక్కుబడిగా చేసి..మళ్లీ యథావిధిగా మానేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ 90 ఏళ్ల వృద్ధుడిని చూస్తే కచ్చితంగా కనువిప్పి కలుగుతుంది, దృక్పథం కూడా మార్చుకోవచ్చని చెబుతున్నారు ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్. తేలికపాటి వ్యాయామాలు చేసే వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేసే స్ట్రెంగ్త్ వ్యాయామాలు చూస్తే కచ్చితంగా విస్తుపోతారు. ఇంతకీ ఎవరా తాతగారు..?, అతని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన జెన్నిఫర్ మార్టిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో చాలామంది మంచం నుంచి లేవడానికి ఇబ్బంది పడే తొమ్మిది పదుల వయసులో స్వతంత్రంగా బతకాలనే ఆశయం, కఠోర శ్రమ ఫలితమే అతడి స్ట్రాంగ్ ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోందామె. ఆమె వయసు పైబడటం సమస్య కాదని అంటోంది, బలం కోల్పోవడమే సమస్య. దీర్ఘాయువుకి కండరాలే కీలకం. ఆ విషయంలోనే ఈ తాతాగారు చాలా కేర్ఫుల్గా ఉంటారు. సవంత్సరాల తరబడి చేసిని నిరంతర వర్కౌట్లు..ఆయన్ని ఇంతలా బలంగా ఫిట్గా ఉండేలా చేశాయి. నిజానికి ఆయనకు 90 ఏళ్లు అంటే ఎవ్వరు నమ్మలేరు.పైగా ఆయన ఫిట్నెస్ దినచర్యలో ఏ యువకుడికైన గట్టి పోటీ ఇచ్చేలా చేయగలరు కూడా. ఆయన ఒంటరిగానే జిమ్కి వెళ్తారని, వారంలో మూడు రోజులు జిమ్కి కేటాయిస్తారని చెబుతోంది. ఆయన ఫుల్లింగ్ వ్యాయామాల దగ్గర నుంచి ట్రెడ్మిల్పై పరుగెత్తడం, క్లైంబింగ్ వర్కౌట్లను ఆస్వాదించడం వరకు అన్నింటిని చేస్తారు. మెషీన్లు, డంబెల్స్ను ఉపయోగించి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి కూడా చేస్తారాయన. ఈ వ్యాయామ దినచర్య కేవలం దీర్ఘాయువు కోసం కాదని, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడిందని చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సకు ముందే ఆ వ్యక్తి శారీరకంగా చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తుండటం వల్ల, ఇతర రోగుల కంటే వేగంగా కోలుకోగలిగారని చెప్పుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆయన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను చూసి..ఆ వయసుల పట్టుదలను అభినందించడమే గాక..ఇది నిజంగా అద్భుతం అని కొనియాడారు. View this post on Instagram A post shared by JEN | Personal Trainer | Functional Movement & Longevity (@jennifermartinnn) (చదవండి: నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!) -
అశ్వత్థామ హతః ధర్మరాజు చెప్పిన అబద్ధం
అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. యమధర్మరాజు అంశతో కుంతీదేవికి జన్మించినవాడు. ధర్మకోవిదుడు, నీతిపరుడు, సత్యవంతుడు... ఇన్ని సుగుణాలు కలిగిన ధర్మరాజు అబద్ధం ఆడాడా..?? అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఆపద్ధర్మం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అబద్ధం ఆడించాడు. లేకుంటే పాండవ వంశానికే ప్రమాదం వచ్చి ఉండేది. మహాభారత యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులు అతిరథ మహారధులని చెప్పుకోవచ్చు. వారిలో అశ్వత్థామ ఒకరు. అశ్వత్థామ మహారథి కోవకు చెందుతాడు. యుద్ధరంగంలో అడుగుపెట్టాడంటే ఏకకాలంలో ఏడు లక్షల 20 వేల మందితో యుద్ధం చేయగలడు. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుని కుమారుడు.ద్రోణాచార్యుడు, కృపి దంపతులకు పరమేశ్వరుడి వరప్రసాదంగా జన్మించిన వాడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా ఉండడంతో ఆ బాలునికి అశ్వత్థామ అని పేరు పెట్టారని, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశ్వత్థామ నుదుటిపై శివుని మూడో కన్నులా అనిపించే ఒక దివ్యమైన మణి ఉండటం వల్ల అశ్వత్థామకు ఏ ఆయుధం వల్ల కానీ, ఎవరి వల్ల కానీ భయం, పరాజయం ఉండవని వరం.. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధంలో వీరవిహారం చేస్తూ పాండవ సైన్యాన్ని మట్టు పెడుతున్న సమయంలో ద్రోణాచార్యుని నిలువరించేందుకు ధర్మరాజుచే శ్రీ కృష్ణుడు అబద్ధం చెప్పిస్తాడు. ఎంతో సత్యవంతుడైన ధర్మరాజు చెప్తేనే అబద్ధాన్ని సైతం నిజమని నమ్ముతాడు ద్రోణాచార్యుడు. తాను అబద్దమాడనని ధర్మరాజు చెప్పినప్పటికీ ఆపద్ధర్మం కోసం అబద్ధమాడితే తప్పులేదని, శ్రీ కృష్ణు్ణడు ధర్మరాజుకు బోధించడంతో అయిష్టంగానే ధర్మరాజు అంగీకరిస్తాడు. ద్రోణాచార్యునికి వినబడేటట్లు అశ్వద్ధామ హతః... కుంజరహః అన్న సమయంలో కుంజరహః అనే మాట ద్రోణాచార్యునికి వినబడకుండా యుద్ధభేరీలు మోగించేటట్లు పథకం రూపొందించాడు శ్రీ కృష్ణుడు. ధర్మరాజు అన్న అశ్వత్థామ హతః అనే మాటను విన్న ద్రోణాచార్యుడు నిజంగానే తన కుమారుడైన అశ్వత్థామ మరణించాడని భావించి అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదునుగా భావించిన ధృష్ట్యద్యుమ్నుడు ద్రోణాచార్యుల తలనరికి అంతమొందిస్తాడు.కాగా ధర్మకోవిదుడైన ధర్మరాజు ఒక చిన్నపాటి అబద్ధం ఆడటం వల్ల అప్పటివరకు మహాభారత యుద్ధంలో ధర్మరాజు పయనించిన రథం భూమికి నాలుగు అంగుళాలు పైన వెళ్లేదని, ఈ చిన్న అబద్ధం ప్రభావం వల్ల ధర్మరాజు రథం నేలను తాకిందని, మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు ఒకేఒక్కసారి నరకలోకాన్ని సందర్శించవలసి వచ్చిందని, ఆపై నేరుగా స్వర్గానికి వెళ్ళాడనే మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది.కాగా ప్రస్తుత కలియుగంలో అశ్వత్థామ హతః కుంజరహః అనే మాటను రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రచారంలో వినియోగిస్తున్నారు. అంటే వారు ప్రజలకు ఇచ్చే హామీలలో కొన్ని మాత్రమే వినిపించేలా మిగిలినవి మెల్లగా చెప్తున్నప్పుడు ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
డోలీ
అదొక చిన్న మండల కేంద్రం. దానికి కూత వేటు దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊర్లో గులాబీ తోటలున్నాయి. ఆ తోటల యజమానుల నుంచి గులాబీలు తీసుకుని మండల కేంద్రానికి వెళ్ళి పూలమ్ముతుంది ఓ ముసలవ్వ.ఆ మండల కేంద్రంలో ఒక గ్రామీణ బ్యాంకు ఉంది. రిటైర్ మెంట్ కు దగ్గరున్న ఓ మహిళా మేనేజర్ ఆ బ్యాంకుకు బదిలీ మీద వచ్చింది. నెత్తి మీద గంప పెట్టుకుని ఇంటింటికీ వెళ్ళి పూలమ్మే అవ్వ ఆ రోజు బ్యాంకు మేనేజర్ ఇంటికి వెళ్ళింది. పూలు తీసుకొమ్మని అడిగింది. పూలు తీసుకునే సమయంలో అవ్వ, ‘కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ ఆమే’ అని తెలుసుకుంది.‘నాకు పదివేలు అప్పు కావాలి, నా దగ్గర కుదవ పెట్టడానికి ఏమీ లేదు. మీ బ్యాంకు నన్ను నమ్మి అప్పు ఇస్తుందా?’ అని అడిగింది. ‘అప్పు చేయాల్సిన అవసరం నీకేమి వచ్చింది?’ అని అడిగింది మేనేజర్. ‘నా వయసు డెబ్భై ఏళ్ళు. నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నాను. కొండ ఎక్కడం ఇన్నాళ్ళూ సాధ్యమయ్యింది. ఈసారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొండ ఎక్కడం అసాధ్యమనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి కూడా స్వామిని చూడాలని కోరికగా ఉంది. కాబట్టి పంబ నదినుంచి సన్నిధానం వరకు డోలీలో వెళ్ళాలనుకుంటున్నాను. నలుగురు మగ మనుషులు నన్ను మోయాలి కదా. దానికి కనీసం పదివేల రూపాయల అవసరం ఉంటుంది. నేను దాచిపెట్టుకున్న డబ్బు ప్రయాణానికి మాత్రమే సరిపోతుంది. మీరు మేనేజర్ కాబట్టి నాకెలాగైనా సహాయం చేయండి. మీ ఋణం పెట్టుకోను. నాకు రావాల్సిన డబ్బు రెండు నెలల్లో వస్తుంది. వెంటనే తీర్చేస్తాను’ అని వేడుకుంది.ఆ అవ్వ భక్తి భావానికి మేనేజర్ ఆశ్చర్యపోయింది. చిన్నగా తేరుకుని ‘నాక్కూడా చాన్నాళ్ళుగా శబరిమలై వెళ్ళాలని ఉంది. స్వామి దర్శనం చేసుకోవాలని ఉంది. కొండపైకి నడిచి వెళ్ళే శక్తి నాకుంది. నువ్వు ఇప్పటికే నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నావు కాబట్టి ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో నీకు బాగా తెలుసు. ఆ దీక్షకు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి కదా. ఆ విషయంలో నాకు సహకరించు. ఒకరికొకరు తోడుగా వెళ్ళి వద్దాం. నీ డోలీ డబ్బులు నేను కడుతాను. అప్పు ఆలోచన పక్కన పెట్టేయ్’ అని బదులిచ్చింది. ఆ ముసలవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మేనేజర్కి ఇవ్వాల్సిన పూలకంటే మరి కొన్ని పూలు అదనంగా ఇచ్చి నమస్కరించి అక్కడినుంచి కదిలింది. నెల తర్వాత వచ్చిన కార్తీక మాసంలో ఇద్దరూ నల్ల వస్త్రాలు ధరించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ కొట్టాయం రైలెక్కారు. – ఆర్సి. కృష్ణస్వామి రాజు -
వైరాగ్యం ఆధ్యాత్మికతకు ఆసరా
ఆధ్యాత్మిక పథంలో పయనించే ప్రతి సాధకుడికి ‘వైరాగ్యం’ అనేది ఒక బలమైన పునాది. సాధారణంగా లోకంలో వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం అని పొరబడుతుంటారు. కానీ, నిజమైన వైరాగ్యం అంటే వస్తువులను వదలడం కాదు, వస్తువుల పట్ల ఉన్న ‘మమకారాన్ని’ లేదా ‘ఆసక్తిని’ వదలడం. ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు, కానీ పెద్దయ్యాక వాటిని వదిలేస్తాడు. అది బొమ్మల మీద కోపంతో కాదు, వాటికంటే విలువైనది ఏదో తెలిసిందనే అవగాహనతో. ఆధ్యాత్మిక వైరాగ్యం కూడా అటువంటిదే.వైరాగ్యం అంటే ‘రాగ రహిత స్థితి’. మనసు దేనినైనా చూసి ఆకర్షింపబడితే దానిని ‘రాగం’ అంటారు. ఆ ఆకర్షణ వల్ల కలిగే బంధం నుండి మనసును విముక్తం చేయడమే వైరాగ్యం. ఇది విరక్తి కాదు, ఒక రకమైన పరిణతి. ఇంద్రియ విషయాల నుండి మనసును మళ్ళించడానికి చేసే ప్రాథమిక ప్రయత్నం (యతమాన సంజ్ఞ ), కొన్ని విషయాల మీద నియంత్రణ సాధించి, కొన్నింటిపై ఇంకా పట్టు కోల్పోని స్థితి (వ్యతిరేక సంజ్ఞ), బాహ్యంగా కోరికలు లేకపోయినా, మనసులో మాత్రం సూక్ష్మంగా ఆ కోరికలు మిగిలి ఉండటం(ఏకేంద్రియ సంజ్ఞ). ఇక నాలుగోది ‘వశీకార సంజ్ఞ’ అత్యున్నత స్థితి. ఇక్కడ మనసు పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఏ బాహ్య వస్తువూ మనసును చలింపజేయదు.సంస్కృతంలో ‘రాగ’ అంటే రంగు లేదా ఆకర్షణ అని అర్థం. ‘వైరాగ్య’ అంటే ఆ ఆకర్షణ లేని స్థితి. నీటిలో ఉన్నా కూడా తామర ఆకుకు నీరు అంటనట్లుగా, సంసారంలో ఉంటూనే దేనికీ అతిగా బందీ కాకుండా ఉండటమే వైరాగ్యం. సాధారణంగా వైరాగ్యాన్ని రెండు స్థాయులలో చూడవచ్చు. ప్రాపంచిక విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని చూసి లేదా భయం వల్ల కలిగే తాత్కాలిక వైరాగ్యం (ఉదాహరణ – శ్మశాన వైరాగ్యం). ఇది ఎక్కువ కాలం నిలవదు. పర వైరాగ్యం అత్యున్నతమైనది. ఆత్మజ్ఞానం వల్ల, సత్యాన్ని గ్రహించడం వల్ల కలిగే స్థిరమైన స్థితి. ప్రపంచంలోని ఏ వస్తువూ శాశ్వతం కాదని గ్రహించినప్పుడు ఇది కలుగుతుంది.వైరాగ్యం సిద్ధించాలంటే రెండు ముఖ్యమైన పద్ధతులు అవసరమని భగవద్గీత చెబుతోంది. ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’. ఏది నిత్యం (శాశ్వతం), ఏది అనిత్యం (తాత్కాలికం) అని వేరు చేసి చూసే తెలివితేటలు. మనసుని పదే పదే ప్రాపంచిక కోరికల నుండి మళ్ళించి, అంతరాత్మ వైపు తిప్పుకోవడం. దేని మీద ఆశ లేనప్పుడు, అది దక్కలేదనే మానసిక ప్రశాంతత, కోల్పోతామనే భయం లేకపోవడం వైరాగ్యం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.వైరాగ్యం అనేది ఒక మందు వంటిది. అది సంసార వ్యాధిని నయం చేసి, మనిషిని తన నిజ స్వరూపమైన ఆనందం వైపు నడిపిస్తుంది. జీవితాన్ని త్యజించడం వైరాగ్యం కాదు, జీవితాన్ని సరైన దృక్పథంతో దర్శించడమే నిజమైన వైరాగ్యం. జీవితం పట్ల సరైన అవగాహన. ఒక పక్షి పండును తింటున్నప్పుడు ఆ రుచికి బానిస కావచ్చు. కానీ మరొక పక్షి అదే చెట్టు మీద ఉండి, పండును తినకుండా కేవలం చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఈ ‘సాక్షి భూత’ స్థితిలో ఉండటమే వైరాగ్యానికి సంకేతం. భగవద్గీత ప్రకారం వైరాగ్యం అంటే పనులను వదలడం కాదు, ఫలాపేక్షను వదలడం. వైరాగ్యం వల్ల మనిషికి నిర్భయత్వం కలుగుతుంది. ‘వైరాగ్యమేవ అభయం’ అని భర్తృహరి సుభాషితం చెబుతోంది. భోగంలో రోగ భయం ఉంటుంది, కులంలో పతనం ఉంటుందనే భయం ఉంటుంది, ధనంలో రాజుల భయం ఉంటుంది.. కానీ వైరాగ్యంలో మాత్రం ఎటువంటి భయం ఉండదు. ఇది మనిషికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. వైరాగ్యం అంటే కేవలం బాహ్య ప్రపంచాన్ని లేదా బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్లడం కాదు. ఇది మనసుకి సంబంధించిన ఒక స్థితి. వస్తువుల మీద, వ్యక్తుల మీద లేదా ఫలితాల మీద ఉండే అతివ్యాప్తిని వదిలివేయడమే నిజమైన వైరాగ్యం.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!
ఐఐటీ జేఈఈలో ఫెయిల్ అయ్యి యూట్యూబ్లో ఉద్యోగం సంపాదించే రేంజ్కు చేరుకున్న జర్నీని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నాడు ఓ భారత సంతత వ్యక్తి. అందుకు ఇద్దరు మహిళలు కారణమంటూ తన కథను పంచుకున్నాడు. అతడి కథ ప్రతిఒక్కరిని కదలించింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్న పోస్ట్లో అభిజయ్ అరోరా అనే వ్యక్తి తన కథను షేర్ చేసుకున్నారు. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా నగరాలు మారుతూ..తనను, తన చెల్లిని ఎలా పెంచిందో గుర్తుచేసుకున్నారు. సింగిల్ మదర్గా ఆమె పడ్డ కష్టం మర్చిపోలేనంటున్నాడు. కేజీ తరగతుల నుంచి ఐఐటీ ప్రవేశ పరీక్ష వరకు ప్రతి దశలోనూ తన తల్లి తనకు ఎలా సహాయం చేసిందో గుర్తు చేసుకున్నాడు. జేఈఈ టైంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి టీ పెట్టి ఇచ్చేదని అన్నారు. అంతలా ఆమె కష్టపడ్డా..ఫెయిల్ అవ్వడంతో తన ఆశయాలన్నీ నీరుగారిపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ ఓటమి అమ్మ త్యాగాలకి చేసిన ద్రోహంగా అనిపించేది, అందుకే మరో మార్గంలో ఎలాగైన సక్సెస్ అందుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఐఐటీ బెంగళూరులో హ్యాకథాన్లో గెలిచి మలేషియాలో ఉద్యోగం సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. బాగా సంపాదిస్తున్నప్పటికీ అదంత సంతృప్తినివ్వకపోవడంతో గూగుల్లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోరా పంచుకున్నాడు. తన అవకాశాలను మెరుపరుచుకోవడానికి ఐవీ లీగ్ ఎంబీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఐఐటి నేపథ్యం లేకుండా హార్వర్డ్ అసాధ్యమని కన్సల్టెంట్లు నవ్వారని నాటి పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ సందేహాలన్నింటిని పక్కనపెట్టి తన కలను సాకారం చేసుకోవడానికి రూ. కోటి రూపాలయ రుణం తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం పెద్ద పోరాటమే చేశానంటున్నాడు. ఉద్యోగం సంపాదించడానికి, దేశం విడిచి వెళ్లిపోవడానికి తన వద్ద 90 రోజుల సమయమే ఉన్న క్లిష్టతరమైన ఉద్యోగ మార్కెట్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాను వారానికి వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..జాబ్ సంపాదించలేకపోయానని చెప్పుకొచ్చాడు. అప్పుడే తన జీవితానికి రెండో ఆధారంగా తన భార్య రంగప్రవేశం చేసిందని చెప్పుకొచ్చాడు. తనను నిరుద్యోగిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, కొండంత తిరస్కరణల నడుమ అండగా నిలబడి తన కుటుంబాన్ని ఒంటరిగా పోషించిందని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఆమెకు తనపై ఉన్న నమ్మకమే తనను ఆవిష్కరణలు చేసేలా పురికొల్పిందని పేర్కొన్నాడు. అంతేగాదు అరోరా తన రెజ్యూమ్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ఏఐ ఆధారిత సాధానాన్ని రూపొందించి ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించిన కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించారు. చివరికి అరోరా చేసిన పని గూగుల్ దృష్టిని ఆకర్షించింది. అలా ఆయన గూగుల్లో యూట్యూబ్లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ పొందారు. ఆ ఫ్లాట్ఫాంలో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఒక కమ్యూనిటీనే ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఏఐ రంగంలోని సిలికాన్ వ్యాలీ నాయకులతో ఒక పాడ్కాస్ట్ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన తల్లిన కూడా గూగుల్ కార్యాలయానికి తీసుకువెళ్లానని పంచుకున్నారు. తన డెస్క్ గోడలపై యూట్యూబ్ లోగోని కన్నీళ్లతో అమ్మ తన వంక గర్వంగా చూసిన క్షణం మర్చిపోలేనంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. ఆ క్షణంలో తాను ఎదుర్కొన్న తిరస్కారాలు, నిద్రలేని రాత్రల కష్టం ఫలించదన్న ఆనందం కలిగిందన్నారు. తన విజయవంతమైన జర్నీని వివరిస్తూ..ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటుంటారు. కానీ తనకు ఇద్దరు మహిళలు ఉండటం అదృష్టం అని రాసుకొచ్చాడు. తనకు ఆరంబాన్ని ఇవ్వడం కోసం సర్వ త్యాగం చేసిన తల్లి, అలాగే తన ప్రస్థానాన్ని పూర్తి చేయడానికి సర్వ పణంగా పెట్టిన భార్య, ఈ ఇద్దరు లేకపోతే తాను లేనని అన్నారు. "ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఉంది. నిజానికి విజయం కష్టానికి ప్రతిఫలమే అయినా..దాని వెనుకు మన ప్రియమైన వ్యక్తుల నిశబ్ద బలం, త్యాగం, ప్రోత్సహం కచ్చితంగా ఉంటాయన్నది మీ కథ నొక్కి చెబుతోంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు". నెటిజన్లు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..! కారణం తెలిస్తే షాకవ్వుతారు) -
నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..!
అత్యంత అరుదైన వింత కేసు. నొప్పులు పడుతున్న టైంలో ఎవ్వరైన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. కానీ ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భావోద్వేగభరితమైన ఆ సమయంలో విచారణకు హాజరుకావడం విచిత్రం అనుకుంటే..అక్కడ ఆమె వాదన న్యాయమూర్తిని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎవ్వరిని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండ కట్టుదిట్టం చేసి అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. చివరికి ఆ మహిళ..ఇప్పటికీ కోర్టుని, వైద్యులపై ఆరోపణలు చేస్తూ తిట్టిపోస్తూనే ఉంది. అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన చెరీస్ డోయ్లిఆస్ప్రతి బెడ్పై నొప్పులు పడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో డెలివరీ అనగా..బలవంతంగా కోర్టు ముందుకు హాజరుపరిచారు వైద్యులు. అంతేగాదు ఆమె అనుమతి లేకుండానే ఇదంతా జరగడం విశేషం. వర్చువల్ కోర్టు విచారణకు ప్రసవ వేదనతో ఉన్న గర్భణీని బలవంతంగా ప్రవేశపెట్టారు. ఈ దురదృష్టకర ఘటన 2024లో చోటుచేసుకుంది. ప్రసవ వేదన మొదలైన వెంటనే రాత్రికి రాత్రే ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ హాస్పిటల్కు చేరుకుంది.అయితే ఆమె 12 గంటల పాటు ప్రసవ నొప్పులు అనుభవిస్తోంది. ఆ సమయంలోనే ఆమెను వర్చువల్ కోర్టు ముందు హాజరుపరిచారు వైద్యులు. తను వర్చువల్ కోర్టు ముందున్న విషయం తెలుసుకుని ఆ నిండు గర్భిణీ కంగుతింది. డోయ్యి వృత్తిపరంగా ప్రసవ సహాయకురాలైన నర్సు. అయితే ఆమె నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు కచ్చితంగా సీసెక్షన్ చేయాల్సిన ఎమర్జెన్సీ. కానీ అందుకు ససేమిరా అంటోంది డోయ్లి. ఎందుకంటే ముగ్గురు పిల్లల తల్లిగా గతంలో జరిగిన సీ సెక్షన్ల నుంచి కోలుకోవడం కష్టంగా ఉందని, దానివల్ల రక్తస్రావంతో అనేక సమస్యలు వస్తున్నాయని వాదిస్తోంది. ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉన్నా..మొండిగా ప్రవర్తించడంతో అక్కడి ప్రభుత్వ అత్యవసర పిటిషన్ దాఖలు చేసి కోర్టు ముందు హాజరపర్చింది. ఆ విషయాన్నే పేషెంట్ డోయ్లికి వివరించారు కూడా. అందువల్లే డోయ్లి నొప్పులు పడుతూనే కోర్టులో విచారణకు హాజరైంది. అయితే వైద్యులు ఆమె గనుక నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే..గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీ సెక్షన్ చేయక తప్పదని వాదిస్తుండటం గమనార్హం. అంతేగాదు డోయ్లి వైద్యులు గనుక సాధారణ ప్రసవం చేయలేకపోతే గనుక మరొక ఆస్పత్రికి తరలించమని కూడా అభ్యర్థించింది. అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి..ఆమెకు తక్షణమే ఆపరేషన్ చేయమని ఆదేశించలేదు గానీ, విపత్కర పరిస్థితి ఎదురైతే ఆమె సమ్మతితో పనిలేకుండానే ఆస్పత్రి శస్త్ర చికిత్స చేయవచ్చని సూచించింది. అయితే రాత్రికి ఆమె బిడ్డ పల్స్ రేట్ పడిపోవడంతో హుటాహుటినా..డోయ్లికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయక తప్పలేదు వైద్యులకు.ఆ తర్వాత ఆమెను మళ్లా కోర్టు ముందు హాజరుపర్చారు. అప్పుడు కూడా, వైద్యులపై మండిపడుతూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటికీ దాన్ని ఆమె అవమానంగా భావిస్తూ..కోర్టుని, సదరు ఆస్పత్రి వైద్యులను తిట్టిపోస్తుండటం గమనార్హం. View this post on Instagram A post shared by Joel Bervell, MD (@joelbervell) (చదవండి: రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..) -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం). దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్). వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." Aristotle సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఆంతరంగిక ప్రశాంతత) -
హీరో వెంకటేష్ మెచ్చిన 'బటర్ దోసె'..! ఎలా చేస్తారంటే..
దోసెలంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి దోసెలలో అత్యంత ఫేమస్ దోసె ఇది. కాసింత నూనె, మసాలా జోడిస్తే అబ్బో.. నోట్లో నీళ్లూరిపోవాల్సిందే. అలాంటి టేస్టీ.. టేస్టీ.. దోసెను దశాబ్దాలుగా అందిస్తోంది బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్. ఈ దోసె కోసం సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు క్యూలు కడుతుంటారు. పైగా అదెలా తయారు చేస్తారనేది బయటకు పొక్కనివ్వకుండా కేర్ తీసుకుంటుందట ఆ రెస్టారెంట్. అంతలా పకడ్బందిగా తయారు చేసే ఆ దోసె మన టాలీవుడ్ హీరో మనసుని సైతం దోచుకుంది. మరి ఆ వంటకం విశిష్టత తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ భోజనశాలలలో విద్యార్థి భవన్ ఒకటి. గాంధీ బజార్లోని రద్దీ వీధుల్లో ఉన్న దీనిని ఒక వారసత్వ ప్రదేశంగా చూస్తారు స్థానికులు. ఆహారం ద్వారా సంప్రదాయాన్ని పరిరక్షించడంలో పేరుగాంచిన ఈ రెస్టారెంట్ తరతరాలుగా వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలను అందించడంలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రత్యేకమైన బటర్ దోసె మెనూలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకంగా నిలవడం విశేషం. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)దోసె వెనుకున్న వారసత్వం..ఆ రెస్టారెంట్ని అరుణ్ కుమార్ అడిగా ఒక పకడ్బందీ ప్రణాళికగా తయారు చేస్తారట. ఈ వంటకం రుచి కోసం అక్కడ పాకనిపుణుల బృందం అవిశ్రాంతంగా పనిచేస్తుందట. ప్రత్యేకమైన కరకరలాడే ఈ ఆకృతి, బంగాళ దుంపల కూర, వెన్న సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి దోసెలు రోజుకి సుమారు 1500 నుంచి 1800 దాక తయారు చేస్తారట. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా అక్కడ బాగా ఫేమస్ ఈ దోసె. ఈ రెస్టారెంట్ని 1943లో దక్షిణ కన్నడలో సాలిగ్రామానికి చెందని వెంకటరమణ ఉరల్ దీనిని స్థాపించారు. Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 20261970వ దశకంలో, ఈ సంస్థ యాజమాన్యం అరుణ్ కుమార్ అడిగ తండ్రి అయిన రామకృష్ణ అడిగ నుంచి వారసత్వంగా బదిలీ అయ్యింది. ఆ కుటుంబికులు ఆ ప్రామాణికతను కాపాడుకునేలా వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఇక ఇటీవల టాలీవుడ్ నటుడు హీరో వెంకటేశ్ కారణంగా మరోసారి ఈ దోసె, సదరు రెస్టారెంట్ గురించి నెట్టంట సంచలనంగా మారింది. రెస్టారెంట్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..నటుడు విక్టరీ వెంకటేశ్ సందడిగా ఉన్న ఈ రెస్టారెంట్ని సందర్శించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వెంకటేశ్ అక్కడ బటర్ దోసెను చట్నీ తోపాటు ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతోపాటు వడ, ఇడ్లీ సాంబార్ చట్నీలను కడా రుచి చూశారు. చివరగా కాఫీతో తన బ్రేక్ఫాస్ట్ని ముగించారు. ఇంకెదుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.(చదవండి: కంటెంట్ క్రియేటర్ అవ్వాలని రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..) -
రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..
మంచి హోదాలో హుందాగా సాగిపోతున్న లగ్జరీ లైప్ని వదులుకుని నిలకడగా డబ్బులు రాని రంగంలోకి వెళ్లడానికి చాలా ధైర్యం కావాలి. పోనీ వెళ్లినా..నిలదొక్కుకోలేకపోతే అంతే సంగతులు. ఈ యువతి అలాంటి నిర్ణయం తీసుకుని ఎంతో సతమతమై చివరకు సక్సెస్ అయిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. అంతేగాదు తనలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలో సూచనలివ్వడమే గాక, ఆ ఛాలెంజ్కి ఎలా కట్టుబడి ఉండాలో ఆలోచింపచేసేలా చెబుతుండటం విశేషం.ఆ అమ్మాయే సాన్యాబాత్ర. కంటెంట్ క్రియేషన్ రంగంలోకి ప్రవేశించడానికి మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులకున్న తన ప్రయాణం గురించి సోషల్ మీడియా వేదికగా వివరించింది. ఆ నిర్ణయం వల్ల కలిగిన భయం, అనిశ్చితి, రిస్క్లు గురించి హైలెట్ చేసింది. ఏడాదికి రూ. 50 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసినప్పటి క్షణాన్ని గుర్తు చేస్తుకుంటూ..ఆ నిర్ణయం ఏ మాత్రం సులభం కాదని త్వరలో అర్థమైందన్నారు. ముఖ్యంగా చుట్టూ ఉన్నవారి సందేహాలు, అనుమానాలు తనను వెంటాడాయని అన్నారు. అలాగే తన తీసుకున్న రంగంలో సక్సెస్ అందుకోగలనా అనే భయం అంకంతకు పెరిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కువ జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకున్న వెర్రిదాన్ని తానేనేమో అనే భయంతో నిద్ర కూడా పట్టేది కాదని అంటోంది. నిజానికి కంటెంట్ క్రియేషన్ అన్నది సరైన కెరీర్ కాదు. పైగా ఉద్యోగాన్ని వదిలేయడం అంటే ఆర్థిక భద్రతను కాదనుకోవడమే అని ఆ సమయంలోనే తెలుసొచ్చిందని అంటోంది. అయితే ఇన్ని సవాళ్లు, భయాలు వెన్నాడినా..స్థిరత్వంతో నీపై నువ్వు నమ్మకంతో సాగిపో అని అంతరాత్మ చెప్పే ప్రబోధం వైపుకే ధైర్యంగా సాగి విజయవంతమయ్యానని ఆనందంగా చెబుతోంది. అంతేగాదు కంటెంట్ను క్రియేట్ చేయడం, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం చేస్తూ..నెమ్మదిగా మెరుగుపడ్డానని అంటోంది. కానీ నిలకడగా చేశానని అదే సక్సెస్ అయ్యేలా చేసిందని చెబుతోంది. అంతేగాదు సందిగ్థాలు ఎదురై టైంలో మనల్ని మనం నమ్మడం గురించి తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుందని అంటోంది. పెద్ద నిర్ణయం తీసుకుని దాని అంచున నిలబడి ఉంటే..బహుశా మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా నమ్మడానికి ఇది సంకేతం కావొచ్చు అని గుర్తించుకోండి అని చెబుతోంది. చివరగా ఏ నిర్ణయం తీసుకున్నా..ఎన్ని సవాళ్లు, భయాలు వెంటాడినా..నిలకడగా చేయడం అత్యంత ముఖ్యమైనది, అదే మిమ్మల్ని విజయతీరాల వైపుకి నడిపిస్తుందని చెబుతోంది. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే కాదు..మీలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు మేడమ్..పలానా అవ్వాలని అనుకోవచ్చేమో గానీ..అంతలా డేర్ చేయలేరంటూ సాన్యపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Sanya Batra | Travel & Lifestyle (@insanyaty) (చదవండి: మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!) -
మంచి జీర్ణక్రియకు మండూకాసనం
మండూకం అంటే కప్ప. ఈ ఆసనం వేసేటప్పుడు శరీరం కప్పలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనంలో మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి కడుపుపై ఒత్తిడి ఇస్తారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కప్పలా కూర్చుని, కడుపుకు మసాజ్ ఇచ్చే యోగానే మండుకాసనం.చేసే విధానం..ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. ∙పిడికిళ్లను బిగించి నాభి దగ్గర పెట్టాలి. ∙శ్వాస విడిచేటప్పుడు ముందుకు వంగాలి. కడుపుపై ఒత్తిడి వచ్చేలా ఉంచాలి.15–20 సెకన్లు ఉండి నెమ్మదిగా పైకి రావాలి.జాగ్రత్తలు..కడుపు నొప్పి / అల్సర్ ఉంటే చేయకూడదు. గర్భిణులు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలి.ఉపయోగాలు..జీర్ణక్రియ మెరుగుపడుతుంది.∙గ్యాస్, అజీర్ణం తగ్గుతుంది.కడుపు భాగం బలపడుతుంది.ఇది డైలీ 2–3 సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.అనిత పాతర్ల యోగా ట్రైనర్ -
మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!
