Family
-
‘జాబ్స్ టియర్స్’..
కొత్త మిల్లెట్ పంట! ‘జాబ్స్ టియర్స్’.. ఇది మన దేశానిదే అయినా మనకు తెలియని పంట. మణిపూర్కు చెందిన మిల్లెట్ పంట. అధిక పోషక విలువతో కూడి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే.. మల్టీకట్ మిల్లెట్ క్రాప్. అంటే, ఒక్కసారి నాటితే చాలు, మూడుసార్లు ధాన్యం కోసుకోవచ్చు. మొదటి కోత తర్వాత కొద్ది నెలల వ్యవధిలో మరో రెండుసార్లు పంట తీసుకోవచ్చు. మణిపూర్ ప్రాంతంలో ఇది సాగవుతోంది. అన్నంగా వండుకు తినొచ్చు. పశువులకు గ్రాసంగా, దాణాగా పెడతారు. మణిపూర్లోని సేనాపతి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ కమీ ‘సాక్షి సాగుబడి’తో ఈ పంట విశేషాలు పంచుకున్నారు. గ్రామినే కుటుంబంలోని ఒక స్మాల్ మిల్లెట్ పంట ఇది. 1–2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. గింజలు రకాన్ని బట్టి రంగు మారుతుంది. పసుపు, ఊదా లేదా గోధుమ రంగులో ఉంటాయి. కన్నీటì బిందువు రూపంలో ఉంటాయి. అందుకే ‘టియర్స్’ అనే పేరొచ్చింది. ఎటువంటి నేలల్లో, ఎంతటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకుంటుంది. దీని బియ్యంలో మాంసకృత్తులు 9%, కొవ్వు 0.5–6.1%, పిండిపదార్థం 58–77%, పీచు 0.3–8.4, 100 గ్రాముల బియ్యంలో 1500 కిలో కేలరీలుంటాయి. వరి బియ్యం, గోధుమలతో పోల్చితే కొవ్వు, ప్రొటీన్ చాలా ఎక్కువ. జాబ్స్ టియర్స్ పైపొట్టు తీసిన ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటే ఆరోగ్యం. పిండితో రొట్టె చెయ్యొచ్చు. సూప్లలో చిక్కదనం కోసం కలుపుకోవచ్చు. సిరిధాన్యాలతో చేసే చిరుతిళ్లన్నీ చేసుకోవచ్చు. మద్యం తయారీకీ వాడుతున్నారు. కోళ్లకు, పశువులకు కూడా పుష్టికరమైన ఆహారం ఇది. కరువు కాలంలో ఇతర పంటలు పోయినా ఇది బతికి, మనుషుల్ని, పశువుల్ని బతికిస్తుంది. నీటి ముంపును తట్టుకుంటుంది. ఆమ్ల గుణం ఉండే నేలల్లో, లేటరైట్ నేలల్లో, కొండవాలులో నిస్సారమైన భూముల్లోనూ పెరుగుతుంది. సముద్రతలం నుంచి 2 వేల మీటర్ల వరకు ఎత్తు గల ప్రాంతాల్లో పండుతుంది. విత్తనాలను బాగా మసిలే వేడి నీళ్లలో 10 నిమిషాలు ఉంచి, విత్తుకుంటే తెగుళ్లు రావు. మే–జూలై మధ్య విత్తుకోవచ్చు. 8–10 అంగుళాల లోతు దుక్కిచేసి, సాళ్లుగా విత్తుకోవాలి/ వెద పెట్టాలి. 100–115 రోజుల పంట. గింజ గట్టిపడి, తేమ 20% కన్నా తగ్గినప్పుడు కోత కోసుకోవాలి. హెక్టారుకు 2–4 టన్నుల ధన్యం దిగుబడినిస్తుంది. పైపొట్టు తీసేస్తే 30–50% వరకు ముడిబియ్యం వస్తాయి. హెక్టారుకు 34 టన్నుల పచ్చిగడ్డి, 8 టన్నుల ఎండు గడ్డి పండుతుంది. ఇతర వివరాలకు.. డా. డేవిడ్ కమీ davidkamei81@gmail.com -
పటిష్ఠ క్వారంటైన్తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
దారి చూపిన నారి
‘ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్ అది మోసిన బోయిలు ఎవరు?’ అని ప్రశ్నించాడు కవి. లూయిస్, క్లార్క్ సాహస, అన్వేష యాత్రలు ప్రపంచ ప్రసిద్ధం. అయితే లూయిస్, క్లార్క్ ద్వయానికి దారి చూపింది ‘సకాగవేయ’ అనే సాహసికురాలు అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. నేటివ్ అమెరికన్ అయిన సకాగవేయ లూయిస్, క్లార్క్లకు అనువాదకురాలిగా, గైడ్గా పనిచేసింది.లూయిస్, క్లార్క్లు 1804 నుంచి 1806 వరకు అమెరికాలో ఎన్నో అన్వేష యాత్రలు చేశారు. ఈ ఇద్దరు ఆమెరికా ఆర్మీలో కెప్టెన్, కమాండింగ్ ఆఫీసర్ హోదాలో పనిచేశారు. 1804 నవంబర్లో లూయిస్, క్లార్క్లు తొలిసారిగా నార్త్ డకోటలో షోషోన్ తెగకు చెందిన సకాగవేయను కలుసుకున్నారు. సకాగవేయ వయసు పదిహేడు సంవత్సరాలు. అప్పటికి ఆమె గర్భవతి. 1805లో జీన్స్ బాప్టీస్ట్ అనే కొడుకుకి జన్మనిచ్చింది. కొన్ని నెలలకే పసిబిడ్డను భుజాన వేసుకొని లూయిస్, క్లార్క్ల అన్వేష యాత్రలో భాగం అయింది. ఈ అన్వేష యాత్రలో ఎంతోమంది నేటివ్ అమెరికన్స్తో మాట్లాడాల్సి వస్తుంది. ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు భాషల్లో ప్రావీణ్యం ఉన్న సకాగవేయ వారికి అనువాదకురాలిగా పనిచేయడమే కాదు ఎన్నో మొక్కల పేర్లు, వాటి వివరాలు, ఔషద గుణాల గురించి చెప్పేది. ప్రమాదాలను పసిగట్టేది.కొండల్లో, కోనల్లో, ఎల్లోరివర్ ప్రాంతాలలో లూయిస్, క్లార్క్లకు దారి చూపింది. అందుకే క్లార్క్ ఆమెను ‘పైలట్’ అని పిలిచేవాడు. పసిఫిక్ మహా సముద్రాన్ని చేరుకోవడంతో లూయిస్, క్లార్క్ల అన్వేష యాత్ర 1806లో విజయవంతంగా పూర్తయింది. ఈ యాత్ర విజయానికి సకాగవేయ సంపూర్ణ సహాకారాన్ని అందజేసింది. అయితే సకాగవేయ పడిన కష్టానికి భర్తకు 232 ఎకరాల భూమి దక్కింది తప్ప ఆమెకు చిల్లి గవ్వ కూడా దక్కలేదు. ఎలాంటి సన్మానమూ జరగలేదు. అయినప్పటికీ అమెరికా చరిత్రలో సకాగవేయ అసాధారణ మహిళ. సాహసం మూర్తీభవించిన సకాగవేయ ముఖచిత్రంతో నాణేలు, స్టాంప్లు ముద్రించారు. ఎన్నోచోట్ల విగ్రహాలు నెలకొల్పారు. -
ఆకాశ సిందూరం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్లోకి దూకింది.‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్శర్మ ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్రాజ్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్గా సంచలనం సృష్టించింది. 300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
Yoga ఆసనాలతో ఆరోగ్యయోగం
సీతంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఆదివారం ‘యోగాంధ్ర’ ఉత్సాహంగా సాగింది. వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం చేశారు. 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఉమామహేశ్వరరావు క్లిష్టమైన యోగసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నగర ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. పలుశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
230 -110 కిలోలకు అద్నాన్ సామి :‘ఆపరేషన్కాదు,వాక్యూమ్ క్లీనర్’
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సామి భారీకాయంతో ఉండేవాడు. అలాంటిది ఉన్నట్టుండి భారీగా బరువు తగ్గి.. అంటే ఫిట్ అండ్ స్మార్ట్ లుక్లో కనిపించాడు. 230 కిలోల నుంచి 110 కిలోలకు తగ్గిపోయాడు. కఠోర శ్రమ, ఆహార నియమాలతో ఏకంగా 120 కిలోల బరువు తగ్గి, అద్భుతమైన లుక్లో అందర్ని ఆశ్చర్యపర్చాడు. అయితే అంత బరువును ఆయన ఎలా తగ్గించకోగలిగాడు. ఎలాంటి ఆహార అలవాట్లను పాటించాడు. ఆపరేషన్ లాంటిదేమైనా చేయించుకున్నాడా? పదండి ఆ వివరాలు తెలుసుకుందాంవిలక్షణ స్వరం, పాటలతో సంగీతాభిమానులను ఆకర్షించిన గాయకుడు అద్నాన్ సామి. అద్నాన్ సామి అనూహ్యంగా బరువు తగ్గడం నిజంగా హాట్టాపిక్. 230 కిలోలున్న వ్యక్తి 120 కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు. మిరాకిల్ ఎలా జరిగిందీ, తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇటీవల పంచుకున్నాడు. బారియాట్రిక్ సర్జరీ ,లైపోసక్షన్ లాంటి ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోకుండా ఈ బరువు తగ్గడం విశేషం.జూన్ 1 నాటి ‘ఆప్ కి అదాలత్ ఎపిసోడ్లో స్వయంగా తన అద్భుతమైన వెయిట్ లాస్, ఫిట్నెస్ సీక్రెట్స్ను పంచుకున్నారు.120 కిలోల వెయిట్ లాస్ మంచి జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ఈ ఫీట్ సాధించారు.230 భారీ కాయం నుంచి ప్రస్తుతం ఆయన వెయిట్ 110 కిలోలకు చేరింది. అయితే బరువు తగ్గడానికి ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నారా అని షోలో అడిగినప్పుడు, అద్నాన్ ఏమన్నారంటే.. "చాలా ఊహాగానాలు ఉన్నాయి, కొంతమంది నేను బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నానని, మరికొందరు లైపోసక్షన్ అని అన్నారు. అయితే విషయం ఏంటంటే.. లైపోసక్షన్ అనేది సూదితో నిర్దిష్ట ప్రాంతాల నుండి కొవ్వును తొలగించే ప్రక్రియ, సాధారణంగా స్పాట్ రిడక్షన్ కోసం." “నా బరువు 230 కిలోలు. నా విషయంలో, కొవ్వు మొత్తాన్ని తొలగించడానికి నాకు వాక్యూమ్ క్లీనర్ అవసరం ఏర్పడింది!” అని చలోక్తి విసిరారు. అదే పెద్ద ప్రేరణహ్యూస్టన్లోని న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు అధికప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నారు. సుగర్, ఆయిల్, రైస్, బ్రెడ్, మద్యానికి పూర్తిగా ఉన్నారు.కఠినమైన ఆహారం, వ్యాయామంతో ఒక నెలలోనే 20 కిలోల బరువు తగ్గడంతో పట్టుదల మరింత పెరిగింది. ఒక్క నెలలో 20 కిలోలు తగ్గడం నిజంగా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఒకసారి షాపింగ్ సందర్బంగా XL లో టీ-షర్టు చాలా బాగా నచ్చిందట. కానీ అప్పటిక ఆయన 9XL. దీంతో నిరాశ చెందాడు. అంతేకాదు ఆషర్టులో నీచేయి కూడా పట్టదు అని తల్లి అన్నారట. అంతే ఆ క్షణమే బరువుగా తగ్గాలని నిర్ణయించు కున్నా.. అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. కొంచెం బరువు తగ్గినప్పుడల్లా , అదే షర్టును వేసుకోవడం, రెండుమూడుస్లార్లు చూసుకోవడం ఇదే పని. అలాఒక రోజు, సరిగ్గా సరిపోయినపుడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాన్నకు ఫోన్ చేసి మరీ ఆనందంతో ఎగిరి గంతేశాను అని గుర్తు చేసుకున్నారు. ఆరు నెలల్లో చనిపోతావ్ అన్నా పెద్దగా పట్టించుకోలేదుబరువు తగ్గాలనుకుంటున్న సమయంలో అద్నామ్ తండ్రికి. ప్రాంకియాటిక్ కేన్సర్ సోకింది. ఈ సందర్భంగా హాస్పిటల్ వెళ్తే ఇంత బరువు ప్రమాదకరం, ఇలానే కొనసాగితే ఆరు నెలలో చనిపోతావ్ అని ఒక వైద్యుడు అద్నాన్ను హెచ్చరించారట. అయినా పెట్టించుకోలేదు. పైగా బేకరీకి వెళ్లి ఫుల్గా లాగించేశడట. ఇది చూసి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకోమంటూ ఆవేదనతో కన్నీటితో చేసిన అభ్యర్థన, లైఫ్స్టైల్ మార్చుకోమని చేసిన హెచ్చరిక అతనిలో పట్టుదల పెంచింది. చివరికి అనుకున్నది సాధించారు. అలాగే తిరిగి బరువు పెరగకుండా ఉండటానికి కఠినమైన దినచర్యను పాటిస్తున్నానని చెప్పారు. కష్టపడి బరువు తగ్గాను.. జీవితంలో షార్ట్కట్లు ఏమీ ఉండవు అని చెప్పారు. -
అవార్డులే అవార్డులు : శశిధర్..ట్రెండ్ సెట్టర్
నగరంలోని ఓల్డ్ డెయిరీ ఫారానికి చెందిన శశిధర్ పైడిరాజు పాండ్రాడ చిన్నతనం నుంచే ఫ్యాషన్, సంప్రదాయ నృత్య ప్రదర్శనల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. పాఠశాలలో సంప్రదాయ నృత్యానికి ప్రోత్సాహం లభించగా, ఇంట్లో అతని సోదరుడు ఫ్యాషన్ పట్ల ఆసక్తిని పెంచాడు. అన్నయ్య తెచ్చిన విభిన్న రకాల దుస్తులను శశిధర్ ధరించి అందరినీ ఆకర్షించేవాడు. అలాగే పాఠశాల కార్యక్రమాల్లో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు. అవార్డులే అవార్డులు ఇటీవల దుబాయ్లోని పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఎస్కేఎస్ అకాడమీ నుంచి ఎనిమిది మంది నృత్య కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇందులో శశిధర్ ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యానికి ‘యువ ప్రతిభ పురస్కారం’లభించింది. అలాగే శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ నుంచి ‘జాతీయ మహా స్వర్ణ నంది అవార్డు’ను అందుకున్నాడు. 2024లో ‘యాక్టివ్ ఉగాది పురస్కారం’ కూడా శశిధర్కు లభించింది. ఒకవైపు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ర్యాంప్పై హొయలొలికిస్తూ, మరోవైపు శాస్త్రీయ నృత్య వేదికపై అభినయంతో అబ్బురపరుస్తూ.. ఇలా రెండు విభిన్న రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు నగరానికి చెందిన 26 ఏళ్ల శశిధర్. చిన్ననాటి అభిరుచులను వదలకుండా వాటినే తన కెరీర్గా మలచుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ‘యువ ప్రతిభ పురస్కారం’ అందుకోవడమే ఇందుకు నిదర్శనం.ఫ్యాషన్ రంగంలోకి అడుగులుడిగ్రీ చదువుతున్న సమయంలో శశిధర్ కొన్ని కారణాలతో సంప్రదాయ నృత్యాన్ని కొంతకాలం పక్కన పెట్టాడు. ఆ సమయంలో తన దృష్టిని పూర్తిగా ఫ్యాషన్పై కేంద్రీకరించాడు. డిగ్రీ స్థాయిలో జరిగిన ఫ్యాషన్ పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు జరిగిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 2018 లో ‘ఉత్తమ ఆకర్షణీయమైన కళ్లు’అవార్డును గెలుచుకున్నాడు.మిస్టర్ కొచ్చి 2021 విజేత చదువు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఫ్యాషన్ రంగంపై శశిధర్ దృష్టి సారించాడు.2021లో కొచ్చిలో జరిగిన ఫ్యాషన్ పోటీల్లో ‘మిస్టర్ కొచ్చి 2021’విజేతగా నిలిచాడు. ఆ తర్వాత, ఆంధ్ర ఫ్యాషన్ వీక్ సీజన్ 1 లో ‘ఉత్తమ యువ డిజైనర్ అవార్డు 2024’, విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో ‘ఉత్తమ స్మైల్ అవార్డు 2024’ను సొంతం చేసుకున్నాడు.నాట్యకళకు తిరిగి ప్రాణం పోసిన వేళ..చదువుపై దృష్టి సారించే క్రమంలో చిన్నప్పుడు నేర్చుకున్న శాస్త్రీయ నృత్యానికి దూరమైనా.. దానిపై మమకారం చావలేదు. 2024లో ఓ అవార్డు కార్యక్రమంలో శశిధర్ మాట్లాడుతూ భరతనాట్యం, కూచిపూడి అంటే తనకెంత ఇష్టమో చెప్పిన మాటలు తన జీవితాన్ని కీలక మలుపు తిప్పాయి. ఆ మాటలు విన్న ఎస్కేఎస్ అకాడమీకి చెందిన పక్కి అరుణ్ కుమార్ సాయి.. శశిధర్ను కలిసి తన నృత్య ప్రతిభను ప్రదర్శించమని కోరారు. అతనిలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలా ఏళ్ల క్రితం ఆగిపోయిన నాట్య ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది. గురువు అరుణ్ శిక్షణలో రాటుదేలిన శశిధర్.. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటాడు. యువతకు మార్గదర్శిగా ‘జేఆర్డీ ఫ్యాషన్స్’ తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు. అమ్మ ప్రోత్సాహంతోనే.. మోడల్గా, నృత్య కళాకారుడిగా రాణించడంలో అమ్మ పాత్ర ఎంతో ఉంది. పాఠశాల రోజుల్లో వివిధ రకాల ప్రదర్శనల్లో నన్ను పాల్గొనేలా ప్రోత్సహించింది. ఫ్యాషన్ రంగంలోకి వెళ్తానంటే సపోర్ట్ చేసింది. నృత్యం ఇక నా జీవితంలో ఉండదు అనుకునే సమయంలో మా గురువు పక్కి అరుణ్ కుమార్ సాయి ప్రోత్సాహం మరువలేనిది. ఈ రెండు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని నిరంతరం పట్టుదలతో శ్రమిస్తున్నా.. – శశిధర్ పైడిరాజు పాండ్రాడ -
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
మోస్ట్ అడోరబుల్ సెలబ్రిటీ కపుల్ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటే ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జూన్ 6న పెళ్లి చేసుకున్న ఈ జంటల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా సూఫీ నైట్లో అందంగా మెరిసారు. మురిపెంగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని అందర్నీ అబ్బుర పరిచారు.సూఫీ రాత్రిలో అఖిల్- జైనాబ్ అద్భుతంగాసెలబ్రిటీ జంట, అఖిల్ అక్కినేని లేడీ లవర్ జైనాబ్ సూఫీ కార్యక్రమంలో కనువిందు చేశారు. జైనాబ్ పూల ప్రింట్తో ఉన్న లాంగ్ ఫ్రాక్ ధరించగా, అఖిల్ నేవీ బ్లూ షేర్వాన, పైజామాతో కనిపించాడు. మాంగ్ టీకా, డైమండ్ నెక్పీస్తో తన లుక్ను మరింత అద్భుతంగా మల్చుకుంది. ఈ వేడుకలో కూడా డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్గా కనిపించింది. వివాహం తర్వాత నూతన వధూవరులుగా తొలిసారి ఇలా కనిపించి అలంకరించారు. పవర్ కపుల్ వరుణ్ జైన్, అతని భార్య సన్యా ఈ వేడుకలో కనిపించారు.అఖిల్ - జైనబ్ వెడ్డింగ్ 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ -జైనాబ్ మూడేళ్ల బంధం తరువాత ఈ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తరువాత గ్రాండ్రిసెప్షన్ కూడా ఇచ్చారు. మహేష్ బాబు, చిరంజీవి, రాంచరణ్, ప్రశాంత్ నీల్ లాంటి సినీ ప్రముఖులతోపాటు, అనేక రాజకీయ, క్రీడారంగ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. -
దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ : ఎగబడుతున్న జనం
నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లోని రిజ్క్స్మ్యూజియంలో దాదాపు 200 ఏళ్ల నాటి, మంచి కండిషన్లో ఉన్న కండోమ్ (Condome) ను ప్రదర్శనకు ఉంచారు. ఈ కండోమ్ను గొర్రె అపెండిక్స్ (పేగు)తో తయారు చేసినట్టు భావిస్తున్నారు. దీనిపై ఉన్న ఒక పెయింటింగ్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక నన్, ముగ్గురు మతాధికారులు ఉన్న ఈ పెయింటింగ్ను "లగ్జరీ సావనీర్"గా పేర్కొంటూ వేలానికి ఉంచారు. అంతేకాదు ఈ మ్యూజియం కళా సేకరణలో ఉంచిన తొలి గర్భనిరోధక సాధకం ఇదేనట.1830 నాటి ఈ కండోమ్, 19వ శతాబ్దపు వ్యభిచారం , లైంగికతపై జరిగే ప్రదర్శనలో భాగమని మ్యూజియం నిర్వాహకులు వె ల్లడించారు. ఇంకా ఈ డచ్ మ్యూజియంలో దాదాపు 7,50,000 వరకు ప్రింట్లు, డ్రాయింగ్లు, ఫోటోలు కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ఉన్నాయి."అక్కడ, అది నా ఎంపిక' అని అర్థం వచ్చే ‘వోయిలా మోన్ చోయిక్స్’( ఇది నా చాయిస్) అనే శాసనం బ్రహ్మచర్యం , గ్రీకు పురాణాల నుండి పారిస్ తీర్పు రెండింటికీ అనుకరణగా ఉందని మ్యూజియం తెలిపింది.చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..చూసేందుకు ఎగబడుతున్న జనంఈ కళాఖండాన్ని ప్రదర్శనలో ఉంచినప్పటి నుంచీ, మ్యూజియం యువకులు, వృద్ధులతో నిండిపోయిందని రిజ్క్స్మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ తెలిపారు. స్పందన అద్భుతంగా ఉందన్నారు. అయితే మొదటిసారి వేలంలో మొదటిసారి ఈ కండోమ్ను ఉంచినపుడు తాను, తన సహద్యోగి నవ్వుకున్నామని ఆమె గుర్తు చేసుకున్నారు. 2024లో జరిగిన ఒక వేలంలో మ్యూజియం దీనిని కొనుగోలు చేసిందట. ఆ తర్వాత వారు దాన్ని అతినీలలోహిత (UV) కాంతిలో పరీక్షించారు. అలా ఆ కండోమ్ను ఎవరూ ఉపయోగించ లేదని భావిస్తున్నామన్నారు. 2025 నవంబర్ చివరి వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుంది. -
Hebah Patel ఫ్యాషన్.. ఫాలో అయ్యేది కాదు
మోడర్న్ లుక్లో కనిపించే ముద్దమందారంలాంటి అమ్మాయి నటి హెబ్బా పటేల్ (Hebah Patel). స్టయిలింగ్, ఫ్యాషన్ చాయిసెస్ కూడా సంప్రదాయం, ఆధునికతల కలయికలాగే ఉంటాయి.ఇప్పుడు అలాంటి ఓ టూ ఇన్ వన్ లుక్ కోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..మేకప్ కంటే ముందు స్కిన్కేర్పై ఎక్కువ శ్రద్ధ పెడతా. మేకప్ ఎంత తక్కువ వేసుకుంటే, అంత బాగుంటాం. ఇక దుస్తులను నా మూడ్, కంఫర్ట్, సందర్భం, వెళ్లే చోటును బట్టి స్టయిలింగ్ చేసుకుంటా. ఫ్యాషన్ అంటే ఫాలో అయ్యే విషయం కాదు. ఫీల్ అయ్యేదని నమ్ముతా. – హెబ్బా పటేల్ చీర బ్రాండ్: హర్షిత నిమిషకవి ధర: రూ. 4,500బ్లౌజ్ ధర: రూ. 1,500జ్యూలరీ బ్రాండ్: బ్లూమ్ బై సుష్మిత ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే.. నెక్పీస్ ధర: రూ. 699గాజులు ధర: రూ. 1,549చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్ -
Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎత్తు, వయసుకి తగ్గట్టుగా బరువు ఉండటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీ గుండె జబ్బులు, మధుమేహం లాంటి జబ్బులను దూరంగా ఉంచుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయంగా ఉండాలంటే దినచర్య సవ్యంగా ఉండాల్సిందే. కొన్ని ముఖ్యమైన సూత్రాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేలేత సూర్యకిరణాలు మన శరీరానికి తాకిడే, చక్కటి డి విటమిన్ అందుతుంది. యోగా, నడక లాంటి వ్యాయామం చేయాలి. ఇది రక్త ప్రవాహం సాఫీగా సాగిపోవడానికి మేలుచేస్తుంది. అంతేకాదు రోజంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నిర్దిష్ట సమయాల్లోనే భోజనం చేయాలి. అదీ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఉపాహారం అస్సలు వాయిదా వేయొద్దు. రాత్రి నిద్రకు ముందు అతిభోజనం వద్దు.సరిపడినన్ని నీళ్లు తాగాలి.స్మార్ట్ఫోన్లు, టీవీలకు ఎక్కువగా అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా రోజుకు 10వేల అడుగులు వేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. నిమిషానికి 80 అడుగులు నడిస్తే సాధారణం. నిమిషానికి 100 అడుగులు నడుస్తుంటే మధ్యస్థంనిమిషానికి 120 అడుగులు నడిస్తే.. అది వేగవంతమైన చురుకైన నడక. ఇది అత్యంత ప్రభావవంతమైనది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితి, సామర్థ్యం ఆధారంగా నిర్ధారించుకోవాలి. రాత్రికి రాత్రికే బరువు తగ్గాలనే అత్యాశతో అవగాహన లేని షార్ట్ కట్ పద్దతులు, లేని పోని డైటింగ్లను ఆశ్రయించకూడదు ఇది ఒక్కోసారి ప్రమాదం కూడా. శరీర తత్వాన్ని అవగాహన చేసుకొని ఓపిగ్గా ప్రయత్నిస్తే విజయం సాధించడం తథ్యం. నోట్: ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
సండే ఆన్ సైకిల్ : సైకిల్ మన దినచర్యలోభాగం కావాలి!
దక్షిణమధ్య రైల్వే స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్జైన్ ప్రారంభించారు. రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఆయన కూడా సైకిల్ తొక్కారు. ‘ఫిట్ ఇండియా సైక్లోథీన్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే అదనపు జీఎం నీరజ్ అగర్వాల్, డీఆర్ఎం భర్తేష్ కుమార్, దక్షిణమధ్య రైల్వే వివిధ విభాగాలకు చెందిన అధికారులు, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, రైల్వే క్రీడాకారులు పాల్గొన్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్ సైక్లింగ్తో ఆరోగ్యం, ఫిట్నెస్, పర్యావరణ బాధ్యత లాంటి ప్రయోజనాలు ఉంటాయని, దీన్ని దిన చర్యలో భాగం అలవర్చుకోవాలన్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ ఎ.చిన్న సీతారామిరెడ్డి, వైస్ చైర్మన్ గిరిధారిలాల్ తోషిన్వాల్ అన్నారు. చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్సింగిలోని ఔటర్రింగ్ రోడ్డు సైకిల్ ట్రాక్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్, సమాజహితం సాధించాలంటే సైక్లింగ్ చేయాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, ఐక్యతని పెంపొందించేందుకు సైక్లింగ్ ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు డీఎంకే టీమ్ నిర్వహించిన వార్మప్ సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నార్సింగి నుంచి అప్పా సర్కిల్ వరకూ సైక్లింగ్ చేశారు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సహాయంతోపాటు హైడ్రేషన్, రిఫ్రెష్మెంట్ అందించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున చార్టర్డ్ అకౌంటెంట్ల కుటుంభాలు పాల్గొన్నాయి. భాగం చేసుకోవాలి. -
నెక్లెస్ రోడ్లో తెలంగాణా రన్ 2025
ఖైరతాబాద్ : సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో రన్– 2025 పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి 3కే, 5కే, 10కే, హాఫ్ మారథాన్ ఆదివారం నిర్వహించారు. ఆరోగ్యకరమైన, చురుకైన తెలంగాణ సాధనే లక్ష్యంగా నిర్వహించిన మారథాన్లో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. మారథాన్, రన్ను డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ ఏ రామ్కిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి క్రీడా రంగాన్ని సాధనంగా మలుచుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఫిట్ తెలంగాణ సాధన కోసం యావత్ క్రీడా సమాజం కృషిచేయాలన్నారు. మానసిక, శారీరక వికాసానికి దోహదపడే క్రీడలు ఐక్యతను సాధించడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. అవంతి కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్రెడ్డి, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమ జగన్మోహన్రెడ్డి, సభ్యులు పన్నాల హరీష్ చంద్రరెడ్డి, శ్రీనివాస్ మగ్గారి, డాక్టర్ మహేష్ పాల్గొన్నారు. మారథాన్, రన్లో విజేతలను సన్మానించి, మెడల్స్ అందజేశారు. ఇదీ చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్ -
భారత్-భూటన్ చిల్.. లాంగ్.. టూర్
మేఘాల మధ్య విస్తరించిన మేఘాలయ. ఛిల్ అవమని ఆహ్వానిస్తున్న షిల్లాంగ్. నాలుగు వేల అడుగుల ఎత్తులో సరస్సు. అంతకు వెయ్యి అడుగుల ఎత్తుల జలపాతం. బౌద్ధంలా విస్తరించిన ప్రశాంత విహారం. ఏడు పాయల సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్. కేథడ్రల్ చర్చ్ వందేళ్ల చారిత్రక గ్రంథం. సంతోషాల విలాసభవనం పునాఖ ద్జోంగ్. భారత్ – భూటాన్ మౌంటెయిన్ టూర్... వీటన్నింటినీ దండలా కూర్చి చూపిస్తోంది.సోమవారం ‘‘ 9–6–2025భారత్ భూటాన్ మిస్టిక్ మౌంటెయిన్ టూర్... ఇది 14 రోజుల యాత్ర. రైలు ఢిల్లీలో మొదలై గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి, థింఫు, పునఖ, పారో మీదుగా ఢిల్లీకి చేరుతుంది. ఢిల్లీలోని సఫ్దర్గంజ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా జంక్షన్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో రైలెక్కవచ్చు. ఈ టూర్ ఈ నెల 28వ తేదీన మొదలవుతుంది. టికెట్ ధరలు ఏసీ కూపేలో (డబుల్ షేరింగ్) ఒక్కొక్కరికి లక్షా అరవై వేలవుతుంది. ఏసీ క్యాబిన్లో సింగిల్ షేరింగ్ లక్షా డెబ్బయ్ ఐదు వేలు, డబుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి లక్షా నలభై ఐదు వేలు. డీలక్స్ (ఏసీ టూ టైర్)లో డబుల్ షేరింగ్ లక్షా ముప్పై వేలు, కంఫర్ట్ (థర్డ్ ఏసీ) కేటగిరీలో డబుల్ షేరింగ్ ఒక్కొక్కరికి లక్షా ఇరవై వేలవుతుంది. ఇవన్నీ ఉండాలి: ఈ టూర్లో విదేశీ పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణికులు పాన్ కార్డు, పాస్పోర్టు (ఆరు నెలల కనీస గడువు ఉండాలి) లేదా ఓటర్ ఐడీ కార్డు (హోలోగ్రామ్ తప్పనిసరి), పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు (వైట్ బ్యాక్ గ్రౌండ్) ఉండాలి.1వ రోజు: మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. రైలు బయలుదేరగానే ప్రయాణికులకు హై టీ, రాత్రి భోజనం అందిస్తారు. రాత్రంగా ప్రయాణం కొనసాగుతుంది.2వ రోజు: ఈ రోజంతా కూడా ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఉదయం టీ నుంచి రాత్రి భోజనం వరకు ఆహారపానీయాలను అందిస్తారు. ఆ రాత్రి కూడా ప్రయాణం సాగుతుంది. 3వ రోజు: మధ్యాహ్న భోజనం తర్వాత రైలు గువాహటికి చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవ్వాలి. సాయంత్రం ఫ్రీ టైమ్. రాత్రి బస అదే హోటల్లో.4వ రోజుఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత రూమ్ చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. కామాఖ్య ఆలయంలో ముఖ దర్శనం చేసుకుని షిల్లాంగ్ వైపు సాగిపోవాలి. ఉమియుమ్ లేక్ మీదుగా సూర్యాస్తమయాన్ని వీక్షించి హోటల్ గదిలో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస షిల్లాంగ్లో.మేఘాల కింద విహారంమేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ప్రధానమైన నీటి వనరు ఉమియుమ్ లేక్. ఇది సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతి.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత చిరపుంజి వైపు సాగిపోవాలి. సెవెన్ సిస్టర్స్ జలపాతంతో సేదదీరి మావ్సామాయ్ గుహలు, నొఖాలికాయ్ జలపాతాలకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం తర్వాత ఎలిఫెంటా జలపాతాన్ని చూసుకుని హోటల్ గదికి వచ్చి సేదదీరాలి. ఆ రాత్రి బస కూడా షిల్లాంగ్లోనే.ఏడు జలధారలుసెవెన్ సిస్టర్స్ జలపాతం మేఘాలయలో ప్రసిద్ధి. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటుంది. ఇది ఏడు పాయలుగా జాలువారుతుండంతో ఆ పేరు వచ్చింది. స్థానికులు నోహ్స్నిగిథియాంగ్ జలపాతం అంటారు. సముద్రమట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో వెయ్యి అడుగుల పై నుంచి కొండ వాలు నుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తుంది. మన దక్షిణాది వాళ్లకు కర్నాటకలోని జోగ్ వాటర్ఫాల్స్ పరిచితం. ఇది నాలుగు పాయలుగా ఉంటుంది. ఇవి రెండూ దేశంలో టాప్ టెన్ జలపాతాల్లో చోటు చేసుకున్నవే.6వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి సైట్ సీయింగ్కి సాగిపోవాలి. కేథడ్రల్ చర్చ్, వార్డ్స్ లేక్, డాన్ బాస్కో మ్యూజియం తర్వాత గువాహటికి ప్రయాణం. గువాహటిలో బ్రహ్మపుత్ర క్రూయిజ్లో విహరిస్తూ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన తర్వాత ప్రశాంతంగా గువాహటి రైల్వేస్టేషన్కి చేరి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. హాసిమరా వైపు ప్రయాణం రాత్రంతా సాగుతుంది.ఏడంతస్థుల మ్యూజియంషిల్లాంగ్లోని కేథడ్రల్ చర్చ్కి వందేళ్లకు మించిన చరిత్ర ఉంది. దీనిని 1913లో పూర్తిగా చెక్కతో నిర్మించారు. అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో తిరిగి కాంక్రీట్ నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణానికి 85 ఏళ్లు. యూరప్ దేశాలు పాటించి గోథిక్ శైలి నిర్మాణం ఇది. ఇంటీరియర్లో జర్మనీ శైలి కళాత్మకతలోని లాలిత్యం ఉంటుంది. ఇక డాన్ బాస్కో మ్యూజియం ఏడంతస్థుల భవనం. ఈశాన్య రాష్ట్రాల కళాకృతుల నిలయం. మనసు నిండుగా చూడాలంటే మూడు గంటల సమయం కేటాయించాల్సిందే. టూర్లో ఆ మేరకు సమయం ఇస్తారు. ఆవరణలో ఫొటోలు తీసుకోవడంలో ఎక్కువ సమయం గడిచిపోయిందంటే మ్యూజియంలోని కళాకృతులను సరగ్గా చూడలేం.7వ రోజురైల్లోనే బ్రేక్ఫాస్ట్. హాసిమరా స్టేషన్లో రైలు దిగి రోడ్డు మార్గాన ఫుయెంట్షోలింగ్, తర్వాత థింఫూకి సాగిపోవాలి. థింఫూ కి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అని సాయంత్రం విశ్రాంతిగా గడపాలి. రాత్రి బస అక్కడే.భూటాన్లో అడుగుపెట్టాం!హసిమరా రైల్వేస్టేషన్ వెస్ట్బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ దిగి రోడ్డు మార్గాన వెళ్లాలి. భారత్ సరిహద్దు దాటి భూటాన్లో అడుగుపెట్టిన తర్వాత ఇరవై కిలోమీటర్ల దూరంలో ఫుయెంట్షోలింగ్ అనే చిన్న పట్టణానికి చేరుతాం. ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు.8వ రోజుఈ రోజంతా థింఫూలో సైట్ సీయింగ్లో గడుస్తుంది. బుద్ధపాయింట్, మోతీతాంగ్ జూ, పెయింటింగ్ స్కూల్, నేషనల్ లైబ్రరీ, బౌద్ధ సంస్కృతికి సంబంధించి పురాతన గ్రంథాల సముదాయాన్ని వీక్షించడం, థింపూ హాండీక్రాఫ్ట్స్ మార్కెట్ పర్యటన, తాషి చో ద్జోంగ్ వీక్షణం తర్వాత హోటల్కి చేరి రాత్రి బస.గ్రేట్ బుద్ధ భూటాన్ రాజధాని నగరం థింపూ. ఈ నగర శివారులో బుద్ధ డోర్డెన్మా విగ్రహం ఉంది. 177 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోని అత్యంత పెద్ద బుద్ధ విగ్రహాల జాబితాలో లిస్ట్ అయింది. ప్రపంచానికి శాంతి, సంపదలు దక్కాలని కోరుకుని దీనిని నిర్మించారు. గ్రేట్ బుద్ధగా వ్యవహరిస్తారు. ఇది ్రపాచీనమైనది కాదు. ఇరవై ఏళ్ల కిందట నిర్మాణం మొదలైంది. ్రపారంభించి పదేళ్లవుతోంది.చిన్ని చిత్రాలయంథింపూలో ఉన్న జాతీయ స్థాయి పెయింటింగ్ స్కూల్ పరిమాణంలో చిన్నది. కానీ ఇందులో పిల్లలకు పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, శిల్పకళ, స్కెచింగ్, ఉడ్ కార్వింగ్ వంటి అనేక కళల్లో శిక్షణనిస్తారు. విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగని విధంగా పర్యాటకులు నిశ్శబ్దం పాటించాలి.9వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన పునఖా వైపు సాగుతుంది ప్రయాణం. దారిలో ఆగుతూ దోచులా పాస్, చోర్టెన్, మణివాల్, ప్రేయర్ ఫ్లాగ్స్ను చూసుకుంటూ మధ్యాహ్యానికి పునఖా ద్జోంగ్, మేల్ రివర్, ఫిమేల్ రివర్ వీక్షణం. సస్పెన్షన్ వంతెన మీద విహారం, ΄్యాలెస్ ఆఫ్ హ్యాపీనెస్ సందర్శనం తర్వాత సాయంత్రం పునాఖాలో హోటల్కు చేరి చెక్ ఇన్ అయి రాత్రి బస చేయాలి.సంతోష భవనంఈ భవనాన్ని స్థానిక వ్యవహారంలో పునాఖ ద్జోంగ్ అంటారు. పునాఖ నగరం భూటాన్కి రాజధానిగా ఉన్నప్పుడు రాజ్యపాలన ఇక్కడి నుంచే జరిగేది. ఈ భవనానికి చారిత్రక ్రపాధాన్యం ఉండడంతో రాజధాని థింపూకి మారిన తర్వాత పర్యాటక భవనంగా మార్చారు. టిబెట్ బౌద్ధం విలసిల్లిన ప్రదేశం ఇది. ఇప్పుడిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల పరిశీలన జాబితాలో ఉంది.10వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత పునాఖాలో హోటల్ గది చెక్ అవుట్ చేసి పారో వైపు సాగిపోవాలి. దారిలో లంపేరీ రాయల్ బొటానికల్ పార్క్, పారో నది మీదున్న తామ్చోగ్ లాఖాగ్ ఐరన్ బ్రిడ్జ్ విహారం, పారో ద్జోంగ్ (రింన్పుంగ్ ద్జోంగ్), కోట సందర్శన తర్వాత ద్జోంగ్ఖాగ్ సందర్శనం. రాత్రి బస పారోలోనే.వంతెన మీద సూర్యాస్తమయంపారో నగరంలో ఉన్న బౌద్ధ క్షేత్రం రిన్పుంగ్ ద్జోంగీ. ్రపాచీనకాలంలో ఈ ప్రదేశాన్ని పాలించిన రాజవంశాలు నివసించిన ప్రదేశం. వారు బౌద్ధాన్ని ఆచరించడంతో ఆ పరంపరగా వచ్చిన బౌద్ధక్షేత్రం ఇది. దీనిని యునెస్కో పరిశీలన జాబితాలోకి తీసుకుంది. నది కి ఇరు వైపులా రెండు భవనాలను కలుపుతూ ఉన్న వంతెన మీద నుంచి సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతి.11వ రోజురోజంతా పర్యటన పారోలో ప్రశాంతంగా సాగుతుంది. టైగర్ నెస్ట్ బేక్క్యాంప్ పాయింట్లో ఫొటో సెషన్, నేషనల్ మ్యూజియం సందర్శనం, తా ద్జోంగ్ (వాచ్ టవర్) నుంచి ప్రకృతి వీక్షణం, భూటాన్ సంప్రదాయ హస్తకళాకృతుల వీక్షణం, మధ్యాహ్న భోజనం తర్వాత భూటాన్ జాతీయ క్రీడ ఆర్చరీ సాధన, విన్యాసాలను వీక్షించడం, చివరగా ఔషథ నీటితో హాట్ స్టోన్ బాత్ చేయించుకుని హోటల్కి చేరడం. ఈ రాత్రి కూడా బస పారోలోనే.రాతితో ఔషథ స్నానంఇది ఇక్కడ ఆయుర్వేద చికిత్స. యాభై రకాల మానసిక, శారీరక అనారోగ్యాలతోపాటు ఆధ్యాత్మిక భావనలను పెం΄÷ందించే చికిత్స. హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించిన ఈ నేలకు ఔషధాల పుట్టిల్లు అని పేరు. ఇక్కడ నీటిలో ఔషథ పత్రాలను వేసి మరిగిస్తారు. రాళ్లను వేడి చేసి ఆ నీటిలో వేస్తారు. ఆ తరవాత ఆ రాళ్లను ఒక చట్రంలో అమర్చి ఒంటికి హాయి కలిగేటట్లు మర్దన చేయడమే హాట్ స్టోన్ బాత్. మోడరన్ లైఫ్ స్టైల్లో ఒత్తిడి, హైపర్ టెన్షన్, జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. వీటన్నింటి నుంచి ఉపశమనం ΄÷ందడానికి హాట్ స్టోన్ బాత్ దోహదం చేస్తుంది. కేరళలో తైలాలతో చేసే చికిత్స వంటిదే ఇది.12వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన హసిమరా రైల్వేస్టేషన్కు సాగిపోవాలి. దారిలో లంచ్ తర్వాత స్టేషన్కి చేరి రైలెక్కిన తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పదమూడవ రోజు మొత్తం రైల్లోనే. పద్నాలుగవ రోజు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎనిమిది గంటలకు రైలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ స్టేషన్కు చేరడంతో యాత్ర పూర్తవుతుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
మిస్ యూనివర్స్కు మన తెలుగు తేజాలు
త్వరలో థాయిలాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి పోటీలు జరిగాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనలిస్టుల ఎంపికలో మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ప్రకృతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు..సుస్మితాసేన్ స్ఫూర్తినేను మెడికల్ స్టూడెంట్ని. మోడల్ గా కూడా రాణిస్తున్నాను. శాస్త్రీయ నృత్యమూ నేర్చుకున్నాను. అందాల పోటీలు అంటే కేవలం బ్యూటీ గురించి మాత్రమే కాదు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, జీవన నైపుణ్యాల వృద్ధి.. ఇలా అన్నింటిపై ఫోకస్ ఉంటుంది. అందుకే నేను దీనిమీద దృష్టి పెట్టాను. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. మా అమ్మానాన్నలు తెలంగాణ వాసులు. మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెలా ఎదగాలన్నది నా డ్రీమ్. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఈరోజుల్లో ప్రజల్లో మానసిక అనారోగ్యం బాగా పెరుగుతోంది. దీనిపై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. అలాగే గృహహింస పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. వీటితో పాటు మూగ, చెవిటి వారికి సహాయకారిగా ఉంటూ వారి వృద్ధికి కృషి చేస్తున్నాను. ఈ విషయాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. తెలంగాణకు రావడానికి ముందే మా పేరెంట్స్ నుంచి, బుక్స్ నుంచి తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం విజేతగా నిలవడం... చాలా సంతోషంగా ఉంది.– కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణకాన్ఫిడెన్స్ ముఖ్యంకళ్ళు మూసినా, తెరిచినా కిరీటమే కళ్ళ ముందుండేది. ఫైనలిస్ట్గా ఎంపికయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పోటీలో మన మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కాన్ఫిడెన్స్ నే ప్రధానంగా చూస్తారు. ఫైనల్ రౌండ్లో... త్యాగం, పాజిటివిటీ, నెగెటివిటీల గురించి అడిగారు. త్యాగం అనేది ఎప్పుడూ గొప్పదే. మన జీవితంలో చిన్న చిన్న త్యాగాలు చేస్తుంటాం. కానీ, త్యాగం వల్ల మన సెల్ఫ్ హ్యాపీగా లేకపోతే చేయకూడదు అని నేను చెప్పడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. గత ఏడాది ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలు పొందాను. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికయ్యాను. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, భాష.. ఇలా అన్నింటి గురించి తెలిసుండాలి. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అమ్మ వర్కింగ్ విమెన్, అక్క ప్రేరణ నాకు బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. అంతగా ఎంకరేజ్ చేస్తారు. బీకామ్లో డిగ్రీ చేశాను. డాన్స్ అంటే ఇష్టంతో డాన్స్ కోర్సు చేశాను. బెంగళూరులో డాన్స్ స్టూడియో ఉంది. రియాలిటీ షో చేశాను, నేను నటించిన సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. నన్ను ఆల్ రౌండర్ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. బ్యూటీ అంటే ఫిజికల్గా కనిపించేదే కాదు.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ . దానినే అన్నింటికన్నా భిన్నంగా చూపగలగాలి.–ప్రకృతి కంబం, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్– నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
దీపకుని గురుసేవ
ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను పూర్వం దీపకుడు అనే బ్రహ్మచారి ఉండేవాడు. అతడు పరమ నైష్ఠికుడు. శాస్త్రాలలో చెప్పిన ‘శిశువుకు తల్లిదండ్రులు, శిష్యుడికి గురువును మించిన దైవం లేరు. వారి సేవను మించిన తీర్థ యజ్ఞాదులు లేవు. జన్మను తరింపజేసుకోవడానికి మాతాపితరుల సేవ, గురుసేవను మించిన మార్గం లేదు’ అనే సూక్తిని చదివి, గురువు కోసం అన్వేషణ ప్రారంభించాడు.ఇంటి నుంచి దీపకుడు కాలినడకన బయలుదేరాడు. దారిలో కనిపించిన వారిని తగిన గురువు కోసం వాకబు చేయసాగాడు. గోదావరి తీరంలో వేదధర్య మహర్షి వేదవేదాంగ పారంగతుడని, గురుకులం నిర్వహిస్తూ ఎందరికో విద్యాబోధన చేస్తున్నాడని చాలామంది చెప్పారు. వేదధర్యుడి ఆశ్రమం ఎక్కడ ఉన్నదో బాటసారులను కనుక్కొని తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిరోజుల ప్రయాణం తర్వాత ఆశ్రమానికి చేరుకున్నాడు. శిష్యులతో వేదం వల్లె వేయిస్తున్న వేదధర్యుడిని చూసి, నేరుగా ఆయన వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు.దీపకుడి వినయశీలతకు వేదధర్యుడు ముచ్చటపడ్డాడు. అతడిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. దీపకుడు గురుసేవ చేసుకుంటూ, విద్యాభ్యాసం కొనసాగించాడు. అనతికాలంలోనే వేద శాస్త్ర పురాణాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. శిష్యుడి విద్యాతేజస్సుకు వేదధర్యుడు అబ్బురపడ్డాడు. ఒకనాడు ఆయన దీపకుడిని పిలిచి, ‘కుమారా! నేను గత జన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. రెండు భయంకరమైన పాపాలకు మాత్రం ఫలితాన్ని ఇంకా అనుభవించాల్సి ఉంది. చేసిన కర్మమే చెడని పదార్థం కదా! సాక్షాత్తు విశ్వనాథుని ధామమైన పవిత్ర కాశీక్షేత్రంలో నేను ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోదలచాను.పుణ్యక్షేత్రంలో ఏ పనికైనా ఫలితం రెండింతలుగా ఉంటుంది. నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తం కోసం ఆవాహన చేయగానే నాకు భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ ఉంటుంది. వికార రూపం వస్తుంది. కొన్నాళ్లకు అంధత్వం వస్తుంది. అలాంటి పరిస్థితిలో కఠినాత్ముడినై, ఇతరుల సేవ కోసం దీనంగా ఎదురుచూస్తుంటాను. నేను ఆ దుస్థితిలో ఉన్నప్పుడు నాకు సేవ చేయగలవా?’ అని అడిగాడు.‘గురువర్యా! నేను మీ పాపాలను ఆవాహన చేసుకుని, వాటి ఫలితాన్ని అనుభవిస్తాను. దయచేసి నాకు అనుమతి ప్రసాదించండి’ అని వేడుకున్నాడు దీపకుడు.‘దీపకా! నువ్వు నీ వంశానికే కులదీపకుడవు. అయినా, ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను’ చెప్పాడు వేదధర్యుడు.గురువు ఆనతి ప్రకారం దీపకుడు ఆయనను కాశీకి తీసుకువెళ్లాడు.కాశీలోని మణికర్ణికకు ఉత్తరాన ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరుకుని, అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.గురువు చెప్పినట్లే జరిగింది. కాశీకి చేరుకున్న కొద్దిరోజులకే వేదధర్యుడి కుష్ఠువ్యాధి సోకింది. క్రమక్రమంగా అతడి శరీరం క్షీణించసాగింది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ, వేళ్లు తెగిపోయి, వికృతాకారుడిగా మారాడు. ఇంకొన్నాళ్లకు అంధుడైపోయాడు. గురువు పరిస్థితికి దీపకుడు చాలా దుఃఖించాడు. గురువును కంటికి రెప్పలా చూసుకుంటూ, నిత్యం ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ, పరిచర్యలు చేసేవాడు. భిక్షకు వెళ్లి, దొరికిన భోజనాన్ని గురువుకు పెట్టేవాడు. ప్రతిరోజూ దీపకుడు తెచ్చిన భిక్షను తానొక్కడే తినేస్తూ, ‘ఇంత కొంచెమే తెచ్చావెందుకు?’ అంటూ దుర్భాషలాడేవాడు. గురువు కోపతాపాలను సహిస్తూనే దీపకుడు ఆయనను అంటిపెట్టుకుని ఉంటూ సేవలు చేసేవాడు.దీపకుడి అచంచల గురుభక్తికి కాశీ విశ్వనాథుడు ముగ్ధుడయ్యాడు. రోజూ మాదిరిగానే ఒకనాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడికి ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ గురుభక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘స్వామీ! నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప మరేదీ తెలియదు. మా గురువు అభీష్టమేదో కనుక్కొని చెబుతాను’ అన్నాడు. ఆశ్రమానికి వెళ్లాక గురువుకు ఈ విషయం చెప్పాడు. ‘గురుదేవా! మీకు స్వస్థత కోరుకుంటాను’ అన్నాడు.‘నాయనా! ఎవరి పాపాలకు ఫలితాన్ని వారు అనుభవిస్తేనే పోతాయి’ అని చెప్పాడు వేదధర్యుడు.మరునాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడు పరమేశ్వరుడిని ఏ వరమూ కోరుకోలేదు.పరమేశ్వరుడు దీపకుడి సంగతిని పార్వతీదేవికి, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడికి, సమస్త దేవతలకు చెప్పి సంబరపడిపోయాడు.శ్రీమన్నారాయణుడు దీపకుడికి ప్రత్యక్షమై, ‘వత్సా! సాక్షాత్తు పరమేశ్వరుడినే మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యం. ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు.‘స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు, చాలు’ అని పలికాడు దీపకుడు.‘తథాస్తు’ అని అనుగ్రహించాడు శ్రీమహావిష్ణువు.∙సాంఖ్యాయన -
తొలి నెలసరి వాయిదా వెయ్యొచ్చా?
