breaking news
Family
-
ఆన్లైన్లో అనకొండలున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే... అంతర్జాలం కాస్తా మాయాజాలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడం నుంచి ప్రైవసీకి ముప్పు రావడం వరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన నిత్యావసరాల జాబితాలో ‘ఇంటర్నెట్’ భాగం అయింది. ఆ నెట్టింట ప్రయోజనాలూ, ఉపయోగాలతో పాటు మింగేసే అనకొండలు కూడా ఉన్నాయి. వాటి బారిన పడకుండా ఉండడం ఈరోజుల్లో సవాలుగా మారింది. ‘ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచించాలి. తొందరపాటు కూడదు’ అనేది సేఫ్టీ ఇంటర్నెట్ తారకమంత్రం...గిబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్గిబ్లీ–స్టైల్ ఏఐ ఆర్ట్ మన ఫొటోలను చిత్రవిచిత్రమైన, యానిమీ–స్టైల్ చిత్రాలుగా మారుస్తుంది. సరదా సంగతి ఎలా ఉన్నా, ఈ గిబ్లీ–స్టైల్ ఆర్ట్ ట్రెండ్ అనేది ప్రైవసీ, డాటా సెక్యూరిటీకి సంబంధించి ముప్పు తెచ్చిపెడు తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. మరికొన్ని...ప్రైవసీ నైట్మేర్: గిబ్లీ–స్టైల్ ఆర్ట్లాంటి ఫీచర్లను అందించే కొన్ని యాప్లు, ప్లాట్ఫామ్లు యూజర్ల ముఖ కవళికలు, రకరకాల ఎక్స్ప్రెషన్స్కు సంబంధించిన చిత్రాలను సేకరించి స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తున్నాయి. దీన్నే ప్రైవసీ నైట్మేర్ అంటున్నారు.డీప్ఫేక్: మహిళలు, పిల్లలు అప్లోడ్ చేసిన పర్సనల్ ఫొటోలు, సెల్ఫీలతో డీప్ఫేక్స్ సృష్టించే ప్రమాదం ఉంది. తెలియకుండానే ఓకే అనేస్తున్నారు: ఫ్యూచర్ మోడల్ ట్రైనింగ్కు సంబంధించి స్టోర్ చేయడానికి, విక్రయించడానికి ఏఐ డెవలపర్లు పర్సనల్ ఫొటోలను ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలను చాలామంది యూజర్లు తెలియకుండానే అంగీకరిస్తున్నారు!లైక్నెస్ ఎక్స్ప్లాయిటేషన్నిజమైన వ్యక్తి, ముఖ్యంగా మహిళల పోలికలను, ఏఐ జనరేటెడ్ క్యారెక్టర్స్లో మెర్జ్ చేస్తున్నారు. వీటిని హానికరమైన పనుల కోసం ఉపయోగించే ప్రమాదం ఉంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు→ ప్రైవసీ పాలసీకి సంబంధించి స్పష్టత లేని, అనుమానించే రీతిలో ఉన్న ఏఐ టూల్స్ను ఉపయోగించవద్దు.→ ప్రైవసీ పాలసీలను జాగ్రత్తగా చదవాలి. అప్లోడ్ చేసిన ఇమేజ్లను ఏఐ ప్లాట్ఫామ్లు ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా ఉపయోగిస్తున్నాయనేది లోతుగా అర్థం చేసుకోవాలి.→ దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండే సెన్సిటివ్, పర్సనల్ ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.→ ఫొటోలను అప్లోడింగ్ చేసే ముందు లొకేషన్ డాటా, వ్యక్తిగత వివరాలు లేకుండా చూసుకోవాలి.→ ఏఐ అకౌంట్స్ ఆథెంటికేషన్ కోసం స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఉపయోగించాలి.→ ఉచిత ఏఐ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అనుమతులు కోరితే వాటిని ఉపయోగించే విషయంలో పునరాలోచన చేయాలి.వాయిస్ క్లోనింగ్ స్కామ్ఒక తండ్రికి విదేశాల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కుమారుడు వికాస్ వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.‘ఒక కేసులో వికాస్ను అరెస్ట్ చేశాం. ఒకసారి మాట్లాడండి’ అన్నది అవతలి గొంతు.‘నాన్న... నేను చెప్పిన ఎకౌంట్కు అర్జంటుగా డబ్బు పంపించు. అలా చేయకపోతే జైల్లో ఉండాల్సి వస్తుంది’ భయం ఉట్టిపడే గొంతుకతో అన్నాడు వికాస్. అది తన కుమారుడి వాయిసే కాబట్టి ఆ పెద్దాయన వారు అడిగినన్ని డబ్బులు పంపాడు.ఆ తరువాత ఎప్పటికో వికాన్ నుంచి ఫోన్ రాగానే ఆత్రంగా ఫోన్ ఎత్తాడు...‘రిలీజ్ చేశారా? క్షేమంగా ఉన్నావా?’ అని ఆత్రంగా అడిగాడు.‘రిలీజ్ చేయడం ఏమిటి?’ అని షాకై పోయాడు వికాస్. జరిగినందంతా చెప్పాడు తండ్రి. తన వాయిస్ ఎవరో క్లోనింగ్ చేశారు అనే విషయం వికాస్కు అర్థమైంది. బ్లాక్మెయిల్ చేయడం నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వరకు స్కామర్స్ వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. దీన్ని ‘వాయిస్ క్లోనింగ్ స్కామ్’ అంటారు.జాగ్రత్తలు→ అనుమానించడానికి ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా ‘మీ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది’లాంటి మాటలు స్కామర్లు ఉపయోగిస్తారు. వెంటనే ఎమోషనల్ కాకుండా కాస్త ఆలోచించడం మంచిది.→ అపరిచిత ఫోన్లకు సంబంధించి ‘నిజమా? కాదా?’ అని నిర్ధారించుకోవడానికి కుటుంబ సభ్యులతో సీక్రెట్ పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా వారికి మాత్రమే జవాబు తెలిసిన కొన్ని ప్రశ్నలు అడగాలి.→ స్కామర్లు మీ వాయిస్ కాప్చర్ చేయకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలను మీ సన్నిహితులు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితులు విధించాలి.స్మిషింగ్ స్కామ్ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో వ్యక్తిగత, ఆర్థిక, లాగిన్ సమాచారాన్ని దొంగిలించడానికి రూ పొందించిన మోసపూరిత టెక్ట్స్ మెసేజ్ను స్మిషింగ్ స్కామ్ అంటారు. ‘మీ ఎకౌంట్ను సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ మెసేజ్ రావచ్చు. ‘డియర్ కస్టమర్’ పేరుతో వచ్చే మెసేజ్లో పెద్దగా వివరాలేమీ లేకపోవడం, అనుమానాస్పద మేసేజ్లు, ఊహించని రిక్వెస్ట్లు నోటిఫికేషన్ల రూపంలో రావడం.. మొదలైనవి స్మిషింగ్ స్కామ్లో భాగం.కొన్ని జాగ్రత్తలు→ తెలియని, అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ల నుంచి వచ్చిన లింక్లను క్లిక్ చేయకూడదు. అటాచ్మెంట్స్ను డౌన్లోడ్ చేయవద్దు → చట్టబద్ధమైన కంపెనీ లేదా బ్యాంకు నుండి వచ్చినట్లు ఏదైనా మెసేజ్ క్లెయిమ్ చేసుకుంటే, టెక్ట్స్లో ఉన్నవి కాకుండా వారి అధికారిక వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా వారిని నేరుగా సంప్రదించాలి.→ అనుమానంగా అనిపించిన మెసేజ్లను మీ సెల్యూలార్ ప్రొవైడర్కు, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్సీసీ)కు రిపోర్ట్ చేయాలి.→ సెన్సిటివ్ ఎకౌంట్స్కు సంబంధించి మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఎంఎఫ్ఏ)ను ఎనేబుల్ చేయాలి.... ఇవి మాత్రమే కాదు, మ్యాట్రిమోనియల్ స్కామ్స్, విషింగ్ ఎటాక్స్, గేమింగ్ స్కామ్స్, ఆన్లైన్ డేటింగ్ ఫ్రాడ్స్... ఇలా ఎన్నో స్కామ్లు ఆన్లైన్లో పొంచి ఉన్నాయి. ‘నాకు అన్నీ తెలుసు. నన్ను ఎవరూ మోసం చేయలేరు’ అనే అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే బాధితుల్లో మొదటి వరసలో మీరే ఉంటారు!అందుకే ఆన్లైన్కు సంబంధించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ కోసమై నెట్ (వల)లో పడెనే... పాపం...మన దేశంలో రొమాన్స్ స్కామ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్లో నకిలీ ప్రొఫైల్ను ఉపయోగిస్తున్నారు. డాక్టర్, మిలిటరీ ఆఫీసర్, సాఫ్ట్వేర్ కంపెనీ సీయీవో... ఇలా రకరకాల ప్రొఫైల్లను సృష్టిస్తున్నారు. ఈ ప్రొఫైల్ నిజమే అనుకొని ప్రేమ ప్రపంచంలోకి వచ్చిన వారిని, ప్రేమబంధం బలపడిన తరువాత ‘అర్జంటుగా అవసరం ఉంది డియర్’ అని (ఫేక్) ఎమర్జెన్సీల పేరుతో డబ్బు లాగుతున్నారు. ఇదొక రకం అయి™ó, సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం అనేది మరో రకం. డేటింగ్ యాప్లలో 39 శాతం మంది యూజర్లు వివిధ రూపాల్లో రొమాన్స్ స్కామ్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ల బారిన పడిన బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. ఆత్మçహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు... → పేరు నమోదు చేసుకునే ముందు డేటింగ్ యాప్ లేదా మ్యాట్రిమోనియల్ అథెంటిసిటీని ధ్రువీకరించుకోవాలి → నివాస చిరునామా, వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచకపోవడం మంచిది → డేటింగ్ యాప్లో పరిచయం అయిన వారిని ప్రత్యక్షంగా కలుసుకొని తగిన ప్రశ్నలు అడగాలి → మ్యాట్రిమోనియల్ సైట్లలో ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి → బ్యాంకింగ్ సమాచారం, గుర్తింపు లేదా పాస్పోర్ట్ కాపీలు, ముఖ్యమైన సమాచారం తెలియని సైట్లకు అందించవద్దు. -
మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?
ఒక చెరుకు వ్యాపారి డబ్బు బాగా గడించాడు. వయసు మీద పడటంతో మనసు చిన్నగా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. గుడులూ గోపురాలూ తిరిగాడు. నదీ స్నానాలు చేశాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో అతడికి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది.అదేమిటంటే ‘ఏ సేవ మంచిది, మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?’ అని. సమాధానం కొరకు ప్రయత్నించాడు. సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. వారి ఊరికి చాలా దూరంగా ఉన్న గుట్టమీద ఒక సాధువు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందని బయలుదేరాడు. దారి సరిగా తెలియక అవస్థలు పడ్డాడు. అప్పటికే బాగా చీకటయ్యింది. వ్యాపారికి ఆ చీకట్లో నడవడం కష్టంగా తోచింది.దారిలో ఒక రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని వ్యాపారిని ప్రశ్నించాడు. తను వెళ్తున్న విషయం చెప్పాడు వ్యాపారి. ‘ఆ గుట్టపైకి వెళ్ళడానికి పగలే కష్టంగా ఉంటుంది. రాత్రయింది కాబట్టి మరింత కష్టం. అందులోనూ పురుగూపుట్రా ఉంటాయి. నేను మీకు తోడుగా వస్తాను’ అని చెప్పి లాంతరు పట్టుకుని బయలుదేరాడు. ఎలాగైతేనేం గుట్ట చేరారు. సాధువును కలిశారు. తను వచ్చిన విషయం చెప్పా వ్యాపారి.‘బాగా రాత్రయ్యింది. అలసిపోయి ఉన్నారు. ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి నిద్రపొండి, ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పాడు సాధువు. ఇద్దరూ అలాగేనని ఒప్పుకున్నారు. తెల్లారిందే లేదో గబగబా నిద్ర లేచిన రైతు పొలం పని ఉంది, నేను బయలుదేరుతాను’ అన్నాడు.వెంటనే వ్యాపారి ‘‘చీకట్లో ఉన్న నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు లాంతరుతో తోడు రాకుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాణ్ణి. మీరు చేసిన సహాయం నా జీవితకాలం మరచిపోను’’ అని చెప్పి పడీపడీ నమస్కరిస్తూ అతడిని సాగనంపాడు.చదవండి: సంక్షోభంలో స్థిరత్వంసాధువు చిరునవ్వు ముఖంతో వ్యాపారిని దగ్గరికి పిలిచి ‘ఒక్క రాత్రి, చీకటిలో ఉన్న నీకు లాంతరు సాయం చేశాడని అతడిని ప్రముఖ వ్యక్తిగా ఆదరిస్తున్నావు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి చీకటిలో ఉన్న నీకు ఆరని దీపంలాగా, నీ ఆలనాపాలనా చూసి, మంచి చెడ్డలు నేర్పించారు నీ అమ్మానాన్నలు. ఎన్నో కష్టాలకు ఓర్చి విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఇంతవాడిగా చేసిన అమ్మానాన్నలకి చేసే సేవకన్నా వేరే ఏ సేవా గొప్పదికాదు, వారికి కృతజ్ఞతగా ఉండటానికి మించింది ఏదీ లేదు’ అని హితవు చెప్పాడు.‘నిజమే, నిరంతరం తను కాలుతూ వెలుగునిచ్చే దీపంలాగా మన జీవితాలకు వెలుగునిచ్చే అమ్మా నాన్నలకు మించిన గొప్పవారు ఎవరు ఉంటారని’ తెలుసుకున్న వ్యాపారి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!
భారత కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే అది ప్రస్తుత కాలంలో చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ప్రాణప్రదంగా పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవాళ్లే..కడదాక కలిసి ఉండలేకపోవడం బాధకరం. అది కూడా చిన్నచిన్న వాటికి, మనస్పర్థలతోటి విడాకులు తీసుకుంటున్నారు. తనకోసం అన్ని వదులుకుని వచ్చిందన్న భావం మగవాళ్లలో కొరవడం ఒక కారణమైతే..తన మాటే నెగ్గాలన్న అహంకారం మరొక కారణం అంటున్నారు మానసిక నిపుణుల. అచ్చం అలాంటి కారణాలతో ఈ టెక్ జంట విడిపోయింది. అందుకు గల కారణం చూస్తే..కన్నీళ్లు వస్తాయి. విమెన్ సాధికారత అన్న మాటలు వెగటుపుడుతాయి. దయచేసి మహిళల్ని మహారాణులు చేయకండి అర్థచేసుకోండి స్వామి..చాలు అని గొంతెత్తి అనాలనిపిస్తోంది. అసలేం జరిగిందంటే..ఈ టెక్ జంట ప్రేమ కథ విడాకులతో ముగియడంతో నెట్టింట వైరల్గా మారింది. సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ప్రకారం. ఆ టెక్ జంట పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకున్నారు. విజయవంతంగా జీవితాన్ని నిర్మించుకున్నారు. గుర్తింపును వెల్లడించిన ఆ ఇంజనీర్ జంటకు ఇద్దరు పిల్లుల, చక్కటి ఆర్థిక భద్రతా ఉంది. ఆమె మంచి కష్టపడి పనిచేసే ఉద్యోగి. గర్భధారణ తర్వాత ఆరునెలలు మినహా ఎన్నడు విరామం తీసుకోలేదు. తొమ్మిదో నెల వరకు ఆఫీసుకు వెళ్లింది. పిల్లలు, భర్త కోసం పనిచేయడం ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది కూడా. రెండో గర్భధారణ తర్వాత ఆ మహిళ కంపెనీ మార్చింది. కొత్త టెక్నాలజీ నేర్చుకుంది. ఇప్పుడు తన భర్త కంటే అధిక వేతనం సంపాదిస్తోంది కూడా. అయితే అత్తగారు అనారోగ్యానికి గురి కావడంతో భర్త తన భార్యను ఉద్యోగం మానేసి ఆమె బాగోగులు చూసుకునే సంరక్షకురాలిగా మారాలని ఆదేశించాడు. అందుకు ప్రెగ్నెన్సీ వల్ల చాలాసార్లు తాను ఉద్యోగానికి విరామం ఇచ్చాను..ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి మీరే జాబ్ మానేయండి, ఫైనాన్షియల్గా మొత్తం చూసుకుంటాను, అలాగే ఇంటి బాగోగుల్లో కూడా హెల్ప్ చేస్తానని చెప్పింది. అవసరమైతే పిల్లల్ని చూసుకునేందు వాళ్ల అమ్మను కూడా పిలిపిస్తానని అంది. అందుకు భర్త తల్లి ససేమిరా అంది. కోడలు తల్లి ఇక్కడకు రావడం సరైన కాదని..పైగా ఉద్యోగం కోడలే మానేయాలని పట్టుబట్టింది. పైగా అత్తగారిని చూసుకోవడం అనేది కోడలు బాధ్యతని ఆమె గట్టిగా విశ్వసిస్తోంది. చివరికీ కోడలు ఉద్యోగం మానేయడం లేదనే అక్కసుతో ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. దాంతో విసుగుపోయిన ఆమె పిల్లలుతో సహా పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అలాగే భర్తకు ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమెకు ఇష్టమైతే తన ఇంటికి వచ్చి ఉండొచ్చని, తన అమ్మనాన్నలు చూసుకుంటారని అంది. అంతే భర్త ఉద్యోగం మానేయడం లేదనే కోపంతో..విడాకులు ఇస్తానని బెదిరిస్తూ లీగల్ నోటీసు పంపాడు. చివరికీ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఎంతో విజయవంతంగా నిర్మించుకున్న ఆజంట సంసారం విచ్చన్నమైంది, విడాకులు తీసుకున్నారు. ఇక్కడ ఒక మహిళ ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా..ఎంత ప్రేమించినా..త్యాగం చేసినా విలువ ఉండదు. జస్ట్ తన స్వాతంత్య్రాన్ని వదులుకోను అనగానే ఆ భార్య ఒక్కసారిగా పనికిరానిదిగా అయిపోయింది. నెటిజన్లు సైతం ఆమె తల్లికి అనారోగ్యంగా ఉంటే..ఆ భర్త ఉద్యోగం మానేస్తాడా? అని ప్రశ్నించారు, మరికొందరు ఇక్కడ ఆమె బాధ్యత నిరాకరించిందని కాదని, కేవలం తనకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న విద్వేషం విడాకులకు దారితీసిందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.చదవండి: భార్య కోసం ఏడాదికి 3 కిలోల బంగారం కొంటున్నాడు..! -
గంగాతీరంలో బోళా శంకరుడి అత్తారిల్లు..!
దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక మహాయాగాన్ని నిర్వహించినప్పుడు సతీదేవిని, మహాశివుడిని ఆహ్వానించడు. పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి అక్కడికి వెళుతుంది. తండ్రి చేసిన అవమానంతో యజ్ఞగుండంలోకి వెళ్లి, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ స్థలమే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సమీపంలోని కంఖాల్ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించి నాటి పౌరాణిక విశేషాలు తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజులలో అత్యంత ప్రాచీన ఆలయాల సందర్శనకు,ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతంది..శక్తి పీఠాల కథకు ఆదిప్రధాన ఆలయం లోపల ఉన్న సతీకుండ్ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహాశివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా, విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి. అవి మొత్తం 108 భాగాలు కాగా, వాటిలో ముఖ్యమైన 54 భాగాలు, మరీ ముఖ్యమైన 18 భాగాలే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ్ర΄ాంగణంలో అనేక ఉ΄ాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపు గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృకార్యాలు, నదీ పూజలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు.అహంకారానికి అంతందక్షేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. శివరాత్రి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksha Mahadev Temple) ఒక ఆలయం మాత్రమే కాదు అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.ఇలా చేరుకోవచ్చు..దక్షేశ్వర మహాదేవ్ ఆలయం సమీప రైల్వే స్టేషన్- హరిద్వార్సమీప విమానాశ్రయం- డెహ్రాడూన్. హరిద్వార్ నుండి 35 కి.మీ. రోడ్ వే ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తక్కువ ధర, ఆశ్రమాల వంటి ఉచిత వసతితో సహా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయిఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే లభిస్తుంది.గంగానది ఒడ్డునహరిద్వార్ (Haridwar) భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మతపరమైన ప్రాచీన నగరం. హిందువులకు పవిత్ర స్థలం. అనేక దేవాలయాల సముదాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది హిందువుల ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షేశ్వర మహాదేవ్ హరిద్వార్లోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది హరిద్వార్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కంఖల్లో ఉంది. సలేశ్వరం ప్రకృతి రమణీయతశివరాత్రి నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన సందర్శన స్థలాల జాబితా తయారుచేసుకుంటే అందులో చేర్చాల్సిన పర్యాటక ప్రాంతం ‘సలేశ్వరం.’ ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ ప్రాంత సందర్శన మనలో ఒక ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలో.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువై ఉన్న యాత్రా స్థలం ఇది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లోయలో ఉన్న గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు ముగ్ధులు అవుతుంటారు. లోయలోకి ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. లోయ అడుగు భాగంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే గుట్టల మధ్య నుంచి కిందుగా కాలి నడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ దారిలో ఎన్నో గుహల నుండి జాలువారే సన్నని జల ధారలు కనిపిస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అడుగు భాగంలో ఉన్న గుండం చేరుకున్నాక పైకి చూస్తే .. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి.. మధ్యలో మనం.. తెలియని అనుభూతికి లోనవుతాం. గుండంలోని నీళ్లు అతి చల్లగా, స్వచ్ఛంగా, రుచిగా ఉంటాయి. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుపుతారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కి.మీ దూరంలో పరహాబాద్ వస్తుంది. అక్కడి నుంచి మరో 32 కిలో మీటర్ల దూరం దట్టమైన అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అమర్నాథ్ నమ్మకమే శాశ్వతంహిమాలయాల మధ్యలో అమర్నాథ్ మంచు గుహలో మహాశివుడు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. అమర్నాథ్ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది. పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. అందుకే తొలిసారి అమర్నాథ్ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి. ప్రతి శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు. అద్భుతం కోసమో, అడ్వెంచర్ కోసమో కాదుం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది. లింగం కరిగిపోతుంది కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్నాథ్ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివతత్వం.కేదార్నాథ్ క్షేత్రం ఓ సందేశంప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది. నిత్య పూజలు జరగవు. భక్తుల సందడి, రాకపోకలు ఉండవు. అయినప్పటికీ మహాశివుడు అక్కడే ఉన్నాడని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.ఇక్కడ శివుడిని ఉనికిగా కాకుండా, లేమిగా పూజిస్తారు. అంటే ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భక్తి ఆగదనే భావానికి కేదార్నాథ్ ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. వేసవిలో ఆలయం మళ్లీ తెరుచుకున్నప్పుడు భారీ ఉత్సవాల కంటే ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి దీపోత్సవం నిశ్శబ్దంగా జరిగినా, ఆ దీపం ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రారంభాన్ని ఒక పండగగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకు నాందిగా భావిస్తారు. ఆ తరువాతే తీర్థయాత్రికుల రాక ప్రారంభమవుతుంది. భక్తి అంటే దేవుడిని ప్రతిరోజూ దర్శించుకోవడమే కాదు. ఆలయానికి నిత్యం వెళ్లడమే కాదు. దూరంగా ఉన్నా దేవుడిని స్మరించడమే నిజమైన భక్తి అని ఈ క్షేత్రం సందేశం ఇస్తుంది. అందుకే ఆలయం మూసి ఉన్న కాలం ముగిసిన వెంటనే భక్తులు దేశం నలుమూలల నుంచి కేదార్నాథ్ దర్శనం కోసం తరలివస్తారు.ఈ ఏడాది ఆలయం తెరుచుకునే తేదీ 2026 సంవత్సరంలో కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22న ఉదయం సుమారు 7 గంటలకు భక్తుల దర్శనానికి తెరుచుకోనుంది. అలాగే నవంబర్ 11 వరకు దర్శనాలు కొనసాగనున్నట్లు తెలియజేస్తున్నారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రకు ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.కాశీ దివ్యమైన అనుభూతిగంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు. కాశీలో జీవితం, మరణాన్ని ఒకే తత్వంగా చూస్తారు. గంగానది తీరంలో జరిగే పూజలు, హారతులు, సంస్కారాలు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడిని మాత్రమే కాదు జీవిత సారాన్ని కూడా దర్శించుకుంటారు. జననం, మరణం, మోక్షం అనే చక్రం గురించి ఆలోచిస్తారు.ప్రతీ రోజు జరిగే గంగా హారతి ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మిక అనుభూతి కలిసే ఒక దివ్యమైన సందర్భం. అగ్ని జ్యోతి గంగాజలాలపై ప్రతిబింబించే సమయంలో భక్తులు తమ భయాలు, బాధలు అన్నింటినీ శివుడికి సమర్పించినట్లు భావిస్తారు. కాశీ గురించి చాలా మంది ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి శివయ్యే మోక్ష మార్గాన్ని చూపిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం మనిషికి ఒక సందేశాన్ని కూడా అందిస్తుంది. జీవితం అశాశ్వతంం ఆధ్యాత్మికతే శాశ్వతం అని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం కాశీ నగరం. భక్తి అంటే దేవుడిని బయట వెతకడం కాదుం మనలోని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం అని చెప్పే పరమ పవిత్ర క్షేత్రం కాశీ. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుచదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు.. ఆ దేశాల్లో లక్షాధికారులే..? -
భార్య కోసం ప్రతి ఏడాది మూడు కిలోలు బంగారమా..!?
బంగారం ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..భారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్ఫ్లిక్స్లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్ చేస్తుంది. ఈ సిరీస్లో నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్లో బారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.ఎవరీ సతీష్ సన్పాల్.. ?సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్ పింక్ రోల్స్ రాయిస్ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఇక సన్పాల్ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్పూర్లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు. View this post on Instagram A post shared by Luxe Life | لوكس لايف (@luxelifedubai) (చదవండి: 'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..! భావోద్వేగపరంగా..) -
'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..!
భారతీయ పేరెంటింగ్పై గురుగ్రామ్ సీఈవో, నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. చాలామంది భారతీయ తల్లిదండ్రుల పిల్లల పెంపకం సరైనది కాదన్నారు. తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కానీ పెంపకంలో ఆలోచన తీరు సరిగా లేదన్నారు. పేరెంటింగ్పై ఎన్నో పుస్తకాలు వచ్చినా ఎందుకనో భారతీయ తల్లిదండ్రుల తీరు మారట్లేదని, వాళ్లు పిల్లలను పెంచడం లేదు, ఫలితాలను పెంచుతున్నారంటూ సోషల్మీడియా వేదికగా విమర్శించారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు. అసలు ఆ సీఈవో ఆంతర్యం ఏంటీ అంటే..భారతీయ కుటుంబ వ్యవస్థను యావత్తు ప్రపంచం మెచ్చుకుంటే..మన భారతీయుడు, గురుగ్రామ్కి చెందిన మ్యాట్రిమోని యాప్ సీఈవో జస్వీర్ సింగ్ భారత పేరెంటింగ్ని తప్పుపడుతున్నారు. భారత తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం అత్యంత అధ్వాన్నమైనది అని తిట్టిపోశారు. వాళ్లు పిల్లలను తమ సొంత ఆస్తులుగా చూస్తారని అన్నారు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో చూసిన దానికంటే అత్యంత భిన్నంగా ఉంటుందన్నారు. సాంస్కృతికంగా భారతీయ పేరెంటింగ్ విధానంలో పెద్దలు ఎల్లప్పుడూ గొప్పవారు అని గుండెల్లో నాటుకుపోతుందన్నారు. అంతేగాదు జస్వీర్ సింగ్ సోషల్మీడియా ఎక్స్పోస్ట్లో భారత తల్లిదండ్రుల పిల్లలను పెంచే విధానం గురించి ఇలా రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల పెంపక విధానాలలో కెల్లా అత్యంత చెత్త విధానంగా పేర్కొన్నారు. దీన్ని ప్రెషర్ కుక్కర్ పేరెంటింగా అభివర్ణించారు. ఇక్కడ భారత తల్లిదండ్రులు చెడ్డవారు కాదు గానీ ఆలోచన తీరు సరైనది కాదంటున్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రశ్నించే విధంగా పెంచరన్నారు. తల్లిదండ్రులదే తుది నిర్ణయం..చాలామటుకు తల్లిదండ్రులు పిల్లలను పెంచరని, వాళ్ల ఫలితాలను పెంచుతారని రాసుకొచ్చారు. వాళ్లు వ్యక్తలుగా స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే భారత్లో ఒక పిల్లవాడు ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఏ వృత్తిలో కొనసాగించాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి...అన్ని తల్లిదండ్రులే ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు. ఆఖరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది కూడా తల్లిదండ్రలదే ఫైనల్ నిర్ణయం అన్నారు. ఇక్కడ భారత పేరెంట్స్ దృష్టిలో మానసిక ఆరోగ్యం, ఆసక్తి, ఉత్సుకత, ఆప్టిట్యూడ్, తదితరాలన్ని ఎందుకు పనికిరానివి, విలువలేనివి అన్నారు. కేవలం వాళ్ల మైండ్లో తల్లిదండ్రులుగా తమకే అన్ని తెలుసని, మేము చెప్పినట్లుగా చేయాలనే ధోరణే ఎక్కువగా ఉంటుందన్నారు. చెప్పాలంటే ఇదొక వస్తుమార్పిడిలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తామే ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్లపై తమకే సర్వహక్కులు ఉంటాయన్నట్లుగా ఉంటుంది వారి తీరు. ప్రశ్నించడమే అతిపెద్ద నేరం..దాంతో పిల్లలు భావోద్వేగపరంగా చిక్కుకుపోతుంటారు. పైగా వైఫల్యాన్ని నేరంగా చూస్తారు. అదొక సిగ్గుచేటు, ఆందోళనగా పిల్లల మైండ్లోకి చొప్పిస్తారు. అంతేగాదు బంధువుల్లోనూ, సమాజంలోనూ తక్కువ అయినట్లుగా ప్రతిక్షణం పిల్లలకు నూరుపోస్తుంటారు. దీన్ని ఇక్కడ తల్లిదండ్రులుగా తాము పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నట్లుగా ఫీలవుతుంటారు కానీ, సవాలుని స్వీకరించేలా కాకుండా వైఫల్యం నుంచి కాపాడుకుంటున్నట్లుగా పెంచుతున్నాం అని గ్రహించరని మండిపడ్డారు. అంతేగాదు ఇక్కడ పిల్లలు ప్రశ్నించడం అనేది అగౌరమైనది, ఒకవేళ ఏ పిల్లవాడైన ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెడితే..అతడని దూరంగా ఉంచాల్సిన వ్యక్తిగా నిలబెడతారు. కేవలం నిశబ్దాన్ని ప్రోత్సహిస్తారు. ముందు తల్లిదండ్రులుగా వాళ్లు ఇలానే పెరిగారు, నియంత్రించబడ్డారు, ప్రశ్నించలేదు, భావోద్వేగపరంగా అణిచివేయబడ్డారు..కాబట్టి అదే తర్వాతి తరాలకు పునరావృతం అవుతుందని అన్నారు. అలాగే కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే పెద్దలకు మించిన పరిణితి, అపారమైన మేధస్సు ఉంటుంది, అయినప్పటకీ అక్కడ కూడా ప్రశ్నించడం ద్రోహం, విబేధించడం, అపరాధం అనే భావన కిందకు రావడం దురదృష్టకరం అని అన్నారు. కొందరు తల్లిదండ్రలు ఇలా ప్రశ్నిస్తున్నందుకు పనిష్మెంట్తో నొరు నొక్కే ప్రయత్నం చేస్తుంటారు లేదా గర్విష్టులు, మొండోడు కింద ముద్రవేస్తారని అన్నారు. నో చెప్పడానికి జంకేలా..ఇక్కడ తల్లిదండ్రులు సమాజా అభిప్రాయానికి భయపడతారని అంటున్నారు. పిల్లలను తమను అనుసరించి, తమపై ఆధారపడేలా పెంచుతారని అన్నారు. అదీగాక తల్లిదండ్రలు మరో విషపూరి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అదేంటంటే పక్కంటి పిల్లవాడితో ప్రతిదానితో పోలుస్తూ..పెంచే ప్రయత్నం చేస్తుంటారు.. ఇది అన్నిట్లంకంటే దారుణైమనది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భారతీయ తల్లిదండ్రులు సమాజంపై పోరాడలేక తమ భయాలను పిల్లలపై వేస్తారు, ఆధిపత్యం చెలాయిస్తారని అన్నారు. సింపుల్గా చెప్పాలంటే పిరికితనంతో పెంచుతారని, అది పితృస్వామ్యం విధేయత నుంచి వచ్చిందని అన్నారు. తల్లిదండ్రులు 'నో' అని స్వతహాగా చెప్పడం నేర్చుకోలేదు..పిల్లలకు అది నేర్పించరు. చెప్పాలంటే భారత పేరెంటింగ్స్ తమ పిల్లలను బాగా పెంచామనే ముసుగులో వారికి తెలియని నష్టం చేకురుస్తున్నారు. పైగా వ్యక్తిగత వైఫల్యాన్ని తరతరాలు మోసేలా చేస్తున్నారని తిట్టిపోశారు జస్వీర్ సింగ్. ఆయన ఉద్దేశ్యం ప్రకారం భారత పేరెంటింగ్ టాలీవుడ్ మూవీ బొమ్మరిల్లు లాంటిదని తేల్చేశారు. అయితే గత దశాబ్ద కాలంలో పెంపకం గురించి మనస్తత్వవేత్తలు, అధ్యయనాలు, కౌన్సలర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే నకుల్ మెహతా, జాన్కీ మెహతా వంటి మిలీనియల్ తల్లిదండ్రులు ఆధునిక అవగాహనతో పిల్లలను స్వతంత్రంగా ఆరోగ్యకరంగా ఎలా పెంచచ్చో అనుభవాలను షేర్ చేసుకున్నారు కూడా.Indian parenting is pressure cooker parenting. One of the worst models globally. Not because parents are evil. But because the system is broken and no one questions it.Most Indian parents didn’t raise children. They raised outcomes.Children are treated like owned assets -…— Jasveer Singh (@jasveer10) February 8, 2026 చదవండి: నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!? -
ఫిట్స్ వస్తే.. ఏం చేయాలి?
ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్పై అవగాహన కోసమే ఈ కథనం. 90 శాతంలో పూర్తి తగ్గుదల 10 శాతంలోనే మాటిమాటికీ... తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్ పదే పదే వస్తుండవచ్చు.6.5 కోట్ల మందిప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. 26 మందిలో ఒకరికి... చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.70% మందిలో.. ఫిట్స్ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్) కారణంగా రావచ్చు.ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.మరికొన్ని మార్గాలు ఫిట్స్ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కూడా ఫిట్స్ను అదుపుచేయవచ్చు.ఫిట్స్ వచ్చినప్పుడు... ఫిట్స్ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్రాగానే ఆ వ్యక్తిని.. ∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. ∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. ∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.చదవండి: అవాంఛిత రోమాలకు పరిష్కారంచివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు. -
‘నో ఫోన్ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు!
ఈ రోజుల్లో చిన్నారులకు చేతిలో స్మార్ట్ఫోన్ లేనిదే ముద్ద దిగదు.. షార్ట్స్ చూడకపోతే నిద్రపట్టదు. అయితే కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన టీచర్ అమృత.. విద్యార్థులను ఈ డిజిటల్ సంకెళ్ల నుండి విడిపించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి కఠినమైన శిక్షలు లేకుండా కేవలం ‘రంగురంగుల స్టిక్కర్లు - చిన్నపాటి సవాళ్లతో’ ఆమె చేసిన ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం రెండు వారాల్లోనే పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని మాయం చేసిన ఆ ‘నో ఫోన్ ఛాలెంజ్’ కథలోనికి వెళితే..కేరళలోని కన్నూర్ జిల్లా, కూతుపరంబ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం అద్భుత ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు పాఠాల కంటే మొబైల్ ఫోన్లలో రీల్స్, షార్ట్స్ , వీడియో గేమ్స్పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని టీచర్ అమృత గమనించారు. పిల్లల ఏకాగ్రత లోపించడానికి మితిమీరిన మొబైల్ వాడకమే కారణమని నిర్ధారించుకున్న ఆమె, వారిని ఆ వ్యసనం నుండి దూరం చేసేందుకు ఒక ప్లాన్ వేశారు. కేవలం హెచ్చరించడమే కాకుండా, పిల్లల మనస్తత్వానికి తగినట్లుగా స్టిక్కర్లు, ఆటలు, చిన్నపాటి సవాళ్లతో వారిని ఆకట్టుకున్నారు.పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం అంత సులభం కాదని అమృతకు తెలుసు. అందుకే ఆమె ‘నో ఫోన్ ఛాలెంజ్’ను ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని విద్యార్థులకు మరుసటి రోజు తరగతిలో రంగురంగుల స్టిక్కర్లను బహుమతిగా ఇచ్చేవారు. ఇది విద్యార్థుల్లో ఒక సానుకూల పోటీని పెంచింది. ఫోన్ చూడటం మానేసిన పిల్లలకు ప్రోత్సాహకంగా కథల పుస్తకాలు, మట్టి బొమ్మలు, నోట్బుక్లను బహుమతులుగా అందించారు. ఫోన్ వదిలేసిన తర్వాత ఖాళీగా ఉండే సమయంలో వారు సృజనాత్మకంగా ఆలోచించేలా మట్టితో బొమ్మలు చేయడం, చిత్రలేఖనం లాంటి యాక్టివిటీస్ వారికి అలవడేలా చేశారు.ఈ వినూత్న ప్రయోగం మొదలైన రెండు వారాల్లోనే పిల్లల్లో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడమే కాకుండా, వారి ప్రవర్తనలో కూడా ప్రశాంతత చోటుచేసుకుంది. గతంలో చిన్న విషయాలకే గొడవ పడే పిల్లలు, ఇప్పుడు సహనంతో వ్యవహరిస్తున్నారని టీచర్ అమృత తెలిపారు. మొబైల్ ఫోన్ లాక్కుంటే ఇంట్లో ఏడ్చి గొడవ చేసే పిల్లలు, ఇప్పుడు పెయింటింగ్ వేస్తూ, ఆ చిత్రాలను టీచర్కు చూపించడానికి ఉత్సాహపడుతున్నారని తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్నారు.పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించే దిశగా విద్యాశాఖ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఇటీవల విడుదలైన ఎకనామిక్ సర్వే నివేదికలో డిజిటల్ వ్యసనం వల్ల యువతలో ఆందోళన, కుంగుబాటు, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడయ్యింది. ఫోన్లకు బానిసలవుతున్న నేటి తరాన్ని ఈ వ్యసనం నుంచి తప్పించేందుకు.. అమృత టీచర్ అనుసరించిన సృజనాత్మక పద్ధతులు అనుసరించాల్సిన అవసరముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు -
మొబైల్ చాయ్.. ఉపాధికి హాయ్..
ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు.. నిజ జీవితంలో విజయాలకు పునాది వేసిన ఆనవాళ్లు అనేకం.. ఒక వినూత్న ఆలోచనతో, తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు.. అలాంటి వారిలో ఒకరు సనత్నగర్కు చెందిన లక్ష్మణ్. 30 ఏళ్ల క్రితమే మొబైల్ వ్యాపార కాన్సెప్్టకు అంకురార్పణ చేశారు. ప్రస్తుతం అనేక మంది ఈ రంగంలో ఉపాధి పొందుతోన్న విషయం తెలిసిందే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటకు చెందిన బచ్చల లక్ష్మణ్ బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. మొదట రిక్షా తొక్కుకుంటూ జీవనం ప్రారంభించాడు. గిట్టుబాటు లేకపోవడంతో సాయంత్రానికి నిరాశా నిస్పృహలే మిగిలేవి. అప్పుడే.. టీ కోసం అనేకమంది దూరం వెళ్లడాన్ని గమనించాడు. రిక్షానే మొబైల్ టీ స్టాల్గా మారిస్తే.. అన్న ఆలోచన తట్టింది. అకున్నదే తడవు ఆచరణలో పెట్టాడు. 1996లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో రిక్షాలో మొబైల్ టీ స్టాల్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్కడ పది మంది గుమికూడితే అక్కడ టీ అందిస్తూ జీవన ప్రయాణాన్ని సాగించారు. సంవత్సరం తిరక్కముందే రిక్షా నుంచి మూడు చక్రాల బైక్కు అప్గ్రేడ్ అయ్యాడు. ఒకటిగా ప్రారంభమై.. అలా ఒక్క మొబైల్ టీ స్టాల్ కాస్తా.. ప్రస్తుతం 22 మొబైల్ టీ స్టాల్స్ను స్వయంగా తీర్చిదిద్ది ఉపాధి కోసం వెతుక్కునే వారికి అండగా నిలుస్తున్నాడు. లక్ష్మణ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న మొబైల్ టీ పరిమళం ఎస్ఆర్నగర్, అమీర్పేట దాటుకుని నగరం అంతటా వ్యాపించింది. తెల్లవారుజామున 4 గంటలకే అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద దిగే ప్రయాణికులకు అల్లం, గ్రీన్, లెమన్, బూస్ట్, హార్లిక్స్, కాఫీ, టీ కాషన్.. ఇలా అనేక రకాల తేనీటిని అందిస్తుంటాడు.రూపాయి నుంచి.. ‘అప్పట్లో అమీర్పేట కేంద్రంగా సాఫ్ట్వేర్ సంస్థల కార్యకలాపాలు కొనసాగేవి. ఇద్దరు సహాయకులతో నడిపేవాడిని.. వారికి రోజుకు రూ.50లు ఇచ్చేవాణ్ణి. ప్రారంభంలో రూపాయికే టీ.. అలా రోజుకు 700–800 టీలు విక్రయించేవాణ్ణి. దీనిమీదే ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేశా. సొంతిల్లు కొనుక్కున్నా. నాకులా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 22 మందికి మొబైల్ టీ స్టాల్స్ ఇస్తున్నా. ఇంతగా విస్తృతమవుతుందని అప్పుడు అనుకోలేదు’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. -
అనంతగిరి హిల్స్.. ది బ్రీజ్
ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పద్మనాభస్వామి దేవాలయం, కొలను, టీబీ హస్పిటల్ ఇతర పర్యాటక ప్రాంతాలు నగరవాసులకు సుపరిచితమే. అటవీ ప్రాంతంలో కర్ణాటకలో ‘జంగల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్’ తరహలో ఎకో టూరిజం బ్రాండ్గా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్’ పేరిట ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. పర్యాటకుల కోసం వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో ‘ది బ్రీజ్’ను తిర్చిదిద్దింది. అనంతగిరిని విజిట్ చేయాలనుకునే పర్యాటకులకు ఓ కొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. పర్యాటకుల కోసం ది బ్రీజ్లో జంగిల్ కాటేజెస్ నిర్మించారు. ట్రెక్కింగ్, బర్డ్స్ వాక్, నైట్ క్యాంప్స్, సఫారీ, బుష్ బ్రెక్ఫాస్ట్ వంటి వినూత్న కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. అటవీ విజ్ఞాన శాస్త్రం, హోటల్ మేనేజ్మెంట్ చదివిన నేచురలిస్ట్లు అడవులు, వృక్ష వైవిధ్యం, జంతు విజ్ఞానం, వాటి సంరక్షణ, హస్పిటాలిటీ తదితర అంశాలను ఇందులో భాగంగా వివరిస్తారు. ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులను మధ్యాహ్నం 1 గంటకు ది బ్రీజ్లో మేనేజర్/ నేచురలిస్ట్ బృందం రిసీవ్ చేసుకుంటుంది. మధ్యాహ్నం 10 రకాల వంటలతో భోజనం అందిస్తారు. షెడ్యూల్ ఇలా.. విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ట్రెక్కింగ్, బర్డ్ వాక్ చేస్తూ సూర్యాస్తమయం వ్యూ తిలకిస్తారు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో చెట్లు, పక్షులు, గడ్డి, జంతువుల గురించి వివరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రిసార్ట్లో స్నాక్స్ అందిస్తారు. రాత్రి 7.30 గంటలకు క్యాంప్ ఫైర్ వేసి వైల్డ్ లైఫ్ గురించి అనేక విషయాలు వివరిస్తారు. రాత్రి 8.45 గంటలకు నాన్వెజ్ డిన్నర్ అందిస్తారు. రాత్రి టెంట్లో బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు మొదలయ్యే సఫారీ దాదాపు 10 కిలో మీటర్లు అడవీలో తిరుగుతారు. 8.45 గంటలకు అడవిలో బుష్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తిరిగి ఉదయం 11 గంటలకు చెక్ అవుట్ ఉంటుంది.ప్యాకేజీ వివరాలకు.. సందర్శించాలనుకునే పర్యాటకులు వివిధ ప్యాకేజీలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాల కోసం వెబ్ సైట్ : deccanwoodsandtrails. com/ 9493549399, 9885298980 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!?
రిలయన్స్ ఫౌండేషన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ లగ్జరీ దుసులకు, ఆభరణాలకు కేరాఫ్ ఆమె. నీతా ధరించి ప్రతి చీర ఓ అద్భుతం. కళ్లుచెదరిపోయే ఖరీదు చేసే ఆభరణాలతో తన ఫ్యాషన్ శైలిని చెబుతుంటారామె. భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ చేనేత చీరలు, అలానాటి రాజుల కాలం నాటి ఆభరణాలతో మన పూర్వవైభవాన్ని తెలుసుకునేలా లేదా గుర్తుచేసేలా అద్భుతమైన లుక్తో కనిపించే నీతా ఈసారి వెస్ట్రన్ వేర్లో అదుర్స్ అనిపించుకున్నారు. తను ఏది ధరించిన సెన్సెషన్గానే ఉంటుంది. ఎందుకంటే వాటి ధర, డిజైన్ కూడా ఊహకందనిది. ఇక నీతా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో భారత ప్రతినిధిగా మిలానో-కోర్టినా వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026కి ముందు 145వ IOC సెషన్కు హాజరయ్యారు. ఏ వేదికపై భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరలే ఎంచుకునే నీతా ఈసారి బాస్లా కనిపించే పవర్ బ్లేజర్, చిక్ కోట్తో ఎంటర్ అవ్వడం విశేషం. నీతా అంబానీ చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 ప్రీ కలెక్షన్ స్టైలిష్ నేవి బ్లూ బ్లేజర్ ధరించింది. పైగా ఈ బ్లేజర్కి డబుల్ కాలర్లు, ఫుల్ స్లీవ్స్, నాచ్ లాపెల్స్, రెండు సైడ్ పాకెట్స్ ఉన్నాయి. అధునాతన నేవీ బ్లూ రంగులో ఉన్న బ్లేజర్పై కుడివైపు కాలర్పై ఎరుపు పూల డైమండ్ బ్రూచ ఆ బ్లేజర్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేసింది. దానికి నల్లటి ఫార్మల్ ప్యాంటుని జత చేసి..సింపుల్గా డైమండ్ ఆకారపు చెవిపోగులు ధరించి స్టైలిష్గా కనిపించారామె. ఇంతకీ ఈ బ్లేజర్ ఎంతో తెలిస్తే నోటమాటరాదు. ఇది అక్షరాలు రూ. 738,800/-. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ) -
మాస్ అండ్ క్లాస్: సంగీత ప్రపంచంలో బీటీఎస్ శాసనం
సంగీతానికి భాషా సరిహద్దులు లేవని ప్రపంచానికి ‘పాప్ మ్యూజిక్’ చాటిచెబుతోంది. వెస్ట్రన్ మ్యూజిక్ హవా నడుస్తున్న తరుణంలో, దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు కుర్రాళ్లు ‘బీటీఎస్’ (బాంగ్తాన్ సోన్యోందన్) పేరుతో ప్రపంచ సంగీత పటాన్ని ఒక్కసారిగా మార్చేశారు. కేవలం తమ పాటలతోనే కాకుండా, తమ అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ, సామాజిక సందేశాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. బీటీఎస్ ఆర్మీ పేరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని తిరుగులేని గ్లోబల్ ఫోర్స్గా ఎదిగారు. గ్రామీ నామినేషన్లు మొదలు ఐక్యరాజ్యసమితి వేదికల వరకు ‘కే పాప్’ స్థాయిని అమాంతం పెంచారు. 7 కోట్ల 80 లక్షల ఫాలోవర్స్కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా ఈ బృందం ఒకేసారి రెండు చారిత్రాత్మక విజయాలను నమోదు చేసి ప్రపంచాన్ని తెగ ఆశ్చర్యపరిచింది. హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ 2025లో ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్లో 78 మిలియన్ల(7 కోట్ల 80 లక్షలు) ఫాలోవర్లను సాధించిన తొలి మ్యూజిక్ గ్రూపుగా అరుదైన మైలురాయిని చేరుకుంది.హంటెయో అవార్డుతో గుర్తింపుసంగీత రంగంలో అత్యంత ఉన్నత అవార్డులలో హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ ఒకటి. 2025 సంవత్సరానికి గాను బీటీఎస్ ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆల్బమ్ విక్రయాలు, డిజిటల్ స్ట్రీమింగ్ గణాంకాలు, అభిమానుల భాగస్వామ్యం ఆధారంగా బీటీఎస్ను విజేతగా ప్రకటించారు. ఈ అవార్డు వారు సృష్టించిన రికార్డులకు ఒక ఉదాహరణగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇన్స్టాగ్రామ్లో తిరుగులేని ఆధిపత్యంఅవార్డుల ప్రకటన వెలువడిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో భారీ రికార్డు బద్దలైంది. బీటీఎస్ అధికారిక ఖాతా 78 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఏ మ్యూజికల్ బ్యాండ్ కూడా ఇప్పటివరకు ఈ స్థాయి ఫాలోయింగ్ను దక్కించుకోలేదు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి.. ఏకైక గ్రూపుగా బీటీఎస్ సరికొత్త రికార్డును లిఖించింది. ఇది బీటీఎస్ గ్లోబల్ క్రేజ్కు అద్దం పడుతోంది.మిలిటరీ సర్వీస్ తర్వాత..బీటీఎస్ సభ్యులైన జిన్, సుగా, జె-హోప్, ఆర్ఎమ్, జిమిన్, వీ, జంగ్కుక్ తమ తప్పనిసరి మిలిటరీ సేవలను పూర్తి చేసుకుని మళ్లీ ఒకే వేదికపైకి రానుండటం అభిమానులను ఆనందంలో మంచెత్తుతోంది. బీటీఎస్ సభ్యులంతా కలిసి పూర్తి స్థాయి బృందంగా తిరిగి రావడం అనేది బీటీఎస్లో భారీ మార్పులకు సంకేతం కానుంది. ఈ పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.మార్చి 20న ‘అరిరంగ్’ ఆల్బమ్ విడుదలదాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత బీటీఎస్ తమ ఐదవ స్టూడియో ఆల్బమ్ ‘అరిరంగ్’ను 2026, మార్చి 20న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఆల్బమ్లో మొత్తం 14 ట్రాక్లు ఉండనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఆల్బమ్పై సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా సంగీత చార్టుల్లో పాత రికార్డులన్నీ కనుమరుగవుతాయని అభిమానులు అంటున్నారు.ప్రపంచవ్యాప్త పర్యటనకు..ఈ ఆల్బమ్ విడుదలైన వెంటనే ఏప్రిల్ 9 నుండి బీటీఎస్ తమ ‘వరల్డ్ టూర్ 2026-2027’ను ప్రారంభించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 34 ప్రధాన నగరాల్లో మొత్తం 81 లైవ్ షోలను నిర్వహించనున్నారు. సభ్యుల లైవ్ పెర్ఫార్మెన్స్ను చూసేందుకు టికెట్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ బృందం భారత్లోని ముంబైలో పర్యటించనున్నదనే వార్త కూడా వినిపిస్తోందిగ్లోబల్ ఐకాన్స్గా బీటీఎస్సంగీతం, ఫ్యాషన్, సామాజిక అంశాలపై బీటీఎస్ చూపిస్తున్న ప్రభావం అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం ఒక పాప్ బ్యాండ్గా మాత్రమే కాకుండా, ఒక గ్లోబల్ బ్రాండ్గా వారు ఎదిగిన తీరు అమోఘమని సంగీతాభిమానులు అంటున్నారు. రాబోయే ‘అరిరంగ్’ ఆల్బమ్, వరల్డ్ టూర్తో 2026 ఏడాదంతా బీటీఎస్ స్మరణతో నిండిపోనున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ‘అమెరికాతో యుద్ధం వచ్చినా..’..ఇరాన్ కీలక ప్రకటన -
సహనం: సంక్షోభంలో స్థిరత్వం
భారతీయ జీవన దర్శనం సహనాన్ని కేవలం ఒక సామాన్య గుణంగా కాకుండా, ఒక మహోన్నత తపస్సుగా అభివర్ణించింది. కష్ట సమయాల్లో చలించకుండా ఉండటమే సహనం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషి ప్రతిదీ తక్షణమే జరిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ అత్యుత్సాహం అసహనాన్ని పెంచి, చిన్న విషయాలకే ఒత్తిడికి గురిచేస్తోంది. సహనం అంటే చేతకానితనం కాదు; అది మన మనస్సుపై మనకు ఉండే అద్భుత నియంత్రణ.విత్తనం విత్తిన వెంటనే ఫలాలు అందవు కదా! ఆ విత్తనం మట్టిలో కలిసి, అంకురించి, మొక్కగా ఎదిగి, వృక్షమై, చివరకు పండ్లను అందించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఆ విత్తనం ఎదుర్కొనే ఎండలు, వానలు, గాలివానలు అన్నీ ఓర్పుకు నిదర్శనాలు. జీవితంలో మన శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే ఈ నిరీక్షణ తప్పనిసరి.ఆర్ష విజ్ఞానంలో సహనానికి భూదేవిని మించిన నిదర్శనం మరొకటి లేదు. సమస్త జీవరాశి తనపై సంచరిస్తున్నా, తనను తవ్వుతున్నా ఆమె చలించకుండా అందరినీ భరిస్తుంది. అలాగే వనవాస సమయంలో పాండవులు చూపిన నిగ్రహం అద్భుతం. రాజభోగాలను వీడి, ఎన్నో అవమానాలను భరిస్తూ సరైన సమయం కోసం వేచి చూశారు. ఆ ఓర్పే వారిని ధర్మ యుద్ధంలో విజేతలుగా నిలబెట్టింది. కోపం క్షణికావేశంలో కలిగే వినాశనం అయితే, సహనం శాశ్వతమైన విజయాన్ని అందించే మౌన శక్తి. పాలు పెరుగుగా మారాలన్నా, రాయి శిల్పంగా మారాలన్నా ఆ ప్రక్రియలో సహనం అంతర్లీనంగా ఉంటుంది. మన సంస్కృతిలో సహనం కలిగిన వాడిని మాత్రమే ధీరుడు అని పిలుస్తారు. నిశ్చలత్వమే నిత్య సత్యమని గుర్తించినప్పుడు ఏ కల్లోలమూ మనల్ని చలింపజేయదు. నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనకు ఇష్టమైన ఫలితం ఆలస్యమైనప్పుడు మనసు ఆందోళన చెందుతుంది. అటువంటి సమయంలో ప్రకృతిని గమనించాలి. ఋతువులు తమ క్రమం తప్పకుండా వస్తాయి, నదులు సుదీర్ఘ ప్రయాణం తర్వాతే సముద్రాన్ని చేరుతాయి. మనం చేసే ప్రయత్నం సరైనదైనప్పుడు, కాలం మనకు సానుకూల ఫలితాన్ని అందిస్తుందనే నమ్మకమే సహనం. కుటుంబ సంబంధాల్లో కానీ, వృత్తి పరమైన సవాళ్లలో కానీ ఆవేశంతో స్పందించే కంటే, సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అనర్థాలు తప్పుతాయి. సహనం మనలో విచక్షణను పెంచుతుంది. ఇది ఒక రకమైన మానసిక పరిపక్వత; ఇది మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.విశ్వజనీన ధర్మం అందించిన ఈ సహన మార్గం వ్యక్తిని స్థితప్రజ్ఞుడిగా తీర్చిదిద్దుతుంది. తొందరపాటు నిర్ణయాలు అపజయాన్ని ఇస్తే, ఓర్పుతో కూడిన అడుగులు విజయతీరాలకు చేరుస్తాయి. మన హృదయంలో సహనం అనే జ్యోతి వెలుగుతున్నంత కాలం ఏ సవాలునైనా అధిగమించవచ్చు. లోకంలో మార్పు అనేది క్రమంగా జరుగుతుంది; ఆ మార్పులో మనం భాగస్వాములవ్వాలంటే సహనం అత్యంత అవసరం. అందుకే మనలో ఉన్న ఓర్పును పెంచుకుంటూ, ప్రశాంతమైన చిత్తంతో లక్ష్యం వైపు సాగిపోదాం. సహనమే శక్తి, సహనమే శాంతి. సర్వం సుమంగళం!వ్యక్తిత్వ వికాస నిపుణులువైదిక సంంస్కృతి బోధించిన తితిక్ష అంటే సుఖదుఃఖాలను, శీతోష్ణాలను సమానంగా భరించే శక్తి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా, విమర్శలు ఎదురైనప్పుడు ఉలిక్కిపడకుండా ఉండటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట దైవత్వం విరాజిల్లుతుంది. మన అంతరంగంలో సహనం అనే వృక్షం పెరిగినప్పుడు, బయటి తుఫానులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ గుణం అలవడిన మనిషికి ప్రతి కష్టం ఒక పాఠంగా, ప్రతి ఓటమి ఒక అనుభవంగా కనిపిస్తుంది. సహనం అనేది మన ఆత్మకు ఉండే కవచం వంటిది; అది మనల్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. – కె. భాస్కర్ గుప్తా -
దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ
మన వస్త్రధారణ, సంస్కృతి విదేశీయలును ఎంతగా ఆకట్టుకుట్టుందో పలు ఘటనల్లో చూశాం. వాళ్లు మన సంస్కృతి, వేషధారణని ఇష్టపడి మరి ఇక్కడే ఉండిపోతున్న వాళ్లు ఉన్నారు. ఇంకొందరు మన దుస్తులను ఇష్టపడటమేగాక..వారి ఆహార్యాన్ని కూడా మార్చుకుంటున్నారు. పైగా మనలా నిండుగా కప్పుకునే దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడటం విశేషం. ఇక్కడొక యూఎస్ మహిళ ఆ విషయమే చెబుతూ..ధన్యవాదాలని చెబుతోంది. ఇంతకీ దేనికి ఈ ధన్యవాదాలంటే..భారత సాంప్రదాయ వస్త్రమైన దుపట్టాపై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ కేమి అను అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో భారత ప్రజలారా మీకు చాలా చాలా ధన్యవాదాలు. స్కార్ఫ్ లాంటి దుపట్టాను వారు తమ భుజం లేదా ఛాతీపై కప్పుకుంటారు. అది తన దుస్తులను అక్షరాల పదిరెట్లు మెరుగుపరిచిందంటూ సంబరపడింది. తాను ఈ దుపట్టాను భారతీయులే కనిపెట్టారని నమ్ముతున్నా..ఒకవేల్ల తప్పు అయితే రిచేయండి అని పేర్కొంది కేమి. నెటిజన్లు కూడా అవును మీరు చెప్పింది నిజమే. దీనిని భారతీయులే కనుగొన్నారు. కానీ దక్షిణాసియా అని ఏడుస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్లు భారతదేశంలో భాగమేనని మర్చిపోవడం బాధకరం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by KEMI (@eczema.bread) (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
ఫ్యాటీలివర్తో బీకేర్ఫుల్..!
ఆల్కహాల్తో ఫ్యాటీలివర్ ముప్పు ఉందన్న విషయం తెలిసిందే. అయితే నిత్యం తాగేవారిలోనే ఈ ఫ్యాటీ లివర్ ముప్పు ఎక్కువ అనే అ΄ోహ గతంలో ఉండేది. తాజా తార్కాణాలూ, అనేక అధ్యయనాల ప్రకారం ఎప్పుడో ఒకసారి (అకేషనల్గా) తాగేవారికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు మగవాళ్లకు దీటుగా తాము ఆల్కహాల్కు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ అంటూ పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. సోషల్ డ్రింకింగ్, వీకెండ్ కాక్టెయిల్ పార్టీస్ అంటూనో లేదా ఇంట్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటూ తాగేవారికి సైతం ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం...చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... చాలా కొద్దిమోతాదులో అంటే ప్రతిరోజూ 30 మి.లీ.కు మించకుండా ఆల్కహాల్... అందులోనూ రెడ్వైన్ తీసుకునేవారిలో గుండెజబ్బులు నివారితమవుతాయనీ, రక్తనాళాల్లోని కొవ్వు కొట్టుకు΄ోతుందనీ, అంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే అది ఫ్యాటీలివర్కు దారితీయదనీ... ఇలాంటి అ΄ోహలు ఎక్కువే ఉన్నాయి. అవన్నీ వాస్తవం కాదంటూ ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తాగినా... అది కూడా చాలా అడపాదడపా(అకేషనల్గా) తీసుకున్నప్పటికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే మన దేశంలోని మహిళలూ ఆల్కహాల్కు దగ్గరవుతున్న నేపథ్యంలో వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్యాటీలివర్ అంటే?మన రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి కోసం రక్తంలోని చక్కెర ఉపయోగపడుతుంది. అటు తర్వాత మిగతా చక్కెర కొవ్వురూపంలో కాలేయంలో నిల్వ అవుతుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం కంటే మన రోజువారీ కార్యకలాపాలు తగ్గుతూ పోతున్న కొద్దీ ఈ కొవ్వు నిల్వలు అలా పేరుకుపోతూ ఉండటంతో పాటు కాలేయ కణాలూ కొవ్వు కణాల్లా మారుతూ ఉంటాయి. ఇలా కాలేయ కణాల్లో కొవ్వు మోతాదులు పెరుగుతూ పోవడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. అందులో మొదటిది ఆల్కహాల్ వినియోగం. రెండోది ఆల్కహాల్ కాకుండా ఇతరత్రా అంశాలు ఫ్యాటీలివర్కు కారణం కావడం. ఈ కారణాలను బట్టి ఫ్యాటీలివర్లోని రకాలివి... ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఏఎఫ్ఎల్డీ) : ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయంలో కొవ్వు చేరి ‘ఫ్యాటీలివర్’కు దారితీయడం. నాన్ ఆల్కహాలివ్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) : దీనికి ఆల్కహాలిక్ ప్రధాన కారణం కాదు. అయితే జీవక్రియల తేడా కారణంగా వచ్చే వ్యాధులు (మెటబాలిక్ సిండ్రోమ్స్), స్థూలకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి కారణాల వల్ల ఈ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది.నిర్ధారణ బాధితుల స్థూలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చూసి డాక్టర్లు పరిస్థితిని కొంత తెలుసుకోగలరు. కొన్ని రక్తపరీక్షలు, వాటితోపాటు డయాబెటిస్, కొలెస్ట్రాల్ మోతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నది చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఫ్యాటీలివర్ కండిషన్ బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ (అంటే కాలేయం తాలూకు చిన్న ముక్కను సేకరించి చేసే) పరీక్ష అవసరం. లివర్ బయాప్సీతో ఎన్ఏఎఫ్ఎల్డీలో అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ (ఎన్ఏఎఎఫ్ఎల్) కండిషనా, లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్ష ద్వారా లివర్లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయా, తగ్గాయా కూడా తెలుసుకోవచ్చు. మహిళల్లో మరింత ఎక్కువ ముప్పు ఎందుకంటే... ఆల్కహాలిక్ ఫాటీలివర్ ముప్పు మహిళల్లో మరింత ఎక్కువ. ఎందుకంటే వీళ్లలో పురుషులతో ΄ోలిస్తే వాళ్ల కాలేయం సైజు తక్కువ. అలాగే వాళ్ల ఒంట్లోని నీటి మోతాదులు కూడా తక్కువే. ఇక మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా ఆల్కహాల్ వాళ్ల రక్తంలో చాలా ఎక్కువగా గాఢతతో చాలాసేపు ఉంటుంది. అలా అరుదుగానే అప్పుడప్పుడూ తాగినా ఆ ఇంటర్మిట్టెంట్ ఆల్కహాల్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, కొవ్వులు పేరుకుపోవడంతో పాటు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కూడా పెరుగుతుందని ఈ అంశాలన్నీ మహిళల్లో ఫ్యాటీలివర్ను పెంచడంతోపాటు లివర్ ఫైబ్రోసిస్ ముప్పునూ చాలా ఎక్కువగా పెంచేస్తాయి. అందుకే 20 – 35 ఏళ్లున్న మహిళల్లో వాళ్ల ఆల్కహాల్ తీసుకునే మోతాదు ఎంత తక్కువైనప్పటికీ లివర్ ఫైబ్రోసిస్ రేటు చాలా పెరిగి΄ోతోంది. అందుకే పురుషులూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లలో ΄ోలిస్తే మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ దుష్ప్రభావాలు మహిళల్లో కేవలం కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ల రుతుక్రమం దెబ్బతినడం, హార్మోనల్ బ్యాలెన్స్ అతలా కుతలం కావడం, సంతానలేమి వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు.లక్షణాలు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో పొట్ట బాగా పెరిగిపోతుంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఇలా కొద్దిమేరకు లక్షణాలు కనిపించవచ్చేమోగానీ...నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో చాలావరకు లక్షణాలు కనిపించవు.అయితే కొన్ని అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ను సూచిస్తాయి. ఉదాహరణకు వీళ్లలోనూ పొట్ట బాగా పెరిగి, సెంట్రల్ ఒబేసిటీతో ముందుకు వచ్చి కనిపిస్తుంది. ∙ కొద్దిమందిలో కుడివైపు పొట్ట పైభాగంలో (ఉరఃపంజరం / రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. క్రమంగా కాలేయం పెరుగుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుంది. నివారణ / చికిత్సఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయడం. డైట్ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం. ఇందులో చక్కెర, కొవ్వుల మోతాదులను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, షుగర్–స్వీటెన్డ్ డ్రింక్స్ వంటి కూల్డ్రింక్స్ దూరంగా ఉండటం. అలాగే పొట్టుతో ఉండే ధాన్యాలూ (హోల్గ్రెయిన్స్), తాజా పండ్లు, కూరగాయల వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. వ్యాయామం : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దేహానికి వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని ఇవ్వడం. నివారణ నియమాలు పాటించడంతో పాటు ఫ్యాటీ లివర్ దశను బట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలతోపాటు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు (అల్ట్రా సౌండ్, మెటబాలిక్ మార్కర్ పరీక్షలు) చేయించుకుంటూ ఉండటం. చివరగా... సోషల్ డ్రింకింగ్ లేదా వీకెండ్ పార్టీస్ అంటూ పార్టీ కల్చర్ పేరిట పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దేహానికి అత్యంత కీలకమైన భాగమైన కాలేయంపై పడే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్కు దూరంగా ఉండటం, ఈ అవగాహనను అందరిలోనూ కల్పించడం అన్నది ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతైన అవసరమని గుర్తించాలి. డాక్టర్ పవన్ కె. అడ్డాల, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్నెస్కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్ప్యాక్ శరీరంతో స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్లాస్కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!) -
శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చె΄్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది. అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే ΄ాజిటివ్ యాటిట్యూడ్ నూరి΄ోసినా, ఆ ΄ాజిటివ్ యాటిట్యూడ్తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకు΄ోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. నిర్వహణ: యాసీన్(చదవండి: ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు) -
జైల్ టు జీహాద్!
కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియా నుంచి జీహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీలోకి వెళ్లిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ చివరకు హర్కత్ ఉల్ ముజాహిదీన్లో (హెచ్యూఎం) చేరాడు. హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్– ముజాహిదీన్ గ్రూపుల మధ్య తారస్థాయికి చేరిన విభేదాలను సెటిల్ చేయడానికి 1994లో భారత్ వచ్చి పట్టుబడ్డాడు. అజర్తో పాటు అతడిని విడిపించడానికి ప్రయత్నించిన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, శ్రీనగర్లో చిక్కిన మరో ఉగ్రవాది అహ్మద్ జర్గర్... ముగ్గురూ ఢిల్లీలోని తీహార్ జైలుకు చేరారు. అక్కడే వీరికి కిడ్నాపింగ్ గ్యాంగ్ నిర్వాహకుడు ఆఫ్తాబ్ అన్సారీతో పరిచయం ఏర్పడింది. ఇదే పార్థప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్కు కారణమైంది. ఇతడి కుటుంబీకుల నుంచి వసూలు చేసిన మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరాయి. అదెలాగంటే?ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఆఫ్తాబ్ అన్సారీ ముంబైలో ఉంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన నేరగాళ్లతో ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకునే అన్సారీ కిడ్నాప్లు, స్మగ్లింగ్ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా బతికేవాడు. ప్రస్తుతం అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని సైతం అన్సారీ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పుడప్పుడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న గౌతమ్ అదానీ 1998 జనవరిలో తన స్నేహితుడు శాంతిలాల్ పటేల్తో కలిసి అహ్మదాబాద్లోని కర్ణావతి క్లబ్ నుంచి బయటకు వస్తుండగా, అన్సారీ ఆదేశాల మేరకు అక్కడే కాపు కాసిన అతడి అనుచరులు ఫజల్ ఉర్ రెహ్మాన్, భోగీలాల్ దర్జీ తుపాకీతో బెదిరించి కారులో అపహరించారు. వారి విడుదల కోసం రూ.15 కోట్లు డిమాండ్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అదే రోజు సాయంత్రం అదానీ, పటేల్ ఇరువురూ విడుదలయ్యారు. ఇలాంటి ఎన్నో నేరాలు చేసిన అన్సారీ అప్పటి వరకు ఓ నేరగాడు మాత్రమే. కోల్కతాకు చెందిన ఆసిఫ్ రజా ఖాన్... అన్సారీ గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించేవాడు. ఓ కేసులో ఢిల్లీ పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేయడంతో తీహార్ జైలుకు చేరారు. ఆ జైలు అధికారులు అజర్, ఒమర్లతో పాటు అన్సారీ, ఆసిఫ్లను ఒకే హై సెక్యూరిటీ ప్రిజన్లో ఉంచారు. అన్సారీ గ్యాంగ్, అతడి కార్యకలాపాలు తెలుసుకున్న ఆ ఉగ్రద్వయం అతడితో పాటు ఆసిఫ్కు బ్రెయిన్ వాష్ చేసి, ఇకపై జీహాద్ కోసం నేరాలు చేసేలా ప్రేరేపించింది. ప్రతి నేరం నుంచి కొంత మొత్తం జీహాదీ కార్యకలాపాలకు విరాళం ఇచ్చేలా వారిని ఒప్పించింది. ఇదిలా ఉండగా, ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 814 విమానం 1999 డిసెంబర్ 24న నేపాల్ రాజధాని కఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తూ హైజాక్ అయింది. ఇది తమ పనేనంటూ పాకిస్తాన్కు చెందిన హర్కతుల్ ముజాహిదీన్ ప్రకటించుకున్నా, కేవలం అజర్ కుటుంబీకులు, ఐఎస్ఐ మద్దతుతో చేశారని నిఘా వర్గాలు చెప్పుకున్నాయి. అఫ్గానిస్తాన్లోని కాందహార్ విమానాశ్రయంలో ఈ విమానాన్ని నిలిపిన ఉగ్రవాదులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, వారం రోజుల తర్వాత అజర్, జర్గర్, ఒమర్లను విడుదల చేయించారు. తనను విడిపించడంలో హర్కతుల్ ముజాహిదీన్ స్పందన నచ్చని అజర్ తానే సొంతంగా జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు.పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అజర్... అల్ కాయిదాలో చేరిన ఒమర్... అక్కడ ఉన్న అన్సారీ, అసిఫ్లతో సంబంధాలు కొనసాగించారు. అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఇక్కడ పలు నేరాలు చేయించారు. అందులో ఒకటే ఖాదిమ్స్ సంస్థ యజమాని, అప్పట్లో దానికి వైస్ చైర్మన్గా ఉన్న పార్థ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్. అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేయాలని నిర్ణయించుకున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ దానికి అవసరమైన నిధులు సమీకరించే బాధ్యతలు అనేక మందికి అప్పగించాడు. ఆ ఫండ్ రైజర్స్లో ఒమర్ కూడా ఒకడు కావడంతో అన్సారీ, ఆసిఫ్ తెరపైకి వచ్చారు. అమెరికాలో భారీ ఆపరేషన్ చేయనున్నామని, అందుకు విరాళం కావాలంటూ ఒమర్ ఇచ్చిన ఆదేశాలతో అన్సారీ, ఆసిఫ్లు 2001 జూలై 25న బర్మన్ను కిడ్నాప్ చేశారు. అప్పటికే దుబాయ్కి మకాం మార్చేసిన ఆఫ్తాబ్ అక్కడ నుంచే ఆసిఫ్ గ్యాంగ్తో కథ నడిపించాడు. బర్మన్ కోల్కతాలోని తిల్జాలాలో ఉన్న తన కంపెనీ గోదాముకు వెళ్తుండగా ఆసిఫ్ గ్యాంగ్ అపహరించింది. అతడిని విడుదల చేయడానికి రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.3.75 కోట్లకు బేరం కుదిరింది. ఈ మొత్తం హవాలా ద్వారా హైదరాబాద్ చేరింది. ఇక్కడ నుంచి రూ.కోటి దుబాయ్ వెళ్లగా, మిగిలిన మొత్తం కోల్కతా చేరింది. దుబాయ్ వెళ్లిన రూ.కోటి అక్కడ నుంచి బెల్జియం మీదుగా అమెరికాలో ఉన్న అల్ కాయిదా అనుచరులకు అందింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై 2001 సెప్టెంబర్ 11న జరిగిన ‘9/11 ఎటాక్స్’కు ఈ నగదు కూడా వినియోగించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేన్ (ఎఫ్బీఐ) విచారణలో తేలింది. ఈ కారణంగానే బర్నన్ కిడ్నాప్ కేసులో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కూడా సాక్షిగా ఉన్నాడు. ఐఎంగా ఏఆర్సీఎఫ్!(ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పూర్తిగా ఉగ్రవాద బాటపట్టిన ఆసిఫ్ రజా ఖాన్ 2002లో కోల్కతాలో ఉన్న అమెరికన్ కల్చరల్ సెంటర్పై దాడి చేశాడు. ఆపై రాజ్కోట్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. దీనికి ప్రతీకారంగా ఆసిఫ్ సోదరుడు అమీర్ రజా ఖాన్ ఏర్పాటు చేసిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. అదెలా..? దీని ఘాతుకాలు ఏంటి? పార్ట్–3లో...) -
ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు
ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్ మ్యూకోజల్) కేన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్జే గ్లోబల్ హెల్త్’ జర్నల్ ప్రచురించింది. ఆ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ 1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..) -
సువ్రతుడి వృత్తాంతం
శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు. అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు. అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, ‘మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి’ అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు. రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు. తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. ‘ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు. నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే’ అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. ‘మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి’ అని మాఘపురాణం చెబుతోంది. మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి’ అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.∙సాంఖ్యాయన -
రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..