ఫ్యాషన్ ఐకాన్గా విలక్షణంగా ఉంటారు బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ఏ సందర్భమైన ఆమె ఫ్యాషన్ స్టైలే వేరేలెవెల్. ధరించే డిజైనర్ వేర్ నుంచి ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతిదీ అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాగజైన్ షూట్ అయినా పండుగైనా..కియారా స్టన్నింగ్ లుక్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా, అనుకరించేలా ఉంటాయి. అలానే ఈసారి కూడా అత్యంత ఆకర్షణీయంగా మెరిశారు కియారా. ఆమె గత రాత్రి తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె ధరించిన అద్భుతమైన చీర, మసబా వారి మహారాణి నెక్లెస్తో ఆకట్టుకున్నారు. సిల్క్ క్రేప్తో రూపొందించిన 'గుల్పోష్' చీరపై ఉన్న సున్నితమైన బుటా వర్క్, ఆమె మొత్తం రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆ చీర పల్లు మరింత హైలెట్గా నిలిచింది. బంగారు ఎంబ్రాయిడరీతో గులాబీ, ఆకుపచ్చ ఆర్గాంజా ప్యాచ్వర్క్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పాంఖ్ బాగ్, గుల్ఝురోఖా మెటిఫ్లు చీరకు రాజససం ఉట్టిపడేలా చేయగా, ఫ్యాన్ ఆకారపు అంచులు ఈ చీర డిజైన్ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఎంత అందమైన చీరకైనా మ్యాచింగ్ ఆభరణాలనేవి అత్యంత కీలకమైనవి. అందుకే కియారా మసబా వారి స్టేట్మెంట్ మహారాణి-శైలి నెక్లెస్ను ఎంచుకుంది. బంగారం, వజ్రాలు, ముత్యాలతో పొదగబడిని నెక్లెస్ని పొరలు పొరలుగా డిజైన్ చేశారు. ఇంతకీ కియారా ధరించిన చీర, నెక్లెస్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. చీర ధర వచ్చేసి రూ. 1.30 లక్షలు, నెక్లెస్ ధర రూ. 1.85 లక్షలు. అలాగే నటి సింపుల్ మ్యాకప్తో ఉంగారాల జుట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేసింది. అంతేగాదు చేతిలో బ్రౌన్ రంగు హెర్మెస్ మినీ కెల్లి పోచెట్ బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీని ధర సైతం దగ్గర దగ్గర రూ. 33 లక్షల పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset)(చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
ముఖంపై వెంట్రుకలు పెరుగుతున్నాయా?
నాకు పద్దెనిమిది సంవత్సరాలు. ఇటీవల పైపెదవి, గడ్డం కింద ఒత్తుగా, దట్టంగా వెంట్రుకలు వస్తున్నాయి. బరువు కూడా పెరుగుతోంది. ఇది ఏ సమస్యకు సంకేతం? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?– మమత, జమ్మలమడుగు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది హిర్సూటిజం (అనవసరంగా వెంట్రుకలు పెరగడం) అనే సమస్య కావచ్చు. సాధారణంగా మహిళల్లో పై పెదవి, గడ్డం, ఛాతీ, వెన్ను వంటి ప్రాంతాల్లో మందంగా, నల్లగా వెంట్రుకలు పెరగడం ఈ సమస్య లక్షణం. ఇది ఎక్కువగా శరీరంలో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్) అధికంగా ఉండటం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అడ్రినల్ గ్రంథుల సమస్యలు, అరుదుగా ట్యూమర్లు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యను నిర్ధారించడానికి గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. డాక్టర్ ముందుగా పూర్తి శరీర పరీక్ష చేస్తారు. అవసరమైతే కొన్ని రక్తపరీక్షలు, హార్మోన్ టెస్టులు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఓవరీల పరిస్థితిని పరిశీలిస్తారు. చికిత్స సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్లను సరిచేసే మందులు, బరువు తగ్గించే చర్యలు. అవసరమైతే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటి జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. చక్కెర, స్వీట్స్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, నియమిత వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచాలి. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా ప్రభావం చూపొచ్చు. కొంతమందిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది. సరైన వైద్య చికిత్సతో పాటు అవసరమైతే లేజర్ వంటి పద్ధతుల ద్వారా వెంట్రుకలను తగ్గించుకోవచ్చు. దీంతో జీవన నాణ్యత మెరుగుపడుతుంది. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ ∙ -
ఒక హత్య.. ముగ్గురు హంతకులు
సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు... హైదరాబాద్ శివార్లలోని ఒక విలాసవంతమైన విల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జీ దారుణ హత్యకు గురయ్యాడు. గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి, ముఖర్జీ సోఫాలో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని మెడపై గట్టిగా నొక్కిన గుర్తులు ఉన్నాయి. హత్యకు గురైంది ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కమిషనర్ కూడా వచ్చాడు. క్లూస్ టీమ్ తన పని తాను చేసుకుపోతోంది.క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైపు చూసి అన్నాడు కమిషనర్... ‘‘మీరు ఎంత త్వరగా కేసు క్లోజ్ చేస్తే అంత మంచిది. ఈ కేసులో అనుమానితులు ముగ్గురు...ముఖర్జీ మేనల్లుడు అజయ్ భారీ అప్పుల్లో వున్నాడు.సెక్రటరీ స్నేహ– ముఖర్జీ తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మరో వ్యక్తి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ వినాయక్... ఈ ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి.’’ఇన్స్పెక్టర్ విక్రమ్ క్రైమ్ స్పాట్ను నిశితంగా గమనిస్తున్నాడు. టేబుల్ మీద మూడు కాఫీ కప్పులు ఉన్నాయి. కాని, గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏసీ ఇంకా ఆన్లోనే వుంది. గదిలో ఏసీ 16 డిగ్రీల వద్ద ఉంది. ‘‘సర్ ... వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కూల్లో వెచ్చగా ఉంటుంది’’ పనిమనిషి ఏసీ ఆఫ్ చేయబోతుంటే వారిస్తూ అన్నాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ తెలిసిన కమిషనర్ కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి పురమాయించాడు. ముఖర్జీ మేనల్లుడు అజయ్ని గదిలోకి పిలిచాడు. ‘‘మీ మేనమామను చంపాలనే బ్రిలియంట్ థాట్ ఎలా వచ్చింది?’’ సూటిగా చూస్తూ అడిగాడు.‘‘నేను చంపడం ఏంటి సర్! మా మామయ్య చనిపోతే నాకేంటి లాభం? బతికుంటే ఎంతోకొంత చిల్లర అయినా వస్తుంది’’ అని చెప్పాడు. అజయ్ని బయటకు పంపించి సెక్రటరీ స్నేహను పిలిచాడు. ‘‘పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు లైఫ్లో నుంచే మీ బాస్ను తీసేశావా?’’ ఆమె వైపే చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్.‘‘సర్! నేను ఒక మాములు ఉద్యోగిని. నేనెలా చంపగలను? చంపితే నాకు ఒరిగేది ఏముంది?’’ సెక్రటరీ స్నేహ అంది.‘‘గుడ్ ఆన్సర్... యు మే గో...’’ అన్నాడు.స్నేహ బయటకు వెళ్ళగానే, ఆ గది మొత్తం మరోసారి పరిశీలించాడు. ఏసీ ఆఫ్ చేయడానికి వెళ్లి రిమోట్ తీసుకుని, ఒకసారి ఏసీ వంక చూశాడు. వంటమనిషి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి వంటమనిషిని బయటకు పంపించి, మంచం ఎక్కి ఏసీని పరిశీలనగా చూశాడు.ఒక చిక్కుముడి వీడిపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ కిందకి దిగి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ను పిలిపించాడు.‘‘మిస్టర్ వినాయక్! మీ లాయర్కు ఫోన్ చేస్తే మనం బయల్దేరుదాం’’ అన్నాడు.‘‘ఎందుకు ఎక్కడికి?’’ అయోమయంగా అడిగాడు వినాయక్.‘‘మీ బిజినెస్ పార్టనర్ను హత్య చేసినందుకు’’ అన్నాడు.‘‘ముఖర్జీ మేనల్లుడు అజయ్, సెక్రటరీ స్నేహ అంతా ఒప్పుకున్నారు’’ వినాయక్ వంక చూస్తూ చెప్పాడు.‘‘వాళ్ళ మాటలు విని నన్ను అరెస్టు చేస్తారా? సాక్ష్యం లేకుండా’’ వినాయక్ కోపంగా అన్నాడు.‘‘ఈ సాక్ష్యం సరిపోతుందా? నువ్వూ... అజయ్... స్నేహ కలిసి ముఖర్జీని చంపడం... ఎలాంటి ఎడిటింగులు లేకుండా ఉన్న ఆధారం ఓకేనా?’’ వినాయక్ను అడిగాడు.కమిషనర్ అలానే చూస్తుండిపోయాడు. ‘‘మీరు అన్నంత మాత్రాన అది నిజం అవుతుందా?’’ వినాయక్ అన్నాడు.‘‘అవుతుంది... ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సార్ కెమెరా ఉంది. అందులో మీ ముగ్గురి ముఖాలు స్పష్టంగా పడ్డాయి. నువ్వు అజయ్ని, స్నేహను ఇరికించాలనుకున్నావు. అజయ్ అప్పులను తీరుస్తానని ప్రామిస్ చేశావు. స్నేహను మంచి జీతంతో నీ దగ్గర సెక్రెటరీగా పెట్టుకుంటానన్నావు.స్నేహ నిద్రమాత్రలు ఇచ్చింది. అజయ్ నువ్వు రహస్యంగా ఇంట్లోకి రావడానికి సహకరించాడు.’’ముఖర్జీ చనిపోతే అతడి అన్ని వ్యాపారాలనూ తన వ్యాపారంలోకి కలిపేసుకోవచ్చని వినాయక్ అనుకున్నాడు.‘‘ముగ్గురూ కలిసి హత్య చేశాక గది లోపల గడియ పెట్టి కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాని, వినాయక్ గమనించని విషయం ఏంటంటే, ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సర్ కెమెరా! అందులో రికార్డు అయిన వాళ్ళ మొహాలు...’’ అంటూ కమిషనర్ వైపు తిరిగి.‘‘ఇదిగోండి ఎవిడెన్స్ ఒక హత్య... ముగ్గురు హంతకులు.’’హత్య చేసినందుకు వినాయక్ను; డబ్బు మీద ఆశతో సహకరించినందుకు అజయ్ను, క్షణకాలం ఆవేశంతో, స్వార్థంతో చేతులు కలిపినందుకు స్నేహను అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ విక్రమ్! కేవలం గంట వ్యవధిలోనే కేసును మైండ్ గేమ్తో సాల్వ్ చేశావు’’ అభినందిస్తూ అన్నాడు కమిషనర్. -
ఈ వారం కథ: మరణం కంటే భయంకరం ఏమిటో తెలుసా?
దబ్బుమని చప్పుడు వచ్చింది. కొంచెం పెద్దదే. అందరికీ వినపడగలిగేంత పెద్దది. దాని వెంబడి ఒక మూలుగు, ఆర్తనాదం వంటిది. అది కొందరికైనా వినపడే అవకాశం తక్కువ. పద్దెనిమిది ఫ్లోర్ల వంతునున్న రెండు టవర్లు. ఫ్లోరుకు రెండు వంతున మూడు పడగ్గదుల ఇళ్లు. పైచివరి అంతస్తులో పొందికైన పెంట్ హవుసులు చెరొకటి. వెంటిలేషన్ కోసం అన్నట్టుగా రెండు టవర్ల మధ్య ఖాళీ సందు. చుట్టూతా వాహనం తిరగగలిగేపాటి బాట. ఓపాటి గార్డెన్ లాంటి ఏర్పాటు. లోపలకు బయటకు కూడా చూడగలిగేలా సీసీ కెమెరాలను పొదువుకున్న ఎత్తయిన ప్రహరీగోడ. దాని నెత్తిన శిరోభూషణంలాగా ఎలక్ట్రిక్ కంచె. మూడు షిఫ్టుల్లో అప్రమత్తంగా కాపలా ఉండే గార్డుల ఏర్పాటుతో ప్రధాన గేటు. అది ఒక చిన్న కమ్యూనిటీ.మొత్తానికి అక్కడే ఎక్కడో వచ్చింది చప్పుడు.పక్కనున్న ఖాళీ నేలలో బోరు డ్రిల్లింగ్ జరగడం లేదు. ఆకాశం ఉరమడం లేదు. జోరు వాన హోరు లేదు. ఆలయాలూ ప్రార్థనస్థలాల మైకుసెట్లు గొంతెత్తిన పాటలూ పిలుపులూ గాలిసవారీ చేయడం లేదు. పంచభూతాతీతమైన ఎటువంటి శబ్దోపద్రవాలూ ఆ సమయానికి అక్కడ లేవు. అలాగని, ఆ ప్రాంతమంతా నిర్జనంగా ఉందని కాదు– కిక్కిరించని జనసందోహం చెదురుమదురుగా ఒంటరి ఒంటరిగా పరచుకుని ఉన్నారు. పరివేష్టించిన జాగా ట్రాకుగా మార్నింగ్ వాకులు చేస్తున్నారు, పచ్చిక మేటలే మ్యాటుగా దేహాన్ని వంగదీస్తూ, సాగదీస్తూ యోగాది కసరత్తుల్లో మునిగి ఉన్నారు, ఒకరో ఇద్దరో సిమెంటు బెంచీలమీద ప్రాణాల్ని కుదేసి మాటలాడుకుంటున్నారు. కానీ ఆ చప్పుడు ఎవరికీ వినపడలేదు. అలాగని, బధిరులు కాదు, చెవులు దిబ్బెడలు వేయలేదు– అయినా ఎవరూ ఆ చప్పుడు వినలేదు. మరేం చేస్తున్నారు? మెజారిటీ చెవులు వాంఛిత కర్ణభూషణాలతో అలరారుతున్నాయి. ఫోను సంభాషణాలూ, సంగీతమూ, పాటలూ ఆ చెవుల్లోకి ప్రవహిస్తున్నాయి. కొందరి చెవుల్లోకి పక్కనున్నవాడి నోర్లు ప్రవహిస్తున్నాయి. ఆ నోర్లలోకి, ఆ ఇద్దరి సమక్షంలో లేని ఇంకొకరి ప్రెవేటు వ్యవహారాలన్నీ జలలాగా ఊరుతున్నాయి. ఏ ప్రవాహాలూ లేని చెవులు, నిష్క్రియగా పరధ్యానంలో ఉన్నాయి. ఎ..వ్వ..రూ ఆ చప్పుడు వినలేదు. క్షణాలూ నిమిషాలు కాదు, అరగంట గడిచిపోయింది. మైలో: నేను నిద్రలేచినంత మాత్రాన నా దినచర్య మొదలు కాదు. నా యజమాని కూడా లేవాల్సిందే. విశ్వాసం అనే పదాన్ని ముద్దర కొట్టి వదిలేసిన పరాధీన బతుకు. నా పేరు మైలో. కుక్కని. రాట్వీలర్ జాతి నాది. పేరును బట్టి నేను సోల్జర్ని. నన్ను పెంచుకునే అదృష్టాన్ని పొందిన వాడి పేరు రాజేంద్ర. అవును మరి.. అదృష్టం వాడిదే. వాడి మిత్రుల్ని, చుట్టాల్ని పోగేసినప్పుడెల్లా.. నన్ను వాడి హోదాకు ఒక చిహ్నంలాగా ప్రదర్శిస్తాడు. ‘మీ కుక్క భలే ఉంది గురూ’ అంటారు. నా జాతిలో ఏ కుక్కయినా ఒకలాగే ఉంటుంది. నా జాతికుక్కలు మాత్రమే ఎరిగిన వాడికి, బహుశా ఇక్కడి వీధుల్లో ఊరకుక్క ‘భలే’ అనే ఫీలింగిస్తుందేమో. ‘నువ్వు సూపర్ గురూ’ అంటారు రాజేంద్రని.నాలాగా నేను ఉండడంలో, వాడి సూపర్ ఏమిటో నాకు అర్థం కాదు! సరే, విషయానికి వస్తాను. నేను లేచి అరగంటైంది. వాడింకా లేవలేదు. బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలి. నేను వెళ్లి, రాగలను. కానీ వాడు నన్ను ఒంటరిగా వెళ్లనివ్వడు. తలుపుకు గొళ్లెమే అయితే తీసుకుని వెళ్లేదాన్నేమో.. తాళమూ వేస్తాడు. అందమైన గొలుసు చేతిలో పట్టుకుని నా వెంట నడవడం వాడికి మజా. ఏసీ పడగ్గదిలో సుఖంగానే ఉన్నదిగానీ, దేహం తొందరపెడుతోంది. వాడి పడకమీదికి చేరి, ప్రేమగా చేత్తో నిమిరాను, మెలకువలోకి వచ్చి నన్ను వాటేసుకుని గిలిగింతలు పెట్టాడు. నేను గారాలు పోయాను! మొత్తానికి ట్రాక్ సూటు తొడిగి తయారై నా వెంట వచ్చాడు. ముందు బయటకు తీసుకెళ్లాడు. అవసరం తీర్చుకున్నాను. తిరిగొచ్చాక, రెండు టవర్లను ప్రదక్షిణం చేసినట్టుగా నాలుగు రౌండ్లు తిరిగాం. ఇంకో రౌండు తిరిగితే ఇంట్లోకి తీసుకెళ్లిపోతాడు. కానీ నా కుక్క బుద్ధికి ఏదో తేడా కొడుతోంది. కొంచెం గింజుకున్నాను. నడవకుండా మొరాయించాను. అటుకేసి గొలుసును ఈడ్వడానికి ప్రయత్నించాను. రాజేంద్రకు ఏదో అనిపించింది. అటువైపు ఆడకుక్క ఉందేమో అనుకున్నాడు. ‘యూ నాటీ బోయ్’ అంటూ చిలిపితనం ప్రదర్శిస్తూ వంగి నా మెడపట్టీ దగ్గరున్న క్లిప్ వదిలేశాడు. ఉరికాను. రెండు టవర్ల మధ్య, సన్నని ఇరుకైన చీకటి గుయ్యారం వంటి ఆ సందులోకి. ఫ్లాట్లలో వెంటిలేషన్ కోసం అని ఆ ఖాళీ వదిలారు గానీ, గ్రౌండ్ లెవెల్లో మసగ్గానే ఉంటుందక్కడ.అనుకున్నదానికంటె ఘోరంగా ఉంది. అరమీటరు మందాన కాస్త కుంకుమరంగు ఎరుపుతో పరచుకుని ఉంది. దగ్గరికెళ్లి చూద్దునుకదా.. తల పగిలే ఉంది. మొహానికి దగ్గరగా నా తల నిక్కించి వాసన చూశాను, శ్వాస లేదు. ఎడమకాలిని చాచి చిక్కబడుతున్న ఎరుపుని తడిమాను. జిగటగా తగిలింది. ఇంకా ఎక్కువసేపు స్టడీ చేయాల్సిందేమీ లేదు. కన్ఫర్మ్. ఒక్క పరుగున తిరిగి వెళ్లేసరికి.. ‘అప్పుడే వచ్చేశావా మైబోయ్’ అంటూ రాజేంద్ర గొలుసు క్లిప్ అందుకున్నాడు. తగిలించబోతే వెనక్కు తగ్గి రుంజుకున్నాను. అరుస్తూ, ఆ సందుకేసి గెంతి, ఆగి, రెండుసార్లు అరచి, మళ్లీ రాజేంద్ర కాళ్ల దగ్గరకు వచ్చి, సందు దిక్కుగా తిరిగి తోకాడిస్తూ నిల్చున్నాను. వాడు గ్రహించాడు. గొలుసు తగిలించకుండానే, నా వెనుక వచ్చాడు. చూసిన వాడికి విషయం అర్థమైంది. నేను అరవకుండా తోకాడిస్తూ వాడినే చూస్తున్నాను. నిజంగానే భయపడ్డాడు. పెద్దగా కేక పెట్టాడు.‘‘సె..క్యూ..రి..టీ..’’ఆ చప్పుడుకు– ఈ అరుపుకు మధ్య గంట గడిచింది!సెక్యూరిటీ పోస్టు:‘‘పతా హై.. యే హై కౌన్’’‘‘నహీ సాబ్’’నన్ను ఆశ్రయించి జీవిస్తున్న వాడు.. కనీసం ఆ శవం దగ్గరికెళ్లి మొహం చూసే ప్రయత్నాన్ని, మొహమాటానికైనా చేయకుండానే, జవాబిచ్చాడు. వాణ్ణి తప్పుబట్టలేం. నిజమే చెప్పాడు. వాడికి ఎవ్వరూ తెలియదు. చివరికి ‘పతా హై’ అంటూ అడిగిన వాడితో సహా! జాలిపడ్డాను. మావాడి మీద కాదు. చుట్టుముట్టిన వాళ్లందరి మీద! తమకు రక్షణగా ఎవరుంటున్నారో, వారికి తామెవ్వరో తెలియకపోవడమంత దౌర్బల్యం ఇంకేం ఉంటుంది. నా పేరు సెక్యూరిటీ పోస్టు. నా ఒంటి మీద ‘సెక్యూరిటీ’ అని రాయిస్తే సరిపోయేది. కానీ ‘పోస్టు’ అని కూడా జోడించారు. అదేదో నా కులం తోకలాగా! అందువల్ల నేను పోస్టు డబ్బా కంటె కొంచెం పెద్దదిగా ఉంటాను. ఫోర్ బై ఫోర్ స్క్వేర్ కట్టడం అనుకోండి. ఒకవైపు ద్వారం ఓకే. రెండు వైపుల నిలువెత్తు గవాక్షాలు! ప్రహరీ గేటు వైపుండే గవాక్షానికి వెలుపల ఓ పాత కుర్చీ, బల్ల. దాని మీద విజిటర్సు రిజిస్టరూ, దానికి ప్లాస్టికు దారంతో కట్టిన పేనా, పక్కనే ఇంటర్ కమ్ ఫోనూ. లోపల కిటికీ లేని వైపు యూనిఫాంలు తగిలించే కొక్కేలు. íసీసీ కెమెరాల ఫుటేజీ చూసే టీవీ, వాటిని రికార్డు చేసే హార్డ్ డిస్కు. నెత్తిన నెలవంక లాగా ఒక కెమెరా. ఇదీ నా స్వరూపం. కేక వినపడగానే నా చెంత ఉన్న ఇద్దరిలో ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తర్వాత రెండోవాడిని కూడా పిలిచారు. వాడు కూడా తెలియదనే చెప్పాడు. ఎలా తెలుస్తుంది వాళ్లకసలు? మాది పోష్ డీలక్స్ అపార్టుమెంట్స్ అనే చెప్పాలి. వాచ్మెన్ ఫ్యామిలీకి ఓ చిన్న ఇల్లు వేసి ఇక్కడే కాపురం ఉంచడం, వాడికో ఇస్త్రీ బండి పెట్టివ్వడం వీళ్లకు నచ్చదు. సెక్యూరిటీని ఏజన్సీకి అప్పగించారు. ఆ ఏజన్సీ రోజూ తమ మనుషుల్ని పంపుతుంది. ఒక్కొక్కడికీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ. రోజుకు నలుగురు వస్తారు. ఒకసారి వచ్చినవాడు మరురోజు వస్తాడని గ్యారంటీ లేదు. వాళ్ల డ్యూటీ గేట్ సెక్యూరిటీ మాత్రమే. పైగా వీళ్లంతా పైనున్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు. మన భాషారాదు, ఇంగ్లీషూ రాదు. ఎవడైనా లోపలకు రావాలనుకుంటే ‘నామ్’ అంటారు.. ‘ఫ్లాట్’ అంటారు.. చెబితే ఆ ఫ్లాట్కు ఇంటర్ కమ్లో కాల్ చేసి చెప్తారు. పంపమంటే, సంతకం చేయించుకుని పంపుతారు.. లేదంటే లేదు అంతే!వాకింగులోని వాళ్లూ, యోగ ముద్రాంకితులూ, ఉదయపు ఎండకోసం వచ్చి తీరిగ్గా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లూ.. ఓ యాభైమందికి పైగా ఆ చిన్న ఇరుకు సందులో.. అప్పటికే చుట్టూ చేరారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ చేరినవాళ్లు మొబైళ్లలో పైన తమ ఫ్లాట్స్లోని వాళ్లకు కాల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరూ వస్తున్నారు. అందరిలోకి కాస్త చొరవగా ఉన్న ఒక మనిషి.. ‘డిడ్ ఎనీ బడీ నో హిమ్.. ఇతనెవరో ఎవరికైనా తెలుసా.. ఇవన్ యారో..’ అని భాషలు మార్చి మార్చి పదేపదే అడుగుతున్నాడు. జవాబు రావడం లేదు. గుమికూడిన జనంలో.. ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్టే లేదు.. చాలా వరకు!నా దగ్గరినుంచి వెళ్లిన రెండో సెక్యూరిటీ వాడు కొంచెం నయం.. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూసిన తర్వాత.. ‘‘ఫ్లాట్ తో మాలూమ్ నై సాబ్. యే తో అందర్వాలా హీ హై.. కన్ఫర్మ్’’ అన్నాడు. మహా అయితే అంతా డెబ్భయి ఇళ్లు. అందరూ మహా సంపన్నులు. పెద్దపెద్ద వాళ్లు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం లేని వాళ్లు. ఇక పోయిన ప్రాణాన్ని, జిగటగా గడ్డకట్టిన ఒక చిన్న ఎర్రటి మడుగులో సగం మునిగిన మొహాన్ని ఎలా గుర్తుపడతారు. ఎవరనేది తెలియలేదు. ఎవరో అన్నారు.. ‘కాల్ ది పోలీస్ ఫస్ట్’.చొరవైన వాడే.. మొబైల్ అందుకుని 100 నొక్కాడు.ఆ చప్పుడుకు– ఈ నొక్కడానికి మధ్య గంటన్నర గడిచింది.రక్షక్:నా పేరు రక్షక్. సెక్టార్ వెహికల్ అంటుంటారు నన్ను. 100 నుంచి మా మాధాపూర్ స్టేషన్కు కాల్ వచ్చింది. అక్కడ నుంచి రౌండ్స్లో ఉన్న సెక్టార్ వెహికల్లోకి సెట్లో సమాచారం వచ్చింది. నన్ను అధిరోహించి ఒక హెడ్ కానిస్టేబులు, ఇంకో కానిస్టేబులు మాత్రమే ఉన్నారు. అయినా వాళ్లకు జంకేమిటి? ఎంచక్కా ఇక్కడకు వచ్చేసాం. ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారని? ఏమీ జడుసుకోలేదు. ఆశ్చర్యపోలేదు. కాకపోతే, అక్కడ ఏడుపులూ పెడబొబ్బలు లేకపోవడం, అనుభవం కొద్దీ, గమనించి ‘‘ఇంకా ఎవరిదో గుర్తుపట్టలేదా’’ అని మాత్రం అన్నారు. ఆ మాటకు, గుమికూడిన వాళ్లలో ఎవరైనా సిగ్గుపడ్డారో లేదో నేను గమనించలేదు. ‘‘లైబ్రరీలో చూశాను.. ఫ్లాట్ తెలీదు గానీ..’’ అని ఒకే పెద్దాయన అన్నాడు. ఇప్పుడైనా వాళ్లు సిగ్గుపడ్డారో లేదో!మరో అరగంటలో మోటారు సైకిల్పై ఎస్సై కూడా వచ్చేశాడు. అనుభవమే వారికి పనిలో వేగం అందిస్తుందనుకుంటా. ఆయన వచ్చాక టైం వేస్ట్ జరగలేదు. ఆ ఇరుకు సందువైపు ఫేస్ చేస్తూ ఉన్న రెండు టవర్లలోని ఫ్లాట్స్ నంబర్లన్నింటినీ రెండు కాగితాలపై వరుసగా రాశాడు మొత్తం 36 తేలాయి. ఆ ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైనా అక్కడ గుమికూడిన జనంలో ఉన్నారేమో అని ఒక్కొక్క నంబరూ ఎలుగెత్తి అరుస్తూ అటెండెన్స్ పిలిచినట్లుగా పిలవసాగాడు. 20 మంది దాకా అక్కడే ఉన్నారు. ఆ నంబర్లు అన్నింటినీ స్ట్రైక్ ఆఫ్ చేసిన కాగితాలను చెరో కానిస్టేబుల్ చేతికిచ్చి రెండు బ్లాకుల్లోని మిగిలిన ఫ్లాట్ల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా కనిపించడం లేదేమో అడిగి రమ్మని పురమాయించాడు.ఆ చప్పుడుకు– ఈ పురమాయింపుకు మధ్య మూడు గంటలు గడిచాయి.కాఫీ కప్పు: ఏ13బీ. కాలింగ్ బెల్ మోగింది. ముందుగదిలోనే కూర్చుని కాఫీ తాగుతున్న అనిల్.. ‘‘అమ్మా వాకింగు నుంచి నాన్నొచ్చినట్టున్నాడు చూడూ’’ అని కేకేశాడు. వంటింట్లోంచి ఆమె వచ్చి తలుపుతీసింది. ఎదురుగా కానిస్టేబులు. విషయం తెలిశాక, ‘కిందికి వెళ్లి చూసొస్తా’నంటూ అనిల్ శాండల్స్లో కాళ్లు పెట్టాడు. ‘వాకింగుకు వెళ్లిన మీ నాన్న కూడా అక్కడే ఉంటాడేమో.. తొందరగా రమ్మను.. ఆయన టిఫినుకు లేటైంది’ వెనుకనుంచి అమ్మణ్ణమ్మ కేకేసింది. ఆ జనంలో ఆయన లేడని ఆమెకు తెలీదు. నా పేరు కాఫీ కప్పు. ఫిల్టర్ కాఫీ నా ప్రత్యేకత. ‘ఆయన’కు శ్రీమతి అందించే ప్రతి ఉదయపు జీవనోత్సాహాన్ని నేనే! ఆయన నాకు కొన్నేళ్లుగా చాలా బాగా తెలుసు. తెల్లారిందని పల్లెకు చెప్పడానికి తాము కూస్తున్నామని కోళ్లు అనుకుంటాయి. ఆకలేసిందని తనకు చెప్పడానికి అవి కూస్తున్నాయని ఆయన అనుకుంటాడు. వాటి కూత పూర్తికాక ముందే లేచి, మేతతో తయారవుతాడు. ఒక్కో గంపను ఎత్తి, కోళ్లను వదులుతూ గింజలు నేలపై చల్లుతూ తన రోజును మొదలెడతాడు. వేసిన గింజలన్నీ తిన్న కోళ్లు తమ స్వప్రయత్నం ప్రారంభిస్తూ పెరటి బాట పట్టేసరికి ఆరుగంటలవుతుంది. గంట కొట్టినట్టుగా అమ్మణ్ణి కాఫీ గ్లాసుతో వాకిట్లోకి వస్తుంది. (అది కూడా నేనే. పల్లెలో నా రూపం గ్లాసే) ఇద్దరూ కలిసి మట్టి అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతారు. ఆ తర్వాతే మిగిలిన దినచర్య. అలా బతకడం అలవాటైన ఈశ్వరయ్యని తెచ్చి ఇక్కడ నాలుగు గోడల మధ్య బందీ చేశారు. తారసిల్లిన ప్రతిప్రాణినీ పలకరించుకుంటూ ఊరంతా తిరగడం, గుడికో పొలానికో వెళ్లి రావడం మాత్రమే తెలిసిన ఈశ్వరయ్య కొత్తగా వాకింగ్ నేర్వలేకపోయాడు. ప్రయత్నించాడు గానీ పలకరింపు కూడా ఉండని, మౌన శవయాత్ర లాంటి ఆ నడకలు రుచించక మానుకున్నాడు. ఎప్పుడైనా లైబ్రరీ దాకా వెళ్లి వచ్చేవాడు. ఇంతకుముందు ఎవరో ‘చూసినట్టుగా ఉన్న’దని అనడం అందువల్లే. ఇవాళ కూడా అమ్మణ్ణి ఆరు గంటలకే ఆయన చేతికి నన్ను అందించింది. అనిల్, అతడి భార్య అప్పటికి నిద్ర లేవలేదు. అప్పుడే లేవరు. నన్ను అందించి, ఆమె వంటగది శుభ్రం చేసే పనిలో పడింది. ఆయన నాతో సహా బాల్కనీలోకి చేరాడు. చివరి చుక్క వరకు, నాలోని ఉత్తేజాన్ని ప్రతిసారీ తనలోకి వంపుకునే ఈశ్వరయ్య.. కనీసం నన్ను ఒక్కసారైనా చుంబించకుండా.. పొగలు కక్కుతూ ఆశ్చర్యపోతున్న నన్ను రెయిలింగ్ గోడపై ఒక చివర్న ఉంచాడు. లోపల సుడిగుండాలు. ఎన్నో, ఏవేవో, ఎందుకు, ఎలా తిరుగుతున్నాయో ఎవరికి తెలుసు? నానుంచి కాస్త దూరం జరిగి రెయిలింగ్ మీదుగా ముందుకు వంగాడు. ‘రెయిలింగ్ యోగా’ భంగిమేమో అని నవ్వుకున్నాను, పొగలు కక్కుతూనే. ఇంకొంచెం వంగాడు. ఇంకా వంగాడు. ఇంకా.. వంగాడు! అసలు అది వంగడమేనా? నేను కంగారు పడేలోగానే అది జరిగింది.