breaking news
Family
-
వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..
కొన్ని విలాసవంతమైన పెళ్లిళ్లు తమ విలాసవంతమైన జీవితాన్ని, డాబు, దర్పం చూపిస్తున్నట్లుగా ఉంటాయి వేడుకలు. కావాలనుకుంటే..అట్టహాసంగా చేసుకోవచ్చు..అత్యంత లగ్జరీయస్గా వేడుక చేసుకోవచ్చు తప్పులేదు. కానీ డబ్బులను పూల వర్షంలా కురిపిస్తూ చేసుకోవడం అంటే..! ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఆ సొమ్ము సామాజిక కార్యక్రమాలకు ఖర్చుపెడితే ప్రయోజనం, పరమార్థం ఉంటుంది. పైగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఆ నూతన దంపతుల మంచి ఆశీర్వాదాలు దక్కుతాయి, మేలు జరుగుతుంది కూడా. ఇలాంటి మంచిపనులు ఏదో ఒకనాటికి మనకు చేరిమేలు చేకూరుస్తాయనే కదా మన పురాణాలు నొక్కి చెబుతున్నాయి. కానీ కొందరు తమ స్వలాభానికి, సంతోషానికే ప్రాధాన్యత చూపిస్తూ వేడుకలు నిర్వహించి విమర్శలపాలవ్వుతారు. అలాంటి పనే చేసింది ఈ వరుడి కుటుంబం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. పంజాబ్లో జరిగిన వివాహ వేడుక అందర్నీ విస్తుపోయేలా చేసింది.వధువుపై డబ్బులు వర్షం కురిపిస్తూ..వరడు కుటుంబం ఆహ్వానం పలికింది. మొత్తం కుటుంబసభ్యులు ఆమెపై నోట్లకట్లను కురిపించారు. మొత్తం అక్షరాల రూ. 8.5 కోట్ల నగదును కురిపించినట్లు సమాచారం. ఆ తర్వాత వరుడు ఆమె చేతిని పట్టుకుని నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అతిగా ఉందని, పేదలకు, నిస్సహాయులకు ఆ డబ్బుని ఉపయోగించి ఉంటే బాగుండేదంటూ విమర్శించారు. కానీ కొందరూ..ఈ తంతు చూస్తే..అతడి కుటుంబం ఆమెని బాగా చూసుకుంటుందని ఆశిస్తున్నా, అయినా ఇది వారి డబ్బు..కాబట్టి నచ్చినట్లు ఖర్చుపెట్టుకుంటారని సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by ET NOW (@etnow) (చదవండి: మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ లైఫ్..) -
మాఘం మౌనమైతే.. ఫాల్గుణం పెళ్లిబాజాలు
విజయనగరం గంటస్తంభం: మాఘమాసం అంటేనే పెళ్లిళ్లు, శుభకార్యాల మాసం అని పెద్దలు చెప్పకొంటారు. కానీ, ఈ ఏడాది శుక్ర మౌఢ్యమి కారణంగా మంచి ముమూర్తాలు దొరకక చాలామంది వేచి చూడాల్సి వచ్చింది. దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియనుండటంతో వివాహాలు, శుభకార్యాలకు మళ్లీ చైతన్యం వచ్చింది. పండితులు చెబుతున్నట్టుగా ఈనెల మూడో వారం నుంచే శుభముహూర్తాలు కలసి వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి ఊపందుకోనుంది. హడావిడి మొదలు.. గ్రామాలు, పట్టణాల్లోని వధూవరుల ఇళ్లలో ఏర్పాటు హడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక కుటుంబాలు మండపాలు, పురోహితులు, అలంకరణల కోసం బుకింగ్స్ పూర్తి చేసుకున్నాయి. ఏడాది పొడవునా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయనే వార్తతో పెళ్లిళ్ల సంఖ్య వేలల్లోకి చేరనుందని అంచనా. కల్యాణ మండపాలకు భారీ డిమాండ్.. వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ మొదలవుతుండటంతో కల్యాణ మండపాలు, హోటళ్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని మండపాలు వరుసగా బుక్ అవుతున్నాయి. మండపం స్థాయిని బట్టి అద్దెలు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా బాజాభజంత్రీలు, షామియానా వ్యాపారులు, క్యాటరింగ్ సంస్ధలకు కూడా పని పెరిగింది. పెళ్లిళ్లకు వచ్చే బంధువుల కోసం లాడ్జీలు, హోటళ్లు ముందుగానే రిజర్వ్ అవుతున్నాయి. పూల అలంకరణల హవా... వివాహాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పూల అలంకరణలకు ఈసారి ప్రత్యేక ఆదరణ కనిపిస్తోంది. అలంకరణ రకం, డిజైన్ను బట్టి ఖర్చులు రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియంతో పాటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి తాజా పూల రకాలను తెప్పిస్తున్నారు. ఫొటోగ్రాపర్లు, వీడియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులకు కూడా బిజీ షెడ్యూల్ మొదలైంది. పురోహితులు సైతం ముందస్తుగానే బుక్ అయిపోతుండటంతో తేదీలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబాలకు సూచిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో పెళ్లి హడావిడి గ్రామల్లో అయితే పెళ్లి పనుల సందడి మరో రకంగా కనిపిస్తోంది. ఇళ్ల ముందర పందిళ్లు, ఊరంతా వెలుగులు, బంధువుల రాకపోకలు..మళ్లీ ఆ పాత హుషారు తిరిగి వస్తోందని పెద్దలు అంటున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఈ సీజన్పై ఆశలు పెట్టుకున్నాయి. మొత్తం మీద శుభముహూర్తాల రాకతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.ముహుర్తాల కోసం ఎదురుచూపులు ముగిశాయి శుక్ర మౌఢ్యమి ఈ నెల 17తో ముగియనుండటంతో శుభకార్యాలకు ఏర్పడిన విరామం తొలగింది. ఈనెల 19 నుంచి మే రెండో వారం వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు ఇది అనుకూల సమయమని సూచించారు. – జయంతి ప్రవీణ్కుమార్, సిద్ధాంతి, జగ్గాపురం -
మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ..
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేజ్ మీద అరుస్తూ, "నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు", "నీలో ఒక సింహం ఉంది", "ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి నేను తోపు అని చెప్పుకో" అంటూ డైలాగులు కొడుతుంటారు. వీటిని చూసి జనం ఇన్స్టంట్గా ఉత్తేజానికి లోనవుతారు. కానీ, ఆ వీడియో ముగిసిన అరగంటకే మళ్ళీ పాత భయాలు, పాత బలహీనతలు చుట్టుముడతాయి.ఎందుకు?ఎందుకంటే, మార్కెట్ అమ్ముతున్నది 'మోటివేషనల్ డ్రగ్'. కానీ మనకు కావాల్సింది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్.మోటివేషన్ అనేది ఒక కప్పు కాఫీ లాంటిది. తాగినప్పుడు కిక్ ఇస్తుంది, ఆ తర్వాత నీరసం వచ్చేస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది మన మనసులోని సాఫ్ట్వేర్ను రీ-రైట్ చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ.సో-కాల్డ్ ట్రైనర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే... అందరికీ ఒకే మందు (One size fits all) ఇవ్వాలని చూడటం."ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. నెగటివిటీని దరిచేరనీయకండి. అన్నీ మంచివే జరుగుతాయని నమ్మండి" అని చెప్తారు సో-కాల్డ్ ట్రైనర్స్. దీన్ని సైకాలజీలో 'Toxic Positivity' అంటారు.కోపం, భయం, అసూయ, బాధలాంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మనిషిలో ఒక భాగమే. వాటిని అణచివేస్తే అవి లోపల కుళ్ళిపోయి డిప్రెషన్ లేదా యాంగ్జైటీగా మారుతాయి.Real Personality Development అంటే నెగటివ్ ఎమోషన్స్ను అణచివేయడం కాదు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. నాకు భయం వేస్తోంది అని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ భయాన్ని జయించడానికి అది మొదటి మెట్టు."నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించు. అది చూసి లోకం నమ్ముతుంది, మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది" అంటారు ట్రైనర్స్.కానీ, ఇది మిమ్మల్ని 'Imposter Syndrome' కి గురి చేస్తుంది. లోపల డొల్లతనం ఉండి పైన మేకప్ వేసుకుంటే, ఎక్కడో ఒకచోట ఆ ముసుగు జారిపోతుందనే భయం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.Real Personality Development అంటే నటించడం కాదు, 'అర్హత'ను (Competence) పెంచుకోవడం. మీరు ఒక పనిలో నిష్ణాతులు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అనేది ఒక బై-ప్రొడక్ట్లా దానంతట అదే వస్తుంది.సైకాలజీ ప్రకారం వ్యక్తిత్వం అంటే 'అలవాటు' కాదు, అది ఒక 'ఆర్గనైజేషన్'. వ్యక్తిత్వం అనేది కేవలం మనం నేర్చుకునే స్కిల్స్ కాదు. అది మన అనువంశికత (Heredity), పరిసరాల (Environment) సంక్లిష్టమైన కలయిక.మోటివేషనల్ స్పీకర్లు కేవలం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సైకాలజీ మీ 'బాల్యం' (Childhood) గురించి మాట్లాడుతుంది.మీ పర్సనాలిటీకి పునాది మీ ఐదేళ్ల వయసులోనే పడిపోయింది. ఆ పునాదిలో ఉన్న పగుళ్లను (Trauma/Negative conditioning) పూడ్చకుండా పైన అంతస్తులు కడితే, ఆ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు.నేను డెవలప్ చేసిన నా "Genius Matrix" Break. Build. Beyond. మోడల్ ద్వారా ఈ సో-కాల్డ్ ట్రైనర్స్ ఎక్కడ విఫలమవుతున్నారో చూడండి:స్టెప్ 1: Break (పాత పునాదిని కూల్చడం)ట్రైనర్స్ డైరెక్ట్గా బిల్డింగ్ కట్టమంటారు. కానీ సైకాలజీ ప్రకారం, ముందు లోపల ఉన్న శిథిలాలను తొలగించాలి.చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని అందరిముందు తిట్టినప్పుడు "నేను దేనికీ పనికిరాను" అని మీ మనసులో పడ్డ ముద్రను చెరిపేయకుండా, పైన మీరు ఎన్ని "సక్సెస్ మంత్రాలు" చదివినా ఉపయోగం లేదు.మీ బలహీనతలు, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ మొదలయ్యాయో గుర్తించి, ఆ పాత సెల్ఫ్-ఇమేజ్ను బ్రేక్ చేయడమే అసలైన వికాసం.స్టెప్ 2: Build (లోపలి నుంచి బయటికి)ఇక్కడ మనం బాహ్య ప్రదర్శనపై కాకుండా, అంతర్గత విలువలపై దృష్టి పెడతాం.ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు (Real Self) అనేది కీలకం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక "సక్సెస్ ఫుల్ పర్సన్" కనిపించాల్సిన అవసరం లేదు, ఒక "నిజాయితీ గల మనిషి" కనిపిస్తే చాలు.గొడవ జరిగినప్పుడు అరవకుండా ఉండటం 'కమ్యూనికేషన్ ట్రిక్' కాదు, అది మనసును కంట్రోల్ చేసే 'మెంటల్ స్ట్రెంత్'.స్టెప్ 3: Beyond (పరిమితుల ఆవల - లెగసీ నిర్మించడం)మార్కెట్ కోరుకునేది 'సక్సెస్'. సైకాలజీ కోరుకునేది 'సాటిస్ఫాక్షన్', 'గ్రోత్'.ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం మానేసి, మీరు మీ కోసం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మీ పర్సనాలిటీలో ఒక Depth ఉంటుంది. Abraham Maslow చెప్పిన 'Self-Actualization' అంటే ఇదే.ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం (Stage Fear). "నువ్వు పులివి.. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఊగిపో.. కేకలు వేయ్.. జనం చప్పట్లు కొడతారు" అంటాడు మోటివేషనల్ స్పీకర్. ఇది ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు, కానీ భయం పోదు.మరేం చేయాలి?ఆ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడా? (Perfectionism). ఎదుటివారు ఏమనుకుంటారో అనే Social Anxiety ఉందా? తన దగ్గర సరైన కంటెంట్ లేదా? అనే అంశాలను పరిశీలించాలి.ముందుగా ఆ వ్యక్తి తనలోని లోపాలను అంగీకరించేలా చేయడం.చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడించి 'ఎక్స్పోజర్' ఇవ్వడం.స్టేజ్ మీద మాట్లాడటం అంటే 'తన్ను తాను నిరూపించుకోవడం' కాదు, 'సమాచారాన్ని పంచడం' అనే మైండ్సెట్ మార్పు తేవడం.ఇది Real Personality Development.చివరగా నేను చెప్పేది ఒక్కటే... పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మోడల్లా నడవడం కాదు, ఒక నాయకుడిలా మాట్లాడటం కాదు.మీ మనసులో ప్రశాంతత ఉందా?మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నారా?కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడుతున్నారా?మీ తప్పులను మీరు ఒప్పుకోగలుగుతున్నారా?ఇవేవీ మార్కెట్లో లభించే రెండు రోజుల వర్క్షాప్లలో దొరకవు. వీటికి లోతైన ఆత్మపరిశీలన, శాస్త్రీయ దృక్పథం అవసరం.మనం ఈ Real Personality Development సిరీస్లో మాట్లాడబోయేది ఆ లోతైన సత్యాల గురించే.ఇక్కడ సో-కాల్డ్ మోటివేషన్ ఉండదు... కేవలం సైకలాజికల్ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
ఇల్లు ఎగ్జామ్ సెంటర్ కాదు
పరీక్షలు వస్తే... పిల్లలు ఎలా ఉండాలో చెప్పడంతోపాటు తల్లిదండ్రులు ఎలా ఉండాలో కూడా చెప్పాల్సి వస్తోంది. ఇరు పక్షాలు బాగా వత్తిడి ఎదుర్కోక తప్పని సమయం ఇది. చదువు ముఖ్యమే అయినా పిల్లల శక్తి, స్వభావం గమనించుకుని తల్లిదండ్రులు తమను తాము అర్థం చేసుకుని ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన సమయం ఇదని అంటున్నారు నిపుణులు.ఫిబ్రవరి వచ్చిందంటే పరీక్షల కాలం మొదలైనట్లే. ఏడాది మొత్తం చదివినదంతా ఈ పరీక్షల్లో రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. లేకపోతే అమ్మా నాన్న ఏమనుకుంటారోనని పిల్లల టెన్షన్. అదే సమయంలో పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఇరుగూ పొరుగూ వారు ఏమనుకుంటారోనని తల్లిదండ్రులకు టెన్షన్. ఇంత టెన్షన్ అవసరమా? ఎగ్జామ్స్ వస్తే ఇళ్లు ప్రశాంతంగా ఉండటం మంచిదేగాని చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దంతో ‘పిల్లాడు చదువుకుంటున్నాడు. అరవకండి’ అనే గుసగుసలతో విడ్డూరంగా ఉండటం సమంజసమా? పరీక్షలు రాయాలి కాబట్టి పిల్లలకు టెన్షన్ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఒత్తిడితో ఆరోగ్యంపాడుచేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు.తల్లులూ... జాగ్రత్తపరీక్షల్లో మార్కులు బాగా రావాలని చాలామంది విద్యార్థులు రాత్రిపూట చదువుకుంటూ ఉంటారు. పిల్లలు వద్దంటున్నా కొందరు పెద్దలు నిద్రమానేసి వారి పక్కనే కూర్చుంటారు. నిద్రపోకుండా టీ, కాఫీ వంటివి అందిస్తుంటారు. కలత నిద్రతోనే పొద్దున్న లేచి మళ్లీ అన్ని పనులు చేస్తుంటారు. ఈ నిద్రలేమి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోజంతా ఇంటి పనులు చేసే తల్లులు రాత్రుళ్లు నిద్రపోకపోవడంతో అలసిపోయి అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు. పరీక్షల వేళ పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో తల్లి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.తండ్రులూ... శాంతంపిల్లలకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొందరు తండ్రులు తమ పిల్లలే ఫస్ట్ రావాలన్న పట్టుదలతో ఉంటారు. పరీక్షల సమయంలో పిల్లలకన్నా వీరే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. చదువుతున్న పిల్లల్ని గదమాయించడం, అన్నీ చదివావా అని మాటిమాటికీ అడగటం, కాసేపు పక్కన వెళ్లినా కసురుకోవడం, వేరేవాళ్లతో కలవనివ్వకుండా చదవమనడం వంటివి చేస్తుంటారు. పిల్లలు పరీక్ష సరిగ్గా రాస్తారా లేదా అన్న భయంతో బీపీ తెచ్చుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటివీ జరుగుతుంటాయి. ఇవన్నీ చిన్నారుల మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపి, వారిని మరింత అభద్రతకు గురిచేస్తాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అటు తల్లిదండ్రుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటే, ఇటు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. కాబట్టి పరీక్షల వేళ శాంతం వహించి చదివించాలి.చిరాకు తెప్పిస్తే ఎలా?పరీక్షలు వస్తే తల్లిదండ్రుల రోజువారీ కార్యక్రమాలు మారిపోతుంటాయి. పొద్దున్నే లేచి పిల్లల్ని లేపడం, వారిని చదువుకోమని చెప్పి పనులు చేసుకోవడం, ఎవరినీ ఇంటికి రానివ్వకుండా కట్టుదిట్టం చేయడం వంటివి చేస్తుంటారు. బయటకు వెళ్లాల్సిన పనులను వాయిదా వేసి 24 గంటలూ పిల్లల పక్కనే ఉంటారు. ఇదంతా వారు ప్రేమతో చేసినా పిల్లలపై చూపే అతి నియంత్రణ ఇబ్బందిగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద భయం, కోపం, చిరాకు పెరుగుతాయని అంటున్నారు.ఇలా చేస్తే మేలుపరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఎంత ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత బాగా చదువుతారని నిపుణులు అంటున్నారు. ‘చదువు..బాగా చదువు..చదవకపోతే జీవితం వేస్ట్’ లాంటి మాటలు మాట్లాడకూడదంటున్నారు. ఏయే సబ్జెక్టుల్లో వారు ఇబ్బంది పడుతున్నారో కనుక్కొని అందులో వారి సందేహాలు తీర్చాలి. అవసరమైతే యూట్యూబ్ వీడియోలు చూసి తగిన అంశాలు రాసుకొని వారికి వివరించాలి. రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టాలని కోరకుండా కాసేపు పిల్లల్ని బయటకు పంపాలి. కంబై¯Œ ్డ స్టడీ చేయాలని పిల్లలు కోరితే అందుకు సహకరించాలి. రాత్రిపూట భోజనం అయ్యాక ఒక పదిహేను నిమిషాలపాటు వారితో కలిసి వాకింగ్ చేయాలి. ఆ సమయంలో పరీక్షల గురించి వారితో చర్చించాలి. వారిలో ఉన్న భయాలు పోగొట్టాలి. పరీక్ష రాసి వచ్చాక వారిని ప్రశ్నలతో వేధించకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.ఈ ఆహారం బెటర్పరీక్షల సమయంలో పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంపై తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉంటాయి. కొందరు ఆహారం విషయంలో కఠినంగా వ్యవహరిస్తే, మరికొందరు అమితంగా తినిపిస్తుంటారు. రెండూ సరికాదని నిపుణులు అంటున్నారు. పరీక్ష సమయంలో కాఫీ, టీ, బ్రెడ్ వంటివి మంచివి కాదని వైద్యులు అంటున్నారు. పోహ, ఉ΄్మా, అవకాడో పనీర్ టోస్ట్, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు, మొలకెత్తిన గింజలు తినిపించడం మంచిదని అంటున్నారు. టిఫిన్లలో కిచిడీ, ఊతప్పం, ఇడ్లీసాంబార్ వంటివి మేలంటున్నారు. పిల్లలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆహారం పెట్టొద్దని, వారికి ఆకలి వేసినప్పుడు అడిగినంత మాత్రమే పెట్టాలంటున్నారు. -
తాజ్ను చూశారా? తాజ్ మహోత్సవ్ వెళ్లారా?
భారత పౌరులకు తాజ్ మహల్ అంటే కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు ఒక ఎవర్ గ్రీన్ ఎమోషన్. జీవితంలో ఒక్కసారైనా ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ని సందర్శించాలని వీలైతే తన సోల్మేట్తో కలిసి వెళ్లాలని ఆశించని వారు అరుదే. పర్యాటకాభిరుచి ఉన్నవారైతే తాజ్ని తమ జాబితాలో అగ్రస్థానంలో చేరుస్తారు. అయితే ఆగ్రాకు వెళ్లే సందర్శకులకు తాజ్ వీక్షణ మాత్రమే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అంతకు మించి అక్కడ దానికి అనుబంధ కార్యక్రమాలు ఏమీ ఉండవు. అయితే అలాంటి ఏకైక సందర్భం ఆగ్రాలో నిర్వహించే తాజ్ మహోత్సవం. తాజ్కు తోడయే మరో వైవిధ్యభరిత అనుభూతి ఇది అంటున్నారు మహోత్సవ్ నిర్వాహకులుచలికి ముగింపు ఉత్సవానికి ఊపు...ప్రతి సంవత్సరం, శీతాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నప్పుడు ఆగ్రా తన ఓ గొప్ప పండుగకు సిద్ధమవుతుంది. దాని పేరే తాజ్ మహోత్సవ్ ఆగ్రా నగర సందర్శకులు తప్పనిసరిగా గుర్తుంచుకోదగిన సందర్భం. గత కొంత కాలంగా దీనిని నిర్వహిస్తున్నప్పటికీ మరీ ఎక్కువగా ప్రచారానికి నోచుకోలేదు. సాంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి తాజ్ మహల్ తో పాటు ఇతర ప్రాంతాలకు సైతం పర్యాటకులను ఆకర్షించడానికి, తాజ్ మహోత్సవ్ పేరిట గత 1992లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉత్సవం ప్రణాళికాబద్ధమైన సాంస్కృతిక కార్యక్రమాలతో క్రమ క్రమంగా కళాకారులు తమ ప్రతిభా నైపుణ్యాలను సాధారణ ప్రజలకు ప్రదర్శించే పండుగగా స్థిరపడింది. ఈ ఏడాది తాజ్ మహోత్సవ్ ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు జరుగుతుంది. ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్. లోన ఉన్న విండ్హామ్ గార్డెన్ హోటల్లో దీనిని నిర్వహిస్తారు.ప్రవేశం ఇలా...ది తాజ్ మహోత్సవ్లో పాల్గొనేందుకు ప్రవేశ ధర రూ.50 కాగా, 3 సంవత్సరాల వయస్సు లోపు చిన్నారులకు ప్రవేశః ఉచితం. అంతేకాదు విదేశీ పర్యాటకులకు కూడా ప్రవేశం ఉచితమే. స్కూల్ యూనిఫాంలో ఉన్న 50 మంది విద్యార్థుల బృందానికి మొత్తంగా కలిపి ప్రవేశ రుసుము రూ.700, వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం అందిస్తున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద ఉంచిన వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.సాంస్కృతిక కార్యక్రమాలను ఇష్టపడితే ఈ కార్యక్రమం ఆగ్రా పర్యటనను గడపడానికి ఒక ఆహ్లాదకరమైన, సుసంపన్నమైన అనుభూతులను ఈ మహోత్సవ్ అందిస్తుంది. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులతో కూడిన హస్తకళా ఉత్పత్తులతు, స్థానిక ప్రాంతీయ వంటకాలతో పాటు పేరొందిన స్ట్రీట్ ఫుడ్తో కూడిన ఫుడ్ కోర్ట్ లు ఇక్కడ కొలువుదీరుతాయి. రోజంతా సంగీత నృత్య ప్రదర్శనలను సమర్పించే ప్రధాన వేదిక కూడా ఉంటుంది. -
సింకోప్.. పడి లేచే ప్రమాదం
ఫెయింట్ అయిపోవడం అనే మాట చాలామంది వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే స్వాధీనం తప్పిపోవడం. ఇది స్పహతప్పి అలాగే ఉండిపోవడం కాదు...కాసేపట్లో మళ్లీ మామూలైపోవడం. ఇలా స్వాధినం తప్పిపోయి... కొద్దిక్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడాన్ని వైద్యపరిభాషలో ‘సింకోప్’ అంటారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లీ మామూలైపోయినప్పటికీ ఇలా జరగడం కొన్నిసార్లు ప్రమాదాలకూ దారితీయవచ్చు. ఉదాహరణకు ఏ వాహనం నడుపుతున్నప్పుడో ఇలా జరిగితే అది పెను ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్యకు చాలా కారణాలుంటాయి. సింపుల్గా దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గిపోవడం (డీహైడ్రేషన్) మొదలుకొని వేగస్ నరం అతిగా స్పందించడం వరకు అనేక కారణాలతో వచ్చే ఈ ‘సింకోప్’ సమస్యపై అవగాహనతో పాటు దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం.కొందరు ఏదైనా తట్టుకోలేని దృశ్యం చూడగానే స్పృహ తప్పినట్లుగా అయిపోతారు. మరికొందరిలో వారి ఆందోళన స్థాయి మితిమీరిపోతే వెంటనే స్వాధీనం తప్పి పడిపోతారు. ఎందుకిలా అవుతుంది. ఎందుకంటే... గుండె స్పందనల లయ (రిథమ్)లో ఏమాత్రం తేడా రాకూడదు. స్పందన పెరిగినా, తగ్గినా అది ప్రమాదకరమే. గుండె స్పందనలు తగ్గడంతో... మన దేహంలో అత్యంత కీలక అవయవమైన మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు స్పృహ తప్పి పడిపోయే కండిషన్ను సింకోప్ అంటారు. ఇది సాధారణంగా చాలాసార్లు నిరపాయకరమే అయినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. సింకోప్ లక్షణాలు, నివారణ, చికిత్సలేమిటో చూద్దాం.సింకోప్లో రకాలున్యూరల్లీ మీడియేటెడ్ : బాగా తీవ్రమైన నొప్పి రావడం లేదా చాలా ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం, అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల. సింకోప్ కండిషన్ రావచ్చు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ : దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గడం వల్లగానీ లేదా ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల అకస్మాత్తుగా ఒక్కసారిగా రక్తపోటు (బ్లడ్ప్రెషర్) తగ్గిపోవడం వల్ల. కార్డియాక్ సింకోప్ : గుండె రిథమ్లో తేడా రావడం వల్ల (అరిథ్మియా అనే కండిషన్లో) గుండెవేగం పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు. సిచ్చువేషనల్ సింకోప్ : గట్టిగా దగ్గడం లేదా మింగడం లేదా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్వాధీనం తప్పిపోవడం.సింకోప్ కారణమయ్యే మెకానిజమ్ 1) మెదడుకు గుండెనుంచి తగినంత రక్తం అందకపోవడం / గుండె తగినంత రక్తాన్ని మెదడుకు అందించలేకపోవడం.2) గుండె పంపింగ్ సరిగా ఉన్నప్పటికీ మెదడుకు ఆ రక్తం అందడానికి అవసరమైన బ్లడ్ప్రెషర్ను మెయిన్టెయిన్ చేయడానికి సదరు రక్తనాళానికి తగినంత సామర్థ్యం లేకపోవడం.3) రక్తనాళానికి సామర్థ్యం ఉన్నప్పటికీ రక్తనాళంలో తగినంత రక్తం లేకపోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటిగానీ, లేదా ఒకటి కంటే ఎక్కువగా అంటే... ఏవైనా రెండు కారణాల వల్ల గానీ ఇలా జరగవచ్చు.ఎందుకిలా జరుగుతుందంటే... గుండె ఒక కండర నిర్మితమైన ఒక ఎలక్ట్రిక్ పంపు లాంటి అవయవం అన్న విషయం తెలిసిందే. ఎస్ఏ నోడ్ (సైనో ఏట్రియల్ నోడ్) అనే ఒక కీలకమైన చోటి నుంచి గుండె స్పందించడానికి అవసరమైన కరెంటు మన శరీరంలోనే నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ సరఫరాలో తేడాల వల్ల ఒక్కోసారి గుండె కండరాలు వేగంగానైనా కొట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా స్పందనలు తగ్గవచ్చు. కార్డియాక్ సింకోప్లో ఇలా జరుగుతుంది.వేగం పెరిగితే... కొన్ని సార్లు గుండె స్పందనల్లో వేగం బాగా పెరిగిపోయి ‘టాకికార్డియా’ అనే కండిషన్ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పై గదుల్లోగాని, కింది గదుల్లోగాని వేగం పెరుగుతుంది. అంటే గుండెలో పంప్ చేయడానికి అవసరమైన రక్తం చేరుకోకముందే గుండె ముడుచుకోవడం... అంటే గుండె స్పందన జరుగుతుందన్నమాట. దాంతో గుండె నుంచి కీలకమైన అవయవాలకు అందాల్సినంత రక్తం రక్తనాళాల్లోకి వెలువడదు. ఈ టాకికార్డియా అనే కండిషన్ ఏ వయసు వారికైనా రావచ్చు.వేగం తగ్గితే... గుండె స్పందనల్లో వేగం తగ్గితే ఆ కండిషన్ను బ్రాడికార్డియా అంటారు. బ్రాడి... అంటే నెమ్మదించడం (స్లో కావడం). ఇక ‘కార్డియా’ అంటే గుండె అని అర్థం. గుండె స్పందనల వేగం తగ్గడం వల్ల కూడా కీలకమైన అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది. మనుషుల్లో తమ వయసు పెరుగుతున్న కొద్దీ వారి గుండె స్పందనలకు అవసరమైన ఎలక్ట్రికల్ సరఫరాల్లో తేడాలు వస్తుండవచ్చు. లేదా కొందరిలో పుట్టుకతోనే గుండెలో బ్లాక్స్ ఉండవచ్చు. గుండెకు అవసరమైన ఎలక్ట్రిసిటీలో తేడాలు రావడం వల్ల వచ్చే సమస్య అన్నది గుండెలో బ్లాక్స్ ఉండటం వల్ల వచ్చే సమస్య కంటే వేరుగా ఉంటుంది.సింకోప్కు కారణాలుగుండె నిర్మాణపరమైనవి : కొన్నిసార్లు గుండెలో నిర్మాణపరంగా ఏవైనా తేడాలు ఉండటం వల్ల మెదడులాంటి కీలక అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు గుండె కండరాలు బలహీనంగా మారడంవల్లనో, లేదా కార్డియోమయోపతి అన్న కండిషన్లో సింకోప్ రావచ్చు.గుండె కవాటాల్లో మార్పులు : గుండె కవాటాలు రక్తాన్ని నిర్దిష్టంగా ఒకే దిశలో ప్రవహించేలా చూస్తుంటాయి. కొన్నిసార్లు గుండె కవాటాలు సన్నబడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. కొన్నిసార్లు అవి లీక్ కావచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇన్సఫిషియెన్సీ’ లేదా ‘రీ–గర్జిటేషన్’ అంటారు. ఈ కండిషన్స్లో దేనివల్లనైనా సింకోప్ రావచ్చు.మితిమీరిన వ్యాయామం : కొందరు వ్యక్తుల్లో... అంటే మరీ ముఖ్యంగా క్రీడాకారులు / అథ్లెట్లలో గుండె కండరాలు మందం కావడం వల్ల కూడా సింకోప్ రావచ్చు. అతి వ్యాయామంతో గుండెపై విపరీతమైన భారం పడేలా పనిచేయించడం వల్ల ఈ కండిషన్ ఏర్పడే అవకాశముంది.పోష్చురల్ హైపోటెన్షన్ : కొన్ని సందర్భాల్లో పక్క మీద పడుకున్న వ్యక్తి స్థిమితంగా కాకుండా హాడావుడిగా లేదా అకస్మాత్తుగా నిల్చునప్పుడు... అతడి కదలికలకు తగ్గట్లుగా గుండె తన స్పందనలను అంతే వేగంగా పెంచుకోలేదు. దాంతో వేగంగా జరిగే శరీర కదలికకు అనుగుణంగా గుండె స్పందనవేగం పెరగకపోవడంతో... కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా జరగడాన్ని పోష్చురల్ హైపోటెన్షన్’ అంటారు.వేసోవేగల్ సింకోప్ : నరాల పనితీరు వ్యవస్థలో మన సంకల్పం లేకుండా దానంతట అవే జరిగేపోయేవి, మన సంకల్పంతో జరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ‘సింకోప్’ కండిషన్ వస్తుంది. వేగస్ అనే నరం గుండె వేగాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అది ఒక్కోసారి గుండె వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇలా వేగస్ నరం వల్ల గుండె వేగం మందగిస్తే దాన్ని వేసోవేగల్ సింకోప్ అంటారు.తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ విపరీతమైన నొప్పి వేగస్ నరాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన / విపరీతమైన ఒత్తిడులు (సివియర్ స్ట్రెస్) కూడా వేగస్ నరాన్ని ప్రేరేపిస్తాయి. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కొందరు స్పృహ తప్పడానికి కారణం కూడా ఈ సింకోపే. కొందరు రక్తం చూసినప్పుడు లేదా కత్తులు– కటార్ల వంటి మారణాయుధాలు చూసినప్పుడు కూడా ఇలా స్పృహ తప్పడం దీనివల్లనే.పేగుల కదలికలు తగ్గడం : కొందరిలో జీర్ణక్రియలో జరుగుతుండే పేగుల కదలికలు (బవెల్ మూవ్మెంట్స్), విపరీతంగా తగ్గడం కూడా వేగస్ నరం మీద ఒత్తిడి కలిగింవచ్చు. అప్పుడు కూడా సింకోప్ కండిషన్ వస్తుంది.అకస్మాత్తుగా తల తిప్పడం వల్ల...కొందరు అకస్మాత్తుగా తలతిప్పడం వల్ల వేగస్ సరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే అది మళ్లీ సింకోప్ కండిషన్కు దారితీస్తుంది.రక్తహీనత.. అనీమియా అనే రక్తహీనత కండిషన్ కూడా సింకోప్కు కారణం. అనిమియా కండిషన్లో రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో కూడా సింకోప్ రావచ్చు. శరీరంలో నీరు / ద్రవాలు తగ్గడం : ఒక్కోసారి దేహంలో నీరు / ద్రవాలు తగ్గడం (డీ–హైడ్రేషన్) వల్ల కూడా సింకోప్ రావచ్చు. కొందరిలో చాలా ఎక్కువగా వాంతులు కావడం వల్లగానీ లేదా నీళ్ల విరేచనాల (డయేరియా) వల్ల గానీ లేదా విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో దేహంలో నీటి / ద్రవాల మోతాదులు తగ్గవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్న కొందరిలో వారు మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల కూడా వాళ్ల శరీరం డీ హైడ్రేషన్కు లోనుకావచ్చు. ఈ కండిషన్లు కొందరిలో సింకోప్కు దారితీసేందుకు అవకాశముంది. చికిత్ససింకోప్ అన్న కండిషన్ నిజానికి అంత సీరియస్ కాదు. కానీ ఇలా ఫెయింట్ కావడం తరచూ జరుగుతుంటే మాత్రం సింకోప్ను నిర్లక్ష్యం చేయడమన్నది ఏమాత్రం తగదు. ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యల (అండర్లైయింగ్ కాజెస్) వల్ల ఇలా జరుగుతుందేమో చూసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు జరపాలి. ఇందుకోసం తొలుత డాక్టర్ సలహా తీసుకుని, బాధితుడికి చికిత్స అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలతో (అండర్లైయింగ్ కాజెస్తో) ఇలా జరుగుతుంటే మాత్రం బాధితుడికి అవసరమైన చికిత్స అందించాలి. సింకోప్ అన్నది ఒకసారి స్వల్పంగా వచ్చి, దాని వల్ల ఎలాంటి గాయాలు జరగకపోతే ప్రైమరీ మెడికల్ కేర్ సెంటర్లో డాక్టర్లు కూడా సాధారణ చికిత్స అందించవచ్చు. అయితే సరిగ్గా నాడిగానీ, శ్వాసగానీ అందని పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి పరిగణించి వెంటనే పెద్ద హాస్పిటల్స్కు (టెరిషియరీ హెల్త్ కేర్ సెంటర్కు) తరలించాల్సి ఉంటుంది.గుండె స్పందనల లయ (రిథమ్)లో మార్పులు వచ్చిన వారికి, గుండె స్పందనల వేగం తగ్గిన వారిలో కొందరికి పేస్ మేకర్ అమర్చాల్సి రావచ్చు. ఈ పేస్మేకర్ అనేది గుండె స్పందనల వేగం తగ్గడాన్ని... అంటే ‘బ్రాడీకార్డియా’ను ముందుగానే పసిగట్టి... గుండె స్పందనల వేగం తగ్గిపోకుండా చూస్తుంది. ఇలా పేస్ మేకర్ అన్నది తగ్గిపోయే గుండె స్పందనలను మళ్లీ మామూలయ్యేలా (నార్మల్గా స్పందించేలా) చేసేందుకు వాడే ఒక ఉపకరణం. అలాగే టాకీకార్డియా కండిషన్లో ఒక షాక్ ద్వారా గుండె స్పందనలు మళ్లీ నార్మల్ అయ్యేలా చూడటం; అలాగే ఇది గుండెలో పైన, కింద ఉండే గదులు కదలికలు సమన్వయంతో జరిగేలా చూడటం; గుండెలోని ఎడమ, కుడి భాగాలు స్పందనల్లో సమన్వయం ఉండేలా చూడటం వంటి పనులనూ చేస్తుంది.చదవండి: గుండె జబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?ఈ పనులన్నింటినీ పేస్ మేకర్ సహాయంతో జరిగేలా చూసే/ చేసే చికిత్సను ‘కార్డియాక్ రీ–సింక్రనైజేషన్ థెరపీ’ (సీఆర్టీ) అని అంటారు. గుండె లయలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ మేకర్లలో కూడా తాత్కాలికంగా అమర్చేవి, శాశ్వతంగా అమర్చేవి అని రెండు రకాలుగా ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైనవారు (సాధారణంగా ‘బ్రాడీ–కార్డియా’ సమస్య ఉన్నవారు) దీన్ని వాడాల్సి ఉంటుంది. పేస్మేకర్ అమర్చాక పేషెంట్స్ తాము అంతకుమునుపు చేసే రోజువారీ పనులన్నింటినీ నార్మల్గానే చేసుకోవచ్చు.తక్షణం అందించాల్సిన సపర్యలు∙సింకోప్కు గురైన వ్యక్తిని కాస్తంత చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి సౌకర్యంగా పడుకోబెట్టాలి. లేదా అతడి తల రెండు మోకాళ్ల మధ్య ఉండేలా చూస్తూ రిలాక్స్డ్గా కూర్చోబెట్టాలి.∙అలా పడుకోబెట్టడం / కూర్చోబెట్టడం జరిగాక... అతడు స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కాస్తంత ఉప్పు కలిపిన ద్రవాన్నిగానీ లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ రక్తపోటు పడిపోవడం (హైపోటెన్షన్) వల్ల సింకోప్ ఏర్పడితే... ఇలా చేయడం వల్ల బాధితుడు మామూలుగా మారిపోతాడు.నివారణ : నిజానికి సింకోప్కు దారితీసే అసలు కారణాలను కనుగొంటే అందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవచ్చు. ఉదాహరణకు... వేసోవేగల్ నరం అతి స్పందన వల్ల ఈ సమస్య వస్తుంటే దానికి కారణాలు కనుగొని చికిత్స అందించడం వల్ల ఆ తర్వాత వచ్చే సింకోప్లను నివారించవచ్చు. అకస్మాత్తుగా లేవడం, అకస్మాత్తు కదలికల వల్ల వచ్చే పోష్చురల్ హైపోటెన్షన్ సింకోప్ను అకస్మాత్తు కదలికలు లేకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు పక్క మీద నుంచి లేచేప్పుడు మెల్లగా లేవడం, వెంటనే నిలబడకుండా కొద్ది సేపు కూర్చోవడం.. ఇలా కదలికలు క్రమంగా ఉండేలా చూసుకోవడంతో ఈ తరహా సింకోప్ రాకుండా చూసుకోవచ్చు. ఇది డీ హైడ్రేషన్ సమస్య వల్ల వస్తే తగినన్ని ద్రవాలు అందేలా చూసుకోవడం వల్ల కూడా సింకోప్ను నివారించవచ్చు.చివరగా...ప్రతినిత్యం తగినన్ని నీళ్లు తాగుతూ, అన్ని రకాల పోషకాలనూ తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నవారిలో సింకోప్ సమస్య చాలా అరుదు. అందుకే అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఉండటం అన్నది కేవలం సింకోప్ నివారణకు మాత్రమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటానికీ దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.నిర్వహణ: యాసీన్ -
65 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్న బామ్మ.. కారణం తెలిస్తే!
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడం అంటే..రెస్ట్ తీసుకునే వయసు అనే భావిస్తారు చాలామంది. ఆ వయసుకి అన్ని బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి..ఏదో ఒక కాలక్షేపంతో కాలన్ని గడిపేయడం అనుకుంటుంటారు చాలామంది పెద్దలు. కానీ ఈ మహిళ అందుకు విభిన్నం. పైగా స్వార్జితంలో ఉన్న ఆనందం, సంతృప్తి వేరు అని చెబుతోంది. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఒరిగేది ఏముండదని కొట్టిపారేస్తోంది. గ్రామీణ భారతదేశంలో వృద్ధ మహిళల ఆలోచనలకు, భావాలకు విరుద్ధంగా బతికి చూపించటమే కాదు..'సాధికారత'కు అసలైన అర్థం చెప్పింది ఈ బామ్మ. ఎవరామె అంటే..ఆ బామ్మే..మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల మంగళ ఆజీ. రెస్ట్ తీసుకునే వయసులో చీరకట్టులో డ్రైవింగ్ చేస్తోంది. చక్కగా ఆటో వేసుకుని రైడ్లకు వెళ్తోంది ఈ బామ్మ. ప్రయాణికులను గమ్యస్థానాల్లో దింపుతూ..ఆదాయం గడిస్తోంది. అది కూడా చక్కగా గ్రామీణ నేపథ్యానికి చెందిన మహిళ కట్టుతీరుతో ఏ మాత్రం భయపడకుండా మహారాష్ట్రలోని రద్దీగా ఉండే రోడ్లపై రెయ్..రెయ్..మని ఆటో నడిపిస్తుండటం విశేషం. నిజానికి ఆమె నిశబ్ద ధైర్యానికి చిహ్నంగా మారింది. ఈ వయసులో అంత అవసరం ఏంటీ అంటే..ఆమె చిన్నతనంలోనే వితంతువుగా మారి నలుగురి పిల్లలను ఒంటిరిగా పెంచి పెద్ద చేసింది. వారికి మంచి చదువులు చెప్పించి, తమ కాళ్లపై నిలబడే వరకు కూలి పనులు చేస్తుండేది. ప్రస్తుతం కొడుకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) డ్రైవర్గా పనిచేస్తుండగా, కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసింది. ఏళ్ల తరబడి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడింది. కానీ ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే..ఈ బామ్మ మంగళ ఏమంటుందో తెలిస్తే..విస్తుపోతారు. బామ్మకు షుగర్ కూడా ఉంది. అయినా సరే తన పిల్లలపై ఆర్థిక భారం పడటం ఇష్టం లేదని, తన సొంత వైద్య ఖర్చుల కోసం కష్టపడుతున్నట్లు తెలిపింది. ఇలా ఆటో డ్రైవర్గా ఎంతో కొంత ఆర్జించి.. తన ఖర్చులకు అలాగే తన కొడుకు కుటుంబానికి ఎంతో కొంత చేదోడువాదోడుగా ఉంటుందని చెబుతుంది.అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొంటే ఏం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోంది . ఎలా ఆటో నడపడం నేర్చుకుందంటే..కొడుకు మార్గదర్శకంలో కేవలం 15 రోజుల్లో ఆటోనడపడం నేర్చేసుకుందట ఆమె. తొమ్మిదేళ్లుగా ఆటో నడుపుతు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారామె. మహారాష్ట్రలోని కరాడ్-ఉండేల్ మార్గం గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతానని చెబుతోంది ఈ బామ్మ. తనకు డ్రైవింగ్ అస్సలు భయం కలిగించదని, పైగా ఇతర డ్రైవర్లు తనను చాలా అర్థం చేసుకుంటారని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు వాళ్లు ముందు ఆజీని వెళ్లనివ్వండి అని పక్కకు తొలిగి మరి దారిచ్చేస్తారని సంతోషంగా చెబుతోంది. అలాగే తన ఆటోడ్రైవర్ జర్నీలో సవాళ్లు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ వయసులో డ్రైవింగ్ చేయడం చూసి..రవాణ అధికారులు పూర్తిగా లైసెన్సింగ్ నిబంధనలను పాటిస్తేనే లైసెన్స్ మంజూరు చేస్తామని కరాఖండీగా చెప్పినట్లు తెలిపింది. తాను ఆ అధికారిక ప్రక్రియని పూర్తిచేసి మరి లైసెన్స్ పొందానంటోంది బామ్మ. సాధికారతే గౌరవం, ఆత్మగౌరవం అని మంగళ బామ్మ కథ చెబుతోంది. తరతరాల అంతరాన్ని చేధించి..వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో సైతం సామాజిక ప్రజా జీవితంలో చురుకుగా ఉండొచ్చని చెప్పింది. అనారోగ్యం అంటూ మూలన కూర్చోవడం కంటే..ఇలా ప్రజల్లో తిరిగితేనే ఇంకా ఉషారుగా ఆయురారోగ్యాలతో ఉండొచ్చని మంగళ బామ్మ కథ చెప్పకనే చెబుతోంది కదూ..! అంతేగాదు ఈ బామ్మ ధైర్యం..తన రైడ్ని బుక్చేసుకున్న ప్రయాణికులను ప్రేరేపించడమే గాక వారిలో స్థైర్యాన్ని నింపుతోంది కూడా. View this post on Instagram A post shared by Sonali H N (@shesays2324) (చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!
విదేశాల్లో చదవాలని..ఒక వ్యక్తి బంగారంలాంటి క్యాంపస్ ప్లేస్మెంట్ని కాలదన్నాడు. చివరికి అప్పులపాలై..ఎంత తక్కవ వేతనానికి పనిచేసేందుకైనా సై అంటున్నాడు.అలా కాకుండా జాబ్ చేస్తూనే లేకా కాస్త ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నాక..ఆ దిశగా అడుగులు వేసిన బాగుండేది. కానీ అత్యాసతో తీసుకున్న ఈ నిర్ణయం..అతడిని ఎంతటి దయనీయ స్థితిలోకి నెట్టేసిందో చూస్తే..విదేశీ మోజులో ఉండే యువతకు అడకి కథ ఓ గొప్ప కనువిప్పు అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్లో చేసిన పోస్ట్ పెను దుమారం రేపి వివిధ చర్చలకు దారితీసింది. ఆ పోస్ట్లో ఇలా ఉంది. "నా స్నేహితుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏడాదికి ఏడు లక్షలు వేతనమిచ్చే జాబ్ ఆఫర్ని కాలదన్నాడు. విదేశాల్లో ఎంఎస్ చేస్తే..అంతకుమించి సంపాదించాలనే అత్యాశతో వద్దనుకున్నాడు. చివరకి తను అనుకున్నట్లుగానే యూఎస్లో విజయవంతంగా ఎంఎస్ పూర్తిచేశాడు. కానీ రూ. 40 లక్షల అప్పుతో రోడ్డుపై నిలబడ్డాడు. దాంతో ఇప్పుడు కనీసం ఏడాదికి రూ. 3లక్షల వేతనమిచ్చే జాబ్లో అయినా చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూశారా..! దురాశ ఎంతటి పరిస్థితికి తీసుకొచ్చేస్తుందో తెలుసుకోండి..ఇది బంగారంలాంటి ఆఫర్లను, నిర్ణయాలను నాశనం చేసేస్తుంది తస్మాత్ జాగ్రత్త." అంటూ తన పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..చాలామంది నెటిజన్లు తమ స్నేహితులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఇబ్బందులు పడ్డారని, అమెరికాలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.One of my friends rejected a 7LPA campus job thinking it was not enough for him. He decided to go to the US for MS instead. Now he has a Masters, 40 LPA in debt and is ready to settle for even a 3 LPA job. Greed is the death of all good things my friends.— enji vi (@original_ngv) February 16, 2026 (చదవండి: బేబీ కేర్పై పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..) -
బేబీ కేర్పై పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..
బాలీవుడ్ నటుడు పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా అక్టోబర్ 19, 2025లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తతల్లి పరిణీతి తన బిడ్డపై కేరింగ్ విషయంలో ఎలా టెన్షన్ పడుతోందో షేర్ చేసుకుంది. అంతేగాదు తన కుమారుడి కోసం ఇంటిని తీర్చిదిద్దిన విధం గురించి కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది. పాతకాలం నాటి వైబ్స్తో మన సంప్రదాయ బేబీ కేరింగ్ విధానం గురించి హైలెట్ చేసింది.ప్రస్తుతం తాను తల్లిగా చాలా బిజీ అని, అతడి సంరక్షణతోనే తలమునకలవుతున్నట్లు పేర్కొంది. ఇది చాలా అలసట, బాధ్యతతో కూడినది, పైగా జీవితంలో అత్యంత సంతోషభరితమైన దశ కూడా అని అభిర్ణించింది. మనిషి ఉపయోగించే కలర్లను బట్టి అతడి మనస్తత్వం ఎలా చెప్పేయొచ్చో..అలాగే ఇక్కడ నటి పరిణీతి తన కొడుకు కోసం రూమ్ అలకరణకు ఏ రంగులకు ప్రాధాన్యత ఇచ్చిందో చూస్తే..ఆమె ఏంటనేది ఇట్టే అర్థమైపోతుంది. తన కొడుకు నీర్ కోసం అన్ని లైట్ కలర్స్, తెలుపు, గోధమ రంగులకే ప్రాధాన్యత ఇచ్చారామె. "బ్రిటిష్-శైలి" ప్యానెలింగ్తో తీర్చిదిద్దారు. తనది, రాఘవా టేస్ట్ దగ్గర దగ్గరగా ఒకటేనని, అందువల్ల అందుకనుగుణంగా ఆ గదిని ఈ విధంగా డిజైన్ చేశానని చెబుతోంది. అక్కడ గోడలన్నీ వింటేజ్ కార్ ఆర్ట్వర్క్తో ఆకర్షించగా, అక్కడ రాఘవ్ తండ్రి గిఫ్ట్గా చెక్క ఫ్లోరింగ్ వింటేజ్ కార్పెట్తో అనుబంధంగా ఉంది. ఇవేగాక క్లాసిక్ రంగుల తెల్లటి తొట్టి, బొమ్లలు, కస్టమ్ మేడ్ లేత గోధమ రంగు వార్డ్రోబ్లు తదితరాలు ఉన్నాయి. నిజానికి ఇది తన రీడిండ్ రూమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ గదిలోకి ఎవరు ప్రవేశించిన తమ ఇట్టే తమ సమస్యలన్నింటిని మరిచపోయేలా చేసే..అందమైన ప్రదేశం. ఇంత ప్రశాంతమైన ప్రదేశంగా మార్చినందుకు పరిణీతికి క్రెడిట్ ఇస్తూ..దీన్ని స్వర్గమపు అభయారణ్యంగా పిలిచారు రాఘవ చద్దా. కాగా, పరిణీతి, రాఘవ్లు మే 2023లో ఉదయపూర్లోని ది లీలా ప్యాలెస్లో అట్టహాసంగా పెళ్లిచేసుకున్నారు. వివాహం అయిన రెండేళ్లకు అక్టోబర్ 19, 2025న పండంటి మగబిడ్డ నీర్కు స్వాగతం పలికారు.(చదవండి: మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!) -
మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!
భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇలీవల బెంగళూరు పర్యటనకు వచ్చారు. ఈ నగరాన్ని చూసి..దాని ఉత్సాహభరితమైన చైతన్యానికి అబ్బురపడుతూ..సాటిలేని శక్తిగా అభివర్ణించారు. ఆ తర్వాత బెంగళూరు దక్షిణ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్యతో కలిసి స్థానిక వంటకాలను ఆస్వాదించారు. అందుకు సంబంధించిన ఫోటోలను గోర్ సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు. ఇక సూర్య కూడా తన ఎక్స్ ఖాతాలో ఆ మధుర క్షణాలను పంచుకుంటూ..భారతదేశంలో బెంగళూరు నగరానికి అమెరికా రాయబారి హెచ్. ఇ సెర్గియో గోర్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఇందిరానగర్లోని హోటల్లో కొన్ని మసాలా దోసెలు, చక్కటి స్ట్రాంగ్ కాఫీ సేవిస్తూ.. తాత్కాలికి వాణిజ్య ఒప్పందంపై సంభాషించినట్లు తెలిపారు.Just arrived in Bengaluru! From startups to street food, Bengaluru’s energy is unmatched! Thank you to my great host @Tejasvi_Surya pic.twitter.com/9PsRfvKeGI— Ambassador Sergio Gor (@USAmbIndia) February 16, 2026 ఆ సమావేశంలో భారత అమెరికా భాగస్వామ్యం, వాణిజ్యం, సాంకేతికత ఆవిష్కరణలపై చర్చించినట్లు కూడా ఎతిపారు. అలాగే గోర్కు నమ్మ ఆటో రైడ్ని పరిచయం చేసినట్లు పేర్కొన్నారు పోస్ట్లో. అలాగే ప్రత్యేక పోస్ట్లో సూర్య భారత అమెరికా సంబంధాలలో బెంగళూరు నగరం కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఈ నగరం మసాలా దోసం నుంచి వివిధ యంత్ర సామర్థ్యాలు పలు ఆవిష్కరణలను మిళితం చేయడమేగాక, రెండు ప్రజాస్వామ్య దేశాల ప్రజల మధ్య ఆర్థిక సంబంధాలను బోలపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఎందుకంటే..700కు పైగా అమెరికన్ కంపెనీల్లో భారతదేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 43% బెంగళూరు నుంచి వస్తున్నందున, మన నగరం US-భారత ఆర్థిక సంబంధాలకు కేంద్రంగా ఉంది. భారతదేశంలోని GCC(గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లలో 40%కి నిలయంగా ఉన్న బెంగళూరు, మన రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆవిష్కరణ ఆధారిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది, ”అని సూర్యా రాసుకొచ్చారు పోస్ట్లో. Delighted to welcome H.E. Sergio Gor, U.S. Ambassador to India, to Bengaluru today.Over some masala dosa & strong coffee at Filter Coffee, Indiranagar, we had an engaging conversation on the growing India US partnership, especially in trade, technology and innovation following… pic.twitter.com/we2jautGId— Tejasvi Surya (@Tejasvi_Surya) February 16, 2026కాగా, రాయబారి గోర్ వైట్హౌస్ అధ్యక్షుడిగా ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్గా పనిచేశారు. తన వృత్తిపరమైన కెరీర్ జర్నీలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ, అమెరికన్స్ ఫర్ లిమిటెడ్ గవర్నమెంట్ అండ్ కాపిట్ హిల్ తదితర విభాగాల్లో పనిచేశారు. ఇక విద్యానేపథ్థ్యం వచ్చేటప్పటికీ..జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన గోర్ 2008లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.(చదవండి: టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!) -
టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!
పది కూడా పాసవ్వని వ్యక్తి పాఠాలు బోధించడం ఏంటని అనిపిస్తుంది కదూ. కానీ ఈ వ్యక్తి చెబుతున్న తీరు చూస్తే..ఆశ్చర్యంకలగక మానదు. ఆర్థిక పరిస్థితులు తనను ఆపేయొచ్చేమో కానీ..తనలోని ఆసక్తి, ప్రతిభని ఆపలేవని, అవి ఏదో రకంగా బయటకు ఉప్పొంగుతాయని చూపించాడు. చుట్టూ ఉన్నవాళ్లు పది పాస్సవ్వలేదని ఎగతాళి చేసినా..తగ్గలేదు, ఆగిపోలేదు. ఇవాళ ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు పాఠాలు చెబుతుండటం విశేషం.అతడే బీహార్కు చెందిన కూరగాయల విక్రేత రోహిత్ కుమార్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. అయితే అతడు కళాకారుడుగా ఉండాలనేది ఆకాంక్ష..అయితే ఆర్థిక ఇబ్బందులు ఆ కలను దూరం చేశాయి. అతడి తల్లి ఆవు పిడకలు అమ్ముతూ..ఇంటిని నడిపించేది. ఇక రోహిత్ ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్మేవాడు. అలా చేస్తున్నప్పుడూ సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని సంకల్పించి నలుగురు విద్యార్థులతో ఓ చిన్న తరగతి గదిని ప్రారంభించాడు. ఆ గది ఇప్పుడు ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు నడుస్తోంది. ప్రస్తుతం అతడి వద్ద వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ. 125లు వసూలు చేస్తున్నాడు. అతడు పది కూడా పాసవ్వకుండా ఇలా ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నందకు అంతా ఎగతాళి చూస్తున్నా..కుమార్ మాత్రం దృఢ నిశ్చయంతో..సాధారణ సైన్స్ పాఠాలతో ఆ చిన్నారులను ఆకట్టుకున్నాడు, వారి మనసులను గెలుచుకున్నాడు. అయితే దీన్నంతటిని రికార్డు చేసి అతడి విద్యార్థులు ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన జోహో మాజీ సీఈవో శ్రీధర్ వెంబు ఇలా రాశారు పోస్ట్లో. దీన్ని చూస్తుంటే..భారత్ పట్ల గర్వం ఆశావాదం కనిపిస్తోంది. బీహార్లోని సామాన్య నేపథ్యాల నుండి వచ్చిన ఈ పిల్లలందరూ, గణితం, సైన్స్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మన దేశ భవిష్యత్తును నిర్వచిస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా అతని ప్రయత్నానికి మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాం అని రాశారు. నెటిజన్లు కూడా రోహిత్ కుమార్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ప్రతిభ ప్రతిచోటా ఉంటుందని, కానీ అవకాశం దాన్ని చేరుకోవడమే అత్యంత కీలకం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు మార్కులు ఎప్పటికీ మన విజయాన్ని నిర్ణయించలేవు అని పోస్టలు పెట్టారు. He once struggled to pass Class 10. Today, 1,000 students climb to his rooftop classroom at 5 a.m. 💛 From charging ₹125 and teaching four children to building a movement that challenges rote learning, Rohit Kumar turned doubt into determination. His mother once sold cow dung… pic.twitter.com/HCHPbzzjOn— Comman Man (@CommanMan777589) February 14, 2026 (చదవండి: కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..) -
కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..
కెపాప్ అనగానే దక్షిణకొరియాలోని సియోల్కి చెందిన మ్యూజిక్ బ్యాండ్. కానీ ఆ దేశం నుంచి వచ్చి మన మహాశివుడికి సంబంధించిన పాటను అద్భుతంగా ఆలాపించి ఆశ్చర్యపరిచాడు. ఓ విదేశీయుడు మన దేశ సంస్కృతిలో భాగం కావడం ఇది కొత్తకాదు గానీ..అందులోనూ పాప్ గాయకులాంటి విదేశీయులు నోట మన దేవుళ్ల పాటలు పలకడం విశేషమే. ఎవరతను..? మన భాషలు ఎలా నేర్చుకున్నాడంటే..అతడే ఔరా అనే పాప్ గాయకుడు. మన భారతదేశాన్ని ఎంతో ఇష్టపడే వ్యక్తి, హిందీ కూడా నేర్చుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం భారత్కి వచ్చి బిగ్బాస్ 17లో కనిపించి సందడి చేశాడు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ..ఎక్కడికి వెళ్లిన అభిమానులను సంపాదించుకుంటూ..అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా చెన్నైలోని శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశాడు. View this post on Instagram A post shared by AOORA (아우라) (@aoora69) ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే..అచ్చం భారతీయ వేషధారణలో ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేశాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..చెన్నైలో ఎప్పటికీ మర్చిపోలేని వరం పొందాను అంటూ భావోద్వేగం చెందాడు. అక్కడ ఎందరో వ్యక్తులు 'శివాయ నమః' అని జపిస్తూ ఉండటం చూశానని, తాను ఈ దేశంలో పుట్టకపోయినా.. ఈ సంస్కృతిని ప్రేమించాలని న ఈ క్షణం తనకు ఎంతో భావోద్వేగంగా అనిపించింది అని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు మహాశివరాత్రి రోజున సాక్షాత్తు ఆ శివుడే తనకు "ఓం నమః శివాయ" అని మార్గదర్శకత్వం చేస్తున్నాడేమో అని పేర్కొన్నాడు పోస్ట్లో. కాగా ఇటీవలే ఫిబ్రవరి 10, 2026న శివ శివం అను పాటను కూడా విడుదల చేశాడు. గాయకుడు ఔరాకి ఈ భారత పర్యటన మూడోసారి. తొలిసారి ఢిల్లీ వచ్చానని, అక్కడ నుంచి ముంబై వంటి ఇతర ప్రదేశాలకు వెళ్లి..ఎంతో అనుభవాన్ని గడించడమే గాక ఎందరో ప్రేమను పొందానని కూడా పేర్కొన్నాడు పోస్ట్లో. View this post on Instagram A post shared by AOORA (아우라) (@aoora69) అందుకు సదా ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞుడనని అన్నాడు. అంతేగాదు తన శివ శివం పాటతో ఇక్కడ కళాకారులతో పనిచేసే అవకాశం పొందానని, ఇలా తన జర్నీలో భాగమైన వారికి ఈ పాట అంకితం అని పేర్కొన్నాడు కూడా. నిజానికి ఇది చాలా గ్రేట్ కదా ఓ విదేశీయుడు మన భాష, సంస్కృతిలో ఇంతలా మమేకమైపోయిన విధం చూస్తే..చాలాఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!.(చదవండి: -
పెరుగుతున్న.. పెళ్లికాని ప్రసాద్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా: కాలం మారుతోంది. కన్యాశుల్కం మళ్లీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ బ్యూరోల వద్ద పెళ్లి కాని ప్రసాద్ల జాబితా పెరిగిపోతోంది. కొడుకే పుట్టాలని కనిపించిన దేవుళ్లందరినీ కోరుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు వారి కుమారులకు పెళ్లి చేసేందుకు గుర్తుకొచ్చిన దేవుళ్లను మొక్కుతున్నారు. పురుషుల సంఖ్యకు తగ్గట్టు అమ్మాయిల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు కారణం. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూసిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు లేరు. అబ్బాయిలు రాజీ పడినా.. చదువుకున్న అమ్మాయిలు నో అంటున్నారు. మారిన రోజులు ఒకప్పుడు పెళ్లిచూపుల్లో రకరకాల యక్షప్రశ్నలు వేసి అమ్మాయి సహనాన్ని అబ్బాయిలు పరీక్షించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. అమ్మాయి, ఆమె కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారు అధిక శాతం అబ్బాయి తరపు తల్లిదండ్రులు. లింగ వివక్షతో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, వారిలో చాలా మంది విద్యావంతులు కావడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చదివేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి విద్య కోర్సులు చదువుతున్నారు. ఇందుకు అనుగుణంగా కళాశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగాయి. బాలికల తల్లిదండ్రులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యూకేజీ నుంచి డిగ్రీ వరకు రూ.వేల నుంచి రూ.లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అమ్మాయిలే విద్య, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేకించి కళాశాలలు వెలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అమ్మాయికి తగ్గ అబ్బాయిలు ఎక్కడ? ఉన్నత చదువులు చదివిన వారు, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అమ్మాయిలు సాదాసీదాగా డిగ్రీ, ఇంటర్ చదివిన అబ్బాయిలను ఇష్టపడడం లేదు. అబ్బాయి ఎంతగా ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఈ మేరకు వారి డిమాండ్లను మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల ముందు ఉంచుతున్నారు. మరోవైపు అబ్బాయిలకు చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించక పోవడంతో పలువురు వ్యాపారాల వైపు, వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల కోరికలకు తగ్గట్టు అబ్బాయిలు లభించడం లేదని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు వి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఇంజినీర్, వైద్యులు కావాలని అమ్మాయిలు అడుగుతున్నారు. ఒక్కడే కుమారుడై ఉండాలని, అత్తమామలు లేకుంటే మరీ మేలని అనే వారూ ఉంటున్నారని మరో మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు నాగేశ్వరరావు తెలిపారు. దీంతో అబ్బాయిల కోర్కెలు తగ్గిపోయాయి. చాలా మంది పిల్లనిస్తే చాలనే ధోరణిలో ఉన్నారు. ఆ లెక్కలు చూస్తే..2011 లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 51,54,296 మంది జనాభా ఉంటే, ఇందులో పురుషులు 25,69,688, మహిళలు 25,84,608 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి లెక్క వేస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు గాను 1,006 మంది మహిళలున్నారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారన్నమాట. అయితే, గత ఆరేళ్ల లోపు శిశు లింగ నిష్పత్తిని పరిశీలిస్తే, ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 968 మంది మాత్రమే ఆడబిడ్డలు ఉన్నారు. దీనిని బట్టి చూస్తే పురుషుల అధికమవుతోంది. 2001లో 7.93 శాతం జనాభా వృద్ధి రేటు ఉంటే, 2011లో జనాభా వృద్ధి రేటు 5.16 శాతంగా ఉంది. 2027 జనాభా లెక్కల అనంతరం ప్రస్తుత పరిస్థితి తెలుస్తుంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 74.51 శాతం జనాభా ఉంటే, పట్టణ ప్రాంతంలో 25.49 శాతం మంది ఉన్నారు. పెరిగిన వివాహ వయసు ఒకప్పుడు అమ్మాయికి 16 వచ్చీ రాగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు 25 సంవత్సరాల వరకూ వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. అమ్మాయికి తగ్గ అబ్బాయి లభించడం లేదన్న కారణాన్ని కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. అబ్బాయిలు సైతం ఒకప్పుడు 20 ఏళ్లు వచ్చేలోపు పెళ్లి చేసుకునేవారు. కానీ వారు కూడా ఇప్పుడు 30 ఏళ్ల దాకా పెళ్లి మాట ఎత్తవద్దంటున్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే చిన్న వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాల్లో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే తేడా.. తమను కని, పెంచి పెద్ద చేసేది స్త్రీ. తల్లిగా, చెల్లిగా, అక్కగా ఉండవచ్చు కానీ కూతురుగా వస్తే మాత్రం చాలా మంది ఒప్పుకోవడం లేదు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఆడపిల్లను కంటే చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే అబ్బాయిల, అమ్మాయిల నిష్పత్తిలో తేడా వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో తల్లిదండ్రుల ఆలోచనా సరళిలో మార్పు కని్పస్తోంది. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఓకే అనే పరిస్థితికి వస్తున్నారు. ఇది కొంత వరకు ఆశించదగ్గ పరిణామంగా చెప్పవచ్చు. మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం లేటు వయసులో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. యువత ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండడం మరో కారణం. పెళ్లిళ్లకు అధిక సమయం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతోంది. వ్యవస్థలో వచ్చిన మార్పు స్పష్టంగా కని్పస్తోంది. –విలపర్తి ఫణిధర్శర్మ, పురోహితుడు, రాయవరం 30 ఏళ్లు పైబడిన వారే అధికం మా దగ్గరకు జాతకాలు, ముహూర్తాల కోసం అధిక సంఖ్యాకులు 30 ఏళ్లు పైబడిన వారే వస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదనే బాధను వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాను. –కోట వీరవెంకట సత్యనారాయణమూర్తి, అర్చకుడు, పాదగయ క్షేత్రం, పురుహూతికా శక్తి పీఠం, పిఠాపురం -
భూమిపై తొలి ‘శాకాహారి’.. షాకిస్తున్న సంచలనాలు!