కొన్ని తలరాతలు దేవుడి అత్యంత నాటకీయం రాస్తాడని అంటుంటారు పెద్దలు. అబ్బాం ఇదేం చిత్రం అనేలా జీవితాన్ని ముగించేస్తాడు. అలాంటి కథ ఈ వ్యక్తిది. ఓ నిజాయితీపరుడు..ఏళ్ల తరబడి చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించిన కథ ఇది. పోనీ అదేమంత పెద్ద అవినీతి కేసు.. అంటే అదీ కాదు. కానీ అన్నేళ్లు ఆశతో తాను నిర్దోషిని అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నం ఎవ్వరినైనా కదలిస్తుంది. అతడు నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి, ఆశావాదానికి ప్రతీక. ఈ కథ చిన్న చిన్న కష్టాలకు హైరాన పడేవాళ్లకు ఓ స్ఫూర్తి. అలాగే ఆశావాదంగా బతకడం ఎలాగో నేర్పిస్తుంది కూడా.ఆ వ్యక్తి కథ హాలీవుడ్ మూవీ ‘ది షాషాంక్ రిడెంప్షన్’ని తలపించే గాథ. అందులో ఓ నిర్దోషి ఎలా అయితే చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడో అలానే గుజరాత్కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి చాలాకాలంపాటు శిక్షను అనుభవించాడు. మొత్తం జీవితం అంతా జైలులోనే గడిపాడు ప్రజాపతి. ఇంతకీ అతడిపై మోపబడిన నేరం ఏంటంటే..రూ. 20ల లంచం కేసులో ఏకంగా 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సింపుల్గా చెప్పాలంటే 1994 నాటి హాలీవుడ్ చిత్రం లాంటిది అతడి కథ. అసలేం జరిగిందంటే..1996లో పోలీస్ కానిస్టేబుల్ బాబూభాయ ప్రజాపతి అహ్మదాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు రూ. 20ల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఆరోపణలు చేశారు. 1997లో సెషన్స్ కోర్టులో ఆయనపై చార్జిషీట్ దాఖలు చేశారు. 2002లో అభియోగాలు మోపారు. 2003లో సాక్షుల విచారణ ప్రారంభమైంది. 2004లో సెషన్స్ కోర్టు ప్రజాపతికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 3,000/- జరిమానా విధించింది. ప్రజాపతి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత, ఆయన అప్పీల్ 22 ఏళ్ల పాటు పెండింగ్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆయన నిర్దోషి కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. అంతేగాదు హైకోర్టు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల్లో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయని, అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఇక ప్రజాపతి తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ, ఈ కేసు మొత్తం అనుమానంతో చేసిన ఆరోపణలే తప్ప వాస్తవం లేదని కోర్టుకి నివేదించారు. కాగా, హైకోర్టు ఎప్పుడైతే ప్రజాపతిని నిర్దోషిగా పేర్కొందే..తతక్షణమే ఆయన భావోద్వేగంగా విడుదలైనందుకు ఆనందంగా ఉంది, ఇక ఇప్పుడు హాయిగా చనిపోయినా పర్లేదని అన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. అయితే న్యాయవాది గాంధీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రజాపతికి సూచించారు. ఆ మరుసటి రోజు ఆ విషయమై ఆయనకు ఫోన్ చేయగా, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్పారని న్యాయవాది గాందీ తెలిపారు. ఇన్నేళ్లు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాడానికి పోరాడిని విధానం అసామాన్యమైనది. చివరికీ..తన నిజాయితీ నిరూపించుకుని మరీ కన్నుమూశాడు. అదీకూడా ఆయన నోటి నుంచి వెలువడినట్లుగానే జరిపోవడం బాధకరం. ఇన్నేళ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ పోరాడాడు..కనీసం కోన్నాళ్లు బతికి ఉన్నా బాగుండేదే అని అతడి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆవేదనగా అన్నారు. (చదవండి: ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!) -
ఈ వారం కథ: బూడిద రంగు ఆకాశం
బ్రూనో తన ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ మీద కన్పిస్తున్న బొమ్మల వైపు నిశితంగా చూసింది. ఓ వైపు గులాబీ పువ్వుంది. మరోవైపు రత్నాలహారం... తను సరైన బొమ్మను ఎన్నుకుంటే బనానా మిల్క్షేక్ బహుమతిగా లభిస్తుందని తెలుసు. పొరపాటు చేస్తే శిక్ష తప్పదని కూడా తెలుసు.బ్రూనో తన కుడిచేతిని ముందుకు చాపి పొడవాటివేలితో హారం వైపు చూపించింది. గత రెండు వారాలుగా హారంవైపు చూపించిన ప్రతిసారీ దానికి తీయటి మిల్క్షేక్ లభించిన విషయం గుర్తుంది. కాని, ఒక్కసారిగా కంటెయినర్లో అంధకారం అలముకుంది. బ్రూనోకు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఐదు నిమిషాలు చీకటిలో మగ్గాక లైట్ వెలిగింది. మరోసారి బ్రూనో ముందు కంప్యూటర్ స్క్రీన్ ఉంచబడింది. బ్రూనో మళ్ళా హారం వైపు చూపించింది. దాన్ని ఉంచిన కంటెయినర్ లోపలున్న బల్బ్ వెంటనే ఆరిపోయింది. ఆరుసార్లు ప్రయత్నించినా బ్రూనో తప్పు చేస్తూనే ఉంది. నిన్నటి వరకు హారం సరైన సమాధానమే అయినా ఈరోజు అది మారిపోయిందన్న విషయం దాని మెదడు గ్రహించలేకపోతోంది.అది జతకడుతున్న ఆడకోతి లిల్లీతో అదే ప్రయోగాన్ని చేశాను. నిన్నటి వరకు లిల్లీ హారం బొమ్మ వైపు చూపిస్తే దానికి అరటిపళ్ళు బహుమతిగా ఇచ్చాను. ఈరోజు మొదట అది హారంబొమ్మ చూపించింది. వెంటనే కంటెయినర్లో లైట్ తీసేసి, చీకటి చేశాను. ఐదు నిమిషాల తర్వాత మళ్ళా స్క్రీన్ చూపిస్తే అది గులాబీపువ్వుని చూపించింది. మరో రెండు కోతులు కూడా మొదట హారాన్ని చూపించి, దాని వల్ల శిక్షిస్తారని అర్థమై, రెండోసారి గులాబీపువ్వు వైపు చూపించాయి.బహుమతినందించే బొమ్మలో మార్పు జరిగిందన్న విషయం వీటికి అర్థమైనట్టు బ్రూనోకి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలుసు. అందుక్కారణం నెలరోజుల క్రితం దాని మెదళ్ళోని ఓ భాగంలోకి ఇంజెక్ట్ చేసిన టాక్సిన్. దానివల్ల అక్కడి టిష్యూలు దెబ్బతిని ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ముప్పయిరెండు కోతుల్లోకెల్లా బ్రూనో చాలా తెలివైన మగ కోతి. నేను న్యూరో సైంటిస్టుగా ఇక్కడ ఉద్యోగంలో చేరేనాటికి దీని వయసు నాలుగు నెలలు. ఎంత అల్లరి చేసేదో.. ఎంత చురుగ్గా ఉండేదో.. ప్రయోగాలకు అవసరమైన కోతుల్ని ప్రయోగశాలలోనే పెంచుతారు. నాలుగడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల పొడవున్న విశాలమైన బోన్లలో కోతుల జంటతో పాటు వాటికి పుట్టిన పిల్లల్ని కూడా ఉంచుతారు. అవి ఆడుకోడానికి కంటెయినర్లోనే అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి.ఏడాది వయసు దాటేవరకు బ్రూనో వాళ్ళమ్మను అంటిపెట్టుకునే ఉండేది. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించసాగింది. నేను ల్యాబ్లోకి ప్రవేశిస్తుంటే నావైపు చాలా ఆసక్తిగా చూసేది. దాని కళ్ళలో మెరుపు కన్పించేది. ఆ కళ్ళు పలకరింపుగా నవ్వుతున్నాయేమో అన్పించేది. దానికిపుడు నాలుగేళ్ళు. ఈమధ్య నన్ను చూడగానే బ్రూనో సంతోషం ఆపుకోలేక గెంతుతోంది. దవడలను ముందుకు చాపి, పెదవులను పైకి లాగి, పళ్ళన్నీ కన్పించేలా అదో రకంగా నవ్వుతోంది కూడా. నేను మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటుంది. మెమొరీ పరీక్షల్లో, పజిల్స్లో చాలా చురుగ్గా పాల్గొంటుంది.ఈ ప్రయోగశాలలో పార్కిన్సన్స్కి, ఏడీహెచ్డీకి, ఆటిజం డిజార్డర్కి సరైన మందులు కనుక్కోవడం కోసం కోతులమీద నాడీసంబంధిత ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న కోతులన్నీ రీసస్ మకాక్ జాతికి చెందినవే. రక్తంలోని ఆర్హెచ్ ఫ్యాక్టర్ గురించి తెల్సుకోవడంలో, రేబిస్, పోలియో, మశూచి వంటి జబ్బులకు టీకాలు కనుక్కోవడంలో శాస్త్రవేత్తలకు సహకరించింది ఈ కోతులే. మానవుల డీఎన్ఏ సీక్వెన్స్తో పోలిస్తే వీటి డీఎన్ఏ తొంభై మూడు శాతం వరకు ఒకేలా ఉండటం వల్ల వీటిని ప్రయోగశాలల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.నేను స్వతహాగా జంతు ప్రేమికురాలిని. అందుకే జంతువుల మీద జరిపే ప్రయోగాలకు విరోధిని. మనుషులకొచ్చే రోగాలకు మందుల్ని కనుక్కోవడం కోసం నోరులేని జంతువుల్ని హింసించడం దారుణం కదా. జంతువుల శరీరాల్లోకి రకరకాల మందుల్ని పంపించడంవల్ల ఎన్ని దుష్పరిణామాలు ఏర్పడతాయో... ఇలా ప్రతియేటా కొన్ని వేల లక్షల ఎలుకలు, గినీ పిగ్స్, కుందేళ్ళు, పందులు, కోతుల్ని బలివ్వడం రాక్షసత్వం కాక మరేమిటి?ఈ ప్రయోగశాలలో కూడా కోతులు హింసకు గురవుతున్నాయి. అయినా మనసుని రాయి చేసుకుని నేనిక్కడ ఉద్యోగంలో చేరడానికి ముఖ్య కారణం స్వార్థమే... కాదనను. కాని, నాకు మరో గత్యంతరం లేదు. నేను చార్జ్ తీసుకున్నాక ఇంతకుముందు అనుసరిస్తున్న పద్ధతుల్లో చాలా మార్పులు తీసుకు వచ్చాను. తప్పు చేస్తే, ఇంతక్రితం కోతి శరీరానికి మైల్డ్ కరెంట్ షాక్ ఇచ్చేవారు. నేను కంటెయినర్లో లైట్లు ఆర్పేసి చీకటి చేసే పద్ధతిని ప్రవేశపెట్టాను. కోతులు చీకటిలో అసహనానికి లోనవుతాయి. వాటికి ఆపరేషన్లు చేయడానికి వాడే థియేటర్ని శానిటైజ్డ్ కండిషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆపరేషన్ తర్వాత గాయాలు ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోడానికి అనుభవజ్ఞులైన ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను ఏర్పాటు చేయించాను.పార్కిన్సన్స్, ఏడీహెచ్డీ, ఆటిజం డిజార్డర్ల గురించి తెల్సుకోవాలంటే మెదళ్లోని ఏ భాగం రోగగ్రస్థం కావడం వల్ల ఆ జబ్బులు సోకుతున్నాయో తెల్సుకోవడం అవసరం. బ్రూనో మెదడు మీద జరుగుతున్న ప్రయోగాల ఉద్దేశం అదే. ఏడాది క్రితం బ్రూనో మెదడుకి శస్త్రచికిత్స జరిగింది. మొదట బ్రూనో తలమీదున్న జుట్టుని షేవ్ చేశారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి, మత్తుమందు ఇచ్చారు. పుర్రెలో ఎనిమిది చోట్ల చిన్నచిన్న రంధ్రాలు చేసి, వాటిలోకి సన్నటి మెటల్ గొట్టాల్ని చొప్పించారు. ఒక ట్యూబ్ ద్వారా నీడిల్ని పంపించి, గులాబీ బూడిద రంగులో ఉండే గ్రేమేటర్లోకి తక్కువ మోతాదులో టాక్సిన్ని ఇంజెక్ట్ చేశారు. దాని ప్రభావం వల్ల మెదళ్లోని ఆ భాగం చెడిపోయి పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత బ్రూనో ప్రవర్తనలో కలిగే మార్పుల్ని పరిశీలించి రికార్డ్ చేయడం జరుగుతుంది.దానివల్ల పార్కిన్సన్స్ లేదా ఏడీహెచ్డీ లేదా ఆటిజం లక్షణాలు ఏర్పడకపోతే, మరో భాగంలోకి టాక్సిన్ను ఇంజెక్ట్ చేసి, మళ్ళా దాని స్వభావంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తారు. పుర్రెలో చేసిన ఎనిమిది రంధ్రాల్ని వినియోగించుకున్నాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే, ఆ కోతిని మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చంపేసి, లోతైన గుంట తవ్వి పూడ్చిపెట్టేస్తారు. బ్రూనోలో నేను ఆశిస్తున్న ఫలితం రాకపోవడంతో, వారం తర్వాత మెదళ్ళోని మరో భాగంలోకి టాక్సిన్ని పంపించి, నెలరోజుల వరకు దాని ప్రవర్తనని గమనించాను. ఫలితం సంతృప్తికరంగా లేకపోవడంతో మరో భాగంలో టాక్సిన్ని ఇంజెక్ట్ చేశాను.మెదళ్లో ఎనిమిదిచోట్ల ఉన్న టిష్యూలని నాశనం చేశాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే? నాకెందుకో చప్పున భయమేసింది. బ్రూనోని కూడా చంపేస్తారు. ఆ ఆలోచనకే వొళ్ళు జలదరించింది. చప్పున కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.∙∙ ఇంటికి చేరుకునేటప్పటికి రాత్రి ఎనిమిదైంది.నాన్నకు రోజూ రాత్రి ఏడింటి లోపలే భోజనం చేయడం అలవాటు. ఆయన సోఫాలో కూచుని టీవీలో వార్తలు వింటున్నాడు. అమ్మ నేనొచ్చే వరకు భోజనం చేయదు.బెడ్రూంలోంచి తుషార్ అరుపులు పెద్దపెద్దగా విన్పిస్తున్నాయి.‘‘వాడేం చేస్తున్నాడు లోపల? అన్నం తిన్నాడా?’’ బెడ్రూం వైపు నడుస్తూనే అడిగాను.‘‘వెళ్ళి చూడు. నీకే తెలుస్తుంది. భోజనానికి రెండుసార్లు పిలిచినా రాలేదు’’ అంది అమ్మ.జారవేసి ఉన్న తలుపుని తోసుకుని లోపలికి వెళ్ళాను.ట్రాంపోలీన్ మీద ఎగిరినట్టు మంచంమీద వేసి ఉన్న డన్లప్ పరుపుమీద తుషార్ గెంతుతూ అరుస్తున్నాడు.వాడు నావైపు ఓసారి అభావంగా చూసి, మళ్ళా పెద్దగా కేకలుపెడుతూ గెంతడంలో నిమగ్నమై పోయాడు. ఉదయం బైటికెళ్ళిన అమ్మ రాత్రి ఎనిమిదింటికి తిరిగొస్తే ఏ పిల్లాడైనా సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మను కౌగిలించుకుంటాడు కదా. నాకా అదృష్టం లేదు.‘‘ఇక చాల్లే నాన్నా. ఆపు. ఆకలి వేయడం లేదా? నాకైతే చాలా ఆకలేస్తోంది. అన్నం తిందాం రా’’ గోముగా అన్నాను.వాడు నా మాటల్ని పట్టించుకోలేదు.మంచాన్ని సమీపించి, వాడి చేయి పట్టుకుని ఆపుతూ ‘‘పడిపోతావు నాన్నా... కిందికి దిగు’’ అన్నాను.వాడు కోపంతో వూగిపోయాడు. ఒక్క దూకు దూకి హాల్లోకి పరుగెత్తాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాడి పింగాణీ ప్లేట్ని కిందికి విసిరికొట్టాడు. అది శబ్దం చేస్తూ ముక్కలుగా పగిలిపోయింది. వాటర్ జగ్ని కింద పడేశాడు. నీళ్ళునింపి ఉన్న గాజుగ్లాసుని కూడా విసిరి కొట్టబోతున్న సమయంలో వేగంగా కదిలి, వాడిని గట్టిగా హత్తుకున్నాను. వాడు కొన్ని నిమిషాలు పెనుగులాడాడు. కోపం తగ్గకపో వడంతో రెండు చేతుల్తో గిచ్చాడు. నా చేతిమీద కొరికాడు. భరించాను.కొన్ని నిమిషాల తర్వాత వాడు శాంతించాడు. అమ్మ హాల్ని శుభ్రం చేశాక ముగ్గురం భోజనాలు చేశాం. తుషార్ బెడ్రూంలోకెళ్ళి ఆడుకోసాగాడు.‘‘ఎందుకు తల్లీ ఈ రోజు చాలా అలజడిగా కన్పిస్తున్నావు?’’ అని అడిగాడు నాన్న. ఆయన గొంతులో ధ్వనించిన వాత్సల్యానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.‘‘ఏం లేదు నాన్నా’’ అన్నాను.‘‘తుషార్ చేస్తున్న పనిని ఆపినా, అడ్డుకున్నా. వద్దని చెప్పినా వాడు వయొలెంట్గా ప్రవర్తిస్తాడని, ఎదుటి వ్యక్తులకు హాని చేయడమో లేకపోతే తనకు తాను హాని చేసుకోవడమో చేస్తాడని మాకు చెప్తూ ఉంటావుగా. ఈరోజు నువ్వు వాడి ట్యాన్ట్రమ్స్కి కారణమైనావంటేనే తెలుస్తోంది నీ మనసులో ఏదో అలజడి ఉందని. నీ మెదణ్ణి తొలుస్తున్నదేమిటో చెప్పు’’ అన్నాడు.వెళ్ళి నాన్న పక్కనున్న కుర్చీలో కూచున్నాను.‘‘నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏమిటో వూహించగలను తల్లీ. డ్రగ్ టెస్టుల కోసం జంతువుల్ని వాడుకోవడం నీకు నచ్చదు. ప్రయోగాల పేరుతో వాటి మీద జరిగే హింసకు నువ్వు పూర్తి వ్యతిరేకివి. కాని, గత నాలుగేళ్ళుగా నువ్వు పనిచేస్తున్న ల్యాబొరేటరీలో నీ కళ్ళముందే కోతుల్ని హింసకు గురిచేస్తుంటే చూస్తూ తట్టుకోలేకుండా ఉన్నావు’’ అన్నాడు నాన్న.నేను మానసికంగా పడ్తున్న హింసని నాన్న ఎంత బాగా అర్థం చేసుకున్నాడో... మనం పడే మూగవేదన ఆత్మీయులకు తెలిసినట్టు వేరేవాళ్ళకి తెలియదు కదా.‘‘అవున్నాన్నా. నా స్వభావానికి విరుద్ధమైన పని చేస్తున్నాను కదా. అందుకే ఒత్తిడికి లోనవుతున్నా’’ అన్నాను.‘‘మానవాళి ఎదుర్కొంటున్న భయంకరమైన రోగాలకు మందులు కనిపెట్టాలంటే కొన్ని జంతువుల ప్రాణాల్ని బలివ్వక తప్పదు కదమ్మా’’ అన్నాడు నాన్న.‘‘తుషార్కి ఏడీహెచ్డీ సమస్య లేకపోతే, నేనా ల్యాబ్లో చేరేదాన్ని కాదు నాన్నా. పార్కిన్సన్స్, ఏడీహెచ్డీ, ఆటిజం డిజార్డర్లను పూర్తిగా నయంచేసే మందులకోసం చేస్తున్న ప్రయోగాలు కాబట్టి వాటిల్లో భాగస్వామిని కాక తప్పలేదు. తల్లిని కదా. ఏదో ఆశ... ఏడీహెచ్డీకి మందు కనుక్కోగలిగితే నా కొడుకుతో పాటు ఆ జబ్బుతో బాధపడుతున్న లక్షలమంది పిల్లలకు, ఆ భారాన్ని మోస్తున్న వాళ్ళ తల్లులకు ఉపశమనం లభిస్తుందన్న ఆశ.’’‘‘జంతువులమీద పరీక్షలు జరపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు రకరకాల ప్రత్యామ్నాయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయని విన్నానమ్మా. సెల్ కల్చర్స్, ఆర్గాన్స్ ఆన్ చిప్స్... ఇవే కాకుండా కంప్యూటర్ మోడలింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుకోవచ్చట కదా’’ అన్నాడు‘‘నిజమే నాన్నా. మిగతా అవయవాలకు వచ్చే జబ్బుల విషయంలో ఆర్గాన్స్ ఆన్ చిప్స్, సెల్ కల్చర్ లాంటివి బాగా ఉపయోగపడ్తాయి. కాని, మెదడుకి సంబంధించిన రుగ్మతల విషయంలో వాటి ప్రయోజనం చాలా పరిమితం నాన్నా.’’‘‘ఎందుకలా? నాకర్థమయ్యేలా చెప్పు’’ అన్నాడు.‘‘విశ్వాంతరాళంలో ఉన్న మనకు అర్థంకాని అనేకానేక రహస్యాల్లానే మెదళ్లోని సంక్లిష్టతలు మానవమేధకు పూర్తిగా అందడం లేదు నాన్నా. ఆకాశంలో కనిపించే కోటానుకోట్ల నక్షత్రాల్లా సూది మొనంత గ్రే మేటర్, వైట్ మేటర్లలో కోటానుకోట్ల న్యూరాన్లు అల్లుకుని ఉంటాయి. మెదళ్లోని ఒక క్యూబిక్ మిల్లీమీటర్ టిష్యూని శాస్త్రవేత్తలు స్కాన్ చేసే ప్రయత్నం చేశారు. దాని పూర్తి నిర్మాణాన్ని ఒడిసి పట్టుకోడానికి 1.4 పెటాబైట్స్ అంత డేటా అవసరమైంది. అర్థమయ్యేలా చెప్పాలంటే అధిక నిడివి గల పధ్నాలుగు వేల సినిమాల సమాచారాన్ని ఇసుకరేణువులో నిక్షిప్తం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే మెదడు సంబంధిత రుగ్మతల్ని నయం చేయడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది’’ అన్నాను.‘‘పార్కిన్సన్స్కి, ఏడీహెచ్డీకి కొన్ని మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కదమ్మా. మరి మీ ల్యాబ్లో చేస్తున్న ప్రయోగాలేమిటి?’’ ‘‘అవున్నాన్నా. కొన్ని మందులున్నాయి. వాటివల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది తప్ప పూర్తిగా నయంచేసే మందులు లేవు. మెదళ్లోని న్యూరోట్రాన్స్మీటర్లలో సమతుల్యత లోపించడం వల్ల ఈ రుగ్మతలు ఏర్పడతాయి. కొన్నిచోట్ల మెదడు టిష్యూలు దెబ్బతినడం కూడా కారణం కావొచ్చు. మొదట అవి ఏ ప్రాంతంలో దెబ్బతినడం వల్ల ఈ జబ్బులు ఏర్పడుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. మేము చేస్తున్న పని అదే. దెబ్బతిన్న మెదడు కణాల్ని పునరుజ్జీవింపచేసే పరిజ్ఞానంలో శాస్త్రవేత్తలు వేగంగా అడుగులు కదుపుతున్నారు. తొందర్లోనే విజయం సాధిస్తారన్న నమ్మకం ఉంది. అప్పుడు ఇటువంటి న్యూరొలాజికల్ డిజార్డర్స్ను పూర్తిగా నయం చేయవచ్చు’’ అన్నాను.బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాను. బాగా డస్సిపోయిన భావన... శారీరక శ్రమ ఎక్కువ కావడం వల్ల కాదు, మానసికంగా కుంగుబాటువల్ల కలుగుతున్న అలసట.తుషార్ మంచం చుట్టూ పరుగెత్తుతూ చేతిలో ఉన్న స్కేల్తో వార్డ్రోబ్స్ మీద, తలుపు మీద దబదబా బాదుతూ శబ్దం చేస్తున్నాడు.ఎంత అందమైన జీవితాన్ని వూహించుకున్నానో... పీజీలో రాహుల్తో ఏర్పడిన పరిచయం కొన్ని నెలల వ్యవధిలోనే ప్రేమగా మారింది. రాహుల్ ఓ ప్రైవేట్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేసేవాడు. నా ఎకౌంట్ అదే బ్యాంకులో ఉండటంతో, పనిమీద వెళ్ళిన ప్రతిసారీ రాహుల్ నవ్వు ఆత్మీయంగా పలకరించేది. ఎంత అందమైన నవ్వో... మెస్మరైజింగ్ స్మయిల్... నాకు శ్రమ లేకుండా అన్ని పనులు చేసిపెట్టేవాడు. నేనంటే అతనికి ఎంతిష్టమో అర్థమవడంతో నేను కూడా ఇష్టపడసాగాను. అందగాడు, మంచి మనసు ఉన్నవాడు, ప్రేమిస్తున్నవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు ... ఇంతకన్నా ఏ ఆడపిల్లయినా ఏం కోరుకుంటుంది? పీజీ పూర్తయిన రెండేళ్ళ తర్వాత రాహుల్తో నా పెళ్ళి జరిగింది.ఎన్ని మధురమైన అనుభవాలో... ఎన్ని తీయటి అనుభూతులో... స్వర్గం అంటే ఇదే కదా అనిపించేది. వసంతం తాకిన వనంలా విరబూసి, మంజుల వీణానిక్వణంలా రవళించి, మకరందం గ్రోలిన మధుపంలా మత్తిలి... జీవితం నిండా ఎన్ని రంగులో... వేనవేల హరివిల్లులు విరిసినట్టు...తుషార్ పుట్టాక జీవితం మరింత శోభాయమానంగా కనిపించసాగింది.కాని, జీవితంలో సంతోషాల జీవితకాలం తక్కువని తొందర్లోనే తెలిసొచ్చింది.రాహుల్కి అదే బ్యాంకులో పనిచేసే హర్షితతో సన్నిహిత సంబంధం ఉందని తెలిసిన రోజు పెద్ద గొడవైంది.‘మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదు. ఉత్త పుకారు’ అంటాడనుకుని ఆశపడ్డాను. ఒకవేళ నిజంగానే ఉన్నా, ‘తప్పు చేశాను. క్షమించు. ఇంకెప్పుడూ అటువంటి పొరపాటు చేయను’ అంటూ పశ్చాత్తాప పడతాడనుకున్నాను. సిగ్గులేకుండా ‘అవును. తనంటే నాకిష్టం. హర్షితతో శారీరక సంబంధం ఉన్నమాట వాస్తవమే. అయితే ఏమైంది? నీకేమీ తక్కువ చేయడం లేదు కదా. నిన్నొదిలేసి ఆ అమ్మాయిని చేసుకునే ఉద్దేశం ఏమీ లేదు. జస్ట్ ఫర్ ఫన్. అంతే. దానికింత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదు’ అన్నాడు.‘ప్రేమించానని కదా వెంటపడ్డావు. నీ ప్రేమ నిజమైందని నమ్మి కదా పెళ్ళి చేసుకున్నాను. ఇలా చేయడం నమ్మక ద్రోహం కాదా?’ అని అడిగాను.‘ఇప్పటికీ నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సౌమ్యా. హర్షితమీద నాకున్నది ప్రేమ కాదు. లస్ట్. అంతే. ఆ అమ్మాయికి మరో మూడేళ్ళలో పెళ్ళవుతుంది. అప్పుడు తనెవరో, నేనెవరో! అది టెంపరరీ బంధం. మనది శాశ్వత బంధం డియర్’ అంటూ నవ్వాడు.మొన్నటి వరకు మెస్మరైజింగ్గా కనిపించిన నవ్వు ఇప్పుడు మాయలమరాఠీ నవ్వులా వెగటుగా అనిపించింది.‘నేను కూడా కాపురం నీతో చేస్తూ సెక్స్ కోసం మరో మగాడితో సంబంధం పెట్టుకుంటే ఒప్పుకుంటావా?’ అన్నాను.నా చెంప పగిలేలా కొట్టి, విసురుగా గదిలోంచి బైటికెళ్ళిపోయాడు.ఇరు కుటుంబాల పెద్దలతో పంచాయతీ జరిగింది.‘నిన్ను వదుల్తాననడం లేదు కదా. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదంటున్నాడుగా. కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకు పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటావు’ అంటూ సలహాలిచ్చే వాళ్ళే అందరూ.ఆ సమయంలో నాకు సపోర్ట్గా నిలబడింది మా అమ్మ.విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించాను.నాకు విడాకులు మంజూరయ్యే నాటికి తుషార్కి మూడేళ్ళు...వాడికి ఏడాది వయసున్నప్పటి నుంచి రాహుల్తో మొదలైన గొడవలు, విడాకుల కోసం కోర్టుల చుట్టూ చేసిన ప్రదక్షిణలు, పడిన పాట్లు, పర్యవసానంగా అనుభవించిన మానసిక హింస... వీటివల్ల నేను తుషార్ని సరిగ్గా పట్టించుకోలేదనేది వాస్తవం. వాడి ఆలనాపాలనా అన్నీ అమ్మే చూసుకునేది.రాహుల్తో విడిపోయాక, ప్రశాంతత చిక్కడంతో తుషార్ని దగ్గరకు తీసుకునే అవకాశం దొరికింది. అప్పుడు గమనించాను వాడి స్వభావంలో ఉన్న వైపరీత్యాల్ని. ఒకచోట కుదురుగా కూర్చోడు. హైపర్ యాక్టివ్... మామూలుగా ఆ వయసు పిల్లలు చేసే అల్లరి గురించి నాకు అవగాహన ఉంది. కాని, తుషార్ చేసే అల్లరి దానికి రెట్టింపు స్థాయిలో ఉంటోంది. ఏమైనా చెప్తుంటే అస్సలు వినడు. చెప్పిన పని చేయడు. పిల్లలతో కలిసి ఆడుకోడు. ఆడే ఆటలో నిమిషాల్లోనే ఆసక్తిని కోల్పోయి మరో ఆట మొదలెడ్తాడు. ఇంపల్సివ్గా పనులు చేస్తాడు తప్ప వాటి పర్యవసానాల గురించి ఆలోచించడు. వాడిని నిద్ర పుచ్చడం పెద్ద సమస్య. నిద్ర పట్టినా చాలాసార్లు మధ్యమధ్యలో లేచి కూచుంటాడు. విపరీతమైన అసహనం, కోపం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న విషయానికే అతిగా స్పందించడం, నిర్లక్ష్యం, ప్రమాదం జరుగుతుందన్న భయం లేకపోవడం, హింసాత్మక ప్రవర్తన వంటి లక్షణాలు కన్పించడంతో నాలో ఏదో అనుమానం పడగ విప్పసాగింది. నిర్ధారణ కోసం చైల్డ్ సైకియాట్రిస్ట్కి చూపించాను. నా అనుమానం నిజమైంది. తుషార్కి ఏడీహెచ్డీ సమస్య ఉంది. అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్... రాహుల్ నాకు చేస్తున్న ద్రోహం గురించి తెల్సినపుడు కూడా ఇంత బాధపడ లేదు. విడాకుల తర్వాత సింగిల్ పేరెంట్గా మారినపుడు కూడా ఆందోళనకు లోనుకాలేదు. కాని, నా ప్రాణంలో ప్రాణమైన నా కొడుక్కి ఏడీహెచ్డీ ఉందని నిర్ధారణ కాగానే అంతులేని దుఃఖంలో కూరుకుపోయాను. రెండేళ్ళపాటు బిహేవియరల్ థెరపీ ఇప్పించాను. వాడికిపుడు ఎనిమిదేళ్ళు...ఏడీహెచ్డీతో బాధపడే పిల్లలు పెద్దయ్యాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడొచ్చు. ఎడీహెచ్డీకి, పార్కిన్సన్స్ వ్యాధికి డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటరే కారణం. ఆడి ఆడి అలసిపోయి, నాపక్కన పడుకున్న తుషార్ మీద లాలనగా చేయివేసి, కళ్ళు మూసుకున్నాను. అనాయాసంగానే కళ్ళలోంచి నీళ్ళు ఉబికుబికి వచ్చాయి.∙∙ బ్రూనో తలకు చేసిన ఎనిమిదో రంధ్రంలోకి టాక్సిన్ని పంపించాక, దాని ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని గమనించసాగాను. వారం గడిచేటప్పటికి దానిలో అసహనం, అలజడి స్పష్టంగా కన్పించసాగాయి. ఒకచోట కుదురుగా కూచోవడం లేదు. కంటెయినర్లో అట్నుంచిటు అవిశ్రాంతంగా తిరుగుతోంది. తనతోపాటు ఉన్న లిల్లీని కొట్టి కొరికి హింసిస్తోంది. నిద్ర కూడా బాగా తగ్గింది.ఇవన్నీ ఏడీహెచ్డీ లక్షణాలు కావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెదళ్లోని ఏ భాగంలో ఉన్న న్యూరాన్లు దెబ్బతినడం వల్ల ఏడీహెచ్డీ ఏర్పడుతుందో కచ్చితంగా తెలియడం వల్ల ఆ డిజార్డర్కి రెండు పద్ధతుల ద్వారా శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చు. మెదళ్లోని ఆ భాగంలోకి ఏ మందుని పంపించడం వల్ల అక్కడి న్యూరాన్లు పునరుజ్జీవం పొందుతాయో తెలుసుకోవడం ఓ పద్ధతి. ప్రయోగశాలలో అటువంటి మెదడు కణాల్ని ఉత్పత్తి చేసి, ఆ భాగంలో అమర్చడం ద్వారా నయం చేయడం మరో పద్ధతి.ఏడీహెచ్డీతో బాధపడే పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేయడం కోసం తన శరీరాన్ని పణంగా పెట్టిన బ్రూనో ఇప్పుడు నా కళ్ళకు దేవదూతలా కన్పిస్తోంది.నేను భయపడుతున్న ఘడియలు రానేవచ్చాయి... బ్రూనోని మెర్సీకిల్లింగ్కు లోను చేయాల్సిన ఘడియలు... నేను బ్రూనోవైపు జాలిగా చూశాను. ఒకప్పటిలా అది నన్ను గుర్తు పట్టడంలేదు. పెదవుల్ని సాగదీసి నవ్వడం ఎప్పుడో మర్చిపోయింది. దుమికే జలపాతంలా చురుగ్గా కదిలే ఒకప్పటి బ్రూనో కాదిప్పుడు. దాని కదలికల్లోనే కాకుండా, ప్రవర్తనలో కూడా చాలా మార్పులొచ్చాయి. అదిప్పుడు వైద్యశాస్త్ర ప్రరిశోధనలకు పనికిరాని ప్రాణి. దాన్ని చంపొద్దని ల్యాబొరేటరీ డైరెక్టర్ నీరవ్ని బతిమాలుకున్నాను.‘‘చంపకుండా ఉంచడం వల్ల ప్రయోజనం ఏముంది? దాని పోషణకయ్యే ఖర్చు వృథా కావడం తప్ప. అదిప్పుడు రకరకాల మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దాని శరీరంలోకి ఎన్ని యాంటీబయోటిక్స్ పంప్ చేశామో గుర్తుందా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దాని అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిని ఉంటాయన్న విషయం మీకు తెలుసుకదా’’ అన్నాడు.‘‘బ్రూనో మానవజాతికి చేసిన మేలు ఎలా మర్చిపోగలం? భవిష్యత్తులో ఏడీహెచ్డీకి పరిష్కారం కనుక్కుంటే ఆ క్రెడిట్ బ్రూనోకే దక్కుతుంది. దానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?’’ అన్నాను.‘‘దాన్ని చంపడమే మనం దానికి చేయగల మహోపకారం’’ అన్నాడు.‘‘నాకిచ్చేయండి. నేను పెంచుకుంటాను’’ అన్నాను.‘‘మీకేమైనా పిచ్చా? రకరకాల మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతున్న బ్రూనోని పెంచడం ఎంత కష్టమో, అందులో ఎంత రిస్క్ ఉందో ఆలోచించారా?’’ అన్నాడు.‘‘ఆ విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. పర్వాలేదు. నా కొడుకు ఏడీహెచ్డీతో బాధపడ్తున్నాడని మీకు తెలుసు. అటువంటి కొన్ని లక్షలమంది పిల్లల కోసం అది శారీరక హింసను భరించింది. నేను దానికోసం ఆ మాత్రం కష్టాన్ని భరించలేనా?’’ అన్నాను.నేనతన్ని ఒప్పించి, బ్రూనోని ఇంటికి తెచ్చుకున్నాను.బ్రూనో కోసం వసారాలో ఉన్న ఖాళీస్థలంలో అల్యూమినియంతో చిన్న గదిలా కట్టించాను.రోజూ రాత్రి యింటికి చేరుకునే సమయానికి బెడ్రూంలో తుషార్ పెద్దగా అరుస్తూ, మంచం పైనుంచి కిందికి జంప్ చేస్తూ గోల చేస్తుంటే, వసారాలో బ్రూనో అల్యూమినియం గదిలో అశాంతిగా, అలజడిగా తిరుగుతూ, కంటెయినర్ గోడల్ని చేతుల్తో బాదుతూ శబ్దాలు చేస్తూ ఉంటుంది.ఇప్పుడు మా యింట్లో ఏడీహెచ్డీతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలున్నారు. ∙సలీం -
కథాకళి: కారణం లేదు
ఆ ఫిర్యాదు అందుకోగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్ స్పెక్టర్ని పిలిచి ఆదేశించాడు.‘‘కొత్తపేటలో ఓ ఇల్లాలు తన భర్తని చంపేసిందని ఫిర్యాదు వచ్చింది. వెళ్ళి చూడు.’’అతను ఓ కానిస్టేబుల్తో ఆ చిరునామాకి పావుగంటలో చేరుకున్నాడు. దూరం నుంచే ఆ ఇంటి బయట లైట్ స్తంభం వెలుతురులో గుమిగూడిన జనాన్ని చూశారు. వాహనంలోంచి దిగిన యూనిఫామ్లోని ఆ ఇద్దర్ని చూసి జనం పక్కకి తప్పుకున్నారు.‘‘ఫిర్యాదు చేసింది మీలో ఎవరు?’’ ఎస్.ఐ. అడిగాడు.ఒకతను ముందుకి వచ్చి చెప్పాడు.‘‘నేనే. పక్కింట్లో ఉంటాను. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూంటే ఇంట్లోంచి అనివర్తిగారి అరుపులు వినిపించాయి. పరిగెత్తుకు వెళ్ళి చూస్తే ఆయన మంచం మీద రక్తసిక్తమై కనిపించాడు. ఆవిడ చేతిలో కత్తి. ఆయన ఎదురుగా కూర్చుని ఆయన్నే చూస్తోంది. ‘ఏమైంద’ని అడిగితే ‘మా వారిని పొడిచాను’ అని చెప్పింది. వెంటనే మీకు ఫోన్ చేశాను.’’ఎస్.ఐ. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. లోపల మంచం మీది హతుడి చొక్కా రక్తంతో తడిసి, నేల మీద కూడా కొంత మడుగు కట్టింది. ఛాతీలో రెండు చోట్ల గాయాలు కనిపించాయి. ఎదురుగా ఏభై ఏళ్ళ ఆవిడ కూర్చుని ఉంది. మంచం మీద రక్తసిక్తమైన కత్తి ఉంది. ఆవిడ పోలీసుల వంక నిర్లిప్తంగా చూసింది.‘‘ఈయన ఎవరు? మీకు ఏమవుతారు?’’ ఎస్.ఐ. అడిగాడు.‘‘నా భర్త.’’‘‘ఈయన్ని మీరే చంపారా?’’‘‘అవును.’’‘‘ఆ కత్తితోనే పొడిచి చంపారా?’’‘‘అవును.’’‘‘ఎందుకు చంపారు?’’ ఎస్.ఐ. ప్రశ్నించాడు.‘‘నాకు తెలీదు.’’‘‘మీకు తెలుసు. కారణం లేకుండా మీరు ఆయన్ని చంపలేరు.’’‘‘ఏమో మరి?’’‘‘ఆయన మీకు తెలీకుండా మరో పెళ్ళి చేసుకోవడం, అక్రమ సంబంధం, ఏ కారణంగానైనా హింసించడం లాంటివి ఏమైనా జరిగాయా?’’‘‘లేవు. ఆయన ఎన్నడూ నా మీద చెయ్యి చేసుకోలేదు.’’‘‘మీరు చంపబోయే ముందు ఏం జరిగింది?’’‘‘పెద్దగా ఏం జరగలేదు. నేను బాత్రూంలోకి వెళ్ళి బయటకి రాగానే ఎందుకో ఆయన మీద కోపం వచ్చి ఉంటుంది. అందుకని పొడిచి ఉంటాను.’’‘‘ఎందుకు కోపం వచ్చిందో గుర్తు తెచ్చుకోగలరా?’’ ఎస్.ఐ. అడిగాడు.పెళ్ళైన కొత్తల్లో అనివర్తి ఆఫీస్ నించి ఆలస్యంగా వచ్చాడు.‘‘ఆలస్యమైనప్పుడు ఓ ఫోన్ కాల్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? మీ కోసం వండిన ఉప్మా చల్లారిపోయింది. రీహీట్ చేస్తే మీరు తినరు.’’అనివర్తి చొక్కా విప్పగానే వీపువైపు చినిగిన బనీన్ ని చూసింది.‘‘ఆ చిరుగుల బనీన్ వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదని అంతా అనుకుంటారు.’’మరో రోజు. ‘‘స్నానానికి వెళ్తూ మూడు విజిల్స్ రాగానే కుక్కర్ని ఆఫ్ చేయమన్నానా? అన్నమంతా ఎలా పొంగిపోయిందో చూడండి. మీరు ఏ పనీ సరిగ్గా చేయరు.’’‘‘ఇంగువ డబ్బా తేలేదే?’’ అనివర్తి సాయంత్రం షాప్కి వెళ్ళొచ్చాక సంచీలోవి కిచెన్ ప్లాట్ఫాం మీదకి కుమ్మరించి చూసి అడిగింది.‘‘మర్చిపోయాను.’’‘‘అసలు మిమ్మల్ని పంపించిందే అందుకు కదా?’’‘‘గుర్తు లేదు.’’‘‘న్యూస్ పేపర్ చదివాక టీవీ కింద షెల్ఫ్లో ఉంచమన్నానా? ఫేన్ గాలికి అవి ఎలా చిందరవందరగా పడ్డాయో చూడండి.’’‘‘రాత్రుళ్ళు మీ మొబైల్ని సైలెంట్ మోడ్లో ఉంచమన్నానా? టింగ్ టింగ్మని మెసేజ్ అలర్ట్స్కి మెలకువ వచ్చి తర్వాత నిద్రపట్టి చావటం లేదు.’’‘‘మనిద్దరికీ డయాబెటిస్. ఆ కాజు బర్ఫీ తీసుకురావద్దంటే ఎందుకు తెస్తారు? మీ కౌంట్ పోయినసారి టూట్వంటీకి వెళ్ళింది.’’‘‘బాత్రూం బయట ఆ పట్టా ఎందుకు వేశారు? దాని కింద బట్ట చిరిగి రబ్బర్ బయటకి వచ్చింది. కింద తడికి దాని మీద కాలు వేస్తే జర్రున జారి పడ్డాను. అదృష్టం. నా ఎముకలు విరగలేదు.’’‘‘ఎందుకిలా అనవసరపు ఖర్చులు పెడతారు? కిలో పదహారు వందలు పెట్టి పిస్తా కొనే తాహతు మనకి ఉందా అని ఆలోచించుకోనక్కర్లేదా?’’ఆ అర్ధరాత్రి అనివర్తి భార్యకి మెలకువ వచ్చింది. లేచి బాత్రూంలోకి వెళ్ళింది. ఆవిడకి గుప్పున యూరిన్ వాసన వేసింది. పెళ్ళైన కొత్తల్లో తన భర్తకి చెప్పడానికి ఆమె కొంత సిగ్గు పడింది. తర్వాత చెప్పేప్పుడు ఇబ్బందిగా చెప్పింది.‘‘మీరు బాత్రూంలో నీళ్ళు చక్కగా చుట్టూ కూడా కొట్టండి.’’వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి నిద్రపోయే భర్త ఛాతీలో రెండుసార్లు బలంగా పొడిచింది. తర్వాత ఎటాచ్డ్ బాత్రూంలోకి కాక కామన్ బాత్రూంలోకి వెళ్ళింది. ‘‘లేదు. నేను నా మావారిని చంపడానికి కారణం ఉందనుకోను. నిజానికి కొన్ని కారణాలు ఉన్నా అందులో ఏవీ చంపదగ్గ కారణాలుగా నాకు తోచలేదు. ఎందుకు చంపానో నాకే తెలీదు.’’ ఆవిడ ఎస్.ఐ.కి చెప్పింది. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
గుజరాతీ రుచులకు గ్లోబల్ క్రేజ్
ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లే వారు అయినా, ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులు అయినా.. విమానం ఎక్కేముందు వారి సూట్కేసుల్లో దుస్తుల కంటే ఎక్కువగా ఆహార ప్యాకెట్లు కనిపిస్తుంటాయి. దీనికి కారణం విదేశాల్లో భారతీయ ఆహారం అంతగా దొరకకపోవడం లేదా ఖర్చు అధికంగా ఉండటం. అందుకే ఇక్కడి నుంచి విదేశాలు వెళ్లేవారు తమతో పాటు ఇక్కడి ఆహారాన్ని మోసుకెళుతుంటారు. ముంబై, అహ్మదాబాద్ల నుంచి విదేశాలకు వెళ్లేవారికి ఇక్కడి గల్లీల్లో ఉండే గుజరాతీ కిచన్లే ‘అన్నపూర్ణలు’గా మారాయి. న్యూజెర్సీ, కాలిఫోర్నియా తదితర నగరాల్లో ఉండే భారతీయులు ఈ హోమ్ కిచెన్ల రుచుల కోసం క్యూ కడుతుంటారు.ఎన్ని పెద్ద బ్రాండ్లు ఉన్నా..న్యూజెర్సీలో పనిచేసే పలువురు భారతీయ టెక్కీలు తమ 30 కిలోల లగేజీలో దాదాపు 8 కిలోలు కేవలం ఈ తినుబండారాలకే కేటాయిస్తుంటారు. థెప్లా, ఫాఫ్డా, ఖాక్రా, రెడీ-టు-ఈట్ పావ్ భాజీ తదిరత వంటకాలు వాక్యూమ్ సీలింగ్ సాంకేతికతతో నెల రోజుల పాటు తాజాగా ఉంటున్నాయి. అమెరికాలో ఎన్ని పెద్ద బ్రాండ్లు అందుబాటులో ఉన్నా, గుజరాతీ మహిళలు (బెన్స్) ఎటువంటి రసాయనాలు లేకుండా చేసే ‘ఇంటి రుచి’కి ఏదీ సాటిరాదని ప్రవాసులు చెబుతుంటారు.బడ్జెట్ ఫ్రెండ్లీ రుచులువిదేశాలకు వెళ్లే కొత్తలో విద్యార్థులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆహార ఖర్చు . న్యూయార్క్ వంటి నగరాల్లో ఒక వెజిటేరియన్ శాండ్విచ్ ధర సుమారు 5 నుండి 7 డాలర్లు (రూ. 400 - 600) ఉండగా, భారత్లో కేవలం 20-30 రూపాయలకే లభించే థెప్లా ప్యాకెట్లు వారికి గొప్ప ఊరటనిస్తున్నాయి. అమెరికాలో లభించే ప్యాక్డ్ ఫుడ్ కంటే ఇవి ఐదు రెట్లు తక్కువ ధరకే లభిస్తుండటం విద్యార్థుల బడ్జెట్కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది.ప్రకటనలు లేని వ్యాపారంఈ గుజరాతీ కిచెన్ల వెనుక ఎటువంటి భారీ మార్కెటింగ్ టీమ్లు లేవు. ముంబైలోని విలే పార్లే, ఘాట్కోపర్ వంటి ప్రాంతాల్లోని గృహిణులు నాణ్యతనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయికి తమ వ్యాపారాన్ని తీసుకువెళ్లారు. ‘ఇందుబెన్ ఖాక్రావాలా’ లాంటి సంస్థల స్ఫూర్తితో తమ ఇంటి వంటగదుల నుంచే పలువురు మహిళలు టెక్కీల ఆకలిని తీర్చే పనిలో నిమగ్నమవుతున్నారు.తెల్లవారుజాము నుంచే విదేశీ ఆర్డర్ల సందడిఅహ్మదాబాద్కు చెందిన సెజల్ షా లాంటివారు తెల్లవారుజామున 4 గంటలకే తమ ‘కిచెన్’లో వంట పనిని ప్రారంభిస్తారు. విదేశాల్లో ఉండే ఐటీ నిపుణుల కోసం, విద్యార్థుల కోసం రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తారు. ఈ చిన్న కిచెన్ల నుండి వెళ్లే ఆహారం అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లోని భారతీయ మేధావుల ఆకలిని తీరుస్తోంది.సంస్కృతుల ఎగుమతివిదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ పిల్లల కోసం, బంధువుల కోసం ఈ వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. స్టార్టప్లు, గిగ్ ఎకానమీ యుగంలోనూ, గుజరాతీ మహిళల వ్యాపార దృక్పథం గ్లోబల్ మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించింది. కేవలం రుచి మాత్రమే కాదు, ఒక సంస్కృతిని, అనుబంధాన్ని ఈ వంటకాల ద్వారా వారు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం! -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?
"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?• డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్రూమ్ దాకా తీసుకొచ్చాయి.• గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.• ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్1. Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.2. Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.3. Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.4. Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.5. Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.మీ కోసం ఒక సెల్ఫ్-చెక్గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
నన్ను పెళ్లి చేసుకుంటావా ?!
‘వాలెంటైన్స్’ వీక్ మొదలైంది. నిన్నంతా గులాబీల పరిమళం (రోజ్ డే). నేడు, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?!’’ అని వేడుకొనే రోజు (ప్రపోజ్ డే). రేపు, మధురమైన చాక్లెట్ డే. 10న టెడ్డీ డే. 11న ప్రామిస్ డే. 12న హగ్ డే. 13న కిస్ డే.14 శనివారం, వాలెంటైన్స్ డే. ఎనిమిది రోజుల ప్రేమవారం.. ఈ వరుసంతా!అన్నిట్లోకి అపురూపమైనది ఇవాళ్టి ప్రపోజ్ డే. ఈ సందర్భంగా –కొందరు తత్వవేత్తల ప్రపోజల్స్ గురించి.తత్త్వవేత్తల ఆలోచనలు సాధారణ ప్రపంచానికి అంతుపట్టవు. వాళ్లకు ఎంతో సరళమైనది, లోకానికి కఠినాతికఠినంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి అనే లాలిత్యమైన భావనలు కూడా వారిలో ‘మేధాగర్భితమై’ ఉంటాయి. మానవ మాత్రులం పూలగుత్తులు, వెన్నెల రాత్రులతో ప్రేమను పండించుకోవాలని చూస్తుంటే... వారు మాత్రం తర్క వితర్కాలు, విడ్డూరమైన ఒప్పందాలతో ప్రేమను ‘కుదుర్చుకోవటం’ చరిత్రలో మనకు కనిపిస్తుంది! పాశ్చాత్య ఫిలాసఫర్లు మాత్రమే కాదు, భారతీయ తాత్త్విక చింతనాపరులూ ప్రేమ / పెళ్లి ‘ప్రపోజల్’ విషయంలో వాళ్లదైన స్థాయిలో సతమతమైనవారే లేదా తమ ప్రియురాళ్లను సతాయించినవారే.ఫ్రెడరిక్ నీషేనీషే 19వ శతాబ్దపు జర్మన్ తత్త్వవేత్త. ఈయన తన ప్రియురాలికి (వన్ సైడ్ లవ్) ముచ్చటగా మూడుసార్లు ప్రపోజ్ చేశారు. ఆ ప్రియురాలు ‘లూ ఆండ్రియాస్ సలోమీ’ అసాధారణ మేధావి! ఈయన్ని మించినావిడ! భావోద్వేగాల పరంగా ఆమె స్థాయి ఎక్కడో ఎగువన ఉంటే, నీషే స్థాయి ఎక్కడో దిగువన ఉండేది. ‘‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ఆయన ఆమెను ఒకసారి అడిగి ఊరుకోలేదు. మూడు ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయత్నంలో, నేరుగా అడిగే ధైర్యం లేక తన స్నేహితుడు పాల్ రేని రాయబారిగా పంపారు. అదే అతడు చేసిన పొరపాటు. ఆ రాయబారికి కూడా ఆమె అంటే ప్రాణం! నీషే ప్రేమ గురించి చెప్పకుండా తన ప్రేమ గురించి ఆమెకు చెప్పాడు. చివరికి ఆమె ఇద్దరికీ ‘నో’ చెప్పేసింది. అలాగని ఆమె ఆ రెండు పురుషాత్మల ఆశా దీపాన్ని ‘ఉఫ్’మనేమీ ఆర్పేయలేదు. ‘‘మన ముగ్గురం కలిసి ఒక ‘పరిశుద్ధ త్రిమూర్తులు’గా బ్రహ్మచర్యం పాటిస్తూ, కేవలం చదువుకు అంకితమై ఒకే ఇంట్లో ఉందాం’’ అని ప్రతిపాదించింది. నీషే మొదట అయిష్టంగానే ఒప్పుకున్నా, ఆ తర్వాత వారి పవిత్ర స్నేహబంధాన్ని ఆమెతో పెళ్లిగా మార్చుకుందామని రెండుసార్లు ప్రయత్నించారు. పాపం ఆయన తర్కం ఆమె దగ్గర చీమంత కూడా పని చేయలేదు.సోరెన్ కిర్కేగార్డ్కిర్కేగార్డ్ 19వ శతాబ్దపు డెన్మార్క్ వేదాంత వేత్త. రెజీన్ ఒల్సెన్ అనే యువతికి ఆయన చేసిన ప్రపోజల్ మొదట్లో చాలా పద్ధతిగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ప్రదర్శించిన విన్యాసాలే చరిత్రలో ఒక వింత అధ్యాయంగా మిగిలిపోయాయి. ఆయన అడిగారు, ఆమె సరేనంది... ఆ ఆనందం కనీసం మూణ్ణాళ్లైనా కాదు కదా, రెణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది! అందుకు కారణం ఆమె కాదు. అతడే. లవ్ని ప్రపోజ్ చేశాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది తనకున్న అకారణ విషాద భావన తత్వం (మెలంకలీ), దేవుని పట్ల ఉన్న భక్తి... ఒక మంచి భర్తగా ఉండటానికి ఏమాత్రం పనికిరావని ఆయన సిద్ధాంతీకరించుకున్నారు! పోనీ, గౌరవప్రదంగా విడిపోవచ్చు కదా? అదీ లేదు! ఆమెకు తన మీద ద్వేషం, అసహ్యం కలిగేలా చేసుకుని, బ్రేకప్ వల్ల ఆమె బాధపడకూడదనే వింత ఆలోచనతో తన గురించి తనే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టుకున్నారు. బయట అందరి ముందు కావాలనే ఒక మూర్ఖుడిలా, దుర్మార్గుడిలా ప్రవర్తిస్తూ తన పరువును తనే తీసుకున్నారు.ఇమ్మాన్యుయేల్ కాంట్ ఈయన 18వ శతాబ్దపు ప్రముఖ భావవాద జర్మనీ తత్త్వవేత్త. సమయాన్ని పాటించడంలో, విషయాలను విశ్లేషించి, వర్గీకరించటంలో మహాజ్ఞాని. సమస్య ఏంటంటే, లవ్ ప్రపోజల్ని ఆయన ఒక అందమైన అనుభూతిలా కాకుండా, తాను ఛేదించలేని ఒక క్లిష్టమైన గణిత సమస్యలా చూశారు. సంగతేంటంటే, ఇద్దరు అమ్మాయిలకు (ఒకేసారి కాదు లెండి, ఒకరి తర్వాత ఒకరికి) ఆయన ప్రపోజ్ చేయాలనుకున్నారు కాని, మేధస్సు ఆడిన ఊగిసలాటతో ఆ పని చేయలేకపోయారు. పెళ్లి వల్ల వచ్చే ఆర్థిక లాభనష్టాలు; తార్కికమైన ప్లస్లు, మైనస్లు లెక్కగట్టడానికి ఆయన ఎంత సమయం తీసుకున్నారంటే... చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి, పెళ్లికి మానసికంగా సిద్ధం అయ్యేనాటికి.. ఒకమ్మాయి ఊరు విడిచి వెళ్లిపోయింది. ఇంకో అమ్మాయి హాయిగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పాపం, కాంట్.. తన లోపల ఉండే ప్రాఫిట్ అండ్ లాస్ల గడియారం కంటే... మనుషుల జీవ గడియారమే వేగంగా తిరుగుతుందని గుర్తించలేకపోయారు!జి.డబ్ల్యూ.ఎఫ్. హెగెల్ఈయన ఒక తార్కిక ప్రేమికుడు! 18వ శతాబ్దం నాటి ప్రఖ్యాత జర్మన్ తత్త్వవేత్త. ప్రతి పదార్థానికీ చలనం ఉంటుందన్న హెగల్ సూత్రం, మార్క్సిస్టు గతి తార్కిక భౌతికవాదంపై ఎంతో ప్రభావం చూపింది. అర్థం కాని భాషకు, భారమైన సిద్ధాంతాలకు హెగల్ మారుపేరు. ‘మేరీ వాన్ టుచర్’ కి ఆయన చేసిన ప్రపోజల్ కూడా ఆయన శైలిలోనే కొంచెం గంభీరమైనది.ఆమె కోసం ఆయన కవితలు రాశారు. కానీ అవి మెదడుకు మేత పెట్టేలా ఉండేవి తప్ప, మనసున మల్లెల మాలలను ఊగించేవి కావు. ‘‘నిష్కల్మషమైన ప్రేమ అనేది బాగానే ఉంటుంది కానీ, ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ‘పెళ్లి’ అనేది ఒక చట్టపరమైన, సామాజికమైన అవసరం. అందుకే మనం పెళ్లి చేసుకుందాం..’’ అని ఆమెతో అనేవారు. అంటే తన లవ్ ప్రపోజల్ని కూడా ఆయన తన ‘ఫెనోమెనాలజీ ఆఫ్ స్పిరిట్’ అనే గ్రంథంలోని ఒక క్లిష్టమైన పాఠంలా మార్చేశారు. అదృష్టవశాత్తూ, మేరీకి ఆయన ప్రపోజల్ నచ్చటంతో ఆయన్ని పెళ్లాడింది.జీన్ పాల్ సార్త్రే సార్త్రే 20వ శతాబ్దారంభపు ఫ్రెంచి తత్త్వవేత్త. నాటక రచయిత, రాజకీయ కార్యకర్త, సాహితీ విమర్శకుడు. ‘విడ్డూరం’ అనే పదానికి అసలైన అర్థం సార్త్రే, ఆయన ప్రియురాలు సిమోన్ డిబోవర్. వీరు ప్రేమించుకున్నారు కాని, పెళ్లి చేసుకోలేదు! ‘చేసుకోకపోవడమే ప్రేమ పరమార్థం’ అన్నట్లు ఉండిపోయారు. సార్త్రే, ఆమెకు ఒక వినూత్నమైన ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే, ప్రతి రెండేళ్లకు ఒకసారి తమ పెళ్లిని ‘రెన్యువల్’ చేసుకునే ఒక ఒప్పందం! ‘‘మన మధ్య ఉన్నది అత్యంత ‘అవసరమైన’ ప్రేమ (!); కాని లోకంలో ఉన్న ‘అనవసరమైన’ పెళ్లిని కూడా మనం చవి చూడటం మంచిది’’ అని సార్త్రే ఆమెను ఒప్పించారు. ఫలితంగా, వారు రెండేళ్లకోసారి పెళ్లి అనే భావనను (!) పొడిగించుకుంటూ 51 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అలాగని ఏనాడూ ఒకే ఇంట్లో నివసించలేదు. పైగా, తమ తమ ఇతర ప్రేమాయణాల గురించి కాఫీ తాగుతూ హాయిగా చర్చించుకునేవారు. ‘ఓపెన్ రిలేషన్షిప్’ అనే పదం పుట్టకముందే, ఆ కాన్సెప్ట్కి వీరు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారు!మొత్తానికి ఈ పాశ్చాత్య తత్త్వవేత్తల ప్రేమకథలు వింటుంటే.. ‘ప్రేమ గుడ్డిది’ అనే మాట కంటే, ‘ప్రేమ తాత్త్వికమైనది’ అనే మాట కరెక్ట్ ఏమో అనే ఆలోచన కలుగుతుంది.::: భారతీయ తత్త్వవేత్తల ప్రపోజల్స్ :::మనవాళ్ల తాత్త్విక సంప్రదాయాలు ఎక్కువగా వైరాగ్యం, మోక్షం వైపు మొగ్గు చూపుతాయి. అందుకే, ఒక జ్ఞాని సంసార జీవితంలోకి (గృహస్థాశ్రమం) అడుగుపెట్టడం అంటే ప్రాచీన భారతదేశంలో అదొక పెద్ద ‘మేధాపరమైన కల్యాణ వేదిక’! పెళ్లి ప్రపోజల్స్ అంటే కేవలం మనసులు కలవడం మాత్రమే కాదు... అవి ధర్మం గురించి, ఆత్మల అనుసంధానం గురించి జరిగే హై–వోల్టేజ్ డిబేట్లు!యాజ్ఞవల్క్య మహర్షిఉపనిషత్తుల కాలం నాటి మేధావు లందరిలో యాజ్ఞవల్క్యుడు ఒక శిఖరం లాంటి వాడు. పెళ్లి విషయంలో కూడా ఆయనది ఒక రకమైన ‘మెటాఫిజికల్’ (అధిభౌతిక) అప్రోచ్! ఆయన తన రెండో భార్య మైత్రేయిని పెళ్లి చేసుకున్నప్పుడు, అది ఇప్పట్లో లాగా ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?‘ అని అడిగే మామూలు ప్రపోజల్ కాదు. మైత్రేయి అసామాన్యురాలు. గొప్ప విదుషీమణి. అంటే, మహా పండితురాలు. ఆమెకు కావలసింది నగలు, బంగారం లేదా హోదా కాదు. ఆమెకు ‘అమరత్వ సిద్ధి’ రహస్యం కావాలి. యాజ్ఞవల్క్యుడు ఆమెకు ఒక సంసార బంధాన్ని కాకుండా, ఒక ‘ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని’ ఆఫర్ చేశారు. ఆయన ఆమెతో ఒక మాట అన్నారు. ‘‘భర్తను భర్త కోసం ప్రేమించకూడదు, ఆయనలో ఉన్న ‘ఆత్మ కోసం ప్రేమించాలి’’ అని! అదే, ఆమెకు ఆయన చేసిన పెళ్లి ప్రపోజల్. దానర్థం ఏమిటంటే, మనం హాయిగా అడవికి వెళ్లి కూర్చుని, మోక్షం వచ్చే వరకు ఈ విశ్వం గురించి వాదించుకుంటూ ఉందాం – అని! ఇదొక రకమైన ‘స్టడీ–బడ్డీ’ లేదా క్లాస్మేట్ ప్రపోజల్ లాంటిది. పెళ్లి తర్వాత పార్టీలు, ఫంక్షన్లు కాదు... నేరుగా పరలోకానికి టికెట్ బుక్ చేసుకునే ప్రణాళిక అన్నమాట.మండన మిశ్రుడు 8వ శతాబ్దంలో, గొప్ప మీమాంస పండితుడైన మండన మిశ్రుడికి ఉభయభారతి అనే తాత్త్వికురాలితో వివాహం జరిగింది. నిజానికి ఆమె తెలివితేటల ముందు ఆయన మేధస్సు కాస్త తక్కువేనని ఆ కాలంలోనే చెప్పుకునేవారు. నిజానికైతే వీరి వివాహాన్ని ఒక ప్రేమ బంధంలా కాకుండా, ఇద్దరు మేధావుల మధ్య జరిగిన ‘జ్ఞాన సమ్మేళనం’ లాగా అభివర్ణించాలి. మండన మిశ్రుడి పెళ్లి ప్రపోజల్ కూడా అదే విధంగా జరిగింది. ఇక, వీరి కాపురం ఎలా ఉండేదంటే... అదొక నిరంతర తాత్త్వికాంశాల తరగతి గదిలా ఉండేది. ఒకసారి సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదనకు దిగారు. అప్పుడు మండన మిశ్రుడు ఏ మగ పండితుడినీ న్యాయనిర్ణేతగా పెట్టుకోకుండా, తన భార్యనే ఆ స్థానంలో ఉండమన్నారు! ఆ చర్చలో భర్త ఓడిపోతుంటే, ఆమె ఏమాత్రం మొహమాటపడకుండా నిజాన్ని అంగీకరించింది. అయితే, ఆమె అక్కడితో ఆగిపోలేదు. ‘‘నా భర్తను ఓడించినా, ఆయనలో సగభాగమైన నన్ను ఓడిస్తేనే మీ విజయం పూర్తవుతుంది’’ అని శంకరాచార్యుల వారికే సవాలు విసిరింది! పైగా, ‘‘నువ్వు సన్యాసివి, అసలు పెళ్లి చేసుకుంటే వచ్చే జీవితానుభవాలే నీకు తెలియవు. మరి నీకు సంపూర్ణ జ్ఞానం ఉందని ఎలా చెబుతావు?’’ అని శంకరాచార్యుల వారిని ప్రశ్నించింది.మహావీరుడుజైనమతంలో 24వ తీర్థంకరుడైన మహావీరుడు చివరికి సర్వసంగ పరిత్యాగిగా మారినప్పటికీ, ఆయన వివాహం గురించి చరిత్రలో ఒక పెద్ద తాత్త్విక చర్చే నడిచింది. పురాణ గాథల ప్రకారం, ఆయన మనసు లోక కల్యాణం మీద ఉండటంతో, ఆయనను ఈ ప్రాపంచిక బంధాల్లో బంధించాలని తల్లిదండ్రులు యశోదతో పెళ్లి నిశ్చయించారు. అంటే, ఆయన పెళ్లి ప్రపోజల్ వెనుక ఆయన ప్రమేయం కంటే, వారి తల్లిదండ్రుల ప్లానే ఎక్కువగా ఉందన్నమాట! మొత్తానికి మహావీరుడు పెళ్లి చేసుకున్నారు కాని, ఆ సంసార జీవితంలో ఉంటూనే అంతర్గతంగా పూర్తి వైరాగ్యంతో ఉండేవారు. ఒకసారి ఊహించుకోండి... ‘‘నేను నీ పక్కనే కూర్చొని ఉంటాను కాని, నా మనసు మాత్రం ఎక్కడో విశ్వంలోని అనంతమైన శూన్యంలో విహరిస్తూ ఉంటుంది’’ అని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? సామాన్యులకు బోధపడే తత్త్వం అయితే కాదు.::: ‘సారీ, నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’:::భక్తి, అద్వైత సంప్రదాయాల్లోని కథలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది అక్కడి తత్త్వవేత్తలు ప్రపోజ్ చేసే విధానం చాలా భిన్నంగా, విచిత్రంగా ఉంటుంది. వారు తమ భాగస్వామికి ప్రాపంచిక విషయాల పట్ల ఎంత ‘నిర్లిప్తత’ ఉందో పరీక్షించి కానీ ముందడుగు వేసేవారు కాదు. నాటి పురుష తాత్వికులు ప్రపోజ్ చేయాలంటే, ఒక షరతు పెట్టేవారు. తనకు కాబోయే భార్య తన ‘దైవ చింతన’కు ఏమాత్రం అడ్డంకి కాకూడదు– అని! పెళ్లి్ల సంబంధం అని అమ్మాయిని చూడటానికి వెళ్లినప్పుడు కూడా మన తత్త్వవేత్తలు ఆమె అందం గురించి కాకుండా... జనన మరణాల గురించి, దేహం తాలూకు అశాశ్వతత్వం గురించి అత్యంత కఠినమైన ప్రశ్నలు అడిగేవారు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా ప్రాపంచికమైన ఆశలతోనో లేదా మామూలు భావోద్వేగాలతోనో సమాధానం చెబితే, ‘‘సారీ... నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’’ అని తిరస్కరించేవారు. అంటే, అది పెళ్లి చూపుల్లా కాకుండా, ఒక ఆత్మకు జరిగే టెక్నికల్ ఇంటర్వ్యూ లాగా ఉండేది! మొత్తానికి పశ్చిమ దేశాల తత్త్వవేత్తలైనా, మన భారతీయ మేధావులైనా... ప్రపోజల్ విషయంలో వారి లాజిక్కులు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయని అర్థమౌతోంది. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
కనువిప్పు
ఒక అడవిలో ఒక బోదురు కప్ప ఉండేది. ఆ బోదురు కప్ప గొప్పలకి పోవడం మొదలు పెట్టింది. నీటిలో ఉన్న జీవులను నేల మీద ఉండలేరని వెటకారం చేసేది. నేలమీద ఉన్న జీవులను నీటిలో ఉండలేరని ఎగతాళి చేసేది. నీటిలోను, నేల మీద ఉండగల జీవి తానొక్కటేనని విర్రవీగడం మొదలు పెట్టింది. ఓ కాకి ఇదంతా గమనించింది. ఎలాగైనా కప్పకు బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒక రోజు చెరువులోంచి నేల మీదకొచ్చిన కప్పకు, నేలపై అన్నం మెతుకులు తింటున్న కాకి కనిపించింది. ‘ఏం కాకి బావా! ఎంత సేపైనా నేల మీదేనా, నాలాగా నీటిలోకి వచ్చేదేమైనా ఉందా?’ అంటూ వ్యంగ్యంగా అంది కప్ప. ఆ మాటకు కాకి ‘ఎందుకు రాను బావా! నువ్వు మా ఆకాశానికి ఎగురుకుంటూ రా! నేను అలాగే మీ చెరువులోకి ఈదుకుంటూ వస్తా’ అని తడుముకోకుండా అంది. ఆ మాటకు కంగు తిన్నది కప్ప. ‘నిజమే కదా! రెండు చోట్లా ఉండగలను కాని, ఆకాశంలో ఎగరలేను కదా! ఇందులో పెద్ద గొప్ప ఏముంది?ఎలాగైనా ఆకాశంలో కూడా ఎగిరి, మూడు చోట్లా ఉండగలనని నిరూపించుకుని, ఎగిరే పక్షులకు కూడా నా సత్తా ఏమిటో చూపాలి’ అనుకుంది. అనుకున్నదే తడవుగా, ‘ఓస్ అదంత కష్టమేమీ కాదు, నీటిలోనూ, నేలపైనా ఉన్న దాన్ని ఆమాత్రం ఆకాశంలోకి ఎగరలేనా? రేపు ఉదయం ఎగురుతాను చూడు’ అని కాకితో తల ఎగరేస్తూ అంది. అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కప్పకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి సమయం అని కాకి సరే అంది.ఎగరడానికి ముందు రెక్కలు కావాలి కనుక కప్ప వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళింది. ‘నెమలి మిత్రమా! నీ ఈకలు కొన్ని నాకు కావాలి. దానికి ప్రతిగా నీకు మొక్కల విత్తనాలు ఇస్తాను’ అని అడిగింది. నెమలి కొన్ని ఈకలు ఇచ్చింది. ఆ ఈకలు తీసుకుని దర్జీపిట్ట దగ్గరకు వెళ్ళింది కప్ప.‘దర్జీపిట్ట మిత్రమా! నాకు ఈ ఈకలతో రెక్కలు కుట్టివ్వవా! దానికి బదులుగా నీకు గింజలు ఇస్తాను’ అంది. ‘సరే’నని దర్జీ పిట్ట కప్పకు నెమలి ఈకలతో రంగు రంగుల రెక్కలను కుట్టి ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం కాకి దగ్గరకు వెళ్లి, ‘చూడు! నాకు రెక్కలు లేవనే కదా, ఎగరలే ననుకున్నావ్. నీ రెక్కలు నల్లవి. నా రెక్కలు చూడు రంగు రంగులవి. నీకన్నా పైకి ఎగరగలను’ అంటూ బలమంతా కూడగట్టుకుని రెక్కలను ఊపుతూ పైకెగిరింది. కప్ప బరువుకి రెక్కలు ఊడిపోయి, గాల్లో ఎగిరిపోయాయి. కప్ప గిరా గిరా గిరికీలు కొడుతూ కిందకు పడబోయింది. కప్పకు కళ్ళు తిరుగుతున్నట్టు, గుండె ఆగిపోతున్నట్టు అనిపించింది. అహంకారానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నానని భయంతో బెక బెకమని అరవసాగింది.అంతా గమనిస్తున్న కాకి వెంటనే ఎగిరి తన వీపుపై కప్పను పెట్టుకుని, కింద పడకుండా జాగ్రత్తగా చెరువు గట్టు మీద దించింది. తను గొప్పలకు పోయి అందరినీ హేళన చేసినా, తనను కాపాడిన కాకి ముందు తలదించుకుని, క్షమించమని అడిగింది కప్ప. ‘ప్రతి జీవి శరీర ఆకృతి, నిర్మాణం ఒకో రకంగా ఏర్పడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా జీవన విధానం ఉంటుంది. అది తెలుసుకుని నడుచుకోకపోతే ఏ జీవికైనా ముప్పు తప్పదు. అహంకారపు పొరలు బుద్ధిని కమ్మేస్తాయి. వాటికి మనం దూరంగా ఉండాలి. ఇకనైనా ఎవరినీ హేళన చేయకుండా బుద్ధిగా ఉండు’ అంటూ కాకి కప్పకు సుద్దులు చెప్పింది. కాకి మాటలను విన్న కప్ప బుద్ధి తెచ్చుకుని, ఎవరినీ ఎగతాళి చేయకుండా అందరినీ గౌరవిస్తూ, స్నేహ పూర్వకంగా మెలగసాగింది. కప్పకు కనువిప్పు కలిగించినందుకు నీటిలోని జీవులు, నేలపైన జీవులు కాకిని అభినందించాయి.కథాకళి25.1.2026 ఫన్డేలో ప్రచురించిన ‘మధురం’ కథకి పాఠకులు సూచించిన టాప్ 5 పేర్లు. హ్యాపీ జర్నీసెడింబి జయలక్ష్మి నరసింహరావుసెకండ్ ఇన్నింగ్స్టి. సూర్య కుమారి (హైదరాబాద్)వైతరణి వెళ్ళొస్తా!డాక్టర్ కోటేశ్వరరావు (గూడూరు)స్వర్గానికి స్మాల్ ట్రిప్ఏ వి సోమయాజులు (కాకినాడ)చావు (అ)భయందీక్షిత (నంద్యాల)-కయ్యూరు బాలసుబ్రమణ్యం -
ప్యాచెస్ కనిపిస్తున్నాయి
నాకిప్పుడు 24 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూ ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నాను. ఇటీవల తలపై ఒకటి రెండు చోట్ల గుండ్రంగా జుట్టు పూర్తిగా రాలిపోయిన ప్యాచెస్ కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో నొప్పి లేదా దురద ఏమీ లేదు. ఇది ప్రమాదకరమైన సమస్యా? – రాధిక, గుంటూరురాధిక గారు, మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది అలోపేషియా ఎరియాటా అనే జుట్టు రాలే సమస్యగా భావించవచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలోపేషియా ఎరియాటా అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. ఇందులో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున జుట్టు మూలాలపై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై లేదా జుట్టు ఉన్న ఇతర ప్రాంతాల్లో గుండ్రంగా జుట్టు పూర్తిగా ఊడిపోయిన ప్యాచెస్ కనిపిస్తాయి. ఇది తలకే కాకుండా కనుబొమ్మలు, వెంట్రుకలు, శరీరంపై ఉన్న జుట్టు, పురుషుల్లో గడ్డం భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలో జుట్టు మూలాలు పూర్తిగా నాశనం కావు. అందువల్ల సరైన చికిత్సతో జుట్టు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. అయితే పిల్లలు, యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో మానసిక లేదా భావోద్వేగ ఒత్తిడి, పోషక లోపాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం, శస్త్రచికిత్సల తర్వాత వచ్చే మార్పులు ముఖ్యమైనవి. అలాగే థైరాయిడ్ వ్యాధులు, విటిలిగో వంటి ఇతర ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నవారిలో కూడా ఇది కనిపించవచ్చు. ఇది అంటువ్యాధి కాదు. నూనె వాడటం, షాంపూ మార్చడం లేదా తల శుభ్రం చేయకపోవడం వల్ల వచ్చే సమస్య కూడా కాదు. కాబట్టి ఈ విషయంలో అపోహలకు లోనవ్వాల్సిన అవసరం లేదు. సమస్యను నిర్ధారించడానికి చర్మవైద్యులు ప్రత్యేకంగా తల చర్మాన్ని పరిశీలించే పరీక్షలు చేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు కూడా సూచించవచ్చు. రక్తహీనత, ఐరన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ డీ లేదా విటమిన్ బి12 లోపాలు ఉన్నాయా లేదా అనేది పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. చికిత్సలో భాగంగా పోషక లోపాలను సరిచేయడం, తలకు అప్లై చేసే మందులు, అవసరమైతే ప్రత్యేక ఇంజెక్షన్లు వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స ప్రారంభించిన తర్వాత సాధారణంగా ఆరు నుంచి పన్నెండు వారాల్లో జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అర్హత గల చర్మవైద్యుణ్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా ఈ సమస్యను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. -డా. ఇందిర పవన్ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ -
శ్రుతి మించిన ఆశావాదం టాక్సిక్ పాజిటివిటీ
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చెప్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది.అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే పాజిటివ్ యాటిట్యూడ్ నూరిపోసినా, ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకుపోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. -
వినువీథిలో సారథులు
ప్రపంచంలోనే అధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్ మారుతోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల సరళీకరణ మన దేశాన్ని మహిళా పైలట్ల హబ్గా మార్చాయి. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వేసిన అడుగులే భారత్ను నేడు ప్రపంచానికి ఆదర్శంగానిలబెట్టాయి.ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం..→ 2021 నుంచి 2025 మధ్యకాలంలో మహిళా పైలట్ల సంఖ్య 90% మేర పెరిగింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, భారతీయ మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. → 2021లో మహిళలకు 243 లైసెన్సులు జారీ చేయగా, 2025 నాటికి ఆ సంఖ్య 461కి పెరిగింది. అంటే ఈ నాలుగేళ్లలో సుమారుగా 89.71% వృద్ధిని సూచిస్తోంది. → డిసెంబర్ 31, 2025 నాటికి భారతదేశంలో మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 3,327.→ ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5% నుంచి 6% మాత్రమే ఉండగా, భారతదేశంలో ఇది 15% గా ఉంది. అంటే ప్రపంచ సగటు (5%) కంటే మూడు రెట్లు ఎక్కువ. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కంటే కూడా భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది.→ ఒక్క ఏడాదిలోనే అంటే 2025 లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు 61 కొత్త శిక్షణ విమానాలను ప్రవేశపెట్టడం విమానయాన రంగంలో ఒక పెద్ద అడుగు. ప్రస్తుతం దేశంలో మొత్తం 385 శిక్షణ విమానాలు ఉన్నాయి.→ సాంకేతిక విభాగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ విభాగాల్లో మహిళల వాటా 14% వరకు ఉంది.→ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో మహిళల సంఖ్య సుమారు 2.6% మాత్రమే ఉన్నప్పటికీ, ఇటీవల ఇండిగో వంటి సంస్థలు కేవలం మహిళలతో కూడిన మెయింటెనెన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.→ 2025 నాటికి విమానయాన రంగంలో మహిళల వాటాను 25 శాతానికి పెంచాలని పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఏ) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక హ్యూమన్ రిసోర్స్ పాలసీలు, ప్రసూతి సెలవులు, శిక్షణ తర్వాత తిరిగి విధుల్లో చేరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిర్ణయించింది.అంతర్జాతీయంగానూ..చాలా మంది భారతీయ మహిళా పైలట్లు ఇప్పుడు అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలను నడుపుతున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో విమానయాన రంగంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదగనున్నారు. పలు ఎయిర్లైన్స్లో మహిళా పైలట్ల శాతం అలయన్స్ ఎయిర్... అత్యధికంగా 17.36% మంది మహిళా పైలట్లు ఉన్నారు.ఇండిగో... గరిష్ట సంఖ్యలో మహిళా పైలట్లను (సుమారు 791 మంది) కలిగి ఉన్న సంస్థ.స్పైస్జెట్... 16.39% మహిళాపైలట్లతో రెండోస్థానంలో ఉంది.ఎయిర్ ఇండియా... 15.62% మహిళా పైలట్లు ఉన్నారు. -
పెళ్లంత థ్రిల్లింతలు
ఒకప్పుడు పెళ్లి అనగానే ‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి’ అనే పాటందుకునేవారు వధూవరులు. ఏ పెళ్లిలోనైనా పీటలపై కూర్చున్న జంట ఒకే రకం పెళ్లి చీర, ఒకేరకం పట్టు లాల్చీతో కనిపించగానే, సంప్రదాయం ఉట్టిపడేది. పురోహితుడి మంత్రాల దగ్గర నుంచి గట్టిమేళం వరకు ఇంచుమించు ఒకే తీరులో పెళ్లివేడుక నడిచేది. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఊహల్లో ఊగులాడుతూ– ఊరంత పందిరినీ, ఊరంతా సందడినీ కోరుకునేవారు. కాని, ట్రెండ్ మారింది. ఇప్పటి యువత ఎక్కువగా స్పెషల్ అండ్ యూనిక్ మ్యారేజెస్కే ఓటేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో సాహసాలను కోరుకుంటున్నారు. శుభాశుభాలను, తిథి నక్షత్రాలను పక్కనపెట్టి, పెళ్లిని వ్యక్తిగత వేడుకగా మార్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నడుస్తోంది. ఆచారాలు, ఆత్మీయ ఆహ్వానాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన యువత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ట్రెండీ లుక్ కోసం సరికొత్త వివాహ పద్ధతుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు.ప్రస్తుతం ట్రెడిషన్ ఫాలోవర్స్ కంటే ట్రెండ్ సెట్టర్స్ ఎక్కువైపోతున్నారు. వైరల్ కావాలనే కుతూహలం కొందరిది; తమ యవ్వనంలోనే ఏదో ఒక ప్రత్యేకతను చాటుకోవాలన్న తాపత్రయం మరికొందరిది; మరపురాని మధుర క్షణాలను సృష్టించుకోవాలన్న ఆరాటం ఇంకొందరిది. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లికి సిద్ధమయ్యే యువత– సంప్రదాయాలను పక్కనపెట్టి అనూహ్యంగా ఆలోచిస్తున్నారు. విస్మయకరంగా విచిత్రరీతుల్లో వివాహాలు చేసుకుంటూ ‘ద్యావుడా’ అనిపిస్తున్నారు. తమ పెళ్లి అందరిలా కాకుండా– అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని తపిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెళ్లి మండపాలు– వింత పందిళ్లను వేçస్తూ, విడ్డూరాలకు తెరలేపుతున్నాయి.పెళ్లి అంటే ప్రమాణం. నీకు నేను, నాకు నువ్వు అనే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని ప్రపంచంలోని ఒక్కో ఆచారం– ఒక్కో తంతుతో నిర్వహిస్తుంది. ప్రతి ఆచారంలోనూ పెళ్లి పేరుతో ఏకమైన జంటకు దైవమే సాక్ష్యమంటూ బంధుగణం ఆశీర్వదిస్తుంది. అలాంటి పవిత్రమైన వేడుక రానురాను ట్రెండ్ మార్చుకుంటోంది. కొన్నిసార్లు గతి తప్పుతోంది. మరికొన్నిసార్లు మతులు పోగొడుతోంది.అడ్వెంచరస్ వెడ్డింగ్స్‘సంసార జీవితమంటేనే ఓ సాహసం’ అనే అనుభవజ్ఞుల మాటల్ని ఫాలో అవుతున్నారో ఏమో కాని, చాలామంది యువత తమ పెళ్లి జీవితాన్ని అదే సాహసంతో ప్రారంభిస్తున్నారు. అలాంటి అడ్వెంచరస్ వెడ్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం!స్కైడైవింగ్ వెడ్డింగ్అడ్వెంచరస్ వెడ్డింగ్స్లో స్కైడైవింగ్తో కూడిన బేస్ జంపింగ్ పెళ్లిళ్లు చేసుకుని వైరల్ అవుతున్నాయి కొన్ని కొత్త జంటలు. నిజానికి ఇలాంటి పెళ్లిళ్లు యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా, హవాయి, మొజూరి వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అలాస్కా మంచుదారుల్లో ఇలాంటి సాహసాలు అధికంగా తారసపడతాయి. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాలతో పాటు ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాలన్నీ స్కైడైవింగ్తో పాటు బేస్ జంపింగ్ వెడ్డింగ్స్కు అనుకూలంగా ఉంటాయి.నిజానికి ఆస్ట్రేలియా, న్యూజీలండ్ దేశాలు సాహస క్రీడలకు కేంద్రం కావడంతో పాటు– అక్కడ బీచ్లు, పర్వతాలు స్కైడైవింగ్కి అనుకూలంగా ఉండటంతో ఈ రకమైన వివాహాలు తరచుగా జరుగుతాయి. మరోవైపు యూకేలో కొందరు వధూవరులు పెళ్లి వేదికకు విమానం, స్కైడైవింగ్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటారు. 2023లో ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను థ్రిల్లింగ్గా నిర్వహించుకుని ప్రపంచాన్ని అవాక్ చేశారు.ఎత్తైన కొండ అంచున పెళ్లి చేసుకుని, వివాహం పూర్తయిన వెంటనే, ఆ కొండ అంచు నుంచి బేస్ జంపింగ్/ స్కైడైవింగ్ చేశారు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట భీకరంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలోనే త్వరగా పాపులర్ అయ్యింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా సాహస ప్రియులైన వ«ధూవరులు– ఈ విధానాన్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు.స్పేస్నెట్ వెడ్డింగ్స్ ఈ స్పేస్నెట్ వెడ్డింగ్ సాహసానికి పరాకాష్టగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కిమ్ వెగ్లిన్, ర్యాన్ జెంక్స్ అనే జంటను ఈ వివాహానికి ట్రెండ్ సెట్టర్స్గా చెబుతుంటారు. వీరు అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని మోయాబ్ ఎడారిలో 400 అడుగుల ఎత్తులో లోయ పైభాగంలో కట్టిన స్పేస్నెట్పై వివాహం చేసుకున్నారు. కిమ్, ర్యాన్ ఇద్దరూ ప్రొఫెషనల్ స్లాక్లైనర్లు. వీరు మోయాబ్లో జరిగే ప్రసిద్ధ హై–లైనింగ్ ఫెస్టివల్లో కలుసుకుని ప్రేమించుకున్నారు. అందుకే, తమ వివాహాన్ని కూడా అదే స్పేస్నెట్లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పదిమంది బేస్ జంపర్లు టూటూ దుస్తులు ధరించి, పారాషూట్లలో పూల రేకులను వదులుతూ ఈ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపారు. ఈ వివాహం 2017లో జరిగింది. అంతకు ముందు పర్పుల్, మిక్కీ అనే మరో జంట మోయాబ్లోనే స్పేస్నెట్పై వివాహం చేసుకున్నట్లు సమాచారముంది. ఇంతటి సాహసం చేసి పెళ్లి చేసుకుంటున్న జంటలు అరుదుగా ఉన్నప్పటికీ ఈ పెళ్లితంతు ప్రపంచ యువత దృష్టిని ఆకట్టుకుంది.అండర్ వాటర్ వెడ్డింగ్స్సాహస ప్రియులైన జంటలకు అండర్ వాటర్ వెడ్డింగ్ అనేది తమ ప్రేమలోని లోతును ప్రకటించుకునే ఒక అద్భుత అవకాశం. షాంపేన్ కంటే ఎక్కువ బుడగలతో, ప్రశాంతమైన సముద్రపు అడుగున, రంగురంగుల పగడపు దిబ్బలు, చిన్నాపెద్దా చేపల సాక్షిగా వివాహం చేసుకోవడం ఇవన్నీ ఈ ట్రెండ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారతదేశంలో నీటి అడుగున వివాహాలకు ప్రధాన కేంద్రం అండమాన్ దీవులు. ఇక్కడ హేవ్లాక్ ఐలాండ్ ఈ వినూత్న వేడుకలకు వేదికగా మారుతోంది. ఇది దేశంలోనే నీటి అడుగున వివాహాలకు ఆదరణ పొందుతున్న ఏకైక ప్రదేశం. వధూవరులు స్కూబా గేర్ లేదా ఆడియో సిస్టమ్ ఉన్న అండర్ వాటర్ హెల్మెట్లు ధరించి నీటి అడుగుకు వెళ్తారు.ఇక్కడ నోటి మాటలకు బదులు, డైవింగ్ స్లేట్లు ఉపయోగించి ప్రమాణాలు చేసుకుంటారు. అనంతరం ఉంగరాలు మార్చుకుంటారు. అండమాన్ లో ఈ వివాహ ఏర్పాట్లకు ఖర్చు సుమారుగా రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. డైవింగ్ మాస్టర్లు, భద్రతా సిబ్బంది, కెమెరామెన్ వివాహం చేసుకోబోయే జంట వెంటే ఉంటారు. నిజానికి అండర్ వాటర్ వెడ్డింగ్స్ గ్లోబల్ ట్రెండ్. అయితే ఈ వివాహానికి మురికి లేని స్వచ్ఛమైన నీరు, పగడపు దిబ్బలు కలిగిన సుందరమైన వాతావరణం ఉండాలి. థాయ్లాండ్ ఈ వివాహాలకు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నీటి అడుగున సామూహిక వివాహాలు జరుగుతాయి. 2001లో క్రాదాన్ ద్వీపంలో 22 దేశాల నుంచి 34 జంటలు ఒకేసారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించి, ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు.అక్కడ కొన్ని రిసార్ట్లలో ప్రత్యేకంగా నీటి అడుగున వివాహాల కోసం చాపెల్స్ అందుబాటులో ఉంటాయి. కైమాన్ దీవులు, మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా కూడా ఈ డైవింగ్కు అనుకూలమైన ప్రాంతాలు కాబట్టి, ఈ ట్రెండ్ను అక్కడ కూడా అనుసరిస్తున్నారు. థాయ్లాండ్లోని ట్రాంగ్ ప్రావిన్స్లో 1997లో వార్షిక సామూహిక జలాంతర వివాహ వేడుక ప్రారంభమవడంతో ఈ కాన్సెప్ట్కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు, ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ట్రెండ్ తరచుగా అత్యంత విలాసవంతమైన లేదా సాహసోపేతమైన గమ్యస్థానాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డైవింగ్ అనుభవం ఉన్న లేదా శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు ఈ పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఎగబడుతున్నారు.హాట్ ఎయిర్ బెలూన్ వెడ్డింగ్స్నిజానికి చాలామంది జంటలు పెళ్లి ప్రతిపాదనలు చేసుకోవడానికి ఈ హాట్ ఎయిర్ బెలూన్ను ఎక్కుతుంటారు. ఈ వివాహం ఆకాశంలో తేలియాడుతూ, భూమిపై అద్భుతమైన దృశ్యాలను చూస్తూ జరుపుకునే సాహస వేడుక. ఈ రకమైన వివాహం– కేవలం వధూవరులు, పూజారి, ఫొటోగ్రాఫర్ల సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఈ వేడుకకు పెద్ద బెలూన్ బాస్కెట్ ఉపయోగిస్తారు. ఈ సాహసానికి టర్కీలోని కప్పడోసియా ప్రత్యేకం. అక్కడి రాతి నిర్మాణాలు, లోయలను పైన హాట్ఎయిర్ బెలూన్ నుంచి చూస్తే కళ్లు చెదురుతాయి.దాంతో చాలామంది ఈ వివాహాలను చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఈజిప్ట్లోని లక్సర్లో పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాల మీదుగా సూర్యోదయాన్ని చూస్తూ బెలూన్ ప్రయాణం చేస్తే అదిరిపోతుంది. అలాగే ఇటలీలోని టస్కనీలో పచ్చని కొండలు, ద్రాక్ష తోటలు, పురాతన కోటల మీదుగా బెలూన్పై ప్రయాణించే అనుభూతి చాలా బాగుంటుంది. అందుకే చాలామంది జంటలు ఆయాప్రాంతాల్లో ఈ ప్రయాణం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక భారత్లో కూడా ఈ వివాహాల ట్రెండ్ పెరుగుతోంది. సాధారణంగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు జరిగే ప్రదేశాలలోనే ఈ వివాహాలను ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ (జైపూర్), గోవా ఈ జాబితాలోకి వస్తాయి.హాట్ ఎయిర్ బెలూన్ చరిత్ర 18వ శతాబ్దంలోనే కనిపిస్తుంది. మొట్టమొదటి మానవ ప్రయాణంతో కూడిన హాట్ ఎయిర్ బెలూన్ విమానం, 1783 నవంబర్ 21న ఫ్రాన్స్లోని పారిస్లో ప్రయోగించారు. ఆధునిక, సురక్షితమైన ప్రొపేన్ బర్నర్లు కలిగిన హాట్ ఎయిర్ బెలూన్ లు 1950ల చివరలో అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి, బెలూనింగ్ ఒక వినోద కార్యక్రమంగా, ఆపై ఒక రొమాంటిక్ వేదికగా మారింది.డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ పెరిగిన తరువాతే, హాట్ ఎయిర్ బెలూన్ లలో వివాహాలు కూడా క్రమంగా మొదలయ్యాయి. అంటే, సాంకేతికంగా బెలూన్లు చాలా పాతవి అయినప్పటికీ, వాటిలో వివాహాలు జరుపుకోవడం అనేది కొత్త ట్రెండ్ అనే చెప్పుకోవాలి. భారత్లో, కొన్ని కొత్త జంటలు వివాహ వేడుక పూర్తయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి కారుకు బదులుగా హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిస్తూ వైరల్ అవుతున్నారు.మంచుశిఖరాల్లో..ఎవరెస్ట్ శిఖరం పైన, మంచుతో నిండిన అంటార్కిటికాలో, మంచు ఎడారులలో లేదా అడవుల లోపల వివాహాలు సాహసోపేతమైన ట్రెండ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఈ రకమైన వివాహాలకు అతిథులు చాలా తక్కువ మంది ఉంటారు. లేదా అసలు ఉండరు.ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (నేపాల్)– ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వివాహ వేదికలలో ఇదొకటి. ఇక్కడ చాలామంది యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అంటార్కిటిక్ క్రూయిజ్–భూమిపై అతి తక్కువ మంది అడుగుపెట్టిన ప్రదేశాలలో ఒకటి అంటార్కిటిక్ ఖండం. అయితే ఇప్పటి ట్రెండీ యూత్కి అటుగా ప్రయాణించే క్రూజ్ షిప్స్ కూడా వివాహ వేదికలే. పెంగ్విన్స్, మంచు దిబ్బల మధ్యలో తీరానికి దగ్గరల్లో క్రూయిజ్ నుంచి ఒక చిన్న పడవలోకి మారతారు. అందులో తీరానికి చేరుకుని అక్కడ వివాహం చేసుకుంటున్నారు.ఎడారుల్లో..ఎడారి పెళ్లిళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండీగా మారిన సాహసోపేతమైన వివాహ వేడుకల్లో ఒకరకం. కాలిఫోర్నియా, జోషువా ట్రీ, పామ్ స్ప్రింగ్స్ వంటి ప్రదేశాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే అరిజోనా, దుబాయ్ ఎడారిలో లగ్జరీ రిసార్ట్లు లేదా ప్రైవేట్ క్యాంపుల్లో విలాసవంతమైన వివాహ వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక భారత్లోని రాజస్థాన్లో జైసల్మేర్, జోధ్పూర్ వంటి నగరాల్లోని ప్యాలెస్లు, డెసర్ట్ క్యాంపులు వివాహవేదికలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి చోట్ల పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యాస్తమయం సమయంలో లేదా నక్షత్రాల కింద రాత్రిపూట ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి.‘హడలెత్తించే’ పెళ్లిళ్లుప్రస్తుత పెళ్లిళ్ల నిర్వహణలో సంప్రదాయాలకు ఆధునికత, వ్యక్తిగత ఆశలు తోడై– కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. సాంప్రదాయ వివాహ వేదికలకు బదులుగా, కొంతమంది జంటలు తమ వైవాహిక జీవితంలో కొత్త సాహసాన్ని కోరుకుంటూ అసాధారణమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.వనాల మధ్యలో..దట్టమైన అడవిలో లేదా పచ్చని చెట్ల తోటల్లో వివాహం చేసుకోవడం ఇప్పుడు యువత మెచ్చిన ట్రెండ్లో ఒకటి. ఈ ఫారెస్ట్ వెడ్డింగ్స్ కాలిఫోర్నియా, యోసెమిటీ నేషనల్ పార్క్లో పొడవాటి చెట్లు, గ్రానైట్ కొండల మధ్య పెళ్లి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కెనడాలోని కొలంబియా కూడా ఇలాంటి పెళ్లిళ్లకు పందిళ్లు వేస్తోంది. ప్రపంచ యువతను ఆకర్షిస్తోంది. ఇక భారత్లో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కర్ణాటకలోని కూర్గ్, కబిని వంటి ప్రాంతాల్లో ఈ పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి.హాంటెడ్ వెడ్డింగ్స్కొన్ని దేశాల్లో, ముఖ్యంగా హాలీవుడ్ థీమ్ల ప్రభావంతో, దయ్యాల కోటలు, పాత జైళ్లు, పాడుబడిన పట్టణాలు లేదా చారిత్రక శ్మశానవాటికల పక్కన వివాహాలు చేసుకుంటున్నారు. సంప్రదాయ వివాహాలకు భిన్నంగా, తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకునే జంటలు ఇలాంటి ప్రత్యేక వేదికలను ఎంచుకుంటున్నారు. హారర్ సినిమాలు, హడలెత్తించే నవలలు, హాలోవీన్ థీమ్ల పట్ల ఆసక్తి పెరగడంతో ఈ రకమైన వివాహాలు ప్రాచుర్యం పొందాయి. పాత కోటలు, పాడుబడిన భవనాలు వేదికలుగా మారి, దయ్యాల కథలు జతచేర్చి చిత్రవిచిత్రమైన అనుభవాన్నిస్తాయి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ ధోరణిఎక్కువగా కనిపిస్తుంది.కొలరాడోలోని ‘ది స్టాన్లీ హోటల్’– ‘ది షైనింగ్’ నవలకు స్ఫూర్తినిచ్చిన ప్రదేశం, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ ప్రాంతాన్నే వివాహ వేదికగా మార్చుకుంటున్నారు చాలామంది వధూవరులు.కాలిఫోర్నియాలో పర్మనెంట్గా డాక్ చేసిన ‘ది క్వీన్ మేరీ’ అనే లగ్జరీ నౌకలో ఒకప్పటి సిబ్బంది, ప్రయాణికులంతా దయ్యాలుగా మారారని, అక్కడే సంచరిస్తున్నారని స్థానికుల నమ్మకం. హడలెత్తించే ఈ ప్రాంతం కూడా వివాహ వేదికే. ఇక కాలిఫోర్నియాలో చారిత్రక గోస్ట్ టౌన్ లోని పాత చర్చిలు లేదా ఆయా పరిసరప్రాంతాలు యువతను పెళ్లి చేసుకోమని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి.భారతదేశంలో పాత మిల్లులు/పాత భవనాలుకొన్ని ఈవెంట్ సంస్థలు పాత మిల్లులు లేదా పాడుబడిన భవనాలను థీమ్డ్ డెకరేషన్తో వివాహ వేదికలుగా మారుస్తున్నాయి. అందులోనే వివాహాలు చేసుకోవడానికి యువత ఇష్టపడుతున్నారు.‘సోలో వెడ్డింగ్స్’తమ సంతోషానికి మరొకరిపై ఆధారపడకుండా, తమ జీవితాన్ని తామే నియంత్రించుకుంటామని ప్రకటిస్తూ.. చాలామంది యువత– సోలో వెడ్డింగ్స్కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది అన్నింటికంటే ప్రత్యేకమైన ట్రెండ్. పెళ్లి చేసుకోమని ఇతరులు ఒత్తిడి చేస్తున్నప్పుడు, తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి తామేనని చెప్పుకోవడానికి కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ సోలో పెళ్లిళ్లు కూడా సంప్రదాయ పెళ్లిళ్లకు మాదిరిగానే అంగరంగ వైభవంగా, అతిథులతో, కేక్తో, రిసెప్షన్ తో జరుగుతాయి. కాని, పార్టనర్ మాత్రమే ఉండరు. ఈ వివాహాలు ప్రస్తుతం జపాన్లో ఎక్కువగా జరుగుతున్నాయి.పెళ్లి అనేది ట్రెడిషనల్ ట్రాక్ నుంచి ట్రెండీ ట్రాక్ ఎక్కి చాలాకాలమే అయింది. కొన్ని వెడ్డింగ్స్ ‘అరే భలే జరిగాయి కదా!’ అనిపిస్తుంటే, కొన్ని వెడ్డింగ్స్ మాత్రం ‘అరే పాపం, ఎందుకురా ఇంత కష్టం.. ఏంట్రా ఈ పిచ్చి?’ అనిపించక మానడం లేదు!చైనా వినూత్న ప్రయత్నం..చైనా ప్రభుత్వం తగ్గుతున్న జననాల రేటును అరికట్టడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి పెళ్లి నిబంధనలను సరళతరం చేసింది. పలు సంప్రదాయేతర ప్రదేశాలలో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, వివాహ వేదికలను ఏర్పాటు చేసింది. సబ్వే స్టేషన్ దగ్గర నుంచి నైట్ క్లబ్స్ వరకూ జనసంచారం ఉన్న ప్రతిచోట పెళ్లి బూత్లను ప్రారంభించింది. దాంతో అక్కడ పెళ్లి చేసుకునే ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ట్రెండ్ని కోరుకునే యువత ఈ విధానానికి అట్రాక్ట్ అవుతోంది.సంహిత నిమ్మన -
నా జీవితంలో స్టార్ ఉన్నాడు!
సొసైటీ ఇచ్చే స్టేట్మెంట్ లేబుల్స్ అంటే అలర్జీ. ఇతరుల అంచనాలన్నింటినీ లైట్గా స్కిప్ చేస్తూ, తనదైన దారిలో తన సొంత ప్రపంచంలో జీవిస్తోంది ఫారియా అబ్దుల్లా. ఇప్పుడు ఆ ప్రపంచం గురించిన విషయాలన్నీ ఆమె మాటల్లోనే...⇒ నా పేరు ఫారియా. చాలామంది ‘ఫైరియా’ అని పిలుస్తారు. నటనకు ముందు ఆరు సంవత్సరాలు హైదరాబాద్లో థియేటర్ ఆర్టిస్ట్గా పని చేశాను. అక్కడే నటిగా పునాది పడింది. అంతకంటే ముందే నేను డాన్సర్, మ్యూజీషియన్ , క్రియేటివ్ ఆర్టిస్ట్ని.⇒ ‘జాతి రత్నాలు’ వచ్చాక నా జీవితం ఫుల్ టర్న్ తీసుకుంది. ఎంతలా అంటే ‘ఎవరు ఈ అమ్మాయి?’ నుంచి, ‘మన చిట్టి!’ అంటూ ప్రతి కుటుంబం నన్ను వాళ్ల అమ్మాయిలా దగ్గరకు తీసుకుంది.⇒ అవును, నేను రిలేషన్ లో ఉన్నాను. ఇది సీక్రెట్ కాదు, ప్రైవేట్. అతను ఒక కొరియోగ్రాఫర్. నేను ముస్లిం, అతను హిందువు. కాని, మా మధ్య ఇవన్నీ ఎప్పుడూ సమస్య కాలేదు. మాది ప్రేమకథ అనడం కన్నా పార్ట్నర్షిప్ అనడమే నాకు ఇష్టం. నా డాన్స్, నా ర్యాప్లో కనిపించే ఎనర్జీ వెనుక అతని సపోర్ట్ బోనస్లా పనిచేస్తుంది.⇒ ఇప్పటివరకు అతని పేరు, ముఖం రివీల్ చేయలేదు. కాని, నా వీడియోల్లో క్లూస్ వెతుకుతున్న ఇంటర్నెట్ డిటెక్టివ్లను చూస్తే నవ్వొస్తుంది. ‘సారీ గైస్’ మీరు ఇంకా లెవెల్ అప్ కాలేదు.⇒ ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఒకప్పుడు మైనస్ అన్నారు. కేవలం గెస్ట్ రోల్స్కే సరిపోతావు అని కామెంట్స్ చేసేవారు. నేను మాత్రం నా సినిమాలతోనే వాళ్లకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.⇒ డాన్స్ నా ఫస్ట్ లవ్. నన్ను నేను ‘మూవ్మెంట్ ప్రాక్టీషనర్’గా పిలుచుకుంటాను. హిప్హాప్, కథక్, బెల్లీ, బీ–బాయింగ్ ఇలా నా శరీరమే నా భాష.⇒ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ ఇలా ప్రతి సినిమా నాకు కొత్త పాఠం నేర్పింది. ఇప్పుడు తమిళంలో ‘వల్లి మయిల్’. అందులో స్టంట్స్ కూడా చేశాను. ఈసారి కొత్త ఫారియాను చూడబోతున్నారు.⇒ నటనతో పాటు సంగీతం కూడా నా ప్రాణం. నేను పాడుతాను, రాస్తాను, కంపోజ్ చేస్తాను. ‘డ్రామా నక్కో మామ’ పాట పూర్తిగా నా మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్.⇒ నా బ్యూటీ రొటీన్ చాలా సింపుల్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కాన్షస్ ఈటింగ్ అదే నా గ్లో సీక్రెట్. మేకప్ తీసేయడానికి బేబీ ఆయిల్, హెయిర్కు వారానికి రెండు మూడుసార్లు ఆయిల్ మసాజ్ తప్పనిసరి.⇒ తినడంలో బిర్యానీ నా బలహీనత. దోశ, ఇడ్లీ లాంటి సింపుల్ ఫుడ్ అంటే కూడా ఇష్టం. ట్రావెల్ చేసినప్పుడు మక్బూస్, లుకైమాత్ లాంటి రుచులు కూడా ట్రై చేశాను.⇒ నా జీవితంలో ఇంకొక స్టార్ ఉన్నాడు. అదే నా పిల్లి ‘సెబాస్టియన్ ’. అతను లేకపోతే నా సోషల్ మీడియా అకౌంట్ అసంతృప్తిగానే ఉంటుంది. -
అదే.. నా బ్యూటీ వెపన్!