ఇటీవలి కాలంలో కూతుళ్లు ఉన్న తల్లులలోఒక ఆందోళన కనిపిస్తోంది. అదేంటంటే పదేళ్ల వయసుకే కూతుళ్ళు రజస్వల కావడం. ఇది వారి భవిష్యత్తు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. అనే భయాన్ని దూరం చేయాలనుకుంటున్నారు. తమ గురించి తమకు ఏ మాత్రం తెలియని అమ్మాయిల్లో తొలి నెలసరి ఆలస్యంగా రావాలని తల్లులు ప్రయత్నిస్తున్నారు, ఇది మంచి పరిణామం అంటున్నారు నిపుణులు.కూతుళ్ళ తొలి నెలసరి ఆలస్యంగా రావడాన్ని తల్లులు ప్రయత్నించవచ్చా... ఈ విషయం గురించి ఇటీవల రిబెక్కా కిండెర్మన్ అనే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రాంతానికి చెందిన తల్లి తన 10, 12 ఏళ్ళ కుమార్తెలకు నెలసరి ఆలస్యం కావాలన్న లక్ష్యంతో కుటుంబ ఆహారం నుండి స్క్రీన్ టైం చూసే వరకు అన్నీ మార్చేసింది. ఆమె ఈ విషయంపై చేసిన ఇన్ స్ట్రాగామ్ రీల్ (@bec&kinderman) 1.6 మిలియన్ల వీక్షణలు, 57,000కు పైగా లైకులు పొందింది.‘పిల్లల మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకముందే, వారిపై ఇంటర్నెట్లో కనిపించే విషయాలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వయస్సులోనే పెద్దవాళ్లలా మారకుండా, చిన్న పిల్లలుగా ఉండేలా చేయాలనుకుంటున్నాను,‘ అంటారు ఆమె. ఈ తల్లి చేస్తున్న ప్రయత్నం గురించి మనమూ ఆలోచించాలి. మన కూతుళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.అమెరికాలో బాలికలు మొదటిసారి నెలసరి అయ్యే సగటు వయస్సు 11.9 సంవత్సరాలు. 11 ఏళ్లకు ముందే నెలసరి ్ర΄ారంభమయ్యే బాలికల శాతం16 గా ఉంది. ఇండియాలోనూ ఈ శాతం ఇదే విధంగా ఉంది.నెలసరి.. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు..12 ఏళ్ల వయస్సు ముందు నెలసరి వచ్చే బాలికలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఎండోమెట్రియల్, ఓవరియన్ క్యాన్సర్లకు కూడా ఇది కారణంగా ఉండే ప్రమాదం ఉంది.గతంలో ఇలా ఉండేది కాదు. రచయిత ఎలెనా బ్రిడ్జర్స్ తెలిపిన ప్రకారం, గిరిజన సమాజాలలో బాలికలు సుమారు 17 ఏళ్ల వయస్సులో తొలి నెలసరి పొందేవారు, తగిన అండాశయాల విడుదల 19 ఏళ్ల వయస్సులో మొదలయ్యేది.ప్రాంచీన కాలంలో మానవ మేధస్సు, శరీరం ముందు నుంచీ వయోజన భావోద్వేగాలను ఎదుర్కొనేవి. కానీ నేటి బాలికలు ఇప్పుడే పీరియడ్లు, బాల్య గర్భధారణను ఎదుర్కొంటున్నారు,‘ అని ఆమె చెప్పారు. ఈ పరిస్థితిని ‘ఎవల్యూషనరీ మిస్మ్యాచ్‘గా అభివర్ణిస్తూ, బ్రిడ్జర్స్ ఇలా అన్నారు: ‘ఇప్పుడు రి పొడక్టివ్ ప్యూబర్టి చైతన్యం అతి త్వరగా వస్తోంది, కానీ మానసికంగా, శారీరకంగా పరిపక్వత రావడం లేదు.‘రసాయనాలు కీలకంప్యూబర్టి ముందే మొదలవడం వల్ల గర్భస్రావం, నెలసరి సమస్యలు, ఆందోళన, డిప్రెషన్, పీసీఓఎస్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ఆహారం, ఒత్తిడి, రసాయనాలు వంటి పర్యావరణ అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీన్ని దష్టిలో ఉంచుకుని కిండెర్మన్ తన పిల్లలను సంపూర్ణ సహజ జీవనశైలిలో పెంచుతున్నారు.ఆమె కుటుంబం ఎక్కువగా ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకుంటుంది, పంటలపై ఉండే పెస్టిసైడ్ మిగులు తొలగిస్తారు, ఇంట్లో రసాయనాల్లేని పరిసరాలను కల్పిస్తారు. ‘సువాసన కోసం పిల్లలు ఉపయోగించే పరిమళ ద్రవ్యాలు హార్మో¯Œ లను ప్రభావితం చేస్తాయి, అందుకే మేం ఇంట్లోనే ఎసెన్షియల్ ఆయిల్స్తో పరిమళాలు తయారు చేస్తాం,‘ అని చెబుతున్నారు.న్యూజిలాండ్కు చెందిన నికీ స్కిన్నర్ (@nourished&and&vibrant) కూడా తన 7, 4 సంవత్సరాల కుమార్తెల కోసం ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.‘ఇది సహజ అభివృద్ధిని కృత్రిమంగా నియంత్రించడమేం కాదు,‘వాతావరణ అంశాలు నెలసరి ముందే రావడానికి కారణమవుతున్నాయని తెలుసుకొని, వాటిని నియంత్రించగలిగినంతవరకు నేను తల్లిగా జాగ్రత్త పడుతున్నాను..‘ అంటారు ఆమె.నిపుణుల మాటలలో...నాచురోపతి వైద్యురాలు లారా బ్రిడెన్ చెప్పిన ప్రకారం, 8 సంవత్సరాల వయస్సుకు నెలసరి రావడం అసాధారణమైన విషయం. 11 ఏళ్ల లోపల నెలసరి రావడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్, , బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనేక సమస్యలతో నెలసరికి సంబంధం ఉంది. మెటబాలిక్ డిస్ఫంక్షన్ వల్ల ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. ఆహారం, పర్యావరణ మార్పులు, వ్యాయామం లేకపోవడం, ఎపిగెనెటిక్ ప్రభావాలు ... ఇవన్నీ నెలసరి ముందుగా రావడానికి కారణాలు. బ్రిడ్జర్స్ హెచ్చరిస్తూ ‘నెలసరి ఆలస్యం చేయాలనే లక్ష్యం తల్లిదండ్రులకు, పిల్లలకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది ఆరోగ్యానికి హానికరమైన చర్యలకూ దారితీయవచ్చు‘ అని కూడా అంటున్నారు.మాట్లాడటానికి భయపడవద్దు..కిండెర్మర్ అండ్ స్కిన్నర్ తమ కుమార్తెలతో జరిపిన సంభాషణలు కూతుళ్లు ఉన్న తల్లులకు తప్పక ఉపయోగపడతాయి.‘మీ పిల్లలు నెలసరి వస్తే భయపడకూడదు. అది ఒక ప్రకృతి సహజమైన చర్యగా సానుకూలంగా తీసుకోవాలి. పిల్లలకు పూర్తి అవగాహన ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం‘ అంటున్నారు. పిల్లల చిన్నప్పటి నుంచే వారి శారీరక, మానసిక ఆరోగ్య విధానాలలో జాగ్రత్తలు తీసుకుంటే తల్లుల్లోనూ ఆందోళన తగ్గుతుంది. – నిర్మలారెడ్డిజీవనశైలి మార్పులే కారణంమా వద్దకు 8, 10 ఏళ్ల వయసున్న అమ్మాయిల్ని రజస్వల అయ్యింది అని తల్లులు తీసుకొస్తుంటారు. ఆందోళన పడుతుంటారు. ఆ పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని వయసు. పాల్ట్రీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, వాతావరణం, క్రీడల వంటి శారీరక వ్యాయామం లేకపోవడం.. వంటి వాటి వల్ల చిన్నవయసులోనే రజస్వల కావడం ఇటీవల జరుగుతోంది. కొన్ని సార్లు వారి జీన్స్, ఎండోక్రైౖ మ్స్ పనితీరులో లోపాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. జీవనశైలి సరిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, రెగ్యులర్ చెకప్స్, నిపుణుల సూచనలు పాటిస్తూ, అవగాహన పెంచుకుంటే సమస్య తగ్గుతుంది. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
జిమ్స్, వర్కవుట్స్ లేకుండానే ఆరోగ్యం
ప్రస్తుతం ఆరోగ్యం/ఫిట్నెస్ సాధన అంటే తప్పకుండా జిమ్కి వెళ్లాలి, చెమటలు కక్కేలా కసరత్తులు చేయాలి అనుకుంటున్నారు చాలామంది. అయితే ఎలాంటి ప్రత్యేకమైన వ్యాయామం లేకుండానే రోజువారీ పనుల ద్వారానే శరీరాన్ని ఫిట్గా ఉంచుకునే విధానం ఇప్పుడు ట్రెండ్లో ఉంది. దానికి దోహదం చేస్తోంది నీట్.. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థెర్మోజెనిసిస్(ఎన్ఇఎటి)అంటే మన శరీరం నిద్రపోవడం, తినడం లేదా ప్లాన్ చేసిన వ్యాయామం కాకుండా చేసే ప్రతి చిన్న చలనం ద్వారా ఖర్చయ్యే ఎనర్జీ.. దీనినే నీట్గా పేర్కొంటున్నారు. ఉదాహరణకు నడక, నిలబడటం, ఇల్లు శుభ్రపరచడం, పిల్లలతో ఆడుకోవడం వంటివాటి వల్ల వచ్చే శక్తి నీట్. సంక్షిప్తంగా చెప్పాలంటే..: జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడమే నీట్ పెరుగుదలకు ఆరోగ్య జీవనానికి దోహదం చేస్తుంది. శరీరం నుంచి ఎక్కువ కేలరీస్ ఖర్చయ్యేలా రోజువారీ పనులను నిర్వహించుకుంటూ నీట్ను సొంతం చేసుకునే వ్యక్తులకు మెరుగైన బాడీ కంపోజిషన్, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీట్ టూ ఫిట్.. ఇలా.. రోజులో ఖర్చు చేసే మొత్తం కేలరీల సంఖ్య బాగా పెరిగి, బరువు నియంత్రణకు నీట్ దోహదం చేస్తుంది. ఇది సంతులితమైన ఎనర్జీ బ్యాలెన్స్కి దారితీస్తుంది. ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేస్తున్నవారికి ఇది ఒక ఆచరణీయ మార్గం. కొన్ని అధ్యయనాల ప్రకారం నీట్ ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యాయామం ఒక జీవనశైలిగా మారుతుంది. జిమ్కి వెళ్లకపోయినా ఈ తరహా జీవనశైలి వల్ల చురుకుదనం, ఆరోగ్యం సొంతం అవుతాయి. నీట్ను వెలుగులోకి తెచ్చినది ఈయనే.. ఈ కాన్సెప్ట్ను అమెరికాకు చెందిన ప్రముఖ ఓబెసిటీ రీసెర్చర్ డా.జేమ్స్ లెవిన్ పరిచయం చేశారు. ఆయన తన మయో క్లినిక్లో పరిశోధనలు చేస్తూ ఈ పద్ధతి ద్వారా సాధ్యమయ్యే ఆరోగ్యలాభాలను వివరించారు. ఆయన పరిశోధనల ప్రకారం రోజూ చేసే చిన్న చిన్న కదలికలే (అంటే నడక, మెట్లు ఎక్కడం, కదులుతూ మాట్లాడటం వంటివి) చాలా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. ఇవే మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రధాన మార్గాలుగా మారుతున్నాయి. ఈ కాన్సెప్ట్ ప్రస్తుతం అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో ప్రముఖంగా వినియోగంలో ఉంది. మన దేశంలోనూ బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమ రోజువారీ జీవనశైలి మార్చుకుంటూ నీట్ను, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు.ఒక్క రోజులో 8 వేల నుంచి 10 వేల అడుగులు నడవడం కోసం.. వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా, ఫోన్ మాట్లాడాలన్నా దానిలో నడకను భాగం చేయడం. మీటింగ్స్ని వాక్ – టాక్గా మార్చడం జిమ్లో, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో స్టెప్ ఎరోబిక్స్ చేయనక్కర్లేదు. సింపుల్గా లిఫ్ట్కు గుడ్బై చెప్పి ఎలివేటర్ బదులుగా మెట్లు ఎక్కడం అన్ని ఫ్లోర్స్ కాకపోయినా రోజూ కనీసం 3 అంతస్తుల వరకూ మెట్లపై వెళ్లగలిగితే.. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో వార్తల కోసమో మరేదైనా కార్యక్రమం కోసమో టీవీ చూసేందుకు కుర్చీ, సోఫాలు కాకుండా సైక్లింగ్ చేస్తూనో, బాల్పై కూర్చునో చూడటం.. భోజనం తర్వాత కనీసం 10–15 నిమిషాలు నడవడం ఒకవేళ వెంటనే కూర్చుని పనిచేయాల్సి వస్తే దానికి బదులుగా నుంచోవడం..పని సమయంలో ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి లేచి కనీసం 2–3 నిమిషాలు నడక.. సినిమా చూస్తున్నా, మధ్యలో లేచి నుంచోవడం, లేదా అటూ ఇటూ నడవడం.ఇంటి ఫ్లోర్ను తుడవడం, గిన్నెలు కడగడం, తోట, వంట పనులు చేయడం.. ఇంట్లో పిల్లలు ఉంటే వారితో ఆడుకోవడానికి కొంత సమయం కేటాయించడం..వర్కవుట్ చేసినా ‘నీట్’గానే ఉండాలి మనం ఇంటి పనులను మనమే చేసుకుంటూ, మన వ్యక్తిగత కార్యకలాపాల్లోనూ కదలికల్ని భాగం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అది జిమ్కు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు కానీ.. ఖచి్చతంగా మన ఆరోగ్యానికి ప్రయోజనకరమే. నేనైతే ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు తగ్గకుండా జిమ్లో వర్కవుట్స్ చేస్తాను. అంతేగాకుండా చురుగ్గా ఉండడానికి నీట్ మీద ఆధారపడతాను. ఆస్పత్రిలో నేను ఎప్పుడూ లిఫ్ట్కి బదులుగా మెట్లనే వినియోగిస్తాను. విభిన్న విభాగాల మధ్య తిరగడంతో పాటు వీలున్నంతగా నడుస్తూనే ఉంటాను. రోజుకు కనీసం 3వేల నుంచి 10వేల అడుగుల వరకూ నడిచేలా చూస్తాను. – డా.ఎ.ప్రణతిరెడ్డి, క్లినికల్ డైరెక్టర్, బర్త్ రైట్ బై రెయిన్ బో హాస్పిటల్ ఆఫీసుల్లో ఉన్నప్పుడు టీ తేవడానికి లేదా ప్రింట్ అవుట్స్ తీసుకోవడానికి ఫ్యూన్స్తో కాకుండా çస్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకోవడం.ఎక్కువ సేపు నిలబడాల్సి వచ్చినప్పుడు సులభమైన స్ట్రెచింగ్స్ చేస్తూ ఉండటం.. ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా కాలూ చేయీ కదుపుతూ ఉండటం. వాటర్ బాటిల్ తెచ్చి పక్కన పెట్టుకోకపోవడం వల్ల దాని కోసం తరచూ కాస్తంత దూరం నడవడం..ఈ చిన్న చిన్న మార్పు చేర్పులతో నీట్ పెంపు అనేది ఆరోగ్యానికి దోహదపడే ఒక సహజమైన, సులభమైన మార్గం. ఇది ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఇలా నీట్ను పెంచుకుంటే అది మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. -
నేడు మృగశిర కార్తె
నెన్నెల(మంచిర్యాల): మృగశిర అనగానే గుర్తుకు వచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభరోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. మృగశిర కార్తెతో వర్షాకాలం ప్రారంభమైందని అంటారు. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంతో మంచివి. వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువ ఉంటుందని అది చేపలు తినడం వల్ల దూరమవుతుందనేది పెద్దల మాట. దీంతోపాటు పెరిగిన సమతుల్యం, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు చేపలు తినడం మంచిదని చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు పోషక విలువలు పొందేందుకు చేపలు తినాలనేది ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది.ఫిష్ మార్కెట్లు సిద్ధంమృగశిర కార్తె రోజు చేపలు తినాలనే ఆనవాయితీ ఉండటంతో ఉమ్మడి జిల్లాలోని చేపల మార్కెట్లు సిద్ధం చేశారు. గ్రామాల్లో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగుల్లో చేపలను పట్టి మార్కెట్లకు తరలించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. గ్రామీణప్రాంతాల్లో వాడవాడ తిరుగుతూ వ్యాపారులు చేపలు విక్రయిస్తారు.చేపలకు డిమాండ్మృగశిర రోజు రెట్టింపు ధరలైనా వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. సాధారణ రోజుల కంటే చేపలకు ధరలు విపరీతంగా పెరుగుతాయి. అయినా మత్స్యప్రియులు కొనేందుకు వెనుకాడరు. బొమ్మ చేప ధర సాధారణ రోజుల్లో కిలో రూ.300 ఉండగా మిరుగు రోజు కిలో రూ.600 రెట్టింపు ధర పలుకుతోంది. రవు, బొచ్చె, బంగారు తీగ, మెరుగ, ఆలుగుచేప, జెల్లెలు, పాపర్లు, గ్యాస్ కట్ రకాల చేపలు ఉండగా వీటి ధర సాధారణ రోజుల్లో కిలో రూ.120 ఉండగా మృగశిర రోజు రూ.200 నుంచి రూ.240 వరకు విక్రయిస్తారు.ఆరోగ్యదాయకం ఇంగువ బెల్లంశారీరక ఆరోగ్యం కోసం ఈ కార్తెలో శాఖాహారులు ఇంగువ, బెల్లం తింటారు. ఈ రెంటిని కలిపి చిన్నచిన్న ముద్దలు చేసి పరిగడుపున తింటారు. ఇంగువకు చలువ చేసే శక్తి, బెల్లానికి జీర్ణం చేసే శక్తి ఉంటుంది. విపరీతమైన ఎండలతో తల్లడిల్లిన జనానికి ఒక్కసారి ఋతువు మారడంతో శరీరంలో తలెత్తే రుగ్మతలు దీన్ని తినడంతో నశిస్తాయని పెద్దలు చెబుతుంటారు.ఉచిత చేపమందు పంపిణీదండేపల్లి: మండల కేంద్రంలో మృగశిర కార్తెప్రవేశాన్ని పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నివారణకు గ్రామానికి చెందిన రంగసాయి ప్రేమ్రాజ్–భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మందు పంపిణీ కోసం నిర్వహణ కమిటీ శనివారం జీపీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. చేపమందు కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని చర్చించారు. వివరాలకు 9866885308, 9440707416, 9640376530, 9908401985 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నాట్యమయూరి
నాట్యం నేర్చుకోవడానికి ఇంట్లో అనుమతి మొదలు ప్రతి ఒక్క దశలోనూ పరీక్షలు ఎదురయ్యాయి ఆమెకు. ఆఖరుకు నాట్యం చేస్తుండగానే వేదిక మీద ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వరకు. కాలికి గాయమైందని గజ్జెలను పక్కన పెట్టి కుంగిపోలేదామె. సర్జరీ చేయించుకున్నారు. నడక వరకు ఓకే కానీ క్లాసికల్ డాన్స్ చేయడం కష్టం అని తెలిసిపోయింది. రెండో సర్జరీతో మోకాలి కదలికలు మెరుగయ్యాయి. ఇనుమడించిన ఉత్సాహంతో తిరిగి నాట్యం చేస్తున్నారామె. ఇది మయూరి సినిమా కాదు. ఆమె సుధాచంద్రన్ కాదు. తెలంగాణ, కొత్తగూడెంలో పుట్టి పెరిగిన క్రాంతి నారాయణ జీవితం.‘‘నడవడం వచ్చినప్పటి నుంచి పిచ్చి గంతులేస్తూ ఉండేదాన్ని. నా ఆసక్లిని గమనించిన మా అమ్మ... నాన్నను ఒప్పించి నన్ను డాన్స్ క్లాసులకు పంపించింది. నాట్యప్రదర్శనల కోసం ఇతర ఊర్లకు ఆడపిల్లను పంపించడం ఏమిటంటూ ఏడాదిలోపే అంతరాయం. నాన్నకు హైదరాబాద్కు బదలీ కావడంతో నాలోని నాట్యమయూరికి రెక్కలొచ్చాయి. దాదాపుగా అదే సమయంలో ఒక టీవీ షోలో శోభానాయుడి గారి ఇంటర్వ్యూ చూశాను. వృత్తి– ప్రవృత్తిని సమన్వయం చేసుకోగలిగిన నైపుణ్యం గురించి చక్కగా చె ప్పారామె. నేను వెళ్లగానే ఆమె ‘ఇన్నేళ్ల విరామం తర్వాత ఇక నాట్యసాధన అసాధ్యం’ అనడంతో కళ్లనీళ్లపర్యంతం అయ్యాను. అప్పుడు ఒక వారం రోజులు టెస్ట్ పీరియడ్గా వచ్చి ప్రాక్టీస్ చేయమన్నారు. ఆ పరీక్షలో నెగ్గి ఆమె శిష్యురాలినయ్యాను.ఇంజినీరింగ్– కూచిపూడిఉస్మానియాలో ఇంజినీరింగ్ చేస్తూ కాలేజ్ నుంచి నేరుగా డాన్స్ క్లాసులకు వెళ్లేదాన్ని. ఎంబీఏ కూడా అలాగే చేశాను. మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉద్యోగం చేస్తూ కూడా డాన్స్ ప్రాక్టీస్ కంటిన్యూ చేశాను. ఆ సమయంలో మరో పరీక్ష ముంబయికి ట్రాన్స్ఫర్. నాన్న హైదరాబాద్ బదలీ నాకు డాన్స్ ప్రాక్టీస్కి అవకాశం ఇచ్చింది. నా ముంబయి బదలీ డాన్స్ కోసం ఉద్యోగం వదులుకునేటట్లు చేసింది. నాట్యానికే అంకితం కావాలనుకుని ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి వెళ్లి మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేశాను.డాన్స్ను గౌరవించే వ్యక్తినే...నా జీవితంలో నాట్యానికి ఉన్న ప్రముఖ స్థానానికి అద్దం పట్టేది నా పెళ్లి చూపులే. పెళ్లి తర్వాత నాట్యసాధన మానేయాలన్న వాళ్లను వద్దని, డాన్్సను గౌరవించే వ్యక్తినే నా జీవితంలోకి స్వాగతించాను. ఇప్పుడు చెప్పండి... కాలికి గాయమైందని నాట్యసాధన మానేయగలనా? నాట్యం ఆగిపోతే నాకు శ్వాస ఆగిపోయినట్లే. కరోనా విరామ సమయాన్ని మా గురువుగారి నాట్యరీతుల మీద ఎం.ఫిల్ చేయడానికి ఉపయోగించుకున్నా’’నని చె ప్పారు క్రాంతి నారాయణ. ఐదు వందలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఆ మధురానుభూతులివన్నీ అంటూ గది నిండుగా ఉన్న జ్ఞాపికలను చూపించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈ వారం కథ: దృశ్యమాలిక
గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న ఆవిడ నాకు అమ్మ మాత్రమే కాదు; స్నేహితురాలూ, గురువూ, దైవం అన్నీనూ! భర్తతోనూ, పిల్లలతోనూ, స్నేహితురాళ్ళతోనూ, మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలని అమ్మతో పంచుకుంటుండే నాకు ఏ ఒక్కరోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా వుండేది. నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపు గంటసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను. అలాంటిది తెల్లవారు జాముకల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందన్న దుర్వార్తని వినవలసి వస్తుందని నేను కలలోనైనా ఊహించలేదు. ‘జాతస్య మరణం ధ్రువం’ అని తెలిసినా, నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ‘చదువుకో తల్లీ నీకు సౌఖ్యమబ్బేను, ఆడుకోవమ్మా నీకు హాయి కలిగేను’ అంటూ అమ్మ చల్లని గొంతుతో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే వుంది.‘చిన్నా, చిన్నా’ అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. ఒకటా, రెండా– ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు. నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి. ‘అమ్మా, చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు’ అని చెప్పగానే, ‘ఎవరమ్మా నా చిట్టితల్లిని కొట్టిందీ, హన్నా’ అంటూ నా తరఫున వకాల్తా పుచ్చుకొని, అన్నయ్యకి రెండు అంటించి మురిపెంగా నన్ను ఎత్తుకుని ముద్దాడిన అమ్మ! ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకి ముందురోజున ‘నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదు, ఫెయిలయిపోతాను’ అంటూ అమ్మ ఒళ్లో తల పెట్టుకుని భోరుమని ఏడుస్తుంటే, ‘ఊరుకో చిన్నా, ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో’ అంటూ తన ఒళ్లో నన్ను నిద్రబుచ్చి, రెండుగంటల తర్వాత ‘చిన్నా, ఇంక మేలుకోమ్మా’ అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపూ నాతో పాటే తనూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా, ఆ మరుసటి రోజు నన్ను వెంటబెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి, నేను పరీక్ష రాసి బైటకి వచ్చేదాకా కాలేజీ గేటు పక్కనే నా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలుచున్న అమ్మ!సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున ‘అమ్మా బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో’ అని నేను భయపడుతుంటే, ‘ఏడాది పాటు ఒకే లక్ష్యంగా, అకుంఠిత దీక్షలా, అహర్నిశలూ చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్కా? అంతా సవ్యంగానే జరుగుతుంది, ధైర్యంగా వుండమ్మా’ అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ! ఐఏఎస్కి సెలక్టయి ట్రైనింగ్కి వెళ్ళాక ‘అమ్మా, ఇక్కడ అంతా నార్త్ ఇండియన్సే వున్నారు. వాళ్ళతో నేను కలవలేక పోతున్నాను. హాస్టల్లో భోజనం కూడా అస్సలు బావుండడం లేదు. పుల్కాలు, మసాలా కూరలూ తినలేక పోతున్నాను’ అంటూ ఫోన్లో నా కష్టాలని ఏకరువు పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ, మాగాయ జాడీలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేసి, నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా నాకు వండి పెడుతూ, నా దగ్గరే ఉండిపోయి, వచ్చీరాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్లకి మన వంటలనీ, ఆప్యాయతనీ రుచి చూపిస్తూ మెల్లిమెల్లిగా వాళ్లందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ! ‘అమ్మా, ఎప్పుడూ నా తోడూనీడగా ఉండేదానివి. ఇలా ఉన్నట్టుండి నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? లేమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా’ అంటూ పెద్దగా ఏడ్చేస్తున్నాను.∙∙ ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ పిల్లలు గట్టిగా కుదుపుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.ఎదురుగా చేతిలో పుష్పగుచ్ఛం పట్టుకుని మా పిల్లలు మన్వి, తన్వి.‘ఏమిటి సిరీ, అత్తయ్యగారుగాని మళ్ళా కలలోకి వచ్చారా?’ అన్న మావారి మాటలకు అవునన్నట్టుగా తలుపాను.పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో పుష్పగుచ్ఛం పెట్టి ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటుంటే వాళ్లవైపు నిరాసక్తంగా చూశాను. దాంతో పిల్లల్లోని ఉత్సాహం అంతా నీరు కారిపోవడం గమనించిన మా వారు వెంటనే ‘మీరు వెళ్లి హాల్లో ఏర్పాట్లు చేస్తుండండి. నేను అమ్మని తీసుకొస్తాను’ అని చెప్పి వాళ్ళని పంపించారు.‘అలాగే డాడీ’ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ‘ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండీ’ అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి, ‘అత్తయ్యగారు పోయి ఇంతకాలమైనా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా సిరీ? రోజుల తరబడి నువ్విలా నిస్తేజంగా ఉంటుంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగ పడుతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు?’ అన్న ఆయన మాటలకి నాలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది.‘అదేమిటండీ, అలా మాట్లాడతారు? పోయింది ఎవరో దూరపు బంధువు కాదు, మా అమ్మ. ఆవిడతో నాకున్న అనుబంధం తెలిసీ మీరిలా...’ అంటుంటేనే నా గొంతు గద్గదమైంది.అది చూసి మా వారు తగ్గిపోయారు.‘నిన్ను బాధపెట్టాలని కాదు సిరీ. నిజమే, తల్లి లేని లోటు ఎవరూ తీర్చేది కాదు. అలాగని నీ విధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా! నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది. నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి, నాకు భార్యవి’ అన్నారు.‘మీకు చేయవలసిన వాటిలో నేను ఏ విధమైన లోటు చేశానండీ? మనసులో బాధ పొంగి పొర్లుతున్నా వేళకి అందరికీ అన్నీ అందిస్తూనే ఉన్నానుగా’ ఉక్రోషంగా అన్నాను.‘నిజమే, అన్నీ చేస్తూనే ఉన్నావు. కాని, ఇలా మొహంలో కళాకాంతులు లేకుండా, జీవితంలో సర్వం కోల్పోయినదానికి మల్లే తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా, మొహాలు వేళ్ళాడేసుకుని వుంటున్నారు. వాళ్ళల్లో హుషారు రోజురోజుకీ తగ్గిపోతుందన్న విషయం నువ్వు గమనించావా? అయినా పుట్టినరోజు పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దుగాని, నీకోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నారు సిరీ. నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు. నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు, పద’ అంటూ హాల్లోకి తీసుకెళ్లారాయన.అక్కడ టేబుల్పైన అందంగా అలంకరించిన కేకు, క్యాండిల్స్, ఇంకా రకరకాల గిఫ్టులు.వాటిని చూసిన నా మొహం విప్పారలేదు. ఎందుకంటే, పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే! నెలరోజుల ముందునుండే పిల్లలకి ఫోన్ చేసి, ‘పిల్లలూ, ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారూ, అమ్మకి ఏం బహుమతులిస్తున్నారూ’ అంటూ హడావిడి చేస్తూండేది అమ్మ! ఇంక ఆరోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి, ‘చిన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా ఆయుష్షు కూడా పోసుకుని పదికాలాల పాటు చల్లగా ఉండు చిట్టితల్లీ’ అంటూ ఆశీర్వదించేది. అలాంటి అమ్మ లేని పుట్టినరోజు పండుగా, ఒక పండుగేనా ! అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవడం నాకేమాత్రం ఇష్టం లేకున్నా, ఆయన చెప్పినట్టుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేకు కట్ చేసి పిల్లలకీ, ఆయనకీ నా చేత్తో తినిపించాక, నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతుంటే, ‘ఉండమ్మా, అసలైన సర్ప్రైజ్ పైనుంది, రా’ అంటూ పిల్లలిద్దరూ నా చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లారు. మాది రెండంతస్తుల మేడ. పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లూ, సినిమాలూ చూసే హోమ్ థియేటర్ ఉంది.అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అబ్బురంగా చూస్తుండిపోయాను.‘చిన్నా, ఎలా ఉన్నావురా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిండునూరేళ్లు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష’ అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్ళు తొక్కింది.శివసాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుని ఎలా మాట్లాడగలుగుతోందో అర్థంకాక నేను తెల్ల మొహం వేస్తే, పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ, ‘ఇంకా ఉంది చూడమ్మా’ అన్నారు.దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధురస్మృతులని పొందుపరచిన ఎన్నో ఫొటోలు, మేమిద్దరం కలిసి వెళ్లిన టూర్లలో, ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు, అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంతో చెబుతున్న కబుర్లూ!అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది. ఇన్నాళ్ళుగా నా హృదయాన్ని కలచివేస్తున్న బాధంతా ఒక్కచేత్తో తీసేసినట్టుగా బుగ్గలపై నుండి జాలువారుతున్న అశ్రువులను తుడుచుకుంటూ ‘ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ?’ అని నేను అడుగుతుంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి, ‘దాదాపు నెలరోజుల పైనుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోని తయారు చేశారు. ఇప్పుడొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా త్రీ డీ టెక్నాలజీ సాయంతో అత్తయ్యగారు నీ ఎదురుగా నిలబడి, నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగులు, స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారుచేశారు. ఇదంతా కూడా నిన్ను ఆనందపెట్టాలన్న తపనతో చేశారు వాళ్ళు. అలాంటిది, నువ్విలా ఏడుస్తుంటే ఎలా చెప్పు?’ అంటూ తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచారు.‘ఇవి కన్నీళ్ళు కావండీ, ఆనందభాష్పాలు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళేగా వచ్చేది’ అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవడం ఆలస్యం, మొహాలు చాటంత చేసుకుని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ.వాళ్ళ నుదుటిన ముద్దాడుతూ, ‘థాంక్యూ సో మచ్ బుజ్జి కన్నలూ. మీ అమ్మమ్మకి తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు’ అన్నాను.నా మాటలకి వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోగా ‘అక్కా, ఎన్ని రోజులయింది కదా అమ్మ మనల్ని ఇలా ‘బుజ్జికన్నలూ’ అని పిలిచి’ అన్న మన్వి మాటలకి ‘అవును తన్వీ, ఇంకా కొన్నాళ్ళయితే మనం ఆ పిలుపే మర్చిపోయేవాళ్ళమేమో’ అంది తన్వి.ఆ మాటలు వింటుంటే ‘అయ్యో, నా నిరుత్సాహంతో పిల్లలని నేను ఇంత బాధపెట్టానా’ అనిపించింది. అదే మాట మా వారితో అనగానే, ఆయన వెంటనే ‘తల్లి పోతే బాధ ఉండడం సహజమే సిరీ. అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురివి కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావాల్సి వచ్చింది, అది నేను అర్థం చేసుకోగలను. నిజానికి, మనుషులు చనిపోవడం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవడం. అంతే! వాళ్లతో మనకున్న అనుబంధమూ, వారి జ్ఞాపకాలూ ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి, వాటికి మరణం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ మధురస్మృతులని నెమరేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ, వాటిని తరగని ఆస్తిగా మలచుకుని రాబోయే తరాలకి అందివ్వాలే తప్ప, వాళ్ళు మన మధ్యన లేరన్న విషయాన్ని అదేపనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు’ అన్నారు.ఆయన చెబుతున్నదాన్ని శ్రద్ధగా వింటున్న నాకు, ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం వున్నట్టనిపించింది.∙∙ ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కీ, ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికీ వెళ్ళాక అమ్మతో కలిసి దిగిన ఫొటోలున్న ఆల్బమ్స్ అన్నింటినీ మంచంపై పరచుకుని తీరిగ్గా ఒక్కో ఫొటో తిరగేయసాగాను. ప్రతి ఫొటో వెనకా మరచిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ‘ఈ స్మృతులన్నింటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా వుంటాయి కదా’ అన్న ఆలోచన తళుక్కుమనగానే వెంటనే లేచి అల్మారాలో వున్న డిజిటల్ కెమెరాని బయటకి తీశాను.ఒక్కో ఫొటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫొటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కటి మాటల్లో నాకు తోచినట్టుగా అర్థవంతంగా వివరించడం మొదలెట్టాను. అలా చేస్తూ ఎంతసేపున్నానో తెలియదు.కాలింగ్ బెల్ మోగడంతో లేచొచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి !‘అప్పుడే స్కూల్ అయిపోయిందా’ అంటూ గోడగడియారం వైపు చూసి, ‘అమ్మో, సాయంత్రం నాలుగు గంటలు దాటింది. పనిలో పడి టైం చూసుకోలేదు. మీకోసం నేనింకా టిఫిన్ కూడా తయారు చేయలేదు’ అని నేను కంగారుపడుతుంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకుని రావడం కనిపించింది.దాంతో ‘కాళ్ళూ చేతులూ కడుక్కురండి. ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను’ అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను.ఫ్రిజ్లో నుంచి దోసెపిండిని బయటకి తీసి, ఉల్లిపాయలూ, పచ్చి మిరపకాయలూ సన్నగా తరిగి కలిపి వాటితో వేడి వేడిగా పొంగనాలు వేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకోచ్చేటప్పటికి అక్కడ నేను పరిచిన ఫొటోలని తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు.నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్లు అందుకుంటూ ‘అమ్మా, ఈ ఫొటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా, సన్నగా వుందో! అన్నట్టు, కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఫొటోలని డిజిటలైజ్ చేస్తున్నావా?’ అని అడిగిన పిల్లలకి నేనేం చేస్తున్నదీ వివరించాను.‘నువ్వు బ్యాక్ గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించేకంటే, నువ్వు కూడా ఫొటో పక్కనే కనిపిస్తుంటే బాగుంటుంది కదమ్మా! ఫొటోని చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తాను’ అంది ఫొటోగ్రఫీ మీద మక్కువున్న నా చిన్నకూతురు మన్వి.‘మన్వి చెప్పింది బావుందమ్మా. ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేశావంటే నేను దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను’ అంది ఇంజినీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి. ఆ వెంటనే ‘నేను ఎలాగో నెలరోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఈ వీడియోలని చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్లుగా ఉంటుంది’ అని కూడా అంది.దాని మాటలకి ఆలోచనలో పడ్డాను.‘పిచ్చిపిల్ల, ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటోంది, అదే ఆ తర్వాత, మా అమ్మలాగే నేనూ ఈ లోకాన్ని వీడిపోయాక? ఎప్పుడోకప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసిన దాన్నేగా! ఎవరి ఆయుష్షు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు?’నా మనసు పరిపరివిధాలు పోసాగింది.‘తన్వి మనసు చాలా సున్నితం. చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది. నేను ఎప్పుడైనా ఆఫీసు పనిపై ఊరు వెళ్ళవలసి వస్తే నాలుగురోజుల ముందునుండే దిగులు పడుతుండేది. ఇంజనీరింగులో చేరి సంవత్సరంన్నర దాటినా ఇంకా దానికి హోం సిక్నెస్ పోలేదు. సెలవులకి ఇక్కడి వచ్చీ తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా అయిష్టంగా హాస్టల్కి వెళ్తుంది. ఇంక మన్వికైతే ఇంకా చిన్నతనం పోలేదు. పసిపిల్లకి మల్లే మారాం చేస్తుంటుంది నా దగ్గరా, వాళ్ళ అక్క దగ్గరా! నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే, ఆ బాధని తట్టుకోగలరా? మా అమ్మని తలచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా, మరి నేను వెళ్లిపోయాక నా పిల్లలూ నాలాగే నా గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో! అమ్మో, అలా అస్సలు కాకూడదు’అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది .‘నేను పోయాక, ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకుగానూ వాళ్ళతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా, భవిష్యత్తులో వాళ్లకి ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేను ఇచ్చే సలహాలనీ, సూచనలనీ నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే, అవి పిల్లలకి సాంత్వనని కలిగించడమే కాకుండా ముందుముందు వాళ్లకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి.’అలా అనుకున్నాక నా మనసు కాస్త ఊరటపడింది. ∙∙ ఆ రాత్రి నా ఆలోచనని ఆయన ముందుంచుతూ ‘యాభైఏళ్లకే నేనిలా ఆలోచించడం అశుభం అంటారా? నా ఆలోచనా విధానంలో లోపం ఉందంటారా, నేను నెగటివ్గా ఆలోచిస్తున్నానంటారా?’ అని అడిగాను.‘అదేం లేదు సిరీ. జీవితం క్షణభంగురం. ఎవరికైనా సరే నుదుటిన రాసిపెట్టి ఉన్నంత కాలమే ఈ పృథ్విపై స్థానం ఉంటుంది. పోయిన వాళ్లతో కలిసి మనమూ పోలేము కాబట్టి వాళ్ళతో పంచుకున్న అనుభూతులని పదిలపరుచుకోవడమూ, అలాగే మనమూ ఎల్లకాలమూ ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి వున్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరుచుకోవడమూ చక్కటి ఆలోచనే. కాబట్టి మనసులో ఏ శంకలూ పెట్టుకోకుండా గో ఎహెడ్. అలాగే నువ్వు కూడా ఇంక ఆఫీసుకి వెళ్ళడం మొదలెడితే కాస్త త్వరగా మనుషులలో పడతావు. నీ చదువు, ఉద్యోగం వెనకాల అత్తయ్యగారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదనీ, ఆవిడే లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయే దానివనీ నాతో నువ్వే చాలాసార్లు చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తిసామర్థ్యాలని కుదించేసుకుని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ సెలవుని రద్దు చేసుకుని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేందుకు ప్రయత్నం చేయి సిరీ’ ఆయన మాటలతో నా ఆలోచనకి బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది..∙∙ ఆ మరుసటి సోమవారమే ఆఫీసులో చేరిపోయాను. ఇంక అప్పటి నుంచి తీరిక సమయాల్లో అమ్మతో, పిల్లలతో ఇంకా మావారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ , మా అమ్మ జ్ఞాపకాలకి ప్రాణం పోస్తూ ఆవిడ ఈలోకంలో లేదన్న బాధనుంచి మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలెట్టాను. దాంతో, మావారూ హ్యాపీ, పిల్లలూ హ్యాపీ, వెరసి కుటుంబమంతా హ్యాపీ. కాలం అన్ని గాయాలనీ మాన్పుతుంది. నిజమే కాని, దానికి మనవంతు కృషి మనమూ జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ! -
కొండవీడు కత్తుల బావి
పర్యాటక ప్రాంతాల్లో అలనాటి రాజుల కోటలు ముందు వరుసలో ఉంటాయి. వాటి చరిత్ర, శిల్పకళ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశంలో అనేక కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి, చరిత్ర ప్రేమికులను, సాహస యాత్రికులను, సాధారణ పర్యాటకులను కూడా అలరిస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ కొండవీడు కోట.ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కోటల్లో ఒకటి. కోటకు వెళ్లేమార్గం, పాములా వంకర్లు తిరిగిన ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఉత్సాహభరితంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకంగా కొండవీడు నూతన శోభను సంతరించుకుంటోంది. ఒకప్పటి ఈ అద్భుత నిర్మాణం నేడు శిథిలావస్థకు చేరింది. అయినా ఆనాటి కట్టడాలు, ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో కొండవీటి కొండపై ఉంటుందీ కోట. రెడ్డి రాజుల్లో మొదటి వాడైన ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం అతని కుమారుడు అనపోతారెడ్డి రాజయ్యాక, అద్దంకి నుంచి రాజధానిని కొండవీడుకు మార్చాడు. శత్రుమూకల దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఈ కోటను నిర్మించాడు.2010లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రుచీ సింగ్, హిస్టరీ ప్రొఫెసర్ కేవీ రావులు కొండవీడును సందర్శించారు. అదే సమయంలో శివాలయం గర్భగుడి కింద బౌద్ధ చైత్యం వెలుగు చూసింది. శాతవాహనుల కాలంలోనే కొండవీడు బౌద్ధక్షేత్రంగా విరాజిల్లిందని చరిత్ర చెబుతోంది.ఆ బురుజులే కాపలాకేంద్రాలు కొండవీడు దుర్గంలో 72 కోట బురుజులతో పాటు ప్రాకారాలు, ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, మసీదు, ఖజానా వంటి నిర్మాణాలు నాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. తారా బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజులు వీటిలో ప్రత్యేకమైనవి. ఈ బురుజులే నాటి సైనికుల కాపలా కేంద్రాలుగా ఉండేవి. శత్రువులు కొండ వరకు రాకుండా కొండల దిగువ చుట్టూ కందకాలను వెడల్పుగా తవ్వి, ఆ నీటిలో మొసళ్లను వదిలారు.నీటి సమస్య రాకుండా..కోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు జరపగా రెండువేల ఏళ్లనాటి బౌద్ధస్థూపం, మట్టిపాత్రలు, చైనాకు సంబంధించిన పింగాణీ పాత్రల ముక్కలు బయటపడ్డాయి. నీటి అవసరాల కోసం కొండమీద ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల అనే మూడు గొలుసుకట్టు చెరువులు తవ్వారు. ఈ మూడూ సుమారు 12 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ మూడూ పూర్తిగా నిండితే కొండలమీదుగా కింది ప్రాంతాల్లోకి ప్రవహించి అక్కడి చెరువులు నిండేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ నేటి తరానికి ఆదర్శప్రాయం.కత్తుల బావి నేపథ్యమిదీ!కొండవీడు కోట పేరు ప్రస్తావించగానే ముందుగా గుర్తుకొచ్చేది కత్తుల బావి. దీని వెనుక ఓ పెద్ద కథే వినిపిస్తుంది. ఆనాటి రెడ్డిరాజ్యంలోని 72 మంది సామంత రాజులను మట్టుబెట్టేందుకు ఓ బ్రాహ్మణుడు ఈ ఆలయం నిర్మించాడని ప్రతీతి. గర్భగుడి చెంతనే ఓ బావిని తవ్వించి, అందులో కత్తులు దాచి, సామంతరాజులను విందుకు ఆహ్వానించారని, బాలకృష్ణుని ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన సామంత రాజులంతా హత్యకు గురయ్యారని ఓ కథ ప్రచారంలో ఉంది. అలా ఆ బావిలో కత్తులు దాచినందువల్ల కత్తుల బావిగానూ, ఆ ప్రాంతం చీకటిగా ఉన్నందున చీకటి కోనేరుగానూ పేరొచ్చింది.విజయానికి చిహ్నంఈ ఆలయానికి అభిముఖంగా 45 అడుగుల ఎత్తులో ఏకశిలా విజయస్థూపం ఉంది. విజయనగర రాజులు కొండవీడును హస్తగతం చేసుకున్న విజయానికి సూచికగా ఈ ఏకశిలా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డిరాజుల పతనానంతరం కోట విజయనగర ప్రభువుల పరమైంది. అనంతరం గోల్కొండ సుల్తానుల చేతుల్లోకి వెళ్లింది.యునెస్కో గుర్తింపు లభిస్తే!2016లో తొలిసారిగా కొండవీడును చారిత్రక ప్రదేశంగా గుర్తించి, యునెస్కో జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై సమగ్రంగా పరిశీలించి నివేదిక పంపించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొండవీడు సమగ్ర స్వరూపాన్ని వివరించే బ్లూప్రింట్ పనులు నిర్వహించేందుకు హైదరాబాద్లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్కిల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక దీన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడ జాబితాలో చేర్చితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కట్టడాలకు పునరుజ్జీవం లభిస్తుంది. కోట పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధికి నోచుకుంటాయి. -
దొంగను పట్టుకుంటే ఘోరం వెలుగులోకి
సాధారణంగా పోలీసులు ఓ దొంగని పట్టుకుని విచారిస్తే ఏమవుతుంది? అప్పటి వరకు అతడు చేసిన చోరీల చిట్టా బయటకు వస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఆ చోరుడితో పాటు అతడికి తెలిసిన దొంగల జాబితాలు బహిర్గతం అవుతాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం పోయిన సొత్తు, సొమ్ముకు సంబంధించి యజమానులు తమ ఫిర్యాదుల్లో చెప్పిన తప్పుడు లెక్కలు తెలుస్తుంటాయి. 2002లో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని షాహినాయత్గంజ్ పోలీసులు సాజిద్ అనే ఘరానా దొంగను పట్టుకున్నారు. ఇతడి విచారణలో కుందన్బాగ్ ప్రాంతంలో జరిగిన తల్లీ, ఇద్దరు కూతుళ్ల సామూహిక ఆత్మహత్య విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయప్రదకు హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారవేత్తతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగిన తరవాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగా, జయప్రద తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుందన్బాగ్లోని రెండంతస్తుల సొంత భవనంలో నివసించేది. కొన్నాళ్ల పాటు కుమార్తెలు తమ చదువుల కోసం కాలేజీలకు వెళ్లివెళ్లేవారు. కానీ, హఠాత్తుగా మానేశారు. తల్లితో పాటు ఇంట్లోనే ఉండిపోయారు. బయట నుంచి అందంగా కనిపించే ఆ భవంతి ప్రాంగణం మాత్రం పట్టించుకునే వాడు లేకపోవడంతో పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయింది. పోర్టికోలో మాత్రం ఎప్పుడూ ఓ కారు ఆగి ఉండేది. తాను బయటకు వచ్చి పరిచయస్తులతో సంప్రదింపులు జరిపినా, ఇరుగుపొరుగు వారితో మాట్లాడినా తన గతం ప్రస్తావన వస్తుందనే ఉద్దేశంతో జయప్రద బాహ్యప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. అదే భావనతో తన పిల్లల్నీ ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసింది. ఫలితంగా ఈ కుటుంబానికి చుట్టుపక్కల వారితో పరిచయాలు, స్నేహాలు లేకుండా పోయాయి. ఈ ఇంటికి రాకపోకలు సాగించే వారు కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట గడప దాటని ఈ కుటుంబం అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళ మాత్రం బయటకు వచ్చి క్యాండిల్ వెలుగులో ఇంటి చుట్టూ సంచరిస్తుండేవారు. అలా వాళ్లు ఎందుకు చేస్తున్నారనే దానిపై స్థానికులు కొన్నాళ్లు ఆరా తీసినా విషయం తెలియలేదు. దీంతో కొందరు వీరి విషయం పట్టించుకోవడం మానేశారు. మరికొందరు భయంతో జయప్రద కుటుంబానికి, ఆ ఇంటికి దూరంగా ఉండిపోయారు. మిస్టరీగా మెలిగే ఈ కుంటుంబం అన్ని చెల్లింపులు ముందస్తుగానే చేసేది. కరెంట్ బిల్ ఏకంగా రెండుమూడేళ్లకు అడ్వాన్స్ కట్టేసేది. పాలు పోసే వ్యక్తికి, పేపర్ బాయ్కి దాదాపు ఏడాదికి సరిపడ డబ్బు ముందే ఇచ్చేది. ఏడాదికి అవసరమైన సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకునేది. ఎవ్వరి కంటా పడకూడదనే ఉద్దేశంతో ఇంటికి సమీపంలో ఉన్న చెత్తడబ్బా దగ్గరకీ తమ కారులో వెళ్లి చెత్తను పడేసి వచ్చేది. ఎవరికీ పట్టని, ఎవరినీ పట్టించుకోని ఈ కుటుంబంతో సమీపంలో ఉండే ఓ కాలేజీ విద్యార్థులు మాత్రం ఓ సందర్భంలో ఘర్షణపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచానికి దూరంగా జయప్రద కుటుంబం నివసిస్తున్న ఈ ఇంట్లో 2002 జూన్ నెల నుంచి నిశ్శబ్దం నెలకొంది. అయినా ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పట్టించుకుని పోలీసులకు సమాచారం అందించలేదు.షాహినాయత్ గంజ్ పోలీసులు అదే ఏడాది సెప్టెంబర్ 15న ఇళ్లల్లో దొంగతనాలు చేసే ఘరానా దొంగ మహ్మద్ సాజిద్ను పట్టుకున్నారు. ఇతడి విచారణలో అనేక నేరాలు వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటే లోకం చూడని సామూహిక ఆత్మహత్యల సమాచారమూ వెల్లడైంది. కుందన్బాగ్లోని ఓ బంగ్లాలో తాను చోరీకి వెళ్లానని, ఆ ఇంటి ప్రధాన ద్వారం లోపలి నుంచి తాళం వేసి ఉండగా, పక్క ఉన్న మరో తలుపు తీసి ఉండటంతో లోపలకు ప్రవేశించానని చెప్పాడు. ఆ ఇంట్లోని బెడ్రూమ్లో మంచంపై ముగ్గురు మహిళల మృతదేహాలు పడి ఉన్నాయని, దీంతో తొలుత కాస్త భయపడినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పదేపదే ఆ ఇంట్లోకి వెళ్లి వస్తూ అందినకాడికి సొత్తు ఎత్తుకుపోయానని బయటపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న షాహినాయత్గంజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుందన్బాగ్ ప్రాంతం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆ అధికారులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి చోరుడిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అతగాడు వరుస చోరీలు చేసిన ఇంటిని చూపించమని కోరారు. సాజిద్ నేరుగా తీసుకువెళ్లి జయప్రద ఇంటిని చూపించాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో, బెడ్రూమ్లో మంచంపై ఉన్న మూడు మృతదేహాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వరండాలో గుట్టగా పడి ఉన్న వార్తాపత్రికలను సేకరించి పరిశీలించారు. అవి ఆ ఏడాది జూన్ 21 తేదీ నుంచి ఆ రోజు వరకు (సెప్టెంబర్ 15) సంబంధించినవిగా తేలడంతో 2002 జూన్ 20 రాత్రి ఈ ఆత్మహత్యలు జరిగినట్లు అంచనా వేశారు. ఆ గదిలో దొరికిన గుర్తుతెలియని విషం ఫినాయిల్గా తేలింది. మృతదేహాలకు సమీపంలోనే ఫినాయిల్ బాటిల్ సైతం పోలీసులకు లభించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుందన్బాగ్తో పాటు హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సామూహిక ఆత్మహత్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. -శ్రీరంగం కామేష్ -
అన్వేషణ
మృగరాజు సింహం చిట్టికూన గుహ ముందు ఆడుకుంటూ తప్పిపోయింది.మధ్యాహ్నం బయటకి వెళ్లి ఇంటికి రాలేదు. చిట్టికూన బుల్లి ఎలుగు, గున్న ఏనుగుతో ఆడుకునేది. మృగరాజు వాటిని పిలిచి విచారించాడు. ‘రాజా! ఇప్పటి వరకు ఇక్కడే కలిసి ఆడుకున్నాం!’ అంది బుల్లి ఎలుగు. ‘చెరువుకు వెళ్లి నీళ్లు తాగి ఎవరింటికి వాళ్లం వెళ్లాం!’ అంది గున్న ఏనుగు. మృగరాజు వెంటనే చెరువుకు వెళ్లి వెతికాడు. కాని, చిట్టికూన కనిపించలేదు.మృగరాజు వద్ద ఎంతోకాలంగా కొంగ, గుడ్లగూబలు గూఢచారులుగా కొలువు చేస్తున్నాయి.అవి అడవంతా తిరుగుతూ మృగరాజుకు రహస్య సమాచారాలు అందించేవి. మృగరాజు వెంటనే కొంగ, గుడ్లగూబలను పిలిపించాడు. మృగరాజు చెప్పేది వింటూనే కొంగ తన పొడవాటి మెడను నలుదిక్కులా తిప్పి పరిశీలించింది. వెంటనే ఎగిరి చెరువుకు పోయింది. చెరువు నుంచి గుహకు వస్తూ మర్రిచెట్టు దగ్గర ఆగింది.తన పదునైన నేత్రాలతో చుట్టూ పరికించి చూసింది. ఒక్క క్షణం ఆలోచించి వెంటనే గుహకు వచ్చి ‘ప్రభూ! చిట్టికూన తప్పిపోలేదు. ఎవరో ఎత్తుకు పోయారు!’ అంది కొంగ. ‘ఎత్తుకు పోయారా?’ లేచి నిలుచుంది సింహం.‘వేగులుగా మా ప్రతిభ మీకు తెలియంది కాదు. చిట్టికూన జాడ చిటికెలో కనిపెడతాం! మీరు నిశ్చింతగా ఉండండి!’ అంటూ గుడ్లగూబతో కలిసి గాలిలోకి ఎగిరింది కొంగ.అవి రెండూ వెళ్లి మర్రిచెట్టు మీద వాలాయి. ‘మిత్రమా! చిట్టికూనను నక్క ఎత్తుకుపోయి ఉండవచ్చు. నక్క పాద ముద్రలు మృగరాజు గుహ చుట్టుపక్కల కనిపించాయి. నాకు అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లాను. అవే పాదముద్రలు చెరువు దగ్గర కనిపించాయి. ఇక చిట్టికూన పాదముద్రలు, నక్క పాదముద్రలు పక్కపక్కనే ఈ మర్రిచెట్టు వరకే ఉన్నాయి. మర్రిచెట్టు దగ్గర చిట్టికూన పాదముద్రలు మాయమయ్యాయి. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా కేవలం నక్క పాదముద్రలు ఉన్నాయి!’ పాదముద్రలు చూపిస్తూ వివరించింది కొంగ. పాదముద్రల వైపు పెద్ద పెద్ద కళ్లతో పరిశీలనగా చూసి చదునైన గుండ్రని తలను ఊపింది గుడ్లగూబ.‘మిత్రమా! చీకటి పడింది. నేను చీకట్లో ప్రయాణించలేను. చీకట్లో నీ దృష్టి, వినికిడి శక్తి అసాధారణం. ప్రత్యేకమైన నీ ఈకలతో నిశ్శబ్దంగా ఎగరగలవు. పాదముద్రల వెంట నక్క ఇంటికి వెళ్లి తనఖీ చేసిరా! పో..!’ అని పంపింది కొంగ.పాదముద్రలు పట్టుకొని నక్క గుహ దగ్గరకు చేరింది గుడ్లగూబ. గుహ బయట చిట్టికూన మల మూత్రాలను గమనించింది.గుహ లోపల గుర్రు పెట్టి నిద్రపోతుంది నక్క పక్కనే కట్టేసిన చిట్టికూన కనిపించింది.ఇంతలో తెల్లారింది. గుడ్లగూబను వెతుక్కుంటూ. మృగరాజు వెంట కొంగ రానే వచ్చింది. ‘రాజా! పక్క అడవి పులిరాజు చిట్టికూనను తెచ్చి ఇస్తే ఆ అడవికి మంత్రిని చేస్తానంటే ఆశతో ఎత్తుకొచ్చాను! నన్ను చంపొద్దు! మన్నించండి!’ అని కాళ్లు పట్టుకుంది. మృగరాజు నక్కకు అడవి బహిష్కరణ శిక్ష విధించాడు. వేగులైన కొంగ, గుడ్లగూబలు వేగంగా అన్వేషించి చిట్టికూనను కాపాడినందుకు అభినందించాడు మృగరాజు.-భార్గవి -
ఏమేమి తినచ్చు?
నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. ఇంట్లో చాలామంది రకరకాల ఆహారపదార్థాలు తినొద్దు, బిడ్డకు సమస్య అవుతుంది అని అంటున్నారు? ఏ విధమైన ఆహారం, మందులు పాలిచ్చే తల్లులకు సురక్షితమో చెప్పండి? – దేశీత, అమరావతి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న తల్లులు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పత్యం ఉండాల్సిన అవసరం లేదు. కాని, మరీ ఎక్కువ పరిమితిలో ఆహారం తీసుకోకూడదు. డైట్లో మాంసం, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, పండ్లు, గింజలూ ఉండాలి. సమతుల ఆహారం అవసరం. కొన్ని చేపల్లో ఎక్కువగా పాదరసం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. ఆల్కహాల్ వద్దు. కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోవద్దు. టీ, కాఫీ, చాకొలేట్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కోల్డ్ అండ్ ఫ్లూ మెడిసిన్స్ వాడకూడదు. ఎక్కువ కాఫీ తాగితే బేబీకి నిద్ర సమస్యలు వస్తాయి. మీకు టీ, కాఫీ అలవాట్లు ఉంటే డీకెఫీనేటెడ్ కాఫీ, టీ తాగొచ్చు. లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకోవచ్చు. జలుబు, దగ్గు వస్తే యాంటీబయోటిక్స్ బదులు సింపుల్ కాఫ్ సిరప్ వాడాలి. మలబద్దకానికి హై ఫైబర్ డైట్ అవసరం. ఇందుకు లాక్టులోజ్ సిరప్ వాడొచ్చు. పైల్స్ ఉంటే ఆయింట్మెంట్స్ లేదా సపోజిటరీస్ వాడొచ్చు. తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి లేదా పారాసెటమాల్ టాబ్లెట్స్ వాడొచ్చు.నాకు డెలివరీ అయి ఒకనెల అవుతుంది. నెల తర్వాత మళ్లీ చెకప్ కోసం రమ్మన్నారు. కాని, నేను మా ఊరిలో ఉన్నాను. ఈ సమయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? – జాగృతి, శ్రీకాకుళం. డెలివరీ తరువాత రెండు నెలలు లేదా ఆరు వారాల్లో గైనకాలజిస్ట్ని తప్పనిసరిగా కలవాలి. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా ఆరు వారాల్లో శరీరం కోలుకుంటుంది. బేబీకి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాలి. కుట్లు వేసిన చోట హీలింగ్ ఎలా ఉందో, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉందో, యూటిరస్ సైజు తగ్గిందో లేదో, వెజైనల్ హీలింగ్, యూరిన్, మోషన్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయా, మల్టీ విటమిన్స్ అవసరమా, బీపీ, షుగర్ లేదా ప్రెగ్నెన్సీ నుంచి ఇస్తున్న మెడిసిన్స్ ఇంకా అవసరమా అనేది టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే పాప్ స్మియర్ లేదా సర్వికల్ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని డాక్టర్ చెప్తారు. ఈ టెస్ట్ ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి చెయ్యాలి. హెచ్ పీవీ వ్యాక్సిన్ లేదా సర్విక్స్ కేన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ ఈ టైమ్లో సజెస్ట్ చేస్తారు. వ్యాయామం చేయటం ఇప్పుడే మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ వ్యాయామం అవసరమని చెప్తారు. అబ్డామినల్ బెల్ట్ను సజెస్ట్ చేస్తారు. బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లేదా నిపుల్ ఇన్ఫెక్షన్ను చెక్ చేస్తారు.బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లేదా నిపుల్ డిశ్చార్జెస్ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీ తరువాత కూడా అవసరం ఉంటే ఇస్తారు. యూరిన్ లీక్, మోషన్ లీక్ ఉంటే రక్తం, మూత్ర పరీక్షలు చేయాలి. ఓవులేషన్ స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాసెప్షన్ అవసరం ఉంటుంది. డిఫరెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయాలి. కాపర్–టి వంటి లాంగ్ టెర్మ్ కాంట్రాసెప్టివ్స్ ఇవ్వొచ్చు. బేబీ బర్త్ రిజిస్ట్రేషన్ కూడా చెక్ చేయాలి. ఆరు వారాల తరువాత డెలివరీ విజిట్ చాలా ముఖ్యం. కాబట్టి, తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి డాక్టరును సంప్రదించండి. -డా‘‘ భావన కాసు-గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ , హైదరాబాద్ -
దెయ్యప్పిల్ల
పాపం మంచమ్మాయే! ‘దెయ్యప్పిల్ల’ అని పేరొచ్చేసిందంతే. అసలు పేరు జో రోత్(Girl Zoe Roth). ఆమె నాలుగేళ్ల వయసులో తండ్రి తీసిన ‘విపత్తు’ ఫొటోపై ఇరవై ఐదేళ్లుగా ఇంటర్నెట్లో ‘మీమ్స్’ వస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా పెద్ద విపత్తు సంభవించింది అనుకుందాం. ఆ విపత్తు ఫొటోను, ఈ పాప ఫొటోను జాయింట్ చేసి ఇంటర్నెట్లోకి వదిలేస్తుంటారు ‘మీమర్స్’. టైటానిక్ నౌక ఎప్పుడో వందేళ్ల క్రితం కదా మునిగిపోయింది.ఆ ఫొటోక్కూడా ఈ పాప ఫొటోను తగిలించేశారు. సరదాకే అనుకోండి. ఆ చిన్నారి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. ఇటీవలే తన చిన్నప్పటి ‘విపత్తు ఫొటో’లో తనెక్కడైతే నిలబడి ఉందో సరిగ్గా అక్కడే నిలబడి ఫొటో తీయించుకుని ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. సీన్ని రీక్రియేట్ చేసిందన్నమాట! ఇదంతా సరే, అసలు పాతికేళ్ల క్రితం నాటి జో రోత్ ఫొటోపై సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్ ఎందుకు వస్తున్నాయి?ఓసారి 2005లోకి వెళ్దాం. ఇయర్ సరే. ప్లేస్ ఎక్కడ? అమెరికాలోని నార్త్ కరోలినా. అప్పుడు జో రోత్ వయసు 4 సంవత్సరాలు. ఆ రోజు.. వీధిలో ఏదో కాలిపోతున్నట్లు పొగలు వస్తుంటే చుట్టు పక్కల వాళ్లు ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు. జో రోత్ ఇంట్లోంచి ఆమె తండ్రి డేవ్, ఆమె వచ్చారు. డేవ్ ఫొటోగ్రాఫర్. అతడి మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది. ఇంట్లోంచి వాళ్లొచ్చి చూసేటప్పటికి బయట ఎవరిదో ఇల్లు కాలిపోతోంది! అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. డేవ్కు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. కెమెరాను సెట్ చేసుకుని, ‘‘తల్లీ.. ఫొటోకు పోజ్ ఇవ్వరా..’’ అన్నాడు.బ్యాక్ డ్రాప్లో కాలిపోతున్న ఇంటి మంటలు. వాటి ముందు రోత్. ఇదీ యాంగిల్. తండ్రి చెప్పినట్లే రోత్ పోజ్ ఇచ్చింది. ‘‘కొంచెం నవ్వు ముఖం పెట్టు’’ అన్నాడు! తనకేం తెలుసు. తండ్రి స్మైల్ అన్నాడు కాబట్టి స్మైల్ ఇచ్చింది. ఇల్లు కాలిపోతుంటే నవ్వుతున్నట్లుగా ఉంది జో రోజ ఆ ఫొటోలో!జో రోత్ సీన్ రీక్రియేషన్ ఫొటో ఐదు లక్షల డాలర్ల ఫొటో!ఆ ఫొటోలో రోత్ నవ్వు ‘డెవిలిష్’గా ఉంది. అంటే దెయ్యప్పిల్ల నవ్వుతున్నట్లు! రెండేళ్ల తర్వాత ఆ ఫొటోను ఏదో పోటీకి పంపుతూ ‘డిజాస్టర్ గర్ల్’ అనే పేరు పెట్టాడు డేవ్. ప్రైజ్ వచ్చింది. అలా ఆ ఫొటో ప్రపంచానికంతటికీ తెలిసింది. అప్పట్నుంచీ జో రోత్ ‘డిజాస్టర్ గర్ల్’ అయింది. ప్రపంచంలో ఎక్కడైనా ఘోరం జరిగితే ఫొటోషాప్ తెలిసిన సృజనశీలురు ఆ ఘటనకు, రోత్ చిరునవ్వు ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పెట్టేవారు.అలా ఆ ఫొటో ఇంకా పాపులర్ అయింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలితే రోత్ ఫొటో. సునామీలు వస్తే రోత్ ఫొటో. ఘోర ప్రమాదాలు జరిగితే రోత్ ఫొటో. అలా నెట్లో, వార్తాపత్రికల్లో తరచు తన చిన్ననాటి ఫొటోని చూస్తూ పెరిగింది రోత్. ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. అప్పటి చిరునవ్వులో మాత్రం మార్పులేదు. అన్నట్లు – ఐదేళ్ల క్రితం ఆ ‘విపత్తు ఫొటో’ ఒరిజినల్ ఐదు లక్షల డాలర్లకు వేలంలో అమ్ముడైంది. రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడన్నట్లు – ఆ రోజు రోత్ తండ్రి డేవ్ ఎందుకు అలా వెనుక మంటలు, ముందు కూతురి చిరునవ్వులు కలిపి ఫొటో తీసినట్లు! ఎప్పటికైనా ఆ ఫొటో భారీ ధరకు అమ్ముడుపోతుందని ముందే ఊహించాడా? లేదు లేదు. ఊరికే అతడికో సరదా ఆలోచన వచ్చింది.ఆ సరదా ఆలోచన కూడా ఎందుకొచ్చిందంటే.. పొగని చూసి హడావిడిగా బయటికి వచ్చారు తండ్రీ కూతుళ్లు.. అయితే అది అగ్ని ప్రమాదం కాదనీ, అగ్ని మాపకదళం వారే ట్రైనింగ్లో భాగంగా ఒక సెట్టింగ్ను తగలబెట్టి మంటల్ని ఆర్పుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, ఆ సంతోషంలో కూతురి ముఖంలో నవ్వుల్ని పూయించాడు డేవ్. ఆ ఫొటోని చూస్తే ఎవరికైనా వెంటనే వచ్చే ఆలోచన.. ‘‘ఏంటీ పిల్ల.. ఇల్లు తగలబడిపోతుంటే నవ్వుతూ చూస్తోంది!’’... అనే కదా. అలాంటి ఆలోచన రప్పించడం కోసమే డేవ్ అలా ఫొటో తీశాడు. అనుకోకుండా ఫొటోగ్రాఫర్గా ఆయనకు పేరు, ఫొటోలో ఉన్న చిన్నారిగా రోత్కు భారీగా డబ్బూ వచ్చాయి. -
బెస్ట్ టూరిస్ట్ స్పాట్
రియో డి జనీరో– బ్రెజిల్లోని ఒక పెద్ద, అందమైన నగరం. ఇది అద్భుతమైన బీచ్లకు, పర్వతాలకు, ఉత్సాహభరితమైన కార్నివాల్ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కోపాకబానా, ఇపనేమా అనే బీచ్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఇవి అందమైన ఇసుక తిన్నెలతో, అహ్లాదకరమైన వాతావరణానికి నిలయమనే చెప్పుకోవాలి. కోర్కోవాడో పర్వతంపైనున్న ఈ భారీ జీసస్ విగ్రహం రియోకు ఒక చిహ్నం.ఇది 2007లో న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో స్థానం దక్కించుకుంది. అక్కడి షుగర్లోఫ్ మౌంటైన్ మీదున్న కేబుల్ కార్ ఎక్కితే ఆ నగరాన్ని మొత్తం వీక్షించవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రైస్తవ కార్నివాల్ ఈ నగరంలోనే ఘనంగా నిర్వహిస్తుంటారు. అలాగే ఈ నగరం ప్రపంచమే మెచ్చే.. సాంబా నృత్యాలకు పుట్టినిల్లు.చెప్పుకోదగ్గ పోటీలుఆస్ట్రేలియాకు చెందిన ‘డార్విన్ బీర్ క్యాన్ రిగటా ఫెస్టివల్’ ఒకటి. ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకను చాలా వినోదాత్మకంగా నిర్వహిస్తారు. ఖాళీ బీర్ బాటిళ్లు, ప్లాస్టిక్ సీసాలు, పాల డబ్బాలు ఇలా ఉపయోగం లేనివాటిని ఉపయోగించి తయారుచేసిన పడవలతో బీచ్లో పోటీపడటం ఈ వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పోటీలను 1974లో లయన్స్ క్లబ్ ఆఫ్ డార్విన్ కమ్యూనిటీ సభ్యులైన లట్జ్ ఫ్రాంకెన్ ఫెల్డ్, పాల్ రైస్–చాప్మాన్ అనే వ్యాపారవేత్తలు ప్రారంభించారు. ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలోని డార్విన్ వీధుల్లో చెల్లాచెదురుగా ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి సరైన మార్గంగా ఈ పడవల తయారీ, పోటీ అనే ఆలోచన వచ్చింది. దాన్ని ప్రారంభించినప్పుడే మంచి స్పందన రావడంతో దాన్ని ప్రతి ఏడాదీ కొనసాగిస్తున్నారు. మిండిల్ బీచ్లో జరిగే ఈ పండుగలో పాల్గొనేవారు వేలాది డబ్బాలతో సృజనాత్మకంగా పడవలను తయారు చేస్తారు. కొన్ని పడవలు పోటీ మధ్యలో విరిగిపోతుంటాయి. దానితో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తపడటంతో విరిగిపోవడం కూడా వినోదాన్ని పండిస్తుంది.ఇక ఈ ఏడాది ఈ పండుగ జూన్ 8న జరుగుతోంది. పడవ పోటీలతో పాటు, ఇసుక కోటల నిర్మాణం, థాంగ్ త్రోయింగ్ వంటి ఇతర సరదా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ డార్విన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనితో వచ్చే నిధులు స్థానిక కమ్యూనిటీ ప్రాజెక్టులకు ఉపయోగపడతాయి. ఈ సంబరాల్లో ‘థాంగ్ త్రోయింగ్ కాంపిటీషన్’ కాస్త వింతైన కామెడీ పోటీ. ఈ పోటీలో పోటీదారులు తమ తేలికపాటి చెప్పు(ఫ్లిప్ఫ్లాప్)లను దూరంగా విసురుతారు. ఎవరు ఎంత ఎక్కువ దూరం తమ చెప్పును విసరగలిగితే వాళ్లే గెలిచినట్లు. ఇక ఈ వేడుకలో భాగంగా ఐరన్ పర్సన్ కాంపిటీషన్, టగ్–ఆఫ్–వార్ ఇలా మరిన్ని పోటీలు జరుగుతుంటాయి. పైగా ఈ పోటీలను జూనియర్లకు వేరుగా, సీనియర్లకు వేరుగా, గ్రూప్ పోటీలు వేరుగా నిర్వహిస్తారు. దాంతో ఈ వేడుకలో వీక్షకులు, పోటీదారులతో సందడి మామూలుగా ఉండదు. -
ఓ మై డాగ్స్!
ఒక అసాధారణమైన స్నేహానికి మూడడుగుల ఎత్తు తేడా ఏమాత్రం అడ్డు రాలేకపోయింది. ఒకటి టీ కప్పు సైజులో పరిగెత్తే పిల్లోడు, ఇంకొకటి సోఫాను బెడ్డుగా వాడే బలమైన కుర్రాడు, కాని, ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం చూస్తే – ఇది శునకాల స్నేహం కాదు, నిజమైన ప్రేమపాఠం అనిపిస్తుంది. ఈ స్నేహం ఐడహోలో గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్ అధికారుల కారణంగా మొదలైంది.ప్రపంచంలోనే అతి పొడవైన శునకం రెజీకి (39.6 అంగుళాలు), అతి చిన్నదైన కుక్క పెర్ల్ను (3.59 అంగుళాలు) మొదటిసారి పరిచయం చేసినప్పుడు, ఎవరూ ఊహించని విధంగా కళ్ల ముందు ఒక డిస్నీ మ్యాజిక్ కనిపించింది. రెజీ, పెర్ల్ కలిసింది మొదటిసారే అయినా, ‘ఓయ్ బాస్, ఈ ప్రపంచంలోనే మేమే గ్రేట్ బెస్ట్ ఫ్రెండ్స్’ అని అందరిని నమ్మించేశాయి! రెజీ భారీ ఆకారం చూసి పెర్ల్ భయపడకుండా ధైర్యంగా దాని చుట్టూ తిరుగుతూ ఆటలాడుకుంటుంటే, రెజీ తన భారీ కాళ్లను నెమ్మదించి, చిట్టి స్నేహితుడితో కలిసి నడిచింది.ఈ అందమైన కలయికకు కారణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కావొచ్చు కాని, ఫలితంగా ప్రపంచం నిండా నవ్వులు పూశాయి, సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్లతో నిండిపోయింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎత్తుల్లో తేడా రావచ్చు, రకాలు భిన్నంగా ఉండొచ్చు కాని, ఒక స్నేహానికి ఇవేమీ అవసరం లేదు, ఒక మంచి మనసే చాలు అని ఈ జంట మరోసారి నిరూపించింది. -
ఆ.. డిస్కషన్స్ రావు
స్టార్ హీరోయిన్గా మామూలు వెలుగు వెలగలేదు కాజల్ అగర్వాల్. పెళ్ళయిన తర్వాత కెరీర్ ముగింపుకి వచ్చినట్లే అని అనుకున్న వాళ్ల నోరు మూయించేలా మళ్లీ తెరపైకి రాబోతోంది.⇒ ఈ ఏడాది కాజల్ అగర్వాల్కి ఓ రకంగా స్పెషల్ ఇయర్. జూన్ 19న 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.⇒ 2020లో పెళ్ళయిన తర్వాత ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణతో కలిసి నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి నటించే చాన్స్ వచ్చినా, మొదట్లోనే ఆ క్యారెక్టర్ని స్క్రిప్టులో నుంచి తీసేశారు. చిత్రీకరించిన సీన్స్, సాంగ్ కూడా డిలీట్ చేసేశారు.⇒ హీరోయిన్ ఓరియెంటెడ్ జోనర్ సినిమా ట్రై చేసి, ‘సత్యభామ’తో మంచి రిజల్ట్స్ అందుకోలేకపోయింది.⇒ సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ సినిమా డిజాస్టర్ అనే మాట అటుంచి, అసలు ఏ మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్ చేసి, అందరిని షాక్కి గురి చేసింది కాజల్ అగర్వాల్.⇒ ఇటువంటి దశలో – కాజల్కి అద్భుతమైన అవకాశం వచ్చింది. విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీదేవిగా నటిస్తోంది. కాజల్కి ఇది మొదటి పౌరాణిక పాత్ర.⇒ కాజల్ అగర్వాల్ పార్వతీదేవి గెటప్ చూసే, మండోదరి పాత్ర ఆఫర్ వచ్చింది. సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ – సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణం’ సినిమాలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని సరసన మండోదరిగా కాజల్ అగర్వాల్ నటించబోతోందని సమాచారం.⇒ విష్ణు మంచుకి ట్విన్ సిస్టర్గా ‘మోసగాళ్ళు’ సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్. ఆ పరిచయం కారణంగానే పార్వతీదేవి పాత్ర వచ్చింది.⇒ అక్షయ్ కుమార్ శివుడు క్యారెక్టర్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే! కొన్నేళ్ళ ముందు అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ‘స్పెషల్ ఛబ్బీస్’ సినిమాలో చేసింది కాజల్ అగర్వాల్ .⇒ వ్యక్తిగత విషయాలకొస్తే, భర్త గౌతమ్ ఇంటీరియర్ డెకార్స్కి సంబంధించిన ఇ కామర్స్ బిజినెస్ చేస్తుంటాడు. భర్త ఆదాయం కన్నా– కాజల్ అగర్వాల్ ఆస్తి పాస్తులు ఎక్కువ. తామిద్దరి మ«ధ్య ఫైనాన్షియల్ మేటర్స్ గురించి డిస్కషన్స్ రావని చెప్పింది కాజల్.⇒ నటిగా ఎంత బిజీగా ఉన్నా, బాబు ఆలనా పాలనకి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పింది. ‘సత్య భామ’ షూటింగ్కి కొడుకుని ముంబై నుంచి తనతో పాటు తీసుకొచ్చింది. ప్రైవేట్ హౌస్లో ఉండి, బాబుతో టైమ్ స్పెండ్ చేసింది.⇒ పెళ్ళయిన తర్వాత హీరోయిన్లకి కెరీర్ ముగిసి పోయిందనేది ఇప్పుడు కరెక్ట్ కాదని, కొత్తదారులకు తలుపులు తెరుచుకుంటాయని అంటుంది కాజల్ అగర్వాల్. -
కడలి కబుర్లు
అగాధ జలనిధి కడలి.. అది అనంత జీవరాశికి ఆలవాలం... నేలపై ఉండే జీవులకు ప్రాణవాయు ప్రదాత.. సాగరగర్భం అనేక వింతలకు నిలయం... సముద్రాలను కాపాడుకోవడం మానవాళి కర్తవ్యం.. సముద్రాలను కాపాడుకుంటేనే మనకు మనుగడ. సముద్రం ఒక వేదికైతే... అందులో చేపల నాటకం.. ఆక్టోపస్ డాన్స్.. డాల్ఫిన్ పాటలు.. ఇలా మరెన్నో కళాకారులతో నిండుతుంది. అయితే, ఆకతాయులు వేసే ప్రతి ప్లాసిక్ బాటిల్కు ఒక రంగురంగుల చేప ఊపిరి ఆగిపోతోంది. అలలు నవ్వడం మానేస్తున్నాయి. అందుకే, ప్రతి ఏటా జూన్ 8న జరుపుకునే ‘ప్రపంచ సాగర దినోత్సవం’(World Oceans Day) రోజునైనా, సముద్రం అంటే సరదా కాదు, ఒక జీవనిధిగా గుర్తించి కాపాడుకుందాం.సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యమని, అందులో నీళ్లు, చేపలు, బోట్లు తప్పే మరేం ఉంటాయ్! అని చాలామంది అనుకుంటుంటారు. కాని, సముద్రం ఎంత గొప్పది అంటే సముద్రమంత! ‘సాగరః సాగరోపమః’ అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అంటే.. సముద్రం సముద్రమంత గొప్పదని అర్థం. సముద్రాన్ని మరోదానితో పోల్చడం సాధ్యం కాదు. అంతటి మహాసముద్రం లోపల వేలాది ర హస్యాలు. భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఎన్నో దాగున్నాయి. వాటిలో బయటకు తెలిసినవి కొన్నే! కాని, సముద్రంలో ఒక చిన్న వినోదం కూడా ఉంటుంది.అది ఒక చక్కని కామెడీ కథల వేదిక. అక్కడి చేపలు చేసే శబ్దాలు రేడియోలో కంటే ఎక్కువగా మాట్లాడతాయి, ఆ శబ్దాలు మనకు వినపడవంతే! ఆక్టోపస్లు ఎనిమిదేసి చేతులతో మాయాజాలం చూపిస్తాయి. జెల్లీఫిష్ సిల్లీ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఒకపక్క తాబేలు స్లో మోషన్ డాన్స్ చేస్తుంటే మరోపక్క డాల్ఫిన్లు, తిమింగలాలు ‘ప్లాస్టిక్ తినకురా! ఓ నీలి నేస్తమా!’ అంటూ రీమిక్స్ చేస్తూ ర్యాప్ పాడుతుంటాయి. ఇక సముద్రపు స్టార్ షార్క్ని సెల్ఫీ అడిగి, దాని నవ్వు చూసిన అలలు పరుగెడుతుంటాయి.ఇలా సముద్రంలో ఎన్నో వింతలు.. విడ్డూరాలు ఉన్నాయి. అలాగే జీవం కూడా ఉంది. అందుకే, మనుషులు ఆనందంగా ఉండాలంటే సముద్రం కూడా ఆనందంగా ఉండాలి. అలా ఆనందంగా ఉండాలంటే మనం సముద్రానికి ప్లాస్టిక్ బ్యాగ్లను టోపీలుగానూ, బాటిళ్లను సీ డెకరేషన్లగానూ చేయకూడదు. సముద్రాన్ని ప్రేమించడం అంటే, మన భవిష్యత్తును మనం ప్రేమించడమే! పుడమికి ప్రాణవాయువును అందిస్తున్న సాగరునికి ప్రతి ఒక్కరూ ‘థ్యాంక్స్’ చెప్పుకునేలా.. ఈ ప్రత్యేక కథనం.. అలా మొదలైంది... ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచం నీలికడలి గురించి ఒక నిలువెత్తు నిజాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సముద్రాలు మనకు ఒక ముఖ్య జీవనాధారం అని. ఆక్సిజన్ లేకుంటే ఎంత ప్రమాదమో, సముద్రాలు లేకున్నా కూడా అంతే ప్రమాదం. ఒకరకంగా చెప్పాలంటే మనం పీల్చుకునే ఊపిరిలో సగానికి సగం సముద్రాల నుంచే వస్తుంది. ఇంతటి ముఖ్యమైన వనరును కూడా మానవులు కాలుష్యంతో నింపి నాశనం చేస్తున్నారు. అందుకే, 1992లో బ్రెజిల్లో జరిగిన ‘ఎర్త్ సమ్మిట్’లో కెనడా మొదటిసారి ‘సముద్రాలకు ఒక ప్రత్యేక దినోత్సవం కావాలి’ అని చెప్పింది. ఆ కలను 2008లో ఐక్యరాజ్యసమితి సాకారం చేసింది. ఇక అప్పటి నుంచి ఏటా జూన్ 8న ‘ప్రపంచ సాగర దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సముద్రంలో సినిమా.. అద్భుతమైన సముద్ర ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ‘అండర్ ది సీ 3డీ’. ప్రముఖ సంస్థ ఐమాక్స్ తెరకెక్కించిన ఈ సినిమా మామూలు సినిమా కాదు. ఇదొక డాక్యుమెంటరీగా తీసుకొచ్చిన సముద్ర మాయాజాలం. ప్రముఖ డైరెక్టర్ హవర్ట్హాల్ దర్శకత్వం వహించగా, మిచెల్ హాల్ దీనికి రచన అందించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ సముద్రం లోతుల్లో తేలియాడుతూ, చుట్టూ రంగురంగుల చేపలను, నిగనిగలాడే పగడాల దిబ్బలను, నెమ్మదిగా కదిలే వివిధ సముద్రపు జీవులను చూస్తున్నట్లు ఉంటుంది.ఈ సినిమా కేవలం రంగుల బొమ్మలనే కాదు, ప్రకృతి చేసే అలజడి, వాతావరణ మార్పులు, పెరిగే ఉష్ణోగ్రతలు, మానవ తప్పిదాలు– ఇలా ఇవన్నీ సముద్రానికి చేస్తున్న ముప్పును చక్కగా చూపిస్తూనే, మనుషుల్లో ‘ఇక కొంతకాలంలో ఈ అందాలను చూసే అవకాశం లేకుండా పోతుందా?’ అనే ప్రశ్నను రేకెత్తించేలా చేస్తుంది. ఇందుకోసం ‘కర్ల్ ట్రయాంగిల్’ అనే సముద్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన సముద్ర జీవులు నివాసం ఉండే ప్రాంతం. అక్కడ చిత్రీకరణ అత్యంత ప్రమాదకరం.ఒక తప్పు జరిగినా అక్కడి జీవ వ్యవస్థ మొత్తానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే, ఈ ఇద్దరు ప్రతి ఫ్రేమ్ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఒక పెద్ద కెమెరాను ఉపయోగించారు. దాని బరువు సుమారు ఆరువందల కిలోలు ఉంటుంది. వివిధ ప్రత్యేక అనుమతులు తీసుకొని సుమారు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అలా ఒక అద్భుత ప్రపంచాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.సంభ్రమపరచే సాగర వాస్తవాలు⇒ సముద్రం లోపల ఏకంగా 37 ‘భారలోహాలు’ ఉన్నాయి. లిథియం, కోబాల్ట్, మాంగనీస్, టైటానియం ఇలా మరెన్నో మినరల్స్ ఉన్నాయి.⇒ సముద్రంలో ఉన్న మొత్తం ఉప్పుని ఉపయోగిస్తే, భూమిపై నేల అంతటినీ ఐదు వందల అడుగుల ఎత్తుతో కప్పేయొచ్చు.⇒ మనకి సముద్రపు లోతుల గురించి కంటే అంతరిక్షం గురించి ఎక్కువ తెలుసు. ఇంకా 90 శాతం సముద్రం మ్యాప్ కూడా గుర్తించలేదు. సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు ఎన్నో ఉన్నాయి.⇒ సముద్రపు నీటి స్థాయి అప్పుడప్పుడు పైకి, కిందికి ఊగుతుంది. శీతాకాలం వస్తే నీరు మంచుగా మారుతుంది. అలాగే, తాపం పెరిగితే భూమి మీదకు వస్తుంది.⇒ సముద్రం భూమి మీద 71% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సముద్రాల్లోని నీటిని కలిపితే 320 మిలియన్ క్యూబిక్ మైళ్ల నీళ్లు! అంతేకాదు, సముద్రాల్లో నీళ్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అవి ఎక్కడో వర్షంగా పడతాయి, మరెక్కడో మంచుగా మారతాయి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ⇒ సముద్రం అంటే ఉప్పు నీరు మాత్రమే ఉండదు. ఉప్పు లేని సముద్రాలు ఉన్నాయి. వాటిని ‘గ్రేట్ లేక్స్’ అంటారు. అంటే సముద్రం కాదు. కాని, ఈ సరస్సులు సముద్రాల్లో ఉంటాయి.⇒ సముద్రంలో ఏకంగా 2.2 మిలియన్ జాతుల జీవులు ఉన్నాయని అంచనా. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పటి వరకు కనుక్కోగలిగాం.⇒ సముద్రపు నేల ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది! అగ్నిపర్వతాల వలన వచ్చిన మాగ్మా ఎత్తైన పర్వతాలను సృష్టిస్తుంటుంది. వీటిపై అక్కడక్కడ ఉండే ‘బ్లాక్ స్మోకర్స్’ అనే పగుళ్లు సముద్రంలో పొగను కూడా వదులుతాయి. హద్దుల్లేని భజంత్రీలుఒకప్పుడు పెళ్లి అంటే పందిరి, లైట్ల మెరుపులు, మైక్ పట్టుకుని చేసే ‘వేదపారాయణం’. కాని, ఈ స్టయిల్ పెళ్లిళ్లను ఈ కాలపు జంటలు అసలు ఒప్పుకోవడం లేదు. అన్నింటికంటే ముందు పెళ్లికి కచ్చితంగా కావాల్సింది అంతులేని తీరాలతో ఉండే ప్రేమ అని కొందరు అంటున్నారు. అంటే పెళ్లి వేదికలుగా సముద్ర తీరాలకు ఓటు వేస్తున్నారు. కాబట్టి పెళ్లి అనగానే పురోహితుడి కంటే ముందు ప్యాకేజీలో బీచ్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ది బెస్ట్ ఇవి.గోవా: గోవాలో పెళ్లంటే.. పెళ్లి కంటే ముందు పెళ్లి విందు మిన్న అన్నట్లే! శుభ ముహూర్తానికి ముందే ‘సన్సెట్ క్లిక్స్’, ‘బీచ్ బేస్డ్ బంగ్లా’ బుక్ అయిపోతాయి. వేదమంత్రాల పక్కనే డీజే ప్లే అవుతుంది. పక్కా ఎంజాయబుల్ పెళ్లికి వెళ్లాలంటే గోవాలో జరిగే పెళ్లికి పిలవకుండా వెళ్లినా తప్పులేదు.అండమాన్: జీవిత ఖైదీని అందంగా బంధించాలంటే అండమాన్లో పెళ్లి చేసుకోవాలి. వధువు వస్తే ఫ్లవర్స్ కాకుండా, టైడల్ షవర్ ఫీల్స్ వస్తాయి.కేరళ: వరుడు బోటులో వస్తే, వధువు కొబ్బరి చెట్టు కింద నిలబడి ‘నన్ను తీసుకెళ్తావ్ కదా’ అని చెప్పే ఓ చక్కని సన్నివేశంలాంటిది కేరళ పెళ్లి.గోకర్ణ: గోకర్ణలో పెళ్లంటే ఒక చిన్న పండగలాంటిది. ఓం కారంతో శుభారంభం పలికి, పెళ్లి, తర్వాత సంగీతం, చివర్లో బీచ్ ఫైర్ డాన్స్తో అలరించేదే ఈ పెళ్లి.పుదుచ్చేరి: ఫ్రెంచ్ వీధుల్లో ప్రేమగా నడుస్తూ, బీచ్ సరసన ప్రేమ పంచుకుంటే, ఫొటోల్లోనే కాదు, జీవితమే ఒక రొమాంటిక్ సినిమాలా కనిపిస్తుంది. అటువంటి సినిమాటిక్ ఫీల్ కోసం పుదుచ్చేరి బెస్ట్ ప్లేస్.డయ్యూ: తక్కువ ఖర్చుతో హైవోల్టేజ్ బీచ్ పెళ్లి కావాలంటే ఇది బెస్ట్. ఓ వైపు పోర్చుగీస్ ఇళ్లు, మరోవైపు బ్రైట్ లైట్స్తో ఉంటుంది. ఈ పెళ్లిని చూసిన తర్వాత పెళ్లికాని అబ్బాయిలు కూడా తమ పెళ్లి ఇక్కడే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు.మహారాష్ట్ర: ఇక్కడ బీచ్ వెడ్డింగ్ అంటే పక్కనే కోటలు, వెనుక సముద్రం, ముందు మేకప్ ఫెయిల్ అయిన వధూవరులు. ఎందుకంటే, ఇక్కడ సూర్యుడు తన శక్తిని కొంచెం ఎక్కువే చూపిస్తాడు. అయినా కూడా అందంగానే ఉంటారు.లక్షద్వీప్: ఇది పెళ్లి కాదు బాస్, అడ్వెంచర్! ఇక్కడ పెళ్లి చేసుకుంటే పంచభూతాలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎందుకంటే, ఇక్కడ చాలామంది స్కూబా డైవింగ్ చేస్తూ, ‘ఐ లవ్ యూ’ చెçప్పుకుంటారు. బంధువులు ఎవరైనా రావాలంటే, ముందే స్విమ్మింగ్ తెలిసుండాలి.కాబట్టి పెళ్లి అంటే ‘పెద్దవాళ్ల దీవెనలు, బంధుమిత్రులతో విందుభోజనాలు’ అనుకునే రోజులు పోయాయి! ఇప్పుడు పెళ్లి అంటే– ‘ఐలాండ్ ప్యాకేజీ బుక్ చేసి, టెంట్లు వేసుకుని, సముద్రపు హోరుకు హార్ట్బీట్ జోడించి, ప్రేమను చాటాలి అనుకుంటున్న రోజులివి. అయితే, ఈ సముద్ర సంబరాలకు వెళ్లడానికి ముందు సన్స్క్రీన్ను రాసుకెళ్లడం మర్చిపోకండి.సముద్రంలో మిస్టరీగా మిగిలిన ప్రదేశాలు.. సముద్రాల్లో కొన్ని ప్రదేశాల గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా, అవి ఇప్పటికీ ప్రశ్నలు, సమాధానాల కంటే అర్థం కాని కథల్లానే మిగిలిపోయాయి. అలాంటి ఐదు అత్యంత రహస్యమైన సముద్ర ప్రదేశాలు ఇవే..బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో విమానాలు, నౌకలు చాలా అదృశ్యమయ్యాయి. అవన్నీ ఎక్కడికి పోయాయి? కారణం ఏమిటి? ఇంకా తెలియలేదు. ఇది సాంకేతిక సమస్యా? లేక ఏదైనా భౌతిక శక్తుల మాయాజాలమా అనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.మారియానా ట్రెంచ్ మనం సముద్రాన్ని కేవలం ఐదు శాతమే అన్వేషించాం. కానీ అంతకంటే లోతైన ప్రదేశం కూడా ఉంది. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ‘చాలెంజర్ డీప్’ అనే ప్రదేశం. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ఇందులో కంటికి చిక్కని లోకం ఉండవచ్చు అనే అనుమానం శాస్త్రవేత్తల్లో ఉంది. సర్గాసో సముద్రం ఈ సముద్రంలో ప్రవాహాలు కనిపించవు. కానీ అందులో తేలే సర్గాసం అనే సముద్రపు మొక్కలు, అక్కడి జీవవైవిధ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఇది సముద్రానికి మధ్యలో ఉన్న, అతిపెద్ద సర్గాసం మొక్కల రాజ్యం లాంటిది.బాల్టిక్ సీ అనోమలీ సోనార్ స్కాన్లలో కనిపించిన ఒక నిర్మాణం చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఏలియన్స్ నిర్మించారా లేదా సహజంగానే ఏర్పడిందా లేక మానవ నిర్మాణమా అనేది ఇప్పటికీ ఎవ్వరూ తేల్చలేకపోయారు.గ్రేట్ బ్లూ హోల్ బెలీజ్ సమీపంలో ఉన్న అతిపెద్ద సింక్ హోల్ ఇది. ఈ సముద్ర గుంత లోతుల్లో దిగుతున్న కొద్దీ నీటి ఉష్ణోగ్రత, పీడనం మారుతూ ఉంటుంది. ఇవి చూపుతున్న ప్రభావాలు శాస్త్రవేత్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలా సముద్ర గర్భం ఒక్కొక్క చోట ఒక్కో విధంగా విశేషమైన ప్రత్యేకతతో ఉంటుంది. ఇవే కాకుండా సముద్ర గర్భం ఎన్నో రాజ్యాలను తనలో దాచుకుందని చరిత్ర చెప్తుంది.అలాంటి అతిపెద్ద నగరాల్లో శ్రీకృష్ణుడి నగరంగా చెప్పుకునే ‘ద్వారక’ ఒకటి. టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు జరుగుతున్న ప్రతిసారి ఎంతో కొంత భూమి సముద్రంలోకి దిగిపోతుంది. అలాగే కొంత భూమి సముద్రం బయటికి చొచ్చుకొని కూడా వస్తుంది. అలా మనకి ఒక ఖండమే మునిగిపోయినట్లు కూడా చరిత్ర చెప్తుంది. అందుకే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ మనిషి పరిశోధన చేయాలంటే భయపడే అతిపెద్ద అంశం ఒక్క సముద్రం మాత్రమే!సముద్రపు వింత జీవులు...సముద్రంలోని కొన్ని నమ్మలేని, వింత జీవులు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. క్రిస్మస్ ట్రీ వర్మ్: ఈ చిన్న జంతువుల శరీరంపై ఉండే స్పైరల్ ఆకారాల ‘ప్లూమ్స్’ క్రిస్మస్ ట్రీలలా కనిపిస్తాయి! ఇవి శ్వాస తీసుకోవడానికి, ఆహారం సేకరించడానికి ఉపయోగ పడతాయి.లీఫీ సీ డ్రాగన్: ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో కనిపించే ఈ జీవి, సీ హార్స్ కుటుంబానికి చెందినది. దాని శరీరంపై ఆకుల్లా కనిపించే చేతులు ఉంటాయి. వీటిని శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఒక ఆయుధంలా ఉపయోగిస్తుంది.ఆంగ్లర్ ఫిష్: సముద్రం లోలోతుల్లో ఉండే జీవి ఈ ఆంగ్లర్ ఫిష్, దాని నోటిపైన మెరిసే గ్లో లైట్తో మామూలు చేపలను ఆకర్షించి వెంటనే చంపి, తినేస్తుంది.నార్తర్న్ స్టార్గేజర్: ఈ చేప మట్టిలో దాగి, తన కళ్లతో పైకి చూస్తూ, చిన్న చేపలు ఎప్పుడొస్తాయా అని వేచి చూసి చంపి తినేస్తుంది. ఒక్కసారిగా పైకి దూకి, శత్రువును హడలెత్తిస్తుంది.రెడ్హ్యాండ్ ఫిష్: ఈ జీవి ఈత కొట్టదు, నడుస్తుంది. రెడ్హ్యాండ్ ఫిష్ అనే ఈ చేప, టాస్మానియా సముద్ర తీరానికి ఆవల కనిపిస్తుంది. ఇది చేతుల్లా ఉండే మొప్పలతో సముద్రం అట్టడుగు నేలమీద నడుస్తూ తిరుగుతుంది.సముద్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తే, ప్రకృతి మనకేదో బలమైన సంకేతాలను పంపుతున్నట్లు అనిపిస్తోంది. కాని, మనం వాటిని గమనిస్తున్నామా? సముద్రపు లోతుల్లో నివసించే కొన్ని జీవులు అకస్మాత్తుగా భూమి మీదకు రావడం మనకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు. ఈ మధ్యే ఆస్ట్రేలియాలో ఒకేసారి 150 కిల్లర్ వేల్స్ చనిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఇవి చాలా తెలివైన, సమూహంగా జీవించే జలచర జీవులు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వీటి మరణం సంభవించడం సాధారణ విషయం కాదు.ఇక ‘బ్లాక్ డెవిల్ ఫిష్’ గురించి చెప్పాలంటే, ఇది ఆరువేల మీటర్ల లోతుల్లో ఉండే జీవి. అలాంటి జీవి ఒడ్డుకి వచ్చి చనిపోవడం అత్యంత అరుదైన ఘటన. అలాగే ‘ఓర్ ఫిష్’ లేదా ‘డూమ్స్ డే ఫిష్’ అనే చేప కూడా, సాధారణంగా మూడు నుంచి ఐదువేల మీటర్ల లోతులో జీవిస్తుంది. ఇది భూకంపాల ముందు ఉపరితలానికి వస్తుందన్న నమ్మకాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి, ముఖ్యంగా జపాన్ లో. 2011 సునామీకి ముందు ఈ చేపలు ఎక్కువగా కనిపించాయి. ఇలా ఈ మధ్య కాలంలో సముద్రంలో అట్టడుగున ఉండే చాలా జీవులు బయటకు వస్తున్నాయి.శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, భూమి లోతుల్లో జరిగే టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు, ఈ జీవులను పైకి తేలుస్తున్నాయేమో అని భావిస్తున్నారు. అయితే, ఇలా ఒకేసారి మూడు రకాల సంఘటనలు ఓర్ ఫిష్ ఉపరితలానికి రావడం, బ్లాక్ డెవిల్ ఫిష్ మరణం, కిల్లర్ వేల్స్ గుంపుగా నశించడం అన్నీ దాదాపుగా ఒకే సమయంలో చోటు చేసుకోవడం అనేది ప్రళయానికి సంకేతం అని, ఇది ప్రకృతి మనకు ‘జాగ్రత్త పడండి,’ అని హెచ్చరిస్తున్నట్లు చాలామంది భావన. త్వరలోనే దాదాపు అన్ని మతాల పురాణాల్లో ఉండే అతిపెద్ద జలచర జీవి ‘లేవియతాన్’ కూడా నిద్ర లేచిందని కథలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే, త్వరలోనే యుగాంతం జరగక మానదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, సముద్రాల్లో వేసే ప్లాస్టిక్ను తగ్గించడం అనేది పెద్ద మార్పు కాదు కాని, మంచి ఫలితాన్ని ఇచ్చే అతిపెద్ద విషయం. -
మరో ప్రతిష్టాత్మక పోటీకి తెలుగమ్మాయిలు
హైదరాబాద్ నగర వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయో లేదో మరో ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్ ‘మిస్ యూనివర్స్’ ప్రారంభమవుతోంది. ఈ సారి థాయ్లాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి ఆడిషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్లను ఎంపిక చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఫైనలిస్ట్లను ఎంపిక చేశారు. హైదరాబాద్ నగరంలో జరగనున్న ఫినాలేలో ఎంపిక చేసిన ఆ ఇద్దరినీ తెలుగు రాష్ట్రాల తరపున మిస్ యూనివర్స్ ఇండియా గ్రాండ్ ఫినాలేకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన కొందరు ఫైనలిస్టులు తమ ప్రయాణాన్ని, ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరోమాది మల్టీ టాస్కింగ్.. నాది విశాఖపట్నం, ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మెడిసిన్, మోడలింగ్ రెండూ చిన్నప్పటి కలలే. ఆడవారికున్న శక్తి మల్టీ టాస్కింగ్. నేను బ్రాహ్మన వర్గం నుంచి వచ్చాను.. మొదట్లో కుటుంబం నుంచి అడ్డంకులు వచ్చినప్పటికీ ఇంట్లో ఒప్పించాను. ఏ రంగంలో చూసినా తెలుగు వారు టాప్లో ఉన్నారు. మిస్ యూనివర్స్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్ నగరంతో పాటు ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో ర్యాంప్ వాక్, గ్రూమింగ్, స్టైల్స్ వంటి అంశాలపై శిక్షణ తీసుకున్నా. ఇప్పటికీ ఇంట్లో మగవారికి పీరియడ్స్ గురించి చెప్పుకోలేని పరిస్థితి. దీనిని పోగొట్టడానికి ఈ వేదికను వినియోగించుకుంటా. డాక్టర్గా కన్నా ఫ్యాషన్ ఐకాన్గా ఈ అంశాన్ని మరింత ప్రభావ వంతంగా ముందుకు తీసుకెళ్లగలను. – డా.వైష్ణవీ వెన్నెల, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుప్రియాంక చోప్రా స్ఫూర్తి.. పుట్టి పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాద్లోనే.. డేటా సైన్స్– ఏఐలో బీటెక్ చేశా. నాకున్న టాలెంట్ స్కిల్తో టాప్ 15లో స్థానం పొందాను. ఈ ఎంపికలో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్నదే ముఖ్యం. ఫ్యాషన్ వాక్, ప్రజెంటేషన్, డ్రెస్సింగ్ వంటి అంశాల్లో ఆడిషన్స్ జరిగాయి. ప్రియాంక చోప్రా, లారా దత్త ఇష్టం. మోడలింగ్ కోసం పలు అంశాల్లో ముంబయిలో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్లో మిస్ వరల్డ్ జరిగితే ఎంత గర్వపడ్డామో.. ఒక ఆడపిల్ల బ్యూటీ పేజెంట్లో పాల్గొంటే అంతే గర్వపడాలి. నా బ్యూటీ విత్ పర్సస్.. చిన్నారుల కోసం పనిచేయడం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. విపత్కర పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలో నేర్పించాలన్నదే లక్ష్యం. పలు ఎన్జీఓలతో పనిచేశాను. – అను శ్రీ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుమిస్ టీన్ తెలంగాణ..ప్రస్తుతం హైదరాబాద్లో ఇంజినీరింగ్ చేస్తున్నా. రెండేళ్ల నుంచి మోడలింగ్లో ఉన్నా. 2023లో ఢిల్లీలో నా మొదటి కాంపిటీషన్లో మిస్ టీన్ తెలంగాణ క్రౌన్, తరువాతి ఏడాది ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్ గెలుచుకున్నా. మిస్ యూనివర్స్ కిరీటం కన్నా, దాని వల్ల వచ్చే గుర్తింపు శక్తివంతమైనది. నేను బ్రాహ్మణ వర్గం నుంచే వచ్చాను. ఈ విషయంలో నాన్న నన్ను అర్థం చేసుకుని ప్రోత్సహించారు. సినిమాలు, మోడలింగ్, చదువును బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. తెలుగమ్మాయిల అందమంతా వారి కళ్లలోనే కనిపిస్తుంది. ఉమెన్ సేఫ్టీ, వాటర్ స్కేర్ సిటీ, నిరుద్యోగం అంశాల్లో కృషి చేయాలనుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. దీని పైన దృష్టి సారిస్తున్నా. – లక్షణ అత్తిలి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టువిలేజ్ టూ మిస్ యూనివర్స్.. నేనొక డాక్టర్.. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో హౌస్ సర్జన్గా చేస్తున్నా. 2019 నుంచి బ్యూటీ పేజెంట్లో పలు సార్లు రిజెక్ట్ అయ్యినా పట్టుదలతో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుగా నిలిచాను. నాన్న రైతు.. మారుమూల గ్రామం. ఇక్కడి అమ్మాయిలకు ఎన్నో బంధనాలు. వాటన్నింటీనీ చేధించాలనేదే లక్ష్యం. గతంలో రన్నరప్గా నిలిచిన ఆటో డ్రైవర్ కూతురు మాన్యా సింగ్ నాకు స్ఫూర్తి. మహిళలు పెద్ద లక్ష్యాలను ఎంచుకోడానికి భయపడుతున్నారు. దానిని సాధించి ఈ తరానికి ఒక మార్గదర్శకంగా నిలవాలనుంది. విశ్వ వేదిక పై మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించాలనుంది. సాఫల్య అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మహిళలకు, బాలికలకు మెన్స్ట్రువరల్ హైజీన్పై అవగాహన కల్పిస్తున్నా. – డా.సురేఖ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుమాతృభూమిపై ప్రేమతో.. న్యూయార్క్లో పుట్టాను, న్యూ జెర్సీలో పెరిగాను. నా మాతృభూమిపై ప్రేమతో కుటుంబంతో పాటు హైదరాబాద్ వచ్చాను. అమ్మ ఒకే మాట చెబుతుంది.. ఏది చేసినా చదువును నిర్లక్ష్యం చేయొద్దని. అందుకే మెడిసిన్, మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో రాణిస్తున్నా. మిస్ యూనివర్స్తో పాటు, నటనలో ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ యువతిగా నిలవాలనేదే లక్ష్యం. బాడీ టైప్, కలర్పై వారికి తోచింది మాట్లాడతారు. ఎవరేమన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం. సొంతంగా గ్రూమింగ్, మేకప్ ప్రతిదీ నేర్చుకున్నా. బేసిక్ మెంటల్ హెల్త్పై, డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వయెలెన్స్పై అవగాహన కలి్పంచడం విధిగా పెట్టుకున్నాను. జెండర్ స్టీరియోటైప్ పోగొట్టిన రాణి రుద్రమా దేవి నాకు స్ఫూర్తి. – కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టు -
వాహ్.. చౌమహల్లా..