మనం తినే ఆహారం, మన జీవనశైలి.. ఇవన్నీ మనం అలవరచుకున్న అలవాట్లు అనుకుంటే పొరపాటే.. సుమారు 30 కోట్ల ఏళ్ల క్రితమే భూమిపై ఒక వింత జీవి తన ‘శాకాహార’ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. కేవలం మొక్కలను, ఆకులను మాత్రమే నమిలి తింటూ బతికిన ‘టైరన్నోరోటర్’ చరిత్ర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కెనడాలో దొరికిన ఒక చిన్న పుర్రె.. కోట్లాది ఏళ్ల నాటి జీవ పరిణామ క్రమ రహస్యాలను ఎలా బయటపెట్టిందో తెలుసుకుందాం..జీవ పరిణామ క్రమంలో సరికొత్త అధ్యాయంకెనడాలోని నోవా స్కోటియా ప్రావిన్స్లో శాస్త్రవేత్తలు 30.7 కోట్ల ఏళ్ల నాటి ఒక అరుదైన పురాతన జీవి పుర్రెను కనుగొన్నారు. ఈ జీవిని భూమిపై నివసించిన అత్యంత పురాతన శాకాహార జంతువులలో ఒకటిగా పరిశోధకులు గుర్తించారు. ఈ ఆవిష్కరణ జీవ పరిణామ క్రమంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. టైరన్నోరోటర్లు మాంసాహారులుగానే ఉండేవని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. టైరన్నోరోటర్ హెబెర్టీ (Tyrannoroter heberti)గా పిలిచే ఈ జంతువులు మిలియన్ల ఏళ్ల ముందే మొక్కలను తినడం ప్రారంభించాయని స్పష్టమైంది.భూమిపై శాకాహార జీవుల ఆధిపత్యంపర్యావరణ వ్యవస్థపై ప్రచురితమైన ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే మొక్కలను ఆహారంగా తీసుకునేందుకు వీలుగా శరీర నిర్మాణాన్ని మార్చుకున్న వెన్నెముక కలిగిన భూచర జీవిగా ‘టైరన్నోరోటర్’ గుర్తింపు పొందింది. షికాగోలోని ఫీల్డ్ మ్యూజియంకు చెందిన పాలియోంటాలజిస్ట్ అర్జన్ మాన్ అభిప్రాయం ప్రకారం.. ఈ ఆవిష్కరణ భూమిపై శాకాహార జీవుల ఆధిపత్యం ఎంత పురాతనమైనదో తెలియజేస్తుంది. నేటి ఆధునిక పర్యావరణ వ్యవస్థకు పునాదులు కోట్లాది ఏళ్ల క్రితమే పడ్డాయని ఈ శిలాజం నిరూపిస్తోంది.ప్రత్యేకమైన ముక్కుతో..ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్శిటీకి చెందిన హిల్లరీ మాడిన్ వివరణ ప్రకారం ఈ జీవి సుమారు ఒక ఫుట్బాల్ పరిమాణంలో ఉండేది. దీని శరీర నిర్మాణం చాలా విచిత్రంగా, పటిష్టంగా ఉండటమే కాకుండా, భూమిపై నివసించడానికి అనువైన లక్షణాలను కలిగి ఉండేది.మొక్కలను కోయడానికి ప్రత్యేకమైన ముక్కు ఉండటం దీని ప్రత్యేకత. ఈ విలక్షణమైన ఆకారం వల్ల నేలపై ఉండే చిన్న చిన్న మొక్కలను సులభంగా కోయడానికి దానికి వీలయ్యేది. ఆహార సేకరణలో ఇతర జీవుల కంటే ఇది భిన్నమైన నైపుణ్యాన్ని ప్రదర్శించేదని పరిశోధకులు భావిస్తున్నారు.‘డెంటల్ బ్యాటరీస్’ మరో స్పెషల్ఈ జీవి నోటిలో పైభాగం, కింది దవడలలో దంతాలు ఒకదానికొకటి సరిగ్గా సరిపోయేలా అమరి ఉన్నాయి. ‘డెంటల్ బ్యాటరీస్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన అమరిక, ఇది కచ్చితంగా మొక్కలను నమిలి తినే శాకాహారి అని ధృవీకరిస్తోంది. మొక్కలను అరిగించుకోవడానికి అవసరమైన శక్తివంతమైన కండరాలను కూడా ఇది కలిగి ఉండేది. ‘టైరన్నోరోటర్’ శిలాజానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధ్యయనం చేసేందుకు పరిశోధకులు 3D స్కానింగ్, ప్రింటింగ్ సాంకేతికతను వినియోగించారు. దాని ప్రతిరూపాలను తదుపరి పరిశోధనల కోసం అందుబాటులోకి తెచ్చారు.ఇది కూడా చదవండి: భూమిపైకి ఏలియన్స్.. ఒబామా వ్యాఖ్యల కలకలం! -
స్వప్నలిపి
‘పగటి కలలు కనకు’ అంటారేగానీ ‘రాత్రి కలలు కనకు’ అనరు. జలుబు చేసినప్పుడు తుమ్మినంత సహజంగా రాత్రి నిద్రలో మనకు కలలు వస్తాయి. ఆ కలలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు...4-7: దాదాపు ప్రతి ఒక్కరికి సగటున నాలుగు నుంచి ఏడు వరకు కలలు వస్తాయి.5-20: ప్రతి కల అయిదు నుంచి ఇరవై నిమిషాల మధ్య ఉంటుంది. ఎక్కువ కలలు రాత్రి ఆలస్యంగా వస్తాయి.2: రాత్రి సుమారు రెండు గంటలు స్వ΄్నావస్థలోనే గడుపుతాము.95 శాతం: 95 శాతం కలలు ఎక్కువ కాలం గుర్తుండవు.0.9-6.8 శాతం: తరచుగా వచ్చే పీడకలలు (కనీసం వారానికి ఒకసారి) 0.9 శాతం నుంచి 6.8 శాతం వరకు ప్రభావితం చేస్తాయి.50 శాతం : ఒక అధ్యయనంలో 50 శాతం మంది తాము కలర్ఫుల్ కలలు కన్నామని చెప్పారు.12 శాతం: ఒక అధ్యయనం ప్రకారం పన్నెండు శాతం మంది తాము నలుపు, తెలుపు రంగులలో మాత్రమే కలలు కంటామని చెప్పారు.25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు తమకు నలుపు, తెలుపు కలలు అరుదుగా వస్తాయని చెప్పారు.కలలలో లింగ భేదాలు!→ కలల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య ఉండే తేడాను పరిశోధకులు కనుగొన్నారు. పురుషులు ఎక్కువగా ఆయుధాల గురించి కలలు కంటారని, మహిళల కలలు సున్నితంగా ఉంటే పురుషుల కలలు దూకుడుగా ఉంటాయని చెబుతున్నారు.→ పురుషులతో పోల్చితే స్త్రీలకు ఎక్కువగా పీడకలలు వస్తాయట!→ అధ్యయనాలు వివిధ రకాల కలల గురించి చెప్పాయి. అందులో ఒకటి... కలలు అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఉంటాయి.→ కలలకు సంబంధించి స్లీప్ ఎక్స్పర్ట్ల మధ్య భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ‘జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడంలో కలలు ఉపకరిస్తాయి’ అనేవారు ఉన్నారు.‘కలలకు అర్థం, పరమార్థంలాంటివేమీ లేవు. కల అంటే ఇన్సిడెంటల్ బ్రెయిన్ యాక్టివిటీ, నిద్రకు సంబంధించి బై– ప్రాడక్ట్’ అనే వారూ ఉన్నారు. -
డాక్టర్ ఏఐతో తస్మాత్ జాగ్రత్త!
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో తమంతట తామే పనిచేసే (ఆటోమేటెడ్ గైడెన్స్) డిజిటల్ యాప్లతో పెను ప్రమాదాలే వచ్చి పడుతున్నాయంటూ చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో అవి చేసే సిఫార్సులు ఒక్కోసారి పెద్దపెద్ద ముప్పులు తెచ్చిపెడుతున్నాయంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ హెచ్చరిస్తోంది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కాలూనని రంగమంటూ ఏదీ లేదు. చట్టాలూ, సాఫ్ట్వేర్, విద్యా, వినోదంతో పాటు ఆఖరికి లక్షలాది మెడికల్ కేసుల అనుభవంతో వైద్య విద్య, చికిత్సల్లో కూడా అది పాలుపంచుకుంటోంది. ఇక చైనాలాంటి దేశాలైతే ఏఐతో నడిచే క్లినిక్లూ, హాస్పిటళ్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. మిగతా రంగాలెలా ఉన్నప్పటికీ... వైద్యరంగంలో మాత్రం ఏఐతో కొన్ని తప్పులూ, పొరబాట్లు జరుగుతున్నాయనీ, ఇవి ఆందోళన గొలిపేలా ఉన్నాయంటూ డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న నిపుణులు బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ పేషెంట్లు తమంతట తామే ఏఐకు తమ సమస్య చెప్పుకుని ఆ మేరకు వైద్య సలహా పొందితే అది ఆందోళనకరంగా పరిణమించేందుకు అవకాశాలు లేకపోలేదంటూ హెచ్చరిస్తున్నారు. టర్కీ (తుర్కియా) రాజధాని అంకారాలోని ఒక హాస్పిటల్కు వచ్చిన ఒక పేషెంట్ తాలూకు కేస్స్టడీతో ఒక సంఘటన వెలుగుచూసింది. అదేమిటంటే... ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ సెమ్ అక్సోయ్ అనే డాక్టర్ దగ్గరికి కౌమార వయస్సులో ఉన్న ఓ పద్ధెనిమిదేళ్ల పిల్లాడు వచ్చాడు. అతడికి కాలిలో క్యాన్సర్ గడ్డ ఉందని నిర్ధారణ అయ్యాక తన కేసు వివరాలను ‘ఏఐ’కి సంబంధించిన చాట్ జీపీటీకి తెలిపి తనకు సలహా ఇవ్వాలంటూ కోరాడు. అంతే... ‘‘నువ్వు ఐదేళ్లకు మించి బతకవు’’ అంటూ ఏఐ సమాధానమిచ్చింది. ఈ సమాచారం ఆ కుర్రాడిని ఎంతగా ఆందోళనపరిచి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. కానీ ఓ సర్జికల్ ఆంకాలజిస్టూ, ఓ ΄్లాస్టిక్ సర్జన్ నిర్వహించిన సర్జరీల తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు. అంతేకాదు... ‘‘ఇప్పుడు నీలోంచి క్యాన్సర్ తొలగిపోయినట్టే’’ అంటూ భరోసా కూడా ఇచ్చారు. అయితే మళ్లీ అదే అబ్బాయి కొన్ని వారాల తర్వాత డాక్టర్ అక్సోయ్కు మరోసారి ఫోన్ చేశాడు. ఈసారి వచ్చిన ఫోన్ సందేశంలోని సందేహమేమిటంటే... ‘‘నాకు తరచూ దగ్గు వస్తోంది. అంటే మొన్నటి క్యాన్సర్ ఇప్పుడు ఊపిరితిత్తులకు సోకిందంటారా?’’ అని అతడు ప్రశ్నించాడు. అయితే డాక్టర్లు అతడి ఊపిరితిత్తులను పూర్తిగా పరీక్షించాక తేలిందేమిటంటే అతడికి క్యాన్సర్ ఏమాత్రం లేదు. అయితే... ఆ పిల్లాడు ఈమధ్య సిగరెట్లు తాగడం మొదలుపెట్టడమే అతడి దగ్గుకు కారణమని తేలింది. ‘‘ఏదైనా వ్యాధి నిర్ధారణ చేయాలంటూ కేవలం లక్షణాలను మాత్రమే చూడకూడదు. అతడికి ఆ లక్షణాలు కనిపిస్తున్న సందర్భాలనూ పరిశీలించాలి. ఆ యువకుడు ఇటీవల పొగతాగడం మొదలుపెట్టినందువల్ల దగ్గు వచ్చిందని తేలింది. వైద్యవిజ్ఞాన సమారమంతా ఓ దట్టమైన అడవి అయితే... ఇలా అరకొర పరిజ్ఞానంతో అందులో తిరగడమన్నది దారీతెన్నూ తెలియకుండా అందులో తప్పిపోవడం లాంటిదం’’టూ డాక్టర్ అక్సోయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘ఏఐ’ సంస్థలకు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ఇలాంటి అనుభవాల తర్వాత... ఏఐ అడగాల్సిన ప్రశ్నలను నమోదు చేస్తూ కృత్రిమ మేధ మరింత సమర్థంగా, పరిపుష్టంగా పనిచేసేలా మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. అయితే కృత్రిమ మేధ ఎప్పటికీ ఓ డాక్టర్ / మెడికల్ ప్రొఫెషనల్కు మంచి ప్రత్యామ్నాయం కాబోదంటూ ఆయన తెలిపారు. ఇక్కడ ఈ టర్కిష్ అబ్బాయి ఉదంతం రెండు అంశాలను సూచిస్తోంది. మొదటిది... ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు... తాము హాస్పిటళ్ల వరకూ వెళ్లాల్సిన శ్రమ తప్పడం కోసం అలాగే తమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెక్నాలజీ ఆధారిత సలహాల మీద ఎలా ఆధారపడుతున్నారనే అంశం. ఇక రెండోది... ఏఐ ఆధారిత చాట్బాట్లు తమకున్న పరిజ్ఞానంతో సమాజాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో తెలపడం కోసం ఈ టర్కీ అబ్బాయి ఉదంతమే ఒక తార్కాణం.మేర దాటుతున్న మేధ... ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొన్ని మెడికల్ యాప్స్ తమ నైతిక పరిధులను దాటుతున్నాయి. ఉదాహరణకు ‘యురేకా హెల్త్’ అనే ఓ యాప్ తనను తాను ‘‘ఆల్ ఇన్ వన్ హెల్త్ కంపేనియన్’గా ప్రకటించుకుంది. అంటే... ఆరోగ్యం విషయంలో అన్ని వ్యాధుల నిపుణుడూ తానే అయిపోయి ఆరోగ్య సమాచారాన్ని తెలుపుతానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఆపిల్ యాప్ స్టోర్ మాత్రం కొంత సంయమనం పాటిస్తూ... ‘‘ఇది కేవలం తగిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే. తాను వ్యాధి నిర్ధారణగానీ లేదా చికిత్సగానీ చేయడానికి తగనం’’టూ’’ స్పష్టం చేస్తోంది. కానీ దాన్ని అభివృద్ధి చేసిన సంస్థవాళ్లు మాత్రం ‘మీకు మీరే మీ డాక్టర్’ అంటూ ప్రచారాలు చేసేస్తున్నారు. అలాగే ‘‘ఆస్క్, డయాగ్నోజ్, ట్రీట్’’ అనే మరో సైట్ వాళ్లు మరికాస్త ముందుకెళ్లి ‘‘మా ఐఏ వ్యాధి నిర్ధారణా చేసేస్తుంది. వాడాల్సిన మందుల్ని సూచిస్తూ ప్రిస్క్రిప్షన్ కూడా రాసేస్తుంది. ఈ ప్రపంచంలోని హాస్పి టల్స్లో వాస్తవంగా మీకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో దాన్ని ఇక్కడే మీకు సూచిస్తుంది’’ అంటూ గొప్పలకు పోతున్నారు. అయితే... రాయిటర్స్ సంస్థలో వచ్చిన వార్తల వల్ల... ‘‘యురేకా హెల్త్’’ యాప్ కారణంగా జరిగిన అనర్థాలను తెలుసుకున్న తర్వాత ‘ఆపిల్’ సంస్థ సదరు యాప్ను తమ స్టోర్నుంచి తొలగించింది. అంతే కాదు... ఏ సమాచారం ఆధారంగా; ఏ పద్ధతుల ద్వారా; ఏయే అంశాల సహాయంతో వ్యాధి నిర్ధారణ విషయంలో ఆ నిర్ధారణకు వస్తున్నారో స్పష్టంగా తెలపాలంటూ యాప్ను అభివృద్ధి చేసే నిపుణులకు స్పష్టమైన సూచనలు చేసింది.మెడికల్ యాప్స్!ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో గూగుల్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే మెడికల్ యాప్ల సంఖ్య బాగా పెరిగింది. నిజానికి అవి ఎలాంటి వ్యాధి నిర్ధారణా చేయకూడదు. అయినప్పటికీ వాటిని ఆశ్రయించి... తమ సమస్య ఏమిటో తెలుసుకోవడమన్నది చాలా ఎక్కువైంది. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. నిజానికి ఏఐ ఎలాంటి వ్యాధినిర్ధారణా (డయాగ్నోజ్) చేయకూడదు. కానీ యూఎస్ ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ నియమాల ప్రకారం... ప్రజల ప్రాథమిక అవగాహన కోసమే సమాచారం తెలిపే సందర్భాల్లో ఆ చాట్బాట్లు ఎవరి అనుమతులూ తీసుకోనక్కర్లేదు. అందుకోసమే ‘‘తాము డాక్టర్కు ప్రత్యామ్నాయం కానేకాదనీ,వ్యాధిని నిర్ణయించడంలో విషయంలో తాము చేసేది ‘తుది నిర్ధారణ’ కాదం’’టూ స్పష్టంగా సూచన (డిస్కె›్లయిమర్) చేస్తుంటాయి. – యాసీన్ -
మద్యపానం తగ్గించాలా? ఓ చిట్కా పాటించండి..
మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని వివరిస్తూ హెచ్చరించడం ఓ రకమైతే, అందుకు భిన్నంగా ఓ చిట్కా ద్వారా కూడా మద్యపాన పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. ది అడిక్టివ్ బిహేవియర్స్ వేదికగా ఈ ఆసక్తికర అధ్యయనం ప్రచురితమైంది.దాదాపు 8,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొనగా వారిని వేర్వేరు గ్రూపులుగా విభజించి, మద్యపానం గురించిన వివిధ ప్రకటనలను, సందేశాలను చూపించారు. అలాగే ‘మద్యపానం అనేది క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుందనే అవగాహన కలిగించడంతో పాటు మద్యం వల్ల కలిగే పలు నష్టాలను విశదీకరించారు. మద్యం అతిగా సేవించడం వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు. గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చిత్తవైకల్యం (డిమెన్షియా) లతో పాటు అకాల మరణ ప్రమాదం కూడా పొంచి ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 7 శాతం అకాల మరణాలకు ఆల్కహాల్ వినియోగం కారణంగా తేలింది.‘‘ఇలాంటి అంశాలతో పాటు మద్యం క్యాన్సర్ కారకమని చాలా మందికి తెలియదు. మద్యపాన ప్రియులకు తెలియజేయవలసిన ముఖ్యమైన సమాచారం ఇది‘ అని ఆస్ట్రేలియాలోని ది జార్జ్ ఇన్సి్టట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ కు చెందిన ఆర్థికవేత్త వినియోగదారు మనస్తత్వవేత్త సైమోన్ పెటిగ్రూ అన్నారు. అయితే ఇలాంటి అవగాహన కలిగించడం అనేది పరిష్కారంలో ఒక భాగం మాత్రమే, ఈ వ్యసనం వల్ల కలిగే ఆరోగ్య సంబంధ ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడానికి మనం వారికి ఇతర ఆలోచనలను కూడా ఇవ్వాలి‘ అని ఈ పరిశోధన సందర్భంగా పెటిగ్రూ అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగానే సీరియస్ ప్రమాదాలతో పాటు మరికొన్ని తేలికపాటి మార్గాలను కూడా సూచించారు. అలాంటి వాటిలో ఒక చిట్కా బాగా ప్రభావం చూపిందని వారు గుర్తించారు. ‘తీసుకుంటున్న ఆల్కహాల్ గురించిన సమాచారాన్ని నిర్ధిష్ట ఆచరణాత్మక చర్యతో పాటుగా వారు తీసుకుంటున్న పానీయాల విశేషాలు, అలాగే వాటి సంఖ్యను లెక్కించడం వల్ల వారు తీసుకునే మద్యం పరిమాణం తగ్గుతుందని మేం కనుగొన్నాం‘ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏతావాతా వీరు చెబుతోంది ఏమిటంటే... లెక్కా గిక్కా ఏం లేకుండా పెగ్గుల కొద్దీ విస్కీలు, బ్రాందీలు, సీలాలకు సీసాలు బీర్లు తాగేసేవారికి... వారు తాగుతున్న మద్యం పరిమాణాన్ని లెక్కించి తెలియజెప్పడం అనేది మద్య పాన తీవ్రతను తగ్గిస్తుంది అని. -
వెడ్డింగ్ డెస్టినేషన్స్ : సరస్సు నుంచి సముద్ర ద్వీపం వరకు
జీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్ వెడ్డింగ్. ఇటలీలోని లేక్ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్ డ్రీమ్కు ప్రతిబింబంలా కనిపిస్తావిదేశీ వివాహ వేదికలు శాంటోరిని, గ్రీస్: శాంటోరిని ద్వీపం తెల్లని గృహాలు, నీలి ఆకాశానికి ప్రసిద్ధి. సూర్యాస్తమ సమయంలో జరిగే వివాహం జీవితాంతం గుర్తుండే అనుభూతిగా మిగులుతుంది.సువాసనల మధ్య వివాహం : ఫ్రాన్స్ దేశంలోని లావెండర్ పూల తోటల మధ్య జరిగే వివాహం ఒక స్వప్నంలా అనిపిస్తుంది. బీచ్లో కళ్యాణం: ఇండోనేషియా దేశంలోని బాలి ద్వీపం సముద్రతీరప్రాంతం ప్రకృతి వైభవానికి ప్రసిద్ధి. అలల శబ్దం, పచ్చని చెట్లు, సంప్రదాయ అలంకరణలు అన్నీ కలిసి ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇలా ప్రతి ప్రదేశం తన ప్రకృతి, చరిత్ర, సంస్కతితో వివాహాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్నిప్రారంభించడం ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. దక్షిణ భారత వివాహ వేడుకలుఈ మధ్య ట్రెండ్గా మారిన డెస్టినేషన్ వెడ్డింగ్ లేదా ప్లాన్డ్ వెడ్డింగ్ ఇలా ప్రత్యేక ప్రదేశాల్లో పెళ్లి చేసుకోవడం కొత్త విషయం కాదు. దక్షిణ భారతంలో ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది.గోపురం మధ్యలో మంగళ ధ్వనితమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో జరిగే వివాహం ఒక దివ్యానుభూతి. ఈ ఆలయం దక్షిణ భారత సంస్కృతికి ప్రతీక. సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటే ఆ వాతావరణం దివ్యానుభూతికి లోను చేస్తుంది. ఇక్కడ ఆలయ నిబంధనల ప్రకారం మాత్రమే వివాహాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆలయ అధికారులను సంప్రదించాలి.దేవుని సొంత నేలలో: కేరళలోని కుమారాకోమ్లోని జలసరి నడుమ ప్రకృతి సాక్షిగా వివాహం జరుగుతుంది. ఈ ప్రాంతం కొబ్బరి చెట్లు, నీటి ప్రతిబింబాలు, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందింది.దక్షిణ భారత వివాహ వేదికలుజీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్ వెడ్డింగ్. ఇటలీలోని లేక్ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్ డ్రీమ్కు ప్రతిబింబంలా కనిపిస్తాయి.కోట వైభవం సాక్షిగా: హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్లో రాజసంగా వివాహం నిర్వహించవచ్చు. హైదరాబాద్లోని ఈ రాజమహల్ నిజాం కాలపు వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడి వేడుకలకు ముందస్తు అనుమతులు అవసరం. ఇదీ చదవండి: వెడ్డింగ్ సీజన్ : కోటలో రాజసంగా వివాహంఊటి అసలు పేరు తెలుసా?! మనమందరం సాదాసీదాగా ఊటి అని పిలిచే ఈ హిల్ స్టేషన్ అసలు పేరు ఉదగమండలం. ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాలి. ఉదగమండలం అనే పేరు తోడా అనే తెగల భాష నుంచి వచ్చిందని స్థానికులు చెబుతారు. ఒతకల్ మండు లేదా ఉదగై మండలం అనే పదానికి అర్థం పర్వతాల మధ్యలో ఉన్న గ్రామం. నీలగిరి పర్వత ప్రాంతంలో నివసించే తోడా తెగల వారికి ఇది పవిత్ర స్థలం. విదేశీ పాలనకు ముందు ఈ ప్రాంతంలో తోడా తెగలే నివసించేవారు. తర్వాత వారి ఉచ్చారణకు అనుగుణంగా పేరును మార్చుతూ చివరకు ఊటి అని ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ స్థానికులు ఇప్పటికీ ఉదగమండలం అనే పేరును గౌరవంగా ఉపయోగిస్తారు. తెలిమంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని తేయాకు తోటలు, ప్రశాంత వాతావరణం ఈ ప్రాంతానికి ఉదగమండలం అనే పేరు ఎంతో తగినదిగా అనిపిస్తుంది. -
సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?
స అష్ట అంగ నమస్కారం... దీనినే సాష్టాంగ నమస్కారం అంటారు. అంటే మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారం అన్నమాట.. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే... ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం.భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం (Sashtanga Namaskaram) పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.చదవండి: మంత్రపుష్పం పరమార్థం ఏమిటి? -
వెడ్డింగ్ సీజన్ : కోటలో రాజసంగా వివాహం
ఆరావళి నీడలో వివాహ వైభవంసరస్సుల నగరంలో కళ్యాణ వైభోగంవసంత కాలాన రాజస్థాన్లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.రాజస్థాన్లో వెడ్డింగ్ సీజన్ అంటే ఒక రాజస అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కూడా. ఇక్కడి ఆరావలి పర్వత సిరుల మధ్య, సూర్యకాంతిని ప్రతిబింబించే జలసిరి సాక్షిగా జరిగే వివాహ వేడుక ఒక కళాత్మక సన్నివేశంలా అనిపిస్తుంది. ఈ భూమిలో పెళ్లి అంటే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, అంతకు మించి జీవితాంతం నిలిచే మధురస్మృతి.సరస్సుల మధ్య వివాహ వైభవంవెడ్డింగ్ సీజన్లో ఉదయ్పూర్ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సరస్సుల అందంతో ‘సిటీ ఆఫ్ లేక్స్’ గా పేరు పొందిన ఈ నగరం సూర్యాస్తమయం వేళ వర్ణరంజిత దృశ్యంగా మారిపోతుంది. ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ ప్రాంగణంలో జరిగే అలంకరణ, బాల్కనీ నుంచి సరస్సును చూస్తూ గడిపే క్షణాలు వధూవరులకే కాదు అతిథులకు కూడా చిరస్మరణీయంగా నిలుస్తాయి. అందుకే పలువురు ప్రముఖులు ఇక్కడే డెస్టినేషన్ వెడ్డింగ్కు ఆసక్తి చూపుతున్నారు.లేక్ పిచోలా మీద వెలిగే దీపాలు నీటిపై ప్రతిబింబించి కొత్త కాంతిని విరజిమ్ముతాయి. ద్వీపం మధ్యలో ఉన్న జగ్ మందిర్ సాయంత్రం వేళ స్వర్ణకాంతితో ప్రకాశిస్తుంది. ఫతే సాగర్ సరస్సు తీరంలో ప్రభాత వేళ హల్దీ, మెహందీ వేడుకలు మరింత అందంగా కనిపిస్తాయి. పుష్పాల మధ్య నిలిచిన సహేలియోకి బరి ఉద్యానవనం ప్రీ–వెడ్డింగ్ వేడుకలకు సజావుగా సరిపోతుంది.రాజస వేదికల ప్రారంభం: రాజస్థాన్లో శరదృతువులో ప్రారంభమయ్యే వివాహాల సందడివసంతకాలానికి చేరుకునే సరికి మరింత ఉత్సాహంగా మారుతుంది. పగలు సూర్యకాంతి, రాత్రి దీపాల వెలుగులతో కోటలు మరింత మాయాజాలంలా కనిపిస్తాయి. ఇక్కడి కోటల్లో వైభవంగా కళ్యాణం చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు. పాలరాతి ప్రాంగణాల్లో రంగోలీలు చిత్రకథల్లా విరాజిల్లుతాయి. బ్యాండ్, బాజా, బారాత్ సందడితో సాయంత్రపు గాలి కూడా ఉత్సవ వాతావరణాన్ని అలుముకుంటుంది. ఈ రాజస భూమిలో వివాహ వేడుక ప్రకృతి మధ్యలో సాగే ఒక అనుభూతి. పర్వతాల నీడలో, సరస్సుల ప్రతిబింబంలో, ఎత్తైన కోటల మధ్య జరిగే కళ్యాణం ప్రతి క్షణం ఒక గీతంలా నిలుస్తుంది.సాంస్కృతిక వేదికరాజస్థానీ పెళ్లి అంటే రంగుల పండుగ. బంధనీ వస్త్రాలు, పగిడీ అలంకారం, జానపద నృత్యాలు ఇవన్నీ కలిసి వివాహాన్ని మరింత ఉత్సవంగా మార్చేస్తాయి. మండపం మధ్య అగ్ని సాక్షిగా జరిగే వివాహానికి పర్వతాలు, సరస్సులు, కోట శిఖరాలు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తాయి. స్థానిక కళాకారుల సంగీతం, ఢోలు శబ్దం, షెహ్నాయి స్వరాలు వేడుకకు భావోద్వేగాన్ని జోడిస్తాయి. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు రెండు మనసుల కలయిక అని చాటుతాయి.ఉదయ్పూర్ రుచులురాజస్థాన్ భోజనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. దాల్ బాటీ చూర్మా, గట్టే కి సబ్జీ, వివిధ రకాల మిఠాయిలు, కచోరీలు, జిలేబీలు ఇవన్నీ వివాహ విందును మరింత రుచికరంగా మారుస్తాయి. పర్యాటనకు సరైన సమయం శరదృతువు నుంచి వసంతకాలం వరకు ఉదయ్పూర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో రాజస్థాన్ మరింత సుందరంగా కనిపిస్తుంది. ఈ సమయంలో వివాహాల ఉత్సాహం కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. రాజస్థాన్లో వివాహ సీజన్ అంటే రాజస శోభ, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక సంగీతం కలిసిన ఒక సుగంధ అనుభూతి. ఫోటోల్లో కనిపించే దృశ్యాల కంటే గుండెల్లో నిలిచే జ్ఞాపకాలే ఎక్కువ. అందుకే అనేక మంది ఇక్కడ వివాహం చేసుకోవాలని కలలు కంటారు.ఎలా వెళ్లాలి? : తెలుగు రాష్ట్రాల నుంచి రాజస్థాన్కు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయుమార్గం ద్వారా మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఉదయ్పూర్కు ప్రయాణించవచ్చు. నగరంలోకి ప్రవేశించే సమయంలో పర్వతాల నీడలు, సరస్సుల అందాలు స్వాగతం పలుకుతాయి.ఏం చూడాలి?ఉదయ్పూర్లో సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా, జగ్ మందిర్, ఫతే సాగర్ సరస్సు, సహేలియోకి బరి వంటి ప్రదేశాలు వివాహ సందర్బంలో మరింత అందంగా కనిపిస్తాయి. సరస్సుల తీరాలు, కోటల శిల్పకళ నగర వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. – ఎం.జి. కిశోర్,ప్రయాణికుడు -
పరమశివుడి భిక్షు పర్యావతారం
పూర్వం విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు పరిపాలించేవాడు. సత్యరథుడు పేరుకు తగినట్లే సత్యధర్మ పరాయణుడు. మహా శివభక్తుడు. విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు సుభిక్షంగా పాలిస్తుండటం చూసి, సాల్వరాజుకు కన్నుకుట్టింది. ఒకనాడు అతడు విదర్భ రాజ్యంపై దండెత్తాడు. విదర్భ సాల్వ సేనలకు భీకర పోరాటం జరిగింది. సత్యరథుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో విదర్భ సేనలు ఓడిపోయాయి.సత్యరథుడు సాల్వరాజు చేతిలో నేలకూలాడు.శత్రుసైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సత్యరథుడి పట్టపురాణికి సమాచారం తెలిసింది. అప్పటికి ఆమె గర్భవతి. నమ్మకస్తులైన దాసీల సాయంతో ఆమె రహస్యమార్గం గుండా అంతఃపురాన్ని వీడి, అటవీ మార్గంలోకి చేరింది. అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంలో తలదాచుకోసాగింది. కొన్నాళ్లకు నెలలు నిండి, ఆమెకు సర్వశుభలక్షణాలు కలిగిన కొడుకు పుట్టాడు. ఆమె ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.ఒకనాడు ఆమె కొడుకును ఆలయంలోనే వదిలి, స్నానం చేయడానికి చేరువలోనే ఉన్న నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఆమె మొసలి నోటికి చిక్కింది. మొసలి ఆమెను అమాంతం తినేసింది. ఆలయంలో ఉన్న పసిబాలుడు తల్లి కోసం రోదించసాగాడు. అంతలో కొడుకుని చంకనెత్తుకుని అటుగా వెళుతున్న బ్రాహ్మణ వితంతువు ఆలయం నుంచి వినిపిస్తున్న శిశువు రోదనను గమనించి, ఆలయంలోకి వెళ్లింది. ఏడుస్తున్న బాలుడిని ఎత్తుకుని, అతడికి పాలిచ్చి ఓదార్చింది. అతడు ఎవరి బాలుడో తెలియక, ఆ బాలుడి కోసం ఎవరైనా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడసాగింది. అప్పుడు పరమశివుడు భిక్షుక రూపంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘తరుణీ! మనసులో శంకలు వీడి ఈ శిశువును కూడా నీ కుమారుడితో పాటే పెంచు. ఇతడి వల్ల నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది’ అని చెప్పాడు.‘భిక్షుకా! ఇంతకీ ఈ బాలుడెవరు? ఇతడి జన్మవృత్తాంతం ఏమిటి?ఈ పిల్లవాణ్ణి నేను తీసుకువెళితే, రాజభటులు నాపై అపహరణ నేరం మోపి, ఉరితీస్తారేమో! అదే జరిగితే ఈ బాలుడితో పాటు నా శిశువు కూడా అనాథ అవుతాడు’ అని భయంగా పలికిందా బ్రాహ్మణ వనిత.‘తరుణీ! భయపడకు. నేను శంకరుడిని. నా సంకల్పం ప్రకారమే నువ్వు ఇక్కడకు వచ్చావు. నిస్సందేహంగా ఈ బాలుడిని తీసుకువెళ్లి పెంచు’ అని పలికి, ఆ బాలుడి వృత్తాంతమంతా వివరించి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు.ఆమె వెంటనే శంకరుడికి పాదాభివందనం చేసింది. ‘పరమేశ్వరా! ఈ పసిబాలుడికి ఇంతటి దుర్గతి కలగడానికి కారణమేమిటి? అలాగే నా కుమారుడు నిరుపేద వితంతువునైనా నా కడపున పుట్టడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించింది.‘తరుణీ! మానవుల జనన మరణాలకు, వారి సుఖదుఃఖాలకు వారు చేసుకున్న కర్మలే కారణం. ఈశ్వరుడిని అయిన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను. ఈ రాకుమారుడి తండ్రి సత్యరథుడు గత జన్మలో రాజుగా పాలిస్తూ, ముందు వెనుకలు విచారించకుండా తన సామంతరాజును ఉరితీయించాడు. ఈ జన్మలో అదే సామంతరాజు చేతిలో హతమయ్యాడు. ఇతడి తల్లి గత జన్మలో తన సవతిని విషప్రయోగంతో చంపించింది. ఇక నీ కుమారుడు గత జన్మలో బ్రాహ్మణుడై, ఆశ్రమధర్మాలను విడనాడి నీచులైన వారి వద్ద నీచ ద్రవ్యాన్ని దానాలుగా స్వీకరించి, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకుండా జీవించాడు. అందుకే ఇప్పుడిలా జన్మించాడు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటూ ఇద్దరు బాలురను అల్లారుముద్దుగా పెంచసాగింది. తగిన వయసు రాగానే ఇద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. వారికి నిత్యం శివలీలలను వినిపిస్తూ, వారిచేత శివలీలలను గానం చేయిస్తూ, ఇద్దరినీ శివభక్తులుగా తీర్చిదిద్దింది. కొన్నాళ్లకు ఇద్దరు బాలకులను ఒక గురువు వద్ద గురుకులంలో చేర్చింది. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచిత విద్యలలోను, క్షత్రియ బాలకుడికి క్షత్రియోచిత విద్యలలోను శిక్షణ ఇప్పించింది. ఇద్దరు బాలకులూ గురువు వద్ద వినయ విధేయతలతో మెసలుకొంటూ శీఘ్రంగానే సమస్త విద్యలనూ నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే బ్రాహ్మణ బాలకుడు తగిన కన్యను వివాహం చేసుకుని, ఏకచక్రపురం రాజు వద్దనే రాజ పురోహితుడిగా కుదురుకున్నాడు.క్షత్రియ కుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుడి సాయంతో రాజాశ్రయం సంపాదించాడు. తన వృత్తాంతం చెప్పి, రాజును సైనిక సహాయం అర్థించాడు. రాజు సమకూర్చిన సైన్యంతో తన తండ్రిని హతమార్చిన సాల్వరాజుపై యుద్ధం ప్రకటించాడు.యుద్ధంలో సాల్వరాజును అంతం చేసి, తన తండ్రి పరిపాలించిన విదర్భ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. విదర్భ రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత «సత్య ధర్మాలను తప్పకుండా జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు.∙సాంఖ్యాయన -
ఈ చెట్టు... ఆ నీళ్లు
అది మంచి ఎండాకాలం. ఎండలు దంచేస్తున్నాయి. దరిదాపులలో నీడనిచ్చేందుకు ఒక చెట్టు కూడా లేదు. దాహం వేస్తోంది. నాలిక పిడచ గట్టుకు పోయింది. ఇంకా రెండు మైళ్ళు నడిస్తే ఊరు చేరుకుంటాను. అనుకుంటూ అలానే రొప్పుతూ, ఆయాసపడుతూ టవలు తలపై వేసుకొని నడుస్తున్నాడు ఆ వ్యక్తి. ఎండ నిప్పులు కక్కుతోంది. దూరాన ఓ చెట్టు కనపడితే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. గబ గబ అడుగులు పెద్దగా వేసుకుంటూ అక్కడి కి చేరుకున్నాడు. ఓ పెద్ద కానుగ చెట్టు గుబురుగా ఉంది. రోడ్డంతా నీడ నిస్తుంది. ఆ చెట్టు చుట్టూ అరుగు కట్టారు. ఒకరిద్దరు అక్కడ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. చెట్టు కిందకు చేరగానే అలసట తీరింది. ‘అబ్బా ఎంత చల్లగా ఉంది. ఎవరో పుణ్యాత్ముడు వేసిన చెట్టు అనుకుని ‘ఆహా..ఆహా’ అంటూ చెట్టు కింద చూశాడు. ఓ కుండ కనిపించింది. వెంటనే వెళ్లి కాడ గరిటతో నీళ్ళు ముంచుకొని తాగాడు. ‘ఆహా ఎవరో పుణ్యాత్ముడు చల్లటి నీళ్ళు పెట్టాడు, ఇక్కడ చెట్టు నాటాడు’’ అనుకుంటూ అక్కడ విశ్రమిస్తుండగా ఓ వృద్ధురాలు ఆ కుండలో నీళ్ల పోస్తూ కనిపించింది.ఇంతటి ఎండలో ఈమె ఎక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చింది... అనుకుంటూ ‘అవ్వా! ఇంతటి ఎండలో ఎక్కడ నుంచి నీళ్లు తెచ్చావు? ఈ వయసులో నీకు ఈ అవసరమేమిటి?’ అడిగాడు. అవ్వ నవ్వి ‘మీలాంటి వాళ్ళ దాహార్తి తీరుస్తున్నాను. అదే నా సేవ నాయన. ఇక్కడ దరి దాపులలో చెట్లు లేకపోతే మా ముసలోడు ఈ చెట్టు నాటాడు, అక్కడ బోరు వేసాడు. దారిన పోయే వాళ్ళు ఈ చెట్టు కింద కూర్చుని చలట్లి నీళ్లు తాగుతూ సేద తీరుతున్నారు. నా కొడుకు..కూతురు ఈ చెట్టు ఆ నీళ్లే నాయనా’ అంటూ అవ్వ అక్కడినుంచి వెళ్ళింది. ‘మానవ సేవే మాధవ సేవ అంటే ఇదేనేమో’ అనుకుంటూ అక్కడ సేద తీరాడు ఆ వ్యక్తి. – కనుమ ఎల్లారెడ్డి -
జీవన చిత్రం
భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఆఫీస్లో అలసిపోయిన వారిద్దరూ ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే వారి ఆరేళ్ళ కొడుకు బడినుంచి ఇంటికి వచ్చి ఉన్నాడు.తమ పుత్రరత్నం, చుట్టుప్రక్కల ఉన్న స్నేహితులనంతా ఇంటికి పిలిచి ఉన్నాడు. వారందరూ చేరి ఇల్లంతా పీకి పందిరి వేసి ఉన్నారు. భార్యాభార్తలిద్దరికీ కోపమొచ్చింది. ఇరుగు΄÷రుగు పిల్లల్ని గట్టిగా అరిచారు. తమ పుత్రరత్నాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.అమ్మనాన్నల తిట్లకు వాడు బుంగ మూతి పెట్టి సోఫాలో కూర్చుండిపోయాడు. వారిలో కోపం తగ్గలేదు. అలా బయటికి వెళ్ళి వస్తే మామూలు స్థితికి వస్తామనిపించింది. ఇద్దరూ ఇంటి బయటికి వచ్చారు. దగ్గరలోనే ఓ కళ్యాణ మంటపం ఉంది. ఆ రోజు ఆ కళ్యాణ మంటపంలో ఓ ఉత్తర భారత దేశ చిత్రకారుడు తన చిత్రాల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. వాటిని చూద్దామని అక్కడికి వెళ్ళారు.మొత్తం చిత్రాలన్నీ పిల్లల చిత్రాలే. అందంగా అమాయకంగా ఉన్నాయి. మరికొన్ని కొంటె చూపుల్తో, పెద్దపెద్ద కళ్ళతో, కవ్వింపు ముఖంతో చూడముచ్చటగా ఉన్నాయి. మూడు వందలకి పైగా ఉన్న ఆ పిల్లల చిత్రాలన్నీ ఆ చిత్రకారుడు గీసినవే. కన్నార్పకుండా చూశారు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించసాగాయి ఆ చిత్రాలు. చిత్రకారుడిని అభినందించాలని అతడి దగ్గరకు వెళ్ళారు.‘మీకు మీ పిల్లలంటే చాలా ఇష్టం కాబోలు, వారు చిన్నప్పుడు ఇంత అందంగా ఉండేవారేమో. అందుకే జీవం ఉట్టిపడేట్లు గీయగలిగారు’ అన్నారు. అతడు ఏమీ మాట్లాడలేదు. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.చిత్రపటాలను సర్దుతున్న చిత్రకారుడి సహాయకుడు వీరిని పక్కకి పిలిచాడు. చిన్న గొంతుతో ‘ఆయనకు పెళ్లై పాతికేళ్ళయ్యింది కానీ, పిల్లలు లేరు. పుట్టే అవకాశం కూడా లేదు. పుట్టి ఉంటే ఇలా ఉంటారన్న ఊహే అతడిలోని చిత్రకారుడిని నిద్ర లేపింది. పెళ్లి అయ్యేంతవరకు అతడు చిత్రకారుడు కాదు. పిచ్చి గీతలు గీసే మనిషి మాత్రమే. పిల్లలు పుట్టరన్న విషయం తెలిసాకే అతడిలోని చిత్రకారుడు మేల్కొన్నాడు’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.నీరు లేని నాడే కదా నీటి విలువ తెలుస్తుందన్న విషయం గుర్తుకొచ్చింది భార్యాభర్తలకి. ‘పిల్లలన్నాక గొడవ చేయడం సహజం, మనకి పిల్లలున్నారు కాబట్టి మనకి వారి విలువ తెలియడం లేదు. పిల్లలు లేని వారి బాధ వర్ణనాతీతం కదా’ అని ఆలోచించారు. పరుగుపరుగున ఇంటికి వెళ్ళారు. కొడుకుతో పాటు వాడి మిత్రులకంతా తీపి మిఠాయిలు పంచారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
వృద్ధాప్యం ఆధ్యాత్మిక సాధనకు వరం
వృద్ధాప్యం అనేది జీవితమనే పుస్తకంలో చివరి అధ్యాయం కావచ్చు, కానీ అది అత్యంత విలువైన గౌరవప్రదమైన దశ. దీనిని కేవలం శారీరక క్షీణతగా కాకుండా, ‘అనుభవాల పండగ’గా చూడాలి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గొచ్చు కానీ, జీవితాన్ని చూసే దృష్టి పెరుగుతుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే విచక్షణ వారికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అందుకే వారిని జ్ఞాన నిధులు అంటారు.వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి., జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయాణం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల కలిగే అసహనాన్ని ఆధ్యాత్మికత తగ్గిస్తుంది. రోజుకు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు నియంత్రణలోకి వస్తుంది. జీవితంలో జరిగిన మంచి చెడులను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. వృద్ధాప్యం అనేది కేవలం శారీరక శక్తిని కోల్పోయే దశ కాదు, అది ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో బాధ్యతలన్నీ తీరిన తర్వాత, మనసును బయటి ప్రపంచం నుండి మళ్లించి లోపలికి (అంతర్ముఖం) పంపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం, పదవి, పిల్లల భవిష్యత్తుపై ఉండే విపరీతమైన వ్యామోహం వృద్ధాప్యంలో క్రమంగా తగ్గుతుంది. కుటుంబంలో జరిగే విషయాలను ఒక సాక్షిలా గమనించడం అలవడుతుందిఅంతా ‘దైవేచ్ఛ’ అని భావించడం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు.వృద్ధాప్యంలో శారీరక కదలికలు తగ్గినప్పుడు, మనసు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలవుతుంది. అనవసరమైన మాటలు తగ్గించి, మౌనంగా ఉండటం వల్ల ప్రాణశక్తి వృధా కాకుండా ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో అహంకారం సహజంగానే తగ్గుతుంది. నా వల్ల ఏమీ కాదు అని తెలిసినప్పుడు, భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. ‘‘నేను నీ వాడిని, నీవే నన్ను నడిపించు’’ అని భగవంతుడికి పూర్తిగాఅప్పగించుకోవడం (శరణాగతి ) వల్ల కలిగే ప్రశాంతత అద్భుతమైనది. ఇది మరణం పట్ల భయాన్ని పోగొట్టి, ప్రశాంతమైన చిరనిద్రకు (మరణానికి) సిద్ధం చేస్తుంది. తమకున్న అనుభవాన్ని యువతరానికి పంచడం, నిస్వార్థంగా సలహాలు ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే.అందరికీ వృద్ధాప్య దశ వరకు చేరుకునే అదృష్టం కలగదు. ఉన్న పెద్దలను గౌరవించడం అంటే మన భవిష్యత్తును మనం గౌరవించుకోవడమే. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అనుభవాలను గడించి, ఒక తరాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులు వృద్ధులు. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో లేదా కొన్ని కుటుంబాలలో వారిని ఒక భారంలా చూడటం కనిపిస్తుంది, కానీ అది సరైన దృక్పథం కాదు. ఈరోజు మనం వృద్ధులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు.వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే ఒక సహజ ప్రక్రియ. వారిని అనాథ శరణాలయాలకు పంపడం లేదా ఇంట్లో ఒక మూలకు పరిమితం చేయడం వంటివి కాకుండా, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం మన సంస్కృతి.వృద్ధాప్యం అనేది ఒక పండు పక్వానికి వచ్చినట్లు. పండు పండితే తీపి పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ మనిషిలో శాంతి, క్షమ, ప్రేమ అనే ఆధ్యాత్మిక గుణాలు పెరగాలి. అదే నిజమైన పురోగతి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే మనలోని అశాంతిని వదిలి, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. వృద్ధాప్యంలో ఈ సాధన మరింత సులభం, ఎందుకంటే లోకజ్ఞానం మనకు అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.వృద్ధులను వేధించే ప్రధాన సమస్య ఒంటరితనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భజనలు, ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చర్చల (సత్సంగం ) ద్వారా సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మ ఎప్పుడూ నాతోనే ఉన్నాడు (భగవంతునితో అనుసంధానం) అనే నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపుతుంది. జీవితం ఒక నిరంతర ప్రక్రియ అని, మరణం కేవలం ఒక మార్పు మాత్రమే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల పఠనం ద్వారా మరణం పట్ల ఉండే భయం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఉన్నదానితో తృప్తి చెందడం (సంతోషం) అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బాధ్యతలు తీరిపోయాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననే భావన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.– రామలక్ష్మీ సదానందమ్ -
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్గా ఉండటమే కాదు..ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!) -
ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!
ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది. ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్ఘాన్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్ రిమ్లి, హజారికా ఫుకాన్ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్లో నివసిస్తుంది. ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్ని అభినందించారు. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే. View this post on Instagram A post shared by OPEN WATER SWIMMING ACADEMY, INDIA (@owsaindia) (చదవండి: డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..) -
‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
కంటతడిపై ‘కన్నే’యండి!కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలు...కళ్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల కళ్లకలక (కంజంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లతో కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్ సిండ్రోమ్లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్లో కళ్లుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.నివారణ, చికిత్స...∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్ల సూచన మేరకు యాంటిహిస్టమైన్చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్ చుక్కల మందును సూచిస్తారు మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్ను సంప్రదించాలి.ఉబ్బు కళ్లు...కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్లో ‘పఫ్ఫీ ఐస్’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్) వల్ల కూడా ఇలా జరగవచ్చు.కారణాలు...∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.నివారణ / చికిత్స...మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్ కంప్రెస్)ఆహారంలో ఉప్పుకారాల మోతాదును తగ్గించడం కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు ఈ సూచనలు పాటించండికళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్ / ఫోన్) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి కళ్లజోడు తాలూకు గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్ మారిందని తెలుసుకోగానే తగిన పవర్ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్ను తప్పక సంప్రదించాలి. నిర్వహణ యాసీన్ (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
మహాశివరాత్రికి సాత్విక వంటకాలు..! హెల్దీగా ఉపవాసం చేద్దాం ఇలా
మహాశివరాత్రికి సాత్వికంగా ఉండే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి రహిత ఆహారాలు తీసుకుంటుంటారు. ఎలాగో మహాశివరాత్రి అంటేనే ఉపవాసం. అయితే చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం ఉంటారు. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు అంతలా కఠిన ఉపవాసాలు ఉండటం కష్టమే. ఒక పక్క అత్యంత పవిత్రమైన రోజు, మరోవైపు శరీరం సహకరించక అవస్థలు పడే వాళ్లు..ఇలాంటి సాత్విక వంటకాలను తీసుకుంటూ..హెల్దీగా ఉపవాసం చేయొచ్చని పెద్దలు చెబుతున్నారు. అంతేగాదు పురాణాలు సైతం శరీరాన్ని కష్టించేలా భక్తి అవసరం లేదని, చక్కగా తింటూనే పూజలు చేయండనే చెబుతున్నారు. పైగా ముందు భుక్తి తర్వాతే భక్తి అన్నారు. అయినా పొట్టలో కాసింత ఆహారం ఉంటేనే ఆధ్యాత్మికతవైపు, భక్తివైపుకి మనసు మళ్లేది. కాబట్టి ఈ పుణ్యప్రదమైన శివరాత్రి రోజున హాయిగా చేసుకుని తిసే సాత్విక వంటకాలేంటంటే..మిల్లెట్లు, దగ్గరన నుంచి సుబుదాను, కుట్టు అట్ట, సింఘార పిండి, పాలు, పండ్లు, నట్స్ తదితరాలను హాయిగా తీసుకోవచ్చట. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎక్కువసేపు ఉపవాసం ఉండేలా, పూజలు చేసుకునేందుకు సౌకర్యవంతగాను ఉంటుంది కూడా. ఆరోగ్యకరమైన సాత్విక వంటకాలు..సబుదాన ఖిచ్డి కాస్త ఓదార్పునిచ్చి..ఆకలిని నియంత్రణలో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. పైగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కూడా. ఎలా చేస్తారంటే..కావలసినవి..సబుదాన – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 మీడియంవేయించిన వేరుశనగలు (తురిమినవి) – ¼ కప్పుజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి (తరిగినవి) – 1సెంధా నమక్ – రుచికి సరిపడానెయ్యి – 1 టేబుల్ స్పూన్తయారీ..ముందుగా సబుదానా(సగ్గుబియ్యం) కడిగి 4–5 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర పచ్చిమిర్చి,బంగాళాదుంపలు బాగా వేయించాలి. అవి ఉడికాక నానబెట్టిన సబుదాన, వేరుశెనగ పొడి, ఉప్పు జల్లి, ఓ రెండు నిమిషాలు ఉడికించండి. అంతే సబుదాన ఖిచ్డి రెడీ..!.సామా కే చావల్ ఖిచ్డిసామా కే చావల్ అని పిలువబడే బార్న్యార్డ్ మిల్లెట్ ఉపవాస భోజనాన్ని తేలికగా, పోషకంగా చేస్తుంది. ఈ సాత్విక్ ఖిచ్డి సరళంగా అనిపిస్తుంది కానీ ఓదార్పునిస్తుంది, మహాశివరాత్రి సమయంలో ఎక్కువసేపు ఉపవాసం ఉండటానికి సరైనది.కావలసినవి సమా కే చావల్ – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 చిన్నవిజీలకర్ర – ½ స్పూన్అల్లం (తురిమినది) – 1 స్పూన్ఉప్పు: తగినంతనెయ్యి – 1 టేబుల్ స్పూన్నీళ్ళు – 2 కప్పులుతయారీ: ముందుగా మిల్లెట్లు బాగా కడగాలి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయించాలి, ఆ తర్వాత అల్లం, బంగాళ దుంప, మిల్లెట్, నీరు కలపాలి. మిల్లెట్ మెత్తగా ఉడికిపోతే..రెడీ అయిపోయినట్లే.కుట్టు అట్ట చీలాకుట్టు అట్ట చీలా వ్రత భోజనాలకు వెచ్చదనం తోపాటు తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎలా చేస్తారంటే..కావల్సినవి..కుట్టు అట్ట – 1 కప్పుఉడికించిన బంగాళాదుంప (గుజ్జు) – 1 చిన్నవిపచ్చిమిర్చి (ఐచ్ఛికం) – ½ స్పూన్ఉప్పు: తగినంతనీరు – ¾ కప్పునెయ్యి – 1 స్పూన్తయారీ విధానం..కుట్టు అట్ట, బంగాళాదుంప, కారం, ఉప్పు, నీరు కలపండి.నునుపైన పిండిలా కలపాలి. వాటి చిన్నసైజు బజ్జీల్లా పాన్లో వేయించాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే చాలు. పెరుగుతో వడ్డించి తింటే రుచి అదుర్స్.వ్రత్ వాలే ఆలూసంక్లిష్టమైన మసాలా దినుసులు లేకుండా సింపుల్గా చేసే వ్రత్ వాలే ఆలూ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.కావలసినవి :ఉడికించిన బంగాళాదుంపలు – 2 మీడియంజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి – 1ఉప్పు: తగినంతనల్ల మిరియాలు – ¼ స్పూన్నెయ్యి – 1 టేబుల్ స్పూన్తయారీ: నెయ్యి వేడిచేసి జీలకర్ర, తరిగిన బంగాళ దుంపలు బాగా వేయించి. దించేముందు కారం, ఉప్పు, నల్లమిరియాలు, చల్లుకోవాలి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.లౌకి ఖీర్లౌకి ఖీర్ మహాశివరాత్రి ఉపవాసానికి తీపి వంటకం ఇచ్చే శక్తి అమోఘమైంది. మరి ఇదేలా చేస్తారంటే..ఇక్కడ లౌకి అంటే అనపకాయ అని అర్థం.కావలసినవి:తురిమిన లౌకి(అనపకాయ ముక్కలు)- 1 కప్పుపాలు - 2 కప్పులుబెల్లం - 3 టేబుల్ స్పూన్లుఏలకుల పొడి - ¼ స్పూన్తరిగిన గింజలు - 1 టేబుల్ స్పూన్తయారీ..తురిమిన లౌకిని పాలలో తక్కువ మంట మీద ఉడికించాలి.మెత్తగా, కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించండి.బెల్లం వేసి బాగా కలపండి. ఏలకులు పొడి వేసి సర్వ్ చేయండి. ఇది మహాశివరాత్రి ఉపవాసానికి బెస్ట్ డెజర్జ్.(చదవండి: పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!) -
ఐఎంగా ఏఆర్సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్లో డెస్క్టాప్ ఇంజనీర్గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్ను చితాక్యాంప్లోని ఓ సైబర్కేఫ్కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్లో 11 గుజరాత్లోని రాజ్కోట్లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్కోట్ పోలీసులు ఆసిఫ్ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్సీఏఫ్ కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్సీఎఫ్ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని గోకుల్చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం.∙ -
ఈ వారం కథ: సోల్మేట్
‘‘అమ్మా, నాకేం తెలీదు.. నువ్వు రేపు నాన్నతో కలిసి లిటరరీ ఫెస్టివల్కు వెళ్తున్నావంతే’’ అంటూ స్వర తన అంతిమ తీర్పును చెప్పేసింది. ఆ ఇంట్లో ఆమె చిన్నదైనా, తల్లిదండ్రుల ఏకైక గారాలపట్టి కావడంతో, తన మాట ఎలాగైనా నెగ్గేలా చేసుకోవడం ఆమెకు కొట్టిన పిండి! ‘‘స్వరా, ప్లీజ్! ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చెయ్యొద్దు. నేనెందుకు పానకంలో పుడకలా? అదంతా మీ నాన్న ఫ్రెండ్ ఒకరి పుస్తకావిష్కరణ వేడుక. ఆ రచనకు మీ నాన్న ముందుమాట రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దాంతో పాటు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, కథాగోష్ఠులు ఉన్నాయి. అక్కడ మీ నాన్నలాగే గొప్ప గొప్ప కవులు వచ్చుంటారు. ఇంకా కొంతమంది సాహిత్యాభిమానులు ఉపన్యాసం వినడానికి, కవితలు ఆస్వాదించడానికి వచ్చి ఉంటారు. నేను ఆ రెండు గుంపుల్లోనూ చేరని దాన్ని. అలాంటప్పుడు నేనెందుకు ఆ కార్యక్రమానికి వెళ్లి నా టైమ్ వేస్ట్ చేసుకోవాలి చెప్పు? నాకక్కడ చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్’’ అంటూ అరగంట నుంచి తనను బతిమాలుతున్న కూతురి ఒత్తిడికి లొంగడానికి ఇష్టపడని సౌదామిని తన మనసులో మాటను కూతురికి చెప్పింది.‘‘అమ్మా, కొన్నిసార్లు మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం తప్పనిసరి అవుతుంది. ఇది కూడా అలాగే అనుకో.’’కూతురి మాటల ధోరణి సౌదామినికి వింతగా అనిపించింది! ఈ అమ్మాయి ఎందుకింత మొండిగా పట్టుబట్టి కూర్చుంది? ‘అమ్మను కవి సమ్మేళనానికి రమ్మని ఒప్పించు’ అని తన భర్తేమైనా దీనికి చెప్పి ఉంటారా అనే చిన్న అనుమానం ఆమెను వేధించినా, ఆయనకు తాను రావాలని ఉంటే, ఆయనే స్వయంగా చెప్పేవారు. కూతురి ద్వారా ఎందుకు చెప్పిస్తారు అనుకుని, తన ఆలోచనకు నవ్వుకుంది సౌదామిని.‘‘నాకు చాలా పని ఉంది. ఇటు చూడు, ఎవరో మీ నాన్న ఫ్రెండ్ ఇంత పెద్ద పనసపండు ఇచ్చి వెళ్లారు. దాని తొనలు తీసి సాయంత్రం కొంచెం పాఠోళీ చేయాలి. మిగిలిన దానిలో రేపు ఉదయం పనసపండు ఆవిరి కుడుములు చేయాలి. మీ నాన్నకు పనసపండు, ఇంకా దాని వంటకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. రేపు మీ నాన్న పుస్తకావిష్కరణ వేడుకకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటు కారులో ఆయన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. అందుకే దారిలో తినడానికి ఏవైనా చిరుతిళ్లు చేయాలి. పోయినసారి చక్కిలాలు చేసిచ్చాను. అందరూ చాలా రుచిగా ఉందని ఇష్టపడి తిన్నారట. ఈసారి కొంచెం కారప్పూస చేస్తాను. ఇన్ని పనుల టెన్షన్లో నేనుంటే నువ్వు నాకు నక్షత్రకుడిలాగా తగులుకున్నావేమిటే?’’ అని విసుక్కుంది సౌదామిని.‘‘అమ్మా, కొంచెం నీ వంటగది ప్రపంచం నుంచి బయటికి రా. నువ్వు రేపు ఉదయం కుడుములు, గిడుములు అంటూ లేనిపోని పనులన్నీ నెత్తిన వేసుకుని కూర్చోకు. నాన్న తొందరగా బయలుదేరతారు. అందుకే నువ్వు ఆయనతో పాటు త్వరగా సిద్ధమై బయలుదేరు. రేపొక్క రోజుకు నేనే మ్యాగీ చేస్తాను. దట్స్ ఆల్!’’ అని స్వర చిరాకుగా చెప్పింది.‘‘స్వరా, నేను వెళ్ళను. నువ్వు నన్ను బలవంతం చేయకు. కొన్నిసార్లు నువ్వు కూడా, నేను ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటే ‘నేను రాను, నాకు అక్కడ డిస్కంఫర్టబుల్గా ఉంటుంది’ అంటూ తప్పించుకుంటావు కదా. నాకూ అలాగే ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, సాహిత్య సంబరం, పుస్తకావిష్కరణ అంటూ నన్ను లాగొద్దు. మీ నాన్నతో ఇరవై ఐదు సంవత్సరాలు సంసారం చేశాను. మా ఇంట్లో జరిగిన గోష్ఠి తప్ప ఇప్పటివరకు ఆయనతో ఒక్క కవి సమ్మేళనంలోగాని, ఆయన పుస్తకావిష్కరణ వేడుకలోగాని నేను పాల్గొనలేదు. ఆయనా దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు కూడా’’ సౌదామిని తల అడ్డంగా తిప్పుతూ, పనసతొనలు తీయడంలో లీనమైంది.‘‘అమ్మా, ఇన్నాళ్లు నువ్వు వెళ్లకపోయి ఉండవచ్చు. కాని, ఇక నువ్వు ఇలాగే కిచెన్ క్వీన్ అంటూ ఇంట్లోనే కూర్చుంటే, ఆ తర్వాత అంతే... నేను నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.’’‘‘ఏంటది, ఏదో చెప్పాలనుకుంటున్నావు. దాన్ని చెప్పడానికి ఇంతలా కష్టపడుతున్నావు? టెల్ మీ వాట్స్ ద మ్యాటర్?’’ ఇప్పుడు సౌదామినికీ ఏదో అనుమానం మొదలైంది.‘‘అమ్మా, విషయం ఇంకా చిన్నగానే ఉంది. కాని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంటారే, ఇదీ కొంచెం అలాగే. నువ్వు ఏడ్చి గోల చేయనంటే చెబుతాను.’’ స్వర మరింత చిక్కుగా చెప్పింది.‘‘నువ్వు ఇంత సస్పెన్స్లో పెడితే ఎలా? నా గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది చూడు,’’ అని కొంచెం కలవరపడినట్లు పలికింది సౌదామిని.‘‘అమ్మా, అదీ నేను ఈ రోజు నాన్న స్నానానికి వెళ్ళినప్పుడు, నా మొబైల్లో చార్జ్ లేదని గూగుల్లో ఏదో సెర్చ్ చేయడానికి అని నాన్న మొబైల్ తీసుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆయన వాట్సప్కి మానసగంగ అనే వారి నుంచి మెసేజ్ వచ్చింది. కుతూహలం ఆపుకోలేక చెక్ చేశాను... నీకు తెలుసా మానసగంగ ఎవరో?’’‘‘ఊ, ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వచ్చినట్లుంది. హా! ఆ రోజు మీ నాన్న బర్త్డేకి మన ఇంట్లోనే కవి సమ్మేళనం ఉన్నప్పుడు చూశాను. నువ్వు అప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నావు. యాక్చువల్గా ఆమె పేరు మానసగంగ కాదు, ఆమె పేరు సావిత్రి అంట. ఆ పేరు ఆమెకి ఇష్టం లేదంట, ఓల్డ్ ఫ్యాషన్డ్ అంట. ఆ పేరుతో కవిత రాస్తే ఎవరూ మెచ్చుకోరంట... అందుకే మానసగంగ అని కలంపేరు పెట్టుకున్నానని ఆ రోజే చెప్పింది. మీ నాన్నే తనకు కవిత రాయడానికి గురువు, స్ఫూర్తి అని కూడా చెప్పింది. ఆమె మీ నాన్నకు ఏం మెసేజ్ చేసింది?’’ సౌదామిని కనుబొమ్మలు ముడిచి అడిగింది.‘‘నాన్న మొబైల్లో ఆమె ఫోటో చూశాను. చాలా పిచ్చిగా ఉంది. ఎదురుగా ఎలా ఉంది?’’ స్వర కుతూహలంతో అడిగింది.‘‘చాలా ముద్దుగా ఉంది. అంతే బాగా మేకప్ వేసుకుని, స్టైల్గా చీర కట్టుకుని ఉంది. ఏదో కాలేజీలో తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తోందంట. ఎమ్మే చదివేటప్పుడే తన లెక్చరర్ ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకుందంట. ఆ పెళ్లి రెండు సంవత్సరాలు కూడా నిలవలేదంట... అదంతా ఆ రోజు కవి సమ్మేళనానికి వచ్చిన ఆడవాళ్లలో కొంతమంది గుసగుస లాడుకున్నారు. ఆ రోజు ఆమెనే కార్యక్రమం యాంకరింగ్ చేసింది. ఆమె యాంకరింగ్ స్టైల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అక్కడ సభలో కూర్చున్న ఎవరో ‘ఆహా, వగలాడి. అదేం స్టైలో, అదేం మేకప్పో, ఎవరినైనా మాటలతో లోబరచుకునే కళ ఈమెకు ఎంత బాగా అబ్బిందో చూడు’ అని తన పక్కన కూర్చున్న వారికి చెబుతున్నారు. దానికి పక్కనున్న ఆవిడ ‘ఏం చేస్తే ఏం లాభం? తన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయింది పాపం! ఈమె పంచవన్నెల చిలక అని తెలియగానే అతను ఈమెను వదిలేసి ఉంటాడు’ అని కిసుక్కున నవ్వింది. నాకు అయ్యో అనిపించింది. ఒక ఆడది ముందుకు వస్తే జనం ఎలా ఆమె గురించి లేనిపోనివన్నీ ఆడుకుంటారే అని చాలా చిరాకు కలిగింది. అదంతా సరే, నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావు? అలాంటిదేం మెసేజ్ పంపింది మానసగంగ, ఐ మీన్ సావిత్రి...’’‘‘అమ్మా, ఆమె నాన్నతో ఫ్లర్ట్ చేస్తోంది. నాన్నకు ఏవేవో మెసేజ్లు పంపింది. నాన్న కూడా దానికి అంతే రసికత్వంతో సమాధానమిచ్చారు. ఆమె పాత మెసేజ్లను కూడా నాన్న డిలీట్ చేయలేదు. నేను అదంతా స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్కు ఫార్వర్డ్ చేసుకుని ఆ తర్వాత నిదానంగా చదివాను. ఐ వాస్ ఇన్ ఎ షాక్. ఇద్దరూ కొంచెం ఎక్కువే క్లోజ్ అయినట్లుంది.’’ స్వర తన గొంతు తగ్గించి పలికింది. నాన్న గురించి తన తల్లి ముందు ఇలా చెప్పడానికి ఆమె మనసు కాస్త వెనుకంజ వేస్తోంది.‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? కేవలం సెక్స్, క్రైమ్, అనైతిక సంబంధాల చుట్టూనే అల్లిన సినిమాలను ఓటీటీల్లో చూడటం తగ్గించు. అప్పుడు ఇలా అందరిపై అనుమానం రావడం తగ్గుతుంది. ఆయన మీ నాన్న అన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఈ మాట నీ బదులు వేరే ఎవరైనా చెప్పి ఉంటే, వాళ్ల నాలుకను కోసి ఇంటి గుమ్మానికి తోరణం కట్టి ఉండేదాన్ని!’’ సౌదామిని పనస తొనలు తీసే పనిని అక్కడితో ఆపి, చెంగున కత్తిపీట మీది నుంచి లేచి కోపంతో కూతురి వైపు చూసింది.‘‘ఆయన కేవలం నీకు భర్త మాత్రమే కాదు. నాకు నాన్న కూడా. అందుకే ఆయన గురించి చెప్పడానికి ముందు వందసార్లు ఆలోచించాను. వాళ్లిద్దరి చాటింగ్ల స్క్రీన్ షాట్ నీ మొబైల్కు పంపిస్తాను. నిదానంగా కూర్చుని చదువు.’’ అంటూ ఒక పనస తొనను నోట్లో వేసుకున్నది. కాని, ఎందుకో అది చేదుగా అనిపించి, దాన్ని ఊయడానికి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది.∙∙ సౌదామిని భర్త శేషగిరి ఒక పెద్ద కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్. అనేక విషయాలపై ఆసక్తి, జీవితం పట్ల అనురక్తి కలిగిన వ్యక్తి అతను. విమర్శకుడు, కవి, కథకుడు, అనేక మంది వర్ధమాన రచయితలకు మార్గదర్శకుడు. ఏ విషయం గురించి అయినా సభికులకు విసుగు రాకుండా రసవత్తరంగా ఉపన్యాసం ఇవ్వగలిగే వాక్చతురుడు! అతనితో పాటు పనిచేసే సై లెక్చరర్లందరూ కాలేజీ ముగిసిన తర్వాత, అలాగే వేసవి సెలవుల్లో కోచింగ్ సెంటర్కు వెళ్లి పాఠం చెప్పి జీతంతో పాటు ఎక్స్ట్రా ఇ¯Œ కమ్ సంపాదించడంలో మునిగి ఉన్నా, ఇతనికి కూడా చాలామంది అలాంటి సలహా ఇచ్చినా, శేషగిరికి లక్ష్మి కంటే సరస్వతియే ఎక్కువ ప్రియమైనదై, కథలు, కవితలు, వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపించాడు. సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏ లాబీయింగూ లేకుండానే కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కాని, తానే మెచ్చి పెళ్లి చేసుకున్న సౌదామిని మాత్రం దానికి పూర్తి విరుద్ధం! ఎక్కువగా మాట్లాడని మౌనగౌరి ఆమె! కథలైనా కొంచెం చదివేదేమో కాని, కవితలంటే ఆమెకు అలర్జీ! పెళ్లైన కొత్తల్లో భార్యకు తన కవితలను చదివి వినిపించే అలవాటు శేషగిరికి ఉండేది. కాని, తాను కవితలు చదివి వినిపించేటప్పుడు భార్య మౌనంగా కళ్లు పెద్దవి చేసి చూసి, చివరకు ‘బాగుంది’ అని భావరహితంగా చెప్పడం చూసి, ఆమెకు దానిపై ఆసక్తి లేదని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే నెమ్మదిగా అతను తన రచన గురించి భార్య ముందు చెప్పడమే మానేశాడు.సౌదామిని కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, తన పనిలో తాను నిమగ్నమై తన పతివ్రతా ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా పాటిస్తూ పోయింది. విపరీతమైన జిహ్వచాపల్యం ఉన్న భర్త అవసరాలన్నీ అర్థం చేసుకుని, అతని కోరిక తీర్చడంలోనే తన జీవితానికి ఒక సార్థకత ఉందని ఆమె భావించింది.శేషగిరి కాలేజీ ముగించి ఇంటికి వచ్చి భార్య చేసి ఇచ్చిన అల్పాహారం తిని, కాఫీ తాగి తన లైబ్రరీ గదిలోకి వెళితే అంతే. చదవడం, రాయడంలోనే లీనమైపోయేవాడు. గోడపై ఉన్న పాతకాలం పెండ్యూలమ్ గడియారం తొమ్మిదిసార్లు కొట్టినప్పుడే బయటికి వచ్చేవాడు! భోజనం తర్వాత కూడా ఏవైనా సగం చదివిన పుస్తకాలు ఉంటే, పూర్తి చేసే పడుకునేవాడు.ఎన్ని పుస్తకాలు చదివి, విమర్శలు రాశాడో అతనికే లెక్క లేదు. ఆ విమర్శాత్మక వ్యాసాలన్నింటినీ సేకరించి కొన్ని విమర్శా గ్రంథాలను వెలువరించాడు. అనేక కథా సంకలనాలు, కొన్ని కవితా సంకలనాలు, మూడు జీవిత చరిత్రలు ఇలా శేషగిరి ఒకటి రెండు రచనలైనా ప్రతి సంవత్సరం విడుదల అవుతూనే ఉండేవి. ఈ మధ్య స్మార్ట్ఫోన్ వచ్చాక కవులతో అతని స్నేహం మరింత పెరిగింది. వేరే వేరే ఊర్లలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు అతిథిగా కూడా వెళ్లేవాడు. కాని, కవితల లోకంలో మునిగి ఉన్న తన భర్త, మానసగంగ అనే కవయిత్రితో రహస్యంగా చాటింగ్ చేస్తున్నాడనే చిన్న అనుమానం కూడా సౌదామినికి రాలేదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయస్సు అంతరం! మానసగంగకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు, శేషగిరికి యాభై రెండు!∙∙ కూతురు తన మొబైల్కు పంపిన అన్ని మెసేజ్లను చదివిన తర్వాత, సౌదామినికి భర్తపై అంతులేని కోపం వచ్చింది. తానేం తక్కువ చేశానని తన భర్త ఇలా ఆమెతో సరస సల్లాపాలు మొదలుపెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తనకు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ చేసే ఇరవై మూడు సంవత్సరాల కూతురు ఉన్నా, తాను ఇంకా అందాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ నాజూకైన తీగలా సన్నగా, తెల్లగా, లక్షణంగా ఉన్న తాను తన భర్త దృష్టిలో పాతబడిపోయానా? లేదా ఆ మానసగంగ అంతలా మార్చివేసిందా? చాటింగ్ మొదలుపెట్టింది ఆమెనే. తన కవితలను కొన్ని పంపి ‘ఎలా ఉన్నాయో చూడండి సర్’ అని పెట్టింది. శేషగిరి వాటి లోటుపాట్లను సరిచేసి పంపినప్పుడు, దాన్ని పత్రికలకు పంపి పేరు సంపాదించుకుంది. అలా ప్రచురించబడిన కవితలను మళ్లీ శేషగిరికి పంపి ‘దీని క్రెడిట్ మీకే చెందాలి’ అని ఒక హృదయం ఎమోజీ పెట్టింది.శేషగిరికి మరో అలవాటు ఉండేది. ఇంటర్నెట్లో దొరికే అందమైన అమ్మాయిల ఫొటోలకు, ప్రకృతి ఫొటోలకు తగిన కవిత రాసి దాన్ని తన స్టేటస్లో, వాట్సప్ గ్రూప్లో పెట్టే అలవాటు! కాని, ఈ మానసగంగ అతని కవిత్వానికి సవాలు విసిరినట్లు, మరులుగొలిపే అందమైన చీర కట్టుకున్న, జుట్టు వదిలేసిన, పెదవులకు రంగు అద్దుకున్న, ఆకర్షణీయమైన భంగిమల్లో తన ఫోటోలు పంపి ‘దీనిపై ఒక కవిత రాయండి చూద్దాం’ అని మెసేజ్ చేసినప్పుడు, శేషగిరి బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఆ ఫొటోలన్నింటికీ ఆమె సౌందర్యాన్ని కొంచెం ఎక్కువే అనిపించేంతగా పొగిడి, శృంగారమయంగా కవితలు రాసి ఆమెకు పంపాడు. ఆ కవితలను చదివిన సౌదామిని గుండెలో అగ్నిపర్వతం బద్దలయ్యింది.సౌదామిని కన్నీళ్లు కారుస్తూ, స్వర రూమ్కు వచ్చి మంచంపై కుప్పకూలి కూర్చుంది. ‘‘నేను మీ నాన్నను దేవుడి లాంటి మనిషి అని నమ్మడం పెద్ద పొరపాటైంది. ఈ రోజు ఆయన ఇంటికి రానివ్వు. చెప్తాను. ఆయనకు. ఇరవై ఐదు సంవత్సరాలు నిష్ఠతో ఆయనతో సంసారం చేసినందుకు ఆయన నాకు మంచి బహుమతినే ఇచ్చారు. కవి సమ్మేళనం పేరుతో ఆమెతో సరసాలాడటానికి వెళ్తున్నారని నాకు ఈ రోజు తెలిసింది. అదీ నువ్వు చెప్పిన తర్వాత...’’ అని వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.‘‘ఏడవొద్దమ్మా, అలాంటిదేం జరగలేదు...’’‘‘ఇంకేం జరగాలి...? ఆమె ఫొటోలన్నింటికీ అంత శృంగారమయమైన కవితలు రాశారు మీ నాన్న... ఇంకొన్ని రోజులు పోతే నన్ను కూడా ఇంటి నుంచి బయటికి తరిమేస్తుందేమో వగలాడి. ఆ రోజు ఆ ఆడవాళ్లు ఈమె గురించి ఆడిన మాటలు అబద్ధం కాదు...’’ సౌదామిని పళ్లు కొరుకుతూ చెప్పింది.‘‘అమ్మా, వాళ్లిద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు. డోంట్ వర్రీ. నువ్వు నాన్న హృదయంలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆమె ఆక్రమించింది అంతే. ప్రతి మనిషికి తన భావాలకు స్పందించే, తనను మెచ్చుకునే ఒక సోల్ మేట్ అవసరం ఉంటుంది. కళాకారులకు, కవులకు అలాంటి ఒక ఆత్మసఖుడు లేదా ఆత్మసఖి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాని నువ్వు నాన్న కవితలను మెచ్చుకోలేదు, ఆయనలోని భావాలకు విలువ ఇవ్వలేదు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో దాని గురించి లోలోపల బాధపడి ఉండాలి. అలాంటి సమయంలో మానసగంగ ఆయన కవితలను మెచ్చి, అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టే మెసేజ్లు చేస్తూ ఆయనకు దగ్గరైంది. కాని ఒక మాట మాత్రం నిజం. ఆమెతో చాటింగ్ చేసినప్పుడు బహుశా నాన్న మనసుకు ఏదో రిలాక్స్ ఫీల్ అవుతూ ఉండవచ్చు. అది తప్ప నాన్న ఆమెకు ఎక్కడా అశ్లీలంగా మెసేజ్ చేయలేదు... దాన్ని నువ్వు మర్చిపోవద్దు.’’‘‘ఊ, అదీ నిజమే. నేను ఆయనను అర్థం చేసుకోవాల్సింది. ఇప్పటికైనా నేను ఆయనకు ఒక ఫ్రెండ్గా అయ్యే, ఆయన తమ ఫీలింగ్స్ను పంచుకోవాలనుకునే ఆత్మసఖిగా అయ్యే ప్రయత్నం చేస్తాను. రేపు మీ నాన్నతో సాహిత్య కార్యక్రమానికి వెళ్తాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నాన్న కవితలను, కథలను చదువుతాను. పాపం, ఊరంతా పొగిడే ఆయనను నేను ఒక్క రోజు కూడా మెచ్చుకోలేదు, పొగడలేదు...’’ సౌదామిని మనస్ఫూర్తిగా బాధపడుతూ పలికింది.‘‘నాన్నా, మీకు ఒక సర్ప్రైజ్. రేపు విజయవాడ లిటరరీ ఫెస్టివల్కు మీతో పాటు అమ్మ కూడా వస్తుందంట...’’ భోజనం చేస్తూ స్వర చెప్పినప్పుడు శేషగిరి నవ్వుతూ, ‘‘మీ అమ్మ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తుండాలి. ఆమెకు నా కవితల గురించి ఆసక్తి ఎక్కడుంది?’’ అన్నాడు.‘‘అయ్యో లేదులెండి, ఈ రోజు మీ బుక్ షెల్ఫ్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మీదొక కవితా సంకలనం దొరికింది. కొన్ని కవితలు చదివినప్పుడు చాలా ఇష్టమైంది... అందుకే నేను రేపు వద్దాం అని...’’ చెప్పింది సౌదామిని.శేషగిరి తనతో పాటు వచ్చే మరో ఇద్దరు కవులకు, మానసగంగకు తాను భార్య, కూతురితో కలిసి విజయవాడకు వస్తున్నానని, వారు వేరే కారు ఏర్పాటు చేసుకోవాలని మెసేజ్ చేశాడు.కారు వెనుక సీట్లో కూర్చున్న స్వర, ల్యాప్టాప్లో ఏదో వెబ్ సిరీస్ చూడటంలో లీనమైంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శేషగిరి తన పక్కన కూర్చున్న సౌదామిని మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ రోజు సౌదామిని, తాను కట్టుకున్న ఆకాశనీలం రంగు డిజైనర్ చీరలో, కూతురు ఆసక్తిగా చేసిన మేకప్లో శేషగిరి కళ్లకు అతిలోక సుందరిగా కనిపించింది.పుస్తకావిష్కరణ, ఉపన్యాసం ముగిసిన తర్వాత, కవి సమ్మేళనంలో శేషగిరి భార్యపై ఒక అందమైన ఆశుకవిత వినిపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కార్యక్రమం చివర్లో ‘మేడమ్, శేషగిరిగారు ప్రణయ కవులు. మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది, ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు ఆయన ప్రేమ కవితలు రాయకుండా ఉంటారా’ అని ఒకరిద్దరు పొగిడినప్పుడు సౌదామిని సిగ్గుపడింది. అయితే శేషగిరి ‘నిజం. నేను పెళ్లైన కొత్తల్లో ప్రచురించిన మూడు కవితా సంకలనాలు నా భార్య గురించే’ అన్నప్పుడు అవాక్కవడం సౌదామిని వంతు అయ్యింది.∙∙ ఇప్పుడు సౌదామినికి తీరికే లేదు. ఆమె ఇప్పుడు భర్తతో పాటు సాహిత్యానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ వెళ్తుంది. ఆసక్తిగా ఫొటోలు తీస్తుంది, అతని ఉపన్యాసం వీడియో చేసి తన ఫ్యామిలీ గ్రూప్కు షేర్ చేస్తుంది. నెమ్మదిగా ఆమెకు కూడా ఇప్పుడు సాహిత్యంపై ఆసక్తి మొదలైంది. భార్యలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు శేషగిరిలో మరింత హుషారును నింపింది.మొన్న మొన్ననే తెనాలిలో జరిగిన నెలనెలా వెన్నెల కార్యక్రమానికి వెళ్లిన సౌదామిని కళ్లు మానసగంగ కోసం వెతికాయి. ఊహూ! ఆమె రాలేదు. అంతేకాదు, సౌదామిని భర్తకు తెలియకుండా ఆయన మొబైల్ కూడా చెక్ చేసి చూసింది. విజయవాడ కవి సమ్మేళనం తర్వాత మానసగంగ శేషగిరికి మళ్లీ మెసేజ్ చేయలేదు. ‘కవిత రాయండి’ అని తన అందమైన ఫోటో కూడా పంపడం మానేసింది. -
కథాకళి: నాతిచరామి
నా మిత్రుడు లీలాచరణ్ మందు మానేశాడని విని నేను నమ్మలేదు. అదే నిజమైతే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది. లీలాచరణ్ భార్య, తల్లిదండ్రులు, స్నేహితులు, వాడితో పరిచయం ఉన్న ఎవరికైనా అది నమ్మలేని నిజమే. లీలాచరణ్ వయసు డెబ్బె ఏడు. వాడిని వాడు అంటున్నానంటే నా వయసుని మీరు ఊహించొచ్చు.నా కో–స్టూడెంట్గా పరిచయమయ్యే నాటికే లీలాచరణ్కి ఆల్కహాల్ అలవాటు ఉంది. అప్పుడే కొత్తగా ఆంధ్రాలో ప్రొహిబిషన్ తీసేశారు. ఓసారి మేథ్స్ టీచర్ వాడి నుంచి వాసన వస్తూంటే పట్టుకున్నప్పుడు మాకా సంగతి తెలిసింది. వాడి తండ్రి విద్యుత్ శాఖలో ఏదో కీలకమైన పోస్ట్లో ఉండడంతో పైసంపాదన చాలా వచ్చేది. పిల్లల మీద ప్రేమతో ఆయన వాళ్ళు అడిగినంత కాదనకుండా ఇస్తూండేవారు. లీలాచరణ్ తను తాగడమే కాక, కంపెనీకి మమ్మల్ని తన వెంట తీసుకెళ్ళి మా డ్రింక్ ఖర్చు కూడా తనే భరించేవాడు. నేను, మా క్లాస్లో చాలామంది మొదటిసారి మందు తాగింది లీలాచరణ్తోనే. ఆ కారణంగా లీలాచరణ్ మిత్రబృందం ఓ మందలా ఉండేది. కాలేజ్లో కూడా లీలాచరణ్ నా క్లాస్మేట్. వయసు పెరిగే కొద్దీ వాడిలో మందు అలవాటు కూడా పెరగసాగింది. లీలాచరణ్ తాగుడికి పరాకాష్ట గురించి చెప్పడానికి రెండు మూడు సంఘటనలని ఉదహరిస్తే చాలు. పెళ్ళిరోజున వాడు ఇంట్లోంచి మాయమయ్యాడు. మా మిత్రబృందం రైలు పట్టాల దగ్గర కూర్చుని తాగుతున్నవాడిని వెతికి తెచ్చాం.‘‘ఒరేయ్. బార్లో ఉంటే నన్ను పట్టుకుంటారని ఇక్కడికి వస్తే ఇక్కడా తగలడ్డారా మిత్రద్రోహుల్లారా!’’ దారిలో వాపోయాడు.ఈ కాలం పెళ్ళికూతుళ్లయితే ‘వాడికి నాకంటే మందు ముఖ్యమా? ఆ సీసాకి తాళి కట్టమనండి’ అని కోపంగా అరిచి వెళ్ళిపోయేవాళ్ళు. కాని 1970లలోని ఆడపిల్లల పరిస్థితి వేరు.వాడి తాగుబోతుతనాన్ని ఉదహరించదగ్గ రెండో సంఘటన. లీలాచరణ్ ఆ రాత్రి పన్నెండున్నరైనా ఇంటికి రాలేదని, వెతకమని మా ఇంటివారికి ఫోన్ చేసి నాకు చెప్పమని అతని భార్య చెప్పింది. నేను వెంటనే చెప్పులు తొడుక్కుని వెతకడానికి బయలుదేరాను. వాడు వెళ్ళే అన్ని బార్లకి వెళ్ళాను. ఓ బార్లోని వాళ్ళు చెప్పారు.‘‘మీవాడు చాలా తాగాడండి. ఎంత తాగాడంటే ఒంటి మీది లుంగీ ఊడిపోయిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు.’’నేను రోడ్లన్నీ తిరుగుతూంటే ఒంటి మీద కేవలం చొక్కా మాత్రమే ఉన్న, అండర్వేర్ కూడా లేని లీలాచరణ్ ఓచోట లైట్ స్తంభంతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు.మరో సంఘటన, స్కూటర్ని నడుపుతూ దాన్ని ఓ లారీ కిందకి పోనించాడు. వాడి అదృష్టం, స్కూటర్ పిప్పి పిప్పి అయింది కాని వాడికి ఏం కాలేదు. వాడు ఇంటికి శంషాద్ బేగం పాట ‘తుమ్హారీ యాద్ సతాతీ హై’ అని పాడుతూ చేరుకున్నాడు.అతని భార్య సాధ్వి అనే పదానికి సరైన నిర్వచనం. నాతిచరామి అనే వాగ్దానానికి వాడు కట్టుబడి లేడు. వాడిని తాగద్దు అంటే మండిపడతాడని గ్రహించిన ఆవిడ పెళ్ళైన మూడో నెల నించే ఆ మాటని మానుకుంది. ‘‘మిత్రమా. నాకు రమ్మంటే ప్రాణమా లేక నా భార్యంటే ప్రేమా అన్నది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రెంటిలో ఏది లేకపోయినా జీవించలేను.’’ తాగనప్పుడు ఓసారి నాకు చెప్పాడు.అలాంటి లీలాచరణ్ మందు మానేశాడని, అది నిజమని తెలిశాక నేను వాడి ఇంటికి వెళ్ళాను.‘‘నా నుంచి ఎప్పటిలా ఏ సువాసనలు రానందుకు మన్నించు మిత్రమా.’’ నన్ను చూసి నవ్వుతూ చెప్పాడు.‘‘నిజమేనన్న మాట?’’ అడిగాను.‘‘చిత్తం. నా చిత్తాన్ని కత్తితో నరికి పారేశాను.’’‘‘ఇంత కాలానికి ఆ కత్తి ఎలా దొరికింది?’’ ప్రశ్నించాను.‘‘ఓసారి అన్నా గుర్తుందా, నాకు ఆ రెంటిలో దేని మీద ఎక్కువ ప్రేమో తెలీడం లేదని? ఇప్పుడు తెలిసింది. నా భార్య అంటేనే ప్రేమ.’’ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.‘‘నీ తాగుడు ఆమెకి ఇష్టం లేదని ఇంత కాలానికి గ్రహించి మానేశావంటే నమ్మను. డాక్టర్ ఇంకా ఎన్ని రోజులని చెప్పారు?’’ నవ్వుతూ అడిగాను.‘‘ఆరోగ్యం చెడింది నాకు కాదు. మా ఆవిడకి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో నేను తాగిన మత్తులో ఉండడంతో గోల్డెన్ అవర్లో కాక, ఆలస్యంగా మర్నాడు మధ్యాహ్నం హాస్పిటల్కి తీసుకెళ్ళబట్టి కాళ్ళు చచ్చుపడ్డాయి. వెంటనే తేవాల్సిందని డాక్టర్ మందలించాడు. ప్రతి రాత్రి మూడు దాటాక ఆవిడని బాత్రూంకి తీసుకువెళ్ళాలి. మనిషి సహాయం లేకుండా నడవలేదు. కాబట్టి మేలుకుని ఉండాలని మందు మానేశాను.’’‘అయ్యో’ అనకుండా ఉండలేకపోయాను.‘‘దేవదాసు, రోమియోలని మించిన ప్రేమ నీది.’’ మనస్ఫూర్తిగా చెప్పాను.‘‘నాది కాదురా పిచ్చి వెధవా. పార్వతీ, జూలియట్లని మించిన ప్రేమ మా ఆవిడది. చాలాకాలం క్రితం ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు, డాక్టర్ ప్రతి రాత్రి తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన మాత్రని నా మీద ప్రేమతో వేసుకోవడం మానేసింది. ఆ మాత్రలో నిద్రని కలిగించే లక్షణం ఉంది. నేను తాగినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తానో, అసలు వస్తానో, రానో ఆ సమయంలో తను మెలకువగా ఉండాలని దాన్ని వేసుకోవడం మానేసింది. దాంతో డాక్టర్ హెచ్చరించినట్లుగానే ఆవిడ రోగం ఇంత దూరం వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ఉంటేనా...’’నవ్వుతూ చెప్పినా లీలాచరణ్ కళ్ళల్లో తడిని స్పష్టంగా చూశాను. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!