బాల నటిగా మొదలైన ప్రయాణం నుంచి, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిత్వం వరకు ఆమె ఫ్యాషన్ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. సంప్రదాయానికి గర్వంగా నిలుస్తూనే, ఆధునిక ప్రయోగాలు చేసే ఆమె స్టయిల్, బ్యూటీ ఫిలాసఫీ ఇదిగో!చీర.. బ్రాండ్: స్వాతికపూర్ లెహంగా ధర రూ. 47,700బ్లౌజ్ ధర రూ. 14,310ఓణీ ధర రూ. 21,200జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూవెల్స్ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.కళ్ల అందాన్ని హైలైట్ చేయడానికి బ్లాక్ కాజల్ కంటే బ్రౌన్ కాజల్ నా సీక్రెట్ బ్యూటీ వెపన్ . దాన్ని స్వల్పంగా స్మడ్జ్ చేస్తే కళ్లకు సాఫ్ట్, మేజికల్ లుక్ వస్తుంది. ఫ్యాషన్ లో మాత్రం నేను సేఫ్ గేమ్ ఆడను. సంప్రదాయ దుస్తులు, చీరలు, అనార్కలీలు లాంటి క్లాసిక్ వేర్ను ఫ్యూచరిస్టిక్ ఔట్ఫిట్స్గా మలచుకుంటూ, మైథాలజీకి మోడ్రన్ టచ్ ఇచ్చే స్టయిల్ను ఫాలో అవుతాను. – సారా అర్జున్ -
మాస్క్ల మాయాజాలం
వెనిస్ వీథులు గత చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఆధునిక ప్రపంచపు కోలాహలాన్ని విడిచిపెట్టి ఒక్కసారిగా మధ్యయుగపు రాజవైభవంలోకి చేరిపోయాయి. బంగారు వర్ణపు పట్టు వస్త్రాలు, వెల్వెట్ గౌన్లతో పురాతన రాజులు, రాణుల వేషధారణతో స్ధానిక వీథులన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇటలీలోని వెనిస్ నగరం ఒక రంగుల హరివిల్లులా మారింది. ప్రతి మలుపులోనూ ముసుగుల సంబరాలు సందడిగా నడుస్తున్నాయి. ముసుగుల వెనక దాగి ఉన్న నవ్వులు, ప్రత్యేకంగా మెరిసే వస్త్రాలతో వెనిస్ నగరం తళుక్కుమంటోంది. కాలం వెనక్కి వెళ్లిందా అన్నంతగా ఈ సంబరం ఆకట్టుకుంటోంది.ఈ పండగకు 864 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1162వ సంవత్సరంలో వెనిస్ గణతంత్ర రాజ్యం ఆక్విలేయాపై విజయం సాధించింది. దీనికి గుర్తుగా ప్రజలందరూ సెయింట్ మార్క్స్ స్క్వేర్ దగ్గర నృత్యాలు చేశారు. ఇదే కాలక్రమేణా కార్నివాల్ ఆఫ్ వెనిస్ ఫెస్టివల్గా మారిపోయింది. ఆనాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికీ అంతే జోరుతో కొనసాగుతున్నాయి. మధ్యలో కొన్నేళ్లు ఆగిపోయినా, 1979 నుంచి అధికారికంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ కార్నివాల్ కేవలం ఇటలీ సంప్రదాయంలా కాకుండా అంతర్జాతీయ పర్యాటక వేడుకగా మారిపోయింది.ఈ ఏడాది జరుగుతున్న ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇటలీలో 2026లో జరగనున్న మిలానో కార్టినా వింటర్ ఒలింపిక్స్ను పురస్కరించుకొని ఈ కార్నివాల్కు ఒలింపస్–ది ఆరిజన్స్ ఆఫ్ ది గేమ్ అనే థీమ్ను పెట్టారు. ఈ కార్నివాల్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. ప్రధాన వేడుకలు మాత్రం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం అవుతాయి.నిజానికి వెనిస్ నగరానికి కాలువలే ప్రధాన ఆకర్షణ. ఆ కాలువలే ఈ కార్నివాల్కు వేదికలు. ఈ కార్నివాల్లో జరిగే వేడుకలన్నీ కాలువల చూట్టూనే జరుగుతాయి. వీటిలో అత్యంత ఆకర్షణీయమైనది గ్రాండ్ వాటర్ పరేడ్. ఈ పరేడ్లో అద్దంలా మెరిసే వెనిస్ కాలువల్లో రంగురంగుల పడవలు వందలాదిగా కదులుతూ ఉంటాయి. ఈ దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. వెనిస్ కార్నివాల్లో మాస్క్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.మనుషుల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఉత్సవంలో అందరూ కలిసి పాల్గొనేందుకు మాస్క్లు ధరిస్తారు. ఈ వేడుకలో బౌటా, మెడికో డెల్లా పెస్టే అనే మాస్క్లు చాలా ఫేమస్. వీటితో పాటుగా రాజులు, రాణులు మాదిరిగా స్థానిక కళాకారులు వేషాలు ధరిస్తారు. సెయింట్ మార్క్స్ బెల్ టవర్ నుంచి దేవదూత వేషధారణలో అమ్మాయి కిందకి దిగి వచ్చే ‘ఫ్లైట్ ఆఫ్ ది ఏంజెల్’ అనే ఘట్టం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. వెనిస్ కార్నివాల్ చూసేందుకు ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మంది పర్యాటకులు నగరానికి వస్తుంటారు. ఈ సమయంలో వెనిస్ నగరంలో ప్రత్యేకమైన విందులు, నాటక ప్రదర్శనలు, వాటర్ లైట్ షోలు ఉంటాయి. -
ఏం కొడుకువిరా నువ్వు..
''నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి'' అని వన దేవతలు సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భక్తుడు. తన వేదనను వంద రూపాయల నోటుపై రాసి హుండీలో వేశాడు. మరికొంత మంది భక్తుల నుంచి కూడా ఇలాంటి వేడుకోళ్లు వచ్చాయి. ముదిమి వయసులో ముసలి తల్లిదండ్రులను వేదనకు గురిచేస్తున్న విదారక ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. కడుపున పుట్టిన పిల్లలను పెంచి, ప్రయోజకులను చేసిన అమ్మనాన్నలకు చివరి రోజుల్లో చీదరింపులే ఎదురవుతున్నాయి. జీవిత చరమాంకంలో తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన పిల్లలు వదిలించుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ పట్టణంలోని బస్టాండ్లో 80 ఏళ్ల వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికుడొకరు ఏమైందని ఆరా తీశాడు. తనను కొడుకు, కోడలు వదిలేసి వెళ్లిపోయారని పెద్దావిడ వాపోయింది. తన కుమారుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, అతడి పేరు సురేష్ శర్మ అని తెలిపింది. తనను కొడుకు- కోడలు సరిగ్గా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది. అమ్మను వదిలేసి వెళ్లిన కొడుకుపై నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.నెటిజన్ల స్పందనపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను ధారపోస్తారని, అలాంటి వారిని చివరి రోజుల్లో చూసుకోవడం వారసుల బాధ్యత మాత్రమే కాదు.. గౌరవం కూడా అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి అతడికి వాళ్లమ్మ పెట్టిన డబ్బు, ఆహారం, భద్రత, ఆశ్రయం, సంరక్షణకు మూల్యం వసూలు చేయడానికి కేసు పెట్టాలని మరొకరు సూచించారు. ఓరి దేవుడా! వృద్ధురాలు అలా ఏడుస్తుండటం తాను చూడలేకపోతున్నానని, ఇది చాలా హృదయ విదారకంగా ఉందని ఇంకొకరు ఆవేదన చెందారు. మన సమాజంలో మానవత్వం ఇంత దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నానని మరొకరు అన్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎక్కువ కాలం బతకం కూడా శాపంగా కింద భావించాల్సి వస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.చదవండి: 100 రూపాయల నోటుపై రాసి.. కాపాడాలని వేడుకోలువీడియోలోని వృద్ధురాలికి ఎవరైనా సహాయం చేశారా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందనే వివరాలు తెలియరాలేదు. తల్లిని వదిలేసి వెళ్లిన కొడుకును కచ్చితంగా శిక్షించాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో కనుమరుగవుతున్న మానవీయ విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోందని ఆలోచనాపరులు నిట్టూరుస్తున్నారు. Elderly Mother aged 80 Abandoned at Bus Stand in Mandsaur by son after pressure from his wifeThe idea of family losing its meaning?Are aging parents become inconvenient liabilities in their own homes?This incident is not an isolated case. It reflects a growing moral crisis… pic.twitter.com/Cjsemah4AE— Woke Eminent (@WokePandemic) February 4, 2026 -
ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!
మార్పు అన్నది ఎక్కడ నుంచో కాదు మన నుంచే రావాలి అంటుంటారు పెద్దలు. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రతీక్ ఖండేల్వాల్. కష్టం రాగానే అనిపించేది.. 'నాకే ఎందుకు అని'..కానీ ప్రతీక్ తనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరూ.. అని ఆలోచించాడు. తనకు సవాలుగా మారిన పరిస్థితులన్ని..తనలాంటి వాళ్లెందరు ఎదుర్కొంటున్నారో గమనించాడు. ఆ మార్పుకు తానే ఎందుకు శ్రీకారం చుట్టుకూడదు అనుకున్నాడు. ఆ క్రమంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు, సవాళ్లు. అయితేనేం తను అనుకున్నట్లుగా మార్పు వచ్చేలా చేసి..అందరికీ ఆమోదయోగ్యమైన వాతావరణాన్ని సృష్టించి శెభాష్ అనిపించుకోవడమే గాక 'ది బెస్ట్ రోల్మోడల్'గా జాతీయ అవార్డు అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. అతడే బెంగళూరుకి చెందిన ప్రతీక్ ఖండేల్వాల్. 2014లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుముక తీవ్రంగా దెబ్బతింది. దాంతో అతడు పూర్తిగా మంచానికే పరిమితయ్యాడు. 20 ఏళ్లకే అతడి జీవితం..గమనం లేకుండా అయిపోయింది. వీల్ఛైర్కే పరిమితమైపోయాడు. అయితే అప్పుడే తెలిసింది తనలాంటి దివ్యాంగులు పడుతున్న కష్టాల గురించి. ఈ నగరాలన్నీ అవయవాలు బాగున్న వాళ్లకే సౌకర్యంగా ఉన్నాయని గుర్తించాడు. పబ్లిక్ ప్రదేశాలు..కార్యాలయాలు, ఆస్పత్రులు ఇలా ప్రతీది దివ్యాంగులకు అననుకూలమైనవని గుర్తించాడు. ఈ మహానగరాలు మాలాంటి వాళ్లకు సౌలభ్యాన్ని అందిచలేనివా.. అనే ప్రశ్నలు ప్రతీక్ని చుట్టుముట్టాయి. అక్కడ నుంచి పుట్టుకొచ్చిందే.."ర్యాంప్మైసిటీ" సంస్థ. నగరాలను అందరికీ సౌలభ్యకరంగా మార్చే లక్ష్యంతో ర్యాంప్మైసిటీని ప్రారంభించి..ఎన్నో ప్రదేశాల్లో వికలాంగులు, పెద్దవాళ్లు, ఈజీగా నడవ గలిగేలా ర్యాంప్లు ఏర్పాటు చేశాడు. పోలీస్ స్టేషన్తో సహా అన్ని ప్రదేశాల్లో ఇవి ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాడు. మొదట్లో ఇవెందుకు చాలా ఖర్చు అనే ప్రశ్నలతో వ్యతిరేత వచ్చినా..ఆగలేదు ప్రతీక్. ఎలాగైనా, ఏనాటికైనా..తాను అనుకున్నది నెరవేరాలనే సంకల్పంతో ముందగుకు సాగి..ఇప్పటి వరకు మొత్తం 600 బహిరంగ ప్రదేశాల్లో ఈ ర్యాంప్లను ఏర్పాటు చేశాడు. పట్టణ జీవితం అందరికీ అనుకూలంగా ఉండాలి..అన్ని సౌకర్యాలు అనుభవించాలి అన్న ఆ కాంక్ష నుంచి వచ్చిన ఈ ఆలోచన..తనలాంటి వాళ్లకు ఎందరికో ఉపయోగపడింది. అనుకోని వైకల్యం శాపమైందని అనిపించేలా పబ్లిక్ ప్రదేశాలు..రోజువారీ ప్రదేశాలు కనిపించకూడదు..మాలాంటి వాళ్ల ఉనికి సులభతరం చేసేలా ఉండాలి అంటాడు ప్రతీక్. అతడి నిస్వార్థపూరితమైన ఆ ఆలోచనే ప్రతీక్ని ఏకంగా రాష్ట్రపతిచే ది బెస్ట్ రోల్ మోడల్గా జాతీయ అవార్డుని అందుకునేలా చేసింది. అంతేగాదు అనుకోని వైకల్యం లేదా పుట్టుకతో వైకల్యం అయినా..మన సంకల్ప శక్తి ముందు చాలా చిన్నది..మన గమనాన్ని ఎన్నటికీ ఆపలేదని నొక్కి చెబుతుంటాడు ప్రతీక్. ఇక్కడ ప్రతీక్ తన గాయాన్నే బలంగా మార్చుకుని..తనలాంటి వాళ్లకు నగరాలకు అనుకూలంగా మార్చే ఆవిష్కరణకు నాంది పలికి..శెభాష్ అనిపించుకున్నాడు. ఈ కథ విధి వెక్కిరించే ప్రయత్నం చేస్తే..తగిన విధంగా బదులివ్వాలే గానీ నిరాశ నిస్ప్రుహల్లోకి వెళ్లిపోకూడదు అని చెబుతోంది కదూ..!. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నానుడికి అసలైన అర్థం ఈ ప్రతీక్.(చదవండి: అందువల్లే భారత్ చాలా స్పెషల్..! ఫ్రెంచ్ మహిళ ప్రశంసల జల్లు) View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: అందువల్లే భారత్ చాలా స్పెషల్..! ఫ్రెంచ్ మహిళ ప్రశంసల జల్లు) -
మోగనుంది పెళ్లి బాజా
పెళ్లి బాజాలు మోగే సమయం సమీపిస్తోంది. యువతీ యువకులు మూడుముళ్లతో ఒక్కటై పెద్దల ఆశీర్వచనాలు అందుకోవాలని భావిస్తున్నారు. మూడు నెలల మూఢం ముగియనుంది. ఈ నెల 19 నుంచి సుముహూర్తాలు ఉండటంతో సందడి మొదలుకానుంది. పెళ్లి ముహూర్తాలు సమీపిస్తుండటంతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.కల్యాణ వీణ మోగే వేళ దగ్గరకొస్తోంది. మూడు నెలల విరామం తర్వాత సుముహూర్తాలు రావడంతో శుభకార్యాల సందడి మొదలుకానుంది. గతేడాది నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 13 వరకు మూఢం కావటంతో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. మాఘ మాసం శుభప్రదమైనా మూఢం కారణంగా ఈ నెల 18 వరకు ముహూర్తాలు లేవు. ఎట్టకేలకు ఈ నెల 19 నుంచి ఫాల్గుణమాసం మొదలు కావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. శుభకార్యాల సీజన్.. శుభకార్యాల సీజన్ కావడంతో ఊరువాడా సందడి మొదలు కానుంది. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, పెద్దల దీవెనలతో జంటలు ఒక్కటికానున్నాయి. వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, నిశి్చతార్థాలులు జరగనున్నాయి. ఇప్పటికే రెండు, మూడు నెలల ముందు నుంచి సంబంధాలు కుదుర్చుకున్న జంటల తల్లిదండ్రులు కల్యాణ మండపాలు మాట్లాడటం, బంగారం, పట్టుబట్టలు ఇతర సామగ్రి కొనుగోలును ముమ్మరంగా చేస్తున్నారు. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అన్నిచోట్లా బాజాభజంత్రీలు మార్మోగనున్నాయి. ఎందరికో ఉపాధి.. శుభఘడియలు రానుండటంతో చాలా వర్గాల వారికి ఉపాధి దొరకనుంది. 20 నుంచి 25 వర్గాలకు ఉపాధి లభించనుంది. ప్రధానంగా పురోహితులు, షామియానా సెట్టింగ్లు, వాయుద్య కళాకారులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, ఆర్కెస్ట్రా, క్యాటరింగ్, బ్యూటీ పార్లర్, ట్రావెల్ ఏజెన్సీలకు డిమాండ్ ఏర్పడింది. చాలామంది ఇప్పటికే బుక్ చేసుకోవటంతో వాటికి డిమాండ్ పెరిగింది. సుముహూర్తాలు ఇవే ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగషు్ట, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్నాయని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలలో: 19,20,21,24,25,26 మార్చిలో: ,5,6,7,8,11,12,13,14,20,21,25,29 ఏప్రిల్లో: 1,2,3,4,5,6,7,8,10,11,12,21,25,26, 28,29,30సిద్ధమవుతున్నారు గత ఏడాది నవంబర్ నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండటంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలతో పాటు పలు శుభకార్యాలు జరగనున్నాయి. ముందుగా సంబంధాలు కుదుర్చుకున్న వారు వివాహాలు సిద్ధమవుతున్నారు. –లంకా లక్ష్మణశర్మ, వేదపండితులుఅభిరుచికి తగిన విధంగా మూడు నెలలుగా మూఢం ఉండటంతో పెళ్లిళ్లు లేవు. దీంతో పనులు లేకుండా పోయాయి. ఫిబ్రవరి 19 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో సీజన్ మొదలైంది. వరుసగా మూడు నెలలు పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శుభకార్యాలు చేసుకునే వారి అభిరుచికి తగ్గట్లుగా ప్రోగ్రాంలు తీస్తున్నాం. –ఎ.దేవివరప్రసాద్, ఫొటోగ్రాఫర్ముందుగానే బుక్ చేసుకుంటున్నారు ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో కల్యాణ మండపాలు ముందే బుక్ చేసుకుంటున్నారు. అడ్వాన్స్లు కడుతున్నారు. కల్యాణ మండపాలతో పాటు పచ్చిపూల మండపాలు కట్టేవారు, క్యాటరింగ్, వంటమేస్త్రి, పురోహితుల ఇలా ఎంతో మందికి డిమాండ్ ఏర్పడనుంది. వ్యాపారాలు బాగుంటాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. –దేరంగుల శ్రీనివాసరావు, ఫంక్షన్హాల్ నిర్వాహకుడు -
అందువల్లే భారత్ చాలా స్పెషల్..!
భారత్లో నివశించిన చాలామంది విదేశీయలు భారత్పై మనుసు పారేసుకుని ఇక్కడే ఉండిపోవడమే కాదు..తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుచున్నామని కూడా చెప్పారు చాలామంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ఫ్రెంచ్ మహిళ కూడా చేరిపోయింది. భారత్ని ప్రత్యేకంగా చూపే విషయాలను వివరించి అందరి మనుసులు దోచుకుంది. మన దేశ గొప్ప తనాన్ని, ఔన్యత్యాన్ని రెండు మాటల్లో చాలా చక్కగా వివరించారామె. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..భారతదేశంలో నివసిస్తున్న ఓ ఫ్రెంచ్ మహిళ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక అందర్నీ అమితంగా ఆకర్షించింది. తన స్వదేశమైన ఫ్రాన్సుతో భారత్ని పోలుస్తూ..ఆ విషయాల్లో ఫ్రాన్స్ కంటే భారత్ ముందు ఉందని అన్నారామె. అలాగే భారత్ని ప్రత్యేకంగా చూపించే అంశాలను సైతం ప్రస్తావించారామె. ఈ మూడు ఏంటంటే..బలమైన సమాజ భావం, దేశ సహజ సౌందర్యం, చేతితో తయారు చేసిన వస్త్రాలు. అంతేగాదు తన స్నేహితులు తరచుగా భారత్లోని సమాజ భావం గురించి చర్చిస్తారని, వాటి అంచనాల ఒత్తిడి అధికంగా ఉంటుందని వాళ్లంతా అంటుంటారని అన్నారామె. అయితే తాను దీన్ని పూర్తి చేసుకోలేనని, తాను అలా ఉండేలనని కూడా ఒప్పుకున్నారామె. అయితే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు ఆదరించుకుంటూ.. సహాయసహకారాలు అందించుకోవడం చూస్తుంటే..చాలా సంతోషంగా అనిపిస్తుందని అందామె. ఇది కుందేళ్లకు ఆహారం ఇచ్చేదాంతో పోల్చారామె. అదే సమయంలో తన స్వదేశం ఫ్రాన్సుకి కూడా దాని స్వంత ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయన్నారామె. అలాగే భారత్లో ప్రతి వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు. ఇక ఇక్కడ దుస్తులు ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటోంది. ఎంబ్రాయిడరీ, పూసల పనిలో ఉన్న నైపుణ్యం తనను ఆశ్చర్యపరుస్తాయిని అన్నారామె. తనకు ఇక్కడ కుర్తీలు కూడా అద్బుతంగా కనిపిస్తాయిని, అవి ఫ్రాన్స్లో హైఫ్యాషన్గా పరిగణిస్తారని, ఖరీదు కూడా ఎక్కువేనని తెలిపింది. చివరగా పోస్ట్లో భారత్లో బలాలుగా భావించిన వాటిని గురించి కూడా హైలెట్ చేశారామె. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే గాక, మా దేశంలో ఈవిషయాలను ఇష్టపడటం చాలా బాగుంది అంటు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Freldaway (@freldaway) (చదవండి: పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!) -
చూడాలని వచ్చి.. భారతీయురాలిగా మారి..
ఆమె బ్రిటన్లో జన్మించారు. భారతదేశంపై ప్రేమ పెంచుకుని ఇక్కడే ఉండిపోయారు. కేరళలో స్థిర నివాసం ఏర్పరుచుకుని, అనేక రచనలు చేయడంతో పాటు, స్థానిక కళల ప్రాచుర్యానికి పాటుపడ్డారు. ఈ నేపధ్యంలో భారత పౌరసత్వం పొందాలని ఆమె తాపత్రయ పడ్డారు. ఎట్టకేలకు ఆమె తన కలను నెరవేర్చుకున్నారు. ఆమె మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత పెపిటా సేథ్ (84). తాజాగా ఆమె అధికారికంగా భారత పౌరసత్వాన్ని పొందారు.గత 50 ఏళ్లుగా కేరళలోనే ఉంటున్న పెపిటా సేథ్.. 2024లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా త్రిశూర్ జిల్లా కలెక్టర్ అర్జున్ పాండియన్ చేతుల మీదుగా ఆమె పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. సహజసిద్ధ పౌరసత్వ విధానం ద్వారా ఆమెకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు వెల్లడించారు. తనకు భారత పౌరసత్వం రావడంపై పెపిటా సేథ్ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను ఇక్కడ ఉన్నందుకు, భారత పౌరురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా చిరకాల స్వప్నం’ అని ఆమె పేర్కొన్నారు. #WATCH | Thrissur, Kerala | Padma Shri awardee Pepita Seth says, "I was born and brought up in UK. I came to India and gradually, I arrived in Kerala... Slowly I grew interested in the culture here and wrote many books... I stayed here for nearly 12 years..." (06.02) https://t.co/96oBzpVFuP pic.twitter.com/8aHrpsBeSu— ANI (@ANI) February 7, 2026యూకేలో పుట్టి పెరిగిన ఆమె తొలుత భారత్ను సందర్శించేందుకు వచ్చారు. ఢిల్లీ, ముంబై తదితర నగరాలను సందర్శించిన తర్వాత ఆమె కేరళకు చేరుకున్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమె కేరళనే తన నివాసంగా మార్చుకున్నారు. కేరళలోని కథాకళి, తెయ్యం వంటి కళారూపాలతో పాటు స్థానిక ఉత్సవాలైన మేళాలు, ఉత్రాలిక్కావు వంటి కార్యక్రమాలపై పెపిటా సేథ్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ఉత్తర కేరళలో ప్రసిద్ధి చెందిన 'తెయ్యం' అనే నృత్యంపై ఆమె పరిశోధన చేసి, పలు పుస్తకాలు కూడా రచించారు.గత 12 ఏళ్లుగా త్రిస్సూర్లో నివసిస్తున్న ఆమె, ఈ ప్రాంతాన్ని తన పరిశోధనలకు, ప్రయాణాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. ఫోటోగ్రఫీ ద్వారా కేరళ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కళ, సాంస్కృతిక రంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2012లో ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. పర్యాటకురాలిగా వచ్చి, భారతీయతను అలవరచుకున్న పెపిటా సేథ్ ఇప్పుడు అధికారికంగా భారతీయురాలిగా మారారు.ఇది కూడా చదవండి: రిటైర్మెంట్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -
ఈ నెల 9 నుంచి శంకర నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరం
"నేత్రదానం కన్నా మిన్న.. ఉన్న చూపును కాపాడటం." ఈ ఆశయంతోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శంకర నేత్రాలయ సంస్థ దాతల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా లక్షలాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన లేక, ఆర్థిక స్తోమత సరిపోక అధిక సంఖ్యలో కంటి పొరలతో పాటు ఇతర చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా శంకర నేత్రాలయ అనేక ఉచిత శిబిరాలను నిర్వహిస్తోంది.కన్నవారినీ....జన్మభూమినీ స్మరించుకుంటూ! ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా శాంతాబయో టెక్నీక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్. కోడూరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి - వసంత దంపతులు తమ స్వగ్రామం పాపిరెడ్డిపాళెం తోపాటు పరిసర గ్రామ ప్రజల నేత్ర సంరక్షణే లక్ష్యంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శంకర నేత్రాలయ కంటి వైద్యశాల - చెన్నై , శాంతా - వసంతా ట్రస్టు - హైదరాబాదు సంయుక్తంగా ఈ ఉచిత కంటి పొర చికిత్స కార్యక్రమాన్ని తొమ్మిది రోజులపాటు జరుపనున్నారు. తమని కన్న అమ్మా, నాన్నలని తాము పుట్టిన జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదన్న సందేశం ఇస్తూ ఇతరులకి స్ఫూర్తి కలిగించేలా వరప్రసాద్ రెడ్డి ఈ మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టారు. తోటపల్లి గూడూరు మండలం లోని ఇస్కపాళెం గ్రామంలో గల ప్రభుత్వ బీ. సీ. హాస్టల్ ప్రాంగణంలో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 9 రోజులపాటు దాదాపు మూడు వేలమందికి అవసరమైన పరీక్షలు జరిపి, ఇదే శిబిరంలో చివరి 5 రోజులు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. రోగికి కావలసిన మందులతో పాటు కంటి అద్దాలని కూడా ఉచితంగానే అందివ్వనున్నారు. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యం.! అత్యాధునిక పరికరాలతో కూడిన సంచార వాహనాల ద్వారా గ్రామాల వద్దకే వెళ్లి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం. కంటి పొరలు ఉన్నట్లు గుర్తించిన రోగులకు అదే శిబిరంలో ఎటువంటి ఖర్చు లేకుండా శస్త్రచికిత్స చేసి అవసరమైన లెన్స్ లు అమర్చడం. దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం. మధుమేహం (Diabetes) ఉన్నవారిలో వచ్చే కంటి సమస్యల (Diabetic Retinopathy) పై ప్రత్యేక అవగాహన కల్పించడం.కంటి పొరలు ఆధునిక చికిత్స....! కంటిలోని సహజసిద్ధమైన లెన్స్ (Lens) మసకబారడాన్నే 'కంటి పొర'లేదా 'కాటరాక్ట్' అంటారు. ఇది సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంది. అయితే, ఆధునిక వైద్యం ఇప్పుడు ఈ సమస్యను చాలా సులభంగా, నొప్పి లేకుండా పరిష్కరిస్తోంది. శంకర నేత్రాలయ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు కంటి వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. వీరు ఉచితంగా పేదవారికి కూడా అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు.ఆపరేషన్ విధానాలు ....! ప్రస్తుతం కంటి పొర చికిత్సలో ప్రధానంగా రెండు రకాల పద్ధతులు వాడుకలో ఉన్నాయి. మొదటిది ఫాకో ఎమల్సిఫికేషన్, ఇది అత్యంత ఆధునిక పద్ధతి. ఇందులో కుట్లు ఉండవు. అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా మసకబారిన పొరను కరిగించి తీసివేస్తారు. దాని స్థానంలో 'ఫోల్డబుల్ లెన్స్'ను అమరుస్తారు. ఇది చాలా చిన్న రంధ్రం ద్వారా జరుగుతుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది.రెండవది లేజర్ కాటరాక్ట్ సర్జరీ , ఇది మరింత ఖచ్చితత్వంతో కూడిన పద్ధతి. బ్లేడ్ వాడకం లేకుండా లేజర్ సాయంతో ఆపరేషన్ చేస్తారు."కంటి చూపు మనిషికి దేవుడు ఇచ్చిన అతిపెద్ద వరం." కంటి పొరలు వచ్చాయని భయపడకుండా పరీక్షలు చేయించుకుని, సకాలంలో ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ప్రపంచాన్ని స్పష్టంగా చూడవచ్చు.గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి...! డబ్బు లేని కారణంతో ఎవరూ చూపు కోల్పోకూడదనే ఉదాత్తమైన భావంతో గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం శంకర నేత్రాలయ , శాంతా - వసంతా ట్రస్టు సంయుక్తంగా ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పేద ప్రజలకు, వృద్ధులకు ఈ సమాచారాన్ని చేరవేసి, ఉచిత సేవలని సద్వినియోగం చేసుకునేలా తోటపల్లి గూడూరు పరిసర ప్రాంత ప్రజలకి చైతన్యం కల్పించాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. -
పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!
కొన్ని చిన్న సంఘటలను మనల్ని ఎంతగానో కదలించి..నిశబ్దమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి. ఆ క్షణంలో మనకు నచ్చనిది కూడా ఎందుకనో ఇష్టంగా మారుతుంది. అది మనకు అపురూపమైన క్షణంగా మారుతుంది. చుట్టూ పరిస్థితులు ఎంత హృద్యంగా ఉన్నా.. వాళ్ల ముఖాల్లోని నవ్వు మనకెంతో నేర్పిస్తుంది. అందుకు ఉదాహరణ ఈ పూలు అమ్మే అమ్మాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో పూలు అమ్మే అమ్మాయికి, ఒక యువతికి జరుగుతన్న చక్కటి సంభాషణ ఇది. మహెక్ షా అనే అమ్మాయి తనకెదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. తనకు సాధారణంగా పూలంటే ఇష్టముండదని, అవి ఒక్కరోజులోనే వాడిపోతాయనే బాధతోనే ఇష్టపడని అన్నారామె. అందుకే తాను పూలకు చాలా చాలా దూరంగా ఉంటానని అన్నారామె. అయితే అదేం తెలియని ఆ పూలమ్మే అమ్మాయి..ఓ పువ్వుని తీసుకొచ్చి నేరుగా ఒళ్లో పెట్టేసింది. తనకు నచ్చవని చెప్పిన పర్లేదు..ఉచితంగానైనా తీసుకోండని అభ్యర్థించింది. చివరికి తాను ధర ఎంత అని అడగగానే..తోచింది ఇమ్మని కోరింది. దాంతో కొంత మొత్తం చెల్లించాను. దాంతో ఆమె ఎంతో సంతోషంతో వెనుదిరిగింది. అయితే ఆమె ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ పూలు తన ఒళ్లోబెట్టిన విధానం..తనను ఆ క్షణం పూలను ఇష్టపడేలా చేసింది. పైగా ఎంతో అప్యాయంగా నవ్వతూ మాట్లాడిన ఆ అమ్మాయిని చూసి.సదా ఉల్లాసభరితంగా ఉండటం ఎలాగో తెలిసిందంటూ.. అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అంతేగాదు షా ఆ వీడియోకి..ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్న మనం మాత్రం దయగానే ప్రవర్తించాలి. అలా ఉండాటానికి మించి గొప్ప నైపుణ్యం మరోకటి లేదంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు..ఈ ఘటన దయకు చిరునామా, అలాగే..ఏ పనిచేసినా..నవ్వుతూ చేస్తే మనంత ధనవంతుడు మరొకరు ఉండరు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mahek shah (@trulymicky) (చదవండి: 50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!) -
జీవనశైలిపై చెరగని ముద్ర: టాటూ ట్రెండ్
ఒకప్పుడు సంప్రదాయానికి, ఆచారాలకూ పరిమితమైన పచ్చబొట్టు (టాటూ) నేడు ఆధునిక జీవనశైలిలో ఫ్యాషన్, వ్యక్తిగత గుర్తింపు, భావ వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో టాటూ అనేది శరీరంపై వేసుకునే డిజైన్ మాత్రమే కాదు.. ఇది ‘లైఫ్స్టైల్ చాయిస్’. కాలేజీ విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు, సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరిలోనూ టాటూ పట్ల ఆసక్తి పెరుగుతోంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే ఆకాంక్ష అందరిలోనూ పెరుగుతోంది. ఈ కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన రెండు కళ్లలోనూ టాటూ వేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నప్పటికీ.. ప్రస్తుత జీవనశైలిలో ఇది స్టైల్ స్టేట్మెంట్గా మారింది. మన సంస్కృతిలో పచ్చబొట్టు అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. గిరిజన తెగలు, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ, ఆధ్యాతి్మక విశ్వాసాలకు ప్రతీకగా పచ్చబొట్లు వేసుకునేవారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం ఆధునికతను సంతరించుకుని ‘స్టైల్ స్టేట్మెంట్’గా మారింది. నేడు టాటూ అంటే ప్రేమ, స్నేహం, కుటుంబం, నమ్మకం, స్వీయ భావనం ఇలా ఎన్నో భావోద్వేగాలకు ప్రతిరూపం. అయితే ఈ టాటూ ఆర్ట్కు ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రస్తుత తరంలో మరింత వినూత్నత్వాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న శైలి మోడ్రన్ ఫ్యాషన్లో భాగమౌతోంది. బ్లాక్ అండ్ గ్రే టాటూలు క్లాసిక్గా ఉంటే, కలర్ టాటూలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇందులో చిన్న డిజైన్లు, సూక్ష్మ అక్షరాలతో మినిమలిస్ట్ టాటూలు, మనుషులు, జంతువుల ముఖాలు, ప్రకృతి దృశ్యాలతో రియలిస్టిక్ టాటూలు రూపుదిద్దుకుంటున్నాయి. సంప్రదాయ గిరిజన శైలితో ట్రైబల్ టాటూలు, విభిన్న ఆకృతులు, రేఖల సమ్మేళనంతో జియోమెట్రిక్ టాటూ.., అంతేకాకుండా రంగుల మేళవింపుతో వాటర్కలర్ టాటూలు సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో 3డీ టాటూలు, గ్లో ఇన్ ద డార్క్ టాటూలు ట్రెండ్గా మారుతున్నాయి.కెరీర్గా.. టాటూ ఆర్టిస్ట్! నగరంలో టాటూ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో హైఎండ్ టాటూ స్టూడియోలు ఉన్నాయి. సెలబ్రిటీలు, యూత్ ప్రభావంతో లాభదాయక వ్యాపారంగా మారింది. టాటూ ఆరి్టస్ట్ ఓ ప్రత్యేక కెరీర్గా మారింది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో టాటూ ఒక కీలక భాగంగా మారింది. ర్యాంప్ వాక్లు, ఫొటోషూట్లు, బ్రాండింగ్లో టాటూలు వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తున్నాయి. టాటూ అంటే స్వీయ వ్యక్తీకరణకు ఒక మాధ్యమంగా మారింది. సున్నితమైన ప్రదేశాల్లో సేఫేనా..?! టాటూ వేసుకోవడంలో చేతులు, భుజాలు, వెన్ను, మెడ వంటి ప్రదేశాలు సాధారణం. కానీ ఇటీవల కాలంలో కళ్లలో (ఐబాల్ టాటూ), నాలుక, పెదాలు, చెవుల వెనుక.. ఇలా అత్యంత సున్నిత ప్రాంతాల్లోనూ టాటూలు వేయించుకుంటున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం సున్నిత ప్రదేశాల్లో టాటూ వేయించుకోవడం తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. దృష్టి కోల్పోవడం, ఇన్ఫెక్షన్లు, నరాల సమస్య వంటి ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.. టాటూ రంగంలో ఆధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచి్చంది. స్కిన్ ఫ్రెండ్లీ ఇంక్స్, డిజిటల్ డిజైన్ ప్రివ్యూలు, నొప్పి తగ్గించే టెక్నిక్స్ టాటూలను మరింత సురక్షితంగా మార్చాయి. కొన్ని స్టూడియోలు పూర్తి మెడికల్ స్టాండర్డ్స్తో పనిచేస్తుండటం విశేషం. ఇటీవల ఒక వ్యక్తి కంట్లోనే టాటూ వేయించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైద్యుల సలహాతో అధునాతన పద్ధతిలో నేపాల్ వెళ్లి మరీ టాటూ వేయించుకున్నాడు. అతను స్వయంగా టాటూ ఆరి్టస్టు కావడం గుర్తించాల్సిన అంశం.సరి్టఫైడ్ టాటూ ఆర్టిస్ట్లు.. టాటూ వేయించుకునే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టాటూ ఫ్యాషన్ అయినా, జీవితాంతం ఉండే గుర్తు. టాటూ వేసుకునే ముందు ముఖ్యంగా సర్టిఫైడ్, అనుభవజ్ఞుడైన టాటూ ఆరి్టస్ట్ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్టెరిలైజ్డ్ సూదులు, సేఫ్ ఇంక్ ఉపయోగిస్తున్నారా అనేది ప్రధానం. స్కిన్ అలర్జీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. టాటూ తర్వాత ఇచ్చే ఆఫ్టర్ కేర్ సూచనలు తప్పక పాటించాలి.నచ్చకుంటే లేజర్ రిమూవల్.. అప్పుడెప్పుడో వేసుకున్న టాటూ ప్రస్తుతం నచ్చకపోతే..? దీనికి పరిష్కారం లేజర్ టాటూ రిమూవల్. లేజర్ టెక్నాలజీ ద్వారా టాటూను దశలవారీగా తొలగిస్తారు. అయితే ఇది పూర్తిగా రిస్క్ ఫ్రీ కాదు. స్కిన్ డార్కెనింగ్, మచ్చలు వంటి సమస్యతో పాటు ఖర్చుతో కూడినది. డాక్టర్ సలహాతో మాత్రమే చేయించుకోవాలి. నగర జీవనంలో స్టైల్ స్టేట్మెంట్గా మారినప్పటికీ ఈ ట్రెండ్ అనుసరించే ముందు సరైన జాగ్రత్తలు పాటించాలని, ఎందుకంటే ఫ్యాషన్ క్షణికం, కానీ టాటూ జీవితాంతం అంటున్నారు నిపుణులు. -
చర్మ సౌందర్యం కోసం..!
చర్మ సౌందర్యం కోసం ఎన్నో మాయిశ్చరైజన్లు రాసి విసిగిపోయి ఉంటారు. అలాంటి వాళ్లు సహజసిద్ధంగా ముఖానికి తేమను అందించి కోమలంగా ఉంచే ఈ టిప్స్ని ఫోలో అయితే సరి. పొడిబారటం తగ్గుతుంది..అలాగే మేను ప్రకాశవంతంగా మెరుస్తుంది కూడా. మరి అవేంటో చూద్దామా..వేడినీటిలో కప్పు పాలను కలిపి స్నానం చేస్తే చర్మ లావణ్యం పెరుగుతుంది. చలికి పొడి బారిన చర్మానికి మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్లు చేయడం సాధ్యం కానప్పుడు ఇలా చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పనిచేస్తుంది. పొడి చర్మానికి ఈ కాలంలో సబ్బు కూడా శత్రువుగా మారుతుంది కాబట్టి సున్నిపిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సున్నిపిండిలో పాలు పోసి పేస్టులా చేసుకుని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కోల్పోదు. అంతేకాకుండా సహజమైన నూనె అందడం వల్ల మృదువుగా మారుతుంది.తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి వలయాకారంగా మర్దన చేయాలి (కళ్ల చుట్టూ మినహాయించాలి). ఇది నాచురల్ స్క్రబ్. చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగాఈ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. -
50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!
50 ఏళ్లు దాటాక ఇదివరకటిలా అధిక ప్రభావ వ్యాయామాలు చేయడం కష్టం. మోకాలి నొప్పి, గాయం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. పైగా ఒంట్లో మునుపటి ఎనర్జీ ఉండదు. అందువల్ల ప్రజలు సులభమైన తక్కువ ప్రభావ వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఓ వయసు వచ్చాక బరువు తగ్గించే వ్యాయామాలకు శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు ఇంట్లో సులభంగా చేసే ఈ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అవేంటో చూద్దామా..!.మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉపయోగకరంగా ఉండే ఈ వ్యాయామాలు 80,90 లేదా వంద కిలోలు బరువుతో ఉండే వాళ్లకు అత్యంత ఉపయుక్తమైనవి. చాలా తేలిగ్గా చేసుకునేవి.మడమ నుంచి తుంటి వరకు నిలబడటం..ఒక కాలు వంచి తుంటికి తాకే ప్రయత్నం చేయాలి. అలాగే చేతులు నిటారుగా ఉంచాలి. ఈ వ్యాయామం మోకాళ్లను సురక్షితంగా ఉంచుతూ తొడలు, పిరుదులను సక్రియం చేయడానికి హెల్ప్ అవుతుంది.తక్కువ-ప్రభావ జంపింగ్ జాక్ఇది మోకాలికి అనుకూలమైన వెర్షన్. పక్కపక్కలకు కాళ్లను కదుపుతూ చాలా తక్కువ మోతాదులో జంప్ చేయడం. ఇది హృదయ స్పందన రేటుని సున్నితంగా పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. కీళ్లపై ఒత్తిడి పడకుండా సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.ఒక వైపు నుంచి ఒక వైపుకి..నియంత్రిత పద్ధతిలో ఒక వైపు నుంచి ఒక వైపు నడక. చాలా ఈజీగా చేసే వ్యాయామం. ఇది తుంటి కండరాలను బలోపేతం చేయడానికి, స్థిరత్వాన్నిఇ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని 20 సార్లు చేసి, ఐదు సెట్లు పునరావృతం చేస్తే చాలని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. స్థిరత్వంపై దృష్టి పెడుతూ..తేలికైన ఈ కదలికలు బాడీని ఫిట్గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల బరువు తగ్గడమే గాక, మోకాళ్ల గాయాలు గానీ, సమస్యలు ఎదురవ్వవని అంటున్నారు. View this post on Instagram A post shared by Nehafun&fitness🤸♂️🧘♀️ (@nehafunandfitness) (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
పాత్రికేయులూ... మమ్మల్ని అలా పిలవద్దు... ప్లీజ్!
గౌరవనీయులైన పాత్రికేయులకు సమస్త మగపురుగులూ నమస్కరించి వ్రాయునది ఏమనగా! అయ్యా... మా జంతు ప్రపంచంలో మగపురుగులైన మేము మా సాటి ఆడజీవులకు ఎంతో గౌరవమిస్తూ ఉంటాం. అదెలాగో చెబుతాం వినండి. ఒకవేళ... మాలో తేళ్ల జాతి గనక ‘షోలే’ సినిమా తీశాయనుకోండి. అప్పుడు మా జాతిలోని ఆడ బసంతీయే... మగతేలును పట్టుకుని గావుకేక పెడుతుంది. ఏమనీ... ‘‘వీరూ... ఏ బిచ్ఛువోకే సామ్నే మత్ నాచ్ నా’’ అంటూ అరిచి గీపెడుతుంది. ఎందుకంటే... మా తేళ్లజాతిలో లేడీతేలును పడేయాలంటే తేలు మగపురుగులైన మేము మా జాతి శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించి చూపాలి. మీలో సాల్సా, హిప్హాపుల్లా మా తేలుజాతి శాస్త్రీయనృత్యం పేరేమిటో తెల్సా? దాని పేరు ‘ ప్రొమెనాడ్ ఎ డియో’’ (Promenade à deux). మా పెళ్లి తర్వాత మా ట్రెడిషనల్ డాన్స్ చూపాకే మాకు శోభనం జరుగుతుంది. మా తేళ్ల జాతిలో తరతరాలుగా యుగయుగాలుగా కొనసాగుతూ వస్తున్న పవిత్రమైన ఆచారమిది. శోభనపు గదిలో ఓ తేలుజంట ఎంటర్ కాగానే... మా ఆడలేడీస్ మమ్మల్ని చూస్తూ... మీ మానవులు ‘పాడు గజాలా పాడు’ అన్నట్టుగానే, ‘‘ఆడరా... తేలుగా ఆడు’’ అని ఆదేశిస్తాయి. అప్పుడు మేమూ... ‘తకిట తధిమి తకిట తధిమి తందానా... హృదయ లయల జతుల గతుల థిల్లానా’ అంటూ డాన్స్ చేయాల్సిందే. ‘తడబడు అడుగుల తప్పని తాళానా...’’అంటూ పొరబాటున మా అడుగులు తడబడ్డాయనుకోండి. సదరు ఆడతేలు ‘ఏయ్... చంద్రమోహన్. నువ్వు ఆడుతున్న ఆ డాన్సేమిటీ... పడుతున్న ఆ అడుగులేమిటీ?’ అంటూ అరవదు సరికదా... మా డాన్స్ సరిగా కుదరనందుకు పనిష్మెంట్గా గబుక్కున మమ్మల్ని పట్టేసి గుటుక్కుమంటూ మింగేస్తుంది. అన్నట్టు మా తేలు చిన్నారులకు నర్సరీలలో చెప్పే రైమ్ ఏమిటో తెల్సా?చిట్టి తేలమ్మా... అమ్మ చెప్పిందాపెళ్లికెళ్లావా... మొగుణ్ణి చూశావాడాన్సులాడావా... గుటుక్కున మింగావా!∙∙ ఇక ‘జంపింగ్ స్పైడర్’ అని పిలిచే మా సాలీడుజాతి మగపురుగుల గురించి సాలిడ్గా చెప్పాల్సిందెంతో ఉంది. మా జాతిలో డాన్స్ ఒకటే సరిపోదు. కాళ్లూ చేతులూ వేగంగా కదిలిస్తూ పుట్టే వైబ్రేషన్స్తో పాట కూడా పాడాలి. ఆ పాటకు మేమే బాణీ కట్టుకోవాలి. మా బాణీలు ఎంత బాగుంటాయో తెల్సా. పొరబాటున మీరుగానీ విన్నారంటే...‘ఏంట్రా బాబూ ఈ జంపింగు స్పైడర్ల బాణీల్లో ఇంత మ్యూజిక్ ఉందీ!’ అంటూ ఆశ్చర్యపోతారు. ఇలా మా పాటకు మేమే ‘కొరియోగ్రఫీ’ చేసుకుని, మా లేడీస్ ముందు జంపింగ్ చేస్తూ మరీ డాన్స్ ఆడాలి. ఇక మా జంపింగు స్పైడర్లలో ఒకజాతి తాలూకు డాన్స్ ఎంతబాగుంటుందో తెల్సా? అందుకే... మీ మనుషుల్లాగే మేము మావాటిని ‘పీకాక్ స్పైడర్స్’ అని పిలుస్తాం. ఎంతైనా... అవి మా జాతి నాట్యమయూరాలు కదా మరి! ఇదంతా చేసి మా లేడీస్ను ఇంప్రెస్ చేస్తేనే మా పెళ్లి... లేదంటే ఆ పూటకు దాని బ్రేక్ఫాస్టూ, లంచూ, డిన్నరూ, చిరుతిండీ, అంచూ, అప్పడం... అన్నీ మేమే! ఇక మాలోనే ఇంకో జాతి ఉంది. పెళ్లి తర్వాత అది మొగుణ్ణి తప్పక తినేస్తుంది కాబట్టే దాని పేరు బ్లాక్ ‘‘విడో’’ అట! ∙∙ ఇంకా చెప్పాలంటే... పురుగుల్లోనే ఒక రకమైన ‘ప్రేయింగ్ మేంటిస్’ జాతి ఖర్మ ఎలా తగలడిందంటే... శోభనం జరుగుతుండగానే అలా లిప్కిస్తో మొదలుపెట్టి... మా పెళ్లాలు మమ్మల్ని ఇలా తినేయడం మొదలుపెడతారు. మరి మగాళ్లమైన మేము శుభకార్యం మధ్యలోనే చనిపోతే ఎలా? అందుకే... మా ఆడ మేంటిసులు మమ్మల్ని తినేసినా అసలు పని ఆగకుండా ఉండటం కోసం ఓ స్పేర్ మెదడును (గ్యాంగ్లియాన్లను) కడుపులో ఉంచుకుంటాం. ఇలా మా తర్వాతి తరాలు బలంగా ఉండటం కోసం... పొదగాల్సిన లేదా పిల్లలు పెట్టాల్సిన మా ఆడలేడీస్కి శక్తి సమకూర్చడం కోసం మా దేహాన్నే త్యాగం చేసేస్తాం. మా ఆడవారి అంగీకారమైతే తప్ప... వాళ్లను బలవంతం చేయడమో, మా ప్రేమను ఒప్పుకోమంటూ ఇబ్బంది పెట్టడమో, కుదరకపోతే యాసిడ్ విసరడమో చేయం గాక చేయం.కాబట్టి... మా మృగప్రపంచపు మగపురుగుల క్యారెక్టరును దృష్టిలో పెట్టుకుని... మా మనోభావాలు గాయపడేలా... ‘మృగాళ్లూ’, ‘మగపురుగులూ’ అంటూ మీ మానవ మగాళ్లతో పోల్చి... మమ్మల్ని కించపరచవద్దని మనవి. – యాసీన్ -
రీల్స్ మాయలో బాల్యం బందీ
పిల్లలు రీల్స్, షార్ట్ వీడియోలకు అడిక్ట్ అవడం అనేది ప్రస్తుతం తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, వారి మెదడు పనితీరును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏకాగ్రత సమయం తగ్గిపోవడంరీల్స్ వల్ల కలిగే అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ఏకాగ్రత సమయం తగ్గడం. సాధారణంగా మనిషి సగటు ఏకాగ్రత సమయం సుమారు 12 సెకన్ల వరకు ఉంటుంది. కానీ రీల్స్, షార్ట్ వీడియోలు చూసే వారిలో అది 8 సెకన్ల కంటే తక్కువకు పడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం 15–30 సెకన్ల వీడియోలకే అలవాటు పడటం వల్ల, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడం, కష్టమైన సమస్యను పరిష్కరించడం మెదడుకు భారంగా అనిపిస్తుంది.సహనం నశించడంనిజ జీవితంలో పనులు నెమ్మదిగా జరుగుతాయి. కానీ రీల్స్ ప్రపంచంలో అన్నీ వేగంగా జరిగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విపరీతమైన చిరాకు, అసహనం కలుగుతాయి. ఫోన్ నిరంతరం వేగవంతమైన సమాచారాన్ని అందించడం వల్ల మెదడు కేవలం తక్షణ వినోదం కోసం మాత్రమే ఎదురు చూసేలా మారిపోతుంది. కష్టపడి సాధించే ఫలితం కంటే, వెంటనే వచ్చే వినోదాన్ని కోరుకుంటారు.స్పీచింగ్ థెరపీ సెంటర్లకు డిమాండ్రీల్స్, వీడియోలు చూసే పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సంవత్సరాలు పెరుగుతున్నా తమ పిల్లలకు మాటలు రావడం లేదంటూ స్పీచ్ థెరపీ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రీల్స్ చూసే పిల్లలు .. ఇంట్లో వారితో మాట్లాడే ప్రయత్నం కంటే స్క్రీన్ను చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.ఆందోళన, నిరాశఇతరుల జీవితాలను రీల్స్లో చూసి, తమ జీవితాన్ని వారితో పోల్చుకోవడం వల్ల పిల్లల్లో ఆందోళన, నిరాశ పెరిగిపోతాయి. ఫిల్లర్లతో కూడిన వీడియోలని చూసి, తమ రూపం పట్ల ఆత్మన్యూనతా భావానికి గురవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇది పిల్లల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది.భావోద్వేగాలు మొద్దుబారడంరీల్స్లో హాస్యం, హింస, విషాదం అన్నీ వెంటవెంటనే వస్తాయి. దీనివల్ల మెదడుకు ఒక భావోద్వేగాన్ని సరిగ్గా ప్రాసెస్ చేసే సమయం ఉండదు, ఇది పిల్లలను భావోద్వేగపరంగా మొద్దుబార్చే అవకాశం ఉంది. ఇది నిజజీవితంలో మరింత ప్రమాదకరం.నిద్ర పట్టకపోవడంస్మార్ట్ఫోన్తో మరో ముఖ్యమైన సమస్య నిద్ర పట్టకపోవడం. రీల్స్ చూడటం, మెసేజ్లు చేయడం వల్ల మెదడు ఉద్వేగానికి గురవుతుంది. దీనివల్ల స్లీపింగ్ సైకిల్ దెబ్బతిని .. పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. దాంతో చిరాకు, కోపం, మొండిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ప్రత్యామ్నాయమే పరిష్కారంఫోన్ వద్దు అని ఒకేసారి చెప్పడం కంటే వారికి నచ్చిన కథల పుస్తకాలు, బోర్డ్ గేమ్స్ లేదా ఏదైనా క్రీడావిశేషాలను చర్చించడం వల్ల వారి మనసు మరోవాటి మీదకి మళ్లుతుంది. బోర్గా ఉందని చెప్పగానే పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానుకోవాలి. వారితో మాట్లాడాలి, ఆడుకోవాలి. అలాగే మీరు నిరంతరం ఫోన్ చూస్తూ ఉంటే, వారు కూడా మిమ్మల్ని అనుకరిస్తారు గనుక స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్ను.. మనం ఎలా వాడుతాము అనేదానిపైనే అది మనకు మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా అనే అంశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి లేదా వీటిలో భాగస్వామ్యం చేయాలి. బాల్యం నుంచే పిల్లల దృష్టి రీల్స్ నుంచి రియల్కు మళ్లించే ప్రయత్నం చేయాలి. -
అరుణ యానంలో ఆమె ప్రతిభ
ఏఐ సాంకేతికతను అంగారక గ్రహంపై కూడా అద్భుతంగా ఉపయోగించవచ్చునని నిరూపించింది నాసా వారి పర్సెవరెన్స్ రోవర్. మరొక గ్రహంపై ఏఐ– ఆధారిత అన్వేషణకు బలాన్ని చేకూర్చిన విజయం ఇది. ఈ విజయంలో భారత సంతతికి చెందిన అంతరిక్ష రోబోటిక్ నిపుణురాలు వంది వర్మ కీలక పాత్ర పోషించారు.పుట్టినరోజు కానుకగా చిన్నప్పుడు వంది వర్మకు ఒక పుస్తకం వచ్చింది. సౌర వ్యవస్థపై రాసిన పుస్తకం అది. పుట్టినరోజు కానుకగా శాస్త్ర, సాంకేతికరంగ పుస్తకం అందుకున్న ఆ చిన్నారికి శాస్త్రరంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటానని, అంగారక గ్రహంపై రోవర్ను నడపడంలో కీలక పాత్ర పోషిస్తాన నీ అప్పుడు తెలియదు!అలా రోబోలపై ఆసక్తి మొదలైంది...వంది వర్మ జన్మస్థలం పంజాబ్లోని హల్వార. తండ్రి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) లో పైలట్. చండీగఢ్లోని ‘పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ’లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వర్మ తరువాత పెన్సిల్వేనియాలోని కార్నెగి మెల్లన్ యూనివర్శిటీ (సిఎంయు)లో రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ‘సిఎంయు’లో చదువుతున్న రోజుల్లో రోబోటిక్స్పై అమితమైన ఆసక్తి పెంచుకున్నారు.‘ట్రాక్టబుల్ పార్టికల్ ఫిల్టర్స్ ఫర్ రోబోట్ ఫాల్ట్ డయాగ్నసిస్’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. చిట్టడవిలో నాసా ప్రయోగ బెలూన్లను సేకరించడానికి ఇతర రోబోట్లతో పోటీపడే సరికొత్త రోబోట్ను రూపొందించారు. దాని పనితీరు వర్మకు నచ్చింది. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆ రోబోట్ పనిచేసిన తీరు నన్ను అబ్బురపరిచింది’ అంటారు వర్మ. అప్పటినుంచి రోబోట్లపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.ప్రయాణమే మన బలం2007లో నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ లో చేరిన వర్మ ప్రస్తుతం ‘మార్స్ మిషన్ రోబోటిక్స్ ఆపరేషన్స్’ చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. ‘అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవడానికి రోబోటిక్ అన్వేషకుల అవసరం ఎంతో ఉంది. గ్రహాంతర వాతావరణంలో రోబోలు మాత్రమే కనుగొనగలిగే విషయాలు ఎన్నో ఉన్నాయి’ అంటారు వర్మ.‘అంగారక గ్రహంపై ఒకప్పుడు ఏదో ఒక జీవి నివసించి ఉండవచ్చు అనే సందేహం నుంచి అసలు ఆ గ్రహంలో ఏం జరుగుతుంది? అనే ఆసక్తి వరకు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో కొత్త ప్రదేశాలకు వెళ్లాను. కొత్త వ్యక్తులతో మాట్లాడాను. తరచు ప్రయాణిస్తూ ఉండడం వల్ల విభిన్న నేపథ్యాలు, విలువలు ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం వస్తుంది. దీంతో మనసు విశాలం అవుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటాం. అందుకే ప్రయాణం అనేది ముఖ్యం. ఇక అంగారక గ్రహం విషయానికి వస్తే...అక్కడ జీవం ఉనికిని మనం చూడలేదు. అయితే ప్రతి గ్రహానికి సంబంధించి భౌగోళిక శాస్త్రంలో కొన్ని గుర్తులు మిగిలే ఉన్నాయి. మనం చదవకుండా వదలేసిన కథలు అవి. ఇప్పుడు చదవాలి. రోబోల పాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది’ అంటారు వర్మ.సవాలు విసిరే పర్యావరణంలో...మానవులను పంపడం చాలా ప్రమాదకరమైన చోట రోబోలను పంపడమే సరిౖయెన పరిష్కారం అయినప్పటికీ, వాటిని నిర్మించడం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేయడం ఆషామాషీ విషయం కాదు. చిన్నపాటి తప్పు జరిగినా మిషన్ మొత్తానికీ ‘శుభం’ కార్డ్ పడుతుంది.‘మార్స్ పర్యావరణం గురించి లోతుగా తెలియనప్పుడు రోబోల నిర్మాణం అనేది సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలోనే సంక్లిష్టమైన పనులు చేసే, అదే సమయంలో సురక్షితంగా ఉండగలిగే రోబోను తయారు చేయాలి’ అంటారు వర్మ.భవిష్యత్ విజయానికి అద్దం పట్టేలా...నాసా వారి పర్సెవరెన్స్ రోవర్ మానవ జోక్యం లేకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) ద్వారా ΄్లాన్ చేసిన మార్గాలలో అంగారక గ్రహంపై విజయవంతంగా డ్రైవ్లను పూర్తి చేసింది. రాళ్ళు, వాలులు, ఇసుక లక్షణాలను గుర్తించడానికి జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ఆర్బిటల్ ఇమేజరీ, రోవర్ నావిగేట్ డేటాను విశ్లేషించాయి. వే పాయింట్లతో నిరంతర డ్రైవింగ్ మార్గాన్ని ఏర్పర్చాయి. మామూలుగానైతే ఈ ప్రక్రియను మానవులు నిర్వహిస్తారు.‘ఇది చెప్పుకోదగిన పురోగతి. ఏఐ సాంకేతికత ఆపరేటర్ల పనిభారాన్ని తగ్గిస్తుంది. నావిగేషన్కు సంబంధించిన ప్రధాన అంశాలను రోవర్ ఎలా క్రమబద్ధీకరించగలదో ఈ పరీక్ష నిరూపించింది. భవిష్యత్లో రోబోటిక్ మిషన్లను ఏఐ సాంకేతికతతో ఎలా నిర్వహిస్తాం అనేదానికి ఈ విజయం అద్దం పడుతుంది’ అంటారు వర్మ.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో... ఆ గ్రహంలోకి!మిషన్ లైఫ్సైకిల్లో రోబోటిక్ ఇంజినీర్లు విభిన్న పాత్రలను పోషిస్తారు. మార్స్పై రోవర్స్ శక్తిసామర్థ్యాలకు సంబంధించిన కోడ్ను రాయడంతోపాటు ఇంకా ముఖ్యమైన పనులెన్నో చేశాను. రోవర్ను ఆపరేట్ చేయడంలో పాలుపంచుకున్నాను. మార్స్పై ఆపరేషన్లను హ్యాండిల్ చేయడం అనేది నాకు ఇష్టమైన పని. ఎప్పటి నుంచో అంగారక గ్రహంపై రోబోలను డ్రైవ్ చేస్తున్నాను. అంగారక గ్రహంపై ఆపరేషన్ల ద్వారా నేను ఎప్పటికప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను. మనం అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించడం అనేది సాధారణం. ఆ సాంకేతికతను మేము సంక్లిష్టమైన వాతావరణంలో ఉపయోగిస్తున్నాం. మార్స్పై ఏ రాయి ఆసక్తికరంగా ఉందో రోవర్ స్వయంచాలకంగా (ఆటోనమస్గా) గుర్తించడానికి మేము ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. వైడ్–యాంగిల్ ఇమేజ్లను తీసుకుంటున్నాం. ఆసక్తికరంగా ఉన్న వాటిని రోబోట్ తెలుసుకోవడంలో సహాయపడడానికి ఆఫ్లైన్ పద్ధతులను ఉపయోగిస్తున్నాం.– వంది వర్మ -
సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?
ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో విస్తరించిన సేంద్రియ వ్యవసాయ సంస్థలతో కూడిన నెట్వర్క్ ఐఫోమ్– ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్. జర్మనీలోని బాన్ కేంద్రంగా 1972 నుంచి పనిచేస్తోంది. 700 పైచిలుకు అనుబంధ సంస్థలకు సేంద్రియ సంబంధిత అంశాలపై చోదక శక్తిగా ఉంది. సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ నిపుణులు ఏమంటున్నారంటే..?సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలేంటి? నేల సారాన్ని పెంపొందించడం, పరిశుభ్రమైన నీటిని అందుబాటులోకి తేవటం, జీవవైవిధ్యం కోసం పెట్టుబడి పెట్టడం, మట్టిలో సేంద్రియ పదార్థాన్ని స్థిరీకరించడం ద్వారా వాతావరణ మార్పును తగ్గించడం. నెదర్లాండ్స్లో డెలాయిట్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రకారం.. రైతులందరినీ 100% సేంద్రియ సాగుకు మళ్లిస్తే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి 1000 కోట్ల యూరోలు ఆదా చేయవచ్చని లెక్కగట్టింది. మరొక అధ్యయనం ప్రకారం.. వ్యవసాయాన్ని సేంద్రియం వైపు మళ్లిస్తే సరఫరా గొలుసులను ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ఆహార భద్రతకు దోహదపడుతుంది.సేంద్రియం ప్రపంచాన్ని పోషించలేదనే విషయం నిజమేనా?రసాయనిక వ్యవసాయంలో ఉత్పాదకత స్తబ్దుగా ఉండటంతో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. పంటల మార్పిడి పాటిస్తూ సేంద్రియ సాగు చేస్తే సాధారణ సాగుకు దీటుగా దిగుబడి వస్తుందని కెన్యాలోని చుకా, కందరాలలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనాలు నిరూపించాయి. బొలీవియాలోని అగ్రోఫారెస్ట్రీ కోకో పొలాల్లోనూ ఇది రుజువైంది.సేంద్రియ ఆహారం పర్యావరణానికి మేలేనా?సేంద్రియ సాగు (Organic Farming) పద్ధతుల వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు శాస్త్రీయ గణాంకాల ద్వారా ధృవీకరించబడ్డాయి. మల్చింగ్ వంటి సేంద్రియ పద్ధతులు భూమిని క్షీణింపజేయకుండా కాపాడుతాయి. మంచి దిగుబడిని ఇస్తాయని తేలింది. ఇంధన వినియోగం తగ్గి, నేల సారం పెరిగి పర్యావరణంపై సానుకూల ప్రభావం ఉంటుందని గణాంకాలు నిర్థారిస్తున్నాయి.సేంద్రియ ఆహారం ఖరీదైనది. అందుబాటులో లేదన్నది నిజమేనా?అమెరికా వాసుల (జనవరి 2025) అభిప్రాయం ప్రకారం సేంద్రియ ఉత్పత్తులు సాధారణ ఉత్పత్తుల కంటే సగటున 52% ఖరీదైనవి. ఒక ప్రాంతంలో రైతులందరినీ స్థానిక పంటలను, సీజన్కు అనువైన పంటలను సేంద్రియంగా పండించటాన్ని ప్రోత్సహిస్తే ప్రజలకు సేంద్రియ ఆహారం అందుబాటులోకి వస్తుంది. సరసమైన ధరకే అందించవచ్చు. స్థానికంగా పండించిన పంటలను స్థానికంగానే ప్రాసెసింగ్ చేసి అమ్మితే.. గ్రామీణ మార్కెట్లలో సేంద్రియ ఆహారం మరింత అందుబాటులోకి వస్తుంది. ఈ దిశగా ప్రయత్నం జరగాలి. సేంద్రీయ ఉత్పత్తుల ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుంది? ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందనటానికి బలమైన ఆధారాలున్నాయి. సేంద్రియ ఆహార ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు, శాస్త్రవేత్తలు ఇద్దరూ గుర్తించారు. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. సాధారణ ఆపిల్ పండ్ల కంటే సేంద్రియ ఆపిల్లు 19% అదనంగా ఆరోగ్యకరమైనవని తేలింది. నేషనల్ పెస్టిసైడ్ అబ్జర్వర్ సమాచారం ప్రకారం సేంద్రియ ఆహారానికి మారటం వల్ల మూత్రంలో గడ్డి మందు గ్లైఫొసేట్ అవశేషాలు గణనీయంగా తగ్గుతాయి.చదవండి: ఈ మొక్కే ఒక ఎరువుల ఫ్యాక్టరీ! -
లేటెస్ట్ లంగా ఓణి..! బుట్టబొమ్మల్లా అమ్మాయిలు..
ఫ్యాషన్లో ఎన్నో డిజైన్స్ మనల్ని పలకరిస్తుంటాయి. అంతే వేగంగా ఆ డిజైన్స్ కనుమరుగవుతుంటాయి. కానీ, మనదైన సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల అలంకరణలో భాగమైన హాఫ్ శారీ అబ్బాయిల అలంకరణలో ధోతీ ఎప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచే ఉంటాయి. హాఫీ శారీ వేడుక టీనేజ్ను దాటేస్తూ ముందుకు వెళ్లి అమ్మాయి జ్ఞాపకాలలో నిలిచే అందమైన రోజవుతుంది. హైదరాబాద్ డిజైనర్ భార్గవి కూనమ్ హాఫ్ శారీస్ డిజైన్స్లో వస్తున్న గ్రాండ్లుక్ని ఇటీవల మరింత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు. ‘‘తెలుగింటి సంప్రదాయంలో పెళ్లి ముఖ్యమైన వేడుక. అంతే వేడుకగా ఒకమ్మాయి జీవితంలో కుటుంబసభ్యులందరూ కలిసి పండగలా జరుపుకునేది హాఫ్ శారీ ఫంక్షన్. ఇటీవల పెళ్లికి చేసిన విధంగానే హాఫ్శారీ ఫంక్షన్ను హల్దీ, మెహందీ .. అంటూ నాలుగు రోజుల పాటు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పన్నెండేళ్ల లోపు అమ్మాయిలకు చేసే ఈ వేడుకలో బుట్టబొమ్మలా కనిపించే అమ్మాయిలపైనే అందరి దృష్టి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా తమ కూతుళ్లను ఆ విధంగా చూసుకోవడానికి చాలా సంతోషిస్తుంటారు. మన చేనేతలుబెనారస్, కంచి, పైథాని పట్టు, చికంకారి జరీ కోటా .. తో చేసిన హాఫ్ శారీ, ధోతీ డిజైన్స్ ఇవి. లైట్ కలర్స్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పట్టు, కోటా ఫ్యాబ్రిక్ ఉపయోగించాం. జరీ వర్క్తో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే చేనేతలు – ఎంబ్రాయిడరీ– ఆభరణాలతో కలిపి చేసిన క్రియేటివ్ జర్నీ ఇది. ఆభరణాల మార్క్హాఫ్ శారీస్కు ఆభరణాల కాంబినేషన్ కూడా అత్యంత ముఖ్యమైనది. ఆకర్షణీయమైన లుక్ క్రియేట్ చేయడానికి పట్టు– జ్యువెలరీతో కలిసి చేసిన కాంబినేషన్ వర్క్ ఇది. లంగాఓణీ కాంబినేషన్ డ్రెస్ మనదైన సంప్రదాయ డ్రెస్ కాబట్టి, దీనికి మన సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీని మ్యాచ్ చేస్తూ పెద్ద పెద్ద హారాలు, డైమండ్ జ్యువెలరీతో మరిన్ని హంగులను తీసుకువచ్చాం’’ అని వివరించారు భార్గవి కూనమ్. (చదవండి: బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..) -
ఫోన్ బ్యాటరీతో ఇలా చేయొద్దు సుమీ..! పాపం ఆ యువకుడు..
సాధారణంగా ఏ వస్తువైనా కొందరికి నోట్లోకి వెళ్లిపోవాల్సిందే. అంటే కొంతమందికి అదో అలవాటులా ఏదోక వస్తువుని నోట్లో పెట్టుకుని నములుతున్నట్లుగా చేస్తుంటారు. అయితే అది ప్రమాదకరమైనదా లేద పెట్టకూడనిదా అని ఉండదు. ఏదైతేనేం..అలా నోటిలో పెట్టి నమలాల్సిందే. ఇక్కడొక యువకుడు అలాంటి పాడు అలవాటు కారణంగానే తీవ్ర గాయలపాయాలయ్యాడు. అసలేం జరిగిందంటే..ఈ ఘటన చూశాక ఎవ్వరూ ఇలాంటి సాహసం చేసే యత్నమైతే చేయరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడొక మొబైల్ షాప్లో యువకుడు కూర్చొని మొబైల్ ఫోన్ బ్యాటరిని నోటిలో పెట్టుకుని నమిలే ప్రయత్నం చేశాడు. అది లిథియం బ్యాటరీ కావడంతో.. ఇలా గట్టిగా నమిలాడో లేదో..అంతే ఒక్కసారిగా పెద్దశబ్దంతో కూడిన మంటలు ఎగిశాయి. అదృష్టవశాత్తు ఆ అబ్బాయికి ఏం కాలేదు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. సమీపంలోని వ్యక్తులు అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ మండుతున్న బ్యాటరీని అక్కడున్న మరో వ్యక్తి కాస్త ధైర్యం చేసి బయటకు విసిరే ప్రయత్నం చేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్యాటరీలను ఇలా నోట్లో పెట్టుకోకూడదని, అందులోనూ లిథియం అధిక శక్తిని నిల్వ చేస్తుందని దాంతో అస్సలు ఆడుకోవద్దని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.Shocking incident inside a mobile shop when a boy began chewing on a Lithium Phone Battery. Within seconds, the battery exploded, leaving him seriously injured. The injured boy was rushed for medical treatment pic.twitter.com/03MeyXz28p— Rosy (@rose_k01) February 5, 2026 (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
తస్మాత్ జాగ్రత్త..! అన్నివేళలా "మంచి" ఆరోగ్యానికి చేటు..!
కొందరు అమ్మాయిలు ఎవర్ని నొప్పించకుండా అందరి దృష్టిలో మంచి అనిపించుకునేలా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకోసం తమను తాము మార్చుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చేస్తుంటారు. అది ఓ మోస్తారు స్థాయిలో ఉంటే పర్లదు. తనను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేలా పరిస్థితులు ఉన్నప్పుడూ కూడా..మంచి వ్యక్తిలా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ధోరణిలో ఉంటే మాత్రం అంతరంగికి ప్రశాంతత కనుమరుగవ్వుతుంది. అదికాస్త శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే సాధ్యమైనంత వరకు అన్నివేళలా మంచి అమ్మాయిలా ఉండటం సురక్షితం కాదని నొక్కి చెబుతున్నారు. ఎప్పుడు మంచిగా ఉండటం కోపానికి మించి ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్ పూర్ణిమ. అంతేగాదు ఆమె దీన్ని "గుడ్ గర్ల్ సిండ్రోమ్"గా పిలిచారు. మంచి అమ్మాయిగా ఉండండి కానీ..మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా మాత్రం కాదు. లేదంటే అది ఒక విధమైన ఒత్తిడికి గురిచేసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే..దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కార్టిసాల్ఎప్పటికీ ఇతరులను సంతోషపెట్టాలని అనుకుంటే..సదా నాడీ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అది ఒక అలవాటులా మారి నో చెప్పడం, హద్దులు నిర్ణయించడం అసురక్షితంగా మారి..అభద్రతాభావంలోకి నెట్టేస్తుంది. దాంతో ఒత్తిడి బారినపడి శరీరంలో కార్టిసాల్ స్టాయిలను పెంచేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి, అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.థైరాయిడ్ అసమతుల్యతఇలా మంచి అనిపించుకునే ధోరణి భావోద్వేగాలను అణిచేస్తుంది. అంటే కోపాన్ని అణిచేసి, గొతు పెగలనీయకుండా చేస్తుంది. దాంతో థైరాయిడ్ బారిన పడతామని అంటున్నారు.జీర్ణ సమస్యలుమన భావాలు ఎప్పుడైతే వ్యక్తీకరించలేకపోతే..జీర్ణక్రియపై ప్రభావం చూపి.. ఉబ్బరం, ఆమ్లత్వం IBS లాంటి లక్షణాలు సాధారణం. భావోద్వేగాలు ప్రాసెస్ చేయబడనప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుందట. అదీగాక అధ్యయనం ప్రకారం, ఒత్తిడి శరీరం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది లేదా పాజ్ చేయమని సూచిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ దెబ్బతిని..తిన్నది ఒంటబట్టలేని సమస్యను ఎదుర్కొంటారట.హార్మోన్ల అసమతుల్యత, అలసటఇక్కడ "మంచిగా" ఉండటం చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ శరీరం ప్రతిసారి మనుగడ అనే మోడ్లోనే ఉండాలి. దాంతో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి..వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. నిరంతరం అలసటకు గురవ్వుతారట.ఆందోళన, భావోద్వేగ అలసటఎల్లప్పుడూ మంచిగా ఉండటం వల్ల విశ్రాంతి లేదా ప్రామాణికతకు చోటు ఉండదు. ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగ అలసట ఒక వ్యసనంగా మారుతుంది. నిజానికి బయటకు ప్రశాంతంగా కనిపించిన..లోలోపల కుంగిపోయి అలసిపోతారట.దీనికి వైద్యం మిమ్మల్ని మార్చుకోవాలనే సంకల్పానికి పునాది వేయడమే అని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్. ఇది నిజాయితీగా వ్యవహరించటంతో మొదలైన "మంచి" మిమిల్ని అన్నిరకాలుగా ముంచేయడం ప్రారంభిస్తుందన్నది గ్రహించాలి. అసురక్షితమైన స్థితికి తీసుకువచ్చే మంచిని వదులుకోవడమే అన్ని వేళల మంచిదని అంటోందామె. దాంతోపాటు శరీరం మాట వినాలి. మనకు అనుకూలంగా సాధ్యమైనదే అయితే.. దానికే సుముఖత వ్యక్తం చేయాలి. సాధ్యమైనంత వరకు కొన్నింటికి "నో" అని ఎంత మేర చెప్పగలుగుతామో అప్పుడు మనం మానసికంగా, శారీరకంగా సురక్షితంగా, స్ట్రాంగ్గా ఉండగలుగుతారని అన్నారు. అతి సర్వత్ర వజ్రయేత్ అనిపెద్దలు చెప్పిన నానుడిలా అతి మంచి పనికిరాదని గుర్తెరగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Poornima Peri (@poorniimahormonecoach) (చదవండి: మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..) -
బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..
ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్లు వచ్చినా.. భారతీయ వారసత్వానికి మించింది లేదు. సాంప్రదాయ దుస్తుల్లోని అందమే వేరు. బంగారు మోటీఫ్లతో ఉండే బనారీసి చీర లుక్కే ఎవర్గ్రీన్. ఆ విషయాన్ని రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. తరచుగా బెనరసీ చీరలతో తళుక్కుమనే నీతా ఈసారి సంప్రదాయ ఎరుపు బనారసీ చీరతో పండుగ వాతావరణం తెప్పించారు. యాభైఏళ్ల క్రితం నాటి ఈ ఫ్యాషన్ నేటికి అద్భుతమే అని చాటిచెప్పారు. ఎరుపు రంగు బంగారు జరీతో ఉన్న ఈ బనారసీ చీర ..చేనేత కళాకారుల నైపుణ్యాన్ని హైలెట్ చేసింది. అందుకు తగ్గట్టుగా ధరించిన మ్యాచింగ్ బ్లౌజ్ వెనుక భాగం రాజదర్పంలా లేదా ఆలయ చిహ్నంలాంటి క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ స్పెషల్ ఎట్రాక్షన్ని ఇచ్చింది. ఈ చిహ్నం శ్రేయస్సుకి సంకేతం కూడా. ఇంతలా వివరణాత్మకంగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఈ దుస్తుల ప్రాధాన్యతను, భారతీయ సంస్కృతిని మరింత హైలెట్ చేసింది. నీతా ఈ కాస్ట్యూమ్కి తగ్గట్టుగా కాంట్రాస్ట్గా పచ్చని డైమండ్ నెక్లెస్ ధరించి.. తన లుక్ని మరి ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. ఆ ఎరుపు పట్టు చీరకు ఆ పచ్చని నెక్లెస్ మరింత అందం. నిండుదనం ఇచ్చింది. View this post on Instagram A post shared by Ritika kadam (@ritikahairstylist) (చదవండి: Strawberry: స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..) -
మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్లమెంట్ వెలుపల మెట్లపై పోన్లో మాట్లాడుతూ పడిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ ఘటనలో శశి ధరూర్కి మడమ ఫ్యాక్చర్ అయ్యిందని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు కూడా. అలాగే ఆయన కోలుకున్నాని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు కూడా తెలిపారు. ఇలా మెట్లపై నడుస్తూ..ఫోన్ మాట్లాడటం మంచిది కాదని నూర్యాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి మల్టీటాస్కింగ్ని బ్రెయిన్ నిర్వహించలేదని హితవు చెప్పారు. ముఖ్యంగా మెట్లపై ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా మాట్లాడుతూ నడవడం అత్యంత డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది అజాగ్రత్తగా వ్యవహరించడం గురించి కాదని, బ్రెయిన్ వర్కింగ్పై అవగాహన ఉండటం.. అత్యంత ముఖ్యమని అంటున్నారు న్యూరాలజిస్ట్లు. మానవ బ్రెయిన్ బహుళ పనులు చేయగలదు. కానీ ఒకేసారి అన్ని పనులు చేస్తున్నప్పుడు.. విభజింపబడతాయి. దాంతో మొదటి దానికి ప్రాముఖ్యత ఇచ్చి మరోకటిపై అటెన్షన్ పెట్టడంలో విఫలమవుతుంది ఫలితంగా ఆ ప్రభావం మనపై పడుతుందన్నారు. ఇక్కడ మెట్లపై నడుస్తూ ఫోన్ చూసినప్పడూ..చూడటంపైనే అంటే కళ్లమీద బ్రెయిన్ ఫోకస్ ఉండి..నడకపై అటెన్షన్ తప్పుతుంది. అందులోనూ నేలలా చదునుగా ఉండకుండా స్టెప్స్లా ఉంటుంది కాబట్టి పాదం సవ్యంగా పడాలి లేదంటే బ్యాలెన్స్ అవ్వలేం. దాంతో ఎప్పుడైత్ ఫోన్ మాట్లాడుతూ మెట్లు ఎక్కుతామో పడిపోవడం లేదా జారిపడటం జరుగుతంది. దాంతో మెదడు, లేదా శరీరానికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేగాదు నిపుణులు ఇలా ఎన్నో సార్లు చేశాను అని తేలిగ్గా కొట్టిపారేయొద్దని హెచ్చరిస్తున్నారు కూడా. సాధ్యమైనంత వరకు ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్పై నడవాలనుకుంటే రైలింగ్ని పట్టుకోండి నడకపై దృష్టిపెట్టండని అంటున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చిన కాల్ పాజ్లో పెట్టి..మెట్లపై నుంచి చదునైన నేలపైకి వచ్చేశాక ఫోన్ కాల్ మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.One phone call. One staircase. One misstep.This video of Mr. Shashi Tharoor tripping while talking on the phone and walking downstairs is not about clumsiness. It’s about the brain.(Glad to note that Mr Tharoor is doing well🙏)Your brain is terrible at “walking + phone”… pic.twitter.com/KgNE7XxOYU— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 5, 2026(చదవండి: బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
ఆనంద్ మహీంద్రా బ్యూటీఫుల్ లవ్స్టోరీ! ఆమె కోసం ఏకంగా సెమిస్టర్ ఎగ్జామ్స్..
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్ఫూర్తిదాయకమైన స్టోరీలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయన భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు అయినప్పటికీ..ఆయన చాలా సాదాసీదాగా ఉండేందుకే ఇష్టపడుతుంటారు. కష్టపడి పనిచేసేవాళ్లన్న, నిజాయితీగా వృద్ధిలోకి వచ్చిన వాళ్లను తనవంతుగా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తుంటారు. వ్యాపార పంరంగానే దాతృత్వంలోనూ ఆయనకు ఆయనే సాటి. అలాంటి ఆనంద్మహింద్రా తన భార్య గురించి, కుటుంబం గురించి పెద్దగా ఎక్కడ ప్రస్తావించారు. అలాగే వారి కుటుంబ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ షేర్ చేయరు కూడా ఆయన. అంత గోప్యంగా ఉండే ఆయన తన కాబోయే కోసం సెమిస్టర్ పరీక్షలనే పక్కనపెట్టి ప్రేమించి ఆమె మనుసుని గెలుచుకుని మరి పెళ్లి చేసుకున్నారు. చెప్పాలంటే సినిమానే తలపించే స్టోరీ. అంతేగాదు బంధాలకు ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తారనేది ఆయన అందమైన ప్రేమకథ వింటే ఇట్టే అర్థమవుతుంది. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఈ ఫిబ్రవరి మాసం సందర్భంగా ఈ వాలెంటైన్స్ డే వీక్ స్పెషల్గా ఆనంద్ మహీంద్రా బ్యూటిఫుల్ లవ్స్టోరీ గురించి తెలుసుకుందామా..!అప్పట్లో ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతుండేవారు. ఒకసారి ఆయన కాలేజ్ ఎసైన్మెంట్ కోసం ఒక ఫిల్మ్ షూట్ చేయడానికి ఇండోర్కు వచ్చారు. అక్కడే ఆయన ఓ 17 ఏళ్ల అందమైన అమ్మాయిని చూశారు. చూసీచూడంగానే ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఆ అమ్మాయి పేరు అనురాధ. ఆమెను చూసింది మొదలు ఆనంద్ మహీంద్రాకు తిరిగి హార్వర్డ్కు వెళ్లాలనిపించలేదు. ఆమెతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో ఆనందంగా గడపడం కోసం ఏకంగా ఒక సెమిస్టర్ పరీక్షలను కూడా రాయకుండా వదిలేశారు. అప్పట్లో ఆ విషయం చాలా పెద్ద సంచలన నిర్ణయమో చెప్పాల్సిన పనిలేదు. అనురాధతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఆనంద్ మహీంద్రా ఏమాత్రం ఆలస్యం చేయలేదు. బాలీవుడ్ మూవీ తరహాలో తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశారు.అంతే.. ఆనంద్ మహీంద్రా ప్రపోజల్ను అనురాధా మహీంద్రా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిపోయింది. దాంతో 1985 జూన్ 17న పెద్దల సమక్షంలో ఆనంద్ అనురాధల పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగింది. దాంతో అనురాధ పేరు కాస్తా అనురాధా మహీంద్రాగా మారిపోయింది. ఇప్పుడు అనురాధ మహీంద్రా ఆనంద్ మహీంద్రాకు భార్య మాత్రమే కాదు. ఒక ప్రసిద్ధ లగ్జరీ లైఫ్స్టైల్ మ్యాగజీన్ ‘వెర్వ్’ వ్యవస్థాపకురాలు. ‘మ్యాన్స్ వరల్డ్’ మ్యాగజీన్కు సహ వ్యవస్థాపకురాలు.ఎవరీ అనురాధ..?అనురాధా ముంబైలో జన్మించారు. ప్రతిష్ఠాత్మక సోఫియా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆనంద్ మహీంద్రాతో పెళ్లి తర్వాత దంపతులిద్దరూ బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. అనురాధ మహీంద్రా బోస్టన్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ చేశారు. అనంతరం జర్నలిజం, పబ్లిషింగ్లో తన కెరియర్ను ప్రారంభించారు. ఆ తర్వాత రోలింగ్ స్టోన్ ఇండియాకు ఎడిటర్-ఇన్-చీఫ్గా, ఆర్టిసాన్స్తో సలహాదారుగా పనిచేశారామె. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకునేందుకే ఇష్టపడతారు అనురాధ. అందువల్ల ఆనంద్ మహీంద్రా చాలా అరుదుగా తన కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తుంటారాయన. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు దివ్య, ఆలిక. వారి వివాహమై నాలుగు దశాబ్దాలు గడిచినా..ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా చేదుడువాదోడుగా ఉంటారు. ఈ తరం ప్రేమికులకు ఆదర్శమైన జంట. పైపై ఆకర్షణలు కాదు ప్రేమ అంటే..జీవితాంతం తోడు, నీడగా వెన్నంటి ఉంటూ.. కంటికి రెప్పలా కాచుకోవాలి బంధాన్ని అని ఈ జంటను చూస్తే అవగతమువుతోంది. అదీగాక మహింద్రా సైతం ఎంటర్ప్రెన్యూర్గా ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నానంటే అందుకు అనురాధనే కారణమని, ఆమె ఫుల్ సపోర్టే వల్లేనని తరుచుగా చెబుతుంటారు ఆనంద్. కలతలు లేని కాపురం సాగిస్తే..ఎంత పెద్ద విజయాలైనా.. సునాయాసంగా అందుకోగలం అనేందుకు ఈ జంటే ఉదహరణ కదూ..!.(చదవండి: పాలల్లో యూరియా.. ఐస్క్రీమ్లో డిటర్జెంట్: ఆహార కల్తీపై రాఘవ్ చద్దా ఫైర్) -
ఎనభై తొమ్మిది... అయితే ఏంటీ!
ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎలా ఉంటారు? విశ్రాంతికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాదాపుగా ఇంటికే పరిమితం అవుతారు. ఎనభై తొమ్మిది సంవత్సరాల కమలాబెన్ మెహతా బామ్మ మాత్రం అలా కాదు. ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ముంబైలోని రద్దీగా ఉండే స్థానిక రైళ్లలో చేతితో తయారుచేసిన పూసల బ్రేస్లెట్లను అమ్ముతుంటుంది.‘ఈ వయసులో ఈ కష్టం ఏమిటి బామ్మ!’ అని ఎవరైనా అడిగితే... ఆమె సమాధానం చెప్పకుండానే గలగలా నవ్వుతుంది. ఆ నవ్వులోనే ఎన్నో జవాబులు వెదుక్కోవచ్చు.‘కష్టానికి వయసుతో పని ఏమిటి!’; ‘ ఎంత కష్టపడితే అంత చురుగ్గా ఉంటాను!’... ఇలాంటి జవాబులు ఎన్ని అయినా ఉండవచ్చు. తాజా విషయానికి వస్తే... ఇన్స్టాగ్రామ్ యూజర్ తుషిత్ షా, కమలా బెన్ను పలకరించింది.‘ముంబైలోని లోకల్ రైలులో బ్రేస్లెట్లు అమ్ముతున్న ఎనభై తొమ్మిదేళ్ల బామ్మను కలిశాను’ అంటూ ఆమె గురించి పోస్ట్ పెట్టింది. ‘ఎందుకు ఇలా?’ అని అడిగితే... ‘నా కుటుంబ సభ్యులు నన్ను వారితో పాటు ఇంట్లో ఉండడానికి అనుమతించారు. వారికి భారంగా ఉండడం ఇష్టం లేదు. అందుకే నా వంతుగా ఎంతో కొంత ఖర్చులకు ఇవ్వడానికి ఇవి అమ్ముతున్నాను’ అని చెప్పింది. -
ఐఏఎస్ ఆఫీసర్... అంగన్ వాడి స్కూల్
‘ఐఏఎస్ ఆఫీసర్లు తమ పిల్లలను ఎలాంటి స్కూల్స్లో చదివిస్తారు?’ అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. అయితే ఐఏఎస్ ఆఫీసర్, చిత్రకూట్ కలెక్టర్ పుల్కిత్ గార్గ్ ‘అందరు ఆఫీసర్లు ఒకేలా ఆలోచించరు’ అని నిరూపించారుమధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తన మూడేళ్ల కుమార్తె సియాను ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థ గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు చాలా మెరుగు పడింది. ఒక ఐఏఎస్ అధికారి తన బిడ్డను ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివించగలిగినప్పుడు సామాన్యులెవరూ సంకోచించకూడదు. అంగన్వాడీ కేంద్రాలపై ఉన్న అభిప్రాయాలు మారాయని విశ్వసిస్తున్నాను’ అన్నారు గార్గ్. ఈ సందర్భంగా బాల్యదశ అభివృద్ధి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఆరోగ్యం, పోషకాహారం... మొదలైనవి బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఎలా తీర్చిదిద్దుతాయో వివరించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న అపనమ్మకాన్ని వీడండి’ అని తల్లిదండ్రులను కోరారు. పుల్కిత్ గార్గ్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాల మాట ఎలా ఉన్నా అత్యధికులు ఆయనను సమర్థించి ప్రశంసించారు. -
ఇంట్లో కొరియన్ భూతాలు
పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. ఫోన్లు వారిని ఏ మూలకు నెడుతున్నాయో గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో చేసే స్నేహం, సంభాషణ, చర్చ మాత్రమే వారిని మంచి దారిలో పెట్టగలదు. ఢిల్లీలో ముగ్గురు ఆడపిల్లలు ‘కొరియన్ గేమ్స్’లో పడి ప్రాణాలు తీసుకున్నారు. మన దేశంలో టీనేజ్ పిల్లలు కె–పాప్ కోసం వెర్రెత్తడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇళ్లల్లోని ప్రేమ, స్నేహాల కొరత వల్లేమోనని చెక్ చేసుకోవడం అవసరం. ఇంతకు కొరియన్ లవ్ గేమ్స్ అంటే ఏమిటి? పిల్లలకు వీటి గురించి ఎలా జాగ్రత్త చెప్పాలి?‘వాస్తవంలో ఏదీ దొరకకపోతే ఊహలనే వాస్తవం అనుకోవాల్సి ఉంటుంది’ఇది నిపుణుల మాట.నిజజీవితంలో తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితులు, ఆటలు, హాబీలు, స్కూల్లో క్లాస్మేట్లతో అనుబంధం, టీచర్ల నుంచి వాత్సల్యం... వీటిలో ఏవీ లేని పిల్లలు... టీనేజ్లో వచ్చిన వారు ఊహల్లో కాకుండా వేటిలో సాంత్వన వెతుక్కుంటారు.ఇవాళ దేశాన్నే కాదు... ప్రపంచంలోని యువతను కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ సంగీతం, సినిమాలు, గేమ్స్ ఆకర్షిస్తున్నాయంటే కారణం... అక్కడ ఊహలు చాలా అందంగా ఉంటాయి. అబ్బాయిలు రాకుమారుల్లా ఉంటారు. అమ్మాయిలు రాకుమార్తెలుగా ఉంటారు. వారి మధ్య ప్రేమ అద్భుతంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయిని కాలు కందకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ల జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది... ఈ అద్భుత ప్రపంచం చూసే కొద్దీ టీనేజ్లోని అమాయకత్వం, ఆకర్షణ వల్ల యువతీ యువకులు తాము అలాగే ఉన్నట్టూ, తమకూ అలాంటి లోకం కావాలన్నట్టు ఉంటుంది.మానసిక నిపుణులు ఏమంటున్నారంటే కొరియన్ ప్రపంచాన్ని ఇష్టపడే వారు ఎక్కువగా భ్రమాజనిత ప్రపంచంలో ఉంటున్నారు... వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నారు అని. దీనికి తార్కాణం తాజాగా ఢిల్లీలో జరిగింది.ఢిల్లీ విషాదం...ఢిల్లీలో ముగ్గురు అమ్మాయిలు (ఇద్దరు ఒక తల్లికి, మరొకరు మరో తల్లికి జన్మించారు– తండ్రి ఒకడే) కరోనా సమయం నుంచి కొరియన్ డ్రామాలకు, గేమ్స్కు, పాప్కు అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో వారి ఐడెంటిటీలు కొరియన్ పేర్లతోనే పెట్టుకున్నారు. వాళ్లలో మధ్య అమ్మాయిని గేమ్స్లోలానే ‘లీడర్’గా ఎంచుకున్నారు. మధ్య అమ్మాయి అన్నం తినకపోతే వారు తినరు. మధ్య అమ్మాయి స్కూలుకు వెళ్లొద్దంటే వాళ్లు వెళ్లరు. తండ్రి, అతని ఇద్దరు భార్యలు కలిసి ఒకే ఫ్లాట్ ఈ పిల్లలతో ఉండగా ఈ ముగ్గురూ ఒక జట్టు, కొడుకు ఒక జట్టుగా మిగిలారు. ‘మా సోదరుడంటే మాకు ఇష్టం లేదు’ అని ఆ అమ్మాయిలు అనడం మొదలుపెట్టారు. తల్లిదండ్రుల పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ ముగ్గురు ఆడపిల్లలు రెండేళ్లుగా స్కూల్లు వెళ్లకుండా పూర్తిగా భ్రమల్లోకి వెళ్లిపోయారు. ఏనాటికైనా కొరియా వెళ్లి అక్కడ జీవించాలని వారి కోరికట. ‘మమ్మల్ని కొరియాకు వెళ్లకుండా ఆపగలరా’ అని రాసి తాము నివాసం ఉంటున్న తొమ్మిదో అంతస్తు నుంచి దూకి మరణించారు.కొరియన్ లవ్ గేమ్స్...కొరియన్ ఆన్లైన్ గేమ్స్ కేవలం బయట ఉండి ఆడేవి కావు. ఆటగాళ్లు ఆ గేమ్లో భాగం అవుతారు. ఆ ఆటగాళ్లకు కొరియన్ నేమ్స్ ఇవ్వబడతాయి. అలాగే గేమ్లోని ఒక వర్చువల్ (కృత్రిమ) యువకుడు లేదా యువతి గేమ్ ఆడే నిజమైన అమ్మాయి లేదా అబ్బాయికి సోల్ మేట్స్ అవుతారు. ఈ సోల్మేట్స్ ఈ నిజమైన అమ్మాయిని అబ్బాయిని చాలా పేంపర్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్ల్లో పలకరిస్తారు. రహస్యంగా కబుర్లు చెబుతారు. వీరి మాయలో పడ్డ టీనేజ్ యువతీ యువకులు ఇక మెల్లగా తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరమవుతారు. ఆ తర్వాత ఈ వర్చువల్ యువకుడు లేదా యువతి నిజ యువకుడు యువతికి టాస్క్లు ఇవ్వడం మొదలెడతారు. ఫలానా టైమ్లో మేల్కోమని, ఫలానా టైమ్లో చాట్లో రమ్మని, ఫలానా విధంగా డ్రస్సు వేసుకొని ఫోటోలు పెట్టమని... ఇలా నెమ్మదిగా బానిసలుగా మార్చి స్క్రీన్ టైమ్ను దారుణంగా పెంచేస్తారు. పిల్లలు ఇలా ఫోన్కు అతుక్కుని పోవడం ఎప్పటికైనా తల్లిదండ్రులకు తెలుస్తుంది. వారు మందలించి ఫోన్ లాగగానే ఒక్కసారిగా భ్రమాత్మక ప్రపంచం మాయమై, డ్రగ్స్ అందని అడిక్ట్స్లాగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆత్మహత్యలకు పూనుకుంటారు. ఢిల్లీలో జరిగింది ఇదే. మరో విధంగా చెప్పాలంటే ఈ గేమ్స్లోని వర్చువల్ పాత్రలు కూడా ఆత్మహత్యలకు పురిగొల్పవచ్చు.బ్లూవేల్ తర్వాత...గతంలో బ్లూవేల్ గేమ్ ఆత్మహత్యలకు పురిగొల్పి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత పరోక్షంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను దివాలా తీయించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఇప్పుడు కొరియన్ ప్రపంచం వారిని అతలాకుతలం చేస్తోంది. వాస్తవానికి కొరియాలో శారీరక కరెక్షన్స్ ఒక తప్పనిసరి. వారు సన్నగా ఉండటానికి అందంగా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అందుకు ‘బ్యూటీ లోన్స్’ ఇచ్చే బ్యాంకులూ ఉంటాయి. పాప్ సింగర్లను సన్నగా కనిపించడం కోసం స్కూల్ వయసు నుంచే ఎంచుకుని ఆహారం ఇవ్వకుండా మాడుస్తారు. దాంతో యుక్తవయసులోనే చనిపోయిన సింగర్స్ ఉన్నారు. ఇన్ని తెర వెనుక వ్యవహారాలుండగా తెర మీద అందంగా కనిపిస్తూ కొరియన్ అబ్బాయిలు, అమ్మాయిలు భారత దేశ టీనేజ్ పిల్లలను పూర్తి భ్రమాత్మక ప్రపంచంలోకి ఈడుస్తున్నారు.తల్లిదండ్రులూ జాగ్రత్త...1. పిల్లలతో పదే పదే మాట్లాడండి. 2. జరుగుతున్న విషాదాలను మెల్లగా వివరించండి.3. ఎవరు చెప్తే వింటారో వారితో చెప్పించండి.4. కౌన్సిలర్ల సాయంతో వారిని మెల్లగా ఫోన్ నుంచి భ్రమాత్మక జగత్తు నుంచి బయట పడేయండి.5. విపరీతమైన ప్రేమ, స్నేహితులు, ఆటపాటలు, సొంత ఊర్లూ పరిసరాలు ఇవి వారిని వాస్తవిక ప్రపంచంలోకి తెచ్చేలా చేస్తాయి. ఓపికగా పిల్లలను మార్చుకోండి.– ఫ్యామిలీ డెస్క్ -
'కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. మా ఆయనకు చెబితే..'
డాక్టర్గారూ నాదొక చిత్రమైన సమస్య. అసలు ఇది సమస్య అవునో కాదో కూడా తెలియడం లేదు. మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. నేను ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాను. నాది చాలా కలివిడి స్వభావం. అందరితో స్నేహంగా ఉంటాను. ఎవరినీ నొప్పించను. నా మూలాన ఎవరూ బాధపడకూడదనుకునే స్వభావం వల్ల చాలాసార్లు నేను పరిస్థితులతో రాజీపడుతూ వచ్చాను. ఈ లక్షణాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది నన్ను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.కొన్ని సంవత్సరాలుగా నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. మా మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి బ్రేకప్ అవుతూ మళ్లీ కలిసిపోతూ ఉండటం కామన్. మేం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. అతను కూడా బ్యాంక్ ఉద్యోగే. ప్రస్తుతం అతనికి వేరే రాష్ట్రంలో పోస్టింగ్ రావడం వల్ల నెలకు ఒకసారి మాత్రమే కలుసుకుంటున్నాం. ఆరునెలల క్రితం ఒకబ్బాయి నేను పని చేసే బ్యాంకులో ప్రొబేషన్ కోసం జాయిన్ అయ్యాడు. అనుకోకుండా అతనికీ నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కలిసి సినిమాలకు వెళ్లినా మేమెప్పుడూ హద్దులు దాటలేదు. అయితే నాకు ఇటీవల కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్ వస్తున్నాయి.ఈ విషయం గురించి నా భర్తకు చెబితే మేమిద్దరం దూరంగా ఉండటం వల్లే అలా వస్తూ ఉండి ఉండచ్చని, అందువల్ల నేను ఉద్యోగం మానేసి అతని దగ్గరకు వెళ్లడం గానీ లేదా తనే ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదనీ అన్నాడు. నాకు నా భర్తను వదిలేయాలన్న ఉద్దేశ్యం లేదు. అలాగని ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ను చంపుకోలేకపోతున్నాను. అతనికీ నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం నా భర్తకు కూడా తెలిసింది. ఒకవేళ నాకు తనతో ఉండటం ఇష్టం లేకపోతే ఆ అబ్బాయితోనే ఉండమని కూడా అన్నాడు. దీంతో నేను చాలా గందరగోళంలో ఉన్నాను. దయచేసి నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – ఓ సోదరి, విశాఖపట్నంమీ ఉత్తరం చదివాక నాకు అర్థం అయిందేమంటే మీరు చెడ్డవారు కానే కాదు, ఇతరుల కోసం మీ అవసరాలను కూడా వెనక్కినెట్టే మనిషని. ఇది చాలామంది మహిళల్లో కనిపించే గుడ్ గర్ల్ సిండ్రోమ్ (Good Girl Syndrome). చిన్న వయసులోనే ఎవరినీ బాధ పెట్టకూడదు, అందరినీ నచ్చాలి. మనవల్ల ఎవరికైనా కష్టం వస్తే అది మన తప్పే అనే భావనతో పెరిగారు. ఇలాంటివారు పెద్దయ్యాక కూడా ఇదే అలవాటును కొన సాగిస్తారు. అది రిలేషన్షిప్కు కూడా వర్తింపచేసుకోవడం వల్ల ఎప్పుడూ ఇతరుల కోసం అడ్జస్ట్ అవుతూ ఉండటంతోనే సరిపోతుంది. మీ గత రిలేషన్షిప్ అన్నింటిలోనూ ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. మీరు ఎదుటి వారికి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మీ బంధం బాగుంటుంది. మీరు మీ అప్రాయం చెప్పినప్పుడో, మీరు అవసరాలు ఉన్నాయని గుర్తు చేసినప్పుడో ఆ బంధం కూలిపోతుంది. దీనివల్ల మీరు మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. నాలాగా నేను ఉంటే నన్ను వదిలేస్తారేమో... ఒంటరి అవుతాననే భయం మిమ్మల్ని పదే పదే కాంప్రమైజ్ అయ్యేలా నడిపించింది.ఇక మీ ప్రస్తుత సమస్య విషయానికొస్తే మీ ఎమోషనల్ సైకిల్ మీ వివాహ బంధంలో కూడా కొనసాగింది. అయితే మీ భర్త మెచ్యూరిటీ వల్ల మీ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం ఏర్పడింది. అదే సమయంలో తను మీకు దూరంగా ఉండటం మీలో ఒక శూన్యాన్ని తీసుకొచ్చింది. ఆ ఖాళీని పూడ్చుకోవడం కోసం మీకు ఆఫీసులో పరిచయం అయిన అబ్బాయికి దగ్గరయ్యారు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఎమోషనల్గా ఆధారడపడటం అనే మీ గుణం వల్ల మీరు అతనికి ఆకర్షితులయ్యారు. కాని అది నిజమైన ప్రేమ కాకపోవచ్చు. మీలో బార్డర్లైన్ పర్సనాలిటీ లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మీలో చిన్న వయసు నుంచి ఎప్పుడూ ఒక రకమైన ఎమోషనల్ ఎంప్టీనెస్ ఉంది. దీన్ని ఎవరోఒకరి తో భర్తీ చేస్తున్నారు. దీనికోసం ఎవరో ఒకర్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎన్నుకున్నారా అనేది ప్రశ్న! మీ మనసు ఇప్పుడు ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంది.ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. సమస్య నుంచి బయటపడే మార్గం వెతకండి. వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్ని, ఒక క్లినికల్ సైకాలజిస్టును కలిస్తే మీలోని ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో నేర్పిస్తారు. మీ జీవితం మీద ఒక స్పష్టత వచ్చేలా సహాయపడతారు. విష్ యు ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
పాలల్లో యూరియా.. ఐస్క్రీమ్లో డిటర్జెంట్!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని అన్నారు. అవి అనారోగ్య కారకాలని, పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. పైగా దాన్ని స్వచ్ఛత ముసుగులో ఉన్న నకిలీగా అభివర్ణించారు. మార్కెట్లోకి విషాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కల్తీకి సంబంధించిన వాటిని జాబితా చేశారు కూడా.పాలలో యూరియాకూరగాయలలో ఆక్సిటోసిన్పనీర్లో కాస్టిక్ సోడాసుగంధ ద్రవ్యాలలో ఇటుక పొడితేనెలో పసుపు రంగుపౌల్ట్రీలో స్టెరాయిడ్లుఐస్క్రీమ్లో డిటర్జెంట్పార్లమెంటులో పాలకల్తీ సమస్యను లేవనెత్తుతూ..చద్దా ఇలా అన్నారు. పరిశోధనల ప్రకారం పాల నమూనాలలో 71% యూరియా, 64 శాతం సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయి. ఈ దేశంలో అమ్ముడవుతున్నంత పరిమాణంలో పాలు ఉత్పత్తి కావడం లేదు.ఆక్సిటోసిన్ ఒక హానికరమైన రసాయనమని, ఇది తలతిరగడం, తలనొప్పి, గుండె వైఫల్యం, వంధ్యత్వం, క్యాన్సర్కు కారణమవుతుందని అన్నారు.పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలింది2014-15 నుంచి 2026 వరకు, పరీక్షించిన అన్ని నమూనాల్లో 25 శాతం కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు . అంటే ప్రతి నాలుగు నమూనాలలో ఒకటి కల్తీకి గురవ్వుతుందని అర్థం. దీనివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవ్వడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యకం చేశారు చద్దా.అంతేగాదు చద్దా అంతర్జాతీయంగా నిషేధించిన భారతీయ ఆహార ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలోని రెండు అతిపెద్ద గరం మసాలా కంపెనీలను అమెరికా, యూకే, యూరప్ అంతటా నిషేధించారు. ఎందుకంటే వాటిలో కేన్సర్కు కారణమయ్యే పురుగులమందులు ఉన్నాయి. కానీ అవే సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో అమ్ముడవుతుండటం బాధకరం అని అన్నారు.రాఘవ్ చద్దా దిద్దుబాటు చర్యలను కూడా సూచించారుప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ, ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ ఈ చర్యలను సిఫార్సు చేశారు:1. మానవశక్తిని పెంచి..ప్రయోగశాల పరీక్షా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని బలోపేతం చేయడం.2. నేరస్థులను అరికట్టడానికి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టడం.3. కల్తీ ఉత్పత్తుల పేర్లు, బహిరంగంగా వెల్లడించడం మార్కెట్ నుంచి తక్షణమే తొలగించేలా చర్చలు తీసుకోవడం వంటివి చేయాలి. Biggest Health Crisis in India 🚨FOOD ADULTERATION - खाने में मिलावट👉Urea in Milk👉Oxytocin in Vegetables👉Caustic Soda in Paneer👉Brick powder in Spices👉 Yellow dye in Honey 👉 Steroids in Poultry👉 Detergent in ice creamWe all are consuming slow poison!Raised… pic.twitter.com/LxWi1nIcP0— Raghav Chadha (@raghav_chadha) February 4, 2026 (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు) -
ఆధునిక తల్లుల వయసు..!
ఆలస్యంగా తల్లికావడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు నేటితరం మహిళలు. కెరీర్కే తొలి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. ఇంటి ఖర్చులు, పిల్లల పెంపకం, చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించే సామర్థ్యం వచ్చాకే మాతృత్వం వైపు అడుగులు వేస్తున్నారు.2024లో 37 శాతం మంది తల్లులు 25–29 ఏళ్ల మధ్య వయసువారే. మాతృత్వానికి ఇదే సరైన వయస్సుగా నేటి మహిళలు భావిస్తున్నారు.19 ఏళ్ల లోపు తక్కువ వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య అభివృద్ధి చెందిన దేశాలలో గణనీయంగా తగ్గింది. అయితే కొన్ని వర్గాలలో గతంలోలాగే ఉంది.30–34 ఏళ్ల వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య 2.5 రెట్లు పెరిగింది. 2005లో 9.9 శాతం ఉండగా 2024లో 24.6 శాతానికి చేరుకుంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళల్లో 34.8 శాతం మందికి ఒక్కరే సంతానం, 31.4 శాతం మందికి ఇద్దరు పిల్లలు, 15.9 శాతం మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విద్యావంతులైన మహిళలు చిన్న కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.2005లో 25 ఏళ్ల లోపు తల్లులు 48.9 శాతం ఉన్నారు. ప్రస్తుతం 29.7 శాతం ఉన్నారు. 30 ఏళ్ల పైబడిన మహిళల్లో తల్లులు అయినవారు గతంలో 21.6 శాతం, ఇప్పుడు 33 శాతం ఉన్నారు. ఇప్పుడు ప్రతి ముగ్గురు తల్లులలో ఒకరు 30 ఏళ్లు పైబడిన వారే.ఈ రెండు దశాబ్దాల కాలంలో 20–24 ఏళ్ల వయస్సులో తల్లులయిన వారి సంఖ్య 46.6 శాతం నుండి 27.1 శాతానికి తగ్గింది.(చదవండి: పార్లమెంట్ సమావేశాల్లో స్పెషల్ అట్రాక్షన్గా కంగానా..!) -
Parliament session: స్టైలిష్ సిల్క్ చీరలో మెరిసిన కంగనా..!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యాక్టింగ్ పరంగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సొంతం చేసుకున్న అందాల నటి. ఫ్యాషన్ పరంగాను ఆమె సాటిలేరవ్వరూ అన్నంతగా హుందాగా, స్టైలిష్గా ఉంటారామె. ఈనెల ఫిబ్రవరి 04న జరిగిన పార్లమెంట్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఒక్కసారిగా ఆమె అభిమానులు రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించడంలో నీకు సాటిరావెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు ముంచెత్తారు. ఆమె ఆధునిక మహిళలా బ్రోకెడ్ ఎంబ్రాయిడరీతో కూడిన పట్టు చీర విత్ ట్రెంచ్ కోట్-శైలి జాకెట్తో అత్యంత అందంగా కనిపించారామె. అచ్చం సాంప్రదాయ శైలి చీర కట్టుతో చక్కగా మడత పెట్టిన పల్లు, ఫుల్హ్యాండ్స్ జాకెట్తో పార్లమెంట్ రేంజ్కి తగినట్లుగా అత్యంత హుందాగా ఉంది ఆమె ఆహార్యం. అలాగే లైట్ మేకప్, బ్యాక్సన్గ్లాస్, చేతిలో హెర్మెస్ బ్యాగ్తో అత్యంత ముగ్దమనోహరంగా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసంతో కూడిన రాజకీయ నాయకురాలిలా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Ecnopolis India (@ecnopolis.india) (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు) -
70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు
ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్లో రిపోర్టు నార్మల్గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్లో కణితి లేక స్ట్రోక్ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్లు చేసినా..ఫలితం శూన్యం. దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు. ఎందువల్ల అంటే..ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్ లేకపోవడం గుర్తించారు వైద్యులు. నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన. బీ12 లోపం అంటే..నరాలను రక్షించే మైలిన్ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు. దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్లు.When the Brain Was Blamed; but the Nerves Told the TruthShe was 70, soft-spoken, and deeply worried.For six weeks, she had been feeling dizzy and unsteady, especially while walking. She described it as “the ground moving under my feet.” At times, she felt she might fall if… pic.twitter.com/do925kj2OZ— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 4, 2026 (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..
స్ట్రాబెర్రీలు ఈ సీజన్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం, అందాన్నివ్వడంలోనూ మేలు చేస్తాయి. వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.వయస్సు తోపాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగించే స్ట్రాబెర్రీ గుజ్జును ముఖానికి ప్యాక్లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని ఎల్లాజిక్ యాసిడ్ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందిస్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి, దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్ సి శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. (చదవండి: ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!) -
ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!
శీతల పానీయాలు తాగొద్దని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫ్యాటీ లివర్, కిడ్నీ సంబంధిత అనారోగాల బారిన పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణుల సదా హెచ్చరిస్తుంటారు. అయినాసరే ఏం కాదులే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ..తాగేస్తుంటారు చాలామంది. అయితే అది ఎలా ఆరోగ్యాన్ని సమస్యల కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది అస్సలు గ్రహించం అంటూ ఇక్కడొక వ్యక్తి కన్నీరుమున్నీరు విలపిస్తున్న కథ వింటే కచ్చితంగా విస్తుపోతారు. అంతేగాదు ఈ కూల్డ్రింక్స్ తాగాలా వద్దా అనే సందేహం కచ్చితంగా ఎదురవ్వుతుంది. ఎందుకంటే..నెట్టింట వైరల్ అవ్వుతున్న ఓ వీడియో అందర్నీ ఆలోచింపచేశాలా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శీతల పానీయాలు తాగడం మానేయండి అంటూ వేడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తముమ్మడు అలాంటి పానీయాలు తాగే ఆరోగ్యం పాడుచేసుకున్నాడంటూ భావోద్వేగం మాట్లాడటం చూడొచ్చు. అతడి ఆరోగ్యం దారుణంగా పాడైందని, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని పేర్కొన్నాడు. తన తమ్ముడిలా ఎవ్వరూ ఆరోగ్యం పాడుచేసుకోకండి అని కోరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేగాదు ఈ శీతల పానీయాన్ని విషంగా పేర్కొన్నాడు. దీని కారణంగా తన సోదరుడు జీవితం పాడైందంటూ కన్నీరుమున్నీరు విలపించాడు ఆ వ్యక్తి వీడియోలో. చాలామంది నెటిజన్లు అవును ఇది మంచిది కాదని తెలిసి విషాన్ని తాగుతున్నామని అంగీకరించారు. ఈ ఘటన అందరికి కనువిప్పు అని పేర్కొంటూ కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం అతను రోజు కూల్డ్రింక్స్ తాగుతున్నాడని తెలిసినప్పుడూ ఎందుకు అదుపుచేయలేకపోయారు అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Updated Bharat.in™ | Latest News (@updatedbharat.in) (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..
బరువు తగ్గించే జైలు గురించి విన్నారా..?. ఔను మీరు వింటుంది నిజమే..!. నిర్బంధంలో ఉంచి స్లిమ్గా మార్చే జైలు ఇది. ఇక్కడకు వస్తే..సులభంగా వెయిట్లాస్ అవ్వొచ్చట. అంతేకాదండోయ్ అందుకోసం ఎంత చెల్లించాలో తెలిస్తే విస్తుపోతారు. ఖైదీల్లా బరువు తగ్గడం కోసం జైలు ఏంటి అనుకోకండి..అక్కడ ఉండే కఠినమైన ఆహార నియమాలు, వర్కౌట్లు తప్పించుకోకుండా ఉండేందుకు అచ్చం జైలు మాదిరి వాతావరణంతో ఉంటుంది ఆ ప్రదేశం. మరి అదెక్కడ ఉంది..?. ఎలా సన్నగా అయ్యేలా చేస్తారు అంటే..బరువు తగ్గించే జైలు చైనాలో ఉంది. దీని గురించి ఒక ఆస్ట్రేలియాన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంట్ చేసి మరి వీడియో షేర్ చేశారు. తాను అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకుని మరి ఇక్కడకు వెళ్లినట్లు వెల్లడించాడు కూడా. దీన్ని ఫ్యాట్ ప్రిజన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో రకాలుగా డైట్లు, వర్కౌట్లు చేసినా..పెద్దగా ప్రయోజనం పొందలేని వాళ్లంతా వస్తారట. శిక్షణ ఎలా ఉంటుందంటే..అక్కడ వాళ్లకు రోజు ఉదయం 7.30 గంటలకు అలారం మోగడంతో ప్రారంభమవుతుందట. ఉదయం 8 కల్లా అదనపు బరువుని చెక్ చేయడం కోసం క్యూలైన్ ఉంటుంది. తర్వాత 9.20 నుంచి 10.30 వరకు ఏరోబిక్ క్లాస్ ఉంటుంది. దీని తర్వాత ఉదయం 11.15 గంటలకు రోజులో తొలి భోజనం మొదలవుతుంది. అందులో అల్పాహారంగా నాలుగు గుడ్లు, ఒక బ్రెడ్ స్లైస్, టమాట, కొన్ని దోసకాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. ఈ సెషన్ తర్వాత కార్డియో వ్యాయామాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.50 నుంచి 4 గంటల మధ్య వెయిట్ లిఫ్టింగ్ సెషన్ మొదలవుతుంది. ఇక లంచ్కి బ్రేజ్డ్ డక్, తామర కాడలు, వేయించిన కూరగాయలు, కొన్ని క్యారెట్లు, అరటిపండ్లు ఉంటాయి. దీని తర్వతా రెండు గంటల పాలు హై ఇంటెన్సివ్ శిక్షణ, స్పిన్ క్లాస్లు ఉంటాయి. ఇక రాత్రి భోజనంలో పుచ్చకాయ, కూరగాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. దీని తర్వాత మరోసారి బరువు చెక్చేసే ప్రక్రియ అనంతరం నిద్రకు ఉపక్రమిస్తారు. అంటే ఈ జైలులో రోజుకి సుమారు 12 గంటల వ్యాయామాలు ఉంటాయని చెబుతున్నాడు ఇన్ఫ్టుయెన్సర్. View this post on Instagram A post shared by eggeats 🐣 I show you the real side of Asia ✨ (@eggeats) ఈ జైలులో ఉండి ఒక మహిళ నాలుగు వారాల వ్యవధిలోనే ఆరు కిలోల బరువు తగ్గినట్లు తెలిపాడు. అంటే ఆమె 85.6 కిలోల బరువు ఉండగా..ఇక్కడకు వచ్చాక 79.6 కిలోలకు వచ్చింది. అంతేగాదు మన వ్లాగర్ సైతం అంతకుమునుపుకి ఇక్కడకు వచ్చాక చాలా పరివర్తన వచ్చాడు. అంతలా బరువు తగ్గ్గిన అతడి పరివర్తనను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు కూడా. ఇదిలా ఉండగా, చైనాలో లాట్జైళ్లు ఇంటెన్సివ్, రెసిడెన్షియల్, మిలటరీ తరహా బరువు తగ్గించే బ్యూట్ క్యాంపులు చాలానే ఉన్నాయట. ఎందుకంటే అక్కడ రోజురోజుకి పెరుగుతున్న ఊబకాయ సంక్షోభం నేపథ్యంలో ఇలాంటివి అత్యంత ప్రజాదరణ పొందుతుండటం విశేషం. View this post on Instagram A post shared by eggeats 🐣 I show you the real side of Asia ✨ (@eggeats) జైళ్లుగా ఎందుకు పిలుస్తారంటే..నేరస్తుల నిర్బంధ కేంద్రాలు కాకపోయినా..అక్కడ ఉండే సౌకర్యాలు జైళ్లను తలిపించేలా ఉంటాయి. పైగా చుట్టూ ఉండే వాతావరణం సైతం జైలు మాదిరిగా ఉంటుంది. అంటే ఎత్తైన కాంక్రీట్ గోడలు, ముళ్ల కంచెలతో లాక్ చేసిన గేట్లు వంటి గట్టి పకడ్బంది ఉంటుంది. దీంతోపాటు ఎక్కడకక్కడ గట్టి నిషా ఉంటుంది. ఇక్కడకు వచ్చే వాళ్లంతా సాంప్రదాయ ఆహారాలు తీసుకున్నా.. బరువు తగ్గని వాళ్లు కాబట్టి నిర్వాహకులు అంతలా వాళ్లని పర్యవేక్షిస్తారు. ఇక్కడ వాళ్లకు 14 నుంచి 28 రోజుల శిక్షణకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా 28 రోజులకు వసతి, ఆహారం, శిక్షణతో సహా రూ. 90 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు ఉమ్మడి వసతినే ఎంచుకుంటారు. ఒక్కో గదికి సుమారు ఐదుగురు వరకు ఉంటారట. ఇదంతా చూస్తుంటా..ఊబకాయంతో మనుషులు ఇంతలా ఇబ్బందులు పుడుతున్నారా..? అనిపిస్తోంది కదూ..!.(చదవండి: -
ఎవరీ వంది వర్మ...? మార్స్ రోవర్స్ తొలి ప్లాన్ డ్రైవ్..
అంగారక గ్రహంపై నాసా తొలి ఏఐ ప్లాన్ డ్రైవ్ వెనుక ఉన్న ప్రధాన శాస్త్రవేత్తగా భారత సంతతి మహిళ వంది వర్మ చరిత్ర సృష్టించారు. భారత్కి చెందిన ఈ రోబోటిక్స్ ఇంజనీర్ వంది వర్మ విమానాయనానికి సంబంధించిన కుటుంబంలోనే పెరగడంతో సాంకేతికను అన్వేషించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నాసా ప్రకారం..వర్మ జేపీఎల్ ప్రిన్సిపాల్ ఇంజనీర్గా, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో మొబిలిటీ అండ్ రోబోటిక్స్ విభాగానికి డిప్యూటీ సెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థకు ముందు, అధికారికంగా ధృవీకరించిన ప్లాన్ అములు చేసే భాష PLEXIL, రోవర్లు, మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతికతను డెవలప్చేయడానికి రూపొందించిన బృందానికి ఆమె నాయకత్వం వహించినట్లు నాసా పేర్కొంది. ఆ కారణంతోనే రోబోటిక్ ఇంజనీరింగ్నే కెరీర్గా ఎంచుకుంది..వర్మ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. విమానాలు,ఇంజనీరింగ్ వాతావరణాలతో ఆమెకు తొలి దశలో పరిచయం ఉండటం వల్ల ఆమెకు టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, తర్వాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్లో మాస్టర్స్ అండ్ పిహెచ్డి పొందారామె. ఇక వర్మ డిసెంబర్ 8 నుంచి 10 తేదీల్లో ఏఐ ప్లాన్ పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ మొదటి డ్రైవ్లను పూర్తి చేసినట్లు నాసా ధృవీకరించింది. ఈ ప్రదర్శనం మన సామర్త్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో చెబుతుండటమే గాక, ఇతర ప్రపంచాలను ఎలా అన్వేషించాలో తెలుపుతుందని నాసా అడ్మినిస్ట్రేర్ జారెడ్ ఐజాక్మాన్ చెబుతున్నారు. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!) -
ఈ ఐదు గేమ్స్ వెంటనే డిలీట్ చేయండి!
ఈ తరం పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఆ ఫోనులో కనిపించే సమస్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆన్లైన్ గేమ్లకు బానిసలుగా మారడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ‘కొరియన్ లవర్’ అనే ఆన్లైన్ గేమ్ మాయలో పడి భవనం పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. చిన్నారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి ప్రాణాలతో ఆటలాడుతున్న డేంజరస్ గేమ్లు ఇవే..కొరియన్ లవర్ప్రస్తుతం అత్యంత వేగంగా పిల్లలను ఆకట్టుకుంటున్న ప్రమాదకరమైన గేమ్ ఇది. ఇందులో అందమైన కొరియన్ బొమ్మలు, యానిమేషన్ పాత్రల సాయంతో పిల్లలను ఆకట్టుకుంటారు. మొదట చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి, చివరకు ఆత్మహత్య చేసుకుంటేనే ‘నిజమైన ప్రేమ’ దక్కుతుందని లేదా ‘మరో ప్రపంచానికి’ వెళ్తారని నమ్మిస్తారు. ఘజియాబాద్ చిన్నారులు సరిగ్గా ఈ ఉచ్చులోనే పడి ప్రాణాలు వదిలారు.బ్లూ వేల్ అండ్ మోమో ఛాలెంజ్ గతంలో వందలాది ప్రాణాలు తీసిన బ్లూ వేల్ గేమ్ ఇప్పుడు సరికొత్త లింకుల రూపంలో వాట్సాప్, టెలిగ్రామ్లలో తిరుగుతోంది. చేతిపై గాట్లు పెట్టుకోవడం, అర్ధరాత్రి భయంకరమైన సినిమాలు చూడటం వంటి 50 టాస్క్లు ఇందులో ఉంటాయి. చివరి టాస్క్ ‘చనిపోవడం’. మోమో ఛాలెంజ్ కూడా వింత ఆకృతి గల బొమ్మతో పిల్లలను భయపెట్టి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది.క్రోమింగ్ ఛాలెంజ్ ఇది గేమ్ల కంటే ప్రమాదకరమైన సోషల్ మీడియా ట్రెండ్. ఇంట్లోని నెయిల్ పాలిష్ రిమూవర్స్, హెయిర్ స్ప్రేలు, పెయింట్ థిన్నర్స్ వంటి రసాయనాలను ముక్కు ద్వారా పీల్చడమే ఈ ఛాలెంజ్. దీనివల్ల క్షణాల్లో మెదడు మొద్దుబారిపోతుంది. ఇది శాశ్వత మెదడు వాపు, కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటుకు దారితీస్తోంది.ఫైర్ ఫెయిరీఇది చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన గేమ్. దీనిలో వారిని ఒక ‘అగ్ని దేవత’గా మారుస్తానని నమ్మిస్తుంది. అర్థరాత్రి గ్యాస్ స్టవ్ వెలిగించి, దాని చుట్టూ తిరగాలని లేదా గ్యాస్ ఆన్ చేసి పడుకోవాలంటూ వింత టాస్క్లు ఇస్తుంది. దీనివల్ల ఇల్లు తగలబడటమే కాకుండా, ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.బ్లాక్ అవుట్ అండ్ బెనాడ్రిల్ ఛాలెంజ్ పిల్లలు తమ మెడను తామే బిగించుకుని, ఊపిరి ఆడక స్పృహ కోల్పోయే వరకు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయడమే ఈ ‘బ్లాక్ అవుట్’ ఛాలెంజ్. అలాగే, అధిక మోతాదులో దగ్గు మందులు తాగి వింత భ్రమలకు గురికావడం మరో మృత్యు క్రీడ. ఇవి నేరుగా నాడీ వ్యవస్థను దెబ్బతీసి, ప్రాణాపాయం కలిగిస్తాయి.తల్లిదండ్రులు ఏం చేయాలంటే..గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని మీ పిల్లల ఫోన్ను మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. మీ పిల్లలు యూట్యూబ్లో, బ్రౌజర్లో ఏం సెర్చ్ చేస్తున్నారో తరచుగా గమనించండి. రోబ్లాక్స్ (Roblox) వంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు అందులో అపరిచితులతో మాట్లాడకుండా ‘చాట్ ఆప్షన్’ను డిసేబుల్ చేయండి. టెక్నాలజీ ఎంత పెరిగినా, తల్లిదండ్రుల పర్యవేక్షణే పిల్లలకు అసలైన రక్షణ అని గుర్తించండి.ఇది కూడా చదవండి: చాట్ జీపీటీకి గూగుల్ షాక్.. ‘జెమిని’లోకి పాత చాట్స్ -
స్మార్ట్ గ్లాసెస్... సో డేంజర్!
సరికొత్త సాంకేతికతలో స్మార్ట్ గ్లాసెస్ ట్రెండ్ ఒకటి. హ్యాండ్స్–ఫ్రీ సెల్ఫీల నుంచి ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్ వరకు స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాల మాట ఎలా ఉన్నా... మహిళల ప్రైవసీకి సంబంధించి స్మార్ట్ గ్లాసెస్ బ్యాడ్ గ్లాసెస్గా తయారయ్యాయి. స్మార్ట్గ్లాసెస్తో మహిళల వీడియోలు తీసి వివిధ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. మహిళలకు తెలియకుండా స్మార్ట్గ్లాసెస్ కెమెరాతో వీడియోలు తీయడం అనేది యూఎస్, యూకేలలో ప్రమాదకరమైన ట్రెండ్గా మారింది...బస్స్టాప్లో నిలబడినప్పుడో, ఏ షాపింగ్ మాల్లోనో ఉన్నప్పుడో స్మార్ట్గ్లాసెస్ ధరించిన వ్యక్తి మీ దగ్గరకి వచ్చి... ‘హాయ్ అండీ... మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది’ అని మాట కలిపి చాలాసేపు మాట్లాడవచ్చు.చివరికి... ‘ఒకరి పోలికలతో ఒకరు ఉండడం సహజమే కదండీ. నేను పొరబడ్డాను...సారీ...’ అంటాడు. ‘భలేవారండీ, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు!’ అని మనం అంటాం.→ కట్ చేస్తే...కొన్ని రోజుల తరువాత మీ వీడియో ఇన్స్టాగ్రామ్లోనో, టిక్టాక్లోనో కనిపించవచ్చు. షాక్కు గురి చేయవచ్చు. అభ్యంతరకరమైన సైట్స్లోనూ కనిపించి మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. ‘అసలు.. నా వీడియో ఈ సైట్లోకి ఎలా వచ్చింది!’ అని ఆలోచిస్తుండగా మీతో మాట్లాడిన వ్యక్తి గుర్తుకు వస్తాడు.‘నాతో మాట్లాడింది నిజమేగానీ. అతడి చేతిలో సెల్ఫోన్లాంటిదేమీ కనిపించలేదే!’ అని అతడికి క్లీన్ సర్టిఫికెట్ ఇస్తారు. నిజాకి ఆ వీడియో సృష్టికర్త అతడే!అతను పెట్టుకున్న స్మార్ట్గ్లాసెస్ కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు. అందులో కెమెరా కూడా ఉంటుంది.యూఎస్, యూకేలలో ‘స్మార్ట్ గ్లాసెస్ బాధితులు’ ఎంతోమంది ఉన్నారు. సాంకేతికతలో మరో ముందుడుగుగా ‘స్మార్ట్ గ్లాసెస్’ వచ్చాయి. హ్యాండ్స్–ఫ్రీ సెల్ఫీలు, ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్, వాయిస్–యాక్టివేటెడ్ అసిస్టెంట్స్లాంటి సదుపాయాల మాట ఎలా ఉన్నా కొన్ని సందర్భాలలో ఇవి మహిళల పాలిట పీడకలగా మారుతున్నాయి.→ భయపడవద్దుగత నెల ఇంగ్లాండ్లో ఓ నలభై ఏడేళ్ల మహిళ ఒక వ్యక్తిని కోర్టుకు లాగింది. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన నేరం ఏమిటి? ఒక హోటల్లో ఆమెకు తెలియకుండా తన స్మార్ట్గ్లాసెస్తో అభ్యంతరకరమైన రీతిలో వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆమెకు అనుమానం వచ్చి, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టుకు లాగింది. కొద్దిమంది బాధితులు మాత్రం ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’ అనుకుంటూ బ్లాక్మెయిల్ చేసే వారి బెదిరింపులకు లొంగిపోతున్నారు. వారు ఎంత డిమాండ్ చేస్తే అంత సొమ్ము ఇచ్చేస్తున్నారు.సూపర్ మార్కెట్కు వెళ్లిన తనను అపరిచితుడు ఎవరో రే–బాన్ మెటా స్మార్ట్ గాసెస్తో అభ్యంతర కరమైన రీతిలో వీడియో తీశాడని ఒక మహిళ ఆన్లైన్లో కన్నీరు మున్నీరు అయింది. ‘ఎవరో చేసిన దుర్మార్గమైన పనికి మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బలహీన పడిపోయాను’ అని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్లో వెల్లడించింది ఆ బాధిత మహిళ.→ ఆ లైట్ వెలగక పోవచ్చు కూడా!సార్ట్ఫోన్ కెమెరా తో ఎవరైనా షూట్ చేస్తుంటే వెంటనే గమనించి అడ్డుకోవచ్చు. అయితే స్మార్ట్ గ్లాసెస్తో రికార్డ్ చేస్తున్న విషయం తెలియకపోవడం వల్ల ప్రమాదాన్ని పసిగట్టలేము. స్మార్ట్ గ్లాసెస్ విషయానికి వస్తే, ఉదాహరణకు మెటా ప్రాడక్ట్ రే–బాన్ స్మార్ట్ గ్లాసెస్ను తీసుకుంటే...రికార్డింగ్ చేస్తున్నప్పుడు గ్లాసెస్లోని తెల్లటి చిన్న ఎల్ఈడి ఇండికేటర్ వెలుగుతుంది. ఈ లైట్ ఆధారంగా వీడియో రికార్డింగ్ జరుగుతున్న విషయం తెలుసుకోవచ్చు. అయితే ఈ లైట్ పగటి వెలుగులో, ప్రకాశవంతమైన పరిసరాలలో అంతగా కనిపించదు. కొందరు ఈ లైట్ కనిపించకుండా కూడా మ్యానేజ్ చేస్తున్నారు.కొన్ని గ్లాసెస్కు రికార్డింగ్ ఇండికేటర్ లేకపోవడం వల్ల అక్రమంగా వీడియో తీస్తున్నవారి పని మరింత సులువు అవుతుంది. ముఖ్యంగా తక్కువ ధరల్లో వచ్చే చైనీస్ మోడల్స్లో ఈ ఫీచర్ కనిపించడం లేదు.స్మార్ట్ గ్లాసెస్లోని ఎల్ఈడి లైట్ ఎందుకు వెలుగుతుందనేది చాలామందికి తెలియక పోవడం వల్ల అనుమానం రావడం లేదు. యూఎస్, యూకేలలో ప్రైవసీ చట్టాలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో వీడియోలు తీయడం నేరం కాదు. మనకు తెలియకుండానే కేఫ్, మెట్రోస్టేషన్, పార్క్, ఆలయం సమీపంలో ఎవరైనా వీడియో షూట్ చేసి ఉండవచ్చు. ఆ వీడియోలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి, ఫుటేజి తీసివేయాలని డిమాండ్ చేయడానికి చట్టపరమైన అధికారం లేదు. అయితే ఇతరులు అభ్యంతరం చెప్పినప్పుడు రికార్డింగ్ నిలిపివేయాలని టెక్ కంపెనీలు చెప్పవచ్చు. యూఎస్, యూకేలలోనే కాదు మన దేశంలోనూ స్మార్ట్గ్లాసెస్ దుర్వినియోగానికి సంబంధించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.→ పరిష్కారం లేదా?‘అవగాహన, అప్రమత్తతే సమస్యకు పరిష్కారం’ అంటున్నారు టెక్ నిపుణులు. ‘సందేహంతో ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అనుమానంగా అనిపిస్తే సమాచారం ఇవ్వాలి’ అని కూడా చెబుతున్నారు. కెమెరాలు ఉన్న అన్ని స్మార్ట్గ్లాసులలోనూ స్పష్టమైన లైట్లు, సంకేతాలు ఉండవనే విషయం తెలుసుకోవాలి. డేంజర్ ట్రెండ్!యూఎస్. యూకేలలో స్మార్ట్ గ్లాసెస్ కెమెరాలను ఉపయోగించి మహిళలకు తెలియకుండా వారి వీడియోలు తీసి. వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం అనేది ప్రమాదకరమైన ధోరణిగా మారింది. వీడియో ఫుటేజీని సైకలాజికల్ మేనిప్యులేషన్ కోసం ఉపయోగించే ప్రమాదకరమైన «ధోరణి పెరిగింది.‘నాకు తెలియకుండానే నా వీడియోను చిత్రీకరించి, ఏదో సైట్లో పోస్ట్ చేశారు. ఆ తరువాత నేను పడిన ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. ఎంత దారుణం ఇది!’ అంటూ న్యూయార్క్లో ఉండే కెసీ జనంజని కళ్లనీళ్ల పర్యంతం అయింది. ‘ఈ పని వారు యాదృచ్ఛికంగా, సరదా కోసం చేశారనుకోవడం లేదు. విషపూరిత ఆలోచనలతోనే చేస్తున్నారు’ అంటుంది కెసీ. -
అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే.. జైలే!
వృత్తిరీత్యా నేను చిన్నపిల్లల వైద్యుణ్ణి. ఈ మధ్యన ఫిట్స్ వచ్చాయని ఓ నాలుగు నెలల పాపను తీసుకొని వచ్చారు. కారణాలు ఆరా తీస్తే పాపకు తాటి కల్లు తాగించార ని తెలిసింది. చిన్నపిల్లలకు తాటి కల్లు, ఈత కల్లు లేదా ఎటువంటి మద్యం తాగించినా అది వారికి చాలా ప్రమాదకరం. గతంలో కూడా ఎన్నో కేసులు చూశాను. ఇది నేరం అని కూడా తెలుసు. కానీ నా వద్దకు వచ్చిన పేషెంట్లకు ఎలా చెప్పాలో, చర్యలు ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇలా మద్యం తాగిస్తే పిల్లలకు మంచిదనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. పైగా కల్లు అంటే అసలు మద్యం కాదు కదా అని నాతోనే వాదిస్తున్నారు. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – డాక్టర్ పసునూటి సుమంత్, వరంగల్చిన్నపిల్లల చేత మద్యం తాగించడం ఎంత ప్రమాదమో నిపుణులైన మీరే చెప్పారు. అందుకే, చట్టం కూడా చిన్నారులకు మద్యం ఇవ్వటాన్ని కఠినంగా పరిగణిస్తుంది – శిక్షిస్తుంది. జువనైల్ జస్టిస్ చట్టం (బాలల పరిరక్షణ చట్టం) లోని సెక్షన్ 75 ప్రకారం చిన్నపిల్లలను నిర్లక్ష్యం చేసినా, వారితో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారి మానసిక ఆరోగ్యానికి లేదా శారీరక ఆరోగ్యానికి భంగం కలిగించే ఎటువంటి పనిచేసినా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష – లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది.అంతేకాకుండా సెక్షన్ 77 ప్రకారం: సముచిత అర్హత కలిగిన వైద్యుని ఆదేశం లేకుండా, ఏ వ్యక్తి అయినా పిల్లలకు మత్తు పానీయం/ మాదక ద్రవ్యం/ పొగాకు ఉత్పత్తులు లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని ఇచ్చినా, లేదా ఇప్పించినా, వారికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. ఎన్.డీ.పీ.ఎస్ వంటి చట్టాలలో నిషేధించబడిన మందులు ఇవ్వాలి అంటే కూడా కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది.చదవండి: భార్యకు విడాకులు.. పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వాలా?మత్తుపదార్థాలు ఇవ్వడమే కాదు వాటిని ప్రేరేపించడం కూడా నేరమే! కాబట్టి మీరు మీ వద్దకు వచ్చిన పేషెంట్లను గట్టిగా మందలించాలి. అంతేకాకుండా చిన్న పిల్లలకు ఏదైనా అపాయం ఉంటుంది అనిపిస్తే – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారికి లేదా పోలీసులకి ఫిర్యాదు చేయవచ్చు. ఈమధ్య కొందరు చిన్నపిల్లలకు కల్లు పోయటం, పొగాకు ఇవ్వటం వంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్లందరూ కూడా శిక్షార్హులే! ప్రభుత్వ శాఖ వారు ఇటువంటి అంశాలను చాలా సీరియస్గా తీసుకొని కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటివి ఆగుతాయి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
నీరు రుచి చూసి మార్కులేస్తుంది...
మామూలు నీళ్లు ఎవరైనా తాగుతారు. ఖరీదైన నీళ్లు తాగే వాళ్లనే ‘పెద్దవాళ్లు’ అంటారు. దేశంలో లీటరు 100 నుంచి 1500 వరకూ పలికే మినరల్ వాటర్ బాటిళ్ల వ్యాపారం జోరు మీద ఉంది. సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ప్రీమియం వాటర్ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. దాంతో ‘వాటర్ టేస్టర్ల’ కు గిరాకీ పెరిగింది. నీటి రుచి చూసి మినరల్స్ను అంచనా కట్టడం వీరిని ‘వాటర్ సొమెలియర్’ అంటారు. ఈ నైపుణ్యంతో వాసికెక్కిన 32 ఏళ్ల అవంతి మెహతా (avanti mehta) చెప్తున్న నీటి సంగతులు...‘మన దేశంలో హిమాలయాల చెంత దొరికే నీటిదొక రుచి, ఆరావళి పర్వతాల వద్ద దొరికే నీళ్లదొక రుచి, సెలయేళ్ల నుంచి, కొండ వాగుల నుంచి, రాతి నేలల నుంచి ఇలా ఒక్కోచోట నుంచి సేకరించే నీటిది ఒక్కో రుచి. అంతేకాదు స్థలాన్ని బట్టి మినరల్స్ శాతం మారుతూ ఉంటుంది. పాకేజ్డ్ వాటర్ కూ మినరల్ వాటర్కూ వ్యత్యాసం నీళ్లలోని ఖనిజాల శాతమే తేలుస్తుంది. మన దేశంలో 6000 సంస్థలకు పాకేజ్డ్ వాటర్ లైసెన్స్ ఉంటే కేవలం 30 సంస్థలకు మాత్రమే మినరల్ వాటర్ లైసెన్స్ ఉంది. శుద్ధి చేసిన నీరు పాకేజ్డ్ వాటర్లో ఉంటే రక్షిత పరిసరాలలోని నీటి వనరుల నుంచి సేకరించిన నీరు మినరల్ వాటర్ బాటిల్స్లో ఉంటుంది’ అంటుంది అవంతి మెహతా.ఈమె మన దేశంలో ప్రస్తుతం ‘వాటర్ సొమెలియర్’గా (water sommelier) గుర్తింపు పొందుతోంది. వాటర్ సొమెలియర్ అంటే నీటి రుచి నిపుణురాలు. నీళ్లను తాగి ఆ నీటి స్వచ్ఛత, నాణ్యత తెలియచేస్తారు. వైన్ రుచి, టీ రుచికి టేస్టర్స్ ఉండటం తెలిసిందే. కాని నీళ్ల రుచి చూసే ‘వాటర్ సొమెలియర్’లు ఇప్పుడు ఉనికిలోకి వస్తున్నారు.‘నేను ఫ్యాషన్ రంగంలో ఈ–కామర్స్ విభాగంలో పని చేసే దాన్ని. అయితే ‘ఆవా’ అనే మినరల్ వాటర్ బ్రాండ్ మా కుటుంబానికి ఉంది. దేశంలో బాటిల్డ్ వాటర్కు పెరుగుతున్న గిరాకీని గమనించాక మా సొంత బిజినెస్లోకి రావాలని అనుకున్నాను. దేశంలో 70 శాతం నీళ్లు కలుషితంగా ఉన్నాయని ప్రజలు భావించే స్థితి వచ్చింది. మున్సిపల్ ట్యాప్స్ నుంచి వచ్చే నీళ్లను ఎవరూ నమ్మడం లేదు. అందుకే బాటిల్డ్ వాటర్ వ్యాపారం పెరిగింది. అయితే పాకేజ్డ్ వాటర్నే మనదేశంలో మినరల్ వాటర్ అనుకుంటూ ఉంటారు. రెండూ వేరు వేరు. అంతెందుకు ఫిల్టర్డ్ వాటర్కూ, ప్యూరిఫై చేసిన వాటర్కూ తేడా ఉంటుంది. నేచురల్ మినరల్ వాటరంటే సహజసిద్ధంగా సేకరించిందని అర్థం. ఇవన్నీ కూడా వాటర్ సొమెలియర్ కోర్సులో మాకు నేర్పుతారు. ప్రస్తుతం ప్రపంచంలో సౌత్ కొరియాలో, ఇటలీలో వాటర్ సొమెలియర్ కోర్సులు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. నేను ఇటలీలో కోర్సు చేసి సర్టిఫికెట్ పొందాను. ఈ కోర్సులో నీటి మూలాలు, నీటి సైకిల్స్, నీటి పరిరక్షణ, వాటిలోని పోషకాల గుర్తింపు ఇవన్నీ నేర్పుతారు’ అని తెలిపింది అవంతి మెహతా.‘మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. అయినా చాలామంది ఏం తింటున్నామన్న దాని మీద తప్ప ఏం తాగుతున్నాం అనే దాని మీద శ్రద్ధ పెట్టరు. చైనా, అమెరికాలో పాకేజ్డ్ నీటి వ్యాపారం ఒకో దేశంలో 3000 కోట్లకు చేరిందంటే కారణం సరైన నీరు తాగాలనే చైతన్యం వల్లనే. సహజ ఖనిజాలు ఉన్న నీరు శరీరాన్ని తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మన దేశంలో ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మంచి నీటి బ్రాండ్లు ప్రీమియమ్ బాటిల్డ్ వాటర్ను అమ్ముతున్నాయి. మా ‘ఆవా’ కూడా ప్రీమియమ్ బ్రాండే. మన దేశంలో కొన్ని కొండవాగుల, ఇసుక పాయల నుంచి సేకరించే నీటికి డిమాండ్ ఉంది. మంచు ఫలకాల నుంచి సేకరించే నీటిని ‘వింటేజ్ వాటర్’ అంటారు– ఆ ఫలకాల వయసును బట్టి. కొన్ని మినరల్ వాటర్స్ను కొన్ని రకాల ఆహారాలకు పెయిర్ చేస్తూ రెస్టరెంట్లు ఫుడ్ బిజినెస్ చేస్తున్నాయి. వెల్నెస్ క్రేజ్ పెరగడం వల్ల ఖరీదైనా సరే మంచిగా ఉన్న నీళ్లు తాగాలని చూస్తున్నారు’ అందామె.‘నీటి వ్యాపారం సాగుతున్న ఈ కాలంలో నా ప్రయత్నమంతా సహజ నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పడమే. కలుషితాలు చేరకుండా చూస్తే స్థానిక చెరువులు, కుంటల్లోని స్వచ్ఛమైన నీరు గొప్ప శక్తిదాయినిగా మారుతుంది. నీరే భవిష్యత్తులో ఏ దేశానికైనా ఐశ్వర్యం కాగలదు’ అని ముగించింది అవంతి మెహతా. చదవండి: అవాంఛిత రోమాలు.. కారణాలు, పరిష్కారాలు -
ఓ వైపు రీల్స్ చేస్తూ.. మరోవైపు చిల్..
హైదరాబాద్ నగరం మరోసారి తన ట్రెండ్ సెట్టర్ హోదాను నిరూపిస్తోంది. ఒకప్పుడు చార్మినార్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలకే పరిమితమైన ఈ గుర్తింపు, ఇప్పుడు రీల్స్, రిహార్సల్స్ కల్చర్, సోషల్ మీడియా లైఫ్స్టైల్ ద్వారా కొత్త మలుపు తిరుగుతోంది. 2026 ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, లక్షల్లో వ్యూయర్స్, లైకులతో హైదరాబాద్ను డిజిటల్ హబ్గా మార్చుతున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది..! నేటి యువత జీవనశైలిలో భారీ మార్పు కనిపిస్తోంది. రీల్స్ ట్రెండ్ (Reels Trend) అనే కల్చర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. విస్తృత స్థాయిలో వేదికలను ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుతోంది. వీళ్లందరికీ నగరం అంటే ఓ లొకేషన్ కాదు, ఒక అనుభూతి, ఒక స్టోరీ, ఒక షేర్ చేయదగిన క్షణం..నగరం దీనికి అనుగుణంగా మారుతూ.. వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు టీ హబ్ నుంచి నీలోఫర్, దుర్గం చెరువు వరకు నగరంలోని ప్రతి ప్రాంతమూ ఒక రీల్ స్పాట్ నుంచి రియల్ హబ్గా మారుస్తోంది. ఇక్కడికి వచ్చే యువత ప్రతి రీల్నీ ఒక లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా భావిస్తున్నారు.రీల్స్కు కొత్త అడ్రస్.. జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు కేఫ్లు, లగ్జరీ రెస్టారెంట్లు, సెలబ్రిటీ నివాసాలు అనే గుర్తింపు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారింది. స్ట్రీట్ లైఫ్, నేచురల్ లైటింగ్, మోడర్న్ ఆర్కిటెక్చర్, మినిమల్ వైబ్స్.. ఇవన్నీ కలగలిసిన స్పాట్స్ యువతను ఓ సరికొత్త ప్రపంచం వైపు లాగుతున్నాయి. రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్స్ దగ్గర నుంచి, డిజైన్ ఉన్న భవనాల వరకు ప్రతి మూల ఒక రీల్ ఫ్రేమ్లా మారుతోంది. ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళ, సాఫ్ట్ సన్లైట్తో జూబ్లీహిల్స్ రోడ్లు ఆర్గానిక్ రీల్స్కి పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్గా మారుతున్నాయి.కార్పొరేట్ నుంచి క్రియేటివ్ వైపు..ఐటీ ఉద్యోగాలతోనే గుర్తింపు పొందిన హైటెక్ సిటీ, ఇప్పుడు మరో అవతారం ఎత్తుతోంది. గ్లాస్ బిల్డింగ్స్, స్కై వాక్స్, మెట్రో పిల్లర్స్, అర్బన్ మోషన్.. ఇవన్నీ కలిపి ఫ్యూచరిస్టిక్ రీల్స్కు సరైన స్పేస్గా మారాయి. ఉద్యోగ సమయం తర్వాత, బ్యాగ్ పక్కన పెట్టి, ఫోన్ చేతిలో పట్టుకుని యువత రీల్స్ చేయడం ఇక్కడ సాధారణ విషయం. ‘ఆఫీస్ అయిపోయాక రీల్స్ తప్పనిసరి’ అన్నట్టుగా మారింది ఈ తరం లైఫ్ స్టైల్.టీ హబ్ టు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్..టీ హబ్ అంటే కేవలం స్టార్టప్లకే పరిమితం కాదు. ఇది ఒక సోషల్ స్టేట్మెంట్ స్పాట్గా మారుతోంది. ఇక్కడ రీల్స్ అంటే డ్యాన్స్ కాదు వాక్ అండ్ టాక్ రీల్స్, మోటివేషనల్ వాయిస్ ఓవర్స్, డే ఇన్ మై లైఫ్, హైదరాబాద్ గ్రోత్ స్టోరీస్ వంటి వైవిధ్యమైన కంటెంట్కు కేంద్రంగా మారుతోంది. నగర యువత కేవలం వ్యూస్ కోసం కాదు, తమ ఆలోచనల్ని కూడా రీల్స్లో చూపిస్తోంది.రుచికి రీచ్.. నీలోఫర్ కేఫ్.. 2026లో నీలోఫర్ కేఫ్ మరోసారి వైరల్ అవుతోంది.. అయితే ఈసారి లైఫ్ స్టైల్ రీల్స్ వల్ల అనే విషయాన్ని తప్పక గ్రహించాలి. చాయ్ గ్లాస్, ఇరానీ చాయ్ ఆవిరి, రాత్రి పూట జిగేల్మనే లైట్స్, జనాల హడావుడి.. ఇవన్నీ కలిసి ఒక ఎమోషనల్ హైదరాబాద్ వైబ్ సృష్టిస్తున్నాయి. ఇక్కడ తీసిన రీల్ అంటే, అది కేవలం వీడియో కాదు.. నగరంతో కనెక్ట్ అయ్యే అనుభూతి.అర్బన్ నేచర్ హాట్స్పాట్.. దుర్గం చెరువు ఫ్లైఓవర్, లేక్ వ్యూ, నైట్ లైట్స్.. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫ్రేమ్స్. నేచర్ ప్లస్ సిటీ ఈక్వల్స్ టు రీల్ అండ్ రియల్ మ్యాజిక్.. ఇక్కడ సన్సెట్ టైమ్లో తీసిన రీల్స్ లక్షల్లో వ్యూస్, లైక్స్ అందుకుంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad) అందాలను, పర్యాటకాన్ని మరో కోణంలో ప్రపంచానికి చాటిచెప్పే మాధ్యమాలుగా ఇన్స్టా, ఫేస్బుక్ వంటివి నిలుస్తున్నాయన్నది వాస్తవం.నగరంలో బెంగళూరియన్స్ రీల్స్? ఇది ఆశ్చర్యంగా అనిపించినా నమ్మదగిన వాస్తవం. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం, బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ నగరంలోని ప్రముఖ స్పాట్స్లో రీల్స్ (Reels) షూట్ చేస్తున్నారు. తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, క్లీనర్ బ్యాక్డ్రాప్స్, నాచురల్ లైటింగ్, కల్చర్ ప్లస్ మోడర్నిటీ మిక్స్.. వంటివి దీనికి కారణమని స్పష్టమవుతోంది. ఈ కారణంగా హైదరాబాద్ సౌత్ ఇండియాలో కొత్త రీల్ క్యాపిటల్గా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.చదవండి: అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి: నటి ఊర్మిళ -
అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి..!: నటి ఊర్మిళ
ముంబై భామ ఊర్మిళ మాతోండ్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్, టాలీవుడ్లో తనదైన అభినయం, అందంతో విమర్శకులు ప్రశంలందుకున్న ప్రముఖ నటిగా పేరుతెచ్చుకున్నారు. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోనివిధంగా గ్లామరస్గా కనిపిస్తుంటారామె. నాజుకైన దేహంతో పదహారణాల అమ్మాయిల కనిపిస్తుంటుంది. ఇవాళ ఫిబ్రవరి 4తో 52వ పుట్టిరోజులోకి అడుగుపెడుతున్న అలనాటి ముద్దుగుమ్మ ఈతరం యువతరానికి హెల్దీగా ఉండటంపై సలహాలు సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దామా..!.ముఖ్యంగా 2008లో సైజ్ జీరో ఫ్యాషన్ క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. ఆ టైంలో యువత ఆ ట్రెండ్తో ఉర్రూతలూగుతున్నప్పుడూ కూడా నటి ఊర్మిళ యువతకు చాలా చక్కటి పిలుపునిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజుకైన శరీరం కంటే..ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఆలోచింపచేసేలా మాట్లాడారామె. 50 ప్లస్లో కూడా ఇంతలా స్లిమ్గా బాడీ మెయింటైన్ చేస్తున్న ఊర్మిళ యువతకు ఇస్తున్న సలహా ఏంటేంటే..ఆరోగ్యం పట్ల తానెప్పుడూ ట్రెండీ పోకడల జోలికి పోనంటున్నారామె. మన పూర్వీకులు ఫాలో అయ్యే ఆరోగ్యకరమైన అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారామె. క్రాష్ డైట్లంటూ పొట్ట మాడ్చుకోనని కూడా చెప్పారు. దయచేసి యువత ట్రెండీ డైట్లు, షార్ట్కట్లో బరువు తగ్గే విధానాల జోలికిపోయి..ఆరోగ్యాన్ని చేజేతులారా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో వెయిట్లాస్ అవ్వడం ఓ ట్రెండీగా మారింది. ముఖ్యంగా స్లిమ్గా ఉంటేనే మనుషులు అనేలా పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఆరోగ్యంగా ఉండటమే అన్నింట్లకంటే ముఖ్యమని నొక్కి చెప్పారు. నాజుకైన శరీరం కోసం..తాన నాజుకైన శరీరం కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తానే తప్ప ఆహారం మానేయడం వల్ల కాదని అన్నారు. క్రాష్ డైట్ల జోలికి పోనని కూడా అన్నారామె. దేవుడు తనకు ఇచ్చిన మంచి జీన్స్ విషయమై సదా కృతజ్ఞతలు చెబుతుంటానని అన్నారు. యువత ఎక్కువగా ఉపవాస డైట్లు పాటిస్తూ..శరీరాన్ని పాడుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారామె. దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం ఆస్వాదిస్తూ..వ్యాయామాలు చేయండి చాలు అని పిలుపునిచ్చారామె. ఫిట్నెస్ సీక్రెట్..చాలామంది సెలబ్రిటీలు తమ ఫిట్నెస్కి విదేశీ సూపర్ ఫుడ్స్కి క్రెడిట్ ఇస్తే..సాంప్రదాయ భారతీయ వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారామె. తన మెరుగైన జీవక్రియకు, శక్తికి అవే మహారాష్ట్ర సంప్రదాయ ఆహారమేనని నొక్కి చెబుతారామె. ఫిట్గా ఉండాలంటే..పోషకాహారం, ఇంట్లో వండిన వంట్లకే కట్టుబడి ఉండటం అని చెబుతున్నారు. తాను ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలా స్లిమ్గా ఉన్నానని నమ్మకంగా చెప్పారామె. కాబట్టి..ఇంకెందుకు ఆలస్యం హాయిగా నచ్చిన పోషకాహారం తింటూ..వర్కౌట్లు చేస్తూ హెల్దీగా ఉందాం మరి..!.(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!) -
మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!
"పెళ్లి" అంటే నూరేళ్ల పంట..ఎన్నో జన్మల బంధం అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది అబద్దమా అనిపిస్తుంది. చాలామంది ఆ అనుభవాన్ని గడించిన వివాహిత మహిళలు ఆ పేరు ఎత్తితేనే..హడలిపోతున్నారు.,విముఖత చూపిస్తున్నారు. సరదాకైనా..మళ్లీ వయసు వెనక్కి వెళ్లితే.. పెళ్లి చేసుకుంటారా అని మాటవరసకు అడిగితేనే..బాబోయ్ అన్నట్లుగా ఇస్తున్న సమాధానాల తీరు చూస్తే..పెళ్లీడుకి వచ్చిన వాళ్లు సైతం చేసుకోవాలా? వద్దా? అనేలా ఉన్నాయి వారి మాటలు. బాలీవుడ్ నటి, ట్రావెల్ వ్లాగర్ షెహనాజ్ తన పర్యాటక అనుభవాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంటారామె. కంటెంట్ క్రియేటర్గా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంటారామె. అలానే ఈసారి పెళ్లై ఎన్నో వసంతాలు గడిచిపోయినా.. వృద్ద మహిళలను ఆటపట్టించే కొంటే ప్రశ్నతో పలకరించారు. అయితే వాళ్లందరి సమాధానాలు చూసి షెహనాజ్ విస్తుపోయింది. ఇంతకీ ఆ వివాహిత వృద్ధ మహిళను ఆమె ఏం అడిగారంటే..ఈ రోజు గనుక మీ ఏజ్ వెనక్కి వచ్చి..20 ఏళ్లు అయితే "మళ్లీ పెళ్లి చేసుకుంటారా"? అని ప్రశ్నించింది. అందుకు ఒకరేమో..ఒక్కసారి చాలు..ఇంకోసారి అస్సలు వద్దు అని చెప్పగా, మరొకరు పైళ్లిపై అంతగా ఆసక్తి లేదని, అది బానిసత్వానికి మరోపేరు అని తేల్చి చెప్పేశారు. ఇంకొందరు..మంచి పాఠం నేర్చుకోవాలంటే తప్పకుండా పెళ్లిచేసుకోవాలని అన్నారు. దానికి షెహనాజ్ ఏ పాఠం అని కుతుహలంగా ప్రశ్నించగా..అచ్చం కభీ ఖుషీ కభీ గమ్ మూవీలా కొన్ని సార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం అని చెప్పారు. చాలామటుకు పెళ్లిని అదొక సర్దుబాటుగా అభివర్ణించారు. ఒకరు మాత్రం ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే..జీవితంపై పూర్తి అవగాహన ఉంటుందని అన్నారామె. అయితే ఆ సీనియర్ మహిళలంతా పెళ్లిపై అలా ఎందుకు చెప్పారంటే..వాళ్ల కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయకుండా గృహిణులుగా జీవితం గడిపామని, ఇంట్లో చాలా బాధ్యతలు ఉండేవని చెప్పడం విశేషం. ఆ సమాధానాలన్ని విని షెహనాజ్ చమత్కారంగా అందుకే తాను పెళ్లిచేసుకోలేదని అంది. వెంటనే అక్కడున్న మహిళ నవ్వుతూ..ఆ..! అది సరైన నిర్ణయం అని సమర్థించడం విశేషం.(చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
స్క్రీన్ టైమ్: సరికొత్త నిర్వచనంలో ‘జెన్ జీ’
నేటి తరం తల్లిదండ్రులుగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ‘జెన్ జీ’లు తమ పిల్లల పెంపకంలో పాతకాలపు పద్ధతులను పక్కన పెడుతూ, సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా మధ్య పెరిగిన ఈ తరానికి డిజిటల్ ప్రపంచంపై పూర్తి అవగాహన ఉంది. అందుకే వీరు స్క్రీన్ టైమ్ను ఒక అడ్డంకిగా భావించకుండా, దానిని ఉపయుక్తమైన పనిగా చెబుతున్నారు.పిల్లల ప్రారంభ దశ అభివృద్ధిలో డిజిటల్ ఎక్స్పోజర్,స్వీయ అనుభవాలు పరస్పర విరుద్ధమైనవి కావని, అవి ఒకదానికొకటి తోడ్పడతాయని ‘జెన్ జీ’ పేరెంట్స్ చెబుతున్నారు. ఆధునిక పేరెంటింగ్ను తమదైన శైలిలో తిరగరాస్తున్నారు. గత తరాల వారు స్క్రీన్ టైమ్ అంటే ఆందోళన చెందుతారు. అయితే సాంకేతికతను, సృజనాత్మకతను స్క్రీన్పై చూసిన జెన్ జీ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ చర్చను ‘ఎంత సమయం?’ అనేలా కాకుండా ‘ఏం చూస్తున్నారు’ అనే దిశగా మళ్లించారు. గంటల లెక్క కాకుండా, పిల్లలు చూసే కంటెంట్ నాణ్యత, వారి ఉద్దేశ్యం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారు.‘జెన్ జీ’ పేరెంట్స్కు డిజిటల్ అలసట (Digital Fatigue)పై అవగాహన ఉండటంతో స్క్రీన్ వినియోగాన్ని మరింత విజ్ఞతతో కూడిన పద్ధతిలో పిల్లలు ఉపయోగించేలా పర్యవేక్షిస్తున్నారు. డిజిటల్ ప్రపంచంతో అనుసంధానమై ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని గుర్తించిన జెన్ జీ తల్లిదండ్రులు, ఆఫ్లైన్ కార్యకలాపాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బొమ్మలు గీయడం, నిర్మాణ నమూనాలు రూపొందించడం (Building Blocks), ఆరుబయట ఆడుకోవడం మొదలైనవాటి ద్వారా పిల్లల్లో భావోద్వేగ వికాసం మెరుగుపడుతుందని ‘జెన్ జీ’ పేరెంట్స్ నమ్ముతున్నారు.అటు డిజిటల్ పరిజ్ఞానం, ఇటు శారీరక శ్రమ.. ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటించడం ద్వారా పిల్లల ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని పెంపొందించవచ్చని ఈ తరం భావిస్తోంది. కాగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారుతున్న నేపథ్యంలో పాఠశాలలు కూడా తమ విద్యాబోధనలో మార్పులు చేస్తున్నాయి. తరగతి గదుల్లో కేవలం డిజిటల్ పరికరాలకే పరిమితం కాకుండా, విద్యార్థులు ప్రశ్నించేలా, సహచరులతో కలిసి మెలిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈ నయాగరాకు ఏమైంది? -
ముగియనున్న మూడు నెలల మూఢం
శ్రీకాకుళం కల్చరల్/శ్రీకాకుళం: మూడు నెలల విరామం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో మళ్లీ వివాహాల సందడి మొదలైంది. గత ఏడాది నవంబరు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకు మూఢాలు కావడంతో చాలామంది వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. మాఘ మాసం వివాహాలకు మంచిదైనప్పటికీ మూఢం కారణంగా ఫిబ్రవరి 18 వరకు సరైన ముహుర్తాలు లేకుండాపోయాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 19 నుంచి ఫాల్గుణ మాసం మొదలు కావడంతో వివాహాలకు సిద్ధమవుతున్నారు. అంతటా బిజీబిజీ.. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది అపురూప ఘట్టం. వివాహ మధురానుభూతులను జీవితాంతం గుర్తుగా దాచుకోవాలనుకుంటారు. పెళ్లి ముహూర్తాలు మొదలుకావడంతో వివాహ సంబంధిత వ్యాపారాలైన భాజాభజంత్రీలు, డెకరేషన్ నిర్వాహకులు, కర్పూర దండల షాపులు, లైటింగ్, మైక్సెట్ నిర్వాహకులు, వస్త్ర వ్యాపారులు, బంగారం షాపుల వద్ద హడావిడి బాగా పెరిగింది. పెళ్లి మండపాలకు డిమాండు బాగానే ఉంది. ఇక, ముహుర్తాల కోసం జాతకాలు తీసుకొచ్చే వారితో జ్యోతిషాలయాల కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. భోజనాల్లో తగ్గేదేలే.. వివాహ వేడుకల్లో భోజనాలదీ కీలక ఘట్టమే. దీనికోసం జిల్లాలో అనేక కేటరింగ్ సరీ్వసులు సిద్ధంగా ఉన్నాయి. వడ్డించే ఐటెమ్స్ బట్టి ధరలు ఉన్నాయి. ప్లేట్ రూ.150 నుంచి రూ.1000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొందరు దూరప్రాంతాలైన విశాఖ, విజయవాడ, రాజమండ్రిల నుంచి సైతం కేటరింగ్ సర్వీసులను రప్పిస్తున్నారు. 19 నుంచి శుభముహూర్తాలు గత ఏడాది నవంబరు నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండడంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి శుభముహుర్తాలు మొదలు కానున్నాయి. చాలా మంది వివాహాలకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, పంచాంగకర్త మంచి ముహూర్తాలివే.. ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనుట్లు పంచాంగకర్తలు చెపుతున్నారు. ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 మార్చి : 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 ఏప్రిల్: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30 మే: 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 జూన్: 19, 20, 21, 24, 25, 26, 27, 28, జూలై: 1, 2, 3, 4, 5, 8, 9 ఆగస్టు: 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబరు : 1, 3, 4, 5 , అక్టోబరు : 11, 14, 29, 30 నవంబరు: 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 ,డిసెంబరు : 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31అభిరుచికి తగ్గట్టు.. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా పెల్లి మండపాన్ని అలంకరిస్తుంటారు. కొందరు ప్లాస్టిక్ పూలతో సరిపెట్టుకోగా, మరికొంత మంది నిజమైన పూలతో మండపం సిద్ధం చేయమంటారు. వారి కోసం బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి సైతం పూలు, ఇతర సామగ్రి తెస్తుంటాం. – గోపి, క్లాత్ డెకరేషన్, శ్రీకాకుళం ముహూర్తాలు మళ్లీ మొదలుఏడాదిలో ఎన్ని పెళ్లి ముహుర్తాలు ఉంటే అంత ఆదాయం. ఈ ఏడాది మూడునెలలు మూఢాల వల్ల వివాహాది శుభకార్యాలు చాలా వరకు వాయిదాపడ్డాయి. మళ్లీ ముహుర్తాలు మొదలు కావడంతో వివాహాలు జరుపుకునేందుకు మా వద్దకు వస్తున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు -
చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు..
పర్యాటన అనగానే..చాలామంది స్కైడైవింగ్, జలపాతాలు, ప్రకృతి అందాల కోసం అన్వేషిస్తుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతతను అందించే ధ్యానానికి సంబంధిన పర్యాట ప్రదేశాలను వెతుకుతారు. ఇంకొందరు ఆరోగ్యం కోసమే..సేద తీరే థెరపీలందించే స్పాల కోసం సర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక స్పాలు. ఇంతవరకు చూడని, అనుభవం పొందని వెరైటీ స్పాలు. ఇవి బాడీకి విశ్రాంతినిచ్చే థెరపీల్లాంటి స్పాలు. ముఖ్యంగా చలికాలంలో సందర్శనకు బెస్ట్ స్పాలుగా పేర్కొనవచ్చు. ఎక్కడున్నాయంటే..అలాంటి ప్రత్యేక స్పాల కోసం చైనాలోని హార్బిన్ నగరంలోకి వాలిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ప్రతి స్పా ఓ అద్భుతం. ఇలాంటి విచిత్రమైనవి ఎక్కడ ఉండవేమో అన్నంతగా ఆకర్షణగా ఉంటాయి ఈ స్పాలు. ఘాటెక్కించే స్పా చిల్లీ పెప్పర్స్ స్పా. మొత్తం ఎర్రటి పచ్చిమిర్చితో ఉండే పూల్ చూసి నోటమాటరాదు. ఓర్నీ ఇందులో స్నానం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇది ఒకరకమైన బాడీ చికిత్స కోసమేనట. ముఖ్యంగా చలికాలంలో వేడి మిరపకాయలతో కూడిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలగడటమేగాక చురుగ్గా ఉండేలా చేస్తుందని నమ్ముతారట అక్కడి చైనా ప్రజలు. అక్కడ ఆ పూల్లోని ఎర్రటి మిరపకాయలు, ఇతర ఘాటైన పదార్థాలతో ఎర్రగా ఉంటుందట నీరు. దీంతోపాటు ప్రత్యేకమైన ఫిష్ స్పా కూడా ఉంది. ఇందులోని చిన్న చేపలు పాదాలకు పెడిక్యూర్ చేస్తాయి. దీంతోపాటు కొన్ని బహిరంగా హాట్ టబ్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలో మంచు మద్య సహజంగా ఏర్పడిన ఆర్కిటిక్ స్పా ఒకటి ఉంది. ఇది 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. అంతేగాదు ఈ ప్రదేశం ఐస్ పెస్టివెల్కి నిలయం కూడా. ఈ స్పాలన్నీ పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని, విశ్రాంతి తోపాటు బాడీకి ఒకవిధమైన చికిత్సను అందిస్తాయి. View this post on Instagram A post shared by Jordan Egbert (@counting.countries) (చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..
డబ్బుంటేనే సాయం కాదు..మంచి మనసు ఉంటే ఎలాగైనా సాయం అందించొచ్చు అని నిరూపిస్తున్నాడు ఈ 24 ఏళ్ల స్విగ్గీ డెలివరీ బాయ్. అతడి చేసేది చాలాకష్టమైన పని. పైగా అది సేవ రంగానికి చెందింది. అందులో వచ్చే సంపాదన అతడి కుటుంబ బాధ్యతలకు అక్కరకు రావు. అయినా..అందులో సగం పేదల కోసం ఖర్చు చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. సాధారణ ఆదాయమే అయినా..ఇంత సేవాతత్పరత..! అని అందరూ విస్తుపోతున్నారు. ఇంతకీ ఎవరా యువకుడు అంటే.. అతడే ఢిల్లీకి చెందిన యువకుడు ఆకాశ్ సరోజ్. అతడి ఉదారతకు హద్దులు లేవు. స్విగ్గీ డెలివరి బాయ్గా పనిచేస్తూ..వచ్చే ఆదాయంలో సగం జీతం పేదల కోసం ఖర్చుపెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అలాగని మనోడుకి ఏమి బాధ్యతలు లేవా అంటే..కుటుంబాన్ని పోషించుకోవాలి, వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆకాశ్దే. అయినప్పటకీ..సంపాదనలో 50% పేద ప్రజల కోసం ఉపయోగిస్తూ అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు. View this post on Instagram A post shared by Aakash Saroj (@imaakashsaroj)డెలివరీ బాయ్గా ఎంతలా కష్టపడితే డబ్బులు వస్తాయో తెలిసిందే. కానీ ఈ యువకుడు..రిక్షా కార్మికుడు నుంచి వీధిల్లో బిచ్చమెత్తుకునే అభాగ్యులు వరకు.. తనకెదురైనా ప్రతి వ్యక్తికి తన ఆదాయంలో ఎంతో కొంత ఖర్చు చేసి మరి సాయం చేస్తాడు. ఎందుకింత ప్రయాస అని ఆకాశ్ని ఎవరైనా ప్రశ్నిస్తే..ఇది తన తండ్రి కల అని, తాను ఒక కొడుకుగా..మంచి వ్యక్తిగా ఉండాలన్నదే అతడి కోరిక అని చెబుతుంటాడు. మరో వీడియోలో కుక్కలకు, పిల్లులకు ఆహారం పెడుతూ కనిపిస్తుంటాడు. పైగా ఇది తన బాధ్యత అని పోస్టులో పేర్కొంటూ..వీడియోకి "ఎక్కవ ఆశీర్వాదాలు సంపాదించు..నీకు మించిన ధనవంతుడు లేడు". అనే క్యాప్షన్ పెట్టడం విశేషం. ఇక్కడ ఆకాశ్ పేదలకు సాయం చేస్తున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ వాటికి ఇచ్చే క్యాప్షన్లు కూడా నెజన్లను అత్యంత ఆకట్టుకుంటాయి, ఆలోచింపచేసేలా ఉంటాయి కూడా. View this post on Instagram A post shared by Aakash Saroj (@imaakashsaroj) (చదవండి: వెయిట్లాస్ డ్రగ్ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత) -
వెయిట్లాస్ డ్రగ్ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత
సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ప్రముఖులు బరువు తగ్గేందుకు వెయిట్లాస్ డ్రగ్స్ లేదా సర్జరీలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి..అక్కడ వారి ఆహార్యం, లుక్ అత్యంత ప్రధానం. అదీగాక నిధానంగా బరువు తగ్గాలనేంత వ్వవధి వారికి ఉండదు కూడా కానీ ఈ అమెరికన్ రాపర్, గాయకుడు అలా కాదు..తొందరగా బరువు తగ్గించే మందులు జోలికే పోకుండా..ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గాడు. అదీకూడా ఏకంగా 90 కిలోలు పైనే బరువు తగ్గడం విశేషం. ఎంతో ఓపికతో..ఫుడ్ ఎడిక్షన్ని దూరం చేసుకుని మరి..స్లిమ్గా మారి స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడి వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..పాటల రచయిత, గాయకుడు జెల్లీ 2026 గ్రామీ అవార్డుల ప్రెస్ ఈవెంట్లో స్మార్ట్లుక్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు అక్కడ మీడియా ఇంటర్వ్యూలో తాను ఇంతలా స్లిమ్గా మారేందుకు తన ఫుడ్ ఎడిక్షన్పై ఎంతలా పోరాటం చేశాడో బహిరంగా వెల్లడించారు. తన కొకైన్ అడిక్షన్ని దూరం చేసుకున్నట్లుగానే ఈ ఆహార వ్యసనానికి చెక్కుపెట్టగలిగానని అన్నారు. అలాగే తన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకున్నట్లు తెలిపారు.ఆహార వ్యసనానికి చెక్పెట్టడం అంటే..తినాలనే ఆలోచనను రానివ్వకుండా చేయడమేని అంటున్నాడు. అలాగే జీవనశైలిలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడం వల్ల ఈ మార్పులు సాధ్యమైనట్లు షేర్ చేసుకున్నారు. ఇంతకుమునుపు తన టూర్లన్నీ పార్టీలు, డ్రింక్, మత్తుపదార్థాల చుట్టూ తిరిగేది. ఇప్పుడు తన టూర్ సంస్కృతి మంచి ఆహారం, వ్యాయామం, భావోద్వేగ పరంగా బలంగా ఉండటం చుట్టూ ఉందని ఆనందంగా చెబుతున్నాడు జెల్లీ.బరువు తగ్గడంలో ఆ రెండే కీలకం..జెల్లీ రోల్ బరువు తగ్గించే ప్రయాణంలో నడక, పరుగు చాలా కీలకమైన ప్రభావాన్ని చూపించినట్లు పేర్కొన్నాడు. తాను 5కే రన్ కోసం శిక్షణ పొందుతున్నప్పుడు..చాలా బరువు తగ్గినట్లు పేర్కొన్నాడు. అలాగే 2024లో ఓ రన్ ఈవెంట్ కోసం సిద్దమయ్యే నేపథ్యంలో రోజుకి రెండు నుంచి మూడు మైళ్లు చోప్పున వారానికి నాలుగు నుంచి ఆరు రోజులు పరిగెత్తేవాడట. ఇలా బరువు తగ్గడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని..అందువల్ల మరింత బరువు తగ్గేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు వివరించాడు. పైగా తేలిగ్గా ఉండి, ఏ టూర్ అయినా ఇట్టే వెళ్లిపోగలం, హాయిగా ఎంజాయ్ చేయగలం అని అంటున్నాడు. View this post on Instagram A post shared by GRAMMYS (@grammys) (చదవండి: తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!? కానీ ఆ ఏజ్కి..) -
క్యాన్సర్ చికిత్స.. వయొలెంట్ కణంపై సైలెంట్ రణం!