ఈశ్వరయ్య పైనుంచి కిందికి జారిపోయాడు. నేను నిశ్చేష్టనైపోయాను. పొగలూ చల్లారిపోయి, కాఫీ పొక్కు కట్టింది.కొన్ని క్షణాలకు దబ్బున చప్పుడు వినిపించింది. కొన్ని నిమిషాలకు, ఇప్పుడు, అనిల్ కిందకు వెళ్లిన తర్వాత, ఏడుపు వినిపించింది. నా అంతఃకర్ణాలను గ్రౌండ్ ఫ్లోర్ దాకా రిక్కించాను. వెక్కుతూ వెక్కుతూ ‘‘మా.. నాన్న’’ అంటున్నాడు. నా అంతఃచక్షువులను కూడా కిందికి సారించాను. నాన్న పక్కనే మోకాళ్లపై కూలబడ్డాడు. చుట్టూ ఉన్న గుంపు మొత్తం కాస్త స్థిమితపడ్డారు. అప్పటిదాకా ఉన్న సస్పెన్స్ తీరిపోయినందుకు! ‘‘ఏ ఫ్లాట్?’’ ఎవరిని ఉద్దేశించామనే స్పష్టత లేకుండా అనేక సిగ్గులేని గొంతుకలు గునగున గొణుగుతున్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకెళ్లి ‘‘ఏ13బీ సార్’’ అనడంలో అందరికీ జవాబు దొరికింది. సస్పెన్స్ తీరిపోయింది గనుక.. ఒకరిద్దరు తమ ఇళ్లకు మళ్లుతున్నారు. ఒకరిద్దరు మళ్లీ చెవులకు తగిలించుకుంటున్నారు. ఈలోగా అంబులెన్సు సైరన్ కూడా వినిపించింది.ఆ చప్పుడుకు– ఈ సైరన్ చప్పుడుకు మధ్య మూడున్నర గంటలు గడిచాయి.గీతామందిరం: నా పేరు గీతామందిరం. ఈ గేటెడ్ ప్రపంచానికి నేనే కమ్యూనిటీ హాలును. నాలుగు అల్మరాలను ఓ మూలగా పేర్చిన లైబ్రరీ అనే పదార్థం కూడా యిక్కడే. పదిరోజుల కిందట తొలుత ఉస్మానియా అంబులెన్సు మీద, తర్వాత వైకుంఠరథం మీద సవారీ వెళ్లిన పెద్దాయన నాకు తెలుసు. ఇవాళ ఆయనకు పెద్దకర్మట. ఇక్కడ నా సమక్షంలో ప్రవచనం ఏర్పాటుచేశారు. ఆత్మానంద స్వామి వచ్చాడు. నీట్గా ట్రిమ్ చేసిన బెత్తెడు గడ్డం, పొందికైన బట్టతలతో ఉన్నాడు. కాషాయాంబరాలు, మెడలో రంగురంగుల పూసలు. దణ్ణం పెట్టించుకోడానికి తగిన గెటప్పులోనే ఉన్నాడు. స్వామీజీ వస్తున్నారని వాట్సాప్ గ్రూపులో బాగా ప్రచారం జరగడం వలన.. చాలా ఫ్లాట్స్ నుంచి మనుషులొచ్చారు. అనిల్ కుటుంబం ఎటూ ఉంది. ఆయన ప్రారంభించాడు.‘‘ఈశ్వరయ్య పరమేశ్వరుడిలో లీనమయ్యాడు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్లే.. కానీ, ఈశ్వరయ్య శివైక్యం చెందిన మూడున్నర గంటల దాకా ఆయన ఎవరో మీలో ఎవ్వరూ గుర్తుపట్టలేదంటే ఎంత సిగ్గు?’’ ఆత్మానంద పాజ్ ఇచ్చాడు.‘అలా గడ్డిపెట్టు వెధవలకి. ముదనష్టపు ప్రపంచం. ఇరుగు పొరుగు ఎవ్వరో తెలియకుండా ఇనుప తెరలు కట్టేసుకున్న ప్రపంచం. హృదయాల్ని హిడెన్ ఫోల్డర్లలో దాచేసి.. కృతకమైన బంధాల్ని, ఉద్వేగాల్ని వెలుపలినుంచి తమపైకి వెల్లువెత్తించుకునే ప్రపంచం! అమానవీయత తమ తరం లక్షణంగా మారుతోందనే స్పృహ కూడా లేని దౌర్భాగ్యపు ప్రపంచం!’ ఆత్మానందకు జేజేలు అనుకుంటూ మిగిలినోళ్లను ఈసడించుకున్నాను నేను. ఆయన కొనసాగించాడు. ‘‘ఇది తప్పు. మనుషుల మధ్య బంధాలు ఉండాలి. సత్సంగాలు జరుగుతూ ఉండాలి. కలుస్తూ ఉండాలి. మీలో మీరు కలవడం కాదు, గురువుల్ని పిలిచి, సద్బోధలు గ్రహిస్తూ ఉండాలి..’’ వీడి పాసుగూల. పెద్దదినాన్ని కూడా మార్కెటింగుకు వాడుకుంటున్నాడే! ‘‘ఈశ్వరయ్య మరణం లాంటిది మరొకటి జరగకూడదు. మంత్రంలాంటి మాట చెబుతాను పాటించండి’’‘నీ మార్కెటింగ్ ఎలా తగలడ్డా పర్లేదుగానీ, మంచి మంత్రం చెప్పు స్వామీ..’ ఆశగా ఎదురుచూస్తున్నాను. ‘‘తమ ఇళ్లలో పెద్దవాళ్లను, ముసలివాళ్లను ‘మెయింటైన్’ చేస్తున్న ప్రతి ఒక్కరూ..’’భళా.. ఇలాంటి పాఠాలే స్వాములనుంచి ప్రపంచానికి అందాలి. నా ఉత్సుకత పెరిగిపోయింది. ‘‘తమ బాల్కనీలకు గట్టి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకోండి..’’ ఆత్మానంద ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. గంట ప్రవచనానికి మాట్లాడుకున్నారంట. అప్పుడే ఎందుకు ఆపుతాడు?చివరగా నేను: నా పేరు ఈశ్వరయ్య. ఆ రోజున నేను, నా విముక్తిని, బలవంతంగా, ఈశ్వరేచ్ఛతో నిమిత్తం లేకుండా, పుచ్చుకున్నాను. ఇవాళ్టిదాకా నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండాలని అందరూ అనుకుంటుండబట్టి.. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని వేచిచూశాను. ఇక చాలు. «పరమేశ్వరుడి లీలలో లీనమయ్యే ముందు.. ఈ నాటకం చాలించేముందు, ఎవడో స్వామిట కదా, నాకోసమే వస్తున్నాడుట కదా.. విందామని ఆగాను. ఆ అమృతోపదేశాన్ని విన్నాను. రాయజాలని భాషలో, ఎవరికీ వినపడదని తెలిసినా, గట్టిగా తిట్టుకుని, నా దారిన చక్కాపోయాను. -
కథాకళి: మంచివాడు
చిత్రాంక్ని రెండు రోజుల నుంచి ఓ సమస్య బాధిస్తోంది. అతనికి ఎదురు చూడని డబ్బు వచ్చింది. అదీ పెద్ద మొత్తంలో. అతను పనిచేసే కంపెనీలోని ఓ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తూండగా, ఆఖరి దశలో ఓ గడ్డు సమస్య వచ్చి ఆ ప్రాజెక్ట్ ముందుకి కదలడం లేదు. ఆ కంపెనీ సీఈవో ఆందోళనగా ఉన్నాడు. చిత్రాంక్ దాన్ని ఆవిష్కరించటంతో సీఈవో అతనికి పదిలక్షల రూపాయల నగదు బహుమతిని ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ కారుని అమ్మేసి ఆ పదిలక్షలతో కొత్త కారుని కొనాలని అనుకున్నాడు. కాని అందుకు అతనికి మరో ఆలోచన అడ్డం వస్తోంది. చిత్రాంక్కి చిన్నప్పటి నుంచి తన తండ్రివైపు బంధువులని ఆదుకోవాలని కోరిక. వారంతా పేదవారు. తన బీద అత్తయ్యకి అప్పుడప్పుడు చిన్న మొత్తాలు సహాయం చేస్తుండేవాడు. ఈ మధ్య చిత్రాంక్ని అతని అత్తయ్య తన ఇద్దరు పిల్లల కోసం పెద్ద మొత్తం అడిగింది. డబ్బు లేక ఆ కోరిక తీర్చలేకపోయాడు. తనకి ఆ పదిలక్షలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు. అన్ని అవసరాలకి ఇప్పుడున్న కారు చాలు. కాబట్టి ఆ పదిలక్షలని తన అత్తయ్య పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కొద్దిరోజుల క్రితమే అత్తయ్య రెండో కొడుకు తనకి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టుకోవాలని ఉందని మాటల్లో చెప్పాడు. అతనికి నాలుగు లక్షలు, మిగిలింది వాడి అక్క పెళ్ళికి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది.ఆ ఆలోచన వచ్చినంత త్వరగా దాన్ని ఆచరించడానికి అతనికి మనసు రాలేదు. తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని తేలిగ్గా దానం చేయగలుగుతారని, ఎక్కువ మొత్తం డబ్బున్న వాళ్ళు చేయలేరన్న నిజం అతనికి అనుభవపూర్వకంగా తెలిసింది. అతనికి ఆ సొమ్ముని అత్తయ్య కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని ఉంది. అదే సమయంలో చూస్తూ చూస్తూ అంత మొత్తం ఇవ్వడానికి మనస్కరించడం లేదు. గత రెండు రోజులుగా చిత్రాంక్ మనసులో ఈ విషయం మీద తర్జనభర్జనలు, తర్కవితర్కాలు సాగుతున్నాయి. చిత్రాంక్ బ్రహ్మచారి. కాబట్టి సలహా తీసుకోడానికి భార్య కాని, తల్లితండ్రులు కాని లేరు.అతను ఆ ఆదివారం సాయంత్రం తను చాలాకాలంగా వెళ్ళాలనుకునే చెరువుకి చేరుకున్నాడు. చుట్టూ కొబ్బరి చెట్లు. దూరంగా కొండల వరుస. అతనికి అక్కడి ప్రశాంతత నచ్చుతుంది. కారుని పార్క్ చేసి నడిచి, చెరువు ఒడ్డున ఉన్న సిమెంట్ బెంచ్ దగ్గరికి చేరుకుని జేబురుమాలుతో దాని మీద దులిపి కూర్చున్నాడు. ఎదురుగా దాదాపు వంద ఎకరాలకి పైగా విస్తీర్ణం ఉన్న ఆ చెరువు మీంచి చల్లటి గాలి వీస్తోంది. అవతల ఓ చిన్న గ్రామం ఉంది. నీళ్ళ వంకే చూస్తూంటే అందులో కొన్ని బాతులు కనిపించాయి.కొద్దిసేపటికి ఒకాయన చెరువు దగ్గరికి వచ్చాడు. ఆయన ఒంటి మీద మాసిన ఖాకీ రంగు నిక్కర్, బనీన్ ఉన్నాయి. ఆయనకి అరవై ఏళ్ళ దాకా ఉండచ్చని తెల్ల జుట్టుని, మొహాన్నిబట్టి అంచనా వేశాడు. ఆయన బెంచ్ మీద కాక ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపాగి తనతో తెచ్చిన మూట తీసి అందులోంచి ఏదో తీసి నీళ్ళలోకి చల్లాడు. తర్వాత ఆయన వెల్లకిలా పడుకుని కూనిరాగం తీస్తూ ఆకాశంలోకి చూడసాగాడు. ఆయన లోకంలో ఎలాంటి దుఃఖం లేనివాడుగా చిత్రాంక్కి తోచింది. బాతులు దూరం నుంచి బిలబిలా ఆయనవైపు ఈదుకుంటూ వచ్చాయి. ఆయన నీళ్ళల్లో చల్లిన, నీటి మీద తేలే మరమరాలని అవి తినసాగాయి. చిత్రాంక్కి ఆశ్చర్యం వేసింది. ఆయన దరిద్రుడిలా ఉన్నాడు. ఆ బాతులు ఆయనవి కావు. అయినా ఆయన వాటికి మేత తెచ్చి వేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు.‘‘ఏం చేస్తున్నావు?’’‘‘ఆకాశంలోకి చూస్తున్నాను.’’‘‘వాటికి ఏదో వేస్తున్నట్లున్నావు?’’‘‘అవును. మరమరాలు.’’‘‘అవి నీ పెంపుడు బాతులా?’’‘‘కావు.’’‘‘నువ్వు ఉండేది ఎక్కడ?’’దూరంగా ఉన్న గ్రామం వంక చేత్తో చూపించాడు.‘‘రోజూ వాటికి మరమరాలు తెచ్చి వేస్తుంటావా?’’‘‘మూడు నాలుగు రోజులకోసారి.’’తనకేమీ కాని బాతులని ఆయన ఆదుకుంటున్నాడు. తన తండ్రి మేనల్లుడిని, మేనకోడల్ని ఆదుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నా, అవకాశం వచ్చేసరికి తను వెనక్కి వెళ్ళడం సబబు కాదనే గట్టి నిర్ణయాన్ని ఆయన్ని చూసి చేసుకోగలిగాడు. ఆయన నిశ్శబ్దంగా మూటలోంచి గుప్పెడు మరమరాలు తీసి చిత్రాంక్ చేతిలో పోశాడు. చిత్రాంక్ వాటిని నీళ్ళలోకి చల్లగానే బాతులు వాటి మీదకి ఎగబడ్డాయి. తను మనిషి. స్వార్థం ఆవరించుకున్న మనిషి అనుకున్నాడు. తన సమస్యకి ఇంత తేలిగ్గా జవాబు దొరుకుతుందని ఎదురుచూడని చిత్రాంక్ ఆయనతో చెప్పాడు.‘‘నువ్వు చాలా మంచివాడివి.’’ఆయన జవాబు చెప్పలేదు. చిత్రాంక్ తన కారు దగ్గరికి నడిచి తాళం తీసి, లోపలకి ఎక్కి కూర్చుని తేలికపడ్డ మనసుతో ఇంటి దారి పట్టాడు. కారు శబ్దం బాగా దూరం అయ్యేదాకా ఆగి ఆ వ్యక్తి లేచి ఓసారి చుట్టూ చూశాడు. తర్వాత సంచీలోంచి మరమరాలని తీసి ఒడ్డున పోసి సంచీని ఖాళీ చేశాడు. కొన్ని బాతులు నీళ్ళల్లోంచి నేల మీదకి వచ్చి వాటిని తినసాగాయి. ఆయన ఓ బాతుని అందుకుని దాని మెడ విరిచాడు. అది రెక్కలు కొట్టుకుంటూంటే దాన్ని ఆ సంచీలో వేసుకుని లేచాడు. కొద్దిసేపట్లో ఎర్రబడ్డ సంచీ నిశ్చలమైంది. ఆ వ్యక్తి చెరువు వెనక ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ప్రధాని మోదీని మెప్పించిన వంటలక్క యాదమ్మ..!
ఏదైన శుభకార్యానికి వెళ్లొస్తే మొదటగా అందరూ మాట్లాడుకునేది వడ్డించిన వంటల గురించే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. వంటకం ఎలా ఉంది..? ఎన్ని రకాలు వడ్డించారు? ఇలా ఓ చర్చే జరుగుతుంది. అయితే ఈ వంటలక్క చేయి పడితే రుచి చూడడం అవసరం లేదు. నాన్వెజ్లో బగారా, చికెన్, మటన్, ఫిష్, తలకాయ, బోటీతో పాటు వెజ్లో పచ్చిపులుసు, భక్షాలు, పప్పుచారు, పులిహోరాతో పాటు పంచభక్ష పరమాన్నాలు లొట్టలేసుకుని తింటారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్న కరీంనగర్లోని సప్తగిరికాలనీకి చెందిన ప్రముఖ క్యాటరింగ్ నిర్వాహకురాలు గూళ్ల యాదమ్మ చేతి వంటను రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ రుచిచూశారు. ఒకప్పుడు రూ.15కు దినసరి కూలీగా చేసి, ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్న యాదమ్మ చేతివంటపై సండే స్పెషల్..!!విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికైనా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు.మోదీ మెచ్చిన వంటలు2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు.వందలాది మందికి ఉపాధికిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు.ఈ జన్మలో కలిగిన భాగ్యంకరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
క్లాసిక్స్ అంటే ఏమిటి
‘ప్రపంచంలోని పుస్తకాలన్నీ రెండే రకాలు! కొన్ని క్షణకాలం నిలిచేవి – మరికొన్ని కలకాలం నిలిచేవి’ అన్నాడు పందొమ్మిదవ శతాబ్దపు బహుముఖ ప్రజ్ఞావంతుడు జాన్ రస్కిన్. అలా కలకాలం నిలిచే పుస్తకాలనే ‘క్లాసిక్స్’ అంటూవుంటారు. సాహిత్య విమర్శలో ఏ మాట చెప్పినా, ఆలంకారికంగానే చెప్తారు; అంచేత ‘కలకాలం’ అంటే సుదీర్ఘకాలమనే మనం అర్థంచేసుకోవాలి. ‘ఎంత కాలంగా నిలువనున్న సరుకైతే అది అంత ప్రశస్తమైనది’ అనే ప్రమాణం చింతకాయ పచ్చడికీ ఉసిరిపచ్చడికీ వర్తించినంతగా క్లాసిక్స్కు వర్తించదు. ‘పురాతన కళాఖండాలు మనకు శ్రేష్ఠమైనవిగా అనిపించడానికి వాటి ప్రాచీనత కారణం కాదు! అలాంటి క్లాసిక్స్ ఎప్పుడు చదివినా ఎంతో తాజాగానూ, శక్తిమంతంగానూ, ఆరోగ్యదాయకంగానూ అనిపించడం వల్లనే అవి క్లాసిక్స్ అయ్యాయి‘ అన్నాడు గోథే. ప్రతి విషయాన్ని చమత్కారంగా చెప్పే అమెరికన్ మహారచయిత మార్క్ ట్వైన్ మాత్రం క్లాసిక్స్నూ వదలలేదు! ‘ప్రతిఒక్కరూ చదవాలని అనుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ చదవని ఉద్గ్రంథాలే క్లాసిక్స్’ అన్నాడట ఆ మహానుభావుడు. అది తప్పని ఆయన విషయంలోనే రుజువైంది. హెమింగ్వేలాంటి వాళ్లు, ట్వైన్ రాసిన ‘హక్ల్ బెరీ ఫిన్’ నవలను క్లాసిక్గా పరిగణించిన మాట – దాన్ని చదవాలని ఒకప్పుడు మనమంతా ఉవ్విళ్లూరిన మాట నిజమే కదా! అంచేత, ఈ మాట అంటున్నప్పుడు మార్క్ ట్వైన్ తన గుబురు మీసాల మాటున నవ్వుకునే వుంటాడని గ్రహించాలి!! ఏతావాతా, దీర్ఘకాలం మనగలగడం ఒక్కటే క్లాసిక్స్ లక్షణం కాదు – కనీసం అది వాటి ప్రధాన లక్షణం కూడా కాదని తేలిపోయింది! జనజీవనంలో అనంతంగానూ, స్థిరంగానూ కొనసాగే కొన్ని ప్రమాణాలు క్లాసిక్స్లో ప్రముఖంగా కనిపించి తీరాలి. మానవమేధను మరింత రసవంతం చేసే లక్షణం దాంట్లో ఉండి తీరాలి. భూగోళమంతా విస్తరించుకుని వున్న మానవాళిలో ప్రతి నిత్యం దర్శనమిచ్చే భావావేశం క్లాసిక్స్లో పెల్లుబుకుతూ ఉండాలి. ఒక్కమాటలో చెప్పుకుంటే, క్లాసిక్స్లో – ఏదో ఒక రూపంలో– మౌలికమైన, విస్తృతమైన, లోతైన ఆలోచన – అనుశీలన – ఆవిష్కరణ వ్యక్తమై ఉండాలి. టీయస్ ఇలియట్ లాంటి నవ్య సంప్రదాయవాదుల లెక్క ప్రకారం, క్లాసిక్స్లో అంతర్నిహితంగా నిర్దిష్ట నైతికబోధన ఉండాలి. పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో, ఈ ప్రతిపాదనను సమర్థించేవాళ్లకన్నా, పట్టించుకోనివాళ్లే ఎక్కువ! విషయమేమిటంటే, కొన్ని తరాలపాటు పాఠక లోకాన్ని ప్రభావితం చేసే లక్షణాలున్న గొప్ప పుస్తకాలన్నీ క్లాసిక్సే. ఉదాహరణకి గురజాడ ‘కన్యాశుల్కం’, చలం ‘మైదానం’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలు’, దేవులపల్లి ‘కృష్ణపక్షం’, సురవరం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది!’, దాశరథి ‘అగ్నిధార’, నవీన్ ‘అంపశయ్య’ – ఇవన్నీ క్లాసిక్సే. నాలాంటి వాడికి మల్లారెడ్డి, రాంభట్ల, సినారె అనువదించిన ‘మఖ్దూం కవిత’, సదాశివ ‘యాది’ కూడా క్లాసిక్స్ గానే కనిపిస్తాయి! అవి ఫలానా దేశంలో, ఫలానా భాషలో, ఫలానా కాలంలో వెలువడి వుండాలనేం లేదు. మనం ఈ విషయం గురించి ఇక్కడ చర్చించుకుంటూ ఉండగానే, ఏదో గొప్ప క్లాసిక్కు శ్రీకారం చుట్టడం జరిగివున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మాటకొస్తే, ప్రతి క్లాసిక్ అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, వేర్వేరు భాషల్లో పుడుతూ వచ్చిందే! నోబెల్ బహుమతో – లేదా పులిట్జర్ పురస్కారమో – లేదా బుకర్ ప్రైజో పొందిన రచనలే క్లాసిక్స్ అని ఎవరూ అనరు – అనలేరు! సామాన్యయుగానికి పూర్వం ఏడో శతాబ్దిలో హోమర్ గానం చేసిన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’లకు ఏ నోబెల్ ప్రైజ్ వచ్చిందని అవి క్లాసిక్స్ కాగలిగాయి? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వాల్మీకి ‘రామాయణ’ కావ్యానికి ఏ పులిట్జర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వ్యాస ‘మహాభారత’ ఇతిహాసానికి ఏ బుకర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? అంతెందుకు – టాల్ స్టాయ్ రాసిన ‘ఆనా కెరినినా’ గానీ, ‘యుద్ధం–శాంతి’ గానీ ఏ పురస్కారానికీ నోచుకోలేదు. అవి క్లాసిక్స్ కాదనడానికి ఎవరికైనా గుండెలున్నాయా? ఇక, జేమ్స్ జాయిస్ రాసిన ‘యులిసెస్’కు ఏ బహుమతీ దక్కకపోగా తీవ్రమైన ఆంక్షల పోటులూ, సెన్సార్ కత్తెర వేటులూ మాత్రమే ప్రాప్తమయ్యాయి. అది మేలిరకం క్లాసిక్ సుమా! అని పనిగట్టుకుని చెప్పాలా? హోర్హే లూయీ బోర్హే రాసిన ‘ఫిక్షన్’కు నోబెల్ పురస్కారం దక్కకపోవడానికి, ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావడం అందరికీ తెలిసిందే! అంతమాత్రాన అది క్లాసిక్ కాకపోతుందా? ఈ జాబితా సుదీర్ఘమైంది. జార్జ్ ఆర్వెల్, వర్జీనియా వూల్ఫ్, చినువా అచెబే, స్కాట్ ఫిట్జెరాల్డ్ లాంటి మహా రచయితల రచనలెన్నో ఉన్నాయి అందులో! క్లాసిక్స్ అంటే ఏమిటో – స్థూలంగా – అర్థం చేసుకోవడానికి ఈ చర్చ సరిపోతుందనుకుంటా. -
సాహిత్య దీపాన్ని అందించే ప్రయత్నం చేశా!
‘పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల గుండెల్లో వారి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే! భవిష్యత్తుకు భరోసాగా నిలిచే ఈ తరం పిల్లల పెంపకంలో ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు.’ అంటారు సినీ గీతరచయిత సుద్దాల అశోక్తేజ. పిల్లల పెంపంకంలో ఎదురయ్యే సాధకబాధకాల గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు...‘జోలాలి జోలాలి జోలాలి.. జోల పాడుతా బజ్జో నా తల్లి / నిదుర తల్లిని బతిమలాడని .. నీలి కళ్లలో నిదురపొమ్మని/ రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో..’ ఇది నేను రాసిన సినిమా పాట. నిజానికి రాత్రివేళల్లో పిల్లలను జోకొడుతూ నిద్రపుచ్చితే, పిల్లలు చెప్పే విషయాలు వింటే.. వారు ఎంతో భరోసాగా ఫీలవుతారు. ఎన్ని పనులున్నా తల్లిదండ్రులు చేయాల్సిన పని రోజులో కొంతసేపు పిల్లలతో గడపడం. నాకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. వారు పుట్టే సమయానికి మేం కడు పేదరికంలో ఉన్నాం. నాకు ఉద్యోగం లేదు. నా భార్య నిర్మల మిషన్ కుట్టేది, బీడీలు చుట్టేది. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో అతికష్టమ్మీద ప్రైవేట్స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మా జీవనం కొంత మెరుగైంది. మా నాన్న హయాంలో కూడా ఆయనకు వచ్చేది కొద్దిపాటి ఆదాయమే. అయినా అంతా అందులోనే బతికాం. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా పిల్లల పెంపకంలో మా అమ్మనాన్నలు ఏం చేశారో, నేనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. మా అమ్మనాన్నలు మా దోసిట్లో పెట్టిన సాహిత్య దీపాన్ని మా పిల్లల చేతుల్లో పెట్టి, వెలిగించే ప్రయత్నం చేశాను. వాళ్లూ నా అంచనా మేరకు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. చలం ‘బిడ్డల శిక్షణ’..స్కూల్ నడుపుతున్న సమయంలో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కణ్ణుంచి మా జీవనం మరికాస్త మెరుగైంది. ఇంటి పనులు, పిల్లల పనులు మా ఆవిడతో పాటు నేనూ కలిసి చేసేవాడిని. మా ఆవిడకు నేను చేసే పనులను చూసి, పిల్లలు కూడా ఇంటి పనుల్లో సాయం చేసేవారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం చదివింది. అది మా ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత చిరాకు సృష్టించినా ఒక్కనాడు కూడా వారి మీద చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచింది. మా ఇంట్లో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం అలవాటుండేది కాబట్టి, మా తమ్ముడు, చెల్లెలికి కథలు చెబుతుంటే మా పిల్లలు కూడా వినేవాళ్లు. ఇప్పుడు మా మనవలు, మనవరాళ్లకు మహాభారతం, భాగవతం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అప్పట్లో సెల్ఫోన్లు, టీవీలు లేకపోవడం వల్ల సామాజిక పరిస్థితులు కూడా నాకు సహకరించాయి. ఇప్పుడు నా పిల్లల పిల్లలు వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పిల్లలకు ‘చందమామ రావే.. ’ పాటలు, ‘చందమామ కథలు’ లేవు. యాంత్రికంగా పరుగులు వద్దుఈ రోజుల్లో భార్యభర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితులు వచ్చాయి. అందుకు ఇంట్లో అవసరానికి మించిన ఆడంబర వస్తువులూ వచ్చి చేరాయి. వాటి కోసం సంపాదన తప్పనిసరి అయ్యింది. కెరీర్ పరుగు పందెంలో జీవితాలు యాంత్రికం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు, గూగుల్కు పిల్లలను అప్పజెబుతున్నారు. డిజటల్లో ఏం చూసి నేర్చుకుంటున్నారో, అదే నేటి పిల్లలు.పిల్లలతో ఆటలు మేలుపిల్లల చిన్నప్పుడు వారితో ఆటలాడేవాడిని. ఉదయం వాకింగ్కు తీసుకెళ్లేవాడిని.. వారితో మాట్లాడే ఆ కాసేపు ‘నా తండ్రి నా వెనకాల ఉన్నాడు’ అనే ఫీలింగ్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా రోజూ కొంత సమయం గడిపితే పిల్లలు తప్పక మంచి స్థానంలో ఉంటారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చు. వంద పుస్తకాలు చదివినంత జ్ఞానం..సెలవుల్లో మా అమ్మ దగ్గరకు పిల్లలను తీసుకొని వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద తినుబండారాలేమీ లేకపోయినా వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి, పిల్లలందరికీ తనే గోరుముద్దలు పెట్టేది. ఆ సమయంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి వంటి కథలన్నీ చెప్పేది. ఇప్పుడు చిన్నకుటుంబాలు పెరిగాయి. అలాగే, పెంపకంలో చింతనలు కూడా పెరిగాయి. ఇప్పటి పిల్లలు ‘బియ్యం చెట్లు ఎలా ఉంటాయి?’, ‘ప్యాకెట్ల నుంచే కదా పాలు వచ్చేవి’ అని అడుగుతుంటారు. వాస్తవానికి దూరంగా పిల్లలు పెరుగుతున్నారు. పండుగల జీవన విధానం...మన పండగలన్నీ మానవసంబంధాలను కాపాడే క్రమంలో ఏర్పాటు చేసినవే. పెసర గారెలు, బూరెలు, భక్ష్యాలు, నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు... ఇలా పండగలను బట్టి చేసే వంటలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇప్పుడు డబ్బు ఉంటుంది, అందుకు తగిన జంక్ ఫుడ్ సులభంగా లభిస్తుంది. ఫలితంగా పిల్లలకు సరిగ్గా విరేచనాలు కావు, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. పిల్లల ఆరోగ్యం, లోకజ్ఞానం, పరిసరాల జ్ఞానం తప్పనిసరి. వీటిని ఈ రోజుల్లో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.నిర్మలారెడ్డి -
రూ.500 లంచం.. 36 ఏళ్ళు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు .వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది. గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు? -
ఆర్డర్ పెడితే చాలు.. అర్ధరాత్రి కూడా ఎండ!