దేవతలందరిలోకీ పరమ బోళా వాడు పరమేశ్వరుడొక్కడే. అవతలి వాడు అసురుడని, వాడు కోరుతున్న వరం లోకాలకే కాదు, తనకు కూడా ముప్పు కలిగిస్తుందని తెలిసి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదెప్పుడూ. ‘అదిన్నీ నీ పతిప్రాణంబు దక్క..’ అని సతీ సావిత్రికి యముడు పెట్టినట్టు మెలిక పెట్టలేదు. కోరిన వరాన్ని కోరిన విధంగానే అనుగ్రహించేశాడు ఆనక తానెన్ని తిప్పలైనా పడనీ... అందుకు ఉదాహరణే గజాసురుడు, భస్మాసురుడు, బాణాసురుడు. వారు కోరిన వరాలను ముందు వెనకలు ఆలోచించకుండా నెరవేర్చేశాడు. గజాసురుడు తన గర్భంలో వసించమని కోరితే ‘వస్తున్నాను పో΄ అనుకుంటూ అమాంతం అతడి పొట్టలోకి దూరిపోయాడు. ఇక భస్మాసురుడు తాను ఎవరి నెత్తిన చేయి పెడితే వారు భస్మం అయి΄ోయేలా వరం అడిగితే ‘ఇచ్చితిని పో’ అన్నాడు. ఆనక అతడి నుంచి తప్పించుకోలేక పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాణాసురుడు తన నగరానికి కాపలా కాయమంటే ‘చిత్తం మహాప్రభో’ అనేశాడు. రావణాసురుడు తన ఆత్మలింగాన్ని అడిగితే అరక్షణంలో అనుగ్రహించేశాడు. అది అతడికి దక్కితే ఆపై వాడి ఆగడాలకు ఇక పట్టపగ్గాలుండవని తెలిసి తక్కిన దేవతలందరూ కలిసి ఆత్మలింగాన్ని దక్కనీయకుండా చేయడం ఆ తర్వాత సంగతనుకోండి... అంతేనా! అనుగ్రహించడంలోనే కాదు... ఆయనకు ఆగ్రహం వచ్చినా కూడా పట్టలేరెవరూ... భయంతో తనను కాపాడమంటూ శరణుజొచ్చిన మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి పాశం విసిరినందుకు యముడి మీద కోపంతో ఎడం కాలితో ఒక్క తన్ను తన్ని అంతకుణ్ణే అంతం చేసిన కాలాంతకుడాయన! తపోదీక్షలో ఉన్న తన మనసును మథించిన మన్మథుణ్ణి ఒక్క కంటి చూపుతో కాల్చి బూడిద చేశాడు. ఒక్క హుంకారంతో అసురుణ్ణి, అతడి సైన్యాలనూ అంతం చేసిన మహాకాలే శ్వరుడాయన. ఆ పరమ శివుడు... ఆ ఆదిభిక్షువు.. ఆ పరమ దయాళువు... ఆ ఉమా మహేశ్వరుడు పట్టరాని సంతోషంతో ఆనంద తాండవం చేసే మహా పర్వదినమే మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఇలా అర్పించాలిపరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన మహాశివరాత్రి పర్వదినాన చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు, పంచాక్షరీ పారాయణలతో పరవశించిపోతుంటాయి. జన్మానికో శివరాత్రి అన్నట్టు... ఈ పర్వదినాన ఆ ముక్కంటిని ఏ విధంగా మొక్కాలో పెద్దలు చెప్పిన విధం తెలుసుకుందాం... శివరాత్రి వేళ సూర్యోదయం కంటె ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయాలి. పగలంతా ఉపవాస వ్రతాన్ని పాటించడంతోపాటు రాత్రంతా జాగరణ చేయాలి. మొదటిజాములో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించి, పుష్పాలతో పూజించి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండోజాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండినపదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు లింగోద్భవ సమయంలో పూజలు చేయడంతోపాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు తిరిగి శివపూజలు చేసి నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ మహాపర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం. ఏకబిల్వం శివార్పణం... శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కనుక శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.శివరాత్రిదానం మహాపుణ్యఫలంసంపద కలిగిన వారు ఈరోజు శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని, లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా... అంతులేనన్ని సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తి.– డి.వి.ఆర్. (చదవండి: ఆయన జగం ..ఆమె సగం) -
ఉద్యోగం మారాలా? ఈ బారుకెళ్లండి!
కొందరు మనసు బాగా లేకుంటే బారుకెళతారు. ఇంకొందరు సంతోషాన్ని పట్టలేక బారుకెళతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకోవడానికి సురశాలలు సురక్షితమైన వేదికలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల బార్లు ఉన్నాయి. ఏ బారుకు ఎవరు వెళ్లినా, అక్కడ చేసేదొక్కటే! కాస్త మందు పుచ్చుకుని, మనసును సేదదీర్చుకోవడమే! జపాన్లోని యోకోహామాలో ఉన్న ‘తెన్షొకు సొడాన్’ బారు మాత్రం ఇంకొంచెం ప్రయోజనాత్మకమైన బారు. ఉన్న ఉద్యోగాల్లో విసిగిపోయిన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారు ఇది. చాలాకాలంగా ఉద్యోగం చేస్తున్నా, ఎదుగూ బొదుగూ లేనివారు ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే, అలాంటి ఉద్యోగులకు ఈ బారు సరైన వేదిక. ఉన్న ఉద్యోగం వదిలేసి మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అలాంటి వారికి ఈ బారులో కెరీర్ కౌన్సెలర్లతో ప్రత్యేకమైన గదుల్లో ప్రైవేటు సిటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. గంట నుంచి గంటన్నర సేపు కొనసాగే ఈ సిటింగ్లలో కెరీర్ కౌన్సెలర్లతో కలసి మందేస్తూ, మారబోయే ఉద్యోగాల గురించి మనసు విప్పి చర్చించుకోవచ్చు. అర్హతలు, అదృష్టం బాగుంటే మంచి ఆఫర్ అక్కడికక్కడే పొందవచ్చు కూడా! ఈ విలక్షణమైన బారు ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైంది. -
"హల్దిరామ్ వివాహం": వేదికగా ప్యాలెస్ సెట్, భారీ కేక్..
అత్యంత విలావంతసమైన వివాహా వేడుక. చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నంత రేంజ్లో హంగుఆర్భాటంగా జరుగుతోంది. ఓ పక్క బాణసంచాతో దద్దర్లిపోతున్న ఆకాశం, మరోవైపు ప్యాలెస్ రేంజ్ వేదిక సెట్, బారీ కేక్లు, మంచు విగ్రహాలు..ఎన్నో అబ్బురపరిచే...దృశ్యాలతో మిరుమిట్లు గొలిపేలా పెళ్లి వేడుక జరుగుతుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..అది బిలియనీర్ శివకిషన్ అగర్వాల్ వివాహ వేడుక. నాగపూర్లో అట్టహాసంగా జరిగింది. అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకలో ఒకటిగా నిలిచింది కూడా. ప్యాలెస్లాంటి వివాహ సెట్, ఎత్తైన పూల అలంకరణలు, మెరిసే మంచు శిల్పాలు, ప్రతిది కనుతిప్పుకోనివ్వతంగా అందంగా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. ఈ వేడుకలో సంగీత్లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. View this post on Instagram A post shared by The Cake Affair Ⓡ | Custom Cake Boutique (@thecakeaffair.nagpur) అంతేగాదు బారీ కేక్, అడుగడుగున రాజదర్పం ఉట్టిపడేలే అత్యంత గ్రాండ్గా జరిగింది ఆ వివాహ తంతు. ఈ వివాహానికి బిజెపి నాయకుడు హన్స్రాజ్ అహిర్ హాజరై నూతన వధువరులకు పూలబొకేని బహుకరించారు. అంతేగాదు ఆయన వారి వైవాహిక జీవితం అత్యంత సంతోషభరితంగా సాగిపోవాలంటూ ఆ జంటను దీవించారు కూడా View this post on Instagram A post shared by Harsh Ekonkar | FOOD & TRAVELLER 🇮🇳 (@harsh_storiess) ఎవరీ శివకిషన్..?హల్దిరామ్ వ్యవస్థాపక కుటుంబంలోని మూడవ తరం శివకిషన్ అగర్వాల్. ఆయన నాగ్పూర్ ఆధారిత వ్యాపార విభాగానికి నాయకత్వం వహిస్తారు. హల్దిరామ్ బ్రాండ్ రాజస్థాన్లోని బికనీర్లోని ఒక చిన్న దుకాణంలో మూలాలు ఉన్నాయి. దీనిని శివకిషన్ అగర్వాల్ తాత గంగా బిషన్ అగర్వాల్ ప్రారంభించారు. కాగా ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ స్నాక్స్, మిఠాయి బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ఏప్రిల్ 2023లో ఢిల్లీ, నాగ్పూర్కు చెందిన కుటుంబంలోని రెండు విభాగాలు కలిసి హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ లిమిటెడ్ను సృష్టించాయి. ఈ వ్యాపారంలో ఆయన వాటా ఏకంగా రూ. 27 వేల కోట్లు. (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..
వెయిట్లాస్ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్లాస్ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్..? ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్లాస్ జర్నీ గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్ కారణంగా ఒక నెలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. డాక్టర్ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..జీఎల్పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
సినిగళంలో నీల కంఠుడు
‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం’ అని రాశారు వేటూరి ‘సాగర సంగమం’లో.తెలుగు సినిమాల్లో శివుడి ప్రస్తావన ఆది నుంచి ఉన్నా అనేక పాటల్లో శివుని ప్రస్తావనను, ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించినవారిలో కె.విశ్వనాథ్, వేటూరి ఉంటారు.‘నటరాజ శత సహస్ర రవితేజా... నట గాయక వైతాళిక మునిజనభోజా’ అని వేటూరి తాను కె.విశ్వనాథ్తో పని చేసిన తొలి హిట్ ‘సిరిసిరిమువ్వ’లో శివుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత ‘శంకరాభరణం’లో ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము’ అని సకల కళలకూ మూలమైన నటరాజ స్వరూపం పరమశివుడిని పల్లవిగా చేశారు.భగవంతుడ్ని చేరుకోడానికి సంగీతం కూడా ఒక అనుసంధాన మార్గమే కదా. అందుకే ‘అద్వైత సిద్దికి అమరత్వ లబ్దికి గానమే సోపానమూ’ అని కూడా అన్నారు వేటూరి.శివతత్వాన్ని పూర్తిగా తెలిసి రాసిన సాహిత్యం ‘సాగరసంగమం’లోనూ వినిపిస్తారు వేటూరి, విశ్వనాథ్లు. శివుడు లయకారుడు. సంగీతంలోనూ... సాహిత్యంలోనూ... గానంలోనూ కూడా లయే ప్రధానం. శివుడు మాట్లాడితే సాహిత్యం. మాట్లాడకపోతే వేదాంతం. అన్నీ శివుడే అని చెప్పటానికి వేటూరి, విశ్వనాథ్ కలసి చేసిన ప్రయోగం సాగరసంగమంలోని ‘ఓం నమఃశివాయ’ పాట. అందులో ‘నీ లయలే ఈ కాలగమనమై’ అంటారు. ‘ప్రకృతి పార్వతి శివునితో కలిసి అడుగులు వేస్తాయి’ అని కూడా అంటారు. ‘జీవితమే చిర నర్తనమాయే’ అనడం వేటూరి మాస్టర్స్ట్రోక్. ఇక బాపు ‘భక్త కన్నప్ప’లో వేటూరి రాసిన ‘కిరాతార్జునీయం’ మరో కవికి సాధ్యం కానిది.వెనక్కు వెళ్లి చూస్తే తెలుగు సినిమా సాహిత్యంలో పరమ శివుడికి ప్రత్యేక స్థానమే ఉంది. రావణ విరచిత ‘శివ దండకాన్ని’ సంపాదించి దాన్ని రావణ పాత్రతోనే పాడించేలా పరిశోధన చేసి సాధించారు సముద్రాల రాఘవాచార్యులు ‘భూకైలాస్’లో. దాన్ని గాలి పెంచెల నరసింహా రావు స్వరసారధ్యంలో నిజంగానే రావణుడే పాడుతున్నారా అన్నంత ఎక్స్ప్రెసివ్గా గానం చేసి రక్తి కట్టించారు ఘంటసాల. తెరమీద రావణపాత్రలో ఎన్టీఆర్ అయితే ఇక చెప్పడానికేముంది. ‘భూకైలాస్’లోనే శివుణ్ణి ‘లోక శుభంకరుడు’గా వర్ణించారు సముద్రాల. ‘అన్య దైవము గొలువ నీదు పాదము విడువ’ అంటాడు రావణుడు శివభక్తితో ‘నీలకంధరా దేవ’ పాటలో. ఇక పింగళి గారు ‘సత్య హరిశ్చంద్ర’లోని ‘నమో భూతనాథ’ పాటలో శివుణ్ణి ‘సదా సుప్రకాశ’ అన్నారు.‘అర్ధనారీశ్వర’ తత్వాన్ని అర్ధం చేసుకున్న వారెవరైనా శివపార్వతులను ఒకటిగానే చూస్తారు. అందుకే భయం కలిగినప్పుడు అభయం కోసం అమ్మవారైన పార్వతిని స్తుతిస్తుంది ద్రౌపది ‘నర్తనశాల’లో. సముద్రాల రాసిన ‘జననీ శివకామినీ’ పాటను భక్తిరసస్ఫోరకంగా స్వరపరిచారు సుసర్ల దక్షిణామ్మూర్తి. అంతే గొప్పగా గానం చేశారు సుశీల. ఆరుద్రకు ఏం తక్కువ. ‘మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని రాశారు ‘భక్త కన్నప్ప’లో. ‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని’ అనే పంక్తి ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. ‘ఏకలవ్య’లో మల్లెమాల రాసిన ‘మ్రోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ కూడా గుర్తు చేసుకోదగ్గది. ‘అమెరికా అమ్మాయిలో’నూ ఓ శివభక్తి గీతం వినిపిస్తుంది. నారాయణరెడ్డి రాసిన సాహిత్యం చిదంబర నిలయుడి మూర్తిని మన కళ్లెదుట నిలుపుతుంది. ‘వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా’ అంటూ ‘ఇంద్ర’ కోసం రాసిన ‘భంభం భోలే’ లో ‘గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే’ అని సిరివెన్నెల మాత్రమే రాయగలరు.‘భరత వేదముగ నిరత నాట్యముగ కదలిన పదమిది పరమేశా’ అని పౌర్ణమి’లోని పాట తరచూ వినిపించే సిరివెన్నెల మరో రచన. ఆపదల్లో ఉన్న వారికి అభయం ఇచ్చి తన వారినిగా చేసుకునే సువిశాల శివతత్వ దర్శనమే ‘ఖలేజా’లో వినిపించే రామజోగయ్యశాస్త్రి గీతం ‘సదాశివ సన్యాసి’. శివతత్త్వమే అత్యంత శుభకరము, భవహరము, హృదయంగమము. మరి ఈశ్వర సాయుజ్యం ΄÷ందేందుకు ప్రయత్నోన్ముఖులైన వారికి ఆనందం కాక మరేమిటి? ఇంక ఇహలోక బంధాలనూ... జంజాటాలనూ పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? విభూతిని ధరించని ఫాలభాగం, శివాలయం లేని గ్రామం, ఈశ్వరుని ధ్యానించని మానవ జన్మం వ్యర్థములు అంటారు. శివ అంటే సంస్కృతంలో శుభము, సౌమ్యము అని అర్థాలున్నాయి. ఈ ప్రపంచమూ అందరి జీవనమూ శుభ సౌమ్యాలతో గడవాలని కోరుకుందాం.– భరద్వాజ -
ఆయన జగం ..ఆమె సగం
బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు, నిత్యమూ శమాది గుణ సంపత్తి కలవాడు కనుక శివుడు అని ‘శివ’ పదానికి వ్యుత్పత్తి.‘శివ’ అంటే పరమేశ్వరుడు.‘శివా’ అంటే పార్వతి. పేర్లలో కూడా ఏక రూపత కలిగిన ఆది దంపతులు వారు స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురూ సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం.‘గౌరి సగం – శివుడు సగం – అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అంటూ అవినాభావమైన ఆ ఆదర్శ దంపతుల అద్వైత రూపాన్ని మహాకవి ఆరుద్ర కీర్తించారు. వాగర్థాలవలె కలిసిపోయిన వారని కాళిదాసు ప్రస్తుతించారు. ప్రకృతి – పురుషులే సృష్టికి మూలమని, అయితే ఇందులో ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పోషించే పాత్ర మరింత కీలకమైనదని చెప్పడానికి జగద్గురు ఆది శంకరులు తమ ‘సౌందర్యలహరి‘ లోని తొలి శ్లోకంలోనే ఇలా చెప్పారు:‘శివః శక్త్యా యుక్తో యది భవ తి శక్తః ప్రభవితుమ్ / నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి ‘.శక్తి స్వరూపిణి అయిన జగదంబతో కూడినప్పుడే పరమేశ్వరుడు సమస్త సృష్టిని నిర్వహించడానికి సమర్థుడై ఉంటాడు. పార్వతితో కూడనినాడు అంతటి శివుడూ కాస్తంత కదలడానికి కూడా శక్తిలేనివాడే అవుతాడు. అంతేకాదు. ఆదిశంకరాచార్యులవారు మరొక అడుగు ముందుకు వేసి ‘చితాభస్మమును దేహమంతా పులుముకొని, కంఠంలో గరళాన్ని ధరించి, దిగంబరుడై, జటాధారిగా, మెడలో పాములను వేసుకొని, పుర్రెను చేతిలో పట్టుకొని, యాచక వృత్తితో జీవిస్తూ, శ్మశానవాసిగా ఉన్న ఈశ్వరుడు ముజ్జగాలకే అధిపతి కావడం కేవలం పార్వతీదేవిని పెండ్లి చేసుకోవడం వలన లభించిన ఫలితమేనంటూ తమ ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో నొక్కి వక్కాణించారు. ఇలా భర్త ఔన్నత్యానికి కారణభూతురాలు అతని ఇల్లాలే అని ఆదిశంకరులు జగతికి చాటి చె΄్పారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే పరమేశ్వరుడు జగన్మాత పార్వతిని తన దేహంలో సగభాగంగా స్వీకరించాడు. శివుడంటేనే శక్తిమయుడు. శక్తి అంటేనే శివుని అభివ్యక్తి. శివశక్తులు రెండూ విశ్వానికి ఆధారమైన మూల పదార్థాలు. ఆ అర్ధనారీశ్వరుని స్వరూపాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఆవిష్కరించుకొందాం.అర్ధనారీశ్వరత్త్వంఅర్ధనారీశ్వర స్వరూపంలో కుడిభాగం శివునిది. ఎడమభాగం పార్వతిది. శివుని మేని ఛాయ బంగారు వర్ణం కాగా, పార్వతీదేవిది కర్పూర సమ ధవళ వర్ణం. శివునిది జటలు కట్టిన రాగిరంగు కేశపాశం కాగా, అమ్మవారిది అందంగా అలంకరింపబడిన నల్లని కేశపాశం. విశాలమైన, పోడవైన, నీలోత్పలం వంటి నయనం జగన్మాతదైతే, వికసించిన ఎర్ర కమలం వంటి నేత్రం ఈశ్వరునిది. తన చెవికి ఆ తల్లి రత్నపు చెవిపోగు ధరించగా, సర్పాలనే ఆయన తన చెవికి ధరిస్తాడు. పార్వతి దివ్యాభరణాలను ధరించి ఉండగా, ఆయన నాగాభరణ శోభితుడు. అమ్మవారు దివ్యమైన పట్టువస్త్రాలను అలంకరించుకొంటే, ఆయన దిగంబరుడై దర్శనమిస్తాడు. కస్తూరి, కుంకుమ వంటి సౌభాగ్య ద్రవ్యాలను ఆమె అలదుకొంటే, దేహమంతా చితాభస్మాన్ని శివుడు పులుముకొని ఉంటాడు. ఆమె పాదం అందెలతోను, ఆయన పాదం నాగ కంకణాలతోనూ కనిపిస్తాయి.ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయైసమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశ్శివా యైచ నమః శివాయఅమ్మవారి ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వుతో విశ్వసృష్టి ప్రారంభమవుతుంది. అయ్యవారి తాండవ నృత్యంతో విశ్వం మొత్తం శివునిలో కలిసిపోతుంది. జగత్తుకే మాతా పితరులైన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంగా కలిసి ఉన్న తత్త్వానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకభావం.రెండు విభిన్నమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సమన్వయాన్ని సాధించిన వైనానికి సాకార రూపమే అర్ధనారీశ్వరం. విభిన్న లక్షణాలున్నప్పటికీ అన్యోన్యానురాగంతో దాంపత్య బంధాన్ని కొనసాగించాలన్నది అర్ధనారీశ్వరుడు ఇచ్చే సందేశం. ఈ తత్త్వాన్ని ఆకళింపు చేసుకోగలిగితే భూమిపై ప్రతి జంటా ఆ ఆదిదంపతుల లాగా అన్యోన్యతకు సాకార రూపమై నిలుస్తుంది. అలా ఉండే ప్రయత్నం మనమందరం చేయగలిగితే మన సంస్కృతిలో భాగమయిన వివాహధర్మం కలకాలం మనగలుగుతుంది !– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
పట్నం కోతి సలహాలు
ఒక పట్నం కోతి కొత్తగా అడవిలోకి వచ్చింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్రరంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి, చిన్నిలతో కాపురం వుంది.పట్నం కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్ రాసుకోవడం, పెదాలకు ఎర్రరంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేవి చిట్టి, చిన్ని.వాటిని చూసి పట్నం కోతి, ‘‘ఇలా రండి, మీకు కూడా పౌడర్ రాస్తాను’’ అంటూ పిలిచింది.చిట్టి, చిన్ని పనస తొనలు తింటూ మొహాలకు పౌడర్ రాయించుకున్నాయి.‘‘పనస తొనలను గింజలు తీసి తినాలి. అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు. పారేస్తారు’’ అంది పట్నం కోతి.చిట్టి, చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి, గుజ్జు మాత్రమే తిన్నాయి.అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.చిట్టి, చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ, అది చెప్పినట్లుగా నడుచుకునేవి.‘‘అలా రోజంతా కూర్చుని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో! మీరు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి.’’ అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ. అయితే చిట్టి, చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరకే పోయి కూర్చునేవి!పట్నం కోతి దాని మాటలతో చిట్టి, చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది!‘‘దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు వొలుచుకుని తినాలి. మొక్కజొన్న పొత్తి గింజలు తిని, కంకి పారేయాలి. మామిడి పండు రసం పీల్చుకుని తొక్క పారేయాలి. అరటి పండు తొక్క కూడా తినకూడదు. వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది!’’ అంటూ వాటికి నూరిపోస్తూ ఉండేది. అయితే నెల తిరిగేసరికి చిట్టి, చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాయి .హడలిపోయిన తిమ్మమ్మ పిల్లలనిద్దరినీ తీసుకుని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి, చిన్ని నోట్లో పసరు మందు పోసి, ‘‘చూడండి పిల్లలూ! మనం పుట్టినప్పటి నుంచి ఏం తిని పెరుగుతున్నామో అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్లూ వీళ్ళూ చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క, గింజలు ఇవే మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు, గడ్డి తింటే జీర్ణం కాదు. అది మీ ఆహారం కాదు. అందుకే ఈ కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే, తిన్నది వంట పడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేసి, ఇన్నాళ్ళూ మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి. ఎటువంటి జబ్బు చేయదు!’’ అని చెప్పింది.ఆ తరువాత చిట్టి, చిన్ని పట్నం కోతి సలహాలు పాటించక పోగా, క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి. -
బెర్ముడా ట్రయాంగిల్..ముక్కోణపు సుడిగుండం!
ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకవేళ ఆ బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే వేరే లోకానికి తీసుకెళ్లే ఒక ‘ఆకలిగొన్న ద్వారం’ అయితే, మీరు వెళ్లే క్రూజ్ షిప్పుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశంలో ఉండేవి. మీ జర్నీ టికెట్ వెనుక ‘మనుషులు మిస్ అయితే మాకు సంబంధం లేదు’ అని బోలెడన్ని కండిషన్లు పెట్టేవారు. కానీ అలాంటిదేం లేదు! అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, వాతావరణం అప్పుడప్పుడు కల్లోలంగా ఉంటుంది. దానికి తోడు చిన్న చిన్న మానవ తప్పిదాలు. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని ఒక మిస్టరీలా మార్చేశాయి అంతే!... నిజంగా అంతేనా! ఇలా పైపైన చెప్పేస్తే మిస్టరీ కాకుండా పోతుందా? అక్కడేమీ మర్మం లేదని చెప్పేవాళ్లు, మరి ఆ స్పాట్లోకి రాగానే నౌకలు ఎందుకు మునిగిపోతున్నాయో, విమానాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నాయో కూడా చెప్పొద్దా?! అవును చెప్పాలి. ‘వాట్ ఇఫ్ సైన్స్’ అనే సంస్థకు చెందిన పరిశోధకుడు రోనాల్ట్ కాపర్ తాజాగా అదే చెబుతున్నారు.మీథేన్ తప్ప మిస్టరీ కాదు!బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఓడలు, విమానాలు మాయమైపోతుంటే ఇన్నాళ్లూ ఏ అతీంద్రియ శక్తులో, లేకుంటే ఏలియన్లో వాటిని మింగేస్తున్నాయని అనుకున్నాం. కాని, అందుకు కారణం మిథేన్ గ్యాస్ అని రోనాల్డ్ కాపర్ బృందం చేసిన పరిశోధన తేల్చేసింది! సముద్రం అడుగుభాగం నుండి అప్పుడప్పుడు మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తుందనీ, ఆ గ్యాస్ ధాటికి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే ఓడలు బ్యాలెన్స్ తప్పి మునిగిపోవటం, విమానాల ఇంజన్లు మొరాయించి కూలిపోవటం జరిగి ఉండొచ్చని రోనాల్డ్ బృందం చెబుతోంది. అయితే ఆ గ్యాస్ అప్పట్లో ఎందుచేతనో ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఉండే అవకాశం చాలా తక్కువని కూడా అంటోంది! లోకం అంతా ఇన్నాళ్లూ దయ్యాల ట్రయాంగిల్ అని భయపడితే, చివరికి అది సముద్రానికి వచ్చిన ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ అని తేలిపోయిందన్న మాట!త్రిభుజాకార ప్రమాద స్థలిసినిమా భాషల్లో చెప్పాలంటే, ఇది ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉండే ఒక ‘మాయా బజార్’ లాంటి ప్రదేశం. ఫ్లోరిడాలోని మయామీ, బ్రిటన్లోని బెర్ముడా దీవి, ప్యూయెర్టోరికోలోని సాన్జువాన్.. ఈ మూడు పాయింట్లను కలిపితే ప్రత్యక్షమయ్యే పెద్ద ‘ముక్కోణపు సుడిగుండమే’ బెర్ముడా ట్రయాంగిల్. సుమారు 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ఈ అదృశ్య జల అగాధ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించటానికి 500 ఏళ్లుగా మానవాళి సంశయిస్తూనే ఉంది. ఓడల కెప్టెన్ల దగ్గర నుండి, విమాన పైలట్లు, కథలు రాసే రైటర్లు, రీసెర్చ్ చేసే మేధావుల వరకు... అందరూ తలా ఒక థియరీతో, ఎవరి ఊహకు అందినట్లు వారు ఏదో చెప్పారు కాని, ఆనాటి బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాలకు అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ‘నో ఎంట్రీ’ త్రిభుజస్థలి చుట్లూ కోకొల్లలుగా ఎన్నో కథలున్నాయి. అలాగైతే ఇప్పుడీ మీథేన్ గ్యాస్ కూడా ఒక కథే అనుకోవాలా?ఎందుకు మునుగుతున్నాయి!‘డైలీ మెయిల్’ తాజా వార్తా కథనం ప్రకారం, ఈ సరికొత్త మీథేన్ గ్యాస్ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చినవారే.. రోనాల్డ్ కాపర్. సముద్రం అడుగున గడ్డకట్టుకుపోయిన మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా పెద్ద త్రేన్పుగా బద్దలై బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నీటి సాంద్రత తగ్గిపోతుంది. అలా నీరు పల్చబడిపోతే, దాని మీద గంభీరంగా తేలుతూ వెళ్లే ఓడలకి ‘బ్యాలెన్స్’ తప్పుతుంది. ఇంకేముంది, ఏ సంకేతం, హెచ్చరిక లేకుండానే ఓడలు సముద్రం గర్భంలోకి జారిపోతాయి. పోనీ ఆకాశంలో వెళ్లే విమానాలైనా అక్కడ సురక్షితమా అంటే, అదీ లేదట! సముద్రం నుండి విడుదలైన గ్యాస్ గాలిలోకి చేరితే, అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఫలితంగా బాగా దిగువగా విమానం వెళితే కనుక ఇంజన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే, అక్కడ ఏదో శక్తి వచ్చి వాటిని లాగేయడం లేదు. సముద్రం వదిలిన గ్యాస్ వల్ల ఓడలకు, విమానాలకు హఠాత్తుగా, ‘తట్టుకునే శక్తి’ తగ్గి, మునిగిపోతున్నాయి అంటున్నారు రోనాల్డ్, ఆయన బృందం. ఇప్పుడెందుకు అలా లేదు?! అదొక బ్యాడ్ టైమ్ అంటారు రోనాల్డ్. అప్పట్లో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఈ మీథేన్ గ్యాస్ విస్ఫోటాలు చాలా చురుగ్గా ఉండేవట. కాలక్రమేణా సముద్రం అడుగున ఉండే పరిస్థితులు స్థిమితపడి, ఆ గ్యాస్ లీకేజీలు, అక్కడి వింత వాతావరణం ఇప్పుడు తగ్గిపోయాయని ఆయన చెబుతున్నారు. ‘‘ఇంతకాలం మనం అనుమానిస్తూ వస్తున్నట్లు అక్కడ ఏ ఏలియన్లు లేరు, వేరే లోకానికి వెళ్లే దారులూ లేవు. అదంతా కేవలం ప్రకృతి చేసిన ఒక వింత విన్యాసం’’ అని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఓడలు హాయిగా షికార్లు చేయటం లేదు, విమానాలు దర్జాగా ఎగరటం లేదు. కొంత భయమైతే ఉంది. మీథేన్ కథ కూడా గ్యాసేనా?సోషల్ మీడియాలో ఇప్పుడీ రోనాల్డ్ కాపర్ మీథేన్ గ్యాస్ థియరీ వైరల్ అవుతోంది కాని, వాస్తవం అయితే వేరేలా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్లో అప్పట్లో నిజంగానే అన్ని గ్యాస్ పేలుళ్లు సంభవించాయా? అని అడిగితే... గట్టిగా సమాధానం చెప్పే సాక్ష్యాలు మాత్రం దాదాపుగా లేవు. అంటే ఇది కూడా ఒక అంచనానేనా?! అమెరికన్ కోస్ట్ గార్డ్లు మొదట్నుంచీ బెర్ముడా ట్రయాంగిల్ ఉనికిని నమ్మటం లేదు. అసలు మ్యాప్లో అలాంటి డేంజర్ జోనే లేదు’’ అని కూడా వారు ఏనాడో తేల్చి చెప్పారు. నేటికీ వీడని ‘సైక్లోప్స్’ మిస్టరీ1918లో అమెరికా నేవీకి చెందిన ‘సైక్లోప్స్’ అనే ఒక భారీ సరుకు రవాణా ఓడ హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ఓడలో ఉన్న 306 మంది సిబ్బంది గాలిలో కలిసిపోయినట్లుగా, జాడ లేకుండా పోయారు. కనీసం ఓడ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో ఎవరికి తోచిన కారణం వారు చెప్పుకున్నారు. ఓడ ఓవర్ లోడ్ అయి మునిగిపోయిందని, అందులో ఉన్న మాంగనీసు పేలిపోయిందని, ఓడలో పెద్ద గొడవ జరిగి ఒకర్నొకరు చంపుకున్నారని.. ఇలా రకరకాల కారణాలు వెతుక్కున్నారు. కొందరైతే సముద్రం అడుగున ఉన్న ఏదో ఒక పెద్ద రాక్షస జంతువు వచ్చి ఓడను నమిలేసిందని కూడా ప్రచారం చేశారు. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి, జర్మనీ వాళ్లే తమ ఓడను ముంచేశారేమో కూడా అనుమానాలు వచ్చాయి. జర్మనీ మాత్రం ‘‘ఆ ఘటనతో మాకు సంబంధం లేదు’’ అని స్పష్టంగా చెప్పేసింది. మరోవైపు సైంటిస్టులు దాన్నొక సహజ ప్రమాదంగా కొట్టిపడేశారు. అయితే అసలేం జరిగింది అనే దానికి సమాధానం మాత్రం ఎవరి దగ్గరా లేదు. ఆ ఓడ ఏమైందో ఇప్పటికీ ఒక పెద్ద ‘మిస్టరీ’!ఏమైనా, టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు శాటిలైట్లు, సూపర్ వెదర్ రిపోర్టులు అందుబాటులోకి వచ్చాక బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే, టెక్నాలజీ ముందు ఈ మిస్టరీలు తోక ముడిచాయని అనుకోవచ్చా?! ఐదు శతాబ్దాల మిస్టరీ!బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ, క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రాలపై షికారు చేస్తున్నప్పటి నుంచీ ఉంది. 1492లోనే కొలంబస్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఆకాశంలో ఏవో వింత వెలుగులు చూశానని తన డైరీలో రాసుకున్నారు. బహుశా ఆ వెలుగులనే మనం ఏలియన్స్ (గ్రహాంతర జీవులు) అనుకుంటున్నామా? శతాబ్దాల తరబడి ఆ రూట్లో వెళ్లే నావికులు, ‘‘అయ్యా! మా దిక్సూచి ఇక్కడికి రాగానే పిచ్చిపిచ్చిగా తిరుగుతోంది, సడన్ గా తుపానులు వస్తున్నాయి’’ అని చెబుతుండేవారు. అందువల్ల కూడా మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేసింది. అసలు కథ మాత్రం 1974లో మొదలైంది. చార్లెస్ బెర్లిట్జ్ అనే ఆయన ‘ది బెర్ముడా ట్రయాంగిల్’ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, ‘‘ఇప్పటి వరకు అక్కడ వెయ్యి మందికి పైగా మనుషులు మాయమైపోయారు!’’ అని ఒక బాంబు పేల్చారు. దాంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది, అప్పటి నుండి ఈ ట్రయాంగిల్ అంటేనే గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. కొలంబస్ చూసిన ఆ ‘లైట్లు’, బెర్లిట్జ్ రాసిన ఆ ‘కథలు’ కలిపి ఈ బెర్ముడా ట్రయాంగిల్ని ఒక గ్లోబల్ సెలబ్రిటీ విలన్ని చేసేశాయి.లాయిడ్స్ ఆఫ్ లండన్ పరిశోధనప్రపంచంలోనే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ‘లాయిడ్స్ ఆఫ్ లండన్’ వాళ్లు కూడా కొంత పరిశోధన జరిపించి, ‘‘మిగతా సముద్ర ప్రాంతాల్లో ఎంత రిస్క్ ఉందో, అక్కడ కూడా అంతే ఉంది. అక్కడేదో అయిపోతుందని ఊహించకండి, మా పరిశీలన ప్రకారం అక్కడ అంతా మామూలు పరిస్థితులే ఉన్నాయి..’’ అని చాలాకాలం క్రిందటే ప్రకటించారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం కొంతమంది రీసెర్చర్లు, మేధావులు, ‘‘ఏంటి బ్రదర్.. అంతా గ్యాస్ అని ఎలా తేల్చేస్తారు, గ్యాస్ కాకపోతే’’ అని రోనాల్డ్ థియరీని వి¿ే దిస్తూ, అది కచ్చితంగా మిస్టరీనే అంటున్నారు. ముఖ్యంగా ఏలియన్స్ గురించి పుస్తకాలు రాసే నైజెల్ వాట్సన్, ‘‘ఎవరి సిద్ధాంతం వారిదే అయితే, అసలు కారణం ఒకటేదో ఉండి ఉంటుంది’’ అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భాగం గ్యాస్ థియరీ నిజమా లేక ఏలియన్స్ నిజమా అన్నది పక్కన పెడితే, జనం ఎప్పుడూ ఏదో ఒక వింతను కోరుకుంటూనే ఉంటారు. అందుకే ఈ ట్రయాంగిల్ కథలు ఇంకా బతికున్నాయి. అయినా ప్రపంచంలో ఇదొక్కటే కాదు కదా ట్రయాంగిల్, మరి మిగతా ట్రయాంగిళ్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం లేదు?’’ అని వాట్సన్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ స్టోరీ ఒక పక్క గ్యాస్, మరో పక్క బాస్ (ఏలియన్స్), ఇంకో పక్క మాస్ (పుకార్లు)ల మధ్య సజీవంగా ఉంటూ వస్తోంది.సాక్షి, స్పెషల్ డెస్క్ -
అదే నా ఐడేంటిటీ
సింపుల్గా కనిపిస్తుంది. కాని, సీరియస్ డెసిషన్స్ తీసుకోవడం బాగా తెలుసు ఈ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకి. అందుకే, గ్లామర్ ట్యాగ్స్కి దూరంగా, పెర్ఫార్మెన్స్ రోల్స్కి దగ్గరగా ఉంటూ, చాలా జాగ్రత్తగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే.. ⇒ నేను వరంగల్లో పుట్టాను. హైదరాబాద్లో పెరిగాను. ఎంబీఏ చేశాను. కాలేజీలో ఉండగానే మోడలింగ్ చేసేదాన్ని. ఫేస్బుక్లో నా ఫోటోలు చూసిన ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు.⇒ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నా మొదటి సినిమా. కాని, ‘అంతకు ముందు ఆ తరువాత’ నన్ను హీరోయిన్ గా గుర్తింపునిచ్చిన సినిమా. గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ ముఖ్యమని అప్పుడే అర్థమైంది.⇒ హీరోయిన్ అవ్వకముందు నా రోజు చాలా బిజీగా ఉండేది. ఉదయం కాలేజీ, మధ్యాహ్నం సాఫ్ట్వేర్ జాబ్, సాయంత్రం ఇంకో పని. అప్పుడే హార్డ్ వర్క్ అలవాటు అయిపోయింది.⇒ ‘అ!’ సినిమాలో లెస్బియన్ పాత్ర చేశాను. చాలామంది షాక్ అయ్యారు. కాని, నేను మాత్రం కొత్తగా ట్రై చేయాలనే ఫీలింగ్తో ఎంతో ఎంజాయ్ చేశాను. రిస్క్ తీసుకోకపోతే గ్రోత్ ఉండదు కదా.⇒ నేను తెలంగాణ అమ్మాయినే. కాని, ‘ఓం శాంతి శాంతిః’ సినిమా కోసం తూర్పు గోదావరి యాసలో మాట్లాడాను. యాస మారడం నాకు సరదానే. అదే సినిమాలోని ఒక సీన్ కోసం నిజంగానే హీరో నా చెంపపై కొట్టారు. ఆ సీన్ లో కనిపించే కన్నీళ్లు యాక్టింగ్ కాదు. నా ప్యూర్ రియాక్షన్.⇒ కెరీర్ మొదట్లో నా రంగు గురించి, లుక్స్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో చాలా బాధపడ్డాను. ఇప్పుడు మాత్రం నా రంగుపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే నా ఐడెంటిటీ.⇒ రిలేషన్ షిప్ రూమర్స్ వస్తూనే ఉంటాయి. నేను ఒక వ్యక్తికి దగ్గరగా ఉన్న మాట నిజమే. పెళ్లి గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. సరైన సమయం వస్తే నేనే చెప్తాను.⇒ కాఫీ లేకుండా నా రోజు ప్రారంభం కాదు. ఖాళీ దొరికితే ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం నాకు చాలా ఇష్టం.⇒ ఫిట్నెస్ నాకు సీరియస్ విషయం. యోగా, జిమ్, కిక్బాక్సింగ్ రెగ్యులర్. స్ట్రాంగ్గా ఉండాలంటే కష్టపడాల్సిందే అని నమ్ముతాను.⇒ ఎప్పటికైనా సరే మహిళా ప్రాధాన్యం ఉన్న చరిత్రాత్మక పాత్ర ఒకటి చేయాలన్న కల నన్ను వెంటాడుతోంది. -
విదేశాల్లో విశ్వనాథుడు
త్రిమూర్తులలో ఒకడైన శివుడు త్రినేత్రుడు. శంకరుడైన శివుడు భక్తవశంకరుడు. అతడే విశ్వనాథుడు. శివారాధన భారత భూభాగానికి మాత్రమే పరిమితం కాదు. పురాతన కాలం నుంచి కొన్ని ఇతర దేశాల్లోనూ శివారాధన ఉండేది. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఆ దేశాల్లో ఆనాటి శివాలయాలు ఉన్నాయి.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విదేశాల్లో ఉన్న కొన్ని పురాతన శివాలయాల గురించి తెలుసుకుందాం.పశుపతినాథ్ ఆలయంమన పొరుగు దేశమైన నేపాల్ రాజధాని కఠ్మాండు శివార్లలో బాగ్మతి నదీతీరంలో ఈ ఆలయం ఉంది. పురాతన శైవక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం గురించిన ప్రస్తావన పలు పురాణ, చరిత్ర గ్రంథాలలో కూడా ఉంది. ‘గోపాలరాజ వంశావళి’ ప్రకారం దీనిని ప్రచండ దేవ కట్టించాడు. పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు ‘కోటి రుద్రసంహిత’ కథనం. నేవారీ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.ప్రాంబనన్ ఆలయ సముదాయంపురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఇండోనేసియా రాజధాని యోగ్యకర్తా ప్రత్యేక ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంగణంలో త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి. వీటిలో అతి ఎత్తయిన గోపురం ఉన్నది శివాలయం. ఈ ప్రాంగణంలో శివాలయమే ప్రధానమైనది. ఈ ఆలయాలు క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటివి. ఇప్పటి జావా ద్వీపం కేంద్రంగా ఏర్పడిన మాతరం రాజ్యాన్ని ఏలిన రాజులు ఈ ఆలయాలను నిర్మించారు. రాజు రాకాయి పికాతన్ క్రీస్తుశకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు దీనిని విస్తరించారు. ఇందులోని శివాలయాన్ని 856లో ప్రారంభించినట్లు శాసనాధారాలు ఉన్నాయి.మై సన్ సాంక్చుయరీఇది వియత్నాంలో ఉంది. పురాతన చంపా నాగరికతకు చెందిన చామ్ రాజవంశీకులు శివారాధకులు. వారు క్వాన్ నామ్ ప్రావిన్స్లో దాదాపు డెబ్బయి శివాలయాలను నిర్మించారు. ఈ ఆలయాలు క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్యకాలంలో నిర్మించినవి. వీటిలో చంపా రాజు భద్ర వర్మ నిర్మించిన భద్రేశ్వర ఆలయం ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఆనాటి చంపా రాజ్య రాజధాని ట్రా కీయు నుంచి దక్షిణాన హోయి అన్ వరకు దాదాపు ముప్పయ్యారు కిలోమీటర్ల మార్గంలో ఈ పురాతన ఆలయాలను నిర్మించారు. వీటిని ఇటుకలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయాలను చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.మున్నేశ్వరం ఆలయంపురాతనమైన ఈ శివాలయం శ్రీలంకలోని పుట్టాళం జిల్లా మున్నేశ్వరం గ్రామంలో ఉంది. వెయ్యేళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే గాథలు స్థలపురాణాలుగా ప్రచారంలో ఉన్నాయి. శ్రీలంకలోని ఐదు పురాతన శైవక్షేత్రాలైన ‘పంచ ఈశ్వరం’ క్షేత్రాలలో మున్నేశ్వరం ఒకటి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై సరైన ఆధారాలు లేవు. అయితే, క్రీస్తుశకం 1412లో కొట్టె రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి పునరుద్ధరించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. పదహారో శతాబ్దిలో పోర్చుగీసు సేనల దాడిలో ఈ ఆలయం దెబ్బతింది. ఆ తర్వాత కాండ్యన్ రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ పద్దెనిమిదో శతాబ్దిలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.ప్రీహ విహార్పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం కాంబోడియాలో ఉంది. కాంబోడియా– థాయ్లండ్ సరిహద్దుల్లోని డాంగ్రేక్ పర్వతశ్రేణులలోని నిటారుగా ఉన్న కొండ మీద దాదాపు ఎనిమిది వందల మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రీహ విహార్ ఆలయ సముదాయం క్రీస్తుశకం పదకొండో శతాబ్ది నాటిది. ‘ప్రీహ విహార్’ అంటే దేవతల విహార స్థలం అని అర్థం. ఖ్మేర్ రాజులు మొదటి సూర్యవర్మ, రెండో సూర్యవర్మ ఇక్కడ శిఖరేశ్వర, భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారు. వీటి చుట్టూ అనేక ఉపాలయాలను కూడా నిర్మించారు. నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తయిన మెట్లతో కూడిన మార్గం ఒక్కటే శరణ్యం. పర్యాటకులు పెద్దసంఖ్యలో ఈ ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. -
నలుపు మెరుపు
స్ట్రాబెర్రీలు సాధారణంగా ఎర్రగా ఉంటాయి. జపాన్లో పండించే అరుదైన తెల్లని స్ట్రాబెర్రీలు కూడా కొందరికి తెలుసు. తాజాగా చైనాలో పండే ఈ నల్లని స్ట్రాబెర్రీలు జనాలకు నోరూరిస్తున్నాయి. ఇవి సాధారణ స్ట్రాబెర్రీల కంటే చాలా గాఢమైన రంగులో ఉంటాయి. వీటి పైనుండే తొక్క దాదాపు నల్లగా ఉంటుంది. లోపలి గుజ్జు కూడా గాఢమైన ఎరుపు, ఊదా రంగుల్లో ఉంటుంది. మిగిలిన రకాలకు చెందిన స్ట్రాబెర్రీల కంటే ఇవి చాలా తియ్యగా ఉంటాయి. సాధారణ స్ట్రాబెర్రీల కంటే వీటిలో దాదాపు ఇరవై శాతం చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఏమాత్రం పులుపు లేకుండా చాలా తీపిగా ఉంటాయి. చైనాలో వీటిని పదేళ్ల కిందట ప్రయోగాత్మకంగా పండించారు. ఇటీవల ఇవి అంతర్జాతీయ మార్కెట్కు చేరి, రుచులూరిస్తున్నాయి. ‘బ్లాక్ పర్ల్’ పేరుతో విక్రయిస్తున్న ఈ నల్లని స్ట్రాబెర్రీల ధర తెలుసుకుంటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఈ రకం స్ట్రాబెర్రీ ఒక్కో పండు ధర 6 డాలర్లు (రూ.550) మాత్రమే! సాధారణ స్ట్రాబెర్రీల కంటే భిన్నమైన రంగులో ఉన్నందున వీటిపై అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు.వీటిని పండించడంలో జన్యుమార్పిడి పద్ధతులేవీ ప్రయోగించలేదని చైనీస్ వ్యవసాయ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ‘యాంథోసైనైన్’ అనే పదార్థం ఎక్కువగా చేరడం వల్లనే ఈ పండ్లకు గాఢమైన రంగు ఏర్పడుతోందని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యాన విభాగం ప్రొఫెసర్ లి బింగ్బింగ్ చెబుతున్నారు. చైనాలో వీటిని ముద్దుగా ‘బిజిన్ హిమె’ (అందాల యువరాణి) అని పిలుచుకుంటున్నారు. -
అవి ఉంటే చాలు రెడీ!