ఇప్పటికే క్యాన్సర్ చికిత్సారంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఇక కృత్రిమ మేధ (ఏఐ)ను కనుగొన్న తర్వాత వచ్చిన, వస్తున్న పురోగతులు చెప్పడానికీ, వినడానికీ, చదవడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి. ఇది ‘సైన్స్ ఫిక్షన్ కాదు... మెడిసిన్’ అని అనుక్షణం నిరూపితమవుతోంది. ఈ ఏడాది క్యాన్సర్ డే థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’! ఈ నినాదం అర్థమేమిటంటే... ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ (యునైటెడ్గా) చికిత్స అందేలా చేస్తూనే... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా... వ్యక్తిగతంగా నిర్దిష్టమైన (యూనిక్) చికిత్స అందేలా చూడటం. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’.ఈ సందర్భంగా ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం...ఒక చిన్న అంశాన్ని ఊహించండి... మన దేహమంతా ఓ నగరం అనుకోండి. అప్పుడు మన ఒంట్లోని ప్రతి కణమూ ఒక ఇల్లవుతుంది. అప్పుడు మన ఇంట్లోని జన్యువు (జీన్) స్విచ్ అనుకుందాం...బాగా పనిచేసే ఆ ‘స్విచ్చు’ ఆన్ చేసినప్పుడల్లా ‘లైట్’ వెలుగుతుంది. అది నార్మల్ పెరుగుదలకు సంకేతం! ∙కొన్నిసార్లు వాటిని ఆన్ చేసినప్పుడు అలారం మోగుతుంది. అంటే రిపేర్లు అవసరమనే సూచన. ∙కొన్ని స్విచ్చులు అవసరాన్ని బట్టి పోలీస్ను పిలుస్తాయి. అది కణం మరణం!ఈ పోలికలతో చెప్పాలంటే... క్యాన్సర్ ఎప్పుడు పుడుతుందంటే...?⇒ కొన్ని స్విచ్చులు అలా ఆన్ అయ్యాక ‘స్ట్రక్’ అయిపోయి... ఆఫ్ కాకుండా ఇరుక్కుపోయినప్పుడు... అంటే... ఆన్ అయిన ఆ స్విచ్చు అలాగే జామ్ అయిపోతే... లైట్ అలా కంటిన్యువస్గా వెలుగుతూనే ఉంటుంది!... అది అప్రతిహతమైన పెరుగుదల.... ఎంతకూ ఆగకుండా పెరిగే క్యాన్సర్ పెరుగుదల! ∙అలారం మెకానిజం దెబ్బతిని అలారం మోగకుండా పోవడమంటే... కణంలో ఏదో తప్పు జరిగి... అది జరిగిందనే హెచ్చరికలు అందకుండా పోవడం. ⇒ ఇక సెల్ డెత్కు కారణమయ్యే పోలీస్ ఇన్స్పెక్టర్ తన పని మానేసి నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడూ... అంటే నార్మల్ కణం కాస్తా క్యాన్సర్ కణంగా మారినప్పుడు... అది మరో నార్మల్ కణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకూ, పొరుగుదాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి నిశ్శబ్దంగా తనంతట తానే మరణించడం జరగకపోవడం.ఇలా జీన్ అనే స్విచ్చులో ఏవైనా మార్పులు వచ్చి అది ‘జామ్’ అయిపోయిందంటే... అది క్యాన్సర్కు దారితీసినట్టేనని తెలుసుకోవాలి. ఇలా కణాల్లోని ‘పీ–53’ అనే ఓ ్రపోటీన్... ఈ స్విచ్చులన్నింటికీ ఓ (మాలెక్యులార్) ‘మాస్టర్ స్విచ్’గా పనిచేస్తుంది. అంటే ఇది మెయిన్బోర్డు దగ్గర ఉంటుంది. దీన్నే ‘గార్డియన్ ఆఫ్ జీనోమ్’ గానూ చెప్పవచ్చు. అదే అవసరాన్ని బట్టి డీఎన్ఏ రిపేర్లు జరిగేలా చూస్తుంది. అప్పటికీ పని జరగకపోతే ఆ తప్పుడు కణం తనంతట తానే చనిపోయేలా చూస్తుంది. (దీన్నే ‘్రపోగ్రామ్డ్ సెల్ డెత్’ అంటారు). అలా చేయడం ద్వారా మిగతా దేహాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.అంటే ఇంట్లో షార్ట్ సర్క్యుట్ అయితే... దానివల్ల ప్రమాదం జరగకుండా మెయిన్ బోర్డు దగ్గరే ఆఫ్ అయిపోయే మాస్టర్ స్విచ్లా పనిచేస్తుందన్నమాట. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణ తర్వాత క్యాన్సర్ చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కొత్త ఆవిష్కరణలేమిటో... వాటితో వచ్చిన మార్పులేమిటో చూద్దాం. మొదటి ఆవిష్కరణ: ఆలిగో న్యూక్లియటైడ్ థెరపీగతంలో ఒంట్లోని ఏదైనా స్విచ్ చెడిపోయిం దంటే... డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు డాక్టర్గారు తన పరికరాల (కీమోథెరపీ) సహాయంతో ఓ ఎలక్ట్రీషియన్లా లేదా ఓ మేసన్ (మేస్త్రి)లా పనిచేస్తూ చెడిపోయిన స్విచ్ను రిపేరు చేసేవారు. ఆ క్రమంలోనే బోర్డులో మరికొన్ని స్విచ్చులూ మార్చాల్సి వచ్చేది. కానీ ఇప్పటి తాజా ఆవిష్కరణతో... కణం నుంచి అది చెడిపోయినట్లు సిగ్నల్ రాగానే పేషెంటే ఆ చెడిపోయిన కణానికి సందేశాలు పంపుతాడు. ‘‘చెడిపోయినట్లు వస్తున్న ఆ సిగ్నల్స్ను పరిగణనలోకి తీసుకోకు’’ ‘‘నీ సేఫ్టీ రూల్స్కు అనుగుణంగా చెడిపోయిన కణాన్ని రిపేర్ చేయ్యి’’ ‘‘ఇలా చేయడం ద్వారా చెడిపోయిన కణం వరకే పరిమితం అవ్వు. దేహంలోని మిగతా కణాలను చెడగొట్టకు’’... లాంటి సందేశాలను కణానికీ, కణంలోని రిపేర్లు చేసే అంశాలకు పంపడం ద్వారా...దేహంలోని మిగతా కణాలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దాంతో క్యాన్సర్ మిగతా కణాలకు వ్యాపించదు. ఇప్పుడు ఇదెలా జరుగుతుందంటే... మానవ కణాల్లో ‘న్యూక్లియటైడ్స్’ అనే ఇటుకలు (బిల్డింగ్ బ్లాక్స్) ఉంటాయి. అయితే డాక్టర్లు ‘ఆలిగోన్యూక్లియటైడ్స్’ అనే కృత్రిమ ఇటుకలను తయారు చేసి... క్యాన్సర్తో చెడిపోయిన ఇటుకల స్థానంలో వీటిని పెట్టి ఈ రిపేర్లు జరుగుతాయి. ఇంకా మరొక పోలిక చెప్పాలంటే... మనకు ఇష్టం లేనిదీ, ఏదో అశ్లీలమైన ఎస్ఎమ్ఎస్ వచ్చిందంటే... చిరాకు పుట్టి ఫోన్ను విసిరికొట్టి దాన్ని ధ్వంసం చేయడం కంటే... కేవలం ఆ మెసేజ్ వరకే డిలీట్ చేయడం లాంటిదన్నమాట.రెండో ఆవిష్కరణ: కార్టి / ఎన్కే సెల్ థెరపీఅత్యంత కన్నింగ్ మోసగాడు... ఈ క్యాన్సర్ కణం! ఈ నేపథ్యంలో ‘క్యాన్సర్ కణం’ తాలూకు ఓ గుణాన్ని చూద్దాం. క్యాన్సర్ కణమనేది అత్యంత కన్నింగ్ మోసగాడిలాంటిది. వాడెంత కన్నింగ్ అంటే... ఎక్కణ్ణుంచో ఓ ‘ఆర్మీ యూనిఫామ్’ను కొట్టేసి, ఫేక్ ఐడీ కార్డునొకదాన్ని పట్టేసి... తానూ ఓ రక్షణ కణంలా కనిపించేలా మారువేషం వేసుకుని మరీ ఆరోగ్యకరమైన కణాలను ధ్వంసం చేస్తుంటాడు. అయితే ఇప్పటి సరికొత్త ఆవిష్కరణతో వచ్చిన ఈ అత్యంత నూతన, అధునాతన చికిత్స ప్రక్రియలో ఎన్కే అంటే... ‘నేచురల్ కిల్లర్’ అని అర్థం. ఇలా పిలిచే ఆర్మీ కమాండోస్ లాంటి ఈ ‘ఎన్కే సెల్స్ థెరపీ’లో ఏం జరుగుతుందో చూద్దాం. ∙గతంలోని ఆర్మీ కమేండోలు డేంజర్ సిగ్నల్స్ వచ్చేదాకా ఆగేవి. కానీ ఇప్పటి ఎన్కే సెల్స్ మాత్రం ఎవరి ఆదేశాల కోసం ఆగవు. అనుమానం వచ్చిందంటే చాలు ఆ క్యాన్సర్ సెల్ను అప్పటికప్పుడు ధ్వంసం చేసేస్తాయి. ∙⇒ నిశితంగా ఎంచుకుని... నిర్దిష్టంగా కేవలం చెడిపోయిన లేదా క్యాన్సర్ కణంగా మారబోతున్న కణాన్నే తుదముట్టించేస్తాయి. ∙ఇమ్యూనిటీ సెల్స్ అయిన బీ సెల్, టీ సెల్ లా తాను రక్షణ కవచాన్ని అని చెప్పే యూనిఫామ్ వేసుకోవు. సివిల్ డ్రస్లో ఉన్న సోల్జర్లా విరుచుకుపడి క్యాన్సర్ కణాన్ని ముట్టడించేస్తాయి. ఈ క్రమంలో అవి యూనిఫామ్ వేసుకుని మోసం చేసే క్యాన్సర్ కణం కన్నింగ్ వేషాల ట్రాప్లో పడిపోవు. సదరు క్యాన్సర్ కణాల కుయుక్తులనూ ముందే పసిగట్టేసి... వాటిని తుదముట్టిస్తాయి.మూడో ఆవిష్కరణ: యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ (ఏడీసీ) «థెరపీ ఓ పొలంలో చీడ పట్టిందనుకోండి. ఆ చీడపురుగులను అంతం చేయడానికి మొత్తం పొలమంతా మందుకొట్టడం మామూలే. అలాగే ఊళ్లో ఉన్న దోమలను తుదముట్టించడానికి అత్యంత ఘాటుగానూ, ఊపిరి పీల్చుకోడానికే ఇబ్బంది పడేలా సఫకేట్ చేసేసే దోమలమందును ఊరంతా కొట్టడం సాధారణంగా జరిగేదే. తాజా ఆవిష్కరణలతో వచ్చిన చికిత్స ఎలాంటిదంటే... ఇది చాలా ఖచ్చితంగా పనిచేసే కొరియర్ బాయ్ లాంటిది. ఆ ఊళ్లో ఆ వీధి ఎక్కడుందో... ఆ వీధిలో ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కుని... బాగా ΄్యాక్ చేసి ఉన్న ఆ ‘క్యాన్సర్ మందు’ను సరిగ్గా ఆ ఇంట్లోకి డెలివరీ చేసే ఓ కొరియర్ బాయ్లా పనిచేస్తుంది. ఆ ఇంట్లోవాళ్లు ఆ ΄్యాక్ను తెరవగానే మందునంతా చిమ్మేసి క్యాన్సర్ను కమ్మేసి సైలెంట్గా చంపేస్తుంది. అలా పక్కనున్న ఇంటికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతుంది. ఈ తరహా కొత్త ఆవిష్కరణ ఫలితంగా బాధితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. దాంతో మునపటి కీమోథెరపీల్లోని వేదనలూ, వెతల్లా కాకుండా చికిత్సను తేలిగ్గా తట్టుకోగలగడం సాధ్యమవుతుంది.నాలుగో ఆవిష్కరణ: కృత్రిమ మేధ + జీనోమిక్స్ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లస్ జీనోమిక్స్ (జీనోమ్ చికిత్స)... ఈ రెండింటి సమన్వయంతో అందే అత్యంత అధునాతమైన సరికొత్త చికిత్స ప్రక్రియ.ఈ అంశాన్నీ తేలిగ్గా వివరించాలంటే... గతంలో నగరంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగాక ఫైర్ అలారం మోగగానే ఫైర్ బ్రిగేడంతా నిప్పును ఆర్పడానికి ఉపక్రమించేవారు. ఇప్పుడు అలాకాదు.. ⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ సీసీటీవీ లా పనిచేసి... అగ్ని అంటుకునేందుకు అవకాశమున్న చోటిని పసిగట్టినట్టే... క్యాన్సర్ పుట్టే చోటిని ముందే పసిగడుతుంది. ⇒ రక్తం / జెనెటిక్ సిగ్నల్స్... నాయిస్ సెన్సర్ మాదిరిగా పనిచేసి క్యాన్సర్ పుట్టేందుకు అవకాశమున్న ప్రదేశాన్ని ముందే కనిపెట్టేస్తాయి. ∙ఇక్కడ మనుష్యులు ఆ స్వల్పాతి స్వల్పమైన అతి చిన్న తేడాను మిస్ కావచ్చేమోగానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కారణంగా ఆ అతిచిన్న తేడానూ పసిగట్టే వీలుంది.ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే... ⇒ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండి... హై–రిస్క్ ఉన్న కుటుంబాల్లో. ∙చాలాకాలం నుంచి పొగతాగే అలవాటున్న స్మోకర్లలో. ∙మహిళల్లోనే వచ్చే ఉమన్ క్యాన్సర్లను పసిగట్టే విషయంలో. ∙క్యాన్సర్ వచ్చేందుకు అవకాశమున్న జీవనశైలిని అనుసరించేవారిలో లేదా అలాంటి వాతావరణంలో పనిచేసేవారిలో.ఐదో ఆవిష్కరణ: పర్సనలైజ్డ్ థెరపీ (ప్రెసిషన్ ఆంకాలజీ) గతంలో ఎవరైనా బాధితుడిలో ఒక రకం క్యాన్సర్ను కనుగొన్నారంటే... ఆ రకం క్యాన్సర్ వచ్చినవారందరికీ ఇచ్చే మందును లేదా చికిత్స ప్రక్రియను అతడికి కూడా అందించేవారు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సహాయంతో ఇప్పుడు అతడిలో క్యాన్సర్ కణం ప్రవర్తించే పద్ధతిని (బిహేవియరల్ మేనర్ను) బట్టి, అతడి జీవనశైలి ఆధారంగా, అతడి బ్లడ్ మార్కర్స్, అతడి స్కాన్లూ, అతడికే ప్రత్యేకమైన అతడిలోని ‘పీ–53’ ్రపోటీన్... అంటే... అతడి ‘మాలెక్యులార్ మాస్టర్ స్విచ్’ ఎంత బలహీనంగా ఉందీ, అది ఏ మేరకు పనిచేయడంలేదు... లాంటి అంశాలన్నీ తెలుసుకొని అతడికే ప్రత్యేకమైన, ఎంతో ప్రభావపూర్వకంగా పనిచేసేలా అతడికే వ్యక్తిగతమైన చికిత్స అందించవచ్చు. ఈ అధునిక ఆవిష్కరణలతో లాభాలివి...⇒ చాలా హాస్పిటల్స్లో ఇప్పటికే ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. ∙తమ జీవన నాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్ను) మెరుగుపరచుకుంటున్నారు. ∙ఎంతో డబ్బునూ, టైమ్నూ ఆదాచేసుకోవడమే కాదు... గతంలో పేషెంట్లకు ఉండే ఎన్నో బాధలూ, వెతలూ, వేదనలకు దూరంగా ఉంచగలగడం సాధ్యమవుతోంది.నిర్వహణ: యాసీన్డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కన్వీనర్, ఏఐ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – మెడికల్ సైన్సెస్ -
అవాంఛిత రోమాలు ఎందుకు పెరుగుతాయి?
తలపై జుట్టు బాగా పెరగాలని మహిళలు కోరుకోవడం ఎంతో సాధారణమో... దేహంలోని కొన్ని భాగాల్లో అంటే... పైపెదవీ, గదమ మీద జుట్టు పెరగకూడదని కోరుకోవడం కూడా అంతే సహజం. అలా జుట్టు పెదవులపైనా గడ్డంపైనా పెరగడాన్ని వారు ఎంతమాత్రమూ ఇష్టపడరు. అలాంటి అవాంఛిత రోమాలను అనేక విధాల తొలగించుకోడానికి మహిళలు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారు కోరుకోని ప్రదేశాల్లో వెంట్రుకలు పెరగడాన్ని అవాంఛిత రోమాలు అనీ... అదే వైద్యపరిభాషలో హిర్సుటిజమ్ (Hirsutism) అని చెబుతారు. అవాంఛిత రోమాలు వచ్చేందుకు కారణాలు, వాటికి పరిష్కారాలేమిటన్నది తెలుసుకుందాం...సాధారణంగా మానవుల శరీరమంతటా రోమాలు ఉండనే ఉంటాయి. మనం క్షీరదాల కోవకు చెందినవాళ్లం కావడం వల్ల... క్షీరదాల్లో ఇలా ఒళ్లంతా వెంట్రుకలు ఉండటం ఒక లక్షణం కావడం వల్ల ఒంటి నిండా రోమాలు ఉండటం సహజం. కాకపోతే దేహంలోని కొన్ని చోట్ల అవి అవి ఉండాల్సినట్టుగా ఉండకుండా పెరగడాన్ని అవాంఛిత రోమాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు పురుషుల్లో గడ్డం, మీసం ఉండటం సహజం. కానీ మహిళల్లో అవి ఉండవు. ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించకుండా... నూగుగా... ఉండీ ఉండకుండా కనిపిస్తుంటాయి. అయితే కొందరిలో అవి పురుషుల్లో మాదిరిగా పెరుగుతూ స్పష్టంగా కనిపించే అవకాశముంటుంది. అవాంఛిత రోమాలంటే... మహిళల్లో చెంపలూ, చుబుకం, పై పెదవుల వంటి చోట్ల కూడా కనీ కనిపించకుండా రోమాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అంత సులభం కాదు. సాధారణంగా మహిళలందరి విషయంలోలా కాకుండా భిన్నంగా కనిపించేవాటిని అసహజమైన వెంట్రుకలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గదమ, చెంపలు, పెదవులపైన వెంట్రుకలు పెరుగుతూ... అవి మరీ గుబురుగా పెరుగుతుంటే వాటిని అవాంఛిత రోమాలుగా పేర్కొనవచ్చు. ఒక అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది శాతం మహిళల్లో... పురుషుల్లో మాదిరిగానే గడ్డంపైనా, పెదవులపైనా వెంట్రుకలు కనిపిస్తాయన్నది వైద్య నిపుణుల మాట.హిర్సుటిజం, హైపర్ట్రైకోసిస్ అంటే...?మహిళల్లో కనిపించే ఈ అవాంఛిత రోమాలను హిర్సుటిజమ్ అనీ అలాగే హైపర్ట్రైకోసిస్ (Hypertrichosis) అని రెండు రకాలుగా చెప్పవచ్చు. స్త్రీలలోనూ పురుషుల మాదిరిగానే వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్’గా చెప్పవచ్చు.అయితే హైపర్ట్రైకోసిస్ కండిషన్లోనూ వెంట్రుకలు పెరిగినప్పటికీ... అవి పురుషుల్లోలాగా ఉండవు. ఉదాహరణకు మహిళల హార్మోన్లలో ఏవైనా తేడాలు వచ్చి పురుషుల్లోలా వెంట్రుకలు పెరగడాన్ని హిర్సుటిజమ్గా చెప్పవచ్చు. కానీ వాళ్ల దేహంపైనా వెంట్రుకలు ఉన్నప్పటికీ అవి ఉండాల్సినంతగా కాకుండా చాలా ఎక్కువగా పెరగడాన్ని ‘హైపర్ ట్రైకోసిస్’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ఇలా జరుగుతుంది. ఇక కొందరిలో అంతకుముందు లేకపోయినా... కొన్ని రకాల మందులు వాడాక దేహంపైన రోమాలు రావచ్చు. అలా మునుపు లేనివీ... అటు తర్వాత ఏదైనా కారణాలతో రోమాలు పెరగడాన్ని కూడా ‘హైపర్ ట్రైకోసిస్’గా చెప్పవచ్చు.కారణాలు మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... హార్మోన్లలో తేడాలు...మహిళల్లో స్రవించే హార్మోన్లలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ అవసరమైన మోతాదు కంటే మించి స్రవించినప్పుడు... ఆ అంశం మహిళల్లో అవాంఛిత రోమాలకు దారితీయవచ్చు.పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్... మహిళల్లో పురుషుల్లోలా వెంట్రుకలు పెరిగేందుకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ (పీసీవోడీ) కూడా ఒక కారణం. హిర్సుటిజమ్ ఉన్న మహిళలలో వైద్యపరీక్షలు చేసినప్పుడు వాళ్లలో చాలామందికి (దాదాపు 70% మందిలో) పీసీవోఎస్ ఉన్నట్లుగా ఫలితాలు రావడం చాలా సహజం. పీసీఓఎస్ ఉన్న మహిళల అండాశయాలు (ఓవరీస్) పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆ హార్మోన్ మహిళల్లో సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు పెరగడం కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లలో మొటిమలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. యుక్తవయసు దాటి΄ోయాక కూడా మొటిమలు రావడం, అవాంఛితమైన రోమాలు ఉంటే పీసీవోఎస్ ఉందేమో అని అనుమానించాలి.పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీవోడీ) సమస్య ఉన్నప్పుడు నిపుణులైన గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా నెలసరి సమస్యలు సరయ్యేలా చూసుకోవడం, చికిత్సను మధ్యలో ఆపకుండా సమస్య పరిష్కారమయ్యేవరకు / పూర్తిగా తగ్గేవరకు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ను కొనసాగించాలి.కొన్ని రకాల గ్రంథుల సమస్య ఉన్నప్పుడు... కొందరు మహిళల్లో థైరాయిడ్ గ్రంథి సమస్యగానీ, పిట్యూటరీ గ్రంథి సమస్య ఉన్నప్పుడు కూడా వారిలో పురుషుల్లోలాగానే వెంట్రుకలు పెరగవచ్చు. అందుకే... అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించి దానికి అసలు కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకోవడం అవసరం.ఇడియోపథిక్ హిర్సుటిజమ్ అంటే...కొద్దిమంది మహిళల్లో పురుషహార్మోన్ స్రావాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ... వెంట్రుకల పెరుగుదల మాత్రం అసాధారణంగా ఉండవచ్చు. ఇలాంటి కండిషన్ను ‘ఇడియోపథిక్ హిర్సుటిజమ్’గా చెబుతారు. వీళ్లలో రుతుక్రమం మామూలుగానే ఉంటుంది. గర్భం రావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాకపోతే వెంట్రుకల పెరుగుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. సాధారణంగా వీళ్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారు. అంటే స్థూలకాయం / ఊబకాయంతో ఉండవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం. మెడ దగ్గర ప్రధానంగా మెడ వెనక భాగంలోనూ, చర్మం ముడతలు పడే ప్రదేశాల్లో చర్మం మరింతగా నల్లగా, మందంగా కనిపించవచ్చు. ఇలా చర్మం మందంగా, నల్లగా కనిపించే కండిషన్ను ‘ఎకాంథోసిస్ నైగ్రికాన్స్’ అంటారు.డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువ... అవాంఛిత రోమాల సమస్యతో బాధపడేవాళ్ల రక్తంలో సాధారణంగా చక్కెర మోతాదులను అదుపులో పెట్టేందుకు మరింత ఎక్కువగా ‘ఇన్సులిన్’ హార్మోను అవసరమవుతుంది. అందుకే ఇలాంటి వాళ్లు చాలాకాలం పాటు ఎలాంటి చికిత్సా తీసుకోకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, అది క్రమంగా డయాబెటిస్ సమస్యకు దారితీసేందుకు అవకాశాలెక్కువ.ఈ వైద్యనిపుణుల సహాయంతో... అవాంఛిత రోమాలు వచ్చే మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదు. అంటే వీళ్లలో నెలసరి (పీరియడ్స్) సక్రమంగా రావు. బరువు ఎక్కువగా పెరగడం, చర్మంలో ముడతలు ఉండే మెడ, బాహుమూలాలు వంటి చోట్ల చర్మం దళసరిగా మారడం, మొటిమలు ఎక్కువగా వస్తుండటం వంటి లక్షణాలతో పాటు ఒకవేళ మాడుపై తగినన్ని వెంట్రుకలు లేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ బాధితులు.. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మోన్ల నిపుణులు)ను, డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధుల నిపుణుల)ను సంప్రదించాలి. ఈ లక్షణాలున్నవారు తాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు గైనకాలజిస్ట్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైనాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్... ఈ ముగ్గురూ ఒక టీమ్గా చికిత్స అందిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో బాధపడుతున్న మహిళలైతే వారు తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లను కొనసాగించాలి. ఇవి చేస్తూ తమ బరువును తగ్గించుకోవడం లేదా నియంత్రణలో ఉంచుకోవడం చేస్తూ... వాటితో పాటు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి తాత్కాలిక ప్రక్రియలనో లేదా శాశ్వత పద్ధతులనో అవలంబించాలి.అవాంఛిత రోమాల తొలగింపునకు తాత్కాలిక ప్రక్రియలుథ్రైడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ ...సాధారణంగా చాలామంది మహిళలు తమ అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి ముఖ్యంగా థ్రెడింగ్, వ్యాక్సింగ్ లాంటి తాత్కాలిక ప్రక్రియలను అనుసరిస్తుంటారు. ఇవి తరచూ చేస్తున్న క్రమంలో కొందరిలో వెంట్రుకమూలంలో/ రోమం అంకురంలో ఇన్ఫెక్షన్స్ రావడం (ఫాలిక్యులైటిస్) వంటి ముప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడక్కడ రోమం కుదురు దగ్గర ఒక గడ్డలా మారి అక్కడ చీమూ పట్టే అవకాశాలెక్కువ. అలాంటి సందర్భాల్లో నొప్పి కూడా రావచ్చు. ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ప్రక్రియలను అనురించేవారి చర్మం నల్లబడవచ్చు. తగినంత పరిశుభ్రత పాటించకపోతే థ్రెడ్డింగ్తో ఒక్కోసారి పులిపిరులతో కూడిన వైరల్ వార్ట్స్ రావచ్చు. కొందరు మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించేప్పుడు అలర్జీలు రాకపోతే వాటిని సురక్షితమైనవిగా భావించి, వాటిని వాడుకోవచ్చు. అయితే హెయిర్ రిమూవల్ క్రీమ్ను ఉపయోగించే ముందు అది సురక్షితమా, కాదా అని తెలుసుకోడానికి చర్మంపై ఎక్కడైనా కొద్దిగా ఉపయోగించి చూడటం (ప్యాచ్ టెస్ట్) అవసరం.షేవింగ్... అపోహలు... అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి సాధారణంగా భారతీయ మహిళలు షేవింగ్ను అంతగా ఇష్టపడరు. షేవింగ్ తర్వాత మరింత గుబురుగా వెంట్రుకలు వస్తాయన్న అపోహ ఉండటం, షేవింగ్ (Shaving) వల్ల చర్మం మరింత గరుగ్గా, మందంగా మారుతుందనే అభిప్రాయాలు ఉండటంతో తమ లుక్స్ను కాపాడుకునే క్రమంలో దాన్ని ఒక సురక్షితమైన, నమ్మదగిన ప్రక్రియ అనుకోరు. అయితే అవి అపోహలే. అయినప్పటికీ షేవ్ చేసిన మర్నాడో లేదా వెంటవెంటనో వెంట్రుకలు పెరుగుతుండటం మామూలే కావడం, షేవ్ చేసిన మేర చర్మం రంగు ఒకింత మారడం వంటి కారణాల వల్ల ఇలా అపోహ పడటానికి అవకాశముంది.చదవండి: నిద్ర పట్టడం లేదా.. ఇదిగో పరిష్కారంఇవిగాక... అవాంఛితమైన రోమాలను తొలగించుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల వైద్యప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు లేజర్ ప్రక్రియలూ, ఎలక్ట్రోలైసిస్ (electrolysis) మార్గాల వంటి అధునాతన చికిత్సలూ ఉన్నాయి. అయితే వైద్య సంబంధితమైన ఎలాంటి విద్యార్హతలు లేకుండా తమను తాము బ్యూటీషియన్లు, కాస్మటాలజిస్టులమని చెప్పుకునే వారి దగ్గరకు వెళ్లడం కంటే... వైద్యపరమైన విద్యార్హతలు (క్వాలిఫైడ్) వైద్యనిపుణులై డర్మటాలజిస్టులు /ట్రైకాలజిస్టులను సంప్రదించడం చాలా మంచిది. ఇక ఇలాంటివారైతే... మహిళల్లో ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు (అండర్లైయింగ్ కాజెస్) ఉండటం వల్ల అవాంఛిత రోమాలు వస్తే... తగిన మందులు ఇవ్వడం లేదా సమస్య మూలాలను తెలుసుకుని సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించమంటూ సలహా ఇవ్వడం వంటివి చేస్తారు.కొందరు మహిళల్లో వెంట్రుకలు పలుచబడటం కూడా...మహిళల్లో అవాంఛిత రోమాలు ఎంత సహజమో... అలాగే కొంతమంది స్త్రీలలో వెంట్రుకలు పలచబారడమూ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా పాపిట తీసే చోట కనిపించడం చాలా సాధారణం. అక్కడ వెంట్రుకలు మరింతగా పలచబారిపోయి పాపిట ఉండాల్సిన దానికంటే చాలా వెడల్పుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడాన్ని ‘ఫిమేల్ ప్యాటరన్ హెయిర్ లాస్’’ అంటారు. కొందరిలో ఈ సమస్యను గుర్తించాక... వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే (సాధారణంగా ఆర్నెల్లలోపు) ఈ సమస్యను మందులతో అధిగమించవచ్చు. అంటే కోల్పోయిన వెంట్రుకలను తిరిగి పొందవచ్చు. అది కుదరకపోయినా మరిన్ని వెంట్రుకలు రాలిపోకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే వెంట్రుకలు మరింతగా రాలిపోయి పూర్తిగా పలచబడితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే ప్రత్యామ్నాయమవుతుంది. నిర్వహణ: యాసీన్ -
మన ‘స్వీటు’ హాటు!
ఆహార పదార్థాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంలో వివిధ రకాల స్వీట్లు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ స్వీట్లకూ నగరంలో భారీ డిమాండ్ ఉంది. అయితే వీటిలో కొన్నింటిపై బంగారం, వెండి పూతతో ఆకర్షణీయమైన స్వీట్లు తయారు చేస్తుంటారు. విలాసవంతమైన జీవన శైలిలో భాగంగా వీటిని తినేందుకు ఆసక్తి చూపుస్తుంటారు నగరవాసులు. అయితే ఈ పూతలో అసలైన మెంటల్స్ కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వేరే లోహాలను వినియోగిస్తున్నారు. తళుక్కున మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించే వివిధ రకాల స్వీట్ల మెరుపుల వెనుక ఉన్నది అసలైన లోహాలేనా? బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఇది సాధ్యమేనా? ప్రత్యామ్నాయ పూతలో ఉండే లోహాలేంటి? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగి నష్టాలేంటి? తెలుసుకుందాం.. హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. పండుగలకు, శుభకార్యాలకు నోరూరించే స్వీట్లూ ఫేమస్సే. ముఖ్యంగా వింధులో వెండి పూతతో మెరిసే స్వీట్లను విలాసవంతమైన జీవన శైలిలో భాగంగా భావిస్తుంటారు. కాజూ కత్లీ నుంచి మోతీచూర్ లడ్డూ వరకు.. మెరిసే వెండి పూత లేకపోతే ఆ స్వీట్కు సంపూర్ణత లేదన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఇటీవల కాలంలో స్వీట్ షాపుల కౌంటర్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దీనికి కారణం మిఠాయి రుచిలో మార్పు కాదుం.. వెండి ధరల పెరుగుదలంతో ధరల్లోనూ భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఫలితంగా పూత (సిల్వర్ వర్క్) తయారీ ఖర్చు పెరిగింది. ఇది నేరుగా స్వీట్ ధరలపై ప్రభావం చూపుతోంది. పూత ఐచ్ఛికమే.. ఇప్పటి వరకూ బంగారం, వెండి పూత స్వీట్స్ అనేవి సాధారణమే. పండుగ, శుభకార్యాల ఆర్డర్లలో ఇవి తప్పనిసరి ఐనప్పటికీ ఈ పూత గురించి అంతంగా ఆలోచించేవారు కాదు. కానీ ఇకపై పూత ఐచ్ఛికం కానుంది. అదనపు చార్జ్లతో మాత్రమే వీటిపూత అందుబాటులో ఉండనుందని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. స్వీట్ వ్యాపారులు కూడా ఖర్చు – లాభం మధ్య సమతుల్యతతో లోహాల వినియోగాన్ని తగ్గిస్తున్నామని చెబుతున్నారు. ఐతే కొన్నిచోట్ల పూర్తిగా మానేశారు. ఉల్లి రేటు పెరిగినప్పుడు బిర్యానీలోకి ఆనియన్ సలాడ్ తగ్గినట్టే, బంగారం, వెండి ధరల పెరుగుదలతో స్వీట్లపై మెరుపు తగ్గుతోంది. శరీరానికి అవసరమా? చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే.. ‘బంగారం, వెండి వంటి లోహాలు శరీరానికి మంచిది’ అనుకుంటారు. వాస్తవానికి బంగారం, వెండి పూతతోగానీ, ఆ లోహంతోగానీ మన శరీరానికి ఎటువంటి ఉపయోగమూలేదు. శరీరానికి అవసరమైన ఖనిజాల జాబితాలో బంగారం, వెండి వంటివి లేవు. అలా అని పోషకాహారమూ కాదు. అయితే చిన్న మోతాదులో బంగారం, వెండి విషపూరితం కాదు. జీర్ణాశయంపై∙ ఎటువంటి ప్రభావం చూపదు. అయితే మోతాదు మించితే ప్రమాదం అంటున్నారు వైద్యులు. దీనికి తోడు ఈ పూతలో ఈ175 అనే పదార్థాన్ని వినియోగిస్తారు. ఇది ఒక మైక్రాన్ని మించి ఉండకూడదు.ఉపయోగం ఉందా.. ?అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. బంగారం, వెండిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ లక్షణం కారణంగా స్వీట్లు త్వరగా పాడవ్వవు. అందుకే స్వీట్లపై ఈ తరహా పూత పూస్తుంటారు. అయితే ఇది ఆరోగ్య అవసరం కాదని మనం గ్రహించాలి. కేవలం ఇదో అలంకరణ మాత్రమే. ఈ లోహాలను తీసుకోవడం వల్ల కేలరీలు, విటమిన్లు, న్యూట్రిషనల్ వేల్యూస్ ఏమీ ఉండవని గ్రహించాలి. అయితే కొందరు నిర్వాహకులు తక్కువ ధరకు దొరికే పూతను వినియోగిస్తున్నారు. ఇందులో అల్యూమినియం, నికిల్, లెడ్ వంటి ప్రమాదకరమైన లోహాలను వినియోగిస్తున్నారు. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రత్యామ్నాయ డెకరేషన్.. ఆరోగ్యంపై స్పృహ పెరగడంతో గత కొంతకాలంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు పలువురు వినియోగదరులు, నిర్వాహకులు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్ డెకొరేషన్, చాక్లెట్ కోటింగ్, నేచురల్ కలర్స్, ఫ్యూజన్ స్వీట్లు..!! అంటే వెండి మెరుపు స్థానంలో డిజైన్, ఇన్నోవేషన్కు చోటు కల్పిస్తున్నారు.స్వీట్లపై ఉండేది నిజమైన లోహాలేనా? వాస్తవానికి స్వీట్లపై ఉండేది నిజమైన బంగారం, వెండేనా..?! అన్న ప్రశ్న మనలో ఎంతమందికి వచి్చంది. స్వీట్లపై వాడే పూతను గోల్డ్, సిల్వర్ వర్క్ (చాంద్ కా వర్క్) అంటారు. అయితే దీనికి ఫుడ్–గ్రేడ్ గోల్డ్, సిల్వర్ వర్క్ 99 శాతం శుద్ధమైన బంగారం, వెండి వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది అతి సూక్ష్మమైన (మైక్రాన్లు) లోహంతో పలుచగా ఉంటుంది. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దీనిని తయారు చేస్తారు. అయితే గతంలో కొన్ని చోట్ల అల్యూమినియం, నకిలీ మెటాలిక్ షీట్స్, ఇండ్రస్టియల్ ఫాయిల్ వాడిన ఘటనలూ లేకపోలేదు.లైఫ్స్టైల్లో మెరుపులకు ప్రాధాన్యం..హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఫుడ్ అనేది కేవలం ఆకలి తీర్చడమే కాదు.. ఇదో స్టేటస్ సింబల్గా మారిపోయింది. వెండి, బంగారు పూత ఉన్న స్వీట్ అంటే ఆ ప్రత్యేకతే వేరు అన్నట్లు కొందరి ఆలోచనా సరళి ఉంది. ఇదొక ఖరీదైన గిఫ్ట్గా గుర్తింపు పొందడంతో పాటు శుభకార్యాల్లోనూ ఆర్భాటానికి ప్రతిగా నిలుస్తోంది. అందుకే వెండిపూత లేకపోతే రుచి మారకపోయినా, విలాసం తగ్గిన భావన వినియోగదారుల్లో కలుగకమానదు. -
తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!?
చాలామంది తరుచుగా ఉద్యోగాలు మారుతుంటారు. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత తరుచుగా జాబ్లు మారుతుంటారు. దాంతో చాలామంది ఈ ఉద్యోగంలోనైన ఎన్నాళ్లు ఉంటాడో అని విమర్శిస్తుంటారు. అయితే ఇలా విమర్శించడాన్ని తప్పుపడుతున్నారు పీపుల్ గ్రూప్ అండ్ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు , సీఈవో అనుపమ్ మిట్లల్. ఇలా మారడాన్ని ఆయన సరైన స్ట్రాటజీగా అభివర్ణించారు కూడా. పైగా యువత సరిగ్గానే చేస్తుందని కితాబిచ్చేస్తున్నారు కూడా. చాలామంది నిపుణులు కూడా ఎక్కడ స్థిరంగా పనిచేయకపోతే అనుభవం ఎలా వస్తుందంటూ..ఉద్యోగాలు మారుతుండే వాళ్లని తిడుతుంటారు. కానీ మిట్టల్ మాత్రం ఇది సరైనదే అంటున్నారు. మరి అది ఏవిధంగానో ఆయన మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!జెన్జెడ్ తరుచుగా ఉద్యోగాలను మార్చడంపై సీఈవో అనుమపమ్ మిట్టల్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ..ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. జెన్జెడ్ తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారని కెరీర్ నిపుణులు తప్పుపడుతుంటారు. కానీ దీన్ని డేటింగ్లా తీసుకోండి అంటున్నారు అనుపమ్. స్థిరంగా ఒక చోట ఉద్యోగం చేయడాన్ని వివాహంగా భావిస్తే..ఈ తరం యువత తమకు నచ్చిన రంగంలో అభిరుచి వెతుక్కుంటూ చేస్తున్న అన్వేషణే ఇది అని అంటున్నారాయన. ఇలా ఉద్యోగాలు మారుతు తమకు నచ్చిన రంగాన్ని వెతుక్కుంటున్నారని అన్నారు. ఈ యువ నిపుణుల తమకు ఏ రంగాలు, ఎందులో తాము సరిపోతామో అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇది అని అంటున్నారు. దీన్ని నమ్మకద్రోహం కిందకు చూడొద్దని, ఆత్మపరిశీలనకు సంబంధించిన అన్వేషణగా అభివర్ణించారాయన. చాలామంది కెరీర్ నిపుణులు దీన్ని తప్పుగా చూస్తున్నారు గానీ.. యువత సరిగ్గా చేయాల్సింది ఇదే కదా అన్నారు. నిజానికి జెన్జెడ్లో చాలామంది కెరీర్ ప్రారంభదశలో ఉన్న నిపుణులే. ఈ తరం ఒత్తిడి కంటే మానసిక శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తోంది. పైగా వాళ్లు కార్పోరేట్ నిచ్చెన ఎక్కడం కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై దృష్టి పెడతారని పలు సర్వేలు కూడా పేర్కొన్నాయని గుర్తుచేశారు. అందువల్ల ఈ తరం చేస్తుంది ముమ్మాటికి కరెక్టేనని అన్నారు. అంతేగాదు 21-24 ఏళ్ల మధ్య ఉద్యోగాలు మారడం సరైనదేనని, 25 ఏళ్ల తర్వాత మాత్రం స్థిరంగా ఒకచోట పనిచేయాలని అనుపమ్ సూచించారు. అంతేగాదు ఉద్యోగం మారాక, దాని గురించి ఆలోచించకండి, చింతికండి అని చెబుతున్నారు అనుపమ్. తాను టీమ్ లీడర్గా ఉన్నప్పుడూ..ఉద్యోగాల నియామక ప్రక్రియలో చాలా క్లియర్గా ఉండేవాడినని, అభ్యర్థికి కనీసం 4 నుంచి 5 ఏళ్లు అనుభవం లేకపోతే నిర్థాక్షిణ్యంగా రిజెక్ట్ చేసేవాడినని అన్నారు. అలాగే ఇలా ఉద్యోగాలు మారడం వల్ల కొత్తదనం తెలియడమే కాకుండా, దాని పర్యవసానాలపై అవగాహన, అనుభవం ఏర్పడుతుందని కూడా నొక్కి చెప్పారు. ఈ పోస్ట్ చాలామంది యువతను ఆకర్షించడమే గాక మాకు ఇది సరైన మార్గనిర్దేశం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..) -
బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..!
బరువు తగ్గడం అంటే వర్కౌట్లు మీద ఫోకస్ పెడతాం. అన్నిట్లంకంటే తగ్గాలనే సంకల్పం బలంగా ఉండాలి అప్పుడే అది సాధ్యమవుతుందని అంటోంది ఫిట్నెస్ కోచ్ కేట్ డేనియల్. ఇంతకుమునుపులా ఉండాలి అన్న ఆలోచనే ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సులభంగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది అంటోందామె. తాను మూడేళ్లలో 70 కిలోల అదనపు బరువుని తగ్గించుకున్నానని..అందుకోసం తన జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేశారో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..బేరియాట్రిక్ కోచ్ కేట్ డేనియల్ బరువు తగ్గడం అన్నది ఓర్పుతో, అంకితభావంతో సాగించాల్సిన జర్నీ అంటుందామె. ఇక్కడ ఈ ఫిట్నెస్ కోచ్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే డైటింగ్/వ్యాయామం పనిచేయనప్పుడు పొట్ట పరిమాణాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడే సురక్షితమైన చికిత్స. అది డేనియల్ లైఫ్లో ఒక భాగం మాత్రమే. కానీ బరువు తగ్గడానికి ముందు తాను టీనేజ్లో ఉన్నట్లుగా తనలా మారాలని స్ట్రాంగ్ కోరుకుంది. ఆ తర్వాత తన జీవనశైలిలో మార్పులు చేసుకున్నారు. అవేంటంటే..ఉదయాన్నే మేల్కోవడం..ఆకలి హార్మోన్ల నియంత్రించే అలవాట్ల కోసం త్వరితగతిన మేల్కోవడం మంచిదని చెబుతోంది. ఇలా తొందరగా లేవడం వల్ల చక్కగా డైట్, వర్కౌట్ల ప్లాన్ సవ్యంగా ఉంటుందన్నారామె. శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండటం..చక్కెర, శుద్ధి చేసిన పిండిలతో చేసి ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వలేదట. ఇది శరీర కొవ్వుని తగ్గించేందుకు హెల్ఫ అయ్యిందట. వారానికొకసారి నచ్చిన ఆహారం..నచ్చిన ఫుడ్ని స్వయంగా తయారు చేసుకుంటూ..హాయిగా తిన్నాను. దానివల్ల త్యాగాలు చేస్తున్నా అన్న ఫీల్ ఉండదు. పైగా కడుపు నిండుగా తినొచ్చు కూడా.తనను తాను మెరుగ్గా ఉంచుకోవడంమొదట మనల్ని మనం ప్రేమించడం, ఆహారంతో సంబంధం లేకుండా ఎంతసేపు ఉండగలం వంటి చిన్న ప్రయత్నాలను రోజు రోజుకి పెంచడం. ఆరోగ్యకరమైన రిలేషన్స్..ఎందుకంటే మనకు నచ్చిన వాళ్లు ఇచ్చిన ఆహారాలను వాళ్లపై ప్రేమతో లాగించేస్తాం. కాబట్టి..బంధాలను బరువుని పెంచేవిగా మార్చుకోవద్దు. వాళ్లని మేలు కోరే వాళ్లుగా మార్చుకోవాలట. అంటే ఆ బంధాలు మనసుకి స్వాంతన ఇవ్వాలే గానీ శరీరాన్ని భారంగా మార్చకూడదని అంటోంది. విజువలైజేషన్కోరుకున్న విధంగా స్మార్ట్గా మారినట్లు ఊహించుకోవడం. పదే పదే ఆ దృశ్యమానం..మిమ్మల్ని జాగురకతతో ఉండేలా చేస్తుంది. తినాల్సిన వాటిపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు.చలాకీగా ఉండటం..బరువు తగ్గిన వెంటనే 20ల వ్యక్తిలా ఎలా ఉషారుగా పనిచేయగలనో భావించడం. ప్రతి కదలికలో దీన్నిగుర్తించుకోవాలి.మానసికంగా స్ట్రాంగ్ ఉండటం..బరువు తగ్గలేకపోతున్న అన్న బాధ మెదుడులోకి ఎంటర్ అవ్వకూడదు. అది మిమ్మల్ని స్మార్ట్గా ఉండనివ్వదట. నిన్ను నువ్వు స్నేహితుడిగా, కేర్టేకర్గా మార్చుకుంటూ సాగితే బరువు తగ్గడం ఇష్టమైన ఆటలా మారి..సునాయాసంగా తగ్గేలా చేస్తుంది లేదా అదుపులో ఉంచుతుంది .ఇక్కడ చెప్పినవన్ని..మాయలు మంత్రల్లాంటివి కాదని, కేవలం బరువు తగ్గేందుకు మానసికంగా మనల్ని సన్నద్ధం చేసేవి. వీటికి మంచి ఆహారపు అలవాట్లు, వర్కౌట్లు తోడైతే..బరువు తగ్గడం సులభమవుతుందని అంటోంది ఫిట్నెస్ కోచ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Kate Daniel (@bariatric_chic) (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
పశువైద్యంలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయం
పశువ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% వరకు తగ్గించే సాంప్రదాయ మూలికా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసిన తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ఎత్నో–వెటర్నరీ మెడిసిన్ (ఈవీఎం)లకు శాస్త్రీయ ప్రామాణికతను నిరూపించటంలో, రైతుల చెంతకు చేర్చటంలో డా. పుణ్యమూర్తి విశేష కృషి చేశారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మహమ్మారికి అసలైన పరిష్కారం ఈవీఎం చికిత్సలేనని డా. పుణ్యమూర్తి తెలిపారు. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి తీవ్ర జబ్బులను ఈవీఎం చికిత్సలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రీయ పరీక్షలతో పాటు రైతుల అనుభవంలోనూ రుజువైందన్నారు. తమిళనాడు తంజావూరు సమీపంలోని వల్లం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన పశువైద్యంలో డాక్టరేట్ చేసి, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ డీన్గా పనిచేసిన ఆయన 2001లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా బెంగళూరులోని టీడీయూ హెల్త్సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి పరిశోధనలు కొనసాగించారు. యాంటీబయాటిక్స్ తదితర రసాయన ఔషధాలపై ఆధారపడకుండా తమ ఇంట్లోని దినుసులతోనే పశువ్యాధులకు రైతులే స్వయంగా చికిత్స చేసుకోవటానికి వీలుగా ఉండటం ఈవీఎంల ప్రత్యేకత. సిద్ధ వైద్య సూత్రాల ఆధారంగా సుమారు 50కి పైగా పశు వ్యాధులకు ఈవీఎం పద్ధతులను ఆయన రూపొందించారు. వీటి పనితీరును నిర్ధారించుకున్న జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా పశుపోషకులకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సిఫారసు చేస్తూ సత్ఫలితాలను నమోదు చేసింది. సంబంధిత చికిత్సల వీడియోలను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఎన్డీడీబీ యూట్యూబ్ చానల్లో అందుబాటులో ఉన్నాయి.స్వచ్ఛమైన పాలు, గుడ్లు, పేడ, మూత్రం ఉత్పత్తే లక్ష్యం: డా. పుణ్యమూర్తి ‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్కేర్పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు.‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్కేర్పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. -
విరిసిన సేద్య పద్మాలు!
వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగాల్లో విశేష కృషి చేసిన 9 మందికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఐదుగురు శాస్త్రవేత్తలు, ముగ్గురు రైతు శాస్త్రవేత్తలు, ఒకరు ప్రముఖ సహకార వేత్త. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ, పూసా) మాజీ సంచాలకులు డా. అశోక్ కుమార్ సింగ్ (బాస్మతి వరి రకాల అభివృద్ధి), జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, మొక్కల రకాలు రైతుల హక్కుల ప్రాధికార సంస్థల మాజీ చైర్మన్ డా. పి.ఎల్. గౌతమ్ (జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, రైతుల విత్తన హక్కుల రక్షణ చట్టం రూపశిల్పి), తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్స్లర్ డా. కె.రామస్వామి (క్లైమేట్ ఒత్తిళ్లను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై పరిశోధన), రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ డా. జి.ఎల్. త్రివేది (ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి), తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి (ఎత్నో–వెటర్నరీ మెడిసిన్) పద్మశ్రీకి ఎంపికయ్యారు. వీరితో పాటు రైతు శాస్త్రవేత్తలు దివంగత రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్), జోగేష్ డ్యూరి (అస్సాం), శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర), దివంగత సహకార వేత్త మామిడి రామారెడ్డి (తెలంగాణ) పద్మశ్రీ 2026 పురస్కారాలకు ఎంపికయ్యారు.మాక్స్ చట్టం రూపశిల్పి రామారెడ్డితెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమలో సహకార సంఘాల పాత్రను బలోపేతం చేసేందుకు 50 ఏళ్లపాటు పాటుపడిన దార్శనిక సహకార నేత మామిడి రామారెడ్డి(83)కి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్పంచ్గా, రాజేంద్రనగర్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. సహకార సమాఖ్య, కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ల ద్వారా సహకార వ్యవస్థ పటిష్టతకు రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సహకార వేత్తగా నిబద్ధతతో సేవలందించారు. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంపీసీఎస్)లను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్లలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యాన్ని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమించి, చట్ట సవరణ సాధించారు. 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ(మాక్స్) చట్టం రూపకల్పనలో రామారెడ్డి కీలకపాత్ర పోషించారని 5 దశాబ్దాలుగా రామారెడ్డితో కలసి నడుస్తున్న సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్త సంభారపు భూమయ్య ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సహకార రంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని గెల్చుకున్న తొలి నేత రామారెడ్డి కావటం సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను, స్వయం సహాయక బృందాలను ఇతోధికంగా ప్రోత్సహించారు. వరంగల్, కరీంనగర్ ప్రాంత మహిళా సహకార డెయిరీ ఏర్పాటులో చోదక శక్తిగా నిలిచారని ఆయన తెలిపారు. దూరదృష్టి గల నేత: ఎన్డీడీబీసహకార సంస్థలను బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడు మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటం హర్షణీయమని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) పేర్కొంది. సహవికాస – సహకార అభివృద్ధి ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతపై బలమైన దృష్టితో తెలంగాణ అంతటా గ్రామీణ జీవనోపాధి అవకాశాలను కల్పించారు. సహకార చట్టాలను రూపొందించడంలో, జాతీయ స్థాయి విధాన సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. వేలాది మంది సభ్యుల యాజమాన్యంలోని స్వావలంబనతో కూడిన సహకార సంస్థలను ఆయన వారసత్వం విశ్వాసం, గౌరవం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతుందని ఎన్డీడీబీ ఆకాంక్షించింది.శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర)వ్యవసాయ ఆవిష్కరణలతో ప్రసిద్ధి చెందిన రైతు శాస్త్రవేత్త శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర). పత్తి ఉత్పత్తిని పెంచే ‘దాదా లాడ్ పద్ధతి’ని ఆయన అభివృద్ధి చేసినందుకు పద్మశ్రీ అందుకోనున్నారు. అధిక సాంద్రతలో పత్తి విత్తటం, మొక్కను 3 దశల్లో కొమ్మలు, పిలకలను కత్తిరించటం ద్వారా దిగుబడిని పెంచటం దాదా లాడ్ టెక్నిక్ ప్రత్యేకత. పత్తి పంట కాలాన్ని కుదించటం ద్వారా గులాబీ పురుగు బెడద నష్టాన్ని నివారించటం మరో ప్రయోజనం. నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్) లాడ్ టెక్నిక్లో ప్రయోజకత్వాన్ని గుర్తించి, అధికారికంగా రైతులకు సిఫారసు చేయటం విశేషం. వర్షాధార, నీటిపారుదల సాగు పద్ధతుల్లోనూ సీఐసీఆర్ విస్తృత స్థాయిలో క్షేత్ర ప్రయోగాలు జరిపింది. ఈ టెక్నిక్ ద్వారా సగటున 48 నుంచి 76% వరకు పత్తి దిగుబడి పెరిగినట్లు రుజువైందని సీఐసీఆర్ ప్రకటించింది.రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్)మొరాదాబాద్ జిల్లాలోని బిలారి ప్రాంతానికి చెందిన అభ్యుదయ రైతు రఘుపత్ సింగ్కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనున్నారు. 55 పైగా అంతరించిపోతున్న కూరగాయల వంగడాలను సంరక్షించి రైతులకు తిరిగి పరిచయం చేశారు. దాదాపు 100 కొత్త రకాలను అభివృద్ధి చేశారు.జోగేష్ డ్యూరి (అస్సాం)ముగా పట్టు పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన జోగేష్ డ్యూరి పద్మశ్రీని అందుకోనున్నారు. ఆయన కృషి వేలాది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచింది. ముగా పట్టుకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టింది. -
పోరాటానికి సిద్ధం చేసే సైకో ఆంకాలజీ
‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’2024 అధ్యయనం ప్రకారం మన దేశంలో 25 లక్షల మంది క్యాన్సర్తో పోరాడుతున్నారు. గత ముపై ్ప ఏళ్లలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 24 శాతం పెరగడమే ఇంత భారీ సంఖ్యకు కారణం. అయితే క్యాన్సర్ నయం చేయడంలో వైద్యంతో పాటు మనసును దృఢం చేయడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు సైకో అంకాలజిస్ట్లు. క్యాన్సర్ పోరాటంలో బాధితునికి సైకో ఆంకాలజిస్ట్లు అందించే సహాయం ఏమిటి?‘ఇటీవల మా అధ్యయనం ఏం చెబుతున్నదంటే క్యాన్సర్ ట్యూమర్తో పాటు మనసుకు కూడా వైద్యం చేయడం వల్ల క్లినికల్గా మంచి ఫలితాలు వస్తాయని. ఆంకాలజీ విభాగంలో సైకాలజీ ఇక ఎంత మాత్రం ఆప్షనల్ కాదు. తప్పనిసరి అవసరం’ అన్నారు న్యూఢిల్లీలోని ఎంఓసి క్యాన్సర్ కేర్ సెంటర్ వైద్యుడు డాక్టర్ నిఖిల్ హింతాని. ‘అందుకే దేశంలోని క్యాన్సర్ సెంటర్లలో సైకో ఆంకాలజిస్ట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది’ అన్నారాయన.క్యాన్సర్ బారిన పడటం ఎవరినైనా కుంగదీసే విషయమే. క్యాన్సర్ నిర్థారణ అయ్యాక ప్రతి పేషంట్కు తనవైన భావోద్వేగ సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనడంతో పాటు వ్యాధిని ఎదుర్కొనాలి... ఈ రెంటి సమన్వయానికి కౌన్సిలింగ్ తప్పనిసరి అంటున్నారు క్యాన్సర్ నిపుణులు. అందుకే ఇప్పుడు క్యాన్సర్ మీద పోరాటంలో సైకో ఆంకాలజిస్ట్ల ప్రాధాన్యం పెరిగింది.→ ఎవరీ సైకో ఆంకాలజిస్టులు?క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే నిపుణులను ‘ఆంకాలజిస్టు’ అంటారని తెలిసిందే. ఆ విభాగంలోనిదే ఈ ‘సైకో–ఆంకాలజీ’. సైకాలజీలో మాస్టర్స్ లేదా పిహెచ్డి చేసి, సైకో ఆంకాలజీని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వారు ‘సైకో ఆంకాలజిస్ట్లు’గా విధులకు సిద్ధమవుతారు. ఆంకాలజిస్ట్లతోటి, పేషంట్స్తోటి సమన్వయం చేసుకుంటూ పేషంట్ మనసుకు స్వాంతన ఇస్తూ వారిలో ధైర్యం నూరి పోయడం, క్యాన్సర్ను గెలవగలననే భరోసాను ఇవ్వడం వీరి ప్రధాన పని.→ క్యాన్సర్ నయమైన వారికీ అండగా..క్యాన్సర్ నయమైన తర్వాత కూడా క్యాన్సర్ విజేతలకు అనేక ఆందోళనలు ఉంటాయి. చికిత్స వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిని తట్టుకోలేక కొందరు కుంగి పోతుంటారు. అటువంటి వారికీ ‘సైకో–ఆంకాలజీ’ అండగా ఉంటుంది. తిరిగి మేలైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా సహజంగా జీవించాలో నేర్పుతుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్య సూత్రాలు, ఒత్తిడి లేని జీవనాన్ని పాటించేలా సూచనలు చేస్తారు సైకో–ఆంకాలజిస్టులు. క్యాన్సర్ నయం కాగానే అంతా మామూలై పోయిందని చాలామంది భావిస్తుంటారు. అక్కడి నుంచే అసలైన సవాళ్లు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడం అత్యవసరమని, దానికి ‘సైకో– ఆంకాలజీ’ తోడ్పడుతుందని అంటున్నారు.→ దశాబ్ద కాలంగా ‘సైకో–ఆంకాలజీ’పై పెరుగుతున్న అవగాహన మనదేశంలో ఎక్కువగా రొమ్ము, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు బాధితులుగా ఉంటారు. వీరిలో ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం. పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్ బారిన పడితే ఇక ఆ కుటుంబంలో నెలకొనే ఆందోళన గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో క్యాన్సర్కు గురైన వారు ధైర్యంగా ఉంటే మిగిలినవారూ ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. అందుకు ‘సైకో–ఆంకాలజీ’ కీలక భూమిక పోషిస్తుంది. గత పదేళ్లుగా దీనిపై అవగాహన పెరుగుతోంది. ‘క్యాన్సర్ని ఎదుర్కొవడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ఎదుర్కునేలా వారిని సిద్ధం చేయడమే మా బాధ్యత’ అంటున్నారు ‘సైకో– ఆంకాలజిస్టులు’.మానసిక ధైర్యమే కొండంత అండసైకో ఆంకాలజీలో పేషంట్కు అవసరాన్ని బట్టి ‘కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ’, ‘స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్స్’, ‘యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ’, ‘స పోర్టివ్ ఎక్స్ప్రెసివ్ థెరపీ’, ‘సైకో థెరపీ’, ‘ఫ్యామిలీ అండ్ కపుల్స్ థెరపీ’, ‘ట్రామా ఇన్ఫార్మ్డ్ థెరపీ’... వంటి అనేక థెరపీలు సైకో ఆంకాలజిస్ట్లు అందిస్తారు. ఎన్ని మందులు ఉన్నా వైద్యులు ఇచ్చే భరోసా వారిలో కొండంత బలాన్ని నింపుతుంది. క్యాన్సర్ మీద ఉన్న అనేక అ పోహల కారణంగా ఈ వ్యాధికి గురైన వారు తీవ్ర మానసిక వేదనతో పాటు చుట్టూ ఉన్న వారి జాలిచూపులు, చికిత్స సమయంలో నొప్పి, తమకేమవుతుందోనన్న ఆందోళన, డబ్బు కోసం కుటుంబ సభ్యులు పడే ఆరాటం.. వీటన్నింటితో సతమతం అవుతుంటారు. సైకో–ఆంకాలజిస్టులు వారితో మాట్లాడి బతుకు మీద ఆశ కలిగించేందుకు ప్రయత్నిస్తారు. -
ముఖానికి ఎంత సన్స్క్రీన్ అప్లై చేస్తున్నారు..?
చర్మ సంరక్షణ ఉత్పత్తులు మనకు మంచి ఫలితాలివ్వాలంటే ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి సంరక్షించే ఉత్పత్తుల విషయంలో ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే ఎంత పరిమాణంలో రాయాలనేది తెలుసుండాలి. లేదంటే అంతలా ఖర్చు చేసి.. కొన్నవి కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. పైగా చర్మ సమస్యలు మరింత ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఏబ్యూటీ ప్రొడక్ట అయినా..రాసే పరిమాణం మీదే ఫలితం ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలి అని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అంతేగాదు ఎంతపరిమాణంలో రాయాలో కూడా సవివరంగా ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించారు చర్మ వైద్యనిపుణురాలు డాక్టర్ గుర్వీన్ వారైచ్. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దాం.చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో సన్స్క్రీన్ అత్యంత ముఖ్యమైనది. ఇది చర్మాన్ని సూర్యుడి నుంచి రక్షించడమే కాకుండా చర్మ పొరను కాపాడుతుంది, నల్లబడటాన్ని నివారిస్తుంది. అలాగే అతినీలలోహిత కిరణాల(యూవీబీ) నుంచి రక్షిస్తుంది. అది ఎంత ఖరీదైన బాటిల్ అయినా, ఎంత ఎస్పీఎఫ్ అందించినా..సరైన మోతాదులో అప్లై చేయడం అనేది అత్యంత కీలకం అని చెబుతున్నారు చర్మవ్యాధి నిపుణురాలు.ఎంత సన్స్క్రీన్ అప్లై చేయాలంటే..చర్మవ్యాధి నిపుణులరాలు గుర్వీన్ ప్రకారం..ప్రతి చదరపు సెంటీమీటర్కు 2మిల్లీగ్రాములు సరైన పరిమాణం. అంటే ముఖం, మెడకు కలిపి..మొత్తం 1.6 నుంచి 1.8 mg అవసరం. ఇది సుమారుగా మూడు వేళ్లకు సమానం. ఈ మోతాదులో ముఖానికి అప్లై చేయకపోతే తగిన ప్రయోజనం పొందలేరని అన్నారామె. మనం ఎంత ఖరీదైనది, సన్స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 అయినా సరే తగిన పరిమాణంలో ఉపయోగించకపోతే మెరుగైన ఫలితం మాత్రంపొందలేమని అన్నారు. ప్రయోజనాలు..SPF 30 ఉన్న సన్స్క్రీన్ రోజువారీ ఉపయోగం కోసం సరిపోతుంది. ఎండలో ఎక్కువగా ఉండేవారికి SPF 60 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. ఇలా ఈ సన్స్క్రీన్ అప్లై యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. అదెలాగంటే..చర్మ రక్షణకు అవరోధంగా ఉన్న వాటిని నివారిస్తుంది. తామర, రోసేసియా, మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. యూవీబీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మ కేన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది. గోధుమ రంగు మచ్చలు, చక్కటి గీతలు, ముడతలు, వర్ణద్రవ్యం వంటి అకాల వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది. View this post on Instagram A post shared by Dr Garekar l Dermatologist (@garekarsmddermatologyclinic)(చదవండి: మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..! సినిమాని తలపించే ఘట్టం) -
మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..!
కోమాలో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఈ ఘటన సరికొత్త ఆశను అందిస్తోంది. అచ్చం సినిమాని తలపించే సన్నివేశంలా..ఈ కేసులో ఆ బిడ్డ కోమా నుంచి బయటపడ్డాడు. వైద్యులు సైతం చేతులెత్తేశారు. కానీ మాటలు, సందేశాలే మంత్రాలుగా మారి మిరాకిల్ చేశాయి. ఆ బిడ్డకు ఊపిరిపోసి..కోమా నుంచి పూర్తిగా బయటపడేలా చేశాయి. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..ఈ అద్భుత ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని యుయాంగ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు లియుచుక్కి నవంబర్ 2025లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు ప్రమాదంలో చిన్నారి చుక్కికి మెదడు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయలయ్యాయి. దాంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు సైతం కోమా నుంచి బయటడే అవకాశాలు తక్కువని అని తేల్చి చెప్పేశారు. కానీ ఆ బాలుడు తల్లి ఆశ వదులుకోలేదు. వైద్యుల సూచనల మేరకు అతడికి రోజు సుపరిచితమైన శబ్దాలు, మాటలు..వినేలా వాతావరణం కల్పించాలని చెప్పారు. దాంతో ఆ బాలుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి వారి మద్దతు..స్కూల్లో అసెంబ్లీలో ప్లే అయ్యే సాంగ్స్, ప్రార్థన గీతాలు వినిపించేలా చేసింది. అలాగే వీడియో కాల్ ద్వారా ఆ బాలుడి స్నేహితుల మాటలు అతనికి వినిపించేలా చేసింది ఆ బాలుడి తల్లి. రోజు అతడి స్నేహితులు.. రేయ్..! చుక్కి కళ్లుతెరవరా.., మాతో మాట్లాడరా, ఫుట్బాల్ ఆడదాం త్వరగా లేగు అన్న మాటలు ఆ బాలుడిలో స్పందన తెప్పించాయి. ఆ తల్లి అలా అతడి క్లాస్మేట్స్ మాటలు రోజు వినేలా చేయడంతో.. అతడి పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అంతేగాదు 45 రోజుల కోమా అనంతరం తొలిసారిగా కనురెప్పలు కదపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఉపాద్యాయుడి గొంతు విని నవ్వాడు. అలా 55వ రోజుకి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని కదిపాడు. తన పాఠశాల సంగీతం, సహ విద్యార్థులు సందేశాల రికార్డింగ్ ఆ బాలుడుని కోమా నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి హెల్ప్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కదిస్తోంది. A touching story😭😭An 8-year-old boy in Hunan, #China, woke from a 55-day coma after hearing the collected messages of love and well wishes from classmates🥺🥺It's the power of #friendship and #hope. ❤️ pic.twitter.com/M8sEcX8o9Z— GeoSight (互fo) (@ShanxiDaily) January 22, 2026 (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..
అధిక బరువు కేవలం సామాన్యులనే వేధించే సమస్య కాదు. ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు కౌన్సలింగ్ ఇచ్చి బరువు తగ్గేలా చేసే ఒబెసిటీ వైద్యులు సైతం అధిక బరువు బాధితులే. అందుకు ఉదాహరణ ఈ వైద్యుడు కెవిన్ జెండ్రూ. అందరికి ఆరోగ్యకరమై జీవిన విధానానికి కౌన్సిలింగ్ ఇచ్చే ఈ ఒబెసిటి డాక్టరే తన స్వతం జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమై అధిక బరువుతో బాధపడ్డాడు. అధిక పని ఒత్తిడికి ఈ వైద్యుడు సైతం సామాన్యుడిలా అధిక బరువు బారినపడ్డాడు. రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తే సరైన జీవన విధానం అవలంభించకలేక ఇబ్బందిపడ్డాడు. చివరికి ఆ ఒక్క దురదృష్టకర ఘటన అతడి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పి బరువు తగ్గేందుకు దారితీయడమే కాదు..వెయిట్లాస్ అవ్వడంలో స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఆ వైద్యుడి వెయిట్లాస్ జర్నీ ఎలా మొదలైందంటే..మసాచుసెట్స్కి చెందిన కెవిన్ జెండ్రూ ఒకప్పుడూ 138 కిలోల బరువు ఉండేవాడు. అతడి వృత్తి ఊబకాయంతో బాధపడే రోగులకు వైద్యం చేయడం. విచిత్రం ఏంటంటే అతడే ఓ ఒబెసిటీ రోగి..పైగా తన లైఫ్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోలేదు. కానీ రోగులకు అధిక బరువు తగ్గించుకునేలా చికిత్స, కౌన్సిలింగ్ ఇస్తుండటం విశేషం. సుదీర్ఘ గంటల పని ఒత్తిడి అతడిని తరుచుగా ఏదో ఒకటి తినేలా చిరుతిండికి బానిసగా మార్చేసింది. అది కాస్త ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలైంది. మరోవైపు అతడి తండ్రికి టెర్మినల్ మెలనోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏం తింటున్నాడో..ఎలా ఉంటున్నాడనే దానిపై స్పృహ లేకుండా జంక్ఫుడ్ తీసుకునేవాడు. అదికూడా నిర్ణిత సమయం అంటూ లేకుండా తినాలనిపించినా..లేకపోయినా..వీలు దొరికినప్పుడల్లా తినడం ఓ అలవాటుగా మారి..విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారినపడ్డాడు. ఊబకాయం ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన ఉన్న వైద్యుడే ఊబకాయంతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనడం ఒకింత సిగ్గుగా అనిపించడం మొదలైంది కెవిన్కి. ఇంతలో సోదరికి కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అవ్వడం ఒక్కసారిగా కెవిన్ ఉలిక్కిపడ్డాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి అంతే అని ఫిక్స్ అయ్యి..ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టిపెట్టడం ప్రారంభించాడు. తన పిల్లల కోసమైన ఆరోగ్యం ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు.ఎలా తగ్గాడంటే..సాధారణ ఆహార మార్పులు, అడపాదడపా ఉపవాసం తదితరాలను ప్రారంభించాడు. అలాగే తనకున్న వైద్య పరిజ్ఞానంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రణాళిలు ఏర్పాటు చేసుకుని మరి బరువు తగ్గేందుకు ప్రయత్నించాడు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక ఫైబర్ ఉండే ఆహారం, బెర్రీలను తీసుకోవడం ప్రారంభించాడు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, శుద్ధి చేసిన చక్కెరను నివారించాడు. అతని సాధారణ భోజనంలో గ్రిల్డ్ చికెన్, సిర్లోయిన్ స్టీక్ లేదా చేపలు, కాల్చిన నాన్-స్టార్చీ కూరగాయలు ఉంటాయి. దాంతోపాటు అవకాడో, గింజలు, ఆలివ్ నూనె, గుడ్లు, చీజ్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మైండ్పెట్టి తినడం, కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాడు. ఇక అడదడపా ఉపవాసాన్ని కూడా హెల్దీగా చేసినట్లు తెలిపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వ్యవధిలో తక్కువ కార్బ్, చక్కెర ఉన్న ప్రోటీన్ భోజనం మాత్రమే తీసుకునేవాడు. దీనివల్ల చక్కెర స్థాయిలు సాధారణస్థితికి వచ్చి డయాబెటిస్ అదుపులోకి వచ్చింది. వర్కౌట్ల దగ్గరకు వచ్చేటప్పటికీ..రోజుకి పదివేల నుంచి పదిహైను వేల వరకు నడక వంటివి కచ్చితంగా చేసేవాడు.ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లతో కేవలం 18 నెలల్లో 138 నుంచి ఏకంగా 56 కిలోలు బరువు తగ్గాడు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన బరువుతో 20లలో ఉన్న వ్యక్తిలా అన్నిపనులు సునాయాసంగా చేయగలుగుతున్నానంటూ తన వెయిట్లాస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. (చదవండి: ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!) -
ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!
ఈ రోజుల్లో చేసిన సాయాన్నిగుర్తించుకుని కృతజ్ఞత చూపించడం అత్యంత అరుదు. ఒక వేళ ఆయా వ్యక్తులు తారసపడిన ముఖం చాటేస్తుంటారు చాలామంది. కానీ ఈ జంట ఎప్పుడో చేసిన వైద్యుడి సాయాన్ని గుర్తించుకోవడం కాదు, అతడు తారసపడిన వెంటనే చేసిన పనికి ఆ డాక్టర్ సైతం కంగుతిన్నాడు, ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఆ వైద్యుడు నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..ఆఫ్రికన్ డాక్టర్ ఇద్రిస్ తాహిర్కి ఈ అరుదైన అనుభవం ఎదురైంది. ఆ సాయంత్రం ఒక రెస్టారెంట్లో చేసిన భోజనం తానొక గొప్ప జ్ఞాపకంగా మిగలనుందని అతడి ఆ సమయంలో తెలియదు. ఒక రోజు సాయంత్రం డాక్టర్ ఇంద్రిస్ ఒక రెస్టారెంట్లో డిన్నర్ కోసం వెళ్లాడు. అక్కడ డైనింగ్ టేబుల మీద ఇద్దరు బ్యూటివఫుల్ ట్విన్స్తో ఉన్న జంటను చూస్తాడు. ఆ కవలలను చూసి ఆ వైద్యుడుకి చాలా ముచ్చటేస్తుంది. ఆ తర్వాత వాళ్లంతా తమకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తినడం జరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడు డిన్నర్ పూర్తి అవ్వగానే బిల్లు పే చేద్దామని వెళ్తుండగా కవలల తండ్రి ఆపి తాను బిల్లు పే చేశానని చెబుతాడు. దాంతో తాహిర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఎవరతను తన బిల్లు ఎందుకు కట్టాడని కన్ఫ్యూజన్లో ఉండగా..ఆ జంట డాక్టర్ గారు..మీరు మమల్ని గుర్తుపట్టలేదని అర్థమైంది. ఐదు నెలలు క్రితం తాను తన భార్య ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చామని, అక్కడ తన భార్యకు కవలలను ప్రసవించేలా సాయం చేసింది మీరేనని వివరిస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ డాక్టర్కి ఏం మాట్లాడలేక ఆ దంపతులు చూపిన కృతజ్ఞతకు ఆనందంతో తడిసి ముద్దవుతాడు. అస్సలు ఈ సాయంత్రం డిన్నర్ ఇంతలా తన జీవితంలో ఓ గొప్ప మరుపురాని జ్ఞాపకంగా ఉంటుందని ఊహించలేదు అంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నెటిజన్లు సైతం వృత్తిలో ఆ డాక్టర్ చూపిస్తున్న నిబద్ధతకు అంతా ప్రశంసించడమే కాదు..సేవకు దక్కుతున్న గౌరవం అది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. I saw a couple at a restaurant with their beautiful twins. Just as I was about to pay my bill, the husband insisted he’d already taken care of it. He said, “You probably won’t recognize me, but you’re the one who operated on my wife five months ago, those are the twins you…— Idris Tahir (@Idrees_taheer) February 1, 2026 (చదవండి: ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..) -
ఇక యూట్యూబర్లకు పండుగే!
కేంద్రం యూట్యూబర్లకు పండుగలాంటి వార్త చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్లో దేశీయ క్రియేటివ్ రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలల్లో ప్రత్యేక కంటెంట్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ప్రారంభ దశలో 1,500 పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలలో శిక్షణ అందించనున్నారు.అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్షిప్లుఅంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ కంటెంట్ భారతీయ కంటెంట్ క్రియేటర్లను గ్లోబల్ సెలబ్రిటీలుగా మార్చేందుకు గూగుల్, యూట్యూబ్, మెటా, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజాలతో ఐఐసీటీ కీలక ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల క్రియేటర్లకు కేవలం వ్యూస్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్షిప్లు, స్కాలర్షిప్లు, మెంటర్షిప్ లభించనున్నాయి. దక్షిణ కొరియా మాదిరిగా భారత్ను గ్లోబల్ కంటెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా వేవ్ఎక్స్ (WaveX) ఇన్క్యుబేటర్ ద్వారా స్టార్టప్లకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.సరికొత్త మౌలిక సదుపాయాలుసృజనాత్మక రంగంలో పెరుగుతున్న డిమాండ్ను అందుకునేందుకు ప్రభుత్వం కొత్తగా ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్’ (ఎన్ఐడీ)ను ఏర్పాటు చేయనుంది. ఇది ‘ఛాలెంజ్ రూట్’ ద్వారా ఏర్పాటు కానుంది. దీనితో పాటు పారిశ్రామిక కారిడార్ల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఒకే చోట ఉండటం వల్ల క్రియేటివ్ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేసినట్లవుతుంది.పెరగనున్న ఉపాధి అవకాశాలుఈ బడ్జెట్ ప్రతిపాదనలతో యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లకు అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. ప్రభుత్వ ల్యాబ్లలో హై-ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత క్రియేటర్లకు కూడా ప్రొఫెషనల్ క్వాలిటీ కంటెంట్ రూపొందించే అవకాశం దక్కుతుంది. అలాగే టెక్ దిగ్గజాలతో కుదిరిన ఒప్పందాల వల్ల తమ ఛానల్స్ను మరింతగా మానిటైజ్ చేసుకోవడానికి, మెరుగైన అల్గారిథమ్ సపోర్ట్ పొందడానికి మార్గం సుగమం కానుంది.చిన్న పట్టణాల్లోని క్రియేటర్లకు వరంసాధారణంగా ఒక యూట్యూబర్ హై-క్వాలిటీ వీడియోలు చేయాలంటే లక్షల రూపాయల విలువైన ఎడిటింగ్ సిస్టమ్స్, కెమెరాలు, సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వేల కంటెంట్ ల్యాబ్లు ఈ సమస్యను పరిష్కరిస్తాయి. ఇక్కడ క్రియేటర్లకు ఏఐ టూల్స్, హై-ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న కంప్యూటర్లు, లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని క్రియేటర్లకు వరంగా మారనుంది.గౌరవప్రదమైన వృత్తిగా..గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలతో ఐఐసీటీ ఒప్పందం చేసుకోవడంతో వల్ల యూట్యూబర్లకు కేవలం ‘వ్యూస్’ ఎలా పెంచుకోవాలో మాత్రమే కాకుండా, యాడ్ రెవెన్యూను ఎలా పెంచుకోవాలి?, కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఎలా ఉండాలో నేరుగా ఆయా సంస్థల ప్రతినిధుల నుండే శిక్షణ అందనుంది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ చేసే గేమర్లకు కొత్త టెక్నాలజీపై మరింత అవగాహన పెరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ‘కంటెంట్ క్రియేషన్’ను ఒక గౌరవప్రదమైన వృత్తిగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నది. ఇది కూడా చదవండి: స్కూల్ నుంచి రిటైర్మెంట్ వరకూ.. ‘ముగ్గురు మిత్రులు’ -
ధ్యాన ప్రయాణం
కొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చాక ఎంతకాలమైనా అవి మన హృదయాన్ని వీడిపోవు. అక్కడి ప్రకృతి సౌందర్యం, అద్భుతమైన మనుషుల ప్రవర్తన మన మనసులో అలాగే నిలిచిపోతాయి. అలాంటి వాటిలో అత్యుత్తమమైన స్థానం ‘తవాంగ్’కి దక్కుతుంది. అరుణాచల్ప్రదేశ్లో ఉన్న ‘తవాంగ్’ ఒక హిల్ స్టేషన్ మాత్రమే కాదు. మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే అత్యుత్తమమైన డెస్టినేషన్. పర్వతాల మధ్యలో, మేఘాల నడుమ, బౌద్ధ మత సారాన్ని గ్రహిస్తూ సాగే ధ్యాన ప్రయాణం విశేషాల గురించి ట్రావెలర్ ఎం.జి. కిషోర్ వివరిస్తున్నారు...మహిళా సన్యాసుల మఠాలుతవాంగ్లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్ (జడలు బర్రె) మిల్క్తో చేసిన టీ తాగాను. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.తవాంగ్లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్ (జడలు బర్రె) మిల్క్తో చేసిన టీ తాగాను. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.ఇక్కడ చేయాల్సిన 5 పనులు 1. తవాంగ్కు బయల్దేరినప్పుడు మీకు ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బంది అనిపిస్తే అరుణాచల్ ప్రదేశ్లో అతి ఎత్తైన పర్వత మార్గం ‘సేలా పాస్’ వచ్చిందని అర్థం. ఘనీభవించిన సేలా సరస్సు మీదుగా ప్రయాణించవచ్చు. స్వర్గ సరస్సు అని దీనికి పేరు. ఈ ప్రయాణం అత్యద్భుతంగా అనిపిస్తుంది.2. తవాంగ్లో వార్ మెమోరియల్, పీ.టి.సో లేక్, ఉర్గేలింగ్ మోనాస్టరీ ... తప్పక సందర్శించదగినవి. 3. అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్లి, శిలాఫలకాలపై చెక్కిన సూక్తులు చదివి, అర్ధం చేసుకోవచ్చు.4. బౌద్ధమతంలో కీలక ప్రదేశం కాబట్టి ఇక్కడ జీవహింసకు తావు ఉండదు. కాబట్టి మీరు చీకటి పడ్డాక బయటికి వెళ్తే ఒక డజను కుక్కలు కనిపిస్తే షాక్ అవ్వకండి. అలాగని ఈ కొండ కుక్కలను తేలికగా తీసుకోకండి. ఎక్కడ బయట తిరగాలన్నా చీకటి పడేలోపే అని గుర్తుంచుకోవాలి. 5. తవాంగ్ మోనాస్టరీలో మీరు బౌద్ధ సన్యాసులను జీవితం గురించి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు.సందర్శనీయ స్థలాలు తవాంగ్లో అన్ని దిశల్లో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. తవాంగ్ మోనాస్టరీ నుంచి అన్నీస్ నన్నరీ అనే మహిళల మఠం, లోకల్ మార్కెట్లు, ఇక్కడి చిన్న చిన్న కేఫ్లు, విండ్ హార్స్ అని పిలిచే రంగురంగుల పతాకాలు, ఇవన్నీ ఎవర్గ్రీన్ మెమరీలుగా మిగిలిపోతాయి. ఇక టౌన్ నుంచి బయటికి వస్తే మాధురీ లేక్ చుట్టూ ఉన్న ప్రశాంతత, భారత్–చైనా సరిహద్దు వద్ద ఉన్న బూమ్లా పాస్ ప్రయాణం, మధ్య మధ్యలో కనిపించే ఎన్నో సరస్సులు, ఇవన్నీ మర్చిపోవడం దాదాపు అసాధ్యం.చైనా బార్డర్ ఉన్న బూమ్లా పాస్ వెళ్లాలంటే మీకు ఇన్నర్ లైన్ పర్మిట్తో పాటు లోకల్ అధికారుల నుంచి అనుమతి కూడా అవసరం అవుతుంది. మీరు ఇక్కడ బైక్ రెంట్కు తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. ఆర్మీ క్యాంపుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధం అని తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం.చూరా సబ్జీఅరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయినప్పటి నుంచి మెనూలో మార్పు కనిపిస్తుంది. ఇక్కడ తూ΄ా, చౌమీన్, మోమోస్, అ΄ాంగ్, చూరా సబ్జీతో ΄ాటు అనేక రకాల కొత్త రుచులను ఆస్వాదించవచ్చు.నేను బస చేసిన వారికే ఉదయం బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయమని చె΄్పాను. దాంతో మధ్యాహ్నం సమయంలోనే ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలిగాను. మీరు డ్రాగన్ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల నార్త్ ఈస్ట్ వెరైటీలు లభిస్తాయి.ఇక్కడ ప్రతి ఇంటి ముందు టన్నుల కొద్దీ బంగాళాదుంపలు కనిపిస్తాయి. వాటిని కూరల్లో వినియోగించడంతో ΄ాటు జస్ట్ ఉడకబెట్టి ఉప్పు, మసాలా వేసుకుని తినేస్తారు. ఈ అలవాటు నాకు కాస్త కొత్తగా అనిపించింది. ఎలా వెళ్లాలి?!∙తవాంగ్కు వెళ్లే మార్గం కూడా తవాంగ్ ఎక్స్పీరియెన్స్ లో భాగమే. గమ్యం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని నేర్పే జర్నీ ఇది. ∙గౌహతికి అన్ని ప్రాంతాల నుంచి బస్సు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ∙గౌహతి నుంచి తవాంగ్ వెళ్లే దారిలో పర్వతాల మధ్య మెలికలు తిరిగే రహదారులు, మధ్యలో చేతికి అందేంత దూరంలో మేఘాలు, బ్రహ్మపుత్ర లోయ, దిరాంగ్ వ్యాలీ, వాటిని తడిపేస్తూ ముందుకు వెళ్తున్న బ్రహ్మపుత్ర నది.. ఇవన్నీ మనసును మరో లోకంలో విహరింపజేస్తాయి. గమనిక : తవాంగ్ వెళ్లడం కోసం మంచి ట్రావెల్ హిస్టరీ ఉన్న బస్సు లేదా ట్యాక్సీని మాత్రమే ఎంచుకోవాలి.ఎక్కడ ఉండాలి?∙తవాంగ్లో హోమ్స్టేలు, లోకల్ హౌసులు, మోనాస్టరీ చుట్టూ ఉన్న చిన్న చిన్న లాడ్జీలు అన్నీ కూడా ఈ టౌన్ థీమ్లో పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. ∙హిల్ వ్యూ ఉన్న రూమ్లోంచి ఉదయం సూర్యోదయం చూసిన తరువాత అరుణాచల్ ప్రదేశ్ను ‘‘ది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్’’ అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. ఎందుకంటే భానుడి తొలికిరణం ఇక్కడే పడుతుంది.అతిపెద్ద మఠంభారతదేశంలోనే అతిపెద్ద మోనాస్టరీ అనే మఠం తవాంగ్లో ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మఠం. ఈ మోనాస్టరీలో ఉదయం, సాయంత్రం బౌద్ధ సన్యాసుల ్రపార్థనలు, యాక్ నెయ్యితో వెలిగే దీపాలు, సన్యాసులు నడిచే మార్గాలు, మోనాస్టరీ లోపల చిత్రకళ... ఇవన్నీ మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.లోనార్ లేక్ దక్కన్ పీఠభూమిలో అంతరిక్ష రహస్యంభూమికి, అంతరిక్షానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఎన్నో సందేహాలతో పాటు కుతూహలం కలిగించే ప్రదేశం ఇది. అలాగే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం కూడా. ఎందుకంటే ఇది మనకు తెలిసిన చరిత్రకు ముందు జరిగిన చరిత్ర.ఇక్కడ ఒకానొక కాలంలో ఉల్క పడటం వల్ల భారీ గుండం ఏర్పడింది అని, అది తరువాత సరస్సుగా మారిందని చెబుతారు. సాధారణంగా ఇలాంటి క్రేటర్లు వేల నుంచి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయి. ఈ క్రేటర్లు భూమి – అంతరిక్షం మధ్య ఉన్న చరిత్రకు సాక్ష్యాలు. సౌరమండలంలో జరిగిన మార్పులకు చిహ్నాలు అని కూడా చెప్పవచ్చు. అలాగే భూమిపై జీవనం ఎలా వికసించింది అనేది తెలుసుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి. చుట్టుపక్కల ఉన్న రాళ్లలో అయస్కాంత లక్షణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కావాలంటే మీరూ ఒకసారి ప్రయత్నించవచ్చు. ఉదయం వేళ పక్షుల కిలకిలారావాలతో పాటు, చాలా తక్కువ సంఖ్యలో పర్యాటకులను కూడా చూడవచ్చు. లోనార్ లేక్ పర్యావరణ వ్యవస్థ అనేది చాలా సున్నితమైనది. అందుకే దీనిని పర్యాటక ప్రాంతంగా ప్రమోట్ చేయడం లేదు. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చు. పర్యాటకులు పరిశీలించవచ్చు. అంతే కానీ, లోనార్కు వెళ్లి ‘చూసొచ్చాం’ అని కాకుండా భూమి చరిత్రను ‘తెలుసుకుని వచ్చాం’ అని చెప్పడం బెస్ట్.ఫోన్లో ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎక్కడ సేవ్ చేయాలి?!ప్రయాణాల్లో డాక్యుమెంట్స్ చూపించమని అధికారులు కోరితే పేపర్లు వెతికే అవసరంఈ రోజుల్లో లేదు. మీ ఫోన్ లోనే అన్నీ సేవ్ చేసుకోండి. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..∙ఈ రోజుల్లో చాలా మంది ప్రయాణికులు తమ డాక్యుమెంట్స్ అంటే ఐడీ ప్రూఫ్స్, హోటల్ బుకింగ్, ట్రైన్ వివరాలు అన్నీ కూడా ఫోన్ లోనే సేవ్ చేసుకుని బయల్దేరుతున్నారు. పేపర్ ఫైల్స్ క్యారీ చేయడం కన్నా స్క్రీన్ పై డిపెండ్ అవ్వడం ఇప్పుడు సాధారణం అయింది. అయితే దీని కోసం ఒక చిన్న డిజిటల్ ట్రావెల్ హ్యాబిట్ను మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ∙ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లౌడ్ స్టోరేజీలో (Google Drive లాంటివి) ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి స్టోర్ చేసుకోండి.∙ఇందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , టికెట్లు, కన్ఫర్మేషన్స్ , వీసా.. ఇలా అన్ని డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ పోయినా లేదా బ్యాటరీ లో అయినా గూగుల్ డ్రైవ్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.∙తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్పోర్టులో, రైల్వే కౌంటర్లో, హోటల్ రిసెప్షన్ లో హఠాత్తుగా ఎవరైనా డాక్యుమెంట్స్ అడిగినప్పుడు బ్యాగ్లలో వెతకడం కన్నా ఫోన్ లో డాక్యుమెంట్స్ క్షణాల్లో వారికి చూపించవచ్చు.హంపి ఇక్కడ ప్రతి రాయికీ ఓ కథ ఉందిహంపి అంటే చాలా మంది శిధిలాల నగరం అని పిలుస్తుంటారు. కానీ హంపిలో అడుగుపెట్టగానే మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్.. ఇవి శిథిలాలు కాదు. ఇవి పురాతనమైన నగరం తాలుకూ ఙ్ఞాపకాలు అని!హిస్టరీ క్లాసుల్లో వినేటప్పుడు బోర్ కొట్టిన విషయాలను ఇక్కడి శిథిలాలు నోరు తెరచి తమ కథను చెబుతున్నట్టు అనిపిస్తుంది. రాళ్లకు జీవం ఉండదు. అయితే హంపీ జీవం లేని ప్రదేశం కాదు. ఇక్కడ రాళ్లు, ఆలయాలు, నదీ శబ్దం ఇన్నీ కూడా మనల్ని పర్యాటకులుగా కాదు ఒక చరిత్రకారుడిలా ట్రీట్ చేస్తాయి. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి మనం గతంలోకి వెళ్లిపోతాం. సూర్యాస్తమయం సమయంలో హంపీ రంగులు ఒక అందమైన కవిత్వంలా కనిపిస్తాయి. రాళ్ల రంగును డామినేట్ చేసే బంగారు వర్ణం ఒక డిఫరెంట్ షేడ్లా మారిపోతాయి. చరిత్రను మనం పుస్తకాల్లో చదవడం అలవాటు చేసుకున్నాం. కాని పుస్తకాలు దాటి అర్థం చేసుకునే అవకాశం మాత్రం హంపీ లాంటి ప్రదేశాల్లోనే దొరకుతుంది.లంగ్కావిస్ట్రెస్ నుంచి బ్రేక్...లంగ్కావి వెళ్తే సరి!మలేషియాలోని లాంగ్కావి ద్వీపంలో అడుగు పెట్టగానే టైమ్ బ్రేక్ తీసుకుందేమో అనిపించకమానదు. అంతా కాస్త స్లో అవుతుంది. అండమాన్ సముద్ర తీరంలో ఉన్న ఈ ఐలాండ్ బీచులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. క్రౌడ్, సౌండ్, హడావిడి లేని బీచ్ ఎక్స్పీరియెన్స్ కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. మొత్తానికి, స్లో టూరిజం ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.ఎలా చేరుకోవాలంటే...లంగ్కావికి విమానంలో సులభంగా చేరుకోవచ్చు. కౌలాలంపూర్ నుంచి ప్రతీ రోజూ డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ముందుగా కౌలాలంపూర్ చేరుకుని, అక్కడి నుంచి దేశీయ విమానాల్లో లాంగ్కావికి ప్రయాణిస్తారు. అలాగే, ఇక్కడికి చేరుకునేందుకు ఫెర్రీ ఆప్షన్ కూడా ఉంది. పెనాంగ్ లేదా కౌలా కెదాహ్ నుంచి లాంగ్కావికి రెగ్యులర్ ఫెర్రీలు నడుస్తాయి.చిరుగాలుల సవ్వడి..లాంగ్కావిలో యాక్టివిటీస్ అంటే సుడిగాలిలా కాకుండా చిరుగాలిలా ఉంటాయి. సింపుల్ అండ్ స్మూత్ యాక్టివిటీస్ ఉంటాయి. బీచ్ వాక్, సన్ సెట్ చూడటం, మాంగ్రోవ్ వనాల్లో బోట్. లాంగ్కావి అనేది సాధారణ పర్యాటక ప్రదేశం కాదు. హడావిడి ఉండదు, ట్రావెల్ లిస్ట్ కంప్లీట్ చేయాలనే తొందర కూడా కనిపించదు. కాబట్టి, నిజంగా బుర్రకు బ్రేక్ కావాలి అంటే.. లాంగ్కావి బెస్ట్ ప్లేస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.పర్యటన కాలం∙ పర్యటనకు సరైన సమయం అనేది సీజన్ ను బట్టి మారుతుంది. మంచు చూడాలనుకుంటే చలికాలంలో వెళ్లొచ్చు. ∙ తవాంగ్ను ప్రశాంతంగా చూడాలంటే చలికాలానికి ముందు వెళ్లడం మంచిది. ∙ వర్షాకాలం మాత్రం ప్లాన్ చేయకపోవడం ఉత్తమం.∙ మొత్తానికి నార్త్ ఈస్ట్ ఎంత అందంగా ఉంటుందో స్వయంగా కళ్లతో సందర్శిస్తేనే తెలుస్తుంది. ఒక్కసారి వెళ్తే ఈ ప్రయాణం మైండ్లో స్టోర్ అయి, గుండెలో రిపీట్ మోడ్లో ప్లే అవుతూనే ఉంటుంది.– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు -
ఆకుపచ్చని చీరలో మెరిసిపోతున్న మాధురి దీకిత్..!