హైదరాబాద్ : అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్ ‘సాక్షి’గా నిలుస్తుంది. రెండో నిజాం కాలంలో చార్మినార్–లాడ్బజార్కు అతి సమీపంలో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. యూరోపియన్ శైలిలో అత్యంత ఆకర్షణీయంగా పాలరాతి వలే నిర్మితమైన ఈ ప్యాలెస్ చార్మినార్ కట్టడానికి దగ్గరలోని ఖిల్వత్లో ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడముచ్చటగా ఉంటుంది. నగర సందర్శకులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మ్యూజియం అందుబాటులో ఉంటుంది. దేశ, విదేశీ పర్యాటకులను అధికంగా ఆకట్టుకుంటున్న చౌమహల్లా ప్యాలెస్ సాధారణ రోజుల్లో కన్నా వారాంతాల్లో సందడిగా ఉంటుంది.నిర్మాణ విశిష్టతలు..ఇది నాలుగు ప్యాలెస్ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అఫ్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్లో నాలుగు ప్యాలెస్ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్లోని షా ప్యాలెస్ను పోలిన ఆర్కిటెక్చర్లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్ మహల్ నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్కు చేయించిన మరమ్మతులతో మరింత శోభాయమానంగా మారింది.మ్యూజియం విశేషాలు.. నాటి ఫర్నీచర్, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు ఇతర విలువైన పురాతన వస్తువులన్నింటినీ నాలుగు ప్యాలెస్లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది. వారంలో శుక్రవారం మినహా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శించవచ్చు. పెద్దలకు రూ.100, పదేళ్ల లోపు చిన్నారులకు రూ.40, విదేశీయులకు రూ.400, మోబైల్ ఫొటోగ్రఫీ రూ.50గా సందర్శనకు టికెట్ ధర నిర్ణయించారు.నాటి చరిత్రకు వెలుగులు.. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో ఇది నిర్మితమైంది. నాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్కు మరింత శోభను తీసుకొస్తున్నాయి. 1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేటు వద్ద అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్లో ఆతిథ్యమిచ్చేవారు. -
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
అక్కినేని కుటుంబం మొత్తానికి అఖిల్ అక్కినేని , జైనాబ్ రవ్జీ మూడు ముళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో(జూన్ 6న)వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున-అమల, సవతి సోదరుడు నాగ చైతన్య -శోభిత ధూళిపాళ దంపతులు దగ్గరుండి వీరి పెళ్లి వేడుకను వైభవంగా జరిపించారు. అఖిల్-జైనాబ్ వెడ్డింగ్ పిక్స్ నెట్టింట సందడిగా మారాయి. అలాగే వధువు జైనాబ్ చీర, నగలపై ఆసక్తి నెలకొంది.వధువు జైనాబ్ వజ్రాభరణాలతో అందంగా మెరిసిపోయింది. జైనాబ్ ముఖంలో ఐవరీ-గోల్డ్ చీర, జడలో మల్లె పూలతో పెళ్లి కళ ఉట్టి పడింది. అలాగే పెళ్లి ముస్తాబులో మొత్తం డైమండ్ నగలనే ఎంచుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్. వజ్రాల ఆభరణాలతో తన బ్రైడల్ లుక్ను తీర్చిదిద్దుకుంది. రెడ్ రూబీ పొదిగిన డైమండ్ చోకర్ నెక్పీస్ అందంగా అమిరింది. దీంతోపాటు మ్యాచింగ్ చైన్, మూడు లేయర్ల డైమండ్ నెక్లెస్, మఠపట్టి, మ్యాచింగ్ ఝుమ్కాలు, ముక్కెర, వజ్రాల గాజులు, డైమండ్ వడ్డాణం ఇలా ప్రతీదీ డైమండ్స్తో తళుక్కున మెరిసింది. అటు కొత్త పెళ్లికొడుకు అఖిల్ కూడా శ్వేత వస్త్రాల్లో సింపుల్గా అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Surya Singh (@suryasinghmakeup)జైనబ్తో తన రిలేషన్షిప్ను అఖిల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రెండు ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు జైనబ్ డైమండ్ రింగ్ను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు. -
Yoga కడుపు ఉబ్బరమా..? ఉందిగా యోగా
కడుపు ఉబ్బరం చాలా మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. క్రమంగా జీర్ణ సమస్యలు, మానసిక రుగ్మతలు, నిద్ర లేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. సహజంగానే ఈ సమస్యను నివారించు కోవచ్చు. ఎందుకు వస్తుంది?కడుపులో ఏర్పడే కొన్నిరకాల రసాయనాల ద్వారా ఇలా జరుగుతుంది. సాధారణంగా కడుపు ఉబ్బరం అనేది మలబద్ధకం ద్వారా వస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా కడుపు ఉబ్బరాన్ని కొన్ని యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చుకటి చక్రాసనం...పేరుకు తగ్గట్లుగానే ఈ ఆసనం వెన్నెముకకు సంబంధించినది. నేలపై నిల్చొని వీపును రెండు పక్కలా తిప్పుతూ ఉండాలి. ఈ సమయంలో చేతులను భుజాలకు రెండు వైపులా స్ట్రెచ్ చేస్తూ చా΄ాలి. ఇలా రెండువైపులా కనీసం 10 రౌండ్లు, 2 నిమిషాల వరకు చేయాలి.చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’సైడ్ యాంగిల్ పోజు: కాళ్లను స్ట్రెచ్ చేసి, ఒకవైపుగా వంగాలి. ఇంకో కాలును వెనక్కి చాపాలి. వంగిన కాలుమీద చేతిని ఉంచి మరో చేతిని నిటారుగా పైకి చూపిస్తూ, బాడీని వీలైనంత వరకు వంచాలి. మొదట్లో 15–20 సెకన్ల నుంచి ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60ఫ్రాగ్ పోజ్: ముందుగా వజ్రాసన భంగిమలో మీ కాళ్లను వెనుకకు మడిచి యోగా మ్యాట్పై కూర్చోవాలి. మీ చేతులను పిడికిలిగా చేసి, వాటిని ఉదరం దగ్గర పెట్టుకుని మెల్లగా ముందుకు వంగాలి. ఈ ఆసనం కూడా మొదట్లో 15–20 సెకన్ల నుంచి ్ర΄ారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయాలి. -
వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60
వయసు పెరిగే కొద్దీ శరీర అవసరాలు కూడా మారుతాయి. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత. మనసు తీపి, వేయించిన వంటకాలు వంటి వివిధ రకాల రుచుల వైపు ఆకర్షిస్తుంది. కానీ ఈ వయస్సులో, మీ ఆహారం శరీరానికి శక్తిని అందించేలా, జీర్ణక్రియను సులభతరం చేసేలా, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, తేలికగా భావించేలా ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీరు మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం మిమ్మల్ని శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసికంగా సంతోషంగా, శక్తివంతంగా ఉంచుతుంది.వేపుళ్లకు దూరం...60 ఏళ్ల తర్వాత శరీర జీర్ణశక్తి క్రమంగా తగ్గుతుంటుంది. ఈ స్థితిలో సమోసా, కచోరి, పూరీ, భుజియా వంటి వేయించిన, భారీ ఆహార పదార్థాలను జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. ఈ ఆహారం కడుపుపై భారంగా ఉండటమే కాకుండా గ్యాస్, ఆమ్లత్వం, అలసటను కూడా కలిగిస్తుంది. శరీరంలో నిరంతరం బరువుగా ఉన్నప్పుడు, నిద్ర, మానసిక స్థితి, శక్తి స్థాయులు కూడా ప్రభావితమవుతాయి. వృద్ధులు ప్రతిసారీ టీతో పాటు క్రిస్పీ లేదా వేయించినవి ఏదైనా తినాలని కోరుకుంటారు. కానీ ఈ అలవాటు క్రమంగా హానికరంగా మారుతుంది.సరైన ఎంపిక...నూనెతో చేసిన ఆహారానికి బదులుగా జీలకర్ర, ఇంగువ చేర్చి కూరగాయలతో చేసిన తేలికపాటి సలాడ్స్ తినవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరాన్ని తేలికగా, సమతుల్యంగా ఉంచుతాయి.చదవండి: డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ! స్వీట్లు, పిండి పదార్థాలకు దూరం...ఈ వయస్సులో స్వీట్లు, పిండితో చేసిన వస్తువులు స్లో పాయిజన్గా భావించాలి. బిస్కెట్లు, కేకులు, పిండితో చేసిన టోస్ట్, మిల్క్ కేక్, హల్వా లేదా పేడా వంటి స్వీట్లు రుచికరంగా కనిపిస్తాయి కానీ వాటిలో పోషకాలు ఏవీ ఉండవు. ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి. మలబద్ధకానికి కారణమవుతాయి. దీర్ఘకాలంలో మధుమేహం, కీళ్ల నొప్పులు, అలసటకు దారితీస్తాయి. భోజనం తర్వాత స్వీట్లు తినడం మంచిదే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ అలవాటు హానికరం కావచ్చు. ఈ అలవాటును పూర్తిగా తొలగించుకోకుండానే మనం మెరుగైన ప్రత్యామ్నాయాలను అందించగలం.మంచి ఎంపిక...స్వీట్లు తినాలపిస్తే భోజనం తర్వాత బెల్లం–నువ్వుల లడ్డు, రాగి లడ్డు, 1–2 ఖర్జూరం లేదా అర టీస్పూన్ గుల్కంద్ తినవచ్చు. కాలానుగుణంగా లభించే చిరు ధాన్యాలతో తయారు చేసిన రోటీలు, కూరగాయలతో శనగ పిండి టోస్ట్, నెయ్యితో పోహా కూడా మంచి ఎంపికలు.చల్లని– పుల్లని పదార్థాలకు దూరం...రోజువారీ భోజనంలో కారంగా ఉండే ఊరగాయలు, చల్లని పదార్థాలు, ప్యాక్ చేసిన పానీయాలను చేర్చడం ఈ రోజుల్లో సర్వసాధారణమై΄ోయింది. కానీ ఇది మీ శరీరంలో వాపు, అధిక రక్తపోటు, వాతం వంటి సమస్యలను పెంచుతుంది. మార్కెట్లో లభించే కారంగా, నూనెతో కూడిన ఊరగాయలలో అధిక సోడియం ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. రక్త΄ోటు అసమతుల్యతకు కారణమవుతుంది. అదేవిధంగా ఫ్రిజ్లో దీర్గకాలం ఉంచిన కోల్డ్ లస్సీ, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్లు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. శరీరం పొడిబారడం, గ్యాస్, అలసటను కలిగిస్తాయి.ఇదీ చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’మంచి ప్రత్యామ్నాయాలు... వీటికి బదులుగా తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలతో ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ లేదా గూస్బెర్రీ ఊరగాయ, పుదీనా–కొత్తిమీర చట్నీ, జీలకర్రతో మజ్జిగ లేదా వేడి సూప్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వేడి సూప్లు, ఉడికించిన కూరగాయలు, నిమ్మకాయ–పుదీనా నీరు లేదా మరిగించిన జీలకర్ర–కొత్తిమీర నీటిని ΄ానీయంగా తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. -
లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’
జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ తల్లి రేవతి కామత్ కోసం ఇటీవల ఒక లగ్జరీకారు కొనిచ్చారు. అలా కొనిచ్చిన మూడు నెలల తరువాత ఆమె బెంగళూరు మెట్రోలో ప్రయాణించడం విశేషంగా నిలిచింది. పర్యావరణవేత్త , వీణ కళాకారిణి కూడా అయిన రేవతి పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారు. దీనిపై ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.బిలియనీర్ కొడుకులు నిఖిల్, నితిర్ ఇద్దరే సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సంగతిని ఫేస్బుక్లో షేర్ చేస్తూ, తన కొడుకులు తనకు సాంప్రదాయ పద్ధతిలో, సరైన ఆచారాలతో పాటు బహుమతినిచ్చారంటూ సంతోసాన్ని వ్యక్తం చేశారు. మెర్సిడెస్ GLS ధర రూ.1.5 కోట్లకు పైగా ఉంది. విశాలమైన క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ,పవర్ఫుల్ ఇంజిన్ ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి ఇందులో. సరిగ్గా మూడు నెలల తర్వాత మరోపోస్ట్ చేశారు. బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తూ, ప్రజా రవాణా వ్యవస్థ సౌలభ్యాన్ని ప్రశంసించారు."మెట్రోలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది, అది కూడా మహిళా కంపార్ట్మెంట్లో! నమ్మమెట్రో" అంటూ ఇన్స్టా క్యాప్షన్లో రాసుకొచ్చారు.చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్కాగా పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషిని వెబ్సైట్ ప్రస్తావించింది. రేవతి కామత్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ఆమె లక్షకు పైగా చెట్లను నాటారు. కర్ణాటకలోని కనకపురలోని సోమనహళ్లి సరస్సును పునరుద్ధరించరు. దీంతో అదిపుడు పచ్చిన ప్రకృతితో, నిండుగా కళకళలాడుతోంది. అంతేకాదు 28 ఎకరాల భూమికి, 300 బోర్వెల్స్, 200 ఓపెన్ బావులకు ప్రయోజనకరంగా మారింది. ప్రతీ తల్లికి, ఆమె పిల్లల విజయం గొప్ప బహుమతి. కానీ రేవతి కామత్ విషయంలో ఆమె కుమారులు, జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ మరో అడుగు ముందుకు వేశారు. అయితే ఒక ‘అమ్మ’గా పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చి మరో మెట్టు ఎక్కారు అంటున్నారు అభిమానులు. ఈ అమ్మలందరూ అంతే.. అంటూ మరికొందరు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Revathi Kamath (@revathikamath.world) ఇదీ చదవండి: డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ! -
డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ!
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల ఎగవేసి లండన్లో తలదాచుకున్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా(Vijay Mallya) భారతదేశంలో సుపరిచితుడు. కింగ్ఫిషర్ బ్రాండ్, ఎయిర్లైన్స్,అందాల భామలతో కేలండర్లు, లగ్జరీ జీవనశైలి, మనీలాండర్, ఆర్థిక నేరస్తుడు, తాజాగా ఐపీఎల్ ఇలా ఏదో కారణంతో నిరంతరం వార్తల్లో ఉండే వ్యక్తి. కానీ చాలా మందికి అతని వ్యక్తిగత జీవితం , అతని దత్తపుత్రిక ‘లైలా మాల్యా’ (Laila Mallya) గురించి పెద్దగా తెలియదు. తండ్రిలా వార్తల్లో ఉండే వ్యాక్తిలా కాకుండా ప్రశాంతంగా ప్రైవేట్ జీవితాన్ని గడుపుతూ ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది.విజయ్ మాల్యాకు లియానా, తాన్య, లైలా అనే ముగ్గురు కూతుళ్లున్నారు. అయితే మాల్యాకు దత్తత కూతురు. తన మొదటి భార్య సమీరాతో విడిపోయిన తర్వాత 1993లో చిన్ననాటి ప్రేమికురాలు రేఖను వివాహం చేసుకున్నాడు మాల్యా. రేఖ మొదటి భర్త మెహమూద్తో విడాకులు, తనతో వివాహం తర్వాత చట్టబద్ధంగా లైలాను తన కుమార్తెగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా మాల్యా కుటుంబంలో భాగమైంది. 'మాల్యా' నుతన ఇంటిపేరుగా మార్చుకుంది. ఆమె తండ్రి జీవితం నిరంతరం మీడియాలో హెడ్లైన్గా మారినప్పటికీ, లైలా తన చదువుపై దృష్టి పెట్టింది. విజయ్ పిల్లల్ని తన సొంత చెల్లెళ్లలా చూసుకుంది. తల్లిరేఖకు మునుపటి వివాహం నుండి ఒక అన్నయ్య కబీర్ కూడా ఉన్నాడు.2011లో, లైలా మాల్యా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సమర్ సింగ్ను వివాహం చేసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో వీరి పెళ్లి జరిగింది. లైలా భర్త సమర్ సింగ్, శరద్ పవార్ మనవడు, రాజకీయ నాయకుడు పార్థ్ పవార్కు మంచి స్నేహితుడు. 2019లో, సమర్ లోక్సభ ఎన్నికల మార్కెటింగ్ ప్రచారంలో పార్థ్కు క్యాంపెయిన్ కూడా చేశాడు.లైలా చదువు, కరియర్లైలా కర్ణాటకలోని బెంగళూరులోని మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, మసాచుసెట్స్లోని వాల్తామ్లోని బెంట్లీ యూనివర్సిటీలోఇంటర్నేషనల్ బిజినెస్లో గ్రాడ్యుయేషన్ , ఆ తరువాత న్యూయార్క్ నగరంలోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కూడా పూర్తి చేసింది. 2009లో, ఆమె IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేసింది, క్రీడలు , ఈవెంట్ మేనేజ్మెంట్పై తొలి అడుగు వేసింది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు. తన అభిరుచికి తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.ఆభరణాల లేబుల్, సోషల్ బటర్ఫ్లైని ప్రారంభించింది. ఆభరణాల డిజైన్లో ప్రతిభను చాటుకుంటోంది 2015 నాటికి వోగ్ బ్రాండ్ జ్యువెలరీ డిజైనర్, స్టైలిస్ట్గా ఎదిగింది. లైలా ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా అనేక ఫ్యాషన్ వీక్ షోలలో కూడా పాల్గొంది. లైలా మాల్యా తన తండ్రి అంత పాపులర్ కాకపోవచ్చు. కానీ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని కెరీర్ను నిర్మించుకున్న ఇండిపెండెంట్ మహిళ అనడంలో సందేహం లేదు. -
ఎవరీ పిడుగు.. ఎనిమిదేళ్లకే పత్రిక ఎడిటర్గా రికార్డ్!
పిల్లలూ! రోజూ పొద్దున్నే న్యూస్పేపర్ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రకరకాల వార్తలు ఏరి, కూర్చి మనకు అందించేందుకు న్యూస్పేపర్ సంస్థలో అనేకమంది పనిచేస్తుంటారు. వారందరికీ బాస్గా వ్యవహరించేది ఎడిటర్. ఆ పత్రిక బయటకు రావడంలో ఆయనదే కీలకపాత్ర. ఎడిటర్గా స్థానం పొందాలంటే ఎంతో అనుభవం కావాలి. అయితే ఓ పాప మ్యాగజైన్ ఎడిటర్గా మారి రికార్డు సృష్టించింది.ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్ డౌన్స్...ఎనిమిదేళ్లకే ’ఇట్ గర్ల్ మ్యాగజన్’ (It Girl Magazine) అనే మ్యాగ్జైన్ కి ఎడిటర్గా మారింది. ఆ వయసున్న చిన్నారులు తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు. అయితే రోక్సాన్ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉంది. తన వయసున్న ఆడపిల్లలు చదువుకునే మ్యాగ్జైన్ రూపొందించాలని భావించింది. దానికి తనే ఎడిటర్గా మారింది. మ్యాగ్జైన్లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకునేందుకు రోక్సాన్ చాలా పరిశోధనలు చేసింది. రోజంతా తన వయస్సు గల వారితో తిరుగుతూ వారి ఇష్టాలు, ఇబ్బందులు, వారు ఆసక్తులు గమనించి, వాటి గురించి తన మ్యాగ్జైన్లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంమ్యాగ్జైన్ కోసం ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ని రోక్సాన్ ఇంటర్వ్యూ చేసింది. అది ప్రఖ్యాతి పొందడంతో ఆ తర్వాత అనేకమంది రచయితలు, టిక్టాక్ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థితికి చేరుకుంది. ఆ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్లో చూడొచ్చు. ఓ వైపు మ్యాగ్జైన్ పనులు చేస్తూనే, పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది రోక్సాన్. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని తను చెపుతోంది.ఇదీ చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్ -
Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. రోజూ అందించే టిప్లో భాగంగా ఈ రోజు కాలా మటన్, రామ్పూరి తార్ కుర్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసినవి: మటన్ – ముప్పావు కేజీ, గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు, పసుపు – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పెరుగు – కప్పు, ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు, నూనె – ఐదు టేబుల్ స్పూన్లు, ధనియాలు – టేబుల్ స్పూను, గసగసాలు – టేబుల్ స్పూను, యాలుక్కాయలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, లవంగాలు – ఐదు, మిరియాలు – ఐదు, సోంపు – టేబుల్ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, ఎండుకొబ్బరి తురుము – అరకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, షాజీరా – టీస్పూను, వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు – టేబుల్ స్పూను, బంగాళ దుంపలు – రెండు, చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు.తయారీ: మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత మటన్ను కుకర్లో వేయాలి. దీనిలో కొద్దిగా ఉల్లి పాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. దీనిలో కొన్ని ఉల్లి పాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషం పాయించాలి. ∙తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాల పాటు మగ్గనిచ్చి దించేయాలి. అంతే ఘుమఘుమ లాడే టేస్టీ టేస్టీ కాలా మటన్ రెడీ. రామ్పూరి తార్ కుర్మాకావలసినవి: నెయ్యి – కప్పు, మటన్ - కేజీన్నర, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్ స్పూన్లు, కారం - రెండు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, పసుపు – అర టీస్పూను, గరం మసాలా పొడి – టేబుల్ స్పూను, వేయించిన ఉల్లిపాయ పేస్టు - పావు కప్పు, పెరుగు – ఆరు టేబుల్ స్పూన్లు, పాలు -కప్పు, ఫూల్ మఖనీ – నాలుగు టేబుల్ స్పూన్లు, కర్బూజా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, మటన్ సూప్- అరలీటర్, జీడిపప్పు - పది. కుర్మా మసాలా: యాలుక్కాయలు -పది, నల్ల యాలుక్కాయలు - రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, జాపత్రి ΄ పొడి -పావు టీ స్పూన్, అనాసపువ్వు- రెండు, లవంగాలు- నాలుగు, షాజీరా - టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము - టేబుల్ స్పూను, మిరియాలు -పది, కశ్మీరి ఎండుమిర్చి రెండు. తయారీ: ∙మటన్ను శుభ్రంగా కడిగి టేబుల్ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కనబెట్టాలి. ∙కర్బూజ గింజలు, పూల్ మఖనీలను అరకప్పు ΄పాలలో నానబెట్టి, పేస్టు చేయాలి. ∙కుర్మా మసాలా దినుసులన్నింటిని దోరగావేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి. ∙మందపాటి బాణలిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, కారం వేయాలి. అరనిమిషం వేగాక మటన్ ముక్కలు, పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను మీడియంకు తగ్గించి, కుర్మా మసాలా టీస్పూను పక్కన పెట్టి మిగతాది వేయాలి, ఉల్లి΄పాయ పేస్టు, పూల్ మఖనీ పేస్టు, పెరుగు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మటన్ సూప్,పావు కప్పుపాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. చివరిగా కుర్మా మసాలా పొడి, జీడిపప్పు వేసి మగ్గనిచ్చి దించేయాలి. -
పాటనుకుంటివా.. ఫైర్ ఇంజన్లు..!
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ యేడాది ఒడిశా (Odisha) 4,500 హెక్టార్లకు (11,120 ఎకరాలు) పైగా అడవులను మంటలు (wildfires) ప్రభావితం చేశాయి. ఈ సమస్య ప్రతి యేటా ఎదుర్కొనేదే. అధికారులు సీసీ కెమెరాలు, ఉపగ్రహ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటలను ట్రాక్ చేస్తున్నారు. అడవిలో ఎండు ఆకులను కాల్చడం వల్ల కూడా వేడిగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడం మరింత కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నుంచి గ్రామ ప్రజలను రక్షించడం కోసం ఒకప్పుడు పురుషులు జట్లు జట్లుగా కలిసి ఊళ్లన్నీ తిరిగి పాటలుపాడి అగ్నిప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను స్త్రీలు స్వీకరించడమే కాదు. మరింత బాగా అవగాహన కల్పిస్తూ... ప్రమాదాల నుంచి రక్షిస్తున్నారని కియోంఝర్ జిల్లాలోని అటవీ డిప్యూటీ పరిరక్షకుడు హనుమంత్ ధమ్ధేరే అన్నారు.ఒడిషా రాష్ట్రంలోని ముర్గపహాడి గ్రామంలోని మహిళలు సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పొలం పనులు, పిల్లలను సాకడం చేస్తుండేవారు. దీంతోపాటు అడవుల్లో పువ్వులు, కట్టెలు సేకరిస్తుంటారు. ఉపాధి లేనప్పుడు వారి భర్తలు నగరాల్లో పని చేస్తుంటే వీళ్లు ఇళ్లను నడిపిస్తుండేవారు. రెండేళ్లుగా మహిళలు కూడా బృందాలుగా చేరి, పాటలుపాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇది వారి స్వీయ గౌరవాన్ని పెంచడమే కాదు సమాజంలో వారి పాత్రను మరింత బలపరుస్తోంది.సంప్రదాయ గీతాలతో ఆధునిక పరిష్కారంఈ ప్రయత్నం ఫలితంగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు 20–30 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధమ్ధేరే కొన్ని మహిళా సంకీర్తన బృందాలను చేర్చుకున్నారు. ఈ బృందాలు స్థానిక భాషలలో కాపాడతాయి. వాటిని స్థానిక ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు అవగాహనతో అటవీ పరిరక్షణకు పాటు పడుతుంటారు. ఈ పని చేసినందుకు గాను ఈ బృందాలకు అటవీశాఖ నుంచి ఆదాయం కూడా లభిస్తుంది.సాంస్కృతిక పునరుద్ధరణసంకీర్తన మండళ్ళు 15వ శతాబ్దం నుంచి ఉన్న సంప్రదాయ గీతాల సమూహాలు. ఈ సంప్రదాయాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించి, పర్యావరణ పరిరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా పరిగణించవచ్చు. అయితే, సంకీర్తన మండలి బృందాలలో సాధారణంగా పురుష గాయకులు, నృత్యకారులు ఉండేవారు. వీరు డ్రమ్స్ వాయించడం, మతపరమైన భక్తిపాటలు పాడేవారు. ‘గ్రామాల్లోని పురుషులు ఫ్యాక్టరీలలో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లినప్పుడు సంకీర్తన మండళ్ళు దాదాపుగా పనిచేయడం లేదు. మేం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం’ అని ముర్గపహాడిలోని బృందానికి నాయకత్వం వహిస్తున్న 35 ఏళ్ల ప్రమీలా ప్రధాన్ చెప్పారు. ప్రధాన్ బృందంలో 17 మంది ఉండగా, వారిలో తొమ్మిదిమంది మహిళలు ఉన్నారు.పురుషులు ఈ మండళ్ళను వదిలి వెళ్లాక, గ్రామీణ మహిళలు ‘సంకీర్తన మండలి’ అనే సంప్రదాయ సంగీత సమూహాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ గీతాలు దేవుని గురించి మాత్రమే కాక, ప్రకృతి పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణ వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఇది ఒకవైపు వారిని సాధికారతవైపుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతోంది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంఉపాధి గీతాలురాష్ట్రంలో దాదాపు 20,000 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో కనీసం 1,000 బృందాలు మహిళలే నిర్వహిస్తున్నారు. అటవీ మంటలు వారి ఆదాయాలను, పిల్లల పోషణను ప్రభావితం చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. ‘కుటుంబ పోషణ కోసం అడవిదుంపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులను సేకరిస్తాం. పెద్ద అగ్నిప్రమాదం జరిగితే, ప్రభుత్వం నుంచి మాకు లభించే బియ్యంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేలా సంకీర్తన మండలిలో చేరినందుకు మాకు ఉపాధి కూడా లభిస్తోంది‘ అని 42 ఏళ్ల బాలమతి చెప్పారు. చదవండి: మాల్యా లగ్జరీ విల్లాను దక్కించుకున్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?కేతకి నాయక్కి 10 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు పాతికేళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘నా చిన్నతనంలో పాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు బృందంలో చేరి, ఊరంతా తిరిగి పాటలు పాడుతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు’ అని ఆనందంగా చెబుతుంది. ఇప్పుడు ఈ మండళ్ళలో యువతులు, విద్యార్థులు కూడా చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీని ద్వారా తరువాతి తరం అడవుల పరిరక్షణకు ఏం చేయగలరో నేర్చుకుంటున్నారు. ఇదీ చదవండి: Food Safety ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు -
World Food Safety Day 2025 ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు
World Food Safety Day 2025 సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్య అంతా వంట గది నుంచే మొదలవుతుంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలంటే..? ప్రతి యేటా సురక్షితం కాని ఆహారం తినడం వల్ల 60 కోట్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. నేడు ఫుడ్ సేఫ్టీ దినోత్సవ సందర్భంగా కొన్ని సురక్షితమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం...చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వాడిన పాత్రలను, వాడాలనుకున్న పాత్రలను తప్పనిసరిగా కడిగాకనే తిరిగి ఉపయోగించాలి. ముడి పదార్థాలను, వండిన పదార్థాలను వేరుగా ఉంచడం వల్ల క్రాస్–కాలుష్యాన్ని నివారించ వచ్చు. పూర్తిగా ఉడికించాలి. ముఖ్యంగా మాంసం, మాంసాహారం, సముద్రపు ఆహారం.. బాగా ఉడికించిన తర్వాతనే తీసుకోవాలి. ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేయాలి. అతి చల్లని, అతి వేడి పదార్థాలను తీసుకోవడం నివారించాలి. సురక్షితమైన నీరు, ముడి పదార్థాలను ఉపయోగించాలి. పదార్థాల తాజాదనాన్ని చెక్ చేసి, తీసుకోవాలి. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో చాలా ముఖ్యం.ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలుఆహారాన్ని శుభ్రంగా వుంచుకోవడం అన్నది 200 కంటే ఎక్కువ ఆహార సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. తాజా ఆహారం వల్ల ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించవచ్చు. సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఇంట్లో/రెస్టారెంట్లలో ఆహారాన్ని ఎక్కడ తీసుకున్నా ఆరోగ్యకరమైన దాని పట్ల తప్పక దృష్టి పెట్టాలి. -
భక్తి... త్యాగాల సమ్మేళనం ఈదుల్ అజ్ హా
ప్రతి విశ్వాసికి జీవితంలో తీపి గుర్తులుగా నిలిచి΄ోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో పండుగలు కూడా ఒకటి. ఇస్లామ్ జీవన విధానంలో ముస్లింలు రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ /రమజాన్, రెండవది ఈదుల్ అజ్ హా/బక్రీద్. ఈదె ఖుర్బాన్ గా పిలువబడే ఈ బక్రీద్ పర్వదినం చరిత్రలో ఒక విశిష్ట స్థానం దక్కించుకుంది. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఇది భక్తి, త్యాగం, ప్రేమ, సహనం, సమానత్వం, మానవతా విలువల ఉత్కృష్ట రూపం. ఈద్ మూలసారాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను దైవం పరీక్షించాడు. పరీక్షలో భాగంగా తన కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను త్యాగం చేయమని ఆదేశించాడు. దైవాదేశాన్ని విన్న మరుక్షణం ఆయన ఎలాంటి తడబాటు లేకుండా అంగీకరించారు. కుమారుణ్ని కూడా సంప్రదించారు. ఇది దేవుని ఆజ్ఞ అని అర్థమై, తండ్రికి సహకరించేందుకు సిద్ధపడ్డాడు కుమారుడు. ఇదే సమయంలో దైవం వారి నిబద్ధతను మన్నించి, వారి త్యాగానికి బదులుగా ఒక గొర్రె పొట్టేలును పంపించి, వారిని పరీక్షనుండి సురక్షితం గావించాడు. నిజాయితీ, భక్తి తత్పరత, నిబద్ధత, త్యాగనిరతి లాంటి సుగుణాలన్నీ ఎటువంటి కఠిన పరీక్షలనుంచయినా సురక్షితంగా బయట పడేయగలవని ఈ సంఘటన రుజువు చేస్తోంది.ఈ ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ముస్లింలు ఈదుల్ అజ్ హా/బక్రీద్ జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం ఒక జంతువును త్యాగం చేయడం మాత్రమే కాదు. అది మన మనస్సులోని స్వార్థాన్ని, లోభాన్ని, అహంకారాన్ని త్యాగం చేయడం కూడా! మనం చేసే ఈ త్యాగం తాలూకు భక్తి శ్రద్ధలు అంటే తఖ్వా మాత్రమే దైవం చూస్తాడు, స్వీకరిస్తాడు. రక్త మాంసాలతో ఆయనకు సంబంధంలేదు. అవసరమైతే ధర్మం కోసం, న్యాయం కోసం నాప్రాణమైనా ఇస్తాను అనే స్పష్టమైన సంకేతం ఇందులో ఉంది. ఈ విషయం ఖురాన్లో ఇలా ఉంది: నా నమాజు, నా త్యాగం (నుసుక్), నా జీవితం, నా మరణం సమస్తమూ సర్వలోక పాలకుడైన దైవానికే.(పవిత్ర ఖురాన్ 6:162)’అల్లాహ్ వద్దకు మాంసం గాని, రక్తం గాని చేరవు; ఆయనకు చేరేది మీ తఖ్వా మాత్రమే’ (పవిత్ర ఖురాన్ , సూరె హజ్ : 37) ఈద్ పర్వదినాన్ని మనం ఎలా గడిపితే అది దైవానికి ఆమోదయోగ్యమవుతుందో ఆ దిశగా ప్రతి విశ్వాసి ప్రయాణం సాగాలి. త్యాగం, భక్తి, ప్రేమ, వినయం, క్షమ, సహనం, మానవత ఇవే ఈ పండుగకు మూల సారాంశం. మన తలుపు తట్టే ప్రతి అవసరమున్న హృదయాన్ని తాకే రోజు ఈదుల్ అజ్ హా కావాలి. మనం చేసే త్యాగం దైవానికి చేరాలంటే అది హృదయ పూర్వకమైనదిగా, తఖ్వాతో కూడినదై ఉండాలి.హృదయాన్ని తాకే సందేశంఈ పర్వదినాన మాంసాన్ని పంచుకోవడం కూడా ఒక విశేషమైన సంప్రదాయం. పేదలకు, బంధువులకు, సొంత కుటుంబానికి ఈ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి పంచడం వల్ల పరస్పర మానవ సంబంధాలు బలపడతాయి. ఇది ఒక ఆచారమే కాదు, ఒక సాంఘిక బాధ్యత కూడా.ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారి ప్రవచనం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది: ‘తను కడుపునిండా అన్నం తిని, తన పొరుగువాడు పస్తు ఉన్నట్లయితే, అలాంటి వ్యక్తి మోమిన్ (విశ్వాసి) కాలేడు. (ముస్త్రదక్ అల్ హాకీం, 7303) ఈ హదీసు మనకు బోధించేది, మనకు తెలిసేది ఏమిటంటే ఈద్ పర్వదినం సందర్భంగా సంతోషం కేవలం మన ఇంట్లో మాత్రమే కాదు, మన చుట్టుపక్కల వారిని కూడా మన సంతోషంలో భాగస్వాములను చేయాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత. అదే నిజమైన మానవత. అలాగే, ఈద్ సందర్భంగా త్యాగం అంటే, కేవలం మాంసం పంచడం మాత్రమే కాదు, మన అవసరాలను కొంతవరకు నియంత్రించుకొని, పేదసాదల పట్ల కరుణతో, సేవాభావంతో వ్యవహరించాలి. నిజమైన త్యాగం అంటే పండుగ, పండుగ తర్వాతి కాలంలోనూ మన ప్రవర్తనలో మార్పు కనిపించాలి. మన వ్యక్తిత్వంలో, మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సమాజంలో పరిశుభ్రత, నైతికత పరిఢవిల్లాలి. ముఖ్యంగా ఈద్ రోజున మనం ఇరుగు, పొరుగును పలకరించాలి. కులమతాలు వేరయినా, మానవతా సంబంధాల పరంగా మనమంతా ఒక్కటే. పరస్పరం సోదర సంబంధమే. ఈ ఐక్యతను చాటాలి. ఈద్ ఒక ఇస్లాంకు సంబంధించిన పండుగ అయినా, దాని సందేశం విశ్వమానవీయంగా ఉంది. ప్రతి హృదయాన్ని తాకే విధంగా ఉంది. దీన్ని మత విభేదాల్ని చెరిపి, మానవతను సమీకరించే రోజుగా మార్చుకోవాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Vijay Mallya లగ్జరీ విల్లాను కొన్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?
భారతీయ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి లండన్కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya) మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2025 (IPL2025)లో ఆర్సీబీ (RCB) టైటిల్ గెల్చుకున్న తరువాత మాల్యా హాట్ టాపిక్గా నిలుస్తున్నాడు. 2008లో ఆర్సీబీ జట్టును స్థాపించిన ఇన్నాళ్లకు ట్రోఫీని గెల్చుకోవడం మాల్యాకు నిజంగా సంతోషకరమైన క్షణమే. అందుకే జట్టుపై ప్రశంసలు కురిపించాడు. 18 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం, సోషల్ మీడియా వేదికగా విజయ్ మాల్యా పోస్ట్ తరువాత నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గోవాలోని విజయ్ మాల్యా కింగ్ఫిషర్ విల్లాని ఎవరు కొన్నారు? అనేది చర్చ నీయాంశంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆర్సీబీతోపాటు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు. గోవాలోని ఐజయ్ మాల్యా కింగ్ఫిషర్ విల్లా విలాసాలకు పెట్టింది పేరు. ఈ విల్లాలో విలాసవంతమైన పార్టీలను నిర్వహించేవాడు. గ్లామర్ ప్రపంచంలోని ప్రముఖులు హాజరయ్యేవారు. ఉత్తర గోవాలోని ఉన్నత స్థాయి కాండోలిమ్ బీచ్ గ్రామంలో 12,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిలో కృత్రిమ చెరువులు, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్-ఎయిర్ డ్యాన్స్ ఫ్లోర్లు, పచ్చని తోటలు లాంటి హంగులెన్నో ఉన్నాయి.మాల్యా వేలకోట్ల ఏగవేత కేసులో 2016లో, దర్యాప్తు ప్రారంభమైనప్పుడు, బ్యాంకుల రుణాల చెల్లింపు ప్రక్రియలో భాగంగా దీన్ని బ్యాంకుల కన్సార్షియం వేలానికి పెట్టింది. ఖరీదైన కింగ్ ఫిషర్ విల్లాను ఎస్బీఐ బ్యాంకు ఎన్నిసార్లు వేలానికి పెట్టినా ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. . ఆన్లైన్ ఆక్షన్లో ఎవ్వరూ దీనిని సొంతం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు 2017లో ఈ విల్లాను బాలీవుడ్ దంపతులు సచిన్ జోషి ,ఊర్వశి శర్మ రూ. 73.01 కోట్లకు కొనుగోలు చేశారు. తరువాత ఈ విల్లా పేరును కింగ్స్ మాన్షన్గా మార్చాడుచదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంకింగ్ఫిషర్ విల్లా- కింగ్స్మాన్షన్విజయ్ మాల్యా లాగే, సచిన్ జోషి కూడామద్యం తయారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు, దీని ఉత్పత్తులలో 'కింగ్స్ బీర్' కూడా ఉంది. కింగ్స్ బీర్ బ్రాండ్ కనెక్షన్ కారణంగా ఈ పేరు పెట్టినట్టు గతంలో ఒక సందర్బంలో వెల్లడించాడు సచిన్.చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?ఎవరీ సచిన్ జోషి ప్రముఖ వ్యాపారవేత్త జగదీష్ మోహన్ లాల్ జోషి కుమారుడు సచిన్ జోషి. తండ్రి స్థాపించిన జేఎంజే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధిపతివున్నాడు. సచిన్ కేవలం వ్యాపారవేత్త మాత్రమేకాదు హీరో కూడా. క్రీడలంటే ఆసక్తి. 2002లో 'మౌనమేలనోయి..' అనే సినిమాతో టాలీవుడ్ ద్వారా నటుడిగా సినీపరిశ్రమకి పరిచయమైన సచిన్ 2011లో అజాన్ చిత్రంతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ముంబై మిర్రర్, జాక్పాట్ చిత్రాలతోపాటు తెలుగు చిత్రాలలో కూడా నటించినా పెద్దగా కలిసి రాలేదు. 2021లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. ఈ మాజీ నటి ఊర్వశి శర్మను వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు. -
ముంబై ‘మాస్క్’ రెస్టారెంట్ ఘనత, ఇండియాలో ఒకే ఒక్కటి!
ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. 2025 సంవత్సరానికి గాను ఈ ప్రపంచ ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ 68వ స్థానంలో నిలిచింది. ఆసియా నుండి తొమ్మిది ఎంట్రీలలో మాస్క్ ఒకటి కాగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ మాస్క్ కావడం విశేషం.ప్రతిష్టాత్మక సంస్థ రూపొందించిన ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ ప్రపంచవ్యాప్తంగా 68వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 50 ఉత్తమ రెస్టారెంట్లు 51 - 100 వరకు ర్యాంక్ పొందిన జాబితా తాజాగా వెల్లడైంది.ఈ జాబితాలో ఆరు ఖండాల్లోని 37 నగరాల్లోని రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఈ జాబితాలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన మాస్క్ అపుడు 78వ స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాదితో పోలిస్తే మరికొన్ని ర్యాంకులు పైగా ఎగబాకింది.చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?2016లో ప్రారంభమైన మాస్క్...దక్కించుకున్న ప్రశంసలు, అవార్డులు చాలానే ఉన్నాయి. దేశంలో టాప్ రెస్టారెంట్గా అనేక సార్లు నిలిచింది. 2025 ఆసియా బెస్ట్ రెస్టారెంట్ల 50 జాబితాలో కూడా మాస్క్ 19వ స్థానాన్ని దక్కించుకుంది. యాక్సెంట్ ఢిల్లీ 46వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్న ఏ రెస్టారెంట్ కూడా ఇటీవలి కాలంలో 50 ఉత్తమ జాబితాలో చోటు దక్కించుకోలేదు. విదేశీ రెస్టారెంట్లు టాప్ప్లేస్స్ దక్కించు కున్నాయి. ఉదాహరణకు, బ్యాంకాక్లోని గగ్గన్, దుబాయ్లోని ట్రెసిండ్ స్టూడియో ఎక్కువగా టాప్ ప్లేస్ను ఆక్రమించుకున్నాయి.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్! -
Beauty Tip : మీ ముఖం చందమామలా మెరవాలంటే..!
ఆరోగ్యకరమైన ఆహారం, తగినన్ని నీళ్లు, సూర్యరశ్మి, క్రమం తప్పని వ్యాయామం, మంచి ఆలోచనలు మంచి చర్మ , జుట్టు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యాన్ని మంచిన అందం, ఆనందం మరొకటి ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అందరిలోనూ అందమైన చందమామలా మెరిసిపోవాలని ఎవరికి ఉండదు. అందుకే అద్భుతమైన చిట్కాలు మీకోసం..పెసర పిండిలో పెరుగు కొబ్బరి నూనె కలిపి ముఖాలకు చేతులకు పాదాలకు రాయాలి. ఆరిన తరువాత మృదువుగా శుభ్రం చేసుకుంటే.. మిల మిల మెరుపు మీ సొంతం.మందార ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయపడుతుంది ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.ముఖం మిలమిలలాడాలంటే కొబ్బరి నూనెలో కాఫీ పౌడర్ వేసి ఇది పేస్ట్ లా తయారయ్యేంత వరకూ బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గి పోతాయి.కలబంద గుజ్జు అలోవెరా జెల్... ఒక సహజసిద్ధమైన కండీషనర్. మాయిశ్చరైజర్ కూడా.కలబంద గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చుండ్రు సమస్యలు, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. కలబంతో కాలిన గాయాలు కూడా త్వరగా మాని పోతాయి మచ్చలు ఏర్పడవుగోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుకల కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది.ఇవీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ? -
స్లిమ్గా మారిన నర్సు..బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పెరుగు..
ఈ వెయిట్ లాస్ స్టోరీ వింటే అవాక్కవ్వుతారు. బాబోయ్ ఇవేం ఫుడ్ అలవాట్లు.. అనిపిస్తుంది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లతోనే స్లిమ్గా మారింది, కానీ బరువు తగ్గాలనుకునే వారు తీసుకోకూడని హెవీ ఫుడ్స్తోనే ఆమె బరువు తగ్గడం విశేషం. నోటిని కట్టడి చేయకుండా.. కడుపు నిండుగా తింటూ బరువు తగ్గి చూపించింది. పైగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ..హాయిగా రుచికరమైన ఆహారం తింటూనే బరువు తగ్గడం ఎలాగో చూపించింది. మరి ఆమె వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగిందో సవివరంగా చూద్దామా.!.కెనడాకు చెందిన మెలనీ కోజ్(21) తన పనివేళల కారణంగా బర్గర్లు, ఫ్రైస్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకునేదట. దాంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొందట. చిన్న వయసులోనే అంత బరువు ఉండటంతో చాలా ఇబ్బందులు పడేది కూడా. పైగా వయసుకి మించిన అధిక బరువు ప్రమాదమని హెచ్చరించడంతో బరువు తగ్గేందుకు ఉప్రక్రిమించిందట. అందుకోసం పలు రకాల వర్కౌట్లు, యోగా, వ్యాయమాలు వంటివి ఎన్నింటినో చేసి.. దాదాపు రెండేళ్లు పూర్తిగా విఫలమైంది. ఇక లాభం లేదనుకుని..డైట్లోనే ఏదైనా మార్పు చేయాలి.. లేదంటే కష్టమే బరువు తగ్గడం అని అర్థమైంది మెలోనికి. దాంతో న్యూట్రిషియన్ కోర్సులో చేరి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో సవివరంగా తెలుసుకుంది. ఇక అప్పటి నుంచి అధిక ప్రోటీన్తో కూడిన ఆహారాలు తినడం ప్రారభించింది. ముఖ్యంగా ఉదయం బ్రేక్ఫాస్ట్గా అధిక ప్రోటీన్తో కూడిన గిన్నెడు పెరుగు తోపాటు తాజా పండ్లను జోడించి తీసుకునేదట. ఇది కడుపు నిండిన అనుభూతి కలిగించి చాలాసేపటి వరకు ఫుడ్ తినాలనే కోరికను నివారించేదట. అలాగే అనారోగ్యకరమైన చిరుతిండ్లన్నింటికి పూర్తిగా దూరంగా ఉండేదట. దాంతో తన బరువులో అనుహ్యమైన మార్పుల మొదలయ్యాయట. అలా 44 కిలోలక వరకు తగ్గానని, ప్రస్తుతం 69 కిలోలు ఉన్నట్లు తెలిపింది. అయితే తన డైట్లో తక్కువ ఫ్యాట్ కలిగిన చీజ్, చికెన్, చేపలు వంటి ఉన్నాయట. అలాగే తనకు ఇష్టమైన స్వీట్స్ కూడా తినేదాన్ని అంది. అది కూడా హెల్దీ స్వీట్స్ తప్ప..ప్రాసెస్ చేసినవి కావట. ప్రస్తుతం ఈ నర్స్ వెయిట్ లాస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్గా మారింది. అధిక ప్రోటీన్తో కూడిన ఆహారం బరువు తగ్గిస్తుందా..ఇది కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. అధికంగా ఫుడ్ తీసుకోవాలనే ఆలోచనను నివారిస్తుంది. అలాగే మంచి బలాన్ని అందించి..బరువు తగ్గాలనే లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. తద్వారా కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే..కఠినమైన డైట్ల జోలికి పోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సరైన విధంగా తీసుకుంటే..ఆహారమే ఆరోగ్యం అని, అతిగా తీసుకుంటే విషంగా మారి అనర్థాలకు కారణమవుతుందని చెప్పారు. పూర్తిగా చెడు ఆహారపు అలవాట్లను నివారించి హెల్దీ ఫుడ్కి ప్రాముఖ్యత ఇస్తే బరువు తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుందట. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !) -
రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !
వాకింగ్ అంటే అందరు కామన్గా చేసేదే. అయితే ఈ వాకింగ్ మాత్రం చాలా విభిన్నమైనది. సంప్రదాయ వాకింగ్ కంటే మంచి ఫలితాలను పొందగలగుతారట. దీన్ని జపనీస్ వాకింగ్ అనిపిలుస్తారు. మరి ఆ నడక వ్యాయామం విశేషాలేంటో చూద్దామా..!. జనీస్ వాకింగ్ వ్యాయామం అంటే..దీన్ని ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ (ఐడబ్ల్యూటీ) లేదా జపనీస్ వాకింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యామ్నాయ విరామాలను కలిగి ఉంటుంది. మూడు నిమిషాల వేగవంతమైన నడక, మరో మూడు నిమిషాలు స్లో వాకింగ్. ఇలా కనీసం ఐదు విరామాల సెట్తో కూడిని వాకింగ్ చేస్తారు. మంచిదేనా అంటే..ఇలా వేగవంతంగా, మళ్లీ చాలా నెమ్మదిగా చేసే వాకింగ్ విధానం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. శారీరక ధృఢత్వాన్ని మెరుగుపరచడంలో, కండర బలాన్ని, గ్లైసెమిక్ నియంత్రణను అందిస్తుందట. వ్యాయామం చేయలేకపోతున్నా అని బాధపడేవారికి.. ఇది మరింత మేలు. అన్ని వయసుల వారికే కాదు వృద్ధులు సైతం హాయిగా ఈ విధానంలో వాకింగ్ చెయ్యొచ్చట. అంతేగాదు ఇది మంచిదేనా? కాదా అని జపనీస్ నిపుణులు సుమారు 63 సంవత్సరాల వయస్సు గల దాదాపు 200 మందిపై అధ్యయనాన్ని నిర్వహించగా మెరుగైన ఫలితాలను కనిపంచాయి. అందువల్ల ఇది సురక్షితమైనదని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అయితే బాగా వేగంగా వాకింగ్ చేసేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం లేకపోలేదనేది కొందరి పరిశోధకులు వాదన. కలిగే లాభాలు..రక్తపోటు తగ్గుతుందిరక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎలా చేయాలంటే..ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అనేది సరిగా సాధనం చేయడంపైనే మెరుగైన ఫలితాలు అనేవి ఉంటాయట. మొదట సాధారణ వేగంతో నడిచి..ఆ తర్వాత ఓ 20 నుంచి 30 సెకన్లు వేగంగా నడవాలట. మళ్లీ బ్రేక్ ఇచ్చి స్లోగా ఇలా ..కనీసం మూడు నుంచి ఐదు సెట్ల చొప్పున చేయాలట. ప్రారంభంలో 30 నిమిషాలు కేటాయించి.. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధానాన్ని పెంచుకోవాలట. అదీ కూడా మన బాడీ తత్వానికి అనుగుణం చేయాలట. ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లను ధరించి చేయాలట. అంతేగాదు ఒకవేళ ఈ క్రమంలో తలనొప్పి, వికారం వంటివి వచ్చినట్లయితే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చాలామటుకు దీన్ని పిట్నెస్ నిపుణుల సమక్షంలో ఈ విధానాన్ని ప్రయత్నించడం మంచిదని చెప్పారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.(చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..) -
రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్మార్కెట్ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్డీటీవీ తన స్పెషల్ రిపోర్ట్లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో తన బ్రైడల్ లుక్ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..
ప్రస్తుతం ఈ రోజుల్లో ఏ వ్యాపారమైన క్లిక్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో వైఫల్యాల అనంతరం గానీ లాభాల బాటపట్ట లేరు. కానీ కొందరూ పెట్టుబడితో పనిలేకుండా..ప్రస్తుత అవసరాలు, డిమాండ్ వంటి వాటికి అనుగుణంగా..పెట్టుబడితో పని లేకుండా తెలివిగా వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అవుతుంటారు. అలాంటి వ్యక్తే ఈ ఆటోడ్రైవర్. జస్ట్ వినియోగదారుల నమ్మకాన్ని పొందడమే వ్యాపారానికి పెట్టబడిగా చేసుకుని లక్షలార్జిస్తున్నాడు. అతడు ముంబైలోని ఓ సాధారణ ఆటో రిక్షా డ్రైవర్. డ్రైవింగ్ చేయకుండానే లక్షలు గడిస్తున్నారు. యూఎస్ కాన్సులేట్ వెలుపల అతడి వ్యాపారం సాగుతుంది. తన వ్యాపారానికి ఆధారమే ఆ యూఎస్ కాన్సులేట్. ఎందుకంటే అక్కడకు వీసా కోసం చాలమంది వ్యక్తులు వస్తుంటారు. అయితే వారి కూడా లగేజ్ని అనుమతించారు. దీన్నే ఈ డ్రైవర్ తెలివిగా క్యాష్ చేసుకుంటున్నాడు. వ్యాపారంగా మార్చుకున్నాడు. సుమారు రోజుకి దగ్గర దగ్గర ఓ 20 నుంచి 30 మంది దాక ఈ యూఎస్ కాన్సులేట్ వద్దకు వీసా కోసం వస్తుంటారు. వారు పని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు వారి లగేజ్ని సేఫ్గా ఉంచుతాడు ఈ డ్రైవర్. అందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1000లు వసూల్ చేస్తాడట. స్థానిక పోలీసులు భాగస్వామ్యంతో లగేజ్ కోసం లాకర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్షలు గడిస్తున్నాడు అతను. చెప్పాలంటే ఐటీ డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేంజ్లో నెలకు సుమారు రూ. 5 నుంచి రూ. 8 లక్షలు ఈజీగా ఆర్జిస్తున్నాడని లెన్స్కార్ట్ ఉత్పత్తిదారుడు లింక్డ్ ఇన్పోస్ట్లో తెలిపారు. తాను వీసా కోసం యూఎస్ కాన్సులెట్ వద్దకు వచ్చినప్పుడే ఈ డ్రైవర్ గురించి తెలిసిందన్నారు. తనను కూడా సెక్యూరిటీ లగేజ్ అనుమతించనని చెప్పినప్పుడు..ఏం చేయాలో తోచక ఫుట్పాత్పై నిలబడి ఉంటే ఈ ఆటో డ్రైవర్ చేయి ఊపి..లగేజ్ సురక్షితంగా ఉంటుంది. జస్ట్ రూ. 1000 ఛార్జ్ చేస్తే చాలు అని చెప్పినప్పుడూ అతడి వ్యాపారం గురించి తెలిసిందని చెప్పుకొచ్చారు. అతడి వద్ద వ్యాపార నైపుణ్యం, సాంకేతిక, నిధులు లేకపోయినా.. జస్ట్ నమ్మకంతో కస్టమర్లకు భద్రత అందించి ప్రీమియం వసూలు చేస్తూ..వ్యాపారం చేస్తున్నాడు. సమయస్ఫూర్తితో చేస్తున్న అతడి వ్యాపారదక్షతను పోస్ట్లో ప్రశంసించారు రూపానీ. ప్రస్తుం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అవసరాలకు, డిమాండ్కు అనుగుణమైన వ్యాపారం ఆటోమేటిగ్గా క్లిక్ అవుతుందని ఈ ఆటో డ్రైవర్ ప్రూవ్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం అంతలా డబ్బులు ఛార్జ్ చేస్తున్నా.. పోలీసులతో కలిసి షేర్ చేసుకోవాల్సిందేగా అని ఒకరు, కాన్సులేట్ లోపల లాకర్ సౌకర్యం ఉందని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. గమనిక: ఇది వాస్తవమేనా అనేది తెలియాల్సి ఉంది. ఎన్డీటీవి ఇంగ్లీష్ ఆర్టికల్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. (చదవండి: డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్గా నం.1 స్థానం..) -
రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం
సొమ్ము భద్రం, భవితం స్వర్ణం అనుకుంటూ సాధారణ ప్రజలనుంచి గొప్ప గొప్పోళ్ల దాకా బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటారు. కాయకష్టం చేసి, కడుపు మాడ్చుకుని మరీ పొదుపు చేసిన సొమ్మను ఎంతో విశ్వాసంతో ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచుఫల్ ఫండ్స్ రూపంలో దాచుకుంటారు. తమ డబ్బు సురక్షితంగా ఉందని భావిస్తారు. బ్యాంకుల అభివృద్ధి, పెట్టుబడికి గట్టి సపోర్ట్ ఇస్తారు. కానీ బ్యాంకు వినియోగదారుల సొమ్మును అక్రమంగా వాడుకుంటూ కొంతమంది అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు వ్యవస్థకే చెడ్డపేరు తీసు కొస్తున్నారు. అంతేకాదు యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. తాజా ఒక అధికారి నిర్వాకం గురించి తెలుసుకుంటే... షాక్ అవ్వక తప్పదు. నెట్టింట చర్చకు దారి తీసిన ఈ వివరాలను తెలుసుకుందాం రండి! ఎన్డీటీ కథనం ప్రకారం రాజస్తాన్లోని కోటలోని ఒక బ్యాంకుకు చెందిన ఒక మహిళా అధికారి రూ. 4 కోట్లకు పైగా కస్టమర్లను మోసం చేసింది. ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్షి మేనేజర్గా పనిచేస్తున్న సాక్షి గుప్తా బ్యాంకు యూజర్ల FDల నుండి కోట్ల రూపాయలను తస్కరించింది. వీటిని స్టాక్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇలా రూ. 4.58 కోట్లు అక్రమాలకు పాల్పడింది. అంతేకాదు లావాదేవీల సందేశాల గురించి వారికి తెలియ కుండా ఉండటానికి , ఖాతాలతో లింక్ చేయబడిన కస్టమర్ల మొబైల్ నంబర్లను కూడా మార్చేసింది.కస్టమర్లను ముంచేసి..తానూ ..'యూజర్ FD (ఫిక్స్డ్ డిపాజిట్)' లింక్ను దుర్వినియోగం చేసి, 2020 - 2023 సంవత్సరాల మధ్య 41 మంది కస్టమర్ల 110 ఖాతాల నుండి రూ. 4.58 కోట్లు కొట్టేసింది. స్టాక్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ సొమ్ము ఆర్జించాలనే లక్ష్యంతో ఈ చర్యకు పూనుకుంది. రెండేళ్ల పాటు తన అక్రమాలు ఎవరి కంట కనపడకుండా కొనసాగించింది. దీంతో బ్యాంకు అధికారులెవరూ దీన్ని గమనించలేదు. అటు స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో డబ్బును తిరిగి ఖాతాల్లో జమ చేలేకపోయింది. అలా అత్యాశకుపోయి, కస్టమర్లను ముంచేసి, తాను కూడా మునిగిపోయింది. ఒక కస్టమర్ తన FD గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న బ్యాంక్ పోలీసులపై కేసు నమోదైంది. రంగంలోకి పోలీసులు గత రాత్రి ఆమె సోదరి వివాహంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇదీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఈ ఖాతాలకు లింక్ చేసి రూ. 4 కోట్లకు పైగా విత్డ్రా చేసిందనీ, ఖాతాదారులకు తన పన్నాగం గురించి తెలియకుండా ఉండటానికి ఆమె తన సిస్టమ్లో OTP లను పొందడానికి ఉపయోగించే వ్యవస్థను కూడా రూపొందించిందని దర్యాప్తు అధికారి ఇబ్రహీం ఖాన్ అన్నారు. అయితే దీనిపై బ్యాంకు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ప్రభావితమైన కస్టమర్లకు నష్టాన్ని భర్తీ చేస్తామని బ్యాంకు వర్గాలు తెలిపాయి.బ్యాంకులో మోసం గురించి తెలుసుకున్న తర్వాత, తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి కస్లమర్లు బ్యాంకుకు రావడం మొదలైంది."మన డబ్బు ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఉంచుకోలేం, ఇప్పుడిక బ్యాంకులో ఉంచుకోలేం ఏమి చేయాలి?" అంటూ బ్యాంకు కస్టమర్ మహావీర్ ప్రసాద్ వాపోయారు. చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్! -
Sri Rama తిరిగి రా, స్వామీ!