హీల్స్ లేకపోయినా స్టయిల్ తగ్గదు, హెవీ మేకప్ లేకపోయినా గ్లామర్ మిస్ కాదు! అదే నటి సయామీ ఖేర్ మ్యాజిక్. ఫ్యాషన్ రూల్స్ కంటే కంఫర్ట్ని సీరియస్గా తీసుకునే ఆమె స్టయిలింగ్ సీక్రెట్స్ ఇప్పుడు మీకోసం..డ్రెస్.. బ్రాండ్: పునీత్ బలానా ధర రూ. 47,700జ్యూలరీ బ్రాండ్: అమ్రపాలీ జ్యూయెల్స్ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఫ్యాషన్ అంటే కాపీ కాదు, కంఫర్ట్. సంప్రదాయ, పాత ఫ్యాషన్ రూల్స్కు నేను బానిసను కాదు. నచ్చిన రంగు, నచ్చిన దుస్తులను ఆత్మవిశ్వాసంతో వేసుకోవడమే నా స్టయిల్. ఒక బ్లాక్ డ్రెస్, మంచి జీన్స్, సింపుల్ డైమండ్ ఇయర్రింగ్స్ ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను. – సయామీ ఖేర్ -
విధ్వంసం విజయం
ప్రకృతి ఇల్లు చిరునవ్వుతో నిలబడి ఉంటే, అమ్మలాంటి చెట్లు నీడనిస్తున్నాయి, నాన్నలాంటి నదులు జీవం పోస్తున్నాయి, అన్నల్లా కొండలు రక్షణ ఇస్తున్నాయి, చెల్లెళ్లలా పూలు రంగులు పూస్తున్నాయి. ఇంతలో... ఘీ.. ఘీ.. ఘీ.. ఘీ.. ఒక భారీ బుల్డోజర్ ఎంట్రీ! దాని పేరు ‘అభివృద్ధి’ అది వచ్చిన వెంటనే చెట్లు పడిపోతాయి, నదులు మురికిదేరుతాయి, ఆకాశం పొగమయమవుతుంది, పక్షులు ‘ఇక్కడ ఉండలేం బాబోయ్!’ అని ఎగిరిపోతాయి.అప్పుడే అభివృద్ధి నివేదికలు స్టేజ్పైకి ఎంట్రీ మైక్ పట్టుకుని: ‘ప్రకృతిని కాపాడటానికి 1 డాలర్, ప్రకృతిని నాశనం చేయడానికి 30 డాలర్లు!’ హాల్ మొత్తం నిశ్శబ్దం. అప్పటి వరకు ఉద్ధరిస్తున్నాననే గర్వంతో ఉన్న అభివృద్ధి కూడా షాక్!దావోస్ గ్లాస్ ప్యాలెస్లో ప్రపంచ పెద్దలు సూటు బూటు, ల్యాప్టాప్లతో కూర్చొని ‘భూమిని ఎలా కాపాడాలి?’ అని చర్చలు జరుపుతుండగా, తెర వెనుక నుంచి ఒక్కసారిగా ‘ఆగండి.. ఆగండి.. రియాలిటీ చెబుతున్నా’ అంటూ ఒక బాంబులాంటి రిపోర్ట్ విసిరింది ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ ఈపీ). తాజాగా ఇది విడుదల చేసిన ‘ప్రకృతి ఆర్థిక స్థితి 2026’ నివేదిక చదివితే మనకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి! 2023లో ప్రపంచం మొత్తంగా ప్రకృతిని నాశనం చేసే పనుల కోసం సుమారు 7.3 ట్రిలియన్ డాలర్లు అంటే (ఆరువందల యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేసిందని ఈ నివేదిక వెల్లడించింది.అంటే భారీ పరిశ్రమలు, పొగలు కక్కే కర్మాగారాలు, అడవుల నరికివేత, బొగ్గు, చమురు తవ్వకాలు అన్నీ కలిసి భూమిపై ఒక మహా విధ్వంస యజ్ఞం చేస్తున్నాయి. మరి ప్రకృతిని కాపాడటానికి ఎంత పెట్టారు? అంటే కేవలం 220 బిలియన్ అంటే (పద్దెనిమి లక్షల కోట్ల రూపాయలు) మాత్రమే! అంటే ఒకవైపు అడవులకు నీళ్లు పోసినట్టు నటిస్తూ, మరోవైపు వాటిని అగ్గిపెట్టెలతో కాల్చేస్తున్నారని ఇది స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సరదాగా చెప్పాలంటే మనం ప్రకృతికి ప్రేమగా ఒక గ్లాసు నీళ్లు పోస్తే, వెంటనే దానిమీద ముప్పై బకెట్ల విషం కుమ్మరిస్తున్నాం!ఇది కేవలం గణాంకాల కథ కాదు! ఇది మన భవిష్యత్తు క«థ, మన పిల్లల భవిష్యత్తు కథ, మన గ్రహం బతుకు కథ! ప్రపంచ పెద్దలు మెత్తని కుర్చీల్లో కూర్చుని ‘గ్రీన్ గ్రోత్’ అంటూ ఊరించే మాటలు చెబుతున్న సమయంలోనే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం అకస్మాత్తుగా తెరపైకి వచ్చి, అద్దం పట్టినట్టు ఈ నిజాన్ని బయటపెట్టింది. ఇది అందరినీ ఆలోచింపజేసే విషయం. దీని ప్రకారం మనం ఒక చేత్తో మొక్క నాటుతూ, మరో చేత్తో అడవిని నరికేస్తున్నాం.కార్యాచరణలో కర్మాగారాల పొగ గొట్టాలు; కాగితాల్లో మాత్రం పర్యావరణ ప్రేమ, భూమిపై కాంక్రీటు దాడి. ఇదే మన ఆధునిక అభివృద్ధి విరోధాభాస. అందుకే ఈ నివేదిక ఆషామాషీ హెచ్చరిక కాదు, ఇదొక పెద్ద అలర్ట్ సైరన్. అందరూ త్వరగా గ్రహించించాలని మారుమోగేలా సైలెంట్గా చెబుతోంది. పచ్చని భూమిపై కరెన్సీ గాటు!సమస్య అంతా అంకెల్లోనే కాదు. మనిషి ఆలోచన, అమలు చేసే విధానాల్లో ఉంది. 2023 గణాంకాల ప్రకారం ప్రపంచం ప్రకృతికి నీళ్లు పోయడం కాదు, పెట్రోల్ పోస్తోంది. యూఎన్ పర్యావరణ సంస్థ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరువందల లక్షల కోట్ల రూపాయలు ప్రకృతికి హానికరమైన పెట్టుబడులు, సబ్సిడీల రూపంలో ప్రవహిస్తున్నాయి. ఇవి అడవుల విధ్వంసం, కాలుష్యం, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం, జల వనరుల క్షీణతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతున్నాయి.దీనికి వ్యతిరేకంగా, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు అంటే అడవుల పునరుద్ధరణ, పట్టణాల్లో పచ్చదనం పెంపు, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం వంటి చర్యలకు మనం పెట్టింది కేవలం సుమారు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలే! అంటే భారీ మంట మీద చిన్న నీటి బొట్టంత! ఒక వైపు డబ్బు చెరకు యంత్రంలా ప్రకృతిని పిండేస్తుంటే, మరోవైపు మన రక్షణ ప్రయత్నాలు చిరుదీపంలా మిణుకు మిణుకుమంటున్నాయి. ఇదే అసలు ప్రకృతి–నెగటివ్ ఫైనాన్ ్స పరస్పర వైరుధ్యంభారత్లోనూ జీవన్మరణ పోరు!భారత్ ఇప్పుడు అభివృద్ధి రైల్లో వేగంగా దూసుకెళ్తోంది. కాని, ఆ రైలు పట్టాలు ప్రకృతి పక్కటెముకల మీద వేసినట్టే ఉన్నాయి. ఒకవైపు భూమి కూడా ఉడికిపోయేలా చేసే తీవ్రమైన వేడిగాలులు, మరోవైపు ఊహించని అస్థిర వర్షాలు, ఒక్కసారిగా ఊళ్లను మింగేసే వరదలు, ఇంకోచోట నేల బీటలువారే కరవులు. నగరాల్లో నీటి కోసం క్యాన్ల క్యూలు, గ్రామాల్లో భూమి శ్వాస తీసుకోలేని భూక్షయం ఇలా ప్రకృతి మనతో టగ్ ఆఫ్ వార్ ఆడుతోంది.ఇదే సమయంలో మనం మాత్రం అభివృద్ధి పేరిట పట్టణాలను విస్తరిస్తూ, మెరిసే రహదారులు వేస్తూ, పొడవాటి ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మిస్తూ, రియల్ ఎస్టేట్ పేరుతో చెట్లను చెక్కేస్తున్నాం. అంటే ఒక చేత్తో కొత్త ఇల్లు కడుతూనే, మరో చేత్తో ఆ ఇంటి పునాదుల్ని మంటల్లోకి తోసేస్తున్నాం. ఇలా అద్దాల మేడలతో మెరిసే కొత్త ఇల్లునే చూస్తున్నాం. కాని, దాని వేనుకే మట్టిలో కలిసిపోతున్నా మన ఆరోగ్యం, నీడనిచ్చిన నేలతల్లి ఆరోగ్యాన్ని మరచిపోతున్నాం.అసలు సమస్య ఎక్కడ ఉందియూఎన్ ఈపీ గణాంకాల ఆధారంగా 2030 లక్ష్యం ఏడాదికి 571 బిలియన్ డాలర్లు అవసరం. అంటే, 2030 నాటికి పెట్టుబడులు కనీసం 571 బిలియన్ డాలర్లు సంవత్సరానికి చేరాల్సి ఉంటుందని యూఎన్ ఈపీ చెబుతోంది. ఇది ప్రస్తుత స్థాయితో పోలిస్తే 7.5 రెట్లు పెరుగుదల, అయినా ప్రపంచ జీడీపీలో కేవలం 0.5 శాతం మాత్రమే. అంటే, ఆర్థికంగా ఇది అసాధ్యం కాదు. కాని, రాజకీయ సంకల్పం అవసరం. ఎందుకంటే, ఇక్కడ సమస్య డబ్బు కాదు. మన ప్రాధాన్యాలు.ప్రభుత్వం క్రమం తప్పకుండా ఈ ‘విధ్వంసకర ఆర్థిక వ్యవస్థ’ ఎలా పనిచేస్తోందో చూసుకుంటూ ఉండాలి. అలాగే ప్రకృతిపై నెగటివ్గా డబ్బు ఎక్కువగా ఎక్కడికి వెళ్తోందో అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అంటే శిలాజ ఇంధనాలు, భారీ పరిశ్రమలు, రసాయనిక ఎరువులు, నిర్మాణ రంగం, రవాణా, వ్యవసాయ సబ్సిడీలు.. ఇలా రోగిని ఆసుపత్రిలో చేర్చాం, కాని, ఇచ్చిన మందులు వ్యాధి నయం చేయడానికి బదులు విషంగా పనిచేస్తున్నాయేమో కూడా చూసుకుంటూ ఉండాలి.మధ్యేమార్గం లేదు.. ప్రపంచ ఆర్థిక చర్చలు సాగే గదుల్లో మాటలు మృదువుగా వినిపిస్తాయి. కాని, యూఎన్ ఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ మాత్రం మైక్ పట్టుకుని ఉరుములా మాట్లాడారు. ఆమె మాటల్లో రాజకీయం లేదు, రాజీపడే ధోరణీ లేదు; కేవలం నగ్నసత్యం మాత్రమే! ‘డబ్బు ఎటు వెళుతుందో చూస్తేనే అసలు కథ తెలుస్తుంది,’ అని ఆమె గట్టిగా చెప్పారు. ఒకవైపు ప్రకృతిని కాపాడతామంటూ ఫొటోలు దిగుతామా? లేక మరోవైపు దాన్ని కాల్చేస్తూ పెట్టుబడులు పెడతామా? ఈ రెండింటి మధ్య ఎలాంటి సేఫ్రోడ్ లేదు.ఎందుకంటే, ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ ఉంది. అదే ప్రకృతిని రక్షించే పెట్టుబడుల్లో దాదాపు 90 శాతం భారాన్ని ప్రభుత్వాలే మోస్తున్నాయి. ప్రైవేట్ రంగం మాత్రం పక్కన నిలబడి చూస్తోంది. ఎందుకంటే, ఇక్కడ ప్రైవేట్ వారి వాటా కేవలం పదిశాతమే! అంతేకాదు, ప్రకృతికి హాని చేసే పెట్టుబడులు ఎక్కువగా కొన్ని రంగాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా శిలాజ ఇంధనాలు, రసాయనిక ఎరువులు, భారీ మౌలిక సదుపాయాలు. ఇలా చూస్తే వీటన్నింటిలోనూ ప్రభుత్వం పెట్టుబడులే ఎక్కువ శాతం. అందుకే, ఆమె ప్రభుత్వం ఇక మాటల కాలంతో కాదు. ఎంపికలతో చికిత్స చేయాలని సూచిస్తోంది. ప్రకృతిని చంపాలా? లేదా బతికించాలా? అన్నది ఇప్పుడు మొత్తం ప్రభుత్వాల చేతుల్లోనే ఉందని ఆమె చెప్పారు.ప్రకృతికి వ్యతిరేకంగా ఖర్చవుతున్న ప్రజాధనం!ప్రపంచం వాతావరణ మార్పుల ప్రభావాలతో వణికిపోతున్న ఈ కాలంలో, మనం ప్రకృతిని కాపాడేందుకు ఖర్చు చేయాల్సిన ప్రజాధనం ఆశ్చర్యకరంగా అదే ప్రకృతికి హాని చేసే రంగాలకే ఎక్కువగా ఖర్చవుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో పర్యావరణానికి హానికరమైన సబ్సిడీలు రూ. 149 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కోవిడ్ ప్రభావంతో 2020లో ఇవి స్వల్పంగా తగ్గి రూ. 141 లక్షల కోట్లకు చేరడంతో ‘మార్పు మొదలైందేమో’ అని కనిపించింది. కాని, ఆ తర్వాత అది ఒక చిన్న ఖర్చుల పండుగలా మొదలై, 2022 నుంచి ఇప్పటి వరకు వ్యయ మహోత్సవంలా కొనసాగింది. 2021లో ఖర్చు మళ్లీ పెరిగి రూ. 174 లక్షల కోట్లు, 2022లో అయితే ఏకంగా రూ. 241 లక్షల కోట్లకు చేరింది. శిలాజ ఇంధనాలు – విలన్ కు భారీ పేమెంట్! సినిమాలో విలన్ కి ఇంత బడ్జెట్ పెట్టినట్టు, కాలుష్యానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలకే అత్యధిక సబ్సిడీలు అందాయి. 2022లో అయితే, ఈ ఒక్క రంగానికే సుమారు రూ. 148 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం సబ్సిడీల్లో శిలాజ ఇంధనాల వాటా చాలా పెద్దది. అంటే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన ఇంధనాలకే, వాతావరణాన్ని కాపాడాల్సిన డబ్బు ఎక్కువగా వెళ్తోంది. ఇది అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేస్తున్న అతిపెద్ద అన్యాయం. రవాణా రంగం – మారని స్క్రిప్ట్రవాణా రంగం మాత్రం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 33 లక్షల కోట్లు తీసుకుంటూ వస్తోంది.ఎలక్ట్రిక్ మార్పులు, పచ్చదనం అన్నీ పక్కన పెడితే, ’ఏ మార్పు లేకుండా, ఎలాంటి పునరాలోచన లేకుండా ఈ ఖర్చు కొనసాగడం గమనార్హం. ఇది పచ్చదనం వైపు మార్పు ఎంత నెమ్మదిగా జరుగుతోందో సూచిస్తుంది.వ్యవసాయ, మత్స్యకార రంగాలు – చివర్లో వినోదం2023లో వ్యవసాయానికి సుమారు రూ. 15 లక్షల కోట్లు, మత్స్యకార రంగానికి రూ. 12 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. ఆహార భద్రతకు ఇవి అవసరమైనప్పటికీ, పర్యావరణానికి అనుకూలమైన విధానాలతో కాకుండా ఖర్చవుతున్నప్పుడు ఇవి కూడా హానికరంగానే మారతాయి. ఎలాగంటే, ప్రకృతిని దెబ్బతీస్తే, హీరో కూడా నెగటివ్ అయిపోతాడు కదా! చిన్నవే కాని... నిరంతరమైన భారాలుప్లాస్టిక్స్, మైనింగ్, నిర్మాణ రంగాలకు ఒక్కొక్కటికీ ప్రతి సంవత్సరం రూ. 2 నుంచి 5 లక్షల కోట్లు మాత్రమే కేటాయించినప్పటికీ, అవి నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇలా చిన్న చిన్ని ఖర్చులే చివరికి భారీ పర్యావరణ బిల్లులుగా మారాయి. చివరికి, చిన్న చినుకులే చివరికి పెద్ద వరదలా మారతాయన్న మాట ఇక్కడ అక్షరాలా నిజమవుతోంది.అంకెలు అబద్ధం చెప్పవు. మన డబ్బు ఎక్కడికి వెళుతుందో స్పష్టంగా చూపిస్తాయి. ప్రకృతిని కాపాడాలి అంటూనే, అందుకు హాని చేసే రంగాలకు బడ్జెట్ పెడితే, అది ప్రేమ కాదు. పర్యావరణానికి వేసే ఫైన్! అలాగే, ఈ గణాంకాలు మన ముందు ఒక స్పష్టమైన ప్రశ్నను నిలబెడుతున్నాయి. ప్రకృతని నాశనం చేయకుండా అభివృద్ధి జరగలేదా? ఇలా జరగాలంటే, ప్రజాధనం ఖర్చయ్యే దారి హానికరమైన సబ్సిడీల నుంచి, ప్రకృతి ఆధారిత పరిష్కారాల వైపుకు మళ్లాలి. అప్పుడే రాబోయే తరాలకు మనం నిజమైన సంపదను వదిలివెళ్లగలం. ఒకవైపు మనం అభివృద్ధి అంటూ ఆకాశంలోకి రాకెట్లు ఎగరేస్తుంటే, మరోవైపు భూగోళం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఊపిరాడక తడబడుతోంది. మనం ఇంకా ఇలాగే కొనసాగితే, రేపటి పిల్లలకు మ్యూజియంలో మాత్రమే అడవి తల్లిని చూపించాల్సి వస్తుంది. ‘ఇక్కడ ఒకప్పుడు చెట్లు ఉండేవి’ అని. ఈ భూమి మన తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుంచి అప్పుగా తీసుకున్న భవిష్యత్తు. ఆ అప్పును తీర్చే సమయం ఇప్పుడే. అందుకే, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ప్రకృతిని ఒక ఖర్చుగా కాకుండా, జీవన బీమాగా చూడాలి.భారత్లో గ్రీన్ షీల్ట్! ఈ అగ్నిపరీక్షలో భారత్కు గ్రీన్ షీల్ట్లా నిలుస్తోంది సీఏఎమ్పీఏ (పరిహార అటవీ నిధుల నిర్వహణ, ప్రణాళిక సంస్థ). ఈ సంస్థ రోడ్లు, గనులు, పరిశ్రమలు, డ్యాములు, హైవేలు కోసం అడవులు నరికినప్పుడల్లా ‘సరే, ఈ చెట్లు పోయాయి, మరి కొత్త చెట్లు ఎవరు పెంచుతారు?’ అనే ప్రశ్నతో ముందుకు వచ్చింది. అందుకే, స్వయంగా సీఏఎమ్పీఏ (కాంపా) నే రంగంలోకి దిగి, ‘ఒక చెట్టు పడిపోతే, రెండు చెట్లు నాటుదాం’ అనే విధానంతో పనిచేస్తోంది. ఇలా అడవులు నరుక్కుంటే వాటికి బదులుగా కొత్త అడవులు పెంచడం, ఎడారిలా మారిన భూములను మళ్లీ పచ్చగా మార్చడం, గ్రామీణ–గిరిజన ప్రాంతాల్లో అటవీ జీవనాధారాన్ని కాపాడడం చేస్తోంది.అలాగే, నదులు, వాగులు, చెరువుల పక్కన హరిత రక్షణ కవచం నిర్మించడం, వాతావరణ మార్పులకు తట్టుకునే అడవులను రూపొందించడం చేస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందంటే! ఎవరైనా ప్రాజెక్టు కోసం అడవిని నరికేస్తే, వారు పరిహార నిధి కట్టాలి. ఆ డబ్బు మొత్తం సంస్థ ఖాతాలోకి వెళుతుంది.ఆ నిధితో కొత్త మొక్కలు నాటుతారు, అడవులను పునరుద్ధరిస్తారు, నేలను బతికిస్తారు. అంటే మనం ఒకవైపు చెట్టును నరికేస్తే, మరోవైపు రెండు మొక్కలను నాటే ‘గ్రీన్ రీబూట్ సిస్టమ్’లా పనిచేస్తుంది. ఇలా భారత్లోని కాంపా అటవీ పునరుద్ధరణ, జీవవ్యవస్థల రక్షణకు జరుగుతున్న ప్రయత్నాలను నివేదిక సానుకూలంగా ప్రస్తావించింది. ఇది ఇతర దేశాలకు కూడా అనుసరణీయ మోడల్గా నిలవవచ్చని యూఎన్ ఈపీ భారత్ ప్రతినిధి బాలకృష్ణ పిసుపాటి అన్నారు. - దీపిక కొండి -
థైరాయిడ్కు.. సేతు బంధాసనం
మహిళల్లో వయసుతో సంబంధం లేకుండా సాధారణంగా కనిపించే సమస్య థైరాయిడ్. ఈ సమస్యను సహజంగా నియంత్రించడంలో సేతు బంధాసన (Setu Bandhasana) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘సేతు’ అంటే వంతెన, ‘బంధ’ అంటే బంధించడం.. ఈ ఆసనంలో శరీరం వంతెన ఆకారంలో ఉండి, గొంతు, మెడ ప్రాంతంపై మృదువైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల విడుదల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే ఛాతీ తెరుచుకోవడం వల్ల శ్వాస లోతుగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.ఉపయోగాలు..థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది. మెటబాలిజం మెరుగై, రువు పెరుగుదల తగ్గుతుంది. గొంతు, మెడ ప్రాంతం బలపడుతుంది. అలసట, నిద్రలేమి తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. వెన్ను, నడుము నొప్పులకు ఒక వరం.జాగ్రత్తలు.. మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు ఉన్నవారు డాక్టర్, యోగా గురువు సలహాతో చేయాలి. గర్భధారణ సమయంలో ఈ ఆసనం చెయ్యొద్దు. తీవ్రమైన నడుము నొప్పి లేదా స్లిప్ డిస్క్ ఉన్నవారు చెయ్యకపోడం మంచిది.చేసే విధానం..స్టెప్ 1: ముందుగా వెల్లకిలా (వెనుక భాగం వెనుకకు ఆనించి) పడుకోవాలి.స్టెప్ 2: రెండు మోకాళ్లను మడిచి, పాదాలను నేలపై నడుముకు దగ్గరగా ఉంచాలి. చేతులను శరీరానికి పక్కన, అరచేతులు నేలను తాకుతూ ఉండాలి.స్టెప్ స్టెప్ 3: గాలి పీల్చుకుంటూ, నెమ్మదిగా నడుమును పైకి లేపాలి.స్టెప్ 4: భుజాలను, చేతులను, పాదాలను బలంగా నేలపై ఆనించి, మీ ఛాతిని గడ్డం వైపు తీసుకురావాలి. ఈ స్థితిలో 15–30 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండాలి.స్టెప్ 5: శ్వాస విడిచే సమయంలో నెమ్మదిగా నడుమును కిందకు దించి వెన్నెముకను నేలపైకి తీసుకువచ్చి, విశ్రాంతి తీసుకోవాలి.– పాతర్ల అనిత, యోగాట్రైనర్ -
పిల్లలకు ఫోన్ ఎప్పుడు ఎలా ఇవ్వాలి?
‘మా అబ్బాయికి ఫోన్ ఎప్పుడు ఇవ్వాలి?’‘మా అమ్మాయి ఫోన్ లేకుండా అన్నం తినడం లేదు, ఏం చేయాలి?’ అని చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు. నేటి హైటెక్ యుగంలో పిల్లలకు ఫోన్ ఇవ్వడం తప్పనిసరి అవసరంగా మారింది. పిల్లలకు సెల్ ఫోన్ పరిచయం చేయడం అనేది కేవలం ఒక పరికరాన్ని ఇవ్వడం కాదు, ఒక అపరిమితమైన, నియంత్రణ లేని ప్రపంచానికి వారిని పరిచయం చేయడం. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు, శాస్త్రీయ దృక్పథం, పరిష్కారాల గురించి చర్చిద్దాం.ఏ వయస్సులో, ఎలా పరిచయం చేయాలి?చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఏడుపు ఆపడానికి లేదా వారు అన్నం తినడానికి ఆరు నెలల వయస్సు నుండే ఫోన్ చూపిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం.» రెండేళ్ల వరకు మొబైల్ ఫోన్కు పూర్తి దూరంగా ఉంచాలి. ఈ దశలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో వారికి మనుషుల స్పర్శ, మాటలు అవసరం, డిజిటల్ బొమ్మలు కాదు.» రెండు నుంచి ఐదేళ్ల వరకు వారానికి రెండుసార్లు రైమ్స్ లేదా స్టోరీ టెల్లింగ్ వీడియోలు చూపించవచ్చు. అయితే, మీరు పక్కనే ఉండి వివరించాలి.» ఆరు నుంచి పన్నెండేళ్ల వరకూ హోంవర్క్ హెల్ప్ కోసం, కొత్త స్కిల్స్ (కోడింగ్, డ్రాయింగ్) నేర్చుకోవడానికి మాత్రమే. గేమ్స్ అనేవి కేవలం వీకెండ్స్లోనే.‘బహుమతి’గా ఇవ్వకండి..చాలామంది తల్లిదండ్రులు పుట్టినరోజుకో లేదా క్లాసులో ఫస్ట్ వచ్చినందుకో స్మార్ట్ఫోన్ను ఒక రివార్డుగా ఇస్తారు. ఇది తప్పు. ఇలా చేయడం వల్ల పిల్లల మెదడులో ఫోన్ అనేది ఒక ‘విలువైన ఆస్తి’గా ముద్రపడిపోతుంది. ఫోన్ కేవలం సమాచారం తెలుసుకోవడానికి, అవసరమైనప్పుడు మాట్లాడుకోవడానికి వాడే ఒక ‘టూల్’ మాత్రమేనని మొదటి నుంచి అర్థమయ్యేలా చెప్పాలి.‘కో–వ్యూయింగ్’ పద్ధతిని పాటించండిపిల్లలకు ఫోన్ ఇచ్చి మీరు వేరే పనిలోకి వెళ్ళిపోవద్దు. మొదట్లో వారు ఏం చూస్తున్నారో వారితో కలిసి చూడండి. పిల్లలు ఒంటరిగా స్క్రీన్ చూస్తున్నప్పుడు వారి మెదడు కేవలం ‘రిసీవింగ్ మోడ్’లో ఉంటుంది. అదే మీరు పక్కన ఉండి, ‘చూడు ఆ పిచుక ఎంత బాగుందో!’, ‘ఆ రంగు ఏంటి?’ అని అడుగుతుంటే వారి మెదడు చురుగ్గా స్పందిస్తుంది. దీనినే ‘జాయింట్ అటెన్షన్’అంటారు.టెక్నాలజీ కాంట్రాక్ట్ ...పిల్లల వయస్సు ఎనిమిదేళ్లు దాటితే, వారికి ఫోన్ ఇచ్చే ముందే ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. అది సరదాగా ఉన్నా, నియమాలు స్పష్టంగా ఉండాలి.» రోజుకు 30–45 నిమిషాలు మాత్రమే.» సైన్స్ వీడియోలు, క్విజ్ గేమ్స్ మాత్రమే చూడాలి. » రూల్ అతిక్రమిస్తే, మరుసటి రోజు ఫోన్ ఉండదు.ఇలా చేయడం వల్ల పిల్లల్లో ‘సెల్ఫ్ డిసిప్లిన్’ పెరుగుతుంది.కంటెంట్ క్యూరేషన్...సెల్ ఫోన్ పరిచయం చేసేటప్పుడు మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్ విషయంలో జాగ్రత్త వహించండి.» ‘ఖాన్ అకాడమీ కిడ్స్’ లేదా ‘డ్యుయోలింగో’ వంటి యాప్స్ ద్వారా భాషా నైపుణ్యాలను పరిచయం చేయండి.» గూగుల్ ‘ఫ్యామిలీ లింక్’ వంటి యాప్స్ వాడండి. ఏది పడితే అది క్లిక్ చేయకుండా ఫిల్టర్లు పెట్టండి.‘నో ఫోన్’ సమయాలు...ఫోన్ పరిచయం చేసే తొలిరోజే.. అది ఎప్పుడు వాడకూడదో కూడా చెప్పాలి.» బాత్రూమ్, బెడ్ రూమ్లో ఫోన్ అస్సలు రాకూడదు.» భోజనం సమయంలో నో ఫోన్. ఫోన్ చూస్తూ తినడం వల్ల పిల్లలకు ఆకలి మీద నియంత్రణ ఉండదు, ఇది భవిష్యత్తులో ఈటింగ్ డిజార్డర్లకు దారితీస్తుంది.డిజిటల్ ఎటికెట్స్ నేర్పండిఫోన్ అంటే కేవలం గేమ్స్ కాదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి? మెసేజ్ చేసేటప్పుడు ఎలాంటి భాష వాడాలి? ఫోటోలు తీసేటప్పుడు ఎదుటివారి అనుమతి తీసుకోవడం వంటి ‘డిజిటల్ లిటరసీ’ వారికి పరిచయం చేయండి.‘రియల్ వరల్డ్’ మర్చిపోవద్దు!పిల్లలకు స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నప్పుడు, అంతకంటే అందమైన ప్రపంచం బయట ఉందని మర్చిపోనివ్వకండి. మట్టిలో ఆడటం, వానలో తడవటం, స్నేహితులతో గొడవపడటం.. ఇవన్నీ ఇచ్చే అనుభూతి ఏ హై–డెఫినిషన్ స్క్రీన్ ఇవ్వలేదు. అందుకే ఎక్కువ సమయం బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. పిల్లలను ఫోన్ నుంచి దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కాని, దానిని ‘ఆరోగ్యకరంగా’ వాడేలా మార్చవచ్చు.-సైకాలజిస్ట్ విశేష్- ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com -
రియో రంగుల సంద్రం
రియో నగరం బ్రెజిల్ దేశపు సంస్కృతికి, ఆనందానికి నిలువుటద్దం. ప్రస్తుతం అది ఒక రంగుల ప్రపంచంగా మెరుస్తోంది. రియోలో ఇప్పుడు ఎటు చూసినా జనమే, ఎక్కడ విన్నా సంగీతమే! రంగురంగుల దుస్తులు, మిరిమిట్లు గొలిపే వెలుగులు, గాలిలో రెపరెపలాడే పించాల మెరుపులతో రియో డి జనిరో రత్నంలా మెరిసిపోతోంది. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు రియో కార్నివాల్ కోసం స్థానిక వీథులన్నీ కళావేదికలుగా మారిపోతాయి. నిశ్శబ్దాన్ని తరిమికొడుతూ గుండె వేగాన్ని పెంచే సాంబా నృత్యాల జోరుతో ప్రపంచాన్ని మెప్పించే సంబరం మొదలైంది.ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్గా పిలవబడే ఈ రియో కార్నివాల్ ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, బ్రెజీలియన్ల భావోద్వేగం. దాదాపు 20 లక్షల మంది ప్రజలు రోజూ వీథుల్లోకి వచ్చి సంబరాల్లో పాల్గొంటారు. పోర్చుగీసు వారు 18వ శతాబ్దంలో మొదలుపెట్టిన ఈ సంప్రదాయం ప్రస్తుతం పోర్చుగీసు, ఆఫ్రికన్ సంస్కృతుల కలయికతో ముందుకు సాగుతోంది. క్రైస్తవుల పవిత్ర సీజన్ లెంట్ కాలానికి ముందు ఈ వేడుక జరుగుతుంది.ఈ కార్నివాల్లో సాంబాడ్రోమ్, బ్లాకోస్ అని పిలవబడే వీథి పార్టీలు, విలాసవంతమైన పార్టీలకు ప్రసిద్ధి చెందిన మ్యాజిక్ బాల్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటన్నింటిలో సాంబా స్కూల్ పరేడ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన సాంబా పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఒకరితో మరొకరు పోటీపడతారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రథాల్లో మెరిసిపోయే దుస్తులు ధరించిన వేలాదిమంది కళాకారులు సాంబాడ్రోమ్ స్టేడియంలో ఇచ్చే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్క పాఠశాల ప్రత్యేకమైన థీమ్తో ముందుకు వచ్చి సంగీత నృత్యాలతో వివిధ అంశాలను వివరిస్తారు.సాంబాడ్రోమ్లు టికెట్తో కూడినవి అయితే బ్లాకోస్ ప్రదర్శనలు మాత్రం ఉచితంగా నగరం మొత్తం కనిపిస్తాయి. సుమారు ఐదువందలకు పైగా బృందాలు నగరం నలుమూలలా సంగీతంతో సందడి చేస్తారు. వింత వింత దుస్తులు ధరించిన స్థానికులు, పర్యాటకులు మ్యూజిక్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తారు. కోపకబానా, ఇపనెమా వంటి బీచ్లో బ్లాకోస్ వేడుకలు రాత్రంతా సాగుతాయి. కార్నివాల్లో ఉండే మ్యాజిక్ బాల్స్ అత్యంత విలాసవంతమైనవి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సెలబ్రిటీలు, సంపన్నులు భారీ సెట్టింగుల మధ్య వినోదాల్లో మునిగిపోతారు.కోపకబానా ప్యాలెస్లో జరిగే ఈ వేడుకల్లో అతిథులు ఖరీదైన మాస్క్లు, డిజైనర్ దుస్తుల్లో సందడి చేస్తారు. రియో కార్నివాల్ కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది బ్రెజిల్ దేశపు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండగలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. ఈ కార్నివాల్ వల్ల బ్రెజిల్ పర్యాటక రంగానికి భారీ ఆదాయం లభిస్తుంది. ప్రతి ఏడాది సరికొత్త ఇతివృత్తాలతో నిర్వహించే ఈ వేడుకలు పర్యాటకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. -
ఐఎంగా ఏఆర్సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్లో డెస్క్టాప్ ఇంజనీర్గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్ను చితాక్యాంప్లోని ఓ సైబర్కేఫ్కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్తో కలిసి పని చేయడం ప్రారంభించాడు ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్లో 11 గుజరాత్లోని రాజ్కోట్లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్కోట్ పోలీసులు ఆసిఫ్ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్సీఏఫ్ కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్సీఎఫ్ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని గోకుల్చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం. -
Mahashivratri 2026: శివపూజకు దినుసులు
ఆయన సామాన్యుడా! ఆయనను విశ్వేశ్వరుడనీ, మహాదేవుడనీ, త్య్రంబకుడనీ, త్రిపురాంతకు డనీ, నీలకంఠుడనీ, మృత్యుంజయుడనీ, సదాశివుడనీ వేదం వేనోళ్ళ స్తుతించింది. మహాదేవుడి మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పేందుకు మాటలు చాలవని మహాకవులైన వారే మనవి చేసుకొన్నారు. ఆయన గొప్పతనం ఆసాంతం చెప్పాలంటే, అది సాక్షాత్తూ చదువుల తల్లికయితే సాధ్యం కావచ్చు నన్నారు. నిజానికి, విశ్వేశ్వరుడి విశిష్టతలన్నీ వివరంగా చెప్పాలంటే సరస్వతీ దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవు తాయట. ముందు కల్పవృక్షం కొమ్మ విరిచి, దాన్ని అరిగిపోని కలం పుల్లగా అమర్చుకోవాలి. సముద్ర మంత జలపాత్ర సంపాదించాలి. ఆ నీటిలో కాటుక కొండను కరిగించి, సిరాను సిద్ధం చేయాలి. ఆ పైన విరామం లేకుండా అహర్నిశలూ రాస్తూనే వెళ్ళాలి. లేకపోతే, కైలాసనాథుడి ఘనతల జాబితాను సమగ్రంగా సమ కూర్చటం ఆమెకయినా అసంభవమే అంటుంది ‘శివ మహిమ్నస్త్రోత్రం’.అయితే, భక్తుల అదృష్టం వల్ల, మహాదేవుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు. ఎంత సర్వ సమర్థుడో, అంత ఆడంబర విరహితుడు. అల్ప సంతోషి. ఆయన అనుగ్రహం పొందేందుకు పాండిత్య పాటవాలతో, పటాటోపాలతో పనిలేదు. విస్తృతమైన పూజావిధులూ, విలువైన సామగ్రీ అక్కర్లేదు. కావలసినవేమిటో ‘కాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి కవి చెప్పాడు: సలిలమ్ముల్ చులుక ప్రమాణ(ము), ఒక పుష్పమ్మున్ భవన్మౌళి, ని/ శ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ,/... తుదిన్ కాంచు నీ/ చెలువంబంతయు, నీ మహత్త్వ మిదిగా, శ్రీ కాళహస్తీశ్వరా! శివపూజకు మూడు దినుసులు చాలు. పుడిసెడు (‘చులుక ప్రమాణము’) నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావం– ఈ మూడింటితో పూజ చేసిన భక్తుడు ధన్యుడై చివరకు శివ సాక్షాత్కారం ప్రాప్తింపజేసుకొంటాడు. భోలా శంకరుడే గదా, చేరెడు నీళ్ళతో అభిషేకించి, చిన్న మారేడు దళం అప్పగిస్తే చాలు, పొంగి పోయి బోలెడు వరాలిచ్చేస్తాడు అని గడసరి భక్తులు అనే మాట అర్ధ సత్యమే. నిశ్చల భక్తి అనే నిప్పు లేకుండా, భక్తుడి పప్పు ఉడకదు అనే షరతు వర్తిస్తుంది! - ఎం. మారుతి శాస్త్రి (ఫిబ్రవరి 15న శివరాత్రి) -
రోడ్డు ఎలా వేస్తారు? పెద్ద తతంగమే!
పిల్లలూ! మీరు రోజూ స్కూల్కి వెళ్లడానికి, తిరిగి ఇంటికి రావడానికి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు కదా! మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు ఉన్న రకరకాల రవాణా మార్గాల్లో రోడ్లు అత్యంత కీలకమైనవి. మన దేశంలో ఇంకా రోడ్డు లేని అనేక ప్రాంతాలున్నాయి. అక్కడి మనుషులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంత కీలకమైన రోడ్డు ఎలా వేస్తారో మీకు తెలుసా?రోడ్డు నిర్మాణానికి ముందుగా కావాల్సింది ప్రణాళిక (ప్లానింగ్). ఆ రోడ్డు ఏయే ప్రాంతాలను కలుపుతుంది, ఆ రోడ్డు విస్తీర్ణం ఎంత, రోడ్డు వేసే నేల స్వభావం ఎలాంటిది వంటి అంశాలను ఇంజినీర్లు పరిశీలించి ఓ ప్రణాళిక రూపొందిస్తారు. అనంతరం సర్వే చేపడతారు. ఆపైన మట్టి పని మొదలవుతుంది.ఎగుడుదిగుడుగా ఉండే దారిని చదునుగా చేస్తారు. లోతట్టుగా ఉండే ప్రాంతంలో బయట నుంచి మట్టి తెప్పించి పోస్తారు. అప్పుడే రోడ్డు వేయడం వీలవుతుంది. అనంతరం రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సైడు కాల్వలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు లేకపోతే వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అనంతరం రాళ్లు, కంకరను పొరలు పొరలుగా ఆ భూమిపై వేసి రోడ్ రోలర్లతో బాగా నొక్కుతారు. దీంతో ఆ ప్రాంతం రోడ్డు వేసేందుకు సిద్ధమవుతుంది. చివరిగా తారు లేదా కాంక్రీట్ మిశ్రమాన్ని వేసి రోడ్డుకు చివరి రూపు ఇస్తారు. అలా రోడ్డు సిద్ధమవుతుంది. ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా? -
టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా?
రోజు మీ భోజనంలో రకరకాల కూరగాయలను భాగంగా చేసుకుంటారు. అవన్నీ తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. నిత్యం మనం తినే ఆహారంలో కొన్ని కూరగాయలు విదేశాల నుంచి వచ్చాయన్న విషయం మీకు తెలుసా?టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి వంటి కూరగాయలు విదేశాల నుండి భారతదేశానికి వచ్చాయి. 16–17 శతాబ్దాలలో పోర్చుగీస్, బ్రిటీష్ వారి ద్వారా ఇవి మన దేశానికి చేరుకున్నాయి. చివరకు ఇవి మన వంటల్లో ముఖ్యమైన పాత్ర షోషించడం మొదలైంది. ఇందులో ముఖ్యమైనది టమాటా. ఇది మెక్సికో నుండి పోర్చుగీస్ వ్యాపారుల ద్వారా మనకు పరిచయమైంది. ఆ తర్వాత బంగాళదుంప (ఆలూ). ఇది పెరువియన్-బొలీవియన్ ఆండీస్ (దక్షిణ అమెరికా) నుండి మన దేశానికి వచ్చింది. పచ్చిమిర్చి. ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపుఇది దక్షిణ అమెరికా మూలాలు కలిగినది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా ఆఫ్రికా, మెడిటరేనియన్ ప్రాంతాల నుంచి మన దేశానికి వచ్చినట్లు భావిస్తుంటారు. బీట్రూట్ అనేది యూరప్, ఈజిప్టు ప్రాంతాల నుంచి వచ్చింది. వీటితోపాటు బ్రోకలీ, లెట్యూస్, ఆస్పరాగస్, స్వీట్ కార్న్ వంటివి కూడా విదేశీ రకాలుగా పరిగణిస్తారు. ఇదీ చదవండి: ఎప్స్టీన్ను చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు -
మంత్రపుష్పం పరమార్థం ఏమిటి?
పూజలో పూలు వాడతాం. మరి మంత్రపుష్పం ప్రత్యేకత ఏమిటీ అంటే – భగవంతుడికి మనం చేయగలిగిన ఉపచారాలన్నీ చేశాక, పెట్టగలిగిన పదార్థాలన్నీ నైవేద్యం పెట్టాక... మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవడమే మంత్రపుష్పంలోని పరమార్థం. కిందివైపు ముడుచుకుని ఉన్న కమలంలా నాభికి పైనా, గొంతుకు కిందా 12 అంగుళాల పరిమాణంలో ఉన్న భాగం (హృదయం), మనం తిన్న అన్నాన్ని శరీరభాగాలన్నింటికీ సమానంగా పంచుతుందట.దానిపై భాగంలో విచ్చుకున్నట్టు ఉండే సూక్ష్మపద్మంలాంటి చోట నివ్వరిధాన్యపు ముల్లంత (వడ్లగింజ కొస) పరిమాణంలో పసుపురంగు కాంతితో మనలోని పరమాత్మ ఉంటాడంటూ సవివరంగా మన జ్యోతి స్థానాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని మంత్రపుష్పంతో (Mantrapushpam) జతచేసి చదువుతాం. అంటే నాలోని ప్రాణం నీవు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను స్వామీ... అని చెప్పుకోవడం మంత్రపుష్పంలోని పరమార్థం.చదవండి: శఠగోపం ఆకారం ఎందుకలా? -
ప్రేమలు పండిన తీరం భీమిలి లోగిలి సారం
భీమునిపట్నం: ప్రేమకథా చిత్రాలకు భీమిలి తీరానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇక్కడ రూపుదిద్దుకుని ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా 1978లో విడుదలైన దర్శక శిఖరం కె. బాలచందర్ దృశ్యకావ్యం ‘మరోచరిత్ర’ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ చిత్రంలోని మెజారిటీ సన్నివేశాలు భీమిలి తీరంలోనే చిత్రీకరించారు. అప్పట్లో అంటే సుమారు 1850 ప్రాంతంలో బ్రిటీష్ గవర్నర్ నివాసం కోసం సముద్ర తీరాన నిర్మించిన అరుదైన బంగ్లా ‘గాలిమేడ’ ఈ సినిమాతోనే ప్రజలకు చేరువైంది. డచ్ గవర్నర్ బంగ్లాగా పిలవబడే ఈ కట్టడం సినిమా హిట్ అయ్యాక ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ 1990వ దశకంలో ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ చారిత్రక గాలిమేడను కూల్చివేసినప్పటికీ, నేటికీ పాతతరం ప్రేక్షకులు ఆ ఖాళీ స్థలాన్ని చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. బాలచందర్ మెచ్చిన తీరం బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘కోకిలమ్మ’ సినిమాతో మొదలైన ఈ సినీ ప్రస్థానం ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికైంది. 1986లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సత్యరాజ్, రేఖలతో తీసిన ‘కడలోర కవిదైగళ్’ చిత్రాన్ని భీమిలిలోని గ్రంథాలయం ఎదురుగా ఉన్న సరస్వతి సమాజం పరిసరాల్లోనే చిత్రీకరించారు. ఇదే సినిమాను 1987లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆరాధన’ పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా భీమిలినే ప్రధాన లొకేషన్గా ఎంచుకున్నారు. సుహాసిని టీచర్గా ఉన్న స్కూల్, ఆమె బడికి రావద్దని చెబితే చిరంజీవి ఒంటికాలిపై నిలబడే దిమ్మ, లైట్ హౌస్ కీపర్ క్వార్టర్స్లో ఉన్న చిరంజీవి ఇల్లు.. ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎన్నో చిత్రాల నిర్మాణం శుభలేఖ, ముద్దమందారం, మహర్షి వంటి క్లాసిక్ చిత్రాలే కాకుండా హిందీ, తమిళ సినిమాలు కూడా ఈ తీరంలో సందడి చేశాయి. 1992లో నటి రోజా, ఆమె భర్త సెల్వమణి కాంబినేషన్లో వచ్చిన ‘చామంతి’, నాగార్జున ‘రావోయి చందమామ’, ప్రభుదేవా ‘టైమ్’ వంటి సినిమాల చిత్రీకరణ బ్యాంక్ రోడ్డులోని ‘ఓషన్ వ్యూ’ బంగ్లా వద్ద జరిగింది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ బంగ్లా కూడా కూలి్చవేతకు గురైంది. గాలిమేడ, ఓషన్ వ్యూ బంగ్లా వంటి కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయినా, ‘ఆరాధన’ సినిమా స్కూల్, ఆనాటి దిమ్మ, నరసింహస్వామి ఆలయ పరిసరాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భీమిలి అందాలు వెండితెరపై ఎంతటి మాయాజాలాన్ని సృష్టించాయో చెప్పడానికి ఈ లొకేషన్లే సజీవ సాక్ష్యాలు.సందడిగా ఉండేది ఇక్కడ షూటింగ్లు జరగడవల్ల ఎంతో సందడిగా ఉండేది, ముఖ్యంగా ఆరాధన షూటింగ్ రెండు నెలలకు పైనే జరిగింది. ఇందులో చిరంజీవి హీరోకావడంతో విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి ప్రతి రోజు భారీ ఎత్తున జనం వచ్చేవారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు, చిత్ర యూనిట్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. –రాంబోతు సత్యనారాయణ, భీమిలికాలేజ్కు వెళ్లేవాళ్లం కాదు ఆరాధన షూటింగ్ ఇక్కడే ఎక్కువ రోజులు జరిగింది. చిరంజీవి, సుహాసిని, రాధికను చూడాలని ఎంతో ఆసక్తి ఉండేది. స్నేహి తులంతా కలిసి కాలేజ్కి డుమ్మా కొట్టి షూటింగ్ చూడడానికి వెళ్లేవాళ్లం. –అయ్యగారి లలితారమేష్ భీమిలిభీమిలికి మంచి గుర్తింపు ఇక్కడ షూటింగ్లు తరచూ జరుగుతుండడంతో భీమిలి ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది. దీనికి చారిత్రిక, పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారు. సినిమా షూటింగ్ల వల్ల ఈ ప్రాంతం మరింత గుర్తింపు లభించింది. ప్రభుత్వం చారిత్రక కట్టడాలకు మెరుగులు దిద్దాలి.–కంటుభుక్త ముత్యాలరావు, భీమిలి -
శఠగోపం ఆకారం ఎందుకలా?
శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఆలయ గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్ తరహా) నిర్మాణాలూ పిరమిడ్ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది.ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు. చదవండి: స్వర్ణగిరికి బ్రహ్మోత్సవ సిరి -
శతాయుష్షు బామ్మ.. ఇప్పటికీ ఆమె అమ్మ
నెల్లూరు జిల్లా: నాలుగడుగులు నడిస్తే ఆయాస పడే ఇప్పటి తరానికి ఆ బామ్మ మాటలు బంగారు బాటలు. కష్టపడి పనిచేస్తే ఎలాంటి జబ్బులు రావనేందుకు ఆమె జీవనశైలి పెద్దబాల శిక్ష. వందేళ్ల వయసు పైబడినా తన పని తానే చేసుకుంటూ ఇంట్లో వారికి సైతం సాయంగా ఉంది. టీవీలు, స్మార్ట్ ఫోన్ల మాయలో పడి పిల్లలకు కూడా వ్యాధులతోపాటు ఊబకాయం వస్తుంటే వారి పెద్దలు ఆందోళన పడుతున్నారు. 103 సంవత్సరాల వయస్సులో బామ్మ ఇప్పటికీ వంట చేస్తుంది. ఇంట్లో గేదెలకు గడ్డి తెచ్చి మేతగా వేస్తుంది.వంట చేస్తూ..పొదలకూరు మండలం, మొగళ్లూరు గ్రామానికి చెందిన అచ్చాల పెంచలమ్మ శతాధిక వృద్ధురాలు. గ్రామంలో ఆమెకంటే పెద్దవారు ఎవరూ జీవించి లేరు. నాలుగు తరాలకు ప్రతినిధిగా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన పెంచలమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇప్పటికీ బామ్మ హుషారుగా ఉంది. ఆమెకు ఎలాంటి జబ్బులు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాత్రివేళ అప్పుడప్పుడు కాళ్లునొప్పులు వస్తుంటాయని చెబుతోంది. వినికిడి, కంటిచూపు ఈ వయస్సులో కూడా పెంచలమ్మకు బాగున్నాయి. కట్టెల పొయ్యి వద్ద ఆమె ఇంట్లో అందరికీ వంట చేస్తుంది.మంచి ఆహారపు అలవాట్లుపెంచలమ్మ కాయ కష్టం చేసేవారు. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండటమే కాక జొన్న, రాగి సంగటి తినేవారు. అందువల్లే ఇప్పటికీ ఆమె ఎంత సమయమైనా కూర్చొని లేవగలుగుతున్నారు. వయోభారంతో కొంత ఆలసటగా కనిపించినా పనులు చేస్తూనే ఉంటారు. కుమారుడు మస్తాన్రెడ్డి, కోడలు సంపూర్ణమ్మ వ్యవసాయ పనులపై తోటకు వెళ్తే పెంచలమ్మ వంటి చేసి పెడుతుంది. వందేళ్లు పైబడినా బంధువులు, స్నేహితుల పేర్లు వెంటనే తడుముకోకుండా చెబుతుంది. షుగర్, బీపీ వ్యాధులు ఆమె దరిచేరలేదు. ఎలాంటి మందులు కూడా వాడటం లేదని పెంచలమ్మ చెప్పారు. ఇప్పటి తిండిలో శక్తి లేదని, తాను వయస్సులో ఉన్నప్పుడు కల్తీ లేని ఆహారం తినడం వల్లే ఇంతకాలం జీవించి ఉన్నానంటారు పెంచలమ్మ. కల్మషం లేని లేని జీవితం, కల్తీ లేని ఆహారం తింటే ఎవరైనా తనలా జీవించేందుకు అవకాశం ఉంటుందని బామ్మ వెల్లడిస్తున్నారు. -
ప్రేమ.. ఒక జీవితం
నిర్మల్: ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల పండుగగా భావిస్తుంటారు. కానీ, ప్రేమ అనేది ఈ ఒక్కరోజుకే పరిమితం కావొద్దు. జీవితాంతం కొనసాగాలని చాలామంది సీనియర్ ప్రేమికులు చెబుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం అర్థవంతంగా సాగుతుందని, లేదంటే అర్ధంతరంగా ముగుస్తుందని సూచిస్తున్నారు. పరస్పర గౌరవం, నమ్మకం, సహనం ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ నిలుస్తుందని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సమయంలో తోడుగా నిలవడమే అవసరమని చాలామంది చాటుతున్నారు. అలాంటి ప్రేమజంటలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.జూనియర్–సీనియర్జిల్లాకేంద్రానికి చెందిన చిన్నపిల్లల వైద్యులు గేయన్మయి నాగరంజని, కావేటి శ్రీకాంత్లది ప్రేమవివాహం. వీరిద్దరూ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ చదువుతుండగా కలిశారు. శ్రీకాంత్ సీనియర్ కాగా, నాగరంజని ఆయనకు జూనియర్. అప్పట్లో వీరిద్దరికీ ఒకే వార్డులో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే ఒకరి వివరాలు ఒకరికి తెలిశాయి. వారి విభాగం వారంతా ఒకసారి కోల్కతా కాన్ఫరెన్స్కి వెళ్లారు. అక్కడే ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టం బయటపడింది. చదువులు కూడా పూర్తికాగానే ఇద్దరూ ధైర్యం చేసి ఇంట్లోవాళ్లకి చెప్పారు. మొదట్లో నాగరంజని వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. చాలారోజులు వేచిచూసి పెద్దలను ఒప్పించేదాకా ఓపికతో ఉండి చివరకు విజయం సాధించారు. అలా 2014 డిసెంబర్ 7న మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా ఒక పాప, బాబు ఉన్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలని, ప్రేమను పొందాలంటే ఓర్పు ఉండాలని వీరు సూచిస్తున్నారు.ఇంట్లో ఒప్పించి ఒక్కటయ్యారుజిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యజంట అనిత, రా మకృష్ణలదీ ప్రేమవివాహమే. వీరిద్ద రు 1995లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పట్లో ప్రేమ అంటేనే ఓ భయం. ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే ఇంకా భయం. కానీ, వీరిద్దరూ అప్పట్లోనే ఇంట్లో పెద్దలను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య ప్రేమకు చిహ్నాలుగా పాప పద్మిని, బాబు ప్రద్యుమ్న ఉన్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉంటేనే ప్రేమ కలకాలం నిలుస్తుందని, అలాంటి ప్రేమకూ అందరి మద్దతు ఉంటుందని వీరు చెబుతున్నారు. -
వేలెంటైన్స్ వర్సెస్ కవిత్వంతో కర్సేస్!!
ఇవాళ్ల వేలెంటైన్స్ డే అటగా. తమ ప్రేమను కవితాత్మకంగా ఎక్స్ప్రెస్ చేసే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారటగా. అందుకే సినిమాల్లో ప్రేయసి మీద పాటలుంటాయటగా. చిన్నప్పట్నుంచీ నాదంతా సినిమా స్టైల్. అందుకే కవితంటే అదో అమ్మాయి పేరని మాత్రమే తెలిసినా, కవిత్వం రాతకు అక్షరమ్ముక్క రాకపోయినా... నేనూ కవితలు రాయడం మొదలుపెట్టా. అసలా పనిని నేను అ...ఆ... లు దిద్దడ మప్పట్నుంచే ప్రారంభించా. ఫ్యూచర్లో నేనెవరైనా అమ్మాయిని ఇష్టపడితే మరి అప్పటికప్పుడు కవిత్వం రాకపోతే ఎలా...? అందుకే... ఎందుకైనా మంచిదంటూ పేడపురుగు ఉండలు ఉండలుగా దొర్లించుకుపోయినట్టుగా... అప్పుడింతా అప్పుడంతా కవిత్వం పోగేసుకున్నా. అదంతా వరసల్లో పేర్చా. ఆ మాటల్లోని కొన్ని ఆణిముత్యాలూ. ప్రేమరత్నాలూ ఇవే... ఓ నా ప్రేయసీ... నువ్వు మంచి ఫూడీవటగా... నీకు బహుమతిగా ఇద్దామని రంగురంగుల ఇంద్రధనుస్సును పనీర్ ముక్కల్లాగా కోసి ఆకాశపు నీలిప్లేటులో అడావుడిగా పట్టుకొచ్చా. ఆత్రంగా పెట్టుకొచ్చా. ఇంధ్రధనుస్సునే ఎందుకు వంచానని అడుగుతున్నావా? అందరూ చంద్రవంకల్నీ నెలవంకలనీ కవిత్వంలో రాస్తారట కదా. మరి... నేనందరికన్నా డిఫరెంటుగా! అందుకే వెల్లకిలా పడి ఉండే నెలవంక షేపుకు ఎగ్జాట్లీగా బోర్లావేసినట్టుండే రెయిన్బోనెంచుకున్నా. చాలామంది రక్తంతో ప్రేమలేఖ రాస్తారటగా నేను మాత్రం ఆ రెయిన్బో ముక్కల్ని వేడివేడిగా నీ నోటికందిద్దామని నా రక్తపు నూనెలో ఎర్రగా గోలిచ్చి పెట్టా.స్టవ్వు మంటకు నా రక్తపు వేడి కూడా తోడైతేనా బంగారానికి దీటుగా ఆ ముక్కలకీ బంగారపు రంగొచ్చేలామంచి డీప్ ఫ్రై చేయవచ్చని... దాంతోనా లవ్వు కూడా డీపుగా ఉంటుదన్నది నా ఆశ.ఆ ఫ్రై ముక్కల ప్యాకింగు కోసంసిల్వర్ ఫాయిల్స్ కోసం ఎంతో వెదికా. టైముకు అవి కనిపించలేదు. అందుకే... పలచని స్ట్రాటోక్యుములస్ మబ్బులంచుల్లో ఉన్న వెండి సిల్వర్ లైనింగును కట్ చేసి వేడి తగ్గకుండానే సదరు పనీరింద్రధనుస్సు ముక్కల్ని ప్యాక్ చేసి పెట్టా.నువ్వు నైసుగా కోసుకుని తినేందుకు నైఫు కూడా కనిపించలేదు. అందుకే... బోర్లా ఉన్న ఇంద్రచాపం వెన్ను బెండుతీసి ఓ అంచుకు బాగా సానపట్టా.అదే రెయిన్బో చివరల్ని లైటుగా కాల్చి ప్రతిరంగు జాయింటు దగ్గర కొద్దిగా చీల్చిరంగురంగుల ఫోర్కుగా దాన్ని నీకందిద్దామని ఇక్కడే వేచి చూస్తున్నా.మన ఫాస్టెస్టు ట్రైనులా రాజధానెక్సెప్రెస్సులానా బ్లడ్ప్రెషరిప్పటికే ప్రేమపట్టాలపై గ్యాలప్పేస్తోంది. సూపర్సానిక్ స్పీడులో ఉన్న నా రక్తపోటు పంపును... యూఎస్ వెళ్లాలనుకున్న ఇంజనీరు పాలిటి ట్రంపులా అడ్డుపడి ఎలాగోలా అదుపులోకి తెచ్చెయవా ఫ్లీజ్! నా ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా నన్ను నిరాశపరచి గేదె తగిలాక గాయపడ్డ వందేభారత్లా నా గుండెను గాయపరిచి వేడుక చూడకంటూ వేడుకుంటున్నాను. తోడుండమంటున్నాను.ఇట్లుమామిడిటెంక మన్మథలెంక ప్రేమలేఖకు ఈవినింగ్ లోపల జవాబూ వచ్చింది. ‘‘ఏయ్ మిస్టర్... చదువుతున్నంతసేపూ గుర్తొచ్చింది షాకిచ్చే శాకినీ... చదివాక నా పరిస్థితి ఢామ్మంటూ ఢాకినీ!... ఇలా నువ్వు నీ లవ్లెటర్తో నా చెవిలో చేతబడి చేశావ్. కర్ణభేరిపై కాష్మోరా ప్రయోగించావ్. అసలే సినిమా పిచ్చోడివి కదా... అందుకే నీకర్థమయ్యేలా చెబుతున్నా విను. కవుల పట్ల జంధ్యాలకున్న అభిప్రాయాలన్నీ రీల్ చేసి ఇస్తున్నా.చూడు. చూశాక... ఇంకెప్పుడూ నాకు కాల్ చేయకూ... కవిత్వంతో నన్ను కాల్చేయకు. – లవ్వు పాలిట యాంటీ ప్రొజెక్టరణీ... నీ ప్రేమ రిజెక్టరణి...– యాసీన్ -
ప్రేమంటే అంతేగా! అంతేగా!
‘అంతేగా... అంతేగా’ ఈ సినిమా డైలాగ్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. ‘ముద్దమందారం’ ప్రదీప్ కాస్తా ‘అంతేగా.. అంతేగా’ ప్రదీప్ను చేసింది. నేటికాలం ప్రేమలకు అసలు సిసలు శత్రువు ఇగో. చిన్న చిన్న ఇగోలతోనే లవ్ బ్రేకప్లు పెరుగుతున్నాయి. ‘నా మాటే నెగ్గాలనే’ పంతానికి పోకుండా ‘అంతేగా! నువ్వు చెప్పింది రైటే కదా!’ అనే ఒక్కమాట ప్రేమను పదికాలాల పాటు నిలుపుతుంది.వంద అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఒక్క అంతేగా, అంతేగా! డైలాగ్ వాడితే ఎన్ని ప్రేమలైనా నిలబెట్టుకోవచ్చు.. సరదాగా నవ్వుకుని.. కాస్త సీరియస్గా ఆలోచించండి.‘సెల్ఫ్ సెంట్రిక్గా ఉండే ప్రేమలు దీర్ఘకాలం మనలేవు. రిలేషన్ ఒక పుష్పగుచ్చంలా ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు సీనియర్ నటుడు ప్రదీప్ కొండపర్తి, సరస్వతి దంపతులు. 37 ఏళ్ల కుటుంబ జీవనంలోని ప్రేమను ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా పంచుకున్న విశేషాలు..ఆరేంజ్డ్ నుంచి లవ్ప్రదీప్: మాది మ్యారేజ్ తర్వాత ప్రేమ. అరేంజ్డ్ మ్యారేజ్. చెట్టుకు నీళ్లు పోస్తేనే అది పువ్వులు ఇస్తుంది. మనిషి కూడా అంతే, గుప్పెడు ప్రేమను పంచితే తిరిగి ప్రేమను అందిస్తాడు. ఈ మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి ప్రేమ అనే పుష్పగుచ్చంలో ఇలా సాగిపోతున్నాం. సరస్వతి: నా ఎం.ఎ. తర్వాత పెళ్లి అయ్యింది. చిన్న కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలోకి వచ్చాను. ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాల్సినవి, మలుచుకోవాల్సినవి తప్పక ఉంటాయి. నేను కొంచెం సైలెంట్. ప్రదీప్ గారితో జర్నీ స్టార్ట్ అయ్యాక ఆయన అందించిన ప్రేమ, కంఫర్ట్ వల్ల సులువుగా అందరిలో కలిసిపోయాను. పెళ్లి తర్వాత పీహెచ్డి చేశాను, యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను.. ఇదంతా ప్రదీప్గారి సపోర్ట్ వల్లే.భేదాభిప్రాయాలుసరస్వతి: సాధారణంగా ఎదుటివారిని మార్చాలనుకున్నప్పుడే విభేదాలు తలెత్తుతాయి. అయితే, మన ప్రవర్తన ద్వారా అవతలి వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. ఇద్దరూ ఓపెన్గా ఉంటేనే పాజిటివ్ ఛేంజ్ తీసుకు రాగలుగుతాం. నా వరకు నేను డిసిప్లిన్గా ఉంటాను. టైమ్, నీట్నెస్.. ఖచ్చితత్త్వం పాటిస్తాను. ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే కొంత పాజ్ ఇచ్చి చూడాలి. అప్పుడు వారికే అర్థమైపోతుంది.ప్రదీప్: ఇద్దరమూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రెయినర్స్గా ఉన్నాం. కాబట్టి, ముందు మేం పాటించి, అవి మిగతావారికి చెబుతాం. అందుకే, మాట తీరు, ప్రవర్తన సరిగ్గా ఉండటానికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏది చేసినా మనవాళ్లతో బాగుండటానికే అనుకుంటే ఎన్ని విభేదాలు ఉన్నా అవి పెద్దవిగా అనిపించవు.త్యాగాలుప్రదీప్: ఎంత బిజీ అనుకున్నా సరే కొన్నింటికి తప్పక టైమ్ కేటాయించుకోవాల్సిందే! కలిసి చేసే ప్రయాణంలో బిజీ అంటే కుదరదు. ‘నా నుంచి మన’ అనుకుంటే అద్భుతమే కదా! సరస్వతి: ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి. ఎదుటివారి కోణంలో నుంచి ఆలోచించాలి. చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఏదైనా సందర్భం ఎదురైనప్పుడు ‘ఇబ్బంది పడకు, నేను చూసుకుంటాలే’ అని చెప్పాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే, దానిగురించి అవతలి వారికి చెప్పే సంస్కారం ఇద్దరిలోనూ ఉండాలి. బలహీనతలను పట్టుకొని నస పెట్టకూడదు. కొన్ని విషయాల్లో సర్దుకుపోయే తత్త్వం ఉండాలి.అలవాట్లుప్రదీప్: రిలేషన్ షిప్ను ఒక బొకేలా తీసుకుంటే అందులో అలవాట్లు కూడా వస్తాయి. అయితే, అలవాట్లు వ్యసనాలు కాకూడదు. పాటలు పాడటం, రచనలు చేయడం, టీవీ.. ఇలా చాలా విషయాల్లో భార్యాభర్తల అలవాట్లలలో తేడాలు ఉంటాయి. వాటి గురించి కామెంట్స్ చేయడం, జోకులేయడం చేస్తే.. బాధపడే సందర్భాలూ ఉంటాయి. రోజులో అరగంటసేపైనా మాట్లాడుకుంటే ఇద్దరి మధ్యా అవగాహన పెరుగుతుంది. సరస్వతి: ఇద్దరికీ నష్టం కలుగుతున్నాయనుకున్న అలవాట్లు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టేయడమే మేలు. మా వరకు విసుగు అనిపించే అలవాట్లు లేవు. చాలా మందికి వ్యసనాల వల్ల సమస్య ఉంటుంది. ముందుగా గుర్తించి, వాటికి ఒక హద్దు గీసుకుంటే సరి!ఊహించని కానుకప్రదీప్ : చివరి వరకు మిగిలేది భార్యభర్తలే. ఒకరి ఎక్స్పెక్టేషన్స్ని మరొకరు అర్ధం చేసుకొని, వాటిని అందించగలగాలి. ఎప్పుడైతే ఎదుటివారి భావాలకు, టైమ్కు ప్రాధాన్యత ఇస్తామో, అదే తిరిగి మనకు వస్తుంది. ప్రతి చర్యలో, మాటలో నీకు నేనున్నాను అనే ఎక్స్ప్రెషన్ను ఇవ్వగలిగితే చాలు. సమస్యలు రావు.సరస్వతి: ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. పార్టనర్కి ఊహించని కానుక ఇవ్వాలని ఉంటుంది. అది, డైమండ్ నెక్లెస్లు కానక్కర్లేదు. సందర్భాన్ని బట్టి ఒక పేపర్పైన లవ్ సింబల్ గీసి, ఇచ్చినా ఆ సమయానికి అది పెద్ద కానుకే. ఆ ప్రేమలో స్వచ్ఛతనే చూడాలి. ఒకసారి నా బర్త్డే రోజున రిలేటివ్స్ పెళ్లికి వెళ్లాం. తిరిగి వస్తూ చార్మినార్ దగ్గర అర్ధరాత్రి కేక్ కట్ చేయించారు. నాటి సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ఊహించనివి ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇద్దరి అభిరుచులు వేరు, ఆలోచనలు వేరు, నచ్చే కలర్స్ వేరు.. చాలా వైరుధ్యం ఉంది. కానీ, మేం ఇద్దరం ఒకటే.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Valentines Day: ఒక ప్రేమిక సజీవ కథ
‘ప్యార్ కియాతో డర్నా క్యా’... ప్రేమకు భయం లేదని, వెరపు వద్దని చెప్పిన పాత్ర అనార్కలీ. ఆ పాత్రకు జీవం పోసిన మధుబాల లక్షల అభిమానుల ప్రేమిక. ఫిబ్రవరి 14న ఆమె జన్మించడం యాదృచ్చికం కాదు. ఆమె పుట్టుక ఒక గొప్ప ప్రేమ కథ ‘మొఘల్ ఏ ఆజమ్’ను ఆచంద్రార్కం చేసింది. ఆమె జీవితం వినూత్న ప్రేమకథగా ముగిసింది. ప్రేమికుల దినం ప్రత్యేక కథనం.మధుబాల గుండెలో బాల్యం నుంచి రంధ్రం ఉంది. ఆ తర్వాత ఆ గుండెను ఎందరో తూట్లు పొడిచారు. తెర మీద. తెర బయట.‘మొఘల్–ఏ– ఆజమ్’లో అనార్కలీ ప్రేమను అక్బర్ చక్రవర్తి అంగీకరించడు. నిజజీవితంలో మధుబాల ప్రేమను ఆమె తండ్రి అంగీకరించలేదు. తెర జీవితం, నిజ జీవితం కొందరికి ఒకేలా మారతాయి.‘మొఘల్–ఏ–ఆజమ్’లోని అనార్కలీ పాత్ర మొదట నర్గీస్కు వెళ్లింది. నాటి సింగింగ్ సూపర్ స్టార్ సురయ్యకు వెళ్లింది. ఇద్దరూ చేయలేదు. దానికోసం మధుబాల జన్మెత్తి ఉన్నప్పుడు అది ఆమెకే కదా చేరాలి. చేరింది. మధుబాల అనార్కలీగా నటించింది. నటించడం ఏమిటి... మధుబాలే అనార్కలీ అయ్యింది. సువాసనలీనే పువ్వు తొందరగా రాలిపోతుందన్నట్టు మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో చనిపోయింది. కాని నేటికీ జీవించే ఉంది. కారణం– అనార్కలీ పాత్ర ఆమెను బతికిస్తూ ఉంది.కాదు– ఆమె అనార్కలీని పునరుజ్జీవం చేస్తూ ఉంది. సరే.. ఇద్దరూ కలిసి ప్రేమకు అమరత్వం తెచ్చారు.‘మొఘల్–ఏ–ఆజమ్’ కథ నిజమో అబద్ధమో తెలియదు కాని అది జనానికి చాలా ఇష్టం. ఒక నిరుపేదరాలిని రాకుమారుడు, భావి సామ్రాట్ కోరుకుంటే ఆ కథ జనానికి నచ్చకుండా ఎలా ఉంటుంది? అక్బర్ కుమారుడు జహంగీర్ (ముద్దుపేరు సలీమ్) తన రాజాస్థానంలో ఉన్న అనార్కలీ అనే నాట్యకత్తెతో ప్రేమలో పడ్డాడట. అది తెలిసి అక్బర్ ఆమెను సజీవ సమాధి చేశాడట. అలాగని జనస్మృతిలో ఉన్న కథను దర్శకుడు కె.ఆసిఫ్ చాలా పెద్దగా, అట్టహాసంగా, ‘తీయదలిచాడు. ఎంతగా అంటే ఆరేడు లక్షల్లో సినిమా అవుతున్న రోజుల్లో కోటి రూపాయలతో. సలీమ్గా దిలీప్ కుమార్ను తీసుకున్నాడు. అక్బర్గా పృథ్వీరాజ్ కపూర్ను. అనార్కలీగా మధుబాలా.మధుబాలాకు ఇండియన్ మార్లిన్ మన్రో అని పేరు. ‘మహల్’తో ఆమె మెరిసినా,‘మిస్టర్ అండ్ మిసెస్ 55’, ‘చల్తీ కా నామ్ గాడీ’... ఆకర్షణగా నిలిచినా ఆమె నటనకు సవాలుగా నిలిచే సినిమా అంతవరకూ లేదనే చెప్పాలి. ‘మొఘల్–ఏ–ఆజమ్’తో ఆ అవకాశం వచ్చింది. దానిని ఆమె ఒక సవాలుగా స్వీకరించింది.మధుబాల క్లాసికల్ డాన్సర్ కాకపోయినా నాటి కథక్ ఆచార్యుడు కిష్షు మహరాజ్ దగ్గర నృత్యం నేర్చుకుని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాటలో మెరుపు వేగంతో పాదాలను కదిలించింది. చురకత్తుల కంటే వాడిగా చూపులను విసిరి అక్బర్ పాదుషానే కాదు ప్రేక్షకులను కూడా కలవర పరిచింది. మేరునగధీరుల వంటి పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్లను ఢీకొడుతూ నటించడం సామాన్యం కాదు. ‘నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అక్బర్ అడిగితే ‘ఒక్క రోజైనా మొఘల్ సామ్రాజ్యపు సింహాసనానికి రాణిగా ఉండాలని ఉంది’ అంటుంది అనార్కలీ. ‘నీ అల్పబుద్ధి మానుకున్నావు కాదు’ అంటాడు అక్బర్. ‘అయ్యా... ఇది నా కల కాదు. మీ కుమారుడి కల. అతని కల అసంపూర్ణంగా ఉంచి నేను మరణించలేను’ అంటుంది అనార్కలీ. ఆమెది విఫల ప్రేమకథే. కాని బాక్సాఫీసు దగ్గర సఫలమైంది. ఆ ప్రేమకథ గెలుస్తూనే ఉంది నేటికీ.మధుబాల దిలీప్ కుమార్ని ప్రేమించింది. దిలీప్కుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని మధుబాల మీద ఆధారపడిన కుటుంబం ఆమె వివాహమయ్యాక దిక్కులేనిదవుతుందని మధుబాల తండ్రి దిలీప్కుమార్తో తగాదా పెట్టుకున్నాడు. కోర్టు గొడవలు దాకా వెళ్లింది. మనసు విరిగిన దిలీప్ ఆ తర్వాత మధుబాల ముఖం చూడలేదు. మొఘల్–ఏ– ఆజమ్లో నటించే సమయంలో వారి మధ్య మాటలే లేవు. కాని తెర మీద రొమాన్స్ను పండించారు. ఆ తర్వాత గాయకుడు కిశోర్ కుమార్ మధుబాలను ప్రేమించినంత పని చేశాడు. వారి వివాహం జరిగాక సాగిన 9సంవత్సరాల కాపురం పెళుసైనది. గుండె జబ్బుతో బాధ పడుతున్న మధుబాలను కిశోర్ లండన్లో కూడా చూపించాడు. నయం కాదని తెలిశాక మృత్యువు తెచ్చే ఎడబాటును తట్టుకోవడానికి బహుశా ముందు నుంచే దూరమయ్యాడు. ఒక అందమైన సుందరి, కోమలమైన హృదయం గల స్త్రీ గుండె నిండుగా ప్రేమ పొందకనే మరణించింది. జీవించి ఉండగా, మరణించాక... నేటికీ ఎందరికో పోస్టర్గర్ల్గా గోడల మీద ఉంటున్న మధుబాల... తాను కోరుకున్న ప్రేమను, తన మనసు నింపే ప్రేమను పొంది ఉంటే మరికొన్నాళ్లు బతికి ఉండేదేమో. ప్రేమికుల రోజు జన్మించిన మధుబాల ప్రేమ ఉన్నంత కాలం ఒక గులాబీని ఆమె స్మరణలో పొందుతూనే ఉంటుంది ఏ అనామక అభిమాని నుంచో.ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నాఔర్ అబ్ హమె కర్నా క్యాజబ్ ప్యార్ కియాతో డర్నా క్యా: -
గోధుమ/జొన్న/రాగులతో రోటీలు,దోసెలు.. లాభాలేమిటి? ఏ సీజన్లో ఏవి తినాలి?