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహ సీజన్ని తలంపుకి వచ్చేలా ఆమె లుక్ మెస్మరైజ్ చేస్తోంది. ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరలో ఈ ఐదు పదుల బ్యూటీ ముగ్దమనోహరంగా ఉంది. కనుచూపుని తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్తో ఆకర్షిస్తోంది. జనవరి 31న, మాధురి ఇన్స్టాగ్రామ్లో “పియా తోసే నైనా లాగే రే (1965 చిత్రం గైడ్ నుండి లతా మంగేష్కర్ పాట)” అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్ చేశారామె. ఆ పచ్చదనం మాధురికి రాచరికపు లుక్ని అందించింది. ఈ చీర అంచుల వెంబరడి జర్దోజీ ఎంబ్రాయిడరీ చీర విలాసవంతమైన లుక్ని హైలెట్ చేసింది. ఆ చీరకు సరిపోయేలా అదే కలర్లోని ఎంబ్రాయిడరీ బ్లైజ్ ఈ వివాహ వేడుకలకు లేటెస్ట్ ఫ్యాషన్స్టైల్గా నిలిచింది. స్టైలిష్గా కూర్చొన్న తీరు..జాలు వారుతున్న ఆ శారీ పల్లు రాజదర్బారులో కూర్చొన్న మహారాణిలా హుందాగా కనిపించింది మాధురి. జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చిన ఈ ఆకుపచ్చని చీర ధర వింటే నోరెళ్లబెడతారు. ఎంతంటే..అక్షరాలు రూ. 1,39,900లు పలుకుతుంది. ఆ చీరకు తగ్గట్టు మాధురి ఎంచుకున్న మేకప్, హెయిర్స్టయిల్ ఆమె లుక్ని మరింత గ్రాండ్గా కనబడేలా చేసింది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) (చదవండి: కిచెన్పై బడ్జెట్ ప్రభావం..ఏం తగ్గనున్నాయంటే..!) -
కిచెన్పై బడ్జెట్ ప్రభావం..ఏం తగ్గనున్నాయంటే..!
కేంద్ర బడ్జెట్ 2026–27 దేశవ్యాప్తంగా గృహాలు, ఆహార సంబంధిత వ్యాపారాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే మార్పులను ప్రవేశపెట్టింది. ఈసారి ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, దేశీయ తయారీకి మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించి మరీ ధరలను సర్దుబాటు చేసింది. అవేంటో సవివరంగా చూద్దామా..!.శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా బయోగ్యాస్ ఆధారిత CNG ఉత్పత్తి ఖర్చును తగ్గించింది. ఈ సంస్కరణ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తోంది. ఫలితంగా వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రీయ వ్యర్థాలను సరఫరా చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను అందించనుంది.మైక్రోవేవ్ ఓవెన్లు మైక్రోవేవ్ ఓవెన్లు వాటి తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయించబడినందున అవి మరింత సరసమైన ధరలో లభించనున్నాయి. దేశీయ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రంగంలో విలువ జోడింపును పెంచడం, దిగుమతి చేసుకున్న భాగాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, తయారీ ఖర్చులను తగ్గించడమే దీని లక్ష్యం.సీఫుడ్ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి, సీఫుడ్ ప్రాసెసింగ్లో ఉపయోగించే ఇన్పుట్లకు సుంకం లేని దిగుమతి పరిమితిని 1% నుంచి 3%కి పెంచారు. ఇది ప్రాసెసర్లకు ముడి పదార్థాలు, పరికరాలను సోర్సింగ్ చేయడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది.ఫిబ్రవరి 1, 2026 నుండి 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 49 పెరిగింది, దీనితో ఢిల్లీలో కొత్త రేటు రూ. 1,740.50కి చేరుకుంది. నెలవారీ ధరల సర్దుబాటులో భాగమైన ఈ సవరణ, రోజువారీ కార్యకలాపాల కోసం LPGపై ఎక్కువగా ఆధారపడే రెస్టారెంట్లు, హోటళ్ళు, కేఫ్లు, వీధి ఆహార విక్రేతలను ప్రభావితం చేస్తుంది. అయితే, దేశీయ LPG సిలిండర్ ధరలు మారవు.కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్ వెండింగ్ మెషీన్లపై ప్రభుత్వం ఇప్పటికే ఉన్న మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఈ చర్య అటువంటి పరికరాల ధరను పెంచుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ యంత్రాలను సాధారణంగా కేఫ్లు, రెస్టారెంట్లు, కార్యాలయ స్థలాలు, వాణిజ్య పానీయాల కౌంటర్లలో ఉపయోగిస్తారు. వీటిలో చాలా వరకు దిగుమతి చేసుకున్న మోడళ్లపై ఆధారపడి ఉంటాయి. సవరించిన సుంకం నిర్మాణం అమలులోకి రావడంతో, వ్యాపారాలు అధిక పెట్టుబడి లేదా భర్తీ ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు. కాఫీ సేవ రోజువారీ కార్యకలాపాలకు అంతర్భాగంగా ఉన్న సంస్థలకు నిర్వహణ ఖర్చుల భారం అధికమవనుంది.పాల ధరలు2026–27 బడ్జెట్ కింద కొత్త సవరణలు లేకుండా పాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.(చదవండి: ఆర్థిక చరిత్రలోనే తొలిసారి ఇలా..! కానీ 1999లో మాత్రం..) -
రామేశ్వరం ఆలయంలో సోమనాథ జ్యోతిర్లింగానికి మహారుద్ర పూజ
గుడి గంటల నాదం, తీరాన్ని తాకుతున్న అలల నాదంతో శ్రుతి కలిపిన వేళ, ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు, పంచభూత క్షేత్రాలు, అమర్నాథ్, పశుపతినాథ్ ఆలయాల పండితుల శక్తివంతమైన, ధ్యానమయమైన వేద మంత్రోచ్ఛారణల నడుమ, శుక్రవారం సాయంత్రం రామేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సమక్షంలో సోమనాథ జ్యోతిర్లింగ మహా రుద్ర పూజతో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి.తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు అపార భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమం , రామేశ్వర తీరాన్ని ప్రార్థన, భక్తి, ఆధ్యాత్మిక జాగృతి కేంద్రంగా మార్చివేసింది.రుద్రాభిషేకం అనేది ప్రాచీన వేద సంప్రదాయంలో భాగమైన పవిత్ర కర్మ. ఇందులో పరమశివుడు రుద్రుడి కరుణామయ స్వరూపంలో పూజింపబడతాడు. ఈ పూజ వలన భక్తులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని, కోరికలు సాకారం అవుతాయని భక్తుల విశ్వాసం. పాలు, నెయ్యి, తేనె, నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో లింగాభిషేకం చేయడం, నిరంతర మంత్రోచ్ఛారణల ద్వారా మనస్సు, పరిసర వాతావరణం శుద్ధి అవుతాయని, అడ్డంకులు వ్యతిరేక భావనలు తొలగిపోతాయని భావిస్తారు.గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు, అమర్నాథ్, పశుపతినాథ్ ఆలయాల నుండి వచ్చిన ప్రముఖ పండితులు సామూహికంగా ఈ మహా పూజకు ప్రారంభించారు. ఈ పవిత్ర కర్మలో భాగంగా, ఆయా ఆలయాల నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన తీర్థ జలాలను సమర్పించడం భారతదేశ ఆధ్యాత్మిక ఏకత్వాన్ని ప్రతిబింబించింది.ఈ సందర్భానికి మరింత విశిష్టత చేకూర్చుతూ, ప్రకృతిలోని పంచభూతాలను సూచించే పంచభూత క్షేత్రాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలను కూడా ఈ రుద్రాభిషేకంలో సమర్పించారు. ఈ పవిత్ర జలాల సంగమం ప్రకృతి, భక్తి, వేద జ్ఞానాల సమన్వయాన్ని ప్రతిఫలించింది.“గురుదేవ్ సృష్టించిన దైవిక వ్యవస్థ, ఇక్కడ ఏర్పడిన అపార ఆధ్యాత్మిక వైభవం కారణంగా ఈ మహా రుద్ర పూజను తరతరాలు గుర్తుంచుకుంటాయి,” అని వారణాసి కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన పండిత్ రమానంద్ దుబే అన్నారు. “జ్యోతిర్లింగాలు అన్నీ ఇక్కడే కొలువై ఉన్నట్లుగా అనిపిస్తోంది.”సాయంత్రం కార్యక్రమంలో, 7వ శతాబ్దానికి చెందిన ప్రముఖ శైవ నాయనార్ సంత్ తిరుజ్ఞానసంబందర్ రచించిన పవిత్ర కొలారు పతిగాన్ని ప్రపంచవ్యాప్తంగా 180కు పైగా దేశాలలోని దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ఏకకాలంలో పారాయణ చేశారు. ఆలయాలు, ఇళ్లు, సామాజిక కేంద్రాల నుండి భక్తి స్వరాలు ఏకకాలంలో మార్మోగుతూ, భౌగోళిక సరిహద్దులను దాటి శాంతి సామరస్యాలకు చిహ్నంగా, శక్తివంతమైన విశ్వ ప్రార్థనగా మారాయి.ఈ మహా రుద్ర పూజతో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత నాలుగు దశాబ్దాలుగా, ఈ సంస్థ ధ్యానం, ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలు, మానవతా సహాయం, విద్య, పర్యావరణ పరిరక్షణ, శాంతి నిర్మాణ కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి చేరువైంది. రామేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమం సేవ, అంతర్గత పరివర్తన వైపు మానవాళి సాగించే నిరంతర ప్రయాణానికి స్ఫూర్తిగా నిలిచింది. -
ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..
కొన్ని ఘటనలు ఎంతో ఆలోచించేలా చేస్తాయి. కొత్త స్ఫూర్తిని నింపుతాయి. చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తే మనం, ఇలాంటి బామ్మను చూసి ఎంతో ప్రేరణ పొందుతాం. కష్టం ఏదైతేనేం..దాన్ని అధిగమించేలా నవ్వుతూ మనపని మనం ఎలా చేసుకుంటూ పోవాలో ఈ బామ్మని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆత్మగౌరవం అనే మాటకు అసలైన అర్థంలా అనిపిస్తుంది ఈ బామ్మ జీవన విధానం..ఆ బామ్మ పేరు 89 ఏళ్ల కమలాబెన్ మెహతా. ముంబై లోకల్ రైళ్లలో నిశబ్దంగా బ్రాస్లెట్లు అమ్ముతు ఉంటుందామె. ఆమెను చూడగానే ఈ వయసులో ఇంతలా కష్టపడుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆమె ఎవరి నుంచి సానుభూతిని, దాతృత్వాన్ని ఆశించకుండా కష్టపడుతున్న తీరు నిజంగా మనసుని కదిలిస్తుంది. చనిపోయేదాక ఆత్మగౌరవానికి భంగం కలగకుండా బతకడం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఆ బామ్మని చూస్తే. అందుకు సంబంధించిన పోస్ట్ని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ఆమెతో మాటలు కలపగా తనపేరు కమలాబెన్ అని, తన వయసు 89 ఏళ్లని ఆ బామ్మ చెప్పిందని పోస్ట్లో పేర్కొన్నాడు. తన కుటుంబంతో కలిసి జీవించడానికి తన వంతుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేందుకే ఈ పని చేస్తున్నట్లు తెలపింది. తాను ముంబైలోని నలసోపారాలో నివశిస్తున్నట్లు పేర్కొంది. ఆమెకు సాయం చేయాలని.. తన దగ్గరున్న బ్రాస్లెట్లు కొందామనుకున్నా.. అంత మొత్తం లేకపోవడంతో ఆ బామ్మ ఇంటి అడ్రస్ అడగగా, ఆమె అందుకు నిరాకరించింది. పైగా తన కుటుంబ తన వల్ల అవమానపాలు కాకూడదు అంటూ అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించిందని పోస్లో రాసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు. నిజానికి ఆ వయసులో ఈ బామ్మ ఏ రకంగానైనా సంపాదించొచ్చు. కానీ తన ఆత్మగౌరవం కోసం శరీరం సహకరించి వృద్ధాప్యంలో కూడా అచంచలమైన పట్టుదలతో చేతితో తయారు చేసిన బ్రాస్లెట్లు అమ్ముతూ సంపాదించాలనుకోవడం నిజంగా ప్రశంసనీయం..స్ఫూర్తిదాయకం. చివరి క్షణం వరకు తలెత్తుకునే బతకాలి కానీ, చేయిచాచి కాదు అని చెంపపగిలేట్టు సమాధానమిచ్చే ఘటన ఇది. ఇంకెందుకు ఆలస్యం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Meeta Tushit Shah (@meetatushitshah) (చదవండి: అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా ఐదు హిమాలయాలు..) -
అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా హిమాలయాల్లోని..
భారతీయ అల్ట్రా-డిస్టెన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుఫియా వంద గంటల్లోపూ కఠినమైన మనాలి-లేహ్ హై-ఆల్టిట్యూడ్ రన్ను పూర్తి చేసి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇంతవరకు ఏ మహిళ సాధించిన ఘనత ఇది. హిమాలయాల్లో మొత్తం ఐదు ఎత్తైన పర్వత పాస్ల మీదుగా దాదాపు 470–480 కి.మీ. దూరం వేగవంతంగా రన్ చేసి రికార్డు సృష్టించింది. వంద గంటల లక్ష్యాన్ని తృటిలో అధిగమించి..కేవలం 98 గంటల 27 నిమిషాల్లో పరుగును పూర్తి చేసింది. ఈ మేరకు సూఫీ తాను సాధించిన ఘనతను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఇలా వివరించింది. తాను ఈ రికార్డును 2023లో అధికారికంగా ఆమోదించారని, కానీ సర్టిఫికేట్ రావడానికి ఇంత సమయం పట్టిందని చెప్పుకొచ్చిది. ఐదు హై పాస్ల ద్వారా మనాలి నుంచి లేహ్ వరకు అత్యంత వేగవంతమైన పరుగు, హై-ఆల్టిట్యూడ్ ఎండ్యూరెన్స్ రన్నింగ్ ఛాలెంజ్… లక్ష్యం: 100 గంటలు. ఇక్కడ సూఫీ దాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసింది. అయితే అధికారిక సర్టిఫికేట్ ఇండియన్ కస్టమ్స్ ద్వారా చేరుకోవడానికి చాలా సమయం తీసుకోవడం విశేషం. ఈ పోస్ట్పై నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. సూఫీ సాధించిన విజయం నిజంగా ప్రశంసనీయం. తదుపరి ఛాలెంజ్ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కూడా. కాగా సూఫీకి ప్రపంచ రికార్డులు కొత్తేమి కాదు. ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగవంతంగా పరిగెత్తిన మహిళగా, అలాగే భారతదేశం అంతటా 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రన్ను తదితరాలను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పొందామె. ఇవేగాక దేశంలో కఠినమైన భూభాగాల్లో అల్ట్రా-డిస్టెన్స్ రన్లను కూడా చేపట్టింది.(చదవండి: తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..) -
తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..
ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.అందుకు సంబంధించిన వీడియోని జితేందర్ సారస్వత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్ని ఓ చిన్న కీప్యాడ్ఫోన్లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఫోన్ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్ని చూసి చెప్పండి అంటూ పోస్ట్ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Jitendar Sarswat (@sarswatjitendar) (చదవండి: హార్డ్వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్గా పోస్ట్) -
స్కూల్ నుంచి రిటైర్మెంట్ వరకూ.. ‘ముగ్గురు మిత్రులు’
ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులనడానికి నిజమైన అర్థంగా నిలిచారు. ఒకటో తరగతితో మొదలైన వారి స్నేహం.. చదువు పూర్తయ్యి, ఉద్యోగాలలో చేరి.. పదవీ విరమణ చేసే వరకూ ఐక్యంగా కొనసాగింది. ఈ ఉదంతం తెలిసిన వారంతా తెగ ఆశ్యర్యపోతున్నారు. వారి అమూల్య స్నేహాన్ని చూసి, వారేవా అంటున్నారు. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లా నెయ్యస్సేరి గ్రామానికి చెందిన కథనం. 1975లో నెయ్యస్సేరి సెయింట్ సెబాస్టియన్ హైస్కూల్లో ఒకటో తరగతిలో అడుగుపెట్టిన ముగ్గురు చిన్నారులు.. సోని మాథ్యూ, సాల్జీ ఇమ్మాన్యుయేల్, సిమీ జోస్లు తొలుత క్లాస్మేట్స్. కాలక్రమేణా వీరి పరిచయం విడదీయలేని బంధంగా మారి, ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి నాంది పలికింది. వీరి విద్యాభ్యాసంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వీరు ముగ్గురూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఒకే బెంచిపై పాఠాలు వింటూ, పెరిగిన ఈ స్నేహితులు, పదో తరగతి తర్వాత కూడా ఒకేలాంటి లక్ష్యాలతో ముందుకు సాగారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక, సమాజానికి మేలు చేసే ఉపాధ్యాయ వృత్తినే ముగ్గురూ ఎంచుకోవడం విశేషం.సోని మాథ్యూ సోని మాథ్యూ తన కెరీర్లో పదేళ్ల పాటు హైస్కూల్ టీచర్గా సేవలందించి, తాను చదువుకున్న నెయ్యస్సేరి పాఠశాలలోనే ఏడాది పాటు హెడ్ మాస్టర్గా బాధ్యతలు నిర్వహించడం విశేషం. త్వరలో ఈయన పైన్కులం సెయింట్ రీటాస్ హైస్కూల్ హెడ్ మాస్టర్గా పదవీ విరమణ చేయనున్నారు. తన విజ్ఞానంతో ఎందరో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన తృప్తి ఆయన కళ్లలో నిరంతరం కనిపిస్తుంటుంది.సాల్జీ ఇమ్మాన్యుయేల్ విద్యా యజ్ఞంలో అలుపెరగని బాటసారి సాల్జీ ఇమ్మాన్యుయేల్ తన వృత్తి జీవితంలో కేరళలోని ముతలకోడం, చెమ్మనార్, ఇలందేశం, రాజముడి, చలస్సేరి తదితర మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేసిన ఆమె ప్రస్తుతం కలియార్ సెయింట్ మేరీస్ ఎల్పీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్షరమే ఆయుధంగా ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.సిమీ జోస్ అంకితభావానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ ముగ్గురి బృందంలో మరొకరు సిమీ జోస్. వెన్మణి సెయింట్ జార్జ్ యూపీ స్కూల్, వలక్కల్ ఎల్ఎఫ్ యూపీఎస్, ఎలుముట్టం సెయింట్ మేరీస్ తదితర పాఠశాలల్లో సేవలు అందించారు. ప్రస్తుతం కొడిక్కులం సెయింట్ మేరీస్ ఎల్పీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె, తన తోటి స్నేహితులతో కలిసి ఒకేసారి పదవీ విరమణ చేయనుండటం గమనార్హం.కొత్తమంగళం డియోసెస్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు హెడ్ మాస్టర్ హోదాల్లో ఉన్న ఈ ముగ్గురు మిత్రులు.. 2026, మార్చి నెలలో ఒకేసారి పదవీ విరమణ చేయనున్నారు. ఒకే పాఠశాలలో ఓనమాలు నేర్చుకున్న ఈ స్నేహితులు.. ఐదు దశాబ్దాల తర్వాత ఒకే సమయంలో విద్యాశాఖ నుండి వీడ్కోలు తీసుకోవడం కేరళ విద్యా వర్గాల్లో అరుదైన రికార్డుగా నిలిచింది. ఇది కూడా చదవండి: నిపా వైరస్: భారత్కు ‘ఆరోగ్య సంస్థ’ హెచ్చరిక -
కథాకళి: విలన్
ఆ ఆదివారం, జనవరి పద్దెనిమిదిన ముప్ఫై రెండేళ్ళ ఏగ్నెస్ సెయింట్ ఫిలోమినా చర్చ్లోంచి బయటికి వచ్చి, మెట్రో స్టేషన్స్ దాకా నడిచింది. తన హేండ్బేగ్ తెరచి డబ్బు లెక్క చూసుకుని, కొద్దిసేపు ఆలోచించింది. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని అనుకుంటోది. వెళ్ళాక ఏదో కొనాలనిపిస్తుంది. కాని సరిపడా డబ్బు లేదు. ఆ ఆదివారం సాయంత్రం హాస్టల్కి వెళ్ళి గదిలో ఒంటరిగా గడపటానికి ఇష్టపడక ఆమె మెట్రో స్టేషన్స్ లోకి నడిచింది. ముప్పావు గంట తర్వాత ఆమె ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ లోకి టికెట్ కొనుక్కుని వెళ్ళింది. ఒక్కో స్టాల్ని చూసుకుంటూ నడవసాగింది. ఆదివారం కాబట్టి అక్కడ బాగా రద్దీగా ఉంది.ఏగ్నెస్ మిరపకాయ బజ్జీల స్టాల్ దగ్గర ఆగింది. బయట అమ్మే ధర కన్నా ఒకోటి నాలుగు రెట్ల ధర. ఆకలిగా ఉండటంతో రెండు కొనుక్కొని తిన్నది. ఆమె తను ఏమేం కొనలేక పోతోందో స్టాల్స్లో చూసుకుంటూ సగం దూరం వెళ్ళాక అది జరిగింది. అకస్మాత్తుగా ఒకడు ఆమె హేండ్ బేగ్ని లాక్కుని పరిగెత్తాడు.‘‘ఆగు. దొంగ. దొంగ.’’ ఆమె అరుస్తూ అతని వెంట పరిగెత్తింది.అతను మనుషుల్ని పక్కకి తోసుకుంటూ వేగంగా పరిగెత్తాడు. ఏగ్నెస్ ఆ రద్దీలో అతని వెంటపడి పట్టుకోలేకపోయింది. అతను ఎర్ర టీషర్ట్, జీన్స్ తొడుక్కున్నాడని మాత్రం గుర్తించింది. అతని వయసు పాతిక దాకా ఉండచ్చని అనుకుంది. కొందరు ఆమెని ప్రశ్నించసాగారు.‘‘దొంగని గుర్తుపట్టగలరా?’’‘‘ఎంతుంది?’’‘‘పోలీస్ పోస్ట్ ఎంట్రన్స్ గేటు పక్కన ఉంది. వెంటనే రిపోర్ట్ చేయండి.’’ ఓ ముసలాయన సలహా ఇచ్చాడు.ఆమె పాతిక అడుగులు వేశాక, ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకి ఆ హేండ్బేగ్ని అందిస్తూ అడిగాడు.‘‘మీదే కదా ఇది?’’‘‘అవును. మీకు ఎలా దొరికింది?’’ ఏగ్నెస్ సంభ్రమంగా అడిగింది.‘‘మీ అరుపులు విన్నాను. వాడు నా ముందు నుంచే పరిగెత్తాడు. మీ అరుపులు విన్నాక మగాడి చేతిలో లేడీస్ హేండ్బేగ్ చూడగానే ఏం జరిగిందో గ్రహించి కాలు అడ్డుపెట్టాను. వాడు పడగానే దీన్ని లాక్కున్నాను. వెధవ. నా దవడమీద కొట్టి పారిపోయాడు.’’‘‘థాంక్స్ అండీ. మీరు నిజంగా హీరో.’’ ఏగ్నెస్ చెప్పింది.‘‘విలన్స్ ఉంటేనే హీరో ఉంటాడు. ఏం పోలేదుగా? చూసుకోండి. ఐనా వాడికి దాన్ని తెరిచి కొట్టేసే సమయం లేదు లెండి.’’‘‘ఇది బీద హేండ్బేగ్. అందులో హాస్టల్కి వెళ్ళడానికి సరిపడా డబ్బు మాత్రమే ఉంది. కాకపోతే ఐడీ కార్డ్ గురించి నేను వర్రీ అయ్యాను.’’‘‘మీ పేరు?’’‘‘ఏగ్నెస్.’’‘‘నేను అబిడ్స్లో మొబైల్స్ రిపేర్ షాప్ నడుపుతున్నాను.’’‘‘నైస్. థాంక్స్ అగైన్స్ అండీ. మీకు మిర్చిబజ్జీలు కొనిపెట్టాలని ఉంది. కాని అంత డబ్బు లేదు.’’ ఏగ్నెస్ నొచ్చుకుంటూ చెప్పింది.‘‘ఫర్వాలేదు. మీ బేగ్ జాగ్రత్త. బై.’’ చెప్పి అతను వెళ్ళిపోయాడు.ఆమెకి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. తిరిగి మెట్రో స్టేషన్స్ కి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతోంది. టికెట్ కొనడానికి హేండ్బేగ్ని తెరిచి చూసి భృకుటి ముడివేసింది. అందులోంచి ఐదువందల రూపాయల నోట్ల కట్టని బయటికి తీసి చూసింది.ఏభై వేల రూపాయలు! ఇది తన హేండ్ బేగ్లోకి ఎలా వచ్చింది? ఆ దొంగ పెట్టి ఉంటాడు. ఎందుకు పెట్టినట్లు? బహుశా ఇంకెవరి దగ్గరో కొట్టేసింది తన బేగ్లో ఉంచి ఉంటాడనే ఆలోచన ఆమెకి కలిగింది.ఇప్పుడు తనేం చేయాలి? పోలీసులకి జరిగింది చెప్పి ఆ డబ్బు ఇవ్వటం సబబు. కాని దాదాపు ప్రతి ఇండియన్స్ కి వచ్చే ఆలోచన దాన్ని రద్దు చేసింది. అది దాని యజమానికి కాక పోలీసుల జేబులోకి వెళ్ళే బదులు తనే వాడుకోవచ్చుగా?మెట్రోలో వెళ్తూ ఆ డబ్బుతో ఏం కొనాలో ఆలోచించింది. చాలా గుర్తొచ్చాయి. ముఖ్యంగా సిటీ సెంటర్ మాల్లో, జూడియోలో విండో షాపింగ్లో చూసిన గౌన్స్ గుర్తొచ్చింది. ఆమె కూకట్పల్లిలో మెట్రోలోంచి బయటికి వచ్చి, పది నిమిషాల దూరంలోని తన వర్కింగ్ విమెన్స్ హాస్టల్కి నడవసాగింది. రోడ్లోంచి ఓ సందులోకి, అందులోంచి ఆట్టే రద్దీ లేని మరో చిన్న సందులోకి నడిచాక వినిపించింది.‘‘హలో ఏగ్నెస్.’’ఆమె తల తిప్పి చూస్తే, ఇందాక ఆ హేండ్ బేగ్ ఇచ్చిన వ్యక్తి పక్కనే నడుస్తూ కనిపించాడు.‘‘హలో. మళ్ళీ కలిశాం.’’ ఆశ్చర్యంగా చెప్పింది.‘‘ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లుగా నేను హీరోని కాను. విలన్స్ ని. ఆ డబ్బు ఇవ్వండి.’’ కఠినంగా చెప్పాడు.‘‘డబ్బు? ఏ డబ్బు?’’‘‘మెట్రో స్టేషన్స్ బయట దాన్ని తీసి చూసుకుని, మళ్ళీ నువ్వు హేండ్ బేగ్లో ఉంచిన ఏభైవేలు.’’ఆమె తెల్లబోతూ చూస్తూంటే అతను ఆమె హేండ్బేగ్ని అందుకుని అందులోంచి ఆ సొమ్ము తీసుకుని చెప్పాడు.‘‘వాడు నా తమ్ముడు. ఓ దుకాణంలో కేష్ బాక్స్లోంచి దాన్ని దొంగిలించాడు. పోలీసులు పట్టుకున్నా తన దగ్గర ఆ డబ్బు దొరకకూడదని దీన్ని నీ హేండ్బేగ్లో ఉంచి నాకు ఇచ్చాడు. నేను దాన్ని నీకు ఇచ్చాను.’’అతను ఆ డబ్బు తన జేబులో ఉంచుకుని వేగంగా వెళ్ళిపోతూంటే, ఏగ్నెస్ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
మృగశృంగుని వృత్తాంతం
పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు కర్దమ మహర్షి కుమార్తెను వివాహమాడాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మృగశృంగుడని నామకరణం చేశారు. కుత్సురుడు కుమారుడికి ఐదో ఏట ఉపనయనం చేశాడు. ఆ బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించి, తండ్రి వద్ద సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. కొంతకాలానికి అతడు యుక్తవయసుకు వచ్చాడు. దేశాటనకు పోవాలనే కోరికతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని, ఇంటి నుంచి బయలుదేరాడు. మృగశృంగుడు దేశాటన సాగిస్తూ, మార్గమధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ కొన్నాళ్లకు మాఘమాసం సమీపిస్తుండగా, కావేరీ తీరానికి చేరుకున్నాడు. ‘ఏమి నా భాగ్యం! మాఘమాసంలో కావేరీ స్నానమాచరించే అవకాశం దొరికింది. మాఘమాసం అంతా ఇక్కడే బస చేస్తాను’ అనుకుని మృగశృంగుడు సంతోషించాడు. నదీ తీరానికి చేరువలోనే ఆశ్రమాన్ని నిర్మించుకుని, అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండటం ప్రారంభించాడు. అతడి తపస్సుకు మెచ్చి ఒకనాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ‘ఓ విప్రకుమారా! నీ తపస్సుకు మెచ్చాను. పవిత్ర మాఘమాసంలో విడువకుండా కావేరీస్నానం సాగిస్తూ వచ్చినందుకు నీ పుణ్యం రెట్టింపైంది. నీకేం కావాలో కోరుకో, తప్పకుండా నెరవేరుస్తాను’ అన్నాడు శ్రీహరి. ‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! నీ దర్శనమాత్రంతోనే నా జన్మ ధన్యమైంది. నాకింకే ఐహిక కాంక్షలూ లేవు. నాకు ఎలా దర్శనమిచ్చావో, ఇదేచోటు కొలువుండి నీ భక్తులకు దర్శనమివ్వు. ఇది చాలు నాకు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి అతడి కోరికను మన్నించి అదేచోట కొలువై వెలిశాడు.కొన్నాళ్లకు మృగశృంగుడు తల్లిదండ్రులను చూడటానికి స్వగ్రామం చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతడిని చూసి సంతోషించారు. మృగశృంగుడికి వివాహం చేయాలని వారు భావించారు. ఇదే సంగతి అతడికి చెబితే, ‘ఆశ్రమాలన్నిటిలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్ఠమని దైవజ్ఞులు చెబుతారు. అయితే, భార్య గుణవతి, అనుకూలవతి అయినప్పుడే గృహస్థాశ్రమ ధర్మాన్ని సజావుగా నిర్వర్తించడం సాధ్యమవుతుంది. అలాంటి యువతి దొరికినప్పుడే వివాహం చేసుకుంటాను’ అన్నాడు. ‘కుమారా! నీ మాటలు సమంజసంగా ఉన్నాయి. నీ కోరిక తీరాలంటే, భగవంతుడైన శ్రీహరిపైనే భారం వేయాలి. నీ అభీష్టం నెరవేరుగాక!’ అన్నారు తల్లిదండ్రులు.ఇలా ఉండగా, భోగాపురం అనే గ్రామంలో సదాచారపరాయణుడైన విప్రుడు ఉండేవాడు. అతడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అందాలరాశి. పేరుకు తగినట్లుగానే గుణవంతురాలు. దైవభక్తి, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన సుశీల నిత్యం ఏదో ఒక వ్రతం చేపడుతూ, పురాణశ్రవణంతో కాలక్షేపం చేస్తూ ఉండేది. ఆమె గుణగణాలను తెలుసుకున్న మృగశృంగుడు ఆమెనే పెళ్లాడదలచాడు.ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి కావేరీ స్నానానికి బయలుదేరింది. అకస్మాత్తుగా ఒక ఏనుగు అటువైపు వచ్చి, ఆ ముగ్గురు యువతులను తరమసాగింది. భయభ్రాంతులైన ఆ యువతులు దిక్కుతోచక పరుగు లంకించుకున్నారు. పరుగెడుతూ వారు ఒక దిగుడుబావిలో పడి మరణించారు. సంగతి తెలిసి హుటాహుటిన అక్కడకు చేరుకున్న వారి తల్లిదండ్రులు విగతజీవులైన కుమార్తెలను చూసి భోరున విలపించసాగారు. మృగశృంగుడికి కూడా ఈ వార్త తెలియడంతో అతడు కూడా అక్కడకు చేరుకున్నాడు. వారిని ఎలాగైనా బతికించాలని సంకల్పించుకున్నాడు. తాను వచ్చేంత వరకు మృతదేహాలను చూస్తుండమని వారి తల్లిదండ్రులతో చెప్పి, నేరుగా కావేరి వద్దకు వెళ్లాడు. మెడలోతు నీళ్లలో మునిగి, ధ్యానం ప్రారంభించాడు. ఈలోగా ఆ యువతుల మరణానికి కారణమైన ఏనుగు అక్కడకు ఘీంకరిస్తూ వచ్చింది. మృగశృంగుడి ఎదుట నిలిచి, భీకరంగా ఘీంకరించింది. మృగశృంగుడు చలించలేదు. అది తదేకంగా అతడినే కాసేపు చూసింది. ఉన్నపళాన అతడిని తొండంతో చుట్టి పైకిలేపి, వీపుమీదకు ఎక్కించుకుంది. ఈ పరిణామాన్ని చూస్తున్న జనాలంతా హాహాకారాలు చేయసాగారు. అయితే, మృగశృంగుడు చలించలేదు. పైగా దీనిని శుభసూచకంగా తలచాడు. ఏనుగు శరీరాన్ని నిమిరి, మంత్రజలాన్ని దానిపై చల్లాడు. తక్షణమే ఏనుగు దేవతారూపం దాల్చి, మృగశృంగుడి ఎదుట నిలిచింది. తనకు శాపవిమోచనం కలిగించినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపి, స్వర్గానికి బయలుదేరింది. శాపవిమోచనం పొందిన ఏనుగు వెళ్లిపోయాక, విగతజీవులైన యువతులను బతికించాలనే సంకల్పంతో మృగశృంగుడు మళ్లీ కావేరిలోకి దిగి, యముడి గురించి ధ్యానం ప్రారంభించాడు. యమధర్మరాజు అతడి దీక్షకు సంతృప్తి చెంది, అతడికి ప్రత్యక్షమయ్యాడు.‘మృగశృంగా! నీ దీక్షకు సంతోషించాను. ఏంకావాలో కోరుకో, తప్పక నెరవేరుస్తాను’ అని పలికాడు.మృగశృంగుడు యమధర్మరాజును వేనోళ్ల స్తుతించి, విగతజీవులైన ముగ్గురు యువతులనూ పునర్జీవితులను చేయమని కోరాడు.యముడు ‘తథాస్తు’ అని పలికాడు.అప్పటివరకు విగతజీవులై పడి ఉన్న ఆ ముగ్గురు యువతులూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచారు. కొంతకాలానికి మృగశృంగుడు సుశీలను పెళ్లాడాడు.∙సాంఖ్యాయన -
బడ్జెట్ భావుకత
ఏడు దశాబ్దాలకు పైగా మన బడ్జెట్ ప్రసంగాలు ఆర్థిక క్రమశిక్షణను మాత్రమే కాకుండా, మన దేశపు గొప్ప సాహిత్య వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి! వివేకానందుడి ధీరత్వం, తిరువళ్ళువర్ నైతికత, చాణక్యుడి వ్యూహం; గాలిబ్, ఇక్బాల్ల కవిత్వం.. ఇలా ఎందరో సాహితీవేత్తల ఉల్లేఖనాలు మన ఆర్థిక ప్రణాళికా ప్రసంగాలకు ఆత్మగా నిలిచాయి. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రసంగ పాఠాలలో, మహనీయుల మాట ఎలా ఒక దిక్సూచిలా మారిందో.. ఆర్థిక మంత్రులు తమ దార్శనికతను సాహిత్యం ద్వారా ఎలా ప్రజల హృదయాలకు చేరవేశారో వివరించే ‘బడ్జెట్ కావ్యం’ ఇది. ఆస్వాదించండి.సొగసైన వ్యక్తీకరణలుభారత కేంద్ర బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే, ఆర్థిక మంత్రులు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సందర్భోచితమైన ‘గొప్ప మాటల’ ద్వారా ప్రభుత్వ దూరదృష్టిని, విజయాలను చాటిచెప్పడం ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చడానికి, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడానికి వీరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోట్స్ను ‘దన్ను’గా ప్రయోగిస్తుంటారు. చారిత్రక వ్యక్తులు మొదలుకొని, ప్రసిద్ధ కవులు, రచయితల వరకు వైవిధ్య భరితమైన మూలాల నుండి ఆ కోట్లను స్వీకరిస్తారు. ప్రసంగంలోని తీవ్రతను బట్టి వాటి శైలి మారుతూ ఉంటుంది. అవి, దేశ ఆర్థిక గమనాన్ని సామాన్యులకు సైతం ప్రభావవంతంగా వివరించడానికి తోడ్పతాయి.కభీ ఖుషీ కభీ ఘమ్ఉదాహరణకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసిద్ధ కవి ఇక్బాల్ కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. పి. చిదంబరం తన బడ్జెట్ ప్రతిపాదనలకు తిరువళ్ళువర్, థోరో వంటి గొప్ప వ్యక్తుల విజ్ఞానాన్ని జోడించేవారు. ప్రణబ్ ముఖర్జీ ప్రాచీన భారతీయ రాజనీతిజ్ఞుడైన కౌటిల్యుడి సూత్రాల నుండి మార్గదర్శకత్వాన్ని పొందేవారు. కేవలం షేక్స్పియర్ లేదా వివేకానందుడి వంటి వారే కాకుండా; అమర్త్యసేన్, ఇందిరా గాంధీ వంటి వారి ప్రస్తావనలు కూడా ఆర్థిక నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను బలోపేతం చేయడానికి బడ్జెట్ ప్రసంగాలకు ఉపయోగపడ్డాయి. ఇక 2002 నాటి ప్రసంగంలో యశ్వంత్ సిన్హా ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు విచారం), ‘ఫిల్హాల్’ (క్షణికమైన) వంటి బాలీవుడ్ చిత్రాల పేర్లను సైతం ఉదహరించారు!మొరార్జీ ఆశావాదం1960వ, 70వ దశాబ్దాలలో భారతదేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో కూడా, ఆర్థిక మంత్రులు ఈనాటికీ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా 1967–68 బడ్జెట్ ప్రసంగంలో, అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పేదరికంపై పోరాటం–మారుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య అత్యంత ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సరైన విధానాలను అనుసరిస్తే దేశ ఆర్థిక పురోగతికి ఒక మలుపు అవుతుందని ఆయన ఆశించారు. ‘‘రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నేను పూర్తి ఆశావాదంతో చూస్తున్నాను. నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే, ఈ ఏడాది.. ఆర్థిక పునరుజ్జీవనానికి నాంది అవుతుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’’ అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.మన్మోహన్ ఉర్దూ అద్దకం1990వ దశాబ్దంలో భారతదేశం ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేసింది. అప్పటి ఆర్థిక మంత్రి, భవిష్యత్ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. 18,650 పదాలతో నేటికీ అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచి ఉన్న తన 1991 నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ రాసిన భావగర్భితమైన కవితను ఆయన చదివారు.దాని భావం: ‘‘గ్రీకు, ఈజిప్షియన్, రోమన్ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని మన గుర్తింపు ఇంకా సజీవంగా ఉంది. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం ఇంకా నిలబడగలిగామంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి.’’! అదే ప్రసంగంలో ఆయన విక్టర్ హ్యూగో రాసిన..‘‘సమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’’ అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. మరుసటి ఏడాది కూడా మన్మోహన్ మరో ఉర్దూ కవి ముజఫర్ రజ్మీ రాసిన మాటలను గుర్తుచేశారు. దాని అర్థం: ‘‘చరిత్రలో కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉన్నాయి, క్షణాల్లో జరిగిన పొరపాట్ల వల్ల శతాబ్దాల తరబడి శిక్షను అనుభవించాల్సి వచ్చింది.’’జస్వంత్.. తీరం, తుఫానుబీజేపీ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ బడ్జెట్ ప్రసంగాలు కూడా కవితాత్మను ప్రతిఫలించాయి. 1999 నుండి 2003 వరకు ఆర్థికమంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా.. బడ్జెట్ను సంప్రదాయానికి భిన్నంగా సాయంత్రం పూట కాకుండా, మధ్యాహ్నం పూట ప్రవేశపెట్టిన మొదటి మంత్రిగా గుర్తింపు పొందారు. ఆర్థిక వ్యవస్థలో రెండవ తరం సంస్కరణలు, వృద్ధి, సమానత్వం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన ఒక కవితను పేర్కొన్నారు.దాని తాత్పర్యం: ‘‘సమయం మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతోంది. తీరం వెంబడి సురక్షితంగా ఎంతకాలం నడుస్తూ వెళ్తాం?’’ (సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం).అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో, యశ్వంత్ సిన్హా తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జస్వంత్ సింగ్, ప్రభుత్వ చివరి సంవత్సరాల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలో సామాన్యుల అవసరాలకు పెద్దపీట వేస్తూ – ‘‘పేదవాడి కడుపులో ఆహారం, గృహిణి కొంగులో ధనం ఉండాలి..’’ అన్నారు. గాలి మేడలు.. పునాదులుకాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగాల్లో మేధావుల మాటలను జోడించడంలో సిద్ధహస్తులు. ముఖ్యంగా తమిళ తాత్విక కవి తిరువళ్ళువర్ పట్ల ఆయనకు ఉన్న భక్తి, గౌరవం ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. తరచు ఆయన తిరువళ్ళువర్ రాసిన ప్రసిద్ధ ‘తిరుక్కురల్’ నుండి, ‘‘ఏది సరైనదో నీ విచక్షణకు స్పష్టంగా తెలిసినప్పుడు, దానిని పూర్తి దృఢ సంకల్పంతో, అలసత్వం లేకుండా సాధించాలి..’’ అనే మాటను ఉదహరించేవారు. 2006–07 మధ్యంతర బడ్జెట్ సమయంలో, భారతదేశ యువత కలలను, ఆకాంక్షలను ప్రతిఫలించేలా, ‘‘మీరు గాలిలో కోటలు కట్టినట్లయితే, మీ శ్రమ వృథా కాదు. అవి ఉండాల్సిన చోటు అదే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ కోటల కింద బలమైన పునాదులను నిర్మించడమే..’’ అని హెన్రీ డేవిడ్ థోరో చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్యాలను గుర్తు చేస్తూ, ‘‘మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. మన తలరాతను మనమే రాసుకుంటాము. గాలి అందరికీ సమానంగానే వీస్తుంది. ఎవరైతే తమ పడవ తెరచాపలను తెరిచి ఉంచుతారో వారు ముందుకు వెళ్తారు. తెరచాపలు మూసి ఉంచిన వారు వెనుకబడిపోతారు. అది గాలి తప్పా? కాదు... మన విధిని మనమే నిర్మించుకుంటాము..’’ అని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. అరుణ్ జైట్లీ.. పూలు–ముళ్లుజైట్లీ తన బడ్జెట్ ప్రసంగాల్లో సందర్భోచితమైన సూక్తులను, కవితలను ప్రయోగిస్తూ ఆర్థిక విధానాలను ఎంతో ఆసక్తికరంగా వివరించేవారు. 2017–18 బడ్జెట్ ప్రసంగంలో ఆయన, ‘‘నా లక్ష్యం సరైనదై, గమ్యం నా కళ్ల ముందు ఉన్నప్పుడు.. గాలులు నాకు అనుకూలిస్తాయి, నేను ఉన్నత శిఖరాలకు చేరుకుంటాను’’ అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. అలాగే 2016–17లో, ‘‘చాంపియన్లు అనేవారు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, ఒక కల, ఒక దార్శనికత నుండి ఉద్భవిస్తారు..’’ అని ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడారు. 2014–15 బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన, ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమం గవర్నెన్స్’ అనే పద ప్రయోగం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక ప్రతీకాత్మక నినాదంగా మారిపోయింది. ప్రధాని మోదీ ఘన విజయం తర్వాత అరుణ్ జైట్లీ తన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతూ, దేశ పరిస్థితులపై ఓ కవితను చదివారు. దాని భావం: ‘‘మనం కొన్ని పూలను పూయించగలిగాము, మరికొన్ని వికసించాల్సి ఉంది. కాని, తోటలో ఇంకా కొన్ని పాత ముళ్లు మిగిలే ఉన్నాయి.’’ 2017లో, గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుండి దేశాన్ని గట్టెక్కించే క్రమంలో, జైట్లీ ఒక శక్తిమంతమైన ఉర్దూ కవితను స్మరించారు. ‘‘పడవను నడిపేవారు ఓటమిని అంగీకరించి చుక్కానిని మాకు అప్పగించినప్పుడు, ప్రతి అలపైనా మాకు తుఫానులు, సుడిగుండాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నదిని ఎలా దాటాలో మేము నిరూపించాము, భవిష్యత్తులోనూ నిరూపిస్తాము.’’. సీతారామన్.. వేకువ పక్షులుఆర్థిక మంత్రులందరిలో నిర్మలా సీతారామన్ తన ఆలోచనలను, ప్రణాళికలను ఎంతో స్పష్టంగా స్వేచ్ఛగా వ్యక్తపరచే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె తన ప్రసంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ దీనానాథ్ కౌల్, ప్రసిద్ధ మహిళా సాధ్వి అవ్వయ్యార్, కాళిదాసు, పిసిరాంతైయార్ వంటి వైవిధ్యభరితమైన మేధావుల నుండి తన బడ్జెట్ ప్రసంగానికి స్ఫూర్తిని అందుకొంటుంటారు. ఆమె ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్ ప్రసంగం ప్రధానంగా ‘‘ఆకాంక్షల భారతం, ఆర్థిక అభివృద్ధి, బాధ్యతాయుతమైన సమాజం’ అనే అంశాల చుట్టూ సాగింది. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని వివరిస్తూ, ఆమె ఉర్దూ రచయిత మంజూర్ హష్మీ రాసిన ఒక కవితను పఠించారు. ‘‘నీపై నీకు నమ్మకం ఉంటే, ఏదో ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. గాలి బలంగా వీస్తున్నప్పటికీ, ఆ గాలిని అడ్డుగా పెట్టుకుని కూడా దీపం వెలుగుతుంది..’’ అని ఆ కవిత భావం. నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చాణక్య నీతి గురించి చెబుతూ, పట్టుదలతో కూడిన కృషి గురించి మాట్లాడారు. ‘‘మనుషులు దృఢ నిశ్చయంతో శ్రమిస్తే, అనుకున్న కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది’’ అని ఆ నీతి భావం. అలాగే, 2020 కేంద్ర బడ్జెట్ ప్రారంభోపన్యాసంలో.. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత, భారతదేశ ఐక్యతను చాటి చెప్పడానికి కశ్మీరీ కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పండిట్ దీనానాథ్ కౌల్ రాసిన కవితను ఆమె చదివారు. ‘‘మన దేశం వికసించిన శాలిమార్ తోట వంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు వంటిది, యువత ఉడుకు రక్తంలా శక్తిమంతమైనది. నా దేశం, నీ దేశం, మన దేశం.. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన దేశం’’ అని ఆ కవిత భావం. ఇక 2021లో, కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన చీకటి నీడల నుండి దేశం కోలుకుంటున్న తరుణంలో, ఆశావాదాన్ని నింపడానికి ఆమె.. ‘‘తెల్లవారుజాములో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, వెలుగును ముందే పసిగట్టి పాట పాడే పక్షి వంటిదే నమ్మకం’’.. అనే రవీంద్రనాథ్ టాగోర్ కోట్ను జ్ఞప్తికి తెచ్చారు.చూడాలి, నేడు (1 ఫిబ్రవరి 2026) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏ ప్రాచీన కవులు, రచయితలు, తత్త్వవేత్తలు, ఆమెతో పాటుగా ‘ప్రసంగిస్తారో’!మొత్తంమ్మీద ఇలా, బడ్జెట్ అంకెల్లో ఎన్నో అక్షర నక్షత్రాలు మెరిశాయి. భారతదేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్’ అంటే కేవలం ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది దేశ ప్రజల ఆశలకూ, ఆకాంక్షలకు ప్రతిరూపం. లోక్సభ వేదికపై ఆర్థిక మంత్రులు ప్రసంగిస్తున్నప్పుడు, ఆ అంకెల ప్రవాహంలో అకస్మాత్తుగా ఒక ఉర్దూ శాయరీయో, సంస్కృత శ్లోకమో లేదా ఒక స్ఫూర్తిదాయక కవితో మెరిసి.. సభలోని వారినే కాదు, యావద్దేశాన్నే మంత్రముగ్ధులను చేస్తుంటాయి. జమాఖర్చుల ప్రసంగ పాఠానికి మనోరంజకమైన జీవిత సత్యాల కవితాత్మక జోడింపు ఇది. ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఉపయోగించిన కొన్ని సూక్తులుసమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. – డాక్టర్ మన్మోహన్ సింగ్మన దేశం వికసించిన శాలిమార్ బాగ్ లాంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు లాంటిది; ఇది యువత ఉడుకు రక్తం లాంటిది, నా దేశం, నీ దేశం, ప్రపంచం ప్రేమించే అత్యంత ప్రియమైన దేశం.– నిర్మలా సీతారామన్పరిస్థితులు మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతున్నాయి. తీరం వెంబడి ఎంతకాలం నడుస్తూ వెళ్తాం? – యశ్వంత్ సిన్హాలక్ష్యం స్పష్టంగా ఉండి, గమ్యం కళ్లముందు ఉన్నప్పుడు.. గాలులు కూడా నాకు అనుకూలించి, నేను ఎత్తుకు ఎగురుతాను.; ‘‘ఛాంపియన్లు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, కల.. ఇంకా వారి దార్శనికత నుండి పుడతారు.’’ – అరుణ్ జైట్లీ -
ఆర్థిక చరిత్రలోనే తొలిసారి ఇలా..! కానీ 1999లో మాత్రం..
భారతదేశ ఆర్థిక చరిత్రలో తొలిసారిగా, కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో 2026-27 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.ఇలా ఎప్పుడైనా వచ్చిందా అంటే..1999 బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి చివరి పనిదినాన బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. 1999లో, ఫిబ్రవరి 28 ఆదివారం వచ్చింది. అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా దానిని ఒక రోజు ముందుగా ఫిబ్రవరి 27న, శనివారం ప్రవేశపెట్టారు. 1999 బడ్జెట్ కూడా చారిత్రాత్మకమైనదే. ఎందుకంటే అప్పటి వరకు, కేంద్ర బడ్జెట్లను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. పగటిపూట జరిగే ప్రకటనల సమయాన్ని ఉపయోగకరంగా మార్చేలా.. ఏళ్ల నాటి బ్రిటిష్ వలసవాద ఆచారానికి తెరపడిన రోజు అది. ఇలా సెలవురోజున ప్రవేశపెడితే ఏం జరుగుతుందంటే..పార్లమెంట్ షెడ్యూల్ ప్రకారం సమావేశమవుతుంది - సెలవు దినం అయినప్పటికీ, పార్లమెంటు సాధారణంగా బడ్జెట్ కోసం సమావేశమవుతుంది. ఆర్థిక మంత్రి షెడ్యూల్ చేసిన సమయంలో లోక్సభలో ప్రసంగిస్తారు.మార్కెట్లు ప్రత్యేక సమావేశాలను ప్రారంభించవచ్చు - BSE, NSE సాధారణంగా ఆదివారాల్లో మూసివేయబడినప్పటికీ, ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లను నిర్వహించవచ్చు, దీని వలన పెట్టుబడిదారులు బడ్జెట్ ప్రకటనలకు వెంటనే స్పందించవచ్చు.విశ్లేషణకు అదనపు సమయం. అలాగే ఆదివారం బడ్జెట్ పెట్టుబడిదారులకు, విశ్లేషకులకు పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక లక్ష్యాలు, రంగాల కేటాయింపులను అధ్యయనం చేయడానికి ఈ అదనపు సమయం ఉపయోగ పడుతుంది. పైగా మార్కెట్లు మార్పులలో పూర్తిగా ధర నిర్ణయించే ముందే ఈ అదనపు సమయంలో ఇవన్నీ జరిగే అవకాశం ఉడొచ్చు. అస్థిరత ఇప్పటికీ సాధ్యమే - అదనపు సమయం ఉంటుంది కాబట్టి.. బడ్జెట్లో ఆశ్చర్యకరమైనవి ఉంటే, ముఖ్యంగా సాధారణ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనప్పుడు మార్కెట్లు చాలా వేగంగా కదలడం ఊపందుకునే అవకాశం ఉంటుంది.(చదవండి: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు ఎందుకు..? ఎప్పటి నుంచి మొదలైందిలా) -
Union Budget: ఫిబ్రవరి 1నే ఎందుకు..? ఎప్పటి నుంచి ఇలా..?
భారతదేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ను నేడు ( ఫిబ్రవరి 1న) పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వ ఖర్చుల ప్రకటన మాత్రమే కాదు.. కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ దేశ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.11. 24 లక్షల కోట్లతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడ్డతారు ఎందుకు..? ఎప్పటి నుంచి ఇలా మొదలైంది..వంటి ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!.నిజానికి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు కాదు. గతంలో ఫిబ్రవరి చివరిలో ప్రవేశపెట్టేవారు. 2016 వరకు, భారతదేశం బిటిష్ కాలం నాటి విధానంలోనే..ఫిబ్రవరి చివరి పనిదినాన బడ్జెట్ను ప్రవేశపెట్టేది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. దాంతో మంత్రిత్వ శాఖలు, వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాలు, పన్ను నిబంధనలపై చర్యలు తీసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉండేంది. బడ్జెట్ ఆమోదం పొంది, అమలులోకి వచ్చేసరికి, కొత్త ఆర్థిక సంవత్సరం అప్పటికే ప్రారంభమైపోయేది. ఫలితంగా, అనేక ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలు సమయానికి ప్రారంభమయ్యేవి కావు, ఆలస్యమయ్యేవి. ఈ విధానం ఎప్పటి నుంచి అంటే..2017లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారిగా ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి, ప్రభుత్వం ఈ ముందస్తు తేదీనే కొనసాగిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపు అందరికీ ప్రణాళికలు వేసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వడమే దీని ప్రదాన లక్ష్యం.అదేవిధంగా, వలసవాద కాలం నుంచి అనుసరిస్తున్న బడ్జెట్ సమయాన్ని కూడా మార్చారు. 1999 వరకు, బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఎక్కువ మీడియా కవరేజ, మెరుగైన ప్రజా భాగస్వామ్యం కోసం సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.తేదీ మార్పుతో రాజుకున్న వివాదం..ప్రభుత్వం ఈ మార్పును ప్రకటించిన వెంటనే, ఈ చర్యను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రజాకర్షక వాగ్దానాలు చేయడానికి బడ్జెట్ను ముందుగా ప్రవేశపెట్టడం ఒక అవకాశాన్ని ఇస్తుందని పిటిషనర్ వాదించారు.కేంద్ర బడ్జెట్ వ్యక్తిగత రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదని, ఇది యావత్తు దేశానికి సంబంధించిన విషయమని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించింది. పైగా కేంద్ర బడ్జెట్కు రాష్ట్రాలతో ఎలాంటి సంబంధం లేదు. పైగా రాష్ట్ర ఎన్నికల కారణంగా కేంద్రం పనితీరుకు ఆటంకం కలిగించదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. అలా అప్పటి నుంచి ఫిబ్రవరి 1నే ఆర్థికమంత్రి కేంద్ర బడ్జెట్ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం ఆనావాయితీగా మారింది. -
కాంజీవరం చీరలో నిర్మలమ్మ.. ప్రత్యేకతలివే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్లో తన తొమ్మిదో బడ్జెట్ను (2026-27) ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె ధరించిన ‘కాంజీవరం చీర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఆర్థిక లెక్కలు, మరోవైపు రాజకీయ సమీకరణాల నడుమ ఈ చీర ప్రత్యేక చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కాంజీవరం పట్టు చీరను ధరించడం ద్వారా ఆ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పిటన్లవుతుందని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆ రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న గౌరవాన్ని చాటడానికి ఇదొక సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాంజీవరం చీర ప్రత్యేకతలు..కాంజీవరం చీరలను దక్షిణ భారతదేశం నుంచి సేకరించిన స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారు చేస్తారు. ఇందులో వాడే జరిలో వెండి తీగపై బంగారు పూత ఉంటుంది. దీనివల్ల చీర చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ఇందులో చీర, అంచు విడివిడిగా నేస్తారు. తర్వాత చాలా బలంగా వాటిని ‘కోర్వాయ్’ పద్ధతిలో జత చేస్తారు. ఒకవేళ చీర చిరిగినా అంచు మాత్రం చీర నుంచి విడిపోకుండా జాగ్రత్తపడుతారు.మూడు దారాల కలయికసాధారణ పట్టు చీరల కంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మూడు పట్టు దారాలను కలిపి నేస్తారు. దీనివల్ల చీర చాలా మన్నికగా, దృఢంగా ఉంటుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె.. -
తక్కువ వ్యయం.. లోటు లేని జీవితం
వచ్చిన ఆదాయంతో దేనికీ అంతగా ఇబ్బందులు పడకుండా, సుఖవంతమైన జీవితం గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి.. సరిగ్గా ఇలాంటివారికి అనువైన నగరాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఖర్చు తగ్గించుకుంటూనే.. నాణ్యమైన జీవితాన్ని గడపాలని ఆశించే వారికి ఇవి ఒక వరమని చెప్పుకోవచ్చు. సంస్కృతికి నిలయమైన జైపూర్ నుండి, ప్రకృతి ఒడిలో అలరారే డెహ్రాడూన్, ఉరుకుల పరుగుల కోల్కతా వరకు.. ఈ నగరాలు మీ జేబుకు చిల్లు పడకుండా సౌకర్యవంతమైన జీవనశైలిని అందిస్తాయి.ప్రశాంతతకు తిరువనంతపురం దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో జీవనం సాగించగల నగరాల్లో కేరళ రాజధాని తిరువనంతపురం అగ్రస్థానంలో ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం అని చెబుతుంటారు. ఇక్కడ నివాస ఖర్చులు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, ప్రముఖ ఐటీ హబ్గా ఈ ప్రాంతం ఎదగడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పశ్చిమ కనుమల మధ్య, అరేబియా సముద్ర తీరాన కొలువైన తిరువనంతపురం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ, తక్కువ ఖర్చుతో నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్నదని ‘టైమ్స్ ట్రావెల్’ తన కథనంలో పేర్కొంది.తక్కువ అద్దెలు, మెరుగైన వసతుల కోసం..తమిళనాడులోని కోయంబత్తూర్ నగరం తక్కువ అద్దెలు, మెరుగైన వసతులకు పెట్టింది పేరుగా నిలిచింది. గృహ నిర్వహణ వ్యయం పరంగా దేశంలోనే అత్యంత చౌకైన నగరాల్లో ఒకటిగా కోయంబత్తూర్ గుర్తింపు పొందింది. ఇక్కడి వస్త్ర, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఆర్థికంగా ఈ ప్రాంతానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా, భారీగా ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.ఇదే కోవలో డెహ్రాడూన్ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది. తక్కువ విద్యుత్ ఛార్జీలు, స్వల్ప నీటి ఛార్జీలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రవాణా వ్యవస్థ, ఆహార ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నగరంగా నిలుస్తోంది.పరిశుభ్రతలో టాప్ నగరంమధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం అసాధారణమైన పరిశుభ్రత, భద్రత, రుచికరమైన ఆహారాల లభ్యతకు పెట్టింది పేరు. దేశంలో నివసించడానికి అత్యంత పొదుపైన నగరంగా 2023లో ఇది నిలిచింది. ఇక్కడ రవాణా, గృహ వసతి చాలా తక్కువ ధరకే లభిస్తాయి.స్ట్రీట్ ఫుడ్ అంటే..సాంస్కృతిక రాజధాని కోల్కతా.. ఇక్కడ లభించే స్ట్రీట్ ఫుడ్ రుచితో పాటు చాలా చౌక ధరలకే లభ్యమవుతుంది. ఇదొక మెట్రో నగరమైనప్పటికీ, ఇక్కడ సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతోనే మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవచ్చు.చండీగఢ్, జైపూర్, నాగ్పూర్..పదవీ విరమణ తర్వాత స్థిరపడాలనుకునే వారికి చండీగఢ్ ఒక అద్భుతమైన నగరమని చెబుతుంటారు. కాలుష్యం తక్కువగా ఉండటం, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, తక్కువ అద్దెలు మొదలైనవి చండీగఢ్ సొంతమని అంటారు.రాజస్థాన్ రాజధాని జైపూర్ సైతం వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, సామాన్యులకు పొదుపుగా జీవించే మార్గాలను అందిస్తోంది. ఇక మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరం ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. తక్కువ రియల్ ఎస్టేట్ ధరలు, అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీ, అత్యుత్తమ వైద్య సదుపాయాలతో నాగ్పూర్ సామాన్యులు స్థిరపడేందుకు అనువైన నగరంగా మారింది.ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది? -
జాబ్ స్ట్రెస్.. శత్రువే కాదు మిత్రుడు కూడా!
నేటి కార్పొరేట్ యుగంలో ’ఉద్యోగం’ అంటే కేవలం పని మాత్రమే కాదు, అదో నిరంతర యుద్ధం. ఉదయం అలారం మోగినప్పటి నుండి, ఆఫీసు డెడ్లైన్లు.. బాస్ నుంచి వచ్చే కాల్స్.. టార్గెట్లు.. పక్క సీటు సహోద్యోగితో పోటీ.. అర్ధరాత్రి బాస్ పంపే మెయిల్,,, అన్నీ కలిసి జాబ్ స్ట్రెస్. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగిని ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వెంటాడే భూతం ఇది.అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఇది ఎప్పుడూ మనకు శత్రువేనా? అంటే కాదనే అంటాను. అది మిత్రుడిలా మనల్ని ముందుకు నడిపించగలదు, శత్రువులా మనల్ని కుంగదీయగలదు. ఆ తేడాను గుర్తించడమే ’ఉద్యోగ పర్వం’లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం.శాస్త్రీయంగా ఒత్తిడి రెండు రకాలు.. 1. యూస్ట్రెస్ (పాజిటివ్ ఒత్తిడి): ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కలిగే చిన్నపాటి భయం, ఒక కొత్త బాధ్యత తీసుకున్నప్పుడు వచ్చే ఉత్సాహం. ఇది మనల్ని ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. ఇది మనకు ’మిత్రుడు’.2. డిస్ట్రెస్ (నెగటివ్ ఒత్తిడి): పని భారం మితిమీరినప్పుడు, భవిష్యత్తుపై అభద్రతాభావం కలిగినప్పుడు వచ్చేది. ఇది మన ఆరోగ్యాన్ని, పనితీరును దెబ్బతీస్తుంది. ఇది మన ’శత్రువు’.శత్రువుగా మారినప్పుడు సంకేతాలు..ఒత్తిడి మీ నియంత్రణ తప్పుతోందని చెప్పడానికి మీ శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది.· ఆఫీసు పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవ్వడం.· ఆకలి మందగించడం లేదా ’స్ట్రెస్ ఈటింగ్’ (ఒత్తిడిలో ఎక్కువగా తినడం).· ఏకాగ్రత కుదరకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు.· చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం· ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినా పని గురించి ఆలోచిస్తూ కుటుంబానికి దూరం కావడం.· నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు· పని మీద ఆసక్తి తగ్గిపోవడం.రాజేష్ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్. అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ, గత ఆరు నెలలుగా అతను తీవ్రమైన మెడనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఆఫీసులో చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇంటికి వెళ్ళాక పిల్లలతో సరిగ్గా గడపలేకపోవడం అతన్ని మానసిక వేదనకు గురిచేసింది. రాజేష్ తన టీమ్ చేసే ప్రతి చిన్న పనిని తానే పర్యవేక్షించాలనుకోవడం (Micromanagement ). ‘నేను లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది‘ అనే అపోహే అతని ఒత్తిడికి ప్రధాన కారణం. కౌన్సెలింగ్లో అతనికి ’డెలిగేషన్’ (పనిని ఇతరులకు అప్పగించడం), ’మైండ్ఫుల్నెస్’ టెక్నిక్స్ నేర్పించాం. మూడు నెలల తర్వాత, రాజేష్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అతని టీమ్ ఉత్పాదకత కూడా 30శాతం పెరిగింది.ఒత్తిడిని మిత్రుడిగా మార్చుకోవడానికి 5 సూత్రాలు..1. Circle of Control : మీరు మార్చగలిగే పనుల మీద (మీ పనితీరు, టైమ్ మేనేజ్మెంట్) దృష్టి పెట్టండి. మీరు మార్చలేని విషయాల గురించి (ఆర్థిక మాంద్యం, బాస్ మూడ్) చింతించడం మానేయండి.2. 2 మినిట్ బ్రీతింగ్: ఒత్తిడి పెరిగినప్పుడు 2 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది మెదడులోని ’అమిగ్డాలా’ను శాంతపరిచి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.3. డిజిటల్ డెటాక్స్: ఆఫీస్ సమయం ముగిశాక, కనీసం ఒక గంట పాటు ఫోన్ను పక్కన పెట్టండి. నోటిఫికేషన్ల మోత మీ మెదడును నిరంతరం అప్రమత్తంగా (Alert mode) ఉంచి ఒత్తిడిని పెంచుతుంది.4. శారీరక శ్రమ: కనీసం 20 నిమిషాల నడక మీ మెదడులో ’ఎండార్ఫిన్’లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడిని తగ్గించే సహజ సిద్ధమైన మందులు.5. Perfectionism వద్దు: అన్ని పనులూ 100శాతం పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదల ఒత్తిడిని పెంచుతుంది. ’ఎక్సలెన్స్’ మీద దృష్టి పెట్టండి, పర్ఫెక్షన్ మీద కాదు.మీ కోసం చిన్న పరీక్ష.. ఈ క్రింది ప్రశ్నలకు ’అవును’ లేదా ’కాదు’ అని సమాధానం చెప్పుకోండి:· ఆదివారం సాయంత్రం నుంచే మీకు ఆఫీసు గురించి ఆందోళన మొదలవుతోందా?· పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు లేదా ఆరోగ్యం దెబ్బతింటున్నాయా?· విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అపరాధ భావన (Guilt) కి గురవుతున్నారా?పై ప్రశ్నల్లో రెండింటికి ’అవును’ అనే సమాధానం వస్తే, మీరు మీ ఒత్తిడిని శత్రువుగా మార్చుకున్నారని అర్థం. ఒత్తిడిని జయించడం అంటే పనిని వదిలేయడం కాదు, పని చేసే విధానాన్ని మార్చుకోవడం. గుర్తుంచుకోండి. మీ కెరీర్ కంటే మీ ఆరోగ్యం.. మీ చిరునవ్వు చాలా విలువైంది.సైకాలజిస్ట్ విశేష్కెరీర్ – మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
ఘోస్ట్ ఎంట్రీ!
సుశిక్షితులైన వేలాది మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ చేసిన ప్రసంగం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఉగ్రవాది కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో అరెస్టు అయ్యాడు. ఇతడిని విడిపించడానికే ‘కాందహార్ హైజాక్’గా పిలిచే ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 814 విమానం హైజాక్ జరిగింది. అజహర్ జైల్లో ఉండగా ఏర్పడిన పరిచయాలతోనే కోల్కతాలో ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్ జరిగింది. బర్మన్ను విడుదల చేయడానికి డిమాండ్ చేసిన రూ.3 కోట్లు హైదరాబాద్ నుంచే చేతులు మారాయి. ఈ మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడుల కోసం వినియోగించారు. బర్మన్ కిడ్నాప్లో పాల్గొన్న ముఠా నుంచే కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పుట్టింది. గోకుల్చాట్– లుంబినీ లేజేరియంల్లో 2007, దిల్సుఖ్నగర్లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ల్లో 2013ల్లో జరిగిన విధ్వంసాలకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థే. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ మూలం– అజహర్ మసూద్ భారత్ రావడం, తిరిగి వెళ్లడమే!పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న బహవల్పూర్కు చెందిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కుమారుడు. పాఠశాల విద్యను ఎనిమిదో తరగతిలోనే వదిలేసిన ఇతగాడు కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియాలో చేరాడు. 1989లో ఆలీమ్గా పట్టభద్రుడై ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా మారాడు. పాకిస్తాన్కు చెందిన జిహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీ అప్పట్లో అఫ్గానిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో జిహాదీ శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఇలాంటి ఓ శిబిరంలో చేరిన మసూద్ ఆ శిక్షణ పూర్తి కాకుండానే సోవియట్–అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. తీవ్రంగా గాయపడి పాకిస్తాన్ చేరిన అజర్ హర్కత్లో యువత చేరేలా ప్రేరేపించే విభాగాన్ని పర్యవేక్షించాడు. ఆపై పాకిస్తాన్కే చెందిన ఉగ్రవాది ఫజల్ ఉర్ రెహ్మాన్ ఏర్పాటు చేసిన హర్కత్ ఉల్ ముజాహిదీన్లో (హెచ్యూఎం) చేరాడు. ఇక్కడే అజర్ భారత్లోకి రావడానికి మార్గం ఏర్పడింది. అప్పట్లో కశ్మీర్లో వేర్పాటు వాదాన్ని ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–అన్సార్లో విభేదాలు ఏర్పడతాయి. దీంతో ఇది హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్–ముజాహిదీన్ అనే రెండు గ్రూపులుగా మారింది. వీరి మధ్య స్పర్థలు 1993లో తారస్థాయికి చేరాయి. ఫలితంగా కశ్మీర్లో తన ఆపరేషన్స్ కుంటుపడ్డాయని హర్కత్ ఉల్ అన్సార్ భావించి, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను అజర్కు అప్పగించింది. దీంతో 1994లో పోర్చుగీస్ పాస్పోర్టు తీసుకున్న అజర్, నేరుగా ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్, అయోధ్య సహా అనేక ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు కశ్మీర్ చేరుకుని రెండు గ్రూపుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసి సయోధ్య కుదిర్చాడు. అత్యంత కీలక ఉగ్రవాది అయిన అజర్కు హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ కశ్మీర్లో ఓ గన్మెన్ను కేటాయించింది. అజర్ అదే ఏడాది ఫిబ్రవరి 11న ఓ కారులో హెచ్యూఎం చీఫ్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ, తన గన్మ్యాన్తో కలిసి కారులో ప్రయాణిస్తుంటే, అనంత్నాగ్లోని కనాబాల్ చౌక్ వద్ద కారు పాడయింది. దీంతో అక్కడ నుంచి వీళ్లు ఆటోలో బయలుదేరారు. ఆటో అక్కడి కప్రాన్ అటవీ ప్రాంతం వద్దకు చేరుకునే సమయానికి జమ్మూ–కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ అది నిత్యం జరిగేదే అయినా, హడావుడి చూసి భయపడిన అజర్ గన్మ్యాన్ తుపాకీతో కాలుస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆర్మీ అప్రమత్తమై అతడితో పాటు అజర్, సజ్జద్లను అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ తరలించి విచారణ ప్రారంభించింది. తొలుత వీరితో పాటు స్థానిక పోలీసులూ అజర్ను సాధారణ వేర్పాటువాదిగా భావించారు. కొందరు అనుమానితులు పట్టుబడిన విషయం శ్రీనగర్ చేరుకునే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) టీమ్ చేపట్టిన విచారణలోనే అజర్ పూర్వాపరాలు బయటకు వచ్చాయి. దీంతో అరెస్టు చేసిన పోలీసులు కొన్నాళ్లు జమ్మూలోని కోట్ భల్వాల్ జైలులో ఉంచి, తర్వాత ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అజర్ను విడిపించడం హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ ఇల్యాస్ కశ్మీరీ, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్లను రంగంలోకి దింపింది. ఈ ద్వయం 1994లోనే ‘ఆపరేషన్ అల్–హదీద్’ పేరుతో ప్రత్యేక ఉగ్రవాద చర్య చేపట్టింది. ఢిల్లీలో ఇద్దరు గైడ్స్తో పాటు నలుగురు విదేశీ పర్యాటకులను అపహరించి, నిర్బంధించింది. వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మసూద్ అజర్ సహా మరికొందరు ఉగ్రవాదుల్ని వదలాలంటూ షరతు విధించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు వీరి స్థావరంపై దాడి చేశాయి. ఫలితంగా ఒమర్ సయీద్ షేక్ గాయపడి చిక్కగా, ఇల్యాస్ కశ్మీరీ తప్పించుకుని పారిపోయాడు. బందీలుగా ఉన్న టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఒమర్ సయీద్ షేక్ని కూడా తీహార్ జైలుకు తరలించింది. (తీహార్ జైలు నుంచే మరో కథ మొదలైంది. అక్కడే తరచు కలుసుకున్న అజర్, ఒమర్ సయీద్ షేక్ సాధారణ కొందరు నేరగాళ్లను ఉగ్రవాదం వైపు మళ్లించారు. వీళ్లే ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన ‘పార్ట్–2 ‘జైల్ టు జీహాద్’ వచ్చే వారం) -
నా చేతి వేళ్ళు
ఈ మధ్య రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిద్రమాత్ర కూడా పని చేయడం లేదు. ఏదైనా నవలో, కథో చదువుకుందామంటే కుదరదు. లైట్ వేస్తే, మా ఆవిడ చిరాకు పడుతుంది. పాపం తనకు కూడా నాలాగే వార్ధక్యం ముంచుకొచ్చింది. ఎప్పుడో గాని ఆమెకు నిద్ర పట్టదు. ఆ సమయంలో నేనే డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజు కూడా అంతే! మెల్లిగా లేచి బాల్కనీలోకి నడిచాను. నగర సుందరికి కూడా నాలాగే నిద్ర పట్టడం లేదేమో! రోడ్లన్నీ కదులుతున్న వాహనాల లైట్ల వల్ల దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నప్పుడు మా నాన్న చిటికెన వేలు పట్టుకుని వచ్చినప్పుడు విస్తుపోయి చూశాను, నగర సౌందర్యాన్ని. అప్పటి నుండి చూస్తున్నాను నగరం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంది. ఏ నగరానికీ ఎప్పుడూ వార్ధక్యం రాదు, మనుషుల్లాగా, నాలాగా! నేను వార్ధక్యంలోకి వచ్చాను గాని, తరతరాలుగా నగరాలు యౌవ్వనంగానే ఉంటాయి. నాకైతే శరీరానికి వచ్చిన ఈ ముసలితనం అస్సలు నచ్చడం లేదు. ఇవ్వాళ మరీ ఘోరం! మంచినీళ్ళు తాగుదామని, మంచం పక్కనే ఉన్న నీళ్ళ సీసాను చేతుల్లోకి తీసుకుని, ఎంత ప్రయత్నించినా, దాని మూత తీయలేకపోయాను. చేతులు వణుకుతున్నాయి. చేతుల్లో బలం లేకుండా పోతుందేమో? నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాను, మరీ ఇవ్వాళే ఎందుకిలా? రోజురోజుకి... మొన్నటికి మొన్న టాబ్లెట్ షీటు నుండి, అల్యూమినియం ఫాయిల్ తుంచి టాబ్లెట్ తీసుకోవడానికి, కత్తెరను ఉపయోగించాల్సి వచ్చింది. నా చేతులు నాకు అన్యాయం చేస్తున్నాయా? నా చేతులను చూసుకున్నాను. నాకేం తేడా కనిపించడం లేదు. కాని, ఎందుకిలా?... నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు తెలుసు చేతులు వణుకుతున్నాయంటే అది పార్కిన్సన్ వ్యాధి లక్షణమని. అప్రయత్నంగానే, నా చేతుల్లో ముఖాన్ని దాచుకుని భోరున ఏడ్చాను. వృద్ధాప్యం మనిషిని ఇంత డొల్లగా మార్చేస్తుందా? నా రెండు చేతులు, నా వేళ్ళు మామూలివి కాదు. అందరూ కాళ్ళ మీద పరిగెడితే, నేను నా చేతి వేళ్ళ మీద పరిగెత్తాను. అటువంటి నా చేతులు బలహీనంగా, దీనంగా మారుతున్నాయా? నా చేతులూ, వేళ్ళూ నన్నింత మోసం చేస్తాయనుకోలేదు. ఆ చేతులను చూస్తూ ఉంటే, మనసు ఒక దృశ్యం వైపు పరిగెత్తుతుంది. నా చదువు మధ్యలో ఉండగానే, మా నాన్న చనిపోయాడు. నడి సముద్రంలో, లంగరు లేని పడవలా, మా బతుకులు అల్లకల్లోలం అయిపోయాయి. కారుణ్య నియామకం కింద దిగువ శ్రేణి గుమాస్తాగా ప్రభుత్వం నన్ను నియమించింది. నేను ఏప్రిల్ 1975 లో ఉద్యోగంలో చేరాను. తినడానికి తిండి దొరికింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. నాన్న లేడన్న మాటే గాని, రోజులు యథావిధిగా నడుస్తున్నాయి. ఒక్క రెండు నెలలు గడిస్తే నా బీయస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యేవి. కాని, ఎవరికీ దాని గురించి, నా గురించి పట్టింపే లేదు. నన్ను నరకకూపంలోకి తోసి, వాళ్ళంతా హాయిగా ఉన్నారు. కాని, మా నాన్న మరణించిన ఆఫీసులో, ఆయన కూర్చుని ప్రాణం వదిలిన కుర్చీలోనే కూర్చొని, పని చేయడం నాకు మాత్రం ప్రతి దినం ప్రాణగండంగా ఉండేది. అలా, పంతొమ్మిదేళ్ళ వయసులో ఉన్న నేను మాత్రం లోలోపలే దహించుకు పోయేవాడిని. భవిష్యత్తు గురించి నేను కన్న కలలన్నీ దగ్ధమయిపోయాయి. నాకు మెడిసిన్లో సీటు వచ్చినా, నన్ను చదివించలేనని మా నాన్న బాధపడుతుంటే, నేనే ‘ఫర్వాలేదు నాన్నా! బీయస్సీలో చేరుతాను.’ అని ఓదార్చాను. బీయస్సీ తర్వాత యమ్మెస్సీ, అటు తర్వాత కెమిస్ట్రీలో రీసెర్చి చేయాలనీ, లేదా యంబీఏ చేయాలనీ ఎన్నో ఆశలుండేవి. అవన్నీ ఇప్పుడు అందని ద్రాక్షలే! కనీసం బీయస్సీ అయినా పూర్తి చేయగలనా లేదా అన్నదే, ప్రస్తుతం నన్ను పీడిస్తున్న సమస్య. నేను రెండు నెలలు సెలవు పెట్టి బీయస్సీ పరీక్షలు రాస్తానంటే ఇంట్లో, బయటా, ఆఫీసులో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే, నేను సెలవు పెట్టినన్ని రోజులకు జీతం రాదు, అదీ వాళ్ళ బాధ. అలా అందరూ కట్టకట్టుకుని వద్దనే సరికి నాలో మరింత పట్టుదల పెరిగింది. నేను సెలవు పెట్టే తీరుతాననుకున్నాను. అలాగే చేసి, బీయస్సీ పరీక్షలు రాశాను. మొదటి నుంచీ మా నాన్న చెప్పిన ఒక్క సూత్రాన్నే నేను పాటించే వాడిని. పదిసార్లు చదివిన దాని కన్నా ఒకసారి రాయడం వల్ల విషయం గుర్తుంటుందనే వాడు. అందుకే పరీక్ష సమయానికి గంట ముందు వరకు నేను సమాధానాలు రాస్తూ ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే, ఈ పరీక్షలు నాకు జీవన్మరణ సమస్య. ఇప్పుడు బీయస్సీ పాస్ కాకపోతే మళ్ళీ రాసే ఓపికా ఉండదు, వీలు కలగదని నాకు తెలుసు. అందుకే, నా మెదడును నా వేళ్ళల్లో నింపి, ప్రాక్టీసు చేశాను. ఎందుకంటే నాకు ప్రిపరేషన్కు ఉన్న సమయం చాలా తక్కువ. మిగిలిన సహాధ్యాయులకున్న ప్రిపరేషన్ లగ్జరీ నాకు లేదు. ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలి. రాసుకోవాలి. పరీక్షలు రాయాలి. ఆరు పేపర్లకు ఉన్న మూడు గంటల పరీక్షలను అలవోకగా రాశాను. బీయస్సీ మంచి మార్కులతో పాసయ్యాను. అతి సులభంగా లభించవలసిన విజయం, నాకు అతి కష్టం మీద లభించింది. అయినా కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాన్న మరణంతో నేను చాలా కృంగిపోయాను. గుండు చేయించుకోవడంతో న్యూనతభావం నన్ను మరింత దిగజార్చింది. అంతకు ముందు వరకు కాలేజీలో యాక్టివ్గా ఉండే నేను, ఒక శిక్ష పడ్డ దోషిలా తలవంచుకుని ఒక మూలలో నిలబడేవాణ్ణి. అటువంటిది నేను బీయస్సీ పాస్ కావడం, కెమిస్ట్రీలో యూనివర్సిటీ రాంక్ రావడంతో నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. మా కెమిస్ట్రీ లెక్చరర్లు నన్ను యంయస్సీ చేయమనీ, లెక్చరర్లంతా కలిసి ఫీజులు కడతామని ఎంతగానో చెప్పారు. కాని, నేను ఆల్రెడీ ఒక భారాన్ని, అవమానాన్ని మోస్తూ బతుకునీడుస్తున్నాను. దానికి అదనంగా మరొకరి దయాదాక్షిణ్యాలను భరించే శక్తి లేదు నాకు. లెక్చరర్లు, యూనివర్సిటీ ఖర్చులు భరించినా, నా మీద ఆధారపడిన నా కుటుంబ సభ్యుల కడుపులు నింపవలసిన బాధ్యతను నేను మరవలేను కదా? అయితే, ఆ పరీక్షలతోనే నా చేతులకు, నా చేతి వేళ్ళకు ఉన్న శక్తి తెలిసింది.అంతకంటే, ముఖ్యంగా నా శక్తి మీద నాకు నమ్మకం కలిగింది. ఎన్ని సమస్యలున్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా పరీక్షా సమయంలో అవేవీ నా ఏకాగ్రతను భంగం చేయలేకపోయాయి. నా చేతి వేళ్ళే నా ఆయుధాలుగా మార్చుకుని, జీవితంలో మరో పోరాటానికి సమాయత్తమయ్యాను. 1970, 80 దశకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజ్ల ద్వారానే జరిగేవి. నేను కూడా నా పేరు నమోదు చేసుకున్నాను. బీయస్సీ గ్రాడ్యుయేట్ అంటే అప్పట్లో కొంత గౌరవం ఉండేది. కాని, మామూలు క్లరికల్ ఉద్యోగాలకు, పదవ తరగతి మాత్రమే విద్యార్హత కాబట్టి, విపరీతమైన పోటీ ఉండేది. అది కూడా సీనియారిటీని బట్టే పిలుపు వస్తుంది. ఎక్సే్ఛంజ్ ముందు నోటీసు బోర్డులో, ఏయే ఆఫీసుల్లో ఏయే ఖాళీలు ఉన్నాయో లిస్టులు పెట్టేవారు. అలా చాలా రోజుల నుంచి ఆ బోర్డులో పెట్టి ఉన్న ఒక నోటీసు నన్ను ఆకర్షించింది. అది కలెక్టర్ కార్యాలయంలో, స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించిన నోటీసు. ఎంక్వైరీ చేస్తే అది నిజమేనని డిగ్రీ, టైప్ హయ్యర్, షార్టుహ్యాండ్ లోయర్ పాస్ ఉంటే అర్హత లభిస్తుందని చెప్పారు. ‘మరి ఇన్ని నెలల నుంచి నోటీసు బోర్డులో ఉంది. అభ్యర్థులు రావడం లేదా?’ అన్న నా ప్రశ్నకు ‘ఈ రోజుల్లో షార్టుహ్యాండ్ పాసయిన వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటీ? షార్టుహ్యాండ్ పరీక్ష పాస్ కాగానే వారి కోసం ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. వాళ్ళు అక్కడ చేరిన తర్వాత, ఆ సర్వీస్ వదులుకుని కొత్త పోస్టులోకి ఎందుకు వస్తారు?’ అని చెప్పారు. నేను ఆలోచనల్లో పడ్డాను. మా నాన్న బతికున్న రోజుల్లో బలవంతాన టైపురైటింగులో చేర్పించడంతో, నేను టైప్ హయ్యర్ పాసయ్యాను. అలాగే, ఎక్కడో ఉచిత షార్టుహ్యాండ్ కోచింగ్ అంటే అందులో చేరి అరవయ్యవ ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్నాను. కాని, టెక్నికల్ బోర్డు పరీక్షలు రాయలేకపోయాను. స్టెనో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న విషయం తెలిసినప్పటి నుండి నాలో ఒక నూతనోత్సాహం పెరిగింది. స్టెనో ఉద్యోగం పెద్దదేమీ కాకపోవచ్చు. కానీ, ఈ కారుణ్య నియామకం అన్న పదమే నచ్చడం లేదు. నాన్న చనిపోయిన సీట్లో కూర్చుని, ఆయన డీల్ చేసిన ఫైళ్ళలో నోట్ రాయడమంటే, నాకు నరకం కనిపిస్తుంది. ఇటువంటి సున్నితమైన విషయాలను ఎవ్వరూ అంత సులభంగా అర్థం చేసుకోరు. కాని, నా భార్య మాత్రం నన్ను ప్రోత్సహించింది. రోజువారీ కుటుంబ బాధ్యతలను చేపట్టడానికి మా ఇంటికి కోడలు కావలసి వచ్చింది. అలా ఇంటికి పెద్దవాడిగా నా పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక అనంత సాగరంలో, కాగితపు పడవ మీద, సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. షార్టుహ్యాండ్ పరీక్ష వివరాలు తెలుసుకున్నాను. కాని, ఇన్స్టిట్యూట్లలో చేరి పరీక్ష రాయడానికి సంవత్సరం పడుతుందన్నారు. కాని, నా కంత టైము లేదు. నాకు ఆల్రెడీ అరవై ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్న అనుభవం ఉంది. దేవుణ్ణి తలచుకుని, ప్రాక్టీస్ మొదలు పెట్టాను. షార్టుహ్యాండ్ ప్రాక్టీసు కోసం ముఖ్యంగా కావలసినవి ప్రశాంతమైన, నిశ్శబ్దంగా ఉండే రూము, డబుల్ లైనులో ఉండే ప్రత్యేకమైన నోట్ బుక్స్, పెన్సిళ్ళు. ఒకటి, రెండున్నరేళ్ళ వయసున్న మా అమ్మాయిలను, నా భార్య గొడవ చేయకుండా చూడడం వలన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. నేను షాపుల్లో దొరికే ఖరీదైన షార్టుహ్యాండ్ నోటు బుక్కులు కొనలేని పరిస్థితి. కాబట్టి, తెల్ల కాగితాలు, అర ఠావు, పావు ఠావు అని అప్పట్లో హోల్ సేల్గా దొరికేవి. అవి తెచ్చి కట్ చేసి, నోటు బుక్కులుగా కుట్టించేది నా భార్య. పెన్సిళ్ళు మాత్రం కొనాల్సిందే. ఎందుకంటే, షార్టుహ్యాండులో రాసే స్ట్రోక్స్ కొన్ని లైట్ కలరులో కొన్ని చిక్కటి కలరులో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, గీత మీద లైటు కలరులో ఏటవాలుగా ఒక పావు ఇంచు గీత లైట్ కలరులో రాస్తే ‘పి’ అనీ, దాన్నే ‘పే’ గా కూడా చదువుకోవచ్చు. అదే ఒత్తుగా రాస్తే ‘బి’ అనీ; అదే ‘బే’ కూడా అవుతుంది. అందుకని మంచి పెన్సిళ్ళు ముఖ్యం. ఆయుధాలన్నీ సర్దుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అది మామూలు ప్రాక్టీసు కాదు. ఒక మహా యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా ప్రాక్టీస్ మొదలయింది. లక్ష్యం తొంభై రోజుల్లో జరిగే షార్టుహ్యాండ్ లోయర్ స్పీడ్ ఎగ్జామ్. నిముషానికి 80 పదాల డిక్టేషన్ తీసుకుని, ఆ వ్యాసాన్ని ఇంగ్లీషులోకి లిపిబద్ధం చేసి, రాసి చూపించాలి. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఐదారేళ్ళు క్లర్కుగా పనిచేశాను కాబట్టి, నాకు డ్రాఫ్టింగ్ పట్ల అవగాహన ఉంది. ఇంగ్లీష్ భాషలో వాక్య నిర్మాణం, వ్యాకరణం, పంక్చుయేషన్ మార్కుల గురించిన పరిజ్ఞానం, నాకు షార్టుహ్యాండ్ పరీక్షకు బాగా ఉపయోగపడింది. నేను ప్రాక్టీస్ మొదలు పెట్టిన పది రోజులకు నాకు ఒక విషయం అవగతమయింది. షార్టుహ్యాండులో, అవతలి వ్యక్తి ఇచ్చిన డిక్టేషన్ ను రాసుకుని, ఇంగ్లీషులోకి ట్రాన్స్క్రైబ్ చేయడమే ముఖ్యం. అందుకోసం షార్టుహ్యాండ్ స్ట్రోక్సే అవసరం లేదు. ఉదాహరణకు, ఒక డిక్టేషన్లో ’హైదరాబాద్’ అనే పదాన్ని స్ట్రోక్లో రాయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆ స్ట్రోక్ రాసే బదులు ’ఏ’ అని రాసుకుంటే సరిపోతుందని నాకనిపించింది. అట్లాగే చెబుతున్న డిక్టేషన్లోని సబ్జెక్టును బట్టి, ‘పార్లమెంట్’ అని వస్తే, ‘పీ’ అని రాసుకుంటే, తర్వాతి పదాలను సులువుగా రాసుకోవచ్చని నాకర్థమయింది. అయితే అందుకు ఇంగ్లీషు భాష మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇంగ్లీషు వార్తాపత్రికలు చదివితే, ఆ పరిఙ్ఞానం వస్తుంది. నేను రోజుకు ఇరవై గంటలు ప్రాక్టీస్ చేసేవాణ్ణి. తిండీ తిప్పలు పట్టించుకోలేదు. బాత్రూములో ఉన్నా పదాలను షార్టుహ్యాండులో వేళ్ళ మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. బొటన వేలితో మిగిలిన వేళ్ళ మీద స్ట్రోక్స్ రాసేవాణ్ణి. కళ్ళ ముందు ఏ వస్తువు కనబడ్డా, ఏ మనిషి కనబడ్డా ఆ పేర్లను వేళ్ళ మీద షార్టుహ్యాండులో రాసే ప్రయత్నం చేసేవాణ్ణి. ‘చెంబు’ కనపడితే, చెంబుని స్ట్రోక్సులో బొటన వేలుతో, చూపుడు వేలు మీద రాసేవాణ్ణి. నడుస్తున్నప్పుడూ, భోంచేస్తున్నప్పుడూ, పిల్లలను ఎత్తుకున్నప్పుడూ, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడూ, బొటన వేలు, చూపుడు వేలు మీద చకచకా స్ట్రోక్స్ రాస్తూనే ఉండేవాణ్ణి. విశ్రాంతిగా ప్రాక్టీస్ మీద కూర్చున్నప్పుడు, మా ఆవిడ కుట్టిన పుస్తకాల మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. నేను ప్రాక్టీస్ చేసిన పుస్తకాలు మా చిన్న ఇంట్లో గుట్టలు గుట్టలుగా దర్శనమిచ్చేవి. కొన్ని పుస్తకాల్లోని రాతలను రబ్బరుతో తుడిచేసి మళ్ళీ ప్రాక్టీసుకు సిద్ధం చేసేవారు. షార్టుహ్యాండు పరీక్షలో స్పీడ్ ముఖ్యం. అందుకని, చిన్న టేప్ రికార్డర్ కొనుక్కుని, ఆంగ్ల పత్రికలలో వచ్చే సంపాదకీయాలను, నిమిషానికి వంద పదాలు వచ్చే విధంగా నేనే రికార్డ్ చేసుకుని, వాటిని షార్టుహ్యాండ్లో రాసేవాణ్ణి. కాని, దాని వల్ల నేనే డిక్టేషన్ చెప్పి, నేనే ట్రాన్సై్కబ్ చేయడంతో కొన్ని పదాలు నాకు ముందే తెలిసిపోవడం వలన, నేను సులువుగా రాయగలుగుతున్నానేమోనని నాకే అనిపించింది. దాంతో తెలిసిన వాళ్ళతో డిక్టేషన్ రికార్డు చేయించేవాణ్ణి. ఇన్స్టిట్యూటులో రిక్వెస్టు చేసి, అక్కడి స్పీడ్ డిక్టేషన్లను, రికార్డింగ్ చేసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాణ్ణి. ఒకసారి, మా పొరుగున ఉన్న అంకుల్ వచ్చి, ‘అర్ధరాత్రి మీ ఇంట్లో నుండి ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి. ఆ టైములో ఎవరు వింటున్నారు?’ అని అడిగాడు. నేను నా షార్టుహ్యాండ్ పరీక్ష గురించి చెప్పాను. ఆయన చాలా సంతోషపడి, ‘బెస్టాఫ్ లక్’ అని చెప్పాడు. మూడు నెలల్లో నేను ఆరు కిలోల బరువు తగ్గాను. బట్టలు లూజు అయిపోయాయి. కళ్ళు గుంటలు పడి, ముఖం పీక్కు పోయింది. గడ్డం పెరిగి, ఒక పిచ్చోడిలా తయారయ్యాను. కాని, నా ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. నిమిషానికి వంద పదాలు సులభంగా రాయగలుగుతున్నాను. ఆత్మవిశ్వాసం నా ముఖంలో తొణికిసలాడుతున్నట్టుగా నాకే తోచింది. పరీక్ష రోజున, పెన్సిల్ ముట్టుకోలేదు. ప్రశాంతంగా ఉన్నాను. దేవుడికి నమస్కరించి, పరీక్ష హాలుకు బయల్దేరాను. షార్టుహ్యాండ్ పరీక్షలో, అభ్యర్థులు కంగారు పడడం సహజం. కాని, నేను ఎటువంటి ఆందోళన లేకుండా, రిలాక్స్డ్గా కూర్చున్నాను. పరీక్ష మొదలయింది. కంచుకంఠంతో డిక్టేషన్ మొదలయింది. ఎగ్జామినర్ నోటి నుండి దొర్లుతున్న పదాలను చెవులు నిక్కించి స్పష్టంగా విని వాటికి స్ట్రోక్స్ రాయడం ప్రారంభించాను. నా చెవుల్లోకి వేరే శబ్దమే వినిపించడం లేదు. షార్టుహ్యాండ్ పరీక్ష మిగతా పరీక్షల్లా కాదు. ఒక్క పదం వినడం మిస్ అయితే కంగారు మొదలై తరువాత అనేక పదాలతో లంకె కుదరదు. అందుకని ఒక పక్కన ప్రపంచం బద్దలైపోతున్నా, పట్టించుకోకూడదు. అందుకే, చాలామంది, ఐదారు సార్లు షార్టుహ్యాండ్ ‘లోయర్’ పరీక్ష రాస్తే గానీ ఉత్తీర్ణత సంపాదించరు. ఆ ఎగ్జామ్ హాల్ వాతావరణం, ఆ హడావుడి, ఆ సందడి, ఆందోళన అనుభవంలోకి రావాలి. అప్పుడు గాని, డిక్టేషన్ మీద ఏకాగ్రత కుదరదు. నేను చకచకా ట్రాన్స్క్రైబ్æ చేసి పేపరు ఇచ్చేసి, ఇంటికి వచ్చి, అన్నం తిని, రెండు రోజుల పాటు పడుకున్నాను. నా చేతులూ, వేళ్ళూ ఎంత అలసిపోయాయో నాకే తెలుసు. ఆ మూడు నెలల్లో కొన్ని లక్షల పదాలు రాశాయి నా వేళ్ళు. కొన్ని వేల పుస్తకాలను నా చేతులు పట్టుకున్నాయి. ఒక మహా మరయంత్రంలా, చక్కటి ప్రిసిషన్తో మెదడు, చెవులు, చేతులు, వేళ్ళు పనిచేశాయి. రిజల్ట్స్ వచ్చాయి. నేను రాష్ట్రంలో ప్రప్రథముడిగా పాసయి, గోల్డ్ మెడల్ సాధించాను. ఆ క్షణంలో, నా భార్య నా చేతి వేళ్ళను ముద్దు పెట్టుకుంది. అది ఒక ప్రారంభం మాత్రమే. షార్టుహ్యాండులో నా ప్రజæ్ఞ వల్ల ఆ తర్వాత అనేక విజయాలు సాధించాను. బ్యాంకులో స్టెనోగ్రాఫర్, ఐఏయస్ ఇంటర్వ్యూ, గ్రూప్ పరీక్షల్లో ప్రప్రథముడిగా ఉద్యోగం రావడం జరిగిపోయాయి. ఇప్పటికీ, కొత్త పదం కనిపిస్తే నా బొటన వేలు, చూపుడు వేలు మీద రాయడానికి ప్రయత్నిస్తుంది. కాని, ఏం లాభం. ఆ స్వర్ణయుగం ముగిసిపోయింది. నన్ను జీవితంలో విజేతగా నిలబెట్టిన నా చేతులు – నా మెదడు విన్న ప్రతి మాటను అక్షర రూపంలోకి లిపిబద్ధం చేసిన నా వేళ్ళు– ఇప్పుడు నా మాట వినడం లేదు. రాయడం అటుంచి, పెన్సిల్ కూడా పట్టుకోలేనంతగా వణుకుతున్నాయి. రుజాగ్రస్తుణ్ణయ్యాను అనుకునే సరికి కన్నీరు ఉబికి వచ్చింది. సన్నటి వాన మొదలయింది. బాల్కనీలో నుండి లోపలికి నడిచాను. వర్షానికి తడిస్తే ఆస్త్మా పెరుగుతుంది. అందుకే ఇన్హేలర్ పీల్చి, మంచం మీద కూర్చున్నాను. పక్కనే నా భార్య పడుకుని ఉంది. నాలాగా కాకండా తనెప్పుడూ మంచానికి ఎడమ వైపు పొందికగా పడుకుంటుంది. టైం ఎంతయిందో తెలియదు కాని, అది కచ్చితంగా బ్రాహ్మీముహుర్తమే. నా భార్య అలా ప్రశాంతంగా పడుకుని ఉండడం చూస్తే, మనసు ఆనందంతో నిండిపోయింది. కారణం తెలియదు. కొన్ని సంతోషాలకు కారణం ఉండదు. భగవంతుని దయ వలన ఇన్నేళ్ళూ ఒకరికొకరంగా బతికి సంసారాన్ని నడిపాము. పిల్లలు ప్రయోజకులయ్యారు. నా భార్య జుట్టును ప్రేమగా నిమిరాను. తను నిద్రలోనే, ‘ఏమైనా కావాలా?’ అని అడిగింది. నేను తన చెంప మీద సుతారంగా ముద్దు పెట్టుకుని ‘ఏమొద్దు, పడుకో!’ అని నా ఆఫీసు రూములోకి నడిచాను. చాలాసేపు మది నిండా ఒక సంతృప్త భావనతో చీకట్లో మౌనంగా కూర్చుండిపోయాను. ‘నాకేం తక్కువ? జీవితంలో అన్నీ అనుభవించాను. కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాను. ఏవో కొన్ని పుస్తకాలు రాశాను. మనిషి జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు ఈ జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు. పండిన ఆకు రాలిపోవడం అత్యంత సహజం. ఆ ప్రక్రియలో ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. వాటిల్లో అనారోగ్యం కూడా ఒకటి. డెబ్భై ఏళ్ళ వయసులో శరీరం, యౌవ్వనంలో ఉన్నట్టుగా, హుషారుగా ఎలా ఉంటుంది? డెబ్భై ఏళ్ళ తర్వాత లభించిన ప్రతి రోజూ బోనస్ జీవితంగానే భావించాలి.’ నా ఆలోచనల్లో నేనుండగానే, లైటు వెలిగింది. నేను తలెత్తి చూశాను. మా ఆవిడ కాఫీ కప్పుతో నిలబడింది. ‘వద్దన్నానుగా?’ అని అన్నాను. తను నవ్వుతూ, ‘మీకు కావాలని నాకు తెలుసుగా?’ అంది నవ్వుతూ. వర్షం వెలిసిన తర్వాత విరిసిన హరివిల్లులా ఉంది, నిద్రమత్తులో ఉన్న తన ముఖంలోని ఆ నవ్వు. తనలో గొప్పతనం ఏమిటంటే, పడుకుని లేచినా ముఖం తాజాగా ఉంటుంది. జుట్టు చెదరదు. ఆమె ముఖాన్నే చూస్తూ, కాఫీ కప్పు అందుకున్నాను. నేను తన కష్టాన్ని సరిగా గుర్తించలేదేమోనని, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. సుమారు యాభై ఏళ్ళ మా సంసారంలో నాకు ఎన్నడూ ఏ లోటూ రాకుండా చూసుకుంది. పేరుప్రఖ్యాతులు నాకు వచ్చినా తనకొచ్చినంతగా సంబరపడేది. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి తన చేతిని స్పృశించాను. ఆ స్పర్శ నాకు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ‘కాఫీ తాగండి!’ అని వెళ్ళబోతూ, ‘ఏంటి, ఆఫీసు రూములో కూర్చున్నారు? మళ్ళీ ఏమైనా రాయబోతున్నారా?’ అంటూ తలుపు దగ్గరకు వేసి బయటకు నడిచింది. ఆమె మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి, ‘అవును ఎందుకు రాయగూడదు?’ అన్న సందేహం నాలో ఉత్పన్నమయింది. మీరు గమనించారా? నేనైతే ఇప్పుడే గమనించాను. కాఫీ కప్పు తీసుకున్నప్పుడు నా చేతి వేళ్ళు మునుపటంతగా వణక లేదు. నా వేళ్ళను చూశాను. ఏదో కొత్త ఉత్తేజంతో తొణికిసలాడుతున్నట్టుగా, నవనవలాడుతూ కనిపించాయి. ‘ప్లేసిబో ఎఫెక్ట్’ గురించి నేనే ఎన్నోసార్లు రాశాను. ఇప్పుడు ఆ ప్రయోజనం నాకే అనుభవంలోకి వస్తున్నట్టుగా అనిపించింది. కంప్యూటర్ తెరిచి, స్పీకరులో కథ ‘డిక్టేషన్’ చెపుతుంటే, వాయిస్ రికార్డర్ ద్వారా, కంప్యూటర్ తెర మీద, అక్షరాల రూపంలో కథ పురుడుపోసుకుంటుంది. ఇప్పుడు కూడా షార్టుహ్యాండే, డిక్టేషన్ ఇవ్వాల్సిందే. కాని, ఇప్పుడు చేతివేళ్ళ పనిని కంప్యూటర్ చేసేస్తోంది. -
ఎక్కువగా ఊడిపోతోంది
నా వయసు 29 ఏళ్లు. గత కొంతకాలంగా తల మొత్తం మీద జుట్టు పలచబడుతున్నట్టు అనిపిస్తోంది. దువ్వుకున్నప్పుడు, తల స్నానం చేసినప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది. మా కుటుంబంలో ఇలాంటి సమస్య ఎవరికి లేదు. ఈ సమస్యను నియంత్రించడానికి ఏ విధమైన పరీక్షలు, చికిత్సలు అవసరం? – స్నేహ, తిరుపతి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది సాధారణంగా డిఫ్యూస్ హెయిర్ ఫాల్ సమస్యగా భావించవచ్చు. రోజుకు సగటున 50 నుంచి 100 జుట్టు ఊడటం సాధారణమే. అయితే దువ్వుకునేటప్పుడు లేదా తల స్నానం చేసినప్పుడు గుప్పెడు జుట్టు ఊడుతున్నట్టు అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో ఇలాంటి సమస్య లేకపోయినా, ఈ రకమైన జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది టెలోజెన్ ఎఫ్లూవియం. ఇందులో జుట్టు పెరుగుదల దశ నుంచి అకస్మాత్తుగా జుట్టు ఊడే దశకు మారుతుంది. అధిక జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, కరోనా వంటి వ్యాధులు, శస్త్రచికిత్సలు, ప్రసవం తరువాత జరిగే శారీరక మార్పులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అకస్మాత్తుగా బరువు తగ్గే డైట్లు, శరీరంలో ఐరన్, ప్రొటీన్ , జింక్ లోపాలు, థైరాయిడ్ అసమతుల్యత, కొన్ని మందుల వినియోగం వంటి అంశాలు దీనికి కారణమవుతాయి. సాధారణంగా ఈ కారణాలు జరిగిన రెండు నుంచి మూడు నెలల తర్వాత జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. యువతుల్లో, ముఖ్యంగా మహిళల్లో పోషక లోపాలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా ఉంటాయి. రక్తహీనత, ఐరన్ నిల్వలు తగ్గిపోవడం, ప్రొటీన్ లోపం, విటమిన్ డీ, విటమిన్ – బి12 లోపాలు ఈ సమస్యను మరింత పెంచుతాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యతలు కూడా డిఫ్యూస్ హెయిర్ ఫాల్కు దారితీస్తాయి. థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్, ప్రసవం తరువాత లేదా మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు, కొన్ని హార్మోన్లు అధికంగా ఉండటం వంటి పరిస్థితుల్లో జుట్టు పలుచబడుతుంది. తల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. తీవ్రమైన చుండ్రు, సెబోరియిక్ డెర్మటైటిస్, సొరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా జుట్టు ఊడవచ్చు. అదేవిధంగా జుట్టును బాగా బిగుతుగా కట్టుకోవడం, అధిక వేడి పరికరాల వినియోగం, తరచు రసాయన చికిత్సలు చేయించుకోవడం, సరైన నిద్ర లేకపోవడం, పొగతాగడం, నిరంతర మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడాన్ని పెంచుతాయి. ఈ సమస్యను నియంత్రించడానికి ముందు అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి రావచ్చు. అలాగే తల చర్మాన్ని ప్రత్యేకంగా పరిశీలించే పరీక్షల ద్వారా కూడా స్పష్టత లభిస్తుంది. పరీక్షల నివేదికలు, వైద్య పరిశీలన ఆధారంగా చర్మవైద్యుడు తగిన చికిత్సను సూచిస్తారు. అవసరమైతే మందులు, పోషక సప్లిమెంట్లు, తలకు అప్లయి చేసే లోషన్లు లేదా జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రత్యేక సీరమ్లు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు ఆధునిక చికిత్స విధానాలు కూడా అవసరం కావచ్చు. జుట్టు చికిత్స ప్రారంభించిన తర్వాత స్పష్టమైన ఫలితాలు కనిపించడానికి కొన్ని నెలలు పడుతుంది. అందుకే ఓర్పుతో, దీర్ఘకాలం చికిత్స కొనసాగించడం అవసరం.అలాగే ప్రొటీన్ , ఐరన్ , ఆకుకూరలు, పండ్లు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. కాబట్టి జుట్టు ఎక్కువగా ఊడుతున్నట్లు అనిపించిన వెంటనే చర్మవైద్యులను సంప్రదించడం మంచిది. -డా. ఇందిర పవన్ ,ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ -
నక్క సాయం
అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతరుల నుంచి సహాయం పొందేది కాని, ఎన్నడూ ఇతరులకు సాయం చేసేది కాదు. ఏ జంతువో, పక్షో వచ్చి వాగుకో వంకకో దారి అడిగితే, తెలిసినా చెప్పేది కాదు. చెప్పినా దూరం దారి చెప్పి సంబరపడేది.అడవిని పాలించే పులిరాజుకు లేక లేక బిడ్డ పుట్టింది. బాతుల వాగు దగ్గర వేడుక చేస్తున్నట్లు ప్రకటించాడు.వేడుకకు అడవిలోని జంతువులన్నీ వచ్చి విందు ఆరగించవలసిందిగా కోరాడు పులిరాజు. వేడుకకు నక్క బయలుదేరింది. కాని, దానికి బాతుల వాగుకు దారి తెలీదు. అది అలా నడుచుకుంటూ పోతూ ఉండగా, దారిలో మామిడి చెట్టు మీద ఒక కోతి కునుకు తీస్తూ కనిపించింది. చెట్టు నీడలో ఆయాసం తీర్చుకొని, ‘కోతి బావా! కోతి బావా! బాతుల వాగుకు దారి చెబుతావా!’ అడిగింది నక్క.‘నేరుగా వెళ్లి కుడివైపు తిరుగు, చింతచెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎడమకు తిరిగి నడిస్తే, మర్రిచెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి కుడికి తిరిగి నడిస్తే, రావిచెట్టు కనిపిస్తుంది. దానికి ఎదురుగా తాటితోపు కనిపిస్తుంది. తాటితోపు దాటగానే బాతుల వాగు ఉంటుంది’ చెప్పింది కోతి.నక్కకు కోతి చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు. అది ఆ దారిలో ఎప్పుడూ వెళ్లనే లేదు. దాంతో బుర్ర గోక్కుంటూ ఆలోచించసాగింది. కోతి కుంటుతూ నెమ్మదిగా చెట్టు దిగి, ‘నక్క బావా! నా కాలికి ముల్లు గుచ్చుకొని గాయమైంది. నీ మీద నన్ను ఎక్కించుకుంటే, నేను నీ వెంట వేడుకకు వస్తాను!’ అంది.కోతిని పైనుంచి కిందికి చూసింది నక్క. ‘వేడుకకు రాకుంటే, విందు చేయకుండా పస్తులుండు! నిన్ను మాత్రం నా వీపు మీద ఎక్కించుకొని తీసుకుపోను. నేను నీ బానిసను కాను!’ పెద్దగా అంది నక్క .కోతి మౌనంగా ఉండిపోయింది. నక్క అక్కడి నుంచి వేగంగా ముందుకు పోయింది.కొద్దిసేపటికి ఆ దారి వెంట ఏనుగు వచ్చింది. కుంటుతున్న కోతిని చూసింది ఏనుగు.‘కోతి బావా! నీ కాలికి ఏమైంది?’ అడిగింది ఏనుగు.‘ముల్లు గుచ్చుకొని గాయమైంది. నడవలేక పోతున్నాను!’ అంది కోతి. ‘అయ్యో! అలాగా! నీకు బాతుల వాగుకు దారి తెలుసా?’ అడిగింది ఏనుగు. తెలుసన్నట్లుగా తల ఊపింది కోతి.‘అయితే, నువ్వు నా వీపు మీద కూర్చుని వాగుకి దారి చెప్పు. ఇద్దరం కలిసి వేడుకకు పోదాం!’ అంది ఏనుగు. కోతి ఏనుగు వీపు మీద కూర్చుంది. కోతి దారి చెబుతూ ఉంటే, ఏనుగు ముందుకు పోతూ ఉంది.అవి రెండూ కబుర్లు చెప్పుకుంటూ బాతుల వాగుకు పోతూ ఉండగా, దారిలో దూరం నుంచే మర్రి చెట్టు కింద కూర్చున్న నక్కను చూసింది కోతి.నక్క దారి మరచి, ‘ఎటు వైపు వెళ్లాలా’ అని ఆలోచించసాగింది.ఏనుగు వీపు మీద కూర్చుని వస్తున్న కోతిని గమనించి నక్క సిగ్గుతో కోతికి కనిపించకుండా పొదల్లో నక్కింది. వెనుక నుంచి ఏనుగును అనుసరించి వేడుకకు చేరాలనుకుంది. అవి మర్రిచెట్టు వరకు రాగానే, ‘నక్క బావా! అలా నక్కి కూర్చుంటే వేడుకకు ఎలా చేరుతావు! మా వెంట పద! పోదాం!’ అంది కోతి. నక్క వాటి వెంట వేడుకకు చేరింది. విందులో రకరకాల వంటలు ఘుమ ఘుమలాడుతూ నోరూరించాయి.ఏనుగు తనకు నచ్చిన చెరుకు గడలు, అరటి గెలలు కడుపునిండా తిన్నది.నక్క లొట్టలేసుకుంటూ మాంసాహారం మెక్కి తిన్నది.కోతి మట్టుకు పులిరాజు పక్కన కింద కూర్చున్నది. కోతి ఏమాత్రం ఆహారం ముట్టుకోలేదు . ఏనుగు, నక్క కోతిని గమనిస్తూనే ఉన్నాయి. అవి కోతిని విందు ఎందుకు చేయలేదని అడిగాయి.‘నేను మీ కన్నా ముందే వేడుకకు వచ్చి, విందు ఆరగించాను. తిరిగి ఇంటికి వెళుతుంటే కాలికి ముల్లు గుచ్చుకొని గాయమైంది!’ చెప్పింది కోతి. తమకు బాతుల వాగుకు దారి చూపించటానికే వేడుకకు మళ్లీ వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాయి ఏనుగు, నక్క.కోతి మంచితనానికి ఏనుగు పొంగిపోగా, నక్క సిగ్గుతో తలవంచుకుంది. అవి తిరిగి వెళ్లేటప్పుడు, నక్కే తన వీపు మీద కోతిని కూర్చోపెట్టుకుని ఇంటి దగ్గర దింపింది. ఆనాటి నుంచి ఇతరులకు సాయం చేస్తూ ఆనందంగా ఉండసాగింది నక్క. -
తాజ్ మహల్ డైమండ్ @ 74 కోట్లు...