‘లోక హితం కోసం నేను శ్రీరాముడిగా మానవ అవతారంలో జన్మిస్తాను. లోక కంటకుడయిన రావణాసురుడిని వధిస్తాను. ఆ తరవాత పదకొండు వేల సంవత్సరాలు భూలోకంలోనే ఉండి రాజ్యం చేస్తాను’ అని శ్రీహరి బ్రహ్మాది దేవతలకు వాగ్దానం చేయటం రామాయణం బాలకాండ ఆరంభంలో కనిపిస్తుంది. అలా మానవ రూపంలో జన్మనెత్తిన తరువాత, శ్రీరాముడు ‘నేను భగవదవతా రాన్ని!’ అని ఎక్కడా చెప్పలేదు. తనను తాను మానవమాత్రుడిగానే భావించుకొని, ధర్మమూర్తిలా జీవించాడు. దేవతల కిచ్చిన వాగ్దానం ప్రకారం లంకేశ్వరుడిని వధించాడు. పదకొండు వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రామరాజ్యాన్ని సాగించాడు. ఆయన భూలోకంలో ఉన్నంత కాలం భూమి మీది ప్రజలు చల్లగా, సుఖంగా ఉన్నారు. కానీ హరి తమకు దూరమవడంతో, దేవతలకు మాత్రం ఆ కాలమంతా క్షణమొక యుగంగా గడిచింది. అనుకొన్న పదకొండు వేల సంవత్సరాల అవధి పూర్తి కాగానే, బ్రహ్మదేవుడు కాలపురుషుడిని తన దూతగా శ్రీరాముడి దగ్గరకు పంపాడు. ఆయన సందేశం ఇది: ‘దేవా! నువ్వు వైకుంఠానికి తిరిగి రావలసిన సమయం వచ్చిందని సవినయంగా గుర్తు చేస్తున్నాను. అయినా మరికొంత కాలం భూలోకంలో ఉండాలని నీకు అనిపిస్తే అలాగే చేయి. లేక ముందు అనుకొన్న ప్రకారం తిరిగి వస్తావా, దేవతలందరూ నీ రాకతో మరింత నిశ్చింతగా జీవించ గలుగుతారు. నిర్ణయం నీది!’ మానవావతారంలో ఉన్న మాధవుడు ‘నేను ఇన్నాళ్ళుగా ఇక్కడ ఉన్నది త్రిలోక క్షేమ కారణమయిన పని మీద! అది పూర్తయింది. కాబట్టి నా వశవర్తులుగా నడుచుకొనే దేవతా గణానికి, ఎప్పటిలాగే అన్ని విష యాలలోనూ అండగా ఉండటం నా కర్తవ్యం. త్వరలోనే నేను తిరిగి వస్తున్నాను’ అని సమాధానం పంపాడు. తరవాత కొద్ది కాలానికే రామావతారం చాలించి, పరంధామానికి తిరిగి వెళ్ళాడు. రామావతార సమాప్తి గురించిన ఆసక్తికరమైన వృత్తాంతం రామాయణం ఉత్తరకాండలో కనిపిస్తుంది.–ఎం. మారుతి శాస్త్రి -
హార్స్ రైడింగ్లో.. ధృవ సత్తా..
హార్స్ షోలో సత్తా చాటిన అత్యంత పిన్న వయస్కుడైన ఈక్వెస్టియన్ రైడర్గా నగరానికి చెందిన మాస్టర్ ధృవ నిలిచాడు. ఈక్వెస్ట్రియన్ అకాడమీ ఆధ్వర్యంలో శంకర్పల్లిలోని నాసర్ పోలో ఆవరణలో అండర్–10, 12, 14, 16, అదే విధంగా 45–125 సెంటీమీటర్ల ఓపెన్ విభాగాల్లో దాదాపు 650 మంది రైడర్లకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రెస్సేజ్ విభాగంతో పాటు ట్రోట్ సీహెచ్–2 వంటి విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఈ పోటీల్లో పదేళ్ల బాలుడు మాస్టర్ ధృవ 3 బంగారు, 1 రజితం, 1 కాంస్య పతకాలతో ప్రథమ బహుమతులు సాధించాడు. ఈ సందర్భంగా ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు ధృవ. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థి ఆరేళ్ల వయసు నుంచే గుర్రపుస్వారీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
The Labubu Doll : సెలబ్రిటీలందరి నోటా లబుబు డాల్... అసలేంటిది?
విచిత్రమైన దంతాలు , ఇంతింత కళ్లు, కుందేలు చెవులు ఇపుడు ఎక్కడ చూసినా ఈ లబుబు డాల్స్ (The Labubu Doll) ట్రెండ్ ప్రముఖంగా నిలుస్తోంది. ఇంత పాపులరైన ఈ లబుబు బొమ్మలను చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఉత్పత్తి చేస్తోంది. బ్లాక్పింక్ లిసా, రిహన్న, అనన్య పాండే ఇంకా అనేక మంది సెలబ్రిటీలు, డాల్ లవర్స్ ఈ బొమ్మల పట్ల ఎందుకంత క్రేజీగా ఉన్నారో తెలుసుకుందామా..‘బొమ్మల్లో లబుబు బొమ్మలు వేరయా!’ అంటన్నారు డాల్స్ ప్రేమికులు. సామాన్యుల నుంచి అనన్య పాండేలాంటి సెలబ్రిటీల వరకు లబుబు బొమ్మలకు ‘లవ్ యూ’ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sufi motiwala (@sufimotiwala)> జానపద కథల నుంచి స్పూర్తి పొంది హాంకాంగ్ ఆర్టిస్ట్ కసింగ్ లుంగ్ ‘లబుబు’ను రూపొందించాడు. విశాలమైన నేత్రాల ఈ బొమ్మ 2019లో మార్కెట్లోకి వచ్చింది. బ్యాగులు, కీచైన్లు....మొదలైన ఎన్నో రూపాల్లో లబుబు బొమ్మలను రూ పొందించారు. లబుబును ‘అన్బాక్సింగ్ ట్రెండ్’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వీటిని బ్లైండ్ బాక్సుల్లో మాత్రమే విక్రయిస్తుంటారు. అన్బాక్సింగ్ తరువాత మాత్రమే ఆ బొమ్మ గురించి తెలుసు కోగలుగుతాం.‘లబుబు’కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనకు ఆ బొమ్మ సృష్టికర్త కసింగ్ లుంగ్ సంతోషిస్తున్నాడు. ‘నా చిన్నప్పుడు గేమ్ కన్సోల్స్, కంప్యూటర్లు లేవు. పెన్నుతో రకరకాల బొమ్మలను పేపర్పై గీసేవాడిని. బొమ్మలు తయారుచేయాలనే ఆసక్తి చిన్న వయసులోనే ఉండేది’ అంటున్నాడు కసింగ్ లుంగ్. -
ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే.. వాటిలోని వింత అనుభవాలను చవిచూడాల ఎప్పుడూ ఉవి్వళ్లూరుతూ ఉంటారు. ఇలాంటి నయా ట్రెండ్స్కు తామేమీ తక్కువ కాదన్నట్లు భావిస్తుంటారు. అందుకే ఏ విషయంలోనైనా భాగ్యనగరవాసులు ముందుంటారు.. అలాంటి మరో కొత్త విశేషమే నగరానికి పరిచయమైంది. అదే ఐస్ బాత్. ఈ పేరిట ఇటీవలే ఓ ట్రెండ్ పరిచయమైంది. ఐస్ బాత్ థెరపీ నగరంలోని ఆరోగ్య, ఫిట్నెస్ ప్రియులకు నూతన ట్రెండ్గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరానికి మాత్రమే కాదు.. మానసికంగానూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని దీన్ని అందిస్తున్న నిపుణులు చెబుతున్నారు. సమంత, విరాట్ కోహ్లీ, విజయ్ దేవరకొండ, అనమ్ మీర్జా, విష్ణు మంచు వంటి ప్రముఖులు ఐస్ బాత్ తో వారి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది అనేకమందిలో ఈ థెరపీ పట్ల ఆసక్తిని పెంచుతోంది. మరి కొందరు సైతం ఐస్బాత్ను ఒక ఈవెంట్లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్.. వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. స్నాన విశేషాలివీ.. ఐస్ బాత్ అనేది చల్లటి నీటిలో, సాధారణంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, 10 నుండి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచడం. దీనినే క్రయోథెరపీ లేదా కోల్డ్–వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్/కోల్డ్ ప్లంజ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ శరీరంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా వాపు, నొప్పి తగ్గుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ చికిత్స విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రారంభ షాక్ తర్వాత, శరీరం అలవాటుపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలివీ.. ఈ ఐస్బాత్ సేవలు అందిస్తున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. దీని ద్వారా కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్తప్రసరణ మెరుగై, ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్ బాత్తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది. తద్వారా సహజమైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఇబ్బంది కలిగించే చలిని ఎదుర్కోవడం మెదడుని అసౌకర్యాన్ని స్వీకరించడానికి, స్థితిస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది. వ్యక్తిగతంగా మెచ్చి.. స్వదేశానికి తెచ్చి.. ‘మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు కఠినమైన శిక్షణ తర్వాత అలసట దూరం కావడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విభిన్న వర్గాల వారు ఆరోగ్యం కోసం దీన్ని ఎంచుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్పై ఆసక్తితో థాయిలాండ్లోని ఎలైట్ ఫైట్ క్లబ్లో సభ్యులుగా శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఐస్ బాత్ థెరపీ గురించి తెలిసింది. నగరంలో దీనిని ప్రవేశపెట్టాలని నార్సింగిలో ఓ సెంటర్తో పాటు మొబైల్ ఐస్ బాత్ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రారంభకులకు 90 సెకన్ల నుంచి అత్యధికంగా 3 నిమిషాలు మాత్రమే సూచిస్తాం. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా 18 నిమిషాల వరకూ ఐస్ బాత్ చేయగలను. జాగ్రత్తలు తప్పనిసరి.. ఐస్బాత్ ఈవెంట్లో పాల్గొనాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందస్తు వైద్య సలహా తీసుకోవాలి. అధిక లేదా తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, నాడీ సంబంధిత పరిస్థితులు, మధుమేహం లేదా వాసు్కలర్, ఏవైనా ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది నప్పదు. ఐస్ బాత్ వ్యవధి ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వరకూ సరిపోతుందని, అయితే కొన్ని సెషన్ల తర్వాత వ్యక్తులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వ్యవధిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభకులకు, సంవత్సరానికి 3–4 సెషన్లు సరిపోతాయి. శరీరం ప్రతిస్పందనను బట్టి ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. ప్రస్తుతం సెషన్ సెటప్ ఫెసిలిటేటర్ నైపుణ్యాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.8,000 వరకూ ఉంది. (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
ఎంబ్రాయిడరీ నగలు..! ఇట్టే కట్టిపడేసే ఫ్యాషన్ ట్రెండ్..
చెవులకు జూకాలు, మెడలో హారాలు చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలునడుముకు వడ్డాణాలు, వేళ్లకు ఉంగరాలు రంగులుగా, అల్లికలుగా..సంప్రదాయ కళ, ఆధునిక శైలి కలయికతో అభివృద్ధి చెందినవి ఎంబ్రాయిడరీ నగలు. సిల్క్ దారాలు, అద్దాలు, పూసలు, మెరిసే రాళ్లు, ప్యాచ్వర్క్తో రూపు కట్టిన ఈ నగలు అందరి చూపులను ఇట్టే కట్టడి చేస్తాయి. తేలికగా.. అందంగా!లైట్ వెయిట్: సాధారణ గోల్డ్/ సిల్వర్ జ్యూవెలరీలతో పోలిస్తే ఈ ఆభరణాలు చాలా తేలికగా ఉంటాయి. వీటిలోనూ నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, మాంగ్ టిక్కా, రింగ్స్,... వివిధ రకాల మోడల్స్లో ఎంచుకోవచ్చు. కస్టమైజ్డ్ : డిజైన్, రంగులు, శైలి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలుంటుంది. డ్రెస్ని బట్టి మోడల్ని, కలర్స్ని ఎంపిక చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ డిజైన్స్: మొఘల్, జర్దోసి, మిర్రర్ వర్క్, గుజరాతీ వర్క్... లాంటి అనేక శైలులను ఈ ఎంబ్రాయిడరీలో చూపవచ్చు. పూర్తి ఎకో–ఫ్రెండ్లీ: సహజమైన వస్తువులతో తయారవడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాదు.వేడుకలకి అనుకూలం: సంప్రదాయ, ఇండో – వెస్ట్రన్ స్టైల్ డ్రెస్లకి ఇది సరైన ఎంపిక.సొంతంగా తయారీ!ఎంబ్రాయిడరీ హూప్ను కొనుగోలు చేసి, మల్టీ కలర్ దారాలు, ఫ్యాబ్రిక్ గ్లూతో నచ్చిన విధంగా తయారుచేసుకోవచ్చు. పర్యావరణహితమైన ఉత్పత్తులు కావడం, రీసైక్లింగ్ చేసే సదుపాయం కూడా ఈ ఆభరణాల తయారీలో చూపించవచ్చు.వేడుకకు తగిన ఆభరణంఉపయోగించే మెటీరియల్స్ని బట్టి ఆభరణం ఉంటుంది కాబట్టి వేడుకను బట్టి డిజైన్ని ఎంచుకోవచ్చు.సిల్వర్, జరీ దారాలతో జర్దోజి, మొఘల్ వర్క్ని గ్రాండ్గా తీర్చిదిద్దవచ్చు. ఈ ఎంబ్రాయిడరీ చేసిన ఆభరణాలను సంప్రదాయ వేడుకలలో లెహంగాలు, శారీలకు ఎంచుకోవచ్చు. కాథా అనే వర్క్ బెంగాలీ ఫోక్ ఎంబ్రాయిడరీ ఆర్ట్. రంగుల దారాలతో లైట్ వెయిట్ జ్యూవెలరీని రూపొదించవచ్చు. ఇవి ప్లెయిన్, ఇండోవెస్ట్రన్ డ్రెస్సులకు, కాటన్ చీరలకు బాగా నప్పుతాయి. గుజరాత్ కచ్ వర్క్, రాజస్థాన్ కళా శైలిని ప్రతిబింబించేలా పూలు, అద్దాలతో చేసిన ఎంబ్రాయిడరీ ఆభరణాలు సంప్రదాయ పండుగలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, కాలేజీ ఫంక్షన్లు.. వంటి వాటిలో స్టైల్గా కనిపిస్తాయి. లేస్ మెటీరియల్తోనూ రంగు దారాలతో పూలు, ఆకులు కుట్టి, ఆభరణంగా ధరించవచ్చు. ఇవి ఎక్కువగా వెస్ట్రన్ డ్రెస్సులకు బాగా నప్పుతాయి -
డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్గా నం.1 స్థానం..
26 ఏళ్ల మృణాల్ పంచల్ను దేశంలో అత్యధికమంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారట. కారణం? ఆమె రోజూ మేకప్ టిప్స్ చెబుతుంది. తన మీద మేకప్ అప్లయ్ చేసి క్షణాల్లో రీల్స్ తయారు చేసి ఆకట్టుకుంటుంది. ముఖాలను మార్చే ఈ కళతో తాజాగా వెలువడ్డ ‘కాండిరి హూరూన్ ఇండియాస్ లిస్ట్ ఆఫ్ లీడింగ్ ఉమన్ ఇన్ఫ్లూయెన్సర్’లో అగ్రస్థానంలో నిలుచుంది.మనిషికి అత్యంత ఇష్టమైన వస్తువు తన ఖ్యాతికి కారణమవుతుందని మృణాల్ పంచల్ ఊహించి ఉండదు. మనిషికి ఇష్టమైనది ఏది? అద్దం. అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు మనిషి ఏమనుకుంటాడు? కాస్త బాగా కనిపిస్తే బాగుండు అనుకుంటాడు.అలంకార ప్రియులైన స్త్రీలు ఈ మాటను ఇంకా ఎక్కువగా అనుకుంటారు. ఇక్కడే మృణాల్ పంచల్ గెలిచింది. ఏదో కాలక్షేపంగా తాను వేసుకునే మేకప్ను చూపుతూ చేసిన వీడియోలు ఆమెకు భారీగా మహిళా ఫాలోయెర్స్ను సంపాదించి పెట్టాయి. ఇన్స్టాలో ఆమెకు 55 లక్షల మంది ఫాలోయెర్లు ఉన్నారు. ఆమె వీడియోలు క్షణాల్లో వైరల్గా మారతాయి. ఇంతకీ కంటెంట్ కేవలం మేకప్పే. అందుకే ఆమె ‘కాండిరి హూరూన్ ఇండియా విమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు ఎవరు ఈ మృణాల్ పంచల్.డాక్టర్ కాబోయి...చాలామంది సినిమా హీరోయిన్లు డాక్టరు కాబోయి యాక్టర్ అయ్యాను అంటుంటారు. మృణాల్ పంచల్ కూడా అంతే. గుజరాత్లో పుట్టి పెరిగిన మృణాల్ ఎం.బి.బి.ఎస్. చేసేందుకు అవసరమైన చదువు/శిక్షణ కోసం పూణె వచ్చింది. ‘మా అమ్మతో శపథం చేసి మరీ వచ్చాను. అయితే నేను ఒకటి తలిస్తే మేకప్ మరొకటి తలిచింది’ అంటుంది మృణాల్. చిన్నప్పుడు తల్లి నిద్రపోతుంటే మేకప్ కిట్ తీసుకుని ఆమె ముఖానికి మేకప్ వేసి ఆశ్చర్యపరిచిన మృణాల్ స్కూల్లో చదివేప్పుడు కూడా రకరకాల పద్ధతుల్లో మేకప్ వేసుకుని కాలక్షేపం చేసేది. అయితే అందులో సహజమైన ప్రతిభ చాలామందిని ఆకర్షించింది.చదవలేక...అయితే పూణె వచ్చాక భాష సమస్య ఆ తర్వాత చదువు తలకు ఎక్కక పోవడంతో మృణాల్ ఒక దశలో కుదేల్ అయ్యింది. ఇక ఇంటికి పోవడం ఒక్కటే శరణ్యం అనుకుంటున్నప్పుడు టిక్టాక్లో కాలక్షేపానికి మేకప్ ట్యుటోరియల్ అంటూ ఒక వీడియో చేసింది. అది వైరల్గా మారింది. స్త్రీలు కింద కామెంట్లు పెట్టి ఇలాంటివే చేయండి అనసాగారు. మేకప్ను వేగంగా, సులువుగా, మనిషిని బట్టి, చర్మాన్ని బట్టి, కన్ను ముక్కును బట్టి, వయసును బట్టి ఎలా వేసుకోవాలో రకరకాల టిప్స్ చెబుతూ సొంతంగా ఆ మేకప్ను వేసుకుని చూపుతూ మృణాల్ అతి త్వరలో ఖ్యాతి గడించింది.వెంటబడ్డ కంపెనీలుమృణాల్ ఇన్ఫ్లూయెన్స్ టిక్టాక్ తర్వాత ఇన్స్టాలో పెరగడంతో బ్యూటీ సామాగ్రి అమ్మే బడాబడా కంపెనీలు ఆమెను తమ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయమని కోరాయి. ‘అతి త్వరగా నేను ముంబైకి మారాల్సి వచ్చింది. నేను కలలో కూడా ఊహించని పెద్ద కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కోసం నన్ను అంబాసిడర్గా పెట్టుకున్నాయి. నా ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది’ అని చెప్పుకొస్తుంది మృణాల్.సరళంగా, అట్టహాసంగా: మృణాల్ భారతీయ మహిళల మనస్థితిని బట్టి మేకప్ టిప్స్ చూపుతుంది. ‘మన మహిళలు గ్లామర్గా మేకప్ వేసుకోవాలనుకుంటారు. కాని జంకుతారు. సరళమైన మేకప్ చూపిస్తే ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేయమని కోరుతారు. రెండు విధాలుగా సంతృప్తి పరుస్తూ వారికి టిప్స్ అందిస్తుంటాను’ అంటుంది మృణాల్. ఆమె చూపే టిప్స్లో కేశాలంకరణ, వాటి షేడ్స్, కనురెప్పలు, ముక్కును సన్నగా చూపించడం, పెదాలను అందంగా చూపించడం, ముఖంలో ఏదైనా ఒక భాగం మోతాదుకు మించి ఉన్నా, కురచగా ఉన్నా దానిని మేకప్లో సరి చేసి చూపించడం చాలా ప్రతిభావంతంగా చేస్తుంది. అందుకే మృణాల్కు యాభై లక్షల మంది ఫ్యాన్స్.సోషల్ మీడియా వచ్చాక చాలామంది విజేతలు మనకు కనిపిస్తున్నారు. అయితే వారంతా తొలిసారిగా ఎవరూ నడవని దారిని నడిచిన వారే. మేకప్ రంగంలో ఎందరో నిష్ణాతులు ఉండగా మృణాల్ దానినో ట్యూషన్గా భావించడం వల్లే ఘన విజయం సాధించింది. నేడు భారతదేశంలో అత్యంత ఇన్ఫ్లూయెన్షల్ లీడర్గా నిలిచింది. మృణాల్ నిజంగా గ్రేట్.(చదవండి: శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది) -
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం ఏదో తెలుసా..!
ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. గానీ కొన్ని గమ్మత్తైన విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎలా తెలుసుకోలేకపోయాం అనిపిస్తుంది. అలాంటి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్నింటి గురించి తెలుసుకుందామా..!ఇరవైనాలుగు ఏళ్ల వయసులో రోమ్ సామ్రాజ్య పాలకుడైన కలిగ్యులా తన గుర్రానికి సెనెటర్ హోదా ఇచ్చాడు.అబ్రహం లింకన్ టాప్ హ్యాట్ ఫేమస్. ఫ్యాషన్ యాక్సెసరీగా మాత్రమే కాదు... వేరే రకంగా కూడా టాప్ హ్యాట్ను వినియోగించేవారట లింకన్.. ముఖ్యమైన నోట్స్, పేపర్లను టాప్ హ్యాట్లో స్టోర్ చేసేవారట.ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం... జెబ్లాక్బర్డ్ వయోలిన్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏమిటంటే... ఈ వాయిద్య పరికరాన్ని కలప నుంచి కాకుండా రాయితో తయారుచేస్తారు.‘ది మ్యాట్రిక్స్’ సినిమాలోని ‘గ్రీన్ కోడ్’కు మూలం... జపనీస్ సుషి కుక్ బుక్.ప్రపంచంలోనే అతి పెద్ద టీ–షర్ట్ను ప్లాస్టిండియా ఫౌండేషన్ తయారుచేసింది. రీసైకిల్ చేసిన 2,100,000 ప్లాస్టిక్ బాటిల్స్తో దీన్ని తయారుచేశారు. ఈ టీ–షర్ట్ పొడవు 96.86 మీటర్లు.‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంగ్’ పుస్తకం 1558లో విడుదలైంది. ఇప్పటికీ ప్రింట్లో ఉంది. ఈ పుస్తకం రాసిన లూయిజీ కార్నరో వంద సంవత్సరాలు బతికాడు. -
శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్ఫోన్తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...తొమ్మిది సంవత్సరాల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది మహిరమ. పదో ఏట స్నేహితులతో కలిసి చిన్న కథ రాసింది. ఆ తరువాత దీనినే నవలగా రాయాలనుకుంది. నవలగా పూర్తిరూపంలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. 500 పేజీల ఈ నవల పేరు...రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్.సంగీతంలోనూ మహీరమ రాణిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ఫోర్త్ గ్రేడ్లో శిక్షణ తీసుకుంటోంది. హస్తకళలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఫ్రెంచి కూడా నేర్చుకుంటోంది. హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్న చల్లా మహిరమ ‘రూబీ బ్లూస్ట్రీమ్ అండ్ ద స్కీమ్ ఆఫ్ టైమ్’ పేరుతో మరో పుస్తకానికి శ్రీకారం చుట్టింది.అందరూ చదివేలా...నేను రాసిన ఫాంటసీ నవల ‘రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్’ పిల్లలే కాదు అన్ని వయసుల వారూ చదివేలా రాశాను. ఫాంటసీ సబ్జెక్ట్పై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రకృతితో ముడిపడి ఉన్న అంశాల ఆధారంగా నవల రాశాను. భూమి, నీరు, గాలి, అగ్ని...వీటితో మనిషి జీవితం ఎలా ముడిపడి ఉంటుందనే విషయం చుట్టూ నవల సాగుతుంది. – చల్లా మహిరమ (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
చిత్ర యాత్ర
తల్లిగా, చెల్లిగా, కూతురుగా... పలు రూ పాల్లో లోకాన్ని ముందుకు నడిపించే శక్తి స్త్రీ మూర్తి. ఆ శక్తి స్వరూ పాన్ని తన ఛాయాచిత్రాల్లో ఆవిష్కరించడానికి పన్నేండేళ్ల కాలాన్ని అంకితం చేస్తూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు భరద్వాజ్ దయాల. 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించాలనేది ఆయన లక్ష్యం....సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెరీర్ ప్రారంభించిన భరద్వాజ్ ప్రస్తుతం హైదరాబాద్లో మూవీ గ్రాఫిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ‘జీవితం చాలా చిన్నది. ఉన్న సమయంలోనే ప్రపంచాన్ని చూసెయ్యాలి. వీలైనంత మందితో మాట్లాడాలి’ అనేది భరద్వాజ్ లక్ష్యం. ఇందులో భాగంగా మహిళామణుల చిత్రాల ఆల్బమ్ రూపకల్పనకు సంకల్పించారు. ఈ డాక్యుమెంటరీలో మిలియ న్ అమేజింగ్ ఉమె న్ (10లక్షల మంది అసాధారణ మహిళలు)కు చోటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించే పనికి శ్రీకారం చుట్టారు.ఒంటరిగా... కెమెరా ఆయుధంగాప్రపంచంలోని మిలియ న్ (10లక్షల) మహిళామణుల ముఖకవళికలపై డాక్యుమెంటరీ తీయడానికి భరద్వాజ్ 100 మిల్లీమీటర్లు, 2.8 లెన్స్ గల కెమెరాను భుజాన వేసుకొని లక్ష్యం దిశగా ముందుకు కదులుతున్నారు. 55 ఏళ్ల భరద్వాజ ఒంటరిగానే, ఎవరి సాయం లేకుండా ప్రపంచయాత్ర చేస్తున్నారు. ఒక కారును తన ప్రయాణానికి అనుగుణంగా మార్చుకున్నారు. ఏడు ఖండాలు తిరిగి. 12 ఏళ్లలోగా అంటే 2037 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తన లక్ష్యం.మహిళా దినోత్సవం రోజు శ్రీకారంప్రస్తుతం భరద్వాజ్ చేపడుతున్న మిలియన్ అమేజింగ్ మహిళ చిత్రసేకరణ ప్రాజెక్టు యాత్ర రెండోది. దీన్ని ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించారు. మిలియన్ అమేజింగ్ మహిళా ఫొటోల సేకరణలో గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 500 మంది మహిళల చిత్రాలను కెమెరాల్లో బంధించారు. ఆల్బమ్లో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మహిళల వరకు ఉన్నారు.రాజమాతతో ప్రారంభం...గుజరాత్ రాష్ట్రం వడోదరలోని రాజవంశానికి చెందిన రాజమాత శుభాంగిణిరాజే చిత్రంతో ఈ మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ప్రాజెక్టు ప్రారంభమైంది. రాజమాత జీవితానికి సంబంధించి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రాన్ని తీశారు. రెస్టారెంట్ నడుపుతూ, నెలకు 8 లక్షల రూ పాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న గిరిజన మహిళతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గృహిణులు, విద్యార్థినులకు చోటు కల్పించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో భరద్వాజ్ పర్యటన సాగుతోంది.అమ్మకు ప్రేమతో...మా అమ్మకు ఐదుగురు సంతానం. మా అందరినీ పెంచి పెద్ద చేయడంలో ఆమె చూపిన కృషి అనిర్వచనీయం. అందుకే అమ్మకు ప్రేమతో ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఆ ఆలోచనలో భాగమే మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ఆల్బమ్. ప్రస్తుతం నా ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చునంతా నేనే భరిస్తున్నాను. నా కంపెనీ తరపున ఆ న్ లై న్ లో జాబ్ చేస్తూ వచ్చిన వేతనంతో టూర్ను కొనసాగిస్తున్నాను. – భరద్వాజ్ దయాల – కరుకోల తిరుమలరావు, సాక్షి, విజయవాడ -
కేన్సర్ను అరికట్టే ఔషధాహారం!
సాక్షి, సాగుబడి: భవిష్యత్తులో కేన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని రకాల బియ్యం లేదా బియ్యం తవుడుతో చేసే ఆహారాన్ని సూచించవచ్చు. అవి తింటే కేన్సర్ రాకపోవచ్చు, వచ్చినా తగ్గిపోవచ్చు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే కేన్సర్ను అరికట్టేయవచ్చు. ఆశ్చర్యంగా అనిపిస్తున్న దీన్ని సుసాధ్యం చేస్తోంది ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి). 3 రకాల ఊదా, ఎరుపు రంగు వరి బియ్యంపై పొర(తవుడు)లో కేన్సర్లను అరికట్టే ఔషధ పదార్థాన్ని వెలికితీసి, ఔషధాహారాన్ని విజయవంతంగా రూపొందించారు అక్కడి శాస్త్రవేత్తలు. కొలొరెక్టల్ కేన్సర్ (పెద్దపేగు+గుదద్వారం కేన్సర్), రొమ్ము కేన్సర్లను అరికట్టడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్ దోహదపడుతుంది.కేన్సర్ కణాలపై దీని పనితీరును ‘ఇరి’ ప్రయోగశాలలో పరీక్షించి అద్భుత ఫలితాలు సాధించారు. ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు సారథ్యం వహిస్తున్న ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, తెలుగువారైన డాక్టర్ నెసె శ్రీనివాసులు ఈ విశేషాలను టెలిఫోన్ ఇంటర్వ్యూలో ‘సాక్షి’కి వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెనుముప్పుగా పరిణమించిన కేన్సర్ మహమ్మారికి ముకుతాడు వేసే అద్భుత ‘ఔషధాహారం’ అందుబాటులోకి రానుంది. పురాతన వరి వంగడాల్లో కేన్సర్లను అరికట్టే అద్భుత ఔషధ గుణాలున్నట్లు ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించింది ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నెసె శ్రీనివాసులు. ప్రస్తుతం ఈయన ఇరిలో కంజ్యూమర్ డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ – న్యూట్రిషన్ సెంటర్ అధిపతిగా ఉన్నారు. ఈయన తల్లిది అనంతపురం. ఈయన పెరిగింది కర్ణాటకలో.3 రకాల పురాతన వరి రకాలతో..ప్రపంచవ్యాప్తంగా 1,32,000 పురాతన వరి వంగడాలున్నాయి. వీటిలో చాలా వరకు తెల్లబియ్యం రకాలే. రకరకాల రంగుల బియ్యం రకాలు 800. వీటిలో పోషకాలపై జరిపిన పరిశోధనల్లో 6 రకాల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ కేన్సర్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు ‘ఇరి’ గుర్తించింది. ప్రస్తుత పరిశోధనలో 3 రకాలను శాస్త్రవేత్తలు వాడారు. ఫిలిప్పీన్స్ కు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగు గల ‘బాలాటినో’ రకం బియ్యం, ‘కింటుమాన్’ అనే ఎర్ర బియ్యంతో పాటు ఇండోనేíసియాకు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగుండే కేతన్ హితం’ అనే పురాతన రకాలను వాడారు. ఈ బియ్యపు తవుడులోని ఔషధ విలువలున్న పదార్థాన్ని ఉపయోగించి కేన్సర్ను అరికట్టే ఫుడ్ సప్లిమెంట్ను తయారు చేశారు. ఇది పొడి లేదా ద్రవ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.ఒక్క గ్రాము చాలు!300 గ్రాముల బియ్యం నుంచి తీసిన తవుడుతో 1 కిలో ఫుడ్ సప్లిమెంట్ను ఉత్పత్తి చేయవచ్చు. కేన్సర్ నిరోధక లక్షణాన్ని మనిషి దేహంలో కలిగించడానికి కనీసం 1 గ్రాము సరిపోతుందని డా.శ్రీనివాసులు తెలిపారు. కేన్సర్ రోగుల కణాలపై ప్రయోగశాలలో ఈ ఔషధాహారంతో నిర్వహించిన పరీక్షల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ రెండు రకాల కేన్సర్ రోగులకు ఇస్తున్న కీమోథెరపీ ఔషధం ‘డోక్సోరుబిసిన్’తో సరిసమానమైన ఫలితాలను.. ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో దీన్ని ఎలుకలపైన, ఆ తర్వాత కేన్సర్ రోగులపైన ప్రయోగించబోతున్నామని వెల్లడించారు.సాంబమసూరిలోకి ఈ జన్యువులుఈ 3 రకాల పురాతన వరి వంగడాల్లోని కేన్సర్ నిరోధక ఔషధ గుణాలకు కారణమైన జన్యువులు ఏవో గుర్తించేందుకు ‘ఇరి’లో పరిశోధన కొనసాగుతోంది. ‘ఈ పరిశోధన పూర్తయ్యాక అధిక దిగుబడినిచ్చే మన సాంబమసూరి వరి వంగడంలోకి ఈ ఔషధ గుణాలున్న జన్యువులను జన్యు సవరణ ప్రక్రియ ద్వారా జోడిస్తాం. ఆ సరికొత్త సాంబమసూరి ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తినొచ్చు.ఫుడ్ సప్లిమెంట్ తింటే వంద శాతం ఫలితం ఉంటుంది. వండిన అన్నం తింటే.. అందులోని కేన్సర్ నిరోధక ఔషధ గుణం 70% వరకు వంటపడుతుంది. కేన్సర్ కణాలు క్రమంగా కోలుకొని సాధారణ స్థితికి వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎలాంటి హానీ జరగదని కూడా మా ప్రయోగశాలలో రూఢీ అయ్యింది. ఇది స్వల్ప ఖర్చుతో కేన్సర్ను అరికట్టే మార్గంగా ప్రపంచం ముందుకు వస్తోంది’ అని డా. శ్రీనివాసులు వివరించారు. -
మేకప్ ప్రొడక్ట్స్తో బికేర్ఫుల్..! పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ..
మేకప్ వేసుకోవడం అంటే చాలామంది అతివలకు ఇష్టం. అదీగాక యూట్యూబ్ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో సౌందర్య సాధనాలతో చేసేపనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్లు సైతం మేకప్ ప్రొడక్ట్స్ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలామంది వీటిని పెడచెవిన పెట్టేస్తారు. అలానే ఇక్కడొక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ నిర్లక్ష్య ధోరణితో చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది. వివరాల్లోకెళ్తే..సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే ఈ తైవాన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ మేకప్ ముక్బాంగ్కు ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మేకప్కి సంబంధించిన వీడియోలతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సింపుల్ చిట్కాలతో చక్కగా మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించడం తోపాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్ టేస్ట్ చేస్తానంటూ కామెడీ చేసేది. ఒక్కోసారి నిజంగానే టేస్ట్ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్ వీడియోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్ దగ్గరి నుంచి లిప్స్టిక్ వరకు అన్ని టేస్ట్ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ . సోషల్ మీడియా స్టార్డమ్ కోసం చేసిస పనికి..పలు బ్రాండెడ్ కంపెనీ ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్డమ్ సంపాదించుకుంది గానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్ ఉత్పత్తులను టేస్ట్ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. ఐతే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఆకస్మికంగా అనారోగ్యం బారినపడి చనిపోయినట్లు బాధితురాలి కుటుంబం ప్రకటించడం గమనార్హం. నిపుణుల వార్నింగ్..దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్ ప్రొడక్ట్స్లో వాడే కెమికల్స్ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటిని టేస్ట్ చేసే సాహసం అససలు చెయ్యొద్దని నొక్కి చెప్పారు. అంతేగాదు మేకప్ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలన్నారు. అలాగే మేకప్తో అలానే అస్సలు పడుకోవద్దని..ఎంత ఆలస్యమైనా..దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు. View this post on Instagram A post shared by 芭樂水水 (@guava_beauty_) (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
ముందే పలకరించిన వానలు : రెయిన్కోట్లకు, గొడుగులకు భలే బేరం!
దాదర్: వర్షాకాలం సమీపించడంతో గొడుగులు, రెయిన్ కోట్లు, ప్లాస్టిక్ క్యాప్లు తదితర సామగ్రి విక్రయించే హోల్సేల్ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముంబైలో గత పక్షం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఒకపక్క వర్షం మరోపక్క ఎండలు కాస్తున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటపడే సమయంలో గొడుగు తీసుకెళ్లాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడిపోయారు. ఈ సారి వర్షాలు కొంత తొందరగా కురుస్తాయని ఇదివరకే శాంతాకృజ్, కొలాబా వాతావరణ శాఖలు హెచ్చరించాయి. అనుకున్నట్లు ఈ సారి వర్షాలు గత పక్షం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఏటా వర్షాకాలం జూన్ ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి వర్షాలు దాదాపు పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్నాయి. దీంతో అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. దీంతో కొత్త గొడుగులు, రెయిన్ కోట్లు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల గొడుగులు.. డిజైన్లతో కూడిన రెయిన్ కోటుముంబైలో దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, చెంబూర్ తదితర ప్రాంతాల్లో వర్షాకాల సామగ్రి విక్రయించే హోల్సేల్ మార్కెట్లున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కోనుగోలుదార్లను ఆకర్షించే రంగురంగుల గొడుగులు, వివిధ డిజైన్లతో కూడిన రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే వివిధ రంగులు, డోరెమాన్, ఛోటా బీం, మోటూ–పాత్లు, స్పైడర్ మెన్, బార్బీ డాల్, సిండ్రోలా తదితర కార్టూన్ బొమ్మలతో కూడిన రెయిన్ కోట్లు, గొడుగులు వచ్చాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దలు వినియోగించే ప్లాస్టిక్ జాకెట్లు, ప్యాంట్లు, క్యాప్లు, ఫోన్లు వర్షానికి తడవకుండా భద్రపర్చుకునే మొబైల్ కవర్లు, బైక్లు, కార్లపై కప్పడానికి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ సారి ధరలు 10–20 శాతం మేర పెరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ సామగ్రిని రిటైల్ వ్యాపారులు క్వాలిటీని బట్టి 20–30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ సారి కోనుగోలుదార్ల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: Chitrakoot Facts: చరిత్ర చెక్కిన రామాయణం చిత్రకూటం.. ఎన్ని విశేషాలో!రెయిన్ కోట్ రూ.30 నుంచి రూ.150 లోపే.. ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటపడే సామాన్యులు ఇదివరకు వాడిన లేజర్ బూట్లు, సాధారణ పాదరక్షలు పక్కన పెట్టేశారు. వర్షంలో వినియోగించే ప్లాస్టిక్ చెప్పులు, బూట్లు, స్లీపర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా గత సంవత్సరం అమ్మగా మిగిలిపోయిన సామగ్రిని బయటకు తీసి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సారి అకాల వర్షాలు పక్షం రోజుల ముందే కురవడంతో అనేక మంది వ్యాపారులు వర్షాకాల సామగ్రి ముందుగానే నిల్వచేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ గొడుగులతోపాటు డబుల్, ట్రిపుల్ ఫోల్డింగ్ గొడుగులు, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్లు, క్యాప్లు, కప్పుకునేందుకు ప్లాస్టిక్ పేపర్లు ఇలా అనేక రకాల వర్షాకాల సామగ్రి మార్కెట్లోకి వచ్చాయి. రూ.100–500 వరకు ధర పలికే హైక్లాస్ ప్లాస్టిక్ బూట్లు, రబ్బర్ చెప్పులు మార్కెట్లో ఉంచారు. వీటిని అధికంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. చాలామందికి వెంట రెయిన్ కోట్లు, గొడుగులు ఉంచుకోవడం ఇష్టముండదు. దీంతో ఇలాంటి వారికోసం యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కో రెయిన్ కోట్ ధర కేవలం రూ.30–150 వరకు పలుకుతున్నాయి. బరువు కూడా చాలా తక్కువ ఉండడంతో హ్యాండ్ బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సాధారణ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం -
నాకే ఇన్ని కష్టాలా...? అంతా మన వల్లే.. !
భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది!!... భగవంతుడు తనకు సన్నిహితంగా ఉన్నవారిని అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు!!... ’కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు... ఇవన్నీ ఆ పరీక్షలో భాగాలే! వాటిని ఒకటి తరువాత మరొకటి ఇస్తూ ఉంటాడు ‘నన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడా! లేదా విసుగుతో నన్ను దూరం చేసుకుంటాడా?’ అని అయన చూస్తూ ఉంటాడు!!... ఒకసారి పరీక్షలో ఉత్తీర్ణులం అయ్యాక మరొక పరీక్ష ఉండటం... లేకపోవడం ఆయన ఇష్టం...!కానీ ఒకసారి విఫలం అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు! ఎందుకంటే అప్పటికే మన సామర్థ్యం అయనకు తెలిసిపోతుంది కనుక, ఈ విషయం మనం చక్కగా గ్రహించి కష్ట నష్టాలు వచ్చినపుడు దైవాన్ని నిందించక, మరువక, విడువక ఆయనపై విశ్వాసంతో సహనం వహించాలి. అప్పుడే అయన తన అనుగ్రహాన్ని పుష్కలంగా అందిస్తాడు!!...ఎలా వచ్చిన కష్ట నష్టాలు అలా పోతాయి. అయితే మన విశ్వాసం, సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టీ పెట్టీ ఆయనే విసుగు చెందిపోవాలి...అంతేకానీ నేను రోజూ పూజలు, అభిషేకాలు చేస్తున్నాను, నాకు ఈ పని కావాలి, ఆ పని జరగాలి, లేకపోతే ఎందుకు అని అనుకోరాదు. అంతా బాగున్నప్పుడు అదంతా మన వల్లే అనుకుని పొంగిపోయి, సౌఖ్యాలు కలుగనపుడు మాత్రం దైవాన్ని నిందించటం తగదు, దానికంటె మనలో విశ్వాస లోపం ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చును, కానీ ఎక్కడో ఏదో మూలన చిన్న సందేహం మిగిలిపోయిందేమో అని చూసుకోవాలి. పాత్రలో నీరంతా బయటకు పోవడానికి పాత్రంత రంధ్రం అవసరం లేదు... చిన్న రంధ్రం ఉంటే చాలు పాత్రలో నీరంతా బయటకు పోవడానికి, కనుక ఆ చిన్న రంధ్రం ఎక్కడుందో కనుక్కుని దానిని మూసివేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నిందిస్తూ కూర్చోకూడదు. దైవనింద వల్ల మరింత పాపం చుట్టుకుంటుంది తప్ప సమస్యలు తీరిపోవు! విశ్వాసమే అసలైన పరిష్కారాన్ని ఇస్తుంది.చదవండి: Bakrid 2025 త్యాగాల పండుగ : ‘తఖ్వా’ అంటే.. -
ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?
అంతర్ముఖ ప్రేమానందం: భగవంతుడంటే ప్రేమ అని మనం ఎన్నోసార్లు విన్నాం. ప్రేమ అంటే ఏమిటో ఎందరో అవతార మూర్తులు, అవతార పురుషులు వారి వారి మార్గాలలో విశదీకరించారు. దానిని ఎంతగా వర్ణించి విశదీకరించినప్పటికీ ప్రేమను అనుభూతి చెందకుండా దాని ఆనందాన్ని పొందలేరు. ఆ ప్రేమను అనుభూతి చెందడం, దానిని అర్థం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. మనలో ఆ ప్రేమను ఆస్వాదించి ప్రకటించగల యంత్రాంగాన్ని భగవంతుడే మనలో పొందుపరిచాడు. ఇది మనలో ఉన్న మిక్కిలి సూక్షమైన, సున్నితమైన యంత్రాంగం. అటువంటి ప్రేమప్రకాశమే ఆనందం. మిగిలినది ఏదీ మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. హృదయాల్లో అనుభూతి చెందుతున్న ప్రేమ మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలదు. కాబట్టి ఒక ప్రేమించే వ్యక్తి ఒక ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉన్నతుడు.మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థ లేక యంత్రాంగం మనలో ఏడు పొరలుగా పనిచేస్తుంది. ఈ పొరల ఉపరితలం మీద ఆనంద తరంగాలు ఉప్పొంగి మెదడు అనే ఒడ్డుకు చేరుకొని ఆనందమనే బుడగలుగా ఏర్పడతాయి. కాని అక్కడ మన మెదడు హేతుబద్ధమైన శిలలా ఉంటే ఈ బుడగలు ఎందుకూ పనికి రాకుండా కరిగిపోయి ఆ రాయి మీద ఏ ప్రభావాన్నీ చూపలేవు. ఈ ఏడు పొరలే మనలోని శక్తి కేంద్రాలు. వాటినే చక్రాలు అని అంటాము. అదే మన శరీరంలో మన కంటికి కనపడని కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఇప్పుడు మనలోని ఈ అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లోని ఈ శక్తికేంద్రాలను గురించి కొంత విశదంగా తెలుసుకుందాం. మొదటిది మూలాధార చక్రం మొట్టమొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం మనలోని విసర్జనావయవాల మీద ప్రభావం చూపుతుంది. మనలో విసర్జనప్రక్రియ సరిగా జరిగినపుడు మనం ఎంతో ఉపశమనం పొందుతాం. ఇది చాలా ప్రాథమికమైన విషయం. అయితే ఆ ఉపశమనం మనకి ఒక రకమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇది చాలా స్థూలమైన చిన్న విషయంగా చెప్పబడుతుంది కానీ ఆ ఆనందం పొందడం చాలా ముఖ్యమైనది. కానీ ఈ ఆనందం మిగిలిన ఎన్నో లోతైన, సున్నితమైన వాటివలన కలిగే ఆనందాన్ని అధిగమించకుండా ఉండాలంటే మనం అ స్వచ్ఛతను కలిగి ఉండాలి. అదే మనలో వుండాల్సిన మొట్టమొదటి గుణం. స్వచ్ఛత అనేది ఎవరిలోనైనా కావాలనుకుంటే వచ్చేది కాదు. అది అంతర్గతంగా నిర్మితమై ఉండాలి. కానీ సహజయోగ సాధనతో మూలాధారాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా స్వచ్ఛతను వృద్ధి చేసుకోవచ్చు. స్వాధిష్టాన చక్రంఇక రెండవ పొర సృజనాత్మకత వలన కలిగే ఆనందం. అదే స్వాధిష్టాన చక్రం. కొంతమంది దేనినైనా సృష్టించాలని చాలా ఆరాట పడుతూంటారు. ఏదో ఒక పుస్తకాన్నో, లేక ఏదైనా కళాత్మకమైన దాన్నో సృష్టించడం చాలా ముఖ్యమని వారు అనుకుంటారు. ఈ సృజనాత్మకతకు కనుక హేతుబద్ధమైన మెదడు తోడైతే అప్పుడు అలాంటి వారు తామే అందరికన్నా గొప్పవారమని గర్వపడుతూ వుంటారు. ఎందు చేతనంటే వారు తాము చేసే పనులన్నింటి సత్ఫలితాలు వస్తున్నాయని, తన గొప్పతనం వలననే విజయం చేకూరుతోందని భావిస్తారు. ప్రతిదాన్నీ హేతువాదంతో చూస్తారు. అయితే అది సరైన ఆలోచన కాదు. ఈ రెండవపొరని అధిగమించాలంటే నిర్విచార స్థితిలోనికి వెళ్ళాలి. మీ అవగాహన ప్రకాశవంతమైనపుడు మీరు నిర్విచార స్థితిలోకి వెళతారు. అపుడు మీరు ఏమి సృష్టించినా దానిని కేవలం గమనిస్తారంతే. నిర్విచారమైన ఎరుకలో మీరు దేన్ని చూసినా, ఏమి సృష్టించినా దాన్ని ఆనందించ గలుగుతారు. ఎటువంటి ఆలోచనలూ లేని స్థితికి వెళతారు. ఈ గుణం మనలోనే వున్న శ్రీ బ్రహ్మ దేవ సరస్వతి తత్త్వాన్ని జాగృత పరచడం వల్లే సాధ్యమవుతుంది. – డా. పి. రాకేష్(అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా) -
Bakrid 2025 త్యాగాల పండుగ : ‘తఖ్వా’ అంటే..
సాధారణంగా పండుగలంటే తిని తాగి, భౌతికంగా పొందే తాత్కాలిక సంతోషం అనుకుంటారు. కాని అదొక అద్వితీయమైన, అనిర్వచనీయమైన, అలౌకిక ఆత్మానందం. రమజాన్ తరువాత బక్రీద్ రూపంలో మరో అద్భుత అవకాశం మనల్ని వరించింది. దీన్నిసద్వినియోగం చేసుకోవాలి. పుణ్యకార్యాలు ఆచరించి అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ‘తఖ్వా’(దైవభీతి)ను హృదయాల్లో ప్రతిష్టించుకోవాలి. జీవితం సార్ధకం కావాలంటే పరమ ప్రభువు ఆదేశాలను తు. చ. తప్పక పాటించాలి. అందుకే పరమ దయాళువైన అల్లాహ్ మనకోసం కొన్ని వసంత రుతువుల్ని ప్రసాదించాడు. అందుకని ఈ రుతువులో కరుణామయుని దయను పొందే నిమిత్తం కష్టపడాలి. వీలయినన్ని ఆరాధనలు చేయాలి. నఫిల్ ఉపవాసాలు పాటించాలి. ముఖ్యంగా ‘అరఫా’ రోజా పాటించాలి. దానధర్మాలు చేయాలి. అల్లాహ్ ప్రీతిని, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేయాలి. నిజానికి జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్ , హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘంగురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది పండుగ.ప్రతి ఒక్కరూ తమస్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. అదికూడా లేనివారు రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మంకోసం, ధర్మసంస్ఢాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది.(శనివారం బక్రీద్ పర్వదినం సందర్భంగా...) -
102 ఏళ్ల డాక్టర్..ఇప్పటికీ వైద్య సేవలోనే..! చిరకాలం బతకాలంటే..
ఎవ్వరైన రిటైర్మెంట్ ఏజ్ వరకు పనిచేస్తారు. ఆ తర్వాత పదవీవిరణ చేసి..రెస్ట్ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ శతాధికుడు విరామం ఎరుగని వైద్యుడు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండొవ ప్రపంచకాలం నాటి ఈ వృద్ధ డాక్టర్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అంతకంతకు పురోగమిస్తున్నారు. యువకుడి మాదిరిగా చురుగ్గా అన్నిపనులు చురుగ్గా చేసుకుంటారాయన. అంతేగాదు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఆ పనులు చేయొద్దని సూచనలిస్తున్నారాయన.అతడే. అమెరికాలో క్లీవ్ల్యాండ్కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ హోవార్డ్ టక్కర్. ఆయనకు 102 ఏళ్లు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేగాదు టక్కర్ అత్యంత వృద్ధ ప్రాక్టీస్ డాక్టర్(Worlds Oldest Practicing Doctor)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా దక్కించుకున్నాడు. 1922లో జన్మించిన డాక్టర్ టక్కర్ మహా మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, కోవిడ్-19 మహమ్మారితో సహా ఒక శతాబ్ద నాటి చారిత్రక సంక్షోభాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. విశేషం ఏంటంటే..ఇప్పటివరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు డాక్టర్ టక్కర్. తాను ఇంతవరకు ఎలాంటి భయానక వ్యాధులతో బాధపడలేదన్నారు. అయితే 80లలో మాత్రం మెడ సమస్యతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని, అయితే సునాయాసంగా ఆ సమస్యను జయించానని చెప్పారు. తన జీవితానుభవంతో నేర్చుకున్న ఆ నాలుగు పాఠాలే తన దీర్ఘాయువు రహస్యంగా విశ్వసిస్తారాయన. అంతేగాదు పదవీవిరమణ గురించి కూడా అస్సలు ఆలోచించరట. ఎందుకంటే దీర్ఘాయువు ప్రధాన శత్రువే పదవీ విరమణ అని నొక్కి చెబుతున్నారాయన. మరి టక్కర్ దీర్ఘాయువు రహస్యం ఏంటో తెలుసుకుందాం..👉 ఈ వృద్ధ డాక్టర్ తన జీవితాంతం వ్యాయామాన్ని స్కిప్ చేయలేదన్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి జాగింగ్, స్కీయింగ్, జిమ్, ట్రెడ్మీల్ వరకు అన్నింటి ని చేస్తారట ఆయన.👉 అలాగే ఉద్యోగానికి పదవీవిరమణ ఇవ్వొద్దు..ఏదో ఒక వ్యాపకంతో ఉండండి. చేయగలిగిన ఉద్యోగం ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. లేదంటే మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడవ్వుతుందట. తద్వారా అనారోగ్యాల బారినపడతామట. 👉 ఎల్లప్పుడూ పనిజీవితం, కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎల్లప్పుడూ సానుకూలత, ఆశావాదానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 👉 భవిష్యత్తు గురించి చిత్తించకుండా చేసే పనిలో సంతోషాన్ని వెతకండి. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. 👉 ఈ వృద్ధ డాక్టర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..మానసిక నిపుణురాలైన సారా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు, పదిమంది మనవరాళ్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో గొడపడటం, ప్రేమించడం వంటివి చేస్తానన్నారు.👉 చివరగా ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఉదయం సాధారణంగా సాగిపోకూడదన్నారు. అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పారు. 👉 అలాగే ఆయన సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ని వినియోగిస్తారు. సోషల్ మీడియా స్టార్గా మాత్రం ఉండనున్నారు. ఎందుకంటే స్వానుభవాలే..గొప్ప పాఠాలనేది ఆయన అభిమతం. 👉 వీటన్నింటి తోపాటు ధూమపానం, మద్యపానం సేవించొద్దని అన్నారు. తాను జీవితాంతం వాటి జోలికిపోలేదన్నారు. అలాగే మితంగానే ఆహారం తీసుకుంటానని చెప్పారు. 👉 అంతేగాదు డాక్టర్ టక్కర్ "జీవితమే ప్రాణాంతక వ్యాధి , దానికి విరుగుడు జీవించడమే" అని చమత్కారంగా చెప్పారు. ఈ వృద్ధ డాక్టర్ మాములు గ్రేట్ కాదు. అద్భుతమైన జీవిత పాఠాలు, ఆరోగ్య విధానం గురించి బహు చక్కగా వివరించారు డాక్టర్ టక్కర్. (చదవండి: ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..) -
Chitrakoot చరిత్ర చెక్కిన రామాయణం.. అడుగడుగునా విశేషమే!
మధ్యప్రదేశ్లోని సత్నాజిల్లాలో గల చిత్రకూటం ప్రకృతి సౌందర్యానికే కాదు... ఎందరో పురుషుల తపోదీక్షకు కేంద్రంగా ఉంది. అత్రి, అనసూయ, మార్కండేయుడు వంటి మునిపుంగవులు, గురువులకే గురువు దత్తాత్రేయుడు వంటి వారు తపస్సు ఆచరించేందుకు ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, పర్ణశాలలు నిర్మించుకుని, ఇక్కడి మందాకినీ నదిలో స్నానమాచరించి, నది ఒడ్డునే తపస్సు చేసుకున్నట్లు స్థలపురాణ చెబుతోంది.మధ్యప్రదేశ్ అడవులలో ఉత్తరప్రదేశ్ సరిహద్దులలో ఉన్న ఈ పవిత్రస్థలిలో ప్రతి కొండా, గుట్టా, రాయీ రప్పా, చెట్టూ పుట్టా, వాగూ వంకా, తీర్థమూ జలపాతమూ... ఇలా ప్రతి ఒక్కటీ కూడా సీతారామ లక్ష్మణులు, వారి దాసుడైన హనుమంతుడి పేర్లతోనే ముడిపడి ఉంటాయి. కేవలం జీవంలేని ప్రదేశాలే కాదు.. ఇక్కడ జీవం పోసుకున్న ప్రతి వారి పేర్లలో సీతా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడూ ఉంటారు. వారి పిలుపులు కూడా రామ్ రామ్ అనే ఉంటాయి. తమకు తారసపడిన ప్రతి వారినీ రామ్ అనే పిలవడం వీరి ఆచారం. కొండగుహలన్నీ రామనామ జపంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద బండరాళ్లమీద సీతమ్మ చీరలు ఆరవేసుకున్నట్లుగా... రామయ్య శయనించినట్లుగా... లక్ష్మణుడు సేదదీరినట్లుగా... హనుమంతుడు గంతులు వేసినట్లుగా ఆనవాళ్లుంటాయి. అంతర్వాహినిగా గుప్తగోదావరి: మందాకినీ నదితోపాటూ యమునా నది కూడా ఇక్కడికి దాపులలోనే ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన పాదచారులకు తన చల్లని స్పర్శతో, గలగల శబ్దాలతో అంతర్వాహినిగా ప్రయాణిస్తూ ఓ గోదావరీపాయ గుప్తగోదావరిగా పేరు తెచ్చుకుంది. రామ్ఘాట్: మందాకినీ నది ఒడ్డున గల ఈ స్నానఘట్టంలోనే రాముడు రోజూ స్నానం చేసేవాడట. రామలక్ష్మణులు స్నానం చేసి వస్తున్నట్లుగా తులసీదాసు తన మనోనేత్రాలతో దర్శించాడట. అందుకే దీనిని తన రామచరిత్ మానస్లో రామ్ఘాట్ అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు.కామద్గిరి: మందాకినీ నది పరిక్రమ చే సే భక్తులు ఇక్కడ గల రామాలయాన్ని సందర్శించి, మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే కామదనాథుడనే పేరుగల రాముడు కోరిన కోరికలు తీర్చే వేల్పుగా ప్రసిద్ధి΄÷ందాడు. ఇక్కడే అనేక ఆలయాలున్నాయి. భరత్ మిలాప్: తన అన్నగారు ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న భరతుడు వేలాదిమంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చి, రాముణ్ణి కలిసిన ప్రదేశమిది. రాముణ్ణి భరతుడు కలిసిన ప్రదేశం కాబట్టి, భరత్ మిలాప్ అనే పేరొచ్చింది. ఇక్కడ భరతుడికి చిన్న మందిరం ఉంది. జానకి కుండ్: రాముడు స్నానం చేసిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే సీతాదేవి స్నానం చేసేదట. అందుకే ఈ ఘట్టానికి జానకి కుండ్ అనే పేరొచ్చింది. సతీ అనసూయ ఆశ్రమం: అత్రి మహాముని పత్ని, సతీ అనసూయా దేవి ఇక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుడిని, ఆయన సోదరులను సాకిందట. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అనసూయా శ్రమాన్ని సందర్శించారట. అప్పుడు అనసూయ సీతకు పాతివ్రత్య ధర్మాలను బోధించడంతో΄ాటు, రకరకాల లేపనాలను, రుచిగల పండ్లను, చీరలను కానుకగా ఇచ్చిందట. హనుమాన్ ధార: చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రదేశానికి చేరాలంటే కనీసం రెండువేల మెట్లను ఎక్కవలసిందే! ఎంతో ప్రయాసకు ఓర్చి ఇక్కడ వరకు వచ్చిన వారి అలసట, మార్గాయాసం అంతా తీరిపోయేలా పురాతన హనుమద్విగ్రహం దర్శనమిస్తుంది. ఎక్కడినుంచి పడుతోందో తెలియని విధంగా నిత్యం జలధార పడుతూ, విగ్రహాన్ని అభిషేకిస్తుంటుంది.రామశయ్య: సీతారామలక్ష్మణులు తాము శయనించేందుకు వీలుగా ఒక పెద్ద చెట్టునీడన గల రాతిప్రదేశాన్ని శయ్యలా చెక్కారట. ఈ రాతిపరుపు పైనే సీతారాములు శయనించేవారట. వారు ఇక్కడ సేదదీరేవారనడానికి గుర్తుగా సీతారామలక్ష్మణుల ముగ్గురి విగ్రహాలూ దర్శనమిస్తాయి. దీనికే రామశయ్య అని పేరు వచ్చింది. స్ఫటిక శిల: సీతారాములు కూర్చున్న ఒక రాతితిన్నెకే స్ఫటిక శిల అని పేరు. సీతారాముల పాదముద్రలు ఈ శిలపై మెరుస్తూ కనిపిస్తాయి. ఉత్సవాలు... పర్వదినాలు: చిత్రకూటంలో ప్రతి అమావాస్యకూ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇంకా దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, ఉగాది వంటి అన్ని హిందూ సంప్రదాయ పండుగలప్పుడూ ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. భోజన, వసతి సదుపాయాలు: చిత్రకూటాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖలవారు విడివిడిగా అందుబాటు ధరలలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇవిగాక ప్రైవేటుగా బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి. – డి.వి.ఆర్. ఎలా వెళ్లాలంటే : విమాన మార్గం: చిత్రకూటానికి దగ్గరలో గల ఏర్΄ోర్ట్ ఖజురాహోనే. అయితే ఇక్కడినుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో గల చిత్రకూటానికి వెళ్లాలంటే మాత్రం మళ్లీ బస్సు లేదా రైలుప్రయాణం తప్పదు మరి. వారణాసి, జబల్పూర్ విమానాశ్రయాలయితే ఇంకా దూరం.రైలు ద్వారా: ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, వారణాసి వంటి ప్రధాన నగరాలనుంచి రైలు ద్వారా కార్వి రైల్వేస్టేషన్కు చేరుకోవచ్చు. అక్కడినుంచి 12 కిలోమీటర్ల దూరంలోని చిత్రకూటానికి ప్రైవేటు వాహనాలుంటాయి. రోడ్డు మార్గం: అలహాబాద్, సత్నా, పన్నా, బండాల నుంచి చిత్రకూటానికి మంచి రోడ్డుమార్గం ఉంది. బస్సులు లేదా ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. -
ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..
సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకోగానే..బరువులేని స్థితిలో ఉంటారు. అందుకు గుర్తుగా ఒక బొమ్మను తీసుకువెళ్తుంటారు. భూమి నుంచి దూరంగా భారరహిత స్థితిలో ఉన్నందుకు గుర్తుగా ఒక టాయ్ని రాకెట్లోకి తీసుకువెళ్లే సంప్రదాయం వ్యోమగామలకు ఉంది. అయితే ఈసారి టెక్సాస్కు చెందిన ఆక్సియమ్ స్పేస్ మిషన్ని స్పేస్ఎక్స్-నాసా భాగస్వామ్యంతో మరికొద్దిరోజుల్లోనే ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్కు భారత్కి చెందిన శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు. మరీ ఈసారి జీరో గ్రావిటీలో చేరుకున్నందుకు గుర్తుగా వ్యోమగాములు ఏ బొమ్మను తీసుకువెళ్తున్నారు..? దాని ప్రత్యేకత వంటి విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!..ఆక్సియమ్ స్పేస్ మిషన్ ఈ నెల జూన్ 10న ప్రారంభకానుంది. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ లాంఛ్ అవుతుంది. ఈ రాకెట్ నలుగురికిపైగా వ్యోమగాములు, వారి పరిశోధన సామాగ్రితో సహా అంతరిక్ష కక్ష్యలోకి తీసుకువెళ్లనుంది. వారితోపాటు జీరో-గ్రావిటీకి గుర్తుగా ఓ చిన్న బొమ్మ కూడా ఈ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ బొమ్మను జీరోగ్రావిటీ ఇండికేటర్గా వ్యవహరిస్తారు.ఈ మేరకు ప్రీ-ఫ్లైట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆక్సియం-4 సిబ్బంది మిషన్ జీరో-గ్రావిటీ ఇండికేటర్ను ఆవిష్కరించారు. అదేంటంటే సరస్వతి దేవి వాహనమైన 'హంస'. భారరహిత స్థితిలోకి చేరుకున్న దృశ్యమానాన్ని సూచించడానికి వ్యోమగాములు తమ వెంట ఏదో ఒక బొమ్మ తీసుకువెళ్లే సంప్రదాయంలో భాగంగా ఈ సారి హంసను ఎంపిక చేసుకున్నట్లు ఆక్సియం మిషన్ పేర్కొది. ఇదే ఎందుకంటే..భారతీయులు జ్ఞానాన్ని, ఉన్నత విద్యను అందించే దేవతగా సరస్వతి మాతను ఆరాధిస్తారు. ఆమె వాహనమే ఈ హంస. ఆంనదాన్ని హంసతో పోలుస్తారు. హంస రంగులా ఆనందం నిర్మలమైన తెలుపులో ఉంటుదనేందుకు సూచిక. అలాగే దాని ముక్కు పసుపు,నలుపు రంగుల్లో ఉంటుంది. అంటే సవాళ్లు, విజయాలు ఒకదాని వెంట ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అదీగాక ఈ మిషన్లో ప్రయాణించి నలుగు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ హంసనే సాంస్కృతిక చిహ్నంగా ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా ఆ సభ్యులలో ఒకరైన భారతీయ వ్యక్తి వ్యోమగామి శుక్లాకు ఆ బొమ్మతో మతపరంగా మరింత లోతైన సంబంధం ఉంది. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్ శుక్లా మాట్లాడుతూ..హంసకు పాల నుంచి నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందని విశ్వసిస్తారు. ఇది జ్ఞానానికి సూచిక. ఈ బొమ్మ మా మిషన్ని విజయంతం చేసేలా స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఇక ఈ మిషన్ కమాండర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ మాట్లాడుతూ..వ్యోమగామి సిబ్బంది మైక్రోగ్రావిటీ గుర్తుగా స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లోపల ఈ హంస బొమ్మ స్వేచ్ఛగా తేలుతున్నట్లు కెమెరాల్లో చూడొచ్చన్నారు. అంతేగాదు ఈ ఆక్సియమ్ రాకెట్ను ప్రయోగించిన కొద్దిసేపటికే.. ఈ టాయ్ మైక్రోగ్రావిటీలో మన రాకను సూచిస్తుందని చెప్పారు. ఇక మిషన్లో పాల్గొన్న మూడు దేశాల వ్యోమగాముల ఆకాంక్షలకు చిహ్నం కూడా ఈ హంస బొమ్మే. అదేలా అంటే..భారతదేశంలో ఇది జ్ఞానానికి చిహ్నం కాగా, పోలాండ్, హంగేరిలో ఇది దయకు సంకేతం. అంతేగాదు ఆ నలుగురు వ్యోమగాముల వైవిధ్యానికి, ఐక్యతకు చిహ్నంగా ఈ హంస బొమ్మ నిలవడం మరింత విశేషం. కాగా, ఈ ఆక్సియమ్ 4 మిషన్ గత నెల మే29న ప్రారంభం కావలి, అనివార్య కారణాల రీత్యా జూన్ 8కి షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత జూన్ 10 సాయంత్రం 5.52 నిమిషాలకు లాంఛ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది స్పేస్ఎక్స్. మిషన్ సోవియట్ సోయుజ్ T-11తో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడు కాగా, సరిగ్గా 41 ఏళ్లకు, ఆక్సియమ్ 4 మిషన్తో గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడుగా నిలిచారు. అంతేగాదు బహుళ భారతీయ ఏజెన్సీల భాగస్వామ్యంతో శాస్త్రీయ ప్రయోగాలతో కూడిన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ మిషన్లో పాల్గొన్న మొదటి భారత పౌరుడు కూడా ఆయనే.(చదవండి: భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..) -
World Environment Day 2025: పర్యావరణాన్ని కాపాడాలి!