అర్ధరాత్రి బిర్యానీని ఆర్డర్ చేసినట్టు, ఇకపై రాత్రి పన్నెండు గంటల సమయంలోనైనా సరే, ‘కాస్త ఎండను పంపండి బాబూ.. బట్టలు ఆరేసుకోవాలి’ అని మనం ఆర్డర్ పెట్టుకునే కాలం.. దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్లే! ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీ, అంతరిక్షంలోకి ఏకంగా 50,000 అద్దాలను పంపి, ఎవరికి కావలిస్తే వారికి రాత్రి పూట కూడా భూమి మీదకు ఎండను డెలివరీ చేసేందుకు త్వరలోనే ఒక ప్రయోగాన్ని చేపట్టబోతోంది.రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రయోగాత్మకంగా ఈ వేసవిలోనే సుమారు 60 అడుగుల (18.3 మీటర్లు) వెడల్పు ఉన్న ఒక మోడల్ అద్దాన్ని అంతరిక్షంలో అమర్చనుంది. అది భూమికి 640 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమి మీద ఉన్న సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని చీకటి ప్రదేశాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే ఇకపై రాత్రిపూట వెన్నెలతో పాటు కృత్రిమ సూర్యకాంతి కూడా భూమికి అందుబాటులోకి వస్తుంది. 30 ఏళ్ల క్రితమే రష్యా ప్రయోగం!నిజానికి ఇలాంటి ఆలోచన రావడం మానవ మేధావులకు ఇదే మొదటిసారి కాదు. 1993లో రష్యా వారు ‘జ్ఞామ్యా’ అనే ఒక ఉపగ్రహం ద్వారా 65 అడుగుల వ్యాసం కలిగలిన అద్దాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసి, రెండు మూడు నిండు చంద్రుళ్లులు ఇచ్చేంత వెలుగును భూమి మీదకు పంపగలిగారు. సైబీరియా వంటి మంచు ప్రాంతాల్లో పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ పగటి సమయాన్ని పెంచాలని అలా చేశారు. కానీ అది అప్పట్లో అంతగా ఫలించలేదు. ఇప్పుడు ఈ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ అదే ఆలోచనను భారీ ఎత్తున ముందుకు తీసుకెళుతోంది. అందుకోసం దాదాపు 28 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 235 కోట్లు) పెట్టుబడులు కూడా సమకూర్చుకుంది.ఎండకు ‘సబ్స్క్రిప్షన్’ ‘‘మేము శిలాజ ఇంధనాల (పెట్రోల్, బొగ్గు) స్థానంలో ప్రపంచం మొత్తానికి ఈ అద్దాల కాంతితో విద్యుత్తును ఇస్తాం చూడండి..’’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాస్ బెన్ నోవాక్ ధీమాగా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి 2027 నాటికి మరో రెండు మోడల్ అద్దాలు పైకి పంపిస్తారు. 2028 నాటికి ఏకంగా 1,000 పెద్ద సైజు అద్దాల ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపాలని చూస్తున్నారు. మొత్తం మీద ఆకాశంలో అద్దాలు అనే కొత్త నక్షత్రాలను మనం చూడబోతాం అన్నమాట. ఈ కంపెనీ ఉత్సాహం చూస్తుంటే భవిష్యత్తులో ఓటీటీ రీచార్జ్ లానే ఎండను కూడా చందా కట్టి కొనుక్కునే అవకాశం కల్పించేలా ఉంది. ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ 2030 నాటికి 5,000 అద్దాలు, 2035 నాటికి ఏకంగా 50,000 అద్దాలను అంతరిక్షంలో పరచాలన్న కృత నిశ్చయంతో ఉంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ప్రస్తుత అంచనాల ప్రకారం, రాత్రిపూట మనకు ఒక గంటసేపు సూర్యకాంతి కావాలంటే సుమారు 5,000 డాలర్లు (రూ. 4,62,000) చెల్లించాలి. అది కూడా కనీసం 1,000 గంటల ఒప్పందం చేసుకుంటేనే అంత తక్కువ ధర అట! ఇక, సోలార్ ప్లాంట్ యజమానులతో కూడా – ‘‘మేము రాత్రి పూట మీకు వెలుగు ఇస్తాం. దాని ద్వారా మీరు తయారు చేసే కరెంటు లాభాల్లో మాకు వాటా ఇవ్వండి’’ అని డీల్ కుదుర్చుకోబోతున్నారు.‘పొద్దు కుదరని’ ప్రమాదం!ఎన్ని ప్రయోజనాలున్నా, తక్కిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ ప్రయోగాన్ని ‘సర్కాడియన్ రిథమ్’ (నిద్ర, మెలకువల లయ)పాలిట శాపంగా చూస్తున్నారు. మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. చీకటి పడగానే నిద్రపోవాలని, వెలుగు రాగానే లేవాలని అది చెప్తుంది. రాత్రి పూట అద్దాల వెలుగు వస్తే ఆ గడియారం దెబ్బతింటుంది. మన ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తుంది. ఇది అక్కడితో ఆగదు. జంతువులు ఆహారం దొరకని సమయంలో పిల్లల్ని కనడం, శీతకాలంలో నిద్రావస్థలోకి వెళ్లే జంతువులు మధ్యలోనే మేల్కొనడం వంటి ప్రకృతి విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తాయి. ఎక్కడెక్కడికో వలస వెళ్లే పక్షులు ఈ కృత్రిమ వెలుగును చూసి ‘వేసవి కాలం వచ్చేసింది’ అని పొరబడి, చలి తీవ్రంగా ఉన్న చోట్లకు వెళ్లి ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది.. తేనెటీగలకు, పూలకు ‘పొద్దు’ కుదరక, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.పైలట్లు తికమక పడొచ్చుమనుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆకాశంలో హఠాత్తుగా మెరిసే ఈ అద్దాల వెలుగు విమాన పైలట్లను అయోమయానికి గురి చేయవచ్చు. టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ అద్దాలు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఆరోగ్యం విషయానికొస్తే, రాత్రి పూట కూడా వెలుగు ఉంటే మన శరీరంలో నిద్రకు కారణమయ్యే హార్మోన్లు విడుదల కావు. ఫలితంగా ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి రోగాలు దరి చేరవచ్చు. ఇవన్నీ అలా ఉంచి, ఈ ప్రయోగం వల్ల మొత్తంగా చీకటి మాయమైపోయే ప్రమాదం ఉందని ‘డార్క్ స్కై’ అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఖగోళ శాస్త్రవేత్తల కలవరం!ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశంలో వేల సంఖ్యలో పరిభ్రమిస్తు్తన్న ఉపగ్రహాల వల్ల నక్షత్రాలను, గ్రహాలను సరిగ్గా చూడటం వారికి కష్టమవుతోంది. ఒక పక్క స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు తమ శాటిలైట్లు తక్కువ వెలుగును ప్రతిబింబించేలా (వీటిని డార్కర్ శాటిలైట్స్ అంటారు) ప్రయత్నిస్తుంటే, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ వాళ్లు మాత్రం తమ శాటిలైట్లను వీలైనంత ఎక్కువ మెరిసేలా అమర్చబోతున్నారు. మరోవైపు, టెలిస్కోపులతో తీసే అంతరిక్ష ఫోటోల్లో ఈ అద్దాల వెలుగు ఒక తెల్లటి గీతలా పడి, అసలైన నక్షత్రాల సమాచారాన్ని మింగేసే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుండి కాంతి కాలుష్యంప్రిన్స్ టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గ్యాస్పర్ బాకోస్ ఈ అద్దాల ఆలోచనపై నిప్పులు చెరుగుతున్నారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ వాళ్లు.. ‘‘మేము కేవలం ఒక చిన్న ప్రదేశంలోనే (సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణం) వెలుగు వచ్చేలా చూస్తాం, పక్కన ఉన్న టెలిస్కోపుల జోలికి వెళ్లము’’ అని నమ్మకంగా చెబుతున్నప్పటికీ, ‘‘ఆకాశం నుండి వచ్చే కృత్రిమ అద్దాల కాంతి.. వాతావరణంలోని మేఘాలు, గాలి కణాల వల్ల అటు ఇటు చెల్లాచెదురు అవుతుంది. దీనివల్ల ఆ ప్రాంతం చుట్టూ ఒక పెద్ద ‘లైట్ పొల్యూషన్’ ఏర్పడుతుంది. ఇది ఖగోళ పరిశోధనలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది’’ అని ప్రొఫెసర్ గ్యాస్పర్ అంటున్నారు. ‘‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్ లాంటి కంపెనీలను అంతరిక్షంలో అద్దాలు పెట్టకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇది మన పర్యావరణానికి చాలా రకాలుగా హాని కలిగిస్తుందని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందా, లేక శాస్త్రవేత్తల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ఉపయోగాలు అనేకం!అంతరిక్షంలో అద్దాలు బిగించి, సూర్యకాంతిని భూమి పైన ఉన్న వారికి డెలివరీ చేయటం అనే ఈ ఐడియా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా సన్నివేశంలా ఉన్నప్పటికీ, ఇది కనుక నిజంగా కార్యాచరణలోకి వస్తే, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రిఫ్లెక్ట్ ఆర్బిటర్ చెబుతోంది. రాత్రి పూటాసౌర శక్తి ఉత్పత్తిసోలార్ ప్యానెల్స్ రాత్రిపూట కరెంట్ తయారు చేయలేవన్నది తెలిసిందే. కానీ ఈ అద్దాలు ఉంటే, రాత్రి కూడా సూర్యకాంతిని ప్యానెల్స్ మీద వేసి 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అంటే సోలాన్ విద్యుత్తును నిల్వ ఉంచే బ్యాటరీల అవసరం తగ్గుతుంది.విపత్తు సమయాల్లో వెలుగుభూకంపాలు, వరదలు, దుర్ఘటనలు రాత్రివేళ సంభవించినప్పుడు కరెంట్ పోయి అంతా చీకటిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో గాలింపు చర్యల బృందాలకు ఆకాశం నుండే వెలుగు అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు.వేగంగా ప్రాజెక్టు పనులుమారుమూల ప్రాంతాల్లో మైనింగ్ లేదా నిర్మాణ పనులు జరిగేటప్పుడు, రాత్రి పూట కూడా పగలు మాదిరిగానే పని చేసుకోవడానికి ఈ అద్దాల వెలుగు ఉపయోగపడుతుంది. పని గంటలు పెరుగుతాయి, ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.సైన్యానికి బాసటగా..!మిలిటరీ ఆపరేషన్లు జరిగేటప్పుడు నిరంతరాయంగా సోలార్ పవర్ అందించడానికి, చీకటిలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి ఈ అద్దాల వెలుగును వాడుకోవచ్చు.వ్యవసాయానికీ పండగేమొక్కల ఎదుగుదలకు సూర్యరశ్మి ముఖ్యం. కాబట్టి పంట కాలాల వ్యవధిని పెంచడానికి, మొక్కలకు కావాల్సినంత వెలుగును అందించి దిగుబడిని పెంచడానికి దర్పణకాంతిని వాడుకోవచ్చు.నగర వీధులు కళకళరోడ్ల మీద వేల సంఖ్యలో స్ట్రీట్ లైట్లు పెట్టే బదులు, నేరుగా పై నుండే వెలుగును వాడుకోవచ్చు. అంతేకాదు, దీనివల్ల భూమి మీద ‘లైట్ పొల్యూషన్’ తగ్గుతుందని కూడా ఈ కంపెనీ అంటోంది.కాంతులీనే వేడుకలుపెద్ద పెద్ద ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు, పర్యాటక క్షేత్రాలలో రాత్రి పూట ఒక వింతైన అనుభూతిని కలిగించడానికి ఈ ఆర్టిఫిషియల్ సన్ లైట్ ను వాడుకోవచ్చు. -సాక్షి స్పెషల్ డెస్క్ -
ఐశ్వర్య పయనం!
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ఐశ్వర్య అర్జున్. అతికొద్ది రోజుల్లోనే తన నటనతో మెప్పించి ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. ఇప్పుడు తెలుగు తెరపై ‘సీతా పయనం’ మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలోని విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం...క్రమశిక్షణ నా బలంక్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడం వల్ల కావచ్చు, క్రమశిక్షణ అనేది నా రక్తంలోనే ఉంది. ఫిట్నెస్ విషయంలో కూడా నేను చాలా కట్టుదిట్టంగా ఉంటాను. యోగా చేయకుండా నా రోజు గడవదు.విమర్శలే ఇష్టంసోషల్ మీడియాలో నా గురించి వచ్చే వార్తల కంటే, నా పని గురించి వచ్చే విమర్శలనే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అవే మనల్ని మంచి నటిగా మారుస్తాయని నమ్ముతాను.నాన్న చాలా స్ట్రిక్ట్బెంగళూరులో పుట్టాను. కాని, నా విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. సేక్రెడ్ హార్ట్ స్కూల్, తర్వాత స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాను. ఫ్యామిలీ మొత్తం సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా, చదువు విషయంలో నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు.వెనుక పెద్ద పేరు ఉన్నా...వెనుక ‘అర్జున్ సర్’ అనే పెద్ద పేరు ఉండొచ్చు. కాని, సెట్స్లోకి వెళ్లినప్పుడు నేను కేవలం ఒక నటిని మాత్రమే. ‘పట్టాతు యానై’తో నా ప్రయాణం మొదలైనప్పుడు నాన్న చెప్పిన ఒకే మాట ఇప్పటికీ గుర్తుంది ‘‘నువ్వు చేసే పనికి వంద శాతం న్యాయం చెయ్, మిగిలింది ప్రేక్షకులు చూసుకుంటారు.’’ ఆ మాటలను ఇప్పటికీ పాటిస్తాను.ఫ్యాషన్ పై ఆసక్తియూకేలోని బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. గ్లామర్ ప్రపంచంలోకి రాకపోయి ఉంటే, నేను కచ్చితంగా ఒక ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడేదాన్ని. అందుకే నా దుస్తుల ఎంపికలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.ఇంటి వంటలంటే ఇష్టంఎన్నో రకాల ఇంటర్నేషనల్ వంటకాలు తిన్నా, ఇంట్లో చేసే వేడి వేడి అన్నం, పప్పు రుచే వేరు. వీకెండ్స్లో నా చెల్లెలు అంజనతో కలిసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటాను. అలాగే నాన్నతో కలిసి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటాను.నటిగా మరింత ముందుకుపవర్ఫుల్, ఎమోషనల్ పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా నన్ను నేను నిరూపించుకునే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాను. -
అదే గ్లామర్ డిసైడర్!
సహజమైన అందం, కంఫర్ట్ ఫ్యాషన్ తోనే గ్లామర్కి కొత్త నిర్వచనం ఇస్తూ, తనదైన గ్రేస్తో ప్రతి లుక్ను ప్రత్యేకంగా మలుస్తోంది నటి రుక్మిణి వసంత్. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్ టిప్స్ ఇప్పుడు మీకోసం...లెహంగా.. స్టయిలింగ్: రుతుజ స్టయిల్స్జ్యూలరీ బ్రాండ్: కుందన్కలీ జ్యూలరీ ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.సింప్లిసిటీనే నా సూపర్పవర్. హెవీ మేకప్ కంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే మెరుపు అసలైన గ్లామర్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఫ్యాషన్లో నాకు హెరిటేజ్ టచ్ను మోడ్రన్ గా క్యారీ చేయడం ఇష్టం. – రుక్మిణి వసంత్.రంగురంగుల హారం!ఏ డ్రెస్లోకైనా ఇట్టే మ్యాచ్ అయ్యే ఆల్–ఇన్ –వన్ హారం కావాలా? అయితే ఈ మల్టీ కలర్డ్ నెక్పీస్ మీ వార్డ్రోబ్లో ఉండాల్సిందే! మెడపై ఒక్కసారి రంగుల హరివిల్లు విరిసినట్టే అనిపిస్తుంది. ఒక్క రంగులోనే కాదు, ఎన్నో రంగులు కలిసిన ఈ హారం ఏ ఔట్ఫిట్కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. అయితే, ఈ హారం వేసుకుంటే ఇయర్రింగ్స్ సింపుల్గా ఉండాలి. లేకపోతే మీ లుక్ కంటే జ్యూలరీ మీపై ఓవర్టేక్ చేస్తుంది! అలాగే, నెక్లైన్ సింపుల్గా ఉంటేనే ఈ హారం ఫుల్గా షైన్ అవుతుంది. హై నెక్తో అయితే అది కొంచెం ‘హైడ్ అండ్ సీక్’ ఆడేస్తుంది, కాబట్టి అప్పుడు దీనిని అవాయిడ్ చేయడం మంచిది.హెయిర్ ఓపెన్ గా కంటే, బన్ లేదా జడగా కట్టుకుంటే ఈ హారం క్లియర్గా హైలైట్ అవుతుంది. అప్పుడు ఫొటోలలో కూడా ఫుల్ మెరుపే మీదే! చేతిలో పెద్దగా ఆభరణాలు పెట్టకపోయినా పర్లేదు; ఒక్క ఈ రంగురంగుల హారం చాలు మీ మొత్తం లుక్ని హైలైట్ చేసేస్తుంది. మార్కెట్లో సింపుల్ నుంచి గ్రాండ్ వరకు ఎన్నో డిజైన్లలో అందుబాటులో ఉండటంతో, ప్రతి స్టయిల్ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరుకుతుంది. -
మృత్యువుపై ఘనవిజయం... క్రీస్తు పునరుత్థానం
ఈస్టర్ ఓ జయధ్వని; ఈస్టర్ ఓ ఆశల హారం; ప్రతి హృదయంలో వికసించిన ప్రేమ పరిమళం. సమాధి తలుపులు తెరిచి దివ్యవర్చస్సుతో క్రీస్తు నిలిచిన రోజు. ప్రతి హృదయంలో ప్రేమ సందేశం మార్మోగుతున్న సమయం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మనిషిని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది.యేసుక్రీస్తు జీవితం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తెచ్చింది. ప్రేమ, దయ, వినయం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా; పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి; కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా; పరమాత్ముని బాటలో నడవాలని బైబిల్ ప్రబోధిస్తు్తంది. మొదటి శతాబ్దకాలంలో ఇశ్రాయేలు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో పౌలు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు యూదుజాతిలో పేరెన్నికగలవాడు. తార్సు ప్రాంతంలో జన్మించి ధర్మశాస్త్రంలో అమితాసక్తిని కలిగియుండి గమలియేలు అనే వ్యక్తి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీరాకారంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యంతో పౌలు మొదట్లో ఏకీభవించలేదు. క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిపై అపరిమితమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. యేసు ‘క్రీస్తు’ కాదని వాదించుటే గాక, యేసుక్రీస్తును విశ్వసించినవారిని హింసించుటకు, దూషించుటకు ఇష్టపడ్డాడు.సిరియా దేశంలోని దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వారిని నాశనం చేయడానికి బయలుదేరాడు. దానికి యెరూషలేములోని క్రీస్తును ద్వేషించే మతపెద్దలు అంగీకరించారు. సరిగ్గా దమస్కు పొలిమేరకు చేరుకొనేసరికి మతగర్వంతో, ద్వేషంతో రగిలిపోతున్న పౌలుకు క్రీస్తు ప్రత్యక్షత దొరికింది. సమున్నతమైన క్రీస్తు రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లిఒడిలో పరవశించే బిడ్డవలే దేవుని దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయాడు. తన గత జీవిత దౌర్భాగాన్ని తలచుకొని కన్నీళ్ళు విడిచి నూతన వ్యక్తిగా మార్పు చెందాడు.ఈ విశిష్ట సంఘటనలను పౌలు స్వయంగా రోమన్ గవర్నర్ ఫేస్తు ముందు, రాజు అగ్రిప్ప ముందు వివరించాడు.ఒకానొక సందర్భంలో రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రజలకు ఓ పత్రిక వ్రాస్తూ యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఇలా అన్నాడు: ‘మనుష్యులమైన మనమంతా బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును గాని, మనమింకను పాపులమై యుండగానే యేసు మన కొరకు చనిపోయెను, సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని గలిగి రక్షించబడు నిమిత్తం క్రీస్తు సిలువమీద మరణించాడు’. దేవుడు ప్రేమాస్వరూపి అనే బైబిల్ బోధకు ఋజువు క్రీస్తు సిలువ మరణమే. పౌలు మూడు సువార్తయాత్రలు చేశాడు. వాటిలో ప్రతిచోటా తాను ఎక్కువగా మాట్లాడింది, తన వ్రాతల్లో వ్రాసింది క్రీస్తు మరణ పునరుత్థానాలను గురించే!‘యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా?’ అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశంలోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రం నిలువెత్తు నిదర్శనంగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుడతారు. యేసు చనిపోయిన తరువాత ఆయనకు చుట్టబడిన వస్త్రం నేటికి ఉందని పండితులు నిర్థారించారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. అతని చేతుల్లో మేకులు గాయాలు ఉన్నాయి. అతని దేహమంతా కూడా తూట్లు తూట్లుగా ఎవరో విభజించినట్లు విపరీతమైన గాయాలు కనబడుతున్నాయి.శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని, దానిమీద పరిశోధనలు చేశారు. ఈరోజుకు కూడా ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు మరణ పునరుత్థానములకు సాక్ష్యం ఆ వస్త్రం. చరిత్రలో చాలామంది ఆ వస్త్రాన్ని దొంగిలించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కాని, వారి వల్ల కాలేదు. అయితే ఆ వస్త్రం యేసుకు సంబంధించినది కాదు, 12 లేదా 13వ శతాబ్దికి చెందిన వస్త్రమని వాదించేవారు లేకపోలేదు. వాస్తవమేమంటే క్రీస్తు ప్రభువు మీద కప్పబడిన వస్త్రం ఆ తర్వాత కాలంలో చాలామంది చేతులు మారడం వలన అక్కడక్కడ పాడైంది. కొంతమంది మఠకన్యలు క్రీ.శ . 1534లో పాడైపోయిన వస్త్రానికి ఎక్కడెక్కడ అయితే రంధ్రాలు పడ్డాయో అక్కడ బాగు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఆ వస్త్రం అనేది 13వ శతాబ్దానికి చెందినదని చాలామంది భావించడానికి అవకాశం దొరికింది. ఇటలీలో ఉన్న ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. గెత్సేమనే తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికీ యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. దానిని ‘చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్’ అని పిలుస్తారు. ఇశ్రాయేలును సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను.అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తబిందువులుగా మారింది. వైద్య పరిభాషలో దానిని హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించాడు. పండిత పురుషోత్తమ చౌదరి అనే కవి క్రీస్తు గెత్సేమనే అనుభవాన్ని ఓ అద్భుతమైన పాటలో ఇలా వర్ణించాడు. ‘శ్రమచేత తన దీన శరీరము నుండి దిగజార చెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపాపము చూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమముగా దూత తన కడకరుగుదెంచి శాంతము బల్కి చనిన పిదపం తమ మనంబుల బోలు తమసమున యూద సైన్యము లేగుదెంచెనపుడు గెత్సేమనే వనికి’. ‘అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను’ (యెష 53:8). జగద్రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలము. ఏడువందల సంవత్సరాలకు పూర్వమే రక్షకుని గూర్చిన సిలువ మరణంతో పాటుగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడతాడు అని తెలియచెప్పబడింది. కఠినమైన సిలువ మరణానికి ముందు ఆయన ఎందుకు తీర్పు తీర్చబడ్డాడు? ప్రభువు తీర్చబడిన తీర్పు అన్యాయమైనదిగా ఎందుకు ఎంచబడింది? ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభువు నేరుగా అన్న, కయపల యొద్దకు తీసుకొని రాబడ్డారు. వాస్తవానికి మొదట అన్న యొద్దకు ఆ తదుపరి కయప యొద్దకు కొనిపోబడ్డారు. ఈ విషయం లేఖనాల్లో రెండు చోట్ల ప్రస్తావించబడింది.(యోహాను 18:1224, మత్తయి 26:57) వీరిద్దరూ యేసును అవమానించారు, హేళన చేశారు. ఆయన మీద ఉన్న అక్కసును వెళ్ళగక్కారు. అక్కడ నుండి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు నొద్దకు తీసుకొని వెళ్ళారు. క్రీస్తు ప్రభువు గలలియ ప్రాంతంలో పెరిగినవాడు గనుక హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని గ్రహించి పిలాతు హేరోదు నొద్దకు పంపెను.హేరోదు మొదట యేసును చూచి మిగుల సంతోషించాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికి యేసు అతనికి బదులియ్యలేదు. కాసేపటి తరువాత హేరోదు యేసు ప్రభువును తృణీకరించి అపహసించి పిలాతు నొద్దకు తిరిగి పంపివేశాడు. చివరగా పొంతి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు ఎలా తీర్చబడ్డాడు?మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. సిలువ మరణానికి ముందు యేసుక్రీస్తును యూదా మతపెద్దల ముందు మూడుసార్లు, రాజుల ముందు మూడుసార్లు నిలువబెట్టారు. అప్పటి కాలపు ప్రధాన యాజకుడైన కయప, అతని మామయైన మాజీ ప్రధాన యాజకుడు అన్న, యూదుల ఆలోచన సభయైన ‘సన్హెడ్రీన్’ ముందు యేసును దోషిగా నిలువబెట్టారు. యేసు తాను దేవుడనని, దేవుని కుమారుడనని ప్రకటించుకున్నాడు, మోషే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించాడన్నది వారు చేసిన నేరారోపణ. ఆ తదుపరి మూడుసార్లు రోమన్ న్యాయస్థానం ముందు నిలువబెట్టారు.రోమన్ కైసరుకు పన్నులు కట్టవద్దన్నాడని, ప్రజలను రోమన్ చక్రవర్తులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని, తాను రాజునని చెప్పుకొనుచున్నాడని యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. అయితే పిలాతు ఏ నేరమును కనుగొనలేకపోయాడు. ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించాడు. చివరగా పస్కాపండుగ సమయంలో ఒక నేరస్థుని విడుదల చేయగలిగే అధికారాన్ని వినియోగించాలని చూచినా, ప్రజల ఒత్తిడికి లోనై సిలువ మరణాన్ని అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. తన తీర్పులో న్యాయంలేదని తెలిసినా ‘ప్రజల’ కోసం అన్యాయ తీర్పును అమలుపరచాడు. ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ సమయంలో ఎవరినీ తీర్పు తీర్చకూడదు, శిక్ష విధించకూడదు. అయితే జరిగిందేమిటి? యేసుక్రీస్తు విషయంలో తీర్పు తీర్చారు. మరణశిక్షను అమలు పరిచారు. అపొ.కా 12:4 ప్రకారం పేతురును చెరసాలలో పెట్టింది పస్కా పండుగ సమయంలోనే. అంతకుముందు యాకోబును ఖడ్గంతో చంపేశారు. పేతురును కూడా పట్టుకున్నారు. అయితే పస్కా సమయంలో శిక్ష అమలు చేయకూడదు కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అయితే అసలు వాస్తవం ధర్మశాస్త్రోపదేశకులు అని చెప్పుకొనేవారే ధర్మాన్ని అతిక్రమించారు. యూదుల ఆలోచన సభ లేదా న్యాయస్థానమైన సన్హెడ్రీన్లో గాని, రోమన్ కోర్టులో గాని నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నేరస్థుడు అని తీర్పు వెలువడాలంటే ఆ న్యాయస్థానంలోని ప్రతి సభ్యుడు వారి వారి అభిప్రాయాలు తెలిపాక అందరి సమ్మతి, అంగీకారంతో శిక్ష అమలు చేయాలి. కాని యేసుక్రీస్తు ప్రభువు విషయంలో ప్రజల కేకలే గెలిచాయి.ఒక వేళ నేరం ఋజువై మరణశిక్ష విధించబడితే, అలా శిక్ష విధింపబడిన వ్యక్తికి కనీసం ఒక రోజు లేదా ఒక రాత్రి గడువును ఇవ్వాలి. ఆ వ్యక్తి మానసికంగా మరణానికి సిద్ధపడడానికి ఆ సమయం అవసరం. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కూడా జరగలేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత క్రూరమైన మరణాన్ని అమలుపరచారు. ఈ మానవ ప్రపంచ చరిత్రలో ఎంత భయంకర నేరస్థుడినైనా కూడా రాత్రివేళ న్యాయస్థానాల్లో నిలువబెట్టలేదు. నిబంధనల ప్రకారం చీకటి పడేలోపు తీర్పు వెలువరించాలి లేదా వాయిదా వేయాలి. అయితే యేసుక్రీస్తును ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టింది రాత్రివేళలోనే! ఇది అన్యాయం కాకపోతే మరేమిటి?ఏ దేశంలోనైనా ఏ న్యాయస్థానంలోనైనా నేరారోపణ ఎదుర్కొను వ్యక్తి తరుపున కనీసం మరొక వ్యక్తి వాదిస్తాడు. అటువంటి వ్యక్తి కోసం వాదించడానికి ఎవరూ లేకపోయినా, ఒకవేళ అడ్వొకేటుకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం గాని, కోర్టువారు గాని ఆ వ్యక్తి కోసం వాదించడానికి ఒక ఉత్తరవాదిని నియమిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కోసం వాదించేవారు ఒక్కడు కూడా లేడు. ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కొన్నింటికి సమాధానాలు చెప్పారు; కొన్ని సార్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన పక్షాన వాదించే వ్యక్తి లేకపోయినా తీర్పు తీర్చేశారు. ఇదికూడా అన్యాయమే!న్యాయవంతుడైన దేవునికి ఈ లోకం అన్యాయపు తీర్పు తీర్చింది. దేవున్ని విడిచి, మరచి బతుకుతున్న కర్కశ సమాజం ఆఖరకు సృష్టికర్తనే అన్యాయానికి గురిచేసింది. కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు కదూ! నీ ప్రభువునే విడిచిపెట్టలేదు ఈ లోకం. నీవు నేను ఓ లెక్కా ఈ పాషాణ సమాజానికి? అయితే యేసుక్రీస్తు అన్యాయపు తీర్పును ఎందుకు సహించాడు? నిలదీసి అడుగుతున్న వ్యక్తులకు సమాధానం చెప్పలేక యేసు మౌనంగా ఉండిపోలేదు, ఆయన ఓ అద్భుత కార్యం నెరవేర్చబోతున్నాడు కాబట్టే అన్యాయాన్ని సహించాడు. ఆయన సహించింది కేవలం నీకోసం, నాకోసం. తప్పు చేసినపుడు శిక్షను భరించడం సమంజసమే కాని, ఏ నేరం లేని నిర్దోషియైన ప్రభువు ఘోర శిక్షను భరించాడంటే ఏదో బలమైన కారణం ఉంది. అదే అవధులు లేని ఆయన ప్రేమ! శుభ శుక్రవారం రోజున యెరూషలేములోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన ఏడు మాటలు సిలువలో పలికి తన ప్రాణాన్ని అర్పించారు. ‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’ అని క్షమాపణ ప్రాముఖ్యతను తెలిపాడు. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’ అని తన పక్కన వేలాడుచున్న దొంగతో మాట్లాడి నిత్యత్యపు పరమార్థాన్ని తెలిపాడు. ‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని మరియమ్మతో పలికి తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ‘ఏలీ ఏలీ లామా సక్తాని’ అని పలికి దేవునితో ఎడబాటు తీవ్రతను తెలిపాడు.‘దప్పిగొనుచున్నాను’ అని పలికి తాను మానవునిగా శ్రమను అనుభవిస్తున్నానని తెలిపాడు. ‘సమాప్తమైనది’ అని పలికి తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని అర్థాన్ని నెరవేర్చాడు. ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికి రక్షింపబడిన వ్యక్తి గమ్యస్థానము దేవున్ని చేరుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమే అనే సత్యాన్ని తెలిపాడు. క్రీస్తు సిలువలో పలికిన ప్రతి మాట సర్వలోకానికి ఓ అద్భుత సందేశమే! క్రీస్తు మరణం శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాదిమంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసు విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆకాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసుప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుండి రక్తం, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని అనేకమంది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహంలో నుంచి ఆ నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు కూడా ధ్రువీకరించారు.క్రీస్తు సిలువపై మరణించినప్పుడు అనేక అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమైనది దేవాలయపు తెర చినిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారుచేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుష్యులెవ్వరూ దానిని చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే, ఆ తెర పైనుండి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును. యేసుక్రీస్తు మరణించిన సిలువపై ‘ఐఎన్ఆర్ఐ’ అనే మాటలు ఒక పత్రంపై వ్రాయబడ్డాయి. సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేంటో బాహాటంగా అందరికీ తెలిసేటట్లు ఒక పత్రంపై అలా వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టేవారు. కాబట్టి క్రీస్తుకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే పై విలాసాన్ని వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా(లాటిన్) భాషలలో వ్రాయబడింది. పిలాతు పై విలాసాన్ని ఆ విధంగా వ్రాయించడం ప్రధాన యాజకులకు నచ్చలేదు. యూదులరాజు అనికాక, యూదుల రాజునని తాను చెప్పుకున్నాడు అని వ్రాయమని కోరారు. వ్రాయబడిన పైవిలాసాన్ని మార్చడానికి పిలాతు నిరాకరించాడు. కొన్ని విషయాలను మార్చడం ఎవరివల్లా కాదు అని ఋజువైంది.అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ విషయాలన్ని ఇలా వ్యాఖ్యానించాడు. ‘హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ మూడు భాషలూ మూడు జాతులను, వారి భావాలైన ప్రత్యక్షత, కళ, సాహిత్యం, అభివృద్ధి, యుద్ధం, ధర్మశాస్త్రం అనువాటిని తెలియచేస్తున్నాయి. ఎక్కడయితే మానవజాతికి గల ఈ మూడు కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుందో, చదవడానికి కన్ను ఉంటుందో అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగి యుంటుంది. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతమయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు. ఆ దినాల్లో ధనికులు తన మరణానికి ముందే తమ సమాధిని సిద్ధపరచుకొనేవారు. క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవరోజున సజీవుడై తిరిగిలేచాడు. బైబిల్ ప్రబోధించే అనేక దివ్యసత్యాల్లో ఒకటి క్రీస్తు పునరుత్థానము. మానవ చరిత్రలోనే ఓ అపూర్వ సంఘటన.వాస్తవానికి క్రీస్తు పునరుత్ధానం గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు, పోలికలు పుష్కలంగా ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని మిగతా లేఖనాల్లో కూడా పునరుత్థానం గురించి తెలియపరచబడింది. లేవీయకాండం పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు ప్రాముఖ్యమైన క్షణాలు ఆ పక్షులలో మనకు తారసపడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంతవరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్ను తాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే నిబంధన ఉండేది.కొంతకాలానికి ఆ వ్యక్తికి కుష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనుపరచుకోవాలి. ఒకవేళ రోగి యొక్క దేహమును పరిశీలించి రోగము నుండి అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుండి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు పక్షులు తీసుకురావాలి. అవి సజీవమైన పక్షులై ఉండాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలి అని అనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి.అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంపబడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు అనేదానికి ఒక సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల అనేది కలిగిందని ఆ రెండో పక్షి సూచిస్తుంది. విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది.‘‘మరియు క్రీస్తు లేపబడియుండిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే’’ (1 కొరింథీ 15:14). యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడా? అన్నది ఈ రోజుల్లో అనేకుల మదిలో మెదలుతున్న ప్రశ్న! అసత్యానికి, సత్యానికి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు వాదించే అంశాలు చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవాన్ని దాచిపెట్టి, అసత్యాన్ని ప్రతిబింబించేలా అపవాది వారిని ప్రోత్సహిస్తున్నాడు అనుటలో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు సిలువపై మరణించలేదని, సుగంధ ద్రవ్యాలు పూసి, ఔషధాలు ఇచ్చి, స్పృహ కోల్పోయిన వ్యక్తిని బ్రతికించారని; ఆ తదుపరి ఆయన మగ్దలేనే మరియను పెండ్లి చేసుకొన్నాడని; కొందరైతే ఆయన కాశ్మీర్ వచ్చాడని రకరకాల కథలు చెబుతూవున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటివేమీ కాదు. మొదటి శతాబ్దం నుండి ఉన్నవే. శిష్యులు ఆయన దేహమును ఎత్తుకొనిపోయి దాచిపెట్టి మృత్యుంజయుడైనాడని ప్రకటించారని వారి వాదన. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు సమాధి దగ్గర ఉంచినంత కావలివారిని బహుశా ఎవరి సమాధి దగ్గర పెట్టలేదేమో! ఆ తరువాతి కాలంలో ఒక్క యోహాను తప్ప క్రీస్తు శిష్యులందరూ పునరుత్థానాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ప్రపంచం నలుమూలల హతసాక్షులయ్యారు. ఈస్టర్ శుభదినాన అనేక క్రైస్తవ సంఘాల్లో మిక్కిలి సమూయేలు వ్రాసిన ఈ భక్తిగీతాన్ని ఆలపిస్తారు. క్రీస్తు పునరుత్థాన సత్యాన్ని కీర్తిస్తారు. ‘యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు’. యేసుక్రీస్తు జీవితాన్ని అద్భుతంగా వివరించే నాలుగు సువార్తలు బైబిల్లో ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నాలుగు సువార్తలలో క్రీస్తు పునరుత్థానం గూర్చి చాలా స్పష్టంగా వివరించబడింది. శిష్యులైన మత్తయి, యోహానులు క్రీస్తు పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షులు. వైద్యుడైన లూకా రెండు గ్రంథాలను వ్రాశాడు. యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు సుగంధ ద్రవ్యములను కొని తమ దగ్గర ఉంచుకున్నారు. ఆదివారం పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వస్తూ సమాధి ద్వారము నుండి మనకొరకు ఎవరు ఆ రాయిని పొర్లించును అని మాట్లాడుకున్నారు. ఆ రాతికి రోమా వారు ముద్రవేసి సైనికులను కావలి ఉంచారని కూడా వారికి తెలుసు. అయితే వారు వచ్చి చూసేసరికి అప్పటికే రాయి దొర్లించి ఉంది. రాయి దొర్లింపబడకుండా కూడా పునరుత్థానుడైన క్రీస్తు బయటకు వచ్చుండేవాడే కానీ మనుష్యులు లోపలికి వెళ్ళి పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చునట్లుగా రాయి దొర్లించబడింది.వారు సమాధిలో ప్రవేశించి నిలువుటంగీ ధరించిన ఒక పడుచువానిగా కనిపిస్తున్న ఒక దేవదూతను చూశారు. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి అద్భుతమైన కొన్ని విషయాలను వారికి తెలియచేశాడు. యోహాను భక్తుడు తాను వ్రాసిన సువార్తలో క్రీస్తు పునరుత్థాన ప్రత్యక్షలను చాలా స్పష్టంగా వివరించాడు. మగ్దలేనే మరియ క్రీస్తు పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని పేతురు, యోహానులకు తెలిపింది. వారు పరుగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి ఖాళీగా ఉంది. సమాధి లోపల నారబట్టలు పడియుండడం చూశారు.ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయాన్ని యోహాను ప్రస్తావించాడు. క్రీస్తు ప్రభువు తలకు చుట్టబడిన రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండడం చూశారు. యేసుక్రీస్తు సమాధి నుండి ఏదో తొందరపాటుతో వెళ్ళిపోలేదని, అక్కడ జరిగిన సంఘటనలన్నియు ఒక పద్దతి ప్రకారం జరిగాయని చూపడానికి ఈ వివరణ అందించబడింది. ఒకవేళ క్రీస్తు దేహాన్ని ఎవరైనా ఎత్తుకుపోయినా, వారు తల రుమాలును ఇంత జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు. పునరుత్థానం జరిగిన ఆదివారం సాయంత్రం శిష్యులందరూ సమావేశమయ్యారు. వారిలో ఏదో తెలియని కలవరం, భయం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. భయం వలన వారు కూడియున్న గది తలుపులు గట్టిగా బిగించుకొనియున్నారు. అకస్మాత్తుగా క్రీస్తు వారి మధ్య నిలిచి ‘‘మీకు సమాధానం కలుగును గాక’’ అని ప్రకటించాడు. వారికి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా. తలుపులు తెరవకుండానే లోపలికి ప్రవేశించడం క్రీస్తు మహిమ. దేహాన్ని కలిగియుండుట వలన అది సాధ్యమయింది. యేసు చేసిన ప్రతి పనిలోనూ మనిషికి సమాధానం అనుగ్రహించడం చూస్తాం. ప్రస్తుత రోజులో మనిషికి అన్నీ ఉన్నాయి గాని, నిజమైన సమాధానం లేదు. వ్యక్తిగతంగా మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, రాజ్యం మీదకి రాజ్యాలు లేవడం సర్వసాధారణంగా కనబడుతూనే ఉన్నాయి. నిజమైన శాంతి సమాధానాలు మనిషికి ఎక్కడ లభిస్తాయి? దేవుడు సమాధానకర్త గనుక ఆయన్ను ఎవరైతే తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారికి సమాధానం, పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మోక్షరాజ్యం లభిస్తాయని బైబిల్ ప్రబోధిస్తుంది. పాప పశ్చాత్తాపంతో నూతన జీవితాన్ని ఆకాంక్షిస్తూ క్రీస్తు సిలువ చెంతకు చేరి ఆయన దివ్య చరణాలను ఆశ్రయించి ఆయన రక్తం ద్వారా తమ పాపములను కడుగుకొని, క్రీస్తు అనుగ్రహించు పునరుత్థాన శక్తితో జీవితయాత్రలో ఒక గమ్యాన్ని కలిగి విశ్వాసంతో సాగిపోవడం ద్వారా సర్వశక్తుడైన దేవుని మహిమపరచగలము అని క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పెను అని వ్రాయబడినట్లుగా ఈ మాటలు చదువుచున్న ప్రతి ఒక్కరికి ప్రేమమయుడైన క్రీస్తు ప్రభువు కృపాసింహాసనం నుండి అన్ని విషయాల్లో శుభం కలుగును గాక. ఈస్టర్ శుభాకాంక్షలు.‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును.మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతయయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు.యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు. డా. జాన్ వెస్లీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమహేంద్రవరం -