17వ శతాబ్దంలో మొఘల్ రాణి నూర్జహాన్ వాడిన నగ అది. బ్రిటిష్ కాలంలో దేశం దాటిన ఆణిముత్యం 1972లో ఎలిజబెత్ టేలర్కు గిఫ్ట్ ఇచ్చిన రిచర్డ్ బర్టన్ ఇప్పుడు హాలీవుడ్ నటి మార్గోట్ రాబీ చేతిలో నూర్జహాన్ నగ హాలీవుడ్ నటి మార్గోట్ రాబీ తన చిత్రం వుథరింగ్ హైట్స్ ప్రమోషన్ లో బిజీబిజీగా గడిపారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె లాస్ ఏంజిల్స్లోని టీసీఎల్ చైనీస్ థియేటర్లో జరిగిన ప్రీమియమ్ షోలో తళుక్కున మెరిశారు. అందులో ఆమె ధరించిన 69.42 క్యారెట్ల నెక్లెస్ అందరినీ ఆకట్టుకుంది. 74 కోట్ల రూపాయల విలువైన ఆ నగ ఇప్పటిది కాదు. 17వ శతాబ్దం నాటిది. చెప్పాలంటే.. అది భారత్కు చెందిన అమూల్యమైన నగ. అప్పట్లో మొఘల్ రాణి నూర్జహాన్ వాడిన నగపై.. ప్రత్యేక కథనం..!జహంగీర్ ఇచ్చిన బహుమతి...17వ శతాబ్దం ఆరంభంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అందాల భామ నూర్జహాన్ ను మనువాడిన విషయం తెలిసిందే..! 1611లో జరిగిన ఈ వివాహం సందర్భంగా ఆయన నూర్జహాన్ కు ఓ నెక్లెస్ను బహూకరించాడు. 69.42 క్యారెట్ల ఆ నగపై అప్పటి అధికారిక భాష పర్షియన్ లో ‘ప్రేమ ఎప్పటికీ శాశ్వతం’ అని చెక్కించారు. మొఘల్ సామ్రాజ్యంలో నూర్జహాన్ ను అందాల రాణి అని, ఫ్యాషన్ డిజైనర్ అని పిలిచేవారు. అంతేకాదు. మొఘల్ బేగంలు ఎవరూ పరదా దాటి బయటకు వచ్చేవారు కాదు. కానీ, జహంగీర్కు 20వ భార్య అయిన నూర్జహాన్ మాత్రం రాచరిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆమె పేరిట నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఆమె ఎన్నెన్నో ఫత్వాలను జారీ చేశారు. న్యాయనిర్ణయంలో.. కోర్టు హాలులో ఆమె జహంగీర్తో కలిసి కూర్చుని, తీర్పులిచ్చేవారు. జహంగీర్ మరణం తర్వాత.. ఆమె క్రమంగా పరిపాలనకు దూరమయ్యారు. 1645లో లాహోర్లో మరణించారు. ఆ తర్వాత ఆ నెక్లెస్ షాజహాన్ భార్య ముంతాజ్ బేగంకు వారసత్వంగా అందింది.నగకు నామకరణం...ముంతాజ్ మరణం తర్వాత.. షాజహాన్ ఆమె పేరిట తాజ్మహల్ను నిర్మించాడని మనకు తెలుసు. ముంతాజ్ మరణానంతరం ఈ నగకు ‘తాజ్ మహల్ డైమండ్’ అని నామకరణం చేశారు. అప్పటినుంచి ఈ నెక్లెస్ అదేపేరుతో కొనసాగుతోంది. బ్రిటిషర్ల కాలం లో కొహినూర్ వజ్రం, నెమలి సింహాసనం మాదిరిగానే.. ‘తాజ్ మహల్ డైమండ్’ నెక్లెస్ కూడా దోపిడీకి గురైంది. ఆ తర్వాత 20వ శతాబ్దం వరకు ఆ నెక్లెస్ ఎన్నెన్నో చేతులు మారి.. 1971లో ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ చేతికి వెళ్లింది. కార్టియర్ దానికి మెరుగులు దిద్ది, కొన్ని చిన్నచిన్న వజ్రాలు, కెంపులను జోడించారు. విమానాశ్రయంలో అమ్మకానికి పెట్టారు.ఎలిజబెత్ టేలర్కు గిఫ్ట్గా...1972లో అప్పటి హాలీవుడ్ స్టార్ రిచర్డ్ బర్టన్ తన భార్య, నటి ఎలిజబెత్ టేలర్కు ఓ చక్కటి గిఫ్ట్ ఇవ్వాలని, అది ఎన్నటికీ గుర్తుండేలా.. చెరిగి పోని గుర్తుగా ఉండాలని భావించారు. ఆ సమయంలోనే.. విమానాశ్రయంలో కార్టియర్ ప్రదర్శనకు పెట్టిన నూర్జహాన్ నగపై ఎలిజబెత్ టేలర్కు మక్కువ కలిగింది. దాంతో రిచర్డ్... ఆమెకు తెలియకుండా ఆ నగను కొన్నారు. ఆ తర్వాత ఎలిజబెత్కు దాన్ని సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చారు. దాంతో ఎలిజబెత్ ఉబ్బితబ్బిబ్బై పోయింది. తన ఆభరణాల కలెక్షన్ లో ఈ నగను ఆమె అత్యంత ప్రముఖంగా చూసుకునేది. క్లియోపాత్రా సినిమా సెట్లో ఎలిజబెత్, రిచర్డ్ మధ్య ప్రేమ చిగురించగా..ఈ నగను ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఆమె భావించేది. ఎలిజబెత్ తనకు ఆస్కార్ వచ్చినప్పుడు.. ఆ పురస్కారాన్ని అందుకునే సమయంలోనూ ఈ నగను ధరించారు. 2011లో ఆమె మరణం తర్వాత.. ఎలిజబెత్ టేలర్ ఎయిడ్స్ ఫౌండేషన్ కోసం ఈ నగను 8.8 మిలియన్ డాలర్లకు.. అంటే రూ.74 కోట్లకు విక్రయించారు. ఆ తర్వాత ఈ నగ గురించి ఎవరికీ పెద్దగా సమాచారం తెలియదు. నూర్జహాన్ నెక్లెస్ను అంతా మరచి పోతున్న తరుణంలో.. ఈ నెలలో మార్గోట్ రాబీ ఆ నగతో తళుక్కున మెరిసి.. ఆభరణాల ప్రియులను, తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.– హెచ్. కమలాపతి రావు, సాక్షి వెబ్ డెస్క్ -
ఆమెకు ఆర్థిక శక్తి!
‘బడ్జెట్ అనేది మన స్వేచ్ఛకు పరిమితులు విధించకూడదు. మరింత స్వేచ్ఛ ఇవ్వాలి’ అనేది పాత మాట. ‘ బడ్జెట్ అనేది స్వేచ్ఛ మాత్రమే కాదు మహిళా సాధికారతకు దారి చూపాలి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ ద్వారా కొత్త శక్తి ఇవ్వాలి’ అనేది కొత్త మాట. ‘బడ్జెట్–2026’ నుంచి మహిళలు ఆశిస్తున్నది ఏమిటి? బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్టెన్షనాలిటీ ప్రాధాన్యత ఏమిటి? ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కావాల్సింది ఏమిటి?... తెలుసుకుందాం...గత కాలాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్టెన్షనాలిటీ (జేఈ) కీలకంగా మారింది. ‘జేఈ’ అనేది మహిళల అవసరాలు, ఆకాంక్షలు, ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని చేసే డిజైనింగ్.‘గత బడ్జెట్ చిన్న వ్యాపారాలు, స్టార్టప్లకు కొత్త అవకాశాలను సృష్టించింది, పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను పెంచింది. క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు రెట్టింపు చేసింది. స్టార్టప్లు, ఎగుమతిదారులకు అధిక కాలపరిమితి గల రుణాలను అందించింది. రాబోయే అయిదేళ్లలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఉపశమనం లభించింది. పెద్ద సంస్థలను స్థాపించాలని, పారిశ్రామిక వృద్ధికి దోహదపడాలని, ఉద్యోగాలు సృష్టించాలని మహిళలు కోరుకుంటున్నారు’ అంటున్నారు భారతీయ యువశక్తి ట్రస్ట్(బివైఎస్టీ) మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటేశన్.జెండర్ బడ్జెటింగ్ అంటే...జెండర్ బడ్జెటింగ్ను జెండర్ సెన్సిటివ్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు. బడ్జెట్లో లింగ అసమానతలు లేకుండా చూసుకోవడమే జెండర్ బడ్జెటింగ్. ముఖ్యమైన అంశాలలో మహిళలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేయడం, పురుషులు, మహిళల మధ్య వనరుల పంపిణీలో సమానత్వం ఉండేలా చూడడం జెండర్ బడ్జెటింగ్ ప్రాథమిక లక్ష్యం.సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్2026 బడ్జెట్ నుండి ఆశిస్తున్న వాటిలో ముఖ్యమైనది...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి మహిళలకు తగినంత సహకారం అందించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, డీప్–టెక్లాంటి రంగాలలో మహిళల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయాలని పీహెచ్డీసీసీఐ (పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) మహిళల ప్రతినిధి బృందం కోరుతోంది.ప్రోత్సాహకాలు, విధానపరమైన మద్దతు ద్వారా మహిళల నేతృత్వంలోని పరిశ్రమలు, సేవారంగాలకు ప్రోత్సాహం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించే మహిళలకు, ముఖ్యంగా ‘స్టెమ్’ విభాగాలకు సంబంధించిన మహిళలకు స్కాలర్షిప్లు అందించాలని, మార్కెట్ యాక్సెన్ను మెరుగుపరుచుకోవడానికి మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను అందించాలనీ కోరారు. ఆఫీసులలో మహిళా ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ నివారణలాంటి ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి ఆరోగ్య పథకాలను అందించాలని కోరారు.మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం..‘మహిళల నేతృత్వంలోని కంపెనీలకు అందుబాటులో ఉండే పథకాలను ప్రవేశపెట్టాలని, ముఖ్యంగా కొలేటరల్–ఫ్రీ క్రెడిట్, వడ్డీ రాయితీ...మొదలైన వాటి ద్వారా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. చిన్నా, పెద్ద పట్టణాలలో ఉన్న మహిళా వ్యాపారులలో ఎంతో సృజనాత్మకత ఉంది. గొప్ప ఆశయాలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు అయ్యేలా సహాయపడవచ్చు. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం అనేది కేవలం కలిసికట్టుగా ముందుకు సాగడం మాత్రమే కాదు భవిష్యత్తు కోసం మెరుగైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కూడా’ అంటున్నారు క్రిమినల్ లాయర్ నుంచి ఎంటర్ప్రెన్యూర్గా మారిన ‘రూట్స్ కేఫ్’ ఫౌండర్ మీనాక్షి కుమార్. ‘మన దేశంలో రిటైల్ కాస్మెస్యూటికల్ పరిశ్రమ లో ఎంతో మార్పు వచ్చింది. దీనిలో మహిళా వినియోగదారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. స్వల్పకాలిక పరిష్కారాల కంటే దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్మెస్యూటికల్స్ను కేవలం అందాల విభాగంగా మాత్రమే చూడకుండా ఆరోగ్య సంరక్షణ–విశ్లేషణ వర్గంగా అధికారికంగా గుర్తించే అవకాశాన్ని కేంద్ర బడ్జెట్ 2026 ఇస్తుందని ఆశిస్తున్నాం. సమర్థవంతమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ రంగం మరింత అభివృద్ధి అయ్యేలా చేయవచ్చు. దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మన దేశంలోని బ్యూటీ–ఫార్మా పరిశ్రమ బలోపేతం అవుతుంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది’ అంటున్నారు బ్యూటీ–ఫార్మాకు చెందిన మహిళా ఎంటర్ప్రెన్యూర్లు.అసమానతలు లేకుండా...మా వాహక్, విట్ట సఖీగా మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి బీమా వాహక్లకు కేంద్ర బడ్టెట్లో ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది. ‘బడ్జెట్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే గత కొంతకాలంగా స్త్రీ సాధికారత దృష్ట్యా అది మరింత ఆసక్తికరంగా మారింది. జెండర్ బడ్జెటింగ్కు ప్రాధాన్యత ఇచ్చే ధోరణి పెరగడం సంతోషం కలిగిస్తోంది. బడ్జెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీదే వారి పురోగతి ఆధారపడి ఉంటుంది’ అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. -
క్యాన్సర్కు ఆన్సర్!
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. డయాబెటిస్, బీపీ మాదిరిగానే క్యాన్సర్తో కూడా దీర్ఘకాలిక మనుగడ సాగించవచ్చు.ఏఐ, రోబోటిక్ సర్జరీలు క్యాన్సర్ పని పడుతున్నాయి. టార్గెటెడ్ థెరపీ, నానో మెడిసిన్, ప్రోటాన్ బీమ్ థెరపీలు క్యాన్సర్ కణాలను గురి తప్పకుండా నిర్మూలిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి . వీటి ఫలితంగా క్యాన్సర్కు ఆన్సర్ దగ్గరలోనే ఉంది.ఇమ్యూనో థెరపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది. రోగుల శారీరక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించే ‘హైపర్ పర్సనల్’ ఔషధాలు, వ్యాక్సిన్లు క్యాన్సర్ను మరింత సమర్థంగా ియంత్రించగలుగుతాయి.క్యాన్సర్ నిర్ధారణను, చికిత్సను ఏఐ మరింతగా మెరుగుపరుస్తుంది. చికిత్సకు ముందే ఔషధాల దుష్ప్రభావాలను ఏఐ ఇప్పటికే గుర్తించగలుగుతోంది. దీనివల్ల అతి తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధాలను ఇవ్వడం ద్వారా వ్యాధిని సమర్థంగా అదుపు చేయడం సాధ్యమవుతోంది. ఏఐ సాయంతో సమీప భవిష్యత్తులో అతి తక్కువ దుష్ప్రభావాలు గల ఔషధాల రూపకల్పన కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.చాలా రకాల క్యాన్సర్లలో సర్వసాధారణంగా కనిపించే టెలోమెరేస్, సర్వినిన్, పీ53 ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని, వాటి ద్వారా వ్యాపించే క్యాన్సర్లను అరికట్టే వ్యాక్సిన్లను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. ఇవి విజయవంతమైతే క్యాన్సర్కు దాదాపు ఆన్సర్ దొరికినట్లే!‘క్యాన్సర్కు ఆన్సర్ ఉండదు’ అనేది ఇదివరకటి మాట. ఇప్పుడది దాదాపు అపోహ. వైద్యశాస్త్రం శరవేగంగా సాధిస్తున్న అభివృద్ధి క్యాన్సర్ దూకుడుకు కళ్లేలు వేయగలుగుతోంది. పలు రకాల క్యాన్సర్లను సమూలంగా నయం చేయగలుగుతోంది. కొన్ని రకాల క్యాన్సర్లు సోకకుండా వ్యాక్సిన్లను తయారు చేయగలుగుతోంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను, చికిత్స విధానాల్లోను వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు త్వరలోనే క్యాన్సర్కు ఆన్సర్గా ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్లను పూర్తిగా అరికట్టగల రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే రోజుల నుంచి క్యాన్సర్ను జయించడం ఏమంత కష్టం కాదనేంత వరకు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగాక రకరకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి, అరికట్టడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణ కోసం ఒకప్పుడు తప్పనిసరిగా కోతపెట్టి, బయాప్సీ పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకు కోతతో పనిలేకుండా, రక్తపరీక్ష ద్వారా జరిపే ‘లిక్విడ్ బయాప్సీ’, శ్వాస ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయగల ‘బ్రీతలైజర్లు’ వాడుకలోకి వచ్చాయి.క్యాన్సర్ రోగులను యమయాతనకు గురిచేసే కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్స పద్ధతుల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఇమ్యూనో థెరపీ’తో చాలామంది క్యాన్సర్ నుంచి విజయవంతంగా కోలుకోవడం సాధ్యం అవుతోంది. వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా సమీప భవిష్యత్తులోనే కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారించడం; ఇంకొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం; మరికొన్ని రకాల క్యాన్సర్లను ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పద్ధతుల్లో ఇటీవలి కాలంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను తెలుసుకుందాం...లిక్విడ్ బయాప్సీ‘కోవిడ్–19’ తర్వాతి కాంలలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో రోగులకు మేలు చేసే కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో ‘లిక్విడ్ బయాప్సీ’ ఒకటి. రక్త నమూనా ద్వారానే క్యాన్సర్ను ముందుగా నిర్ధారించే పరీక్ష ఇది. సేకరించిన రక్తనమూనాలోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లను విశ్లేషించి, రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్ గుర్తించేందుకు ‘లిక్విడ్ బయాప్సీ’ దోహదపడుతుంది. దీని వల్ల త్వరగా చికిత్సను ప్రారంభించి, ఎక్కువగా ఇబ్బంది లేకుండానే క్యాన్సర్ను పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. కోతపెట్టడం ద్వారా కణజాలం ముక్కను తీసుకునే చేసే బయాప్సీ పరీక్ష కంటే ఇది చాలా తక్కువ నొప్పితో కూడుకున్నది కావడమే కాకుండా, రోగనిర్ధారణలో సమర్థంగా ఉపయోగపడుతుంది.ఏఐ ఆధారిత పాథాలజీక్యాన్సర్ నిర్ధారణకు సీటీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, మామోగ్రామ్, హిస్టోపాథాలజీ పరీక్షలు వంటివి చేస్తుంటారు. వీటిని విశ్లేషించి, చికిత్స చేయడం కొత్తేమీ కాదు. వీటి విశ్లేషణ కోసం ఇటీవలి కాలంలో ఏఐ వినియోగం మొదలైంది. ఏఐ వినియోగం వల్ల రకరకాల స్కానింగ్స్ వంటి ఇమేజింగ్ పద్ధతుల విశ్లేషణ చాలా సులభతరంగా మారింది. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా క్యాన్సర్లను త్వరితగతిన గుర్తించడానికి, తగిన చికిత్స అందించడానికి వీలవుతోంది. ఏఐ ఆధారిత ఇమేజింగ్ పద్ధతుల ద్వారా వైద్యులు మరిన్ని ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) పరీక్షలుఇవి కూడా ‘లిక్విడ్ బయాప్సీ’ మాదిరి పరీక్షలే! ఒకే రక్తనమూనాను పరీక్షించడం ద్వారా యాభైకి పైగా క్యాన్సర్లను ముందుగానే గుర్తించే విధానాన్ని ఇటీవలి కాలంలో వైద్య పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటివల్ల రోగులకు ముందుగానే చికిత్స ప్రారంభించి, ఎక్కువ ఇబ్బంది లేకుండానే వ్యాధిని నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరీక్షల్లో రోగి నుంచి సేకరించిన రక్తనమూనాల ద్వారా డీఎన్ఏలో వచ్చే మార్పుల ఆధారంగా దాదాపు యాభైకి పైగా రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలను గుర్తించడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక విప్లవాత్మకమైన పరిణామం.జీనోమిక్ ప్రొఫైలింగ్– ప్రెసిషన్ ఆంకాలజీక్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఇటీవలి కాలంలో అధునాతనమైన మాలిక్యులర్, జీనోమిక్ ప్రొఫైలింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా జీవకణాల్లోని జన్యువుల్లో క్యాన్సర్కు దారితీసే ఉత్పరివర్తనలను ముందుగానే అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో రోగికి వారి వారి వ్యాధి పరిస్థితులను బట్టి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ చికిత్సను అందించగలుగుతున్నారు. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వల్ల క్యాన్సర్ రోగులను మృత్యువాత పడకుండా కాపాడగలుగుతున్నారు.డిజిటల్ బయో మార్కర్స్ఇటీవలి ఆవిష్కరణల ఫలితంగా క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలు, బయాప్సీ కోసం సేకరించిన కణజాలం నమూనాలు వంటి ‘బయో మార్కర్స్’ను హైరిజల్యూషన్ డిజిటల్ ఇమేజెస్గా మార్చడం వీలవుతోంది. డిజిటల్ బయో మార్కర్స్ ద్వారా క్యాన్సర్ రోగులకు తగిన చికిత్స అందించడానికి, వారి ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. డిజిటల్ బయో మార్కర్స్ ఇమేజెస్ను సుదూరంలో ఉన్న నిపుణులకు పంపి, వారి సలహా సంప్రదింపులు పొందడానికి, వారి సూచనల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతోంది. దీని వల్ల ఎక్కడి నుంచైనా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలపై చికిత్స పొందడం సాధ్యమవుతోంది.క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు ఆశాజనమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడానికి, రోగుల జీవితకాలాన్ని పొడిగించడానికి దోహదపడుతున్నాయి. ఇదివరకు క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో మరిన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...సీఏఆర్–టీ సెల్ థెరపీలుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లను అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ‘కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ–సెల్ థెరపీ’ (సీఏఆర్–టీ సెల్ థెరపీ). ఇది కూడా ఇమ్యూనో థెరపీలో ఒక విధానం. అయితే, ఇది వ్యక్తిగత చికిత్స విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధకతకు దోహదపడే ‘టీ–సెల్స్’కు జన్యుమార్పులు చేసి, రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.టార్గెటెడ్ థెరపీకీమో థెరపీ, రేడియో థెరపీలలో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు ‘టార్గెటెడ్ థెరపీ’ని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఇవి హాని చేయవు. టార్గెటెడ్ థెరపీతో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతోంది.ప్రెసిషన్ రేడియేషన్ థెరపీరేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్కు గురిచేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో రేడియేషన్ కిరణాలను కచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, స్టీరియో టాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో కచ్చితత్వం గణనీయంగా పెరిగి, రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గి, రోగి కోలుకునే అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి.నానో మెడిసిన్క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్స్ సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్స్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్స్లో 1–100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగం మరింతగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బేస్డ్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీలో నానో సాంకేతికత వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.రోబోటిక్ క్యాన్సర్ సర్జరీక్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత కచ్చితత్వం సాధిస్తోంది. హైడెఫినిషన్ త్రీడీ కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితులను గుర్తించి, తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో పని చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితులను తొలగించగలుగుతున్నాయి. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతోంది. ప్రొస్టేట్, కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, అండాశయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ సత్ఫలితాలను సాధిస్తోంది. ప్రోటాన్ బీమ్ థెరపీరేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్–రే రేడియషన్ కిరణాలను ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యకరమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో ప్రోటాన్ కిరణాలు అత్యంత కచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకు ప్రసరించి, అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హానీ జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి అవకాశం ఉండటం మరో సానుకూలత. దీని వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం లేకుండా, విడతలు విడతలుగా క్యాన్సర్ కణితిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నెముక, కన్ను, ప్రొస్టేట్, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.మరిన్ని చికిత్స పద్ధతులుక్యాన్సర్ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్స పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’, ‘ఎపిజెనెటిక్ థెరపీ’ వంటి పద్ధతులపై ప్రయోగాలు జరుపుతున్నారు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’లో జన్యుమార్పిడి చేసిన వైరస్ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిని మెలనోమా వంటి చర్య క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ‘ఎపిజెనెటిక్ థెరపీ’లో క్యాన్సర్కు కారణమయ్యే ఉత్పరివర్తలను లోనైన జన్యువులను గుర్తించి, వాటి డీఎన్ఏను మార్చకుండానే, ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పరివర్తనలను వెనక్కు మళ్లిస్తారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్ససమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతులను కొనసాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా ‘హైపర్ పర్సనలైజ్డ్’ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి, ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో పలు అధునాతనమైన ఔషధాలు, చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చినా, పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదు. అందువల్ల క్యాన్సర్ను దీర్ఘకాలం నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధాలను, చికిత్స విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించ లేకపోయినా; డయాబెటిస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా చేయవచ్చని చెబుతున్నారు.క్యాన్సర్ వ్యాక్సిన్లుపలు రకాల క్యాన్సర్లను నిరోధించడానికి వీలుగా ఇటీవలి కాలంలో ‘ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రొటీన్లకు అనుగుణంగా ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్, మెలనోమా, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. -పన్యాల జగన్నాథదాసు -
ఇసుక బ్యాటరీ
ఆధునిక గడియారాలు అందుబాటులో లేకముందు ఇసుక గడియారాలను వాడేవారు. కాని, అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలు కూడా అందుబాటులోకి వచ్చాక ఈ ఇసుక బ్యాటరీ తయారు కావడం వింతగా ఉంది కదూ! నిజానికి ఇది లిథియం అయాన్ బ్యాటరీల కంటే అధునాతనమైనది, అత్యంత సమర్థమైనది కూడా! ఫిన్నిష్ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ ఇసుక బ్యాటరీని రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇసుక బ్యాటరీ. ఈ బ్యాటరీ సామర్థ్యం తెలుసుకుంటే, నోరెళ్లబెట్టాల్సిందే!ఈ బ్యాటరీతో ఏకంగా ఐదువేలకు పైచిలుకు ఇళ్లు గల ఒక చిన్న పట్టణానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగలుగుతున్నారు. పోర్నాయినెన్ అనే పట్టణంలో ప్రయోగాత్మకంగా దాదాపు యాభై అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ ఇసుక బ్యాటరీని నెలకొల్పారు. ‘లోవీసన్ ల్యాంపో’ అనే కంపెనీ శాస్త్రవేత్తల సహాయంతో ఈ ఇసుక బ్యాటరీని తయారు చేసి, ఈ పట్టణంలో నెలకొల్పింది. పొడిగా చితక్కొట్టిన రాళ్లను ఇసుకగా మార్చి, దానిని విపరీతంగా వేడి చేయడం ద్వారా ఈ బ్యాటరీని రూపొందించారు.అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడెక్కిన ఇసుక దీర్ఘకాలం పాటు వేడిని నిక్షిప్తం చేసుకుని, విద్యుత్తు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఎంత విద్యుత్ సరఫరా ఉన్నా, ఫిన్లండ్లో శీతకాలమైతే చాలు, ఇళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి కట్టెల వినియోగం కూడా తప్పనిసరి. అయితే, ఈ ఇసుక బ్యాటరీ వల్ల పోర్నాయినెన్ పట్టణంలో ఈ శీతకాలంలో కట్టెల వినియోగం దాదాపు అరవైశాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఫిన్లండ్ తన విద్యుత్తు వినియోగంలో 43 శాతం మేరకు పునర్వినియోగ ఇంధనాల ద్వారానే పొందుతోంది. పునర్వినియోగ ఇంధనాలను మరింతగా పెంచడం ద్వారా 2035 నాటికల్లా పూర్తిగా పర్యావరణ హితమైన విద్యుత్తునే దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని ఫిన్లండ్ ప్రభుత్వం భావిస్తోంది. -
ఆ ఆనందమే వేరు!
మనసును తాకే అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ఆమె మనసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే, మీ కోసం...⇒ అసలు పేరు నమిత. ‘మమిత’ అనే పేరు సినిమాలు ఇచ్చిన బహుమతి. ఇంట్లో మాత్రం ఇప్పటికీ పొన్నుమణి, మమ్మే అని పిలుస్తారు. ‘సూపర్ శరణ్య’ తర్వాత ‘సోనా’ కూడా అయ్యాను.⇒ నటనకంటే ముందే నాట్యం నా జీవితంలో ఉంది. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. స్టేజ్పై అడుగులు వేస్తే వచ్చే ఆనందం వేరే ఏదీ ఇవ్వలేదు.⇒ సినిమాల మధ్యలోనూ సైకాలజీ చదవాలని ప్రయత్నించాను. షూటింగ్స్ వలన క్లాసులు మిస్ అయ్యాయి. కాని, నేర్చుకోవాలనే కోరిక ఇంకా అలాగే ఉంది.⇒ మేకప్ లేకుండా, సింపుల్ దుస్తుల్లోనే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. డిజైనర్ డ్రెస్సులు కాదు, నా అల్మరాలో ఉన్న వాటితోనే ఎక్కువగా స్టయిలింగ్ చేసుకుంటాను.⇒ నేనొక ఫూడీ. అందులోనూ నాన్వెజ్కి నో చెప్పలేను. పంచకర దోశ, బాషి బిర్యానీ నా ఫేవరెట్స్. మలయాళీ వంటకాలంటే ఇల్లు గుర్తు వస్తుంది. కాని, తమిళ సెట్ దోశ, నెయ్యి ఇడ్లీలకు కూడా పెద్ద ఫ్యాన్ను. వంకాయ మాత్రం నాకు చాలా బోరింగ్ కూర.⇒ మలయాళం నా మాతృభాష. కాని, ఇతర భాషా చిత్రాల్లో నటించాలంటే భాషను గౌరవించాలి అనిపించింది. ఒక్కో పదం నేర్చుకుని ఇప్పుడు తమిళం, తెలుగు చదవడం, రాయడం కూడా వస్తోంది.⇒ స్క్రీన్పై కెమిస్ట్రీ చూసి వచ్చే డేటింగ్ రూమర్స్ నాకు కొత్త కాదు. అవన్నీ సోషల్ మీడియా కథలే! నా రియల్ రిలేషన్ షిప్ నాకు మాత్రమే తెలుసు.⇒ సెట్లో ఉన్నప్పుడు చాలా కామ్గా ఉంటాను. కెమెరా ఆన్ అయితే పూర్తిగా మారిపోతాను. ఆ మాయే నన్ను నటన వైపు తీసుకొచ్చింది. పెద్ద కమర్షియల్ హిట్స్ కంటే, మనసును తాకే పాత్రలే నాకు నిజమైన విజయం.⇒ రాబోయే ఒక సినిమా నన్ను కొత్తగా పరిచయం చేస్తుంది. ఆ పాత్ర తర్వాత ‘మమిత’ను మరో కోణంలో చూడబోతున్నారు. -
తొమ్మిదేళ్లకే పెట్టుబడులు పెట్టేస్తున్నాడు!
నిజమైన అభ్యాసం అంటే పరీక్షలు రాసి గ్రేడ్లు సాధించడం కాదు.. జీవితాన్ని కనుగొనడం, సృష్టించడం అని తొమ్మిదేళ్లకే అర్థం చేసుకున్నాడు గుజరాత్లోని సూరత్కు చెందిన వేదార్థ్. అందుకే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే తరగతి గది గోడలుగా మార్చుకున్నాడు. ప్రతి క్షణాన్ని ఏదో అన్వేషించడానికి, సృష్టించడానికి.. తద్వారా ఉన్నతస్థాయికి ఎదగడానికే వినియోగిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 100కి పైగా పుస్తకాలు చదివాడు. రోబోటిక్స్, ఎల్ఈజీవో నిర్మాణం వంటి అంశాలపై వర్క్ షాపులకు వెళుతుంటాడు. ఏ సవాల్నైనా ఉత్సాహంతో ఎదుర్కొంటాడు. ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకం చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం.. వాటిని జీవితంలో ఎలా వినియోగించుకోవాలా అని ఆలోచించడం.. అతడి నిత్యకృత్యంగా మారిపోయింది.విద్యాభ్యాసాన్ని సరికొత్తగా పునర్ నిర్వచించుకున్న వేదార్థ్ (Vedarth) అక్కడితో ఆగిపోలేదు. సొంతగా కప్కేక్స్ తయారు చేసి విక్రయిస్తుంటాడు. చాక్లెట్ స్టాల్ ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ సొమ్మును సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో పెట్టుబడులు కూడా పెడుతున్నాడు. ఇలా ఇప్పటివరకు అతడు రూ.10 వేల వరకు పొదుపు చేశాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడిగా వేదార్థ్ గుర్తింపు పొందాడు.తల్లే తొలి గురువు... వేదార్థ్ తల్లి విశ్రుతి తన తొలి గురువు. ఆమె వేదార్థ్ జీవితానికి నిజంగా కావాల్సింది ఏమిటో ఓనమాల నుంచే నూరిపోశారు. స్కూల్లో బట్టీ పట్టడం ద్వారా వచ్చిన జ్ఞానం తన జీవితంలో పెద్దగా ఉపయోగపడలేదని గ్రహించిన విశ్రుతి.. తన కొడుకుకు ఉత్సుకత, వాస్తవ ప్రపంచ అనుభవంతో నిండిన బాల్యాన్ని అందించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో అన్ స్కూలింగ్ అని పిలిచే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.చదవండి: హీరోయిన్ హోటల్ ముందు క్యూ కట్టిన జనం అన్ స్కూలింగ్ (unschooling) విధానంలో నిర్ణీత పాఠ్యాంశాలు, షెడ్యూల్ లేదా పరీక్షల వంటివి ఉండవు. ఇక్కడ కేవలం ఆసక్తి ఆధారిత అభ్యాస విధానం, విద్య సహజమైన ఉత్సుకత, స్వీయ–నిర్దేశిత అన్వేషణ ఆధారంగా సాగుతుంది. ఇందులో భాగంగా విశ్రుతి డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం గురించి ఆచరణాత్మక అవగాహన కల్పించడంతో వేదార్థ్ తల్లి ప్రోత్సాహంతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధమవుతున్నాడు. వేదార్థ్.. నువ్వు వెరీవెరీ స్పెషల్..– గౌతమి గిద్దిగాని, సాక్షి సెంట్రల్ డెస్క్ -
8 బడ్జెట్లు.. 8 చీరలు.. దేని స్పెషాలిటీ దానిదే!
కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున దేశమంతా వివిధ శాఖలకు కేటాయింపుల గురించి చర్చించుకుంటుంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు. ఏటా ఆమె ధరించే చీర భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా దేశీయ చేనేత కళాకారులకు ఇచ్చే గౌరవంలా కనిపిస్తుంది. ఈ కథనంలో గడిచిన ఎనిమిది బడ్జెట్ సెషన్లలో (2019 నుంచి 2025 వరకు) నిర్మలమ్మ ధరించిన చీరల ప్రత్యేకతలు తెలుసుకుందాం.2019: మంగళగిరి చేనేత వైభవంతొలి బడ్జెట్ ప్రసంగం కోసం నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన మంగళగిరి చేనేత చీరను ఎంచుకున్నారు. బంగారు రంగు అంచు ఉన్న ఈ గులాబీ రంగు చీర ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.2020: కంచి పట్టు సంప్రదాయంరెండో బడ్జెట్ సమయంలో ఆమె దక్షిణ భారత దేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచి పట్టు చీరలో మెరిశారు. పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించి సభలో హుందాతనాన్ని చాటారు.2021: పోచంపల్లి ఇక్కత్ కళతెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను 2021 బడ్జెట్ సందర్భంగా ఆమె ధరించారు. ఎరుపు, ఆఫ్-వైట్ కలయికతో ఉన్న ఈ చీరపై ఉన్న ఆకర్షణీయమైన గ్రీన్ బోర్డర్ దేశీయ చేనేత కళాకారుల ప్రతిభను ప్రతిబింబించింది.2022: బొంకాయ్ సిల్క్ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ బొంకాయ్ శైలి చీరను 2022లో ఆమె ఎంచుకున్నారు. రస్ట్ బ్రౌన్ రంగులో ఉండి మెరూన్ బోర్డర్, సిల్వర్ జరీతో ఉన్న చీరను ధరించారు.2023: కసూతి ఎంబ్రాయిడరీ2023 బడ్జెట్ రోజున కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే కసూతి ఎంబ్రాయిడరీ చీరలో ఆమె కనిపించారు. ఎరుపు రంగు చీరపై నలుపు రంగు టెంపుల్ బోర్డర్, చేతితో అల్లిన ప్రత్యేకమైన కసూతి వర్క్ ఆకర్షణీయంగా నిలిచింది.2024 (మధ్యంతర బడ్జెట్): బెంగాల్ కాంతా వర్క్2024 ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కోసం ఆమె పశ్చిమ బెంగాల్కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీ ఉన్న ఇండిగో బ్లూ రంగులో ఉన్న సిల్క్ చీరను ధరించారు. ‘రామా బ్లూ’గా పిలిచే ఈ రంగు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని సూచించింది.2024 (పూర్తి స్థాయి బడ్జెట్): మంగళగిరి పట్టు పునరావృతంమరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆమె మళ్లీ మంగళగిరి పట్టు చీరను ఎంచుకున్నారు. ఆఫ్-వైట్ రంగులో ఉండి పర్పుల్, గోల్డ్ బోర్డర్ ఉన్న చీరను ధరించారు.2025: మధుబని చిత్రకళా సౌరభం2025 బడ్జెట్ సెషన్లో బిహార్కు చెందిన సుప్రసిద్ధ మధుబని పెయింటింగ్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీమ్ కలర్ సిల్క్ చీరపై పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా వేసిన చిత్రకళతో ఈ చీర రూపొందించారు. -
శాస్త్రవేత్తలే షాకయ్యారు.. అసలేంటి ‘గ్రేవ్ 43’?
బంగారం.. బంగారం.. బంగారం.. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలతో ఇప్పుడు గోల్డ్ హెడ్లైన్స్ అవుతోంది.. బ్రేకింగ్ న్యూస్గా మారుతోంది. కానీ, ఓ చోట సమాధుల్లో కుప్పలు తెప్పలుగా బంగారం దొరికిందంటే మీరు నమ్ముతారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6,600 సంవత్సరాల క్రితమే.. ఆ సమాధుల్లో బంగారాన్ని పెట్టారని, ఆ కాలంలోనే బంగారాన్ని అందమైన ఆభరణాలుగా మార్చారని తెలిస్తే.. షాకవుతారు కదా? ఆ విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చాం. వివరాలను చదవాల్సిందే.62 సమాధులు.. కిలోల కొద్దీ బంగారం..అది బల్గేరియాలోని వర్ణా అనే నగరంలో ఉన్న శ్మశానం..! ప్రాంతం. 1972లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఓవైపు పారిశ్రామిక ప్రాంతం, మరో వైపు, కార్మికుల నివాస సముదాయాలు ఉండే ఆ ప్రాంతంలోని శ్మశానంలో జరిపిన తవ్వకాలతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అక్కడ మొత్తం 300 సమాధులు బయటపడగా.. వాటిల్లో 62 సమాధుల్లో కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు లభించాయి.పరిశోధనల్లో ఏం తేలిందంటే..అందమైన నగలే కాకుండా.. రాజదండం, ఇతరత్రా రాచముద్రల రూపంలోనూ బంగారం లభ్యమైంది. కార్బన్ డేటింగ్ వంటి తదనంతర పరిశోధనల్లో తేలింది ఏమిటంటే.. ఆ సమాధుల్లోని మృతదేహాలు క్రీస్తు పూర్వం 4600 నుంచి 4300 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి. అంటే.. మనముంటున్న కాలంతో పోలిస్తే.. దాదాపు 6 వేల సంవత్సరాల కిందటివన్నమాట. అంటే.. అప్పట్లోనే బంగారంపై మోజు ఉన్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు.ఏకంగా మృత కళేబరానికి..ఈ సమాధుల్లో ‘గ్రేవ్ 43’ ఏకంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఆ సమాధిలో కిలోన్నరకుపైగా బంగారం ఓ మృతదేహం వద్ద లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అతను మృతిచెందినప్పుడు 60 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. అంతలా బంగారం లభించడాన్ని బట్టి.. అతను సంబంధిత తెగకు నాయకుడై ఉంటారని భావించారు. గ్రేవ్ 43లో ఏకంగా మృత కళేబరానికి బంగారు గొలుసులు, చేతి కంకణాలు, చెవిపోగులున్నాయి. దీంతోపాటు.. బంగారు రాజదండం, బంగారు పూత పూసిన ఆయుధం ఆ సమాధిలో లభించాయి.అబ్బురపరిచే అద్భుత శైలిఇప్పుడు ఈ సమాధులు ఎందుకు హాట్ టాపిక్ అయ్యాయంటే.. మీకు తెలిసిందే..? బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుక్కారణం ప్రజల్లో బంగారంపై మోజు పెరగడమే..! భారత్లో బంగారు ఆభరణాలు స్టేటస్కి నిదర్శనమైతే.. విదేశాల్లోనూ వేల ఏళ్ల క్రితమే అంతటి క్రేజ్ ఉందని ఈ సమాధులు స్పష్టం చేస్తున్నాయి. మెషీన్లతో కాకుండా.. పూర్తిస్థాయిలో చేతితో చేసిన బంగారు ఆభరణాలు అంత అద్భుత శైలిలో తయారు చేయడం ఇప్పటి తరాన్ని అబ్బురపరుస్తున్నాయి.6,600 ఏళ్ల క్రితమే..అంటే.. 6,600 ఏళ్ల క్రితమే బంగారాన్ని కనుక్కొన్నారనే విషయం ఒక ఎత్తయితే.. దాన్ని శుద్ధి చేసి, హ్యాండీక్రాఫ్ట్ మాదిరిగా చేతితోనే ఆభరణాలుగా మార్చడం మరో విశేషం. అంతేకాదు.. ఆ కాలంలోనే సంపద అనేది సమాజంలో విభజనకు కారణమనే విషయం స్పష్టమైంది. వర్ణా శ్మశానంలో బయటపడ్డ 300 సమాధుల్లో కేవలం 62 గ్రేవ్స్లో మాత్రమే బంగారు ఆభరణాలుండడం ఇందుకు నిదర్శనం. సింధూనాగరికత సమయంలో కోటల్లో ఎగువ వర్గాలు.. కోట బయట దిగువ స్థాయి వర్గాలుండేవని చదువుకున్న విషయం తెలిసిందే..! ఈ సమాధులను పరిశీలిస్తే.. 6,600 ఏళ్ల క్రితమే బల్గేరియాలో కూడా ఇలాంటి సామాజిక ఆంతర్యాలున్నట్లు స్పష్టమవుతోంది. ఆ సమాధుల్లోంచి వెలికి తీసిన ఆభరణాలు ప్రస్తుతం బల్గేరియాలోని వర్ణా ఆర్కియాలజికల్ మ్యూజియంలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. -
‘పీస్’ ఫుల్ఫామ్.. ‘పి’ ఫర్ పెయిన్–మేకర్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ‘పీస్’ ప్రైజ్ వరించిందనే వార్త ప్రపంచాన్ని అయోమయంతో కూడిన ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ట్రంప్ ఆనందానికి అవధులు, ఆనకట్టలు, డ్యామ్లు, కాలువలు లేవు.‘ఈసారి కచ్చితంగా నాకే’ అని గన్షాట్ ఆశ పెట్టుకున్న ట్రంప్ను గతంలో ఎస్నో సార్లు ‘పీస్’ ప్రైజ్ వెక్కిరిస్తూ వచ్చింది.పరాభవానికి గురైన ట్రంప్ ‘శాంతి’ బహుమతిపై అశాంతి, కసి, కోపం, పగ, ప్రతీకారం, రివేంజ్.. ఇలాంటివి ఎన్నో పెట్టుకున్నాడు. అంతేకాదు...‘పి’తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం మానేశాడు. ‘పి’తో మొదలయ్యే వంటకాలను తినడం మానేశాడు.‘పి’తో మొదలయ్యే డ్రింక్స్ తాగడం మానేశాడు.అలాంటి ట్రంప్ను ‘పీస్’ ప్రైజ్ వరించడంతో... ఆ ప్రైజ్పై అతడికి అభిమానం, అనురాగం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ, మమత, సమత... ఇలాంటి భావాలెన్నో కలిగాయి. ఆ ఆనంద కిక్లో వైట్హౌజ్లో ప్రెస్మీట్ పెట్టాడు.‘అరచేయి అడ్డుపెట్టి అప్పడం కాలకుండా చేయగలరా? నో... నెవర్! పీస్ ప్రైజ్ నాకు రావడం కూడా అలాంటిదే. ఈ శుభ సందర్భంగా ప్రపంచశాంతిని ఆశిస్తూ ఒక పాట పాడుతాను’ అని గొంతు సవరించాడు ట్రంప్. ఆ పాట వినడానికి సభాసదుల చెవుల వైశాల్యం రెట్టింపు అయ్యింది. ‘నేను విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ’ అని పాడడం ప్రారంభించాడు శ్రీ ట్రంప్.‘సోడా బుడ్డికి ప్రపంచ శాంతికి సంబంధం ఏమిటి?’ అని అడగబోయిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక విలేఖరికి వెజెజువెలా ప్రెసిడెంట్ గుర్తుకు వచ్చాడు. ‘అంత పెద్ద ప్రెసిడెంట్నే మాయం చేసిన వాడికి నేనొక లెక్కా’ అని జాగ్రత్తగా లెక్కలు వేసుకొని నీట్గా రూట్ మార్చాడు.చదవండి: చుక్కల్లో పసిడి ధరలు.. చదివింపుల గుబులు‘మీరు పాడిన పాట ఏ భాషదో తెలియదుగానీ... ఎంత అద్భుతంగా పాడారు సర్!’ అని మెలికలు తిరిగిపోయాడు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అని చెప్పిన ట్రంప్కు తన పాట ఎంత బ్లడ్పాతం సృష్టించిందో తెలియదు. దీనికి సాక్ష్యం... వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి చెవిలోని నుంచి ఆగకుండా కారుతున్న రక్తం!!!!కసి మెరుపు: ఇంతకీ... ట్రంప్కు ‘పీస్’ ప్రైజ్ ప్రకటించింది నోబెల్ కమిటీ కాదు.‘హారిబుల్’ కమిటీ! అర్జెంటీనాలోని ఫాక్స్నక్కపాలెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కమిటీ... మూర్ఖత్వం, అహం మూర్తీభవించిన ప్రతిభా‘వాంతు’లకు ప్రతి యేటా ‘పీస్’ ప్రైజ్ ప్రకటిస్తుంది. ఇంతకీ... ఈ ‘పీస్’ ప్రైజ్లో శాంతి పిసరంత కూడా ఉండదు.– యాకుబ్ భాషఇంతకీ... వీరి ‘పీస్’ ఫుల్ఫామ్...‘పి’ ఫర్ పెయిన్–మేకర్: బాధలు తయారుచేసే వ్యక్తి‘ఇ’ ఫర్ ఎంప్టీ హెడ్: ఖాళీ బుర్ర‘ఎ’ ఫర్ ఆరగెంట్: గర్వం మూర్తిభవించిన వ్యక్తి‘సి’ ఫర్ క్రేజీ: తెలివితక్కువ–సెన్స్లెస్కు ఎక్కువ‘ఇ’ ఫర్ ఇగోయిస్టిక్: అహంకారి -
చాట్జీపీటీతో డేటింగ్.. వ్యక్తి రహస్యాలు బయటపడ్డాయి
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఎలా దూసుకుపోతోందో చూస్తూనే ఉన్నాం. ఇపుడు మరో అడుగు ముందుకువేసి ఓ ప్రైవేటు డిటెక్టివ్లా మారి ఓ వ్యక్తి రహస్యాలని బయటపెట్టి భయపెట్టేసింది. న్యూయార్క్ సిటీలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన నెట్టింట హల్చల్ చేస్తోంది. న్యూయార్క్కు చెందిన ఒక 27 ఏళ్ల మహిళ, తనకంటే పెద్దవాడైన ఒక ప్రోఫెషనల్తో డేటింగ్కు వెళ్ళింది. ఆ వ్యక్తి ప్రతి విషయానికీ తన ఫోన్లో చాట్ జీపీటీని వాడుతూనే ఉన్నాడు. కాక్టెయిల్స్ చరిత్ర నుండి మాటలు కలపడం వరకు ప్రతిదానికీ అతను చాట్ జీపీటీపై ఆధారపడుతున్నాడు. ఇది గమనించిన ఆమె అతన్ని ఆటపట్టించింది. దానికతను, ‘చాట్ జీపీటీ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి ఏదైనా దీన్ని అడుగు, అది చెబుతుంది’ అని తన ఫోన్ ను ఆమెకు గర్వంగా ఇచ్చాడు. అపుడు ఆ మహిళ సరదాగా.. నా గురించి నీకు నచ్చిన, ఎవరికీ చెప్పని ఒక విషయాన్ని చెప్పు.. అని టైప్చేసింది. ఆ ప్రశ్నకు వెంటనే చాట్జీపీటీ .. నువ్వు నీ భార్య పట్ల ఎంతో ప్రేమగల భర్తవు, నీ పిల్లల పట్ల ఎంతో బాధ్యత గల తండ్రివి.. ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది.. అని చెప్పింది. ఈ సమాధానం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయి, పిల్లలున్నారనే విషయం తెలియడంతో ఆ డేటింగ్ అక్కడితో ముగిసింది. ఆ వ్యక్తి గతంలో తన భార్యకు బహుమతులు కొనడానికో లేదంటే పిల్లల పెంపకం కోసమో చాట్జీపీటీని సలహాలు అడిగి ఉండవచ్చు. ఆ సమయంలో అతను ఇచ్చిన సమాచారాన్ని ఏఐ తన మెమరీలో సేవ్ చేసుకుని.. ఇలా అతని గుట్టు రట్టు చేసింది. ఎక్స్ వేదికగా ప్రముఖ డేటింగ్ కోచ్ బ్లెయిన్ ఆండర్సన్ షేర్ చేసిన ఈ విషయంపై .. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మోసం చేయాలనుకున్న అతనికి ఏఐ తగిన శాస్తి చేసిందని కొందరు స్పందించగా.. ఏఐ మన సమాచారాన్ని ఎంతలా గుర్తుంచుకుంటుందో చూస్తుంటే భయమేస్తోందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. -
పెళ్లంటే.. ఈ ‘మాత్రం’ ఉండాలి!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సాదాసీదా శుభలేఖలు బోర్ కొట్టాయనుకున్నాడో ఏమో.. ఆ వరుడు తన పెళ్లి పత్రికను ఒక మెడికల్ షాపులోని ట్యాబ్లెట్ స్ట్రిప్ లా మార్చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన కిన్నెర నవీన్కు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. వధువు శిరీష ఎం.ఫార్మసీ చదివి, ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. ఆమె వృత్తిని గౌరవిస్తూ, నవీన్ తన వివాహ పత్రికను ఒక ట్యాబ్లెట్ స్ట్రిప్ (మాత్రల షీట్) ఆకారంలో డిజైన్ చేయించారు. సాధారణంగా మందుల షీట్లపై ఉండే హెచ్చరికల తరహాలోనే, ‘డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ మిస్ మై వెడ్డింగ్’అంటూ రాసుకొచ్చారు. -
ఇలా ఉన్నాం.. ఇలా చేయాలి...
ఎకనామిక్ సర్వే అంటే అంకెలు, సంఖ్యల విశ్వరూపం కాదు. రిపోర్ట్ రూపంలోని మన శ్రేయోభిలాషి. విలువైన సూచనలు ఇచ్చే మేధో విశ్లేషకురాలు. ‘ఫలానా విషయంలో మనం ఇలా ఉన్నాం. ఒకప్పుడు అలా ఉన్నాం’ అని గత, వర్తమానాలను కలుపుతూ విశ్లేషిస్తుంది. ‘ఈ ΄పొరపాట్లు చేస్తున్నాం. వాటిని సవరించుకోవాలంటే’ అంటూ విలువైన సూచనలు ఇస్తుంది. డిజిటల్ వ్యసనం నుంచి ఊబకాయ సమస్య వరకు, స్క్రీన్ టైమ్ నుండి మహిళా శ్రామికశక్తి వరకు ఎన్నో అంశాలను విశ్లేషించి, సూచనలిచ్చింది ఎకనామిక్ సర్వే. 40 రెట్లు పెరిగింది! ‘మన దేశంలో ఊబకాయ సమస్య ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతోంది. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారాలవాట్లు. అల్ట్రా– ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం (యూపీఎఫ్) పెరగడం దీనికి కారణం’ అని నివేదిక పేర్కొంది. బర్గర్, పిజ్జా, నూడుల్స్, శీతల పానియాలు...మొదలైనవి జంక్ఫుడ్గా పిలిచే అల్ట్రా– ప్రాసెస్డ్ ఫుడ్స్.ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులకు, ఆరోగ్య సమస్యల పెరుగుదలకు ‘యూపీఎఫ్’ కారణం అవుతోంది.మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ ఒకటి. 2009 నుండి 2023 వరకు యూపీఎఫ్ల వినియోగం 150 శాతానికి పైగా పెరిగిందని నివేదిక తెలియజేసింది. మన దేశంలో యూపీఎఫ్ల రిటైల్ అమ్మకాలు 2006లో 0.9 బిలియన్ డాలర్లు ఉండగా 2019 నాటికి దాదాపు 38 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది 40 రేట్ల పెరుగుదల.డిజిటల్... ఏజ్ చిన్న పిల్లలను హానికరమైన డిజిటల్ కంటెంట్కు దూరంగా ఉంచడానికి వయసు ఆధారిత యాక్సెస్ విధానాన్ని గట్టిగా అమలు చేయాలని నివేదిక సూచించింది. డిజిటల్ ప్లాట్ఫామ్లు వయసు ధృవీకరణను అమలు చేయడానికి బాధ్యత వహించాలని చెప్పింది. ‘పిల్లలలో ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను పాదుకొల్పడంలో పాఠశాలలు కీలక పాత్రపోషిస్తాయి. స్క్రీన్ టైమ్, సైబర్భద్రత, మానసిక ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ వెల్నెస్పై పాఠ్యప్రణాళిక ప్రవేశపెట్టాలి.కోవిడ్–19 సమయంలో విస్తరించిన ఆన్లైన్ బోధనా సాధనాలపై ఆధారపడడాన్ని తగ్గించి, ఆన్లైన్ బోధనకు ప్రాధన్యత ఇవ్వాలి’ అని చెప్పింది.ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లకు సంబంధించి కుటుంబాలకు అవగాహన కలిగించడానికి పాఠశాలలో వర్క్షాప్లు నిర్వహించాలని చెబుతున్న రిపోర్ట్ స్క్రీన్టైమ్ పరిమితులు, డివైజ్–ఫ్రీ టైమ్ అమలు అయ్యేలా చేయాలని, ఆఫ్లైన్ యాక్టివిటీలను పెంచాలని సూచించింది.41.7% మహిళా శక్తిఇటీవల కాలంలో మహిళా శ్రామిక శక్తిలోని సానుకూల ధోరణిని నివేదిక హైలెట్ చేసింది. డేటా ప్రకారం... ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (ఎఫ్ఎల్ఎఫ్పీఆర్) 2017–18లో 23.3 శాతం ఉంటే 2023– 24లో 41.7 శాతానికి పెరిగింది. మహిళల్లో నిరుద్యోగం తగ్గింది. మహిళల నిరుద్యోగిత రేటు 2017–18లో 5.6 శాతం ఉండగా 2023–24లో 3.2 శాతానికి తగ్గింది.‘ఇది గణనీయమైన మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ మహిళల మొత్తం భాగస్వామ్యం పురుషుల కంటే తక్కువగా ఉంది’ అని నివేదిక పేర్కొంది. ‘ఇ–శ్రమ్’పోర్టల్ను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసంఘటిత కార్మికుల పేర్లను నమోదు చేయడానికి, వారిని ఉ పాధి సేవలు, సామాజిక భద్రతతో అనుసంధానించడానికి ఈపోర్టల్ను రూపొందించారు. జనవరి 2026 నాటికి ఈపోర్టల్లో 31 కోట్లకుపైగా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.‘మహిళలు ప్రతిరోజూ వేతనం లేని పనులపై 363 నిమిషాలు గడుపుతుండగా, పురుషులు 123 నిమిషాలు గడుపుతున్నారు. వేతనంతో కూడిన పనులలో పాల్గొనే మహిళలు ఎక్కువ సమయాన్నే వెచ్చిస్తున్నప్పటికీ , మొత్తం మీద వారి భాగస్వామ్యం పురుషుల కంటే తక్కువగా ఉంది’ అని నివేదిక పేర్కొంది. వేతనంతో కూడిన పనులలో మహిళల భాగస్వామాన్ని పెంచడానికి మౌలిక సదు పాయాలు, ఆరోగ్య సంరక్షణ సదు పాయాల మెరుగుదల ప్రాముఖ్యత గురించి నివేదిక నొక్కి చెప్పింది.డిజిటల్ వ్యసనండిజిటల్ వ్యసనాన్ని ప్రధాన జాతీయ ప్రజారోగ్య సమస్యగా అధికారికంగా గుర్తించింది ఆర్థిక సర్వే 2025–2026 నివేదిక. అసంక్రమిత వ్యాధుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరుసలో డిజిటల్ వ్యసనాన్ని చేర్చింది. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, గేమింగ్లపై అధిక సమయాన్ని వెచ్చించడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతింటుందని, పనిగంటలను తగ్గిస్తోందని, డిజిటల్ వ్యసనం అనేది మానవ వనరులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. అవగాహన కార్యక్రమాలతో డిజిటల్ వ్యసనాన్ని దూరం చేయవచ్చని సూచించింది.కుటుంబ ఆదాయం పెరగాలి ‘గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 17 శాతం పాఠశాలలు మాత్రమే మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి. పట్టణ ్ ప్రాంతాల్లో సుమారు 38 శాతం పాఠశాలలు మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి’ అని నివేదిక తెలియజేసింది. పాఠశాలకు వెళ్లని పిల్లలలో అత్యధిక సంఖ్యలో ఉన్నవారు సెకండరీ పాఠశాల వయస్సు (14 నుండి 18 సంవత్సరాల మధ్య) వారేనని తెలియజేసిన నివేదిక కుటుంబ ఆదాయాన్ని గురించి ప్రస్తావించింది. కుటుంబ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, పేదరికం, ఇంటిపనులు, బాధ్యతలు... మొదలైనవి పాఠశాల విద్యను మానేయడానికి ప్రధాన కారణమని నివేదిక తెలియజేసింది.ఏఐతో ఒత్తిడి!‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత పని స్వభావాన్ని మారుస్తోంది. జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ... మొదలైనవి కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నప్పటికీ, నైపుణ్యం పొందే విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి కూడా కలిగిస్తున్నాయి’ అని చెబుతోంది నివేదిక.‘ఏఐ నైపుణ్యానికి సంబంధించి ప్రపంచంలో మన దేశం రెండో స్థానంలో ఉంది. ఏఐని స్వీకరించడం అనేది సాంకేతిక సవాలు మాత్రమే కాదు శ్రమతో కూడుకున్నది. బిజినెస్ మోడల్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సంస్థలు, ఉద్యోగులు ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త పాత్రలకు అనుగుణంగా మారాలి’ అని సూచిస్తోంది ఈ నివేదిక. -
సత్సంబంధాల కోసం 50-30-20 రూల్..! ఎంత కేటాయించాలంటే..
యూట్యూబర్, అంకుర్ వారికు ఆర్థిక నిర్వహణకు చెప్పిన ఇదే రూల్ సత్సంబంధాలకు వర్తిస్తుందన్నారు. అందరు భావోద్వేగ శక్తిని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించేస్తుంటారిని అన్నారు. మన సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇదే రూల్ పాటిస్తే..జీవితంలో మంచి రిలేషన్స్, అభ్యున్నతి రెండూ సునాయసంగా సాధించగలుగుతామని అన్నారు. మన ఎనర్జీని సరైన విధంగా వినయోగిస్తే..మంచి సంబంధాలను నెరపడమేగాక, అవి మన విజయానికి, ఎదుగదలకు ఉపకరిస్తాయని అన్నారు. మరి అదెలాగంటే..భావోద్వేగ శక్తిని ఇలా హ్యండిల్ చేయండి అంటూ ఆర్థిక నిపుణుడు అంకుర్ వారికు 50-30-20 రూల్ గురించి వివరించారు. ఆర్థిక శాస్త్రంలో సరైన ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఈ రూల్ భావోద్వేగ ప్రాధాన్యతను కూడా ఎలా మార్గనిర్దేశితం చేస్తుందో వివరించారు. మన ఎనర్జీలో సగం పని, కుటుంబం, కచ్చితంగా కేటాయించాలి. ఇక 30% మనకు సురక్షితంగా అనిపించే బంధాల కోసం ఎనర్జీని ఖర్చు చేయాలి. మిగిలిన 20% వ్యక్తిగత ఎదుగుదల, అభిరుచులు, స్వీయ పరిశీలనపై దృష్టిపెట్టాలని అన్నారు.ఈ విధంగా భావోద్వేగ శక్తిని విభజించడం ద్వారా అలసిపోకుండా బాధ్యతలు, అర్థవంతమైన సంబంధాలు, స్వీయ-సంరక్షణ తదితరాలను సమతుల్యం చేయడం సులభతరమవుతుంది. వ్యక్తిగతంగా ఎదుగుదల, బాధ్యతలను పోషిస్తూనే మానసిక, భావోద్వేగ స్థితిని బలోపేతం చేసుకోవడానికి ఈ రూల్ హెల్ప్ అవుతుంది. జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తిగతం 20% ఎనర్జీని ఖర్చు చేయడం అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. నెటిజన్లు కూడా అందుకు మద్దతిస్తూ..20% వ్యక్తిగత సంరక్షణకు అత్యవసరం అని..అందరూ దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారంటూ పోస్టులు పెట్టడం విశేషం.(చదవండి: రెండేళ్లకే రెండు గిన్నిస్ రికార్డులు..!) -
రెండేళ్లకే రెండు గిన్నిస్ రికార్డులు..!
పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లుగా ఈ బుడతడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ఎత్తుకు సరిపోని స్నూకర్ గేమ్ని ఆడి అందర్ని అబ్బురపరుస్తున్నాడు. పెద్దవాళ్లు ఆడగలిగే ఈ గేమ్ తన ఎత్తు కారణంగా ఇబ్బందిపడ్డా కూడా..ఆశ్చర్యపోయే విధంగా షాట్లు కొట్టి గిన్నిస్ రికార్డులకెక్కడు. ఇంగ్లాడ్లోని మాంచెస్టర్కు చెందిన ఈ రెండేళ్ల బాలుడు జూడో ఓన్స్ ఒక ఆటలో రెండు ట్రిక్ షాట్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరించింది. స్నూక్ర్ క్రీడా పూల్ క్యూ క్రీడను పోలి ఉంటుంది. టేబుల్పై పెద్ద సంఖ్యలో బంతులు పెట్టి ఆడతారు. క్యూ బాల్తో ఇతర బాల్లను కొట్టినప్పుడూ నేరుగా నిర్ధేశిత హోల్లో పడేలా చేస్తారు. ఇక జూడ్ అక్టోబర్ 12, 2025న పూల్లో బ్యాంక్ షాట్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ ఘనత సాధించడానికి 41 రోజుల ముందు స్నూకర్ గేమ్లో డబుల్ షాట్(టేబుల్ అంచులకు తాకిస్తూ) చేసిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఇక్కడ డబుల్ పాట్ అనేది ఒకే స్ట్రైక్లో రెండు బంతులను క్యూ బాల్తో జత చేసి నిర్దేశిత హోల్లో పడేలా చేస్తే బ్యాంక్ షాట్ అంటారు. నిజానికి ఎత్తు రీత్యా అంత ఎత్తులో ఉండే టేబుల్పై ఆడే క్రీడను జూడో కిచెన్ స్టూల్ సాయంతో నుంచొని ఆడటం విశేషం. అలా అయినా అతని వయసుకి ఆడటం కష్టమే కానీ ఈ చిచ్చరపిడుగు అదేమంతా కష్టం కాదంటూ అవలీలగా చేసి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. కాగా, జూడ్ తండ్రి లూక్ ఒక మినీ టేబుల్ని కొన్నప్పుడే అతనికి స్నూకర్, పూల్ ఆటలను పరిచయం చేశాడు. ఆ చిన్న వయసులోనే తన చిట్టి చేతులతో చాలా సునాయాసంగా క్యూని తీసుకుని అవలీలగా బాల్స్ అన్నింటిని కొట్టేసేవాడని వివరించాడు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెట్టింట షేర్ చేసేవాడు జూడో తండ్రి లూక్. ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ క్రెయిగ్ గ్లెండే కూడా ఇంత చిన్న వయసులోనే జూడ్ ఇంత ప్రతిభ,అంకితభావం, ఉత్సాహాన్ని చూపించడం అత్యంత ప్రత్యేకమని అన్నారు. (చదవండి: Intermittent Fasting: అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు!
బరువు తగ్గించే పద్దతుల్లో అడపాదడపా ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(ఐఎఫ్). బరువు తగ్గడానికి అత్యంత సులభమైన పద్ధతిగా పేర్కొంటారు. త్వరితగతిన బాడీలో మార్పులు..పైగా ఆరోగ్యకరమైన విధానమని పలువురు వెల్న్స్ నిపుణుల అభిప్రాయం. అయితే ఇది మహిళలకు ఎప్పటికీ ప్రమాదకరమని, ముఖ్యంగా పీరియడ్స్ వచ్చే మహిళలకు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఫెర్టిలిటీ కోచింగ్ వ్యవస్థాపకురాలు ప్రీతికాసిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఈ పద్ధతి మహిళ ఆరోగ్యానికి ఏవిధంగా చేటు చేస్తుందో తన స్వీయానుభవాన్నిషేర్ చేసుకున్నారు.విపరీతంగా ప్రజాదరణ పొందిన అడపాదడపా ఉపవాసం మహిళల ఆరోగ్యానికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ఇది హర్మోన్లను ఇన్బ్యాలెన్స్ కారణమయ్యే విధానంగా అభివర్ణించారు. దీన్ని అవలంభించడంతో తనకు టీ స్థాయిలు గణనీయంగా పడిపోయాయని, జీవక్రియ నెమ్మదించిందని, కార్టిసాల్ స్థాయిలు ఉదయంపూట ఎక్కుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే నిరంతరం చలిగా అనిపించిందని, పీరియడ్స్ రావడం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారామె. ఈ విధానం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని తేల్చి చెప్పారామె. నిజానికి ఈ విధానంలో అల్పాహారం దాటవేయాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని ఆహరం కంటే కార్టిసాల్తో నడపేలా బలవంతం చేస్తుందన్నారు. ఫలితంగా థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపడం, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం వంటి సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారామె. బ్రేక్ఫాస్ట్ అనేది శక్తి కదలికని, అది తప్పనసరి అన్నారామె. ఇక ఈ అడపాదడపా ఉపవాసం..తప్పుదారి పట్టించే వెల్నెస్ సలహాగా అభివర్ణించారామె. అడపాదడపా ఉపవాసం అంటే..ఈ విధానంలో ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనేదానిపై ఫోకస్ పెట్టే చేసే డైట్ విధానం. అత్యంత సాధారణ వెర్షన్ 16:8 పద్ధతి. ఇక్కడ 16 గంటలు ఉపవాసం ఉండి ఎనిమిది గంటలలోపు తినాల్సి ఉంటుంది. ఇది డైటింగ్ను సులభతరం చేస్తుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలువురు నిపుణులు వాదన. .సైన్స్ ఏం అంటుందంటే..అయితే ఈ వాదనలలో కొన్నింటిని సైన్స్ సమర్థిస్తుంది. బహుళ అధ్యయనాలు IF బరువు తగ్గడానికి, నడుము చుట్టుకొలతను తగ్గించడానికి, రక్తంలో మెరుగైన చక్కెర నియంత్రణకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే..నొయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ డీన్ డాక్టర్ సుప్రియా అవస్థి మాట్లాడుతూ, అడపాదడపా ఉపవాసం మహిళలందరికీ మంచిది కాదని చెప్పలేం కానీ ఇది అందరికీ సురక్షితమైనది కాదని అన్నారు. అయితే మహిళలు తమ ఆరోగ్యానికి సరిపడితే ఈ పద్ధతి పాటించొచ్చని, అయితే చాలామటుకు మహిళల్లో ఈ విధానం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండాలంటే కష్టమని, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు.Intermittent fasting was one of the worst things I did for my hormones (7 years ago).My free T3 levels dropped significantly when I did it, which means my metabolism slowed to a crawl. I was cold all the time. My cortisol levels were elevated in the morning. My periods were…— Preethi Kasireddy (@iam_preethi) January 26, 2026 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?) -
హార్డ్వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..!