మన చుట్టూ ఉన్న సహజ, మానవ నిర్మిత అంశాలన్నీ కలిపి ఒక జీవి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే వాతా వరణమే పర్యావ రణం. నేల, నీరు, గాలి మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకాలు. ఈ మూడూ ఇప్పుడు కలుషితం అవుతూ ఉండడం భూమి మీద ఉన్న సకల జీవరాశికీ ప్రాణసంకటం అయ్యింది. పర్యావరణంలోకి విడుదల అవు తున్న ఇతర కాలుష్య కారకాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణ వ్యవస్థల్ని మరింతగా ధ్వంసం చేస్తున్నాయి. ప్లాస్టిక్ కాలు ష్యాన్ని సమర్థంగా ఎదు ర్కోడానికి ప్రపంచ దేశా లన్నీ ‘ప్లాస్టిక్ కాలు ష్యాన్ని ఎదుర్కొందాం’ అనే నినాదంతో 2025 సంవత్సరపు పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకోవాలని ఐక్య రాజ్య సమితి కోరింది. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ చేరడంవల్ల వాతావరణం వేడెక్కి దాని ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. వేడి వాతావరణంలో కాలుష్య కారకాలు, పుప్పొడిరేణువుల సంచారం బాగా పెరుగుతుంది. కాలుష్యం పెరగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కంటి జబ్బులు కూడా వస్తున్నాయి. ఈ వేడికి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఉప్పె నలు వస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థలో మరొక సమస్య ఆమ్లవర్షాలు. నేల మీద విడు దలై ఆకాశాన్ని చేరుతున్న కలుషిత గాలుల్లో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఉన్నాయి. ఇవి వర్షపు జల్లులతో కలసి ఆమ్లవర్షాలుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు నేలపై పడేసరికి ఆ నేలలు సేద్యానికి యోగ్యం కాకుండా పోతున్నాయి. కప్ప వంటి ఉభయచరాలు చిన్న చిన్న గుంటల్లో గుడ్లు పెడతాయి. అక్కడికి ఆమ్లవర్షం చేరితే గుడ్లు నాశనమై పిల్లలు పుట్టవు. నీటిలో నివసించే చేపలు, రకరకాల కీటకాలు, ఈ ఆమ్లవర్షాలకు బతక లేవు. ఈ వర్షం ఆహారపు గొలుసును తునా తునకలు చేస్తుంది. రవాణా కోసం మోటారు సైకిళ్ళకు బదు లుగా ప్రజారవాణా సదుపాయాన్ని వినియో గించుకోవాలి. నడక, సైకిళ్ల వాడకం మంచిది. రక్షిత నీటి సరఫరాకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. దోమలను నియంత్రించే విధానాలపై దృష్టి పెట్టాలి. నీరు పారే ప్రాంతాలలో ఎటు వంటి మలినాలు లేకుండా చూడాలి. ఇదీ చదవండి: చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్పర్యావరణంలోకి చేరే వ్యర్థా లలో అధిక భాగం ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలే! ఏటా విడుదల వుతున్న ప్లాస్టిక్ వ్యర్థా లలో 46 శాతం వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తుంటే, దాదాపు 23 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సము ద్రాలు, నదులను కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ పదార్థాలు నేలలో కలసిపోవు. నేలను నాశనం చేస్తాయి. సాధ్యమైనంతవరకు రీసై కిల్ చేయడానికి వీలున్న ప్లాస్టిక్ వస్తువు లనే వాడాలి. అలా కానివాటి వాడకాన్ని నిషేధించాలి. ఇప్పుడు శబ్దకాలుష్యం ఎక్కువ అయ్యింది. ఈ కాలుష్యాన్ని హరించేందుకు చెట్ల పెంపకం చేపట్టాలి. రైతులు పంటల దిగుబడి పెరిగేందుకు కృత్రిమ రసాయ నాలను ఎరువులుగా వాడే బదులు సేంద్రియ ఎరువులు వాడాలి. మరుగుదొడ్ల వాడకం పెరగాలి. డా. సి.వి. సర్వేశ్వర శర్మపాపులర్ సైన్స్ రచయిత(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) -
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్ లుక్లో తన అభిమానులకు సరప్రెజ్ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్బర్డ్స్కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్ గురించి ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్ డిజైన్సహా ఆమె డిజైన్స్ ట్రెండ్గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda)p; -
ఉన్నది ఒకటే అన్న భావనే అద్వైతం
ద్వైతం కానిది అద్వైతం. అంటే రెండు అనే భావన పోయి ఉన్నది ఒకటే అని భావించగలగటం అద్వైతమవుతుంది. అయితే ఉపాధులన్నీ సమానమని అర్థం కాదు. పాపపుణ్య కర్మ ఫలితంగా వచ్చిన ఉపాధులు పరస్పరం భిన్నమైనవే. అవి పూర్తిగా నశించిపోయేవే. నశించనిది, నిత్యసత్యమైనది ఉపాధి గతమైన ఆత్మ ఒక్కటే. ఈ విషయం గ్రహించటమే సమదర్శి స్వభావం. నిత్యసత్యం, వ్యవహార సత్యం అనేవి రెండున్నాయని గ్రహించాలి. మనకు కనబడే ప్రపంచమంతా వ్యవహారంలో సత్యం. కాని నిత్యసత్యము మాత్రం కాదు. ప్రపంచం నిత్యసత్యమని తెలిస్తే అది భ్రాంతి అనక తప్పదు. ఈ అద్వైత జ్ఞానం వల్ల తానంటూ వేరే ఉండక అంతట తననే చూడటం, తనలోనే సర్వాన్ని చూడటం జరుగుతుంది. ‘ఆత్మ వత్సర్వభూతాని సర్వభూతాని చాత్మని’ అనే దాని కర్థం అదే. ఈ జ్ఞానం ఒక్క గురుబోధ, గురుసేవ వల్లనే లభ్యం. కేవలం గ్రంథ పఠనం చాలదు.ఒక గురువు గారు తన శిష్యుడికి ‘అద్వైతం’ గురించి పాఠం ప్రారంభించారు. ‘భగవంతుడు ఒకడే. ఆయన సర్వాంతర్యామి. ఆయన సంకల్పంతో సృష్టి జరిగింది. ఆయనొక్కడే నిత్య సత్యం. ఈ కనబడేది అంతా భ్రాంతి వల్ల కనబడు తున్నది కాని నిజానికి ఇదేదీ లేదు. అని మొదట్లో బోధించటం జరిగింది. ఈ జ్ఞానం శిష్యులలో స్థిరపడటానికి ఇంకా సమయం కావాలి. గురువిచ్చే అనుభవం సంపాదించాలి. అప్పుడుగాని అర్థమైనట్లు కాదు. ప్రాథమిక దశలోనే ఉన్న ఈ శిష్యుడు ఒక సారి అడవికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. దారిలో ఒక మదపుటేనుగు ఎదురుగా వస్తున్నది. దానిపై ఉన్న మావటివాడు, ఈ ఏనుగు ఇది పూర్తిగా మచ్చిక కాని మదపుటేనుగు పక్కకు తప్పుకో అని అరిచాడు. ఆ శిష్యునికి అద్వైతం పాఠం గుర్తుకొచ్చింది. ‘ఈ కనబడేదంతా బ్రహ్మమే. రెండవదంటూ లేదు.’ కాబట్టి ఈ కన బడే ఏనుగు భ్రాంతి జన్యమైంది. కనుక నేను తప్పుకోవలసిన పని లేదని ముందుకు నడిచాడు. ఏనుగు రానే వచ్చింది, తొండంతో అతణ్ణి విసిరి అవతల పారవేసింది. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందో లేదో కాని మనకు మాత్రం బాగా అర్థమవ్వాల్సింది ఏమిటంటే... ‘ఉపాధులన్నింటిలోనూ ఉన్న అంతర్యామి ఆత్మ ఒక్కటే అయినా, ఉపాధి గత భేదం భేదమే’అని! -
మిస్టర్ వరల్డ్ పోటీలు: మిస్టర్ గ్లో..మిస్టర్ స్లో..
అందాల ప్రపంచంలో అతివలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. పురుషులకూ అంతే ప్రాధాన్యత ఉంది. మోడలింగ్ కావచ్చు, గ్లామర్, సినీ రంగాల్లో రాణించాలనుకునే యువతికైనా, యువకుడికైనా బ్యూటీ కాంటెస్ట్లు చక్కని ర్యాంప్ను ఏర్పాటు చేస్తాయి. అయితే మహిళల అందాల పోటీలు రోజురోజుకూ విస్తరిస్తుంటే మగవాళ్ల అందాల పోటీల విలువ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పోటీలు సందడిగా ముగిసిన నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలను సిటీ మోడలింగ్ రంగం గుర్తు చేసుకుంటోంది. ప్రపంచ సుందరి పోటీలు ఎంత పాపులరో, ప్రపంచ సుందరాంగుడు పోటీలు అంత తక్కువ పాపులర్ అని చెప్పొచ్చు. మిస్ వరల్డ్ పోటీలను 1951లో ప్రారంభిస్తే.. చాలా ఆలస్యంగా.. 45ఏళ్ల తర్వాత 1996లో మిస్టర్ వరల్డ్ పోటీలను ఎరిక్ మోర్లే ప్రారంభించారు. అందం, శారీరక సామర్థ్యం, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని బట్టి పురుషులను విజేతలుగా ఎంపిక చేసే ఈ పోటీ లండన్లోని ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సారథ్యం వహిస్తున్న జూలియా మోర్లేనే ఈ పోటీలకు సైతం అధ్యక్షురాలిగా ఉన్నారు. మూడు దశాబ్దాల్లో.. పదకొండు సార్లు.. మిస్ వరల్డ్ పోటీల్లానే.. ఏటా నిర్వహించాలని ప్రారంభంలో అనుకున్నా.. స్పందనను బట్టి ఈ పోటీలను నిర్ణిత వ్యవధి అనేది లేకుండా నిర్వహిస్తున్నారు. తొలిసారి 1996లో బెల్జియం వాసి టామ్ నుయెన్స్ ఈ పోటీలో గెలుపొందగా, 1998లో వెనిజువెలా వాసి సాండ్రో ఫినోగ్లియో, 2000లో ఉరుగ్వే వాసి ఇగ్నాసియో క్లిచె, 2003లో బ్రెజిల్ వాసి గుస్తావో గియానెట్టి, 2007లో జువాన్ స్పెయిన్ కు చెందిన గార్సియా పోస్టిగో, 2010లో ఐర్లాండ్కు చెందిన కమాల్ ఇబ్రహీం, 2012లో కొలంబియా నివాసి ఫ్రాన్సిస్కో ఎస్కోబార్, 2014లో డెన్మార్క్ నుంచి నిక్లాస్ పెడర్సెన్, 2016లో మొదటి ఆసియన్ విజేతగా భారత్కు చెందిన రోహిత్ ఖండేల్వాల్, 2019లో ఇంగ్లాండ్ వాసి జాక్ హెసెల్వుడ్ గెలుపొందారు. చివరి సారిగా 2024లో ఈ పోటీ నవంబర్ 23న వియత్నాంలోని ఫాన్ థియెట్లో జరిగింది. డానియెల్ మేజియా మిస్టర్ వరల్డ్ పోటీలో, స్పోర్ట్స్ టాలెంట్ విభాగాల్లో విజేతగా నిలిచారు. అతను 60 మంది ఇతర పోటీదారులతో పోటీపడి, మొదటి స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాల్లో.. మిస్టర్ వరల్డ్ పోటీలో పాల్గొనేవారు వివిధ విభాగాల్లో పోటీ పడతారు, వారి శారీరక సామర్థ్యం పరీక్షించడానికి స్పోర్ట్స్ ఛాలెంజ్, ప్రతిభను ప్రదర్శించే టాలెంట్ రౌండ్, సామాజిక మాధ్యమాల్లో పట్టును చూపించే మల్టీమీడియా, వ్యక్తిగత శైలి ఫ్యాషన్ సెన్స్ చూపే ఫ్యాషన్ రౌండ్.. ఈ పోటీలు పాల్గొనేవారి సమగ్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రూపొందించారు. ఇండియాకు టైటిల్ తెచ్చిన నగరవాసి..2016లో, రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు, ఆసియన్ కూడా. ఈ పోటీ జులై 19, 2016న ఇంగ్లండ్లోని సౌత్పోర్ట్లో జరిగింది. రోహిత్, మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు కూడా గెలుచుకున్నారు. విశేషం ఏమిటంటే రోహిత్ ఖండేల్వాల్ నగరానికి చెందిన యువకుడు కావడం. ఈ నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి మన హైదరాబాద్ పూర్తిగా సరైన ఎంపిక అని పలువురు నగర మోడల్స్ అభిప్రాయపడుతున్నారు. మిస్ వరల్డ్ లాగే మిస్టర్ వరల్డ్ పోటీదారులు కూడా హైదరాబాద్ నగరంలో సందడి చేస్తారేమో వేచి చూద్దాం.. (చదవండి: మిస్ యూనివర్స్ సన్నాహకం..) -
మెల్లగా వేగాన్ వైపు..! దావత్ ఈద్ పేరుతో..
ప్రస్తుత ఈద్ అల్–అధా (బక్రీద్) పండుగ నేపథ్యంలో పెటా మరోసారి జంతుహింస పై అవగాహన కల్పిచింది. ఇందులో భాగంగా నగరంలో నిత్యం అన్నదానం చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ సర్వ్ నీడీ సహకారంతో దావత్–ఎ–ఈద్ పేరుతో వేగన్ బిర్యానీ పంపిణీ చేశారు. స్వతహాగా వేగన్ అయినటువంటి ప్రముఖ సింగర్ జహ్రా ఎస్ ఖాన్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. నీలోఫర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోని అన్నార్తులకు ప్రత్యేకంగా వడ్డించిన వేగన్ బిర్యానీ పంపిణీ చేశారు. ఏ మతమైనా కరుణను కోరుకుంటుందని, ఆయా మతపరమైన వేడుకల్లో జంతు వధ తప్పనిసరి కావాల్సిన అవసరం లేదని పెటా బృందం నినదించింది. జంతువులపై దయ, కరుణతో నిర్వహించే పండుగలకు మరితం ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. మనుషుల్లాగే జంతువులకూ..జంతు రవాణా చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక జంతువులను ఇరుకైన ట్రక్కుల్లో లాక్కెళుతూ, వాటి ఎముకలు విరిగిపోయినా, ఊపిరాడక చనిపోయినా పట్టింపు లేకుండా హింస్తుండటం బాధాకరం. నేను గత నాలుగేళ్ల నుంచి వేగన్గా మారాను. జంతు సంరక్షణే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడంలో వేగన్ ఫుడ్ ఉత్తమమైనది. ఫిట్గా ఉండటంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్లు, మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం వంటి వ్యాధులకు దూరంగా ఉంచడంలో ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యానికి కీలకమైనది. సినిమాల పరంగా మరో మూడు పెద్ద ప్రాజెక్టుల్లో భాగమయ్యాను, త్వరలో అవి విడుదల కానున్నాయి. – జహ్రా ఎస్ ఖాన్మంచి అనుభూతినిచ్చింది.. మహానగరంలో ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నాం.. కానీ ఈ రోజు వినూత్నంగా వేగన్ బిర్యానీ అందించడం మంచి అనుభూతినిచ్చింది. సమానత్వం, సేవ మనుషులకు మాత్రమే కాదు సాటి మూగజీవాలకూ వర్తిస్తుందనే విషయాన్ని పెటా తమ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంది. ఇది స్ఫూర్తినిచ్చే అంశం. – గౌతమ్ కుమార్, సర్వ్ నీడీ వ్యవస్థాపకులు (చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్ కూడా..) -
భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..) -
పర్యావరణ హితమైన క్లీనింగ్ ప్రొడక్ట్స్నే ఉపయోగిద్దాం ..!
పర్యావరణానికి మేలు చేయడానికి చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. రోజువారీగా మన ఇళ్లలో... గిన్నెలు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి, ఫ్లోర్ తుడవడానికి, వాష్ రూమ్లు, గాజు పరికరాలు శుభ్రం చేయడానికి... ఉపయోగించే క్లీనర్స్ సువాసన రావడానికి ఎయిర్ ప్రెషనర్స్.. అంటూ రకరకాల రసాయన ఉత్పత్తులను వాడుతుంటాం. శుభ్రత మాట ఎలా ఉన్నా ఇవన్నీ పర్యావరణానికి హానిచేసేవే ఉంటాయి. వ్యర్థాల నుంచి తిరిగి ఉపయోగించేలా వస్తువుల తయారీ ఎంత ముఖ్యమో, ఇంటి శుభ్రతలో రసాయనాలు లేని ఉత్పత్తుల వాడకమూ అంతే ముఖ్యం. ఆల్ పర్సప్ క్లీనర్స్...దినచర్యలో భాగంగా వంటగది, బాత్రూమ్.. ఇంటిలోని ప్రతి భాగాన్ని శుభ్రం చేయడానికి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి. వెనిగర్లో బాక్టీరియా నశింపజేసే గుణం ఉంటుంది. కిచెన్, గ్లాస్, బాత్రూమ్ క్లీనర్గానూ పనిచేస్తుంది.వంటలలో వాడే బేకింగ్ సోడాను ఇంటి శుభ్రతలోనూ వాడచ్చు. మరకలు తొలగించడానికి, దుర్వాసన పోగొట్టడానికి నీటిలో కలిపి ఉపయోగించవచ్చు. నిమ్మరసంలో యాసిడ్ గుణం ఉండటం వల్ల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. కూరగాయలు కట్ చేసే బోర్డ్స్, మెటల్ పాలిష్ రిమూవర్కి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఇంట్లో మంచి పరిమళాలు రావడానికి సుగంధనూనెలను ఉపయోగించవచ్చు. ఈ నూనెలలో యాంటీబాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయిఫ్లోర్ క్లీనర్గా 5 లీటర్ల నీటిలో అర కప్పు వెనిగర్ + స్పూన్ బేకింగ్ సోడా + కొన్ని చుక్కల ట్రీ ట్రీ ఆయిల్ కలిపి ఫ్లోర్ను తుడవాలి. ఫ్లోర్పై ఉన్న మరకలు, బాక్టీరియా శుభ్రపడుతుంది. ఆల్ పర్పస్ క్లీనర్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. కప్పు వెనిగర్ + కప్పు నీరు + 10 చుక్కల నిమ్మ నూనె స్ప్రే బాటిల్లో కలిపి, గ్లాస్, కిచెన్ కౌంటర్లపై స్ప్రే చేసి, తుడవాలి. బాక్టీరియా దరిచేరదు. చక్కగా శుభ్రపడతాయి.ఆత్మీయ నేస్తం పర్యావరణ ముప్పుకు చెక్ పెట్టే అతి పెద్ద రక్షణ ‘చేతి సంచి. యూజ్ అండ్ థ్రో ΄ాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించడానికి క్లాత్తో లేదా జ్యూట్తో చేసిన సంచులను ఉపయోగించవచ్చు. సొంతంగా క్లీనింగ్ ప్రొడక్ట్స్గిన్నెలు కడగడానికి లిక్విడ్ డిష్ వాషర్కి షీకాకాయ, కుంకుడుకాయ పొడి, లెమన్పీల్ పౌడర్, ఉప్పు, బూడిద కలిపి మిశ్రమం తయారుచేసి, దానినే ఉపయోగిస్తాను. ఆరెంజ్ పీల్, నీళ్లు, బెల్లం కలిపి ఒక పాత్రలో పోసి 3–4 నెలల పాటు అలాగే ఉంచుతాను. ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి స్పూన్తో కలుపుతాను. ఆ మిశ్రమాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి, ఫ్లోర్ తుడవడానికి ఉపయోగిస్తాను. అలాగే, వాషింగ్ మెషిన్ లిక్విడ్, బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్కి కుంకుడు కాయల నుంచి రసం తీసి ఉపయోగిస్తాను. ఒంటి శుభ్రతలోనూ సహజ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను. దుస్తులకు డై చేయడంలో సహజసిద్ధమైన పద్ధతులనే ఎంచుకుంటాను. వీటి తయారీకి కొంత సమయం పడుతుంది. కానీ, పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులను వాళ్లు దోగాడటం నుంచి ఉపయోగిస్తున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ నుంచి ఎకో ప్రింటింగ్ వైపుకు నా ఆలోచనను మార్చుకున్నది కూడా పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీలో భాగం అవ్వడం కోసమే. – సవిత అలంపల్లి, ఎకో ప్రింటర్, కిస్మత్పుర, హైదరాబాద్(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ) -
పెంపుడు కుక్క మరణంతో తీవ్ర మనోవేదన!
మా పెంపుడు కుక్క 12 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే జబ్బు చేసి చనిపోయింది. మాకు పిల్లలు లేని కారణంగా, కుక్కతో మాకు చాలా అటాచ్ మెంట్ ఉండేది. నాకు బాధగా ఉన్నప్పటికీ, మా ఆయన మరీ డీలా పడిపోయారు! రోజు దానిని నడకకు తీసుకెళ్ళడం, రాత్రి భోజనం పెట్టడం, స్నానం చేయించడం, ఆయన ఎంతో శ్రద్ధతో చేసేవారు. అది చనిపోయిన తరువాత ఆయన బాగా డల్ అయి మాటలు కూడా తగ్గాయి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టే ఉంటున్నారు. రాత్రులు నిద్ర పట్టక గంటల తరబడి అటు ఇటు తిరుగుతున్నారు. బిజినెస్ మీద కూడా ముందున్న శ్రద్ధ పెట్టడం లేదు నా భర్తను కోల్పోతున్నానని, భయమేస్తోంది. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు. – మంజుశ్రీ, విశాఖ పట్టణం మీ ఉత్తరంలో మీ భర్త ఎదుర్కొంటున్న తీవ్రమైన మానసిక వేదన స్పష్టంగా కనిపిస్తోంది. 12 సంవత్సరాలుగా అంతప్రేమగా పెంచుకున్న పెట్ని కోల్పోవడం మీ ఇద్దరికీ ఎంత బాధాకరమో నేను ఊహించగలను. దానికి రోజూ మార్నింగ్ స్నాక్స్, రాత్రి భోజనం, స్నానం వంటి రోజు వారికి కార్యాలు చేయించడం ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా అయినట్లు అనిపిస్తుంది. ఆయన మనోవేదన, ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత తీవ్రంగా ఉన్నట్లుంది. పెంపుడు జంతువులు అందునా ముఖ్యంగా కుక్కలు, మన భావోద్వేగ జీవితంలో ఒక అంతర్భాగం అవుతాయి. అవి నిష్కపటమైన ప్రేమను పంచుతాయి. మీ భర్త ఒంటరితనం, నిద్రలేమి, పనిలో ఇబ్బందులు చూస్తే ఆయన ‘కాంప్లికేటెడ్ గ్రాఫ్’ అనే మానసిక రుగ్మతతో పోరాడుతున్నాడని అనిపిస్తుంది. మార్నింగ్ వాక్, కుక్కకు రాత్రి భోజనం పెట్టడం వంటిని ఆయనకు ఒక నిర్దిష్టమైన రొటీన్ను అందించాయి. అవి లేకపోవడం, వల్ల అతని దైనందిన జీవితంలో ఒక శూన్యత ఏర్పడినట్లుంది. కొన్నిసార్లు కుక్క చనిపోయినప్పుడు దాన్ని బతికించుకోలేక పోయాననే గిఫ్ట్ ఫీలింగ్ కూడా ఉండొచ్చు! మన సమాజం పురుషులను తమ దుఃఖాన్ని బయటకు వెలిబుచ్చకుండా మనసుల్లో దాచుకొనేందుకు ఒత్తిడి చేస్తుంది. ఇది కూడా ఆయన ప్రస్తుత ప్రవర్తనకు ఒక కారణం కావచ్చు. ఆయన పడుతున్న వేదనను మీరు అర్థం చేసుకొని ‘నేను నీకోసం నీతోనే ఉన్నాను’ అనే విషయాన్ని ఆయనకు అర్థం అయేలా వ్యక్తం చేయండి. ఇది అతను ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఇస్తుంది. మీ కుక్క జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటడం లేదా ఫోటో ఆల్బమ్ తయారు చేయడం లాంటిని ఆయనతో చేయించండి. ఆయన రొటీన్ను కొనసాగించడానికి, ఉదయం నడకకు కలిసి వెళ్దామని సూచించండి. ఆయన నిద్రలేమి ఒంటరితనం, పనిలో ఇబ్బందులు కొనసాగితే ఒక సైకియాట్రిస్ట్కి చూపించి కౌన్సెలింగ్, ఇంకా అవసరం అయితే కొన్ని మందులు, వాడించండి. మీ కుక్కకు సంబంధించిన మంచి జ్ఞాపకాలు పంచుకోండి. మీ ప్రేమ, సాంగత్యం అతనికి శక్తిమంతమైన సపోర్ట్గా ఉంటాయి. మీరు ఆత్మస్థైర్యంతో ఈ పరిస్థితిని తప్పకుండా – అధిగమిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com ) -
WED: పర్యావరణం కోసం.. తిరుగులేని యోధులు
ఆకాశాన్ని అంటుతున్న పర్యావరణ ఉద్యమ భవనాన్ని చూస్తూ....గొప్పగా మాట్లాడుకుంటాం. ఆ అమూల్యమైన భవనం రాత్రికి రాత్రి వెలిసింది కాదు. రాత్రనకా, పగలనకా ఎంతోమంది కష్టపడితే రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఆ భవనానికి పునాదిరాళ్లు వేశారు. వారి అడుగుజాడలు ఆదర్శప్రాయం, అనుసరణీయం...పక్షులను రక్షించుకుందాంరసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేసింది రేచెల్ కార్సన్. ఆధునిక పర్యావరణవాదానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా గుర్తింపు పొందిన రేచెల్ 1962లోనే ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని రాసింది. రసాయన ఎరువుల వాడకం వల్ల పక్షులకు జరుగుతున్న ప్రాణ నష్టం గురించి ఈ పుస్తకంలో వివరించింది.పర్యావరణ పార్టీమారినా సిల్వా తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేసేది. పదహారేళ్ల వయసు వరకు చదవడం, రాయడం రాదు. ఆ తరువాత కష్టపడి చదువుకుంది. డిగ్రీ సాధించింది. చిన్న వయసులోనే సెనెటర్ అయ్యింది. బ్రెజిల్ పర్యావరణశాఖ మంత్రిగా స్ఫూర్తిదాయకమైన పనులకు శ్రీకారం చుట్టింది. అటవీ నిర్మూలన జరగకుండా చేసింది. ఎన్నికలలో ‘పర్యావరణం’ అనేది కీలక అంశం అయ్యేట్లు చేసింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సస్టెయినబిలిటీ నెట్వర్క్’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించింది.నిర్లిప్తత వదిలేలా...‘వియ్ యాక్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ జస్టీస్’ వ్యవస్థాపకురాలు పెగ్గీ షెప్పర్డ్. 1988 నుంచి మన్హట్టన్లో పర్యావరణ సంరక్షణకు సంబంధించి కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది. అమెరికాలో ఎన్నో ప్రాంతాలు కాలుష్యానికి చిరునామాలుగా ఉండేవి. అయినప్పటికీ ‘మనం ఏం చేయలేము’ అనే నిర్లిప్తత జనాలలో ఉండేది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి పర్యావరణ స్పృహ తీసుకు రావడానికి కృషి చేసింది షెప్పర్డ్. ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అడ్వైజరీ కౌన్సిల్’కు తొలి మహిళా చైర్పర్సన్గా గుర్తింపు పొందింది.తిరుగులేని యోధురాలు‘భయం లేని యోధురాలు’గా గుర్తింపు పొందిన మార్జరీ స్టోన్మన్ డగ్లస్ జర్నలిస్ట్, రచయిత్రి. స్త్రీవాదం, పర్యావరణవాదం కోసం తన శక్తిమంతమైన గొంతును వినిపించేది. 1947లో ‘ది ఎవర్గ్లైడ్స్: రివర్ ఆఫ్ గ్రాస్’ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రాసింది. పర్యావరణ సంరక్షణకు ప్రజా మద్దతు కూడగట్టడంలో క్రియాశీల పాత్ర పోషించింది.అడవి తల్లి కోసం...ఎమ్మీ అవార్డ్–విన్నింగ్ జర్నలిస్ట్ వెనేస హాక్ పదిహేను సంవత్సరాలకు పైగా పర్యావరణ సమస్యలను వెలుగులో తీసుకువచ్చింది. కేవలం రాతలకే పరిమితం కాకుండా ప్రజలలో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఉద్యమ స్థాయిలో పనిచేసింది. పర్యావరరణ సమస్యలపై ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఏర్పాటు చేసింది. ‘మదర్ జంగిల్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ అంశాలపై క్షేత్రస్థాయిలో పనిచేసింది.ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చేలా...‘గ్రీన్బెల్ట్ మూమెంట్’ వ్యవస్థాపకురాలైన వంగరి మాథాయ్ ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ ఉద్యమకారులలో ఒకరు. నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ఆఫ్రికన్ మహిళ. మొక్కలు నాటే పనిని ఉద్యమ స్థాయిలో చేపట్టింది. మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఎంతోమంది మహిళకు ఉపాధి లభించింది. మాథాయ్ చేసిన పర్యావరణ ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో ఆఫ్రికన్ దేశాలకు స్ఫూర్తిని ఇచ్చాయి.(చదవండి: -
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్లో జన్మించి ఐ సర్జన్గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్గా, మోటివేషనల్ స్పీకర్గా, మేరేజ్ కౌన్సిలర్గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2025లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వాలిఫైయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన పీబీకేఎస్, అదే తరహాలో టైటిల్ గెలుస్తుందని ఊహించిన అభిమానులకు తీరని నిరాశ మిగిలింది. 18 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆసీబీ టైటిల్ను దక్కించుకుంది. పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యజమాని బాలీవుడ్ నటి, ప్రీతి జింటా (Preity Zinta) ఆస్తి ఎంత, PBKS నెట్వర్త్ ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది. ప్రీతి జింటా ఐపీఎల్ టీం పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ సరసన ‘దిల్ సే’ మూవీతో ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు దశాబ్దాలకు పైగాబాలీవుడ్ను ఏలింది. కెరీర్లో, ప్రీతి కల్ హో నా హో, వీర్ జారా, లక్ష్య, సలాం నమస్తే, సంఘర్ష్, కోయి... మిల్ గయా, క్యా కెహ్నా, కభీ అల్విదా నా కెహ్నా, చోరి చోరి చుప్కే చుప్కే, ది లాస్ట్ లియర్, సోల్జర్ , అనేక ఇతర చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించింది.ప్రీతి జీన్ గూడెనఫ్ను వివాహం తరువాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో సిర్థపడింది. నటనకు దూరంగా ఉంది. ప్రీతి-జీన్ దంపతులకు కవల పిల్లలున్నారు. అయితే, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, ఐపీఎల్ జట్టు ఓనర్షిప్ ఇతర వ్యాపారాలు, ఎండార్స్మెంట్ల ద్వారా భారీ ఆస్తులను సంపాదించింది. 2008లో, ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా, వ్యాపారవేత్తగా అవతరించింది.మనీ కంట్రోల్ సమాచారం ప్రకారం, 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా ప్రీతి ఆ సమయంలో రూ. 35 కోట్లు పెట్టుబడి పెట్టగా, అది ఇప్పుడు 350 కోట్ల రూపాయలకు పెరిగింది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభించినప్పుడు, దానిని విలువ 76 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022 నాటికి 925 మిలియన్ డాలర్లకు పెరిగింది.ప్రీతి జింటా ఆస్తి రూ. 183 కోట్లు ప్రీతి జింటా నికర ఆస్తుల విలువ రూ. 183 కోట్లు, ఇందులో ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, వ్యాపార సంస్థలు, ఐపీఎల్ జట్టులో వాటా కూడా ఉన్నాయి. ముంబైలోని పాలి హిల్స్లో రూ. 17 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ప్రీతి సొంతం. జీన్ గూడెనఫ్తో వివాహం తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి బెవర్లీ హిల్స్లో నివసిస్తున్నప్పటికీ సిమ్లాలో రూ. 7 కోట్ల విలువైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది.బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ప్రీతి జింటా ప్రచారం చేసే ప్రతి బ్రాండ్ నుండి దాదాపు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రీతి జింటా కార్ల విషయానికి వస్తే లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. వీటిలో రూ. 132 లక్షల విలువైన లెక్సస్ 400 క్రాస్ఓవర్, రూ. 58 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, పోర్స్చే , BMW ఉన్నాయి. -
కోహ్లి ఆర్సీబీ గెలుపుతో ఢిల్లీ పోలీసులు యువతకు సందేశం..!
ఏ విజయమైన స్ఫూర్తిని, చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అంతేగాదు ఎందరో పరాజితుల్లో కొండంత ఆశలను నింపి..సాధనకు ఉపక్రమించేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే..గెలుపును అందుకోవడంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఐపీఎల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులనే ఆశ్చర్యపరిచేలా ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. ఎన్నాళ్లుగానో ఐపీఎల్లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి అందని ద్రాక్షలా ఉండిపోయిందో తెలిసిందే. ఎట్టకేలకు 18వ సీజన్లో ఆ కలను సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ విజయం ఓ చక్కటి సందేశం తోపాటు స్ఫూర్తిని కూడా నింపింది. రావడం లేదు, అందుకోలేకపోతున్నా అన్న నిరాశ నిస్ప్రుహలకు ఒక్క గెలుపుతో చెక్పెట్టొచ్చని ఆర్సీబీ విజయంతో తేటతెల్లమైంది. ఓపికతో నిరీక్షించేవాడు ఎన్నటికైన విజయం అందుకుంటాడు. విసుగే చెందాక ప్రయత్నిస్తేనే విజయమనే నిధిని అందుకోగలమనే సామెతకు నిర్వచనంగా మారింది ఆర్సీబీ. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ తెరపడేలా ఘన విజయం అందుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మనం కూడా ఓటములతో సతమతమవుతున్నప్పుడూ..చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు గెలుస్తావా అన్నట్లు చూసే చూపులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని ఓర్చుకుంటూ ఓపికతో లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేవాడిని ఎన్నటికైనా విజయలక్ష్మీ వరిస్తుందనడానికి ఉదాహరణగా ఆర్సీబీ ఆటగాళ్లు నిలిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఎట్టకేలకు 18వ సీజన్లో తన కలను సాకారం చేసుకున్నాడు. విచిత్రంగా విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 కావడం మరింత విశేషం. చెప్పాలంటే విరాట్ కోహ్లి ఓపికకు దక్కే ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడండి విరాట్ కోహ్లీగెలుపు కోసం 18 ఏళ్లు వేచి ఉన్నాడు. అలాగే డ్రైవింగ్ చేసేందుకు 18 ఏళ్లు నిండే వరకు ఓపిక పట్టండి. అలా కాకుండా టీనేజర్లుగా ఉన్నప్పుడే త్వరపడి కన్నవాళ్లకు శోకం మిగల్చడం లేదా అవతల ప్రయాణికుల ప్రాణాలను పొట్టబెట్టుకుని నేరస్థులుగా మిగిలిపోవడం జరుగుతుంది అని తమ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేగాదు అందులో టీనేజర్లు చట్టబద్ధంగా డ్రైవింగ్ వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి లేదంటే అసహనం తెచ్చిపెట్టే అనర్థాలకు బలైపోతారని క్యాప్షెన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నిజంగా ఒక గెలుపు ఎన్నో రకాలుగా స్ఫూర్తిని నింపుతుందంటే ఇదే కదూ..!. View this post on Instagram A post shared by DelhiPolice (@delhi.police_official) (చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్టాపిక్గా హర్ష్గోయెంకా ప్రసంగం) -
Menstruation మౌనాన్ని బద్దలుకొట్టింది, ప్రతిష్టాత్మక అవార్డు పట్టింది
గుర్గావ్కు చెందిన ప్రియాంషి బగ్గా చిన్న వయసులోనే చాలా పెద్దమనసుతో ఆలోచించింది. ఎవ్వరూ చేయని సాహసానికి పూనుకుంది. మాట్లాడానికి అందరూ ఇబ్బందిపడే పీరియడ్స్ గురించి 17 ఏళ్ల వయసులో ధైర్యంగా మాట్లాడింది. అంతేకాదు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సదుపాయం, రుతుక్రమ పరిశుభ్రత ను మార్చే లక్ష్యంతో బ్రేక్ ది సైలెన్స్ (మౌనం వీడండి..చుప్పీ తోడో, ) అనే కార్యక్రమాన్ని స్థాపించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఆమె వేలాదిమంది బాలికలకు అవసరమైన శానిటరీ ప్యాడ్లను అందించింది. అలాగే శానిటరీ ప్యాడ్స్ అవసరమైన బాలికలకు అందేలా పాఠశాలల్లో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఉద్యమం కోసం రూ. 5 లక్షలకు పైగా సేకరించింది, పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలతో బాలికలకు సాధికారత కల్పించడం దీని లక్ష్యం, అమ్మాయిల డ్రాప్-అవుట్ రేటును కూడా తగ్గిస్తుంది2024లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఆచరించేలా ప్రోత్సహిస్తోంది. పీరియడ్ సమస్య కారణంగా ఆడపిల్లలు చదువును ఆపకుండా, అంతరాయం లేకుండా క్లాసులకు హాజరయ్యేలా, వారి కలలను కొనసాగించడానికి సాధికారత కల్పిస్తోంది. వారి విద్య, ఆరోగ్యం, సాధికారతను ప్రోత్సహిస్తోంది. యువత తలచుకుంటే సామాజిక ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో అనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంషి.ఇదీ చదవండి: Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!చుప్పీ తోడో ఐడియా ఎలా వచ్చిందిప్రియాంషికి చిన్నప్పటినుంచీ చదువు అంటే ప్రాణం. అదృష్టవశాత్తూ బాల్యంనుంచి చదువు విషయంలో తనకుఎలాంటి ఆటంకం రాలేదు. కానీ ఆమె గ్రామీణ పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేసినప్పుడు, ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు ఉన్నత తరగతుల్లో చదువు మానేస్తున్నారని గమనించింది.. ఋతుస్రావం వంటి సహజమైన శారీరక ప్రక్రియ వారి విద్యకు అడ్డుగా నిలబడటం చాలా అన్యాయమని భావించింది. "విద్య అనేది అవకాశానికి ద్వారం" అని విశ్వసించే ప్రియాంషి దీన్ని అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం కాదని, మౌనం వీడి గొంతెత్తాల్సిన సమస్యని అని తెలుసుకుంది. అంతే. .బ్రేక్ ది సైలెన్స్ తో ముందుకు వచ్చింది. గృహ హింస, యాసిడ్ దాడులు, ఇతర సామాజిక దురాచారాల లాగ్గానే దీనికి గురించికూడా పాడ్కాస్ట్లోఎ విస్తృతంగా చర్చించడం మొదలు పెట్టింది. దీనికి మంచి ఆదరణ లభించింది. ఆమె వినిపించే కథలు పలువుర్ని కదిలించేవి. కంట తడిపెట్టించేవి.చదవండి: Obesity పోషకలోపం.. ఊబకాయం!ఈ ప్రాజెక్ట్ క్రమం తప్పకుండా ఋతు పరిశుభ్రత వర్క్షాప్లను కూడా నిర్వహిస్తుంది .శానిటరీ ఉత్పత్తుల ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్యానికి మద్దతు ఇవ్వడానికి స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తుంది. ఆ బృందాలు మహిళలు తమ కమ్యూనిటీలలో ఈ ఉత్పత్తులకు నిధులు సమకూర్చడానికి , పంపిణీకి వీలు కల్పించింది. "శానిటరీ ప్యాడ్ వాడకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా , సరసమైనదిగా చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలిపింది. ప్రియాంషి కృషిని గుర్తించింది ఐక్యరాజ్యసమితి, ఈ ప్రాజెక్ట్ గర్ల్అప్ ప్రాజెక్ట్ అవార్డుతో సత్కరించింది. అశోక విశ్వవిద్యాలయం సహ-హోస్ట్ చేసిన టాకో బెల్ యాంబిషన్ యాక్సిలరేటర్కు ఫైనలిస్ట్గా నిలవడం విశేషం. -
అలాంటి వారి హృదయాల్లో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు!
నిర్మలమైన హృదయం కలిగి ఉండి, మత్సరభావం లేకుండా, ప్రశాంత చిత్తంతో ఎల్లవేళలా సృష్టిలోని సమస్త జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉంటూ, ఇతరులతో సంభాషణల సమయంలో ప్రియంగా మాట్లాడేవారి హృదయాలలో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడని విజ్ఞులు చెబుతారు. ‘కావాలని మనస్సులోని ఆలోచనలను పాపకర్మలు చేయడం వైపుకు మరల నీయకుండా, చెడ్డ పనులను తలపెట్టక, ధర్మమార్గాన్ని ఎన్నడూ విడిచి పక్కదోవ పట్టకుండా చూసుకుంటూ, చెడ్డపేరు తెచ్చిపెట్టే పనుల జోలికి వెళ్ళకుండా, ఇరుగుపొరుగున అందరూ తమను మెచ్చుకునే పద్ధతిలో జీవనం సాగించే వ్యక్తులు దేవతలతో సమానమైనవారే అవుతారని, వారిలో ఇంకేమి తక్కువని అలా అనకుండా ఉండగలం?’ అని వెన్నెలకంటి సూరన రచనయైన ‘ఆంధ్ర శ్రీ విష్ణుపురాణము’ ప్రశ్నించి చెప్పింది. పుణ్యానికైనా, పాపానికైనా, సుఖానికైనా, దుఃఖానికైనా మనిషి చేసే అలోచనలే ముఖ్యం కాబట్టి, ప్రయత్న పూర్వకంగా మనసును చెడు ఆలోచనల వైపుకు మళ్ళకుండా చూసుకోవడం మనిషికి అవసరం అన్నది పై మాటల సారాంశంగా భావించవచ్చు. సరిగా ఈ ఆలోచననే నొక్కి చెప్పినట్లుగా, బుద్ధిలో సందేహము, నిర్మలత్వము లేకుండా ఆచరించబడే కర్మల నిష్ప్రయోజకత్వాన్ని ఎఱయకవి రచించిన ‘సకలనీతికథా నిదానము’ ప్రథమాశ్వాసములోని ఈ కింది తేటగీతి పద్యం తేలికైన మాటలలో చెప్పింది.చిత్తశుద్ధి లేక చేసిన జపమునుతపము హోమవిధియు దానములునుదేవతార్చనములు భావింప నిష్ఫలమట్లుగాన వలయు నాత్మ శుద్ధి. మనసు నిర్మలంగా ఉండడం, చేసే పనియందు లగ్నమై ఉండడం – కార్యాచరణలో ఈ రెండూ చాలా ముఖ్యమైనవని తెలుసుకోవాలి. ఏకాగ్రచిత్తంతో చేయని ఏ పని కూడా సరైన ఫలితాలను ఇవ్వదు. మనసులో నిర్మలత్వం లేని దానము, దేవతార్చన కూడా నిష్ఫలమే అవుతాయి. అందువలన మనసును – అంటే ఆత్మను, బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం అని పై పద్యం సారాంశం. సువాసనలు వెదజల్లే పూవులను పూచే మొక్కలకు, రుచికరమైన పండ్లను ఫలించే చెట్లకు, మూలాలు భూమి పొరలలోని మట్టిలో నిక్షిప్తమై ఉన్నట్లుగా, ఇహపరాలలో మనిషికి ఆధ్యాత్మిక సౌఖ్యాలను అందించే పుణ్యానికి మూలాలు నిర్మలమైన చిత్తంతో ఈ భువిపై జీవనంలో ఆచరించే సత్కర్మలలోనే ఉంటాయన్నది కాదనలేని నిజం.– భట్టు వెంకటరావు -
Sirimanu Utsavam అంబరాన్నంటిన సిరిమాను సంబరం
పార్వతీపురం టౌన్: మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచె మ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం మంగళవారం సంబరంగా సాగింది. సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. వీరితో పార్వతీపురం పట్టణం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను కనులారా వీక్షించిన భక్తులు జయజయధ్వానాలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. మహిళలు ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవా ర్లను పూజించారు. అమ్మవార్ల పూజార్లు జన్నిరామారావు, నక్క వాసుదేవరావులు అమ్మవారి దండకం చదివి సాయంత్రం 5 గంటల సమయంలో సిరిమానును అధిరోధించారు. అంజలి రథంపై పేడి వేషధారుల నాట్యం అనంతరం సిరిమాను తిరువీధి ప్రారంభమైంది. అమ్మవార్లను ఎమ్మెల్యేలు బోనెల విజయ చంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయరాజు, తదితరులు దర్శించుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు సిరిమాను సంబరం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించా యి. తప్పెటగుళ్లు, కోలాటం, అమ్మవార్ల వేషధారణలు, కాంతారా, బళ్లు వేషాలు ఆకట్టుకున్నాయి. 450 మందితో పోలీస్ బందోబస్తు పార్వతీపురం ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. 40 సీసీ కెమెరాలు అమర్చి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జిల్లా కేంద్ర సరిహద్దుల్లో భారీ వాహనాలను నిలిపివేసి, అత్యవసర, కార్లు, ద్విచక్ర వాహనాలను బైపాస్ మార్గం గుండా మళ్లించారు. పోలీస్ బందో బస్తును ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకిత సురాన, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్బీ సీఐ పి.రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు పర్యవేక్షించారు. -
లాస్ట్ మీల్ ఎన్నింటికి తింటున్నారు..? నటి కరీనా కపూర్ ఏకంగా..
సాయంత్రం కాస్త ఎర్లీగా భోజనం తినేయమని చెబుతుంటారు నిపుణులు. అదే ఆరోగ్యకరమని పదే పదే నొక్కి చెబుతుంటారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం అదే మాట అన్నారు. తాను కూడా అలానే తింటానని చెప్పారు కూడా. పైగాఅదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పారామె. ఆరోగ్యప్రదాత సూర్యుడి గమనం ఆధారంగానే మన జీవక్రియ పనిచేస్తుందని..దానికనుగుణంగా తింటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు కూడా. సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్న ఈ హెల్దీ ట్రిక్ గురించి సవివరంగా చూద్దామా..!.నాలుగు పదుల వయసులో ఉన్న కరీనా కపూర్ సైతం సౌందర్యపరంగానే కాకుండా ఫిట్నెస్ పరంగా చాలా మంచి జీవశైలికి పేరుగాంచిన నటి. ఈ ఏజ్లో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా కట్టిపడేసే గ్లామర్ కరీనా సొంతం. ఆమె చాలా క్రమశిక్షణాయతమైన జీవనశైలిని ఫాలో అవుతానని పలు ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారామె. పోషకాహారంతో కూడిన డైట్, బాడీకి తగిన వర్కౌట్లు, త్వరిత గతిన నిద్రకు ఉపక్రమించడం వంటి మంచి అలవాట్లనే అనుసరిస్తారామె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చివరి మీల్ కచ్చితంగా సాయంత్రం 6.30 కల్లా పూర్తి అయిపోయేలా చూసుకుంటానన్నారామె. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంత త్వరగానే అని అనుకున్నారు కూడా. కానీ కరీనా మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇది తప్పనిసరని చెబుతోంది.అలానే మంచిదా అంటే.. సూర్యదోయం వేళ మన శరీరం చాలా చురుకుగా ఉంటుందట. ఆ సమయంలోనే మన జీవక్రియలు యాక్టివ్గా ఉంటాయట. అంటే పగలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా..సులభంగా అరిగిపోతుందట. పైగా మనం మేల్కోనే ఉంటాం కాబట్టి సులభంగా ఆ ఎనర్జీ అంతా బర్న్ అయిపోతుందట. ఇక సూర్యాస్తమయ వేళ్లకు మన శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాబట్టి ఆ టైంలో జీర్ణమవ్వడానికి అధిక సమయం తీసుకునే ఫుడ్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైగా అది కూడా సూర్యస్తమయంలోపే ఫినిష్ చేస్తే మంచిదట. దానివల్ల మనం పడుకునే సమయానికి అరిగిపోయి..త్వరితగతిన మేల్కొనడానికి ఉపకరిస్తుంది. మన శరీరధర్మానికి అత్యంత అనువైన జీవన విధానం ఇదేనని నిపుణులు నొక్కి చెబుతున్నారు. మన పూర్వీకులు దీన్ని బాగా అనుసరించేవారని చెబుతున్నారు. ఇలా సాయంత్రం 6.30 కల్లా భోజనం తినేస్తామో..అప్పుడు మనం దాదాపు 12 నుంచి 14 గంటలు అడదడపా ఉపవాసం ఉన్నట్లువతుంది. పైగా ఉదయమే చక్కటి లెమన్ విత్ హనీ వాటర్తో రోజుని మొదలుపెట్టి, నచ్చిన ప్రూట్ సలాడ్ వంటి పోషకాహారాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మంచిదట. ఈ విధానంలో మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ దూరంగా ఉండటం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలు..జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందికడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉండదుఇలా ముందుగా తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది కూడాదీనివల్ల విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయిబరువు అదుపులో ఉంటుందినిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందటరోజంతా చురుగ్గా ఉంటారట మరీ అంత తొందరగా తినలేకపోయినా..కనీసం సాయంత్రం 7.30 గంటల లోపు భోజనం ఫినిష్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి..సత్ఫలితాలను పొందండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ) -
జస్ట్ 10 నిమిషాలు అదొక్కటి చాలు! నాసా స్టడీ
అందరూ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి అనుకుంటారు. కానీ మధ్యలోనే వదిలేసేవాళ్లు కొందరైతే, మరికొంతమంది మన వల్ల కాదు అని చేతులేత్తుస్తుంటారు. అస్సలు హెల్దీగా ఉండాలంటే..అది చాలా తేలిగ్గా తెలివిగా చేసే పని అంటోంది నాసా. అందరూ బిజీ షెడ్యూల్తో శారీర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. పైగా వర్కౌట్లు కొన్ని రోజుల తర్వాత విపరీతమైన వొళ్లు నొప్పులుగా అనిపించి స్కిప్ చేసేస్తుంటారు. దాంతో చాలామంది కంటిన్యూ లేదా దైనందిన జీవితంలో ఆ వ్యాయామాలను భాగం చేసుకోలేక విఫలమవుతుంటారు. అలాంటివాళ్లు ఒక్క పదినిమిషాలు ఈ వ్యాయమానికి కేటాయించండి చాలు అని చెబుతోంది నాసా పరిశోధన. ఇది ఎంత ప్రభావవంతమైన ప్రయోజనాలందిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారని అంటోంది. పైగా మధ్యలో వదిలేయరు, అది మీ జీవితంలో ఓ భాగమైపోతుందని నమ్మకంగా చెబుతోంది. మరీ ఆ వ్యాయామం ఏంటంటే..ఎక్కువ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారికి ఈ వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది నాసా. ఇది ఒక చిన్న ట్రాంపోలిన్పై చేసే జంపింగ్ లాంటి వ్యాయామం. పిల్లలు అమిత ఇష్టంగా చేసే జంపింగ్ క్రీడ. ఇది గనుక చేస్తుంటే తెలియకుండానే ఒక విధమైన ఆనందం..పైగా అమితోత్సాహంతో మరింతగా చేస్తారట కూడా. ఇది తెలియకుండానే బాడీలోని కేలరీలను తగ్గిస్తుందట. ఇందుకోసం కావాల్సిందల్లా..మినీ-ట్రాంపోలిన్ ఉంటే చాలు. దీంతో జంపింగ్ జాక్లు చేస్తుంటే..బరువు అదుపులో ఉండటమేగాక..బాడీ కూడా ఫిట్గా ఉంటుందని చెబుతున్నారు. పోనీ ఈ జంపింగ్ కుదరకపోతే..ఓ 30 నిమిషాలు మీకు నచ్చిన మ్యూజిక్తో నచ్చినట్లుగా గంతులు వేయండి. ఓ పద్ధతి అవసరం లేదు బాడీ అంతా ఊగేలా ఎంజాయ చేస్తూ నచ్చినట్లుగా డ్యాన్స్ చేయండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి చాలు అని చెబుతోంది నాసా. ఇది పరుగు, జాగింగ్ కంటే కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుందట. కచ్చితంగా మెరుగైన ఫలితాలు పొందగలరని చెబుతోంది నాసా పరిశోధన. ఇది శరీరంపై అధిక ఒత్తడిని కలిగించదు. అదీగాక ఎవ్వరైనా హాయిగా సులభంగా చేయగలిగేవే ఈ వ్యాయమాలని పేర్కొంది నాసా. ఆరోగ్య లాభాలు..సరదాగా ఉండే ఈ వ్యాయమాం కిల్లర్ ఫుల్ బాడీ వ్యాయామంకీళ్లపై సున్నితంగా ఉంటుంది. అయితే మోకాళ్లు, చీలమండలంపై కఠినంగా ఉంటుంది. శోషరస వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. పైగా ఇది మంచి కార్డియో వర్కౌట్ల పనిచేస్తుంది. ఆరోగ్యానికి బెస్ట్ వ్యాయామం కూడా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్టాపిక్గా హర్ష్గోయెంకా ప్రసంగం) -
మరోసారి హాట్టాపిక్గా పని జీవిత సమతుల్యత..! వైరల్గా హర్ష్గోయెంకా ప్రసంగం
పని జీవిత సమతుల్యత అనే టాపిక్ మాత్రం ప్రతిసారి రసవత్తరమైన అంశంగా మారిపోతోంది. దీనిపై ఒక్కొక్కరిలో ఒక్కో అభిప్రాయం ఉంది. ఇది వారి వారి హోదాల రీత్యా సరైనది కావొచ్చు. అందరికీ వర్తించాలంటే మాత్రం కష్టమే. ఉద్యోగి శరీర తత్వం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు తదితరాల దృష్ట్యా మారుతూ ఉంటుందనేది నిపుణుల వాదన. అంగీకరించక తప్పని వాస్తవం కూడా. బహుశా ఈ విషయాన్నే సూటిగా చెప్పే ఉద్దేశ్యంతో మరోసారి వివరణ ఇచ్చినట్లుగా ఉంది నెట్టింట వైరల్ అవుతున్న హర్ష్ గోయెంకా ప్రసంగం. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎప్పటికప్పుడూ నెటిజన్లతో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి తన ఉద్యోగుల నుద్దేశించి ప్రసంగించిన వీడియోని షేర్ చేసుకుని..నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఆ వీడియోలో హర్ష్ గోయెంకా..తాను ఆదివారాల్లో పనిచేయడం గురించి, జీవిత భాగస్వాములను చూస్తుండటం గురించి మాట్లాడటం లేదు. అందువల్ల కాసేపు శ్రద్ధతో నా మాటలు ఆలకించండి అన్నారు. అంతే ఆ సభా ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. ఉద్యోగులంతా ఆయన ప్రసంగానికి కడుపుబ్బా నవ్వుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోలో. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి మీ సంస్థలో ప్రతి ఉద్యోగి పనిలో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఐతే ఇంతకమునుపు ఇదే హాలులో ఎల్ అండ్ టి అనే కంపెనీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడిన మాటలతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. నిజానికి సుబ్రహ్మణ్యన్ మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగుల పోటీతత్వం గురించి చెబుతూ ఆయన..వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. అయినా ఎంత సేపు భార్యను చూస్తుంటారు, ఆదివారం కూడా ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్నారు. ఎందుకంటే తాను కూడా ఆదివారాల్లో పనిచేస్తానని చెప్పారు. పైగా అలా చేయడం వల్ల తాను మరింత సంతోషంగా ఉన్నానని సుబ్రహ్మణ్యన్ అన్నారు. అంతే ఒక్కసారి పనిజీవిత సమతుల్యతకు ఆస్కారం ఏముందని న్యూట్రిషన్లు, ప్రముఖులు భగ్గుమన్నారు. ఇది సరైనది కాదంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పైగా ఈ అంశం హాట్టాపిక్గా మారి చర్చలకు దారితీసింది. ఇక మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ..తాను పని నాణ్యతను నమ్ముతానని, ఎని గంటలు చేశామన్నది లెక్కలోకి తీసుకోనని చెప్పారు. అలాగే పనినాణ్యతపై దృష్టి పెట్టాలే గానీ, పరిమాణంపై కాదని తేల్చి చెప్పారు. ఆఖరికి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ సైతం పని గంటలు కాదు, నాణ్యతే ముఖ్యం అని చెప్పారు. ఇక వ్యాపరవేత్త హర్ష్ గోయెంకా కూడా గతంలో వారానికి 90 గంటల పనా? అని ఖండించారు. సండే అనేది సూర్యుడి డ్యూటీగా భావించి డే ఆఫ్గా ఎందుకు భావించకూదని అన్నారు. అయినా జీవితాన్ని శాశ్వతమైన ఆఫీస్ పనిగా మార్చేస్తే విజయం మాట దేవుడెరగు..అనర్థాలే తెచ్చిపెడుతుందన్నారు. ఆయన కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఆప్షన్ కాదు, అది మన అవసరం అని నొక్కి చెప్పారు. వర్క్ని చాలా తెలివిగా స్మార్ట్గా చేసేందుకు ప్రాముఖ్యత ఇస్తానన్నారాయన. సో పనిజీవిత సముతుల్యత అన్నది ఎంత ముఖ్యమో అర్థమైంది కదా..కాబట్టి బిజీకి ఛాన్స్ ఇవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుందామా మరీ..!.Concluding part of my annual RPG townhall address to all my colleagues 😀 pic.twitter.com/sIbC34dqU2— Harsh Goenka (@hvgoenka) June 3, 2025 (చదవండి: నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!) -
Obesity పోషకలోపం.. ఊబకాయం!
డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్తో బాధపడుతున్న తెలంగాణ యువతపురుషులతో పోలిస్తే మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం అధిక బరువుతో ఇబ్బందిపడుతున్న 18.8% మంది అతివలు ధనవంతుల ఇళ్లలో స్థూలకాయం... పేదల్లో పోషకాహార లోపం చదువుకోని/చదువుకున్న తల్లులు ఉన్న ఇళ్లలోనూ స్పష్టమైన తేడా యంగ్ లైవ్స్ సర్వే–2023లో కలవరపెట్టే గణాంకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 22 ఏళ్ల యువతలో ఒకవైపు స్థూలకాయం పెరుగుతుండగా మరోవైపు పోషకాహార లోపం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’గా పేర్కొంటున్నారు. తెలంగాణ యువత ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్లు ‘యంగ్ లైవ్స్’రౌండ్–7 సర్వే (2023–24) ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల యువతలో 19 శాతం మంది అధిక బరువు/ఒబేసిటీతో ఉండగా 29 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2016తో పోలిస్తే స్థూలకాయం రెండింతలైంది. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా (18.8%) కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 14 శాతంగా ఉంది. మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రమాదాలకు దీన్ని కేంద్రంగా నిపుణులు గుర్తించారు. ఇప్పటికే 22.7% మహిళలు హై కార్డియోవ్యాసు్కలర్ రిస్్కలో ఉన్నారని హెచ్చరిస్తున్నారు. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో 29 శాతంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. అందులో గ్రామీణ యువతలో తక్కువ బరువు ఉన్నవారి శాతం 30.9% కాగా.. పట్టణాల్లో ఇది 23.8% శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, తల్లులు తక్కువ చదువుకున్న కుటుంబాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.మానసిక ఒత్తిడిలో యువత తెలంగాణలో వివిధ కారణాల వల్ల యువతలో 2023 నాటికి 71.3 శాతం మోస్తరు స్థాయి ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో వెల్లడైంది. పెద్దల్లో ఇది 68 శాతంగా ఉంది. వారిలో పురుషులు 66.7 శాతంగా ఉంటే మహిళలు 75.9 శాతంగా ఉన్నారు. ఇక 22.6% మందిలో మితమైన ఆందోళన, 17.47% మందిలో మితమైన డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. మహిళలకంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్లు గణాంకాల ద్వారా తేలింది. పట్టణ యువతలో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్ తరువాత భావోద్రేకం లక్షణాలు 1.5 శాతం పెరిగినట్లు సర్వే తేల్చింది. కరోనా తర్వాత ఆరోగ్యంగా ఉండాలనే అభిలాష ప్రజల్లో పెరిగిందని.. గతంలో 23 శాతం మందే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోగా ఇప్పుడు వారి సంఖ్య 37 శాతానికి చేరినట్లు పేర్కొంది.అక్కడలా.. ఇక్కడిలా..’సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. సామాజికంగా దిగువస్థాయి వర్గాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండగా ఆరోగ్యంపై సరైన అవగాహన, వైద్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏటా ఎక్కువవుతోంది. అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంటుండగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అని తేలింది. 2016లో ధనవంతుల ఇంటి యువతలో స్థూలకాయం 30.6% ఉండగా.. పేదల్లో ఇది 14.0% మాత్రమే. అలాగే పేదల్లో తక్కువ బరువుతో 36.1 శాతం మంది ఉండగా ధనవంతుల్లో అది 21.5 శాతంగా ఉంది. -
Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ హస్తభూషణంగా మారింది వాటర్ బాటిల్. మన చేతుల్లో ఉండే వస్తువుల్లో ముఖ్యమైనదిగా ఈ బాటిల్స్ మారాయి. పనిలో పనిగా గుళ్ల నుంచి జిమ్ వరకూ, స్కూల్ బ్యాగ్ నుంచి కార్ కోల్డ్ బాక్స్ వరకూ ప్రతిచోటా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సర్వసాధారణం అయ్యాయి. జెన్ జీ భాషలో చెప్పాలంటే ఒక ‘లైఫ్స్టైల్ స్టేట్మెంట్’గా అయిపోయింది. ప్లాస్టిక్ బాటిళ్లు విభిన్న డిజైన్లలో లభ్యమవుతుండటంతో మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్స్ పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో నగరంలో అధిక సంఖ్యలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఈ బాటిళ్ల వల్ల కలిగే ఆనారోగ్య, పర్యావరణ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనిపై విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ డిజైన్స్కి ఆకర్షితులవుతూ.. వివిధ రకాల రోగాలకు చేరువవుతున్నారు. –సాక్షి, సిటీబ్యూరో ప్లాస్టిక్ బాటిల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉండటమే కాకుండా, రకరకాల రంగులు, డిజైన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, గ్లిట్టర్ ఎఫెక్ట్స్తో అందరి మనసు దోచేస్తున్నాయి. ప్రత్యేకించి చిన్నపిల్లలు అవి చూసి వాటిపై మక్కువ పెంచుకుంటున్నారు. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లల కోసం బాటిల్స్ కొనుగోలు ఎక్కువగా జరుగుతోంది. దీంతో పాటు మార్కెట్లో పిల్లల కోసం వివిధ మోడళ్లు అందుబాటులో ఉండటంతో కొందరు ఒకటికి మించి బాటిళ్లను వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో పిల్లలు అడిగినట్లు రెండు మూడు రకాలు కొని పెడుతున్నారు. ఇదీ చదవండి: Obesity పోషకలోపం.. ఊబకాయం!ప్లాస్టిక్ అనేది సహజంగా కుళ్లని పదార్థం. ప్లాస్టిక్ బాటిల్స్ ఒకసారి భూమిలో పడితే దాదాపు 450 ఏళ్ల పాటు మట్టిలో కలిసిపోవు. హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు వేల సంఖ్యలో వినియోగించిన బాటిల్స్ పారేస్తున్నారు. వీటిలో మళ్లీ రీసైకిల్ అవ్వడం చాలావరకూ జరగకపోవడం వల్ల, ఈ ప్లాస్టిక్ వాడకం అత్యధిక వ్యర్థంగా మారుతోంది. నగర శుభ్రతపై కూడా ప్రభావం చూపుతోంది. పర్యావరణానికి భారంగా ప్లాస్టిక్.. పిల్లల కోసం బాటిల్ కొంటే, దాని శక్తినీ, దుష్ర్పభావాలనూ అంచనా వేయాలి. మెటీరియల్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అందం మాత్రమే కాకుండా ఆరోగ్యం అనే కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక స్కూల్స్, కంపెనీలు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాల్సిన అవసరముందని నిపుణులు, సామాజికవేత్తలు నినదిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్ ఇప్పుడు ఒక హస్తభూషణం అవుతున్నా, దీని వెనుక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టుకోవడం దురదృష్టకరం. మన చేతిలో ఉన్న బాటిల్ కాస్త బాధ్యతతో ఎంచుకుంటే, మన ఆరోగ్యాన్ని రక్షించడమే కాదు, భూమిని కూడా కాపాడిన వాళ్లమవుతామని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. స్టైలిష్ డిజైన్ల పేరిట ప్రమాదం.. బిస్ ఫినాల్–ఏ (బీపీఏ), మైక్రోప్లాస్టిక్స్ వంటి రసాయనాలు కొన్ని తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే అవకాశముంది. ఇవి నీటిలో కలిసిపోయి మానవ శరీరంలోకి చేరినప్పుడు, హార్మోనల్ డిసార్డర్స్, మానసిక అభివృద్ధి సమస్యలు, తక్కువ నిరోధక శక్తి వంటి అనారోగ్యాలను కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి ఇది ఓ మౌన సంకటమే. వాస్తవానికి తల్లిదండ్రులకు దీనిపై అవగాహన లేకపోవడంతో స్టైలిష్ డిజైన్ల పేరిట ప్రమాదాన్ని కొనుగోలు చేస్తున్నారు.చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీప్రత్యామ్నాయాల వైపు చూపు.. మెటల్ బాటిల్స్ (స్టీల్, కాపర్) మునుపటి కాలంలో ఎక్కువగా వాడేవారు. ఇవి ఆరోగ్యానికి మంచివి, మైక్రోప్లాస్టిక్స్ సమస్య ఉండదు. దీర్ఘకాలికంగా వాడవచ్చు. కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న డిజైన్ వైవిధ్యం, తక్కువ ధర, తక్కువ బరువు వల్ల ప్రజలు వాటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ స్థితిలో డిజైనర్లకు, తయారీదారులకు కూడా నూతన బాధ్యత ఉంది.. ఆరోగ్యానికి హానీ లేకుండా, ఆకర్షణీయమైన డిజైన్లతో మెటల్ బాటిల్స్ తయారుచేయడం మాత్రమే దీనికి ఏకైక పరిష్కారం. వీలుంటే గ్లాస్ బాటిల్లు వినియోగించడం మరింత ఉత్తమం. -
నావికాదళంలో అత్యున్నత అధికారిగా హైదరాబాద్ కుర్రాడు!
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు భారత నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ముఫకం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంజేసీఈటీ) నుంచి మహ్మద్ అబూబకర్ 2022 సివిల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. కళాశాలలో ఉన్న సమయంలో చదువుతోపాటు క్రీడల్లోనూ ఆయన తనదైన ప్రతిభను చూపారు. ఆటలన్నా, పోటీలన్నా ముందుండేవాడు. అదే తత్వం అతని లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం.. అబూబకర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ)లో అర్హత సాధించారు. కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు. మే 31న పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న అతను అధికారికంగా భారత నావికాదళంలో అధికారిగా చేరారు. అబూబాకర్ కళాశాల సమయంలోనూ క్రీడల్లో ముందుండేవాడు. అంతేకాకుండా రాష్ట్రం తరుపున సైతం పోటీల్లో పాల్గొన్నారు. కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో స్పోర్ట్స్ కో–ఆర్డినేటర్గా వ్యవహరించిన అబుబాకర్ నైనిటాల్లో జరిగిన 7–ఎ–సైడ్ జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో, ఇండో–నేపాల్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఎంజేసీఈటీ, తెలంగాణ రాష్ట్రం తరుపున రెండింటికీ ప్రాతినిధ్యం వహించాడు. లక్ష్యం కోసం ముందుకు..అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కఠోరశ్రమ ఎంతో అవసరం. ఒకవైపు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం వల్లనే తనకు ఈ అవకాశం లభించిందని అంటున్నారు అబుబాకర్. తన ఈ ప్రయాణంలో కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. భారత సాయుధ దళాలకు అవసరమైన అధికారిగా నిలపడంలో, మార్గదర్శకత్వం చూపడంలో అవసరమైన శిక్షణ అందించడంలో సహాయపడిన ఫిజికల్ డైరెక్టర్ మహ్మద్ యూసుఫుద్దీన్, స్పోర్ట్స్ చైర్మన్ అమీర్ జావీద్ తదితరుల సేవలను ఆయన గుర్తుచేశారు. తనతోపాటు ఇటీవలి కాలంలో తమ కళాశాల నుండి దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర పరిపాలనతో సహా వివిధ ప్రభుత్వ సేవల్లో ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారన్నారు. నావికాదళంలో పనిచేయడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు. యువత సైతం తమ ఆలోచనలను సుసాధ్యం చేసుకోవడానికి అవసరమైన లక్ష్యాలను ఏర్పచుకోవాలన్నారు. (చదవండి: పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు) -
ఘోరం.. లేడీ టిక్టాక్ స్టార్ దారుణ హత్య...! పరువు హత్య?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో టీనేజీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసఫ్(17) హత్యకు గురైంది. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఇస్లామాబాద్లో సుంబల్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈమె తండ్రి ప్రభుత్వ అధికారి కాగా, తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. మంగళవారం నివాసంలో ఉండగా ఈమె వద్దకు ఉమర్ హయత్ అలియాస్ కాకా వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడాక తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో ఆమెపైకి రెండుసార్లు కాల్పులు జరిపి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. ఆ సమయంలో సనా బంధువు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. హయత్ కూడా టిక్టాకరేనని తెలిపారు. ఇతడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పాకిస్తాన్లో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్ సనా. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు. -
పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు
ఒకప్పుడు పుస్తకాలు తెగ చదివేవాడిని. ఇప్పుడు సంవత్సరానికి ఒక పుస్తకం చదవడం కూడా కష్టమైంది’ అనే మాట వింటుంటాం. పుస్తకం పఠనం అనేది విలువైన అభిరుచి. ఆ అభిరుచిని ఎప్పటిలాగే కొనసాగించడానికి...ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకంతో మీ రెండో ప్రయాణం ప్రారంభించండి. టీవిలో మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ‘థ్రిల్లర్’ నవలతో రంభించండి. పెద్దపెద్ద పుస్తకాలతో కాకుండా చాలా చిన్న పుస్తకాలతో చదవడం మొదలుపెట్టండి. ‘రోజుకు ఇన్ని పేజీలు’ అని నిర్ణయించుకొని వాటిని మెల్లగా పెంచుతూ పోవాలి.మీతో పాటు ఎప్పుడూ ఒక పుస్తకం ఉండాలి. బయట ఎక్కడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు, వెయిటింగ్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ చూడడం కాకుండా పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవాలి. పుస్తక పఠనం అనేది సోలో హాబీ మాత్రమే కాదు. ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. రెండు మూడు రోజులు కావచ్చు. వారం కావచ్చు...‘రీడింగ్ టైమ్’ అని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. కాస్త మార్పు కోసం, ఆసక్తి కోసం కొంత టైమ్ ఫిజికల్ బుక్స్ నుంచి ఇ–బుక్స్కు మారండి. -
చిన్నారులను కంటికి రెప్పలమై కాపాడుకుందాం..!