పుల్కా కావచ్చు, చపాతీ కావచ్చు...ప్రస్తుతం ప్రతి రోజూ రోటీలను తినడం చాలా మంది ఆరోగ్యార్ధులకు అలవాటుగా మారింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్ల స్థానంలో రోటీలు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా స్థిరపడుతున్న పరిస్థితుల్లో గోధుమలతో పాటు మరికొన్ని కూడా రోటీలు, దోసెల తయారీలో వినియోగిస్తున్నారు. అలాంటి వాటిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను కూడా చేరుస్తున్నారు. సహజ ఆహారాన్ని ప్రోత్సహించే వైద్యులు కల్పిస్తున్న అవగాహన కూడా వీటి వినియోగాన్ని పెంచుతోంది.అయితే ఇప్పుడున్న అవగాహన ప్రకారం.. ఇవి కేవలం కేలరీలు లేదా ఫైబర్ గురించి మాత్రమే అనుకోకూడదు. నిజానికి శతాబ్దాల క్రితమే ఇవి మనకు ఆహారంలో భాగంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి ముందు, వాతావరణానికి తగ్గట్టుగాస్థానికంగా భూమి ఏమి అందించింది? అనేదానిపైనా, శరీరానికి ఏమి అవసరమో దానిపైనా మాత్రమే ఆహారపు అలవాట్లు ఆధారపడి ఉండేవి. ఆ తర్వాత తర్వాత వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఆహారం అందుబాటులోకి రావడంతో... కాలానుగుణంగా తినడం అనే అలవాటు తగ్గిపోయింది.మరోవైపు గోధుమలు చిరుధాన్యాలు (బజ్రా, రాగి, జొన్న, మక్కీ) వంటి తృణ ధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి పరిశోధనల ప్రకారం ఈ ధాన్యాలు ఫైబర్, విటమిన్లు తదితర ఆరోగ్యకరమైన సమ్మేళనాలను అందిస్తాయి, ఇవి మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వీటిని వినియోగించడంలో సీజన్లను దృష్టిలో పెట్టుకుంటేనే సంపూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయని సంప్రదాయ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఈ ధాన్యాలను తీసుకుంటనే శరీరానికి మేలు చేస్తాయని అంటున్నారు.మన శరీరాలు వేడి సీజన్లో లేదా చలి కాలంలో ఆహారాన్ని వేర్వేరుగా జీర్ణం చేసుకుంటాయని ఆయుర్వేదం సహా సంప్రదాయ వైవ్య విధానాలు చెబుతున్నాయి. వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా...ఇలా జీర్ణక్రియ మార్పు చేర్పులతో శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా, వాతావరణానికి సరిపోయే ధాన్యాలను మనం ఎంచుకోవచ్చు.గోధుమలు...మనం నిత్యం ఇష్టపడేవి గోధుమలతో చేసిన ఆహారం. ఇది వెచ్చదనం జీర్ణ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది. వసంతకాలంలో లేదా శీతాకాలం ప్రారంభంలో జీర్ణక్రియ నెమ్మదించినప్పుడు, గోధుమ రోటిలు కడుపుపై భారం పడకుండా శక్తిని, ఫైబర్, బి–విటమిన్లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అందిస్తాయి, బరువు పెంచకుండా రోజువారీ కార్యకలాపాలను కొనసాగించేలా చేస్తాయి.సజ్జలు...సజ్జలు ఆరోగ్యకరమైన ధాన్యరకమే కానీ దీనిది వేడెక్కించే స్వభావం దీని అధిక పోషక సాంద్రత, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్ ఫైబర్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. వెచ్చదనం శక్తిని అందిస్తాయి కాబట్టి చల్లని వాతావరణంలోనే వీటిని వినియోగిస్తారు.రాగులుప్రస్తుతం ఇడ్లీల నుంచి రోటీలు, దోసెల దాకా చేసేందుకు వాడే రాగులు (ఫింగర్ మిల్లెట్) కాల్షియం సూక్ష్మపోషకాలతో సమృద్ధికర ఆహారం. వేడి సీజన్లో ఉదరంలో తేలికగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి సీజన్లలో జీర్ణ మందగమనాన్ని నివారిస్తుంది. అనేక దక్షిణ భారత ప్రాంతాలు రాగులను వేసవిలో ప్రధాన ఆహారంగా చేయడానికి కారణం దాని చల్లబరిచే గుణమే.జొన్నలు..మక్కీ లేదా మొక్కజోన్న, జొన్న (జోవర్) రోటీలు తక్కువ గ్లైసెమిక్ ప్రభావాలు చూపిస్తూ బలమైన ఫైబర్ లను కలిగి ఉంటాయి. అవి బలమైన జీర్ణక్రియ, అధిక శ్రమ కలిగిన జీవనశైలులకు సరిపోతాయి, కానీ వాటిని కొవ్వులు లేదా కూరగాయలతో జాగ్రత్తగా జతచేయడం అవసరం. వేసవిలో చల్లదనాన్ని అందించే జొన్నలు.. శీతాకాలంలో కూడా ఉపయుక్తమైనవే.సంవత్సరమంతా ఒకే ధాన్యాన్ని తినడానికి బదులుగా, రుతువులకు అనుగుణంగా ధాన్యాలను ఆరగించడం శరీరానికి మంచిదని సంప్రదాయ వైద్య విజ్ఞానం స్పష్టం చేస్తోంది. -
వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
కంటెంట్ క్రియేటర్, కమెడియన్, బాలీవుడ్ నటి ఐశ్వర్య మోహన్ రాజ్ స్లిమ్గా మారిన సంగతి తెలిసిందే. అంతేగాదు తన వెయిట్లాస్ సీక్రెట్ని కూడా చాలా నిజాయితీగా బయటపెట్టారామె. తాను వెయిట్లాస్ డ్రగ్ మౌంజారోని వాడనని దానివల్ల 22 కిలోలు వరకు బరువు తగ్గానని నర్మగర్భంగా చెప్పారామె. అయితే అలా చెప్పినందుకు పలువురు విమర్శించారు కూడా. కానీ బాలీవుడ్ నటి సోహ అలీఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఆమె నిజాయితీని ప్రశంసించారు. మరి ఇంతకీ ఇలాంటి బరువు తగ్గించే మందులు ఆరోగ్యానికి సురక్షితమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..అయితే కమెడియన్ ఐశ్వర్య మోహన్ రాజ్ బరువు తగ్గేందుకు మౌంజారోలాంటివి హెల్ప్ అవుతాయి గానీ వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపినప్పటికీ..చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయనేది వారందరి వాదన. ఈ నేపథ్యంలో సోహా అలీ ఖాన్ తన తాజా పాడ్కాస్ట్లో ఎండోక్రినాలజీ అండ్ డయాబెటాలజీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అంబ్రిష్ మిథల్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జూహి అగర్వాల్తో చర్చించి మరి ఎలాంటి వాళ్లు బరువు తగ్గించే మందులు తీసుకోవచ్చు?ఎవరికి మంచిది కాదు తదితరాలను అడిగి అందరి అనుమానాలను పటాపంచలు చేశారామె. వాళ్లంతా ఏచెబుతున్నారంటే..ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిక్ , ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు బరువు తగ్గించే మందులను సిఫారసు చేస్తారని చెప్పారు. వాటి సాయంతో బరువు తగ్గితే సదరు రోగి పరిస్థితి మెరుగుపడుతుంది..తదనుగుణంగా అప్పటి నుంచి జీవనశైలిలో మార్పులు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. View this post on Instagram A post shared by Soha (@sakpataudi) బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) 27 లేదా 30 ఉంటే వాళ్లు వైద్యుల సూచన మేరకు నిరభ్యంతరంగా ఈ బరువు తగ్గించే మందులు వాడొచ్చని అన్నారు. ఇంతకుమునుపు వెయిట్లాస్ డ్రగ్స్ అత్యంత ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు నెలకు తక్కువ మోతాదు అయితే రూ. 12000లని, అదే ఎక్కువ మోతాదు అయితే నెలకు రూ. 22,000 దాక ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఎవరికి మంచిది కాదంటే..థైరాయిడ్ కేన్సర్ చరితర ఉన్న వ్యక్తులుప్యాంక్రియాటైటిస్ చరిత్రజీర్ణశయాంతర సమస్యలుమధుమేహం కారణంగా కంటివ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తదితరులకు ఈ మందులు సరిపడవని చెప్పారు. ఏమందులైనా..నిపుణలు పర్యవేక్షణలో సలహాలు సూచనలతో ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ప్రస్తుతం కాలంలో అధిక బరువు సమస్యతోనే అనారోగ్యం బారిన పడుతున్న వారెందరికో ఈ మందులు వరంగా మారాయని అంటున్నారు వైద్యనిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!) -
స్మృతి బ్రాండింగ్ హవా..! ఏకంగా విరాట్ కోహ్లి రేంజ్లో..
అమ్మాయిల క్రికెట్లో ఇప్పుడు ఆమె అతి పెద్ద అద్భుతం...వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానం...ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా అగ్రస్థానం... అంతర్జాతీయ టి20ల్లో రెండో స్థానం...అన్నింటికి మించి తొలిసారి భారత జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర...రెండేళ్ల వ్యవధిలో కెప్టెన్గా సాధించిన రెండు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్స్ దీనికి అదనం. ఈ అన్ని ఘనతలూ సాధించిన ఒకే ఒక స్టార్ ప్లేయర్ ఎవరంటే నిస్సందేహంగా స్మృతి మంధాన పేరు చెప్పవచ్చు. ఒకప్పుడు మహిళల క్రికెట్ మాత్రమే కాదు...మహిళా ప్లేయర్లు సౌందర్య సాధనాలకు తప్ప మరో ఉత్పత్తికి ప్రచారం చేస్తే చూసేవారెవరు, కొనేవారెవరు అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు స్మృతి మంధాన క్రెడిట్ కార్డులు కొనమని చెప్పినా.... ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నా...ఇంజిన్ ఆయిల్ అమ్మినా, ఎనర్జీ డ్రింక్లు తాగమని చెప్పినా జనం వింటున్నారు. ఆట ప్లస్ అందం కలగలిసిన ప్రచారకర్తగా అమాంతం స్థాయిని పెంచుకున్న స్మృతి బ్రాండింగ్ హవా ఇప్పుడు నడుస్తోంది....స్మృతి మంధాన బ్రాండింగ్ విలువ ఇప్పుడు భారీగా పెరిగినా... ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. దశాబ్ద కాలానికి పైగా నిలకడైన ఆటతీరుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కృషి దీని వెనక ఉంది. వరుసగా పలు రికార్డులు సృష్టిస్తూ అంచెలంచెలుగా ఆమె పెద్ద స్థాయిని అందుకుంది. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఆమె కెరీర్ ఆరంభం నుంచే జోరుగా సాగింది.జట్టులో జూనియర్గానే ఉన్నా... ప్రదర్శనపరంగా అందరికంటే అగ్రభాగాన నిలుస్తూ తనదైన ముద్ర వేసింది. మిథాలీ రాజ్ తర్వాత భారత నంబర్వన్ బ్యాటర్గా ఆమె అన్ని ఘనతలు సాధిస్తూ వచ్చింది. ఈ పాపులారిటీ కారణంగానే మహారాష్ట్రలో తన సొంత పట్టణం సాంగ్లీలో ఎస్ఎం 18 పేరుతో స్మృతి ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం ఆమెలోని వ్యాపార కోణాన్ని చూపించింది.అన్ని వర్గాలు మెచ్చేలా...ఒక ప్లేయర్లో ప్రతిభను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో వారు ఎంత పెద్ద స్థాయికి చేరవచ్చో అంచనా వేయడంలోనే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీల విజయం దాగి ఉంటుంది. స్మృతి మంధాన విషయంలో బేస్లైన్ వెంచర్స్ అనే మేనేజ్మెంట్ కంపెనీ చూసిన భవిష్యత్తు ఆమె బ్రాండింగ్ స్థాయిని అమాంతం ఆకాశానికి తీసుకెళ్లింది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఆమెకు బ్రాండింగ్ అవకాశాలు తెచ్చి పెట్టాయి. ‘హెల్త్, ఇన్సూరెన్స్, క్రీడా సామగ్రి, మొబైల్స్, ఫైనాన్స్... ఇలా ఒకటేమిటి... ఎన్నో భిన్న రంగాల్లో దాదాపు 15 రకాల ఉత్పత్తులకు స్మృతి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. క్రికెట్లోనే కాకుండా మైదానం బయట కూడా ఆమె వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అన్ని వర్గాలకు చేరువైనట్లుగా, అందరి మనిషి అనేలా అనిపించడమే స్మృతి బ్రాండింగ్ రహస్యం’ అని బేస్ లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహీన్ మిశ్రా తమ క్లయింట్ గురించి గర్వంగా చెబుతున్నాడు.‘సరిగ్గా చెప్పిలంటే పురుషుల జట్టులో విరాట్ కోహ్లి స్థాయిని ఇప్పుడు ఆమె మహిళల క్రికెట్లో అనుభవిస్తోంది. అందుకే ప్రీమియం, లైఫ్ స్టయిల్ బ్రాండ్లు, ఎనర్జీ డ్రింక్ ప్రకటనలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి’ అని మరో మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధి రూపేశ్ కశ్యప్ వివరించాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రచారకర్తగా ప్రస్తుత పురుషుల క్రికెటర్లు ఎంతో మందికంటే స్మృతి చాలా ముందుంది.మెగా టోర్నీల్లో విజయంతో...మూడు నెలల వ్యవధిలో స్మృతి వన్డే వరల్డ్ కప్ విజయం, ఉమెన్ ప్రీమియర్ లీగ్ విజయాల్లో భాగంగా ఉంది. ఇందులో డబ్ల్యూపీఎల్ టీమ్కు ఆమె కెప్టెన్ కూడా. పైగా ఫ్యాన్స్పరంగా చూస్తే అత్యంత ప్రజాదరణ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇవన్నీ కలిసి సహజంగానే స్మృతి బ్రాండింగ్ విలువను అమాంతం పెంచేశాయి. బ్రాండింగ్ వ్యవహారాలను చూస్తే సంస్థ క్రోల్ అంచనా ప్రకారం... గత ఏడాది కాలంలో ఆమె విలువ దాదాపు 50 శాతం పెరగడం విశేషం. 2023లో తొలి డబ్ల్యూపీఎల్ సమయంలో స్మృతి బ్రాండింగ్ విలువ సుమారు 12 మిలియన్ డాలర్లు కాగా, 2024లో అది 17 మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు అది ఏకంగా 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 226 కోట్లు) వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు ఒక్కో ప్రకటనకు ఆమె రూ. 2 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఆర్జనపరంగా భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (సుమారు రూ. 26 కోట్లు)తో పోలిస్తే స్మృతి (సుమారు రూ. 34 కోట్లు) చాలా ముందుంది. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 15 మిలియన్లకు చేరడం విశేషం. ఒక్క ఏడాదిలోనే ఇది రెట్టింపైంది. ఆటపరంగా స్మృతి తన కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉంది. ఇంకా 30 ఏళ్లు కూడా నిండని ఆమె త్వరలో హర్మన్ తప్పుకుంటే భారత కెప్టెన్గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్రాండింగ్ విషయంలో మరికొంత కాలం స్మృతి హవా కొనసాగడం ఖాయం. ప్రస్తుతం స్మృతి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పటి వరకు పని చేసిన కొన్ని సంస్థలు చూస్తే... నైకీ, ఎస్బీఐ, హ్యుందాయ్ మోటార్స్, హావెల్స్, పీఎన్బీ మెట్లైఫ్, రెడ్బుల్, గల్ఫ్ ఆయిల్, హెర్బలైఫ్, రాంగ్లర్ జీన్స్, మాస్టర్ కార్డ్, నీమ్ ఆయు షాంపూ, నేచురల్స్, గవి ఎడ్టెక్, మ్యాడ్ ర్యాబిట్ ఆడియో ప్రొడక్ట్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్లేయర్స్ పాట్ ఆన్లైన్ గేమ్, రెక్సోనా.మొహమ్మద్ అబ్దుల్ హాది (చదవండి: అద్భుతమైన హోమ్ టూర్..! జీవితాన్ని ఆస్వాదించటం అంటే ఇదే..!) -
అద్భుతమైన హోమ్ టూర్..! రిటైర్డ్ ఐపీఎస్ అధికారి..
ఇటీవల కాలంలో సోషల్మీడియా పుణ్యమా అని సీనియర్ సిటిజన్లు కూడా కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్లుగా తమ టాలెంట్ని చూపిస్తున్నారు. ఒకరకంగా వారికి ఇదొక వ్యాపకం, కాలక్షేపం కూడా. అలానే ఇక్కడొ వృద్ధుడు కూడా తన హోమ్టూర్ వీడియోతో నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు. తొలిసారిగా చేసిన హోమ్టూర్తో ఆ తాతగారు..జీవితం విలువని తెలియజేశారు. ఆ తాతగారే కర్తార్ సింగ్. వయసు కేవలం సంఖ్యే అని తన హోమ్ టూర్ వీడియోతో చెప్పకనే చెప్పాడు. ఆ వీడియోలో హర్యానాకు చెందిన 89 ఏళ్ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తన బెంగూరురు నివాసాన్ని అద్భుతంగా చూపించాడు. తన వన్ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం అద్భుతంగా చూపించారాయన. ఆ తాత గారు నారింజ కుర్తా, సాంప్రదాయ హిమచల్ టోపీని ధరించి..తన ఇంటికి ఆహ్వానించిన తీరు అదుర్స్. ఇలా హోమ్ టూర్ వ్లాగ్ చేయడం ఇదే తొలిసారి అని చెబుతూ..తన ఇంటి గురించి పూసగుచ్చినట్లుగా వివరించారు. ఆ వీడియోలో తన పేరు కర్తార్ సింగ్ తోమర్. హర్యానా కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని. తాను దాదాపు 89 ఏళ్ల వయసులో ఉన్నానని..ఇదే తన 1 BHK ఫ్లాట్, ఇక్కడే రోజంతా గడుపుతానని చెబుతాడు. తన ఇల్లు తనకు స్వర్గం లాంటిదని చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. అక్కడ ఉండే సోఫా-కమ్-బెడ్, డైనింగ్-కమ్-స్టడీ సెటప్ , క్లీన్గా ఉన్నా వంటగది, బాత్రూంలో స్కిడ్-నిరోధక ఫ్లోరింగ్, తదితరాలన్నీ చూపిస్తాడు. అలాగే ఫ్యాన్తో పనిలేకుండా చక్కగా గాలి వచ్చే పెద్ద అద్దాల విండోని, బాల్కనీలో చక్కగా ఆస్వాదించే పచ్చదనం తదితరాలన్నీ చక్కగా వివరిస్తూ..చూపించారు వీడియోలో. సింపుల్గా చెప్పాలంటే.. ఓ సీనియర్ సిటీజన్కి అనుకూలమైన ఇల్లు ఎలా ఉండాలో చెబుతున్నట్లుగా ఉంటుంది. అంతేగాదు పదవీవిరమణ తర్వాత హాయిగా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తున్నట్లుగా ఉంది. View this post on Instagram A post shared by Manasum Senior Living (@manasum.living) (చదవండి: విడదీయలేని బంధం మాది..! హ హ్హ హసిని క్యూట్ లవ్ స్టోరీ..) -
విడదీయలేని బంధం మాది..! హ హ్హ హసిని..
ప్రేమించుకోవడం కంటే దాన్ని కడదాక నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమికులు అవ్వగలిగినంత ఈజీగా..మంచి ఆలుమగలు అనిపించుకోలేరు చాలామంది. వివాహ బంధంలో మనస్పర్థలనేవి కామన్..వాటిని అధిగమించి అన్నివేళలా ఒకరికొకరుగా సాగడం కొందరికే సాధ్యం. అలాంటి వాళ్లు ప్రేమికులుగానూ..దపంతులుగానూ గెలిచి..అందరికీ ఆదర్శంగాన నిలుస్తుంటారు. ఈ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నేపథ్యంలో ప్రేమను కడదాక ఉంచుకుని..విజయవంత చేసుకుని..అందరిచేత గొప్ప సెలబ్రిటీ జంటగా పిలిపించుకుంటున్న రితేష్ జెనీలియా క్యూట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.రితేష్-జెనీలియాలు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెళ్లై 14 ఏళ్లు అయినా..ఏ ఈవెంట్లో అయినా..జంటగా కనిపించి సందడి చేస్తుంటారు. దపంతులంటే వీళ్లలా ఉండాలి అనేలా ఎంతో అన్యోన్యంగా అందంగా కనిపించే ఈ జంట లివ్ఇన్రిలేషన్షిప్కి దూరం అంటే ఒప్పుకుంటారా..!?. ఔను..! ఇది నిజం. సినిమా షూటింగ్లు నిమిత్తమైన ఇరువురు వేరుగా.. స్నేహితులతోనే ఉండేవారట. అంతేగాదు అందరిలా డేటింగ్ చేయకుండా హద్దుల్లో ఉంటూనే ఒకరినొకరు అర్థం చేసుకుని మరి వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్య దాంపత్యం గురించి పలు విషయాలు సానియా మీర్జా పాడ్కాస్ట్లో షేర్ చేసుకున్నారు కూడా. తాము ఎప్పుడు పెళ్లికి ముందు ఒకే గదిలో కలిసి ఉండటం వంటివి చేయలేదని అన్నారు. కానీ చాలా క్లోజ్గా ఉండేవాళ్లం. ఎంత దూరంలో ఉన్నా..ఒకరి జీవితంలో ఒకరు ఉండేవాళ్లం. పెళ్లి అయ్యాకే..తాము కలిసి ఉన్నామని, అంతకుమునుపు షుటింగ్ సమయంలో కూడా స్నేహితులతోనే ఉండేవాళ్లమని అన్నారు. అయినా ఇంతలా అన్యోన్యంగా ఎలా ఉండగలరు మీరు అని అందరు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. అయితే ఇద్దరి మధ్య చక్కటి అవగాహన..ప్రతీది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే..బంధం స్ట్రాంగ్గా ఉంటుందంటున్నారు ఇద్దరు. మధ్యలో జెనీలియా కల్పించుకుంటూ..తనకంతా రితేషేనని. తన ప్రేమ, ఇష్టం, కన్నీళ్లు ఏదైనా రితేష్ అని చెబుతుంది. తనకు కంటనీరు రాక మునుపే రితేష్కి అర్థమైపోతుంది. తనతో ఉన్నవాళ్లకు ఎవ్వరైనా..రితేష్ ఎంతలా కనెక్ట్ అవ్వుతాడో ఇట్టే అర్థమైపోతుంది. అతని కేరింగ్ కూడా అద్భుతమని అంటోంది జెనీలియా. తనెప్పుడు నాతోనే ఉన్న అనుభూతే కలుగుతుంది, ఇంకా చెప్పాలంటే 24/7 అనోచ్చు అని నవ్వుతూ చెప్పింది జెనీలియా. అంతేగాదు ఆ పాడ్కాస్ట్ చివరలో మా ఆయన బంగారం అంటూ నవ్వేసింది ఈ అందాల హాసిని..(చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!) -
నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!
బాలీవుడ్ నటి, రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. ఫ్యాషన్ పరంగానూ ఆమెకు సాటిలేరవ్వరూ. రెట్రో స్టైల్తో అందర్నీ మెప్పించి..అందరూ ఆ బాటలో పయనించేలా స్ఫూర్తిగా నిలిచిందామె. అలాంటి ఆలియా ఓ మీడియా ఇంటర్వ్యూలో తనకెంతో ఇష్టమైన పిల్లుల నుంచి గొప్ప జీవిత పాఠాలు నేర్చుకున్నానంటూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆలియాకు తన పెంపుడు జంతువులు ఎడ్వర్డ్, జునిపర్లంటే ఎంతో ఇష్టమో తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తరుచుగా షేర్ చేస్తుంటుంది ఆలియా. అవి తనకు అద్భుతమైన జీవిత పాఠాలు నేర్పించాయంటూ వాటి గురించి చెప్పుకొచ్చింది ఆ ఇంటర్వ్యూలో. అవేంటంటే..మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోకండి, అలాగే ఎవరి నుంచి ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి. ఎంత తక్కువగా ఆశ పెట్టుకుంటే అంత తక్కువగానే నిరాశే చెందుతామని అంటోందామె. హాయిగా నిద్రపోండి. జీవితం చాలా అందమైనది అంటూ ఆమె తన పెంపుడు పిల్లుల నుంచి నేర్చుకున్న వాటి గురించి వివరించింది. అలాగే తన చిన్నతనాన్ని ఉద్దేశించి ఒక హృదయపూర్వక లేఖను పంచుకుంది. బాల్య స్వభావం ప్రకారం..చిన్నారులు ఎక్కువ కలలు కంటుంటారు. ఆ లేఖలో దాన్నే ప్రోత్సహిస్తూ..చిన్నా నువ్వు ఎప్పుడు కలలు కంటూనే ఉంటావని తెలుసు. దయచేసి అలా చేయడం ఆపకండి. మీలోని కలలు కనేవాడే మీ సూపర్ పవర్ అంటూ చెప్పిన మాట కూడా తనకు అద్భుతంగా పనిచేసిందని అంటోంది ఆలియా. ఇక, ఆలియా తన కుమార్తె రాహా గురించి మాట్లాడుతూ..మనకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన కూమార్తె పుడుతుంది. మన జీవితం ఊహించలేని విధంగా మారుతుంది. పైగా ఆమె న్యాయవాది ఆకావాలని అనుకుంటుంది కూడా అని నవ్వుతూ అన్నారామె. కాగా, ఏప్రిల్ 14, 2022న పెళ్లి బంధంతో ఆలియా, రణబీర్ కపూర్లు ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: శెభాష్ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..) -
గుండెను కోసే గాయం…
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి అయితే, అది విఫలమైనప్పుడు కలిగే బాధ ఒక నరకం. "ఆమె లేకపోతే నా ప్రపంచం శూన్యం", "ఆమె లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను" అనే భావన ఒక వ్యక్తిని ఆత్మహత్య అనే అగాధం వైపు నడిపిస్తుంది.'అజయ్' (పేరు మార్చాను) అనే 26 ఏళ్ల యువకుడి జీవితంలో జరిగిన సంఘర్షణ ద్వారా ఈ మరణపు అంచులను స్పృశించే మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం.‘‘నేను మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటున్నాను, నన్ను మర్చిపో' అని ఆమె పంపిన పది పదాల ఆఖరి మెసేజ్ చదవడానికి నాకు గంట పట్టింది సర్. నా కళ్ల ముందు ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపించింది. అప్పటిదాకా నా భవిష్యత్తు గురించి నేను వేసుకున్న ప్లాన్స్, ఆమెతో కలిసి కన్న కలలు అన్నీ ఒక్క నిమిషంలో బూడిద అయిపోయాయి.ఆమె వెళ్ళిపోయింది కానీ, ఆమె జ్ఞాపకాలు నా రూమ్ నిండా దెయ్యాల్లా తిరుగుతున్నాయి. ఆమె వాడిన పర్ఫ్యూమ్ వాసన వచ్చినా, ఆమెకు ఇష్టమైన పాట విన్నా నా ఒళ్ళు వణికిపోతోంది. ఫోన్ లో ఆమె పాత మెసేజ్ లు, వాయిస్ నోట్స్ చదువుతూ రాత్రంతా పిచ్చోడిలా ఏడుస్తుంటాను.ఆమె ఆన్లైన్ లో ఉంటే.. ఎవరితో మాట్లాడుతోంది? నాకంటే మంచివాడు దొరికాడా? తనకి నా బాధ అస్సలు గుర్తు లేదా? అని నా మెదడు నన్ను వెయ్యి ప్రశ్నలతో వేధిస్తోంది.ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన ఎంగేజ్మెంట్ ఫోటో చూసినప్పుడు.. నా ప్రాణం పోయిందనిపించింది సర్. 'ఆమె లేని ఈ లోకం నాకెందుకు?' అనే ఆలోచన నా మనసులో ఒక వైరస్ లా నాటుకుపోయింది. నేను చనిపోతేనే ఆమెకు నా విలువ తెలుస్తుందని, నా సమాధి దగ్గరకు వచ్చి ఆమె ఏడుస్తుంటే చూడాలని ఒక రకమైన వికృతమైన కోరిక.నేను ఫెయిల్యూర్ ని అని, నా ప్రేమను కూడా నేను కాపాడుకోలేకపోయానని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఫ్యాన్ కు తాడు వేసుకుని గంట సేపు చూస్తూ కూర్చున్నాను సార్.. కానీ నా తల్లిదండ్రుల ముఖాలు గుర్తొచ్చి ఆగిపోయాను. అయినా నా మనసు వినడం లేదు.. 'నువ్వు బ్రతకడం వేస్ట్' అని ఒకటే అరుస్తోంది.ఆకలి చచ్చిపోయింది. ఆఫీసులో పని మీద ఏకాగ్రత లేదు, బాస్ తిడుతున్నా నాకు ఏమీ అనిపించడం లేదు. నిద్ర లేని కళ్లు, చిందరవందరగా ఉన్న గది.. నేను నాలా లేను సార్. బ్రతికి ఉన్న శవంలా ఉన్నాను.ఆమె నా కాల్స్ ఎత్తడం లేదు, బ్రతిమాలినా కనీసం ఒక్కసారి కూడా మాట్లాడటం లేదు. ఇంత నిర్లక్ష్యం చూశాక కూడా ఆమె కోసం నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియడం లేదు సార్" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అజయ్.అజయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. నాలుగేళ్లుగా తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో అజయ్ జీవితం నరకంలా మారింది. అజయ్ పడే బాధ కేవలం ఎమోషనల్ కాదు, అతని మెదడులో జరుగుతున్న రసాయనిక మార్పుల వల్ల కలిగే శారీరక హింస.బ్రేకప్ అంటే కేవలం ఒక వ్యక్తి దూరమవ్వడం కాదు.. శరీరాన్ని, మనసును మొద్దుబారిన కత్తితో కోసినట్లు ఉంటుంది. ఆ నొప్పి కంటికి కనిపించదు, కానీ ప్రతి సెకను చంపేస్తుంటుంది.బ్రేకప్ అనేది ఒక 'డ్రగ్ విత్ డ్రాయల్' (The Neurological Agony) అజయ్ అనుభవిస్తున్న ఈ స్థితి వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలను గమనిస్తే, ఇది కేవలం బలహీనత కాదని అర్థమవుతుంది.🔹ది బ్రైన్ ఇన్ విత్ డ్రాయల్ (The Addictive Loop): ప్రేమలో ఉన్నప్పుడు మెదడులో Dopamine (Happy Hormone), Oxytocin (The Cuddle Hormone) విపరీతంగా విడుదలవుతాయి. బ్రేకప్ అయినప్పుడు, మెదడు ఒక్కసారిగా ఈ హార్మోన్ల సరఫరాను ఆపేస్తుంది. ఇది ఒక మాదక ద్రవ్యానికి బానిసైన వ్యక్తికి ఆ డ్రగ్అందకపోతే ఎంత బాధ కలుగుతుందో (Withdrawal Symptoms), అంతటి నొప్పిని కలిగిస్తుంది.🔹సోషల్ పెయిన్ ఈజ్ ఫిజికల్ పెయిన్: సైకాలజీ ప్రకారం, మనసు పడే బాధను మెదడులోని Anterior Cingulate Cortex అనే భాగం గుర్తిస్తుంది. విచిత్రం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని కొట్టినప్పుడు కలిగే శారీరక నొప్పిని గుర్తించే మెదడు భాగమే, మనసు గాయపడినప్పుడు కూడా స్పందిస్తుంది. అంటే, అజయ్అనుభవిస్తున్న మనోవేదన ఒక ఎముక విరిగినప్పుడు కలిగే నొప్పి కంటే తక్కువేమీ కాదు.🔹The Amygdala Hijack: అజయ్ మెదడులోని Amygdala (భయం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే భాగం) పూర్తిగా అతని లాజికల్ మెదడును (Prefrontal Cortex)డామినేట్ చేస్తోంది. అందుకే అతనికి సూసైడ్ అనేది ఒకే ఒక్క పరిష్కారంలా కనిపిస్తోంది. దీన్నే 'టన్నెల్ విజన్' అంటారు. 🔹Obsessive Rumination: ‘‘నా తప్పు ఏంటి? ఆమె ఎందుకు మారింది?’’ అని పదే పదే ఆలోచించడం వల్ల మెదడులో Default Mode Network (DMN) అతిగా పని చేస్తుంది. దీనివల్ల బాధితుడు తన గతాన్ని వదలలేక పోతాడు.🔹The Revenge Fantasy: చాలా మంది "నేను చనిపోతే ఆమె బాధపడుతుంది" అని అనుకుంటారు. ఇది ఒక తప్పుడు రివెంజ్ ఫాంటసీ. చనిపోయిన తర్వాత వారు చూసే బాధను చూడటానికి మీరు ఉండరు అనే నిజాన్ని మెదడు ఆ సమయంలో గ్రహించలేదు. ఇది కేవలం క్షణికావేశంలో మెదడు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం (Executive Dysfunction).దీనివల్ల కలిగే తీవ్ర నష్టాలు… 🔸Clinical Depression: కేవలం బాధగా ఉండటం కాదు, ఇది తీవ్రమైన క్లినికల్ డిప్రెషన్ కు దారితీసి మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. 🔸Self-Harm: తనని తాను కోసుకోవడం లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం ద్వారా మానసిక నొప్పి నుండి ఉపశమనం పొందాలని చూడటం. 🔸Future Anxiety: "నేను మళ్ళీ ఎవరినీ ప్రేమించలేను", "ఎవరు వచ్చినా నన్ను వదిలేస్తారు" అనే భయంతో మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోవడం.ఆవేదన నుండి ఆనందం వైపు (The Path to Recovery) అజయ్ ను ఆత్మహత్య నుండి కాపాడి, అతని జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వడానికి మేము Multimodal Therapy ఉపయోగించాము. అజయ్ దగ్గర ఉన్న పదునైన వస్తువులను, ప్రమాదకరమైన మెడిసిన్స్ను తొలగించమని అతని స్నేహితులకు చెప్పాము. ఒంటరిగా ఉండనివ్వలేదు."ఈ బాధ శాశ్వతం కాదు, ఇది కేవలం మెదడులోని రసాయనాల చర్య" అని అతనికి అర్థమయ్యేలా వివరించాము. అతని ఫోన్ నుండి ఆమె ఫోటోలు, నంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేయించాము.అజయ్ లో డోపమైన్, సెరోటోనిన్ పెంచడానికి రోజూ జిమ్ కి వెళ్లేలా చూశాము. తన పాత హాబీలను మళ్ళీ మొదలుపెట్టేలా ప్రోత్సహించాము. CBT, NLPt, Grief Counseling ద్వారా అతని ఆలోచనలను మార్చుకునేలా చేశాం .The Transformation ఆరు నెలల చికిత్స తర్వాత, అజయ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆఫీసులో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకున్నాడు.🏆"సార్, ఆ రోజు మీ దగ్గరకు రాకపోయి ఉంటే నేను ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేవాడిని. ఇప్పుడు నా జీవితం నాది. ప్రేమ కంటే నా ప్రాణం, నా కెరీర్ చాలా పెద్దవని నాకు అర్థమైంది" అని నవ్వుతూ చెప్పాడు.అజయ్ కథ మీ కథేనా? బ్రేకప్ బాధ మీ ప్రాణం తీస్తోందా? గుర్తుంచుకోండి.. మీరు ప్రేమించిన వ్యక్తి మీ జీవితం కావచ్చు, కానీ వాళ్ళు మీ ఊపిరి కాదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన మీ జీవితం ముగిసిపోదు. ఆ నల్లని మేఘాల వెనుక ప్రకాశవంతమైన సూర్యుడు ఉన్నాడని గుర్తించండి. మీ మనసు గాయాన్ని మాన్పించడానికి, మీకు మళ్ళీ బ్రతకాలనిపించేలా చేయడానికి శాస్త్రీయమైన చికిత్స ఉంది.మీ వివరాలు 100 శాతం గోప్యంగా ఉంటాయి. సహాయం కోసం ఈ రోజే సంప్రదించండి.— మీ సైకాలజిస్ట్,Psy. Vishesh -
శెభాష్ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..
కొన్ని విషయాలు చూడటానికి సాధారణ చిన్న చిన్న తప్పులుగా కనిపిస్తున్నా ..అవే ఒకరకంగా ఘోర ప్రమాదాలకు మూలం కూడా. పోనీలే అని వదిలేయడం కూడా ఒక కారణం. ఎవ్వరు అనడం లేదు కదా మనం ఒక్కరమే వ్యతిరేకించడం దేనికని వదిలేస్తుంటాం. కానీ కొందరు విభిన్నంగా ఉంటారు. డిఫెరెంట్గా ఆలోచించడమే కాదు..ఒక్కరిగా.. హీరోలా వీరోచితంగా పోరాడి శెభాష్ అని ప్రశంసలందుకుంటారు. ఔను కదా..! మనమెందుకు అలా చేయలేకపోయాం అని ఆలోచింపచేసేలా స్ఫూర్తిని కలిగిస్తారు కూడా. ఇంతకీ ఏం జరిగిందంటే..కేరళకు చెందిన ఓ వృద్ధ మహిళ రద్దీగా ఉండే రోడ్డుకి ఒకపక్కను ఉన్న ఫుట్పాత్పై నడుస్తుంటుంది. ఇంతలో ఒక ద్విచక్ర వాహనదారుడు స్కూటీపై దర్జాగా ఫుట్పాత్పై వచ్చేస్తుంటాడు. అది గమనించిన మహిళ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డగిస్తుంది. పాదాచారులు నడవకుండా మీది నుంచి వెళ్లిపోతావా అని అరుస్తూ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డుకునే యత్నం చేస్తుంది. ఇక్కడ ఆ స్కూటర్ రైడర్ కూడా ఏదో విధంగా ఆమెను తప్పించి వెల్లిపోయే సాహసం చేస్తుంటాడు ఓ పక్కన. అయితే ఆ వృద్ధ మహిళ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అతడి స్కూటర్ని ఫోటోతీసి భయపెట్టి ప్రయత్నం చేస్తుండగా..దెబ్బకు చేసేది లేక వెనక్కి తగ్గి.. నెమ్మదిగా స్కూటర్ని టర్న్ చేసుకుంటూ రోడ్డ మీదకు వెళ్లిపోతాడు. చివర్లో బొటనవేలుని చూపిస్తూ..యాహు గెలిచా..! అన్నట్లుగా చిరునవ్వు చిందించింది ఆ బామ్మ. అలా మనలో ఎంతమంది సాహసం చేయగలం అని ఆలోచిస్తే..సమాధానమే రాదు కదా..!. నిజానికి మనందరికీ కావాల్సింది ఇలాంటి ధైర్యమే అప్పుడు పెను రోడ్డు ప్రమాదాలను కొంతైనా నివారించగలుగుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కానీ చాలామంది అవతల వ్యక్తి దూకుడుగా ప్రవర్తిస్తే మనం ఇబ్బదుల్లో పడే అవకాశం లేకపోలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. చాలామటుకు ఇలా చేయడం వల్ల కాస్త భయంతో అయినా..అలా ఫుట్పాత్పై వెళ్లేందుకు జంకుతారని కొందరు వాదిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఫుట్పాత్పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం. ఫుట్పాత్లు కేవలం పాదచారుల కోసం మాత్రమే. దీన్ని ఉల్లంఘిస్తే..జరిమానా, ఆరు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ కేరళ మోటార్ వాహనాల నియమాలు, 1989 ప్రకారం, ఫుట్పాత్పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం కూడా. View this post on Instagram A post shared by Aflah E (@aflu__stories_) (చదవండి: గిఫ్ట్గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..) -
‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం!
ప్రేమ అంటే రెండు మనసుల కలయిక అనే నిజమైన అర్థం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో ప్రేమ అంటే ‘వ్యాపార ధోరణి’ అనే కొత్త అర్థాన్ని కొన్ని కంపెనీలు సృష్టించాయి. రాబోయే ఫిబ్రవరి 14న ప్రేమికులు జరుపుకోబోయే ‘వాలంటైన్స్ డే’కి వ్యాపార సరంజామాను అంటగడుతూ కొన్ని సంస్థలు మార్కెట్లో తమ హవాను చాటుకుంటున్నాయి.ప్రేమకు మార్కెటింగ్ వ్యూహంనిజానికి ప్రేమలోని మాధుర్యం ఒక అందమైన భావోద్వేగం. దీనికి సాహిత్య సృజనతోడయితే ప్రేమ మరింత పరిమళిస్తుంది. అయితే ఇప్పుడది మార్కెటింగ్ వ్యూహాల మధ్య చిక్కుకు పోయింది. ఒకప్పుడు పరస్పర అనురాగాన్ని వ్యక్తపరిచే ప్రశాంతమైన సందర్భంగా ఉన్న ప్రేమికుల రోజు ఇప్పుడు భారీ వాణిజ్య ఈవెంట్గా రూపాంతరం చెందింది. నేటి కాలంలో ప్రేమను ఖర్చు చేసే సామర్థ్యం, సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఆడంబరం, ట్రెండ్స్ను అనుసరించడం ద్వారా కొలుస్తున్నారు. ఈ మార్పు ప్రేమకున్న అర్థాన్ని తగ్గించిందని, ఖరీదైన వస్తువులను గిఫ్ట్లుగా ఇస్తేనే ప్రేమ బంధం బలపడుతుందనే అపోహలో యువత ఉన్నారని పలువురు అంటున్నారు.అంతర్జాతీయ వాణిజ్య వేడుకఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల రోజుతో ముడిపెట్టడం అనేది మధ్యయుగంలో ఐరోపా కవిత్వంగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా జెఫ్రీ చోసర్ రచనల ద్వారా ఇది ప్రారంభమైంది. శతాబ్దాలు గడిచేకొద్దీ ఈ సాహిత్య భావన ఒక సాంస్కృతిక ఆచారంగా, తరువాత అంతర్జాతీయ వాణిజ్య వేడుకగా పరిణమించింది. నేడు మనం చూస్తున్న చాక్లెట్లు, గులాబీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్రాచీన సంప్రదాయాలు కావు. ఇవి వివిధ కంపెనీలు తమ మార్కెట్ను పెంచుకునేందుకు సృష్టించిన ఆధునిక కల్పనలు మాత్రమేనని చాలామంది చెబుతుంటారు.సోషల్ మీడియా ప్రభావంఇప్పుడున్న రోజుల్లో ప్రేమ అనేది ఒక వ్యక్తిగత ఇష్టం నుండి సామాజిక బాధ్యతగా మారిపోయింది. సాధారణ వస్తువులను భావోద్వేగ అవసరాలుగా పలు కంపెనీలు తమ ప్రకటనల్లో చిత్రీకరిస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ‘వాలెంటైన్స్ వీక్’, ‘లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్స్’ వంటి పేర్లతో కృత్రిమ గడువులను సృష్టిస్తూ, బహుమతి కొనకపోవడం అనేది ఒక వైఫల్యంగా భావించేలా చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ అనేది ప్రదర్శన వస్తువుగా మారిపోయింది. మరోవైపు ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారాలు కూడా బ్రాండెడ్ వస్తువులతో ప్రేమను ముడిపెట్టేలా సాగుతున్నాయి. ఫలితంగా ప్రేమికులు ఆర్థిక పరిమితులకు మించి ఖర్చు చేస్తూ, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.ఒక బాధ్యత- దీర్ఘకాలిక నిబద్ధతఈ వాణిజ్య ధోరణి భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందని పలువురు అంటుంటారు. భారతదేశంలో ప్రేమ, అనురాగం, భక్తిని చాటేందుకు పలు మార్గాలు ఉన్నాయి. మన పండుగలు, సంప్రదాయాలు ప్రేమను ఒక బాధ్యతగా దీర్ఘకాలిక నిబద్ధతగా తెలియజేశాయి. ప్రేమ అనేది ఒక రోజు ప్రదర్శించే ఆడంబరం కాదని, అది నిరంతరం పాటించే ధర్మం అని పేర్కొన్నాయి. ప్రస్తుత వాలెంటైన్స్ డే సంస్కృతి కృత్రిమ భావోద్వేగాలను కలగుజేస్తున్నయని పలువురు అంటున్నారు.వస్తువుల కంటే విలువలకు..నిజమైన ప్రేమకు, వాణిజ్య ప్రేమకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నిజమైన ప్రేమ అనేది ఎదుటివ్యక్తి నిరంతర సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. అది జీవితాంతం ఉండే ఒక మధురమైన భావన. ప్రేమ అనేది మార్కెట్లో అమ్మే వస్తువు కాదని, అది చిత్తశుద్ధితో నిర్మించుకోవాల్సిన ఒక నిరంతర సాధన అని పెద్దలు చెబుతుంటారు. వస్తువుల కంటే విలువలకు, ఆడంబరం కంటే అనురాగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ప్రేమకు సార్థకత చేకూరుతుందని అంటారు. ఇది కూడా చదవండి: లక్షణాలు లేకుండా కాలేయాన్ని కరిగించి.. -
ఆల్‘ఇంటి’యా రేడియో!
వన్స్ అ పాన్ ఏ టైమ్ రేడియో అంటే... ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాదు. మన కుటుంబసభ్యురాలు! ΄÷ద్దుటే సుప్రభాతంతో నిద్ర లేపి, ప్రపంచంలో, దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో చెప్పి, బుర్ర హీటెక్కి పోకుండా చల్లని పాటలు వినిపించి... ఒక్కటా రెండా... రేడియో అంటే అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపద....ఆకాశవాణి–రజనిమన ఆకాశవాణిని జనరంజకం చేసిన వారిలో బాలాంత్రపు రజనీకాంతరావు ఒకరు. ఆకాశవాణిలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వహించారు. లలిత సంగీతాన్ని ఆకాశవాణి వేదికగా జనరంజకం చేశారు. 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి, ప్రధాని నెహ్రూ ప్రసంగం తరువాత రజని రచించి, స్వర పరిచిన ‘మాదీ స్వతంత్రదేశం’ ప్రసారం అయింది.99%: ఆకాశవాణిగా ప్రసిద్ధమైన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ప్రపంచంలో అతి పెద్ద ప్రసార సంస్థలలో ఒకటి. 23 భాషలలో, 179 మాండలికాలలో మన దేశంలోని 99 శాతం మందికి చేరువైంది.ఆకాశవాణి – ఆధ్యాత్మికం – ఉషశ్రీరామాయణ, భారత, భాగవతాలను ఆకాశవాణి వేదికగా సామాన్యులకు చేరువ చేశారు ఉషశ్రీ. భగవద్గీత, సుందరకాండలను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆయన నిర్వహించిన ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం చాలా జనాదరణ పొందింది. పౌరాణికాలకు సంబంధించి ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.1923: బాంబే రేడియో క్లబ్ కార్యక్రమాలతో 1923లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మొదటి న్యూస్ బులెటిన్ జనవరి 19, 1936లో ప్రసారం అయింది.ఆకాశవాణి–మహానటిమహానటి సావిత్రి సమర్పించిన జనరంజని ప్రత్యేక కార్యక్రమం 1979లో ఉగాది రోజున ప్రసారం అయింది.సిగ్నేచర్ ట్యూన్ శివరంజనిశివరంజని రాగం ఆధారంగా వాల్టర్ కౌప్మన్ ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ను స్వరపరిచారు. వయోలిన్పై వాయించారు.జనం మెచ్చిన జనరంజనిశ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ‘జనరంజని’ అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఆదివారాలు, పండగ రోజుల్లో ప్రత్యేక జనరంజని కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.బారిష్టర్ పార్వతీశం రాకతో రేడియో నవ్వింది!మొక్క పాటి ప్రసిద్ధ హాస్య నవల ‘బారిస్టర్ పార్వతీశం’ ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకాల్లో ఒకటి.రేడియోలో వేటూరి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైన వేటూరి సంగీత రూపకం ‘సిరికాకొలను చిన్నది’ అద్భుతమైన ఆడియో నాటిక. ఈ సంగీతక రూపకానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు.థీమ్ 2026ఈ సంవత్సరం ‘వరల్డ్ రేడియో డే’ థీమ్...‘రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ వాయిస్’ -
రెట్రో క్వీన్ కల్పనా ఈజ్ బ్యాక్
ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉండే నేటి డిజిటల్ కాలంలో కూడా కానీ కొన్ని క్లాసిక్స్కు ఎప్పటికీ కాలం చెల్లదన డానికి 1981లో ఒక వెలుగు వెలిగిన రంభ హో పాట, ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తం గా మార్మోగి పోతోంది. కారణం ఒరిజినల్ రంభా హో గర్ల్ కల్పనా అయ్యర్ తన 69 ఏళ్ల వయసులో చేసిన ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్. పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని ఒక పెళ్లి వేడుకలో ఈ మ్యాజిక్ జరిగింది. తన స్నేహితురాలి కుమారుడి పెళ్లికి వెళ్లిన కల్పనా, అక్కడివారి కోరిక మేరకు ఏమాత్రం ΄్లాన్ చేయకుండానే స్టేజ్ ఎక్కారు. లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ పాడిన అత్యంత ప్రసిద్ధ పాటల్లో ఒకటైన రంభహో పాటకు ఆమె తనదైన శైలిలో స్టెప్పులేసి సందడి చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అవ్వడంపై కల్పనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానులంతా తనపట్ల చూపిస్తున్న ప్రేమకి ఎంతో సంతోషంగా ఉందని ఆమె కృతజ్ఞతలు తెలి పారు. కల్పనా అయ్యర్ 1980లలో బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన డాన్సర్, నటి. ఆమె 1978లో మిస్ ఇండియా రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా డిస్కో డాన్సర్ సినిమాలోని ఔవా ఔవా, అర్మాన్ చిత్రంలోని రంభ హో వంటి పాటలతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమెను అప్పట్లో క్యాబరే క్వీన్ అని పిలిచేవారు. ఈ పాట మళ్ళీ ఇంతలా వైరల్ అవ్వడానికి మరో కారణం బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ధురంధర్ సినిమా కోసం ఈ ఐకానిక్ సాంగ్ను రీమిక్స్ వెర్షన్ లో ఉపయోగించారు. 80ల నాటి ఈ ఎనర్జిటిక్ పాటను నేటి జెన్జెడ్ యువత కూడా ఇష్టపడటం విశేషం. -
విజయపథంలో ఆమె పాదం
వైకల్యం అనే ఓ పదం మనిషి ఆశలను, ఆశయాన్ని చలనం లేకుండా చేయలేదు అని నిరూపించింది. తనను చూసి ఎగతాళి చేసిన అయిన వాళ్లతో పాటు.. కరుడుగట్టిన బయటవాళ్లనూ గెలిచారు కృష్ణవేణి. ఇటీవల వెలువడ్డ గ్రూప్–1 ఫలితాల్లో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని శ్రీరంగరాజపురం (ఎస్ఆర్)కు చెందిన ముద్దంగల కృష్ణవేణి రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యారు. తల్లి రోజువారీ తాపీ పనులకు వెళితే.. తండ్రి వ్యవసాయ కూలి పనులు చేసి బిడ్డను చక్కగా చదివించారు. ఇపుడు ఊరంతా కృష్ణవేణి విజయం గురించి మాట్లాడుతోంది. కానీ ఆ విజయం వెనుక కష్టం గురించి మాత్రం కృష్ణవేణే మాట్లాడాలి. ఆమె ఏం చెబుతోందో తెలుసుకుందాం...మాది పేద కుటుంబం. అన్న, నేను, తమ్ముడు ముగ్గురం. నాన్న దొరస్వామి. రోజూ ΄÷లంలో కూలి పనులు చేస్తాడు, అమ్మ పేరు రత్నమ్మ. మగాళ్లకు సమానంగా ఇసుక–సిమెంటు కలపడం, ఇటుకరాళ్లు మోయడం లాంటి తాపీ పనులు చేసింది. రోజూ ఎవరో ఒకరు పనికి వెళితే తప్ప.. ఆ రోజు ఇల్లు గడవదు. తిన్నా, తినకున్నా.. నాకు మాత్రం స్కూల్లో ఉండడం ఇష్టం. నేను ఆరోతరగతి చదువుతుండగా 2010లో ఓ రోజు ఇంటి దగ్గర బట్టలుతికి, ఆరేస్తుండగా.. 11 కేవీ విద్యుత్ వైరు తగలడంతో నేను కిందపడి పోయాను. మా కుటుంబం పరిస్థితి తలకిందులై పోయింది.అప్పుల ఊబిలో చిక్కుకున్నాంట్రాన్స్కో అధికారులకు అప్పటికే చాలాసార్లు చెప్పాం. లైను మార్చమని, వాళ్లు పట్టించుకోక పోవడంతో కరెంటు తీగలు తాకిన నాకు షాక్ తగిలి శరీరమంతా నల్లగా మారి పోయింది. ఇక బతకదన్నారు. చివరి ప్రయత్నంగా తమిళనాడు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నన్ను ఎలాగో బతికించారు. మూడు నెలల తరువాత కాలు, చేయి కోల్పోయిన నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే నా వైద్యంకోసం భూములు పోయినాయి. అప్పుల్లో చిక్కుకున్నాం. (ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాం) కానీ నాకేమో ఇంట్లో ఉండడం నచ్చదు. ఏది ఏమైనా బడికి వెళ్లాలి. ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్లడానికి రోడ్డుపై నిలబడితే ఊర్లో ఉన్న ఎవరో ఒకరు నన్ను స్కూటర్పై ఎక్కించుకుని బడిలో వదిలితే అమ్మో నాన్నో వచ్చి పిలుచుకెళ్లేవాళ్లు. ఆ తర్వాత కృత్రిమ కాలు అమర్చుకున్నాను.ఆ నిర్లక్ష్యమే కసిని పెంచింది.ట్రాన్స్ కో అధికారుల నిర్లక్షా్యనికి పరిహారం కోరుతూ కలెక్టరేట్ చుట్టూ తిరిగేవాళ్లం. చేయి, కాలు పనిచేయని నన్ను అమ్మ–నాన్న చిత్తూరులో ఉండే కలెక్టరేట్కు తీసుకెళ్లేవాళ్లు. క్యూలో నిలబడి చాలాసార్లు మాకు జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నాం. అప్పుడే నేనొకటి గమనించాను. మాకన్నా దారుణమైన పరిస్థితి ఉన్న వాళ్లు కూడా కలెక్టర్ పిలిస్తే వెంటనే అక్కడ నిలబడటం, ఆయన ఆదేశాలు పాటించడం చూశాం. అంటే చదువుకుని చేతిలో అధికారం ఉంటే అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయొచ్చని మాత్రం అర్థమయ్యింది. ట్రాన్స్కో అధికారుల మనసు కరగక పోవడంతో అప్పులు చేసి మరీ కోర్టులో కేసు వేశాం. 54 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ తొక్కుతూ నాన్న వాయిదాలకు హాజరయ్యేవారు. అదే నాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే కసిని పెంచింది. 14 ఏళ్ల తరువాత పరిహారం వచ్చినా.. అది మా అప్పులు–వడ్డీలకు కూడా చాల్లేదు. పదో తరగతి వరకు ప్రభుత్వ బడే. మళ్లీ ఇడుపుల పాయలో సీటు, అక్కడే బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేశాను.ఐఏఎస్ అవుతా..డిగ్రీ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాను. 2022లో వెలువడ్డ గ్రూప్స్ నోటిఫికేషన్ లో తొలి పరీక్షే తప్పాను. ఆ మరుసటి ఏడాది వెలువడ్డ నోటిఫికేషన్ లో ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని నిర్ణయించుకున్నాను. గ్రూప్–1, గ్రూప్–2కు సమాంతరంగా సిద్ధమయ్యాను. నా ఆర్థిక పరిస్థితి తెలిసి చాలామంది దాతలు చందాలు వేసుకుని హాస్టల్ ఫీజులు, స్టడీ సెంటర్ ఫీజులు కట్టారు. అది ఎప్పటికీ మర్చి పోలేను. ఈ మధ్యే గ్రూప్–2లో సివిల్ సప్లైస్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినా గ్రూప్ 1లో ఉద్యోగం వస్తుందన్న ధీమాతో అందులో చేరలేదు. నా నమ్మకం వమ్ము పోలేదు. అనుకున్నట్లే వచ్చింది. అమ్మా నాన్నలను నా కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పాలి. ఇదే సమయంలో ఎప్పటికైనా ముద్దంగల కృష్ణవేణి.. ఐఏఎస్ అని పిలిపించుకోవాలన్న నా లక్ష్యాన్ని సాధించి తీరతాననే నమ్మకం ఉంది. – ఎం.లోకనాథన్, సాక్షి, చిత్తూరు అర్బన్ -
పాఠం నుంచి పాకం దాకా
ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పెద్ద జీతం మీద పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్ప్రెన్యూర్గా ఎలా ఎదిగిందో చూద్దాం...రిచాశర్మది జైపూర్. ఫైనాన్స్లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు. వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్’ పేరుతో శ్నాక్స్ సప్లై చేసేది. కోవిడ్ మార్చేసిన జీవితంఅలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్ బిజినెస్ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్ మేడ్ ఫుడ్ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్ స్కిల్స్ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం. ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ల వరకు విస్తరించారు. తన బిజినెస్కు ‘హంబుల్ ఫ్లేవర్స్’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్ ఇన్స్పైరింగ్ హోమ్ బిజినెస్ ఉమన్ అవార్డు వరించింది. -
కన్నుల పండువగా స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు
అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.లోక కల్యాణార్థం సకల శుభప్రాప్తి కోసం అస్మద్ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభంస్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. 17 వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.విశేష కార్యక్రమం వివరాలునేటినుంచి పల్లకిసేవ... 12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ.14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి. సాయంత్రం అశ్వవాహన సేవ. 16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి.ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకుసుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార, ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.చదవండి: మోక్షమార్గం.. శివనామ స్మరణంసాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకుశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
గిఫ్ట్గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..
బంగారం ధర ఏ రేంజ్లో ఉందంటే..కొనాలనే ఆలోచన కూడా మనసులోకి రావడం లేదు. అంతగా భయపెడుతున్నాయ్ దాని ధరలు. అలాంటిది ఇక్కడొక పెళ్లి వేడుకలో ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను గిఫ్ట్గా అందిస్తున్నారు. ఎంత ధనవంతులైనా..బంగారం గిఫ్ట్గా ఇవ్వడమా..?! అని సందేహం వస్తుంది కదా..!. కానీ ఇది నమ్మక తప్పని నిజం. ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఒక వివాహంలో వధువు కుటుంబం వరుడి కుటంబానికి బంగారు బిస్కెట్లను బహుమతిగా ఇస్తోంది. అవి కూడా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను ఏదో చాక్లెట్లను పంచినట్లుగా ఇస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. విలాసవంతమైన పెళ్లిళ్లు ఎన్నో చూసుంటాం గానీ..ఇలా బంగారు బిస్కెట్లను బహుమతులుగా ఇవ్వడg ఇదే తొలిసారేమో కాబోలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 33 సెకన్ల ఆ వీడియో క్లిప్లో ఒక వ్యక్తి ఒక బాక్స్ నిండుగా బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ..అక్కడున్న మగవాళ్ల ముందు పెట్టడం..వాళ్లు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నెటిజన్లు అవి బంగారం కాదని వాదిస్తున్నారు. మరికొందరు దీనిని దుబారా లేదా తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవడంగా విమర్శిస్తే..చాలామంది మాత్రం..బంగారు రేకుతో చుట్టబడిన లగ్జరీ చాక్లెట్లని, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా వివాహాలు, పండుగ సమావేశాల ఇలాంటి చాక్లెట్లని పంచడం ఆచారమని పేర్కొనడం గమనార్హం. అలాగే ఆరేబియాలో గోల్డ్ రేకుతో చుట్టబడిన పాచీ వంటి లగ్జరీ చాక్లెట్ బ్రాండ్లు బాగా ఫేమస్ కూడా. దాంతో చాలామంది అవి బంగారం కాదని తేల్చి చేప్పేస్తుండటం గమనార్హం.Saudi wedding ceremonyBride’s brother offers 24 karat Gold biscuits to Groom’s family 😳pic.twitter.com/2lOAZwUhoi— Frontalforce 🇮🇳 (@FrontalForce) February 11, 2026 (చదవండి: ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..) -
ఆ గంభీరమైన గొంతు మూగబోయింది..ప్రముఖ న్యూస్ రీడర్ కన్నుమూత
దూరదర్శన్ ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి ఈ రోజు మృతి చెందారు. గంభీరమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణతో మూడు దశాబ్దాల పాటు వార్తా రంగంలో ప్రముఖ న్యూస్రీడర్గా నిలిచారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1976లో దూరదర్శన్లో అనౌన్సర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. దాదాపు మూడు దశాబ్దాల పాటు మీడియా రంగంలో తన గంభీరమైన స్వరంతో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న సరళ మహేశ్వరి ఇక లేరు. న్యూస్ యాంకర్ అనే భావన సాధారణం కాకముందు హుందాగా స్పష్టమైన ఉచ్చారణతో వార్తలను చదువుతూ న్యూస్ రీడర్గా ప్రస్థానం ప్రారంభించాలనుకునే యువ యాంకర్లకు మార్గదర్శకంగా నిలిచారామె. 71 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సరళ మహేశ్వరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ దూరదర్శన్ నేషనల్.. ‘X’ వేదికగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా వార్తా రంగంలో ఆమె సేవలను గుర్తు చేసుకుంది. 1984 వరకు దూరదర్శన్లోనే పనిచేశారామె.“దూరదర్శన్ కుటుంబం తరపున.. సరళ మహేశ్వరికి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. దూరదర్శన్ న్యూస్ రీడర్గా.. ఆమె సున్నితమైన స్వరం, కచ్చితమైన ఉచ్చారణ, గౌరవప్రదమైన డెలివరీతో భారతీయ వార్తా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సింప్లిసిటీ, సంయమనం, వ్యక్తిత్వం.. ప్రేక్షకులలో లోతైన నమ్మకాన్ని కలిగించాయి” అని పోస్ట్ చేసింది. మహేశ్వరి మరణాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్.. “టెలివిజన్ జర్నలిజంలో స్వర్ణయుగం ముగింపు”గా అభివర్ణించింది. ఆమె విశ్వసనీయత, మర్యాద ఎల్లప్పుడూ రాబోయే తరాలకు ప్రేరణగా ఉంటాయని పేర్కొంది. ప్రశాంతమైన అందమైన ముఖంతో ప్రేక్షకులను పలకరిస్తున్నట్లుగా అత్యంత నైపుణ్యంతో వార్తలు అందించేవారామె. ఆమె గొంతుకకు మాతమ్రేగాక ధరించే దుస్తులకు కూడా అభిమానులు ఉండేవారట. దూరదర్శన్కు ఆమె దుస్తుల గురించి వందలాది అబిమానుల లేఖలు వచ్చేవట. ఆమె ధరించే గుజరాతీ చీరలను హిందీ చిత్రపరిశ్రమలో నటీనటుమణులు కూడా కాపీ చేసేవారట. అంతేగాదు ఆమె చీర కట్టు తీరు కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది, పైగా ఆ క్రెడిట్ని తన తల్లికే ఇచ్చేవారట ఆమె. నిజానికి టెలిప్రాంప్టర్లు లేని యుగం, న్యూస్ రీడర్లు పూర్తిగా వారి జ్ఞాపకశక్తిపై ఆధారపడవలసి వచ్చింది. దాంతో సరళ తరుచుగా ఇంటర్వ్యూలలో ఇలా అనేవారట. ఇది అపారమైన బాధ్యతతో కూడిన పని అని, దీన్ని బాగా చేయడానికి ఎంతో కొంత పరిణతి ఉండాలని చెప్పేవారట.(చదవండి: ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..) -
ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూసలమ్మే అమ్మాయి గుర్తుందా..!. అందమైన మోముతో అందర్నీ ఆకర్షించి..రాత్రికిరాత్రికే సంచలనంగా మారింది. పైగా నటిగా అవకాశం వరించింది కూడా. అలా ఏదోక విశిష్ట లక్షణంతో సెన్సెషన్ అయిన వాళ్లెందర్నో చూశాం. కానీ ఇలాంటి కళ్లున్న అమ్మాయిని మాత్రం చూసుండరు. ఈ అమ్మాయి 20 ఏళ్ల క్రితం పలు పోస్ట్కార్డ్లపై కనిపించి సంచలనంగా మారింది. అయితే అప్పుడు సోషల్ మీడియాలు లేవు కాబట్టి..మ్యాగ్జైన్ కవర్పేజీలో, పర్యావరణ సావనీర్లలోనూ ఆమె ముఖ చిత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏముంది ఆమె ముఖంలో అంతగా ఆకర్షించేది అంటే..ఆమె అందమైన కళ్లు. కవులు చెప్పే కలువరేకుల్లాంటి కనులు గురించి విని ఉంటారు. కానీ ఈమె కళ్లు ఎలా ఉంటాయో తెలిస్తే..విస్తుపోతారు. ఇంతకీ ఎవరీమె అంటే..దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాజస్థాన్లోని పుష్కర్ ఫెయిర్లో ఆ యువతి ఫోటోలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎడారి పట్టణ నేపథ్యం నుంచి వచ్చి ఆమె చిత్రాలు చాలా దూరం ప్రయాణించాయి. ఆ అమ్మాయే రాజస్థాన్కి చెందిన పప్పుదేవి. మళ్లీ ఇన్నేళ్లకు ఆన్లైన్లో ఆమె ఫోటో వైరల్గా మారి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. ఇంతకీ ఆమె మోములోని స్పెషల్టీ మొత్తం కళ్లదే. ఆ కళ్లు అలాంటి ఇలాంటివి కాదు..అచ్చం పులి లాంటి అందమైన కళ్లు. వాటిని చూస్తే కళ్లుతిప్పుకోలేం. మరోసారి చూడాలనిపించేంతగా కట్టిపడేస్తాయి. 20 ఏళ్ల క్రితం ఒక విజిటింగ్ ఫోటోగ్రాఫర్ ఆమె అద్భుతమైన పులికళ్లను క్లిక్మనిపించడంతో ఆమె ముఖ చిత్రం పలు వార్తపేపర్లలోనూ, పోస్టకార్డులపైకి వెళ్లిపోయింది. అలా ఆమె రాత్రికి రాత్రికే సెలబ్రిటీ అయిపోయింది. మళ్లీ సరిగ్గా ఇప్పుడుమరోసారి ఆ పప్పుదేవి ఫోటోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దాంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉందని ఆరాలు మొదలయ్యాయి. ఇక పప్పు దేవి ఒక సఫారి డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఆమె ఇద్దరు కుమార్తెలకు వారసత్వంగా పులికళ్లు వచ్చాయి. ఆ అమ్మాయిలు ఇద్దరు పప్పు దేవికి స్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటారట. పర్యాటకులను పిలుస్తూ..మిర్రర్ వర్క్ బ్యాగులను విక్రయించడంలో సాయం అందిస్తారట. అయితే సందర్శకులు చాలామంది తనను, ఆ ఇద్దరు కుమార్తెలను చూసి అవిశ్వాసం వ్యక్తం చేస్తూ..ప్లీజ్ కళ్లజోడు పెట్టుకోరా అని అడగుతారని అంటోంది పప్పుదేవి. కాగా, పప్పుదేవి తాను బంజారా కమ్యూనిటీకి చెందినదాన్ని కాదని స్పష్టం చేసింది. ఎవరో ఒక వ్యక్తి తన కళ్లను చూసి అందుకు సరిపోయే దుస్తులు ధరించమని సూచించడంతో ఈ వేషధారణలో ఉన్నానని వివరణ ఇచ్చిందామె. View this post on Instagram A post shared by LOG KYA SOCHENGE (@log.kya.sochenge) (చదవండి: ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..) -
ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..!