హోమియోలో మనమే టాప్
ప్రపంచంలోని ప్రధాన వైద్యవిధానాల్లో ఒకటైన హోమియోపతికి పుట్టినిల్లు జర్మనీ. పద్దెనిమిదో శతాబ్ది చివరినాళ్లలో జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానిమన్ ఈ వైద్యవిధానాన్ని రూపొందించాడు. తొలినాళ్లలో ఆనాటి వైద్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నా, హానిమన్ తన ప్రాక్టీసు కొనసాగించాడు. ఆయన వద్దకు రోగులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవారు. వార్ధక్యంలో జర్మనీని విడిచిపెట్టి 1835లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు వలసవెళ్లిపోయి, అక్కడే తాను 1843లో మరణించేంత వరకు విజయవంతంగా ప్రాక్టీసు కొనసాగించాడు. జర్మనీలో పుట్టిన హోమియో వైద్య విధానం యూరోపియన్ మిషనరీల ద్వారా పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో భారత్లోకి అడుగుపెట్టింది. గడచిన రెండు శతాబ్దాల కాలంలో భారత్ హోమియో వైద్యానికి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్యులు, రోగుల సంఖ్యలో టాప్–5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం... -
మరణములో నుండి జీవములోనికి
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.మతంతో సంబంధం లేని మార్గంమన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది. ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’– యేసుక్రీస్తు – జేతమ్ -
మలి దశ... మరో కోణం
జీవితం మలి దశలో భావోద్వేగ పరంగా మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మగవారిలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ మహిళలు ఇటీవల కాలంలో దీని వల్ల ఎక్కువ మోసపోతున్నారని చెబుతున్నారు. జీవితం మలిదశలో ఏర్పడిన శూన్యతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఏం చేయాలో అవగాహన కలిగి ఉంటే అధిగమించడం సులువు అవుతుంది.చదువు, సంపాదన, వివాహం, కుటుంబ బాధ్యతలు.. ఒక్కోదశ ను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంటాం. ఐదు పదులు దాటిన తర్వాత బాధ్యతల బరువు తగ్గి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఎప్పుడో వదిలేసిన భావాలు మనసును ముట్టడిస్తాయి. ఖాళీ సమయాన్ని టీవీ కో, సోషల్ మీడియాకో కేటాయిస్తుంటారు చాలా మంది. కొందరు లోపలి ఖాళీని పూరించడానికి మానసికంగా కొత్త సంబంధాలవైపు మొగ్గు చూపుతారు. ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారిలో అన్లైన్ డేటింగ్ పెరుగుతోందని అమెరికన్ ఫ్యూ రీసెర్చి సెంటర్ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏజింగ్ ఆన్లైన్ డేటింగ్ను ఎంచుకునేవారికి సూచనలూ ఇచ్చింది.తమకు తామే మోసం..వయసు పైబడిన వారిలో అప్పటికే శారీరక మార్పులు చుట్టుముడతాయి. దీంతో హఠాత్తుగా లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇన్నాళ్లూ తాము ఏం కోల్పోయోమో అర్థం అవుతుంది. వదిలేసిన అన్నింటినీ తిరిగి జీవితంలోకి తెచ్చుకోవాలనే ఆతృత పెరుగుతుంది. పూర్తి చేయలేక ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఫలితం గా తమను తాము హింసించుకోవడమూ పెరుగుతుంది.అర్థం చేసుకోవడం ముఖ్యం..ఈ వయసులో‘అందరూ ఏవేవో సాధిస్తున్నారనో, తాము వెనకబడిపోయామనో, గుర్తింపు కోసమో, ఖాళీని భర్తీ చేయడం కోసమో.. పరిగెత్తడం కాదు. తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.→ మెనోపాజ్ సమస్యల వల్ల వచ్చే భావోద్వేగాల సమతుల్యతనూ సాధించాలి. → నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం, ప్రశాంత జీవితాన్ని గడపడం, లోపలి స్వరాన్ని వినడం, సేవ, సృజన, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించాలి. → సెకండ్ లైఫ్కి ఇది ప్రారంభ దశగా గుర్తించాలి.రిలేషన్స్ కూలిపోవచ్చు.. యవ్వనంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరం, భద్రత, కలిసి బతకడం.. వంటివే వారిని కలిపి ఉంచే బంధాలు. మధ్య వయసుకొచ్చేసరికి అర్థం చేసుకోవడం, భావోద్వేగ కలయిక, నిజాయితీగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కొత్త బంధాలను ఏర్పరుచుకోవడంతో ఇద్దరి మధ్య తెలియకుండానే చీలిక ఏర్పడుతుంది. ఆ తర్వాత బంధాల పట్ల విముఖత ఏర్పడుతుంది. అనవసరపు ప్రయాస అనిపిస్తుంది.దంపతుల మధ్య దూరం..పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బాధ్యత తగ్గుతుంది. అలాగే, వారితో సమయం కేటాయించడం కూడా తగ్గిపోతుంది. దంపతులుగా ఇన్నాళ్లూ పిల్లల కోసమే కలిసి ఉన్నామా.. అనే ఆలోచన మొదలవుతుంది. చెప్పుకోలేని సందేహాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఓపిక, సహనం తగ్గుతాయి. అప్పటివరకు నొక్కి పెట్టిన నిర్లక్ష్యం, అవమానం, త్యాగం.. అన్నీ పైకి ఉబికి వస్తాయి. ఇక ‘ఇప్పుడు భరించలేను’ అనే దశ వస్తుంది. ‘అందరూ నన్ను చీట్ చేశారు. వీళ్లకోసమా నేను త్యాగం చేశాను’ అనే ఆలోచన కలుగుతుంది.ప్రయోజనకరంగా! పాజిటివ్ ఆలోచనలవైపు మొగ్గు చూపాలి. శారీరక–మానసిక వ్యాయామాలు నిరాశను తగ్గిస్తాయి. మానసికంగా చురుకుగా ఉండటానికి పజిల్స్ పూరించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వదిలేసిన అభిరుచులను తిరిగి మెరుగుపెట్టడం, స్వచ్ఛంద సేవ.. వంటి అర్థవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మేలు చేస్తుంది. ఈ దశలో శరీరంలో వచ్చే ప్రకృతి సిద్ధ మార్పుల (మెనోపాజ్, వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం, చర్మంలో కాంతి తగ్గడం..) వల్ల నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పోషకాహార, చర్మ వైద్య నిపుణుల సూచనలతో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసు కుంటూనే ఆరోగ్యకరమైన బంధాలపై అవగాహన పెంచుకోవడం అవసరం.అవగాహనతోనే వికాసంసంబంధాలలో ఏర్పడిన మార్పుల వల్ల మన ఆలోచనా విధానంలోనూ చాలావరకు మార్పు వస్తుంది. శారీరకంగా కన్నా మానసికపరమైన మోసం ఎక్కువ హానికరంగా అనిపిస్తుంది. అది తమ భాగస్వామి, పిల్లలు, బయటి వ్యక్తులు.. ఎవరైనా కావచ్చు. భావోద్వేగ బంధం స్పర్శకంటే లోతైనా సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి, దానిని కోల్పోవడం అంటే ఆ బంధాన్ని కోల్పోయినట్టే అనిపిస్తుంది. అప్పుడు మోసం జరిగింది అనుకుంటారు. ఇలాంటప్పుడు నిపుణులను సంప్రదించి, సూచనలు తీసుకోవడం మేలు కలిగిస్తోంది.– డాక్టర్ డోనాసింగ్, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పసి గుండెకు గురిపెట్టే ఫీవర్
చిన్నపిల్లల్లో జలుబు చేయడం చాలా మామూలు విషయం. జలుబు తర్వాత కాస్తంత గొంతునొప్పి రావడమూ మామూలే. వీటితో పాటు జ్వరం కనిపించడం చాలా సాధారణమే. అయితే ఇలా జ్వరమూ (హైఫీవర్), జలుబూ, గొంతునొప్పి కనిపించడమన్నది సాధారణమే కదా అంటూ మామూలుగా తీసుకోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు. ఈ మామూలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదనీ, అదే చాలా తీవ్రమైన రుమాటిక్ ఫీవర్గా పరిణమించి చిన్నారుల ‘గుండె’నూ దెబ్బతీస్తుందంటే అది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది వాస్తవం. అందుకే ఒక్కోసారి ఈ చిన్న లక్షణాలనూ చాలా సీరియస్గా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. అదెప్పుడో తెలుసు కునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.చిన్న పిల్లల్లో వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. చిన్న పిల్లలకు జలుబు చేశాక వారు గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఓ చిన్న సమస్యగానే చూడకూడదని తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే... జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్కు దారితీయవచ్చు. ఇక కొందరిలో గ్రూప్–ఏ స్ట్రె΄్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చినట్లయితే... దానికి డాక్టర్ సూచించే పూర్తి స్థాయి యాంటీబయాటిక్స్ కోర్సు వాడాలి. అలా వాడకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే మరో సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. అలా జలుబు, జ్వరాల తర్వాత మళ్లీ మరోసారి జ్వరం... మునుపు డాక్టర్లు ఇచ్చిన అవే మందులు వాడుతూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే అది రుమాటిక్ ఫీవర్కు దారి తీసే ప్రమాదమూ ఉందని తల్లిదండ్రులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. అందుకే జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.రుమాటిక్ ఫీవర్తో ఎలాంటి ప్రమాదం వస్తుందంటే... రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రుమాటిక్ ఫీవర్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో అది గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతుంది.లక్షణాలు.. మొదట జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ మరోమారు జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటి మీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్గా అనుమానించాలి. అలాగే తొలుత ఈ లక్షణాలు కనిపించిన పిల్లల్లో... తర్వాత శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలుగా పరిగణించి... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. ఇక్కడ పేర్కొన్న అంశాలను బట్టి ఇది ఎంతో పెద్ద సమస్యగా అనిపిస్తున్నప్పటికీ... కేవలం ఒక పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందులతో దీన్ని పూర్తిగా నివారించవచ్చనీ, దాంతో పిల్లల అద్భుతమైన భవిష్యత్తును కాపాడుకోవచ్చని తల్లిదండ్రులు అవగాహన పెంచుకుంటే చాలు... పేరెంట్స్ ఆ చిన్నారి గుండెకు తగిన రక్షణ కల్పించినవారవుతారు. చికిత్స / నివారణవాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా తగిన చికిత్స అందిస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా సమసిపోతుంది. కానీ తొలిదశల్లో ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె వైఫల్యానికీ (హార్ట్ ఫెయిల్యూర్కూ) దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది గానీ... చాలా కొద్దిమంది పిల్లల్లోనే ఇలా జరిగే అవకాశముంది. మరికొందరు చిన్నారుల్లో జీవితాంతమూ బ్లడ్థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు... వారికి ఆ గర్బధారణ కూడా ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జబులు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా ఒకసారి మీ పిల్లల డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాదు... ఇలా జలుబు, గొంతునొప్పి, జ్వరం వచ్చిన పిల్లల విషయంలో వారు తగినంత వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.డా‘‘ శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్నిర్వహణ: యాసీన్ -
గర్భసంచి జారడం అంటే...?
సాధారణంగా మహిళల్లో మధ్యవయసు దాటిన కొందరిలో ‘గర్భసంచి జారడం’ అనే మాట వినిపిస్తుంటుంది. మహిళల పొత్తికడుపులో గర్భసంచి అంటూ అందరూ సామాన్యంగా పిలిచే యుటెరస్తో పాటు పెద్దపేగు, మూత్రపు సంచి లాంటివి కూడా ఉంటాయి. ఇవి కాస్తంత జారిపోయి యోని పైభాగం మీద ఒత్తిడి కలిగిస్తూ మహిళల్లో తీవ్రమైన నొప్పినీ, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇలా పొత్తికడుపులోని యుటెరస్, పెద్దపేగు, మూత్రపు సంచి (బ్లాడర్) వంటి దేహ భాగాలు యోని పైభాగంలోకీ లేదా ఒక్కోసారి యోనిలోనికి జారిపోవడాన్నే వైద్యపరిభాషలో ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అని పేర్కొంటారు. అవి ఎందుకలా జారతాయో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. నిజానికి మహిళల్లో తమ పొత్తికడుపులోని అవయవాలన్నీ చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. పొత్తికడుపులోపల ఉండే గర్భసంచి వంటి అనేక అంతర్గత అవయవాలన్నీ ‘పెల్విక్ ఫ్లోర్’ అని పిలిచే ఓ పొర లాంటి కండరంపై ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ ‘పెల్విక్ ఫ్లోర్’ ఆ అంతర్గత అవయవాలను మోస్తూ ఉంటుంది.ప్రొలాప్స్కు మరికొన్ని కారణాలు పొత్తికడుపు అవయవాలు ఇలా కిందికి జారడానికి చాలా అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు వయసు పెరగడం వల్ల పెల్విక్ఫ్లోర్ కండరం బలహీనపడటం అనే ముఖ్యకారణంతో పాటు...→ బిడ్డలకు జన్మనివ్వడం (ఛైల్డ్ బర్త్) → రుతుక్రమం ఆగిపోవడం (మెనోపాజ్) → బరువు పెరగడం (ఒబేసిటీ) → తీవ్రమైన మలబద్ధకం (క్రానిక్ కాన్స్టిపేషన్)తో ముక్కడం వల్ల కొందరిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ (హిస్టరెక్టమీ) జరగడం... వంటి అంశాలు ప్రొలాప్స్కు కారణమవుతాయి. నివారణపెల్విక్ ప్రొలాప్స్ నివారణ చాలా పరిమితమైన మేరకే సాధ్యమవుతుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాన్ని బలోపేతం చేసే ‘కెగెల్స్ ఎక్సర్సైజెస్’ అని పిలిచే పొత్తికడుపు వ్యాయామాలను చేయడం ద్వారా కొంతవరకు ఈ పరిస్థితిని నివారించవచ్చు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, మంచి విసర్జక అలవాట్లు (గుడ్ టాయిలెట్ హ్యాబిట్స్... అంటే రోజూ ఒకేవేళకు మలవిసర్జనకు వెళ్లడం), స్థూలకాయాన్ని నివారించుకోవడం అంటే బరువు పెరగకుండా జాగ్రత్తపడటం, బరువైన వస్తువుల్ని అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తగా ఉండటం వంటి వాటితో పెల్విక్ ప్రొలాప్స్ను కొంతమేర నివారించవచ్చు. జారడం ( ప్రొలాప్స్) అంటే ఏమిటి, ఎందుకలా జరుగుతుందంటే...? మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరం బలహీనపడుతుంది. ఆ క్రమంలో ఒక్కోసారి పొత్తికడుపులో ఉండే అంతర్గత అవయవాలు ‘బలహీనపడ్డ’ ఆ పెల్విక్ఫ్లోర్ నుంచి జారి... యోనిలోకి గానీ లేదా యోని పైభాగంలోకి వచ్చేస్తాయి. ఇలా జారి కిందకు రావడాన్నే ‘్రపొలాప్స్’అంటారు. ఏ అవయవం జారిందో దాన్ని బట్టి ఆ జారిన ప్రక్రియకు ( ప్రొలాప్స్కు) ఆ పేరు పెడతారు. ఉదాహరణకు గర్భసంచి జారితే దాన్ని ‘యుటిరైన్ ప్రొలాప్స్’ అనీ, పెద్దపేగు జారితే ‘బవెల్ ప్రొలాప్స్’ అనీ, మూత్రపు సంచి జారితే ‘బ్లాడర్ ప్రొలాప్స్’ అని చెబుతుంటారు. సాధారణంగా వీటన్నింటినీ కలిపి ‘పెల్విక్ ఆర్గాన్స్’గా పేర్కొంటారు కాబట్టి అవి జారినప్పుడు... అలా జరడాన్ని ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అనే ఒక్క మాటతో సూచిస్తుంటారు. నిజానికి ఇవేవీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే సమస్యలు కాదు. అయితే ఇలా జారడం వల్ల ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నొప్పి కూడా వస్తుంటుంది.చికిత్సకొన్ని జీవనశైలి మార్పులు అనుసరిస్తూ కొంతమందిలో హార్మోన్ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ కండిషన్ను డాక్టర్లు చక్కదిద్దడం జరిగినప్పటికీ... ఇలాంటి చర్యలతో అంతగా ఫలితం లేనప్పుడు జారిన అవయవాన్ని / అవయవాలను తిరిగి వాటి వాటి స్థానాల్లో అమర్చేలా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సతో ఆయా అవయవాలను వాటి స్థానాల్లో తిరిగి అమర్చడం మాత్రమే ప్రొలాప్స్కు శాశ్వత చికిత్సగా చెప్పవచ్చు.డా‘‘ సరోజ బానోతు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ -
రూ.500 లంచం... 36 ఏళ్లు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు. వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది.గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు?దిలీప్ మాదిరెడ్డి -
సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు
కలుపు.. అంటే రైతులు ఆ పొలంలో ఆ పంట సాగు కాలంలో అవాంఛితంగా పెరుగుతున్న రకరకాల మొక్కలను కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. వేల సంవత్సరాల సుసంపన్న సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానం కలిగిన భారతీయ రైతాంగానికి ఒక్క గ్రాము కలుపు మందును వాడకుండా వ్యవసాయం చేసే వారసత్వం ఉంది. అయినా, ఆధునిక వ్యవసాయ పోకడల నేపథ్యంలో కలుపు మొక్కలను నియంత్రించే మందుల వినియోగం పెరిగిపోయింది. రసాయనిక లేదా పారిశ్రామిక వ్యవసాయం ఊపందుకున్నాక.. ఏదో ఒకటే పంటను పొలమంతా వేసి పండించే ఏక పంటల (మోనోకల్చర్) సాగు విస్తృతం అయిన తర్వాత.. గడ్డి లేదా కలుపు నిర్మూలన మందుల వాడకం పెరిగింది. అప్పటికి ఇది రైతుకు సులువైన పరిష్కారంగా, ఖర్చు తక్కువతో పూర్తయ్యే పనిగా తోచినప్పటికీ.. గడ్డి మందులకు అనేక రకాలుగా దుష్పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. మట్టిలో సూక్ష్మజీవరాశి నశించి వ్యవసాయం సమస్యల్లో పడుతుంది. గాలి, నీరు కలుషితమవుతుంది. మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది. పారాక్వాట్, గ్లైఫొసేట్ వంటి కలుపు మందుల వాడకంతో రైతులు, రైతు కూలీలు, వినియోగదార్లలో కేన్సర్లు, ప్రాణాంతక జబ్బులు ప్రబలుతున్నాయని చెప్పటానికి ప్రపంచ దేశాల్లో ఆధారాలకు కొదువ లేదు. కాబట్టి, రసాయనాలు చల్లకుండా కలుపు నిర్వహణపై భారతీయ వ్యవసాయ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విస్తరణకు గతంలో కన్నా ఎక్కువగా కృషి జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఇది ఒక అనివార్యం. కలుపు మందుల నిరోధకత, కలుపు మందులతో వ్యవసాయ – పర్యావరణ ప్రభావాలు, కలుపు మొక్కలపై ప్రాకృతిక దృక్పథం, సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు ఏమిటో చర్చించటమే ఈ కథనం లక్ష్యం. కలుపు మొక్కల ‘ఉపయోగాలు’ మీకు తెలుసా! రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి!మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి. కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి. నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి.సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి.కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి.నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి. సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి. కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.నేలను కప్పి ఉంచుతూ సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి. ప్రవహించే వాన నీరు, గాలుల వల్ల నేల కోతకు గురికాకుండా కలుపు మొక్కలు కాపాడతాయి. అనేక ప్రయోజనకరమైన కీటకాలు, మాంసాహారులు, పరాన్నజీవులు, పరాగ సంపర్కాని ఉపయోగపడే జీవులకు కలుపు మొక్కలు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పిస్తాయి.చాలా జంతువులకు, మానవులకు ఆహారంగా, ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటి ఔషధ విలువలు తెలియక మనం అవి కలుపు మొక్కలనుకొని నిర్మూలిస్తుంటాం.చాలా రకాల కలుపు మొక్కలు నిజానికి పుష్కలంగా పోషక విలువలను కలిగి వుంటాయి. సాగు చెయ్యని ఆకుకూరలుగా, మందు మొక్కలుగా వ్యవసాయ కుటుంబాలకు గొప్పగా దోహదపడతాయి. అలాగే కరువు సమయాల్లో ఆహారాన్ని కూడా అందిస్తాయి. వీటిలో చాలా వాటిని కొందరు గ్రామీణులు సేకరించి మార్కెట్లలో కూడా అమ్ముతారు.కేరళలోని వాయనాడ్ జిల్లాలో ‘థనల్’ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో, 83 రకాల ఆకుకూరలను (సాధారణంగా కలుపు మొక్కలుగా వర్గీకరించబడినవి) ఆ ప్రాంత ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వాటిలో 20 రకాలు వరి పొలాల్లో లభించాయి.ప్రకృతిలో అన్నీ మొక్కలే.. ‘కలుపు’ మొక్కల్లేవు! ప్రకృతి దృష్టికోణంలో ‘కలుపు మొక్కలు’ అనేవి ఉండవు. కలుపు అనేది మానవుల భావన. ఎందుకంటే మనం ఒక పంటను ΄పొలంలో పెంచుకుంటూ ఉంటే మనం కోరకుండా వాటంతట అవే పెరిగే మొక్కలను మనం ‘కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. అయితే, మనం కలుపు అనుకునే మొక్కలు ఒక ప్రత్యేక వాతావరణంలో, ప్రత్యేకమైన మట్టిలో కొన్ని కలుపు మొక్కలు పెరగడానికి ప్రకృతి సంబంధమైన కారణాలు అనేకం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి ప్రకృతిపరంగా ముఖ్యమైన పాత్రలు, విధులు ఉంటాయి. కలుపు మొక్కలు ప్రకృతిపరంగా బాగా అనుకూలతను కలిగి ఉంటాయి. మనం విత్తనాలు/మొక్కలు నాటి సాగు చేసే పంటలు జీవించడం కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆ పొలంలోనే అనేక కలుపు మొక్కలు పెరగడానికి ఇదే కారణం. కొన్ని పరిస్థితులలో పంట మొక్కల కంటే కలుపు మొక్కలు మరింత దృఢంగా ఉంటాయి. కలుపు మొక్కలు సూక్ష్మమైన శక్తులు. అవి ప్రకృతి సమతుల్యతకు సహాయపడతాయి.అందుకనే, ‘నేలపై నియంత్రణ సాధించడంలో కలుపు మొక్కలు మానవ వైఫల్యాన్ని సూచిస్తాయి. ప్రజలు తప్పులు చేసిన చోట అవి సమృద్ధిగా పెరుగుతాయి. అవి మన తప్పులను, ప్రకృతి చేపట్టిన దిద్దుబాట్లను సూచిస్తాయి’ అంటారు అమెరికాకు చెందిన ప్రసిద్ధ బయోడైనమిక్ శాస్త్రవేత్త డా. ఎహ్రెఫ్రై డ్ ఫైఫర్.ఉదాహరణకు.. సియామ్ కలుపు మొక్క లేదా ఫ్లాస్ ఫ్లవర్ (క్రోమోలీనా ఒడోరాటా) అనేది ఒక భయంకరమైన కలుపు మొక్క. ఇది అడవులను అక్రమిస్తూ అక్కడ అనాదిగా సహజంగా పెరిగే మొక్కలు, చెట్ల జాతుల జీవవైవిధ్యాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అయితే, ఇది చెట్లు లేని వాలు ప్రాంతాల్లో పెరిగి, నేలను త్వరగా ఆక్రమించుకుంటుంది, ఇతర మొక్కలు పెరగడానికి అనుమతించదు. చాలా సందర్భాలలో, ఇది నేలను పట్టి ఉంచి, నేల కోతను నిరోధించే ఏకైక మొక్క. త్వరగా కుళ్ళిపోయే దాని ఆకులు తూర్పు భారతదేశంలో ఝుమ్ వ్యవసాయ పద్ధతిలో పండించే వివిధ రకాల పంటలకు మంచి ఎరువుగా ఉయోగపడుతుంటాయి. కొన్ని రకాల పోషకాలు లోపించిన నేలల్లో కొన్ని రకాల ప్రత్యేక కలుపు మొక్కలు పెరుగుతాయట. రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి! మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మందులకు నిరోధకతకలుపు మందుల మార్కెట్ మన దేశంలో 2025లో 393 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 608 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న కలుపు కూలీల ఖర్చు తగ్గించుకోవటానికి రైతులు కలుపు మందులు చల్లుతున్నారు. అయితే, కలుపు కూలీల ఖర్చే కాదు మొత్తంగా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. రైతు అధికంగా ఖర్చు పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర లభించనప్పుడు కూలీల ఖర్చు భరించటం వారికి సమస్యగా మారుతోంది. కలుపు మందుల మార్కెట్లో సింహభాగం గ్లైఫోసేట్, 2,4–డి ఆక్రమిస్తున్నాయి. గ్లైఫోసేట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన వ్యవసాయ రసాయనం. 2024లో రైతులకు వచ్చిన ఆదాయంలో నేల కోసం పెట్టిన ఖర్చు వాటా 46.5%కు పెరిగిందని అంచనా. కలుపు మందును తట్టుకునే నిషిద్ధ బీటీ పత్తితో సహా వాణిజ్య పంటల విస్తరణ ఏటా 9.31% పెరుగుతున్నట్లు చెబుతున్నారు.కలుపు మందులు కొట్టినా కలుపు చనిపోకుండా నిరోధకత పెంచుకోవటం ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారింది. దీర్ఘకాలికంగా బీటీ పంటలను సాగుచేస్తున్న దేశాల స్థాయిలో మన దేశంలో ఇంకా నిరోధకత లేదు. అయినప్పటికీ, కలుపు మందును తట్టుకునే నిషిద్ధ పత్తి సాగు వ్యాప్తితో పెరుగుతున్న కలుపు మందుల వాడకం ఆందోళన కలిగిస్తున్నది. వరి పొలాల్లో కూలీలతో కలుపు తీసే పద్ధతిలో కూడా కలుపు మొక్కలు రంగు మార్చుకొని తప్పించుకుంటున్నాయి.మన దేశంలో కలుపు మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న కలుపు మొక్కల సంఖ్య పెరుగుతున్నది. తట్టుకునే శక్తిని పెంచుకున్న కలుపు మొక్కలను లక్ష్యంగా చేసుకునే కొత్త కలుపు మందుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొండి కలుపుపై చల్లటానికి అనేక కొత్త మందులు అభివృద్ధి చెందే క్రమంలో ఉన్నాయి. గ్లైఫోసేట్ కలుపు మందుకు 50కి పైగా కలుపు జాతులు ఇప్పుడు నిరోధకతను ప్రదర్శిస్తున్నాయి. పాత కలుపు మందులు పనిచేయకపోతే మరింత విషపూరిత కలుపు మందులను రైతులు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది పొలంపై, పంటపై రసాయనాల భారాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ పొలాల్లో నుంచి నీరు పొంగి పొర్లిన సందర్భంలో నాచుకు, ఉభయచరాలకు ఈ రసాయనాలు హాని చేస్తాయి.ప్రాక్వాట్ అనే కలుపు మందు మట్టికి గట్టిగా అంటుకుంటుంది. అది పై పొరలలో ఉండి ఉత్పాదకతకు కీలకమైన నత్రజనిని స్థిరీకరించే మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తుంది. తక్కువ సాంద్రతలలో కూడా ఈ మందు జలచరాలు, తేనెటీగలు, ప్రయోజనకరమైన కీటకాలకు అత్యంత విషపూరితమైనది. 30 కంటే ఎక్కువ కలుపు జాతులు ఇప్పుడు దానికి నిరోధకతను సంతరించుకున్నాయి. అంటే, ఈ మందు కొట్టినా ఈ కలుపు మొక్కలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఎక్కువసార్లు పిచికారీ చేయటం వల్ల కలుపు మొక్కల రకాలు తట్టుకొని దీర్ఘకాలం బతికే జాతులుగా మారుతున్నాయి. ప్రాక్వాట్ నేల ఆరోగ్యాన్ని, వాన పాముల సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించటం హర్షదాయకం. అదే విధంగా, 2,4 డిని 80 సంవత్సరాలకు పైగా ఉపయోగించిన తర్వాత 40 కంటే ఎక్కువ కలుపు జాతులు దానికి నిరోధకతను పెంచుకున్నాయి. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలురసాయనిక కలుపు మందులకు అనేక పర్యావరణ హితమైన సమర్థ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొందరు రైతులు కలసి సహకార యాజమాన్యంలో యంత్రాలతో కలుపుతీసే పద్ధతులతో పాటు సేంద్రియ/ప్రకృతి సేద్య మిశ్రమ పంటల సాగు పద్ధతులను అనుసరించవచ్చు. కలుపు మొక్కలు పెరగనీయకుండా అంతరాయం కలిగించే అంతర పంటలు, పంటల మార్పిడి, నేలను కప్పి వుంచే పంటలు సాగు చెయ్యటం, పంట వెయ్యటానికి ముందు పొలానికి నీటి తడి పెట్టి కలుపు మొలిచిన తర్వాత దుక్కి చేసి ఆ తర్వాత పంట వేసుకోవటం ద్వారా కలుపు సమస్యను అధిగమించటం వంటి అనేక పద్ధతులు కలుపు మందులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ పద్ధతులు కలుపు మొక్కలను అణచివేయటం, నేల ఆరోగ్యాన్ని పెంపొందించటంతో పాటు విలువైన పర్యావరణ సేవలను అందిస్తాయని గుర్తించడం అవసరం.ఎద్దులతో గుంటకలు తోలి కలుపు నివారించే సాధనాలను ఉపయోగించే సాంప్రదాయ పద్ధతులు, కోనో–వీడర్లు, రోటరీ వీడర్లు, సైకిల్ వీడర్లు వంటి ఆధునిక ఆవిష్కరణలతో కలిపి సమర్థవంతమైన కలుపు తొలగింపు మార్గాలను అనుసరించవచ్చు. దానితో పాటు ఈ పనుల ద్వారా మట్టి లోపలికి గాలిని ప్రసరింపజేయటం, తెగుళ్లు కలిగించే పురుగుల జీవిత చక్రాలకు అంతరాయం కలిగించటం, కలుపు మొక్కలను పచ్చి రొట్ట ఎరువుగా తయారుచేసి నేలలో కలపటం ఈ పద్ధతుల్లో సాధ్యపడుతుంది. తద్వారా రసాయన ఉత్పాదకాలపై ఆధారపడకుండా బహుళ వ్యవసాయ ప్రయోజనాలను ఈ పద్ధతులు సాధిస్తాయి.అంతేకాదు, ఈ విధానాలు రైతు స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తాయి. గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తరతరాల పర్యావరణ జ్ఞానాన్ని కాపాడతాయి. నేల సారానికి నష్టం చేయకపోగా పెంపొందిస్తాయి. విషం లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి.రసాయనాలు లేకుండా కలుపు మొక్కలను నియంత్రించటం అనేది సాంకేతికమైన విషయమా లేదా రాజకీయ, ఆర్థిక విషయమా అనేది ప్రాథమిక ప్రశ్న. వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు పర్యావరణ మార్పును తట్టుకునే స్థితిని కల్పించటానికి ఉపయోగపడే వ్యవసాయ పర్యావరణ శాస్త్రం అభివృద్ధిపై భారతదేశం పెట్టుబడి పెడుతుందా లేదా రసాయనాల వాడకాన్ని పెం΄÷ందించే పద్ధతులను ప్రోత్సహిస్తుందా అన్నది కాలం తేల్చాల్సిన విషయం.హెక్టారులో 40 కోట్ల పార్థీనియం విత్తనాలు!ఒక పార్థీనియం మొక్క 15 వేల నుంచి 20 వేల విత్తనాలను ఉత్పత్తి చేయగలదు. ఇది పొలంలోనే లేదా నేలలోనే ఒక భారీ, నిరంతర విత్తన బ్యాంకు ఏర్పడటానికి దారి తీస్తుంది. హెక్టారు భూమిలో విత్తనాల దశ వరకు పార్థీనియం మొక్కలను పెరగనిస్తే ఆ పొలంలో 40 కోట్ల విత్తనాలు తయారు చేసినట్లే. అవి మైళ్ళ దూరం ప్రయాణించి, అనేక దశాబ్దాల పాటు జీవిస్తాయి. అవి మానవులను, జంతువులను అంటుకొని ప్రయాణిస్తాయి. మరికొన్ని మన పొలాల్లో వాలే పక్షుల ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి.చాలా ఏళ్లపాటు బతికే కలుపు మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా వేర్ల ద్వారా, ఊడల్లాంటి (రన్నర్లు లేదా స్టోలన్) తీగల ద్వారా వ్యాప్తిచెందుతాయి. తెల్ల క్లోవర్ కలుపు మొక్క 50 మీటర్ల పొడవున తీగను పాకించగలదు. వేరు దుంపల ద్వారా కొన్ని కలుపు మొక్కలు నిరంతరం విస్తరిస్తూ ఉంటాయి. హార్స్టెయిల్ వేరు దుంపలు 5 మీటర్ల లోతులో 100 మీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లి మొక్కల్ని మొలిపించగలదు. నేలపై ఒక చోట కలుపు మందుతోనో, చేతితోనే తీసేసి నిర్మూలించినా నేలలో దుంప నుంచి మళ్లీ పెరుగుతూనే ఉంటుందన్న మాట. చాలా కలుపు మొక్కలు లోతైన వేర్లను కలిగి ఉంటాయి. ఇవి కొమ్మలు, రెమ్మలను తొలగించినప్పుడు కూడా పునరుత్పత్తి చేయగలవు. ఆక్సాలిస్ జాతి దుంప రకం కలుపు మొక్క ఒక సీజన్లో 6900 మొక్కలుగా పెరుగుతుంది. నేలకు కరుచుకొని, పొట్టిగా, పాకుతూ పెరుగుతుండటం వలన యంత్రాలతో వీటిని తొలగించినప్పటికీ తప్పించుకుని బతుకుతాయి. -
ఊబకాయం నుంచి స్మార్ట్గా..! ఏకంగా 204 కిలోల నుంచి 92 కిలోలకు..