ఇవి..అవి..అని కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిత్యం పిల్లలు అనేక రూపాల్లో శారీరక, లైంగిక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారు.వారిని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? వారి హక్కులను ఎలా కాపాడుకోవాలి... మొదలైన విషయాలను అవగాహన పరిచే రోజు... సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే రోజు...ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’...పద్నాలుగు సంవత్సరాల వయసులో రోషిణి పర్వీన్కు వివాహం జరిగింది. పదిహేను సంవత్సరాలకే తల్లి అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో రోషిణి పడిన బాధలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఇన్నీ అన్నీ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తనలా ఏ అమ్మాయీ బాధ పడకూడదు అనుకొని ముందుకు కదిలింది.ఇప్పటివరకు అరవైకి పైగా బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకుంది.ఆ పిల్లలను మళ్లీ బడి బాట పట్టించి వారి భవిష్యత్ను వెలుగుమయం చేసింది. ఒకప్పుడు ‘నేను ఒంటరిని’ అనుకున్న బిహార్లోని సిమల్బరీ గ్రామానికి చెందిన రోషిణి ‘చైల్డ్లైన్ ఇండియా ఫౌండేషన్’లో చేరడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ‘నేను ఒంటరిని కాదు. నాతో మరెంతోమంది ఉన్నారు’ అనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ప్రాణాలకు తెగించి బాల్య వివాహాలను, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకుంది.‘సేవ్ ది చిల్డ్రన్’లాంటి సంస్థలలో పని చేసిన రోషిణి ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే సమస్యల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నో స్కూల్స్లో ‘గర్ల్స్ గ్రూప్’లను ఏర్పాటు చేసింది. బిహార్లోని రోషిణి పర్వీన్ నుంచి శ్రీకాళహస్తిలోని వైశాలి వరకు ఎంతోమంది మహిళలు పిల్లల హక్కులు, భద్రత గురించి క్రియాశీలంగా పనిచేస్తున్నారు.క్షేత్రస్థాయిలోకి...‘కొంతమంది స్నేహితులు, న్యాయవాదుల సహాయంతో బుక్లెట్ రూపొందించాను. మా అబ్బాయితో మొదట దీని గురించి మాట్లాడాను. సేఫ్ ఇండియా, హ్యాపీ ఇండియా క్యాంపెయిన్ మొదలు పెట్టి పిల్లల భద్రత గురించి ప్రచారం చేశాం. కరపత్రాలు పంచాం’ అంటుంది వైశాలి కోలా.పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్రీకాళహస్తిలో‘తేజోభారత్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది వైశాలి. ‘ఏదైనా నేరం జరిగితే దానిగురించి కాసేపు మాట్లాడుకొని బాధ పడతారు. ఆ తరువాత మరచి పోతుంటారు. కొందరు మాత్రం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిద్ర లేని రాత్రులు గడుపుతుంటారు. అలాంటి వారు కూడా ఏదైనా చేద్దాం అంటే ముందుకు రారు. పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రమాదాల గురించి అవగాహన కలిగించడానికి స్వరక్ష ఏర్పాటు చేశాం’ అంటుంది కేరళలోని కోచికి చెందిన అనూ సూరజ్. ‘స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ పిల్లలపై జరిగే భౌతిక, లైంగిక, మానసిక హింస గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలకు తెలియజేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.ఎందుకు ఈరోజు?ప్రతి సంవత్సరం జూన్ 4న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’ జరుపుకుంటారు. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆగస్ట్ 19, 1982లో మొదలైంది. మొదట్లో యుద్ధ బాధితులైన లెబనాన్, పాలస్తీనా పిల్లలపై దృష్టి పెట్టినప్పటికీ తరువాత దీని ఉద్దేశాన్ని విస్తృతీకరించారు. పిల్లలు రకరకాల రూపాల్లో ఎదుర్కొంటున్న హింసను నిరోధించడానికి, వారి హక్కులను కాపాడడానికి పరిష్కార మార్గాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ఆలోచించడమే ఈ రోజు ఉద్దేశం.ఫన్నీగానే సీరియస్ విషయాలుబ్యాడ్ టచ్, గుడ్ టచ్ పిల్లలు గుర్తించేలా చేయడానికి, ఆన్లైన్లో సురక్షితంగా ఉండడానికి, అంతర్గత శక్తిని పెంచడానికి ఆడియో–విజువల్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాం. ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తున్నాం. కథలు, ఫన్ వీడియోల ద్వారా చిన్న పిల్లలకు సీరియస్ విషయాల గురించి తెలియజేస్తున్నాం. ‘మాయ’ అనే షార్ట్ ఫిల్మ్ను కూడా రూపొందించాం. పేరెంట్స్, టీచర్స్తో సమావేశాలు నిర్వహిస్తున్నాం. రకరకాల ఏజ్ గ్రూపుల ఆధారంగా పిల్లలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం,– అనూ సూరజ్, స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు‘చైల్డ్ మ్యారేజ్–ఫ్రీ ఇండియా’ అనేది నా లక్ష్యం. నాది బాల్య వివాహం కావడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకూడదనుకున్నాను. గ్రామాల్లో ‘చైల్డ్ ప్రొటెక్షన్’ కమిటీలు ఏర్పాటు చేశాం. అవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ‘మీ హక్కులు ఇవి’ అంటూ పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహించాం.– రోషిణి, సామాజిక కార్యకర్తఎన్నెన్నో రూపాల్లో..పిల్లల్ని పనిలో పెట్టుకొని వారి భవిష్యత్ను చీకటిమయం చేసే, పిల్లల్ని అపహరించి అమ్ముకునే, పిల్లల్ని అపహరించి వ్యభిచార కూపాల్లోకి దింపే సంఘటనలు ఒకవైపు... మరోవైపు యుద్ధాలలో చని΄ోతున్న పిల్లలు. యుద్ధ భీభత్సానికి బా«ధితులు అవుతున్న పిల్లలు. ఇంట్లో తల్లిదండ్రుల తగాదాలకు మానసికంగా దెబ్బతింటున్న, అయిన వారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు.(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!) -
టర్మరిక్ క్యూబ్స్తో.. మిలమిలలాడే అందం
ఇది అటు ఎండా... ఇటూ వానా రెండూ కలగలిసిన వింత వాతావరణం. ఈ సీజన్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్ వల్ల కమిలినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్క్యూబ్లతో మంచి పరిష్కారం లభిస్తుంది. టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్పొడి, కప్పు రోజ్వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒకగిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్క్యూబ్స్తో ఇరవై నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలిఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ను రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ఫ్రెష్గా మెరుపులీనుతూ కనిపిస్తుంది.అంతేకాదు, చర్మం జిడ్డు కారడం ఆగిపోయి దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!) -
వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!
1999లో మా తాతగారు చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు వీలునామా రాశారు. అందులో నాకు నా కజిన్ (పెద్దమ్మ కూతురు)కి సమానమైన వాటా రావాలి అని చెప్తూనే ఆ వీలునామా మేము ఇద్దరం మేజర్లు అయిన తర్వాత మాత్రమే చెల్లుతుంది అని కూడా రాశారు. నేను, మా కజిన్ దాదాపు ఒకటే వయసు వాళ్ళం. 2007లో మేజర్లం అయ్యాం. సమస్య ఏమిటంటే, ఆ వీలునామా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఇది చాలా పాతది – ఈ వీలునామా చెల్లదు, కోర్టును ఆశ్రయించాలి అంటున్నారు. మా మేనమామకు – ఇంకొక పిన్నిగారికి కూడా సంతానం ఉంది కానీ వారికి ఈ ఆస్తిలో మా తాతగారు ఏమీ వాటా ఇవ్వలేదు. ఈ విషయాలు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మేము కోర్టుకు వెళితే వాళ్లు పేచీ పెడతారని భావిస్తున్నాము. ఏం చేయమంటారు? – సరళ, విశాఖపట్నంవీలునామా రిజిస్టర్ చేసుకోవడం మంచిది అయినప్పటికీ రిజిస్టర్ చేయాలి అనే ఖచ్చితమైన నియమం ఎక్కడా లేదు! రిజిస్టర్ చేయని వీలునామా అయినా చట్టబద్ధంగా చెల్లుతుంది. ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు తెలియజేశాను. చాలా పాత వీలునామా కాబట్టి ఇది చెల్లదు అనడం సరికాదు. వీలునామాను అమలుపరచుటకు (ఎగ్జిక్యూట్ చేయుటకు) ఎటువంటి కాలపరిమితీ లేదు. మీరు తీసుకువెళ్లిన వీలునామా ఆధారంగా రిజిస్ట్రార్ గారు ఖచ్చితంగా మీ పేరున ఆస్తి బదిలీ చేయవలసి ఉంటుంది. పైగా ఈ ఆస్తిపై, సదరు వీలునామాపై అభ్యంతరాలు ఉన్నాయి అంటూ ఎవరు ఎటువంటి ఫిర్యాదులు వాళ్లకు అందనప్పుడు రిజిస్ట్రేషన్ను ఆపే హక్కు వారికి లేదు. ఇక్కడ మరో విషయం... కోర్టులో దావా వేస్తే మీరు అనుమానం వ్యక్తపరచిన విధంగా మీ తాత గారి సంతానం అయిన వేరే కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఇప్పుడు పేచీ పెట్టే అవకాశం లేకపోలేదు. సివిల్ కోర్టుకు వెళ్తే మీరు డిక్లరేషన్ సూట్ వేయవలసి ఉంటుంది. అయితే సివిల్ కోర్టుకు వెళ్లే ముందు, మరొక దరఖాస్తు సదరు రిజిస్ట్రార్ గారికి సమర్పించి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. వారు అప్పటికీ వినను అంటే దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లుగా లిఖితపూర్వకంగా వ్రాసి ఇమ్మని అడగండి. అలా ఇచ్చినా ఇవ్వక΄ోయినా, హైకోర్టు లాయర్ గారిని సంప్రదించి రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించి రిజిస్ట్రార్ గారి నిర్ణయాన్ని (లేదా మీ దరఖాస్తుపై జాప్యాన్ని) చాలెంజ్ చేయండి. హైకోర్టు ద్వారా మీకు అనుకూలమైన ఆర్డర్ రావడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి. అప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లవలసిన అవసరం రాదు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )( -
మిస్ యూనివర్స్ సన్నాహకం..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ సందడి ముగిసిందో లేదో మరో అంతర్జాతీయ గ్లామర్ వేదిక ‘మిస్ యూనివర్స్’ సందడి మొదలైంది. మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా మంగళవారం నగరంలోని దస్పల్లా హోటల్ వేదికగా సాష్ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ సాష్ ఈవెంట్లో తమ క్యాట్ వాక్తో అలరించారు. మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ల కోసం పోటీదారులుగా ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఎంపిక కాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది అలరించారు. అంతర్జాతీయ అందాల వేదికపై భారతీయ ప్రశస్తిని సగర్వంగా ప్రదర్శించేందుకు తెలుగు అమ్మాయిలు సన్నద్ధమవుతున్నారు, బ్యూటీ రంగంలో మన ప్రత్యేకతను చాటుకుంటున్నామని మిస్ యూనివర్స్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాద్ గారపాటి తెలిపారు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ భారత్కు ప్రాతినిథ్యం వహించడానికి విభాగాల్లో తలపడనున్నామని మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఆంటోనీ గుంజాల్వెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 7, 8 తేదీల్లో గ్రాండ్ ఫినాలే..రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెస్టెంట్లకు ఈ నెల 6న మాదాపూర్లోని అరైవల్ హోటల్స్ వేదికగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. 7, 8 తేదీల్లో నగరంలోని ధారా రిసార్ట్ అండ్ కన్వెన్షన్లో గ్రాండ్ ఫినాలే నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా విజేతకు కిరీటం ధరింపజేస్తారు. రాష్ట్ర సమాచార–సాంకేతిక, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
వృథా చేయని సమయమే ర్యాంక్ తెస్తుంది
ఐ.ఐ.టి. జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్ పరీక్ష అంటే పరీక్షలకే పరీక్ష. అలాంటి పరీక్షను 2025లో లక్షా తొంభై వేల మంది రాస్తే వారిలో అమ్మాయిలు 43,000 మంది. ఆ మొత్తం అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది దేవదత్తా మాఝీ(Devdutta Majhi). బెంగాల్లోని చిన్న ఊర్ల విద్యార్థినుల విజయం ఇది. జె.ఇ.ఇ. మెయిన్ సీజన్ 1, సీజన్ 2లలో టాప్ 1 ర్యాంక్ సాధించిన దేవదత్తా కోచింగ్ లేకుండా సొంతగా చదువుకుంది. ‘మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషం మిమ్మల్ని ర్యాంక్కు దూరం చేస్తుంది’ అని హెచ్చరిస్తూ ఉంది ఆ చదువుల సరస్వతి.ర్యాంక్ రావడం గురించి కోచింగ్ సెంటర్లకు ఒక వైఖరి ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక వైఖరి ఉంటుంది. పిల్లలకు కూడా ఉంటుంది. మా దగ్గర కూచోబెట్టి రాత్రి తెల్లవార్లు చదివిస్తే ర్యాంకు వస్తుందని కోచింగ్ సెంటర్ వాళ్లూ, ఎయిత్ క్లాస్ నుంచే కోచింగ్లో పెడితే ఇంటర్ అయ్యే సరికి చచ్చుకుంటూ ర్యాంక్ వస్తుందని తల్లిదండ్రులూ, ఆపకుండా క్లాసులు విని మాక్ టెస్టులు రాస్తే ర్యాంక్ వస్తుందని విద్యార్థులు అనుకుంటూ ఉంటారు.తీరా రిజల్ట్స్ వచ్చాక అంచనాలు తారుమారు అయి ఉంటాయి. బ్లేమ్ క్వశ్చన్ పేపర్ మీదకు వెళుతుంది. ‘పేపర్ చాలా టఫ్గా వచ్చింది కాబట్టే మా అబ్బాయికి ర్యాంక్ రాలేదు’ అనీ, ‘కెమిస్ట్రీ ఫిజిక్స్ బాగా చేసింది కాని మేథ్స్లో దెబ్బతింది మా అమ్మాయి’ అని కామెంట్లు వస్తుంటాయి. కోచింగ్ సెంటర్ వాళ్లు బాగా చెప్పలేదని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించి చదివించలేదని కోచింగ్ సెంటర్ వారూ అనుకుంటారు. మన తెలివితేటలకు ఇంకా మంచి ర్యాంక్ రావాలని విద్యార్థులు డిజ΄్పాయింట్ అవుతారు.కాని జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్కే కాదు ఏ పరీక్షకైనా ర్యాంక్ రావాలంటే మొదట పూనుకోవాల్సింది, సంకల్పించాల్సింది విద్యార్థే అంటోంది దేవదత్తా మాఝీ. లక్షా తొంభై వేల మంది రాసిన జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్ పరీక్షలో కామన్ ర్యాంక్ 16 సాధించిన దేవదత్తా అమ్మాయిలందరిలో టాప్ 1 ర్యాంకర్గా నిలిచింది. అంతే కాదు జె.ఇ.ఇ మెయిన్స్లో 100 పర్సంటైల్ సాధించింది.కోచింగ్ లేకుండానే...‘నేను కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు ఢిల్లీ లెక్చరర్ల నుంచి తీసుకున్నాను. మిగిలినదంతా సెల్ఫ్ స్టడీనే.పోటీ పరీక్షల్లో ర్యాంకు రావాలంటే ముందు నుంచి మనం క్రమశిక్షణతో ఉండాలి. టెన్త్ అయిపోయాక రెండేళ్లపాటు నేను నా ఫ్రెండ్స్ని, బంధువులను కలవలేదు. ఫంక్షన్స్కు అటెండ్ కాలేదు. కచ్చితంగా రోజుకు పది, పన్నెండు గంటలు చదివాను. ఏనాడూ డిసిప్లిన్ తప్పలేదు. మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం మనల్ని ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలి’ అంది దేవదత్తా మాఝీ.తల్లి మార్గదర్శనందేవదత్తా తల్లి ఫిజిక్స్ టీచర్. తండ్రి లెక్చరర్. వీరు ఉంటున్నది కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కత్వా అనే చిన్న ఊరు. దేవదత్తా గవర్నమెంట్ హైస్కూల్లోనే టెన్త్ చదివి 2023లో స్టేట్ టాప్ 6వ ర్యాంకర్గా నిలిచింది. ‘అప్పటినుంచే నాకు ఐ.ఐ.టి. అడ్వాన్స్డ్ సాధించాలని కోరిక. అందుకు వేరెవరో కష్టపడితే నాకెలా ర్యాంక్ వస్తుంది. కష్టపడి చదవాల్సింది నేనే... ర్యాంక్ సాధించాల్సింది నేనే. కోచింగ్ సెంటర్లలో కష్టపడి లెక్చరర్లు చెప్పడం ద్వారా మనకు ర్యాంక్ వచ్చేయదు. నా చదువుకు అమ్మ కొంచెం గైడ్ చేసింది. నేను మొదట మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో థియరీ అంతా చదువుకున్నాను. తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. టెక్స్›్టబుక్స్ మాత్రమే కాకుండా చాలా పుస్తకాలు చదివాను’ అంటుంది దేవదత్తా.ఏ.ఐ. చదవాలని...దేవదత్తా ఖరగ్పూర్ ఐ.ఐ.టి. పరిధిలోకి వచ్చినా తాను మాత్రం ఐ.ఐ.ఎస్.సి. బెంగళూరులో ఏ.ఐ. అండ్ రోబోటిక్స్ చదవాలని అనుకుంటోంది. ‘నేను వయొలిన్ బాగా వాయిస్తాను. కాని పరీక్షల కోసం దానినీ పక్కన పెట్టేశాను. అయితే పరీక్షలయ్యాక ఇప్పుడు మళ్లీ వయొలిన్ వాయిస్తున్నాను. ఈ రెండేళ్లు నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతూ రిలాక్స్ అయ్యాను. ఆమెతో మాటలు తప్ప మిగిలినదంతా పుస్తకాలతోనే’ అని ముగించింది దేవదత్తా. -
ఆలూ ద బెస్ట్
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. 66% ప్రపంచ ప్రజలు దైనందిన ఆహారంలో బంగాళదుంపలు తింటున్నారు. 2023లో 38.3 కోట్ల టన్నులు బంగాళదుంపలు పండాయి. ప్రపంచ జనాభాకు ఆహార భద్రత కల్పిస్తున్న బంగాళదుంప ప్రాధాన్యాన్ని చాటిచెప్పటానికి 2008లో అంతర్జాతీయ బంగాళదుంపల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించింది. 2024 నుంచి మే 30న అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని సైతం నిర్వహిస్తోంది. ‘చరిత్రను నిర్మించటం, భవిష్యత్తును పోషించటం’ ఇదీ ఈ ఏడాది నినాదం.పెరులోని ఆండీస్ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్ దేశాలకు ఈ పంట చేరింది. ఎటువంటి వాతావరణానికి ఇట్టే అలవాటైపోవటం వంటి సుగుణాల వల్ల 5 శతాబ్దాల్లోనే ప్రపంచం అంతా వ్యాపించింది. ⇒ వేల రకాల బంగాళదుంపల్లో దేని రంగు, సైజు, రుచి, పోషక విలువలు దానికే ప్రత్యేకంగా ఉంటాయి. అందువల్ల ఇదొక ముఖ్యమైన ఆహార పదార్థంగా మాత్రమే కాదు వంటింటి సృజనాత్మక సంస్కృతికి మూలాధారం అని కూడా అర్థమవుతుందని ఐరాసకు చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది.⇒ ఆహారపు అలవాట్లు మారిపోతున్న నేపథ్యంలో తాజా బంగాళదుంపలను వండుకు తినే వారి సంఖ్య తగ్గుతున్నట్లు అంచనా. అదేసమయంలో, అతిగా ప్రాసెస్ చేసిన పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినటం మాత్రం ఎక్కువైందట. ఫలితంగా అనేక రకాల పోషకాహార లోపాలు తలెత్తుతున్నాయి. ఈ ట్రెండ్ మన దేశంలోనే కాదు ప్రపంచదేశాలన్నిటిలోనూ ఇంతేనని ఎఫ్ఎఓ తాజా నివేదిక చెబుతోంది. ⇒ బంగాళదుంపల్లో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు బంగాళదుంపలో 80% నీరు, 15.7% పిండిపదార్ధాలు, 1.8% మాంసకృత్తులు, 1.7% పీచుపదార్థం, 0.1% కొవ్వు ఉంటాయి. ⇒ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కర్వీ జబ్బును నివారించడంలో సహాయపడుతుంది.⇒ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్. మన గుండె, కండరాలు, నాడీ వ్యవస్థల సరైన పనితీరుకు దోహదం చేస్తుంది. ⇒ బంగాళాదుంప పైపొరలో పీచు పదార్థం ఉంటుంది. మానవ జీర్ణవ్యవస్థలో ఆహారం జీర్ణం కావడానికి ఇది అవసరం. ⇒ దేహ రక్షణకు సహజ మూలకాలైన యాంటీఆక్సిడెంట్లు దోహదం చేస్తాయి. బంగాళదుంపల్లో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి దన్నుగా నిలవటం ద్వారా ఆరోగ్యదాయకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించటంలో యాంటీఆక్సిడెంట్లు తోడ్పడతాయి. ⇒ బంగాళదుంపలోని పోషక విలువ దాని రకం, వాతావరణం, నేల, సాగు పద్ధతులు, నిల్వ పరిస్థితులు, ప్రాసెసింగ్, తయారీ, వంట పద్ధతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ⇒ బంగాళదుంపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కాగలిగినవైప్పటికీ ఇవి అందరికీ సరిపడవు. ఎందుకని అంటే..? ఎంత తింటాం? ఎలా ప్రాసెస్ చేస్తాం? ఎలా వండుతాం? విలువ ఆధారిత ఆహారోత్పత్తుల్ని ఎలా తయారు చేస్తాం? వంటి అంశాలతో పాటు ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిపినప్పుడు ఎంత సమతుల్యతను పాటిస్తాం అన్నదానిపై ఆధారపడి బంగాళదుంప బాగోగులు ఆధారపడి ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. ఏ రకం బంగాళదుంపల్లో ఏయే పోషక విలువలు ఎంతెంత?(ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) సమాచారం ప్రకారం.. 100 గ్రామాలు పచ్చి బంగాళదుంపలో గత పోషక విలువలు)బంగాళదుంపలు.. అంకెలు.. వాస్తవాలు..⇒ ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. ⇒ ఇవి 5 వేల రకాలు ఉన్నాయి. బంగాళదుంపల జీవవైవిధ్యం ప్రపంచ ఆహార భద్రతకు ఒక పట్టుకొమ్మగా నిలిచింది. చిన్న, సన్నకారు రైతులకు ఇదొక ముఖ్యమైన ఆహార పంటగా మారిపోయింది. ⇒ బంగాళదుంపలకు పుట్టిల్లు పెరులోని ఆండీస్ పర్వత ప్రాంతాలు. పెరులోని కస్కో దగ్గర పోటాటో పార్క్ ఉంది. దీని విస్తర్ణం 12 వేల హెక్టార్లు. వైవిధ్యంతో కూడిన పురాతన బంగాళదుంప వంగడాల జన్యువనరులను, సంప్రదాయ విజ్ఞానాన్ని ఆదివాసులు అనాదిగా పరిరక్షిస్తున్నది ఈ ప్రాంతంలోనే. ⇒ ఆండీస్ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. ⇒ పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్ దేశాలకు, అక్కడి నుంచి ప్రపంచానికి వ్యాపించింది బంగాళదుంప పంట. కేవలం 5 శతాబ్దాల్లో వేగంగా విస్తరించింది. ⇒ ఐర్లాండులో 1840వ దశకంలో బంగాళదుంప పంట చీడపీడలతో తుడిచిపెట్టుకుపోవటంతో క్షామం సంబవించింది. అక్కడ ఈ పంట వంగడాల్లో వైవిధ్యతను నిలుపుకోకపోవటమే ఇందుకు కారణం. ⇒ బంగాళదుంపలు మనకు గోధుమ రంగులో ఉండేవే తెలుసు. కానీ, ఎన్నెన్నో రంగుల్లో ఉంటాయి. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో, విభిన్న సాగు పద్ధతుల్లో, భూతాపాన్ని తట్టుకుంటూ మనగలుగుతున్న అతి ముఖ్యమైన ఆహార పంట ఇది. మారుతున్న పరిస్థితులకు తగినవిధంగా మార్పుచెందే క్రమంలో ప్రతి బంగాళదుంప వంగడానికి ప్రత్యేకమైన గుణాలు ప్రకృతిసిద్ధంగా చేకూరాయి. ⇒ 2000–2020 మధ్యకాలంలో బంగాళదుంపల సాగు విస్తీర్ణం 17% తగ్గినప్పటికీ ఉత్పత్తి 11 శాతం పెరిగింది. తక్కువ చోటులో ఎక్కువ దిగుబడి సాధించటంలో మెరుగైన వంగడాలు, సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులు దోహదం చేస్తున్నాయి.⇒ ప్రపంచవ్యాప్తంగా బంగాళదుంప వంగడాల సంరక్షణ, విత్తటం, కోత, విక్రయం తదితర ప్రక్రియల్లో గ్రామీణ మహిళలు కీలకపాత్రపోషిస్తున్నారు. ఈ పొలాల్లో మహిళల శ్రమే అధికం.బంగాళదుంపలతో ఆహారేతర ప్రయోజనాలు⇒ బంగాళదుంపలను ఆహారంగానే కాకుండా.. ఔషధతయారీ, వస్త్రోత్పత్తి, ప్లైవుడ్, పేపర్ పరిశ్రమల్లోనూ రకరకాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు.⇒ బంగాళదుంప పై పొరను ఫ్యూయల్–గ్రేడ్ ఇథనాల్ ఉత్పత్తిలో వాడుతున్నారు.⇒ 100% ప్రకృతిలో కలిసిపోయే ప్లాస్టిక్ల తయారీలోనూ బంగాళదుంపలు ఉపయోగపడతాయి.⇒ గోజాతి పశువులు, పందులు వంటి పశువులకు దాణాగా బంగాళ దుంపలను పెడుతున్నారు.⇒ 8,000 ఏళ్ల క్రితం బంగాళదుంపలను తొలిసారి పెరులో సాగు చేయటం మొదలుపెట్టారు.⇒ 5.000 రకాలకు పైగా బంగాళదుంపల వంగడాలు ఉన్నాయి⇒159 దేశాల్లో బంగాళదుంపలను పండిస్తున్నారుఅతి ముఖ్యమైన పంటబంగాళదుంపల సాగు: ∙వేర్వేరు వ్యవసాయ వాతావరణ ప్రాంతాల్లో, నేలల్లో సాగు అవుతుంది. ⇒ సముద్రతలం నుంచి 4,700 మీటర్ల ఎత్తు వరకు భూముల్లో సాగవుతుంది.⇒ చిన్న, సన్నకారు రైతులకు ఆధారపడదగిన ఆదాయాన్ని అందిస్తుంది బంగాళదుంప పంట.⇒ సుసంపన్నమైన జన్యువైవిధ్యం వల్ల బంగాళదుంప వంగడాలు చీడపీడలను దీటుగా తట్టుకోగలుగుతుంది.⇒ బంగాళదుంపలను కోట్లాది మంది ప్రజలు దైనందిన ప్రధాన ఆహారంగా తింటున్నారు.ప్రపంచవ్యాప్తంగా 2022లో 37.5 కోట్ల టన్నుల బంగాళదుంపలను రైతులు పండించారు.⇒ చైనా 95.5 (టన్నులు)⇒ భారత్ 56.2⇒ ఉక్రెయిన్ 20.9⇒ రష్యా సమాఖ్య 18.9⇒ అమెరికా 17.8⇒ జర్మనీ 10.7⇒ బంగ్లాదేశ్ 10.1⇒ ఫ్రాన్స్ 8.0⇒ పాకిస్తాన్ 7.9⇒ నెదర్లాండ్స్ 6.9 ఆలూపై అపోహలు వద్దుఎవరైనా తీసుకునే ఆహారం వారి వయసు, రోజువారీగా వారి శారీరక శ్రమపై ఆధారపడి ఉండాలి. ఏదైనా మితంగా తీసుకోవాలి. బంగాళదుంప వాతం అంటూ ఉంటారు. కానీ, నిజానికి ఇది అపోహే. బంగాళదుంపలో ఎక్కువగా పిండిపదార్థాలు ఉన్నాయి. దీనితో పాటు కలిపి తీసుకునే ఇతర ఆహార పదార్థాలు మాంసకృత్తులు కలిగినవై ఉండాలి. ఉత్తరాదిలో ఏ కూర చూసినా ఆలు లేకుండా ఉండదు. అయితే, ఆలుతో పాటు కాబోలి శనగలు కూడా కలిపి వండుతారు. మన ఆహారంలో సాధారణంగా మాంసకృత్తులు లోపిస్తున్న విషయం తెలిసిందే కదా.పెద్దవాళ్లు రోజూ ఆలు తిని కూర్చుంటే పిండిపదార్థాలు ఎక్కువై నొప్పుల సమస్య వస్తుంది. పెద్దవాళ్లకు జీర్ణశక్తి తగ్గటం కూడా ఈ సమస్యకు ఒక కారణం. అదే పిల్లలైతే శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి వారికి ఆ సమస్య రాదు. ఎవరైనా, తగుమాత్రంగా, సమతులాహారంలో భాగంగా తీసుకున్నప్పుడు ఏ సమస్యా ఉండదు. లేదంటే ఊబకాయానికి దారితీస్తుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినటం చిన్నా పెద్దా ఎవరికీ ఆరోగ్యకరం కాదు. – ఆచార్య విజయ ఖాదర్, విశ్రాంత డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ హోం సైన్స్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
టాలెంట్ ఉండాలే గానీ.. అమెరికన్ కంపెనీలో రూ.1.45కోట్ల వేతనం
బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. కారు బంగ్లా కొనుక్కోవాలి. ఇలాంటి కలలు చాలా మంది విద్యార్థులు కంటారు. కానీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు, అదృష్టాన్ని దక్కించుకుంటారు. పట్టుదల, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. దీనికి నిడుమోలు లక్ష్మీ నారాయణరావు దానికి ఒక ఉదాహరణ. అమెరికన్ క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ రుబ్రిక్లో రూ. 1.45 కోట్ల వార్షిక వేతనంలో అద్భుతమైన ప్లేస్మెంట్ ఆఫర్ను అందుకున్నాడు. తద్వారా కన్న తల్లిదండ్రులకు, కన్న ఊరికి గర్వకారణంగా నిలిచాడు. చదువుకున్న సంస్థకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు.రూ. 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవాడు నిడుమోలు లక్ష్మీ నారాయణ రావు. తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. రాంచీలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT)లో 2021-2025 బ్యాచ్కు చెందినకంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. అద్భుతమైన ప్రతిభతో ప్రొఫెసర్లు, కంపెనీలను ఆకట్టుకున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.ఇదీ చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీమలుపు తిప్పిన ఇంటర్న్షిప్తన చదువులో భాగంగా లక్ష్మీ నారాయణ రావు అమెరికన్ కంపెనీ రుబ్రిక్లో ఆరు నెలల ఇంటర్న్షిప్కోసం చేరారు. అదే అతని జీవితంలో మైలు రాయిగా నిలిచింది. రావు అసాధారణ పనితీరు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రూ 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీ వెదుక్కుంటూ వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఆఫర్ను తిరస్కరించాడు.. త్వరలోనే బెంగళూరులో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. రావుకు చిన్నప్పటి నుంచీ ఐటీ, టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కప్ లాంగ్వేజ్ (AIML)కి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ ఇన్స్స్టిట్యూట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిBIT మెస్రా యాజమాన్యం నిడుమోలు సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.తమ సంస్థకు చెందిన విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీని అందుకోవడం ఇదే తొలిసారంటూ రావును అభినందించింది. గతంలో, గరిష్ట ప్యాకేజీ సంవత్సరానికి రూ. 52 లక్షలుగా నమోదైందని BIT మెస్రా ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు. -
అందరూ ఆమె బతకదన్నారు..! కానీ ఇవాళ ఆమె లుక్ చూస్తే..
కొందరు చావు అంచులు దాక వెళ్లొచ్చి..బతికొస్తుంటారు. అలా ఆయురారోగ్యాలతో ఉన్నావారెందరో. ఒకరకంగా వారంతా ఆ అనారోగ్యం మేల్కొలుపుతో ఆరోగ్యవంతమైన జీవితం గడిపి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ డాక్టర్. అంతటి భయానక పరిస్థితి నుంచి బయటపడ్డ ఆమె లుక్ను చూస్తే కంగుతింటారు. ఈమెనే అనారోగ్యం బారినపడింది అనే సందేహం కలుగమానదు. ప్రస్తుతం ఆమె వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి.. దీర్ఘాయువుతో ఎలా ఉండాలో చిట్కాలు చెబుతున్నారామె. మరీ ఆ డాక్టర్ ఆసక్తికర గాథ ఏంటో చూద్దామా..!.లండన్కి చెందిన 53 ఏళ్ల లైఫ్స్టైల్ వైద్య నిపుణురాలు డాక్టర్ అల్కా పటేల్ని చూస్తే 23 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది. ఆమె జీవ సంబంధమైన వయసు కేవలం 23 ఏళ్లేనని ఆమెనే స్వయంగా చెబుతున్నారు. మనలో కొందరూ ఏజ్ పరంగా చాలా పెద్దవాళ్లైన లుక్చూస్తే చిన్నవాళ్లలా ఉంటారు. అలా మనం కూడా ఉండొచ్చని అల్కా అంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలితో ఆరోగ్యాన్నే కాదు మన ఏజ్ని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారామె. ఒకప్పుడామె..ఆమె రెంబు దశాబ్దాలకు పైగా జనరల్ ప్రాక్టీషనర్ సేవలందించిన డాక్టర్ ఆమె. ఎక్కువ సమయం తన పేషెంట్ల బాగోగుల, కుటుంబ బాధ్యతలకు కేటాయించి తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారామె. దాంతో సడెన్గా తన 39వ పుట్టనరోజున ఎడతెరగని జ్వరం బారినపడింది. సాధారణ జ్వరం కాస్త సివియర్ అయిపోయింది. నెమ్మదిగా అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. అసలు ఆమె ఏ వ్యాధితో బాధపడుతుందో వైద్యులకే అంతు చిక్కలేదు. ఇక లాభం లేదని అవయవాలు పనిచేసేలా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిదంటే..తన పిల్లలకు అమ్మగా తానేం చేయకుండానే చనిపోతాననే బెంగతో జీవచ్ఛవంలా అయిపోయింది. ఒకరకంగా ఆ అనారోగ్యం అల్కాకు తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టేలా చేసింది. ఎలాగైన తన పిల్లల కోసం ఈ అంతుచిక్కని వ్యాధిని ఎలాగైనా జయించాలనే ధైర్యాన్ని కూడగట్టుకుంది. అలా నెమ్మదిగా..తగినంత విశ్రాంతి, పోషకాహారంపై దృష్టిపెట్టి తనను తాను బాగుచేసుకుంది. ఆ తర్వాత మరింత ఆరోగ్యంగా ఉండేలా..వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఆహారంపై ఫోకస్ పెట్టారు అలా ఆమె యవ్వనంగా మారడమే గాక పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభించారు. ఆ అనారోగ్యమే తన కళ్లు తెరిపించిందని అంటారామె. పైగా ఇవాళ ఆమె దీర్గాయువు నిపుణురాలిగా సేవలందిస్తున్నారు కూడా. ఇక ఆమె ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని నిర్వహించడం కోసం ఆరింటిని తప్పనిసరిగా పాలోకండని సూచిస్తున్నారామె. అవేంటంటే..సూర్యకాంతిలో గడపటం: ప్రతిరోజు ఉదయం కనీసం ఒక్క నిమిషం సూర్యకాంతిలో గడపటం. ఓ పదిసెకన్లు కళ్లు మూసుకుని మీకోసం మీతో గడపాలట.వాకింగ్: గుండె ఆరోగ్యం, శక్తిని పెంచడానికి ఓ 20 సెకన్ల పాటు నడవాలట. హైడ్రేటెడ్ ఉండటం: ప్రతి 30 నిమిషాలకు నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టడంపొగడ్తలు, గర్వంగా ఫీలైన క్షణాలు: మిమ్మల్ని మెచ్చకున్న వ్యక్తులను గుర్తుచేసుకోండి. అలాగే మీకు మద్దతు, సహయం చేసేవారిని ప్రశంసించడం అలవాటు చేసుకోవాలటవర్కౌట్లు: శరీరంలో మంచి కదలికలు ఉండటం కోసం ఓం 50 సెకన్ల పాటు వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయలటబ్రీథింగ్ వ్యాయామాలు: నాడీ వ్యవస్థను శాంతపరిచేలా ప్రతి రోజు ఒక గంట శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం తదితరాలతో వ్యాయమాన్ని తిప్పికొట్టి ఆరోగ్యవంతంగానే కాకుండా నిత్య యవ్వనాన్ని సొంత చేసుకోగలమని చెబుతున్నారు డాక్టర్ అల్కా పటేల్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీ
కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక, వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని అందలాలను అధిరోహించాలనే పట్టుదల ఇద్దరు స్నేహితరాళ్లను వ్యాపారవేత్తలుగా మార్చింది. ఇది వారి కలలను సాకారం చేసుకోవడం వరకే పరిమితం కాలేదు. నేత వస్త్రాలను ప్రాచుర్యం, చేతివృత్తులవారికి ఆర్థిక స్వావలంబన, మహిళాలకు సాధికారతను తెచ్చి పెట్టింది. అలా మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా అనే ఇద్దరు స్నేహితులు అద్భుతాలు చేశారు. ఇంతకీ వీరేం సాధించారు తెలుసుకుందామా...!నిజానికి నిరుపమ సింగ్( Nirupama Sharma) అంజనా భమ్రా Anjana Bhamra) సక్సెస జర్నీ సుమారు పదేళ్ల క్రితం సాయంత్రం కాఫీ ఒక స్నేహితుడు అడిగిన సాయం వారిలో వ్యాపార ఆలోచనకు పునాది వేసింది. ఫ్యాషన్, ఫాబ్రిక్ పట్ల వారి జ్ఞానం ఆసక్తి సొంత ఫ్యాషన్ లేబుల్ కలిగి ఉండాలనే ఆలోచన వారి మనస్సులలో మొలకెత్తింది. అలా ‘ది సాఫ్రాన్ సాగా ’ పుట్టింది. భారతీయ కళా నైపుణ్యం, మహిళా సాధికారత, ఫ్యాషన్, పర్యావరణ అనుకూల డిజైనర్ దుస్తుల బ్రాండ్ ఇది. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో దేశీయ హస్తకళను ప్రోత్సహిస్తుంది.చీరలు, సూట్లు, దుస్తులు, బ్లౌజులు , ట్రెండీ లాంజ్వేర్ వంటి ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నారు అంతేకాదు తమ బ్రాండ్ను జీరో-వేస్ట్గా మార్చడానికి ,మిగిలిపోయిన బట్టలను రీసైక్లింగ్ కూడా చేస్తారు. ఇదీ చదవండి : అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ పురాతన హస్తనైపుణ్యానికి, ఆధునిక ట్రెండ్ను, సౌందర్యాన్ని జోడించి, పలురకాల ప్రింట్లు , రంగులతో అనేక ప్రయోగాలు చేస్తున్నాం అంటారు సాఫ్రాన్ సాగా వ్యవస్థాపకులు నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, సితార, లినెన్, బాటిక్, బాగ్ బహార్, ఇంద్రధనుష్ వంటి గాలి ఆడేలా, లేత రంగు ఫాబ్రిక్ను ఎంచుకుంటామన్నారు. సీజన్కు తగినట్టు దుస్తులను తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకున్నారు.2015లో పదేళ్ల క్రితం కేవలం 20వేల రూపాయల పెట్టుబడితో 'ది సాఫ్రాన్ సాగా' అనే ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించారు. అదీ 40 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రపంచంలోకి అడగుపెట్టారు. అంజనా ఒక హోటల్, సెలూన్, బోటిక్ నడిపేది. ఆమె స్నేహితురాలు నిరుపమ మార్కెటింగ్, కమ్యూనికేషన్లలో నిపుణురాలు. ఇలా వీళ్లిద్దరి కలయికలో రూపుదిద్దుకున్న ఈ బిజినెస్ టర్నోవర్ రూ. 1.5 కోట్లను దాటేసింది. అయితే వీరి సక్సెస్ జర్నీ అనుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఒక సవాల్ అయితే, తమ బ్రాండ్ను జనాల్లోకి తీసుకెళ్లడం మరో సవాల్. ఒక దశలో ఈఎంఐలు కట్టడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సవాళ్లను ఇద్దరూ కలిసి మొక్కవోని దీక్షతో అధిగమించారు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు కరిగి పోయాయి. మొదట్లో ఆశించినంత లాభాలు రాక, ఆదాయం రాకపోయినా నిరాశపడలేదు. ధైర్యంతో తమ బ్రాండ్ను విజయ తీరాలకు చేర్చారు. ఏదైనా సాధించాలనే పట్టుదల, కృషితో ముందుకు సాగి, సక్సెస్కు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. -
వాట్ ఏ టాలెంట్ బ్రో..! రెండు కాళ్లు లేకపోతేనేం..
మనపై మనకున్న నమ్మకం, అచంచలమైన ధైర్యం ముందు..ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహారణ ఈ కొరియోగ్రాఫర్. రెండు కాళ్లు లేపోయినా..విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు. అతడే కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు. అయితేనేం..అతడి మనోధైర్యం, సంకల్పం.. అతడి కాళ్లకు ఊపిరిపోశాయా అనిపించేలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అతను. కూమార్ ప్రోస్థెటిక్ కాళ్లతో తన విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా వారింది. ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్ ప్రముఖ హిట్పాట చిట్టియాన్ కలైయాన్ పాటకు డ్యాన్స్ చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్ కదుపుతున్న స్టెప్పులు చూస్తే..కళ్లు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్ చేసినట్లు మంచి హవభావాలు పలికిస్తూ..డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు వీడియోలో. ఈ వీడియోని చూసి నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుంది అనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కూమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ablu Rajesh Kumar (@ablurajesh_) (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
వయసు 70 ఏళ్లు..ఇప్పటికీ 40 కి.మీ సైకిల్పైనే..
చిన్న వ్యాపారమే నడుపుతున్నా..రయ్రయ్మని..బైక్ లేదా కార్లలలోన వెళ్తుంటారు. పైగా అది స్టేటస్ ఆఫ్ సింబల్గా పలువురి అభిప్రాయం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఓ తాతా గారు బడా వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా..ఇప్పటికీ సాధారణ సైకిల్పైనే తన ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు. అది కూడా ఏకంగా 30 కి.మీ పైనే తొక్కుతూ వెళ్లడం విశేషం. ఇవాళ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భరంగా అంతలా ఫిట్నెస్ ప్రాముఖ్యత ఇచ్చి సైక్లిల్పైనే రాకపోకలు సాగిస్తున్న ఆ తాతగారు గురించి తెలుసుకుందామా..!.అతడే 70 ఏళ్ల సురేష్ జరివాలా. ఆయన్ను సైక్లింగ్ లెజెండ్గా పేర్కొన్నవచ్చు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. స్వతహాగా వస్త్ర వ్యాపరావేత్త అయినా ఆయన ఫిట్నెస్కి వీరాభిమాని. ఆయన వ్యాపారిగా తన కెరీర్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్లు ఆయన దరిచేరలేకపోయాయి లేదా ఆయన్ను ఆకర్షించడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే సూరత్లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ..సైకిల్పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్ని సలాబత్పురా నుంచి అంకలేశ్వర్ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్లోని తన ఇంటి నుంచి స్టేషన్కి మూడు కి.మీ సైకిల్పై ప్రయాణించి.. అక్కడ నుంచి రైలులో ప్రయాణించి అంకలేశ్వర్కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కి.మీ సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పుడో 1990లలో రూ. 2000 పెట్లి అట్లాస్ కంపెనీ సైకిల్ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే..ఆ సైకిల్ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవిన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనలా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా. ఇంత బిజీ లైఫ్లో కూడా ఆయన రోజూ పదివేల అడుగులపైగా వాకింగ్ చేస్తాడట. మారథాన్, రన్నింగ్ రేస్ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే..మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కి.మీ. సైకిల్పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవిన విధానం పర్యావరణ హితంగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం. కనీసం ఆయనలా అంతలా చేయలేకపోయినా..పర్యావరణానికి మేలు కలిగించేలా, ఆరోగ్యగా ఉండేలా జీవించడానికి కొద్ది ప్రయత్నమైనా చేద్దామా..!..(చదవండి: 'డయాబెటిక్ రైస్' అంటే..? బాలీవుడ్ నటుడు గోవింద్ వైఫ్ సైతం..) -
ఉండాల్సిన నమ్మకం : భగవంతుడు సర్వాంతర్యామి
భగవంతుడు సర్వాంతర్యామి అనేది భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులకు నదీనదాలూ, కొండలూ, గుట్టలూ, జంతువులూ, పక్షులూ... ఒకటేమిటి– అన్నీ పూజనీయాలే. పండుగలూ పబ్బాలలో ప్రకృతితో మమేకమై తన్మయత్వంతో పూజలు చేయడం అందుకే! అయితే వివిధ రూపాల్లో ఉన్న దేవుని గుర్తించడంలో మాత్రం చాలామంది విఫలమవుతూ ఉంటారు. ఇందుకు దైవాన్ని గుర్తించగలిగిన జ్ఞానం వారికి లేకపోవడమే కారణం. దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడి లోపలికి చాలా భక్తిప్రపత్తులతో వెళతారు. కానీ గుడి మెట్లపై కూర్చునే యాచకులు, దీనులను చాలామంది పట్టించుకోరు. వారితోనే నిజంగా దేవుడు కూర్చున్నా గుర్తించలేరు. అయితే భగవంతుని గుర్తించడానికి శోధన అవసరం. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్అన్వేషించే కొద్దీ భగవంతుణ్ణి ఏదో ఒకరోజు తెలుసుకోవచ్చు. ఆరాధనా పద్ధతులతోపాటు అన్వేషణా జ్ఞానాన్నీ సముపార్జించాలి. ఆ జ్ఞానం లేకపోతే ఆ నారాయణుడే మన ముందుకొచ్చి నిల్చున్నా తెలుసుకోలేం. పైపెచ్చు అనుమానిస్తాం. అతను నిజంగా నారాయణుడేనా అని ఆలోచనలో పడతాం. నారాయణుడేదో మన అవసరాలను తీర్చడానికొస్తే ఎదురు మనమే అవీ ఇవీ అడిగి అనుమానిస్తాం. అప్పుడు ‘నేను సాక్షాత్తూ ఆ నారాయణుడినే నయ్యా’ అని భగవంతుడు చెప్పినా సరే... మన మనసు ఒప్పుకోవడానికి ససేమిరా అంటుంది. ‘అదేంటీ, నాకంత సులభంగా పరమాత్మ ప్రత్యక్షమవుతాడా’ అని సందేహిస్తాం. ఇటువంటి స్థితిలోనైనా మనకు ప్రహ్లాదుడి మాట గుర్తుకు రావాలిగా... ఆ హరి నారాయణుడు లేని చోటేది? అతను సర్వాంతర్యామి అనేది తెలిసుండాలిగా! అలాకాక ‘నీకు శంఖం, చక్రం లేవేమిటీ? నీ వాహనమైన గరుత్మంతుడేడీ?’ అని ప్రశ్నిస్తే ఆ నారాయణుడిని ఎలా చూడగలం?చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుందిమనకు మన మీదే అపనమ్మకం. అటువంటప్పుడు సాక్షాత్తూ ఆ వైకుంఠవాసుడైనా ఏమీ చేయలేడు. కనుక మనకు ఉండాల్సింది నమ్మకం. అన్నింట్లోనూ ఆ భగవంతుడు ఉంటాడనేది తెలియాలి. – యామిజాల జగదీశ్ -
'డయాబెటిక్ రైస్' అంటే..? ఇది మధుమేహాన్ని నియంత్రించగలదా..
ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న తీపి వ్యాధి మధుమేహం. దీని కారణంగా ఏం తినాలన్నా..బాబోయ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది చాలామందిలో. దాన్ని క్యాష్ చేసుకునేలా మార్కెట్ డయాబెటిస్ వాళ్లకు ఉపయోగపడే రైస్, కూరగాయాలు, స్వీట్లు అంటూ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి చాలామందికి కూడా రైస్తో భోజనం కానిస్తే కానీ కడుపునిండిన ఫీల్ రాదు. ఇలానే అంటున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరో గోవింద్ భార్య సునీతా అహుజా సైతం. ఆమె కూడా హాయిగా అన్నం తింటేనే ఆ అనుభూతే వేరు అంటున్నారు. కానీ తాను కూడా డయాబెటిస్తో పేషెంటేనని, అందుకని రైస్ని ఇలా తీసుకుంటానంటూ తన డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మనకిష్టమైన రైస్నే వదులకోకుండా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారామె. మరి నిపుణులు దీని గురించి ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.సెలబ్రిటీ సునీతా ఆహుజా తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ..తాను నేపాలీగా ఎక్కువ వైట్రైస్ తినేందుకే ఇష్టపడతానని అన్నారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి డయాబెటిక్ రైస్కి ప్రాధాన్యత ఇస్తానన్నారామె. దాంతోపాటు రోటీలు కూడా తీసుకుంటానని అన్నారు. ‘డయాబెటిక్ రైస్’ అంటే..ఈ ‘డయాబెటిక్ రైస్’ఇటీవలకాలంలో బాగా ప్రజాదరణ పొందింది. ఇది మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయమైన రైస్ అని చెప్పొచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. సాదారణ బియ్యం కంటే..వీటిలోనే గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెరుతాయి. అందువల్ల వీటికే మొగ్గు చూపుతున్నారు చాలామంది. అవేంటంటే..నల్ల బియ్యంఎర్ర బియ్యంగోధుమ బియ్యందంపుడు బియ్యంతక్కువ GI బాస్మతి బియ్యంమిల్లెట్ ఆధారిత బియ్యంప్రాసెస్ చేసిన తక్కువ-కార్బ్ బియ్యంవాటిల్లో గ్లైసెమిక్ సూచిక..తెల్ల బియ్యం: GI 70–89 (ఎక్కువ)గోధుమ బియ్యం: GI 50–60 (తక్కువ)ఎర్ర బియ్యం: GI దాదాపు 55 (తక్కువ)దంపుడు బియ్యం: GI 38–50 (అత్యల్పం )మిల్లెట్స్: GI దాదాపు 40–55 (అత్యల్పం)డయాబెటిక్ బియ్యంతో కలిగే లాభాలు..భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంచడం, భాగం నియంత్రణకు సహాయపడుతుందిదీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరగలదుశుద్ధి చేయబడిన తెల్ల బియ్యంతో పోలిస్తే, తృణధాన్యాలు లేదా తక్కువ GI బియ్యం గ్లూకోజ్ ప్రతిస్పందనను మాడ్యులేట్ చేయడంలో బెస్ట్నిపుణులు ఏమంటున్నారంటే..ఇక వైద్య నిపుణులు సైతం "డయాబెటిక్ బియ్యం"లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆరోగ్యకరమని అతిగా తీసుకుంటే మాత్రం.. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారుగ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టార్చ్ లేని కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా నివారించాలని సూచించారు. చివరగా తక్కువ-GI, అధిక-ఫైబర్ బియ్యం రకాలు చక్కెర నిర్వహణను గణనీయంగా మెరుగుపరుస్తాయని నమ్మకంగా చెప్పారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. (చదవండి: ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే..? ఈ చికిత్స ఎందుకోసం అంటే..) -
అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ
తల్లి ఇంట్లో నిశ్శబ్దంగా బాధపడటం చూసినప్పుడు పిల్లల మనస్సులో ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆమె మూగ వేదన పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా? ఇది అనేక మంది పిల్లల్లో బయటికి కనిపించని వేదన. అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థం కాక, నాన్న మద్యానికి ఎందుకు బానిసగా మారిపోయాడో తెలియక, నాన్న పెట్టే హింసను అమ్మ ఎందుకు భరిస్తుందో చిట్టి బుర్రకు అర్థంకాక సతమతమయ్యే పిల్లలు గుండెల్లోని గాయాల ప్రభావం మాత్రం చాలా గట్టిగా, సుదీర్ఘంగా ఉంటుంది. ఇది చాలామంది పిల్లల అనుభవం కూడా. తాజాగా టీనేజర్ మానసిక ఆరోగ్యం వారి తల్లి ఇంట్లో భరించే హింస ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అనే దానిపై ఒక అధ్యయనం కొన్ని హృదయ విదారకమైన అంశాలను శాస్త్రీయంగా వెలుగులోకి తీసుకొచ్చింది.ఎదుగుతున్న పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. ముఖ్యంగా తల్లి మానసిక స్థితి, ఇంట్లో ఆమె స్థానం, ఆమె ఎదుర్కొనే గృహ హింస పిల్లల ఎదుగుదలను, మానసిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిపై ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో తల్లీ బిడ్డలపై ఆసక్తికర అధ్యయనం జరిగింది.ఈ అధ్యయనం భారతదేశంలోని కౌమారదశలోని పిల్లల మానసిక ఆరోగ్యంపై గృహ హింస ఎదుర్కొనే తల్లి అనుభవాల ప్రభావాన్ని పరిశీలించింది. PLOS One అనే మెడికల్ జర్నల్లో ప్రచురించిన ఈ స్టడీలో , తల్లులు గృహ హింసను ఎదుర్కొన్నప్పుడు, వారి కౌమారదశలో ఉన్న పిల్లలు ఆందోళన, నిరాశ ,ఇతర సాధారణ మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది. దేశంలోని ఏడు రాష్ట్రాలలో 2,784 తల్లి-బిడ్డ జంటల నుండి వచ్చిన డేటా ఆధారంగా, ఇంట్లో హింస మహిళలను మానసిక వేదనకు గురి చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తరం మానసిక శ్రేయస్సును కూడా దెబ్బతీసింది. నిశ్శబ్దంగా చాప కింద నీరులా వారిని పట్టి పీడిస్తుందని అధ్యయనం తెలిపింది.అధ్యయనం ఏమి కనుగొంది?గత ఏడాది పిల్లలున్న మహిళలపై గృహ హింస (DV) 36.8 శాతం ఉందని అధ్యయనం కనుగొంది. శారీరక లేదా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న తల్లుల టీనేజ్ పిల్లలు అనేక మానసిక రుగ్మతలతో బాధపడే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శారీరక వేధింపులను ఎదుర్కొనే తల్లులున్న పిల్లలలో నిరాశ ప్రమాదాన్ని రెట్టింపుచేశాయని పేర్కొంది. కొట్టడం, తిట్టడం లాంటి వాటిని ప్రత్యక్షంగా చూడకపోయినా, భావోద్వేగం, వాతావరణం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అధ్యయనం హైలైట్ చేసింది.ఎలా విశ్లేషించారు:కొట్టడం, చెంపదెబ్బ కొట్టడం, కొట్టడం వంటి శారీరక వేధింపులుతిట్టడం, అవమానించడం, బెదిరింపులుభర్త బలవంతం లేదా దాడితో సహా ఇతర లైంగిక వేధింపులుమానసిక ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేశారు?12–17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్నవారిని ఈ క్రింది రుగ్మతలను గుర్తించే డయాగ్నస్టిక్ టూల్ ద్వారా పరీక్షించారు.ఆందోళన (GAD, సోషల్ ఫోబియా, PTSD) డిప్రెషన్ (మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, డిస్టిమియా)సాధారణ మానసిక రుగ్మతలు (CMDలు), ఆందోళన నిరాశ . 5.3 శాతం మందికి ఆందోళన రుగ్మతలు, 3.2 శాతం మందికి డిప్రెషన్ మరియు 7.4 శాతం మందికి CMDలు ఉన్నట్టు ఈ స్టడీ గుర్తించింది.భారతదేశంలో ఎందుకు ముఖ్యం?భారతదేశంలో, ఉమ్మడి కుటుంబాల్లో మహిళలపై గృహ హింస, శారీరక వేధింపులు చాలా ఎక్కువ. కట్నం తేలేదనో, మగ బిడ్డ పుట్టలేదనో, అందంగా లేదనో.. ఒకవిధంగా చెప్పాలంటే ఈ కారణాలకు లెక్కేలేదు. అలాగే మగబిడ్డ పుట్టే వరకు గర్భ నిరోధకాలను నిలిపివేయడం లేదా తల్లిదండ్రుల ఇళ్లకు బలవంతంగా పంపడం వంటి అనేకరకాల వేధింపులను అధ్యయనం గుర్తించింది. ఇవి పైకి మామూలుగా కనిపించినప్పటికీ, మహిళలు, వారి పిల్లలు ఇద్దరిపైనా దీర్ఘకాలిక ఒత్తిడిని తెస్తుందని తెలిపింది. అంతేకాదు ఈ కారణంగా ఉద్భవించిన శారీరక, మానసిక సమస్యలు, భావోద్వేగ బాధలకు గుర్తింపుగానీ, తగిన చికిత్స కానీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లల్లో ఎలాంటి ప్రభావం దీర్ఘకాలిక నిరాశ,ఆందోళన ముప్పుఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఇబ్బందిపేలవమైన పనితీరు, చదువులో శ్రద్ధలేకపోవడం, పాఠశాల మానేయడంఆత్మహత్య ఆలోచనల ప్రమాదం ఎక్కువఈ ప్రభావాలు యుక్తవయస్సు, ఆపైన కూడా కొనసాగవచ్చు ఎవరెవరు ఏం చేయాలి? సామాజిక-ఆర్థిక స్థితి, లింగం, విద్య లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా, గృహ హింస, లైంగిక వేధింపులు బలమైన ప్రమాద కారకాలుగా ఉన్నాయని అధ్యయనం గుర్తించింది. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలని స్టడీ పిలుపునిచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విధాన నిర్ణేతలు తగిన చర్యలు చేపట్టాలని తెలిపింది. తల్లిదండ్రుల సంబంధాలు, వ్యవహారం పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. వారి మానసిక ఆరోగ్య సమస్యల కోసం స్క్రీనింగ్ చేయాలి. అలాగే అధికారులు గృహ హింస నివారణ కార్యక్రమాలను బలోపేతం చేయాలి. పాఠశాలలు,సమాజాలలో మానసిక ఆరోగ్య మద్దతును ఏకీకృతం చేయాలి. -
‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే ..?
సినిమాల్లో ఈ థెరపీని భయంకరంగా చూపిస్తారు. ఎవరినైనా హింసించడానికి దాన్ని వాడుకుంటున్నట్టుగా చూపుతారు. అంతేకాదు... కొన్ని హాస్య సన్నివేశాల్లోనూ నవ్వించడానికీ దాంతో కామెడీ యాక్టర్లకు షాక్ ఇస్తున్నట్టు చూపి, నవ్వు తెప్పించడానికి వాడతారు. ఇక వార్తా కథనాల్లో ఎదుటి పార్టీవారికీ, ప్రత్యర్థులకు షాక్ ఇచ్చినప్పుడు ‘షాక్ ట్రీట్మెంట్’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అలా దానిపై ఎన్నో అనుమానాలూ, అపోహాలూ కల్పిస్తారు. కానీ నిజానికి అదో మంచి ట్రీట్మెంట్. బాధితులకు షాక్ తగినట్లుగా తెలియనివ్వని చికిత్స. మరెంతో మందికి మానసిక చికిత్సల కోసం, అనేక మందికి ప్రాణరక్షణ కోసం వాడే థెరపీ. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి అనేక మందికి ప్రాణరక్షణ ఇచ్చిన చికిత్సా ప్రక్రియ. ఎంతో మందిని రక్షించిన ఆ చికిత్స పేరే ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్. వైద్య పరిభాషలో ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’అని పిలుస్తూ సంక్షిప్తంగా ‘ఈసీటీ’ అనే ఈ చికిత్సపై ఉండే అపోహలూ, అపార్థాలు తొలగించి, ఈ చికిత్స ప్రక్రియపై మంచి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. సినిమాల్లో, అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో ఎంతగానో భయంగొలిపేలా చూపే ఈ షాక్ ట్రీట్మెంట్ నిజజీవితంలో ఎంత మాత్రమూ భయం గొలిపే చికిత్స కాదు. దీనిపై ఎంతగా అపార్థాలు నెలకొన్నాయంటే బాధితుడికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలంటూ డాక్టర్లు చెబితే... అతడి బంధువులూ, స్నేహితులూ ఆందోళనకు గురయ్యేంతగా ఇది అపోహలకు గురయ్యింది. కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని తిరిగి సాధారణ స్థితికి రావడానికి ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి ఏటా దాదాపు లక్షల సంఖ్యలోని బాధితులకు వారి సమస్యలను నయం చేస్తూ, అనేక రకాలుగా స్వస్థత చేకూర్చే ఈ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రావడమూ చాలా నాటికీయంగా జరిగింది. అది సివియర్ డిప్రెషన్, కెటటోనియా లాంటి ఎన్ని రకాల సమస్యలనుంచి విముక్తి కల్పిస్తుందనే విషయంతోపాటు అసలు అది ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరుతెన్నులూ... ఈ విశేషాలన్నింటి గురించీ తెలుసుకుందాం...షాక్ ట్రీట్మెంట్ ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరిది... అసలు కరెంటు షాక్ ద్వారా కొన్ని మానసిక వ్యాధులను నయం చేయవచ్చని ఎలా తెలిసిందన్నదే అబ్బురాన్ని కలిగించే విషయం. తొలుత 1934లో డాక్టర్ మెడూనా అనే శాస్త్రవేత్త మానసిక సమస్యలు ఉన్న బాధితులకు క్యాంఫర్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా బాధితుడికి మూర్చ (ఫిట్స్ / కన్వల్సెన్స్)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించాడు.ఇప్పుడు మరింత సమర్థంగా మాడిఫైడ్ ఈసీటీ రూపంలో ... ఇటీవల పెరిగిన వైద్యవిజ్ఞానంతో చాలా తక్కువ డోసులో మత్తు మందుతోపాటు తక్కువ మోతాదులో కరెంట్ ఇవ్వడం ఆధునిక మాడిఫైడ్ ఈసీటీలో జరుగుతుంది. శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ఇటీవల కాలంలో బాధితులకు ఇప్పుడు మత్తు కూడా చాలా తక్కువ మోతాదులో (షార్ట్ యాక్టింగ్) అలాగే చాలా సురక్షితంగా కూడా ఇస్తున్నారు. కండరాలుకు తగినంత విశ్రాంతి కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రో కన్వల్సివ్ చికిత్స (ఈసీటీ) చేయడం జరుగుతుంది. ఇందులో బాధితులకు తమకు కరెంట్ షాక్ ఇస్తున్న విషయమూ తెలికుండానే... వారికి అసలేమీ జరగదలేదని అనిపించేలా... కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతోంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినప్పుడు మాత్రమే బాధితులకు తమకేదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుందిగానీ.... ఇందులో నిజానికి ఎలాంటి బాధా ఉండదు. ఈసీటీ ఇచ్చిన తర్వాత సుమారు 2 గంటల పాటు వైద్యులు సదరు మానసిక సమస్యల బాధితుల్ని తమ పర్యవేక్షణలోనే ఉంచుకుని (తాము వాడిన మందుల ప్రభావం తగ్గేంతవరకు) ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన, ప్రమాదరహితమైన ఔట్పేషెంట్ పద్ధతిలోనే చికిత్స జరుగుతుందన్నమాట. మన సమాజంలో నిజానికి మానసిక సమస్యలు వాటి కారణాలు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని సభ్యులకు ఏదైనా మానసిక సమస్య ఉందంటే... వారు దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచడానికే మొగ్గుచూపుతారు. ఇది సరైన పద్ధతి కాక΄ోయినా... దురదృష్టవశాత్తు ఇంకా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన ధోరణే ప్రజల్లో / సమాజంలో కొనసాగుతోంది. నిజానికి మన దేహంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా పూర్తి స్థాయిలో అంతుచిక్కనిదీ లేదా చాలా తక్కువగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది మన మెదడు గురించే. మెదడు నిర్మాణం, జీవక్రియలూ అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ... ఈ అంశం మన మెదడు తాలూకు సంక్లిష్టతను తెలియజేస్తుంది. అందుకే మానసిక సమస్యల తాలూకు కారణాలు తెలుసుకోవడం చాలా సంక్లిష్టమైన కఠినమైన విషయంగా మారింది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన చాలా రహస్యాలు మెల్లమెల్లగా తెలిసివస్తున్నాయి. ఈసీటీ ప్రక్రియ... మెదడులోని అనేక స్థాయుల్లో చాలారకాల మాలిక్యులార్ బయోకెమికల్, ఎండోక్రైన్, స్ట్రక్చరల్, జెనెటిక్ మార్పులను కలగజేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ వ్యాధిని నయం చేయడానికి కారణమవుతోంది. ఎలక్ట్రో కన్వల్సివ్ ప్రక్రియ(ఈసీటీ) ఎలా పనిచేస్తుందంటే...నిజానికి ఈసీటీ చికిత్స ఎంత సురక్షితమైనదో చెప్పడానికి తార్కాణమేమిటంటే... గర్భవతుల్లో (ప్రెగ్నెన్సీలో)అలాగే ప్రసవం అయ్యాకకొత్తగా తల్లులైన మహిళల్లో వచ్చే పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్సఇచ్చేటప్పుడు ఆ బాలెంతకూ...అంతేకాదు...గర్భంలో ఉన్నశిశువుకుసైతం ఈసీటీఅనేది చాలాసురక్షితమైన ప్రక్రియ అనితేలింది. ఈ నేపథ్యంలోసమాజంలో ఈ చికిత్సపై ఉన్న అపోహలు తొలగించుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.ఈసీటీతో ఏయే సమస్యలుఉన్నవారికి చికిత్స అందిస్తారంటే...తీవ్రమైన వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు ఉన్నవారికి. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా అనుకుంటున్నవారికీ, ఆత్మహత్యలకు ప్రయత్నించేవారికీ (సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవారికీ) ఆహారాన్ని తిరస్కరించేవారికి. బైపోలార్ డిప్రెషన్ ఉన్న బాధితులకు మందులతో పైన పేర్కొన్న వ్యాధులు నయంకాని సందర్భాల్లో... స్కీజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి. కెటటోనియా అనే మానసిక సమస్యలో (ఈ పరిస్థితిలో బాధితులు పూర్తిగా ఓ శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ స్థితి అనేక మానసిక వ్యాధుల కారణంగా కలుగుతుంది. కెటటోనియా స్థితి నుంచి బాధితులను మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్థెరపీ బాగా ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో కాస్త ముతకగా... ఆ తర్వాతమెరుగ్గాతొలినాళ్లలో బాధితులకు మత్తు మందు ఇవ్వకుండానే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ)ని ఇచ్చేవారు. దాంతో బాధితుల్లో మూర్చలు కలిగినప్పుడు వారికి గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావడం, ఎముకలు గాడితప్పడం (డిస్ లొకేట్ కావడం), ముఖ్యంగా దవడ ఎముక (జా డిజ్లొకేషన్) వంటివి ఎక్కువగా కనిపించేవి. అయితే తొలిసారిగా 1940లో బెనెట్ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స ఇవ్వడం వల్ల పైన పేర్కొన్న సమస్యలేవీ రావనీ, దాంతో కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ఇతరత్రా సమస్యలేమీ లేకుండా చాలా సురక్షితంగా ఈ చికిత్సను అందించడం సాధ్యమేనని కనుగొన్నాడు.ఈసీటీపై అపోహలూ వాస్తవాలు అపోహ:ఈసీటీ ప్రక్రియ మెదడును గాయపరుస్తుంది. వాస్తవం : ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రాగానీ ఎలాంటి గాయాలూ కావనీ, మెదడులో ఏ రకమైన ప్రమాదకరమైన మార్పులూ కలగవంటూ అనేక పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. అపోహ:ఈసీటీ వల్ల మతిమరపు వస్తుంది.వాస్తవం : ఈసీటీ వల్ల బాధితుల జ్ఞాపపశక్తిపై దాదాపుగా ఎలాంటి ప్రభావమూ పడదని చెప్పవచ్చు. ఒకవేళ పడినా అది చాలా చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే ముందు తాత్కాలికంగా ఇచ్చే మందు మోతాదు కూడా చాలా తక్కువ. అయితే ఈ మత్తు నుంచి బయటకు వచ్చే ముందర బాధితుల్లో కాస్త అయోమయ స్థితి కనిపించవచ్చు. ఇదే ఇలాంటి దురభిప్రాయానికి కారణమవుతోంది. అంతేతప్ప జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గదు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ అది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మాత్రమే. ఈసీటీ వల్ల శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. అపోహ: ఈసీటీ వల్ల మెదడులోనికి ఒక్కోసారి ప్రమాదకరమైన రీతిలో కరెంట్ ప్రవహించవచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అత్యాధునిక పరికరాల వల్ల కరెంట్ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా సురక్షితం. దాంతో ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం ప్రక్రియ అని చెప్పవచ్చు. పైగా ఈసీటీలకు వాడే వోల్టేజీ కూడా చాలా తక్కువ. అపోహ: ఈసీటీకి వల్ల మెదడు దెబ్బతిని కొన్ని మానసిక వ్యాధులు రావచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. ఈసీటీతో కొన్ని మానసిక సమస్యలు తగ్గడమే తప్ప కొత్తగా ఎలాంటి మానసిక వ్యాధులూ రావని స్పష్టంగా చెప్పవచ్చు. అపోహ: కరెంట్ షాక్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఎలక్ట్రో కన్వల్సివ్ ట్రీట్మెంట్లో ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) వల్ల ఇతరత్రా శస్త్రచికిత్సలో ఉండే రిస్క్ మాత్రమే ఇందులోనూ ఉంటుంది. అంతేతప్ప ఇందులో ఎలాంటి అదనపు ముప్పూ ఉండదు. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ఇతరత్రా జబ్బుల్లో ఇచ్చినప్పుడు చూసినట్టుగానే బాధితులకు దాన్ని తట్టుకునే ఫిట్నెస్ ఉందే లేదో చూసుకోవాలి. గుండెజబ్బులు, ఇతర శారీరక సమస్యలు ఉన్నాయేమో గమనించాలి. అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్ ఆక్సీమీటర్ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిసూ ఉంటే ఇరత శరీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.ఈసీటీ ఇవ్వడం ఎప్పుడు సరికాదంటే...నిజానికి కొన్ని రకాల సమస్యలు ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు... ఒకవేళ అవి ఈసీటీ ఇవ్వడం వల్ల తగ్గేవైతే... అలాంటి సందర్భాల్లో మందులు మార్చి చూడటం కంటే ఈసీటీతోనే మంచి ఫలితాలు ఉంటాయంటూ వైద్యపరిశోధకులు, వైద్యులు గుర్తించారు. అయితే ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియే అయినప్పటికీ ఈ చికిత్సకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటంటే... మెదడులో సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు. ఇటీవల ట్రాన్స్క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులైజేషన్ అనే ప్రక్రియ వల్ల కూడా ఈసీటీతో ఉండే ప్రయోజనాలే కలుగుతాయని కొత్త పరిశోధనలతో తేలింది. కాబట్టి ఇదే ఈసీటీనే ఇంకాస్త అధునాతంగా ఇవ్వడంపై కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వైహెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
చిరుధాన్యాలను ఎలా విత్తుకుంటే మేలు...?
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)లో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తుకోవటానికి అనువైన 11 రకాల చిరుధాన్యాల విత్తనాలను విక్రయిస్తు న్నారు. జొన్నలు, పచ్చజొన్నలు ఎకరానికి 3 కిలోలు విత్తుకోవాలి. ఇతర చిరుధాన్యాలన్నీ ఎకరానికి 2 కిలోలు సరిపోతాయని, ఎకరానికి సరిపోయే విత్తనంతో బ్యాగ్లను సిద్ధం చేశామని ఐఐఎంఆర్ విత్తన విభాగం సాంకేతిక అధికారి రఘునాద్ కులకర్ణి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. వరుసలుగా విత్తుకుంటే మేలు: చిరుధాన్య పంటలను వెదజల్లటం కాకుండా వరుసలుగా విత్తుకోవటం మేలు. కూలీలతో కలుపు తీయిస్తే రైతుకు మిగిలేదేమీ ఉండదు. వరుసలుగా విత్తుకుంటే యంత్రాలతో అంతరసేద్యం చేస్తూ కలుపును నిర్మూలించుకోవచ్చు. సాధారణంగా వరుసల మధ్య 22.5 సెం.మీ. దూరం పెడతారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న వీడర్ యంత్రాల వెడల్పును బట్టి సాళ మధ్య దూరాన్ని నిర్ణయించుకోవచ్చు. అవసరాన్ని బట్టి 30 సెం.మీ. / 40 సెం.మీ. / 45 సెం.మీ. వరకు కూడా సాళ్ల మధ్య దూరం పెట్టుకోవచ్చని రఘునాద్ వివరించారు. ఇదీ చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది∙జొన్న (దేశీ రకం/ హైబ్రిడ్), పచ్చజొన్న, పచ్చిగడ్డి కోసం పెంచే జొన్న ఎకరానికి 3 కిలోలు విత్తుకోవాలి. ∙సజ్జ, రాగు (కెఎంఆర్ 301), కొర్ర (సూర్యనంది), సామ (సిఎల్ఎంవి1), ఊద (డిహెచ్బిఎం93–3), వరిగ (టిఎన్ఎయు 202), అరిక (సికెఎంవి2), అండుకొర్ర (హెచ్బిఆర్2)లను ఎకరానికి 2 కిలోలు విత్తుకోవాలి. ఈ విత్తనాలు ఐఐఎంఆర్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు స్వయంగా వచ్చి కొనుక్కెళ్లాలి. ఇతర వివరాలకు.. 040–24599305. చదవండి: కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’చిరుధాన్యాల విత్తనాలు దొరికే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు: నంద్యాల (99896 25208), పెరుమామళ్లపల్లి (87906 38715)పాలెం (97050 69580)లలోని కూడా కొన్ని రకాల చిరుధాన్య పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయి.ఐఐఎంఆర్లో 11 రకాల చిరుధాన్యాల విత్తనాలు సిద్ధం -
ఇదేం ఫ్యాషన్..? ఏకంగా దుప్పటినే లెహంగాలా..