వివాహం అనేది అత్యంత పవిత్రమైన బంధం. వేరు వేరు నేపథ్యాల మనుషులు పెళ్లి అను బంధంతో ఒక్కటై..ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకునే పవిత్రమైన కార్యం అది. అలాంటి వైవాహిక వ్యవస్థనే అపహాస్యం పాలుచేస్తున్నారు నేడు చాలామంది యువతీయువకులు. అలాంటి వాళ్లకు కనువిప్పు నెట్టింట రెడ్డిట్లో వైరల్ అవుతున్న పోస్ట్. అది ఆ గొప్పబంధానికి ఉన్న పవిత్రతను హైలెట్ చేసింది. అంతేగాదు ఒకరికొకరుగా ఉండటం అంటే అవగతమవుతుంది. ఆలుమగలు బంధం అనే మాటకు అసలైన అర్థం చెబుతూ ఆలోచింపచేస్తున్న పోస్ట్ అందర్నీ తెగ ఆకర్షిస్తుంది. పైగా నెటిజన్లు ఆ జంటను 'మేడ్ ఫర్ఈచ్ అదర్' అంటూ కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే..ఆ పోస్ట్లో ఒక మహిళ ఏ ఉద్యోగం లేని తన భర్త ఇచ్చిన గిఫ్ట్ని చూసి కన్నీళ్లు పెట్టుకుందామె. తన భర్తకు కొన్ని నెలలుగా ఉద్యోగం లేదని, తాను కాపీ రైటర్గా పనిచేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నట్లు తెలిపింది. అతడు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడని, అతడి ఖర్చలు, పాకెట్ మనీ అన్ని తానే చూస్తుంటానని రాసుకొచ్చింది పోస్ట్లో. అయితే తన భర్త ఆ డబ్బుని పెట్రోల్ కోసం, స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తాడని తెలిపింది. పైగా తన భర్త పెద్దగా ఖర్చులు కూడా చేయడని, ఎప్పుడైనా స్నేహితులు ఫుడ్ ఆర్డర్ చేస్తే తన వంతుగా రూ. 200 నుంచి రూ. 300లే ఇస్తాడని తెలిపింది. అలాగే తాను తనకు ఉద్యోగం లేదని అతడి స్నేహితుల ముందు నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదని కూడా పేర్కొంది. అయితే ఉద్యోగం లేకపోయినా..తన భర్త ఈ వాలెంటైన్స్డేకి బహుమతి ఇవ్వడం తనని ఆశ్చర్యంలో ముంచెత్తిందని అంటోంది. తాను ఇచ్చిన పాకెట్ మనీలోనే కొంత తనకు గిఫ్ట్ ఇచ్చేందుకు కొని సర్ఫైజ్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టించేసిందని భావోద్వేగంగా రాసుకొచ్చింది పోస్ట్లో. అంతేగాదు తన భర్త ఇచ్చిన వాలెంటెన్స్డేకి ఇచ్చిన గిఫ్ట్లను తెలియజేస్తూ..ఆయన ఇచ్చన పెంగ్విన్ ప్లషీ, చాక్లెట్ బార్ చూసి ఆనందంతో ఉంబ్బితబ్బిబైంది. ఈ కష్టసమయంలోనూ తన గురించి ఆలోచించినందుకు కంటనీళ్లు ఆగడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది. తాము విదేశీ పర్యటనలకు వెళ్లిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కష్టసమయం తమ మధ్య నెలకొన్న బలమైన బంధం కారణంగా ఇట్టే గడిచిపోతుందని ఉద్విగ్నింగా చెబుతూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా ఆ ఆలుమగల మధ్య ఉన్న బలమైన బంధానికి ఫిదా అవ్వడమే గాక ప్రశంసల వర్షం కురిపిస్తు పోస్టులు పెట్టారు.(చదవండి: టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!) -
'నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను'
నా వయసు 34 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ. చిన్న విషయాలకే ఒళ్లు తెలియని కోపంతో చేతిలో ఏది ఉంటే దానితో కొట్టడం, ఖరీదైన ఫోన్లు, టీవీలు పగలగొట్టడం జరుగుతోంది. కోపావేశంలో నా ముందున్న వ్యక్తి ఎవరు అనే ఆలోచన లేకుండా దాడి చేసే పరిస్థితి వస్తోంది. దీనివల్ల నా భార్య, పిల్లలు చాలా భయపడుతున్నారు. కోపం తగ్గిన తరువాత చాలా బాధ, పశ్చాత్తాపం ఉంటాయి. కానీ ఆ సమయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నాకు ఇతర మానసిక, శారీరక సమస్యలు ఏవీ లేవు. ఒకసారి మానసిక వైద్యుడిని కలవాలని అనుకుంటున్నాను. నాకు ఉన్న ఈ సమస్యకు సరైన చికిత్స లేదా పరిష్కారం ఉందా?– రవికుమార్, హిందూపూర్మీ సమస్యను ఇతరుల మీద నెట్టకుండా, మీరే బాధ్యత తీసుకుని మారాలనుకోవడం నిజంగా అభినందనీయం. మీరు వివరించిన లక్షణాలను వైద్య పరిభాషలో ఇగో డిస్కంట్రోల్ సిండ్రోమ్ (ego dyscontrol syndrome) లేదా ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోసివ్ డిసార్డర్ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారు చాలా చిన్న విషయాలకే అసాధారణమైన కోపం, ఆవేశానికి గురవుతారు. ఆ సమయంలో తనపై పూర్తిగా నియంత్రణ కోల్పోయి విలువైన వస్తువులను పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, మాటలతో లేదా చర్యలతో ఇతరులపై దాడి చేయడం వంటి ప్రవర్తనలు చేస్తాడు. కోపం తగ్గిన తరువాత మాత్రం పశ్చాత్తాపం, తప్పు చేశాననే భావన ఎక్కువగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం, ఇలాంటి వ్యక్తుల మెదడులో సెరటోనిన్ (Serotonin) అనే రసాయనం తక్కువ స్థాయిలో ఉండటం గమనించవచ్చు. ఇది చాలా సందర్భాల్లో జన్యుపరంగా వచ్చే సమస్యగా కూడా ఉండవచ్చు. అంటే, సెరటోనిన్ తయారు చేసే వ్యవస్థలోనే లోపం ఉండే అవకాశం ఉంది.అలాగే వారు పెరిగిన వాతావరణం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, కొన్ని అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే అమీగ్డాలా, ఫ్రాంటల్ కార్టెక్స్ వంటి భాగాలు సరిగా పనిచేయకపోయినా కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమస్యకు పూర్తిగా చికిత్స ఉంది. సైకోథెరపీ, కోప నియంత్రణ చికిత్స లతోపాటు, మెదడులో సెరటోనిన్ స్థాయిని పెంచేందుకు తగిన మందులను, మనసుని స్థిమితపరిచే మూడ్ స్టెబిలైజర్స్ వంటి మందుల్ని వైద్యుల పర్యవేక్షణలో వాడడం వలన మంచి మెరుగుదల కనిపిస్తుంది.చదవండి: కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయాలి?సమయానికి చికిత్స తీసుకుంటే, కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యం అవుతుంది. దీనిద్వారా కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు. ఈ సందర్భంగా మనసుకవి ఆత్రేయ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా’. విరిగిన వస్తువుల్ని అతికించవచ్చు, లేదా మళ్ళీ సంపాదించొచ్చు. కానీ విరిగిన మనసులని, దూరం అయిన బంధాలని మళ్ళీ దగ్గరగా చేసుకోవాలంటే దానికి చాలా శ్రమ అవసరం. కోపాన్ని జయించినవాడే తన జీవితాన్ని జయిస్తాడు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసినమెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్..! సురక్షితమేనా..?
కొన్నికేన్సర్లు.. సులభంగా టెస్ట్లు చేయించుకోలేం. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గర్భాశయ కేన్సర్. ఇది కాస్త గోపత్యకు సంబంధించినవి కావడంతో మహిళలు క్లినిక్లను సందర్శించడంలో జాప్యం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వైద్యశాస్త్రం సాంకేతిక సాయంతో మరింత పురోగతిని అందించేలా మహిళలే స్వీయంగా చేసుకునే వెసులబాటు అందించింది. అంటే ఇంట్లోనే సులభంగా గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్(HPV స్వీయ-నమూనా అని కూడా పిలుస్తారు) చేసుకోవచ్చు అన్నమాట. ఇది భవిష్యత్తు కాలంలో మంచి గేమ్ ఛేంజర్గా ఉద్భవించనుంది. అచ్చం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మాదిరిగానే ఇంట్లోనే గర్భాశయం ఆరోగ్యం కోసం మనమే స్వయంగా చేసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలేంటి టెస్ట్? ఎలా చేయాలి?, సురక్షితమేనా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే..గర్భాశయం నుంచి కణాలను సేకరించడానికి వైద్యుడు స్పెక్యులమ్ను ఉపయోగించే సాంప్రదాయ పాప్ స్మియర్ మాదిరిగా కాకుండా, ఇంట్లోనే నిర్వహించే స్వీయ-నమూనా కిట్ ఇది. ఇందులో 95% కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు నిపుణులుఎలా చేయాలంటే..కిట్: స్టెరైల్ స్వాబ్ (పొడవైన Q-టిప్ లాగా) లేదా ప్రత్యేకమైన బ్రష్ను కలిగి ఉన్న చిన్న ప్యాకేజీని అందుకుంటారు.బాత్రూమ్ లేదా గదిలో ఆ స్వాబ్ను యోనిలోకి చొప్పించి కొన్ని సెకన్ల పాటు తిప్పాలి. అది గర్భాశయాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ స్వాబ్ HPV DNA కలిగి ఉన్న యోని గోడల నుంచి కణాలు, ద్రవాలను తీసుకుంటుంది. ఆ స్వాబ్ను ప్రిజర్వేటివ్ ట్యూబ్లో ఉంచి, దానిని సమీపంలోని ల్యాబ్కు పంపించాలి. ఫలితం: పరీక్షలో నెగిటివ్ వస్తే..గర్భాశయ కేన్సర్వచ్చే ప్రమాదం చాలా తక్కువని, ఒకవేళ పాజిటివ్ అయితే ..ప్రమాదకర హెచ్పీవి శరీరంలో ఉందని అర్థం. అలాంటప్పుడు తదుపరి పాప్ స్మియర్ లేదా కోల్పోస్కోపీ కోసం గైనకాలజిస్ట్ను సందర్శించాలి.ఇక్కడ మహిళలకు ఓ వైద్యుడి మాదిరిగా చేసుకోగలమా అనే సందేహం రావడం సహజం. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జేసీఓ గ్లోబల్ ఆంకాలజీ ఈ స్వీయ నమునా చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ముందుగా ఈ గర్భాశయ కేన్సర్ని గుర్తించడంలో సాంప్రదాయ పాప్ స్మియర్ల కంటే HPV DNA పరీక్షలు చాలా సులభంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించగలిగేవని పేర్కొంది. ఈ హెచ్పీవీ కిట్ల సాయంతో మహిళలు స్వయంగా సేకరించిన నమునాలు, వైద్యులు సేకరించిన వాటివలే ఉంటాయని హామి ఇచ్చింది కూడా. ఇది ప్రారంభ స్కీనింగ్ వైద్య పరీక్షగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కేన్సర్ని మందస్తు దశలోనే గుర్తించడానికి హెల్ప్ అయ్యే సాధనమే తప్ప కేన్సర్ని నిర్థారించేది మాత్రం కాదు.ఎందుకు అత్యంత ముఖ్యమైనదంటే..భారతదేశంలో, గర్భాశయ కేన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ కేన్సర్గా మారింది. ప్రతి ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది దాక మహిళలు ఈ వ్యాధి కారణాంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నివారించేందుకు ఇంట్లేనే నిర్వహించుకునే ఈ సులభమైన స్క్రీనింగ్ పరీక్ష అత్యంత ప్రధానమైనదిగా మారింది.ఏవిధంగా అంటే..?ఈ టెస్ట్ నిమిత్తం చాలామంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతారు. ఆ అసౌకర్యాన్ని ఈ పరీక్ష తొలగిస్తుంది. అదీగాక గ్రామీణ మహిళలకు, అత్యంత బిజీగా ఉండే పట్టణ మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. పైగా ఈ పరీక్షలో ఎలాంటి నొప్పి ఉండదు, ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది.నిజానికి ఈ కిట్లు ఆరోగ్యకరమైన భవిష్యత్తుగా వారధిగా పనిచేస్తాయి. పైగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వాళ్లు కనీసం మూడేళ్ల కొకసారైనా ఈ పరీక్షను చేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్) -
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్! -
లక్షణాలు లేకుండా కాలేయాన్ని కరిగించి..
ఆ వైరస్ బారినపడినవారు బయటకు ఆరోగ్యంగానే కనిపిస్తారు.. రోజువారీ పనులన్నీ చురుగ్గానే చేసుకుంటారు.. కానీ వారి శరీరంలోని కాలేయం (Liver) మెల్లమెల్లగా క్షీణిస్తుంటుంది. అది పూర్తిగా దెబ్బతిన్న తర్వాత కానీ అసలు విషయం బయటపడదు. అదే హెపటైటిస్ వైరస్ చేసే దారుణ మాయాజాలం. ప్రస్తుతం భారతదేశంలో హెపటైటిస్ బి (HBV), హెపటైటిస్ సి (HCV) ఇన్ఫెక్షన్లు ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తున్నాయి.కోటి మందికి పైగా..దేశంలో హెపటైటిస్ ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. దేశ జనాభాలో సుమారు మూడు నుంచి నాలుగు శాతం మంది హెపటైటిస్ బి (HBV) బారిన పడగా, మరో 0.5 నుంచి ఒక శాతం మంది హెపటైటిస్ సి (HCV)తో పోరాడుతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, సుమారు కోటి మందికి పైగా భారతీయులు ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల ముప్పులో ఉన్నారని అంచనా.లక్షణాలు కనిపించకపోవడం..ఈ వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ ఎటువంటి బాహ్య లక్షణాలు కనిపించకపోవడం అత్యంత ప్రమాదకరమైన అంశమని నోయిడాలోని మెదాంత ఆస్పత్రి నిపుణులు డాక్టర్ సౌరదీప్ చౌదరి హెచ్చరిస్తున్నారు. దీని బారినపడినవారు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, వైరస్ లోపల కాలేయాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ, చివరకు సిరోసిస్, కాలేయ వైఫల్యం లేదా క్యాన్సర్కు దారితీస్తుందని డాక్టర్ సౌరదీప్ తెలిపారు.హెపటైటిస్ వ్యాప్తికి కారణాలివే..హెపటైటిస్ వ్యాప్తిపై సమాజంలో పలు అపోహలు ఉన్నాయి. కాలేయ వ్యాధులు కేవలం మద్యం సేవించే వారికే వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. అపరిశుభ్రమైన ఇంజెక్షన్లు, తనిఖీ చేయని రక్తం ఎక్కించడం, కలుషితమైన పరికరాలతో శస్త్రచికిత్సలు చేయడం లేదా పచ్చబొట్లు (టాటూలు) వేయించుకోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అలాగే ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. అయితే కౌగిలించుకోవడం, కలిసి భోజనం చేయడం లేదా దగ్గు ద్వారా ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల బాధితులు సామాజిక వివక్షకు గురవుతున్నారు. ఇదే వారు సకాలంలో పరీక్షలు చేయించుకోకుండా అడ్డుపడుతోంది.కాలేయ క్యాన్సర్కు ప్రధాన కారణంహెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్కు ప్రధాన కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. హెపటైటిస్ 'సి' ని ప్రారంభ దశలో గుర్తిస్తే వైద్యం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైతే కాలేయం కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. హెపటైటిస్ 'బి' కి మాత్రం దీర్ఘకాలిక చికిత్స అవసరం. మద్యం సేవించడం, అనారోగ్యకర ఆహారం, ఊబకాయం, మధుమేహం తదితర అంశాలు కాలేయం దెబ్బతినే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్ ఉన్నవారు స్వల్పంగా మద్యం సేవించినా అది ప్రాణాంతక పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సాధారణ రక్త పరీక్ష ద్వారా వైరస్ ఉనికి..ప్రస్తుత కాలంలో హెపటైటిస్ పరీక్షలు, చికిత్స సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా వైరస్ ఉనికిని గుర్తించవచ్చు. హెపటైటిస్ ‘బి’ నివారణకు సమర్థవంతమైన టీకాలు అందుబాటులో ఉండగా, హెపటైటిస్ 'సి' ని ఎనిమిది నుండి 12 వారాల పాటు మందులు వాడటం ద్వారా శాశ్వతంగా నయం చేయవచ్చు. గతంలో ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్న వారు, రక్తమార్పిడి జరిగిన వారు లేదా తెలియక అపరిశుభ్రమైన ఇంజెక్షన్లు తీసుకున్న వారు వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చేయడమే.. కాలేయాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం -
జిమ్లోనూ వేధింపులా!
ఆరోగ్య స్పృహ పెరగడంతో గతంతో పోల్చితే జిమ్కు వస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. ఇది సానుకూల కోణం అయితే, ప్రతికూల కోణం... జిమ్లో వివిధ రూపాల్లో మహిళల భద్రతకు, డిగ్నిటీకి ఎదురవుతున్న ముప్పు. దే«శవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని జిమ్, ఫిట్నెస్ కేంద్రాలలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు, టీనేజర్లకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) జిమ్లు, ఫిట్నెస్ సెంటర్ల పనితీరు, నియంత్రణపై నివేదికను కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత మార్గదర్శకాలు, పర్యవేక్షణ విధానాలపై సమాచారాన్ని సమర్పించాలని క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది..మన దేశంలో ఫిట్నెస్ సంస్కృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తమ కంఫర్ట్ జోన్ల నుంచి బయటికి వస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ భద్రతాపరంగా మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి.→ అలహాబాద్ హైకోర్ట్ ఆందోళనజిమ్లోకి వచ్చే అమ్మాయిలను అశ్లీల దృష్టితో చూడడం, అసభ్యంగా కామెంట్ చేయడం, రహస్యంగా సెల్ఫోన్తో వీడియోలు తీయడంలాంటివి దేశవ్యాప్తంగా చాలా జిమ్లలో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మేరuЇకు చెందిన జిమ్ ట్రైనర్ నితిన్ సైనీ కేసు విచారణ సందర్భంగా, తగిన రక్షణ చర్యలు లేకుండా జిమ్లలో పురుష ట్రైనర్ ద్వారా శిక్షణ ΄÷ందుతున్న మహిళల భద్రత, ప్రైవసీలపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలు ట్రయల్ కోర్టు ముందు వినిపించిన తన వాంగ్మూలంలో నితిన్ సైనీ ఒక మహిళను అశ్లీలంగా వీడియో తీశాడని, తనలాంటి మహిళలకు అశ్లీల వీడియోలు పంపుతున్నాడని ఆరోపించింది.ఈ నేపథ్యంలో నితిన్ సైనీ జిమ్ చట్ట ప్రకారం సక్రమంగా నమోదు చేయబడిందా... లేదా? జిమ్లో మహిళా ట్రైనర్లు ఉన్నారా లేదా?... తెలియజేసే వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని మేరuЇలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారిని కోర్టు ఆదేశించింది.→ మహిళా ట్రైనర్లు తప్పనిసరిఫ్రభుత్వ, ప్రైవేట్ జిమ్లలో మహిళా ట్రైనర్లను తప్పనిసరిగా నియమించాలని హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. లైంగిక వేధింపులను నివారించడానికి మహిళా ట్రైనర్ల నియామకం ఉపకరిస్తుందని చెప్పింది. పురుషులు మాత్రమే ట్రైనర్లుగా ఉండే జిమ్లలో మహిళల అసౌకర్యానికి, లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు అందాయని కమిషన్ తెలియజేసింది. జిమ్లో తమకు అసౌకర్యంగా అనిపిస్తే, లైంగిక వేధింపులు ఎదురైతే ఉమెన్ కమిషన్ అధికారిక వెబ్సైట్కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరింది. హరియాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని మహిళా కమిషన్లు ప్రైవేట్, ప్రభుత్వ జిమ్లలో మహిళా ట్రైనర్ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని కోరుతున్నాయి.→ నిజమేనంటారా?!‘మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా జిమ్లో బ్యాక్గ్రౌండ్ చెకప్ స్ట్రిక్ట్గా ఉండాలి. సీసీటీవి నిఘా ఉండాలి’ అంటున్నాడు గురుగ్రామ్లోని ‘సెక్టర్ 29 ఫిట్నెస్ సెంటర్’కు చెందిన ఒక పర్సనల్ ట్రైనర్.‘మార్కెట్లో సర్టిఫైడ్ ఉమెన్ ట్రైనర్ల కొరత చాలా ఉంది’ అంటున్నాడు మరో ట్రైనర్.అయితే ఈ కొరత నిజమేనా? కృత్రిమమా... అనేది తెలియాల్సి ఉంది.‘ఉమెన్ ట్రైనర్లు ఉంటే సౌకర్యంగా ఫీల్ అవుతారు. ప్రతి విషయాన్ని మేల్ ట్రైనర్లతో పంచుకోవడం, చర్చించడం మహిళలకు సౌకర్యంగా అనిపించదు’ అంటుంది ఫిట్నెస్ ట్రైనర్ చారు సేథ్.→ ఇలా అయితే కష్టమే!నమోదవుతున్న కేసుల కంటే జిమ్లలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని, ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’లాంటి భయాల వల్ల, రకరకాల ఒత్తిళ్ల వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతుంది మానవ హక్కుల కమిషన్. ఫిట్నెస్ కేంద్రాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై స్పందించడానికి, పరిష్కార మార్గాలు కనుగొనే నిర్మాణాత్మక వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.అనేక రాష్ట్రాలలో జిమ్ల స్థాపన, నిర్వహణకు సంబంధించి ఒకే రకమైన నిబంధనలు లేవు. దీంతో చాలామంది జిమ్ నిర్వాహకులకు జవాబుదారీతనం లేకుండా పోతోంది. జిమ్లపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలు అందించాలని మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సి) రాష్ట్రాలను కోరింది. భద్రతా సమస్యలతో పాటు జిమ్లలో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సి గుర్తించింది. సరైన అనుమతులు, నాణ్యత తనిఖీలు లేకుండా కొన్ని జిమ్లు ఫుడ్ సప్లిమెంట్లను విక్రయిస్తున్నాయని కమిషన్ గమనించింది. అనుమతిలేని ఫుడ్సప్లిమెంట్లను విక్రయించడం వల్ల టీనేజర్లు, యువతీయువకులలో హార్మోన్ల అసమతుల్యత, ఇతర శారీరక సమస్యలు వస్తున్నాయి.రాష్ట్రాల నుంచి నివేదికలు అందిన తరువాత జిమ్లు, ఫిట్నెస్ కేంద్రాల పనితీరును నియంత్రించడానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధలను ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉంది. జిమ్క్రిప్ ట్రెండ్వేధింపుల ఫిర్యాదుపై నటుడు, ఫిట్నెస్ కోచ్ భాస్కర్ తములీని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంజన్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్పై మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది... ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. జిమ్లోని మహిళలపై జరిగే కనిపించే, కనిపించని వేధింపులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా అవగాహన పెంచడానికి టిక్ టాక్లో జిమ్క్రిప్ ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్లో కీలక పాత్ర పోషిస్తోంది నటాలీ. తాను వివిధ సందర్భాలలో జిమ్లో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పింది లండన్కు చెందిన 23 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ నటాలీ టార్నెట్. ‘జిమ్లో ఎదురైన లైంగిక వేధింపుల వల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే జిమ్ వేధింపుల గురించి మాట్లాడడం, అవగాహన పెంచడాన్ని నా లక్ష్యంగా చేసుకున్నాను’ అంటుంది నటాలీ. -
ప్రతి స్కూల్ లో ఉండాలి టీచర్ల బుక్క్లబ్స్
టీచర్లు టెక్ట్స్బుక్స్ చదువుతారు. సిలబస్ మారితే కొత్త పాఠ్యపుస్తకాలు చదువుతారు. సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్నవారు ఆ సబ్జెక్ట్కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటారు. కాని పుస్తకాలు చదువుతున్నారా?పుస్తకాలంటే...సాహిత్యం, చరిత్ర, రాజకీయాలు, జీవిత చరిత్రలు, సినిమా, సంగీతం, సైకాలజీ, యాత్రాకథనాలు... ఈ పుస్తకాలు చదువుతున్నారా? హెచ్ఆర్ఏ అందుకునే టీచర్లు తమ నివాసంలో కనీసం ఒక బుక్షెల్ఫ్ అయినా మెయిన్టెయిన్ చేస్తున్నారా? ఎందుకంటే పుస్తక పఠనం ఉపాధ్యాయులకు చాలా మేలు చేస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. బెంగళూరు నగరంలో టీచర్ల బుక్క్లబ్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.→ రెండు విధాలా మేలు..పుస్తకాలు చదవడం వ్యక్తిగతంగా, వృత్తిగతంగా మేలు కలిగిస్తున్నాయి. బెంగళూరులోని క్రేయన్ ప్రీస్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ మధు ప్రకాశ్ కొన్నిరోజుల నుంచి ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఏ అనారోగ్య సమస్యా లేదు. అయినా జీవితంలో ఏదో వెలితి. ఆ వెలితిని పుస్తక పఠనం ద్వారా అధిగమించారు. రోజూ కనీసం అరగంట సేపు పుస్తకాలు చదవడం ద్వారా ఒత్తిడి దూరమవడంతోపాటు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోందని, దానివల్ల ఉద్యోగం మీద ఏకాగ్రత పెరిగిందని వివరిస్తున్నారామె. ఆమె అనుభవం తెలుసుకున్న మరికొందరు టీచర్లు పుస్తకాలు అందుకున్నారు. విద్యావేత్త నీలమ్ దీక్షిత్ పరిశీలనలో రోజుకో అరగంటపాటు పుస్తకాలు, దినపత్రికలు చదివే టీచర్లు ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నారని వివరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు బుక్ క్లబ్లు ఏర్పాటు చేసి టీచర్లను అందులో భాగస్వాములను చేస్తున్నారు. వారానికో పుస్తకం చొప్పున చదివేలా ప్రోత్సహిస్తున్నారు. తమతోపాటు టీచర్లు కూడా కూర్చొని పుస్తకాలు చదువుతుండటంతో పిల్లలకు అది ఉత్సాహం కలిగిస్తోందని పాఠశాల యాజమాన్యాలు అంటున్నాయి. → అభి్రపాయాలను మారుస్తూ..‘అకాడమిక్ పుస్తకాలతో కుస్తీ పట్టడానికే సమయం చాలడం లేదు. ఇక బయట దొరికే పుస్తకాలు చదివే వీలెక్కడిది?’ అని కొందరు ఉపాధ్యాయులు పెదవి విరిస్తే ఈ అభి్రపాయాన్ని మార్చేందుకు మధు ప్రకాశ్ ఓ పని చేశారు. జొనాథన్ హైడ్ రాసిన ‘ది ఆంక్షియస్ జనరేషన్’ అనే పుస్తకం గురించి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇతర టీచర్లకు ఆసక్తి కలిగించడంతో వారు ఆ పుస్తకం చదివేందుకు ముందుకొచ్చారు. స్టాన్లీ గ్రీన్ స్పాన్ రాసిన ‘ప్లేగ్రౌండ్ పాలిటిక్స్’ పుస్తకం చదవడం ద్వారా తాను బోధించే విధానం మారిందని వాణి అనే ఉపాధ్యాయిని చెప్పడంతో ఇతర టీచర్లకూ ఆ పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగింది. వర్జీనియా ఆక్స్లైన్ రాసిన ‘డిబ్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ సెల్ఫ్’, ఇ.ఆర్.బ్రెత్వెయిట్ రాసిన ‘టు సర్, విత్ లవ్’ పుస్తకాలు చదవడం వల్ల పిల్లలతో తాను ప్రవర్తించే విధానంగా సమూలంగా మారిందని ప్రతిమా అనే ఉపాధ్యాయిని వివరిస్తున్నారు.→ ఎలాంటి పుస్తకాలు మేలు?టీచర్ బుక్క్లబ్లో ఎలాంటి పుస్తకాలు చదవాలనేదానిపైనా కొందరు టీచర్లు సూచనలు చేస్తున్నారు. హెలెన్ కెల్లర్, ఐన్ స్టీన్, మేరీ క్యూరీ, అన్నా ఫ్రాంక్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్ వంటి మహనీయుల జీవితచరిత్రలతోపాటు సైన్స్, చరిత్ర, సాంస్కృతిక అంశాలపై పుస్తకాలకుప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. పాఠాల్లో ఉన్న అంశాలపై మరింత లోతైన సమాచారం అందించే పుస్తకాలనూ టీచర్లు చదువుతూ విద్యార్థుల చేత చదివిస్తున్నారు. బెంగళూరులో కొన్ని స్కూళ్లలో పాటిస్తున్న ఈ విధానం చూసి ఇతర స్కూళ్లలోనూ టీచర్స్ బుక్క్లబ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. టీచర్లు పాఠకులేనా?టెట్సుకో కురొయానాగి రాసిన ‘టొటొ చాన్ ’ చదివితే పిల్లల సామర్థ్యాలేమిటో అర్థమయ్యాయి అంది ఒక ఉపాధ్యాయిని. స్టాన్లీ గ్రీన్స్పాన్ రాసిన ‘ప్లే గ్రౌండ్ పాలిటిక్స్’ చదివితే పిల్లల మధ్య అనుబంధాలు తెలిసొచ్చాయి అంది మరో ఉపాధ్యాయిని. ప్రభుత్వాలు పిల్లల చేత న్యూస్పేపర్లు చదివించే నిబంధనలను తెస్తున్నాయి.కాని టీచర్లు పాఠకులుగా ఉంటున్నారా? టీచర్లు పుస్తకాలు చదివితే వృత్తి నైపుణ్యంతోపాటు పిల్లల వికాసం మరింత బాగుంటుందని బెంగళూరు టీచర్లు నిర్వహిస్తున్న వాట్సప్ టీచర్స్ బుక్ క్లబ్స్ నిరూపిస్తున్నాయి. టీచర్లూ... ఏం చదువుతున్నారు? -
అప్పుడు లెజండరీ యాక్టర్...ఇవాళ లైఫ్కోచ్గా..!
అప్పట్లో భారతీయ టెలివిజన్ రంగంలో తన అందం, గొంతుతో సంచలనం సృష్టించిన రూబీ భాటియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అయితే, ఈసారి ఆమె వార్తల్లో నిలవడానికి కారణం ఆమె గ్లామర్ కాదు.. రూ. 1,000 కే అందిస్తున్న లైఫ్ కోచింగ్ సర్వీసెస్. ఈ ప్రకటనలు చూసిన నెటిజన్లు, ముఖ్యంగా 90ల కాలం నాటి అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. ఒకప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న ఒక లెజెండరీ యాంకర్.. 90వ దశకంలో భారతీయ టెలివిజన్ రంగంలో ఛానల్వి హవా నడిచిన కాలం. ఆ తరం యువతకు ఫ్యాషన్ ఐకాన్ రూబీ భాటియా. తన విలక్షణమైన ఇంగ్లీష్ యాక్సెంట్, చిరునవ్వు, మెరిసే కళ్ళతో ఆమె బుల్లితెరను శాసించేది. మాజీ మిస్ ఇండియా కెనడా అయిన రూబీ భారత్ మొట్టమొదటి వీడియో జాకీగానూ గుర్తింపు పొందారు. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె ఒక స్మార్ట్ఫోన్ కెమెరా ముందు కనిపిస్తూ నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, బరువు తగ్గడం, ఆందోళన, డిప్రెషన్ వంటి విషయాలపై లైఫ్ కోచింగ్ ఇస్తానంటూ ఆమె ఇటీవల వీడియోలు విడుదల చేశారు. వీటిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఆమెను ఇలా చూడటం మనుసుకి భారంగా ఉందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఏ పనీ చిన్నది కాదని భావించి, స్వయంగా తన సేవలను ప్రమోట్ చేసుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. For 90s kids, Ruby Bhatia was everywhere, a familiar, confident face on TV, VJing, anchoring, interviewing.Seeing her reels today, offering life coaching, makeup tips, and even asking people to WhatsApp her for work for ₹1000, just feels heavy.Not mocking her at all. It’s… pic.twitter.com/JAP2YPkZXp— Sapna Madan (@sapnamadan) January 29, 2026 (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!) -
ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
డెబై ఏళ్ల వయసులో ఆ బామ్మ పడుతున్న కష్టం చూస్తే మనసు కరిగిపోతుంది. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా ఆత్మగౌరవంగా బతికేందుకు పడుతున్న తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్. ఎందుకమ్మా.. ఈ వయసులో నీకంత కష్టం అనిపిస్తుంది. కానీ ఆ బామ్మ తన కాళ్లపై తనునిలబడాలని పోరాడుతున్న తీరు యువతకు ఆదర్శం, స్ఫూర్తి కూడా. అందుకు సంబంధించిన వీడియోని ఆరాధన ఛటర్జీ షేర్ చేయడంతో నెటింట వైరల్గా మారింది. ఆ బామ్మ పేరు దీపాలీ ఘోష్. తన భర్త మరణించిన తర్వాత దాదాపు మూడు దశాబ్దాలు ఓ చిన్న భోజనశాల నడుపుతోంది. ఆ భోజనశాలలో ప్రతీదీ ఆమెనే స్వయంగా చేసుకుంటుంది. ఇప్పుడు ఆ హోటల్ సరిగా నడవడం లేదు. కనీసం ఐదు కస్టమర్లు కూడా లేరని భోరుమంటోంది. అది ఓ చిన్న ఇరుకైన స్థలంలో ఉన్న చిన్నపాటి భోజనశాల. అక్కడ ఓ విరిగిన ఫ్లైవుడ్పై నిద్రపోతుంది. చెప్పాలంటే ఆ దుకాణం నిండా ఉన్న పాత సామాన్లు, మసితో నిండిన గోడలు, ఓ పక్క లీకయ్యే పైపుతో చిందరవందరగా ఉంది. బామ్మకు లాక్డౌన్ తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైందట. పైగా వినికిడి శక్తి తగ్గిపోయింది ఆ బామ్మకు. ఆమె తన ఆహారం, మందులు కోసం ఈ పని చేస్తూనే ఉండాలి. ఆమె వృద్ధాశ్రమానికి వెళ్లాలనుకోవడం లేదట. తాను గౌరవంగా జీవనోపాధిని పొందాలనేదే ఆమె ఆశ. ఆ బామ్మ అక్కడే ఉండి తన వ్యాపారాన్ని ఇదివరకిటిలా రన్ చేయాలని తపన పడుతోంది. కాబట్టి మనమందరం కలిసి దీన్ని సాధ్యమయ్యేలా చేద్దామా అని పిలుపునిస్తూ..అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంది సోషల్ మీడియా యూజర్ ఆరాధన. ఆ వీడియో మిలియన్లమంది నెటిజన్ల మనసుని కదిలించింది. ఎలా ఆ బామ్మని కలిసేది, సాయం చేసేది అంటూ పోస్టలు పెట్టారు. మాలాంటి సోమరిపోతులకు నిజంగా ఆ బామ్మ కథ ఓ కనువిప్పు, ప్రేరణ అని భావోద్వేగంగా పోస్టులు పెట్టారు కూడా. View this post on Instagram A post shared by Aradhana Chatterjee (@storiesbyaradhana) (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్) -
స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!
ఇప్పుడంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు చాలా తేలికగా వెళ్లగలుగుతున్నాం. సరైన రవాణా సౌకర్యం లేనందున కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి దర్శనభాగ్యం నగర వాసులకు చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన బిర్లా మందిర్ ఆ కొరత తీర్చింది. సిటీ జనులే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వారికి ఫేవరెట్గా మారింది. వివాహం తర్వాత, శుభకార్యాలు, పుట్టిన రోజుల సందర్భంగా అందరూ బిర్లా మందిర్కే రావడం... ఇక్కడి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. కొత్తగా పెళ్లయినవారికైతే బిర్లామందిర్కు వెళ్లాల్సిందే అన్న రీతిలో ఖ్యాతికెక్కింది. అలాంటి బిర్లా మందిర్ 50 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు తొలిసారిగా 1976 ఫిబ్రవరి 13న తొలిసారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.చారిత్రక కట్టడాల సరసన ఆధ్యాత్మిక వైభవం భాగ్య నగరం అంటే చారిత్రక కట్టడాలే కాదు. ఆధ్యాతి్మక వైభవం అని చాటుతోంది బిర్లా మందిర్. నౌబత్ పహాడ్ కొండపై పాలరాయితో కొలువుదీరిన ఈ ఆలయం కేవలం ఆధ్యాతి్మక ప్రదేశమే కాదు.. అద్భుత శిల్పకళా వేదిక కూడా. సిటీ నడిబొడ్డున జన కోలాహలం మధ్య ఉన్న ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కలిగే ప్రశాంతత అటు భక్తులు, ఇటు పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తోంది.పాలరాతి సొగసుల మందిరం... పూర్తిగా రాజస్థాన్ నుంచి తెప్పించిన 2000 టన్నుల పాలరాయితో బిర్లా మందిర్ను నిర్మించారు. పదేళ్లపాటు నిపుణులైన శిల్పుల చేత తీర్చిదిద్దారు. ఉత్తర, దక్షిణ భారత వాస్తు శిల్పి రీతుల (గోపుర, రాజస్థానీ) కలయికతో విలక్షణంగా కనిపిస్తుంది. బిర్లా మందిర్లో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం 11 అడుగుల ఎత్తులో తిరుమల శ్రీవారిని తలపిస్తూ భక్తిపారవశ్యం కలిగిస్తుంది. శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు భారతీయ సంస్కృతికి అద్దంపడతాయి. సాయంత్రం తర్వాత విద్యుత్ కాంతులతో మెరిసిపోయే బిర్లా టెంపుల్ పర్యాటకులనూ కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహం, నగర అందాలు కనువిందు చేస్తుంటాయి. ప్రశాంతత కోరుకునేవారికి, ఫొటోగ్రఫీ ప్రేమికులకు (ఆలయం వెలుపల) బిర్లా మందిర్ మంచి స్పాట్.హైదరాబాద్ ఎక్స్కర్షన్...! అందులో బిర్లా మందిర్ విజిటింగ్..! ఇదీ స్కూల్ పిల్లలకు కొన్నేళ్లపాటు తప్పనిసరిగా కొనసాగిన సంప్రదాయం. అంతేకాదు, టెక్ట్స్ బుక్స్లోనూ బిర్లా మందిర్ విశిష్టత గురించి చెప్పేవారు. దీంతో ఆ టెంపుల్ను చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తహతహలాడేవారు. కొత్త జంటలకు ఫేవరెట్ కొత్తగా పెళ్లయినవారికి సిటీలో ఫేవరెట్ స్పాట్ బిర్లా మందిర్. భక్తి, ప్రశాంతత రెండూ లభించే ప్రదేశం కావడంతో యువ జంటలు ఇక్కడికి రావడాన్ని ఓ కార్యక్రమంగా పెట్టుకునేవారు. వీకెండ్లో హార్ట్ బీట్ అసలే వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఆపై శనివారం..! ఇంకేం వీకెండ్ వస్తే చాలు సిటీ జనులు బిర్లా మందిర్కు పొలోమంటూ పోటెత్తుతుంటారు. వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో కిక్కిరిసినట్లే. శని, ఆదివారాల్లో అత్యధిక శాతం నగరవాసుల ఆధ్యాత్మిక కేంద్రం ఇదే.ప్రత్యేకతలు ఇవి 1966లో ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ బిర్లా కలలోకి ఈ కొండ, శ్రీ వేంకటేశ్వరస్వామి కనిపించారని చెబుతారు. సమీపంలోని హోటల్ గది నుంచి చూస్తున్న ఆయనకు కొండపై వేంకటేశ్వరస్వామి ఆహా్వనిస్తున్నట్లు అనిపించిందని.. దీంతో బిర్లా మందిర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే రూ.2 కోట్లతో ఏడెకరాలలో హిందూస్థాన్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నౌబత్ పహాడ్పై బిర్లామందిర్ నిర్మించారు. 50 ఏళ్లలో 15 కోట్ల మందిపైగా భక్తులు, పర్యాటకులు సందర్శించారు. సోమ–శుక్రవారం వరకు రోజుకు 5–6 వేలమంది భక్తులు, సందర్శకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 9–11 వేలకు చేరుతుంది. 24 నుంచి స్వర్ణోత్సవాలు శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 27 వరకు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నాం. హోమాలు, అభిషేకాలు, పల్లకీ సేవ, కలశపూజ, పూర్ణాహుతి, శోభాయాత్ర చేపడతాం.– సీఏ శ్యాం కొఠారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ -
వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్కపూర్ త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడి అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ ..కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. ఈ జంట 2022లో మొదటి బిడ్డ వాయును స్వాగతించారు. ఇక గతేడాది నవంబర్లోనే సోనమ్ రెండోసారి అమ్మను కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల ఫిబ్రవరి 8నబాలీవుడ్ అతిరథుల నడుమ సోనమ్ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుక తాలుకా వీడియోని షేర్ సుకుంటూ..సీమంతం తంతు గురించి చాలా భావోద్వేగంగా పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేగాదు ఆ ఈవెంట్ ఎంతలా భారతీయ సంప్రదాయపద్ధతిలో జరిగిందో కూడా వివరించింది.కాబోయే తల్లి సోనమ్ తన సీమంతం వేడుక వీడియోని షేర్ చేస్తూ..పురాతన వేద సాంప్రదాయంలో పాతుకుపోయిన ఈ ఆచారం గురించి చాలా గొప్పగా రాసుకొచ్చింది పోస్ట్లో. ఆ రోజు తనకెంతో ముఖ్యమైనదే గాక స్రీ జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యమైనదిగా పేర్కొంది. 40 ఏళ్ల సోనమ్ సీమంతం అనేది సనాతన ధర్మంలోని పదహారు పవిత్ర సంస్కారాలలో మూడవదిగా వెల్లడించింది. దీన్ని 'జుట్టు విప్పే ఆచారం'గా పిలుస్తారని, నవమాసాలు బిడ్డను మోసే తల్లి గౌరవార్థం జరిపే వేడుకగా పేర్కొంది. దీన్ని మన భారతదేశంలో పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పిలుస్తారంటూ సవివరంగా వెల్లడించింది. ఈ సీమంతం వేడుకను ఉత్తరాన గోధ్ భారాయ్ అని, దక్షిణాన వాలైకప్పు, మహారాష్ట్రలో దోహలే జెవాన్ వంటి పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఎన్ని విభిన్న పేర్లతో పిలిచినా..ఈ అందమైన భావం స్త్రీ జీవితలోని అత్యంత అపురూపమైన క్షణంగా పేర్కొంది. ఇది ప్రేమ, రక్షణ, కొత్త జీవితంల వేడుకగా అభివర్ణించింది. సోనమ్ షేర్ చేసిన వీడియోలో వేదమంత్రాల నడుమ స్వీట్లను తినిపించడం, కుటుంబం, స్నేహితులతో గడిపే మధురమైన క్షణం అని చెబుతోంది. కాగా, ఈ సీమంతం వేడుక అనిల్ కపూర్ విలాసవంతమైన బంగ్లాలో జరిగింది. అక్కడ ఈ వేడుక కోసం బంగ్లాని అధునాత డిజైన్తో పవిత్ర భారతీయ చిహ్నలను మిళితం చేస్తూ..పూల అభయారణ్యంగా, ఆధ్యాత్మికతకు నెలవుగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆ వేడుకలో ముఖ్యంగా నాటి కాలాన్ని గుర్తుచేసేలా దీప స్థంభం అత్యంత హైలెట్గా నిలిచింది. ఇంతలా అంగరంగ వైభవంగా ఈ సీమంతం వేడుకను జరిపినందుకు తన తల్లి, అత్తగారు, సోదరి రియా కపూర్లకు పోస్ట్లో కృతజ్ఞతలు తెలిపింది. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) (చదవండి: అంతర్జాతీయ మోడల్గా సివిల్ ఇంజనీర్..! ఒక్క రోజుకే..) -
అంతర్జాతీయ మోడల్గా సివిల్ ఇంజనీర్..! ఒక్క రోజుకే..
ఇంజనీరింగ్ చదువుకుంటూనే ఫ్యాషన్ ప్రపంచం వైపుకి అడుగులు వేశాడు ఈయువకుడు. ఒక పక్క చదువుని, అభిరుచిని..రెండిటిని సమతుల్యం చేస్తూ..మోడలింగ్లో మంచి సక్సెస్ని అందుకున్నాడు. అంతేగాదు ఇంజనీర్గా ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తం మోడల్గా ఒక్కరోజులోనే ఆర్జిస్తూ..గ్లామర్కున్న క్రేజ్ని చాటి చెప్పాడు. అంతేగాదు రెండు విభిన్న రంగాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ని విజయవంతంగా నిర్మించుకోవచ్చని నిరూపించి, స్ఫూర్తిగా నిలిచాడు. అతడే శుభమ్ వైద్కర్. 24 ఏళ్ల ఈ యుకువడు సివిల్ ఇంజనీర్ గ్రాడ్యేయేట్. కానీ ఇవాళ అంతర్జాతీయ మోడల్గా లక్షలు ఆర్జిస్తున్నాడు. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ కోసం చాలాసార్లు ర్యాంప్పై నడిచాడు. ముంబైలో పుట్టి పెరిగిన శుభమ్ అక్కడే సివిల ఇంజనీరింగ్ని పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే మోడలింగ్ ప్రారంభించాడు. ఇన్స్టాగ్రామ్లోని ఒక రీల్ చూసి దీనిపై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే అప్పడు తన బరువు 83 నుంచి 84 కిలోలు వరకు ఉండేవాడినని అన్నాడు. మోడల్ వైపుకి వచ్చానే కానీ..ఎలా అనేది అంతగా తెలియదు. అందుకోసం అని గూగుల్లో వెతకగా..మనకు ప్రాతీనిధ్యం వహించడానికి ఏజెన్సీలు అవసరమని తెలుసకున్నానని అంటున్నాడు శుభమ్. దాతో తన ఫోటోలు ఏజెన్సీలకు పంపాను..వాటిలో ఒక ఏజెన్సీ తనను మీటింగ్కి పిలిచి..నేరుగా బరువు తగ్గాలని సూచించారని తెలిపాడు. అందుకు ఒక నెల సమయం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే శుభమ్ టైం వేస్ట్ చేయకుండా వెయిట్లాస్ అయ్యే పనిలో పడ్డాడట. అప్పటి నుంచే చక్కెర, జంక్ పదార్థాలు, నూనె పదార్థాలకు చాలా దూరంగా ఉండేవాడట. అలా మోడల్గా మారేందుకు కష్టబడుతున్న తరుణంలో 2024 జనవరిలో అర్మానీ షో కోసం ఇటలీలోని మిలన్కు వెళ్లే అవకాశం తనకు మొదటిసారి లభించిందని చెప్పుకొచ్చాడు. అంతకుమందు భారత్లో మోడలింగ్గా చేశానని, కానీ విదేశాలకు వెళ్లే ఛాన్స్ మాత్రం రాలేదని అంటున్నాడు. ఆ ఏడాదే జూన్లో రెండోసారి మిలన్ నుంచి పారిస్కి ప్రయాణించినట్లు తెలిపాడు. జూన్లో తన గ్రాడ్యుయేషన్ పరీక్షలు పూర్తిచేసుకుని మరి వెళ్లినట్లు పేర్కొన్నాడు. మిలన్లో రెండు నెలలు ఉన్నట్లు తెలిపాడు. అయితే మోడలింగ్ అనేది స్థిరంగా పనిదొరికే రంగం కాదు. ఈవెంట్లను బట్టి వర్క్ అనేది ఉంటుంది. దాంతో శుభమ్ వెంటనే భారత్కి వచ్చేసి..తన డిగ్రీకి తగిన ఉద్యోగం వెతుక్కుని మరి జాయిన్ అయ్యిపోయాడు. నెలకు రూ. 30 వేల వేతనం చెల్లించేది. అయితే మోడలింగ్ని పూర్తి సమయం కొనసాగించే నిమిత్తం జాబ్లో జాయిన్ అయ్యిన ఆరునెలలకే రాజీనామా చేసేశాడు. మోడల్గా సంపాదన..సివిల్ ఇంజనీర్గా నెలకు రూ. 30 వేలు సంపాదిస్తే..మోడల్గా ఒక్కరోజు షూట్ కోసం లక్షల్లో డబ్బు సంపాదించడం విశేషం. మిలన్లో జరిగే రన్వే షో కోసం దాదాపు లక్ష నుంచి రెండు లక్షలకు వరకు సంపాదించొచ్చని చెబుతున్నాడు. అడ్వర్టైస్మెంట్లకే బాగా వేతనం లభిస్తుందని అంటున్నాడు శుభమ్. ఒక్కోసారి ప్రాజెక్ట్ని బట్టి..రూ. 5 లక్షలు పైనే ఆర్జించొచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. అయితే ఇక్కడ మొత్తం మోడళ్ల చేతికి వెళ్లదని, ఏజెన్సీ 30% కోత విధిస్తుందని చెప్పుకొచ్చాడు. కేవలం 70% తాము ఉంచుకుంటామని అన్నాడు. ఇక మోడలింగ్ పైకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా..తెరవెనుక చాలా కష్టం ఉంటుందని చెబుతున్నాడు శుభమ్. తన గ్లామర్ లుక్ కోసం చాలా ఖర్చు చేయాల్సి కూడా ఉంటుందని అంటున్నాడు. అలాగే ఈవెంట్ల గురించి ఒకరోజు ముందు మాత్రమే తెలుస్తుందట. అక్కడ వసతికి సంబంధించి..ఏజెన్సీనే చూసుకుంటుంది. గానీ ఇతర ఖర్చులు మనమే భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ రంగంలో ఒక్కోసారి ప్రదర్శన సమయంలో చివరి క్షణంలో మనల్ని తొలగించే అవకాశం కూడా ఉంటుందట. ఆ టైంలో మానసికంగా స్థైర్యంగా ఉండటం అంత ఈజీ కాదని అంటున్నాడు శుభమ్. అంతేగాదు మోడల్గా రాణించాలంటే బరువుని కూడా అదుపులో ఉంచుకోవడమే గాక, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి కూడా. చివరగా శుభమ్ ఈ గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలంటే..తిరస్కరణలను తట్టుకోవాలి, ఓపికతో ఉండాలని అంటున్నాడు. ఎందుకంటే ఒక్కోసారి అసలు పనే ఉండదు..అయినప్పటికీ..అవకాశం కోసం చాలా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. View this post on Instagram A post shared by Shubham Vaidkar (@shubham_vaidkar) (చదవండి: 'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్ వ్యవస్థాపకుడి పేరెంటింగ్ పాఠాలు..) -
మోక్ష మార్గం.. శివనామ స్మరణం
భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒక్కటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు ఉండవు. ఈ సత్య విషయాన్ని తెలియ జెప్పే నిర్గుణ పరతత్వ స్వరూపమే ‘లింగం’. ఈ లింగోద్భవ వేళ శివనామస్మరణ మోక్ష మార్గానికి మార్గమని పెద్దలు చెబుతుంటారు. ఆ సమయంలో రానే వస్తోంది. మహాశివరాత్రి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. తాడిమర్రి/ఎన్పీ కుంట: కాకిముట్టని తీర్థంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో వెలసిన కాటికోటేశ్వర క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన స్వామి.. కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాడని భక్తుల నమ్మకం. రెండు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాశీ నుంచి తెప్పించి ప్రతిష్టించిన శివలింగం, నవగ్రహాలు, గదాగుండం, కొండపై గుహలో అక్కమ్మ దేవతలు ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి పర్వదినాన రెండు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రానికి అనంతపురం నుంచి నార్పల మీదుగా పార్నపల్లి బస్సులో వెళ్లవచ్చు. అలాగే ధర్మవరం నుంచి పులివెందుల బస్సులో దాడితోట మీదుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.కాకి ముట్టని తీర్థంకాటికోటేశ్వర క్షేత్రంలో కాకులు మచ్చుకై నా కనిపించవు. అందుకే ఈ కోనేటిలోని నీటిని కాకిముట్టని తీర్థమని అంటారు. పూర్వం ఇక్కడి గుహలో వెలసిన అక్కమ్మ దేవతలు కోనేటిలో జలకాలు ఆడేవారని, ఆ సమయంలో వారి వస్త్రాలపై కాకులు రెట్ట వేయడంతో వారు ఆ ప్రాంతంలో కాకులు ఉండకుండా శాసించినట్లుగా ఓ పూర్వగాథ ఉంది.14 నుంచి జాగరణ మహోత్సవాలుఎన్పీకుంట మండలం గూటిబైలులో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే తిమ్మమాంబ జాగరణ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వెలసిన తిమ్మమ్మ మర్రిమాను 8.15 ఎకరాల్లో విస్తరించి, 6,800 ఊడలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది.మహావృక్షం వెనుక పురాణగాథ ఉందిబుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబకు దిగువ గూటిబైలు గ్రామానికి చెందిన బాలవీరయ్యతో వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి జీవితం ఆనందంగా సాగింది. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడిన బాలవీరయ్య మృతి చెందడంతో ఆ రోజుల్లో కొనసాగుతున్న ఆచారం మేరకు తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధం కాగా, చితి పక్కకు వైదొలగకుండా నాలుగు వైపులా ఎండిన మర్రి గుంజలను నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి నేడు మహావృక్షంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.ఆలయ నిర్మాణంతో నిత్య పూజలుబెంగుళూరుకు చెందిన కై వారం యోగినారాయణస్వామి ట్రస్ట్ ధర్మాధికారి డాక్టర్ ఎంఎస్ జయరాం 2011లో తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమాంబ, బాలవీరయ్య దంపతుల ఆలయంతో పాటు తిమ్మమాంబ సతీసహగమనం చేసిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ఘాట్ను నిర్మించారు. ఈ సారి జాగరణ మహోత్సవాలను ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. తిమ్మమ్మ మర్రిమానుకు అరకిలోమీటరు దూరంలో శివప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ధ్యానం చేసుకునేందుకు వీలుగా గదులు కూడా నిర్మించారు. -
'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్ వ్యవస్థాపకుడి పేరెంటింగ్ పాఠాలు..
తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పైగా ప్రయోజకులుగా తీర్చిదిద్దడంపై సూచనలు కూడా ఇచ్చారు. అయితే థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి చెప్పే పేరెంటింగ్ పాఠాలు చాలా ఆలోచనాత్మకంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలను అభ్యున్నతి మార్గంలో నడిపించే దిక్సూచిలా ఉంటాయి అవి. గతంలో దీని గురించి తన అనుభవాలను జోడిస్తూ చెప్పారు. ఈసారి పిల్లల పెంపకంపై పేరెంట్స్ని ఉద్దేశిస్తూ చేసిన ఆసక్తికర పోస్ట్ చర్చనీయాంశమై హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆయన పోస్ట్లో ఏ చెప్పారంటే..తన పోస్ట్లో వేలుమణి పిల్లలను పెంచడాన్ని రెండు విధాలుగా పోల్చారు. టైప్ ఏ అని రాస్తూ..చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ..పిల్లలను బహిరంగంగా అభినందించడం, పోరుగువారితో తమ పిల్లల సక్సెస్ని షేర్ చేసుకుంటుంటారు. అంతేగాదు అక్కడితో ఆగారు..అందుకుగానూ విదేశీ పర్యటనలు అంటూ వారికి సర్ప్రైజ్ గిప్ట్లు కూడా ఇస్తుంటారు. ఈ పేరెంటింగ్ విధానంలో ఇరువురు సంతోషంగా ఉంటారు. కానీ పిల్లల్లోని అసలైన ప్రతిభాపాటవాలు వెలులోకి రావని అంటున్నారు. మరోవైపు టైప్ బి అనేది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక చిన్న సమస్యను పరిష్కరించేలా ప్రేరేపిస్తారు. దాని తర్వాత మరింత పెద్ద సమస్యను ముందుంచుతారు. అలా క్రమంగా సవాళ్లను స్వీకరించే సామార్థ్యం..అధిగమించి శక్తిని పుంజుకునేలా బలోపేతం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే వారిలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీసే యత్నం చేస్తుంటారు. ఇది పిల్లలకు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ ఉండటాన్ని నేర్పిస్తుంది. ఫలితంగా పిల్లలు ప్రయోజకులు అవ్వడమే కాదు..బలోపేతమైన పెద్దలుగా మారేందుకు దోహదపడుతుంది. చాలామటుకు పిల్లల సామర్థ్యాలను వెలికితీసేలా పెంచెలాని కోరుతూ..పిల్లలను గారబం మాత్రం చెయ్యొద్దని హితవు పలికారు పోస్ట్లో. అయితే వేలుమణి చెప్పిన ఈ అంశం నెటిజన్లుల్లో ఒక విధమైన ఉత్సుకతను రేపి..చర్చలకు తెరలేపింది. ప్రోత్సహిస్తేనే కాదా..పిల్లలు ముందుకు పోగాలరు. దాన్నే వద్దంటున్నారు అని కొందరు, కఠినమైన ప్రేమ అనేది పిల్లవాడిలోని నిజమైన సామర్థ్యాన్ని అన్లైక్ చేస్తుందని మరొకొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఇక్కడ వేలుమణి చెబుతోంది అది కాదు. ఆయన ఎల్లప్పుడూ పిల్లలను ప్రేమించండనే అంటున్నారు. అయితే కాస్త తెలివిగా ప్రశంసిస్తూ..పిల్లలు బలాన్ని పుంజుకునేలా చేయాలి. కంఫర్ట్జోన్కి పరిమితం కానివ్వకుండా సవాళ్లును చలాకీగా స్వీకరించే బలోపేతమైన వ్యక్తులుగా కూడా తీర్చిదిద్దాలనే విషయం మరువకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే పెద్దలు గారబం జోలికి పోకూడదు..అప్పుడే వాళ్లలో అపారమైన ప్రతిభపాటవాలు వెలికి తీయగలగడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.Two kinds in Mothers. A. A child solves a small problem. Appreciates. Celebrates. Tells all neighbors. Puts in Social media too. Takes for a foreign trip. Both happy. B. A child solves a small problem. Gives a bigger problem. Keeps it incremental for years. In the long run…— Dr. A. Velumani.PhD. (@velumania) February 10, 2026 (చదవండి: అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
మంచుకురిసే వేళలో.. ‘ఇగ్లూ విలేజ్’కి వెళితే..
సన్నగా మంచు కురుస్తుంటే దానిని చూసేందుకు ఇష్టపడని వారు ఎవరుంటారు? చుట్టూ తెల్లని మంచు దుప్పటి పరుచుకుంది.. ఆకాశం నుండి మంచు ముత్యాలు రాలుతున్నాయి... ఇటువంటి దృశ్యాలను తనివితీరా చూడటం ఒక ఎత్తయితే, ఏకంగా మంచుతో కట్టిన ఇంట్లోనే (ఇగ్లూ) ఉండటం మరో ఎత్తు. హిమాచల్ ప్రదేశ్లోని సేథన్ గ్రామం ఇప్పుడు ఆ కలను నిజం చేస్తోంది. సాహస యాత్రికుల నుండి ప్రకృతి ప్రేమికుల వరకు అందరినీ ఆకర్షిస్తున్న ఈ ‘ఇగ్లూ విలేజ్’ విశేషాలు మీకోసం..మనాలిలో సరికొత్త అద్భుతంహిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో, సముద్ర మట్టానికి సుమారు 2,700 మీటర్ల ఎత్తులో ఉంది సేథన్ గ్రామం. మనాలికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న గ్రామం ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ‘ఇగ్లూ విలేజ్’గా ప్రపంచ పటంలో నిలుస్తోంది. విదేశాల్లో మాత్రమే కనిపించే ఈ ఇగ్లూలు ఇప్పుడు మన దేశంలోనే అందుబాటులోకి రావడం విశేషం. ఇవి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.గడ్డకట్టే చలిలోనూ వెచ్చదనంఇగ్లూలు మంచుతో కట్టినవే అయినా వాటి లోపల ఉష్ణోగ్రత ఆశ్చర్యకరంగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉన్నప్పటికీ, ఇగ్లూ లోపల మాత్రం బయటి కంటే దాదాపు 8∘C నుండి 10∘C వరకు ఎక్కువ వేడి ఉంటుంది. మంచు గోడలు బయటి గాలిని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడమే దీనికి మూల కారణం. పర్యాటకులు వెచ్చని స్లీపింగ్ బ్యాగుల్లో పడుకుని, ఈ వింత అనుభూతిని ఎంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.ఆర్కిటిక్ అనుభూతి.. మన హిమాచల్లోనే!గతంలో మనం ఇగ్లూలను చూడాలంటే అలాస్కా లేదా ఫిన్లాండ్ వంటి దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సేథన్ గ్రామం ఆ లోటును తీరుస్తోంది. ఇక్కడి ఇగ్లూల నిర్మాణం అత్యంత నైపుణ్యంతో కూడుకున్నది. మంచు ఇటుకలను ఒక పద్ధతిలో పేర్చి, రూపొందించే ఈ ఇగ్లూలు, సందర్శకులకు ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నామనే భ్రమను కలిగిస్తాయనడంలో సందేహం లేదు.సాహసాలకు చిరునామా.. సేథన్కేవలం ఇగ్లూ బస మాత్రమే కాదు, సేథన్ గ్రామం సాహస క్రీడలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ పర్యాటకులు స్కీయింగ్ , స్నోబోర్డింగ్ తదితర క్రీడల్లో పాల్గొనవచ్చు. అలాగే రాత్రిపూట నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద క్యాంప్ ఫైర్ వేసుకుని, వేడి వేడి ఆహారాన్ని ఆస్వాదించడం ఒక మరపురాని అనుభూతినిస్తుంది.సోషల్ మీడియాలో సెన్సేషన్ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సేథన్ ఇగ్లూ విలేజ్ వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. మంచు దుప్పటి కప్పుకున్న పైన్ చెట్లు, అద్భుతమైన పర్వత దృశ్యాలు ఫోటోగ్రాఫర్లకు పండగలా మారుతున్నాయి. ‘స్విట్జర్లాండ్ ఎందుకు? మన సేథన్ ఉండగా!’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.పర్యాటక రంగంలో సరికొత్త విప్లవంఈ ఇగ్లూ విలేజ్ రాకతో హిమాచల్ ప్రదేశ్ పర్యాటకానికి కొత్త ఉత్సాహం వచ్చింది. స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, పర్యావరణానికి హాని కలగని రీతిలో ఈ పర్యాటకం సాగుతుండటం విశేషం. మంచు కురిసే జనవరి నుండి మార్చి వరకు ఈ ఇగ్లూలు సందర్శకుల కోసం అందుబాటులో ఉంటాయి.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు! -
నా భార్త సంసారానికి పనికిరాడు.. నేనెలా రుజువు చేయాలి
మాకు పెళ్లి అయ్యి ఏడాది అవుతోంది. తొలిరాత్రి మేము కలవడానికి నా భర్త నన్ను కొంత సమయం కావాలి అని అడిగారు. నేను సరే అన్నాను. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకు నేను తనను సంతృప్తి పరచడం లేదు అని నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లి΄ పోమ్మని చెప్పాడు. బంధుమిత్రులందరి దగ్గరా అలాంటి దుష్ప్రచారమే చేస్తున్నాడు. అయితే అది తప్పు. అతను అసలు ఒకసారి కూడా కనీసం నాకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. అతను సంసారానికి పనికిరాడు అని చెప్పి కోర్టులో కేసు వేశాను. రుజువు చేయండి అంటున్నారు. నేనెలా రుజువు చేస్తాను? – సరళ, విజయవాడపెళ్ళైన తర్వాత భర్త భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండకపోవటం లేదా లైంగికంగా తగిన విధంగా లేకపోవటం వలన చాలా వివాహ బంధాలు విడాకులతో అంతమవుతున్నాయి. భార్య అయినా భర్త అయినా లైంగిక సంతృప్తి ఇవ్వకపోవడం మానసిక క్షోభకి గురిచేస్తుందని కోర్టులు చాలా సందర్భాలలో చెప్పాయి. లైంగిక సంబంధం లేని భర్తతో కలిసి కొంతకాలం ఉన్న తర్వాత, విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే స్త్రీలు ‘ఇంపొటెన్సీ’ని (నపుంసకుడు / లైంగిక శక్తిహీనత/ సంసారానికి పనికిరాడు అని) కారణంగా చూపి కేసులు వేస్తున్నారు. ఇలా వేసే కేసులలో దాదాపుగా స్త్రీలకు వ్యతిరేకం అయ్యే దాఖలాలే ఎక్కువ.ఎందుకంటే భర్త ఇంపొటెన్సీని రుజువు చేయలేని పక్షంలో, భర్త లైంగిక సమర్థతపై అబద్ధపు ప్రచారం చేశారు అని, సమాజంలో భర్త పరువును తీశారని.. ఇవన్నీ కూడా భాగస్వామిపై క్రూరమైన చర్యలే అని కోర్టు భావించే ఆస్కారం ఉంది. తనని నపుంసకుడు అని అందరిలో ప్రచారం చేస్తోందనే కారణం చూపి–దానిని రుజువు చేస్తే, విడాకులు అడిగే భర్తలకు కూడా కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఎందుకంటే, పురుషులలో తరచుగా వుండే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, స్తంభన సమస్యలని చాలా సందర్భాలలో నపుంసకత్వం అని చాలామంది, ముఖ్యంగా సరైన అవగాహన లేని స్త్రీలు భావిస్తుంటారు. అదే కోర్టులో కూడా చెప్పి, చివరికి రుజువు చేయలేక నష్టపోతారు. అందుకే, అలాంటి అంశం ఏదైనా ఉంటే, విడాకుల దరఖాస్తు వేసేముందు నిపుణులతో వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మగవారు సైతం వారికి ఉండే సమస్యలు దాచి ఉంచి పెళ్ళి చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో అయితే తాము సంసారానికి పనికిరామని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లేదా తమకి స్త్రీలపై ఎటువంటి ఆకర్షణా లేదు అని తెలిసి కూడా పెళ్లికి సిద్ధమవుతారు. కేవలం తమని తాము మగాడిలా చూపించుకోవాలి అనే తపనతో స్త్రీ హక్కులను, జీవితాన్ని పట్టించుకోకుండా కావాలని పెళ్ళి చేసుకుని, తర్వాత ఏదో ఒక కారణం చూపి విడిపోవాలని పథకం ప్రకారం చేసుకునే పెళ్ళిళ్ళు కూడా చాలానే వున్నాయి. అయితే, ఒకవేళ తన భర్త సంసారానికి పనికిరాడు అని రుజువు చేయగలిగితే మాత్రం, అన్ని రకాల పరిహారాలతో΄ాటు తగిన భరణం కూడా పొందవచ్చు. అంతేకాక క్రిమినల్ చేసు కూడా నిరూపించవచ్చు. విడాకులు తీసుకోవాలి అనుకునే స్త్రీలు అయినా పురుషులు అయినా, తన భాగస్వామి లైంగికతను తెలుసుకొని, సరైన కారణాలు, రుజువు చేయదగ్గ అంశాలను కోర్టుకు చూపగల్గితేనే సరైన ఉపశమనం దొరుకుతుంది. - శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
శాస్త్రరంగంలో సగర్వంగా...