కొందరు సుమోలు మాదిరిగా భారీ శరీరంతో ఉంటారు. వాళ్లు వెయిట్లాస్ అవ్వడం చాలాకష్టం. బరువు తగ్గే సర్జరీలు, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కాస్త బరువు తగ్గగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గడం అంత సులభం కాదు. పైగా ఆ క్రమంలో చాలా నరకం చవి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ బరువు తగ్గాలనే కోరిక బలంగా ఉంటే..పట్టుదలతో ఇట్టే ఆ సమస్యను జయించొచ్చు అని నిరూపించిందామె.ఆ మహిళ అమెరికాలోని కొలరాడోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అనా అలోన్సో. తన శరీర బరువులో సగానికి పైగా బరువు తగ్గిన జర్నీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిజానికి ఆమె బరువు 204 కిలోలు. పట్టుదల, మానసిక స్థైర్యంతో బరువు తగ్గడానికి స్థిరంగా కట్టుబడి మరి స్మార్ట్గా మారింది ఆ పిల్లల తల్లి. ఒకప్పుడు అధిక బరువుతో..చిన్నపాటి కదలికలకే అల్లడిపోయే సవాళ్లను ఎదుర్కొంది. నిరంతర ఆయాసంతో బయటకు అడుగుపెట్టాలంటేనే ఇబ్బంది పడేది. ముఖ్యంగా తన రూపం కారణంగా నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బందిపడేది. తాను ఎలాగైన చురుకైన తల్లిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్న ఆరాటం ఆమెను బరువు తగ్గేందుకు పురికొల్పొంది. ముఖ్యంగా బరువు తగ్గి మంచి శరీరాకృతితో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆకాంక్షతో చాలా పట్టుదలతో నిలకడగా బరువు తగ్గేందుకు ఉపక్రమించానని చెప్పుకొచ్చింది అనా.శారీరక పరివర్తన ఎలా సాధించిందంటే..మొదట్లో చిన్న పాటి కదలికలు కూడా కష్టమైందామెకు. సాధార వ్యాయామాలకే అలిసిపోయేది. అయితే అసౌకర్యాన్ని భరిస్తూ ముందుకు సాగింది. అయితే నిలకడగా చేయడం ప్రతీది మార్చేసింది. కాలక్రమేణ బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేయడం, బహిరంగ పోటీల్లో పాల్గొనేంత వరకు పురోగతి సాధించింది. ఆమె పరివర్తన మొత్తం రాత్రికి రాత్రే జరగలేదు. మంచి జీవనశైలిని అవలంభిస్తూ..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ..తగ్గడం సాధ్యమే అని నిరూపించింది. ఎలా విజయవంతమైందంటే..ఆరోగ్యకరమైన బరువు తగ్గడం కోసం అనా అనుసరించిన ముఖ్యమైన సూత్రాలేంటంటే..క్రమం తప్పని వ్యాయామాలు కాలక్రమేణ బలాన్ని పెంచుకోవడానికి, కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పును మెరుగుపరుచుకోవడానికి సహయాపడ్డాయి. మొదట్లో ఎక్కువ దూరం వాకింగ్ చేసేది. ఆ తర్వాత రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేసేలా జిమ్లో చేరింది. అక్కడ బరువైన బార్బెల్స్, స్క్వాట్స్ వంటివి చేసింది.జీవనశైలిలో మార్పులుతీవ్రమైన డైటింగ్కు బదులుగాచ నిలకడైన అలవాట్లపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యంఒక్కోసారి వద్దు అనుకునే టైంలో భావోద్వేగంగా బలంగా ఉండటం ఎలాగో తెలుసుకుంది. ఎందుకు ఈ లక్ష్యం అనేది మననం చేసుకుంటూ..నిలకడగా చేస్తుండేది. ఆ తర్వాత సమర్థవంతంగా బరువు తగ్గినా.. ఎక్సెస్ స్కిన్తో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రతిపని సునాయాసంగా చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. ఇక్కడ అనా కథ ఎందరికో స్ఫూర్తి. ఆమె వెయిట్లాస్ స్టోరీ ఆరోగ్యం అనేది మనస్తత్వంతో గాఢంగా ముడిపడి ఉంటుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. నిరంతర కృషి, మానసిక బలం స్థిరమైన అలవాట్లతో, అత్యంత సవాలుతో కూడిన వెయిట్లాస్ జర్నీ అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది అనేందుకు అనానే ఉదాహరణ. గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ana Alonso (@ana.fitness.vsg) (చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..! తండ్రిగా, హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారంటే..) -
వ్యాయామాలు తప్పనిసరా..? చేయాల్సిందేనా..
వ్యాయామం అంటే కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, టైప్–2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. అందువల్ల బద్ధకించకుండా బాధ్యతగా చేసే పనిగా గుర్తించాలి.ముందుగా ప్లాన్ చేసుకోకపోతే వ్యాయామం అనేది ఎప్పటికీ చేయలేము. పిల్లలు నిద్రలేవక ముందే, లేదంటే వారి మధ్యాహ్నం నిద్ర సమయంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు ప్లాన్చేసుకోవాలి. ఉదయాన్నే ‘ఏం బట్టలు వేసుకోవాలి? బాటిల్ ఎక్కడ ఉంది?’ అనే గందరగోళం లేకుండా, ముందు రోజే మీ వర్కవుట్ దుస్తులను, వాటర్ బాటిల్ను సిద్ధం చేసుకోండి. ఇది మీ మెదడుపై నిర్ణయాల భారాన్ని తగ్గిస్తుంది.చిన్నపాటి వర్కవుట్లు చాలు..జిమ్లో గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. పుష్–అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటివి ఎక్కడైనా చేయవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం ఉండేలా చూసుకోండి.పిల్లలతో కలిసి..పిల్లల పనులు చేయాలనే సాకుతో చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి పిల్లల పనులు కానీ, పిల్లలు కానీ మీ ఫిట్నెస్కు అడ్డంకి కానే కాదు, వారితో కలిసే వ్యాయామం చేయండి. వారితో కలిసి డ్యాన్స్ చేయడం లేదా పార్కులో ఆడుకోవడం ద్వారా వారికి కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయి. చురుకైన తల్లిదండ్రులను చూసి పెరిగే పిల్లలు భవిష్యత్తులో కూడా యాక్టివ్గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయిక్రమం తప్పకుండా..ఒక్కోసారి చాలా బిజీగా ఉండవచ్చు. అటువంటప్పుడు కనీసం 10 నిమిషాల స్ట్రెచింగ్ లేదా యోగా చేయండి. అన్నీ చేయాలి లేదా ఏదీ చేయకూడదు అనే ధోరణి కంటే, కొద్దిగానైనా క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం.వారానికి రెండుసార్లు..మహిళలకు కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది, కండరాల పటుత్వాన్ని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే గాయాలను నివారించడానికి ఇది అవసరం. వారానికి కనీసం రెండుసార్లు దీనిని ప్రయత్నించండి.(చదవండి: -
తెల్లటివి కంటే గోధుమ రంగు గుడ్లు మంచివా..?
కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం ఇదే. అయితే, కోడిగుడ్ల వినియోగంపై సమాజంలో ఎన్నో రకాల అ΄ోహలు ఉన్నాయి. అనవసరమైన భయాలను పెట్టుకోకుండా గుడ్లను ఆహారంలో చేర్చుకుందాం.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందుదాం. అందుకోసం అపోహలను తొలగించుకుందాం.నమ్మకాలు కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి, పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని వదిలేయాలి.తెల్లటి గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచివి.గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, గుండె జబ్బులు వస్తాయి.నిజాలుపచ్చసొనలోనే శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు నిండి ఉంటాయి. తెల్ల గుడ్లు, గోధుమ రంగు గుడ్లు రెండూ సమానమైన ΄ోషక విలువలను కలిగి ఉంటాయి.గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు పైగా ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.ఆరోగ్యంగా ఉన్నవారు రెండు కన్నా ఎక్కువ గుడ్లను తిన్నా ఏమీ కాదు. అది వారి ఇష్టం. అంతే! .(చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. తన నటనతో, స్టైల్తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా..అభిమానులను అలరించేలా యంగ్ హీరోల మాదిరిగా స్టెప్పులు వేస్తూ నటిస్తుండటం విశేషం. సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడం తోపాటు అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ మంచి తండ్రిగా మన్నననలను అందుకున్నారు. రజనీకాంత్, భార్య లత దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమార్తెలు కూడా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో దర్శకులుగా, నిర్మాతలుగా కళాకారిణులుగా స్థిరపడ్డారు. ఆయన ఆడిపిల్లలు అనే తారతమ్యం చూపకుండా నచ్చిన రంగంలోకి వచ్చే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా తండ్రిగా అన్ని విధాలుగా సపోర్టు చేస్తూ..నాన్న అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చారాయన. అలాంటి సూపర్స్టార్ నుంచి నేర్చుకోవాల్సిన పేరెంటింగ్ పాఠాలేంటో తెలుసుకుందామా..!పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించడం..తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని నియంత్రించడానికి బదులుగా సొంత మార్గాన్ని ఎంచుకునేలా కుమార్తెలను ప్రోత్సహించారు రజనీ. ఇక్కడ పిల్లలను ఫలానా చేయమని డైరెక్షన్ ఇవ్వడం లేదా బలవంతం చేయడం వంటివి చేయకూడదు. వారి భావనలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. అందులో ఉండే సాధకబాధలు అర్థమయ్యేలా వివరించాలే తప్ప..నిర్బంధించకూడదు. ఇక్కడ మంచి తండ్రిగా రజనీ తన కుమార్తెల విషయంలో అదే చేశారు. ముఖ్యంగా పిల్లలను అర్థం చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు రజనీ. పిల్లలతో సన్నిహితంగా ఉండటం..అతిముఖ్యమైన పేరెంటింగ్ పాఠం పిల్లలతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండటం. ఇక్కడ నటుడు రజనీకాంత్ తన కుమార్తెలు, కుటుంబంతో చక్కటిన సత్సంబంధాలను నెరుపుతారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్లు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులపై మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. స్ట్రిక్ట్గా ఉండటం కంటే..పిల్లలతో స్నేహపూర్వకంగా మెలిగే పెంపకమే మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు.పిల్లల డ్రీమ్స్కి మద్దతివ్వండి..రజనీ కూతుళ్లు ఇద్దరు సినీ రంగాన్నే ఎంచుకున్నారు. చిత్రపరిశ్రమలో తమకంటూ మంచి కెరీర్ని నిర్మించుకున్నారు. రజనీకాంత్ తన పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చారు. పిల్లల కోసం అన్నీ చేయడం పెంపకం కాదు, కష్ట సమయాల్లో పిల్లలకు అండగా నిలవడం, వారి పక్కన ఉండటమే అసలైన పెంపకం. అంతేగదు పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చినప్పుడే పిల్లలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ఆధనిక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పెంపక పాఠం.కుటుంబానికే తొలి ప్రాధాన్యత..అలాగే పేరెంట్స్ తమ తమ ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సూపర్స్టార్ రజనీ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పేరెంటింగ్ పాఠం ఇది. ఆయన నటుడిగా బిజీగా ఉన్నా..కుటుంబంతో గడిపే సమయానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పారు కూడా. కుటుంబమే లేకుంటే మనం లేం, అందువల్ల మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీకే ఇవ్వండి అప్పుడే ఎందులోనైనా సక్సెస్ అవ్వగలం అని చెబుతున్నారు రజనీ. -
ఫ్లూట్లు అమ్ముకునే వ్యక్తి కథ..!
సంగీతానికి సంబంధించిన పరికరాలు అమ్మే వ్యక్తి..ఇతర పండ్లు, కూరగాయలు అమ్మే విక్రేతగా అరుస్తూ అమ్మడు. మాధుర్యంగా వాయిస్తూ ప్రజల అటెన్షన్ తనపై పడేలా నిశబ్దంగా అమ్ముకుంటాడు. ప్రజలు కూడా ఆ సంగీతానికి పరవశమై కాసేపు జాలీగా, బాధగా చూసి వెళ్లిపోవడమో లేక కుదిరితే కొనడమో చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చెయ్యొద్దు అని చెబుతున్నాడు ప్రభ్జోత్ సంగ్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేయాలంటే..ఢిల్లీకి చెందిన సూరజ్ అనే ఫ్లూట్లు అమ్మే వ్యక్తి కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రభ్జోత్ సింగ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సూరజ్ అనే ఫ్లూట్ల విక్రేత బెలూన్ల తోపాటు ఆ ఫ్లూట్లను అమ్మే విధానం ముగ్ధమనోహరంగా ఉంటుంది. అతడు ఫ్లూట్ పట్టుకుని వాయిస్తూ ప్రజలందరీ అటెన్షన్ తనపై పడేలా వాయించే విధానం ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అంత అద్భుతంగా వేణువుని ఆలపిస్తాడు సూరజ్. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేస్తూ..అతను వేణువుని వాయిస్తున్నప్పుడు అందంగా కదిలే ఆ బుడగల దృశ్యం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని రాసుకొచ్చాడు. అతను ఒకేసారి ప్రదర్శకుడిగా, అమ్మకందారుడిగా రెండు పాత్రలను భలే సమతుల్యం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అతడి కుటుంబ అవసరాలకు ఎంత మాత్రం సరిపడదనేది అందరికీ తెలిసిందే. అయితే మనమంతా అలాంటి వ్యక్తుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతూ..జాలిని వ్యక్తం చేసి వదిలేస్తుంటాం. ఎలాంటి సాయం చేయూత అందించే యోచన చేయమని, తాను కూడా మొదటిసారి అలానే చేశానని చెప్పుకొచ్చాడు ప్రభ్జోత్. అయితే ఈసారి అలా చేయాలనుకోలేదని వివరించాడు. ఈసారి అతడితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపాడు. తన తండ్రి వేణువుని వాయించేవాడని, ఇప్పుడు తన కొడుకు కూడా తనలా వాయించేలా నేర్చుకుంటున్నాడని సూరజ్ చెప్పుకొచ్చినట్లు వెల్లడించాడు. ఇక అమ్మేందుకు ఇలా ప్రదర్శన ఇవ్వడం కాకుండా తన టాలెంట్న ప్రదర్శించేందుకు వాయిస్తాడని పోస్టులో రాసుకొచ్చాడు ప్రభ్జోత్. అంతేగాదు ఇతరులను కూడా అలానే చేయమని ప్రోత్సహిస్తున్నాడు కూడా. వీధి సంగీతకారులను చూసి కేవలం విని వదిలేయొద్దు..వారి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకో లేదా హౌస్ పార్టీలోనే చక్కగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వండి, తోచినంత మొత్తం చెల్లించండి. మనం వాళ్లని అమ్మకందారులుగా కాకుండా కళకారులుగా పిలిచి గౌరవిద్దాం అని పిలుపునిస్తున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రభ్జోత్. నిజానికి మనం మొత్తం వ్యవస్థను మార్చలేకపోవచ్చు..ఇలాంటి చిన్న ప్రయత్నాలతో వాళ్ల జీవితంలో వెలుగు రావొచ్చేమో..లేక మార్పు సంతరించుకోవచ్చేమో..! అంటూ పోస్ట్ ముగించాడు. నెటిజన్లు సైతం అతడికి మద్దతిస్తూ..ఆలోచన బాగుంది సార్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Prabhjot Singh (@intent.content.form) (చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
కళలు, సంస్కృతికి నిలయమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) మూడో వార్షికోత్సవం ఏప్రిల్ 3, 2026న ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆరుగజాల మెటాలిక సిల్క్ చీర, దానికి మ్యాచింగ్గా ఆభరణాలను ధరించి రాజసం ఉట్టపడే ఆహార్యంతో కట్టిపడేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖ తారలంతా విచ్చేశారు. ముఖ్యంగా షాహిద్ కపూర్, మీరా కపూర్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, సిద్ధార్ధ్ మల్హోత్ర, కియార అద్వానీ తదితర తారాగణం హాజరయ్యారు. ఈ వేడుకలో నీతా అంబానీ రాజసం ఉట్టిపడే పట్టుచీరలో ధగధగ మెరిసిపోయారామె. సాంప్రదాయ భారతీయ హస్తకళకు అద్భుతమైన నిదర్శనంగా నిలిచింది ఆమె ధరించిన చీర. బంగారు, ముదురు ఎరుపు రంగుల ప్రకాశవంతమైన కలయికతో కూడిన చరీపై క్లిష్టమైన జరీ పని అద్భుతంగా ప్రతిబింబిస్తూ..ద్రవరూపంలో ఉన్న మెరుపని సృష్టిస్తోంది. సాంప్రదాయ పైస్లీ నమూనాలతో కూడిన వెడల్పాటి అంచు, చీరకు చక్కటి రూపాన్ని ఇవ్వగా పల్లుపై సూక్ష్మమైన నమూనాలు మరింత హైలెట్గా నిలిచాయి. దానికి మ్యాచింగ్గా మెరూన్ గోల్డ్ రంగులో పొట్టిచేతులతో కూడిన బ్లౌజ్ చీర లుక్ని అమాంతం పెంచేసింది. ఆ పట్టుచీరకు తగ్గట్టుగా ప్రకాశవంతమైన పచ్చులు, కెంపులతో పొదిగిన నెక్లెస్, చేతులకు బంగారు గాజులు, చెవులకు స్టేమెంట్ రింగులతో.. పండుగ వాతావరణాన్ని తలపించే రాయల్ లుక్లో ఆకర్షణీయంగా కనిపించారు నీతా. సాంప్రదాయ మహిళలా మధ్యపాపిడి చక్కటి కొప్పు, తేలికైన మేకప్తో హుందాగా మెరిశారామె. సింపుల్గా చెప్పాలంటే ఆమె మొత్తం రూపంలో సాంస్కృతికత ప్రతిధ్వనించింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!) -
మనం చాక్లెట్ అంటే పడి చావడం లేదు!!
చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఎంత ఇష్టమన్నదే ఇక్కడపాయింట్. యూరప్, యూఎస్లోచాక్లెట్ అంటే పడి చస్తుంటే.. ఆసియాలో మాత్రం చాక్లెట్ కన్నా.. స్థానిక మిఠాయిలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో జర్మనీ వాసులు అత్యధికంగా చాక్లెట్ను తింటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి 8.1 కిలోల చాక్లెట్ను తింటున్నాడట. తర్వాతి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. చివరి స్థానాల్లో భారత్, చైనాలు ఉన్నాయి. ఓసారి ఆ లెక్కలేంటో చూసేద్దామా.. -
రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!
రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి..తల్లి అయ్యాక మళ్లీ కెరీర్కి బ్రేక్ ఇస్తే..తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఉద్యోగం కోల్పోవడంతో కొంత భయం, కాన్ఫిడెన్స్ మాయం అవ్వడం సహజం. అందులోనూ ఓ పక్క తల్లి అవ్వడంతో పెరిగిన బాధ్యతలు నడుమ ఒక విధమైన మానసిక ఒత్తిడి ఎదురవ్వుతుంది. అవన్నీ తట్టుకుని మళ్లీ ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్లపై నిలబడాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాల్సి ఉంటుంది. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది 39 ఏళ్ల మహిళ.డాక్టర్ ప్రియా పోర్వాల్ రెండుసార్లు ఉద్యోగాన్ని కోల్పోయి, తల్లి అయ్యాక కొంత కాలం కెరీర్కి విరామ ఇచ్చి..మళ్లీ తన ఉద్యోగ కెరీర్ని నిర్మించుకోవడానికి ఎంతలా పాట్లు పడిందో పంచుకున్నారు. విద్యారంగంలో ప్రారంభమైన తన ఉద్యోగ కెరీర్ ఊహించని మలుపు తీసుకునే ముందు..దశాబ్దానికి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారామె. ప్రియ తాను 35 ఏళ్ల వయసులో తల్లి అయ్యానని, ఈ మైలు రాయి తన 12 ఏళ్ల కెరీర్కు విరామం ఇచ్చేలా చేసిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయి చాలా ఏళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ అనుభవం తనను చాలా కలవరపరిచిందని అన్నారు. కోలుకోవడానికి నెలలు పట్టిందని, తన కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా అనిపించిందంటూ ఆ మానసిక క్షోభను గుర్తుచేసుకున్నారు. తిరిగి ఎలాగైన పుంజుకోవాలనే పట్టుదలతో ప్రియా పలు సంస్థలలో విజిటింగ్ ఫ్యాకల్టీ సభ్యురాలిగా అవకాశాలు అన్వేషించారు. ఆ తర్వాత మరో విద్యాసంబంధమైన పదవిని కూడా పొందారు. అయితే అక్కడి వాతావరణం ఆమె అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మరోసారి అక్కడ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తిరిగి ప్రారంభించడం అంత సులభం కాదని తేలింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది. 37 ఏళ్ల వయసులో, ఒక చిన్న బిడ్డను పెంచుతూ, అనిశ్చితిని ఎదుర్కొంటూ..తన కెరీర్పై పూర్తి నియంత్రణ సాధించాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారామె. తాను తిరిగి కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను, అదికూడా తనకు నచ్చిన విధంగా అని చెప్పుకొచ్చింది. ఆర్థిక స్వాతంత్యానికి మించిన చోదకశక్తి మరొకటి లేదని అంటోంది. తన సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టానని, కేవలం డబ్బుకోసం కాదు, వ్యక్తిగత ప్రాముఖ్యత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ రోజు, ఆ నిర్ణయం ఫలించిందని, గతేడాది తాను డాలర్లలో ఐదు అంకెల జీతం కూడా సంపాదించినట్లు పేర్కొంది. ఇతర మహిళలకు ఆమె ఇచ్చే సందేశం ఏంటంటే.. “ప్రసూతి అనేది వృత్తికి ముగింపు కాదు.” అని నొక్కి చెబుతోంది. (చదవండి: వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!) -
ఆంతరంగిక ప్రశాంతత
ఆధ్యాత్మికత (Spirituality) అంటే కేవలం పూజలు, పునస్కారాలు అనుకుంటారు. కానీ సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోణంలో స్పిరిచువాలిటీ అంటే—మీ అంతరంగంతో మీరు కనెక్ట్ అవ్వడం. బయట ప్రపంచంలో మీరు ఎంత సక్సెస్ సాధించినా, లోపల ప్రశాంతత లేకపోతే ఆ వ్యక్తిత్వం వెలిగిపోదు. ఆంతరంగిక ప్రశాంతత మీ పర్సనాలిటీని ఎలా ఒక 'స్థితప్రజ్ఞుడి'లా మారుస్తుందో ఈ ఆర్టికల్లో చూద్దాం.పర్సనాలిటీ అనేది ప్రపంచం చూసే 'బయటి కవచం' అయితే, స్పిరిచువాలిటీ అనేది ఆ కవచం లోపల వెలిగే 'దీపం'. ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఒక రకమైన నిలకడ (Stability), కరుణ (Compassion), స్పష్టత (Clarity) ఉంటాయి. ఇది మిమ్మల్ని కేవలం ఒక 'సక్సెస్ఫుల్ మ్యాన్' నుండి ఒక 'వైజ్ మ్యాన్' (Wise Man) గా మారుస్తుంది.అంతర్గత నియంత్రణ (Locus of Control)స్పిరిచువల్ పర్సనాలిటీ ఉన్నవారికి తమ సంతోషం కోసం బయటి వ్యక్తుల మీద లేదా పరిస్థితుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ‘‘నా ప్రశాంతత నా చేతుల్లోనే ఉంది. ఎవరో నన్ను విమర్శించినా, నా ప్లాన్ ఫెయిల్ అయినా నా 'కోర్' (Core) కదలదు’’ అనుకుంటారు. దీన్నే Internal Locus అంటారు. దీనివల్ల మీరు ఒత్తిడిలో కూడా అద్భుతంగా పనిచేయగలరు. మీ పర్సనాలిటీకి ఇది ఒక 'బుల్లెట్ ప్రూఫ్' కవచంలా పనిచేస్తుంది.Ego vs SoulEgo-Driven Personality: "నేను గెలవాలి, నేను అందరికంటే గొప్పగా కనిపించాలి" అనుకుంటారు. ఇది ఎప్పుడూ భయం మరియు అసూయతో నిండి ఉంటుంది.Soul-Driven Personality: "నేను నా ధర్మాన్ని (Purpose) నెరవేర్చాలి, అందరికీ మేలు చేయాలి" అనుకుంటారు. ఇందులో ప్రశాంతత మరియు నిస్వార్థం ఉంటాయి.ఎప్పుడైతే మీ పర్సనాలిటీ ఈగో నుండి సోల్ వైపు ప్రయాణిస్తుందో, మీ కరిష్మా వెయ్యి రెట్లు పెరుగుతుంది. మనుషులు మిమ్మల్ని చూసి గౌరవించడం కాదు, మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు.మోటివేషన్ మాయ vs ఆంతరంగిక ప్రశాంతతమోటివేషన్ "బయట గెలువు, ప్రపంచాన్ని జయించు" అని మిమ్మల్ని నిరంతరం ఉరుకులు పెట్టిస్తుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది (Burnout).స్పిరిచువాలిటీ (Mindfulness)... "లోపల ప్రశాంతంగా ఉండు, అప్పుడు ప్రపంచం నీ వెనుక వస్తుంది" అని చెప్తుంది. ఇది మీకు 'శాశ్వతమైన శక్తిని' (Enduring Power) ఇస్తుంది.ఆంతరంగిక ప్రశాంతతను ఎలా సాధించాలి?Step 1: Break External Validation"నలుగురు ఏమనుకుంటారు?" అనే ఆలోచనను 'Break' చేయండి. మీ విలువలకు విరుద్ధంగా ఏ పని చేయకండి. మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోగలిగితే, అదే అతిపెద్ద ప్రశాంతత. పాత మొహమాటాలను వదిలేయండి.Step 2: Build Solitudeప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు మీతో మీరు గడపడం 'Build' చేయండి. అది మెడిటేషన్ కావచ్చు, లేదా ఒక డైరీ రాయడం కావచ్చు. మీ లోపల జరుగుతున్న సంభాషణను గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినడం మొదలుపెడితే, మీ నిర్ణయాల్లో తప్పులు జరగవు.Step 3: Universal Compassionమీ ప్రశాంతత కేవలం మీకే పరిమితం కాకుండా, మీ చుట్టూ ఉన్నవారికి కూడా అందాలి. ఒక చిన్న చిరునవ్వుతో, ఒక ఓదార్పు మాటతో మీరు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి. మీరు ఒక 'ప్రేరణ'గా (Inspiration) మారడమే 'Beyond' స్టేజ్.మీ లోపల ఏముంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు భయం వేస్తోందా లేక ప్రశాంతంగా అనిపిస్తోందా?2. మీ సంతోషం వేరే ఎవరి చేతుల్లోనైనా ఉందా?3. మీరు చేసే పని వల్ల మీ ఆత్మ తృప్తి పొందుతోందా?ప్రశాంతతే అసలైన సంపద!ప్రపంచాన్ని గెలిచి మిమ్మల్ని మీరు ఓడిపోతే అది విజయం కాదు. మిమ్మల్ని మీరు గెలిచి ప్రపంచానికి సేవ చేస్తేనే అది పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఆంతరంగిక ప్రశాంతత ఉన్న వ్యక్తి యుద్ధ భూమిలో కూడా ప్రశాంతంగా ఉండగలడు. అదే 'జీనియస్' లక్షణం."Peace comes from within. Do not seek it without."Gowthama Buddha సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: లక్ష్యంతో మారే పర్సనాలిటీ!) -
రుతుక్రమం వైకల్యం కాదు
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన బహిష్టు సెలవుల ఉత్తర్వు చట్టపరమైన చర్చకు దారితీసింది. దీనిని సవాలు చేస్తూ 15 మంది మహిళా వృత్తి నిపుణులు హైకోర్టు మెట్లెక్కారు. రుతుక్రమ సెలవును ‘కపట వివక్షగా’ అభివర్ణించారు. ఇది బంగారు పంజరం లాంటిదని.. పైకి మహిళల మేలు కోసమే అన్నట్లుగా కనిపించినా.. ఇలాంటివి వారి కెరీర్ని దెబ్బతీస్తాయని వారు వాదించారు. మూసధోరణులకు ముగింపు పలకాలన్నారు.ఉత్తర్వు ఏం చెబుతుంది?కర్ణాటక ప్రభుత్వం బహిష్టు సెలవు విధానాన్ని నవంబర్ 2025లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రవేశపెట్టారు. ఇది మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవును తప్పనిసరి చేస్తుంది. అంటే ఏడాదికి 12 రోజులు. ఈ ఉత్తర్వు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాలకూ వర్తిస్తుంది. అంటే ఐటీ సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేసే 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అవసరం గల ప్రతి మహిళా సెలవు తీసుకోవచ్చు. దీనికి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే ఉపయోగించని సెలవులను తదుపరి నెలకు బదిలీ చేయడం సాధ్యపడదు.మూసధోరణుల్ని ప్రోత్సహించడమేప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ‘బహిష్టు సెలవు’పై ప్రశ్నిస్తూ ఉన్నత హోదాల్లో ఉన్న 15 మంది మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఇది మృదువైన వివక్షకు నిదర్శనమన్నారు. సమానత్వాన్ని పెం పొందించడానికి బదులుగా, ఈ విధానం దానికి విరుద్ధమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల నియామక ప్రక్రియలలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని, యజమానులు మహిళలను పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలవారిగా చూసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ చర్య ఆనాటి మూస పద్ధతులను బలపరిచే ప్రమాదం ఉందని, వారి ఎదుగుదలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెలవు మహిళలను బలహీనులుగా చిత్రీకరిస్తుందని, తద్వారా సమానత్వ చట్టాల అసలు ఉద్దేశ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని వారు వాదించారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో మహిళలు ప్రత్యేక రాయితీలు, నిర్బంధ సెలవులు కోరుకోవడం లేదు, కేవలం సమాన అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కోరుతున్నారు. రుతు క్రమాన్ని ఒక వైకల్యంగా మార్చడం తమ వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం’’ అని ఈ మహిళల వాదన.పని ప్రదేశాల్లో ఈ రకమైన వివక్షను గుర్తించడం కష్టం, ఎందుకంటే ఇది ప్రేమ, మర్యాద రూపంలో వస్తుంది. ఈ బంగారు పంజరం నుంచి బయటపడాలంటే, మహిళలను కేవలం రక్షించాల్సిన వ్యక్తులుగా కాకుండా, సమాన సామర్థ్యం గల భాగస్వాములుగా గుర్తించడం నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. -
సోలో లైఫ్.. సోషల్ మీడియా
ఉదయం లేస్తూనే సోషల్మీడియా వాకిట్లో పక్షుల్లా వాలిపోతుంటారు. రీల్స్, రివైవల్, కబుర్లు, మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు.. వయసు తేడా లేకుండా ఆన్లైన్ వేదికగానే ఎన్నో విశేషాలను పంచుకుంటూ, పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా డంప్ అయ్యే ఎన్నో మానసిక సమస్యలనూ నెత్తిన మోస్తున్నారు. ‘ప్రపంచం అంతా ‘పర్ఫెక్ట్’గా ఉందన్న భ్రమతో తమను తాను హింసించుకునేవారి శాతం ఇటీవల పెరుగుతోంది..’ అంటున్నారు నిపుణులు.వైజాగ్ వాసి పదిహేడేళ్ల అనన్య భోజనం తినడం తగ్గించడం మొదలుపెట్టింది. ఈ సమస్య ఎంతగా అంటే ఒకరోజు ఆమెను బలవంతంగా హాస్పిటల్లో చేర్చి, సెలైన్ పెట్టించాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్రభావంతో ఆమె తన శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేది. తినమని తల్లి ఒత్తిడి చేస్తే ‘లైక్స్ రావడం లేదంటే అర్థం, నేను బాగా లేనట్టేగా..’ అని గట్టిగట్టిగా అరుస్తోంది.. అని అనన్య తల్లి ఆవేదన చెందుతోంది.. ∙∙ ఉద్యోగంలో బిజీగా ఉండే మాధవి రిలాక్స్ కావడానికి సోషల్మీడియా ఒక మార్గంగా మారింది. మొదట్లో ఫ్రెండ్స్తో కనెక్ట్ అవడానికి ఆ తర్వాత ఫొటోలు షేర్ చేసేది. ఆ పోస్టులకు లైక్స్, కామెంట్స్ పెరుగుతుండటంతో తరచు చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకట్రెండుసార్లు ఆమె పెట్టిన ఫొటోకు తక్కువ లైక్స్ రావడంతో నిరాశ మొదలైంది. ‘అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకో’ అనుకోవడం మొదలుపెట్టింది. ఇతరుల ఫొటోలు చూసి, తనను తాను పోల్చుకుంటుంది. ‘వారితో పోల్చితే, అంత అందంగా లేను. అందుకే లైక్స్ రావడం లేదు’ అనే భావన పెరిగింది. పనిమీద దృష్టి తగ్గింది. దీంతో ఆందోళన పెరగడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు మొదలయ్యాయి. కనిపించని ఒత్తిడులుఇప్పటికాలంలో సోషల్ మీడియా మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ అదే సమయంలో ఇది మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. బయటికి కనిపించేది ఫొటోలు, వీడియోలు, లైక్స్, కామెంట్స్ మాత్రమే. కానీ అంతరంగంలో జరిగే మానసిక ఒత్తిడి వేరుగా ఉంటోంది. అందం, ఆనందం, ఆర్థిక విషయాలు, తన చుట్టూ ఏమీ బాగోలేదనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ప్రధాన సమస్యలుఇతరులతో పోల్చుకోవడం. ఇతరులు అందంగా, ఆనందంగా ఉన్న ఫొటోలు, రీల్స్.. చూసి వారి జీవితం వడ్డించిన విస్తరి అనే భావనకు లోనవుతున్నారు. అదే సమయంలో తమ జీవితం ఎంత నిస్సారంగా ఉందో అంచనా వేసుకుంటున్నారు. దీంతో మిగతావారికంటే తమ జీవితం చాలా తక్కువ అనే భావనకు లోనవుతున్నారు. → ఫొటోలు, వీడియోలకు వాడే ఫిల్టర్లు, ఎడిటింగ్, ఏఐ.. వంటి వాటి వల్ల అంచనాలు పెరుగుతున్నాయి. నిజానిజాలు అర్ధం చేసుకోలేకపోతున్నారు.→ తమపై తమకు ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. కుటుంబంపైనా ఈ ప్రభావం పడుతోంది.→ లైక్స్, కామెంట్స్ ద్వారా ఆనందం పొందడం అలవాటై, తక్కువ రెస్పాన్స్ వస్తే ‘బాధ’కు లోనవుతున్నారు. → ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ వల్ల డిప్రెషన్, భయాందోళనకు లోనవుతున్నారు. → ఇతరుల ఆనందం చూసి ‘నేను ఏదో మిస్ అవుతున్నాను’ అనుకుంటున్నారు. → అతి ఎక్కువగా స్క్రీన్ టైమ్లో గడపడం వల్ల మానసిక అలసటకు లోనవుతున్నారు. → సోషల్ మీడియా అంటే రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరైన విధంగా వాడితే సమాచారం, ప్రపంచంతో కనెక్టివిటీ ఇస్తుంది. కానీ నియంత్రణ లేకుండా వాడితే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.నియంత్రణ తప్పనిసరి→ రోజుకు ఒక పరిమితి పెట్టుకోవాలి.→ సోషల్ మీడియాలో కనిపించేది పూర్తి నిజం కాదని గుర్తుంచుకోవాలి.→ వారానికి ఒక రోజు సోషల్ మీడియా నుంచి పూర్తి బ్రేక్ తీసుకోవడం మంచిది.→ ప్రేరణ, ఉత్సాహం, అవగాహన కలిగించే కంటెంట్ను ఫాలో అవడం మంచిది. → మన విలువలను లైక్స్తో కాకుండా మనసుతో కొలవాలి. కుటుంబం, స్నేహితులతో రోజువారీ అంశాలపై చర్చ, మాట్లాడం.. వంటివి చేస్తుంటే సోషల్ మీడియా ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. సోషల్ మీడియా అనేది ఒక వర్చువల్ ప్రపంచం. అక్కడ మనం చూస్తున్నది పూర్తినిజం కాదు. కానీ, మన మెదడు దాన్ని నిజం అనేలా స్వీకరిస్తుంది. అదే సమస్యకు మూలం అవుతుంది. పాజిటివ్గా వచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ అనే ‘ఫీల్గుడ్’ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఫోన్ను పదే పదే చెక్ చేయడం, సోషల్ మీడియా లేకపోతే అసహనం, నిద్రలేమి, పనిమీద దృష్టి తగ్గడం.. వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. రోజులో కొంత సమయమే సోషల్ మీడియా ఉపయోగించడం, అభి రుచులు, వ్యాయామం, కుటుంబంతో సరైన టైమ్ గడపడం వంటివాటి వైపు మనసును మళ్లించగలిగితే సరైన జీవన ఆనందాన్ని పొందగలరు. సమస్యను నియంత్రించుకోలేకపోతే నిపుణులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం మేలు చేస్తుంది.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ -
మరో చరిత్రకోసం...