‘ఫ్యాషన్ అనేది ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి కాదు మన ఊహాల నుంచి మొదలవుతుంది’ అంటారు. సిమ్రాన్ క్రియేటివిటీని చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ ఆనంద్ ఇరవై కిలోల బెడ్ షీట్ను ఆకట్టుకునే లెహంగాగా మార్చి ఔరా..! అనిపించుకుంది. చక్కటి ఎంబ్రాయిడిరీతో అందంగా ఉన్న ఈ బెడ్షీట్ని ఇలా కూడా ఉపయోగించొచ్చు అనే ట్రెండ్కి తెరతీసింది. అదేనండి మనసుంటే మార్గం ఉంటుంది. అన్నట్లుగా ఈ అమ్మడు తన సృజనాత్మకతకు పదునుపెట్టి మరీ మనకు సరికొత్త ఫ్యాషన్ని పరిచేయం చేసింది సిమ్రాన్‘ఔట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్’ కాప్షన్తో ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సిమ్రాన్.‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘బెడ్ షీట్లలో నాకు ఫ్యాషన్ కనిపించింది’ ‘లెహంగాగా మార్చడం ద్వారా దుప్పట్లకు సెకండ్ లైఫ్ కూడా ఇవ్వవచ్చు’ అంటుంది సిమ్రాన్. ఇక నెటిజనుల స్పందన విషయానికి వస్తే... ‘దుప్పటితో లేహంగా ఏమిటీ!’ అనే వెక్కిరింపుల కంటే.. ‘క్రియేటివ్ ఐడియా’ అనే ప్రశంసలే ఎక్కువగా కనిపించాయి. View this post on Instagram A post shared by Simran Anand (@simrananand21) (చదవండి: ‘పేరెంట్ షాలా’: పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!) -
కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’
కేరళలోని వయనాడ్ జిల్లా అంబలవాయల్కు చెందిన అజి థామస్ (AjiThomas) కూరగాయలు, అరటి, రబ్బరుతో పాటు వరిని పండిస్తారు. రైతులు తగిన ఆదాయం లేక వరి సాగు మానుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో బయో స్లర్రీతో వరి విత్తనాల ‘పెల్లెటైజేషన్’ (pelleting technique ) పద్ధతిని ఆయన అభివృద్ధి చేశారు. విత్తనం చుట్లూ మట్టిని లేపనం చేస్తే వాటిని విత్తన గుళికలు అనొచ్చు. ఇది అలా కాదు. నాలుగు పలకలుగా ఉండే పేడ తదితర పోషకాలతో కూడిన బిళ్లలో వరి విత్తనం పెంచి, నాట్లేస్తారు. కాబట్టి ‘విత్తన బిళ్లలు’ అని చెప్పుకుందాం. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి బయో స్లర్రీలోని సూక్ష్మజీవులు పొలం మట్టిలోని పోషకాలను విచ్ఛిన్నం చేసి వరి మొక్కలకు అందించటంతో రెట్టింపు దిగుబడి వస్తున్నదని వారు తెలిపారు. ఈ పద్ధతిలో హెక్టారుకు 5.5–6 టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, వయనాడ్ ప్రాంతంలో సాధారణ పద్ధతిలో వచ్చే ధాన్యం దిగుబడితో పోల్చితే రెట్టింపని థామస్ తెలిపారు. కూలీల ఖర్చు 25 శాతానికి తగ్గింది. ప్రతి కుదురుకు 50–60 పిలకలు వస్తున్నాయి. కంకి పొడవు పెరిగింది. ఎకరానికి వరి విత్తనాల అవసరం 30–50 కిలోల నుంచి 2.5–5 కిలోలకు తగ్గింది. పంట 15–20 రోజులు ముందే కోతకు వస్తోందని అజి థామస్ తెలిపారు. ఇదీ చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీవిత్తన బిళ్లల తయారీ ఖర్చు ఎంత?హెక్టారుకు సరిపడా వరి విత్తన బిళ్లల తయారీకి 12–14 కిలోల బయో–స్లర్రీ అవసరం. దీనికి హెక్టారుకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇది సాధారణ రసాయనిక సాగు పద్ధతిలో ఎరువులు, ఇతర ఉత్పాదకాల సగటు ఖర్చు కంటే రెట్టింపు. అయినప్పటికీ, కూలీల అవసరం/ఖర్చు, విత్తనాల ఖర్చు తగ్గి ధాన్యం దిగుబడి రెట్టింపు కావటంతో ఈ పద్ధతిలో వరి సాగు లాభదాయకంగా మారిందని థామస్ వివరించారు.ఇదీ చదవండి: ‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా! ప్రభుత్వ ప్రోత్సాహంకేరళ ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. దీంతో, ఈ పద్ధతి కేరళలో రైతుల ఆదరణ పొందుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అజి థామస్ చెబుతున్నారు. ‘విత్తన బిళ్ల’ అంటే? తయారీ ఎలా?వరి విత్తనాలను ట్రేలలోని చిన్న చిన్న చతురస్త్రాకారపు గదుల్లో బయో స్లర్రీని నింపి, అందులో వరి విత్తనం పెట్టి, మొలకెత్తిస్తారు. ఆ తర్వాత పొలంలో నాట్లు వేసే పద్ధతి ఇది. ఆవుపేడ, పులియబెట్టిన ఆకుల ద్రావణం, పంచగవ్య, ద్రవ జీవామృతంతో పాటు సూడోమోనాస్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులు కలిపి బయో–స్లర్రీ మిశ్రమాన్ని తయారు చేస్తారు. బల్ల మీద ఉంచిన స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలో లేదా సాధారణ బోలు రబ్బరు మ్యాట్లో 1–1.5 అంగుళాల లోతు/పొడవు/వెడల్పుతో నలుచదరంగా ఉండే గుంతల్లో బయో స్లర్రీని పోసి, అందులో వరి విత్తనాలను గుచ్చుతారు. ఒక రోజులో ఆ స్లర్రీ గట్టిపడి విత్తన బిళ్లలు తయారవుతాయి. ఆ తర్వాత ట్రే నుంచి విత్తనంతో కూడిన ఆ బిళ్లలను బయటకు తీసి 12 గంటలు ఎండబెడతారు. ఆ తర్వాత వాటిపై నీరు చిలకరిస్తారు. 3 రోజుల్లో వరి మొలకలు బయటకు వచ్చి, తగినంత ఎత్తు పెరిగిన తర్వాత, ఆ బిళ్లతో కూడిన వరి నారును దమ్ము చేసిన పొలాల్లో మనుషులతో వరుసలుగా నాటుతారు. వరుసల మధ్య 25 సెం.మీ. (పది అంగుళాలు) దూరం పెడుతున్నారు. ఎకరానికి ఇట్లాంటి వరి నారు బిళ్లలు 64 వేలు అవసరమవుతాయి. ఇదే ప్యాడీ సీడ్ పెల్లెటైజేషన్ పద్ధతిచదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది -
‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా!
చెద పురుగులు (termites) ఇళ్లలోనే కాదు, పంట పొలాల్లో కూడా సమస్యలు సృష్టిస్తుంటాయి. పంటలను ఆశిస్తూ 10 నుంచి 50% వరకు దిగుబడి నష్టం కలిగిస్తుంటాయి. రైతులు సాధారణంగా రసాయనాలు చల్లి పంట పొలాల్లో చెదలును నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, రసాయనాలతో పని లేకుండా సులభంగా, స్వల్ప ఖర్చుతో చెదలు సమస్యకు పరిష్కారాన్ని వెదకటంలో ఓ వృద్ధ మహిళా రైతు అసాధారణమైన విజయం సాధించారు. యూకలిప్టస్ కొమ్మలు/కట్టె ముక్కలను పొలంలోని పంటల సాళ్ల మధ్య ఉంచితే, చెద పురుగులు పక్కనే ఉన్న పంటల జోలికి వెళ్లకుండా యూకలిప్టస్ కొమ్మలనే ఆశిస్తున్నాయని ఆమె కనుగొన్నారు. సజ్జ నుంచి గోధుమ వరకు..గోధుమ చేనులో 12“12 మీటర్ల దూరంలో ఎకరానికి 32 చొప్పున స్ప్రింక్లరు ఉంటాయి. ప్రతి స్ప్రింక్లర్కు దగ్గర్లో ఒక యూకలిప్టస్ కట్టె ముక్క/ కొమ్మను ఆమె పెట్టారు. ఒక్క గోధుమ మొక్కను కూడా చెదలు ఆశించలేదు. ఒక్కో కట్టె ముక్కను వేలకొద్దీ చెద పురుగులు చుట్టుముట్టాయి. అంటే పంట వైపు నుంచి ఈ యూకలిప్టస్ కట్టెలు చెదపురుగుల దృష్టిని వంద శాతం మళ్లించాయన్న మాట. ఎకరానికి ఖర్చు కేవలం రూ. 320లు. ఈ కట్టెలను ప్రతి పంట కాలానికీ కొత్తవి వేయాల్సిన అవసరం లేదు. మూడు పంటల వరకు అవే సరిపోతున్నాయని ఆమె తెలిపారు.వ్యవసాయ విశ్వవిద్యాలయ గుర్తింపుభగవతి దేవి ఈ విషయాన్ని ఫతేపూర్ షెఖావతిలోని కేవీకే శాస్త్రవేత్తల చెప్పారు. వరుసగా నాలుగేళ్ల పాటు అనేక పంటల్లో ప్రయోగం చేసి సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. బికనెర్లోని రాజస్థాన్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీ పంటలోనూ అద్భుత ఫలితాలు రావటంతో, రైతులందరికీ ఇది అనుసరించమని చెబుతున్నారు. తళుక్కుమన్న ఉపాయంపనులు చేస్తూనే అసాధారణంగా ఉన్న విషయాలను గమనిస్తూ ఉండటం భగవతి దేవికి అలవాటు. వంట కలపను ఇంటికి తెచ్చి పొయ్యిలో పెడుతున్న ఒక సందర్భంలో ఆమె దృష్టిని యూకలిప్టస్ కర్రలు ఆకర్షించాయి. యూకలిప్టస్ కర్ర ముక్కల పైకి మిగతా కర్రల కంటే చాలా ఎక్కువ చెదపురుగులు చేరుతున్నట్లు ఆమె గుర్తించారు. ఈ గ్రహింపు కలిగిన మరుక్షణమే ఆమె మదిలో ఒక కొత్త ఉపాయం తళుక్కున మెరిసింది. ఆలోచన వచ్చిందే తడవుగా అప్పుడు సాగులో ఉన్న సజ్జ పంటలో అమలు చేసింది. 2 నుంచి 3 అడుగుల పొడవు, 2 నుంచి 3 అంగుళాల లావు ఉన్న యూకలిప్టస్ కర్ర ముక్కలను తీసుకొని, సజ్జ పొలం అంతటా సాళ్ల మధ్యలో పెట్టింది. ఆమె అనుకున్నట్లుగానే, ఆ కర్ర ముక్కల చుట్టూ వేలకొలది చెద పురుగులు చేరి, కర్రలను కొరికి తినటం ప్రారంభించాయి. ఆశ్చర్యమేమిటంటే.. చెద పురుగులు ఇక సజ్జ మొక్కల జోలికి పోలేదు. యూకలిప్టస్ కర్ర ముక్క నుంచి 4 అంగుళాల దూరంలో ఉన్న సజ్జ మొక్కలను కూడా అవి ఆశించలేదు. అంతే. భగవతి దేవి మొహం ఆనందంతో వెలిగిపోయింది. జఠిలమైన చెదలుకు ప్రకృతిసిద్ధమైన పరిష్కారాన్ని కనుగొన్న రాజస్థాన్ వృద్ధ మహిళా రైతు యూకలిప్టస్ కర్ర ముక్కలను పొలంలో ఉంచటం ద్వారా.. చెద పురుగులు పంటలను పాడు చెయ్యకుండా కాపాడుతున్నారు. -
ఇది సఫ(బ)ల తెలంగాణ
మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. అలాంటి మహిళకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని కేబినెట్ బెర్త్ల దాకా అడుగడుగునా అన్యాయమే. కానీ 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఆడబిడ్డల మోములపై నవ్వులు చిందుతుండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయనుకున్న యువత, ముఖ్యంగా మహిళల ఆశలు అడియాసలే అయ్యాయి. బీఆర్ఎస్ మొదటి కేబినెట్లో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అతివలను అతి ఘోరంగా అవమానించింది. ఇతర పదవులూ ఇవ్వలేదు. కానీ... కాంగ్రెస్ సర్కారు మహిళలకు పెద్దపీట వేసింది. కేబినెట్లోకి ఆదివాసీ బిడ్డ ధనసరి సీతక్కను, బీసీ బిడ్డ కొండా సురేఖను తీసుకున్నది. అలాగే, ‘తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’, ‘తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్’ల చైర్మన్లుగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలిగా అతివలకు అవకాశం కల్పించింది. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతివల ఇంటి కష్టాలను తీర్చుతున్నది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించింది. దీంతో మహిళలకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. దీంతోపాటు ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందజేస్తున్నది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడమే కాదు... ఆ బస్సులకు వారినే ఓనర్లను చేసే మరో మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించింది. మరో 450 బస్సులను కూడా అద్దెకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదీ చదవండి: World Bicycle Day 2025 డయాబెటిస్కు, ఊబకాయానికి చెక్మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసింది. ఈ బజార్లు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్ను అందిస్తాయి. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతున్నది. అలాగే, మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 196 ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లు మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నాయి. మహిళలంతా ఒకేచోట చేరి తమ పురోగతికి ప్రణాళికలు రచించుకునేలా 22 ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను నిర్మించింది. ఇవి మహిళలకు కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మహిళలకు ‘మీ సేవా’ కేంద్రాలను అప్పగించి, వారికి ఉపాధి కల్పిస్తున్నది. డైరీ సహకార రంగంలో 40 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఆర్థిక భద్రతకు భరోసానిస్తున్నది. ఇలా నేటి ప్రభుత్వం మహిళా సాధికారతకు పాటుపడటంతో పాటు ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కో పువ్వేసి బతుకమ్మను పేర్చినట్టు పునర్నిర్మిస్తున్నది. -ఇందిరా శోభన్కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు -
పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!
ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడం ఒక ఛాలెంజింగ్గా మారిందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, లైఫ్ స్టైల్ ఇందుకు ముఖ్య కారణాలని ప్రముఖ మనస్తత్వవేత్త సుదీర్ సండ్రా తెలిపారు. సుధీర్ ఆధ్వర్యంలో నగరంలోని శిల్పకళా వేదికగా నిర్వహించిన సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్లో 1,300 మందికి పైగా తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఉపయోగపడే అధునాతన యాప్ ‘పేరెంట్ షాలా’ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు చిన్నారులకు సరైన గైడెన్స్ ఇచ్చే వేదిక కోసం వెతుకుతున్నారని, దీనికి అనువైన వేదిక ‘పేరెంట్ షాలా’ అని పేర్కొన్నారు. వారికి ఇదొక మెంటార్ లా సాయపడుతుందని చెప్పారు. నిపుణుల మార్గదర్శకత్వంతో పాటు కమ్యూనిటీ పరంగా సహాయం అందిస్తుందని, భారతీయ సంప్రదాయాలకు, ఆధునిక పేరెంటింగ్ పద్ధతులను జతచేసి అనుబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకుండా చిన్నారుల దృష్టిని మళ్లిస్తుందని, అలాగే తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇదే వేదికపై సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్లో భాగంగా నలుగురు మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత స్టోరీ టెల్లర్ రమా రావి, డాక్టర్ ఇప్పలపల్లి రమేశ్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ (ఎన్హెచ్ఏ) డైరెక్టర్ మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్) -
World Bicycle Day 2025 డయాబెటిస్కు, ఊబకాయానికి చెక్
World Bicycle Day 2025 నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో అందరికీ అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన వాహనం సైకిల్. ఒకప్పుడు సైకిల్ ఉందంటే ధనిక కుటుంబంగా భావించే పరిస్థితి. పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్ళాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా సైకిల్నే వాడేవారు. కొత్తగా పెళ్లయిన జంటలు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, స్నేహితులు ఇలా ఎంతోమంది సరదాగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే సైకిలే ఆధునిక ప్రయాణ సాధనం. అటువంటి సైకిల్ కొంతకాలంగా తన ప్రభావాన్నీ, ప్రాధాన్యాన్నీ కోల్పోతోంది. మోటార్ సైకిళ్ళు, కార్లు వంటి వాహనాలు సైకిళ్ల స్థానాన్ని ఆక్రమించాయి. అయితే నార్డిక్ దేశాల్లో నేటికీ రవాణా సాధనంగా సైకిల్కి అత్యంత ప్రాధాన్యం ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్మోటారు వాహనాల వాడకం కాలుష్య కారకం కాబట్టి సైకిల్ను వాడాలని స్వీడన్ ప్రజల్లో చైతన్యం తెచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన ‘అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం’ జరిపే విధంగా ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా 2018 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ ఏడాది ‘సైకిల్ ద్వారా ఆరోగ్యం, సమానత్వం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం’ అనే థీమ్ను ఎన్నుకున్నారు. చదవండి: World Bicycle Day: మొదటి వాహనముకు వందనం!నేడు సైకిల్ వాడకంలో ప్రపంచంలోనే ముందున్న దేశం ‘నెదర్లాండ్స్’. సైకిల్ తొక్కడం ఓ మంచి వ్యాయామం. కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా మోటార్ సైకిళ్ళు, కార్లు వినియోగించడం సరికాదు. నడవడమో లేక సైకిల్పై వెళ్లిరావడమో అలవాటు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ‘సైకిల్ ట్రాక్’లు ఏర్పాటు చేయాలి. ‘సైక్లింగ్‘ ఒక ఫ్యాషన్గా మారాలి. ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు పరిష్కారానికీ; ఊపిరితిత్తుల ఆరోగ్యానికీ, మంచి నిద్రకీ, అధిక రక్తపోటు నియంత్రణకూ సైకిల్ తొక్కడం మంచి తరుణోపాయం. – ఐ.ప్రసాదరావు, ఉపాధ్యాయుడు, కాకినాడ.(నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం) -
చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్
ఇప్పుడంటే మోటారు సైకిల్, కార్లు సర్వసాధారణం అయ్యాయిగాని.. ఒక జనరేషన్ వెనక్కి వెళితే సైకిల్ అనేది స్టేటస్ సింబల్గా ఉండేది. ఊర్లో అక్కడక్కడా కనిపించేవి. పెళ్లిళ్లలో మగ పెళ్లివారు సైకిల్ బహుమానంగా ఇవ్వాల్సిందేనని అడిగి మరీ తీసుకునేవారు. ఆ పరిస్థితుల నుంచి మధ్యలో కొంత కాలం విరామం వచ్చింది. ప్రస్తుతం మళ్లీ సైకిల్కు క్రేజ్ పెరుగుతోంది. ఆరోగ్యం, శారీరక వ్యాయామం, ఒత్తిడి నుంచి రిలాక్సేషన్, కాలుష్య నివారణ, పెట్రోల్ వినియోగం తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించిన పట్టణ యువత తిరిగి సైక్లింగ్ వైపు మొగ్గుచూపుతోంది. జూన్ 3 ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. ఆకారంలో మార్పు.. ధరల్లో వ్యత్యాసం..సైకిల్ తయారు చేసిన తొలినాళ్లలో దాని ఆకారం ఇప్పుడున్నట్లు లేదు. ముందు చక్రం పెద్దదిగాను, వెనుక చక్రం చిన్నదిగాను ఉండేది. కాలక్రమేణా దాని రూపం మారుతూ వచ్చింది. సైకిల్ ధర అప్పట్లో రూ.వందల్లో ఉండేది. ప్రస్తుతం మోడల్ బట్టి వేలల్లో అమ్మకాలు చేస్తున్నారు. 1980లో సుమారు రూ.500 నుంచి రూ.800 మధ్యలో లభించేది. అది కాస్త 2000 సంవత్సరం వచ్చే సరికి సుమారుగా రూ.3 వేల నుంచి రూ.4500 వరకూ పెరిగింది. ప్రస్తుతం పాత తరం వినియోగించే మోడల్స్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1950 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు సైకిల్ విరివిగా వినియోగించేవారు. హెర్క్యులస్, హీరో, అట్లాస్ వంటి సైకిల్ కంపెనీలు భారత దేశంలో గుర్తింపు పొందిన కంపెనీలు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు దీని వినియోగానికి విరామం ఏర్పడింది. అనంతరం కొత్త మోడళ్ల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యులు తొక్కే సైకిల్ ప్రారంభ ధర రూ.5 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు సుమారు రూ.3 వేల నుంచి రూ.పది వేలకుపైబడిన ధరల్లో అమ్ముడుపోతున్నాయి. చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, సైక్లింగ్ చేసేవాళ్లు, ఇలా వేర్వేరు కేటగిరీలు, విభిన్నమైన మోడళ్లలో సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఉపయోగాలు.. సైకిల్ తొక్కువడం వల్ల ఆరోగ్య పరంగా, పర్యావరణ పరంగానూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు అన్నిటికంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాన్సర్, మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఒత్తిడి, దీర్ఘకాలిక రోగాలకు సైక్లింగ్తో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నగరవాసులు బిజీ లైఫ్లో ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు, ఇతర రంగాల వారికి తమతమ పనుల్లో శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మోటారు సైకిళ్లు, కార్లకు బదులుగా సైకిళ్లను వినియోగిస్తే కాలుష్య నివారణతో పాటు, ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. నగరంలో సైక్లింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఓఆర్ఆర్, కేబీఆర్ పార్క్, తదితర ప్రదేశాల్లో సైకిల్ ట్రాక్స్ నిర్మించింది. దేశంలో సైకిల్ చరిత్ర ఇలా.. భారత దేశంలో 1890ల్లో యూరోపియన్ దేశస్తులు సైకిల్ తొక్కడం ప్రారంభించారు. ఉన్నత, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు స్టేటస్ సింబల్గా వినియోగించేవారు. 1920–1935 మధ్య కాలంలో ప్రపంచ సైకిల్ యాత్రలు ప్రారంభమ్యాయి. బ్రిటిష్, నవాబుల పరిపాలనలో సమాచార సరఫరా, తపాలా, పోలీసులు, సైన్యం సైతం వివిధ అవసరాలకు సైకిళ్లనే వినియోగించేవారు. తొలి నాళ్లలో కార్మికులు హెర్క్యులస్ సైకిళ్లు వినియోగిస్తే.. ఉన్నత వర్గాలు రాలీ, జేమ్స్ సైకిళ్లను వినియోగించేవారట. ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది.. సైక్లింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది. వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులంతా కలసి సైక్లింగ్ చేస్తాం. ఫలితంగా రొటీన్ లైఫ్కు భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ లభిస్తుంది. కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించవచ్చు. – నేహ, మణికొండ పర్సనల్ టైం సైక్లింగ్.. తొమ్మిదేళ్ల నుంచి సైక్లింగ్ చేస్తున్నాను. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకూ సైక్లింగ్ చేస్తాం. ఇంటికి చేరుకుని కుటుంబం, పిల్లలు ఇతర పనుల్లో బిజీ అయిపోతాం. నాకంటూ దొరికే పర్సనల్ టైం సైక్లింగ్. ఔట్ సైడ్ నేచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. 70 కిలోమీటర్ల వరకూ వెళ్తుంటాను. 500 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలన్నది నా లక్ష్యం. 35 మంది మహిళలు కలిసి వెళ్తుంటాం. అంతా మంచి మిత్రులైపోయాం. – వందన లోకేష్ యుగంధర్, మణికొండ (చదవండి: womens safety: ఆపదలో అండగా...!ఈ స్మార్ట్ డివైజ్తో భద్రంగా ఉండొచ్చు..) -
ఉమెన్ సేఫ్టీ: ఆపదలో అండగా..!
బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైసూర్కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కరణ్ సరికొత్త పరికరాన్ని తయారుచేశాడు. ఐజీడబ్ల్యూఎస్(ఇన్నోవేటివ్ ఇంటెలిజెంట్ జీయోఫెన్స్–ఎనేబుల్డ్ వేరుబుల్స్ సిస్టమ్స్) అనే పరికరం మహిళలు ఆపదలో ఉంటే వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ను ఎలార్ట్ చేస్తుంది.‘డివైజ్లోని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి...జియోఫెన్స్–బేస్డ్ డిటెక్టర్. ఒక మహిళని ఎవరైనా మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాలో అవుతున్నప్పుడు ఈ డివైజ్ సందేహాస్పద వ్యక్తి మొబైల్ ఫోన్ను గాని, బ్లూటూత్ డివైజ్ అడ్రస్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది’ అంటున్నాడు కరణ్.ఈ డివైజ్లో జియోఫెన్స్–బేస్డ్ సేఫ్టీ టైమర్ కూడా ఉంటుంది. యూజర్ ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి షాపింగ్కు వెళ్తూ 30 నిమిషాలలో ఇంటికి వస్తానని చెబితే సిస్టమ్ ఆమె జియోలోకేషన్ని మానిటర్ చేస్తుంది. సెట్ చేసిన టైమ్ లోపు ఇంటి జియోఫెన్స్లోకి రాకపోతే డివైజ్ ఆటోమెటిక్గా ఆమె లోకేషన్ని ఎమర్జెనీ కాంటాక్ట్కి పంపిస్తుంది. డివైజ్లో ‘రిటర్న్ హోమ్ సేఫ్టీ రిమైండర్’ కూడా ఉంటుంది. డివైజ్లో మరో సేఫ్టీ ఫీచర్...డేంజర్–జోన్ నోటీఫైయర్. ఇది హై–రిస్క్ జీపీఎస్ లొకేషన్స్ ప్రీలోడెడ్ జాబితాను ఉపయోగిస్తుంది. యూజర్ ఈ ప్రాంతాలలోకి వెళ్లినప్పుడు వేరబుల్ బజర్ యాక్టివేట్ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్కి తెలియజేస్తుంది. (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
World Bicycle Day: మొదటి వాహనముకు వందనం!
రాజైనా రైతైనా.. కొడుకైనా కూతురైనా కలెక్టరైనా బంట్రోతైనా.. ఊరైనా పట్నమైనా మనిషికి ప్రాప్తమయ్యే మొదటి వాహనం సైకిల్. దోగాడే వయసులో ట్రై సైకిల్ తొక్కిబైస్కిల్కు ఎదగడమే చేయాల్సింది. ఇక అక్కడి నుంచి ఎక్కడికి చేరినా జీవితాన్ని బేలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగమని చెబుతుంది సైకిల్. ప్రతి ఒక్కరి బాల్యంలో సైకిల్ విడదీయరానిది. ఆ మాటకొస్తే సైకిల్లోని ప్రతి పార్ట్ జీవన సందేశాన్ని వినిపిస్తుంది. అసలు సైకిల్ని ఇష్టపడని వారెవరు?సైకిల్! ట్రింగ్ ట్రింగ్మని బెల్లు కొడుతూ జ్ఞాపకాలు కమ్ముకుంటున్నాయా? చిన్నప్పుడు ఎవరిదో ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేసి ఉంటే కింద కూచుని పెడల్ తిప్పుతూ వెనుక చక్రం గిర్రున తిరుగుతుంటే చూసిన జ్ఞాపకం. ముందు చక్రంలో వెనుక చక్రంలో స్పోక్స్ మధ్యన ఉండే ఇంధ్రధనువు రంగుల కుచ్చు గుబ్బలను ఆసక్తిగా చూసిన జ్ఞాపకం. వెనుక సీటుకు డైనమో ఉంటుంది. అది ఆన్ చేస్తే బ్యాక్ టైర్కు అంటుకుంటుంది. టైరు తిరిగే కొద్దీ డైనమో నుంచి కరెంటు జనరేట్ అయ్యి ముందున్న బల్బు వెలుగుతుంది. ఆ రోజుల్లో రాత్రుళ్లలో లైటు వెలిగే సైకిల్ తొక్కేవాడు గొప్ప.అవును. సైకిల్ తొక్కడం గొప్పే. ఎంతమంది దగ్గర ఉండేదని. ఒకవేళ ఉన్నా అందులో అంతరం. ర్యాలీ, హంబర్ సైకిళ్లు ఉన్నవారు శ్రీమంతులు, హీరో సైకిల్ ఉన్నవారు మధ్య తరగతి వారు, అట్లాస్ అంటే ఇక పేదవాళ్లు కొని తెగ తొక్కడమే. ఆ తర్వాత బి.ఎస్.ఏ సైకిళ్లు వచ్చాయి. వాళ్లు తెచ్చిన లేడీస్ సైకిళ్లు ఆడపిల్లలను వాటిపై కూచోబెట్టి నేరుగా స్కూళ్లకు కాలేజీలకు పంపాయి. చిన్న పట్టణాల్లో సాయంత్రాలు సైకిల్ తొక్కుతూ వెళ్లే ఆడపిల్లలకు ఉండే క్రేజ్ సామాన్యం కాదు. మగాడికి ‘మగాడు’ అనిపించుకునే సవాళ్లు సమాజం పెడుతూ ఉంటుంది. ఆ సవాళ్లలో ఒకటి సైకిల్ తొక్కడం నేర్చుకోవడం. ఏడు, ఎనిమిది తరగతులకు రావడంతోటే ఊళ్లలో పల్లెల్లో పిల్లలు సైకిల్ నేర్చుకుని ఉండాల్సింది. ‘ఏంటి.. మీవాడికి ఇంకా సైకిల్ తొక్కడం రాదా’ అనంటే అవమాన పడిపోయే తండ్రులు ఉండేవారు. కొడుకు తిట్లతో రెచ్చగొట్టి ‘సైకిల్ తొక్కుతావా లేదా’ లేదా అని ఎక్కించి వెనుక పరిగెత్తుతూ నేర్పించేవారు. ఆ రోజుల్లో పిల్లలు తొక్కే సైకిళ్లు ఎక్కడివని? అన్నీ పెద్దలు తొక్కేవే. అందుకే పిల్లలు మొదట ఆఫ్ పెడల్ తొక్కి, ఆ తర్వాత ఫ్రంట్ బార్ మీద కూచుని తొక్కి, కాళ్లందే ఎత్తు పెరిగాక సీటు మీద కూచుని తొక్కేవారు.సైకిల్ తొక్కడం అంత వీజీ కాదు. ఆ రోజుల్లో ప్రతి సైకిలూ తన యజమానిని సొంత ఊరి చెరువు నీళ్లు గటగటా తాగించేది. ఒక సైకిలుకు బ్రేకులు పడవు. ఒక సైకిల్కు పెడళ్లు ఊడిపోతాయి. ఒక సైకిల్కు చైను లూజు. మరో సైకిలుకు స్టాండ్ పడదు. స్టాండ్ వేసి జరగ్గానే ధబేలున పడుతుంది. ఒక సైకిలుకైతే సీటు అట్టగట్టుకుని పోయి కూచుంటే ముళ్ల మీద కూచున్నట్టు ఉంటుంది. ఒక సైకిలు సైడుకు లాగుతూ ఉంటుంది. ఒక సైకిలుకు హ్యాండిలు వంకర. ఇక పంక్చర్లు వేసి వేసి లోపల టైరు బ్యారుమన్నా ఓనరు కనికరించక దాన్ని తొక్కుతూనే ఉంటాడు. డబ్బులే లేని ఆ కాలంలో సైకిలే సిరి.సైకిల్ వల్ల ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. ఫ్రంట్ రాడ్ మీద కూచుని సినిమాకొచ్చేవాడొకడు. బ్యాక్ క్యారేజీ మీద కూచుని సంతకు పోదాం అనేవాడొకడు. ఎదురుగాలిలో తొక్కుతుంటే వెనుక కూచున్నవాడు కూడా తోడు తొక్కుతాడు. అంటే రెండు పెడళ్ల మీద నాలుగు కాళ్లు. సైకిల్ డౌన్లో తొక్కేటప్పుడు గడ్డిపోచకంటే తేలిగ్గా ఉంటుంది. ఎదురుగాలిలో తొక్కుతుంటే రాకాసి దెయ్యమంత బరువు పెరుగుతుంది. అన్నింటి కంటే హింస ఏమిటంటే చైనుకు ఉన్న మడ్గార్డు గనుక పెడల్కు రాసుకుంటూ ఉంటే మనం వీధి వెంట వెళుతున్నామని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు.. ఆ గర్గర్మనే సౌండ్కి.సైకిల్కు సింగారాలు చేసేవారు ఉండేవారు. హ్యాండిల్కు చెరొక మిర్రర్ని బిగించే సోగ్గాళ్లు ఉండేవారు. హ్యాండిల్ మీద ఫ్రంట్ క్యారేజ్ బిగిస్తే వాటి మీద బుక్స్ పెట్టుకోవచ్చు. సీటుకు స్పాంజ్ కవర్ చాలా షోకు. స్టీలు బిందెల మీద పేర్లు రాసినట్టు సైకిల్ హ్యాండిల్ మీద ఓనర్ పేరు రాయించడం సేఫ్. సైకిల్ దొంగతనం అయితే పోలీసులు ఆ పేరును బట్టి వాపసు చేసేవారు.ఆ రోజుల్లో అద్దె సైకిళ్ల జమానా నడిచింది. ఐదారు సైకిళ్లు అద్దెకు ఇస్తూ బతికే వారుండేవారు. సైకిళ్లన్నీ అద్దెకెళ్లిపోతే కావాల్సిన వాళ్లు వెయిట్ చేస్తూ కూచునేవారు. కొందరైతే రే΄÷్పద్దున నాకు సైకిల్ కావాలి అని ముందే అద్దెకు మాట్లాడుకునేవారు. సైకిల్ లేకుండా పని ఎవరికి జరిగేదని? సామాన్లు తెచ్చుకోవాలన్నా, పక్కూరికి పనికి వెళ్లాలన్నా, నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఎవరికైనా బాగా లేకపోతే డాక్టర్ని పిలుచుకు రావాలన్నా, చావు కబురు చె΄్పాలన్నా సైకిలే గతి. సైకిల్ వేదాంతి. బతుకు బండిని బేలెన్స్ తప్పకుండా చూసుకోమని, అత్యాశలకూ అతి కోరికలకూ బ్రేకులు వేస్తూ నువ్వెంత తొక్కగలవో అంతలోనే బతకమని, మంచి అనుబంధాలనే ఆయిల్ను తరచూ రిమ్ములకు రాస్తూ ఉండమని, మంచి చెడ్డల్లో పాల్గొంటూ సైకిల్ బెల్లులా ఉనికి చూపమని, వెనుక క్యారేజీ మీద కూచోబెట్టుకునే పాటి సహాయమైనా ఇతరులకు చేస్తూ ఉండాలని, జీవితపు పరుగుకు అప్పుడప్పుడు స్టాండ్ వేసి నిలబెట్టమని లేదంటే కనీసం సైడ్ స్టాండ్ వేయమని చెబుతుంటుంది. లేదంటే హటాత్తుగా సైకిల్ మొరాయించి ఓవరాయిలింగ్కు వస్తుందని హెచ్చరిస్తుంది.సైకిల్లా సింపుల్గా బతకడం ఇవాళ చాలా కష్టమైపోతుంది. కాసింత గాలి కొడితే ఇక సైకిల్ ఏమీ అడగదు. కాని నేడు మనం ఉపయోగిస్తున్న, వాడుతున్న, అందుకోవాలనుకుంటున్న ప్రతిదీ మన నుంచి చాలా అడుగుతున్నాయి. ఇంటి వాకిటలో నిలబెట్టిన సైకిల్ ఎంత నిమ్మళంగా ఉంటుంది!‘వరల్డ్ సైకిల్ డే’ రోజున జీవితపు వేగాన్ని తగ్గించుకుని ఆస్వాదనకు పెడల్ వేద్దాం.– కె. -
ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..
కొన్ని రకాల కూరగాయలు అందరు ఇష్టపడరు. దాని రుచి రీత్యా తినేందుకు మక్కువ చూపించరు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓ షోలో తనకు కూడా కొన్ని కూరగాయలు నచ్చవని చెప్పారు. పైగా ఆయన చాలా చమత్కారంగా ఆ కూరగాయలను తినదగినవి కావు..కానీ తింటేనే ఆరోగ్యం అని అన్నారు. మరీ బిగ్ బీ సైతం ఇష్టపడి ఆ కూరగాయాలు ఏవి..?. వాటివల్ల కలిగే లాభాలేంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనకు కూడా కొన్ని కూరగాయలంటే అస్సలు ఇష్టం ఉండదని అన్నారు. అవేంటో షేర్ చేసుకున్నారు కూడా. అయితే వాటిని అందరూ తప్పక తీసుకోవాల్సిందేనని, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు మరీ అని నవ్వేశారు. ఆ కూరగాయలే పనస, గుమ్మడి కాయ, కాకరకాయ. పనస: దీన్ని కూరగానూ, పండుగానూ కూడా తీసుకుంటారు. ఇందులో పోటాషియం సమృద్ధిగా ఉంటుందట. గుండె కండరాలతో సహా మొత్తం కండరాల పనితీరుని నిర్వహించడంలో కీలకంగా ఉంటుంది. అంతేగాదు శరీరంలోని సోడియం నియంత్రణను నిర్థారిస్తుంది. అలాగే ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా అధికంగా ఉంటుందట. ఐరన్ మూలం కూడా.ముఖ్యంగా రక్తహీనతతో పోరాడటానికి, జీవక్రియను పెంచడానికి ఉపకరిస్తుందట. ఇందులో మెగ్నీషియం, విటమిన్ సీ, రాగి వంటివి కూడా ఉంటాయట. ఇవి రక్త నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.గుమ్మడికాయగుమ్మడికాయలలో కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం, ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. ఇది బీటా-కెరోటిన్కి అద్భుతమైన మూలం. కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతిస్తుంది. పొటాషియం, సోడియం ప్రభావాలను సమతుల్యం చేసి రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహారం కూడా. దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందట. కాకరకాయఇందులో విటమిన్ ఏ,సీలు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ తదితర కీలకమైన పోషకాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ, మధుమేహ నిర్వహణలో సహాయపడుతుంది. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది., ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.అలాగే ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడేలా చేసి కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్ అధికంగా ఉంటుంది, సంతృప్తిని ప్రోత్సహించి, బరువుని అదుపులో ఉంచుతుంది. దాంతోపాటు కాలేయ పనితీరుకు మద్దతు ఇచ్చి..శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..?
చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం ఎందుకొస్తుంది అని ఆలోచించారా ఎప్పుడైనా..?. వాట్ ఇదేం కామెడీ ప్రశ్న అనుకోకండి. ఎందుకంటే చప్పట్లు కొడితే శబ్దం ఆటోమేటిగ్గా రాకుండా ఉండదు కదా అని చెప్పేయొద్దు. చూడటానికి గమ్మత్తుగా అనిపించే ఈ చిన్న విషయాన్ని కనుగొంటే.. శబ్దం ఎలా జనిస్తుందో అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరికినట్లువుతుంది. రెండు గట్టిపదార్థాలను ఒకదానికొకటి తాకిస్తే శబ్దం వస్తుది. అదే ప్లాస్టిక్, చెక్క వంటి వాటి నుంచి రాదుగా. మరీ రక్తం, కండరాలతో నిర్మితమైన చేతుల నుంచి ఎలా వచ్చేస్తోందన్న సందేహం కొందరి శాస్త్రవేత్తల బుర్రలను తొలిచింది. దాని పర్యవసానంగా..అవాక్కయ్యే విషయం వెలుగులోకి వచ్చిందిఇన్నాళ్లుగా మనమంతా అనుకున్నట్లుగా..రెండు చేతుల దగ్గరకు చరచడం వల్ల కానేకాదట. ఒక చిన్న స్థలంలో గాలి కుదించబడి బయటకు నెట్టడం వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కుదించబడిన గాలి హెల్మ్హోల్ట్జ్ రెసొనేటర్ లాగా ప్రవర్తిస్తుందట. అందుకు ఉదాహరణే బాటిల్ గుండా గాలిని ఊదితే వచ్చే శబ్దమేనని వివరించారు. అరచేతులు ఒక కుహరాన్ని సృష్టిస్తాయి. అంటే ఒక చిన్న స్వరంగం మాదిరి అన్నమాట. ఇక్కడ బొటన వేలు, చూపుడు వేలు కారణంగా కుదించబడిన కుహరంలా(చిన్న బాటిల్ మూతిలా) ఏర్పడుతుందట. సరిగ్గా గాలి ఆ కుహరం నుంచే బయటకు నెట్టబడటంతో ధ్వని తరంగాలను సృష్టిస్తుందట. దాంతో టప టప అని సౌండ్ ఉత్ఫన్నమవుతుందని చెప్పుకొచ్చారు. చప్పట్ల వేగాన్ని అనుసరించే వచ్చే శబ్దాలపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైందని అన్నారు. అలాగే ప్రతి వ్యక్తి చప్పట్లు కుహరం ఆకారం, చర్మ స్థితిస్థాకత వంటి వాటిని బట్టి వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని.. ఏ ఒక్కరిది ఒకేలా ఉండదని తేల్చి చెప్పారు. ఇది మనకు మనషుల గుర్తింపులో ఉపయోగపడే మరో కొత్త అంశమని చెప్పుకొచ్చారు కార్నెల్ అండ్ మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ అధ్యయనం ఫిజికల్ రివ్యూ జర్నల్లో ప్రచురితమైంది. (చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..) -
ఘనంగా 'తెలంగాణ కథలు'ను ప్రారంభించిన ఓనమాలు..!
ప్రాంతీయ పాక వారసత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవంగా జరుపుకోవాలనే ఆశయంతో తెలంగాణ కథలు’ను ఘనంగా ప్రారంభించింది ’ఓనమాలు‘. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)కి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం, తెలంగాణ ప్రాంత వంటకాలు, కళలు, కథలను పండుగలా నిర్వహించింది. చిత్రనిర్మాతలు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు , ఆహార ప్రియులను ఒకచోటకు చేర్చి, వారికి అద్భుతమైన అనుభవాన్ని అందించింది అనడంలో సందేహం లేదు.ఈ వేడుకలో కరీంనగర్ మహిళలు తయారుచేసిన సర్వపిండి, బక్షాలు, జొన్న రొట్టె, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు స్థానికంగా లభించే పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి గోండులు, మహువా సమాజానికిచెందిన గుస్సాడి నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఈ వేడుకకు ఉత్సాహభరితమైన ప్రాంతీయ సౌరభాలను సమరకూర్చాయి. “తెలుగును ఒకమాటలో వర్ణించలేం. ఒకే ఒక్క సాధారణ స్వరంలో చెప్పలేం. ఇది వెయ్యి సూక్ష్మ కథలతో, అనేక ఉప-ప్రాంతీయ వైవిధ్యాలతో జమిలిగా అల్లిన కథ. దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, వినడానికి, కనుమరుగవుతున్న వాటిని సంరక్షించడానికి మేము ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, హైదరాబాద్ కోసం సూక్ష్మ-ప్రాంతీయ సంఘాలను నిర్మిస్తున్నాము, ”అని ది క్యులినరీ లాంజ్ CEO , ఓనమాలు ఉద్యమంలో కీలక సూత్రధారి గోపి బైలుప్పల అన్నారు. “ఈసారి, ప్రయాణం ఎప్పుడూ లేనంతగా ఇంటికి దగ్గరగా ఉంది.” అని పేర్కొన్నారు.ఈ ప్రాంతీయ సంఘాలు నెలవారీ మాస్టర్క్లాస్లు, సాంస్కృతిక చర్చలను నిర్వహిస్తాయి, ఔత్సాహికులకు స్థానిక ఆహారం, సాహిత్యం, సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక వేదికను అందిస్తాయన్నారు. ఈ దృష్టి కేంద్రీకృత సమాజ కార్యక్రమాల శ్రేణిలో తెలంగాణ కథలు మొదటి అధ్యాయం. ఈ కార్యక్రమంలో అన్విక్షికి పబ్లిషర్స్ వ్యవస్థాపకుడు వెంకట్ సిద్ధా రెడ్డి కూడా పాల్గొన్నారు.ఆయన పాక పునరుజ్జీవనం, సాహిత్య పునరుజ్జీవనం మధ్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు “అన్విక్షికి తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరించే దృక్పథంతో స్థాపించారు. స్థానిక వ్యాపారాలలో చిన్న స్వయం-సేవ పుస్తక దుకాణాలు, చలనచిత్ర నిర్మాణ కార్యాలయాలలో లైబ్రరీల ద్వారా తాము తమ పరిధిని విస్తరిస్తున్నామని వెంకట్ తెలిపారు. ఈ చొరవ పాఠకుల సంఖ్యను, ఆదాయాన్ని అందిస్తూనే ఆయా ప్రదేశాలకు సాంస్కృతిక విలువను జోడిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం ’బలగం‘తో అవార్డు గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి, మరో అవార్డు గ్రహీత, తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ది క్యులినరీ లాంజ్లో అన్విక్షికి ప్రత్యేక పుస్తకాల షెల్ఫ్ను ప్రారంభించారు.ప్రముఖ విద్యావేత్త, నటీ గీతా భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ అమర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ వంటలను ఆస్వాదించి, నిర్వహకులను అభినందించారు.బలగం డైరెక్టర్ వేణు మాట్లాడుతూ సర్వపిండి, బక్షాలను గురించి ఈతరం పిల్లలకు తెలియదనీ, భవిష్యత్ తరానికి తెలంగాణ పురాతన వంటకాల గురించి తెలియజేయడానికి ఓనమాలు చేస్తున్న ప్రయత్నం గొప్పదనీ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఓనమాలు గురించితెలుగు మాట్లాడే రాష్ట్రాలలోని వైవిధ్యమైన పాక వారసత్వాన్ని సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, వాటిని ముందుతరాలకు అందించే లక్ష్యంతో 2024లో లాంచ్ అయింది ’ఓనమాలు‘ అనే కమ్యూనిటీ ఇనీషియేటివ్. సూక్ష్మ వంటకాలను అన్వేషించడం, పురాతన వంటకాలను పునరుద్ధరించడం, పరిశోధన, వాటి గురించి సవివరంగా చెప్పడం, ఆచరణాత్మక అనుభవాల ద్వారా కమ్యూనిటీలను నిమగ్నం చేయడమే ఓనమాలు లక్ష్యం. డాక్టర్ ఎ.వి. గురవా రెడ్డి KIMS-SUNSHINE హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ITEC), పరిశ్రమలు అండ్ వాణిజ్య విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణలో సీనియర్ IAS అధికారి జయేష్ రంజన్ ’ఓనమాలు‘ను ప్రారంభించారు. గత సంవత్సరంలో ఓనమాలు 27,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, పెద్దలు, రైతులు, గృహ వంటవారు. ఇతర నిపుణులను కలిసి, కనుమరుగవుతున్న రుచులను, మరచిపోయిన పాక పద్ధతులను తిరిగి గుర్తించారు. ఈ వేదిక ఫ్లూట్ రిసిటల్స్, పాక థియేటర్ ప్రదర్శనలు, సాంప్రదాయ రుచికరమైన వంటకాలను అందించే లైవ్ ఫుడ్ స్టేషన్ల నిర్వహణతో రుచి, సంప్రదాయం ద్వారా తరాల అంతరాలను తగ్గిస్తోంది. తెలుగు పాక పరి జ్ఞానాన్ని సంరక్షించి, గర్వంగా అందించేలా వంట మ్యూజియంను స్థాపించడం, ట్రైనింగ్ వర్క్షాప్లను నిర్వహించడంతోపాటు, గృహిణులు, చెఫ్లు, ఆహార చరిత్రకారులు, సాంస్కృతిక నిపుణులతో సహకారాన్ని పెంపొందించడం అనేవి ఓనమాలు భవిష్యత్ ప్రణాళికలు.(చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..) -
ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..
గురువు అనే పదానికి అసలైన అర్థం ఈ మాస్టారు. పిల్లలకు పాఠాలను చెప్పడం కోసం..ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారో తెలిస్తే కంగుతింటారు. అలా ఏకంగా 20 ఏళ్ల నుంచి చాలా శ్రమ ఓర్చి.. తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పైగా ఆయన డ్యూటీ పరంగా చాలా సిన్సియర్, ఏ రోజు లేటుగా వచ్చిన దాఖాలాలు కూడా లేవు. అలాంటి గొప్ప మాస్టార్ని పొందిన ఆ విద్యార్థులు కూడా ఎంతో అదృష్టవంతులు కదూ..!.ఆ మాస్టార్ పేరు అబ్దుల్ మాలిక్. కేరళకు చెందని ఆయన మల్లాపురంలోని పదింజత్మురిలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నారు. ఈయన ఆ స్కూల్ని చేరాలంటే.. ప్రతిరోజూ సాహసం చేయాల్సిందే. నడుంకి ఓ ట్యూబ్ తగిలించుకుని నది ఈదుకుంటూ వెళ్లి మరీ విద్యార్థులకు పాఠాలు చెప్పి వస్తుంటారు. ఇలా ట్యూబ్ తగిలించుకోవడంతో అక్కడి స్థానికులంతా ఆయన్ను ముద్దుగా ‘ట్యూబ్ మాస్టర్’ అనిపిలుస్తుంటారు. అయితే ఇలా నదిలో ఈదుకుంటూ వెళ్తున్నప్పుడూ.. కాలానుగుణంగా వచ్చే భారీ వర్షాలు, పాములు వంటి ఇతర భయంకరమైన సరీసృపాలు తదితర సవాళ్లు చాలానే ఎదుర్కొంటుంటారాయన. అయినా అవేమి ఆయన్ను తన విద్యార్థుల దగ్గరకు వెళ్లనీయకుండా ఆపలేకపోయాయి. ఇంత ఇబ్బంది పడి వెళ్లటం అవసరమా అని ఆయన ఏనాడు అనుకోకపోవడం విశేషం. ఇలానే ఎందుకంటే..మాలిక్కి ఇలా నదిలో ఈదుకుంటూ కాకుండా మరొక మార్గం ఉంది. కానీ మరింత వ్యయప్రయాసలతో కూడినది. ఎందుకుంటే సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ స్కూల్కి చేరుకోవాలంటే మూడు బస్సులు మారాల్సిందే. పైగా మూడుగంటలకు పైగా జర్నీ చేయాలి. దాంతో మాలిక్ ఇలా నదిలో ఈదుకుంటూ స్కూల్కి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక పడవల సాయంతో వెళ్దామంటే.. ఆ నది నీటి ఉద్ధృతిలోని హెచ్చు తగ్గుల రీత్యా అది అస్సలు సాధ్యం కానీ పని అంటున్నారు మాలిక్. ఇక ఆయన క్లాస్లు ఉదయం 10.30తో మొదలవ్వుతాయి. ఆయన గణితాన్ని బోధించడం తోపాటు పర్యావరణం గురించి తెలుసుకునేలా ఆయన రోజు ఈతకొట్టి వచ్చే నది వద్దకు కూడా విద్యార్థులను తీసుకువెళ్తారు మాలిక్. ప్రకృతిని కాపాడుకోవడం దాన్ని గౌరవించడం నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా తీసుకువెళ్తుంటానని చెబుతున్నారు మాలిక్. కాగా, 2013 నుంచి ఆ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు మాలిక్. అలా ఈ ఏడాది 2025 పూర్తి అయ్యే నాటికి.. ఆయన ఆ స్కూల్కి వెళ్లి తిరిగి రావడానికి.. దాదాపు 700 కిలోమీటర్లక పైనే ఈత కొట్టినట్లు అంచనా.!. నిజంగా ఈ మాస్టారు మాములు గ్రేట్ కాదు కదా..!. (చదవండి: పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..! ఆ ఎవర్గ్రీన్ ఎనర్జీకి ఫిదా అవ్వాల్సిందే..) -
పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..!
బాలీవుడ్లో ప్రఖ్యాత నటి, నాట్యకళాకారిణిగా ఒక ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్న హీరోయిన హెలెన్. 80లలో ప్రసిద్ధ ఐకానిక్ పాటల్లో నర్తించి ప్రేకక్షకులను మంత్రముగ్దులను చేసేది. ఇప్పటికి ఆ పాటలు చెవిన పడగానే..నాటి కుర్రకారుని ఉర్రూతలూగించిన అందాల నటి హెలెన్ కళ్లముందు కదలాడుతుంది. అంతలా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందామే. ఇప్పుడామె ఎనిమిది పదుల వయసుకి చేరుకుని బామ్మలా ఉన్నా కూడా..అంతే జోష్ హుషారుతో ఉంటారామె. అచ్చం 85 ఏళ్ల అమ్మాయి అనేలా ఉంటుంది ఆమె ఉత్సాహం చూస్తే. కాలక్రమేణ వచ్చే వృద్ధాప్యానికి చెక్పెట్టి..యవ్వనంగా బతకడం ఎలా అనేందుకు ఆమెనే ఓ ఉదాహరణ. మరి అంతలా ఆమె ఎవర్గ్రీన్ ఎనర్జీ వెనకున్న ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా నటి హెలెన్కి సంబంధించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దాంతో ఒక్కసారిగా హెలెన్ మరింత ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఏజ్లో కూడా ఇంత ఎనర్జీనా అని నెటిజన్లు విస్తుపోతున్నారు. 85 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా చెంగుచెంగుమని తిరుగుతున్న ఆమె యాక్టివిటీని చూసి.. వృద్ధాప్యం చిన్నబుచ్చికుని దూరంగా వెళ్లిపోయాందా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ..నటి హెలెన్ తనను తాను పరిచయం చేసుకుంటూ..బలంగా, చరుగ్గా ఉండాలంటే పైలేట్స్ వ్యాయామాలు మన దినచర్యలో భాగం కావాలని చెబుతున్నట్లు కనిపిస్తుంది. తాను 85 ఏళ్ల అమ్మాయినే బామ్మను మాత్రం కాను అని నవ్వుతూ చెబుతున్నారామె. ఇప్పుడు కూడా మీరు ఈ కఠినతరమైన పైలేట్స్ వ్యాయామాలు చేస్తారా అని ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ ప్రశ్నించగా..ఓ చేద్దాం అని నటి హెలెన్ అన్నారు. వెంటనే పైలేట్స్ బాల్ మీద పడుకుని..శ్వాసను సమన్వయం చేస్తూ వ్యాయామాలు ఈజీగా చేశారామె. అలాగే ఎవరి సాయం లేకుండా ఈజీగా లేవడం, నిలబడటం వంటివి చేయగలరు. ఆఖరికి స్టెప్స్పై కూడా చకచక నడిచేస్తారామె. అంతేగాదు హాయిగా జంపింగ్, రన్నింగ్ కూడా చేస్తారామె. తన ఈ ఉత్సాహానికి కారణం పైలేట్స్ తన దినచర్యలో భాగమవ్వడమేనని అన్నారు. అంతేగాదు ఆ వీడియో చివరలో ఓ మై డార్లింగ్ అనే పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. ఆమె వృద్ధాప్యాన్ని ఆరోగ్యకరంగా నిర్వచించడానికి స్ఫూర్తిగా నిలిచారు . View this post on Instagram A post shared by We The Women Asia (@wethewomenasia) వృద్ధులు తప్పకుండా చేయాల్సిన పైలేట్స్ వ్యాయామాలు..సింగిల్ లెగ్ పుల్ అండ్ డబుల్ లెగ్ పుల్ - ఈ వ్యాయామాలు కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. శరీరం సమతుల్యత, స్థిరత్వానికి చాలా అవసరం.సైడ్-లైయింగ్ సిరీస్ - ఇది మన కదలికలను మెరుగుపరుస్తుందిమోడిఫైడ్ ప్లాంక్ - కీళ్లపై ఒత్తిడి పెట్టకుండా బలాన్ని పెంచుతుంది.వాల్ పైలేట్స్ - ఈ వ్యాయామాలను గోడ సాయంతో చేయవచ్చు.తొడ మడతలు - ఈ వ్యాయామాన్ని కుర్చీ సహాయంతో చేయవచ్చు . పైగా వృద్ధులు ఈజీగా నడిచేందుకు హెల్ప్ అయ్యే మంచి వ్యాయామం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఇలాంటి వ్యాయామాలు చేసే ముందు ఫిట్నెస్ నిపుణుల సలహాలు, సూచనలతో చేయడం ఉత్తమం.(చదవండి: వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! క్యూకడుతున్న ప్రసిద్ధ బ్రాండ్లు) -
స్త్రీ సాధికారత దిశగా..
మహిళలు తమ కాళ్లపై నిలబడి.. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు దాదాపు దశాబ్దకాలంగా తోడ్పాటునందిస్తోంది తెలంగాణలోని సాయి సమాజ్ ఛారిటబుల్ ట్రస్ట్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్త్రీల సాధికారతకు బాటలు వేస్తోంది. వందలాది మంది మహిళల ఆర్థిక ఆలంబనకు కృషి చేస్తోంది. స్త్రీ ఆర్థిక పురోగతి సాధించినప్పుడే ఆ కుటుంబం.. తద్వారా ఆ దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని నమ్మిన సిద్ధాంతం మేరకు ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాల మహిళలకు కుట్టు మిషన్, మగ్గం వర్క్ (డిజైన్)లపై ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తూ చేయూతనందిస్తోంది. ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకూ 35 మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటి వరకూ 23 బ్యాచ్లకు పైగా శిక్షణ ఇచ్చామని ట్రైనర్ అనూష ‘సాక్షి’తో చెప్పారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో స్వయం ఉపాధి శిక్షణ తీసుకొని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రధానం చేస్తామన్నారు. ఉపాధి అవకాశాల్లో మెరుగుదల.. నిరుపేద మహిళలకు సొంతంగా ఉపాధి చేసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. చీరలు, బ్లౌజులపై డిజైన్ వేయడానికి మగ్గం వర్క్ నేర్పిస్తున్నాం. దీంతో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. – ఉమా, శిక్షకురాలుకుట్టుమిషన్పై శిక్షణ.. సాయి సమాజ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలకు కుట్టుమిషన్లో బ్లౌజులు, పలు రకాల పంజాబీ డ్రెస్సులపై శిక్షణ ఇస్తాం. మహిళలకు శిక్షణ ఇచ్చి మూడు నెలల తర్వాత సర్టిఫికెట్లను అందజేస్తాం. – అనుష, శిక్షకురాలు తరగతులతో మేలు.. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్, ఇతర మగ్గం, ఎంబ్రాయిడరీ వర్క్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. అన్ని విధాలా శిక్షణ తీసుకొని మా సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందేందుకు దోహదపడుతుంది. – సంగీత, కుట్టుమిషన్ నేర్చుకున్న మహిళ (చదవండి: సమానత్వం.. సాధికారత సాధిస్తా!) -
ఈ రోజు క్రియేటివ్ థియేటర్ ప్రదర్శన ..!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్రియేటివ్ థియేటర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో సోమవారం సాయంత్రం 6:45 గంటలకు ‘గొల్ల రామవ్వ’ నాటికను ప్రదర్శించనున్నారు. ఈ నాటికకు మూలకథ స్వర్గీయ భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన ప్రసిద్ధ కథ ‘గొల్ల రామవ్వ’. గ్రామీణ నేపథ్య జీవితాల విశిష్టతను ప్రతిబింబించేఈ కథను నాటికగా మలచి ప్రదర్శిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరుగనుంది. క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు అజయ్ మంకెనపల్లి ఆధ్వర్యంలో దీనిని ప్రదర్శించనున్నారు. నాటకరంగ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ విలక్షణ నాటికను ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ నాటికలో తమ సంస్థ నుంచి పలువురు యువ థియేటర్ ఆరి్టస్టులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: క్రేజ్ ఫుల్.. బోబా బబుల్ టీ..! స్పెషాల్టీ ఇదే..) -
క్రేజ్ ఫుల్.. బోబా బబుల్ టీ..! స్పెషాల్టీ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్న తాజా డ్రింక్ సంచలనం.. బోబా టీ, లేదా బబుల్ టీ. తైవాన్లో పుట్టిన ఈ పానీయం ఇప్పుడు భాగ్యనగరంలోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇటీవల బోబా టీ షాప్స్ ముంబయి, బెంగళూరు వంటి నగరాలతో పాటు హైదరాబాద్ వంటి నగరంలోనూ పెరుగుతున్నాయి. కాలేజీ యువత, వర్కింగ్ ప్రొఫెషనల్స్ దీనిని చల్లదనాన్నిచ్చే ఆహ్లాదకరమైన డ్రింక్గా ఎంజాయ్ చేస్తున్నారు. బోబా టీ అనేది టీ ఆధారిత పానీయం. అదే దీనికి ప్రత్యేకతను చేకూర్చే అంశం. టాపియోకా పెరల్స్ లేదా బోబా బాల్స్. ఇవి చిన్న గోళాకార బంతుల్లా ఉంటాయి. తీపిగా, కొద్దిగా చిక్కదనం ఉండే ఈ బంతులు టీతో కలిసినపుడు ఒక వినూత్న రుచిని జత చేస్తాయి. బోబా టీ కూడా బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా మిల్క్ టీ తరహాలోనూ వినియోగించవచ్చు. లేదా దీనికి పండ్ల ఫ్లేవర్స్, సిరప్లు, పాలు లేదా క్రీమ్లను కూడా కలుపుతారు. బోబా టీలో భాగంగా టాపియోకా బాల్స్ కాకుండా జెల్లీ, ఫ్రూట్ బిట్స్ వంటి వేరే రకాల టాపింగ్స్ కూడా వినియోగిస్తారు. ఎన్నెన్నో.. వెరై‘టీ’లు బోబా టీ వివిధ రుచుల్లో మ్యాంగో, స్ట్రాబెర్రీ, చెరకు, కొబ్బరి వంటి అనేక ఫ్లేవర్లలో లభ్యమవుతోంది. ప్రత్యేకమైన టేక్–అవే గ్లాస్లు, స్టైలిష్ స్ట్రా, బాల్స్ వల్ల యువత ఈ పానీయం పట్ల అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆకట్టుకునే కలర్ కాంబినేషన్లు, ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ వల్ల బోబా టీ ఇన్స్టా, ఇతర సామాజిక మాధ్యమాల్లో రీల్స్ల ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. పోషక విలువలు.. కాసావా స్టార్చ్ లేదా సముద్రపు పాచి సారం నుండి తయారు చేసిన ఈ ముత్యాలు సహజంగా గ్లూటెన్ రహితమైనవి. పైగా పూర్తి శాకాహారం. కాసావా అనేది విటమిన్ ‘సి’ మంచి మూలం. ఇది వాపును తగ్గించే, కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే యాంటీఆక్సిడెంట్. దీంతోపాటు ఫైబర్, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుదలకు సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం సంగతేం ‘టీ’.. బోబా టీ కాస్త అధికంగా తీపి పదార్థాలతో కూడినందున దీనిని అప్రమత్తంగా వినియోగించాలి. ఎందుకంటే దీనిలో అధిక క్యాలరీలు ఉంటాయి. అయితే కొంతమంది టాపియోకా బాల్స్ను, చక్కెరను తగ్గించి ఆరోగ్యకరమైన రీతిలో కూడా తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, నగరంలోనూ ఉన్న ప్రముఖ కేఫ్ చైన్ యమ్మీ బీ, బోబా టీకి కొత్త వెర్షన్ను తాజాగా మార్కెట్లోకి తెచ్చింది. ఆరోగ్యాభిలాషులను దృష్టిలో పెట్టుకుని షుగర్–ఫ్రీ బోబా టీని ఆన్లైన్ ద్వారా అందిస్తోంది. మ్యాంగో బోబా టీ, థాయ్ బోబా టీ, మాచా బోబా టీ.. వంటి పేర్లతో ఈ బోబా/బబుల్ టీ నగర ఆహార ప్రియుల అభి‘రుచుల్లో’ ఒకటిగా మారింది. (చదవండి: ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేయండిలా..) -
విటమిన్–డి లోపిస్తే మానసిక వ్యాధుల ముప్పు
న్యూఢిల్లీ: మనుషుల ఆరోగ్యానికి విటమిన్–డి ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రధానంగా అప్పుడే పుట్టిన శిశువుల్లో ఈ విటమిన్ తగినంతగా లేకపోతే వారిలో మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అ్రస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, డెన్మార్క్లోని అర్హాస్ యూనివర్సిటీ, స్టేట్ సీరమ్ ఇనిస్టిట్యూట్తో కలిసి లాన్సెట్ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను సైకియాట్రీ పత్రికలో ప్రచురించారు. డి విటమిన్ లోపంతో జన్మించే శిశువుల్లో ఆటిజం, అటెన్షన్ డెఫిషిట్–హైపర్ యాక్టివ్ డిజార్డర్(ఏడీహెచ్డీ), స్కిజోఫ్రినియా వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. విటమిన్–డి, మానసిక సమస్యల మధ్య సంబంధాల విషయంలో ఎక్కువ మందిపై నిర్వహించిన సర్వే ఇదే కావడం గమనార్హం. సర్వేలో భాగంగా 71,000 మందిని పరీక్షించారు. వారి డి విటమిన్ స్థాయిలను అధ్యయనం చేశారు. వీరిలో చాలామంది బాల్యంలో మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారే.శరీరంలో తగినంత డి విటమిన్ స్థాయిలు లేకుండా జని్మంచినవారిలో ఆరు రకాల మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు క్వీన్స్లాండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి జాన్ మెక్గ్రాత్ చెప్పారు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రినియా, ఏడీహెచ్డీ, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్(ఏఎస్డీ), అనొరెక్సియా నెర్వోసా వంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు వివరించారు. శిశువులు, చిన్నారుల్లో డి విటమిన్ తక్కువగా ఉంటే స్కిజోఫ్రినియా, ఏఎస్డీ, ఏడీహెచ్డీ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు డి విటమిన్ మాత్రలు తీసుకుంటే పుట్టే శిశువులకు ముప్పు తగ్గుతుందని సూచించారు. అలాగే పుట్టిన శిశువులకు తగినంత డి విటమిన్ అందేలా చూడాలని చెప్పారు. శిశువుల్లో మెదడు అభివృద్ధికి విటమిన్–డి అత్య ంత కీలకమని జాన్ మెక్గ్రాత్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా గర్భిణుల్లో విటమిన్–డి స్థా యిలు తక్కువగా ఉండడం సర్వసాధారణంగా మారిపోయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణులు తగినంత డి విటమిన్ తీసుకోవాలని డాక్టర్ హిమానీ నరులా ఖన్నా చెప్పారు. నిత్యం 600 నుంచి 2,000 ఇంటర్నేషనల్ యూనిట్స్(ఐయూ) డి విటమన్ తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహాతో 4,000 ఐయూ వరకు తీసుకోవచ్చని వివరించారు. శరీరంపై 10 నుంచి 30 నిమిషాలపాటు సూర్యకాంతి పడేలా చూసుకోవాలని పేర్కొన్నారు. చేపలు, గుడ్లతోపాటు పాల ఉత్పత్తుల్లో విటమిన్–డి అధికంగా ఉంటుంది. గర్భిణులకు కేవలం ఆహారంతోనే తగినంత విట మిన్–డి లభించకపోవచ్చు. అందుకే మా త్రల రూపంలో అదనంగా తీసుకోవాలని డాక్టర్ హిమానీ నరులా ఖన్నా చెప్పారు. పేద, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో డి విటమిన్ లోపం అధికంగా కనిపిస్తోంది. విటమిన్ సప్లిమెంట్స్ కూడా అందుబాటులో ఉండడం లేదు. ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ఖరీదు భారీగా ఉండడం ప్రజలకు సమస్యగా మారింది. ధనిక దేశాల్లోనూ డి విటమిన్ లోపంతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఎండలోకి వెళ్లకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం ఇందుకు కారణాలు. శిశువుల్లో ఆటిజం, ఏడీహెచ్డీ, స్కిజోఫ్రినియా లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి గర్భిణులు తగినంత విటమిన్ తీసుకుంటే శిశువులకు తగ్గుతున్న రిస్క్ -
ఛత్రపతి విజయ విహారం..! ఆరో రోజుల టూర్..