‘సైన్స్ విద్యలు మహిళల కోసం కాదు’ అన్నట్లుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితి మెల్లగా మారిపోయింది. గతంతోపోల్చితే సైన్స్లో మహిళల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ పురుషులతో పోల్చితే సైన్స్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది...⇒ సైన్సులో ప్రపంచ వ్యాప్తంగా మహిళా పరిశోధకులు 30 శాతం కంటే తక్కువగా ఉన్నారు⇒ సైన్స్లో బాలికలు, మహిళలను ప్రోత్సహించడానికి, కెరీర్లో సమాన అవకాశాలు కలిగించడానికి తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడిగా ప్రాజెక్ట్ చేపట్టాయి.అంతరాన్ని కొలవాలి... పరిష్కారాలు ఆలోచించాలి⇒ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సైన్స్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.⇒ ప్రపంచ వ్యాప్తంగా సైన్స్లో లింగ అంతరం లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జెండర్గ్యాప్ను కొలిచి, దాన్ని ఎలా తగ్గించాలనేది ఆ ప్రయత్నాలలో ఒకటి.⇒ రాచెల్ ఐవీ, సుసాన్ వైట్ అనే శాస్త్రవేత్తలు సైన్స్లో జెండర్ గ్యాప్నకు సంబంధించి లోతైన విశ్లేషణ చేశారు. పరిష్కార మార్గాలను సూచించారు⇒ ‘సైన్స్లో లింగ సమానత్వం’ (జెండర్ ఈక్వాలిటీ) అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట వర్చువల్ మీటింగ్స్ జరుగుతున్నాయి.చాలా తక్కువ... శాస్త్రీయ సంస్థలలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థానాలలో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు.ప్రభావం... పాతుకుపోయిన కొన్ని సామాజిక విశ్వాసాలు ‘సైన్స్ అనేది పురుషుల రంగం’ అనుకునేలా చేశాయి.పక్షపాతం... సైన్స్ ఫీల్డ్లో ఉద్యోగ నియామకాలు, నిధులు, కెరీర్ పురోగతికి సంబంధించి మహిళల పట్ల వివక్ష కనిపిస్తుంది.కాల్ టు యాక్షన్సైన్స్లో మహిళకు సమాన అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో యూనెస్కో ‘కాల్ టు యాక్షన్’ప్రోగ్రామ్ రూపొందించింది.రోల్ మోడల్సైన్స్లో మహిళా రోల్మోడల్స్ సంఖ్య పెరగడంతో వారిని స్ఫూర్తిగా తీసుకునే ధోరణి బాలికలలో పెరుగుతోంది. -
విన్స్మోర్
‘నీ దగ్గర సైన్యం లేదు... మరచిపో... నీ దగ్గర ఆయుధం లేదు... మరచిపో... అయితే ఆశ... అనే అద్భుతాన్ని మాత్రం ఎప్పుడూ మరచిపోవద్దు. ఆ ఆశే నీ ఆయుధం అవుతుంది... సైన్యం అవుతుంది’... అనేది జపాన్ ప్రఖ్యాత నాయకుడు షింజో అబే మాట. ఆ మాటే సనై తకాయిచికి ధైర్యాన్నిచ్చింది. ‘జపాన్ ఐరన్ లేడీ’ని చేసింది. గత సంవత్సరం జపాన్ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన తకాయిచి... తాజాగా జపాన్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో (ముందస్తు) ఘన విజయం సాధించారు...మూడు నెలల్లోనే పార్లమెంట్ను రద్దుచేసి, ఎన్నికల బరిలోకి దిగడం ఆషామాషీ విషయం కాదు. తమ మీద తమకు గట్టి నమ్మకం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఆ నమ్మకం ఎప్పుడూ తకాయిచితోనే ఉంది. అందుకే ఆమె సనై తకాయిచి అయ్యారు! తాజా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి తానేమిటో నిరూపించుకున్నారు.టకాయిచి టాక్ చాతుర్యం... అమోఘం!తకైచి గురువు షింజో అబే. ఆయన వాక్చాతుర్యం అంటే తకైచికి బాగా ఇష్టం. షింజో జపాన్లోని ప్రముఖ ప్రజానాయకుడు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడు అయిన షింజో అబే జసాన్ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. ‘ప్రజలతో కలిసి పనిచేస్తున్నంత కాలం నాకు వేరే శక్తి అవసరం లేదు. ప్రజలే నా శక్తి. ఆ శక్తితో ఎన్ని రకాల సవాళ్లనైనా ఎదుర్కోగలను’ ‘మనిషికి ఆశ ఎప్పుడూ ఉండాలి. ఆ ఆశే అయుధం. కలను సాకారం చేసుకునే సాధనం’... గురువు నోట వినిపించే ఇలాంటి మాటలు అంటే తకాయిచికి చాలా ఇష్టం. ‘ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తుంటే ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మాట్లాడినట్లు ఉండకూడదు. మన ఊరి వ్యక్తో, కుటుంబ సభ్యులో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉండాలి.’.. అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది షింజో అబే వాక్చాతుర్యం. అలాంటి సహజ వాక్చాతుర్యాన్ని సొంతం చేసుకున్నారు తకాయిచి.ధైర్యమే దారి చూపిందిఅమెరికాలో యూనివర్శిటీ విద్య పూర్తయిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చిన తకాయిచి కొంత కాలం టీవీ యాంకర్గా పనిచేశారు. 1996లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అగ్రనేత షింజో అబేకు ప్రియ శిష్యురాలు అయ్యారు. అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) 2024లో ఉభయ సభలలో మెజారిటీ కోల్పోయింది. కొమైటో పార్టీతో దశాబ్దాల పొత్తు కూలిపోయింది. ఎటు చూసినా నిరాశే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం, ఆశ కోల్పోలేదు తకాయిచి. ఆమెకు ప్రజలలో ఉన్న ఆదరణే పార్టీని నిలబెట్టింది. గత ఏడాది ఆమె ప్రధానిగా ఎన్నికైనప్పుడు... ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా?’ అనే ప్రశ్న వేశారు రాజకీయ విశ్లేకులు. ఆ ప్రశ్నకు తాజా విజయం జవాబు చెప్పింది. తకాయిచి పాలనకు జనం ఆమోదముద్ర వేశారు. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తకాయిచి దారి... రహదారి!వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్!⇒ ‘వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి’ అనే మాట ఎప్పుడూ వినబడుతూ ఉంటుంది. అయితే ఈ సమన్వయ ధోరణికి తకాయిచి వ్యతిరేకం.⇒ ‘దేశం కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్. అందరూ గుర్రంలా పనిచేయాలి’ అంటారు తకాయిచి.⇒ ‘వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్’ అనే మాట జపాన్లో బాగా పాపులర్ అయింది. ప్రతి సంవత్సరం జపాన్లో విడుదల చేసే పాపులర్ మాటల పుస్తకంలో ఈ మాట చేరింది!ఆ దూకుడు... ఇప్పటికీ!చిన్నప్పుడు సనై తకాయిచికి ‘బైకర్ అమ్మాయి’ అని పేరు. జపాన్ రోడ్లపై స్పీడ్గా దూసుకెళ్లేది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత బైక్ డ్రైవింగ్కు దూరమైనా ఆ దూకుడు, స్పీడ్ మాత్రం తగ్గలేదు. అదే ఆమె ఎనర్జీ! కరుడు కట్టిన సంప్రదాయవాది, జాతీయవాదిగా ముద్ర పడినప్పటికీ ఆమె గిరి గీసుకొని కూర్చోలేదు. కొరియన్ సంగీతం, నాటకాలను బాగా ఇష్టపడతారు.యస్... ఇప్పటికీ డ్రమ్స్ మోగాల్సిందే!యూనివర్శిటీ రోజుల్లో సరదాగా డ్రమ్స్ వాయించడమే కాదు ఒక మ్యూజిక్ బ్యాండ్లో కూడా చేరారు సనై తకాయిచి. పాకెట్మనీకి సరిపడ డబ్బులు వచ్చేవి! మరి ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆ డ్రమ్స్ మూలన పడ్డాయా? గత జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయా?అదేమీ కాదు. ఆమె ఇప్పటికీ డ్రమ్స్ వాయిస్తారు. వేదికలపై కాదు... ఇంట్లోనే! రాజకీయ రణరంగంలో బోలెడు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయట పడడానికి, తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి ఇప్పటికీ డ్రమ్స్ వాయిస్తుంటారు.గత నెల జపాన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో చర్చలు జరిపారు తకాయిచి. చర్చలు పూర్తయిన తరువాత ఇద్దరూ సరదాగా కె–పాప్ పాటలు పాడుకున్నారు. డ్రమ్స్ ప్లే చేశారు. -
గుండెజబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?
హార్ట్ఎటాక్ అంటే చాలామందికి ఆందోళన. కుటుంబంలో ఎవరికైనా లేదా చుట్టుపక్కల వాళ్లలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి... నిన్నటి వరకూ తమతోనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మిస్ అయిపోవడం ఎందరికో విషాదంతో కూడిన ఆశ్చర్యకరమైన అంశం. అందుకే... గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటే బాగుండు అనే భావన. మరికొందరిలో... రక్తాన్ని పలచబార్చేవీ, గుండెనొప్పి అనిపించగానే నాలుక కింద పెట్టుకోమ్మని డాక్టర్లు చెప్పేవాటి గురించి విని... అలాంటి ఏవైనా మందులున్నాయనే అభిప్రాయం కూడా ఉంటుంది. నిజంగా గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటాయా అన్న విషయం గురించి అసలు వాస్తవాలేమిటో చూద్దాం.ఓ కేస్ స్టడీ... శ్రీధర్ వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే హార్ట్ ఎటాక్తో పోయారు. ఇటీవలే వాళ్ల చిన్నాన్నకు కూడా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదుగానీ... ఒకటోసారీ, రెండోసారి హార్ట్ ఎటాక్ ఉపేక్షిస్తుందేమోగానీ మూడోసారి వచ్చిందంటే మాత్రం తప్పక ప్రాణాపాయం కలుగుతుందంటూ చుట్టుపక్కలవారు చెబుతుండటంతో అతడిలో ఆందోళన ఇంకా పెరిగిపోతోంది. అయితే శ్రీధర్కు ఇప్పటికైతే ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే అతడి వయసు నలభై ప్లస్. కుటుంబంలో చాలామందికి హార్ట్ ఎటాక్ రావడం, పైగా నాన్నగారు హార్ట్ ఎటాక్తో పోవడంతో వంశపారంపర్యంగా తనకూ హార్ట్ ఎటాక్ వస్తుందేమోనన్న ఆందోళన అతడిని నిలువనీయడం లేదు. దాంతో తమకు తెలిసిన కార్డియాలజిస్ట్ను సంప్రదించి... ‘‘మా నాన్నకూ, చిన్నాన్నకూ వచ్చినట్టుగా నాకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు మందులివ్వండం’’టూ డాక్టర్ను అడగసాగాడు.శ్రీధర్కు వచ్చిన సందేహమే చాలామందిలో ఉంటుంది. ‘‘గుండెపోటు వచ్చాక కొన్ని రకాల మందులు తీసుకోవడం తప్పదు కదా. అయితే... అసలది రాకుండానే నివారించుకునేందుకు మొదట్నుంచీ ఆ మందులు తీసుకోవచ్చా?... ఇలాంటి నివారణ మందులేమైనా ఉన్నాయా?’’ అనే సందేహం కొందరిలో మెదులుతుంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో గుండెపోటు వచ్చినవారుండటం... వారేవో కొన్ని రకాల మందులు వాడుతుండటంతో... అవే మందులు తామూ వాడితే గుండెపోటు రాదేమో అనే ఆలోచనా ఉంటుంది. ఎందుకంటే... ఒకసారి గుండెపోటుకు గురైనవారికి మళ్లీ అది రాకుండా ఉండేందుకు డాక్టర్లు కొన్ని మందులు సూచిస్తుంటారు. ఉదాహరణకు... అలాంటి పేషెంట్లు ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, రామిప్రిల్ వంటి మందులతో పాటు, బీటాబ్లాకర్, స్టాటిన్స్ వంటి మందుల్ని వాడుతుంటారు. దాంతో అవే మందుల్ని మనమూ తీసుకుంటూ ఉంటుంటే గుండెపోటును నివారించవచ్చు కదా అనే సందేహం రావడం చాలా సాధారణం.గుండెపోటు / గుండెజబ్బులకు అవకాశమున్నది ఎవరికంటే... కొందరిలో స్వాభావికంగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. కొన్ని అంశాలు గుండెజబ్బులు / గుండెపోటుకు ఆస్కారమిస్తాయి. వాటిని రిస్క్ఫ్యాక్టర్స్గా చెప్పవచ్చు. అవేమిటంటే... ఇవీ ఆ రిస్క్ఫ్యాక్టర్స్...వయసు : నలభై ఏళ్ల వయసు దాటాక గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. డయాబెటిస్ : చక్కెర వ్యాధి (మధుమేహం) ఉన్నవారిలో గుండె జబ్బులకు అవకాశాలెక్కువ. రక్తపోటు : అధికరక్తపోటు (హై–బీపీ) ఎక్కువగా ఉన్నవారిలో... కొలెస్ట్రాల్ : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వు పదార్థాలు నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నవారిలో. స్మోకింగ్ : పొగతాగే అలవాటు ఉన్నవారిలో. స్థూలకాయం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో గుండెజబ్బులూ / గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగా పోకపోవడం, తల్లిదండ్రులు లేదా తోడబుట్టినవాళ్లులో తక్కువ వయసులో హార్ట్ ఎటాక్ రావడం వంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్లే.పురుషుల్లో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ... మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులకు ముప్పు ఎక్కువ. మహిళల్లో రుతుస్రావం కొనసాగుతున్నంత వరకూ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా వాళ్లకు ఓ స్వాభావిక రక్షణ ఉంటుంది. అయితే మహిళల్లో రుతుస్రావం ఆగాక (మెనోపాజ్ తర్వాత) ఈస్ట్రోజెన్ స్రావాలు తగ్గుతాయి కాబట్టి.. ఆ దశ తర్వాత పురుషులకూ, మహిళలకూ గుండెపోటు వచ్చే అవకాశాలు సమానంగా ఉంటాయి.రామిప్రిల్ : ఈ మందు హైబీపీని (రక్తపోటును) తగ్గించి... తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత రామిప్రిల్గానీ... అలాంటి మరికొన్ని మందులుగానీ డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ముందుజాగ్రత్తగా ఆహారంలో ఉప్పు మోతాదు, కొవ్వు పదార్థాలు తగ్గించడం, మద్యపానం మానివేయడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, పచ్చికూరలు తీసుకోవడం వంటి సూచనలనూ ఈ మందు తీసుకుంటూ పాటిస్తుండాలి. బీటాబ్లాకర్స్ : ఒకసారి గుండెపోటు (Heart attack) వచ్చిన తర్వాత గుండె పంపింగ్ తగ్గినవారికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అయితే బీటాబ్లాకర్స్ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే... ఇవి వాడినప్పుడు రక్తపోటు (బీపీ) తగ్గే అవకాశముంటుంది. కాబట్టి బీపీని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ మందులతో నివారణ ఎప్పడూ... ఎలాగంటే... హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే : ఇవి సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే. ఆస్పిరిన్ను సాధారణంగా... ఒకసారి గుండెజబ్బులు కనిపించిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు. మునుపు డయాబెటిస్ ఉండి, గుండెజబ్బు లేనివారికి కూడా ప్రైమరీ ప్రివెన్షన్ కోసం ఆస్పిరిన్ను వాడేవారు. అయితే కొత్త పరిశోధనల ఆధారంగా ఇప్పుడు ఆస్పిరిన్ను కేవలం సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. పై అంశాలు లేకపోతే ఆస్పిరిన్ వాడటం వల్ల ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ.మందులెప్పుడూ సెకండరీ ప్రిపెన్షన్గానే... ఆరోగ్య సమస్య ఏదీ లేనప్పుడు... అది రాకుండా చూసుకునేందుకు పాటించే నివారణ చర్యలను ప్రాథమిక నివారణ’ (ప్రైమరీ ప్రివెన్షన్) అంటారు. అయితే గుండెపోటుగాని, బ్రెయిన్స్ట్రోక్గాని ఒకసారి వచ్చాక... అది మళ్లీ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు తీసుకోవడం, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ మందులు తీసుకోవడాన్ని, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే పద్ధతిని ‘సెకండరీ ప్రివెన్షన్’గా చెబుతారు. సాధారణంగా మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైబీపీ) ఉందని బయటపడ్డ తర్వాత అది గుండెపోటుకు లేదా గుండెజబ్బులకు దారితీయకుండా కొన్ని రకాల మందులు వాడటం లేదా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేస్తుంటారు. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్గా చెప్పవచ్చు. అసలు డయాబెటిస్గానీ లేదా రక్తపోటు (హైబీపీ)గానీ రాకుండా ముందుగానే జాగ్రత్త పడటం ‘ప్రైమార్డియల్ ప్రివెన్షన్’ అవుతుంది. ఈ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్ కంటే ఇంకా ముందు దశ. అంటే రిస్క్ ఫ్యాక్టర్లు కనిపించకముందే... నివారణ చర్యలు చేపట్టడం అన్నమాట. అంతేతప్ప... సెకండరీ ప్రివెన్షన్లో వాడే మందులను ముందునుంచే గుండెపోటు రాకుండా ఉండేందుకు వాడే మందులుగా పొరబడకూడదు.సెకండరీ ప్రివెన్షన్గా వాడే మందులివి... ఆస్పిరిన్: సాధారణంగా నొప్పుల నివారణకు వాడే ఆస్పిరిన్ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా సమర్థంగా ఉపయోగపడుతుంది. అలా పరచబార్చడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలుగా పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. అందుకే ఒకసారి గుండె΄ోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్ మాత్ర క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... గుండెజబ్బు లేకుండానే ఆస్పిరిన్ వాడటం వల్ల అంతగా ఫలితమేమీ కనిపించదు. పైగా ముందునుంచే మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం పలచబారిపోవడం వల్ల ఏ చిన్నదెబ్బ లేదా చిన్నగాయానికైనా ఆగకుండా రక్తస్రావమై... ఆ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొంతకాలం క్రితం డయాబెటిస్ ఉన్నవాళ్లకు గుండెజబ్బులు ఉన్నా లేకపోయినా ఆస్పిరిన్ ఇచ్చేవారు. కానీ... ఆ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని కొన్ని శాస్త్రపరిశోధనల్లో వెల్లడయ్యాక డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ కాకుండా కేవలం హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే ఆస్పిరిన్ సూచిస్తున్నారు.స్టాటిన్స్ : రక్తంలోని కొవ్వుల మోతాదులను తగ్గించే మందులివి. మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అయిన లో–డెన్సిటీ లైప్రొటీన్ (ఎల్డీఎల్) అనే కొవ్వులను తగ్గిస్తాయి. అందుకే గుండెపోటు వచ్చిన ప్రతివారికీ ఈ మందును జీవితాంతం సూచిస్తారు. అంతేకాదు... డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బుల ముప్పు కూడా పెరగడం వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు స్టాటిన్లు కూడా వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. చదవండి: ఫిట్స్తో ఎవరైనా పడిపోతే ఇలా చేయకండిఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... కేవలం రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాక... తక్కువ రిస్క్ ఉన్నవారికి సైతం స్టాటిన్స్ వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. దాంతో రక్త పరీక్షల్లో ‘హెచ్ఎస్ సిఆర్పీ’ విలువ – 2 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే గుండె΄ోటు లేనివాళ్లకూ గుండెజబ్బులను నివారించవచ్చని తేలింది. ‘సీటీ స్కాన్’తో చూసే ‘కరొనరీ క్యాల్షియమ్ స్కోర్’ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్లు స్టాటిన్స్ను సూచిస్తారు. అందుకే స్టాటిన్స్ వాడాలంటే ముందుగా డాక్టర్ సూచనల మేరకు తగిన పరీక్షలు చేసి అవి తీసుకోవాలా లేదా అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.వ్యాయామంతో గుండెజబ్బులు దూరం ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం గుండెజబ్బులు / గుండెపోటుకు మంచి నివారణ అని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ వ్యాయామం కేవలం మొక్కుబడిగా కాకుండా... ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కాకపోతే మరీ ఎక్కువగా శ్రమ కలిగించేలా ఉండకూడదు. అలాగని మరీ విశ్రాంతిగా కూడా ఉండకూడదు. శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలగని రీతిలో ఉండే బ్రిస్క్వాకింగ్, ఈత లేదా ఏదైనా స్పోర్ట్ వంటి వ్యాయామాలు మంచివి. మరీ ఎక్కువగా శ్రమ కలిగించేవి అకస్మాత్తుగా మొదలుపెట్టకూడదు. తీవ్రతను క్రమంగా పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఏయే కొలతలు ఎంతెంత ఉండాలంటే... గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తపోటు విలువ 130/80 కంతే తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ మోతాదులు : రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్ మోతాదులు... 200 కంటే తక్కువ ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) మోతాదులు... 100 కంటే తక్కువ ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారికి 70 కంటే తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) మోతాదులు... 40 కంటే ఎక్కువగా ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ అనే రకం కొవ్వుల మోతాదులు... 200 కంటే తక్కువగా ఉండాలి. -
సైకిల్ నేర్పించి రూ. 35 లక్షలు సంపాదించాడు!
చిన్నతనంలో సైకిల్ తొక్కడం నేర్చుకున్నారా? పెద్దయ్యాక కూడా సైకిల్ తొక్కే అలవాటును కొనసాగిస్తున్నారా? అబ్బే.. అసలు అలవాటు చేసుకోలేదండీ అంటారా? మరేం ఫర్వాలేదు. వయసుతో సంబంధం లేకుండా సైకిల్ తొక్కడం ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఏంటీ.. సైకిల్ తొక్కడం కూడా నేర్పుతారా? కారు, బైక్ డ్రైవింగ్ నేర్పడం గురించి విన్నాం కానీ.. దీని గురించి ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా? మీకో ఆసక్తికర సంగతి తెలుసా? సైకిల్ తొక్కడం నేర్పించి ఓ కుర్రాడు రెండేళ్లలో లక్షలకు లక్షలు సంపాదించాడు. ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఎవరా కుర్రాడు, ఏమా కథ.. తెలుసుకుందాం రండి.డబ్బు సంపాదించడం కోసం మనుషులు రకరకాల పనులు చేస్తుంటారు. చైనాలోని షాంఘై యూనివర్శిటీ ఆఫ్ స్పోర్ట్లో మూడవ సంవత్సరం మాస్టర్ డిగ్రీ చదువుతున్న లీ అనే విద్యార్థి కూడా ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్కు పెరుగుతున్న ఆదరణను గమనించి ఆ దిశగా అడుగులు వేశాడు. తన స్నేహితుడితో కలిసి షాంఘైలో ప్రొఫెషనల్ సైక్లింగ్ శిక్షణ మొదలు పెట్టాలని భావించాడు. అయితే తన మిత్రుడికి ఉద్యోగం దొరకడంతో అతడు మధ్యలోనే వెళ్లిపోయాడు. లీ మాత్రం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు.చదువు కొనసాగిస్తూనే..ముందుగా సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకోవాలో బోధిస్తూ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. రెండు నెలల తర్వాత అతడికి తొలి అవకాశం దక్కింది. అక్కడి నుంచి లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్క చదువు కొనసాగిస్తూనే, మరో పక్క ఉపాధి వెతుక్కున్నాడు. పిల్లలు, పెద్దలకు ఎంతో ఓపిగ్గా సైకిల్ తొక్కడం (bicycle ride) నేర్పిస్తూ మన్ననలు పొందాడు. దీంతో అతడికి దగ్గర సైకిల్ నేర్చుకునేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. తన వద్ద నేర్చుకుంటే కచ్చితంగా సైకిల్ వస్తుందన్న భరోసా ఇవ్వడంతో ఔత్సాహికులకు నమ్మకం పెరిగింది. ఒక్కొక్కరి నుంచి 800 యువాన్లు (సుమారు రూ. 10 వేలు) తీసుకునేవాడు. రెండు క్లాసులతోనే శిక్షణ పూర్తి చేసేవాడు. ఒక్కొ క్లాస్కు గంటన్నర నుంచి 2 గంటల సమయం తీసుకుంటాడు. పిల్లలు త్వరగా నేర్చుకోలేరు కాబట్టి వారికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. సైక్లింగ్ శిక్షణ ద్వారా రెండేళ్లలో అతడు దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా సంపాదించినట్టు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వెల్లడించింది.అలా నేర్పిస్తాడు..ఓర్పుగా నేర్పించడమే తన విజయ రహస్యం అంటాడు లీ. శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే వారితో ముందుగా 10 నిమిషాలు మాట్లాడతానని, దీని ద్వారా వారు ఎంత సమయంలో నేర్చుకోగలుగుతారో అంచనా వస్తానని చెప్పాడు. చిన్నతనం సైకిల్ నేర్చకుంటూ పడిపోవడంతో కలిగిన భయం వల్ల చాలా మంది వెనుకంజ వేస్తుంటారు. వారిలో ఆ భయాన్ని పొగొట్టడానికే వారితో మాట కలుపుతానని వివరించారు.చదవండి: ఫిట్స్తో ఎవరైనా పడిపోతే ఇలా చేయకండిషాంఘై దాటి..సైక్లింగ్కు ఇంత ఆదరణ ఉందని తాను ఊహించలేదని లీ చెప్పాడు. జూన్లో తన చదువు పూర్తవగానే తన సేవలను విస్తరిస్తానని తెలిపాడు. తన బోధనా పద్ధతులను మరింత మెరుగుపరుచుకుని షాంఘై వెలుపల కూడా శిక్షణ ఇస్తానని వెల్లడించాడు. జెజియాంగ్, జియాంగ్సు ప్రాంతాల్లోనూ సైక్లింగ్ కోచింగ్కు ప్లాన్ చేస్తున్నానని పేర్కొన్నాడు. -
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్స్వామి. అలాంటి ఆయన కెరీర్పీక్లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..అరవింద్ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.(చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..
అత్తా కోడలు బంధం అనగానే ఎలా ఉంటుందో తెలిసిందే. ఒక ఇంటిలో రెండు కొప్పులు పొసగవు అన్న నానుడిలా ఉంటుంది చాలావరకు. కానీ ఈ అత్తాకోడళ్లు అందుకు విరుద్ధం. పైగా ఆ కోడలు దేశం, సంస్కృతి, వేషధారణ అన్ని పూర్తి విభిన్నం..అయినా వారి మధ్య అనుబంధం మాములుగా లేదు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోని డెట్రాయిట్లో జన్మించిన వ్యవస్థపకురాలు బ్రిటినీ గ్రే యాదవ్ షేర్ చేశారు. ఆ వీడియోలో రెండు వేర్వేరు దేశాలు మధ్య శక్తిమంతమైన బాండింగ్ని చూపించింది. ఆమె తన భారతీయ అత్తగారితో గడిపిన క్షణాన్ని షేర్ చేసింది. తాము రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటామని పోస్ట్లో రాసుకొచ్చింది. ఆతర్వాత ఆమె తన అత్తగారు ఆ వీడియోలో ఎందుకు అంతలా నవ్వుకుంటున్నామో వివరించింది. తాము సరదాగా మాట్లాడుకుంటూ..తన అత్తగారు కోడలి నుంచి ఆశిస్తోంది ఏంటో చెప్పగా..దాన్ని తాను చేసి చూపించడంతో నవ్వులు విరిశాయని పేర్కొంది. ఇంతకీ భారతీయ అత్తగారు కోడలి నుంచి ఏం ఆశించారంటే..ప్రతి రోజు వంట చేయడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పాదాలు నొక్కడం తదితరాలని మాట. ఆ అత్తగారు కోరుకున్నట్లుగానే బ్రిటనీ నేలపై కూర్చోగా..అత్తగారు సోఫాలో కూర్చొని..ఒకటే పకపక నవ్వు. ఇద్దర్నీ చూస్తే..అత్త కోడళ్లలా కాకుండా స్నేహితుల్లా మెలుగుతున్న వారిని చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత అద్భుతంగా ఉంది ఆ ఘట్టం. ఇక బ్రిటనీ డెట్రాయిట్కి చెందిన నల్లజాతి అమ్మాయి కాగా, ఆ అత్తగారు భారత్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ. నెటిజన్లు కూడా ఆ అత్తాకోడళ్లు కలిసిమెలిసి ఉన్న విధం చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Brittany Grey-Yadav (@brittanygreyyadav) (చదవండి: బరువు తగ్గాలంటే..తూచా తప్పకుండా పాటించాల్సిన ఏడు సూత్రాలు..!) -
షుగర్ లెవల్స్ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి
మధుమేహ రోగులకు HbA1c పరీక్ష ప్రామాణికం. రక్తంలో చక్కెర స్థాయుల సగటు ఎంత ఉందో ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఈ పరీక్ష ఫలితాలపై ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు... ప్రపంచవ్యాప్త వైద్యవిశేషాలతో ప్రచురితమయ్యే ప్రముఖ పత్రిక లాన్సెట్! భారతీయులు HbA1c పరీక్ష బదులుగా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గత కొద్ది నెలలుగా గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉన్న మధుమేహ రోగుల విషయంలో సాధారణంగా చేసే HbA1c పరీక్ష అత్యంత కచ్చితమైన పద్ధతి కాదనేది దేశంలోని పలువురు సుప్రసిద్ధ డయాబెటాలజిస్టుల తాజా వాదన. లాన్సెట్ పత్రికలో ‘ప్రాంతీయ ఆరోగ్యం: ఆగ్నేయాసియా (రీజినల్ హెల్త్: సౌత్ ఈస్ట్ ఆసియా) పేరిట ఈ అధ్యయన ఫలితాలు ఈ నెల 9న ప్రచురితమయ్యాయి. చక్కెర వ్యాధికి భారత్ రాజధాని. మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య దాదాపు 10.10 కోట్లు. వీరిలో చాలామంది తమ గ్లూకోజ్ స్థాయులు తెలుసుకోవడానికి HbA1c పరీక్ష చేయించుకుంటుంటారు. అయితే ఇండియాలో ఈ పరీక్ష స్పష్టమైన వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించడం లేదనే మరో కథనం కూడా ఇటీవల ‘లాన్సెట్’లో వచ్చింది.HbA1c పరీక్ష ఎందుకు?ఎర్ర రక్తకణాలు సుమారు మూడు మాసాలు జీవిస్తాయి. కనుక HbA1c లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షను గత రెండు నెలలు లేదా మూడు నెలల కాలానికి రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తెలుసుకోవడానికి చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే ప్రోటీన్. ఇది గ్లూకోజును అతుక్కుని ఉంటుంది. HbA1c టెస్టులో హీమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తారు. HbA1c స్థాయి 5.7 శాతం కంటే తక్కువ ఉంటే డయాబెటిస్ లేనట్టు. అది 5.7-6.4 శాతం మధ్య ఉంటే ప్రీ-డయబెటిస్ కింద లెక్క. 6.5 శాతాన్ని మించితే సుగర్ వ్యాధి ఉన్నట్టు పరిగణిస్తారు. రక్తంలో చక్కెర నియంత్రణ, HbA1c లెవల్స్ మధ్య గల లింకు గురించి 1976లో తెలిసినప్పట్నుంచి ‘గ్లైసెమిక్ కంట్రోల్’ పరిశీలనకు సంబంధించి HbA1c అనేది ‘స్వర్ణ ప్రామాణిక పరీక్ష’ తరహాలో ఓ గీటురాయిగా మారింది. ఇది ఓ స్థిరమైన ముందస్తు విశ్లేషణతో కూడిన పరీక్ష. 2010లో దీన్ని ఓ డయాగ్నొస్టిక్ విధానంగా కూడా ప్రతిపాదించారు. పరగడుపున సేకరించే రక్త నమూనా కోసం సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా HbA1c విధానంలో రోగి ఏమీ తినకుండా ‘ఉపవాసం’ పాటించాల్సిన అవసరం లేదు.HbA1cలో కచ్చితత్వం ఉండదా?పరిశోధకులు ఈ సందర్భంగా వివిధ పద్ధతుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను కొలిచి, వాటిని పోల్చుతూ పలు అధ్యయనాలతో సమీక్షించారు. దక్షిణ భారత దేశంలో ఇటీవల 1,120 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో HbA1c పరీక్ష (45.4%)తో పోలిస్తే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (87.8%) (OGTT)లో ఎక్కువ ప్రీ-డయాబెటిస్ కేసులు నమోదయ్యాయి. (ప్రీ-డయాబెటిస్ అంటే మధుమేహం త్వరలో రాబోతోందని తెలిపే ఓ ముందస్తు సూచిక. ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, మద్యం- ధూమపానం మానివేయడం, జీవన శైలిని మార్చుకోవడం వంటివి పాటించకపోతే అనతి కాలంలోనే వారికి అతిదాహం-అతిమూత్ర వ్యాధి ఖాయం!). పుణెలో 116 మంది యువతపై నిర్వహించిన ఓ స్టడీలో 23.3% ప్రీ-డయాబెటిస్ కేసుల్ని HbA1c పరీక్ష గుర్తించగా, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) మాత్రం 7.8% కేసుల్లో మాత్రమే ప్రీ-డయాబెటిస్ ఉన్నట్టు తేల్చింది. ఆయా వ్యక్తుల్లో ఎర్ర రక్తకణాల స్థాయులు, వాటి జీవితకాలం, అవి గ్లూకోజుతో అంటిపెట్టుకొని ఉండే అంశాల కారణంగానే ఈ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. “HbA1c స్థాయులపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఐరన్ (ఇనుము) కొరతతో తలెత్తే రక్తహీనత (అనీమియా) లేదా జీ6పీడీ (ఎర్ర రక్తకణం ఎంజైమ్) కొరత వల్ల రక్తకణాలు విచ్ఛిన్నమవుతాయి. ఇటువంటి పరిస్థితులు హీమోగ్లిబిన్ లెవల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా HbA1c లెవల్స్ మారతాయి” అని ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఫర్ డయాబెటిస్ ఛైర్మన్, పరిశోధన పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్న రచయితల్లో ఒకరైన డాక్టర్ అనూప్ మిశ్రా వ్యాఖ్యానించారు.దేశంలో అనీమియా వ్యాప్తి అధికంగా ఉందని, దీంతోపాటు కొన్ని జన సమూహాల్లో తలసేమియా (దేహంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తయ్యే అనువంశిక రక్తసంబంధ రుగ్మత), సికిల్ సెల్ (హీమోగ్లోబిన్ సంబంధిత వంశపారంపర్య రుగ్మత) వంటి హీమోగ్లోబినోపతీస్ (జన్యుపరమైన అనువంశిక వ్యాధులు) ఉన్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు, అధ్యయనకర్తల్లో ఒకరైన శశాంక్ జోషి తెలిపారు. అలాగే మలేరియా కేసులు కూడా వ్యాప్తిలో ఉన్నాయని, ఇవన్నీ హీమోగ్లోబిన్ స్థాయులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇటువంటి స్థితిలో HbA1c లెవల్స్ కచ్చితమైన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. నిపుణుల సలహా ఏమిటంటే... మధుమేహ రోగులకు HbA1c పరీక్ష కంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ ఉత్తమం. HbA1c పరీక్ష అక్కర్లేదని, వారంలో రెండు లేదా మూడు సార్లు వంతున కొంతకాలం పాటు రక్తపరీక్ష చేయించుకుంటే షుగర్ లెవల్స్ సంగతి ఇట్టే తెలిసిపోతుందని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో HbA1c పరీక్ష రుసుము సుమారు రూ.600గా ఉంది. - జమ్ముల శ్రీకాంత్(Credits: The Lancet, The Indian Express, Hindustan Times, The Economic Times, ET Health World, NDTV) -
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్లాస్ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు. ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ష్ త్రిపాఠి కొలెస్ట్రాల్ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్ చేసుకున్నాడు. తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. ప్రధాన నియమం..కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..? అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఆహారంలో ఉండాల్సినవి..తప్పనిసరిగా సగం కూరగాయల్లో 1/4 వంతు ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.ప్రోటీన్ తప్పనిసరి..ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .కూరగాయలు తప్పనిసరి..ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయికార్బోహైడ్రేట్ నియంత్రణ నియమంమన ఆహారంలో కార్బోహైడ్రేట్లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. కొవ్వు/నూనె నియమండైట్ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.గుర్తించుకోవాల్సిన విషయాలుశాఖాహారుల కోసం, కొవ్వు తగ్గింపు ప్లేట్లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు, 1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.అలాగే నాన్-వెజ్ ప్లేట్లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.అల్పాహారం ప్లేట్లలో తక్కువ కార్బోహైడ్రేట్లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు.చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్ని ముగించాడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ త్రిపాఠి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!) -
చిన్నారి చిత్రకారిణి.. ప్రతిభలో మేటి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బాలిక వేసిన పెయింటింగ్ విశ్వగురు వరల్డ్ రికార్డు సాధించింది. నిజాంపేట్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పెయింటింగ్లో శిక్షణ పొందిన విశ్వేశ్వరరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ప్రవ్య ఆదిత్రి నాలుగు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు మొత్తం 20 అడుగుల కాన్వాస్పై కేవలం 12.44 నిమిషాల్లో శివుడి పెయింటింగ్ (Lord Shiva Painting) వేసి ఆదివారం ఈ రికార్డును సొంతం చేసుకుంది.బంజారాహిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి, రిటైర్డ్ ఎస్పీ ఎస్ఎం రత్న, డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయభాస్కర్, విశ్వగురు వరల్డ్ రికార్డు ఫౌండర్ సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు సమక్షంలో అతి తక్కువ సమయంలో శివుడి పెయింటింగ్ వేసి ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రతిభను తిలకించిన అతిథులు సన్మానించి అభినందనలు తెలిపారు. చదవండి: నో ఫోన్ చాలెంజ్.. 2 వారాల్లోనే అనూహ్య మార్పు -
ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!
మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదలుకుని నచ్చిన జాబ్లో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలి. తీరా మనకు నచ్చిన రంగంలో కొనసాగాక..సమస్యలు వెంటాడితే ఇక అంతే సంగతులు. అంతా సవ్యంగా ఉంటే పర్లేదు. ఏదైనా సమస్య వస్తేనే ఇబ్బంది. అందులోనూ భారీ వేతనం లభిస్తున్న ఉద్యోగం వదలాలన్న గట్స్ కావాలి. అయితే ఈ టెక్కీ అంత సాహసం చేశాడు. అది కూడా యూట్యూబ్లో కోడింగ్ నేర్పడం కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలేశాడు. అబ్బా ఇదేంటని అడిగితే.. తాను కోరుకున్నది ఇదేనని నవ్వుతూ చెబుతాడు సదరు టెక్కీ. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారడమే గాక టెక్కీ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వ్యక్తే అక్షయ్ సైనీ. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో మాజీ ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్షయ్ సైనీ ఐదేళ్ల క్రితం సురక్షితమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్న తన జర్నీని పంచుకున్నాడు. ఈ నిర్ణయం అతడికి తన డడ్రీమ్ లైఫ్ని నిర్మించుకునేందుకు సహాయపడింది. అంతేగాదు సైనీ తన యూట్యూబ్ ఛానెల్లో రెండు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నిజానికి తాను ఉబర్లో ఉద్యాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడూ..అందరు తనని మతిస్థిమితం లేనివాడిగా చూశారని చెప్పుకొచ్చాడు. కేవలం యూట్యూబ్లో బోధించేందుకు మంచి జీతం, మంచి బ్రాండెడ్ కంపెనీ తదితరాలన్నీ కాదనుకుంటున్నావా అని కూడా ప్రశ్నించారని రాసుకొచ్చాడు. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయమని. అంతగా కావాలనుకుంటే జాబ్ చేస్తూనే వారాంతాలలో య్యూట్యూబ్ కంటెంట్క్రియేటర్గా, కోడింగ్ బోధించమని సలహ ఇచ్చారని తెలిపాడు. కొందరైతే ఏకంగా ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్యాగ్తో పెళ్లి అయిపోని.. ఆ తర్వాత నచ్చినదాంట్లో కొనసాగమని సూచించారు కూడా. అయితే నా దృష్టిలో వివాహాం పెద్ద మేటర్ కాదు కాబట్టి..గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం తొందరపడలేదని..జీతం లేకుండా పది నెలలకు పైగా సెలవులు తీసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వివరించాడు. ఆ విరామ సమయంలో బోధన, డెవలపర్ విద్యపై దృష్టి సారించి నమస్తేదేవ్ అనే వేదికపై పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో తాను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాత్రమే ఇప్పుడు..వ్యవస్థాపకుడిగా, సీఈవోగా, మార్కెటర్గా, సేల్స్గైగా, ప్రొడక్ట్ మేనేజర్గా, ఫైనాన్స్గైగా, కొన్నిసార్లు కస్టమర్ సపోర్ట్గా అన్ని రోల్స్ నిర్వరిస్తున్నా అని ఆనందంగా చెబుతున్నాడు. అంతేగాదు మనకు బయట స్టార్టప్లు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. కానీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా ఎన్నో విమర్శలు, ఆన్లైన్ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వెనుతిరగలేదని, ఎన్నోప్రతికూలతలను దాటుకుంటూ చాలా దూరం వచ్చానంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సైని. అలా ఇప్పటికీ ఐదేళ్లు అయ్యిందని, స్వస్థలం డెహ్రాడూన్, అక్కడే ఒక చిన్న రిమోట్ బృందంతో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీని వల్ల కుటుంబంతో గడపగలుగుతున్నానని, పనిని ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్..అందరి మనుసుని గెలుచుకోవడమే గాక..ఇలాంటి నిర్ణయాల తీసుకునేందుకు చాలా గట్టి ధైర్యం కావాలని, ఆత్మసంతృప్తినిచ్చే పని ఎంతో నచ్చుతుందని. దానికి మించింది మరొకటి లేదని పోస్టులు పెట్టారు. అలాగే అన్నివేళలా సురక్షితమైన ఉద్యోగం కంటే..ఓర్పుతో నచ్చిన వృత్తిలో గెలుపు అందుకోవడంలో ఉన్న కిక్ వేరేలెవెల్ అంటూ మరికొందరూ పోస్టుల్లో పేర్కొన్నారు.When I left Uber, a lot of people thought I had lost my mind.Good salary, big brand, stable life.And I was walking away from it to do YouTube, teaching, content creation. In India.People told me very seriously, “This is not a good decision.”Some said, why don’t you do…— Akshay Saini (@akshaymarch7) February 9, 2026 (చదవండి: ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!) -
ముంబై వదిలి ఢిల్లీకి.. ప్రతి నెలా రూ. 75 వేలు ఆదా!
ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరొక నగరానికి మారడం చాలా మందికి సాధారణమే అయినప్పటికీ, ఆ పరిస్థితి ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసిందంటే మనం నమ్మలేం. దీనిని సంబంధించిన ఉదంతంలోనికి వెళితే.. ముంబై లోకల్ రైళ్ల రద్దీని వదిలి.. ఢిల్లీ మెట్రో సౌకర్యాన్ని ఎంచుకున్న ఒక బ్యాచిలర్, తన తాజా అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.రెండింతల తృప్తిఉద్యోగ రీత్యా ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీకి షిఫ్ట్ అయిన కారణంగా తనకు డబ్బు ఆదా అవడమే కాకుండా, విశాలమైన నివాసాలు, పరిశుభ్రమైన వాతావరణం లభించడంతో తన తృప్తి రెట్టింపు అయ్యిందని ఆ బ్యాచిలర్ పేర్కొన్నారు. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో లభించే సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.మరింతగా పెరిగిన పొదుపునెలకు రూ. 1.4 లక్షల వేతనం పొందుతున్న అతను ముంబైలో ఉన్నప్పుడు ఒక సాధారణ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం రూ. 40,000 అద్దె చెల్లించేవారు. అంత ఖర్చు చేసినా అక్కడ అంత సౌకర్యవంతంగా ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే తాను ఢిల్లీకి మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన వివరించారు. ముంబైలో నెలకు రూ. 40 నుంచి 50 వేలు మాత్రమే పొదుపు చేయగలిగిన ఆయన, ఇప్పుడు ఢిల్లీలో అంతకంటే మెరుగైన జీవనశైలిని గడుపుతూ, నెలకు సుమారు రూ. 75,000 ఆదా చేస్తున్నట్లు వెల్లడించారు. విశాలమైన రోడ్లు, సులభంగా లభించే ఇంటి పనివారు, మెరుగైన వైద్య సేవలు ఢిల్లీలో తన ఖర్చులను భారీగా తగ్గించాయని ఆయన పేర్కొన్నారు.ఈ వైరల్ పోస్ట్పై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముంబైలో అద్దెలు భరించలేనంతగా ఉన్నాయని ఒకరు వ్యాఖ్యానించగా, ఢిల్లీలోని కాలుష్య సమస్యను మరొకరు గుర్తు చేశారు. ఏడాదిలో మూడు నాలుగు నెలల పాటు ఉండే కాలుష్యాన్ని ఎలాగోలా భరించగలిగితే మిగిలిన విషయాల్లో ఢిల్లీ ఎంతో మెరుగైనదని కొందరు అభిప్రాయపడ్డారు. తరతరాలుగా ఆస్తులు ఉన్నవారికే ముంబై సరిపోతుందని, మధ్యతరగతి, బ్యాచిలర్లకు ఢిల్లీ సరైన ఎంపిక అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.‘ఢిల్లీ కంటే హైదరాబాద్ బెటర్’ఈ చర్చలో భాగంగా మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ కంటే హైదరాబాద్ నగరం ఎంతో ఉత్తమమని ఒక నెటిజన్ చేసిన కామెంట్కు సదరు బ్యాచిలర్ కూడా మద్దతు పలికారు. తాను ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్ను సందర్శించానని, భారతదేశంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. సౌకర్యవంతమైన జీవితానికి హైదరాబాద్ సరైన వేదిక అని ఈ చర్చలో పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’పై ట్రంప్ కరుణ.. కీలక రంగానికి సుంకాల ఎత్తివేత! -
ఆన్లైన్లో అనకొండలున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే... అంతర్జాలం కాస్తా మాయాజాలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడం నుంచి ప్రైవసీకి ముప్పు రావడం వరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన నిత్యావసరాల జాబితాలో ‘ఇంటర్నెట్’ భాగం అయింది. ఆ నెట్టింట ప్రయోజనాలూ, ఉపయోగాలతో పాటు మింగేసే అనకొండలు కూడా ఉన్నాయి. వాటి బారిన పడకుండా ఉండడం ఈరోజుల్లో సవాలుగా మారింది. ‘ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచించాలి. తొందరపాటు కూడదు’ అనేది సేఫ్టీ ఇంటర్నెట్ తారకమంత్రం...గిబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్గిబ్లీ–స్టైల్ ఏఐ ఆర్ట్ మన ఫొటోలను చిత్రవిచిత్రమైన, యానిమీ–స్టైల్ చిత్రాలుగా మారుస్తుంది. సరదా సంగతి ఎలా ఉన్నా, ఈ గిబ్లీ–స్టైల్ ఆర్ట్ ట్రెండ్ అనేది ప్రైవసీ, డాటా సెక్యూరిటీకి సంబంధించి ముప్పు తెచ్చిపెడు తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. మరికొన్ని...ప్రైవసీ నైట్మేర్: గిబ్లీ–స్టైల్ ఆర్ట్లాంటి ఫీచర్లను అందించే కొన్ని యాప్లు, ప్లాట్ఫామ్లు యూజర్ల ముఖ కవళికలు, రకరకాల ఎక్స్ప్రెషన్స్కు సంబంధించిన చిత్రాలను సేకరించి స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తున్నాయి. దీన్నే ప్రైవసీ నైట్మేర్ అంటున్నారు.డీప్ఫేక్: మహిళలు, పిల్లలు అప్లోడ్ చేసిన పర్సనల్ ఫొటోలు, సెల్ఫీలతో డీప్ఫేక్స్ సృష్టించే ప్రమాదం ఉంది. తెలియకుండానే ఓకే అనేస్తున్నారు: ఫ్యూచర్ మోడల్ ట్రైనింగ్కు సంబంధించి స్టోర్ చేయడానికి, విక్రయించడానికి ఏఐ డెవలపర్లు పర్సనల్ ఫొటోలను ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలను చాలామంది యూజర్లు తెలియకుండానే అంగీకరిస్తున్నారు!లైక్నెస్ ఎక్స్ప్లాయిటేషన్నిజమైన వ్యక్తి, ముఖ్యంగా మహిళల పోలికలను, ఏఐ జనరేటెడ్ క్యారెక్టర్స్లో మెర్జ్ చేస్తున్నారు. వీటిని హానికరమైన పనుల కోసం ఉపయోగించే ప్రమాదం ఉంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు→ ప్రైవసీ పాలసీకి సంబంధించి స్పష్టత లేని, అనుమానించే రీతిలో ఉన్న ఏఐ టూల్స్ను ఉపయోగించవద్దు.→ ప్రైవసీ పాలసీలను జాగ్రత్తగా చదవాలి. అప్లోడ్ చేసిన ఇమేజ్లను ఏఐ ప్లాట్ఫామ్లు ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా ఉపయోగిస్తున్నాయనేది లోతుగా అర్థం చేసుకోవాలి.→ దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండే సెన్సిటివ్, పర్సనల్ ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.→ ఫొటోలను అప్లోడింగ్ చేసే ముందు లొకేషన్ డాటా, వ్యక్తిగత వివరాలు లేకుండా చూసుకోవాలి.→ ఏఐ అకౌంట్స్ ఆథెంటికేషన్ కోసం స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఉపయోగించాలి.→ ఉచిత ఏఐ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అనుమతులు కోరితే వాటిని ఉపయోగించే విషయంలో పునరాలోచన చేయాలి.వాయిస్ క్లోనింగ్ స్కామ్ఒక తండ్రికి విదేశాల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కుమారుడు వికాస్ వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.‘ఒక కేసులో వికాస్ను అరెస్ట్ చేశాం. ఒకసారి మాట్లాడండి’ అన్నది అవతలి గొంతు.‘నాన్న... నేను చెప్పిన ఎకౌంట్కు అర్జంటుగా డబ్బు పంపించు. అలా చేయకపోతే జైల్లో ఉండాల్సి వస్తుంది’ భయం ఉట్టిపడే గొంతుకతో అన్నాడు వికాస్. అది తన కుమారుడి వాయిసే కాబట్టి ఆ పెద్దాయన వారు అడిగినన్ని డబ్బులు పంపాడు.ఆ తరువాత ఎప్పటికో వికాన్ నుంచి ఫోన్ రాగానే ఆత్రంగా ఫోన్ ఎత్తాడు...‘రిలీజ్ చేశారా? క్షేమంగా ఉన్నావా?’ అని ఆత్రంగా అడిగాడు.‘రిలీజ్ చేయడం ఏమిటి?’ అని షాకై పోయాడు వికాస్. జరిగినందంతా చెప్పాడు తండ్రి. తన వాయిస్ ఎవరో క్లోనింగ్ చేశారు అనే విషయం వికాస్కు అర్థమైంది. బ్లాక్మెయిల్ చేయడం నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వరకు స్కామర్స్ వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. దీన్ని ‘వాయిస్ క్లోనింగ్ స్కామ్’ అంటారు.జాగ్రత్తలు→ అనుమానించడానికి ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా ‘మీ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది’లాంటి మాటలు స్కామర్లు ఉపయోగిస్తారు. వెంటనే ఎమోషనల్ కాకుండా కాస్త ఆలోచించడం మంచిది.→ అపరిచిత ఫోన్లకు సంబంధించి ‘నిజమా? కాదా?’ అని నిర్ధారించుకోవడానికి కుటుంబ సభ్యులతో సీక్రెట్ పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా వారికి మాత్రమే జవాబు తెలిసిన కొన్ని ప్రశ్నలు అడగాలి.→ స్కామర్లు మీ వాయిస్ కాప్చర్ చేయకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలను మీ సన్నిహితులు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితులు విధించాలి.స్మిషింగ్ స్కామ్ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో వ్యక్తిగత, ఆర్థిక, లాగిన్ సమాచారాన్ని దొంగిలించడానికి రూ పొందించిన మోసపూరిత టెక్ట్స్ మెసేజ్ను స్మిషింగ్ స్కామ్ అంటారు. ‘మీ ఎకౌంట్ను సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ మెసేజ్ రావచ్చు. ‘డియర్ కస్టమర్’ పేరుతో వచ్చే మెసేజ్లో పెద్దగా వివరాలేమీ లేకపోవడం, అనుమానాస్పద మేసేజ్లు, ఊహించని రిక్వెస్ట్లు నోటిఫికేషన్ల రూపంలో రావడం.. మొదలైనవి స్మిషింగ్ స్కామ్లో భాగం.కొన్ని జాగ్రత్తలు→ తెలియని, అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ల నుంచి వచ్చిన లింక్లను క్లిక్ చేయకూడదు. అటాచ్మెంట్స్ను డౌన్లోడ్ చేయవద్దు → చట్టబద్ధమైన కంపెనీ లేదా బ్యాంకు నుండి వచ్చినట్లు ఏదైనా మెసేజ్ క్లెయిమ్ చేసుకుంటే, టెక్ట్స్లో ఉన్నవి కాకుండా వారి అధికారిక వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా వారిని నేరుగా సంప్రదించాలి.→ అనుమానంగా అనిపించిన మెసేజ్లను మీ సెల్యూలార్ ప్రొవైడర్కు, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్సీసీ)కు రిపోర్ట్ చేయాలి.→ సెన్సిటివ్ ఎకౌంట్స్కు సంబంధించి మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఎంఎఫ్ఏ)ను ఎనేబుల్ చేయాలి.... ఇవి మాత్రమే కాదు, మ్యాట్రిమోనియల్ స్కామ్స్, విషింగ్ ఎటాక్స్, గేమింగ్ స్కామ్స్, ఆన్లైన్ డేటింగ్ ఫ్రాడ్స్... ఇలా ఎన్నో స్కామ్లు ఆన్లైన్లో పొంచి ఉన్నాయి. ‘నాకు అన్నీ తెలుసు. నన్ను ఎవరూ మోసం చేయలేరు’ అనే అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే బాధితుల్లో మొదటి వరసలో మీరే ఉంటారు!అందుకే ఆన్లైన్కు సంబంధించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ కోసమై నెట్ (వల)లో పడెనే... పాపం...మన దేశంలో రొమాన్స్ స్కామ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్లో నకిలీ ప్రొఫైల్ను ఉపయోగిస్తున్నారు. డాక్టర్, మిలిటరీ ఆఫీసర్, సాఫ్ట్వేర్ కంపెనీ సీయీవో... ఇలా రకరకాల ప్రొఫైల్లను సృష్టిస్తున్నారు. ఈ ప్రొఫైల్ నిజమే అనుకొని ప్రేమ ప్రపంచంలోకి వచ్చిన వారిని, ప్రేమబంధం బలపడిన తరువాత ‘అర్జంటుగా అవసరం ఉంది డియర్’ అని (ఫేక్) ఎమర్జెన్సీల పేరుతో డబ్బు లాగుతున్నారు. ఇదొక రకం అయి™ó, సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం అనేది మరో రకం. డేటింగ్ యాప్లలో 39 శాతం మంది యూజర్లు వివిధ రూపాల్లో రొమాన్స్ స్కామ్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ల బారిన పడిన బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. ఆత్మçహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు... → పేరు నమోదు చేసుకునే ముందు డేటింగ్ యాప్ లేదా మ్యాట్రిమోనియల్ అథెంటిసిటీని ధ్రువీకరించుకోవాలి → నివాస చిరునామా, వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచకపోవడం మంచిది → డేటింగ్ యాప్లో పరిచయం అయిన వారిని ప్రత్యక్షంగా కలుసుకొని తగిన ప్రశ్నలు అడగాలి → మ్యాట్రిమోనియల్ సైట్లలో ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి → బ్యాంకింగ్ సమాచారం, గుర్తింపు లేదా పాస్పోర్ట్ కాపీలు, ముఖ్యమైన సమాచారం తెలియని సైట్లకు అందించవద్దు. -
మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?
ఒక చెరుకు వ్యాపారి డబ్బు బాగా గడించాడు. వయసు మీద పడటంతో మనసు చిన్నగా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. గుడులూ గోపురాలూ తిరిగాడు. నదీ స్నానాలు చేశాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో అతడికి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది.అదేమిటంటే ‘ఏ సేవ మంచిది, మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?’ అని. సమాధానం కొరకు ప్రయత్నించాడు. సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. వారి ఊరికి చాలా దూరంగా ఉన్న గుట్టమీద ఒక సాధువు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందని బయలుదేరాడు. దారి సరిగా తెలియక అవస్థలు పడ్డాడు. అప్పటికే బాగా చీకటయ్యింది. వ్యాపారికి ఆ చీకట్లో నడవడం కష్టంగా తోచింది.దారిలో ఒక రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని వ్యాపారిని ప్రశ్నించాడు. తను వెళ్తున్న విషయం చెప్పాడు వ్యాపారి. ‘ఆ గుట్టపైకి వెళ్ళడానికి పగలే కష్టంగా ఉంటుంది. రాత్రయింది కాబట్టి మరింత కష్టం. అందులోనూ పురుగూపుట్రా ఉంటాయి. నేను మీకు తోడుగా వస్తాను’ అని చెప్పి లాంతరు పట్టుకుని బయలుదేరాడు. ఎలాగైతేనేం గుట్ట చేరారు. సాధువును కలిశారు. తను వచ్చిన విషయం చెప్పా వ్యాపారి.‘బాగా రాత్రయ్యింది. అలసిపోయి ఉన్నారు. ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి నిద్రపొండి, ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పాడు సాధువు. ఇద్దరూ అలాగేనని ఒప్పుకున్నారు. తెల్లారిందే లేదో గబగబా నిద్ర లేచిన రైతు పొలం పని ఉంది, నేను బయలుదేరుతాను’ అన్నాడు.వెంటనే వ్యాపారి ‘‘చీకట్లో ఉన్న నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు లాంతరుతో తోడు రాకుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాణ్ణి. మీరు చేసిన సహాయం నా జీవితకాలం మరచిపోను’’ అని చెప్పి పడీపడీ నమస్కరిస్తూ అతడిని సాగనంపాడు.చదవండి: సంక్షోభంలో స్థిరత్వంసాధువు చిరునవ్వు ముఖంతో వ్యాపారిని దగ్గరికి పిలిచి ‘ఒక్క రాత్రి, చీకటిలో ఉన్న నీకు లాంతరు సాయం చేశాడని అతడిని ప్రముఖ వ్యక్తిగా ఆదరిస్తున్నావు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి చీకటిలో ఉన్న నీకు ఆరని దీపంలాగా, నీ ఆలనాపాలనా చూసి, మంచి చెడ్డలు నేర్పించారు నీ అమ్మానాన్నలు. ఎన్నో కష్టాలకు ఓర్చి విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఇంతవాడిగా చేసిన అమ్మానాన్నలకి చేసే సేవకన్నా వేరే ఏ సేవా గొప్పదికాదు, వారికి కృతజ్ఞతగా ఉండటానికి మించింది ఏదీ లేదు’ అని హితవు చెప్పాడు.‘నిజమే, నిరంతరం తను కాలుతూ వెలుగునిచ్చే దీపంలాగా మన జీవితాలకు వెలుగునిచ్చే అమ్మా నాన్నలకు మించిన గొప్పవారు ఎవరు ఉంటారని’ తెలుసుకున్న వ్యాపారి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!
భారత కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే అది ప్రస్తుత కాలంలో చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ప్రాణప్రదంగా పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవాళ్లే..కడదాక కలిసి ఉండలేకపోవడం బాధకరం. అది కూడా చిన్నచిన్న వాటికి, మనస్పర్థలతోటి విడాకులు తీసుకుంటున్నారు. తనకోసం అన్ని వదులుకుని వచ్చిందన్న భావం మగవాళ్లలో కొరవడం ఒక కారణమైతే..తన మాటే నెగ్గాలన్న అహంకారం మరొక కారణం అంటున్నారు మానసిక నిపుణుల. అచ్చం అలాంటి కారణాలతో ఈ టెక్ జంట విడిపోయింది. అందుకు గల కారణం చూస్తే..కన్నీళ్లు వస్తాయి. విమెన్ సాధికారత అన్న మాటలు వెగటుపుడుతాయి. దయచేసి మహిళల్ని మహారాణులు చేయకండి అర్థచేసుకోండి స్వామి..చాలు అని గొంతెత్తి అనాలనిపిస్తోంది. అసలేం జరిగిందంటే..ఈ టెక్ జంట ప్రేమ కథ విడాకులతో ముగియడంతో నెట్టింట వైరల్గా మారింది. సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ప్రకారం. ఆ టెక్ జంట పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకున్నారు. విజయవంతంగా జీవితాన్ని నిర్మించుకున్నారు. గుర్తింపును వెల్లడించిన ఆ ఇంజనీర్ జంటకు ఇద్దరు పిల్లుల, చక్కటి ఆర్థిక భద్రతా ఉంది. ఆమె మంచి కష్టపడి పనిచేసే ఉద్యోగి. గర్భధారణ తర్వాత ఆరునెలలు మినహా ఎన్నడు విరామం తీసుకోలేదు. తొమ్మిదో నెల వరకు ఆఫీసుకు వెళ్లింది. పిల్లలు, భర్త కోసం పనిచేయడం ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది కూడా. రెండో గర్భధారణ తర్వాత ఆ మహిళ కంపెనీ మార్చింది. కొత్త టెక్నాలజీ నేర్చుకుంది. ఇప్పుడు తన భర్త కంటే అధిక వేతనం సంపాదిస్తోంది కూడా. అయితే అత్తగారు అనారోగ్యానికి గురి కావడంతో భర్త తన భార్యను ఉద్యోగం మానేసి ఆమె బాగోగులు చూసుకునే సంరక్షకురాలిగా మారాలని ఆదేశించాడు. అందుకు ప్రెగ్నెన్సీ వల్ల చాలాసార్లు తాను ఉద్యోగానికి విరామం ఇచ్చాను..ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి మీరే జాబ్ మానేయండి, ఫైనాన్షియల్గా మొత్తం చూసుకుంటాను, అలాగే ఇంటి బాగోగుల్లో కూడా హెల్ప్ చేస్తానని చెప్పింది. అవసరమైతే పిల్లల్ని చూసుకునేందు వాళ్ల అమ్మను కూడా పిలిపిస్తానని అంది. అందుకు భర్త తల్లి ససేమిరా అంది. కోడలు తల్లి ఇక్కడకు రావడం సరైన కాదని..పైగా ఉద్యోగం కోడలే మానేయాలని పట్టుబట్టింది. పైగా అత్తగారిని చూసుకోవడం అనేది కోడలు బాధ్యతని ఆమె గట్టిగా విశ్వసిస్తోంది. చివరికీ కోడలు ఉద్యోగం మానేయడం లేదనే అక్కసుతో ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. దాంతో విసుగుపోయిన ఆమె పిల్లలుతో సహా పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అలాగే భర్తకు ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమెకు ఇష్టమైతే తన ఇంటికి వచ్చి ఉండొచ్చని, తన అమ్మనాన్నలు చూసుకుంటారని అంది. అంతే భర్త ఉద్యోగం మానేయడం లేదనే కోపంతో..విడాకులు ఇస్తానని బెదిరిస్తూ లీగల్ నోటీసు పంపాడు. చివరికీ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఎంతో విజయవంతంగా నిర్మించుకున్న ఆజంట సంసారం విచ్చన్నమైంది, విడాకులు తీసుకున్నారు. ఇక్కడ ఒక మహిళ ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా..ఎంత ప్రేమించినా..త్యాగం చేసినా విలువ ఉండదు. జస్ట్ తన స్వాతంత్య్రాన్ని వదులుకోను అనగానే ఆ భార్య ఒక్కసారిగా పనికిరానిదిగా అయిపోయింది. నెటిజన్లు సైతం ఆమె తల్లికి అనారోగ్యంగా ఉంటే..ఆ భర్త ఉద్యోగం మానేస్తాడా? అని ప్రశ్నించారు, మరికొందరు ఇక్కడ ఆమె బాధ్యత నిరాకరించిందని కాదని, కేవలం తనకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న విద్వేషం విడాకులకు దారితీసిందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.చదవండి: భార్య కోసం ఏడాదికి 3 కిలోల బంగారం కొంటున్నాడు..! -
గంగాతీరంలో బోళా శంకరుడి అత్తారిల్లు..!
దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక మహాయాగాన్ని నిర్వహించినప్పుడు సతీదేవిని, మహాశివుడిని ఆహ్వానించడు. పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి అక్కడికి వెళుతుంది. తండ్రి చేసిన అవమానంతో యజ్ఞగుండంలోకి వెళ్లి, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ స్థలమే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సమీపంలోని కంఖాల్ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించి నాటి పౌరాణిక విశేషాలు తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజులలో అత్యంత ప్రాచీన ఆలయాల సందర్శనకు,ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతంది..శక్తి పీఠాల కథకు ఆదిప్రధాన ఆలయం లోపల ఉన్న సతీకుండ్ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహాశివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా, విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి. అవి మొత్తం 108 భాగాలు కాగా, వాటిలో ముఖ్యమైన 54 భాగాలు, మరీ ముఖ్యమైన 18 భాగాలే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ్ర΄ాంగణంలో అనేక ఉ΄ాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపు గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృకార్యాలు, నదీ పూజలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు.అహంకారానికి అంతందక్షేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. శివరాత్రి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksha Mahadev Temple) ఒక ఆలయం మాత్రమే కాదు అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.ఇలా చేరుకోవచ్చు..దక్షేశ్వర మహాదేవ్ ఆలయం సమీప రైల్వే స్టేషన్- హరిద్వార్సమీప విమానాశ్రయం- డెహ్రాడూన్. హరిద్వార్ నుండి 35 కి.మీ. రోడ్ వే ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తక్కువ ధర, ఆశ్రమాల వంటి ఉచిత వసతితో సహా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయిఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే లభిస్తుంది.గంగానది ఒడ్డునహరిద్వార్ (Haridwar) భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మతపరమైన ప్రాచీన నగరం. హిందువులకు పవిత్ర స్థలం. అనేక దేవాలయాల సముదాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది హిందువుల ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షేశ్వర మహాదేవ్ హరిద్వార్లోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది హరిద్వార్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కంఖల్లో ఉంది. సలేశ్వరం ప్రకృతి రమణీయతశివరాత్రి నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన సందర్శన స్థలాల జాబితా తయారుచేసుకుంటే అందులో చేర్చాల్సిన పర్యాటక ప్రాంతం ‘సలేశ్వరం.’ ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ ప్రాంత సందర్శన మనలో ఒక ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలో.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువై ఉన్న యాత్రా స్థలం ఇది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లోయలో ఉన్న గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు ముగ్ధులు అవుతుంటారు. లోయలోకి ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. లోయ అడుగు భాగంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే గుట్టల మధ్య నుంచి కిందుగా కాలి నడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ దారిలో ఎన్నో గుహల నుండి జాలువారే సన్నని జల ధారలు కనిపిస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అడుగు భాగంలో ఉన్న గుండం చేరుకున్నాక పైకి చూస్తే .. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి.. మధ్యలో మనం.. తెలియని అనుభూతికి లోనవుతాం. గుండంలోని నీళ్లు అతి చల్లగా, స్వచ్ఛంగా, రుచిగా ఉంటాయి. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుపుతారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కి.మీ దూరంలో పరహాబాద్ వస్తుంది. అక్కడి నుంచి మరో 32 కిలో మీటర్ల దూరం దట్టమైన అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అమర్నాథ్ నమ్మకమే శాశ్వతంహిమాలయాల మధ్యలో అమర్నాథ్ మంచు గుహలో మహాశివుడు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. అమర్నాథ్ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది. పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. అందుకే తొలిసారి అమర్నాథ్ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి. ప్రతి శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు. అద్భుతం కోసమో, అడ్వెంచర్ కోసమో కాదుం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది. లింగం కరిగిపోతుంది కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్నాథ్ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివతత్వం.కేదార్నాథ్ క్షేత్రం ఓ సందేశంప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది. నిత్య పూజలు జరగవు. భక్తుల సందడి, రాకపోకలు ఉండవు. అయినప్పటికీ మహాశివుడు అక్కడే ఉన్నాడని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.ఇక్కడ శివుడిని ఉనికిగా కాకుండా, లేమిగా పూజిస్తారు. అంటే ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భక్తి ఆగదనే భావానికి కేదార్నాథ్ ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. వేసవిలో ఆలయం మళ్లీ తెరుచుకున్నప్పుడు భారీ ఉత్సవాల కంటే ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి దీపోత్సవం నిశ్శబ్దంగా జరిగినా, ఆ దీపం ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రారంభాన్ని ఒక పండగగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకు నాందిగా భావిస్తారు. ఆ తరువాతే తీర్థయాత్రికుల రాక ప్రారంభమవుతుంది. భక్తి అంటే దేవుడిని ప్రతిరోజూ దర్శించుకోవడమే కాదు. ఆలయానికి నిత్యం వెళ్లడమే కాదు. దూరంగా ఉన్నా దేవుడిని స్మరించడమే నిజమైన భక్తి అని ఈ క్షేత్రం సందేశం ఇస్తుంది. అందుకే ఆలయం మూసి ఉన్న కాలం ముగిసిన వెంటనే భక్తులు దేశం నలుమూలల నుంచి కేదార్నాథ్ దర్శనం కోసం తరలివస్తారు.ఈ ఏడాది ఆలయం తెరుచుకునే తేదీ 2026 సంవత్సరంలో కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22న ఉదయం సుమారు 7 గంటలకు భక్తుల దర్శనానికి తెరుచుకోనుంది. అలాగే నవంబర్ 11 వరకు దర్శనాలు కొనసాగనున్నట్లు తెలియజేస్తున్నారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రకు ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.కాశీ దివ్యమైన అనుభూతిగంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు. కాశీలో జీవితం, మరణాన్ని ఒకే తత్వంగా చూస్తారు. గంగానది తీరంలో జరిగే పూజలు, హారతులు, సంస్కారాలు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడిని మాత్రమే కాదు జీవిత సారాన్ని కూడా దర్శించుకుంటారు. జననం, మరణం, మోక్షం అనే చక్రం గురించి ఆలోచిస్తారు.ప్రతీ రోజు జరిగే గంగా హారతి ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మిక అనుభూతి కలిసే ఒక దివ్యమైన సందర్భం. అగ్ని జ్యోతి గంగాజలాలపై ప్రతిబింబించే సమయంలో భక్తులు తమ భయాలు, బాధలు అన్నింటినీ శివుడికి సమర్పించినట్లు భావిస్తారు. కాశీ గురించి చాలా మంది ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి శివయ్యే మోక్ష మార్గాన్ని చూపిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం మనిషికి ఒక సందేశాన్ని కూడా అందిస్తుంది. జీవితం అశాశ్వతంం ఆధ్యాత్మికతే శాశ్వతం అని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం కాశీ నగరం. భక్తి అంటే దేవుడిని బయట వెతకడం కాదుం మనలోని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం అని చెప్పే పరమ పవిత్ర క్షేత్రం కాశీ. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుచదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు.. ఆ దేశాల్లో లక్షాధికారులే..? -
భార్య కోసం ప్రతి ఏడాది మూడు కిలోలు బంగారమా..!?
బంగారం ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..భారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్ఫ్లిక్స్లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్ చేస్తుంది. ఈ సిరీస్లో నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్లో బారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.ఎవరీ సతీష్ సన్పాల్.. ?సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్ పింక్ రోల్స్ రాయిస్ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఇక సన్పాల్ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్పూర్లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు. View this post on Instagram A post shared by Luxe Life | لوكس لايف (@luxelifedubai) (చదవండి: 'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..! భావోద్వేగపరంగా..) -
'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..!