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.రికార్డ్ సృష్టించి...2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.అంటార్కిటికాలో...‘ఆర్టెమిస్–2’ మిషన్కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్లో అసైన్డ్ క్రూ బ్రాంచ్కు చీఫ్గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో సెంటర్ డైరెక్టర్కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.అంతరిక్ష యోగా!‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?‘యస్’ అంటున్నారు కోచ్. తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్. శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.రికార్డ్లు బద్దలు కావాల్సిందే!→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?క్రిస్టినా కోచ్: నేను రికార్డ్లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.→ అంతరిక్ష అనుభూతి గురించి...కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. -
మనసును తాకే స్టోరీ..! తాత జ్ఞాపకాల కోసం..
రాజస్థాన్లోని సింధారి జిల్లాలోని కర్దాలి గ్రామంలో... యాభై ఏళ్ల నాటి పూరి గుడిసె పునాది బలహీన పడడంతో కూలిపోయే ప్రమాదంలో పడింది. ఈ గుడిసె పూర్ణారామ్ అనే వ్యక్తి తాతది. పూర్ణరామ్కు అది పాత గుడిసె కాదు. ఒక అమూల్యమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని కాపాడుకోవాలనుకున్నాడు పూర్ణారామ్. హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో గుడిసెను వేరే చోటికి తరలించాడు. చెదల వల్ల గుడిసె పునాది దెబ్బతిందని, అందుకే దాన్ని తరలించాల్సి వచ్చిందని పూర్ణారామ్ వివరించాడు. గుడిసె పై కప్పు మరమ్మతు చేస్తే అది 30 నుండి 40 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని అతను భావిస్తున్నాడు.‘లక్ష రూపాయల విలువ కూడా లేని ఈ పాత గుడిసె కోసం ఇంత శ్రమ ఎందుకు?’ అనే ప్రశ్నకు పూర్ణారామ్ ఇచ్చిన జవాబు...‘నా దృష్టిలో అది కోట్లాది రూపాయల కంటే విలువైన గుడిసె. ఈ గుడిసె చుట్టూ ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి’. View this post on Instagram A post shared by Social Mela (@social_mela) (చదవండి: వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!) -
వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!
పెళ్లికి ముందు వరకు అమ్మాయిల లైఫ్ చదువులు, కాలేజ్ లైఫ్ తదనంతర ఉద్యోగం వంటివాటితో హాయిగా తుళ్లుతూ సాగిపోతుంది జీవితం. పెద్దగా ట్రబుల్స్ ఏమి ఉండవు. తల్లిదండ్రుల వద్ద గారాభంగా, ముద్దుగా ఏ చీకు చింత లేకుండా గడిపేస్తారు. పెళ్లి అనే రెండే అక్షరాల బంధంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో అప్పుడే బాధ్యతలు, బరువు ఒకేసారి మీద పడినట్లుగా ఉంటుంది జీవితం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనే వాటిపై అటెన్షన్ ఎక్కువై ఒకటే ఆత్రం, ఆందోళన వెంటాడుతూ ఉంటాయి. దాంతో పెళ్లి తర్వాత అమ్మాయిలంతా గూగుల్ని అవే ఎక్కువ అడుగుతున్నారట. వాళ్లంతా చిటికెలో దొరికే పరిష్కారాల కోసం గూగుల్ని అడుగుతున్న విచిత్రమైన ప్రశ్నలేంటంటే..1. చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ భర్తలను సంతోషంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పర్యవసానంగా, వారు తమ భర్త ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం ఎలా?, ఏం చేయకూడదు, ఎలా తీసుకోకూడదు వంటి వాటిని సర్చ్ చేస్తున్నారట. ముఖ్యంగా తమ భర్త సంతోషం కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారట.2. వివాహిత మహిళలల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక ప్రశ్న, తమ భర్త మనసును గెలుచుకోవడం ఎలా అనేది. భర్త సంతోషంగా ఉంటేనే కదా మనల్ని సంతోషంగా ఉంచుతాడనే నమ్మకంతో దానికోసం చిట్కాల కోసం వెతుకుతారట. .3. తమ భర్తలను విధేయులుగా ఎలా మార్చుకోవాలి అనేదాని గురించి కూడా ఎక్కవగా సర్చ్ చేస్తున్నారట. కొంతమంది మహిళలు తమ భర్తలు తమ మాట వినడాన్ని ఇష్టపడతారు. అందుకే దీనిపై గూగుల్ని ఎక్కువగా సలహాలు కోరుతున్నారట.4 కొత్తగా పెళ్లైన వారిలో పిల్లలను కనడానికి సరైన సమయం గురించిన ప్రశ్నలు కూడా వస్తుండటం విశేషం. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వం లేకపోవడంతో, చాలా మంది మహిళలు జాగ్రత్తగా, ప్రణాళికతో మాతృత్వాన్ని స్వీకరించాలనే ఉద్దేశ్యంతో గూగుల్ని ఆశ్రయిస్తున్నారట.5. కొత్త కుటుంబంలో ఎలా సర్దుకుపోవాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలామంది కొత్త వధువులు కొత్త ఇంట్లో తమ సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలిని కుటుంబసభ్యులతో సముచితంగా ఎలా మెలగాలి వంటి సలహాలు కూడా అడుగుతున్నారట.6. వివాహంతో వచ్చే బాధ్యతలు అధిక భారాన్ని మోపవచ్చు. మహిళలు తరచుగా ఈ కొత్త విధులను నిర్వహించడానికి వ్యూహాల కోసం వెతుకుతున్నారట. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద హాయిగా సాగిన జీవితాల్లోకి ఒక్కసారిగా వచ్చిపడిన బాధ్యత భారం ఎలా నిర్వహించాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుందట మహిళల్లో. 7. కొందరైతే ఫ్యామిలీ లైప్, వృత్తి జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలనే దానిపై ఆందోళన చెందుతున్నారట. వృత్తిపరమైన ఆశయాలకు కుటుంబ జీవితం ఆటంకంగా మారకూడదనే ఆందోళన నేపథ్యంలో దీనిపై ఎక్కువగా గూగుల్లో సర్చ్ చేస్తున్నారట. చెప్పాలంటే మహిళలు సమర్థవంతమైన సమయ నిర్వహణతో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చెయ్యొచ్చు అని సలహాలు అడుగుతుండటం విశేషం. (చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
సక్సెస్కి చిరునామా అతడు..!
‘హాయిగా గడిచిపోతుంది కదా...రిస్క్ ఎందుకు!’ అనుకునే వాళ్లకు రిస్క్తోపాటు సక్సెస్ కూడా దూరంగానే ఉంటుంది! ‘సక్సెస్ దక్కాలంటే రిస్క్ చేయాల్సిందే’ అనుకునేవాళ్లే విజేతలవుతారు. రోహిత్ రేజి కొన్ని స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడు. ‘నేనే ఒక స్టార్టప్ ఎందుకు మొదలు పెట్టకూడదు’ అనే ఆలోచనతో నియోక్రెడ్ టెక్నాలజీస్ మొదలు పెట్టి అద్భుత విజయం సాధించాడు... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా చూసే సాంకేతికతను, సమస్యల పరిష్కారాలను ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’ రూపొందించింది. ఇది బి2బి2సి స్టార్టప్. నియోక్రెడ్ అనేది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేసే సంస్థ. మన దేశంలోని అగ్రశేణి బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, రేజర్పే, పేటీఎం వంటి ఫిన్టెక్లు ‘నియోక్రెడ్’ కస్టమర్లు.అసలైన సామర్థ్యం అదే!‘ఏఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుండి బీకామ్ పూర్తి చేసిన తరువాత ‘ఎక్స్పెడైట్’ అనే స్టార్టప్లో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు రోహిత్. ‘లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టి)’లో కొంతకాలం పనిచేసిన తరువాత టెడ్ఎక్స్ టాక్ షోలను నిర్వహించడానికి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ తరువాత బెంగళూరులో ‘ఎంఎస్ఎస్’ పేమెంట్స్ అనే స్టార్టప్లో చేరాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సొంత స్టార్టప్ గురించి ఆలోచించాడు.‘ఓపెన్ బ్యాంకింగ్ రంగంలో పరిష్కారాలను రూపొందించడంలోనే అసలైన సామర్థ్యం ఉందని గ్రహించాను’ అంటున్న రోహిత్ ఆ సమస్యల పరిష్కార వేదికగా ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’కు శ్రీకారం చుట్టాడు. ఓపెన్ బ్యాంకింగ్ అనేది సురక్షితమైన ఏపీఐలను ఉపయోగించే ఒక వ్యవస్థ. దీనిద్వారా అధీకృత థర్డ్–పార్టీ ప్రొవైడర్లు(ఫిన్టెక్ల వంటివి) కస్టమర్ల బ్యాంక్ డేటాను వారి అంగీకారంతో యాక్సెస్ చేస్తాయి.నమ్మకం ప్లస్ గుర్తింపుయెస్ బ్యాంక్తో కలిసి 2018–19లలో ప్రీపెయిడ్ కార్డులను ప్రారంభించింది నియోక్రెడ్. కోవిడ్ కల్లోల కాలం తరువాత ‘రూపే ఆన్ ది గో’ అనే పైలట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్స్ ఆఫ్ ఇండియా)తో కలిసి సహ–భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఇది మాకు నమ్మకాన్ని, గుర్తింపు రెండిటినీ ఇచ్చింది’ అంటాడు రోహిత్. కొన్ని సంవత్సరాల క్రితం రోహిత్ స్టార్టప్కు విరెంక్సియా, ఏంజెల్ ఇన్వెస్టర్ రాజేష్ జైన్ నుంచి ఎనిమిది కోట్ల సీడ్ ఫండింగ్ వచ్చింది. ప్రొడక్ట్స్లైన్స్ నియోక్రెడ్కు మూడు ఉత్పత్తి శ్రేణులు(ప్రొడక్ట్ లైన్స్) ఉన్నాయి. ఐడెంటీ మెనేజ్మెంట్ (ప్రొఫైల్ ఎక్స్), ప్రైవసీ(బ్లూటిక్), పేమెంట్స్ (కలెక్ట్ బాట్)‘నియోక్రెడ్’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు రోహిత్ రెజి,‘ఇతర దేశాలలో ఐడెంటిటీ ప్రొఫైలింగ్, ప్రైవసీ, పేమెంట్స్ ఫ్లాట్ఫామ్లను నిర్మించాలనుకుంటున్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి స్థానిక అవసరాలు తీర్చాలనుకుంటున్నాం’ అంటున్నాడు రోహిత్. దీనికి సంబంధించి సింగపూర్, దుబాయ్లోని పార్టీలతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నాడు. ‘నియోక్రెడ్’లో ప్రస్తుతం 140 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సగం మంది టెక్ నిపుణులు. ‘తమ లక్ష్యం గురించి నిరంతరాయంగా కష్టపడడం, నిబద్ధత నియోక్రెడ్ విజయానికి కారణం’ అంటున్నారు ‘అల్వారెజ్ అండ్ మార్సల్’ గ్లోబల్ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ భావిక్ హతి. సక్సెస్ అనేది కంఫర్ట్ జోన్ నుంచి రాదు. సవాళ్లను అధిగమించే శక్తి నుంచి వస్తుంది.'– రోహిత్ రెజి(చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!
వెయిట్లాస్ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్ లైఫ్స్టైల్స్తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్లాస్ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్లాస్ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.బరువు తగ్గడం కోసం..డైట్లు చేయడం:తాను కఠినమైన డైట్లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్ క్రియేటర్ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.కార్బోహైడ్రేట్లను తగ్గించడంరొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..కఠినమైన ఆహార డైట్లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.అతిగా వ్యాయామం చేయడంతీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mallika Fatehpuria (@mallikafatehpuria) (చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!
అవసరం, ఆకలి బాధ ఆ యువకుడని ఆవిష్కరణ బాట పట్టేలా చేసింది. అతడిలోని టాలెంట్ని వెలికితెచ్చేలా చేసి..జీవితానికి మార్గం చూపింది. అంతేగాదు ఎప్పుడో వదిలేసిన చదువు వైపుకి వెళ్లేలా చేసి..ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలే అభ్యున్నతిని సాధించేందుకు దారితీసింది. తన జీవితంలోకి వచ్చిన ఆ వెలుగుని పదిమందికి పంచి తనలాంటి వాళ్ల అభ్యున్నతికి పాటుపడుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.అతడే కమ్క్వాంబా. దక్షిణాఫ్రికా మలావిలోని మసితాలా అనే గ్రామీణ గ్రామంలో పెరిగాడు క్వాంబా. అతని కుటుంబాని మొక్కజొన్న పంటే ఆధారం. 2001లో కరువు, భారీ వర్షాలు దీనికి తోడు ప్రభుత్వం ధాన్యం నిల్వలు అమ్మేయడంతో ఏర్పడిన తీవ్రమైన ఆహార సంక్షోభం కారణంగా కరువు సంభవించింది. దాంతో అతడి కుటుంబం స్కూల్ ఫీజులు భరించలేక అతడిని పాఠశాలకు పంపించడం మానుకుంది. అయితే ఒకరోజు తన గ్రామ గ్రంథాలయంలో 'యూజింగ్ ఎనర్జీ' అనే పుస్తకాన్ని అరువుతెచ్చుకుని మరి తన చదవుని కొనసాగించే ప్రయత్నం చేశాడు. అందులోని గాలిమర అతడిని తెగ ఆకర్షిస్తుంది. అయితే ఆ పుస్తకం పూర్తిగా ఆంగ్లంలో ఉంది. అతనికి ఇంగ్లీష్ అంత బాగా రాదు. అయితే అందులోని బొమ్మలు అతడికి మార్గాన్ని చూపాయి. దాంతో అతడు పనికిరాని లోహపు ముక్కలు, ట్రాక్టర్ భాగాలు, సైకిల్ ముక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, చెట్లకొమ్మలతో 16 అడుగుల గాలిమరను రూపొందించాడు. అయితే పనిచేస్తుందా లేదా అనే సందేహంతో భయపడతాడు. కానీ అనుహ్యంగా ఆ యంత్రం పనిచేస్తుంది. పైగా అది అతడి ఆకలి జీవితాన్ని మార్చేసింది. ఆ గాలిమర అతన కుటుంబంలో నాలుగు లైట్లు, రెండు రేడియోలకు విద్యుత్ అందించింది. త్వరలోనే పొరుగువారు ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు వచ్చేవారు. అలా ఆ ఒక్క ఆవిష్కరణ కామ్క్వాంబాను స్థానికంగా, జాతీయంగా వేలాదిమందికి సుపరిచితమైన వ్యక్తిగా మార్చింది. అతడి కథ వార్తపత్రికల నుంచి ఆన్లైన్లో వ్యాపించి..చివరికి టెడ్ దృష్టిని ఆకర్షించింది. ఆ విధంగా అతనికి TEDGlobalకు ఫెలోషిప్ ఆహ్వానం అందింది. అక్కడ క్వాంబ్ తన ఆవిష్కరణ గురించి, నీటి పారుదల కోసం గాలిమరను నిర్మించాలనే తన ఆకాంక్ష తిరిగి చదువుకోవాలనే చిరుఆశ గురించి మాట్లాడాడు.అలా అతడు నిర్మించిన యంత్రం అతడి చదువుకి వారధిగా మారి..దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ లీడర్షిప్ అకాడమీలో చేరి చదువుకునే అవకాశం దక్కేలా చేసింది. ఆ తర్వాత 2014లో డార్ట్మౌత్ కాలేజీ నుంచి పర్యావరణ అధ్యయనాల డిగ్రీ పట్టాను పొందాడు. క్వాంబా ఆవిష్కరణలు అక్కడితో ఆగలేదు..తన గ్రామంలో విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి, నీటిని తోడటానికి ఇతర గాలిమరలను కూడా నిర్మించాడు. 2008లో, అతను 'మూవింగ్ విండ్మిల్స్ ప్రాజెక్ట్'ను సహ-స్థాపించాడు. ఈ ప్రాజెక్ట్ మసిటాలా ప్రాంత నివాసితులతో కలిసి స్వచ్ఛమైన నీటి బావులు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల కోసం సౌర ఫలకాలు, రోజువారీ వ్యవసాయ సమస్యలకు సరళమైన పరిష్కారాలపై పనిచేస్తుంది. ఆ ఒక్క ఆవిష్కరణ మౌలిక సదుపాయల దిశగా నడిపించింది క్వాంబాని. తన ఇంటికే కాదు మొత్తం సమాజానికే ఉపయోగపడేలా సామాజిక సేవలో భాగమవుతున్నాడు. ఓ పేద బాలుడు..అతడి ఆకలి, అవసరాలు ఆవిష్కరణ దిశగా అడుగులు వేసి..ఎన్నో గొప్ప పనులు చేసేలా శ్రీకారం చుట్టింది. చిన్న చిన్న అవరోధాలు, సమస్యలకు బాధపడిపోయే యువత..క్వాంబా కథ గొప్ప ప్రేరణ. ఏం రాదు, నావల్ల కాదు అనుకుంటూ కాలక్షేపం చేయకూడదు..అందుబాటులో ఉన్నవే గొప్పవిగా..అవే మనకు గమ్యాన్ని చూపే ఆయుధాలుగా మార్చుకోవాలని క్వాంబా కథ చెబుతోంది కదూ..!.(చదవండి: రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ ..! ప్లీజ్ కూతుళ్లను ఇలా పెంచుదాం..) -
’రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ ..! ప్లీజ్ కూతుళ్లను..
‘ఆ అమ్మాయి ఎంత నల్లగా ఉందో..’‘అమ్మో, ఆమె బరువుకు ఆ స్టేజ్ విరిగిపోతుందేమో..!’‘ఆ ముక్కు ఎంత వంకరో ...’‘ఎత్తు పళ్లు..’ ‘చీమ కళ్లు..’ఇలా సూదుల్లా మనసును గాయపరిచే మాటలకు ఆత్మన్యూనతతో కుంగిపోతూ... ‘శరీరాన్ని సరిచేసుకోవాలి’ అనే మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు అమ్మాయిలు. ఈ క్రమంలో కెరియర్ వైపు కాకుండా రూపం కోసం తమ సమయాన్ని, డబ్బును ఖర్చు చేస్తున్నారు. ‘శారీరక సౌందర్యం మనల్ని పరిపూర్ణ వ్యక్తులను చేయదు. మన శరీరం ఓ వస్తువు కాదు, సరిచేసుకోవడానికి’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు.‘బాడీ షేమింగ్’ అనేది రూపానికి సంబంధించినది మాత్రమే కాదు. తరతరాలుగా మన సమాజంలో పాతుకుపోయిన ఒక లోతైన సమస్య. కొందరు ఎదుటివారి శారీరక లోపాలను ఎగతాళి చేస్తే, మరికొందరు తమ శరీర లోపాలకు తమను తామే తిట్టుకుంటుంటారు. కాలేజీకి వెళ్లాల్సిన స్నేహ రెడీ అవడానికి ఈ మధ్య అద్దం ముందు నిలబడటం లేదు. ఫొటోలకు దూరంగా ఉంటోంది. గ్రూప్లో ఉన్నా, తనకి తాను కనిపించనట్టు వెనకే ఉంటోంది. ఒక రోజు క్లాస్లో సబ్జెక్ట్పై ప్రెజెంటేషన్ ఉంది. ఆమె దానికి ప్రిపేర్ అయ్యి వచ్చింది. కానీ స్టేజ్ మీదకు వెళ్లే ముందు, వెనుక నుండి ఎవరో ‘స్టేజ్ బ్రేక్ అవుతుందేమో?’ అనే జోక్కి కొంతమంది నవ్వారు. మరికొంతమంది నవ్వు ఆపుకున్నారు. అంతే, స్టేజీ ఎక్కకుండానే వచ్చి తన సీటులో కూర్చొంది. ఆ రోజు తర్వాత ఆమె మాట్లాడటం తగ్గించింది. స్నేహితులతో కలవడం లేదు. ఇంట్లో కూడా ఓ మూలన ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంటుంది. తల్లిదండ్రులు ఎంత అడిగినా.. ‘ఏమీ లేదని’ దాటేస్తోంది.∙∙ 2025లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ రీసెర్చ్ ప్రకారం, బాడీ షేమింగ్ అనుభవం జెండర్ పరంగా చూస్తే భిన్నంగా ఉంది. మైసూరులో 10–19 ఏళ్ల మధ్య 155 మంది యువతులపై చేసిన అధ్యయనంలో, అమ్మాయిలలో 23.2 శాతం మంది బాడీ షేమింగ్ సమస్య అనుభవిస్తున్నారని చెప్పారు. అబ్బాయిలలో ఈ సమస్య 7.1 శాతం మాత్రంగానే ఉంది.మనసుపై ఒక నిశ్శబ్ద దాడిబాడీషేమింగ్ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మైండ్లో బ్లాక్ స్పాట్స్ ఏర్పడి, మానసిక వికాసానికి అడ్డంకి అవుతాయి.ఆందోళన పెరిగి, మనో నిగ్రహంపైన ప్రభావం చూపుతుంది.డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. తాను ‘దేనికీ సరికాదు’ అనే భావన పెరుగుతుంది.శరీరాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ‘జిమ్కి వెళ్ళాలి, కాస్మటాలజీ చికిత్స చేయించుకోవాలి, మందులు వాడాలి, పోషకాహారం తినాలి...’ ఇలా వీటిమీద ఫోకస్ పెరుగుతుంది. దీంతో బ్యూటీ సెంటర్స్కు నెలకు రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చుపెడుతున్నవారున్నారు. స్లిమ్మింగ్ సెంటర్స్వైపు మొగ్గుచూపుతున్నారు. మధ్య, దిగువ తరగతికి ఇది పెను భారం అవుతోంది. కలర్ ట్రీట్మెంట్స్ ఇటీవల బాగా పెరుగుతున్నాయి. బ్యూటీ మెయింటెనెన్స్ విషయంలో అమ్మాయిలు ఇంట్లో వాళ్లమీద ఒత్తిడి పెంచుతున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కుటుంబ స్థితిగతులపైనా ప్రభావం చూపుతుంది. కెరియర్ పరంగా ఎదగాలనుకునేవారు బాడీషేమింగ్ వల్ల శరీరంపై దృష్టిపెట్టి, తమపైన తాము ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ఏం చేయాలంటే...డిజిటల్ ఫ్లాట్ఫారమ్లలో శరీరాకృతిని విమర్శించడం సైబర్ బుల్లియింగ్కు సంబంధించినదే. ఆన్లైన్–ఆఫ్లైన్ లో శరీరాకృతిని విమర్శించే వారిని ఎదుర్కోవడానికి, వారు కలిగించే బాధను, వేదనను అధిగమించడానికి, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికి మార్గాలు ఉన్నాయి. ప్రతిభను అణచివేయడానికి అసూయ వల్ల ఇలా ‘బాడీషేమింగ్’కు పాల్పడుతున్నారని గ్రహించాలి. ఆహారాన్ని తగ్గించడం వల్ల పోషకాలు మైండ్కు చేరకపోవచ్చు. అందుకని సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కరుణ, సహనం .. వంటివి అలవర్చుకోవడానికి సాధన చేయాలి. శారీరక సౌందర్యం కంటే, ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరులు ఎగతాళి చేసే రూపం కంటే తమలో తమకు నచ్చిన విషయాల పట్ల దృష్టి పెట్టాలి. ఒక రోజు స్నేహ అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుండగా తల్లి చూసి అడిగింది. బాడీషేమింగ్ విషయం చెబుతూ ‘నా త΄ప్పా?!’ అని అడిగింది. ‘అలా అన్నవారి ఆలోచనలే తప్పు’ అని కూతురిని దగ్గరకు తీసుకుంది. విమర్శలను కాదని, తన శరీరాన్ని తాను అంగీకరించడం నేర్చుకుంది.తప్పక ఛేదించాల్సిందే!మన కూతుళ్లు తమ శరీరానికి సంబంధించి అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండాలనే ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ గాయాలు ఒక రోజులో అనుకోకుండా అయినవి కావు. మనం ఈ బాధాకరమైన సాంస్కృతిక వారసత్వాన్ని తప్పక ఛేదించాల్సిందే. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే ’రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ వర్క్షాప్ నిర్వహిస్తున్నాను. ఇందులో అమ్మాయిలు తమ బాల్యం నుండి ఎదుర్కోవాల్సిన అవసరం లేనివి, స్వేచ్ఛగా పెరగడానికి అవసరమైన సాధనాలను అందిస్తుంటాను. మనందరం కలిసి మానసిక ఒత్తిడి లేని ఒక కొత్త తరాన్ని పెంచుదాం. – డాక్టర్ షెఫాలీ సబేరీ, క్లినికల్ సైకాలజిస్ట్ పాజిటివ్గా మార్చుకోవాలికొందరి ఇండ్లలో తల్లిదండ్రులు, కజిన్స్, బంధువులు.. కూడా శారీరక లోపాలతో పిలిచేవారుంటారు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. ఆత్మవిశ్వాసం లేనివారే ఎదుటివారి మనస్తత్వాన్ని దెబ్బతీస్తారనే విషయాన్ని ‘బాడీషేమింగ్’ అనుభవించేవాళ్లు అర్థం చేసుకోవాలి. మనసులో వచ్చే నెగటివ్ ఆలోచనలను గుర్తించి తమను తాము మార్చుకోవడం చాలా ముఖ్యం. మన శరీరం గురించి మనమే మంచి మాటలు చెప్పుకుంటే అది ఒక థెరపీలా పనిచేస్తుంది. పోలికల నుంచి దూరంగా ఉండాలి. వ్యక్తిత్వం, టాలెంట్ ముందు మిగతా వన్నీ చిన్నవే అని గ్రహించాలి.– డాక్టర్ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..! నివేదికలో షాకింగ్ విషయాలు) -
లక్ష్యంతో మారే పర్సనాలిటీ!