ఈ టూర్లో గిరిదుర్గాలే ప్రధానం. ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతీకలు. తిరుమల కొండలంత ఎత్తులో ఉన్నాయి. ఇక... ఓ వనాలయం... మరో నగరాలయం. అవి... దట్టమైన వనాల్లో విస్తరించిన జ్యోతిర్లింగం.మరోటి... ప్రాచీన నగరంలో విలసిల్లిన లక్ష్మీదేవి ఆలయం.1వ రోజుఉదయం ఆరున్నరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, థానేలలో ఎక్కడైనా రైలెక్కవచ్చు. రైలు రాయగఢ్ వైపు సాగుతుంది. రైల్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. పదిన్నరకు రైలు మాన్గోవ్ స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రాయగఢ్ కోటకు చేరాలి. మధ్యాహ్న భోజనం ఎక్కడ అనేది సమయాన్ని బట్టి నిర్ధారిస్తారు. రాయగఢ్ పర్యటన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు మాన్గోవ్ స్టేషన్కు వచ్చి రైలెక్కాలి. రైలు ఆరు గంటలకు పూనే వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే. పది గంటలకు రైలు పూనేకు చేరుతుంది. హోటల్కు చేరడం, పూనేలో రాత్రి బస.పట్టాభిషేక దుర్గంరాయిగఢ్ కోట ఉన్న పట్టణం పేరు మహద్. మహారాష్ట్ర, రాయగఢ్ జిల్లాలో ఉంది. ఇది మహాదుర్గం. సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని ఈ కొండమీదకు చేరడానికి రోప్వే, ఏరియల్ ట్రామ్వే ఉన్నాయి. కోట లోపల శివాజీ సింహాసనం, పట్టాభిషేకం జరిగిన ప్రదేశం, చెక్కతో నిర్మించిన రాణి ప్యాలెస్, శివాజీ తల్లి జిజాబాయి సమాధి, శివాజీ సమాధి ఉన్నాయి. కోటగోడలు, దర్వాజాల మీదకు అల్లుకున్న పిచ్చి చెట్లుతీగలనుచూస్తే ఈ కోట పరిరక్షణ పట్ల ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి బాధ్యత అప్పగించడంతో పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయి. ఈ కోట మీద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి సౌందర్యం అంతా దండగా అల్లి అమర్చినట్లుంటుంది. ఇది ఒక ఫీల్గుడ్ టూరిస్ట్ డెస్టినేషన్.2వ రోజుహోటల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత పూనాలోని లాల్ మహల్, కాస్బా గణపతి ఆలయాల సందర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత శివ్శ్రుతి వీక్షణం. రాత్రి భోజనం తర్వాత హోటల్ గదికి చేరడం. ఆ రాత్రి బస కూడా పూనేలోనే.లాల్ మహల్ అంటే శివాజీ బాల్యం గడిచిన ΄్యాలెస్. శివాజీ తండ్రి షాహాజీ భోసాలే తన కొడుకు, భార్య కోసం కట్టించిన ప్యాలెస్ ఇది. నిజానికి షాహాజీ కట్టించిన నిర్మాణం నిర్వహణ సరిలేక శిథిలమైంది. ఇప్పుడు కనిపిస్తున్న ప్యాలెస్ అదే నమూనాలో చేసిన పునర్నిర్మాణం. ఇక నగరంలో చూడాల్సిన మరో ప్రదేశం కాస్బా గణపతి. ఇది శివాజీ తల్లి రాజమాత జిజాబాయి ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం. పూనే వాసులు గ్రామదేవతగా కొలుస్తారు. ఈఈ గణపతికి ఉన్న చారిత్రక ప్రత్యేకత ఏమిటంటే జాతీయోద్యమంలో భాగంగా బాలగంగాధర తిలక్ సామూహిక గణపతి ఉత్సవాలు మొదలు పెట్టింది ఈ ఆలయంలోనే. ప్రజలను ఒక చోటకు చేర్చడానికి, వారిని జాతీయోద్యమ బాట పట్టించడానికి ఈ ధార్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు తిలక్. 3వ రోజుశివనేరి కోట సందర్శనకు ఉదయాన్నే ఆరు గంటలకు టీ తాగిన తర్వాత హోటల్ నుంచి బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ ΄్యాక్ చేసి ఇస్తారు. పూనే నుంచి శివనేరి కోటకు రెండు గంటల ప్రయాణం. మధ్యాహ్న భోజనం తర్వాత భీమశంకర్ దర్శనానికి వెళ్లాలి. ఈ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత పూనేకి వచ్చి రాత్రికి హోటల్లో బస చేయాలి.మరాఠా రాజ్యం పుట్టింది!శివ్నేరి కోట ఛత్రపతి శివాజీ పుట్టిన ప్రదేశం. మరాఠా రాజ్య నిర్మాత పుట్టిన నేల అంటే మరాఠా రాజ్యం పుట్టిన నేల కూడా. శివాజీ తాత మాలోజీ భోసాలే నివసించిన కోట ఇది. బహమనీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధాలకు కేంద్ర బిందువు కూడా. ఈ కోట లోపల గంగ, యమున పేరుతో రెండు నీటి గుండాలున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరు ఉంటుంది. ఈ కోట పై అంతస్థు నుంచి చూస్తే నారాయణగఢ్, హద్సార్, చావాంద్, నీమ్గిరి కోటలు కనిపిస్తాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉండడంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ కోటను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. శివ్నేరి కోట నుంచి 70 కిమీల దూరంలో ఉంది భీమశంకర్. చిక్కటి పచ్చదనంతో విస్తరించిన సహ్యాద్రి శ్రేణుల్లో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగ క్షేత్రం. మహారాష్ట్రలో భీమనది తీరాన ఉంది. 4వ రోజుఉదయం పూనేలో హోటల్ గది చెక్ అవుట్ చేసి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బయలు దేరుతుంది. బ్రేక్ఫాస్ట్ రైల్లో ఇస్తారు. రైలు పది గంటలకు సతారా స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ప్రతాప్గఢ్ కోటకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం, కోట సందర్శనం, రాత్రి భోజనం తర్వాత పదిన్నరకు రైలెక్కాలి. పదకొండున్నరకు రైలు కొల్హాపూర్ వైపు బయలుదేరుతుంది.మరాఠ విజయంమరాఠా సామ్రాజ్య స్థాపనలో కీలకమైన కోట ప్రజాప్గఢ్. మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీకి బహమనీ సుల్తాన్ అజమ్ఖాన్కు మధ్య జరిగిన భీకర యుద్ధంలో శివాజీ గెలిచాడు. శివాజీ కొలిచిన తుల్జా భవానీ మాత ఆలయం ఈ కోటలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట అందమైన ప్రకృతి సౌందర్యవీక్షణానికి వేదిక కూడా. 5వ రోజుతెల్లవారు జామున ఐదు గంలకు రైలు కొల్హాపూర్లోని షాహూ మహారాజ్ టెర్మినస్కు చేరుతుంది. రైలు దిగి హోటల్కు వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత పన్హాల ఫోర్ట్ సందర్శనం. ఆ తర్వాత కొల్హాపూర్లోని రైల్వేస్టేషన్కు వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ముంబయి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.కొల్హాపూర్ మహారాష్ట్ర కాశీభారతీయులు జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలని కోరుకునే ప్రదేశం కొల్హాపూర్. ఇక్కడి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి ఉత్తర– దక్షిణ భారతాల వాళ్లు వస్తారు. ఈ ఆలయ నిర్మాణం గురించి కూడా విశేషంగా చెప్పుకోవాలి. దక్షిణాది ఆలయాల్లాగ విగ్రహాల సుమహారంగా ఉండదు. ఉత్తరాది నిర్మాణాల్లాగానూ ఉండదు. స్థూలంగా నిర్మాణం రెండింటి కలయికగా ఉంటుంది. సునిశితంగా శిల్పనైపుణ్యాన్ని గమనిస్తే జామెట్రికల్ డిజైన్స్తో ఆచ్చెరువు కలిగిస్తుంది. దక్షిణ కాశిగా చెప్పుకుంటారు. పెద్ద పట్టణం, మరాఠీ సినిమా పరిశ్రమ కేంద్రం. ఈ పర్యటనలో కొల్హాపూర్ లక్ష్మీదేవి దర్శనం తర్వాత న్యూ ప్యాలెస్ వీక్షణం. ఆ తర్వాత కొల్హాపురి చెప్పులు ఒక జత కొనుక్కోవడం మర్చి΄ోవద్దు. ఎందుకంటే పనితనం రీత్యా వీటికి జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ కూడా వచ్చింది.పన్హల ఫోర్ట్శివాజీ ఈ కోటను బీజాపూర్ సుల్తానులతో యుద్ధం చేసి సాధించాడు. ఆ తర్వాత మరికొన్ని నిర్మాణాలు చేశాడు. శివాజీ వారసులు ఈ కోట నుంచి మొఘల్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధాలు చేశారు. ఈ కోట నిర్మాణపరంగా పెద్దది కాదు, కానీ మరాఠాల పాలన ముందుచూపుకు నిదర్శనం. కోట లోపల ధాన్యాగారం ఉంది. అందులో నిల్వ చేసిన ధాన్యం కోట లోపల ఉన్న వారికి మాత్రమే కాదు, రాజ్యంలో కరువు సంభవిస్తే ప్రజల ఆకలి తీర్చడానికి ఒక ఏడాదికి సరిపడినంత ధాన్యాన్ని నిల్వ చేసేవారు. కోట లోపల ఒక దిగుడు బావి ఉంది. స్టెప్వెల్లు గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలోనూ ఉన్నాయి. హైదరాబాద్లోనూ ఉంది. తెలంగాణ జిల్లాల్లో కూడా ఉండేవి. ఆర్కియలాజికల్ సర్వే విభాగం తవ్వకాల్లో ఇటీవల కొన్ని స్టెప్వెల్లు బయటపడ్డాయి. భారతీయ శాస్త్రీయత నిర్మాణాలకు ఇవి తార్కాణాలు. 6వ రోజుఉదయం ఆరు గంటలకు రైలు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది. దాదర్, థానేల్లో కూడా దిగవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్క్యూట్ ప్రతాప్గఢ్... ఇది ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న ఆరు రోజుల టూర్ ప్యాకేజ్. జూన్ 9వ తేదీన మొదలవుతుంది. ముంబయిలో మొదలయ్యే ఈ టూర్లో రాయగఢ్ ఫోర్ట్, పూనే, శివనేరీ ఫోర్ట్, భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం, ప్రతాప్గఢ్ ఫోర్ట్, కొల్హాపూర్, పన్హలా ఫోర్ట్ కవర్ అవుతాయి.కొంకణ్ రైల్వేస్ ట్రైన్ ముంబయిలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి టూర్ మొదలవుతుంది. మాన్గోవ్, పూనే, సతారా, ఛత్రపతి షాహూ మహారాజ్ టెర్మినస్ కొల్హాపూర్ మీదుగా తిరిగి ముంబయికి చేరుతుంది.టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ (ఎకానమీ)లో ఒకరికి 13,155 రూపాయలు, ధర్డ్ ఏసీ (కంఫర్ట్)లో దాదాపుగా 20వేలు, సెకండ్ ఏసీ (సుపీరియర్)లో 27 వేలకు పైగా అవుతుంది. రాత్రి బసకు ఎకానమీ క్లాస్కు నాన్ ఏసీ గదులు డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్లో ఇస్తారు. రైలు దిగిన తరవాత రోడ్డు ప్రయాణానికి నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం. కంఫర్ట్, సుపీరియర్ ΄్యాకేజ్లో బస ఏసీ గదుల్లో. ఒక్కరుగా బుక్ చేసుకున్న వారు ఇతర ప్రయాణికులతో రూమ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఏసీ వాహనాలు. ప్యాకేజ్లో చెప్పిన టికెట్ ధరలకు ట్యాక్స్ అదనం. ప్యాకేజ్లో ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, సెక్యూరిటీ ఉంటుంది. భోజనం శాకాహారం ఇస్తారు. పర్యాటక ప్రదేశాల్లో బోటింగ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఖర్చులు ప్యాకేజ్లో వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్కే అందని మిస్టరీ..!) -
అందమైన అనుభవాలు.. అద్భుతమైన జ్ఞాపకాలు
2024లో మిస్ పోలోనియా కిరీటాన్ని గెలుచుకున్న మాజా క్లాజ్డా ఈ ఏడాది మిస్ వరల్డ్ ఫైనల్లో సెకండ్ రన్నరప్గా నిలిచింది. అందం, తెలివితేటలు, సమతుల్యతతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకర్షించింది. ఆమె బ్యూటీ విత్ ఎ పర్పస్ చొరవ, నేటి అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటైన పిల్లలు, యుక్తవయస్కుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మానసిక అనారోగ్య నివారణ, భావోద్వేగ సంఘర్షణలపై దృష్టి సారించి, 40 కి పైగా వర్క్షాప్లను నిర్వహించింది. మానసిక శ్రేయస్సు గురించి యువత తమను తాము, తమతో ఉన్న వారిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఈ వర్క్షాపులు ఉపకరిస్తున్నాయి. మనస్తత్వశాస్త్ర విద్యార్థిగా, మాజా టీనేజర్లతో వారి స్వంత భాషలో కనెక్ట్ అవుతుంది. సామాజిక బహిష్కరణ ప్రమాదంలో ఉన్న పిల్లలకు మద్దతు ఇచ్చే గ్రోయింగ్ అప్ జోన్ ఫౌండేషన్ కు చెందిన 12 ఏళ్ల బాలుడి కలను మాజా ఇటీవల నెరవేర్చింది. ఆమె అతన్ని బార్సిలోనాలో జరిగే లైవ్ మ్యాచ్కు హాజరు కావడానికి బార్సిలోనాకు తీసుకువెళ్లింది. అతని జీవితకాల కోరికను నెరవేర్చింది.సంతృప్తికరమైన అనుభవాలునేను పొందిన గొప్ప విజయాల్లో ఒకటి చిన్నచూపును అధిగమించడం. మొదట్లో న లుగురితో కలవాలంటే చాలా సిగ్గుపడేదాన్ని. దానిని దాటి ఈ దశకు వచ్చాను. ప్రజలతో కలిసి పోవడం, వారితో మాట్లాడుతూ ఉండటం అంటే నాకు ఇష్టం. కిరీటం దక్కక పోయినా అంతకు మించిన అనుభవాలు నాకు అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చాయి. ఇక్కడి ఆతిథ్యం నాకు మా ఇంటిని గుర్తు చేసింది. ఇది నా రెండో కుటుంబంలా అనిపించింది. మెడికల్ టూరిజంలో భాగంగా ఏఐజీ హాస్పిటల్కి వెళ్లినప్పుడు వారి ఆ΄్యాయత నన్ను ఆకట్టుకుంది. వారు ఎంతో బాధలో ఉండి కూడా చిరునవ్వుతో మాకు ఆహ్వానం పలికారు. ముచ్చటించారు. అది నా జీవితంలో మరచి పోలేను. ఇక్కడ ప్రతి ఒకరికి మరొకరితో ఉన్న కనెక్టివిటీ, రిలేషన్స్ చాలా బాగున్నాయి’’ అంటూ తెలంగాణలో మిస్ వరల్డ్ పాజెంట్ జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది మాజా క్లాజ్డా– నిర్మలారెడ్డి -
సమానత్వం.. సాధికారత సాధిస్తా!
హాసెట్ డెరెజె అడ్మస్సు రెండవ స్థానంలో నిలిచి మిస్ వరల్డ్ చరిత్రలో అత్యున్నత ర్యాంకింగ్ సాధించింది. ఇథియోపియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ అందాలభామ, ఫస్ట్ రన్నర్–అప్గా , మిస్ వరల్డ్ ఆఫ్రికా టైటిల్ను గెలుచుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ చేస్తున్న పంతొమ్మిదేళ్ల హాసెట్ దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ ఇథియోపియా, కిందటేడాది మిస్ వరల్డ్ ఇథియోపియా పోటీలో విజేతగా నిలిచారు. ఇథియోపియాలోని మహిళల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ సమాజాలలో తల్లీబిడ్డల ఆరోగ్యం, బాలికల విద్యపై దృష్టి సారించిన ఆమె ‘‘బ్యూటీ విత్ ఎ పర్పస్’’ ప్రాజెక్ట్ న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.నా పనే నా కిరీటంకిరీటం మరొకరికి వెళ్లచ్చు. కానీ, నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది. అదే నాకు కిరీటం. స్థానికంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సమానత్వం, లింగ సాధికారత కోసం ఒక గొంతుకగా పనిచేస్తాను. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక పరిమళాన్ని అర్థం చేసుకున్నాను. ఆస్వాదించాను. ఈ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది. ఓ పా గురించి చె ప్పాలంటే తను చాలా హార్డ్ వర్కర్. నేను తనకు చాలా పెద్ద అభిమానిని. తనకు కిరీటం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో భిన్నమైన క్వాలిటీస్ ఉన్నాయి. నిజానికి అందం అంటే అందరూ అనుకుంటున్నట్టు చర్మం, జుట్టు, గోళ్లు, డ్రెస్సింగ్.. ఇవి కావు. మన చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయడమే. మా పేరెంట్స్ నా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారు. నా ఈ విజయానికి నా కుటుంబ మద్దతు ఎంతో ఉంది.మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం...ఇథియోపియాలో మానసిక ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను. మాయా చారిటబుల్ ఆర్గనైజేషన్ కు అంబాసిడర్గా ఉంటూ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాను. మిస్ వరల్డ్ అనేది కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. నా దేశం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి ఇథియోపియన్ నేనే. మిస్ వరల్డ్ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లులు, వారి పిల్లల జీవితాలలోనూ స్ఫూర్తి నింపేది’’ అని చె ప్పారు. -
Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..
ఓపల్ సుచాతా.. మోడల్, థాయ్లాండ్.. తొలి మిస్ వరల్డ్... ఇప్పుడు 72వ మిస్ వరల్డ్! థాయ్లాండ్కి చెందిన ఆమె కేన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్ ట్యూమర్ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్ సుచాతా గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..‘‘నేను పుట్టి పెరిగింది థాయ్లాండ్లోని ఫుకెట్లో. మా ఊరూ హైదరాబాద్లాగే పర్ల్ సిటీ! హైస్కూల్ కోసం బ్యాంకాక్కి మూవ్ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. ప్రస్తుతం నేను అంబాసిడర్ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నాను.. మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్ విమెన్ మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్లో డిటెక్ట్ అయిన ట్యూమర్తో ఫైట్ చేసేలా చేసింది. అది క్యాన్సర్ ట్యూమర్ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్ ఫర్ హర్’ప్రాజెక్ట్తో బ్రెస్ట్క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే రౌండ్తో ఈ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్లో పాల్గొన్నాను. నా కథను షేర్ చేసుకుని, నాప్రాజెక్ట్ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకే కాదు జెండర్స్కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటానుమిస్ వరల్డ్ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.క్రౌన్తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందినా బ్యూటీ పాజెంట్ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్ బ్యూటీ పాజెంట్లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఎ పర్పస్తో విన్ అయ్యి.. మిస్ వరల్డ్ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్ వరల్డ్ క్రౌన్తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్ నా లెర్నింగ్ అన్ లెర్నింగ్ప్రాసెస్కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్ ఆఫ్ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్ షేరింగ్తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్ బ్రాడ్ అయింది.అన్నీ అద్భుతంతెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్ జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్ వరల్డ్.– సరస్వతి రమఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
కీలు మారాక 'ఫీల్ ఎలా ఉంది'?
చాలా ఏళ్ల కిందట ఇటీవల మోకాలి దగ్గర ఉన్న కీళ్లు అరిగితే... తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. పాత నొప్పులంటూ చెబుతూ జీవితాంతం బాధపడేవారు. కదలడానికి కూడా కష్టపడుతూ, నడవడానికి నానా యాతన పడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా వేగంగా ప్రాచుర్యం పొందడంతో ఈ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఒక ఎత్తైతే... ఆ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ, సూచనలూ మరో ఎత్తు. వీటిని ఎంత సమర్థంగా అమలు చేస్తే... నడక అంత వేగంగానూ అంత మెరుగ్గానూ జరుగుతుంది. మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, పాటించాల్సిన సూచనలపై అవగాహన కోసం ఈ కథనం.మోకాలి కీళ్ల మార్పిడి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా బాధితులకు రెండు రకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మొదటిది పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (కంప్లీట్ నీ– రీప్లేస్మెంట్ సర్జరీ), రెండోది... పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ – రీప్లేస్మెంట్ సర్జరీ). వీటిల్లో పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో కోలుకోవడం అన్నది చాలా త్వరితంగా... అంటే రెండు నుంచి నాలుగు వారాల్లో జరుగుతుంది. అదే పూర్తి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకోడానికి నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి అవసరం. బాధితుల అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఈ రెండింటి ప్రభావాలూ, మన్నిక ఒకేలా ఉంటాయి. పోలికలు వద్దు... పైన పేర్కొన్న కాల వ్యవధులను చాలామంది వ్యక్తులను పరిశీలించి... ఓ సగటు సమయాన్ని పేర్కొనడం కోసం చెప్పేవి మాత్రమే. వారి వారి శరీర తత్త్వాన్ని బట్టీ, అలాగే రోగనిరోధక వ్యవస్థ తాలూకు చురుకుదనం, వారి సాధారణం ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ వీటన్నింటి ఆధారంగా కోలుకునే సమయం ఒకరి నుంచి మరొకరికి మారవచ్చు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి వస్తుండే వ్యవధి కూడా ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉండవచ్చు. అందుకే మోకాలి కీలు మార్పిడి జరిగిన ఇతర వ్యక్తులతో ΄ోల్చుకోవడం సరికాదు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం, దాంతో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడం వల్ల గాయం తగ్గడానికి పట్టే సమయం పెరగవచ్చు. అందుకే మరొకరితో ΄ోల్చుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు. శస్త్రచికిత్సకు ముందున్న స్టిఫ్నెస్ : శస్త్రచికిత్సకు ముందు మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నవారికి ఆ తర్వాత కదలికలు పెరుగుతాయి. అయితే మునుపు అంతగా స్టిఫ్గా లేనివారితో పోలిస్తే ఇలా స్టిఫ్గా ఉన్నవారిలో కదలికలు అంతగా పెరగకపోవచ్చు. నొప్పి తీవ్రత ఎక్కువ తక్కువలు : నొప్పి తక్కువగా ఉన్నవారు ఫిజియో వ్యాయామాలను సమర్థంగా చేయగలుగుతారు అందుకే వారిలో మెరుగదల గణనీయంగా ఉండవచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నవారిలోనూ, వ్యాయామల సమయంలో నొప్పిని అంతగా భరించలేనివారిలో వ్యాయామాలు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయి నార్మల్ కదలికలు రాకుండా కేవలం పరిమితంగా మాత్రమే మెరుగుదల కనిపించవచ్చు. ఇలా నొప్పి ఎక్కువగా ఉండేవారు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. డాక్టర్ను సంప్రదించి నొప్పి వాళ్ల ఆధ్వర్యంలో నివారణ మందులు వాడుతూ వ్యాయామాలు చేస్తూ తాము కోరుకున్న స్థాయి మెరుగుదలను పొందవచ్చు.మెరుగుదల ఆధారపడే అంశాలివే... శస్త్రచికిత్స తర్వాత కాలి కదలికలు మామూలుగా మారడం లేదా మోకాలి దగ్గర నార్మల్గా ఉండటం అన్నవి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి... శస్త్రచికిత్సలో ఏ టెక్నిక్ వాడారనే అంశం : శస్త్రచికిత్సలో ఏ తరహా టెక్నిక్ వాడారనే అంశంతో పాటు శస్త్రచికిత్స సమయంలోనే లోపల ఉన్న అవరోధాలనూ, వైకల్యాలను, ఇతరత్రా సమస్యలను ఏ మేరకు రిపేర్ చేశారనే అంశాలపై కూడా శస్త్రచికిత్స తర్వాతి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మోకాలు తాలూకు డిజైన్ : కృత్రిమంగా లోపల అమర్చే భాగాన్ని ప్రోస్థెసిస్’ అంటారు. ఈ ప్రోస్థెటిక్ డిజైన్ను బట్టి కూడా మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న డిజైన్లు మోకాలి కీళ్ల దగ్గర కదలికలు ఫుల్ రేంజ్లో చాలా ఎక్కువగా (గరిష్ఠంగా) ఉండేలా డిజైన్ చేసినవి అందుబాటులోకి వస్తున్నాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి... శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వకపోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. దాని గురించి ఇతర బాధితుల లేదా శస్త్రచికిత్స జరిగినవారితో మీ భావాలు పంచుకోకుండా కేవలం మీ డాక్టర్తో మాట్లాడటమే మంచిది. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతో పాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది.మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత... చేయాల్సినవీ... చేయకూడనివి... మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడం గానీ లేదా మెరుగుదల గానీ, కృత్రిమ కీలు చాలా రోజులు మన్నికతో ఉండటానికి గానీ పాటించాల్సిన సూచనలలో ప్రధానమైవి...చేయాల్సినవి... బరువు అదుపులో ఉంచుకోవడం (స్థూలకాయం వల్ల కృత్రిమ కీలుపై బరువు పడటం వల్ల మన్నిక తగ్గే అవకాశమున్నందున బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం). కృత్రిమ కీలు వద్ద తగినంత కదలికలూ, కీలుకు అవసరమైన బలం సమకూరడంతో పాటు అది చాలాకాలం మన్నికతో ఉండటం కోసం క్వాడ్రసెప్, హ్యామ్స్ట్రింగ్ కండరాలకు బలం చేకూరే వ్యాయామాలు చేయడం. క్రమం తప్పకుండా ఈత (స్విమ్మింగ్), సైక్లింగ్, నడక (వాకింగ్) వ్యాయామాలు. ఇక్కడ పేర్కొన్న వ్యాయామాల్లో బాధితులకు అనువుగా ఉన్నవాటిని రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఆరు రోజుల పాటు చేస్తుండాలి.చేయకూడనివి... పరుగు (రన్నింగ్), ఆటలాడటం వంటి వ్యాయామాలు వద్దు. దీనివల్ల అమర్చిన కృత్రిమ కీలుపై భారం ఎక్కువగా పడి అక్కడ గాయం రేగవచ్చు. మోకాళ్లు పూర్తిగా ముడుచుకునేలా గుంజీళ్లు తీయడం వంటి వ్యాయామాలూ, అలాగే గొంతుక్కూర్చోవడం, బాసిపట్లు వేసి కూర్చోవడం వద్దు. కృత్రిమ కీలు ప్రోస్థెసిస్)లోని పాలీ ఇథిలీన్ / ప్లాస్టిక్ స్పేసర్ భాగం కొంత సున్నితమైనది. కాబట్టి నడక, కఠిన వ్యాయామాలు, రఫ్గా ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొంత విచక్షణ పాటించి జాగ్రత్తగా చూసుకోవడం మేలు.నరాలకు సంబంధించిన సమస్యలుగానీ లేదా నడకలో నొప్పిగాని ఉంటే వాకర్ లేదా వాకింగ్ స్టిక్ వంటి ఉపకరణాల సహాయం తీసుకోవడం మంచిది. చివరగా... కృత్రిమ కీలు కొత్తగా శరీరంలోకి వచ్చి చేరిన భాగమైనందువల్ల మిగతా అవయవాల లాగే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు జ్వరం, గాయం దగ్గర తీవ్రమైన నొప్పి రావడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. అలాగే చెవి, గొంతు, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు కనిపించినా వెంటనే డాక్టర్ను కలవాలి. అంతే తప్ప సొంత చికిత్స రూపంలో యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. పైన పేర్కొన్న సూచనలతో కృత్రిమ కీలును దాదాపు 15 నుంచి 20 ఏళ్లు మన్నేలా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వక΄ోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతోపాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి,సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
జోర్ హుషార్.. సిమ్లా సమ్మర్
‘సిమ్లా–ప్రకృతి అందాలకే కాదు, ప్రత్యేక వేడుకలకూ నిలయమే’ అంటోంది హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం. దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సిమ్లా సమ్మర్ ఫెస్టివల్’ నేటి (జూన్ 1) నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 1960 నుంచి ప్రతి ఏటా జరుగుతూ వస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, ప్రముఖ విద్వాంసుల సంగీత కచేరీలు, సంప్రదాయ జానపద కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. స్థానిక కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటయ్యే వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. జోరుగా హుషారుగా సాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. గతంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి లెజెండరీ కళాకారులు ఈ వేడుకల్లో తమ గాత్ర మాధుర్యంతో శ్రోతలను ఓలలాడించారు.హిమాచలీ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, స్థానిక చేతివృత్తులు, ఉన్ని దుస్తులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇక్కడ అనేక స్టాళ్లు ఏర్పాటవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జనం పోటెత్తుతారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన సంప్రదాయ దుస్తులను ప్రదర్శించే ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక పర్యాటకులకు ఆటవిడుపుగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక మరపురాని అనుభూతి కలిగిస్తుందంటారు వీక్షకులు. ఈ సంబరాలు జూన్ 5న ముగియనున్నాయి. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..) -
ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేద్దాం ఇలా..
అమెరికన్ ఫ్రైడ్ స్ట్రాబెర్రీస్కావలసినవి: గుడ్డు– ఒకటి, పాలు– ఒక కప్పు, పంచదార– 3 టేబుల్ స్పూన్లు, నూనె– ఒక టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్– ఒక టీస్పూన్, మైదాపిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టేబుల్ స్పూన్స్ట్రాబెర్రీలు– 10 లేదా 15తయారీ: ముందుగా ఒక గిన్నెలో గుడ్డు, పాలు, పంచదార, నూనె, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్ వేసికలుపుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమంలో పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ, ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా లేదా మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి, తొడిమలను తొలగించి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బాణలిలో నూనె వేడి చేసుకుని, డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఒక్కో స్ట్రాబెర్రీని మైదా– పాల మిశ్రమంలో ముంచి మళ్లీ నూనెలో వేయించుకోవాలి. కాస్త చల్లారగానే, నచ్చిన విధంగా కట్ చేసుకుని, చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.ఇటాలియన్ కాన్నోలికావలసినవి: గుల్లల కోసం: మైదాపిండి– 2 కప్పులు, పంచదార పొడి– పావు కప్పు, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, వెన్న– 3 టేబుల్ స్పూన్లు, మార్సాలా వైన్– అర కప్పు, నీళ్లు– 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్– ఒక టేబుల్ స్పూన్, నూనె– డీప్ ఫ్రైకి సరిపడా, గుడ్డు– 2 క్రీమ్ కోసం: రికోటా చీజ్– 500 గ్రాములు, పంచదార పొడి– అర కప్పు, వెనీలా ఎసెన్స్– ఒక టీస్పూన్, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, నిమ్మతొక్క తురుము– కొద్దిగాగార్నిష్ కోసం (అభిరుచిని బట్టి): చాక్లెట్ చిప్స్– కొన్నిపంచదార పొడి– కొద్దిగా, పిస్తా తరుగు– కొద్దిగా చెర్రీలు– కొన్నితయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. వెన్న కరిగించి, మైదా మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా చేసుకుని, మధ్యలో గుంతలా చేసుకోవాలి. అనంతరం దానిలో మార్సాలా వైన్, నీళ్లు, వెనిగర్, గుడ్లు (ఒక తెల్లసొన తీసి పక్కనపెట్టుకోవాలి) వేసుకుని బాగా ముద్దలా కలుపుకోవాలి. అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమానికి క్లాత్ చుట్టి రెండుగంటలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, కాస్త కోలగా చపాతీలు మాదిరి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక్కో చపాతీని కాన్నోలి ట్యూబ్కి చుట్టి, రెండు అంచులు అతుక్కునే చోట గుడ్డు తెల్లసొన కొద్దిగా రాస్తే అది ఊడిపోదు. ఇప్పుడు అన్నీ చపాతీలు అలానే చేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక కాన్నోలి ట్యూబ్లను తొలగిస్తే, చిత్రంలో కనిపిస్తున్న గుల్లల మాదిరి ఉంటాయి. అనంతరం ఒక గిన్నెలో రికోటా చీజ్ను హ్యాండ్ బ్లెండర్తో క్రీమీగా చేసుకుని దానిలో పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమంతో తయారుచేసిన గుల్లల్లో ఈ మిశ్రమం నింపుకుని, పిస్తా ముక్కలు, చాక్లెట్ చిప్స్, పంచదార పొడి, చర్రీస్ ఇలా నచ్చిన వాటితో, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. (చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..) -
పులిలా కనిపించే పిల్లి..!
ఈ పిల్లి వాక్ చేస్తే ఫర్నిచర్ వణుకుతుంది. ఓరకంట ఒక్క చూపు చూస్తే మొరుగుతున్న కుక్కలు కూడా గప్చిప్గా నోరు మూసుకుంటాయి. అది పిల్లి కాదు, పులి అని అనుకుంటున్నారా? కానేకాదు, నిజంగానే అది పిల్లే, పేరు జ్యూస్. చూడ్డానికి పెద్దపులిలాగా కనిపిస్తుంది. పదమూడు కిలోల బరువు, నాలుగు అడుగుల మూడు అంగుళాల పొడవుతో ఎదుగుతున్న పులిపిల్లలా ఉంటుంది. దానికున్న భారీ ఆకారమే జ్యూస్ను తమ వీథిలోని పెంపుడు జంతువులకు డాన్గా మార్చేసింది. ఆహారం కూడా దాని సైజుకు తగ్గట్టుగానే రోజుకు రెండు కిలోల మాంసం, టాప్ బ్రాండ్ ట్రీ ట్స్తో స్పెషల్ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో దీనికున్న క్రేజ్ మామూలుగా ఉండదు. జ్యూస్ నిద్రపోయే వీడియోకు కూడా మిలియన్స్లో లైక్స్ వస్తాయి. జ్యూస్ గురించి దాని యజమానురాలు డానియేలా మాట్లాడుతూ ‘నాకు ఇది చిన్న పిల్లికూనగా వీథిలో దొరికింది. ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంటే, రోజు రోజూకు భారీగా పెరిగిపోయింది. ఇది ఇంత పెద్దగా మారుతుందని అసలు అనుకోలేదు. మీరెవరైనా ఇకపై పిల్లిని పెంచుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి.’ అని చెప్పింది. (చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..) -
ఇంటర్ తర్వాత వాట్ నెక్స్ట్..? టెన్షన్ వద్దు..
ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్ చెయ్, ఫ్యూచర్ బాగుంటుంది.’’‘‘నీట్ రాయి, ఎంబీబీఎస్ అయిపోతే జీవితం సెట్ అవుతుంది.’’‘‘బీకామ్ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్ కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. బైపీసీ తర్వాత మెడిసిన్ తప్ప మరేం చేసినా వేస్ట్. బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కామర్స్ అంటే సీఏ తప్ప దారిలేదుకామర్స్ స్ట్రీమ్లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్ ఇప్పుడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ ఉండదు.. ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మీడియా, కాగ్నిటివ్ సైన్స్ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. దారి చూపించే మూడు ప్రశ్నలు...ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. అది మీకు ప్యాషన్ కలిగించాలి.అది మీకు పర్పస్ నేర్పించాలి.అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్. నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్. ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్ అండ్ అవేర్నెస్ + స్కిల్ అండ్ మ్యాపింగ్ + ఫ్యూచర్ విజన్= రైట్ కెరీర్. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జస్ట్ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..! మరింత అందంగా ఇల్లు..) -
జస్ట్ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..!
వ్యర్థాలతో కళాత్మక వస్తువుల తయారీ గురించి మనకు తెలిసిందే! కేరళ వాసి అంజలి పవన్ అప్సైకిల్డ్ వ్యర్థాలతో తన ఇంటి ఆవరణలో ఓ తోటను ఏర్పాటు చేసింది. దానికి తన తల్లితో కలిసి వాడేసిన డబ్బాలు, సీసాలు, టైర్లు, పాత బట్టలు వంటి వ్యర్థాలను ఉపయోగించి, అప్సైక్లింగ్ చేయడం ద్వారా వాటి రూపు రేఖలనే మార్చేసింది.తల్లీ కూతుళ్ల వినూత్న ప్రయోగం‘‘మా అమ్మ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ జపనీస్ కళ కోకెడామా చూశాను. కోకెడామా అనేది జపనీస్ తోటపని పద్ధతి. ఇక్కడ మొక్కల వేళ్లను నాచుపట్టిన బంతిలో చుట్టి, వేలాడే తోటలను సృష్టిస్తారు. నేను కోకెడామాను చాలా ఇష్టపడ్డాను. సొంతంగా అలాంటి తోటను నేను సృష్టించుకోవాలనుకున్నాను. ఆన్లైన్లోను, యూట్యూబ్లోను శోధించిన తర్వాత, ఈ గార్డెన్ క్రియేషన్ను అమల్లో పెట్టాను. ఒకదాని నుంచి మరిన్ని మొక్కలను నాటడం ప్రారంభించాను. దీంతో మా తోట వికసించడం మొదలైంది. దానిని మరింత పెంచడానికి మరిన్ని కొత్త పద్ధతులను కనిపెట్టాం. పడేసే వస్తువులతో పర్యావరణ అనుకూలమైన ప్లాంటర్లుగా మార్చాను. దీనికి మా అమ్మ కూడా సాయం చేసింది. పెయింట్ డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పొట్టు, ప్లాస్టిక్ సీసాలు, పాత కుట్టు మిషన్లు, డ్రమ్స్ వంటి వాటిని ఉపయోగించాం. ఇప్పుడు మా తోట మొత్తం వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. కానీ, అవి అత్యంత అందంగా మారిపోయాయి’’ అని చెబుతుంది అంజలి. మాక్రేమ్ ఆర్ట్ ఉపయోగించి వీరు ప్లాంట్ హ్యాంగర్లను కూడా తయారు చేశారు. అంజలి తల్లి పాత దుస్తులను ఉపయోగించి, మొక్కల కుండీలను తయారు చేస్తుంది. వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా, ఈ తల్లీ కూతుళ్లు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మార్కెట్ నుంచి ప్లాంటర్లను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసే డబ్బును కూడా ఆదా చేసే మార్గాన్ని కనిపెట్టారు. ఇప్పుడు వీరి ఇంటి ఆవరణ పచ్చదనంతో అత్యంత ఆహ్లాదంగా మారిపోయింది. ఎన్.ఆర్ (చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..) -
నటి మడోన్నా సెబాస్టియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
చక్కని చిరునవ్వుతో మనసు గెలుచుకునే నటి మడోన్నా సెబాస్టియన్. తెరమీద కనిపిస్తే ఆ ఫ్రేమ్కే అందం తెచ్చిపెట్టగలిగేంత అందంగా ఉంటారు. అలా తెరమీదనే కాదు, తెరవెనుక కూడా కనులవిందుగా ఉంటుంది ఆమె స్టయిలింగ్. ఇందుకోసం ఆమె సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్సే ఇవి.చెవి దగ్గర మొదలై మెడ చుట్టూ తిరిగి జడలో ముగిసే అందమైన కథే చెంపసరాలు. ఇవి కేవలం ఆభరణాలే కాదు. జడలోకి దిగి వచ్చే పూల గొలుసులు. ఇవి పెట్టుకున్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఆ ఫ్రేమ్ మొత్తం అందంగా మెరిసిపోతుంది. చెంపసరాల ట్రెండ్ కొత్తేమీ కాదు. కాని, ఇప్పుడు వీటి ప్రెజెంటేషన్, స్టయిలిష్గా మారడంతో మళ్లీ వీటికి రీబర్త్ వచ్చింది. మోడర్న్ వన్ పీస్ డ్రెస్స్ల్లోకి కూడా అమ్మాయిలు స్టేట్మెంట్ లుక్గా వీటిని వేసుకుంటున్నారు. ముత్యాలు, కుందన్, రుబీ, టెంపుల్ ఇలా రకరకాల డిజైన్లలో లభించే చెంపసరాలను వేసుకుంటే, చుట్టూ ఉన్నవాళ్ల చూపులన్నీ మీ చెవులవైపు తిప్పేలా చేస్తాయి. చీర, లెహంగా, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఏదైనా, వీటిని వేసుకోవడానికి కమ్మలను మాత్రం పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, బోసిగా ఉంచిన మెడ, చెంపసరాలకు తగ్గట్టుగా ఉండే హెయిర్ స్టయిల్, సింపుల్ గాజులు ఇవన్నీ కలిస్తేనే అందం. అప్పుడే చెంపసరాలకు, వాటిని వేసుకున్న మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అచ్చం నటి మడోన్నా లుక్లాగా.అందం అందులో ఉండదు..అందం అంతా క్రీమ్స్, మేకప్స్లో ఉండదు. మంచి స్కిన్ కేర్లోనే ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ మసాజ్, నేచురల్ ప్రాడక్ట్స్, హైడ్రేటింగ్ స్కిన్ కేరే నా బ్యూటీ సీక్రెట్. దుస్తుల్లో కూడా ‘ఇది నాకు నప్పుతుందా?’ అని కాకుండా ‘ఇది నేను కంఫర్ట్గా వాడతానా?’ అని ఆలోచించి సెలక్ట్ చేస్తానని చెబుతోంది మడోన్నా సెబాస్టియన్. -దీపిక కొండి(చదవండి: ఘనంగా ముగిసిన మిస్ వరల్డ్ అందాల పోటీలు) -
కొత్త అల్లుడికి కొసరి..కొసరి..
తెలుగు నాట సంక్రాంతి అల్లుళ్లకు ఎలాంటి ఆదరాభిమానాలు అందుతాయో పశ్చిమబెంగాల్కు చెందిన బెంగాలీలకు కూడా అల్లుళ్లను గౌరవించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి యేటా తిథి, నక్షత్రం ప్రకారం అల్లుళ్లను గౌరవంగా ఇంటికి ఆనించి సత్కరిస్తారు. జమై షష్టి అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించే బెంగాలీలు అమ్మవారికి అందించే సకల గౌరవ మర్యాదలు, సత్కారాలను అల్లుళ్లకు సమర్పిస్తారు. కొత్త బట్టలు పెట్టి ఇష్టమైన వంటకాలను వడ్డిస్తారు. జేష్ట మాసంలో జరిగే ఈ పండుగను జూన్ ఒకటో తేదీన జమై షష్టి మహోత్సవం పేరుతో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే బెంగాలీలు పూర్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దశాబ్దాలుగా స్థిరపడిన బెంగాలీలు ఏడానికోసారి కన్నులు పండుగగా దీనిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అల్లుడు అత్తారింటికి వచ్చిన రోజు జరిగే హంగు ఆర్భాటాలు, అందుకు అయ్యే ఖర్చులను అత్తగారి భరిస్తారు. ఇక మరుసటి రోజు అల్లుడి వంతు ఉంటుంది.అల్లుళ్ళకు రాజభోగం.. అమ్మవారి కరుణ కటాక్షం మా కుటుంబంతో పాటు అల్లుళ్లపై ఉండాలని కోరుతూ జమై షష్టి నిర్వహిస్తాం. ఒకరికొకరు కొత్త బట్టలతో, బహుమతులతో గౌరవించుకుంటాం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. – మౌసమీ– బెంగాలీ మహిళఖర్చంతా అల్లుడిదే.. అత్తారింటికి చేరిన అల్లుడు మరుసటి రోజు జరిగే ఉత్సవానికి ఆయనే ప్రధాన బాధ్యుడిగా ఉంటారు. అంటే ఆ రోజు జరిగే ఖర్చంతా అల్లుడు భరించాల్సి ఉంటుంది. ఇంట్లోని వారందరికీ బహుమతులతో పాటు అత్తగారికి చీరను బహూకరిస్తారు. ఇతర కుటుంబ సభ్యులకు మర్యాదపూర్వకంగా గిఫ్ట్లు అందజేస్తారు. ఈ ఖర్చంతా అల్లుడు చూసుకుంటాడు. జమై షష్టి.. బెంగాలీల ఆచారం.. జమై షష్టి..అనేది బెంగాలీ ప్రజల సంప్రదాయ, సాంస్కృతిక ఆచారం. ఈ ఆచారాన్ని జైష్ట మాసం శుక్ల పక్ష ఆరవ తిథి నాడు నిర్వహిస్తారు. జమై అంటే అల్లుడు. షష్టి అంటే చంద్ర పక్షంలోని ఆరో రోజు. జమైషష్టి అనేది అల్లుళ్లను గౌరవించడానికి అంకితం చేసే పండుగ. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అత్తగారు వారి శ్రేయస్సు కోసం దుర్గా దేవిని పూజిస్తారు. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..) -
మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..
సోషల్మీడియాలో యుగంలో ప్రతి ఒక్కటీ వింతే.. అన్నట్లు ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏఐ ఏఐ హవా నడుస్తోంది. రెండు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో హోరెత్తిన సోషల్మీడియా.. తాజాగా బేబీ పాడ్కాస్ట్, బేబీ ఏఐ వీడియోలతో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు బేబీ రూపంలో చేసిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ప్రతి ఒక్కరూ దీనిని ట్రెండ్గా ఫాలో అవుతున్నారు. సోషల్మీడియాలోని ఇన్స్టా, ఫేస్బుక్లతో పాటు అన్ని యాప్లలో బేబీ పాడ్కాస్ట్ విడియోలే దర్శనమిస్తున్నాయి. సినిమాల్లోని వైరల్ సీన్లను బేబీ పాడ్ కాస్ట్ రూపంలోకి తీసుకొచ్చి సందడి చేస్తున్నారు. చాట్జీపీటీ ఏఐతో ఈ బేబీ పాడ్కాస్ట్ వీడియోలు చేస్తున్నారు. సినిమా, పొలిటికల్, నెటిజన్లు చేసిన వీడియోలు దీనికి కేంద్రబిందువుగా మారుతున్నాయి. గిబ్లీ ఆర్ట్ చేసిన రచ్చను మించి బేబీ పాడ్కాస్ట్ చేస్తుందని నెటిజన్ల అభిప్రాయం. (చదవండి: ఆసియాలో అతిపెద్ద భూగర్భ లైబ్రరీ..! పైన దేవాలయం..కింద గ్రంథాలయం) -
మొఘులుల కాలం నాటి ఖుర్బానీ కా కహానీ..!
విందు భోజనం తినే ముందు ఆకలిగా అనిపించడం సహజమే. కానీ సిటీలోని వేడుకల్లో పాల్గొనేవారికి విందు దాదాపు ముగింపునకు వచ్చేటప్పుడు కూడా కొత్త ఆకలి పుట్టుకొస్తుంది. కారణం ఖుర్బానీ కా మీఠా. ఈ డెజర్ట్ లేకుండా నగరంలో ఏ విందూ పూర్తి కాదు. తినకుండా ఏ జిహ్వా శాంతించదు. ఇంతగా సిటిజనుల అభి‘రుచి’లో అల్లుకుపోయిన ఈ ఖుర్బానీ కా మీఠా కహాని దాని తియ్యదనమంత గొప్పది. కునాఫా చాక్లెట్లు, చీజ్కేక్లు, మాకరూన్లు వంటి కొత్త కొత్తవి సిటీ డెజర్ట్స్ మెనూలోకి రావడానికి చాలా కాలం ముందు నుంచే ఓ మిఠాయి రాజదర్పంతో కింగ్ ఆఫ్ డెజర్ట్స్గా నగరంలో వర్థిల్లుతోంది. నిజాం వంశాల వంటగదుల్లో జచిన ఈ మిఠాయి, హైదరాబాద్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకల భోజనాలు ఈ డెజర్ట్తో ముగిస్తేనే.. అది సంపూర్ణ విందుగా పరిగణిస్తారు. రాత్రంతా నానబెట్టిన డ్రై ఆప్రికాట్లను చక్కెరతో మగ్గించి, బాదం లేదా ఆప్రికాట్ గింజలతో అలంకరించడంతో ఇది స్వీట్ రూపం దాల్చుతుంది. ఈ రుచికరమైన డెజర్ట్ను మలాయ్, వెనిల్లా ఐస్క్రీమ్ లేదా కస్టర్డ్తో కలిపి కాంబినేషన్గా అందిస్తున్నారు.మొఘలుల కాలం నుంచే.. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్కు ఫెర్గానా లోయ (ఉజ్బెకిస్తాన్)లో పండే ఆప్రికాట్లు బాగా నచ్చేవట. భారతదేశపు వేడిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు తన స్వదేశ పండ్లను బాగా మిస్ అయ్యేవాడట. ఆ తర్వాత భారత ఉపఖండంలోకి అలా వచ్చిన ఆప్రికాట్లు నాటి చక్రవర్తుల పుణ్యమాని మొఘల్ వంటల్లో కూడా ప్రాధాన్యం పొందాయి. నగరాన్ని పాలించిన ఆసఫ్ జాహీ రాజవంశం హయాంలో ఈ మిఠాయి హైదరాబాద్ క్యుజిన్లో ప్రాముఖ్యం పొందింది.నగరం నలువైపులా..హైదరాబాద్ వంటకాలకు పేరొందిన ప్రతి రెస్టారెంట్ ఖుర్బానీ కా మీఠాను ప్రత్యేకంగా అందిస్తుంది. బిర్యానీకి పేరొందిన ప్యారడైజ్ రెస్టారెంట్, షాదాబ్ హోటల్, బావర్చీ హోటల్, నవాబ్స్ రెస్టారెంట్, సర్వీ, నానీస్ ప్యూర్ వెజ్, కబూల్ దర్బార్ వంటివన్నీ ఈ డెజర్ట్ను సర్వ్ చేస్తున్నాయి. అలాగే మినర్వా కాఫీ షాప్స్, చట్నీస్లో క్లాసిక్ ఖుర్బానీ కా మిఠాను ఐస్క్రీమ్తో కలిపి అందిస్తారు. కరాచీ బేకరి, ఆల్మండ్ హౌజ్ వంటి కొన్ని మిఠాయి దుకాణాల్లో ప్యాకింగ్స్లో కూడా దొరుకుతుంది. దీని ధరలు రూ.70 నుంచి రూ.600 వరకూ ఉన్నాయి. సితార ఫుడ్స్ వంటివి కిలోల లెక్కన విక్రయిస్తున్నాయి. చైనాలో పుట్టి.. చరిత్రకెక్కి.. ఖుర్బానీ కా మిఠా కేవలం ఒక మిఠాయి కాదు. తరాలుగా మనతో పాటు అల్లుకున్న చారిత్రక, సాంస్కృతిక సంపద. ఖుర్బానీ అంటే ఉర్దూలో ఆప్రికాట్. చైనాలో జన్మించిన ఈ పండు, క్రీ.పూ.4వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ సైనికుల ద్వారా భారతదేశం మీదుగా యూరప్కు ప్రయాణించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.ఆధునిక రూపం.. ఆప్రికాట్ డిలైట్.. ఈ మధ్య కాలంలో ఖుర్బానీ కా మిఠాకు సరికొత్త అవతారం దాల్చింది. అదే ఆప్రికాట్ డిలైట్. ఇందులో అసలు మిఠాయి రుచిని అలా ఉంచుతూనే కేక్, కస్టర్డ్, విప్డ్ క్రీమ్ వంటి కొత్త రుచులు జోడించి ట్రైఫిల్ లాగా తయారు చేస్తారు. ఈ కొత్త వెర్షన్ జూబ్లీహిల్స్లోని ది స్పైసీ వెన్యూ హోటల్కి చెందిన ఎల్.రవీందర్ కుమార్ రూపొందించారు. ఈ డెజర్ట్ సోషల్ మీడియా, ఫుడ్ బ్లాగర్ల ద్వారా మరింత ప్రజాదరణ పొందింది. పారంపర్యానికంటే భిన్నంగా ఉందని కొన్ని వర్గాలు విమర్శిస్తున్నా మరికొందరు దీనిని పాత మిఠాయికి కొత్త జీవం పోసే ప్రయత్నంగా స్వీకరిస్తున్నారు. (చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..) -
Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే..
ప్రపంచ వేదికపై హైదరాబాద్ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు క్యాట్ వాక్ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ విభాగానికి గ్లోబల్ అంబాసిడర్గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. మెగా హంగామా.. ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్ కట్టర్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు సాంగ్కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.ఆతిథ్యం అద్భుతం.. ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్ 4లో నిలిచిన పోలండ్ కాంటెస్టెంట్ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు. ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. అంతే కాకుండా ఈ గ్రాండ్ ఫినాలేలో టాప్ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్ కాంటెస్టెంట్ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్ కూడా హైదరాబాద్కు సుపరిచితుడే. ( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా) -
చూడటానికి అదొక దేవాలయం..! కానీ కింద చూస్తే..
అదొక పుస్తక నిలయం. లక్షల సంఖ్యలో గ్రంథాలతో కళకళలాడే జ్ఞానభాండాగారం. కాని, అక్కడికి వెళితే, అక్కడ ఒక దేవాలయం మాత్రమే గోచరిస్తుంది. గుడిలోకి ప్రవేశించాక నేలమాళిగలోకి వెళ్లేందుకు భూగర్భమార్గం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గంలో కిందికిపోతే, అరుదైన భూగర్భ గ్రంథాలయం ఆశ్చర్యపరుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ గ్రంథాలయమది. అత్యంత అరుదైన ఈ భూగర్భ గ్రంథాలయం కథా కమామిషు తెలుసుకుందాం...పదహారడుగుల లోతులో...రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా భడారియా గ్రామం చుట్టూ ఎడారి వాతావరణం. ఊరిలో భడారియా దేవాలయం ప్రత్యేక ఆకర్షణ కేంద్రం. కారణం ఈ ఆలయం భూ ఉపరితలానికి పదహారడుగుల కింద కొలువైన భూగర్భ గ్రంథాలయం. విశాలమైన వరండాలు, గాజు అలమరాలలో భద్రపరచిన పుస్తకాలు, పెద్దపెద్ద ర్యాకులు, ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు. భడారియా గ్రంథాలయాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహణ భవన్. అధ్యయన భవన్లో వందలాది మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విశాలమైన గదులను నిర్మించారు. సంగ్రహణ భవన్లో పలు అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు. వీటికోసం 562 అలమరాలు, 16వేల అడుగుల పొడవులో ర్యాక్స్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రాచీన ప్రతులు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. భడారియా మహారాజు కృషి ఫలితంభడారియా మహారాజు 1960లో శక్తిపీఠమైన భడారియామాత మందిరాన్ని సందర్శించి. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హరివంశ్సింగ్ నిర్మల్. ఇక్కడి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ గ్రంథాలయాన్ని నెలకొల్పాలని అనుకున్నారు. 1983లో నిర్మాణానికి సంకల్పించారు. బయట ఎడారి వాతావరణం కాబట్టి పాఠకులకు, సందర్శకులకు ఇబ్బంది లేకుండా దీనిని నేలమాళిగలో నిర్మించారు. దీనివల్ల లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఎలాంటి అసౌకర్యానికి గురికారు. మహారాజు పదిహేనేళ్ల కృషికి ఫలితంగా 1998లో ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణం ప్రారంభం నుంచే పుస్తకాల సేకరణ ప్రారంభించారు. అలా ఇప్పటికి తొమ్మిది లక్షల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రపంచస్థాయిలోని పలు మత గ్రంథాలు, చారిత్రక, భాషా, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. వీటితోపాటు వినోద, విజ్ఞానాలను పంచే పుస్తకాలనూ ఉంచారు. ఇక్కడికి వచ్చే పరిశోధకులు, విజ్ఞానార్థులు వేరేచోట అన్వేషించాల్సిన అవసరం లేకుండా సకల గ్రంథాలూ లభించేలా సమకూర్చారు. విశాలమైన భోజనశాలలుపలు అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చే వారికోసం పద్దెనిమిది గదులు నిర్మించారు. అలాగే విశాలమైన భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతమైనా, ఈ గ్రంథాలయంలో ఎక్కడా వేడి వాతావరణం కనిపించదు. పాలరాతి గోడలతో చుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా దీనిని నిర్మించారు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాదు, యూరోప్ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిఆసియాలో పేరున్న భూగర్భ గ్రంథాలయాల రెండే ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని స్టార్ ఫీల్డ్ లైబ్రరీ ఒకటి కాగా రెండోది మన భడారియా గ్రంథాలయం. ఈ రెండిటిలో భడారీయా పుస్తక నిలయమే పెద్దది కావడం విశేషం. తిరుమలరావు కరుకోల(చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
రాచ సాలీడు..! టాలెంట్కి ఫిదా అవ్వాల్సిందే..
‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే సినిమా డైలాగ్లా కాదు. కొన్నిసార్లు కటౌట్తో పనిలేకుండా కూడా కొన్ని కొన్ని నమ్మేయాలి. ఎందుకంటే, ఫొటోలో చిన్నగా బొద్దుగా ఉండే ఈ సాలీడు టాలెంట్ తెలిస్తే అలాగే అనిపిస్తుంది. ఇది సాలీడు జాతికే రారాజులాంటిది. పేరు ‘డార్విన్ బార్క్ స్పైడర్’. కేవలం ఇరవై రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కాని, అది అల్లే సాలెగూడు పరిమాణం ముందు సినిమాల్లోని స్పైడర్ మాన్ కూడా తలదించుకోవాల్సిందే! గాలిలోకి దాని జిగురు దారాలను వదిలి, ఎక్కడో ఓ చెట్టుకి అంటుకునేలా చేస్తుంది. అలా మొదలైన దాని సాలెగూడు ఏకంగా ఇరవై ఐదు మీటర్ల దూరం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన గూడు నిర్మించుకునే సాలీడుగా ఇది రికార్డులకెక్కింది. గూడు ఎంత పెద్దదైతేనేం అంత బలంగా ఉండదనుకోకండి. దాని జిగురు దారాల బలం, పట్టుదారం కంటే పదిరెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. దాని సాలెగూడులో పడి, ఒకేసారి దాదాపు ఇరవై దోమలు, ఈగలు బ్రేక్ఫాస్ట్ బఫేగా మారిపోగలవు. దీని గురించి తెలిస్తే స్పైడర్మాన్ కంటే ఈ నిజమైన వెబ్ హీరోకే ఫిదా అయిపోతారు. (చదవండి: కింగులా బతికాడు సింగిల్గా..!) -
కింగులా బతికాడు సింగిల్గా..!
రోజూ పొద్దునే లేస్తాడు. ఆకలైతే తింటాడు. వ్యవసాయం తన వృత్తి. ఇంటి ముందే కొన్ని పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుకుంటుంటాడు. మనుషులెవ్వరితోనూ మాట్లాడడు. మూగజీవాలు, పక్షులే అతని ఫ్రెండ్స్. కాలక్షేపం కోసం ఇంటి పనులు, మరమ్మతులు, నీటి గుంటలు తవ్వటం వంటివి చేస్తాడు. అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక అలసట వస్తే, స్వయంగా నిర్మించుకున్న తన తాటాకుల గుడిసెలో సేద తీరుతాడు. అతన్ని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా, ప్రతిసారి పెద్ద యుద్ధమే చేసి, విజయం సాధించాడు. అడగకుండా ఎన్ని ఇచ్చినా పుచ్చుకోకుండా, చేయి చాచని మహారాజులా నిలబడేవాడు. ఆఖరుకు ఎక్కడికైనా చేరగల ఇంటర్నెట్ కూడా అతని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అతన్ని మచ్చిక చేసుకోలేక పోయాయి. ఇలా హాయిగా తన పని తాను చేసుకునేవాడు. ఇంతే! ఇదే తన జీవితం. ఎంతో అందమైన, ప్రశాంతమైన జీవితం. ఇలా అందరూ బతకలేరు. ఎవరికీ సాధ్యం కాని పనికూడా! అయినప్పటికీ అతను ఈ సూపర్ సింగిల్ లైఫ్ని గత మూడు దశాబ్దాలుగా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అతనెవ్వరో కాదు, 1996లో తొలిసారి అమెజాన్ అటవీ అధికారులు గుర్తించిన ఒంటరి గిరిజనుడు. అతని తెగ మొత్తం అంతరించిపోయినా, అతను మాత్రం ఒక్కడే అడవిలో జీవిస్తున్నాడని తెలిసింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం అతన్ని 2018లో కెమెరాలో రహస్యంగా వీడియో తీసి, వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ మధ్యనే అధికారులకు అతని శరీరం గుడిసెలో కనిపించింది. నిద్రలో ప్రశాంతంగా మరణించాడు. ఇరవై ఆరేళ్లపాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, కలవకుండా, ఒంటరిగా మహారాజులా బతికి, అంతే రాజసంగా లోకం నుంచి నిష్క్రమించాడు. (చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
పాలిచ్చే తల్లులూ..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...!
నాకు త్వరలో తొమ్మిదో నెల నిండుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ కావటంతో చాలా భయంగా ఉంది. మా ఊరి నుంచి దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. అందుకే, ముందుగానే ఆసుపత్రికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాలి?– రమణి, శ్రీకాకుళం. మొదటి ప్రెగ్నెన్సీలో కొంచెం గందరగోళం ఉంటుంది. ఏ సమయంలో నొప్పులు వస్తాయో తెలియదు కాబట్టి, తొమ్మిదో నెల వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్, బ్యాగ్ ఎప్పుడూ సిద్ధంగా ఒక చోట పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీకు వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, ఉమ్మనీరు పోతున్నా వెంటనే ఆసుపత్రికి బయలు దేరాలి. నొప్పులు మొదటి డెలివరీలో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమందికి టైమర్ పెట్టుకొని పది నిమిషాల్లో ఎన్నిసార్లు పొట్ట గట్టిగా అవుతుందో నోట్ చెయ్యమని చెప్తాం. పది నిమిషాల్లో మూడుసార్లు టైట్గా అయినా, నొప్పి ఎక్కువ అయినా, అవి డెలివరీ పెయిన్స్ అని అర్థం. ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ముప్పయి సెకండ్ల నుంచి ఒక నిమిషం ఉంటుంది. కొంతమందికి నొప్పులు ప్రతి అర్ధగంటకొకసారి ఎక్కువ అవుతుంటాయి. అంటే కాన్పు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. కేవలం నొప్పి ప్రతి అర్ధగంటకొకసారి వస్తుంటే రెండు నుంచి మూడు గంటలు చెక్ చేసుకొని, నొప్పి ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి వెళ్లండి. కొంతమందికి నొప్పి వచ్చి ఒక గంటలో తగ్గిపోతుంది. అంటే అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని అర్థం. అందుకే నొప్పి అనిపించిన తరువాత రెండు నుంచి మూడు గంటలు ఆగాలి. మొదటి ప్రెగ్నెన్సీలో నొప్పి మొదలైన పన్నెండు నుంచి ఇరవైనాలుగు గంటలకు కాని, కాన్పు కాదు. అందుకే, హడావిడి పడనవసరం లేదు. కాని, బ్లీడింగ్ లేదా వాటర్ లీక్ అవుతుంటే మాత్రం, నొప్పి లేకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్లాలి. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ పల్స్, బీపీ, బేబీ హార్ట్బీట్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు. వాటిని బట్టే ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. ఫాల్స్ లేబర్ అయితే కొన్ని పరీక్షలు చేసి ఇంటికి పంపిచేస్తారు.నాకు డెలివరీ అయి రెండు నెలలు అవుతోంది. చాలాసార్లు నిపుల్ క్రాక్స్ వస్తున్నాయి. బ్లడ్ కూడా వస్తోంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – లావణ్య, తిరుపతి. బేబీకి ఒక సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలు చాలా అవసరం. అందుకే, బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే సమస్యలకు చాలా త్వరగా చికిత్స తీసుకోవాలి. పాలు తగ్గినా, నిపుల్ క్రాక్స్ ఉన్నా బేబీకి పాలు తాగటం కష్టం అవుతుంది. మీకు కూడా చాలా నొప్పి ఉంటుంది. పుండు లేదా పగిలిన చనుమొనలకు చికిత్స తీసుకోవడానికి ముందు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్ సబ్బులని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కాటన్ లోదుస్తులను వేసుకోవాలి. దానితో రొమ్ములకు మంచి ఎయిర్ సర్కులేషన్ వస్తుంది. వ్యాసలిన్ లేదా పారాఫిన్ లేదా ప్యూరిఫైడ్ లోషన్తో నిపుల్ మీద మసాజ్ చెయ్యాలి. ఇలా ప్రతి ఫీడ్ తరువాత చెయ్యండి. మళ్లీ ఫీడ్కి ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఫీడింగ్ ఇవ్వండి. బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుతున్నవారు, వాటిని ప్రతి ఫీడ్ తరువాత మార్చుకోవాలి. ఇలా క్రాక్స్ కాకుండా ప్రివెంట్ చెయ్యడానికి ఫీడ్ అయిన వెంటనే కొంచెం బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి నిపుల్ మీద రాసి, తరువాత కవర్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేస్తే అసలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. నిపుల్ షీల్డ్ అని మెడికల్ షాప్స్లో రబ్బర్ కవరింగ్స్ దొరుకుతాయి. ఒకవేళ క్రాక్స్ ఎక్కువ ఉండి, బ్లీడింగ్ అవుతుంటే క్రీమ్స్ రాసి దాని తరువాత సరైన సైజ్లోని షీల్డ్ పెట్టి ఫీడింగ్ ఇస్తే నిపుల్కి విశ్రాంతి దొరికి, బ్లీడింగ్ అవకుండా ఉంటుంది. బేబీకి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నిపుల్ క్రాక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, ఒకసారి పిల్లల డాక్టర్కి బేబీని చూపించండి. తరచు క్రాక్స్కి ఇది కారణం కావచ్చు. బేబీ సకింగ్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. రొమ్ముల ఐరోలా, నిపుల్ మొత్తం నోటిలో పెట్టుకొని బేబీ సక్ చెయ్యాలి. అప్పుడే పాలు బాగా వస్తాయి. నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. నిపుల్ ఒక్కటే పట్టుకొని సక్ చేస్తే క్రాక్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి లాక్టేషన్ కన్సలెంట్ని కలసి మీకు పొజిషన్స్ ఫర్ ఫీడింగ్ గురించి తెలుసుకోండి. ఇవి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఫీడింగ్ బాగా వస్తుంది, నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..! వ్యాయామాలు చేయకుండానే..) -
ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!
మయాన్మార్లోని బాగన్ ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఒకప్పుడు పేగన్ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ఈ ప్రాంతం, వేలాది పురాతన బౌద్ధ దేవాలయాలు, స్థూపాలు, పగోడాలకు ప్రసిద్ధి చెందింది. 11 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణాలు బర్మీస్ నిర్మాణ కళకు అద్భుతమైన సాక్ష్యాలుగా కనిపిస్తాయి.విస్తారమైన మైదానంలో ఎటు చూసినా కనిపించే ఈ ఆలయాల దృశ్యం గొప్ప అనుభూతినిస్తుంది. సంధ్యవేళలో బంగారుకాంతితో మెరిసే ఈ నిర్మాణాలు, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆనంద టెంపుల్, శ్వేదగాన్ పగోడా, థాబ్యిన్యు టెంపుల్ వంటి ముఖ్యమైన ఆలయాలు అక్కడి చరిత్రను చాటి చెబుతాయి.బాగన్ అందాలను ఆస్వాదించడానికి ‘హాట్ ఎయిర్ బెలూన్ రైడ్’ భలేగా ఉంటుంది. ఆ రైడ్తో ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎత్తయిన ప్రదేశం నుంచి ఈ పురాతన నగరంలోని విశాలమైన ఆలయాల దృశ్యాన్ని చూడటం ఒక మరపురాని అనుభవం కలిగిస్తుందంటారు పర్యాటకులు. కాలక్రమేణా ఇక్కడ కొన్ని ఆలయాలు శిథిలమైనప్పటికీ, బాగన్ చారిత్రక ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. ఇది చరిత్ర, సంస్కృతిని ప్రేమించే వారు, తప్పక చూడవలసిన ప్రదేశం. (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్కే అందని మిస్టరీ..!) -
వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! నెటిజన్లు ఫిదా
వందేళ్లు దాటిన అందాలబామ్మ ఆమె. ‘ఆన్లైన్’లో ఈ బామ్మ పేల్చే బ్లష్ బ్లాస్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఆమె చెప్పే పాఠాలు వింటే వెంటనే మీరు కూడా మేకప్ బ్రష్ పట్టుకొని అద్దం ముందుకు వెళ్తారు. బామ్మలు అంటే కుకీస్ చేయటం, కథలు చెప్పడమే కాదు; సౌందర్య పోషణతో సోషల్ మీడియాను షేక్ చేయవచ్చని నిరూపించింది ఇంగ్లండ్కు చెందిన జోన్ పార్ట్రిడ్జ్. ఈమె వయసు 103.సరదా సరదాగా బ్యూటీ పాఠాలురోజూ ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకోవడం కంటే ముందు ఈ బామ్మ మేకప్ బ్రష్ పట్టుకుంటుంది. ఆపై మొబైల్ కెమెరా ఆన్ చేసి, టిక్టాక్లో మేకప్ ట్యూటోరియల్ వీడియోలు చేస్తుంది. బామ్మ చెప్పే పాఠాలు బోరింగ్ అనుకోకుండా సుమారు రెండున్నర లక్షల మంది చాలా శ్రద్ధగా వింటారు. ఒకరోజు బ్లష్ బ్రష్ తీసుకొని చెంప మీద మెల్లగా తిప్పుతూ ‘బ్లష్ ఎప్పుడూ నవ్వుతూ వేయమంటారు. కాని, నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి.’ అనే పంచ్ వేసింది. ఈ మాట వినగానే స్క్రీన్ ముందు ఉన్న జనాలంతా నవ్వుల వర్షం కురిపించేశారు. ఈ ఒక్క వీడియోకి లక్షల్లో లైక్స్, కామెంట్లు, షేర్లు! ఇక అప్పటి నుంచి ఆమె మేకప్ టెక్నిక్స్ చూసి కొంతమంది ఫిదా అయితే, బామ్మ కామెడీకి చాలామంది డబుల్ ఫిదా అయ్యారు. ‘ఇలా కాజల్ వేయాలి, ఇలా బ్రష్ తిప్పాలి, ఇలా బ్లష్ టచప్ చేయాలి’ అని అందరికీ అర్థమయ్యేలా చక్కగా బోధపరుస్తుందీ బామ్మ. ఏ టిప్ అయినా, సీరియస్గా చెప్పదు, చెణుకులు వేస్తూ సరదాగా చెప్తుంది. ‘టిక్టాక్’లో ఈ బామ్మ హవా తెలుసుకున్న టీవీ చానళ్లు కూడా ఇంటర్వ్యూల కోసం ఈమె ముందు క్యూ కడుతున్నాయి. బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానళ్లు ఈమెను ఇప్పటికే ఇంటర్వ్యూ చేశాయి.వరుస గిఫ్ట్ హ్యాంపర్లు దీనికి తోడు, ఆమె ఉపయోగించే మేకప్ ఐటమ్స్ను కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాషన్ బ్రాండ్స్కు ట్యాగ్ చేశారు. బ్రాండ్స్ వాళ్లు కూడా బామ్మ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి, వెంటనే గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. ఇక ఆ హ్యాంపర్స్ వచ్చాకే అసలు మజా మొదలైంది. బామ్మ మేకప్ ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. వందేళ్ల వయసులోనూ బామ్మ టిక్టాక్లో వైరల్ స్టార్, మేకప్ గురు, బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఈ బామ్మని చూసిన తర్వాత ‘మా అమ్మమ్మకు, బామ్మకు ఫేస్బుక్ ఖాతా లేదని సిగ్గేస్తోంది’ అని అనిపించకుండా ఉండదు. కొంతమంది యువత వాళ్ల అమ్మమ్మలకూ, బామ్మలకు ఈ బామ్మ వీడియోలను షేర్ చేస్తున్నారు. బ్లష్ ఎలా వేయాలో నేర్చుకోవటానికి కాదు, వాళ్ల అమ్మమ్మలు, బామ్మలు కూడా టిక్టాక్ స్టార్లుగా రెడీ అవ్వడానికి! (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..) -
కాంతిమంతమైన ముఖం కోసం..
ముఖం కాంతిమంతంగా, ఆకర్షణీయం కనిపించడం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే సహజసిద్ధంగా ఇంట్లో లభించేవే మంచివంటున్నారు నిపుణులు. మన ప్రతి నిత్యం చూసే వాటితో చాలా సింపుల్గా మన సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో చూద్దామా..!.టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ రోజ్వాటర్ను తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల చర్మానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంది మొటిమలు తగ్గుముఖం పట్టడంతోపాటు, చర్మం మృదువుగా తయారయి నిగారింపు సంతరించుకుంటుంది. బాగా మగ్గిన అరటిపండు తొక్క తీసుకుని టేబుల్ స్పూన్ తేనె వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. ఈప్యాక్ను రెండురోజులకొకసారి వేసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది, మెరుపులీనుతుంది. ట్యాన్ను తరిమేస్తుంది..మూడుస్పూన్ల ముల్తాని మట్టిలో రెండు టీస్పూన్ల రోజ్వాటర్, మూడు టీస్పూన్ల పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లలోకి పోకుండా ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్ క్రమంగా పోతుంది. చర్మానికి విటమిన్ ఏ, తేమ అంది ఆరోగ్యంగా ఉంటుంది. (చదవండి: పాలీవర్కింగ్ గురించి విన్నారా..?) -
పాలీవర్కింగ్ గురించి విన్నారా..?
ముంబైకి చెందిన సారా ఒక టెక్ కంపెనీలో టాలెంటెడ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. యోగా ఇన్స్ట్రక్టర్, ఫ్రీలాన్స్ కాపీరైటర్గా కూడా పనిచేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ప్రైమరీ జాబ్ చేసే సారా సాయంత్రం తరువాత లోకల్ స్టూడియోలో యోగా పాఠాలు చెబుతుంది. వీకెండ్స్లో ఫ్రీలాన్స్ రైటింగ్ ప్రాజెక్ట్లు చేస్తుంటుంది.పాలీవర్కింగ్ వల్ల ఆర్థికస్థిరత్వం తోపాటు తన పాషన్ను కూడా కొనసాగించే వీలు కలుగుతోంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం...పాలీవర్కింగ్. కోవిడ్ మహమ్మారి తరువాత ఈ ధోరణి బాగా పెరిగింది. అస్థిరమైన ఉద్యోగాల కారణంగా యువ ఉద్యోగులు మునుపెన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు.‘వోల్ ల్యాబ్స్’ సర్వే ప్రకారం 46 శాతం మంది ఉద్యోగులు సెకండరీ జాబ్ చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న మిలీనియల్స్లో 52 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో 24 శాతం మంది మూడు ఉద్యోగాలు చేస్తున్నారు. 33 శాతం మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేస్తున్నారు. ఇక జెన్ జెడ్లో సగం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీలు పాలీవర్కింగ్’ ట్రెండ్కు కారణం. ‘ఆదాయం పెంచుకోవడం మాత్రమే కాదు, అనేక రకాల నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఈ ట్రెండ్ ఉపకరిస్తుంది’ అంటుంది సారా. (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..)