లైఫ్లో ఒకానొక టైంలో కష్టపడకపోతే..మనల్ని ఎవ్వరు రక్షించలేరు అన్నది జగమెరిగిన సత్యం. మన పెద్దలు కూడా వయసులో ఉన్నప్పడు ఏదైనా సంపాదించగలం, ఆ తర్వాత మనతరం కాదు అని అంటుంటారు. అలాగే కష్టబడి డిగ్రీలు చదివి..ఉద్యోగం సంపాదించక హమ్మయ్యా అనేస్తాం. కానీ అక్కడి నుంచే మన అభివృద్ధి, ఎదుగుదల మొదలవ్వుతుంది. అలాకాకుండా..చతికిలపడితే అంతే పరిస్థితి అంటూ నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక ఆలోచింపచేసేలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.26 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగి నందిని శర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గొప్ప కెరీర్ పాఠాన్ని షేర్ చేశారు. టీనేజ్ చివరలో.. 20ల ప్రారంభంలో ఉన్నవారికి ఉపయోగపడే అధ్బుతమైన కెరీర్ సలహాలను ఇచ్చారామె. కార్పోరేట్ లైఫ్ వాస్తవికంగా ఎలా ఉంటుందనేది ఒక్క మాటలో చెప్పేశారామె. కెరీర్ ప్రారంభ సవంత్సరాల్లో అందరి దృష్టి డబ్బు పైనే ఫోకస్ ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా విజయపరంపరతో జాబ్లో దూసుకోవడం అనేది ఎప్పటికీ శక్తిమంతమైనదని నొక్కి చెప్పారు. అది ఇరవైలలోనే సాధ్యమని అప్పుడే మంచిప్రయోజనం పొందగలమని అన్నారు. ఎందుకంటే అప్పటికీ ఎలాంటి కుటుంబ ఒత్తిళ్లు, బాధ్యతలు ఉండవు, పైగా వారివద్ద చాలా సమయం ఉంటుంది. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యక్తిగత డెవలప్మెంట్పై ఫోకస్ పెడితే రానురాను కష్టం అనే మాటే ఉండదని అన్నారు. ఇలాంటి ధోరణితో ఉంటే గనుక రిస్క్ తీసుకునేందుకు భయపడరు, నైపుణ్యాలను అందిపుచ్చుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. మనం ఫ్రీగా ఉన్న టైంలోనే కష్టపడేందుకు ఆసక్తి చూపాలి..అప్పుడే మన కెరీర్ ఉన్నతంగా ఉంటుంది..అలాగే ఈ కార్పొరేట్ లైఫ్లో మన మనుగడ సాధ్యమని నొక్కి చెప్పారామె. లేదంటే మనల్ని కాపాడే వారెవ్వరూ లేరు అని గుర్తించుకోండి అని అన్నారామె. తాను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నప్పటికీ..తన కెరీర్, ఫిట్నెస్ లక్ష్యాలు, సాధించాల్సిన ఆశయాలను ఎప్పటికీ గుర్తించుకుంటానని అన్నారు. అంతేగాదు తన విజయవంతమైన కెరీర్ జర్నీని డాక్యమెంట్ చేయాలని భావిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఐటీలో పనిచేస్తూ కెరీర్పై ఎన్నో కలలతో ఉన్నవాళ్లకు ఈ సందేశం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ తన పోస్ట్ని ముగించారు శర్మ. కష్టే ఫలి అంటే ఇదేగదూ.! అంతేగాదు నెటిజన్లు సైతం ఇది ముమ్మాటికీ నిజం. ఎవ్వరికీ మన సమస్యను పట్టించుకునేంత సమయం లేదు. అందరూ వారివారి సమస్యలతో వాళ్లు బిజీగా ఉన్నారని కొందరూ. మరికొందరూ డెవలప్మెంట్ అనేది ఉద్యోగ ఆఫర్తో ముగిసిపోదని అక్కడ నుంచే ప్రారంభమని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.I'm 26 and i work at @Microsoft .if you're in your late teens or early 20s, here are a few things i wish someone told me earlier:1. Hard work compound - espcially early.People talk a lot about money compounding, but effort compounds too. But Consistency changed…— Nandani S (@TheDebugDiva) January 28, 2026 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?) -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదకరమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని, అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చికత్స తీసకుంటున్నట్లు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. పైగా ఇమ్రాన్ ఎదుర్కొంటుంది ప్రమాదకరమైన కంటి వ్యాధి అని, సకాలంలో వైద్యం అందించకపోతే కంటి చూపే పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు ఇమ్రాన్కు వచ్చిన తీవ్రమైన కంటి వ్యాధి ఏంటి..ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ని అక్కడ వైద్యులు పరీక్షించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖాన్కు రెటీనా సిర మూసివేత(రెటీనా నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే చిన్న సిరలు మూసివేత) ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలిందని అధికారులు తెలిపారు. ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి తరలించి ఓ 20 నిమిషాల పాటు చికిత్స అందించి తిరిగి జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు కూడా. ఇంతకీ అసలేంటి రెటీనా సిర మూసుకుపోవడం..రెటీనా సిర మూసుకుపోవడం అంటే..రెటీనా సిర మూసుకుపోవడం లేదా ఆవీఓ అనేది రెటీనా నుంచి రక్తాన్ని బయటకు పంపే సిరలో పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుపడటం. దీని వల్ల కంటి వెనుక భాగంలో ఉన్న కణజాల పొర, కాంతిని మనం చూడగలిగే చిత్రాలలోకి అనువదిస్తుంది.రెటీనా సిరలో అడ్డంకి రెటీనా నుంచి రక్తం బయటకు రాకుండా నిరోధిస్తుంది.దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి వాపు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఫలితం దృష్టి సమస్యలు లేదా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. రోగి కంటి పరిస్థితి దృష్ట్యా ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నుంచి శస్త్రచికిత్స వరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదంతా రోగి కంటి సమస్యపై ఆధారపడి ఉంటుందట. ఈ పరిస్థితి ఎందువల్ల అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన అధ్యయనాలు ప్రకారం..ఈ పరిస్థితి రెటీనా సిర ద్వారా సాధారణ రక్త ప్రవాహానికి అంతరాయం వల్ల సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.కారణాలు..రక్తం గడ్డకట్టడంరక్త ప్రవాహం మందగించడంరెటీనా సిర, రెటీనా ధమనితో కలిసే చోట కుంచించుకుపోవడం.ఇది ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన యువకులలో, ముఖ్యంగా డయాబెటిస్, గ్లాకోమా లేదా అధిక రక్తపోటు వంటి కొన్ని వైద్య పరిస్థితులు ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువ.రెటీనా సిర మూసుకుపోవడంలో సంకేతాలు, లక్షణాలుఅస్పష్టమైన దృష్టి లేదా దృష్టి నష్టంనల్ల మచ్చలు లేదా గీతలుకంటిలో నొప్పి, ఒత్తిడిఎలా నిర్ధారిస్తారు..కంటి సంరక్షణ నిపుణులు కంటి పరీక్ష, రెటీనా ఇమేజింగ్ పరీక్షల ద్వారా కనుపాపలను విస్తరించి ఆవీఓని నిర్ధారిస్తారు. చికిత్స..రెటీనా సిరలో అడ్డంకిని తిప్పికొట్టడానికి లేదా నయం చేయడానికి ప్రస్తుతం ఎటువంటి మార్గం లేదు. కానీ కంటి సంరక్షణ నిపుణులు యాంటీ-VEGF ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్యాన్రెటినల్ ఫోటోకోగ్యులేషన్తో రెటీనా సిర మూసుకుపోవడం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు.రెటీనా సిర మూసుకుపోయే ప్రమాదాన్ని నివారించడానికి మొదటి సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం. ఈ సమస్య బారినపడకూడదంటే..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడం వంటివి చేయాలి. అలాగే ధూమపానం, పొగాకు వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులును సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలై..) -
పెద్దతరం చిన్నపోవద్దు!
70% భారతదేశంలో కుటుంబ సభ్యులు లేకుండా ఒంటరిగా ఉంటున్న వృద్ధుల సంఖ్య 80 నుండి 90 లక్షల వరకు వుంటుందని గణాంకాల అంచనా. వీరిలో 70 శాతం ఒంటరి వృద్ధులు మహిళలే. 2040 2040 నాటికి ఒంటరిగా నివసించే వృద్ధ దంపతులు, ఒంటరి వృద్ధుల సంఖ్య బాగా పెరగనుందని గణంకాలు చెబుతున్నాయి. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం వేగంగా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతోంది.2050 నాటికి ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు వృద్ధులుగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ గణాంకాల కంటే భయంకరమైనది వారు ఎదుర్కొంటున్న భావోద్వేగ నిర్లక్ష్యం. పిల్లలే సర్వస్వమనుకొని,వారికోసమే తమ జీవితాన్ని గడిపిన వారికి నేడు ఒంటరితనం శాపంలా మారుతోంది. ఎంతలా అంటే జీవితంపై ఆసక్తి పోయేంతలా.మానసిక కేంద్రాలకు వెళ్లేంతలా, తమకు గౌరవం, విలాసాలు కాదు కావల్సింది... ఒక ప్రేమపూర్వకమైన చిన్న పలకరింపు మాత్రమే అని వేడుకునేంతలా...20462046 నాటికి వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు తప్పనిసరి అవసరంగా మారబోతున్నాయి.20%ప్రస్తుతం భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు దాదాపు 10 శాతం ఉండగా, 2040–46 నాటికి ఇది 20 శాతానికి చేరుకుంటుందని అంచనా. అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరు వృద్ధులు వుంటారు.70%సుమారుగా 75 శాతం మంది వృద్ధులు రోజూవారీ అవసరాల కోసం ఇతరులపై లేదా పిల్లలపై ఆధారపడుతున్నారు. 25 నుండి 50 శాతం వృద్ధ జంటలు పిల్లలు లేకుండా కేవలం ఇద్దరు మాత్రమే నివసిస్తున్నారు. 70శాతం మందికి ఎటువంటి పెన్షనూ లేదు. 10ఢిల్లీ ఎయిమ్స్లోని మానసిక వైద్య నిపుణుల ప్రకారం వృద్ధులలో 70 శాతం మంది నిద్రలేమి, ఒత్తిడి, మానసిక అనారోగ్యం, ఆందోళనతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో చాలామంది తమ మనసులోని బాధను, ఒంటరి తనాన్ని మాటల్లో చెప్పలేరు. అందుకే అది ఇతర శారీరక సమస్యల రూపంలో బయటపడుతుంది. ఒంటరిగా ఉండే వృద్ధులలో డిప్రెషన్ వచ్చే అవకాశం కుటుంబంతో ఉండే వారికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 70 శాతం అనే ఈ గణాంక సంఖ్య కేవలం ఒక అంకె కాదు, అది భారతదేశం ఎదుర్కోబోయే ఒక భారీ నిశ్శబ్ద మహమ్మారికి సంకేతం.1.4 భారత్లో డిమెన్షియా (మతి మరుపు) బాధితుల సంఖ్య ప్రతి 20 ఏండ్లకు రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం 2023–24 అంచనాల ప్రకారం సుమారు 88 లక్షల మంది 60 ఏళ్ల పైబడినవారు డిమెన్షియాతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 1.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా.40%ఐఎల్ఎస్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ డైరెక్టర్, డాక్టర్ సౌమిత్ర పాఠరే ప్రకారం భారతదేశంలో వృద్ధుల ఆత్మహత్యలు 2019 లో 11,013 ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 15,339 కి పెరిగింది. అంటే ఆత్మహత్యల రేటు దాదాపుగా 40 శాతం పెరిగింది. భారతదేశంలో సగటున 42 మంది వృద్ధులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.14%ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 60ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది ఏదో ఒక మానసిక రుగ్మతతో సతమతమవుతున్నారు.1,37,653 ది జర్నల్స్ ఆఫ్ జెరంటాలజీ సిరీస్ బి అనే పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం సామాజిక ఒంటరితనం వృద్ధులలో మానసిక సామర్థ్యం తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం 14 ఏళ్ల కాలంలో 1,37,653 మానసిక పరీక్షలను విశ్లేషించింది. -
బ్రిటిష్ అకాడెమీకి బూంగ్
మంచి సినిమాల నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాల మహిళా దర్శకులు ప్రతిభ చూపుతూనే ఉన్నారు. అస్సామీ దర్శకురాలు రిమా దాస్ ‘విలేజ్ రాక్స్టార్స్’తో గుర్తింపు పొందగా ఇప్పుడు ‘బూంగ్’ సినిమాతో మణిపూర్ దర్శకురాలు లక్ష్మీప్రియా దేవి 2026 బ్రిటిష్ అకాడెమీ అవార్డ్స్ బరిలో ఎంట్రీ సాధించారు. ఈశాన్య రాష్ట్రాల బాలల భావోద్వేగాలు ‘బూంగ్’లో ఆకట్టుకున్నాయి. దర్శకురాలి గురించి, చిత్రం గురించి విశేషాలు....సినిమా రంగంలో ప్రతిభ బాలీవుడ్లోనో దక్షిణాదిలోనో ఉందనే ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ ఈశాన్య రాష్ట్రాల మహిళా దర్శకులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. వారి వరుసన లక్ష్మీప్రియా దేవి చేరారు. తన తొలి చిత్రం ‘బూంగ్’ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ కథ విని ఫర్హాన్ అఖ్త్తర్ వంటి దిగ్గజాలు నిర్మాతగా మారారంటే ఈ సినిమా కథ ఎంతగా ఆకట్టుకునేలా ఉందో ఊహించవచ్చు. ఈశాన్య రాష్ట్రాల కథలు లోకానికి తెలియాలనే దృష్టితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకో వచ్చు.‘బూంగ్’ 2024 టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘డిస్కవరీ’ విభాగంలో ప్రదర్శితమై మొదటగా వార్తలలో నిలిచింది. ఇప్పుడు 2026 ఆఅఊఖీఅ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డ్సు పోటీలో నామినేషన్ దక్కించుకుని మరింత ఘనత సాధించింది. ఉత్తమ బాలల–కుటుంబ చిత్రాల కేటగిరీలో బూంగ్ ఎంపికైంది. వచ్చే నెల ప్రకటించనున్న అవార్డులలో ‘బూంగ్’ గెలిస్తే లక్ష్మీప్రియ దేవి వల్ల ఈశాన్య రాష్ట్రాల సినిమాకు మరింత గుర్తింపు వస్తుంది.ఏమిటి ఈ ‘బూంగ్’?2024లో మణిపురి భాషలో లక్ష్మీప్రియాదేవి తెరకెక్కించిన చిత్రం ‘బూంగ్’. ఇది బూంగ్ అనే స్కూల్ పిల్లాడి కథ. ఆ పిల్లవాడు తప్పి΄ోయిన తన తండ్రి జాయ్కుమార్ని, తన తల్లి మందాకినిని తిరిగి కలపడం కోసం తన స్వస్థలం నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని మోరే వరకు ప్రయాణించడమే ఇందులోని కథ. బూంగ్ తండ్రి బతికే ఉన్నాడా, అతనికి ఏమైంది, ఈ ప్రయాణంలో బూంగ్కు ఎదురైన అనుభవాలేమిటనేది లక్ష్మీప్రియదేవి ఆసక్తికరంగా, గుండె చలించేలా చిత్రించారు.ఇది ఒక రకంగా లక్ష్మీప్రియదేవికి బాగా తెలిసిన కథ. తన బాల్యంలో చుట్టూ ఉన్న పరిస్థితులే బూంగ్ కథకు అంకురార్పణ చేశాయని అంటారు లక్ష్మీప్రియదేవి. ఈ చిత్రం తన మణిపుర్ జ్ఞాపకాలలోని తీపి చేదు సమ్మేళనంలాంటిది అంటారు. పరాయివారి పట్ల ద్వేషం, మతవిద్వేషం, వేర్పాటువాదం వంటి అనేక సమస్యలను ‘బూంగ్’ కథలో స్పృశించారు. ఇందులోని మెయిటీ బాలుడి పాత్రను కుకీ–జో వర్గానికి చెందిన గుగున్ కిప్జెన్ పోషించాడు.మణిపుర్ అల్లర్లకు వారం ముందు...2023లో మణì పుర్లో అల్లర్లు జరిగేందుకు సరిగ్గా వారం ముందు లక్ష్మీప్రియ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ విషయం తలుచుకుంటే ఇప్పటికీ తన ఒళ్లు జలదరిస్తుందంటారామె. ఆ సమయంలో స్థానికంగా కొంత ఘర్షణ వాతావరణం ఉందని, అయితే అది ఈ స్థాయిలోకి మారుతుందని తాను ఊహించలేదని వివరిస్తున్నారామె. ‘బూంగ్’ సినిమా మోరే పట్టణానికి సంబంధించిన చివరి డాక్యుమెంటేషన్. తమ సినిమాలో చూపిన ప్రదేశాలు, ప్రజలు మళ్లీ ఎప్పటికీ మునుపటిలా ఉండరని ఆమె ఆవేదన చెందుతున్నారు. తమ సిబ్బంది బస చేసిన ప్రదేశాలూ, అక్కడి వారు నివసించిన ఇళ్లూ అన్నీ ధ్వంసమయ్యాయని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు.బాలీవుడ్ చిత్రాలకు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా...మణిపుర్లో పుట్టి పెరిగిన లక్ష్మీప్రియ మాస్ కమ్యూనికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఫర్హాన్ అక్తర్ తీసిన ‘లక్ష్య’ (2004), రాజ్కుమార్ హిరానీ తీసిన ‘పికె’ (2014) చిత్రాలకు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే దర్శకత్వంపై ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కేవలం కథలు రాయాలనేదే ఆమె ఆలోచన. ఈ క్రమంలో ‘బూంగ్’ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. దాన్ని రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ దగ్గరికి తీసుకువెళ్లగా వాళ్ళు ఆ సినిమా చేద్దాం అన్నారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. -
జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!?
జెన్జీ అనగానే చాలామందికి రకరకాల అపోహలు. సక్రమంగా పనిచేయరని, ఏ విషయానికీ శ్రద్ధ చూపరని, బాధ్యతగా ఉండరని… ఇలా ఇంటా బయటా వారిమీద ఓ అవవాదు ఉంది. కానీ తాజాగా వెలువడిన ఒక నివేదిక మాత్రం ఈ అపోహలను చెరిపేసింది. ‘జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!’ అని అనిపించేలా ఆ నివేదికలో వివరాలు బయటపడ్డాయి. ఏంటా నివేదిక? ఆ నివేదికలో ఏముంది?బార్, రెస్టారెంట్, హౌస్ పార్టీ – ఏ సందర్భమైనా మద్యం తప్పనిసరి అన్న భావన ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జెన్జీలు మద్యం వినియోగానికి దూరంగా ఉంటున్నారని తేలింది. బీర్, వైన్, స్పిరిట్స్ వంటి పానీయాలను వీరు పెద్దగా పట్టించుకోవడం లేదు. యువతలో మద్యం వినియోగం తగ్గుతుండగా, ఆరోగ్యంపై శ్రద్ధ, మితంగా జీవించడం, జీరో-అల్కహాల్ పానీయాలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగ ధోరణులు మారుతున్నాయి.అమెరికాలో గ్యాలప్ సర్వే ప్రకారం 18-34 ఏళ్ల వయసు గల యువతలో మద్యం తాగే వారి శాతం గత రెండు దశాబ్దాల్లో తగ్గింది. 2000ల ప్రారంభంలో 72 శాతం మంది తాగుతుండగా, ఇటీవల అది 62 శాతానికి పడిపోయింది. మిల్లెనియల్స్తో పోలిస్తే జెన్జీ తరం సుమారు 20 శాతం తక్కువగా మద్యం సేవిస్తోంది. మరో సర్వే ప్రకారం 21.5 శాతం మంది జెన్జీలు అసలు మద్యం తాగరని, 39 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే తాగుతారని తేలింది. ఎందుకు తగ్గిస్తున్నారు?మద్యం వల్ల నిద్రలేమి, ఆందోళన, హ్యాంగోవర్ వంటి సమస్యలు వస్తాయని యువత స్పష్టంగా గుర్తిస్తోంది. ఫిట్నెస్, మైండ్ఫుల్నెస్, మానసిక స్థైర్యం కోసం మద్యం దూరం చేస్తున్నారు.సామాజిక ప్రభావం: సోషల్ మీడియా యుగంలో ప్రతి నిర్ణయం బహిరంగంగా కనిపిస్తోంది. అందుకే మద్యం తాగకపోవడం కూడా ఒక సామాజిక సందేశంగా మారింది. ‘సోబర్ క్యూయిరియస్’ ఉద్యమాలు, మద్యం లేని సమావేశాలు, వెల్నెస్ ఈవెంట్లు యువత సంస్కృతిలో భాగమయ్యాయి.ఆర్థిక కారణాలు: పెరుగుతున్న జీవన ఖర్చులు, విద్యా రుణాలు, గృహ వ్యయాలు. ఇవన్నీ మద్యం వినియోగాన్ని తగ్గించేలా ప్రభావం చూపుతున్నాయి. ఖరీదైన నైట్లైఫ్ కన్నా ఇంట్లో సమావేశాలు, నాన్-అల్కహాలిక్ పానీయాలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.తాగుతున్నవారు కూడా..జెన్జీ తరం పూర్తిగా మద్యం మానేసిందని కాదు. తాగుతున్నవారు కూడా పూర్వతరాలతో పోలిస్తే భిన్నంగా తాగుతున్నారు. తక్కువ సార్లు, తక్కువ పరిమాణంలో, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాగుతున్నారు. అలాగే లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్, ఫ్లేవర్డ్ పానీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆహార, అతిథ్య రంగంపై ప్రభావంఈ మార్పు రెస్టారెంట్లు, బార్లు, బ్రాండ్లను కొత్త దారిలో నడిపిస్తోంది. మాక్టెయిల్స్, లో-అల్కహాల్ డ్రింక్స్, ప్రీమియం నాన్-అల్కహాలిక్ పానీయాలు ఇప్పుడు మెనూలో ప్రధాన స్థానాన్ని పొందుతున్నాయి. పానీయాల కంపెనీలు కొత్తగా లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.జెన్జీ తరం మద్యం వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడం కాదు, దాని పాత్రను తిరిగి నిర్వచిస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యత, ఆర్థిక వాస్తవాలు, సామాజిక మార్పులు – ఇవన్నీ కలిపి ఈ తరాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. సంప్రదాయాలను ప్రశ్నించే, అలవాట్లకన్నా ఉద్దేశ్యాన్ని విలువ చేసే తరం ఇది. -
ధర చుక్కల్లో.. చదివింపుల గుబులు!
కంచు మోగినట్లు కనకంబు మోగునా.. అన్న వేమన పద్యం మనందరికీ సుపరిచితమే.. అయితే ప్రస్తుతం అదే బంగారం మార్కెట్లో ధరల మోత మోగిస్తోంది. అంతేకాదు.. బంగారం గొప్పతనం తెలియస్తూ.. బంగారం కొద్దీ సింగారం, ఇంటికి ఇత్తడి, పొగరుకు పుత్తడి, మెరిసేదంతా బంగారం కాదు.. అన్న సామెతలూ వినే ఉంటాం. దీంతో పాటు సమాజంలో శాంతి, శ్రేయస్సు, సాంస్కృతిక, సాంకేతిక పురోగతి సాధించిన సమయాన్ని ‘స్వర్ణయుగం’ (గోల్డెన్ ఎరా)తో పోల్చుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు అనేగా మీ సందేహం..! మార్కెట్లో రోజు రోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు సమాజం, కుటుంబ ఆచారాలు, శుభకార్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రానురాను బంగారానికి పెరుగుతున్న విలువ, ఫలితంగా ఏర్పడే సమస్యలపై కేస్ స్టడీ.. ‘మూడేళ్ల క్రితం జనవరిలో మా గృహప్రవేశానికి మా మరిది కుటుంబం మాకు తులం బంగారం కానుకగా పెట్టారు. అప్పుడు ధర రూ.55 వేలుగా ఉంది. వచ్చే వారం వాళ్లింట్లో శుభకార్యం ఉంది. ఆనవాయితీ ప్రకారం వాళ్ల బంగారం వాళ్లకు అప్పజెప్పాలి. కానీ, ఇప్పుడేమో పసిడి రేటు రూ.1.70 లక్షలు దాటింది. దీంతో ఏం చేయాలో అర్థంకావట్లేదు’ అంటూ పీర్జాదిగూడకు చెందిన గృహిణి హిందుమతి చెబుతున్నారు.. అనాదిగా వస్తున్న సంప్రదాయం.. భారతీయ కుటుంబాల్లో శుభకార్యాల సమయంలో కానుకలు, చదివింపులు, బహుమతులు అందజేయడం ఆనవాయితీ. అనాదిగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా.. వివాహాలు, గృహప్రవేశాలు, పండుగల సమయంలో కానుకలు, బహుమతుల రూపంలో బంగారానికి, వెండికి ప్రాధాన్యత ఇచ్చేవారు. క్రమంగా ఇది తెలుగు సంస్కృతిలో భాగమైపోయింది. మధ్యతరగతి కుటుంబాల్లో శుభకార్యాల్లో ఇది మరింత ఎక్కువ. ఇలా తీసుకున్న వాటిని తిరిగి వారి శుభకార్యాల సమయంలో అప్పజెప్పడం మామూలే. అయితే పసిడి ధరల పెరుగుదల ఈ ఆనవాయితీపై ప్రభావం చూపుతోంది. గతంలో బంధువులు పెట్టిన బంగారం.. మళ్లీ ఇప్పుడు చదివించాలంటే మధ్యతరగతికి భారంగా మారుతోంది.తగ్గిన ఆభరణాల మార్కెట్.. బంగారానికి, మహిళలకు అవినాభావ సంబంధం. ఏడాది కాలంగా ధరల పెరుగుదల మధ్యతరగతి మహిళల అభిరుచిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎక్కువగా ఆభరణాలు వినియోగించే ఈ తరగతి ప్రజలు వాటిని క్రమంగా తగ్గించుకునే పరిస్థితి. దీంతో అనాదిగా వస్తున్న వివాహ సంబంధమైన ఆభరణాల డిమాండ్ కూడా 30 శాతం వరకు తగ్గింది. నాలుగేళ్ల గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం (Gold) కొనుగోలుకు రూ.6 నుంచి 7 లక్షలు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి.ఈ ఏడాది రూ.2 లక్షల మార్క్..?గతేడాది ఆగస్టు 22న తొలిసారి తులం బంగారం ధర రూ.లక్ష దాటింది. అక్కడినుంచి పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. రోజుకు రూ.2 వేల చొప్పున వృద్ధి చెందుతూ.. పస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,78,850కు చేరింది. 2022 జనవరిలో రూ.50 వేల మార్క్ను దాటిన గోల్డ్ ధర.. లక్షకు చేరేందుకు మూడేళ్ల సమయం పట్టింది.. కేవలం ఏడాది వ్యవధిలోనే రూ.1.50 లక్షల మార్క్ను దాటింది. ఈ ఏడాది 10 గ్రాముల ధర రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ‘గత వారం మా మేనకోడలి శారీ ఫంక్షన్ జరిగింది. ఏడాది క్రితం మా ఇంట్లో శుభకార్యానికి మా అన్నయ్య బంగారం పెట్టాడు. ఇప్పుడు వాళ్లింట్లో ఫంక్షన్కు మేం తిరిగి అప్పజెప్పక తప్పదు. బంగారం ధర ఎక్కువగా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో దీనికి బదులుగా డబ్బు రూపంలో కట్నం చదివించాం.’ అంటూ హబ్సిగూడకు చెందిన స్వాతి వాపోతున్నారు.ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మధ్యతరగతి గృహిణుల ఆలోచనా సరళి క్రమంగా మారుతోంది. కుటుంబ శుభకార్యాల్లో బంగారం చదివింపులకు పునరాలోచనలో పడుతున్నారు. పసిడికి బదులుగా నగదు, గృహోపకరణాలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వెండి కూడా పసిడితో పోటీపడుతోంది. కాస్తోకూస్తో మధ్యతరగతి (middle class) ప్రజలకు అందుబాటులో ఉన్న వెండి కాస్తా రయ్ మంటూ దూసుకుపోతోంది. ఒకప్పుడు రూ.40వేలకు లభ్యమయ్యే కిలో సిల్వర్ నేడు రూ.4.25 లక్షలకు చేరింది. దీంతో వెండి కొనడం కూడా కలగానే మారే పరిస్థితి. దీన్ని కూడా తులాల రూపంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. – సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరోచదవండి: ఊహించని స్థాయికి వెండి ధరలుబంగారం కొనడం సెంటిమెంట్.. ఉగాదితో పండుగల సీజన్ మొదలుకానుంది. సాధారణంగా పండుగల సీజన్లో బంగారం కొనడం మహిళలు సెంటిమెంట్గా భావిస్తుంటారు. మధ్యతరగతి గృహిణులు ఎంతోకొంత బంగారం కొనడం ఆనవాయితీ. అయితే కొంతకాలంగా పసిడి కొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. – వేణుగోపాల్ చారి, బంగారం వ్యాపారి, సిద్దిఅంబర్ బజార్ -
దుబాయ్ బిలియనీర్ బంపర్ ఆఫర్..! పెళ్లికి రూ. 12 లక్షలు, పిల్లలు కంటే..
దుబాయ్ షేక్ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూస్తే షాకవ్వుతారు. జస్ట్ పెళ్లి చేసుకుంటే రూ. 12 లక్షలు. పిల్లలు కంటే మరో రూ. 12 లక్షలు ఇస్తామని సోషల్ మీడియా ఎక్స్లో కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించారు దుబాయ్లోని బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూ సోషల్ మీడియా పోస్ట్లో. వివాహం, కుటుంబాన్ని పోషించడం వ్యక్తిగత విషయాలు కాదని అవి సామాజిక బాధ్యతలని పిలుపునిస్తూ..తన అల్ హబ్తూర్ గ్రూప్లోని ఎమిరేట్ ఉద్యోగులకు ఈ ఆఫర్ అందిస్తూ తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. "కుటుంబాలే బలమైన దేశానికి కీలకమని, పిల్లలు దేశ భవిష్యత్తులో పెట్టుబడి అని అన్నారు. మా ప్రభుత్వాలు యువకుల కుటుంబ జీవితాలు ప్రారంభంలో మద్దతివ్వడానికి వెనకడుగు వేయవు. అందువల్ల యుఏఈ జాతీయులు వివాహం చేసుకుని కుటుంబాన్ని పెంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరి నుంచి ఆచరణాత్మక చొరవలు కూడా అవసరంర. కుటుంబాలు నిర్మించడం అనేది ఉమ్మడి బాధ్యత అని, కుటుంబం చిన్నదైనా లేదా పెద్దదైనా సమాజం, దేశం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది." అని అన్నారు. కాగా, ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్టూర్ UAE వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ అండ్ దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కంపెనీకి ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో దుబాయ్ కమర్షియల్ బ్యాంక్ ఛైర్మన్గానూ, అల్ జలీలా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్గా, అలాగే UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు.గతేడాది అక్టోబర్లో, అల్ హబ్టూర్ యువకులను వివాహం చేసుకోవాలని కోరారు. అంతేగాదు ఆయన యువకులు 30 ఏళ్లలోపు వివాహం చేసుకునేలా ప్రోత్సహించే చట్టం కోసం ఆశిస్తుండటం గమనార్హం. వివాహం చేసుకోకుండా ఉండిపోయిన యువకులను జవాబాదారీగా ఉంచాలని కూడా అన్నారు. ఇది సమాజంలో మనుగడకు, ఐక్యతకు సంబంధించిన విషయం అని అన్నారు. కుటుంబాలే దేశానికి కీలకం అంటూ అందర్నీ ఆలోచింపచేసేలా ఆయన ఈ షేకింగ్ ఆఫర్ ఇచ్చారు.تزوّجتُ وأنا في عمر 17 عاماً، وأسّستُ مع زوجتي عائلة جميلة، أحمدُ الله على هذه النعمة في كل لحظة. منذ تلك اللحظة، أصبحت الأسرة بالنسبة لي دائماً ملاذ راحة، ومصدر سكينة، ونعمة حقيقية أستمدّ منها القوة والسعادة.ومن هذا الإيمان، أودّ أن أُشجّع شبابنا على تأسيس أسر متماسكة تكون… pic.twitter.com/ououH8gqkj— Khalaf Ahmad Al Habtoor (@KhalafAlHabtoor) January 24, 2026 (చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?) -
ఆ నటి ధరించిన డైమండ్ నెక్లెస్ ..రూ. 72 కోట్లా..!? ఏకంగా షాజహాన్..
సెలబ్రిటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్, నగలు ప్రత్యేక ఆకర్షణ తోపాటు అత్యంత విలాసవంతమైనవి కూడా. వాళ్ల స్టేటస్కి తగ్గ ఫ్యాషన్వేర్లే అయినా..ఇక్కడ ఈ నటి ధరించిన డైమండ్ నెక్లెస్ అత్యంత ప్రత్యేకం. ఈ నెక్లెస్ వెనుకున్న ఆసక్తికర స్టోరీలు చూస్తే..ఇంత చరిత్ర ఉందా ఈ ఆభరణానికి అని విస్తుపోవడం ఖాయం. ఎందరి చేతులు మారి ఆ నెక్లస్ ఆమె వద్దకు చేరిందంటే..ఆస్ట్రేలియన్ నటి మార్గోట్ రాబీ తన రాబోయే చిత్రం వూథరింగ్ హైట్స్ ప్రమోషన్లో భాగంగా రెడ్ కార్పెట్పై తన గ్లామ్ లుక్తో అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ మూవీలో హీరో జాకబ్ ఎలోర్డి కూడా నటించారు. రాబీ లాస్ ఏంజిల్స్లోని చైనీస్ థియేటర్లో జరిగిన వరల్డ్ మూవీ ప్రీమియర్కు హాజరయ్యారు. అక్కడ ఆమె షియాపరెల్లి కోచర్ గౌనుతో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకొంది. ముఖ్యంగా ఆమె మెడలో ధరించిన నెక్లెస్ అమితంగా అందరి మనసులను దోచుకుంది. ఎందుకంటే ఈ డైమండ్ నెక్లెస్ హాలీవుడ్ ఐకాన్ ఎలిజబెత్ టేలర్ది. దీని ధర భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 74 కోట్లు పలుకుతుంది. ఆమె ధరించే ప్రతి ఆభరణం ఆలోచనాత్మకంగానూ, ఇంట్రస్టింగ్ కథ దాగుంటుంది. హాలీవుడ్ ఐకాన్ నటి ఎలిజబెత్ టేలర్ 40వ పుట్టిన రోజున తన ఐదో భర్త ఈ నెక్లెస్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఈ ఇద్దరు రోమ్లో నిర్మిస్తున్న క్లియోపాత్రా చిత్రంలో పనిచేశారు. అప్పుడే ఇద్దరూ ఒకరికొకరు పరిచయమై ప్రేమలో పడ్డారు. ఆ టైంలో వీరి ప్రేమకథ వార్తల్లో నిలిచి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కూడా. రియల్ స్టోరీ ఏంటంటే..గుండె ఆకారంలో ఉన్న టేబుల్-కట్ వజ్రంపై "ప్రేమ శాశ్వతమైనది" అని రాసి ఉన్న పార్సీ శాసనం ఉంది. దానిపై నూర్జహాన్ పేరు కూడా చెక్కి ఉంటుంది. ఈ రత్నాన్ని నూర్జహాన్ భర్త మొఘల్ చక్రవర్తి షాజహాంగీర్ ఇచ్చాడని, తరువాత వారి కుమారుడు షాజహాన్కు అందజేశాడని నమ్ముతారు. చరిత్రకారుల ప్రకారం..షాజహాన్ తన భార్య ముంతాజ్కు ఆభరణాలను బహుకరించాడు. మొఘలులతో దాని లోతైన అనుబంధం కారణంగా, ఈ నెక్లెస్ను "తాజ్ మహల్ వజ్రం" అని కూడా పిలుస్తారు.1971 నాటికి, ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ తాజ్ మహల్ వజ్రాన్ని సొంతం చేసుకుంది, ఎరుపు రత్నాలు టేబుల్-కట్ వజ్రాలతో అలంకరించబడి, భారతీయ ఆభరణంలా రూబీ హారంలా డిజైన్ చేశారు. దీన్ని ఇలా నెక్లెస్లా తీర్చిదిద్దింది ప్రఖ్యాత నగల డిజైనర్ ఆల్ఫ్రెడ్ డ్యూరాంటే.. అంత చరిత్ర కలిగిన ఈ నెక్లెస్ని ఆస్ట్రేలియన్ నటి రాబీ మెడలో ధరించడంతో అక్కడున్న వారందరిలో ఆసక్తి, కుతుహలం వెల్లువెత్తింది. అక్కడ అందరి చూపు ఆ ఆభరణంపైనే. ఎన్నో ప్రేమకథలను పొందుపర్చుకున్న ఈ హారంతో రాబీ ఆ వేడుకలో పురాతన వైబ్స్ సృష్టించింది.(చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?) -
చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?
ఏదైనా టూర్కి వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలు, ప్లాన్లు వేసేస్తుంటాం. బడ్జెట్ సరిపోతుందనుకుంటే..టూర్ ప్లాన్ లేదంటే నో చెప్పేస్తాం. అలాంటిది ఈ దేశాలకు మాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా హాయిగా చుట్టొచ్చేయొచ్చట. జస్ట్ చేతిలో వంద రూపాయాలుంటే చాలు హాయిగా అక్కడున్న ప్రదేశాలను ధీమాగా చూసేయొచ్చు. అదేంటని విస్తుపోకండి..ఎందుకంటే అక్కడ మన రూపాయి విలువే ఎక్కువ. అందువల్ల చేతిలో పదివేలు ఉన్నాచాలు..లక్షాధికారిలా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. మరి ఆ దేశాలేవో సవివరంగా తెలుసుకుందామా..!.ప్రవాసులకు అత్యంత సరసమైన ధరలో ఖర్చులు కలిసొచ్చే దేశాల జాబితాలో వియత్నాంది అగ్రస్థానం. భారతీయులు వియత్నాంకు జస్ట్ ఆన్లైన్ వీసా పొందే సదుపాయం కూడా ఉంది. అక్కడ హా లాంగ్ బే, హనోయ్, హో చి మిన్ సిటీ, హోయ్ ఆన్, మెకాంగ్ డెల్టా మొదలైన ప్రదేశాలను తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. తర్వాతి స్థానం లావోస్ది.లావోస్ఇక్కడ భూభాగంలో దాదాపు 70 శాతం అడవులతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్, కయాకింగ్, జిప్ లైనింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్ మొదలైన సాహస కార్యకలాపాలను తక్కువ ఖర్చుతో ఆస్వాదించవచ్చు. ఇక్కడ పర్యాటకులు తప్పక సందర్శించాల్సిన అనేక ప్రదేశాలు ఉన్నాయి, లుయాంగ్ ప్రాబాంగ్, వియంటియాన్, కువాంగ్ సి జలపాతం, బుద్ధ పార్క్. మన రూపాయి ఇక్కడ కరెన్సీ ప్రకానం 253.25 లావోటియన్ కిప్లు పలుకుతుంది.ఇండోనేషియాఇండోనేషియా బాలి, జకార్తా, గిలి దీవులు, కొమోడో జాతీయ ఉద్యానవనం వంటి అనేక ఆకర్షణలతో సహజ సౌందర్యంతో నిండిన ప్రదేశం. లెక్కలేనన్ని అగ్నిపర్వత ద్వీపాలు, స్పష్టమైన ఆకాశం, నీలి జలాలు, సముద్ర జీవులతో, ఇండోనేషియా ప్రపంచంలోని అతిపెద్ద ద్వీప దేశాలలో ఒకటి. తనహ్ లాట్ టెంపుల్ వద్ద సూర్యాస్తమయం, లెంబోంగన్ రీఫ్ క్రూయిజ్, ఆయుంగ్ వైట్ వాటర్ క్రూయిజ్ అన్నీ సందర్శించదగినవి. ఇక్క మన రూపాయి ఇండోనేషియా కరెన్సీలో 193.77 ఇండోనేషియా రుపియా.కంబోడియాఅందమైన పర్యాటక ప్రాంతాల్లో కంబోడియా ఒకటి . భారత పాస్పోర్ట్ హోల్డర్లు 30 రోజుల్లో వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అంగ్కోర్ వాట్, అలాగే అందమైన బీచ్లు, మ్యూజియంలు, అరణ్యాలకు నిలయం. ఇక్కడ ఒక రూపాయి విలువ 46.76 కంబోడియన్ రీల్పరాగ్వేఇది అసున్సియన్, పలాసియో డి లోపెజ్, మ్యూజియో డెల్ బారో, యిప్కారా సరస్సు, సాల్టోస్ డెల్ ముండో జలపాతాలు, లా శాంటిసిమా ట్రినిడాడ్ డి పరానా, సెర్రో కోరా నేషనల్ పార్క్, ఎన్కార్నాసియన్ పట్టణం వంటి అనేక ఆకర్షణలకు నిలయంగా ఉంది.దక్షిణ కొరియాఇక్కడ మన దేశ కరెన్సీ విలువ కాస్త తక్కువగా ఉంటుంది. దక్షిణ కొరియాలో వసతి కొంచెం ఖరీదైనది. ముఖ్యంగా సియోల్ వంటి ప్రధాన నగరాల్లో, వసతి, ఆహారం, రవాణా, ఆకర్షణల ఖర్చు భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటుంది. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నప్పటికీ, రవాణా ఖర్చులు భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటాయి. దక్షిణ కొరియాలో ఏడు రోజుల పర్యటనకు రూ.70 వేల నుంచి లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. విమాన ఛార్జీలు, వసతి ఖర్చును తగ్గించడానికి మార్గం ఆఫ్-సీజన్లో ప్రయాణించడం.ఇక్కడ ఒక్క రూపాయి 17.19 దక్షిణ కొరియా వోన్.(చదవండి: కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..) -
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..ఎన్నారై దంపతులు దివ్య, జాన్లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు. మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్స్టాగ్రామ్లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్లో పేర్కొనడం విశేషం. View this post on Instagram A post shared by Kahaanioftails (@kahaanioftails) (చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!) -
ఎవరీ సోఫీ రెయిన్? కంటెంట్ క్రియేటర్గా అన్ని కోట్లా..!
కంటెంట్ క్రియేటర్గా చాలామంది రాణిస్తున్నారు. కొందరు వేలల్లో ఆర్జిస్తే..ఇంకొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ కోట్లలలో సంపాదించడం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. జస్ట్ కంటెంట్ క్రియేటర్గా ఆ రేంజ్లో సంపాదనా..!? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి తాను చెబుతోందంతా నిజం అంటూ ఏవిధంగా ఆమె ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లలో కోట్లలో ఆర్జిస్తోంది ఆధారాలతో సహా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించింది. ప్రముఖ అమెరికన్ ఓన్లీఫ్యాన్స్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోఫీ రెయిన్ వివిధ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ల ద్వారా సుమారు రూ. 930 కోట్లకు పైనే సంపాదిస్తున్నానని వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలతో సహా స్కీన్షాట్లతో చూపించింది. మొత్తంగా ఆల్టైమ్ ఆదాయం ఎంత ఉంటుందో స్క్రీన్ షీట్ తీసి మరి చూపించింది. తాను అబద్ధం చెప్పడం లేదని, ఈ విజయం అసాధారమైనది మాత్రం కాదని చెప్పుకొచ్చింది. సగటు కంటెంట్ క్రియేటర్ నెలకు దగ్గర దగ్గర రూ. 13 వేలుదాక సంపాదించగలడని..తాను మాత్రం వాళ్లందరికంటే అధిక మొత్తంలో ఆర్జిస్తున్నానని ధీమాగా చెబుతోంది. అందుకు అపారమైన లక్తోపాటు..లక్షలాది ఫాలోవర్స్ కూడా చాలా అవసరమని పేర్కొంది. 2024 ఏడాదికే తాను రూ. 359 కోట్లు దాక ఆర్జించినట్లు వెల్లడించింది. జస్ట్ ఆన్లైన్ వీడియోలతో స్టార్ జేసన్ టాటమ్ వంటి ప్రొఫెషనల్ అథ్లెట్ల వార్షిక జీతాలను అధిగమించింది. ఆమె తన ఆదాయంలో కొంత ప్రైవేట్ జెట్లు, కార్ల కోసం ఖర్చు చేసినా..కొంత భాగాన్ని మాత్రం తండ్రి అప్పులు తీర్చడానికి ఉపయోగించడం విశేషం. అయితే రెయిన్ 70% సంపాదనను పెట్టుబడుల్లో పెట్టినట్లు పేర్కొంది. ఎవరీమె..?సోఫీ రెయిన్ 21 ఏళ్ల అమెరికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , కంటెంట్ క్రియేటర్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల మీడియా అకౌంట్లతో బాగా గుర్తింపు దక్కించుకుంది. అక్కడ ఆమె తన తన సబ్స్క్రైబర్లతో ప్రత్యేకమైన కంటెంట్ను పంచుకుంటుంది. 2004లో ఫ్లోరిడాలోని మయామిలో జన్మించిన సోఫీ, ఓన్లీఫ్యాన్స్లో 11 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా, ఇన్స్టాగ్రామ్లో 8 మిలియన్ల మంది ఫాలోవర్లతో సహా బహుళ ప్లాట్ఫామ్లలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది.సోఫీ తన కెరీర్ని వెయిటర్గా ప్రారంభించింది, కానీ ఆమె బాస్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల్మీడియా ఖాతాల సాయంతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన కంటెంట్ క్రియేటివిటీ, మాటల ఆకర్షణ సాయంతో ఎక్కువమంది సబ్స్కైబర్లను ఆకర్షించింది. ఆమె కంటెంట్ పరంగానే కాకుండా సన్నిహిత ఫోటోషూట్ల విషయంలోనూ అత్యంత కేర్ఫుల్గా ఉంటుందామె. ప్రస్తుతం ఆమె బాప్హౌస్ కలెక్టివ్ కంటెంట్ క్రియేటర్ వ్యవస్థాకురాలు కూడా. (చదవండి: 'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్ల పైబడ్డ కూడా..) -
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.ఫిబ్రవరి 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంఈ సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపి, అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు. ఉదయం 07.00 గం.ల నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :17-02-2026ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం - ఉ. 10.30 - 11.00 గంటల వరకు)రాత్రి – పెద్దశేష వాహనం18-02-2026ఉదయం – చిన్నశేష వాహనంరాత్రి – హంస వాహనం19-02-2026ఉదయం – సింహ వాహనంరాత్రి – ముత్యపుపందిరి వాహనం20-02-2026ఉదయం – కల్పవృక్ష వాహనంరాత్రి – సర్వభూపాల వాహనం21-02-2026ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు)22-02-2026ఉదయం – హనుమంత వాహనంరాత్రి – గజ వాహనం23-02-2026ఉదయం – సూర్యప్రభ వాహనంరాత్రి – చంద్రప్రభ వాహనం24-02-2026ఉదయం – రథోత్సవంరాత్రి – అశ్వవాహనం25-02-2026ఉదయం – చక్రస్నానం(ఉ. 08.00 నుండి 10.00 గంటల వరకు)రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)26.02.2026.మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.(చదవండి: అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలై) -
నాకు 65 ఏళ్లు.. భార్యేమో ఛీ కొడుతోంది
నా వయసు 65 సంవత్సరాలు. నేను రిటైర్ట్ ప్రభుత్వోద్యోగిని. నా భార్యకు 55 ఏళ్లు. తను టీచర్గా పని చేస్తోంది. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి కానీ నియంత్రణలోనే ఉన్నాయి. నా భార్య కొంచెం లావుగా ఉంటుంది. మోకాళ్ల నొప్పి తప్ప ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేదు. మాది ప్రేమ వివాహం. పెళ్లైన మొదట్లో మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగిన తర్వాత మా మధ్య మానసికంగా, శారీరకంగా దూరం పెరిగింది. ఆమె పిల్లలతో కలిసి పడుకునేది. మేము ఏ నెలకో రెండు నెలలకో ఒకటి రెండుసార్లు కలిసేవాళ్లం. ఇటీవలే మా పిల్లలకు పెళ్లిళ్లు చేశాం. వాళ్లు బాగానే సెటిల్ అయ్యారు. నా భార్యకు ఐదేళ్ల క్రితం మెనోపాజ్ వచ్చింది. అప్పటినుంచి ఆమె నన్ను పూర్తిగా దూరం పెట్టింది. ఇప్పుడు మా ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం. నాతో ఒకే బెడ్మీద పడుకోదు. ఎప్పుడైనా నేను ప్రేమగా దగ్గరకు వెళితే– కాటికి కాళ్లు చాపే వయసులో ఇంకా నీకు ముద్దు మురిపాలు కావాలా– అంటూ చికాకుతో విదిలించి కొడుతుంది. మా పెళ్లయి ఇన్నేళ్లయినా నేను వేరే స్త్రీని ముట్టుకున్నది లేదు. కనీసం ఊహించుకున్నది కూడా లేదు. భార్యతో కలసి సరదాగా గడపాలని కోరుకోవడం తప్ప! అది కూడా ఆమెకు ఇష్టం ఉండదు. నా భార్య, నా పిల్లలు కలిసి నన్ను ఒక సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన మా పిల్లల కంటె కొంచెం పెద్దవారు. కనీసం నా వెర్షన్కూడా వినకుండా నాకే క్లాస్ పీకారు మీరు కోరికలు తగ్గించుకోవాలి అని చెప్పి నాకు ఏవో మాత్రలు రాశారు. నాకు ఈ విషయమై చాలా బాధగా ఉంది. నా కోరికలో ఏమైనా తప్పుందా? నా విషయంలో నా భార్యా పిల్లల వైఖరి సరైనదేనంటారా? మీ అభిప్రాయం, సూచనలు, సలహాల కోసం గంపెడంత ఆశతో రాస్తున్నాను.– ఎన్.ఎస్.ఎన్.మూర్తి, విజయనగరంమూర్తిగారూ, మీరు రాసిన ప్రశ్నలో ఎక్కడా అశ్లీలత లేదు. మితిమీరిన కోరికలు లేవు. బాధ్యత లేని ప్రవర్తన లేదు. మీరు మీ భార్యతో ప్రేమను, సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. అవి దొరకక పోవడంతో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వయసు పెరిగినంత మాత్రాన ప్రేమ, జీవిత భాగస్వామితో దగ్గరగా ఉండాలనే భావన పూర్తిగా పోదు. అది సహజమే. అయితే మెనోపాజ్ తర్వాత హార్మోన్లలో ర్పడిన అసమతుల్యత వల్ల ఆమెలో వచ్చిన శారీరక, మానసిక మార్పులను మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఆమెది కేవలం మెనోపాజ్ వల్ల వచ్చిన సమస్యగా మాత్రమే చూడలేం. పిల్ల బాధ్యతల కారణంగా మీరిద్దరూ ఇప్పటి వరకూ భార్యాభర్తల కంటే తల్లిదండ్రుల్లా ఎక్కువగా జీవించారు. మీ మధ్య మాటలతో పాటు భావోద్వేగ అనుబంధం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పిల్లలు వెళ్లిపోయిన తర్వాత మీరు మళ్లీ భార్యాభర్తలుగా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మీ భార్య ఇంకా అమ్మ పాత్రలోనే నిలిచిపోవడం వల్ల ఒక భార్య ఇవ్వాల్సిన ప్రేమ, ఆ΄్యాయతల వంటివి ఆమె పూర్తిగా మరచిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా మీరు అన్నీ ఆశించేటప్పుడ ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది చాలా మంది దంపతుల్లో కనిపించే సమస్యే. ఆమెను తప్పు పట్టడడం కానీ, నిందించడం కానీ సరైనది కాదు. ఇది కేవలం మాత్రలతో తగ్గిపోయే సమస్య కూడా కాదు. ఆమె వైపు నుంచి కూడా సమస్యను అర్థం చేసుకోవల్సి ఉంటుంది. మీ ఇద్దరూ కలిసి ఒకసారి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. అక్కడ మీ ఇద్దరూ భద్రంగా, స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని కల్పిస్తారు. మీ మధ్య ఉన్న అపోహను తొలగించి, ఒక సమతుల్యమైన పరిష్కారం కోసం అందరం కలిసి ప్రయత్నిద్దాం. చివరిగా ఒక మాట... వృద్ధాప్యం అనేది శరీరానికి మాత్రమే, మనసుకు కాదు. అన్ని బరువు బాధ్యతలూ తీరిన తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరయ్యే మంచి సమయం అది. జీవితపు చివరి రోజులు ప్రేమతో అన్యోన్యంగా గడపాల్సిన సమయం అలా అన్నీ మంచిగా జరగాలని కోరుకుందాం!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్లు పైబడ్డ కూడా..
మనషుల ప్రవర్తనలు చాలామటుకు చుట్టూ ఉన్న మనుషులు లేదా అతడు పెరిగిన కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అది అతడి అభ్యున్నతికి ఉపకరించేలా ఉంటే పర్లేదు..తనేం చేసినా కరెక్ట్ అనే ధోరణిలో ఉంటే చాలా సమస్యలు ఎదురవ్వుతాయి. ముఖ్యంగా మగపిల్లలను తల్లులు ఎంతలా గారాబం చేస్తుంటారంటే..వాళ్లేం చేసినా కరెక్ట్, ఆడపిల్ల వరకు వచ్చేటప్పటికీ..పరాయి ఇంటికి వెళ్లాల్సింది బాధ్యతతో వ్యవహరించాలన్నట్లుగా పెంచుతారు. బాధ్యతల విషయంలో ఇద్దరు సమానం అన్న ఆలోచన లేమి..ఎంతటి పరిస్థితికి దారితీస్తుందంటే..కట్టుకున్న భార్యతోపాటు, చుట్టు ఉన్నవాళ్లకు, అలాగే తనకు సమస్యగా మారిపోతాడు. మొగ్గగా ఉన్నప్పుడే ఆ ధోరణి సరవ్వాలి లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ఈ వృద్ధుడే ఉదాహరణ..ముంబై విమానాశ్రయంలో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఇలా వివరించింది. ఆ పోస్ట్లో ఎయిర్పోర్ట్లో ఓ 50 ఏళ్ల వ్యక్తి రెండు క్యూల వద్దకు వచ్చాడు. అవి ఎయిర్ ఇండియా, ఇండిగో కోసం ఉన్న క్యూలు. అయితే ఆ వ్యక్తి తప్పుగా క్యూలో నిలబడి ఉండటంతో..సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇది ఆ క్యూ కాదు అని చెబుతున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అరవడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడున్న వాళ్లు ఏం మాట్లాడలేక అలా చూస్తుండిపోయారు. ఇంతలో అతడి కుటుంబం జోక్యం చేసుకుని అతడిని శాంత పరిచేంతవరకు అక్కడ గందరగోళ వాతావరణం సృష్టించాడు. అదంతా చూశాక.. సదరు మహిళ ఇలాంటి మానసిక ప్రవర్తనను రాజా బేటా సిండ్రోమ్గా పేర్కొంది. ఇదేమి మానసిక రోగం కాదని, చిన్నప్పటి నుంచి తానేం చేసిన కరెక్ట్ అనే ధోరణిలో పెరిగిన వాళ్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుంటారని, దీని కారణంగా చుట్టూ ఉన్నవాళ్లకు, తనకు సమస్యలు సృష్టిస్తారని అన్నారామె. దక్షిణాది కుటుంబాలలో ముఖ్యంగా పురుషలలో ఈ ధోరణి ఉంటుందని, అందుకు తల్లులు, వారి కుటుంబ ఆలోచన విధానమేనని అన్నారామె. అబ్బాయి కాస్త ఎక్కువ, అమ్మాయిలు కాస్త తక్కువ అనే భావజాలంతో ఉండే కుటుంబాలలో పురుషల మనస్తత్వం ఇలానే ఉంటుందని అన్నారు. దయచేసి ఇలాంటి ప్రవర్తనను దూరం చేసుకోండి లేదంటే..నెమ్మదిగా ఒక సమయానికి మనుషులు దూరమైపోతారంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా తమ కుటుంబంలోని వ్యక్తులు గురించి వివరిస్తూ..తమ అనుభవాలను షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snowy Rahi | Therapist (@sitwith_rahi) (చదవండి: రుద్ర హెలికాప్టర్ని నడిపిన తొలి మహిళా పైలట్..! ఒంటరి తల్లి..) -
అచ్ఛా... చల్తా హూ...
‘అచ్ఛా... చల్తా హూ... దువావోంమే యాద్ రఖ్నా’... ఇది అర్జిత్ సింగ్ సూపర్ హిట్ పాట. వీడ్కోలును సూచించే పాట ఇది. అర్జిత్ సింగ్ తన కెరీర్ పీక్లో ఉండగా 38 ఏళ్ల వయసుకే రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు సంగీతాభిమానులకు అశనిపాతంగా ఉంది. అయితే తాను కేవలం సినిమా ప్లేబ్యాక్కు మాత్రమే దూరమవుతున్నానని అర్జిత్ ప్రకటించడం కొద్దిలో కొద్ది ఊరట. అర్జిత్ నిర్ణయం వెనుక.. అర్జిత్ స్వభావం పై కథనం....‘తుమ్ హి హో’ అంటూ ‘ఆషికీ2’తో, ‘అచ్ఛా చల్తా హు’ అంటూ ‘అయ్ దిల్ హై ముష్కిల్’ తో దుమారం రేపి ఆ తర్వాత వందలాది పాటలతో దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న గాయకుడు అర్జిత్ సింగ్ తన ప్లేబ్యాక్ సింగింగ్కు గుడ్బై చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. క్రీడాకారులకు రిటైర్మెంట్ ఉండొచ్చేమోగాని ప్లేబ్యాక్ సింగర్లకు పాడినంత కాలం అవకాశాలు ఉంటాయి. అందునా అర్జిత్ సింగ్ వంటి స్టార్ సింగర్కు డైరీ నిండిపోయేనన్ని పాటలున్నాయి. అయినా సరే అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ తీసుకోవడం పట్ల అభిమానులు డిజ΄్పాయింట్ అయినా కొంతమంది ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నారు. అర్జిత్ తెలుగులో కూడా దాదాపు పాతిక పాటలు పాడాడు.అదే కారణం...అర్జిత్ సింగ్ ముందు నుంచి కూడా బాలీవుడ్ తరహా లగ్జరీ జీవితాన్ని ఇష్టపడేవాడు కాదు. అతనికి తను పుట్టి పెరిగిన పశ్చిమ బెంగాల్లోని జియాగంజ్ అనే ఊరు ఇష్టం. అతని తల్లి బెంగాలి. తండ్రి పంజాబీ శిక్కు. ముంబై అంధేరిలో అతనికి ఇల్లు, కోట్ల రూపాయల డబ్బు ఉన్నా నేటికీ ఎక్కువగా జియాగంజ్లోనే బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. మామూలు యువకుడిలా అందరితో కలిసి క్రికెట్ ఆడుతుంటాడు. ప్లేబ్యాక్ సింగర్గా ఉండాలంటే మ్యూజిక్ డైరెక్టర్ల ఇష్టానుసారం, సినిమాల అర్జెన్సీని బట్టి రికార్డింగ్స్కు హాజరు కావాలి. అదొక్కటే కాక హీరోల, మ్యూజిక్ డైరెక్టర్ల ఇష్టాఇష్టాల రాజకీయాలు కూడా ఉంటాయి. ఇవన్నీ అర్జిత్కు నచ్చకపోయి ఉండొచ్చు. గతంలో సల్మాన్ఖాన్ ఒక వేడుకను హోస్ట్ చేస్తూ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకు వచ్చిన అర్జిత్ను చూసి ‘కొంచెం నీట్గా తయారయ్యి రావొచ్చుగా. నిద్రలో లేచి వచ్చినట్టు ఉన్నావు’ అన్నాడు. దానికి అర్జిత్ సరిగ్గా సమాధానం చెప్పలేదు. దాంతో ‘సుల్తాన్’లో అర్జిత్ పాడిన పాటను వేరొకరికి ఇచ్చారు. తర్వాత అర్జిత్ సల్మాన్కు బహిరంగంగా సారీ చె΄్పాల్సి వచ్చింది. ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది. తాజాగా సల్మాన్ఖాన్ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’లో సల్మాన్ ఖాన్ కోసం అర్జిత్ పాడాడు. కాదన్న సల్మాన్ ఖాన్కు పాట పాడటంతో తన ప్రయాణం ముగిసిందని అర్జిత్ భావించి ఉండొచ్చు.లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా...అర్జిత్ సింగ్ లైవ్ ప్రోగ్రామ్స్కు వేలాదిగా తరలి వచ్చే అభిమానులు ఉన్నారు. అమెరికా, గల్ఫ్ దేశాలలో అర్జిత్ కచ్చేరీలు భారీ హంగామాగా జరుగుతాయి. అందులో పెద్ద రాబడి కూడా ఉంటుంది. ప్లేబ్యాక్ సింగర్లకు ఇచ్చే పారితోషికంతో పోలిస్తే ఈ డబ్బు చాలా ఎక్కువ. అందువల్ల కూడా అర్జిత్ ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. ఇకపై అర్జిత్ మ్యూజిక్ కంపోజర్గా, ప్రయివేట్ ఆల్బమ్స్ గాయకుడిగా, లైవ్ సింగర్గా తన జర్నీ ద్వారా ప్రేక్షకులను కలుస్తూనే ఉంటాడు. -
అక్షర ధీర
‘పత్రికొక్కటున్న పదివేల సైన్యం... పత్రికొక్కటున్న మిత్రకోటి’... ఆనాటి నార్ల వారి మాట ఇప్పటికీ శక్తిమంతమైనదే. పత్రికల శక్తిని తెలియజేసేదే! పత్రిక అంటే ప్రజల ఆత్మీయ నేస్తం. దారి చూపే దీపం. సమాజానికి ముప్పు వాటిల్లినప్పుడు పత్రిక ప్రజల గొంతుక అవుతుంది. పాశుపతాస్త్రం అవుతుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకు రిపోర్టర్, ఫొటో జర్నలిస్ట్, పొలిటికల్ కార్టూనిస్ట్... వివిధ స్థాయులలో పత్రికారంగంలో మెరిసిన మహిళలు ఎంతోమంది ఉన్నారు...జేమ్స్ ఆగస్టస్ హికీ 1780 జనవరి 29న ‘హికీస్ బెంగాల్ గెజిట్’ పత్రికను ప్రారంభించారు. ఇది మన దేశంలోని మొదటి వార్తాపత్రిక మాత్రమే కాదు ఆసియాలోని మొట్టమొదటి వార్తాపత్రిక కూడా. భారతదేశంలో నిశ్శబ్దంగా మొదలైన ప్రింట్ జర్నలిజం సామాజిక రంగాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారుల గొంతుక అయింది. నాయకులు, విప్లవకారుల అభి్రపాయాలను సాధారణ ప్రజలకు చేరవేయడం ద్వారా రాజకీయ పరివర్తన సాధనాలుగా పనిచేశాయి. అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కలకత్తాలో ప్రారంభమైన ‘హికీస్ బెంగాల్ గెజిట్’ లేదా ‘ది ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వరై్టజర్’ రెండు సంవత్సరాల పాటు నడిచింది. ఈ పత్రిక నాటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు తొలి బీజం వేసింది.అరుణ అడుగు జాడలలో...భారతీయ పత్రికరంగంలో కీలక పాత్ర పోషించిన మహిళా జర్నలిస్ట్లలో అరుణ అసఫ్ అలీ మొదటి వరుసలో నిలుస్తారు. స్వాతంత్య్రోద్యమ పోరాట యోధురాలైన అరుణ 1950 చివరిలో ‘పేట్రియాట్’ దినపత్రికను, ‘లింక్’ వారపత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలు కార్మికుల హక్కులు, సామాజిక న్యాయంపై దృష్టి సారించాయి. సైద్ధాంతిక చర్చలకు వేదికలయ్యాయి.ఛాయాచిత్ర సంచలనంఫొటో జర్నలిజం ద్వారా ప్రింట్ మీడియాలో సత్తా చాటిన జర్నలిస్ట్ హోమై వ్యరవాలా. ‘డాల్టా’ పేరుతో సుపరిచితురాలైన ఆమె భారతదేశంలోని తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆమె ముంబైలోని ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ పత్రికలో పనిచేస్తున్నారు. తొలినాళ్లలో హోమై తీసిన ఫొటోలు ఆమె భర్త పేరుతో ప్రచురితమైనాయి.‘మహిళలు అన్నిచోట్లా తిరగడం ఆరోజుల్లో చాలామంది ఇష్టపడేవారు కాదు. నేను చీర కట్టుకొని, మెడలో కెమెరాతో తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను వింతగా చూసేవారు. సరదా కోసం అలా తిరుగుతున్నానని అనుకునేవారు. నన్ను సీరియస్గా తీసుకునేవారు కాదు. దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫొటోలు తీయగలిగాను. నాపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల సున్నితమైన ప్రాంతాలకు వెళ్లి కూడా ఫొటోలు తీయగలిగాను. నాకు ఎవరూ అడ్డుపడలేదు. దీంతో అరుదైన ఫొటోలు తీసి ప్రచురింపజేయగలిగాను. ఆ ఫొటోలు ప్రచురితమైన తరువాతే ఆ పనిని నేను ఎంత సీరియస్గా చేస్తున్నానో ప్రజలు గుర్తించారు’ అని చెబుతుండేవారు హోమై వ్యరవాలా.మాయా జాలం!మన దేశంలోని ప్రముఖ మహిళా రాజకీయ కార్టూనిస్ట్లలో మాయా కామత్ ఒకరు. ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందిన మాయ చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ ఉండేవారు. లిన్ జాన్స్టన్ పుస్తకం ‘ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్’ ప్రేరణతో కార్టూన్లు గీయడం ప్రారంభించారు కామత్. ఎన్నో ప్రధాన స్రవంతి వార్తాపత్రికలలో కార్టూనిస్ట్గా పనిచేశారు. ‘సక్సెస్ఫుల్ ఉమెన్ కార్టూనిస్ట్’ గా గుర్తింపు తెచ్చుకున్నారు.‘కర్ణిక కహెన్’ అనే కార్టూన్ క్యారెక్టర్ను సృష్టించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు కనికా మిశ్రా. దేశంలో జరిగే సంఘటనపై వ్యాఖ్యనించేలా ‘సామాన్య పురుషుడు’ కార్టూన్ క్యారెక్టర్లు ఎన్నో వచ్చాయి. దీనికి భిన్నంగా ‘కర్ణిక కహెన్’ను తీసుకువచ్చారు.సామాన్య మహిళలే సారథులువివిధ సామాజిక సమస్యలపై పోరాడుతూ పైకి ఎదిగిన మహిళ కవితా దేవి. బుందేల్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత ‘ఖబర్ లహరియా’ పత్రిక ఎడిటర్–ఇన్–చీఫ్గా దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించారు. తనలాంటి భావాలు ఉన్న మహిళలతో కలిసి ‘ఖబర్ లహరియా’కు రూపకల్పన చేశారు. బుందేలీ, బజ్జికా, అవధిలాంటి హిందీలోని వివిధ గ్రామీణ మాండలికాలలో ఈ పత్రిక ప్రచురితమవుతుంది. బుందేల్ఖండ్లోని సామాన్య మహిళలే ఈ పత్రికకు రిపోర్టర్లు. సారథులు.పిచాయ్– ప్రింట్ రీడర్‘నాకు ఫిజికల్ పేపర్ చదవడం అంటేనే ఇష్టం’ అని చెబుతుంటారు సుందర్ పిచాయ్. సాంకేతిక దిగ్గజం ‘గూగుల్’కు సీయివో అయిన పిచాయ్ నోట ఆన్లైన్ కాకుండా ‘ఫిజికల్ న్యూస్ పేపర్’ అనే మాట వినిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ‘నేను ఓల్డ్ స్కూల్’ అని చెప్పకనే చె΄్పారు పిచాయ్. ఈ నేపథ్యంలో ఫిజికల్ న్యూస్పేపర్లు, పుస్తకాలు చదవడం వల్ల కలగే ఉపయోగాల గురించి సామాజిక మాధ్యమాలలో చర్చ నడిచింది. సమాచారాన్ని ఎక్కువ కాలం పాటు గుర్తించడానికి ఫిజికల్ ఫార్మట్ ఉపయోగపడుతుదనే చెబుతున్నారు విశ్లేషకులు. -
కాంతివంతమైన ముఖం కోసం..తియ్యటి తేనె!
తియ్యటి తేనె ఆరోగ్య సంరక్షణలోనే కాదు..అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కీలకంగా ఉంటుంది. ఈ తేనెతో చేసిన మాయిశ్చరైజర్లు, ఫేస్ప్యాక్లు ముఖాన్ని ప్రశాశవంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మరి అలాంటి తేనెను సౌందర్య సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలంటే..అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్తో ఫోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతివంతమవుతుంది. మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మంపై ఉన్న ట్యాన్ తొలగి΄ోయి ముఖం కాంతిమంతమవుతుంది.తేనెలో ఉండే యాంటీ–సెప్టిక్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక చెంచా తేనెలో అరచెంచా దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలున్న చోట రాసి, 10 నిమిషాల తరువాత కడిగేయాలి.పెదవులు నల్లగా మారినా, పగిలినా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా తేనె, చక్కెర కలిపి పెదవులపై నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇది మృతకణాలను తొలగించి పెదవులను గులాబీ రంగులోకి మారుస్తుంది.చెంచా తేనెతో పాలు లేదా పెరుగు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడగాలి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి ముఖచర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: ఎసిడిటీని తగ్గించే యాలక్కాయ..! ఇలా తీసుకుంటే ఎంతో మేలు) -
యాలకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..!?
యాలకులను సువాసన కోసం వాడే వంట దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. తిన్న ఆహారం త్వరగా అరగడానికి యాలకులు బాగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి వాటిని తగ్గిస్తాయి. భోజనానంతరం ఒక యాలక్కాయను నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి, నోరు తాజాగా ఉంటుంది.తల తిరుగుతున్నప్పుడు యాలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది.యాలకులు రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతాయి.గొంతు నొప్పి, దగ్గు ఉన్నపుడు యాలకులతో చేసిన కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది. -
రుద్ర హెలికాప్టర్ని నడిపిన తొలి మహిళా పైలట్..!
సైన్యంలో చేరడం అంటే అంత ఆషామాషి కాదు. తీరా అందులో జాయిన్ అయ్యాక అక్కడ కఠిన శిక్షణను తట్టుకుని పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడం మాటలు కాదు . అందులోనూ ఏవియేషన్ రంగంలో ఓ సాయుధ హెలికాప్టర్కి పైలట్గా వ్యవహరించడం అంటే..ఎన్ని సవాళ్లు ఎదుర్కొనలో చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకు అంతటి కష్టతరసాధ్యమైన బాధ్యతలను పురుషులే నిర్వర్తించారు. తొలిసారి అలాంటి విధుల్లో ఒక మహిళ రావడం ఇదే తొలిసారి. అలాంటి ఘనతను అందుకు "శర్మ జీ కి బేటి". గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె స్టోరీ ప్రేరణగా నిలిచింది. ఎవరామె..? ఈ రంగాన్ని ఎలా ఎంచుకుందంటే..రుద్ర హెలికాప్టర్ను నడిపిన భారత సైన్యం తొలి మహిళా పైలట్గా కెప్టెన్ హంస్జా శర్మ చరిత్ర సృష్టించారు. శర్మ కెరీర్ జర్నీలో తిరస్కరణలు, శస్త్ర చికిత్సలు ఉన్నాయి. జమ్మూలో పుట్టి పెరిగిన ఆమె నాసిక్లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ శిక్షణా పాఠశాల (CAATS)లో తన శిక్షణా కోర్సులో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ పోరాట విమాన చోదకుడికి ఇచ్చే సిల్వర్ చిరుత ట్రోఫీని అందుకున్న తొలి అధికారిణి ఆమె. ఇది భారత ఆర్మీ ఏవియేషన్కు తొలి రికార్డు కూడా. ఈ ఏడాది రాజస్థాన్ ఆర్మీ డే పరేడ్లో 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్కు నాయకత్వం వహించడమే గాక హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శించింది.జమ్మూ నుంచి ఆర్మీ ఏవియేషన్ వరకు..మార్చి 9, 1998న జమ్మూలో జన్మించిన కెప్టెన్ శర్మ బర్నాయ్లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె జమ్మూలోని పరేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత భారత సైన్యంలోకి ఎంపికయ్యే ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో చేరింది. అక్కడ నుంచి భారత సైన్యంలోకి చేరడానికి ఆమె పలు సవాళ్లు ఎదుర్కొంది. మొదటగా తాత్కలిక తిరస్కరణలను ఫేస్చేసింది. ఆ క్షణంతో తన కెరీర్ ముగిపోయిందనుకుంది. కానీ ఆమె అచంచలమైన సేవ, పట్టుదల మనస్తత్వం తిరిగి తన ఒంటిమీదకు యూనిఫాం వచ్చేలా చేశాయి. సింగిల్ మదర్ సంరక్షణలో..సీనియర్ జర్నలిస్ట్, సింగిల్ మదర్ రష్మి శర్మ తన పిల్లలను పెంచడానికి అన్నింటిని అమ్మేశానన్నారు. ప్రస్తుతం తన కూతురు హంసజ తనను ఉద్యోగం మానేయమని అంటుంది. అయితే తాను జర్నలిస్ట్ని కాబట్టి పనిచేస్తే..తనకు చేతనైనంత ఇతరులకు సాయం చేయగులుగుతానని అంటోందామె. తన కూతురు కూడా ఇతర సైనికురాలి లాంటిదేనని అన్నారు. వాళ్లు దేశం కోసం త్యాగం చేస్తే..తాను అలాంటి త్యాగాలే చేసిన తల్లినని ఆమె గర్వంగా చెప్పారు. తాను శత్రువుల ముందు ధైర్యంగా నిలబడి తగిన జవాబు ఇవ్వడానికి సాహసించే ప్రతిసైనికుడిని చూసి గర్విస్తున్నాని అన్నారామె. నిజానికి ఏఎల్హెచ్లో ప్రయాణించడం అంటే బహిరంగ ఆకాశంలో ప్రయాణించడం లాంటిదని, చాలా భయంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో హంసజకు మరిన్ని బాధ్యతలు, సవాళ్లు ఎదరవ్వుతాయని..వాటన్నింటి ఆమె విజయవంతంగా ఎదుర్కొగలదని నమ్మకంగా చెప్పారు హంసజ తల్లి రష్మి శర్మ.(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!) -
మానసిక సమస్యలు మహిళల్లోనే అధికం..!
‘మనసే అందాల బృందావనం’ అనేది కవి మాట.అయితే ఆ బృందావన అందాలు, ప్రశాంతతకు చాలామంది మహిళలు దూరం అవుతున్నారు. వ్యక్తిగత సమస్యల నుంచి పని ప్రదేశాలలో ఒత్తిడి వరకు.... రకరకాల కారణాలు మహిళల్లో మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.మన దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా డిప్రెషన్తో బాధ పడుతున్నారు. దాదాపు 40 శాతం మంది మహిళలు కుంగుబాటు(డిప్రెషన్) సమస్యను ఎదుర్కొంటున్నారు.భారతదేశంలో 1.3 మిలియన్ల మంది మహిళలపై సర్వే నిర్వహించి, వారి మానసిక ఆరోగ్య సమస్యలపై ‘అన్వీలింగ్ ది సైలెంట్ స్ట్రగుల్’ పేరుతో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నివేదిక విడుదల చేసింది.47 శాతం మంది మహిళలు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి వారి ఐక్యూని, జ్ఞాపకశక్తిని (కాగ్నెటివ్ హెల్త్) ప్రభావితం చేస్తోంది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులలో 42 శాతం మందిలో కుంగుబాటు, ఆందోళన లక్షణాలు కనిపించాయి.80 శాతం మంది మహిళలు ప్రసూతి సెలవులు, కెరీర్ పురోగతికి సంబంధించి వివక్ష ఎదుర్కొంటున్నారు.దాదాపు 38 శాతం మంది మహిళలు కెరీర్, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన విషయాలలో ఆందోళన చెందుతున్నారు.ప్రతి ఇద్దరు భారతీయ మహిళలలో ఒకరు దీర్ఘకాలిక ఒత్తిడితో బాధ పడుతున్నారు.ఆహార సంబంధిత రుగ్మతలు(ఈటింగ్ డిజార్డర్స్) కేసులలో 63.3 శాతం మహిళలు ఉండగా, 36.7 శాతం మంది పురుషులు ఉన్నారు.భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలలో 18–38 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఉంటున్నారు.‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ నివేదిక ప్రకారం నిరాశ, నిస్పృహలకు సంబంధించిన రుగ్మతలు 29.8 శాతం, ఆందోళనకు సంబంధించిన రుగ్మతలు 27.9 శాతం పెరిగాయి.(చదవండి: అధిక ఆదాయం.. కానీ ఆనందం నిల్..!) -
పంపాలో పేరుకుపోయిన భక్తుల దుస్తులు.. మండిపడ్డ కేరళ హైకోర్టు
సాక్షి, కేరళ: శబరిమల యాత్ర ముగిసిన తర్వాత పంపా నదిలో భక్తులు వదిలేసిన దుస్తులతో చెత్తకుప్పలా మారింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం అధికారుల తీరుని తప్పుపబట్టింది. అలాగే ఈ దుస్తులను తొలగించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి శబరిమల సీజన్ ముగిసిన తర్వాత పంపా నదిని శుభ్రం చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నదిలో పేరుకుపోయిన బట్టల కుప్పలు పర్యావరణానికి, జలచరాలకు ముప్పుగా మారుతుందని స్పష్టం చేసింది. చాలామంది భక్తులు దీన్ని ఆచారంగా భావిస్తున్నారు..కానీ ఇది శబరిమల సంప్రదాయంలో భాగం కానేకాదని, అదొక అపోహని పేర్కొంది. భక్తులకు దీనిపై అవగాహన పెంచాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. నిజానికి ఇలా నదిలో వదిలేసిన బట్టలు కుళ్లిపోయి దుర్వాసన రావడమే గాక, ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా ఈ వ్యర్థాల వల్ల చేపలు వంటి జలచరాలు మృత్యువాతపడుతున్నాయని పేర్కొంది. కేవలం నదిలో తేలే బట్టలను మాత్రమే కాకుండా, నది అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే సుచిత్ర మిషన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పంతినం తిట్ట జిల్లా యంత్రాంగం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పంపా నదిని యథాస్థితికి తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని దేవస్వం బోర్డును ఆదేశిస్తూ కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది కేరళ హైకోర్టు. కాగా, ఈ పంపా నది కేరళలో మూడవ అతి పొడవైన నది. దక్షిణ గంగగా పూజలందుకుంటోంది. ఇడుక్కిలోని పీర్మేడు పీఠభూమిలోని పొగమంచుతో నిండిన పులచిమలై కొండల నుంచి ఉద్భవించి, అరుదైన ఔషధ వృక్షజాలంతో సమృద్ధిగా ఉన్న అడవుల గుండా ప్రవహించే ఈ పవిత్ర నది ప్రతి అలలోనూ ఇతిహాసాలు, గొప్ప చరిత్రను దాచుకుంది. ఒకప్పుడూ స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచిన అవే జలాలు ఇలా భక్తులు వదిలేసిన బట్టలు, పూసల మాలలు వంటి వాటితో కలుషితమవుతోంది. ఉనికిలోని ఆచారంతో పవిత్రమైన నదిని కాస్తా అపవిత్రంగా మారుస్తుండటం బాధకరం.(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!) -
అధిక ఆదాయం.. కానీ ఆనందం నిల్..!
అందరు లక్షల్లో ఆదాయం వస్తే ఎంత బాగుండును అనుకుంటుంటారు. అందుకోసం చిన్న పార్ట్టైం ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇంకొందరు ఏకంగా నెలకు లక్షల్లో సంపాదన ఉంటుంది. అయినా ఇంకా ఏదో వెలితి. సంపాదించింది ఏ మాత్రం అక్కరకు రాదు. అలాంటి బాధనే సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకున్నాడు ఓ చార్టడ్ అకౌంటెంట్. చార్టడ్ అకౌంటెట్ నితిని కౌశిక్ సోషల్ మీడియా ఎక్స్ పోస్టులో.. ఆకర్షణీయమైన ఆదాయం ఉంది. కానీ ఆర్థిక స్వేచ్చ లేదంటూ తన గోడుని వెల్లబోసుకున్నారు. మెట్రో నగరాల్లో జీవించేవాళ్లు నెలకు రెండు లక్షలు సంపాదించినా..సరిపోవడం లేదని వాపోయాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాం అని చెప్పాడు. పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడం కూడా భారంగా ఉందని, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల ఫీజులు కూడా ఆందోళనకరంగా పెరిగాయని అన్నారు. ఇక వైద్యం దగ్గరకు వచ్చేటప్పటికీ..ఆరోగ్య సంరక్షణ తీవ్రమైన ఆర్థిక ప్రమాదంగా ఉందని బాధగా చెప్పుకొచ్చారు. మనమంతా ట్రెడ్మిల్పై పరుగులంఖించుకుంటున్నామే తప్ప సంపదను సృష్టించుకోలేకపోతున్నాం అని వేదనగా చెప్పాడు. నిరంతరం ఈఎంఐలు చెల్లిస్తూ..రుణ చెల్లింపు యంత్రాలుగా మారిపోతున్నాం అంటూ బాధగా తన ఆవేదనను వివరించారు సీఏ కౌశిక్. అయితే ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు మండిపడ్డారు. ఇది ముమ్మాటిక ఆర్థిక నిర్వహణ వైఫల్యమని తేల్చి చెప్పారు. సంపాదన తోపాటు ఖర్చులను బ్యాలెన్స్ చేసే నేర్పరితనం లేనప్పుడూ..ఎంత సంపాదించినా వృధానే అన్నారు. చాలీచాలని జీతంతో బతుకుతూ..తమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నావారు కూడా ఉన్నారని గుర్తుచేశారు. సంపాదనకు తగ్గ ఖర్చు, పొదుపు చేయగలిగే సమర్థత ఉంటే..ఏదైనా సాధ్యం చేసుకోగలమంటూ ఎన్నో ఆర్థిక పాఠాలు, చిట్కాలు షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదండోయ్ అధిక ఆదాయం ఉంటే హ్యాపీ కాదు..సంతృప్తిగా బతకడం తెలియాలి. అసలు ఎంత సంపాదించాం అనేది కాదు..దాన్ని ఏవిధంగా ఖర్చుచేస్తూ..పొదుపు చేయగలం అనేది అత్యంత ముఖ్యం సుమీ. -
ఆ ఆస్తిలో వారికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది!
నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలు నా మాజీ భార్య వద్దనే ఉంటారు. అయితే మా నాన్న గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా?– కృష్ణమూర్తి, విశాఖపట్నంమీ తండ్రిగారి దగ్గర నుంచి మీకు సంక్రమించిన ఆస్తి మీ తండ్రి గారి స్వార్జితమైవుండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి వుంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కు ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే అది మీ పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది వుంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అది మీ తండ్రి గారికి కూడా వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయివుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేదా విడిపోయిన మీ మాజీ భార్య వద్ద ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం వున్నారో మీరు చెప్పలేదు. ఒకవేళ మీతోపాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ తల్లిగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాన్నమ్మ) ఉంటే వారికి కూడా మీతోపాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటాను వారు అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ పోందే హక్కు వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comమెయిల్ చేయవచ్చు. -
దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!
అడవి అంటే సహజసిద్ధంగా ఏర్పడేదనేది తెలుసు అందరికి. కానీ చేతితో సృష్టించిన వనం గురించి విన్నారా. ఔను ఇది నిజం. చేతితో అడవిని సృష్టించడమా? అని ఆశ్చర్యం వేసినా..నమ్మకతప్పని సత్యం ఇది. అది కూడా ఓ 92 ఏళ్ల వృద్ధురాలి చేతి నుంచి పరుచుకన్న పచ్చదనం. అది ఆమె ఆరాటం నుంచి పుట్టుకొచ్చిన ప్రకృతి తపోవనంలా అచ్చంత ఆహ్లాదభరితంగా అలారారుతుంది. వాతావరణ మార్పు కోసం గత కొన్నేళ్లుగా పచ్చదనం అనే మంత్రం జపిస్తున్నాం కానీ..అంతకుమునుపు నుంచే ఈ దేవకి అమ్మ పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి..అందుకోసం కృషి చేశారామె. చెట్టు విలువ తెలసిన అమ్మ ఈమె. ఆమె పెంచిన అడవిలో ఉండే మొక్కలు గురించి విన్నా..విస్తుపోవాల్సిందే..!. అసలు ఈ దేవికి అమ్మ ఎవరు..? అడవిని సృష్టించాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే..కేరళలోని అలప్పుజలోని ఓ చిన్న గ్రామానికి చెంది దేవికి అమ్మ నలబై ఏళ్ల కృఫి ఫలితమే ఈ తపోవనం. ఇది ఆమె చేతితో సృష్టించిన అడవి. ఇక్క ఎన్నో ఔషధ మోక్కలు, చేపలు, పక్షుల సందడితో ఆహ్లాదభరితమైన పర్యావరణ సమతుల్యత కనిపిస్తుంది. మనకు కలిగిన శారీరక కష్టానికి కాసింత కలత చెంది..ఆరోగ్యంగా ఉండేందుకు యత్నిస్తాం. కానీ ఈ దేవికి అమ్మ అలా కాదు..తాను అనుభవించిన శారీరక బాధకు ఉపశమన మొక్కలుగా భావించడం విశేషం. అనుకోని ఓ ప్రమాదం కారణంగా అంగవైకల్యంతో మంచానికే పరిమితమైంది దేవకి. బాధకు ఉపశమనంగా చెట్ల పెంపకం..దాంతో ఎప్పటికీ వరిపొలం పనులు చేసే అవకాశం లేకుండాపోయింది. ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకున్న దేవకీ..ఆ పనులకు స్వస్తిచెప్పక తప్పలేదు. తనంతట తాను నడవలేని దైన్యస్థితితో చాలా పోరాడింది. చివరికి చికిత్స తీసుకుంటూనే తన పనులు తను చేసుకునేలా ఉండాలన్న సంకల్పం..కర్ర ఊతంతో నడవగలిగే శక్తిని అందించింది. ఆ కాసింత శక్తితోనే ఏదో ఒకటి చేయాలని ఆరాటపడింది. ఎలాగో ఈ శారీరక వైకల్యంతో వ్యవసాయం అంటే కష్టమే అందుకని..తన ఇంటి వెనుక ఉన్న బంజరు భూమిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. రోజుకు ఒక మొక్క చొప్పున నాటడం, దానితో కాసేపు గడపడం వంటి పనులతో తన శారీరక రుగ్మత నుంచి బయటపడే యత్నం చేసింది. ఇలా నాలుగు దశబ్దాలుగా తన రోజువారీ దినచర్యలో మొక్కలు నాటడం అనేది భాగంగా మారింది. అలా చూస్తుండగానే ఐదు ఎకరాల్లో పరుచుకున్న సహజసిద్ధమైన అడవిగా రూపాంతరం చెందింది. ఈ అడవిలో వివిధ జాతుల చెట్లు,పొదలు, ఔషధ మొక్కలకు నిలయం.ఇక్కడ ప్రత్యేక చెట్లలో ఒకటి కమండలు. దీన్ని కాలాబాస్ చెట్టు అని కూడా పిలుస్తారు. ఋషులు తపస్సు నిమత్తమై వినియోగించే కమండలం కోసం ఈ చెట్టునే వినియోగిస్తారు. అందుకే దీన్ని కమండలు వృక్షం అనిపిలుస్తారు. అంతేగాదు ధ్యాన సమయంలో ఈ చెట్టు కొమ్మలనే ఆధారం చేసుకుంటారు. ఇదేగాక నెమలి మొక్క..అని మరో ప్రత్యేకమైన మొక్క ఉంది. దీని ఆకులు నెమలి ఈకను పోలి ఉంటాయి. ఇవేగాక అంజూర చెట్లు, ఇండియన్ బ్లాక్బెర్రీ, జాక్ఫ్రూట్, మామిడి, అడవి బెర్రీలు, వేసవిలో ఆకురాల్చు బుద్ధచెట్టు తదితరాలు ఉన్నాయి. ఈ పచ్చదనం మధ్యలో క్యాట్ఫిష్ వంటి చేపలు, స్నేక్హెడ్ ముర్రెల్తో నిండిన చిన్న చెరువు వంటివి ఉన్నాయి. ఈ చేపలు తినే పక్షులు, ఈగల్, వేటాడే పక్షులు కిలకిలరావాలతో మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉంటుంది. సముద్రానికి సమీపంలో బ్యాక్వాటర్స్(ఉప్పునీరు లాంటి చిన్న చెరువులు) మధ్య ఇలాంటి అడవినా..! అని అక్కడకు వచ్చే జనాలు విస్తుపోతుంటారు. తెల్లటి ఇసుక, చుట్టూ ఉప్పు నీరు మధ్య పచ్చదనం అనేది చాలా కష్టం. కానీ దేవికి అమ్మ పట్టుదల..ఈ వృక్ష సంపదకు మూలం. ఆ అమ్మ చుట్టు పక్కల వాళ్లకు ఉచితంగా ఆ అడవిలోని మొక్కలను అందిస్తుంది. అంతేగాదు అందరు వచ్చి సందర్శించొచ్చు కూడా. అందుకు ఎలాంటి రుసుము తీసుకోదామె.ఇది ప్రకృతి ప్రసాదమని అవి అందరి హక్కు అని అంటుంటారామె. ఒక చెట్టును నాటడం అనేది కార్బన్ పాదముద్రను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇక్కడ ఈ దేవికి అమ్మ అదే చేశారు. అందుకే భారత ప్రభుత్వం ఆమె నిస్వార్థ సేవను గుర్తించి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్సంగ్ హీరోస్ విభాగంలో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు అడవుల పెంపకం, పరిరక్షణకు సంబంధించి పర్యావరణ బాధ్యత ఎలా ఉంటుందో చేతల ద్వారా చూపించి ఆదర్శంగా నిలిచింది ఈ దేవకి అమ్మ..!.(చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..)