చాలామందికి 'గోల్' (Goal) కి 'పర్పస్' (Purpose) కి తేడా తెలియదు. గోల్ అనేది మీరు 'ఏమి' సాధించాలనుకుంటున్నారు అనేది చెబితే, పర్పస్ అనేది మీరు అది 'ఎందుకు' సాధించాలనుకుంటున్నారు అని చెబుతుంది. ఒక బలమైన ఉద్దేశ్యం (Purpose) ఉంటే, మీ పర్సనాలిటీ ఒక సామాన్యుడిలా ఉండదు.. అది ఒక 'మిషన్' లా మారుతుంది. సైకాలజీలో దీనిని'Sense of Purpose'అంటారు.విక్టర్ ఫ్రాంక్ల్ (Viktor Frankl) అనే సైకాలజిస్ట్, నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో మరణానికి దగ్గరగా ఉండి కూడా బ్రతికి బయటపడ్డారు. ఆయన కనిపెట్టిన సత్యం ఏంటంటే..."ఎవరి జీవితానికైతే ఒక అర్థంఉంటుందో, వారు ఎలాంటి కష్టాన్నైనా భరించగలరు."మీ పర్సనాలిటీని ఒక అయస్కాంతంలా మార్చే శక్తి ఈ 'పర్పస్'కు ఉంది.పర్పస్ ఉంటే మీలో వచ్చే మార్పులు (Psychological Shifts): ఒక ఉద్దేశ్యం ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఈ మూడు స్పష్టంగా కనిపిస్తాయి.Laser Focus: మీకు పర్పస్ ఉన్నప్పుడు, అనవసరమైన పనులు, గాసిప్స్, డిస్ట్రాక్షన్స్ మీకు చిన్నవిగా కనిపిస్తాయి. మీ సమయం దేనికి ఖర్చు చేయాలో మీకు స్పష్టత ఉంటుంది.Resilience: సమస్యలు వచ్చినప్పుడుపర్పస్ లేనివాడు కుంగిపోతాడు. కానీ పర్పస్ ఉన్నవాడు "ఇది నా ప్రయాణంలో ఒక భాగం మాత్రమే" అని మరింత బలంగా లేస్తాడు.Gravitas: మీ మాటల్లో, నడకలో ఒక రకమైన 'బరువు' వస్తుంది. మీరు ఏదో సాధించడానికి పుట్టారు అనే నమ్మకం ఎదుటివారికి మీ ప్రెజెన్స్ ద్వారానే అర్థమవుతుంది.గోల్ vs పర్పస్: తేడా ఏంటి?గోల్ అనేది ఒక మైలురాయి అయితే, పర్పస్ అనేది ఒక దిక్సూచి (Compass). "నేను ఒక కోటి రూపాయలు సంపాదించాలి" లేదా "నేను ఈ పదవిని అందుకోవాలి"అనే గోల్ ఇది సాధించగానే ఆగిపోతుంది. కానీ "నేను నా జ్ఞానంతో ఒక లక్ష మంది జీవితాలను మార్చాలి" అనే పర్పస్ నిరంతరం సాగుతుంది.మోటివేషన్ మాయ vs పర్పస్ డ్రివెన్ పవర్మోటివేషన్ బయట నుండి వచ్చే 'కిక్'. వీడియో చూస్తే వస్తుంది, కాసేపయ్యాక పోతుంది. పర్పస్ లోపల నుండి వచ్చే 'జ్వాల'. ఎవరూ మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా ఇది మిమ్మల్ని నిద్రపోనివ్వదు.మీ పర్పస్ ని ఎలా కనుక్కోవాలి?పర్పస్ ఫుల్ పర్సనాలిటీగా మారడానికి మూడంచెలు... Step 1: Break Selfish Thoughtsకేవలం "నాకు ఏం వస్తుంది?" అనే చిన్న ఆలోచనను 'Break' చేయండి. పర్పస్ ఎప్పుడూ మీకంటే పెద్దదై ఉండాలి. మీరు సమాజానికి లేదా మీ వృత్తికి ఏ Valueఇస్తున్నారో ఆలోచించండి.Step 2: Build Ikigaiమీకు ఇష్టమైనది, మీరు చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది—ఈ మూడూ కలిసే చోటే మీ పర్పస్ ఉంటుంది. దాన్ని ప్రతిరోజూ మీ పనుల్లో 'Build' చేయండి. మీ పర్సనాలిటీ మీ పర్పస్ కి ప్రతిరూపం కావాలి.Step 3: Legacy Building మీ పర్పస్ ని ఒక సిస్టమ్ గా మార్చండి. మీరు లేకపోయినా ఆ ఉద్దేశ్యం కొనసాగాలి. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పర్పస్ ద్వారా మనుషులు ప్రభావితం అవ్వడమే 'Beyond' స్టేజ్.మీ 'ఎందుకు' (Why) ఏంటి?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. రేపు పొద్దున్నే మీరు బెడ్ మీద నుండి ఎందుకు లేవాలి? దానికి డబ్బులు కాకుండా వేరే బలమైన కారణం ఉందా?2. మీ జీవితంలో మీరు సాధించే విజయం వల్ల మీ కుటుంబం కాకుండా మరో పదిమందికి ఏమైనా లాభం ఉందా?3. మీరు చేస్తున్న పనిలో మీకు 'సార్థకత' (Fulfillment) కనిపిస్తోందా?పర్పస్ ఉంటే మీరు అజేయులు!పర్పస్ లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. అలలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. కానీ ఒక పర్పస్ ఉంటే, మీరు సముద్రాన్నే శాసిస్తారు. మీ వ్యక్తిత్వం ఒక వెలుగు కిరణంలా మారుతుంది."The two most important days in your life are the day you are born and the day you find out why."Mark Twain సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com (చదవండి: మీ గరిష్ట సామర్థ్యాన్ని అందుకోవడం ఎలా?) -
అవధులు లేని దేవుని ప్రేమ
ఒక నీతిమంతుని మరణం నశించిపోయే మానవ జాతికి శుభం చేకూర్చింది. మరణానికి వారసులైన నరజాతికి యేసుక్రీస్తు రూపంలో గొప్ప విమోచకుడ్ని అందించింది. పాపపరిహారార్థ బలిగా, సజీవ యాగంగా దేవాదిదేవుడే సిలువపై తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని ధారవోశాడు. మానవుల పట్ల తన అపార ప్రేమను తన బలి అర్పణ ద్వారా చాటుకున్నాడు.ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి చివరికి రెండు తేదీలే మిగిలి పోతాయి. ఒకటి పుట్టుక రెండవది మరణ తేదీ. పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. అందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రపంచ అధినేత అయినా సరే, మారుమూల గ్రామంలో పుట్టిన సామాన్యుడైనా చావు ముందు తల వంచాల్సిందే. మరణం ముందు ఓడి పోవాల్సిందే. అందుకే మనిషికి చావంటే చచ్చేంత భయం. కొంతమంది బతకడానికి కావలసినంత ధైర్యం లేక చావును ఆశ్రయిస్తారు. అదీ శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే మనకథ మరణంతో ఆగి పోదు. మనం చేసిన పాపాలకు ఆ తర్వాత రెండో మరణం కాచుకోని ఉంటుంది. మరణాన్ని తలపించే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించేందుకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి మన పాపాలకు విమోచన క్రయధనముగా అర్పించాడు.పాపపరిహారార్థ బలిగా క్రీస్తు తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుని చేత సృజించబడ్డ ఆదిమానవుడైన ఆదాము, అతని భార్యకు తమ ఇష్టం చొప్పున బతికే అవకాశం ఇచ్చాడు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ లోక అధిపతిగా పిలవబడ్డ దుష్టుడైన సాతాను వారిద్దరినీ మోసం చేసి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. పాపం చేసిన వారిద్దరూ పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో ఉన్న ఆ పాపపు బీజం ఆ తర్వాత ప్రతి మనిషిలో కొనసాగుతూ వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసుకోడానికి మనిషి చేయని ప్రయత్నం లేదు. ప్రధానంగా జంతువుల రక్తం బలి ఇవ్వడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవాలని చూసాడు. అయినా నరునిలో వున్న పాపబీజం అతని వెంటాడుతూనే ఉంది. పలు బలి అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు పాపము నుండి మానవులను వేరుచేయవని గ్రహించిన దేవుడు తన కుమారుని ఈ భూమిపైకి పంపి అతని బలి అర్పణ ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవులకు ఆ పాపపు శాపాన్ని విడిపించి తిరిగి దేవునితో మొదటి మానవుడి ద్వారా విడిపోయిన ఆ సంబంధాన్ని పునరుద్ధరింప జేశాడు. అందుకు నీతిమంతుడైన యేసు అప్పటి రోమా పాలకులు, తన స్వజనమైన యూదా ప్రజల ద్వారా ఘోరమైన శ్రమలు సిలువ ద్వారా అనుభవించాల్సివచ్చింది. మానవుల పాపం కోసం పాపంగా చేయబడ్డాడు. సమస్త మానవ కోటి పాపభారాన్ని, శాపాన్ని తనపై మోశాడు. శిలువపై తన పవిత్ర రక్తాన్ని చిందించాడు.క్రీస్తు ప్రశస్తమైన మాటలుశిలువ మరణానికి ముందు క్రీస్తు యేసు భూమ్మీద పలికిన ప్రతి మాట జీవపు ఊటై అప్పుడు ఇప్పుడూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. భూమి గతించినా నా మాటలు మాత్రం నిత్యం నిలిచి ఉంటాయని క్రీస్తు చె΄్పాడు. క్రీస్తు మరణ సమయంలో సిలువ మీద పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ ధ్యానిస్తారు. వాటిలో ముఖ్యంగా తనను క్రూరంగా హింసిస్తున్న సైనికులను, హేళన చేస్తున్న యూదా మతాధికారులు, ప్రజలను చూసి తండ్రీ వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కోరాడు. మానవుల పట్ల మితిలేని ప్రేమగల దేవుడు కాబట్టే ఇట్టి క్షమాపణగుణం కనబరిచాడు. కుడిచేతి వైపు సిలువ వేయబడిన దొంగ యేసును గమనిస్తూ ఆయన నిజమైన పాపుల రక్షకుడు, దేవుడని గ్రహించి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని అర్థించినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని అభయం ఇచ్చాడు. నిజంగా ఒకడు పరలోకం చేరాలంటే దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తీస్మం తీసుకోవాలి. కానీ ఇదేమీ లేకుండా ఒక బందిపోటు దొంగకు అతని విశ్వాసం చొప్పున నేరుగా పరలోకం అనుగ్రహించాడు. రోదిస్తున్న తల్లిని చూచి తన ప్రియమైన శిష్యుడికి అమ్మ బాధ్యతలు అప్పగించాడు. సిలువ యాగం ద్వారా తాను భూలోకానికి వచ్చిన రక్షణ కార్యం పూర్తయిందని గ్రహించి తండ్రికి తన ఆత్మను అప్పగించి చివరకు సమాప్తమైనదని చెప్పి యేసు ప్రాణం విడిచాడు. యేసు చనిపోయాడో లేదో నిర్ధారించుకోడానికి ఒక సైనికుడు పక్కటెముకల్లో బల్లెంతో ΄÷డిచాడు. ఇదంతా గమనిస్తున్న కఠినమైన రోమా శతాధిపతి హృదయం కరిగిపోయింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటూ ప్రకటించాడు. యేసు చనిపోయిన వెంటనే కొన్ని అద్భుతాలు జరిగాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పేర్కొంది. ప్రసిద్ధ యెరూషలేము దేవాలయపు గర్భగుడిలో ఉండే పెద్ద తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలిపోయిందని, ఆ ప్రాంతంలో భూమి కంపించిందని, బండలు బద్దలవడం, సమాధులు తెరవబడి మృతులైన పరిశుద్ధులు పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడ్డారని పేర్కొంది. క్రీస్తు కథ సిలువ మరణంతో ఆగిపోలేదు. చరిత్ర పుటల్లో మరణాన్ని జయించి మూడవ దినమున పునరుత్థానుడైన ఒకే వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇప్పటికీ క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేములో మనకు దర్శనమిస్తుంది. సజీవుడైన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయింది. అందుకే అగస్టిన్ అనే భక్తుడు ’సిలువ దేవుని ప్రేమను ప్రకటించిన గొప్ప వేదిక’ అంటాడు.– స్టెర్జి రాజన్ బందెల, సీనియర్ జర్నలిస్ట్ -
ఆఖరి మజిలీకి ఆమె చేయూత!
చావులకు వెళ్లాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. కొందరైతే చావుకు వెళ్లినా అంత దూరాన ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తుంటారు. అలాంటిది కొందరు మహిళలు వారసత్వంగా వచ్చిన పాడె కట్టడం, చితి పేర్చడం, బొంద తవ్వడం వంటి వృత్తులు నిర్వహిçస్తూ, ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అలాంటి పనులు మగవారే చేస్తుంటారు. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలే అన్నీ తామై పాడె కట్టడం నుంచి చితిని పేర్చి శవం కాలి బూడిదయ్యేదాకా అన్నీ తామై వారసత్వంగా వస్తున్న ఆ వృత్తిలో ఆఖరి మజిలీ వరకు చేయూతనిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఎవరైనా చనిపోయినట్లు సమాచారం అందగానే అంత్యక్రియలకు అవసరమైన కుండతో పాటు పాడె కట్టడానికి అవసరమైన కట్టెలు తీసుకుని వెళతారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి డప్పుల చప్పుడు మధ్యన పాడె కడతారు. శవాన్ని పాడె మీద పడుకోబెట్టగానే బట్ట కప్పేసి శవం పడిపోకుండా తాడుతో కట్టేస్తారు. మరో బృందం చితికి అవసరమైన కట్టెలు తీసుకువచ్చి శ్మశానవాటికలో పేర్చి, శవాన్ని చితిపై పడుకోబెట్టగానే కట్టెలతో నింపేస్తారు. కుటుంబ సభ్యులు చితికి నిప్పంటించగానే, దహనమయేదాకా అక్కడే ఉంటారు. కొన్ని కుటుంబాల వాళ్లు శవాలను ఖననం చేస్తుంటారు. అలాంటి పనుల్లో శవాన్ని ఖననం చేయడానికి గుంత తవ్విన తరువాత శవాన్ని అందులో పూడ్చేసే కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉంటారు. కామారెడ్డి పట్టణానికి చెందిన వారంతా పట్టణంతో పాటు దేవునిపల్లి, క్యాసంపల్లి, సరంపల్లి గ్రామాల్లో చనిపోయిన వారి ఆఖరి మజిలీలో తమ పాత్ర పోషిస్తున్నారు. కరోనా అప్పుడు కూడా పనిచేసినంనేను నలభై ఏండ్ల సంది పాడె కడుతున్న. ఎవరు చనిపోయినా వచ్చి మాట్లాడుకుని వెళతారు. చావుకు అవసరమైన కుండ, పాడె కట్టెలు కొనుక్కుని వెళతాం. ఇంటిముందర కుండలో అన్నం వండి ఇవ్వడం నుంచి పాడె కట్టడం, శవాన్ని పాడెమీద పడుకోబెట్టి తీసుకువెళ్లేదాకా అన్ని పనులు చూసుకుంటాం. ఇంటి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని జీవనం సాగిస్తుంటాం. అయితే మేము చేసేది పుణ్యకార్యంగానే భావిస్తాం. కరోనా సావులు కూడా చేసినం.– బైరం సిద్దవ్వఇరవై ఏండ్ల సంది చేస్తున్న...నేను ఇరవై ఏండ్ల సంది వృత్తిలో ఉన్న. మా కుటుంబ వారసత్వంగా వచ్చిన దానిని అలాగే కొనసాగిస్తున్నం. పెద్ద ఊరు కావడం వల్ల ఒక్కోసారి ఒకేరోజు మూడు, నాలుగు సావులు కూడా చేయాల్సి ఉంటది. ఆ రోజు తినడానికి కూడా టైం సరిపోదు. అన్ని సావుల కాడికి వెళ్లాలి. పాడె కట్టాలి. జీవితం ఉన్నన్ని రోజులు చేయాల్సిందే. ఇబ్బందే అయినా బతకుదెరువుకు చేయాల్సిందే. – బైరం హేమలత– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
అతనే.. భామ
ఆమె నృత్యం చేస్తున్నంతసేపూ అపురూప అందాల రాశి అనుకుంటూ కనురెప్పలు కొట్టడమే మానేసి కళ్ళప్పగించి చూస్తాం! ప్రదర్శన పూర్తయ్యాక కరతాళ ధ్వనుల మధ్య ఆమె ఆమె కాదు, అతను... పేరు సంజయ్ వడపల్లి అని వ్యాఖ్యాత ప్రకటించగానే హాలు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది! అవును అతను సంజయ్ వడపల్లి! ఆంధ్రనాట్యంలో అద్భుత నర్తకిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, అభినవ సత్యభామ డాక్టర్ కళాçకృష్ణ ఆయన గురువులు. ప్రస్తుతం హెచ్.ఎస్.బి.సి హాంగ్ కాంగ్ బ్రాంచ్లో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ శనివారం హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.తన 8వ ఏట డాక్టర్ నటరాజ రామకృష్ణ దగ్గర లాస్య, తాండవ నృత్య సాధనతో ఆరంభించి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. డాక్టర్ కళాçకృష్ణ దగ్గర ప్రబంధ సాంప్రదాయ నవ జనార్ధన పారిజాతం నేర్చుకున్నారు. తొలిసారి సత్యభామ వేషం ధరించి నాట్యం చేసినప్పుడు లభించిన ప్రశంసలతో నాట్య రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్ తెలిపారు. తాను సత్యభామగా నర్తించినప్పుడు వేదికపై చూసిన వారు, ఆ తరువాత మేకప్ తొలగించుకుని పలకరిస్తే ఆశ్చర్య పోయేవారని, తానే సత్యభామ అంటే నమ్మే వారు కాదంటూ తొలినాటి ప్రదర్శనల అనుభూతులను గుర్తు చేసుకున్నారు. సంజయ్ వడపల్లి సత్యభామగా నవ జనార్దన పారిజాతంతో1985 నుంచి దేశంలోని వివిధ నృత్యోత్సవాల్లో, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. యునెస్కో, హాంగ్ కాంగ్ ఇన్–క్రెడిబుల్ ఫెస్టివల్, అమెరికాలో జరిగిన నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్య రత్న పురస్కారంఆంధ్రనాట్యం, పేరిణి నాట్య సృష్టికర్త డాక్టర్ నటరాజ రామకృష్ణ పేరిట తమ డ్యాన్సింగ్ బెల్స్ సంస్థ నుంచి జాతీయస్థాయిలో నృత్య రత్న అవార్డును ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల్లో విశేష కృషి చేస్తూ విశ్వవ్యాప్తం చేసే గురువులకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం కింద 20 వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో ప్రతి యేటా గురువులను సత్కరిస్తామని, యువ నర్తకులకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు. ఆంధ్రనాట్య సోలో ప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంజయ్ ప్రతిష్టాత్మక సత్రాజితి అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అవార్డు, ఆంధ్రనాట్య కళాశౌర్య అవార్డు, సింగిడి తెలంగాణ పురస్కారం, నృత్యకౌముది, ముంబయి వారి జాతీయ సమైక్యతా నృత్య పురస్కారం లాంటి పలు అవార్డులు అందుకున్నారు. బాలనటుడైన సంజయ్ వడపల్లి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శృతి లయలు సినిమాలోనూ నటించారు. ప్రబంధ సాంప్రదాయ నవజనార్ధన పారిజాతం ప్రదర్శన విశ్వవ్యాప్తం చేయడంతోపాటు నాట్యాచార్య డాక్టర్ నటరాజ రామకృష్ణ, డాక్టర్ కళాకృష్ణ తెలుగు జాతికి అందించిన నృత్యాంశాలను భావి తరాలకు అందించే ప్రయత్నమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ‘అభినవ అంతర్జాతీయ సత్యభామ’ సంజయ్ వడపల్లి తెలిపారు. ఈనెల 4న నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే తన ప్రదర్శనకు ఉచిత ప్రవేశం అని, కళాప్రియులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పరిశుభ్రతే పర్యాటకాకర్షణ
ఆ పల్లె కీర్తి...దేశానికే స్ఫూర్తి వేసవిలో హిల్ స్టేషన్స్కు , పండగలు, జాతరలు ఉన్న రోజుల్లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు.. ఇలా ఏడాది మొత్తం సీజన్ను బట్టి టూర్ ‘ఇష్టుల’ అభిరుచులు కూడా మారుతుంటాయి. అయితే అత్యంత పరిశుభ్రంగా ఉన్న పల్లెటూర్లకు, చక్కని జీవనశైలికి పట్టం కడుతున్న గ్రామాలకు కూడా ఇటీవల పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దుమ్మూ థూళి, అపరిశుభ్రవాతావరణం, కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవువున్న నగరాల నుంచి ఇలాంటి పల్లెలకు ప్రయాణాలు పెరుగుతున్నాయి. అదే క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ఓ పల్లె సైతం పర్యాటక ఆకర్షణగా మారడం విశేషం. పరిశుభ్రత అనేది భూతద్ధంతో వెదకాల్సిన అంశంగా ఉన్న పరిస్థితుల్లో , ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు పరిశుభ్రతపై తన శ్రద్ధతో పౌర స్పృహకు కొత్త అర్థాన్ని ఇస్తోంది. బాబోజోలా అనే ఈ సాదాసీదా గ్రామం చెత్త, వ్యర్ధాల రహిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. బాబోజోలాలో నివసించే గ్రామస్తులకు, పరిశుభ్రత అనేది కేవలం ఒక నియమం కాదు, అది ఒక జీవన విధానం. ప్రతి ఇంటివారు ఎంతో శ్రద్ధగా పాటించే ఒక విధి.పరిశుభ్రతే జన‘పధం’ నిషేధం ఓ ఆయుధం...మహిళలు రోజుకు మూడుసార్లు గ్రామాన్ని ఊడ్చి శుభ్రం చేస్తారు. అంతేకాదు ఇంటింటి నుంచీ చెత్తను డబ్బాలలో సేకరిస్తారు. మరుసటి రోజు మగవారు ఆ చెత్తను తొలగిస్తారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా «నియంత్రించారు. అంతేకాకుండా, ప్రజారోగ్యంపై అవగాహన పెంచడానికి ప్రతి మూలలో ’ధూమపానం నిషేధం’ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. , ఇంకా బహిరంగంగా ఉమ్మివేయడం లేదా పొగాకు నమలడం కూడా నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలను పక్కాగా అమలు చేస్తుండడంతో ఈ గ్రామంలో ఎవరూ గుట్కా సేవిస్తూ కనిపించరు ప్లాస్టిక్ జాడ కూడాఎక్కడా కనిపించదు.ఉపాధ్యాయుడి...పాఠం...బాబోజోలాను ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలనే ఆకాంక్షతో, మధుసూదన్ మారండీ అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు 15 సంవత్సరాల క్రితం ఈ పారిశుధ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన బాటలో గ్రామస్తులు దీనిని ఒక నైతిక బాధ్యతగా స్వీకరించి, పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీసీటీవీలు, చెత్తబుట్టలు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం నిధులు సేకరించడానికి ఒక క్లబ్ను ఏర్పాటు చేశారు.శుభ్రమైన ఇళ్లు...అందాల లోగిళ్లు...ప్రస్తుతం, బాబోజోలాలో సుమారు 70 సంతల్ కుటుంబాలు నివసిస్తున్నాయి, వారి గడ్డి ఇళ్లు సహజసిద్ధంగా, ప్రకృతి వనరులతో నిర్మితమయ్యాయి. ఆసక్తికరంగా, ప్రతి ఇంటి గోడలను మహిళలు రంగురంగుల పువ్వులు ఆకుల నమూనాలతో పాటు, జంతువులు సాంప్రదాయ థీమ్స్తో అందంగా అలంకరిస్తారు. స్థానిక భాషలో దీనిని ’భిత్ పోటావ్’ అని పిలుస్తారు. ఈ చిత్రణలలో ఉపయోగించే రంగులన్నీ నదీ తీరంలోని బంకమట్టి, రాళ్ళు, చెట్ల బెరడు పువ్వుల నుంచి సహజంగా లభించేవే కావడం విశేషం.ఫిబ్రవరిలో జరిగే పటపర్వ పండుగ సమయంలో, గ్రామస్తులు తమ ఇళ్లకు కొత్తగా రంగులు వేసి, పారిశుధ్య భావనను ప్రచారం చేసే సాంప్రదాయ పాటలు నృత్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సమయంలో ఎక్కువగా ఉండే సందర్శకులు పర్యాటకుల రద్దీని పురస్కరించుకుని నిబంధనలు పాటిస్తున్నారో లేదో గమనించడానికి, ఈ గ్రామం అంతటా సీసీటీవీలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు జరిమానా చెల్లించడాల్సి ఉంటుంది. లేదా ఆ ప్రదేశాన్ని స్వయంగా శుభ్రం చేయవలసి ఉంటుంది.ఈ పల్లెను సందర్శించాలంటే...విమాన మార్గంలోనైతే... భువనేశ్వర్ విమానాశ్రయానికి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి మయూర్భంజ్కు క్యాబ్ లేదా బస్సులో ప్రయాణించి, ఆ తర్వాత బాబోజోలాకు స్థానిక రవాణాలో వెళ్లాలి. అదే విధంగా రైలు ద్వారా చేరుకోవాలంటే.. సమీపంలో ఉన్న బారిపద బాలాసోర్ రైల్వే స్టేషన్లలో దిగాలి. అక్కడి నుంచి స్థానిక బస్సును లేదా షేర్డ్ క్యాబ్/జీప్ను ఎక్కవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే తొలుత బారిపదకు చేరుకుని, అక్కడి నుంచి స్థానిక బస్సు, ఆటో లేదా ఏదైనా షేర్డ్ వాహనాన్ని ఎంచుకోవాలి. -
Easter పునరుత్థానుడైన క్రీస్తు
వృక్షము నరకబడిప్పుడు అది తిరిగి చిగురిస్తుంది. అయితే నరుడు మరణమై కదలలేక పడి ఉంటాడని యోబు అనే భక్తుడు యోబు గ్రంథం 14:7లో స్పష్టీకరించాడు. ఆ గ్రంథంలో దేవుడు నరావతారిగా తన కుమారుడైన యేసుక్రీస్తుగా జన్మించి శ్రమకు ఓర్పు ముఖ్య లక్షణమని, కష్టాలు, శ్రమలు భరించి, కాలం సంపూర్ణమైనప్పుడు ప్రతి ఒక్కరు కాలము చేయుదురని, కాని నిస్సహాయతలో దేవునివైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతమని నిరూపించి సంధించిన పునరుత్థానం లేక మరణానంతరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే‘ఈస్టర్’ పండుగ.యేసుక్రీస్తు యూదామతంలో జన్మించారు. ఆయన మీ ΄ాపములు క్షమించానని అనడం, కుష్ఠ రోగులను ముట్టుకోవడం, స్వస్థపరిచాడన్న విషయం కంటే వారిని ముట్టడమే నేరమని, నలుబది సంవత్సరాలు శ్రమపడి కట్టిన దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులలో లేపుతానంటూ చేసిన ప్రసంగాలు యూదులు సహించక, ఆ చర్యలను దేవదూషణ, దేశద్రోహంగా చిత్రీకరించి ఆయనను రోమా సామ్రాజ్యపు అధికారులకు అప్పగించారు. యూదులలో ఛాందసుల కోరిక ప్రకారం రోమీయులకు యేసుక్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేసి, రాతి సమాధిలో ఉంచి, సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి ద్వారమునకు ముద్రను వేయించి కావలి వారిని కాపలాగా ఉంచారు.కానీ ఆదివారం తెల్లవారుతున్నప్పుడు ప్రభువు దూత రాయిని ΄÷ర్లించగా మహా భూకంపం కలిగింది. కావలివారు వణికిపోయారు. ఆయనను చూడటానికి వచ్చిన స్త్రీలు ఈ విషయం శిష్యులకు చె΄్పారు. ఆయన వారికి ప్రత్యక్షమై మీకు శుభమని చెప్పగా వారు ఆయన శరీరంతో సజీవుడై ఉండుట చూచి ఆయన ΄ాదములను పట్టుకొని మొక్కారు. అనంతరం యేసు ప్రభువు వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. అటువలె యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారు ఆయన ఏ రీతిగా చని΄ోయి బతికెనో, ఆ విధంగా ఆయన యందు విశ్వాసముంచువారు చని΄ోయినను ఆయనవలే తిరిగి మహిమ శరీరంతో తిరిగి లేపబడుతారు (యోహాను 14:6).– బి.బి.చంద్రపాల్ కోట మార్గం, సత్యం జీవం, రెండువేల యేళ్ళనాటి ఈస్టర్ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆ రోజున సూర్యుడుదయించాడు. ఉదయం చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన మగ్దలీనా మరియకు యేసుప్రభువు ఆనాడు తనను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్ నవశకం ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశా నిర్దేశం చేసి 40 వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాల దాకే నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తి తోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధ మయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మ శక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీ లోంచి గదిలోకొస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు పోవడానికి మాత్రం పునరుత్తాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ పునరుత్థాన శక్తే!!! హ్యాపీ ఈస్టర్. – సందేశ్ అలెగ్జాండర్ -
Good Friday బలియాగమైన యేసు
క్రీస్తు కేంద్రకంగా దేవుడు సంకల్పం చేశాడు. ఇందులో క్రీస్తు మరణం అత్యంత ప్రధానం. ఈ సర్వ జగత్తుకు పూర్వమే క్రీస్తు బలి ఏర్పాటు చేయబడింది. పాపము లేనప్పుడే క్రీస్తు పరిశుద్ధ రక్తానికి ప్రాధాన్యం ఇవ్వడం అంటేనే దేవుడు అద్వితీయ జ్ఞాన సంపన్నుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. దూరదృష్టి, ముందుచూపు అనేవి దేవుని నుండి నేర్చుకోగలిగే జీవితాలు ఏంతో ఉన్నతంగా ఉంటాయి. మానవాళి పాపాలకు ప్రతిగా యేసును నలగగొట్టడం దేవుడైన యెహోవాకు ఇష్టమైంది. క్రీస్తు వారి మరణం దేవుని చిత్తం. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ తలవంచిన క్రీస్తు ముందుకు అడుగు వేశాడు. దేవుడు తన ప్రజల పరిశుద్ధత కొరకు యుక్త కాలాన యేసును ప్రాణం పెట్టమన్నాడు. అందుకు క్రీస్తు సంతోషంగా సమ్మతించాడు. బలి ఆగుటకు ఏంతో ఇష్టపూర్వకంగా విధేయంగా తన తండ్రియైన దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు .యేసు తనను గూర్చి తన రాకను గూర్చి ఇలా వివరణ ఇచ్చుకున్నారు. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు వచ్చాను (మత్త 20:28). ప్రాణత్యాగాన్ని మించిన గొప్ప పరిచర్య ఏముంటుంది? నీతి కలిగిన మంచి వ్యక్తులకొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవతెగించవచ్చు. మంచి వాడైనా చెడ్డ వాడైనా ’తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు’ అన్నది ఆయన ఉన్నత బోధే (యోహాను 15:13). ఒక్క దేవుని మెప్పు ఉంటే కోల్పోయేది ఎలాంటిదైనా ఎంతటిదైనా ఏముంది? తనదైన బోధలకు అనుగుణంగా అనగా, సాహసొపేతంగా జీవిస్తూ ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన వాడు యేసు. ప్రత్యేకంగా ఇదే యేసు జీవితానుభావం నుండి మనం నేర్చుకొనేది. క్రీస్తు భక్తిహీనులైన పాపుల కొరకు చని΄ోయారు (రోమా 5:6–8 ).క్రీస్తు మరణానికి కొద్దిరోజుల ముందు ప్రధాన యాజకుడైన కయప ఇలా ప్రవచించాడు. ‘మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం... యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరి΄ోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనైయున్నాడు’ ( యోహాను 11:49–52 ) అంటూ..దేవునిలో స్థిరపడి నిలకడగా ఉన్న యూదులైన దేవుని పిల్లలు, దారితప్పి చెదరి దూరమైన వేరే దొడ్డి గొర్రెలు అనబడే అన్యజనులు ఇప్పుడు క్రీస్తు మరణం వలన ఏకం కాబోతున్నారు. విద్వేషం లేని ఆత్మ సంబంధ ఏక ప్రపంచం త్వరలో రూపుదిద్దుకోబోతోంది. ఈ పై రెండు వచనాలు క్రీస్తు ’మరణ శాసనం’ గుర్తు చేస్తున్నాయి. ఇదీ చదవండి: రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తియేసు తన మరణాన్ని తానే నిర్ణయించుకొని అనగా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసికొనుటకును దేవుని వలన అధికారం పొందియున్నారు. యేసుక్రీస్తు తన మరణ శాసనాన్ని అనగా కొత్త నిబంధన లేదా నూతన ఒడంబడికను తన రక్తంతో వ్రాసుసుకున్నారు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటూ తన మరణానికి ముందే చెప్పకనే చెప్పారు. క్రీస్తును బట్టే దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అట్టి నిబంధనకు తన దైన సొంత రక్తం ద్వారా రూపకల్పన చేసినది మాత్రం క్రీస్తు వారే. రక్తము లేకుండా ఏ నిబంధన లేదు. క్రొత్త నిబంధన ఎంత ఉన్నతమైనదంటే ఇది క్రీస్తు వారి రక్తంతోనే ప్రతిష్టించబడింది.– జేతమ్