భారతీయ పేరెంటింగ్పై గురుగ్రామ్ సీఈవో, నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. చాలామంది భారతీయ తల్లిదండ్రుల పిల్లల పెంపకం సరైనది కాదన్నారు. తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కానీ పెంపకంలో ఆలోచన తీరు సరిగా లేదన్నారు. పేరెంటింగ్పై ఎన్నో పుస్తకాలు వచ్చినా ఎందుకనో భారతీయ తల్లిదండ్రుల తీరు మారట్లేదని, వాళ్లు పిల్లలను పెంచడం లేదు, ఫలితాలను పెంచుతున్నారంటూ సోషల్మీడియా వేదికగా విమర్శించారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు. అసలు ఆ సీఈవో ఆంతర్యం ఏంటీ అంటే..భారతీయ కుటుంబ వ్యవస్థను యావత్తు ప్రపంచం మెచ్చుకుంటే..మన భారతీయుడు, గురుగ్రామ్కి చెందిన మ్యాట్రిమోని యాప్ సీఈవో జస్వీర్ సింగ్ భారత పేరెంటింగ్ని తప్పుపడుతున్నారు. భారత తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం అత్యంత అధ్వాన్నమైనది అని తిట్టిపోశారు. వాళ్లు పిల్లలను తమ సొంత ఆస్తులుగా చూస్తారని అన్నారు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో చూసిన దానికంటే అత్యంత భిన్నంగా ఉంటుందన్నారు. సాంస్కృతికంగా భారతీయ పేరెంటింగ్ విధానంలో పెద్దలు ఎల్లప్పుడూ గొప్పవారు అని గుండెల్లో నాటుకుపోతుందన్నారు. అంతేగాదు జస్వీర్ సింగ్ సోషల్మీడియా ఎక్స్పోస్ట్లో భారత తల్లిదండ్రుల పిల్లలను పెంచే విధానం గురించి ఇలా రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల పెంపక విధానాలలో కెల్లా అత్యంత చెత్త విధానంగా పేర్కొన్నారు. దీన్ని ప్రెషర్ కుక్కర్ పేరెంటింగా అభివర్ణించారు. ఇక్కడ భారత తల్లిదండ్రులు చెడ్డవారు కాదు గానీ ఆలోచన తీరు సరైనది కాదంటున్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రశ్నించే విధంగా పెంచరన్నారు. తల్లిదండ్రులదే తుది నిర్ణయం..చాలామటుకు తల్లిదండ్రులు పిల్లలను పెంచరని, వాళ్ల ఫలితాలను పెంచుతారని రాసుకొచ్చారు. వాళ్లు వ్యక్తలుగా స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే భారత్లో ఒక పిల్లవాడు ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఏ వృత్తిలో కొనసాగించాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి...అన్ని తల్లిదండ్రులే ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు. ఆఖరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది కూడా తల్లిదండ్రలదే ఫైనల్ నిర్ణయం అన్నారు. ఇక్కడ భారత పేరెంట్స్ దృష్టిలో మానసిక ఆరోగ్యం, ఆసక్తి, ఉత్సుకత, ఆప్టిట్యూడ్, తదితరాలన్ని ఎందుకు పనికిరానివి, విలువలేనివి అన్నారు. కేవలం వాళ్ల మైండ్లో తల్లిదండ్రులుగా తమకే అన్ని తెలుసని, మేము చెప్పినట్లుగా చేయాలనే ధోరణే ఎక్కువగా ఉంటుందన్నారు. చెప్పాలంటే ఇదొక వస్తుమార్పిడిలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తామే ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్లపై తమకే సర్వహక్కులు ఉంటాయన్నట్లుగా ఉంటుంది వారి తీరు. ప్రశ్నించడమే అతిపెద్ద నేరం..దాంతో పిల్లలు భావోద్వేగపరంగా చిక్కుకుపోతుంటారు. పైగా వైఫల్యాన్ని నేరంగా చూస్తారు. అదొక సిగ్గుచేటు, ఆందోళనగా పిల్లల మైండ్లోకి చొప్పిస్తారు. అంతేగాదు బంధువుల్లోనూ, సమాజంలోనూ తక్కువ అయినట్లుగా ప్రతిక్షణం పిల్లలకు నూరుపోస్తుంటారు. దీన్ని ఇక్కడ తల్లిదండ్రులుగా తాము పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నట్లుగా ఫీలవుతుంటారు కానీ, సవాలుని స్వీకరించేలా కాకుండా వైఫల్యం నుంచి కాపాడుకుంటున్నట్లుగా పెంచుతున్నాం అని గ్రహించరని మండిపడ్డారు. అంతేగాదు ఇక్కడ పిల్లలు ప్రశ్నించడం అనేది అగౌరమైనది, ఒకవేళ ఏ పిల్లవాడైన ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెడితే..అతడని దూరంగా ఉంచాల్సిన వ్యక్తిగా నిలబెడతారు. కేవలం నిశబ్దాన్ని ప్రోత్సహిస్తారు. ముందు తల్లిదండ్రులుగా వాళ్లు ఇలానే పెరిగారు, నియంత్రించబడ్డారు, ప్రశ్నించలేదు, భావోద్వేగపరంగా అణిచివేయబడ్డారు..కాబట్టి అదే తర్వాతి తరాలకు పునరావృతం అవుతుందని అన్నారు. అలాగే కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే పెద్దలకు మించిన పరిణితి, అపారమైన మేధస్సు ఉంటుంది, అయినప్పటకీ అక్కడ కూడా ప్రశ్నించడం ద్రోహం, విబేధించడం, అపరాధం అనే భావన కిందకు రావడం దురదృష్టకరం అని అన్నారు. కొందరు తల్లిదండ్రలు ఇలా ప్రశ్నిస్తున్నందుకు పనిష్మెంట్తో నొరు నొక్కే ప్రయత్నం చేస్తుంటారు లేదా గర్విష్టులు, మొండోడు కింద ముద్రవేస్తారని అన్నారు. నో చెప్పడానికి జంకేలా..ఇక్కడ తల్లిదండ్రులు సమాజా అభిప్రాయానికి భయపడతారని అంటున్నారు. పిల్లలను తమను అనుసరించి, తమపై ఆధారపడేలా పెంచుతారని అన్నారు. అదీగాక తల్లిదండ్రలు మరో విషపూరి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అదేంటంటే పక్కంటి పిల్లవాడితో ప్రతిదానితో పోలుస్తూ..పెంచే ప్రయత్నం చేస్తుంటారు.. ఇది అన్నిట్లంకంటే దారుణైమనది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భారతీయ తల్లిదండ్రులు సమాజంపై పోరాడలేక తమ భయాలను పిల్లలపై వేస్తారు, ఆధిపత్యం చెలాయిస్తారని అన్నారు. సింపుల్గా చెప్పాలంటే పిరికితనంతో పెంచుతారని, అది పితృస్వామ్యం విధేయత నుంచి వచ్చిందని అన్నారు. తల్లిదండ్రులు 'నో' అని స్వతహాగా చెప్పడం నేర్చుకోలేదు..పిల్లలకు అది నేర్పించరు. చెప్పాలంటే భారత పేరెంటింగ్స్ తమ పిల్లలను బాగా పెంచామనే ముసుగులో వారికి తెలియని నష్టం చేకురుస్తున్నారు. పైగా వ్యక్తిగత వైఫల్యాన్ని తరతరాలు మోసేలా చేస్తున్నారని తిట్టిపోశారు జస్వీర్ సింగ్. ఆయన ఉద్దేశ్యం ప్రకారం భారత పేరెంటింగ్ టాలీవుడ్ మూవీ బొమ్మరిల్లు లాంటిదని తేల్చేశారు. అయితే గత దశాబ్ద కాలంలో పెంపకం గురించి మనస్తత్వవేత్తలు, అధ్యయనాలు, కౌన్సలర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే నకుల్ మెహతా, జాన్కీ మెహతా వంటి మిలీనియల్ తల్లిదండ్రులు ఆధునిక అవగాహనతో పిల్లలను స్వతంత్రంగా ఆరోగ్యకరంగా ఎలా పెంచచ్చో అనుభవాలను షేర్ చేసుకున్నారు కూడా.Indian parenting is pressure cooker parenting. One of the worst models globally. Not because parents are evil. But because the system is broken and no one questions it.Most Indian parents didn’t raise children. They raised outcomes.Children are treated like owned assets -…— Jasveer Singh (@jasveer10) February 8, 2026 చదవండి: నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!? -
ఫిట్స్ వస్తే.. ఏం చేయాలి?
ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్పై అవగాహన కోసమే ఈ కథనం. 90 శాతంలో పూర్తి తగ్గుదల 10 శాతంలోనే మాటిమాటికీ... తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్ పదే పదే వస్తుండవచ్చు.6.5 కోట్ల మందిప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. 26 మందిలో ఒకరికి... చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.70% మందిలో.. ఫిట్స్ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్) కారణంగా రావచ్చు.ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.మరికొన్ని మార్గాలు ఫిట్స్ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కూడా ఫిట్స్ను అదుపుచేయవచ్చు.ఫిట్స్ వచ్చినప్పుడు... ఫిట్స్ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్రాగానే ఆ వ్యక్తిని.. ∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. ∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. ∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.చదవండి: అవాంఛిత రోమాలకు పరిష్కారంచివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు. -
‘నో ఫోన్ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు!
ఈ రోజుల్లో చిన్నారులకు చేతిలో స్మార్ట్ఫోన్ లేనిదే ముద్ద దిగదు.. షార్ట్స్ చూడకపోతే నిద్రపట్టదు. అయితే కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన టీచర్ అమృత.. విద్యార్థులను ఈ డిజిటల్ సంకెళ్ల నుండి విడిపించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి కఠినమైన శిక్షలు లేకుండా కేవలం ‘రంగురంగుల స్టిక్కర్లు - చిన్నపాటి సవాళ్లతో’ ఆమె చేసిన ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం రెండు వారాల్లోనే పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని మాయం చేసిన ఆ ‘నో ఫోన్ ఛాలెంజ్’ కథలోనికి వెళితే..కేరళలోని కన్నూర్ జిల్లా, కూతుపరంబ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం అద్భుత ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు పాఠాల కంటే మొబైల్ ఫోన్లలో రీల్స్, షార్ట్స్ , వీడియో గేమ్స్పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని టీచర్ అమృత గమనించారు. పిల్లల ఏకాగ్రత లోపించడానికి మితిమీరిన మొబైల్ వాడకమే కారణమని నిర్ధారించుకున్న ఆమె, వారిని ఆ వ్యసనం నుండి దూరం చేసేందుకు ఒక ప్లాన్ వేశారు. కేవలం హెచ్చరించడమే కాకుండా, పిల్లల మనస్తత్వానికి తగినట్లుగా స్టిక్కర్లు, ఆటలు, చిన్నపాటి సవాళ్లతో వారిని ఆకట్టుకున్నారు.పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం అంత సులభం కాదని అమృతకు తెలుసు. అందుకే ఆమె ‘నో ఫోన్ ఛాలెంజ్’ను ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని విద్యార్థులకు మరుసటి రోజు తరగతిలో రంగురంగుల స్టిక్కర్లను బహుమతిగా ఇచ్చేవారు. ఇది విద్యార్థుల్లో ఒక సానుకూల పోటీని పెంచింది. ఫోన్ చూడటం మానేసిన పిల్లలకు ప్రోత్సాహకంగా కథల పుస్తకాలు, మట్టి బొమ్మలు, నోట్బుక్లను బహుమతులుగా అందించారు. ఫోన్ వదిలేసిన తర్వాత ఖాళీగా ఉండే సమయంలో వారు సృజనాత్మకంగా ఆలోచించేలా మట్టితో బొమ్మలు చేయడం, చిత్రలేఖనం లాంటి యాక్టివిటీస్ వారికి అలవడేలా చేశారు.ఈ వినూత్న ప్రయోగం మొదలైన రెండు వారాల్లోనే పిల్లల్లో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడమే కాకుండా, వారి ప్రవర్తనలో కూడా ప్రశాంతత చోటుచేసుకుంది. గతంలో చిన్న విషయాలకే గొడవ పడే పిల్లలు, ఇప్పుడు సహనంతో వ్యవహరిస్తున్నారని టీచర్ అమృత తెలిపారు. మొబైల్ ఫోన్ లాక్కుంటే ఇంట్లో ఏడ్చి గొడవ చేసే పిల్లలు, ఇప్పుడు పెయింటింగ్ వేస్తూ, ఆ చిత్రాలను టీచర్కు చూపించడానికి ఉత్సాహపడుతున్నారని తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్నారు.పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించే దిశగా విద్యాశాఖ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఇటీవల విడుదలైన ఎకనామిక్ సర్వే నివేదికలో డిజిటల్ వ్యసనం వల్ల యువతలో ఆందోళన, కుంగుబాటు, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడయ్యింది. ఫోన్లకు బానిసలవుతున్న నేటి తరాన్ని ఈ వ్యసనం నుంచి తప్పించేందుకు.. అమృత టీచర్ అనుసరించిన సృజనాత్మక పద్ధతులు అనుసరించాల్సిన అవసరముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు -
మొబైల్ చాయ్.. ఉపాధికి హాయ్..
ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు.. నిజ జీవితంలో విజయాలకు పునాది వేసిన ఆనవాళ్లు అనేకం.. ఒక వినూత్న ఆలోచనతో, తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు.. అలాంటి వారిలో ఒకరు సనత్నగర్కు చెందిన లక్ష్మణ్. 30 ఏళ్ల క్రితమే మొబైల్ వ్యాపార కాన్సెప్్టకు అంకురార్పణ చేశారు. ప్రస్తుతం అనేక మంది ఈ రంగంలో ఉపాధి పొందుతోన్న విషయం తెలిసిందే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటకు చెందిన బచ్చల లక్ష్మణ్ బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. మొదట రిక్షా తొక్కుకుంటూ జీవనం ప్రారంభించాడు. గిట్టుబాటు లేకపోవడంతో సాయంత్రానికి నిరాశా నిస్పృహలే మిగిలేవి. అప్పుడే.. టీ కోసం అనేకమంది దూరం వెళ్లడాన్ని గమనించాడు. రిక్షానే మొబైల్ టీ స్టాల్గా మారిస్తే.. అన్న ఆలోచన తట్టింది. అకున్నదే తడవు ఆచరణలో పెట్టాడు. 1996లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో రిక్షాలో మొబైల్ టీ స్టాల్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్కడ పది మంది గుమికూడితే అక్కడ టీ అందిస్తూ జీవన ప్రయాణాన్ని సాగించారు. సంవత్సరం తిరక్కముందే రిక్షా నుంచి మూడు చక్రాల బైక్కు అప్గ్రేడ్ అయ్యాడు. ఒకటిగా ప్రారంభమై.. అలా ఒక్క మొబైల్ టీ స్టాల్ కాస్తా.. ప్రస్తుతం 22 మొబైల్ టీ స్టాల్స్ను స్వయంగా తీర్చిదిద్ది ఉపాధి కోసం వెతుక్కునే వారికి అండగా నిలుస్తున్నాడు. లక్ష్మణ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న మొబైల్ టీ పరిమళం ఎస్ఆర్నగర్, అమీర్పేట దాటుకుని నగరం అంతటా వ్యాపించింది. తెల్లవారుజామున 4 గంటలకే అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద దిగే ప్రయాణికులకు అల్లం, గ్రీన్, లెమన్, బూస్ట్, హార్లిక్స్, కాఫీ, టీ కాషన్.. ఇలా అనేక రకాల తేనీటిని అందిస్తుంటాడు.రూపాయి నుంచి.. ‘అప్పట్లో అమీర్పేట కేంద్రంగా సాఫ్ట్వేర్ సంస్థల కార్యకలాపాలు కొనసాగేవి. ఇద్దరు సహాయకులతో నడిపేవాడిని.. వారికి రోజుకు రూ.50లు ఇచ్చేవాణ్ణి. ప్రారంభంలో రూపాయికే టీ.. అలా రోజుకు 700–800 టీలు విక్రయించేవాణ్ణి. దీనిమీదే ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేశా. సొంతిల్లు కొనుక్కున్నా. నాకులా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 22 మందికి మొబైల్ టీ స్టాల్స్ ఇస్తున్నా. ఇంతగా విస్తృతమవుతుందని అప్పుడు అనుకోలేదు’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. -
అనంతగిరి హిల్స్.. ది బ్రీజ్
ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పద్మనాభస్వామి దేవాలయం, కొలను, టీబీ హస్పిటల్ ఇతర పర్యాటక ప్రాంతాలు నగరవాసులకు సుపరిచితమే. అటవీ ప్రాంతంలో కర్ణాటకలో ‘జంగల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్’ తరహలో ఎకో టూరిజం బ్రాండ్గా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్’ పేరిట ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. పర్యాటకుల కోసం వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో ‘ది బ్రీజ్’ను తిర్చిదిద్దింది. అనంతగిరిని విజిట్ చేయాలనుకునే పర్యాటకులకు ఓ కొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. పర్యాటకుల కోసం ది బ్రీజ్లో జంగిల్ కాటేజెస్ నిర్మించారు. ట్రెక్కింగ్, బర్డ్స్ వాక్, నైట్ క్యాంప్స్, సఫారీ, బుష్ బ్రెక్ఫాస్ట్ వంటి వినూత్న కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. అటవీ విజ్ఞాన శాస్త్రం, హోటల్ మేనేజ్మెంట్ చదివిన నేచురలిస్ట్లు అడవులు, వృక్ష వైవిధ్యం, జంతు విజ్ఞానం, వాటి సంరక్షణ, హస్పిటాలిటీ తదితర అంశాలను ఇందులో భాగంగా వివరిస్తారు. ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులను మధ్యాహ్నం 1 గంటకు ది బ్రీజ్లో మేనేజర్/ నేచురలిస్ట్ బృందం రిసీవ్ చేసుకుంటుంది. మధ్యాహ్నం 10 రకాల వంటలతో భోజనం అందిస్తారు. షెడ్యూల్ ఇలా.. విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ట్రెక్కింగ్, బర్డ్ వాక్ చేస్తూ సూర్యాస్తమయం వ్యూ తిలకిస్తారు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో చెట్లు, పక్షులు, గడ్డి, జంతువుల గురించి వివరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రిసార్ట్లో స్నాక్స్ అందిస్తారు. రాత్రి 7.30 గంటలకు క్యాంప్ ఫైర్ వేసి వైల్డ్ లైఫ్ గురించి అనేక విషయాలు వివరిస్తారు. రాత్రి 8.45 గంటలకు నాన్వెజ్ డిన్నర్ అందిస్తారు. రాత్రి టెంట్లో బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు మొదలయ్యే సఫారీ దాదాపు 10 కిలో మీటర్లు అడవీలో తిరుగుతారు. 8.45 గంటలకు అడవిలో బుష్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తిరిగి ఉదయం 11 గంటలకు చెక్ అవుట్ ఉంటుంది.ప్యాకేజీ వివరాలకు.. సందర్శించాలనుకునే పర్యాటకులు వివిధ ప్యాకేజీలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాల కోసం వెబ్ సైట్ : deccanwoodsandtrails. com/ 9493549399, 9885298980 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!?
రిలయన్స్ ఫౌండేషన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ లగ్జరీ దుసులకు, ఆభరణాలకు కేరాఫ్ ఆమె. నీతా ధరించి ప్రతి చీర ఓ అద్భుతం. కళ్లుచెదరిపోయే ఖరీదు చేసే ఆభరణాలతో తన ఫ్యాషన్ శైలిని చెబుతుంటారామె. భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ చేనేత చీరలు, అలానాటి రాజుల కాలం నాటి ఆభరణాలతో మన పూర్వవైభవాన్ని తెలుసుకునేలా లేదా గుర్తుచేసేలా అద్భుతమైన లుక్తో కనిపించే నీతా ఈసారి వెస్ట్రన్ వేర్లో అదుర్స్ అనిపించుకున్నారు. తను ఏది ధరించిన సెన్సెషన్గానే ఉంటుంది. ఎందుకంటే వాటి ధర, డిజైన్ కూడా ఊహకందనిది. ఇక నీతా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో భారత ప్రతినిధిగా మిలానో-కోర్టినా వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026కి ముందు 145వ IOC సెషన్కు హాజరయ్యారు. ఏ వేదికపై భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరలే ఎంచుకునే నీతా ఈసారి బాస్లా కనిపించే పవర్ బ్లేజర్, చిక్ కోట్తో ఎంటర్ అవ్వడం విశేషం. నీతా అంబానీ చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 ప్రీ కలెక్షన్ స్టైలిష్ నేవి బ్లూ బ్లేజర్ ధరించింది. పైగా ఈ బ్లేజర్కి డబుల్ కాలర్లు, ఫుల్ స్లీవ్స్, నాచ్ లాపెల్స్, రెండు సైడ్ పాకెట్స్ ఉన్నాయి. అధునాతన నేవీ బ్లూ రంగులో ఉన్న బ్లేజర్పై కుడివైపు కాలర్పై ఎరుపు పూల డైమండ్ బ్రూచ ఆ బ్లేజర్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేసింది. దానికి నల్లటి ఫార్మల్ ప్యాంటుని జత చేసి..సింపుల్గా డైమండ్ ఆకారపు చెవిపోగులు ధరించి స్టైలిష్గా కనిపించారామె. ఇంతకీ ఈ బ్లేజర్ ఎంతో తెలిస్తే నోటమాటరాదు. ఇది అక్షరాలు రూ. 738,800/-. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ) -
మాస్ అండ్ క్లాస్: సంగీత ప్రపంచంలో బీటీఎస్ శాసనం
సంగీతానికి భాషా సరిహద్దులు లేవని ప్రపంచానికి ‘పాప్ మ్యూజిక్’ చాటిచెబుతోంది. వెస్ట్రన్ మ్యూజిక్ హవా నడుస్తున్న తరుణంలో, దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు కుర్రాళ్లు ‘బీటీఎస్’ (బాంగ్తాన్ సోన్యోందన్) పేరుతో ప్రపంచ సంగీత పటాన్ని ఒక్కసారిగా మార్చేశారు. కేవలం తమ పాటలతోనే కాకుండా, తమ అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ, సామాజిక సందేశాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. బీటీఎస్ ఆర్మీ పేరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని తిరుగులేని గ్లోబల్ ఫోర్స్గా ఎదిగారు. గ్రామీ నామినేషన్లు మొదలు ఐక్యరాజ్యసమితి వేదికల వరకు ‘కే పాప్’ స్థాయిని అమాంతం పెంచారు. 7 కోట్ల 80 లక్షల ఫాలోవర్స్కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా ఈ బృందం ఒకేసారి రెండు చారిత్రాత్మక విజయాలను నమోదు చేసి ప్రపంచాన్ని తెగ ఆశ్చర్యపరిచింది. హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ 2025లో ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్లో 78 మిలియన్ల(7 కోట్ల 80 లక్షలు) ఫాలోవర్లను సాధించిన తొలి మ్యూజిక్ గ్రూపుగా అరుదైన మైలురాయిని చేరుకుంది.హంటెయో అవార్డుతో గుర్తింపుసంగీత రంగంలో అత్యంత ఉన్నత అవార్డులలో హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ ఒకటి. 2025 సంవత్సరానికి గాను బీటీఎస్ ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆల్బమ్ విక్రయాలు, డిజిటల్ స్ట్రీమింగ్ గణాంకాలు, అభిమానుల భాగస్వామ్యం ఆధారంగా బీటీఎస్ను విజేతగా ప్రకటించారు. ఈ అవార్డు వారు సృష్టించిన రికార్డులకు ఒక ఉదాహరణగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇన్స్టాగ్రామ్లో తిరుగులేని ఆధిపత్యంఅవార్డుల ప్రకటన వెలువడిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో భారీ రికార్డు బద్దలైంది. బీటీఎస్ అధికారిక ఖాతా 78 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఏ మ్యూజికల్ బ్యాండ్ కూడా ఇప్పటివరకు ఈ స్థాయి ఫాలోయింగ్ను దక్కించుకోలేదు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి.. ఏకైక గ్రూపుగా బీటీఎస్ సరికొత్త రికార్డును లిఖించింది. ఇది బీటీఎస్ గ్లోబల్ క్రేజ్కు అద్దం పడుతోంది.మిలిటరీ సర్వీస్ తర్వాత..బీటీఎస్ సభ్యులైన జిన్, సుగా, జె-హోప్, ఆర్ఎమ్, జిమిన్, వీ, జంగ్కుక్ తమ తప్పనిసరి మిలిటరీ సేవలను పూర్తి చేసుకుని మళ్లీ ఒకే వేదికపైకి రానుండటం అభిమానులను ఆనందంలో మంచెత్తుతోంది. బీటీఎస్ సభ్యులంతా కలిసి పూర్తి స్థాయి బృందంగా తిరిగి రావడం అనేది బీటీఎస్లో భారీ మార్పులకు సంకేతం కానుంది. ఈ పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.మార్చి 20న ‘అరిరంగ్’ ఆల్బమ్ విడుదలదాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత బీటీఎస్ తమ ఐదవ స్టూడియో ఆల్బమ్ ‘అరిరంగ్’ను 2026, మార్చి 20న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఆల్బమ్లో మొత్తం 14 ట్రాక్లు ఉండనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఆల్బమ్పై సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా సంగీత చార్టుల్లో పాత రికార్డులన్నీ కనుమరుగవుతాయని అభిమానులు అంటున్నారు.ప్రపంచవ్యాప్త పర్యటనకు..ఈ ఆల్బమ్ విడుదలైన వెంటనే ఏప్రిల్ 9 నుండి బీటీఎస్ తమ ‘వరల్డ్ టూర్ 2026-2027’ను ప్రారంభించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 34 ప్రధాన నగరాల్లో మొత్తం 81 లైవ్ షోలను నిర్వహించనున్నారు. సభ్యుల లైవ్ పెర్ఫార్మెన్స్ను చూసేందుకు టికెట్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ బృందం భారత్లోని ముంబైలో పర్యటించనున్నదనే వార్త కూడా వినిపిస్తోందిగ్లోబల్ ఐకాన్స్గా బీటీఎస్సంగీతం, ఫ్యాషన్, సామాజిక అంశాలపై బీటీఎస్ చూపిస్తున్న ప్రభావం అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం ఒక పాప్ బ్యాండ్గా మాత్రమే కాకుండా, ఒక గ్లోబల్ బ్రాండ్గా వారు ఎదిగిన తీరు అమోఘమని సంగీతాభిమానులు అంటున్నారు. రాబోయే ‘అరిరంగ్’ ఆల్బమ్, వరల్డ్ టూర్తో 2026 ఏడాదంతా బీటీఎస్ స్మరణతో నిండిపోనున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ‘అమెరికాతో యుద్ధం వచ్చినా..’..ఇరాన్ కీలక ప్రకటన -
సహనం: సంక్షోభంలో స్థిరత్వం
భారతీయ జీవన దర్శనం సహనాన్ని కేవలం ఒక సామాన్య గుణంగా కాకుండా, ఒక మహోన్నత తపస్సుగా అభివర్ణించింది. కష్ట సమయాల్లో చలించకుండా ఉండటమే సహనం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషి ప్రతిదీ తక్షణమే జరిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ అత్యుత్సాహం అసహనాన్ని పెంచి, చిన్న విషయాలకే ఒత్తిడికి గురిచేస్తోంది. సహనం అంటే చేతకానితనం కాదు; అది మన మనస్సుపై మనకు ఉండే అద్భుత నియంత్రణ.విత్తనం విత్తిన వెంటనే ఫలాలు అందవు కదా! ఆ విత్తనం మట్టిలో కలిసి, అంకురించి, మొక్కగా ఎదిగి, వృక్షమై, చివరకు పండ్లను అందించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఆ విత్తనం ఎదుర్కొనే ఎండలు, వానలు, గాలివానలు అన్నీ ఓర్పుకు నిదర్శనాలు. జీవితంలో మన శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే ఈ నిరీక్షణ తప్పనిసరి.ఆర్ష విజ్ఞానంలో సహనానికి భూదేవిని మించిన నిదర్శనం మరొకటి లేదు. సమస్త జీవరాశి తనపై సంచరిస్తున్నా, తనను తవ్వుతున్నా ఆమె చలించకుండా అందరినీ భరిస్తుంది. అలాగే వనవాస సమయంలో పాండవులు చూపిన నిగ్రహం అద్భుతం. రాజభోగాలను వీడి, ఎన్నో అవమానాలను భరిస్తూ సరైన సమయం కోసం వేచి చూశారు. ఆ ఓర్పే వారిని ధర్మ యుద్ధంలో విజేతలుగా నిలబెట్టింది. కోపం క్షణికావేశంలో కలిగే వినాశనం అయితే, సహనం శాశ్వతమైన విజయాన్ని అందించే మౌన శక్తి. పాలు పెరుగుగా మారాలన్నా, రాయి శిల్పంగా మారాలన్నా ఆ ప్రక్రియలో సహనం అంతర్లీనంగా ఉంటుంది. మన సంస్కృతిలో సహనం కలిగిన వాడిని మాత్రమే ధీరుడు అని పిలుస్తారు. నిశ్చలత్వమే నిత్య సత్యమని గుర్తించినప్పుడు ఏ కల్లోలమూ మనల్ని చలింపజేయదు. నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనకు ఇష్టమైన ఫలితం ఆలస్యమైనప్పుడు మనసు ఆందోళన చెందుతుంది. అటువంటి సమయంలో ప్రకృతిని గమనించాలి. ఋతువులు తమ క్రమం తప్పకుండా వస్తాయి, నదులు సుదీర్ఘ ప్రయాణం తర్వాతే సముద్రాన్ని చేరుతాయి. మనం చేసే ప్రయత్నం సరైనదైనప్పుడు, కాలం మనకు సానుకూల ఫలితాన్ని అందిస్తుందనే నమ్మకమే సహనం. కుటుంబ సంబంధాల్లో కానీ, వృత్తి పరమైన సవాళ్లలో కానీ ఆవేశంతో స్పందించే కంటే, సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అనర్థాలు తప్పుతాయి. సహనం మనలో విచక్షణను పెంచుతుంది. ఇది ఒక రకమైన మానసిక పరిపక్వత; ఇది మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.విశ్వజనీన ధర్మం అందించిన ఈ సహన మార్గం వ్యక్తిని స్థితప్రజ్ఞుడిగా తీర్చిదిద్దుతుంది. తొందరపాటు నిర్ణయాలు అపజయాన్ని ఇస్తే, ఓర్పుతో కూడిన అడుగులు విజయతీరాలకు చేరుస్తాయి. మన హృదయంలో సహనం అనే జ్యోతి వెలుగుతున్నంత కాలం ఏ సవాలునైనా అధిగమించవచ్చు. లోకంలో మార్పు అనేది క్రమంగా జరుగుతుంది; ఆ మార్పులో మనం భాగస్వాములవ్వాలంటే సహనం అత్యంత అవసరం. అందుకే మనలో ఉన్న ఓర్పును పెంచుకుంటూ, ప్రశాంతమైన చిత్తంతో లక్ష్యం వైపు సాగిపోదాం. సహనమే శక్తి, సహనమే శాంతి. సర్వం సుమంగళం!వ్యక్తిత్వ వికాస నిపుణులువైదిక సంంస్కృతి బోధించిన తితిక్ష అంటే సుఖదుఃఖాలను, శీతోష్ణాలను సమానంగా భరించే శక్తి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా, విమర్శలు ఎదురైనప్పుడు ఉలిక్కిపడకుండా ఉండటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట దైవత్వం విరాజిల్లుతుంది. మన అంతరంగంలో సహనం అనే వృక్షం పెరిగినప్పుడు, బయటి తుఫానులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ గుణం అలవడిన మనిషికి ప్రతి కష్టం ఒక పాఠంగా, ప్రతి ఓటమి ఒక అనుభవంగా కనిపిస్తుంది. సహనం అనేది మన ఆత్మకు ఉండే కవచం వంటిది; అది మనల్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. – కె. భాస్కర్ గుప్తా -
దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ
మన వస్త్రధారణ, సంస్కృతి విదేశీయలును ఎంతగా ఆకట్టుకుట్టుందో పలు ఘటనల్లో చూశాం. వాళ్లు మన సంస్కృతి, వేషధారణని ఇష్టపడి మరి ఇక్కడే ఉండిపోతున్న వాళ్లు ఉన్నారు. ఇంకొందరు మన దుస్తులను ఇష్టపడటమేగాక..వారి ఆహార్యాన్ని కూడా మార్చుకుంటున్నారు. పైగా మనలా నిండుగా కప్పుకునే దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడటం విశేషం. ఇక్కడొక యూఎస్ మహిళ ఆ విషయమే చెబుతూ..ధన్యవాదాలని చెబుతోంది. ఇంతకీ దేనికి ఈ ధన్యవాదాలంటే..భారత సాంప్రదాయ వస్త్రమైన దుపట్టాపై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ కేమి అను అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో భారత ప్రజలారా మీకు చాలా చాలా ధన్యవాదాలు. స్కార్ఫ్ లాంటి దుపట్టాను వారు తమ భుజం లేదా ఛాతీపై కప్పుకుంటారు. అది తన దుస్తులను అక్షరాల పదిరెట్లు మెరుగుపరిచిందంటూ సంబరపడింది. తాను ఈ దుపట్టాను భారతీయులే కనిపెట్టారని నమ్ముతున్నా..ఒకవేల్ల తప్పు అయితే రిచేయండి అని పేర్కొంది కేమి. నెటిజన్లు కూడా అవును మీరు చెప్పింది నిజమే. దీనిని భారతీయులే కనుగొన్నారు. కానీ దక్షిణాసియా అని ఏడుస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్లు భారతదేశంలో భాగమేనని మర్చిపోవడం బాధకరం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by KEMI (@eczema.bread) (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
ఫ్యాటీలివర్తో బీకేర్ఫుల్..!
ఆల్కహాల్తో ఫ్యాటీలివర్ ముప్పు ఉందన్న విషయం తెలిసిందే. అయితే నిత్యం తాగేవారిలోనే ఈ ఫ్యాటీ లివర్ ముప్పు ఎక్కువ అనే అ΄ోహ గతంలో ఉండేది. తాజా తార్కాణాలూ, అనేక అధ్యయనాల ప్రకారం ఎప్పుడో ఒకసారి (అకేషనల్గా) తాగేవారికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు మగవాళ్లకు దీటుగా తాము ఆల్కహాల్కు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ అంటూ పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. సోషల్ డ్రింకింగ్, వీకెండ్ కాక్టెయిల్ పార్టీస్ అంటూనో లేదా ఇంట్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటూ తాగేవారికి సైతం ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం...చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... చాలా కొద్దిమోతాదులో అంటే ప్రతిరోజూ 30 మి.లీ.కు మించకుండా ఆల్కహాల్... అందులోనూ రెడ్వైన్ తీసుకునేవారిలో గుండెజబ్బులు నివారితమవుతాయనీ, రక్తనాళాల్లోని కొవ్వు కొట్టుకు΄ోతుందనీ, అంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే అది ఫ్యాటీలివర్కు దారితీయదనీ... ఇలాంటి అ΄ోహలు ఎక్కువే ఉన్నాయి. అవన్నీ వాస్తవం కాదంటూ ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తాగినా... అది కూడా చాలా అడపాదడపా(అకేషనల్గా) తీసుకున్నప్పటికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే మన దేశంలోని మహిళలూ ఆల్కహాల్కు దగ్గరవుతున్న నేపథ్యంలో వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్యాటీలివర్ అంటే?మన రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి కోసం రక్తంలోని చక్కెర ఉపయోగపడుతుంది. అటు తర్వాత మిగతా చక్కెర కొవ్వురూపంలో కాలేయంలో నిల్వ అవుతుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం కంటే మన రోజువారీ కార్యకలాపాలు తగ్గుతూ పోతున్న కొద్దీ ఈ కొవ్వు నిల్వలు అలా పేరుకుపోతూ ఉండటంతో పాటు కాలేయ కణాలూ కొవ్వు కణాల్లా మారుతూ ఉంటాయి. ఇలా కాలేయ కణాల్లో కొవ్వు మోతాదులు పెరుగుతూ పోవడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. అందులో మొదటిది ఆల్కహాల్ వినియోగం. రెండోది ఆల్కహాల్ కాకుండా ఇతరత్రా అంశాలు ఫ్యాటీలివర్కు కారణం కావడం. ఈ కారణాలను బట్టి ఫ్యాటీలివర్లోని రకాలివి... ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఏఎఫ్ఎల్డీ) : ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయంలో కొవ్వు చేరి ‘ఫ్యాటీలివర్’కు దారితీయడం. నాన్ ఆల్కహాలివ్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) : దీనికి ఆల్కహాలిక్ ప్రధాన కారణం కాదు. అయితే జీవక్రియల తేడా కారణంగా వచ్చే వ్యాధులు (మెటబాలిక్ సిండ్రోమ్స్), స్థూలకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి కారణాల వల్ల ఈ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది.నిర్ధారణ బాధితుల స్థూలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చూసి డాక్టర్లు పరిస్థితిని కొంత తెలుసుకోగలరు. కొన్ని రక్తపరీక్షలు, వాటితోపాటు డయాబెటిస్, కొలెస్ట్రాల్ మోతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నది చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఫ్యాటీలివర్ కండిషన్ బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ (అంటే కాలేయం తాలూకు చిన్న ముక్కను సేకరించి చేసే) పరీక్ష అవసరం. లివర్ బయాప్సీతో ఎన్ఏఎఫ్ఎల్డీలో అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ (ఎన్ఏఎఎఫ్ఎల్) కండిషనా, లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్ష ద్వారా లివర్లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయా, తగ్గాయా కూడా తెలుసుకోవచ్చు. మహిళల్లో మరింత ఎక్కువ ముప్పు ఎందుకంటే... ఆల్కహాలిక్ ఫాటీలివర్ ముప్పు మహిళల్లో మరింత ఎక్కువ. ఎందుకంటే వీళ్లలో పురుషులతో ΄ోలిస్తే వాళ్ల కాలేయం సైజు తక్కువ. అలాగే వాళ్ల ఒంట్లోని నీటి మోతాదులు కూడా తక్కువే. ఇక మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా ఆల్కహాల్ వాళ్ల రక్తంలో చాలా ఎక్కువగా గాఢతతో చాలాసేపు ఉంటుంది. అలా అరుదుగానే అప్పుడప్పుడూ తాగినా ఆ ఇంటర్మిట్టెంట్ ఆల్కహాల్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, కొవ్వులు పేరుకుపోవడంతో పాటు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కూడా పెరుగుతుందని ఈ అంశాలన్నీ మహిళల్లో ఫ్యాటీలివర్ను పెంచడంతోపాటు లివర్ ఫైబ్రోసిస్ ముప్పునూ చాలా ఎక్కువగా పెంచేస్తాయి. అందుకే 20 – 35 ఏళ్లున్న మహిళల్లో వాళ్ల ఆల్కహాల్ తీసుకునే మోతాదు ఎంత తక్కువైనప్పటికీ లివర్ ఫైబ్రోసిస్ రేటు చాలా పెరిగి΄ోతోంది. అందుకే పురుషులూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లలో ΄ోలిస్తే మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ దుష్ప్రభావాలు మహిళల్లో కేవలం కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ల రుతుక్రమం దెబ్బతినడం, హార్మోనల్ బ్యాలెన్స్ అతలా కుతలం కావడం, సంతానలేమి వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు.లక్షణాలు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో పొట్ట బాగా పెరిగిపోతుంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఇలా కొద్దిమేరకు లక్షణాలు కనిపించవచ్చేమోగానీ...నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో చాలావరకు లక్షణాలు కనిపించవు.అయితే కొన్ని అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ను సూచిస్తాయి. ఉదాహరణకు వీళ్లలోనూ పొట్ట బాగా పెరిగి, సెంట్రల్ ఒబేసిటీతో ముందుకు వచ్చి కనిపిస్తుంది. ∙ కొద్దిమందిలో కుడివైపు పొట్ట పైభాగంలో (ఉరఃపంజరం / రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. క్రమంగా కాలేయం పెరుగుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుంది. నివారణ / చికిత్సఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయడం. డైట్ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం. ఇందులో చక్కెర, కొవ్వుల మోతాదులను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, షుగర్–స్వీటెన్డ్ డ్రింక్స్ వంటి కూల్డ్రింక్స్ దూరంగా ఉండటం. అలాగే పొట్టుతో ఉండే ధాన్యాలూ (హోల్గ్రెయిన్స్), తాజా పండ్లు, కూరగాయల వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. వ్యాయామం : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దేహానికి వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని ఇవ్వడం. నివారణ నియమాలు పాటించడంతో పాటు ఫ్యాటీ లివర్ దశను బట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలతోపాటు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు (అల్ట్రా సౌండ్, మెటబాలిక్ మార్కర్ పరీక్షలు) చేయించుకుంటూ ఉండటం. చివరగా... సోషల్ డ్రింకింగ్ లేదా వీకెండ్ పార్టీస్ అంటూ పార్టీ కల్చర్ పేరిట పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దేహానికి అత్యంత కీలకమైన భాగమైన కాలేయంపై పడే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్కు దూరంగా ఉండటం, ఈ అవగాహనను అందరిలోనూ కల్పించడం అన్నది ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతైన అవసరమని గుర్తించాలి. డాక్టర్ పవన్ కె. అడ్డాల, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్నెస్కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్ప్యాక్ శరీరంతో స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్లాస్కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!) -
శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చె΄్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది. అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే ΄ాజిటివ్ యాటిట్యూడ్ నూరి΄ోసినా, ఆ ΄ాజిటివ్ యాటిట్యూడ్తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకు΄ోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. నిర్వహణ: యాసీన్(చదవండి: ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు) -
జైల్ టు జీహాద్!
కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియా నుంచి జీహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీలోకి వెళ్లిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ చివరకు హర్కత్ ఉల్ ముజాహిదీన్లో (హెచ్యూఎం) చేరాడు. హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్– ముజాహిదీన్ గ్రూపుల మధ్య తారస్థాయికి చేరిన విభేదాలను సెటిల్ చేయడానికి 1994లో భారత్ వచ్చి పట్టుబడ్డాడు. అజర్తో పాటు అతడిని విడిపించడానికి ప్రయత్నించిన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, శ్రీనగర్లో చిక్కిన మరో ఉగ్రవాది అహ్మద్ జర్గర్... ముగ్గురూ ఢిల్లీలోని తీహార్ జైలుకు చేరారు. అక్కడే వీరికి కిడ్నాపింగ్ గ్యాంగ్ నిర్వాహకుడు ఆఫ్తాబ్ అన్సారీతో పరిచయం ఏర్పడింది. ఇదే పార్థప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్కు కారణమైంది. ఇతడి కుటుంబీకుల నుంచి వసూలు చేసిన మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరాయి. అదెలాగంటే?ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఆఫ్తాబ్ అన్సారీ ముంబైలో ఉంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన నేరగాళ్లతో ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకునే అన్సారీ కిడ్నాప్లు, స్మగ్లింగ్ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా బతికేవాడు. ప్రస్తుతం అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని సైతం అన్సారీ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పుడప్పుడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న గౌతమ్ అదానీ 1998 జనవరిలో తన స్నేహితుడు శాంతిలాల్ పటేల్తో కలిసి అహ్మదాబాద్లోని కర్ణావతి క్లబ్ నుంచి బయటకు వస్తుండగా, అన్సారీ ఆదేశాల మేరకు అక్కడే కాపు కాసిన అతడి అనుచరులు ఫజల్ ఉర్ రెహ్మాన్, భోగీలాల్ దర్జీ తుపాకీతో బెదిరించి కారులో అపహరించారు. వారి విడుదల కోసం రూ.15 కోట్లు డిమాండ్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అదే రోజు సాయంత్రం అదానీ, పటేల్ ఇరువురూ విడుదలయ్యారు. ఇలాంటి ఎన్నో నేరాలు చేసిన అన్సారీ అప్పటి వరకు ఓ నేరగాడు మాత్రమే. కోల్కతాకు చెందిన ఆసిఫ్ రజా ఖాన్... అన్సారీ గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించేవాడు. ఓ కేసులో ఢిల్లీ పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేయడంతో తీహార్ జైలుకు చేరారు. ఆ జైలు అధికారులు అజర్, ఒమర్లతో పాటు అన్సారీ, ఆసిఫ్లను ఒకే హై సెక్యూరిటీ ప్రిజన్లో ఉంచారు. అన్సారీ గ్యాంగ్, అతడి కార్యకలాపాలు తెలుసుకున్న ఆ ఉగ్రద్వయం అతడితో పాటు ఆసిఫ్కు బ్రెయిన్ వాష్ చేసి, ఇకపై జీహాద్ కోసం నేరాలు చేసేలా ప్రేరేపించింది. ప్రతి నేరం నుంచి కొంత మొత్తం జీహాదీ కార్యకలాపాలకు విరాళం ఇచ్చేలా వారిని ఒప్పించింది. ఇదిలా ఉండగా, ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 814 విమానం 1999 డిసెంబర్ 24న నేపాల్ రాజధాని కఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తూ హైజాక్ అయింది. ఇది తమ పనేనంటూ పాకిస్తాన్కు చెందిన హర్కతుల్ ముజాహిదీన్ ప్రకటించుకున్నా, కేవలం అజర్ కుటుంబీకులు, ఐఎస్ఐ మద్దతుతో చేశారని నిఘా వర్గాలు చెప్పుకున్నాయి. అఫ్గానిస్తాన్లోని కాందహార్ విమానాశ్రయంలో ఈ విమానాన్ని నిలిపిన ఉగ్రవాదులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, వారం రోజుల తర్వాత అజర్, జర్గర్, ఒమర్లను విడుదల చేయించారు. తనను విడిపించడంలో హర్కతుల్ ముజాహిదీన్ స్పందన నచ్చని అజర్ తానే సొంతంగా జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు.పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అజర్... అల్ కాయిదాలో చేరిన ఒమర్... అక్కడ ఉన్న అన్సారీ, అసిఫ్లతో సంబంధాలు కొనసాగించారు. అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఇక్కడ పలు నేరాలు చేయించారు. అందులో ఒకటే ఖాదిమ్స్ సంస్థ యజమాని, అప్పట్లో దానికి వైస్ చైర్మన్గా ఉన్న పార్థ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్. అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేయాలని నిర్ణయించుకున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ దానికి అవసరమైన నిధులు సమీకరించే బాధ్యతలు అనేక మందికి అప్పగించాడు. ఆ ఫండ్ రైజర్స్లో ఒమర్ కూడా ఒకడు కావడంతో అన్సారీ, ఆసిఫ్ తెరపైకి వచ్చారు. అమెరికాలో భారీ ఆపరేషన్ చేయనున్నామని, అందుకు విరాళం కావాలంటూ ఒమర్ ఇచ్చిన ఆదేశాలతో అన్సారీ, ఆసిఫ్లు 2001 జూలై 25న బర్మన్ను కిడ్నాప్ చేశారు. అప్పటికే దుబాయ్కి మకాం మార్చేసిన ఆఫ్తాబ్ అక్కడ నుంచే ఆసిఫ్ గ్యాంగ్తో కథ నడిపించాడు. బర్మన్ కోల్కతాలోని తిల్జాలాలో ఉన్న తన కంపెనీ గోదాముకు వెళ్తుండగా ఆసిఫ్ గ్యాంగ్ అపహరించింది. అతడిని విడుదల చేయడానికి రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.3.75 కోట్లకు బేరం కుదిరింది. ఈ మొత్తం హవాలా ద్వారా హైదరాబాద్ చేరింది. ఇక్కడ నుంచి రూ.కోటి దుబాయ్ వెళ్లగా, మిగిలిన మొత్తం కోల్కతా చేరింది. దుబాయ్ వెళ్లిన రూ.కోటి అక్కడ నుంచి బెల్జియం మీదుగా అమెరికాలో ఉన్న అల్ కాయిదా అనుచరులకు అందింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై 2001 సెప్టెంబర్ 11న జరిగిన ‘9/11 ఎటాక్స్’కు ఈ నగదు కూడా వినియోగించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేన్ (ఎఫ్బీఐ) విచారణలో తేలింది. ఈ కారణంగానే బర్నన్ కిడ్నాప్ కేసులో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కూడా సాక్షిగా ఉన్నాడు. ఐఎంగా ఏఆర్సీఎఫ్!(ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పూర్తిగా ఉగ్రవాద బాటపట్టిన ఆసిఫ్ రజా ఖాన్ 2002లో కోల్కతాలో ఉన్న అమెరికన్ కల్చరల్ సెంటర్పై దాడి చేశాడు. ఆపై రాజ్కోట్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. దీనికి ప్రతీకారంగా ఆసిఫ్ సోదరుడు అమీర్ రజా ఖాన్ ఏర్పాటు చేసిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. అదెలా..? దీని ఘాతుకాలు ఏంటి? పార్ట్–3లో...) -
ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు
ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్ మ్యూకోజల్) కేన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్జే గ్లోబల్ హెల్త్’ జర్నల్ ప్రచురించింది. ఆ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ 1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..) -
సువ్రతుడి వృత్తాంతం
శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు. అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు. అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, ‘మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి’ అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు. రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు. తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. ‘ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు. నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే’ అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. ‘మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి’ అని మాఘపురాణం చెబుతోంది. మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి’ అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.∙సాంఖ్యాయన -
రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..
కొన్ని తలరాతలు దేవుడి అత్యంత నాటకీయం రాస్తాడని అంటుంటారు పెద్దలు. అబ్బాం ఇదేం చిత్రం అనేలా జీవితాన్ని ముగించేస్తాడు. అలాంటి కథ ఈ వ్యక్తిది. ఓ నిజాయితీపరుడు..ఏళ్ల తరబడి చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించిన కథ ఇది. పోనీ అదేమంత పెద్ద అవినీతి కేసు.. అంటే అదీ కాదు. కానీ అన్నేళ్లు ఆశతో తాను నిర్దోషిని అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నం ఎవ్వరినైనా కదలిస్తుంది. అతడు నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి, ఆశావాదానికి ప్రతీక. ఈ కథ చిన్న చిన్న కష్టాలకు హైరాన పడేవాళ్లకు ఓ స్ఫూర్తి. అలాగే ఆశావాదంగా బతకడం ఎలాగో నేర్పిస్తుంది కూడా.ఆ వ్యక్తి కథ హాలీవుడ్ మూవీ ‘ది షాషాంక్ రిడెంప్షన్’ని తలపించే గాథ. అందులో ఓ నిర్దోషి ఎలా అయితే చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడో అలానే గుజరాత్కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి చాలాకాలంపాటు శిక్షను అనుభవించాడు. మొత్తం జీవితం అంతా జైలులోనే గడిపాడు ప్రజాపతి. ఇంతకీ అతడిపై మోపబడిన నేరం ఏంటంటే..రూ. 20ల లంచం కేసులో ఏకంగా 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సింపుల్గా చెప్పాలంటే 1994 నాటి హాలీవుడ్ చిత్రం లాంటిది అతడి కథ. అసలేం జరిగిందంటే..1996లో పోలీస్ కానిస్టేబుల్ బాబూభాయ ప్రజాపతి అహ్మదాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు రూ. 20ల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఆరోపణలు చేశారు. 1997లో సెషన్స్ కోర్టులో ఆయనపై చార్జిషీట్ దాఖలు చేశారు. 2002లో అభియోగాలు మోపారు. 2003లో సాక్షుల విచారణ ప్రారంభమైంది. 2004లో సెషన్స్ కోర్టు ప్రజాపతికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 3,000/- జరిమానా విధించింది. ప్రజాపతి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత, ఆయన అప్పీల్ 22 ఏళ్ల పాటు పెండింగ్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆయన నిర్దోషి కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. అంతేగాదు హైకోర్టు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల్లో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయని, అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఇక ప్రజాపతి తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ, ఈ కేసు మొత్తం అనుమానంతో చేసిన ఆరోపణలే తప్ప వాస్తవం లేదని కోర్టుకి నివేదించారు. కాగా, హైకోర్టు ఎప్పుడైతే ప్రజాపతిని నిర్దోషిగా పేర్కొందే..తతక్షణమే ఆయన భావోద్వేగంగా విడుదలైనందుకు ఆనందంగా ఉంది, ఇక ఇప్పుడు హాయిగా చనిపోయినా పర్లేదని అన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. అయితే న్యాయవాది గాంధీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రజాపతికి సూచించారు. ఆ మరుసటి రోజు ఆ విషయమై ఆయనకు ఫోన్ చేయగా, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్పారని న్యాయవాది గాందీ తెలిపారు. ఇన్నేళ్లు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాడానికి పోరాడిని విధానం అసామాన్యమైనది. చివరికీ..తన నిజాయితీ నిరూపించుకుని మరీ కన్నుమూశాడు. అదీకూడా ఆయన నోటి నుంచి వెలువడినట్లుగానే జరిపోవడం బాధకరం. ఇన్నేళ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ పోరాడాడు..కనీసం కోన్నాళ్లు బతికి ఉన్నా బాగుండేదే అని అతడి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆవేదనగా అన్నారు. (చదవండి: ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!) -
ఈ వారం కథ: బూడిద రంగు ఆకాశం
బ్రూనో తన ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ మీద కన్పిస్తున్న బొమ్మల వైపు నిశితంగా చూసింది. ఓ వైపు గులాబీ పువ్వుంది. మరోవైపు రత్నాలహారం... తను సరైన బొమ్మను ఎన్నుకుంటే బనానా మిల్క్షేక్ బహుమతిగా లభిస్తుందని తెలుసు. పొరపాటు చేస్తే శిక్ష తప్పదని కూడా తెలుసు.బ్రూనో తన కుడిచేతిని ముందుకు చాపి పొడవాటివేలితో హారం వైపు చూపించింది. గత రెండు వారాలుగా హారంవైపు చూపించిన ప్రతిసారీ దానికి తీయటి మిల్క్షేక్ లభించిన విషయం గుర్తుంది. కాని, ఒక్కసారిగా కంటెయినర్లో అంధకారం అలముకుంది. బ్రూనోకు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఐదు నిమిషాలు చీకటిలో మగ్గాక లైట్ వెలిగింది. మరోసారి బ్రూనో ముందు కంప్యూటర్ స్క్రీన్ ఉంచబడింది. బ్రూనో మళ్ళా హారం వైపు చూపించింది. దాన్ని ఉంచిన కంటెయినర్ లోపలున్న బల్బ్ వెంటనే ఆరిపోయింది. ఆరుసార్లు ప్రయత్నించినా బ్రూనో తప్పు చేస్తూనే ఉంది. నిన్నటి వరకు హారం సరైన సమాధానమే అయినా ఈరోజు అది మారిపోయిందన్న విషయం దాని మెదడు గ్రహించలేకపోతోంది.అది జతకడుతున్న ఆడకోతి లిల్లీతో అదే ప్రయోగాన్ని చేశాను. నిన్నటి వరకు లిల్లీ హారం బొమ్మ వైపు చూపిస్తే దానికి అరటిపళ్ళు బహుమతిగా ఇచ్చాను. ఈరోజు మొదట అది హారంబొమ్మ చూపించింది. వెంటనే కంటెయినర్లో లైట్ తీసేసి, చీకటి చేశాను. ఐదు నిమిషాల తర్వాత మళ్ళా స్క్రీన్ చూపిస్తే అది గులాబీపువ్వుని చూపించింది. మరో రెండు కోతులు కూడా మొదట హారాన్ని చూపించి, దాని వల్ల శిక్షిస్తారని అర్థమై, రెండోసారి గులాబీపువ్వు వైపు చూపించాయి.బహుమతినందించే బొమ్మలో మార్పు జరిగిందన్న విషయం వీటికి అర్థమైనట్టు బ్రూనోకి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలుసు. అందుక్కారణం నెలరోజుల క్రితం దాని మెదళ్ళోని ఓ భాగంలోకి ఇంజెక్ట్ చేసిన టాక్సిన్. దానివల్ల అక్కడి టిష్యూలు దెబ్బతిని ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ముప్పయిరెండు కోతుల్లోకెల్లా బ్రూనో చాలా తెలివైన మగ కోతి. నేను న్యూరో సైంటిస్టుగా ఇక్కడ ఉద్యోగంలో చేరేనాటికి దీని వయసు నాలుగు నెలలు. ఎంత అల్లరి చేసేదో.. ఎంత చురుగ్గా ఉండేదో.. ప్రయోగాలకు అవసరమైన కోతుల్ని ప్రయోగశాలలోనే పెంచుతారు. నాలుగడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల పొడవున్న విశాలమైన బోన్లలో కోతుల జంటతో పాటు వాటికి పుట్టిన పిల్లల్ని కూడా ఉంచుతారు. అవి ఆడుకోడానికి కంటెయినర్లోనే అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి.ఏడాది వయసు దాటేవరకు బ్రూనో వాళ్ళమ్మను అంటిపెట్టుకునే ఉండేది. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించసాగింది. నేను ల్యాబ్లోకి ప్రవేశిస్తుంటే నావైపు చాలా ఆసక్తిగా చూసేది. దాని కళ్ళలో మెరుపు కన్పించేది. ఆ కళ్ళు పలకరింపుగా నవ్వుతున్నాయేమో అన్పించేది. దానికిపుడు నాలుగేళ్ళు. ఈమధ్య నన్ను చూడగానే బ్రూనో సంతోషం ఆపుకోలేక గెంతుతోంది. దవడలను ముందుకు చాపి, పెదవులను పైకి లాగి, పళ్ళన్నీ కన్పించేలా అదో రకంగా నవ్వుతోంది కూడా. నేను మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటుంది. మెమొరీ పరీక్షల్లో, పజిల్స్లో చాలా చురుగ్గా పాల్గొంటుంది.ఈ ప్రయోగశాలలో పార్కిన్సన్స్కి, ఏడీహెచ్డీకి, ఆటిజం డిజార్డర్కి సరైన మందులు కనుక్కోవడం కోసం కోతులమీద నాడీసంబంధిత ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న కోతులన్నీ రీసస్ మకాక్ జాతికి చెందినవే. రక్తంలోని ఆర్హెచ్ ఫ్యాక్టర్ గురించి తెల్సుకోవడంలో, రేబిస్, పోలియో, మశూచి వంటి జబ్బులకు టీకాలు కనుక్కోవడంలో శాస్త్రవేత్తలకు సహకరించింది ఈ కోతులే. మానవుల డీఎన్ఏ సీక్వెన్స్తో పోలిస్తే వీటి డీఎన్ఏ తొంభై మూడు శాతం వరకు ఒకేలా ఉండటం వల్ల వీటిని ప్రయోగశాలల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.నేను స్వతహాగా జంతు ప్రేమికురాలిని. అందుకే జంతువుల మీద జరిపే ప్రయోగాలకు విరోధిని. మనుషులకొచ్చే రోగాలకు మందుల్ని కనుక్కోవడం కోసం నోరులేని జంతువుల్ని హింసించడం దారుణం కదా. జంతువుల శరీరాల్లోకి రకరకాల మందుల్ని పంపించడంవల్ల ఎన్ని దుష్పరిణామాలు ఏర్పడతాయో... ఇలా ప్రతియేటా కొన్ని వేల లక్షల ఎలుకలు, గినీ పిగ్స్, కుందేళ్ళు, పందులు, కోతుల్ని బలివ్వడం రాక్షసత్వం కాక మరేమిటి?ఈ ప్రయోగశాలలో కూడా కోతులు హింసకు గురవుతున్నాయి. అయినా మనసుని రాయి చేసుకుని నేనిక్కడ ఉద్యోగంలో చేరడానికి ముఖ్య కారణం స్వార్థమే... కాదనను. కాని, నాకు మరో గత్యంతరం లేదు. నేను చార్జ్ తీసుకున్నాక ఇంతకుముందు అనుసరిస్తున్న పద్ధతుల్లో చాలా మార్పులు తీసుకు వచ్చాను. తప్పు చేస్తే, ఇంతక్రితం కోతి శరీరానికి మైల్డ్ కరెంట్ షాక్ ఇచ్చేవారు. నేను కంటెయినర్లో లైట్లు ఆర్పేసి చీకటి చేసే పద్ధతిని ప్రవేశపెట్టాను. కోతులు చీకటిలో అసహనానికి లోనవుతాయి. వాటికి ఆపరేషన్లు చేయడానికి వాడే థియేటర్ని శానిటైజ్డ్ కండిషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆపరేషన్ తర్వాత గాయాలు ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోడానికి అనుభవజ్ఞులైన ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను ఏర్పాటు చేయించాను.పార్కిన్సన్స్, ఏడీహెచ్డీ, ఆటిజం డిజార్డర్ల గురించి తెల్సుకోవాలంటే మెదళ్లోని ఏ భాగం రోగగ్రస్థం కావడం వల్ల ఆ జబ్బులు సోకుతున్నాయో తెల్సుకోవడం అవసరం. బ్రూనో మెదడు మీద జరుగుతున్న ప్రయోగాల ఉద్దేశం అదే. ఏడాది క్రితం బ్రూనో మెదడుకి శస్త్రచికిత్స జరిగింది. మొదట బ్రూనో తలమీదున్న జుట్టుని షేవ్ చేశారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి, మత్తుమందు ఇచ్చారు. పుర్రెలో ఎనిమిది చోట్ల చిన్నచిన్న రంధ్రాలు చేసి, వాటిలోకి సన్నటి మెటల్ గొట్టాల్ని చొప్పించారు. ఒక ట్యూబ్ ద్వారా నీడిల్ని పంపించి, గులాబీ బూడిద రంగులో ఉండే గ్రేమేటర్లోకి తక్కువ మోతాదులో టాక్సిన్ని ఇంజెక్ట్ చేశారు. దాని ప్రభావం వల్ల మెదళ్లోని ఆ భాగం చెడిపోయి పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత బ్రూనో ప్రవర్తనలో కలిగే మార్పుల్ని పరిశీలించి రికార్డ్ చేయడం జరుగుతుంది.దానివల్ల పార్కిన్సన్స్ లేదా ఏడీహెచ్డీ లేదా ఆటిజం లక్షణాలు ఏర్పడకపోతే, మరో భాగంలోకి టాక్సిన్ను ఇంజెక్ట్ చేసి, మళ్ళా దాని స్వభావంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తారు. పుర్రెలో చేసిన ఎనిమిది రంధ్రాల్ని వినియోగించుకున్నాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే, ఆ కోతిని మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చంపేసి, లోతైన గుంట తవ్వి పూడ్చిపెట్టేస్తారు. బ్రూనోలో నేను ఆశిస్తున్న ఫలితం రాకపోవడంతో, వారం తర్వాత మెదళ్ళోని మరో భాగంలోకి టాక్సిన్ని పంపించి, నెలరోజుల వరకు దాని ప్రవర్తనని గమనించాను. ఫలితం సంతృప్తికరంగా లేకపోవడంతో మరో భాగంలో టాక్సిన్ని ఇంజెక్ట్ చేశాను.మెదళ్లో ఎనిమిదిచోట్ల ఉన్న టిష్యూలని నాశనం చేశాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే? నాకెందుకో చప్పున భయమేసింది. బ్రూనోని కూడా చంపేస్తారు. ఆ ఆలోచనకే వొళ్ళు జలదరించింది. చప్పున కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.∙∙ ఇంటికి చేరుకునేటప్పటికి రాత్రి ఎనిమిదైంది.నాన్నకు రోజూ రాత్రి ఏడింటి లోపలే భోజనం చేయడం అలవాటు. ఆయన సోఫాలో కూచుని టీవీలో వార్తలు వింటున్నాడు. అమ్మ నేనొచ్చే వరకు భోజనం చేయదు.బెడ్రూంలోంచి తుషార్ అరుపులు పెద్దపెద్దగా విన్పిస్తున్నాయి.‘‘వాడేం చేస్తున్నాడు లోపల? అన్నం తిన్నాడా?’’ బెడ్రూం వైపు నడుస్తూనే అడిగాను.‘‘వెళ్ళి చూడు. నీకే తెలుస్తుంది. భోజనానికి రెండుసార్లు పిలిచినా రాలేదు’’ అంది అమ్మ.జారవేసి ఉన్న తలుపుని తోసుకుని లోపలికి వెళ్ళాను.ట్రాంపోలీన్ మీద ఎగిరినట్టు మంచంమీద వేసి ఉన్న డన్లప్ పరుపుమీద తుషార్ గెంతుతూ అరుస్తున్నాడు.వాడు నావైపు ఓసారి అభావంగా చూసి, మళ్ళా పెద్దగా కేకలుపెడుతూ గెంతడంలో నిమగ్నమై పోయాడు. ఉదయం బైటికెళ్ళిన అమ్మ రాత్రి ఎనిమిదింటికి తిరిగొస్తే ఏ పిల్లాడైనా సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మను కౌగిలించుకుంటాడు కదా. నాకా అదృష్టం లేదు.‘‘ఇక చాల్లే నాన్నా. ఆపు. ఆకలి వేయడం లేదా? నాకైతే చాలా ఆకలేస్తోంది. అన్నం తిందాం రా’’ గోముగా అన్నాను.వాడు నా మాటల్ని పట్టించుకోలేదు.మంచాన్ని సమీపించి, వాడి చేయి పట్టుకుని ఆపుతూ ‘‘పడిపోతావు నాన్నా... కిందికి దిగు’’ అన్నాను.వాడు కోపంతో వూగిపోయాడు. ఒక్క దూకు దూకి హాల్లోకి పరుగెత్తాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాడి పింగాణీ ప్లేట్ని కిందికి విసిరికొట్టాడు. అది శబ్దం చేస్తూ ముక్కలుగా పగిలిపోయింది. వాటర్ జగ్ని కింద పడేశాడు. నీళ్ళునింపి ఉన్న గాజుగ్లాసుని కూడా విసిరి కొట్టబోతున్న సమయంలో వేగంగా కదిలి, వాడిని గట్టిగా హత్తుకున్నాను. వాడు కొన్ని నిమిషాలు పెనుగులాడాడు. కోపం తగ్గకపో వడంతో రెండు చేతుల్తో గిచ్చాడు. నా చేతిమీద కొరికాడు. భరించాను.కొన్ని నిమిషాల తర్వాత వాడు శాంతించాడు. అమ్మ హాల్ని శుభ్రం చేశాక ముగ్గురం భోజనాలు చేశాం. తుషార్ బెడ్రూంలోకెళ్ళి ఆడుకోసాగాడు.‘‘ఎందుకు తల్లీ ఈ రోజు చాలా అలజడిగా కన్పిస్తున్నావు?’’ అని అడిగాడు నాన్న. ఆయన గొంతులో ధ్వనించిన వాత్సల్యానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.‘‘ఏం లేదు నాన్నా’’ అన్నాను.‘‘తుషార్ చేస్తున్న పనిని ఆపినా, అడ్డుకున్నా. వద్దని చెప్పినా వాడు వయొలెంట్గా ప్రవర్తిస్తాడని, ఎదుటి వ్యక్తులకు హాని చేయడమో లేకపోతే తనకు తాను హాని చేసుకోవడమో చేస్తాడని మాకు చెప్తూ ఉంటావుగా. ఈరోజు నువ్వు వాడి ట్యాన్ట్రమ్స్కి కారణమైనావంటేనే తెలుస్తోంది నీ మనసులో ఏదో అలజడి ఉందని. నీ మెదణ్ణి తొలుస్తున్నదేమిటో చెప్పు’’ అన్నాడు.వెళ్ళి నాన్న పక్కనున్న కుర్చీలో కూచున్నాను.‘‘నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏమిటో వూహించగలను తల్లీ. డ్రగ్ టెస్టుల కోసం జంతువుల్ని వాడుకోవడం నీకు నచ్చదు. ప్రయోగాల పేరుతో వాటి మీద జరిగే హింసకు నువ్వు పూర్తి వ్యతిరేకివి. కాని, గత నాలుగేళ్ళుగా నువ్వు పనిచేస్తున్న ల్యాబొరేటరీలో నీ కళ్ళముందే కోతుల్ని హింసకు గురిచేస్తుంటే చూస్తూ తట్టుకోలేకుండా ఉన్నావు’’ అన్నాడు నాన్న.నేను మానసికంగా పడ్తున్న హింసని నాన్న ఎంత బాగా అర్థం చేసుకున్నాడో... మనం పడే మూగవేదన ఆత్మీయులకు తెలిసినట్టు వేరేవాళ్ళకి తెలియదు కదా.‘‘అవున్నాన్నా. నా స్వభావానికి విరుద్ధమైన పని చేస్తున్నాను కదా. అందుకే ఒత్తిడికి లోనవుతున్నా’’ అన్నాను.‘‘మానవాళి ఎదుర్కొంటున్న భయంకరమైన రోగాలకు మందులు కనిపెట్టాలంటే కొన్ని జంతువుల ప్రాణాల్ని బలివ్వక తప్పదు కదమ్మా’’ అన్నాడు నాన్న.‘‘తుషార్కి ఏడీహెచ్డీ సమస్య లేకపోతే, నేనా ల్యాబ్లో చేరేదాన్ని కాదు నాన్నా. పార్కిన్సన్స్, ఏడీహెచ్డీ, ఆటిజం డిజార్డర్లను పూర్తిగా నయంచేసే మందులకోసం చేస్తున్న ప్రయోగాలు కాబట్టి వాటిల్లో భాగస్వామిని కాక తప్పలేదు. తల్లిని కదా. ఏదో ఆశ... ఏడీహెచ్డీకి మందు కనుక్కోగలిగితే నా కొడుకుతో పాటు ఆ జబ్బుతో బాధపడుతున్న లక్షలమంది పిల్లలకు, ఆ భారాన్ని మోస్తున్న వాళ్ళ తల్లులకు ఉపశమనం లభిస్తుందన్న ఆశ.’’‘‘జంతువులమీద పరీక్షలు జరపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు రకరకాల ప్రత్యామ్నాయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయని విన్నానమ్మా. సెల్ కల్చర్స్, ఆర్గాన్స్ ఆన్ చిప్స్... ఇవే కాకుండా కంప్యూటర్ మోడలింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుకోవచ్చట కదా’’ అన్నాడు‘‘నిజమే నాన్నా. మిగతా అవయవాలకు వచ్చే జబ్బుల విషయంలో ఆర్గాన్స్ ఆన్ చిప్స్, సెల్ కల్చర్ లాంటివి బాగా ఉపయోగపడ్తాయి. కాని, మెదడుకి సంబంధించిన రుగ్మతల విషయంలో వాటి ప్రయోజనం చాలా పరిమితం నాన్నా.’’‘‘ఎందుకలా? నాకర్థమయ్యేలా చెప్పు’’ అన్నాడు.‘‘విశ్వాంతరాళంలో ఉన్న మనకు అర్థంకాని అనేకానేక రహస్యాల్లానే మెదళ్లోని సంక్లిష్టతలు మానవమేధకు పూర్తిగా అందడం లేదు నాన్నా. ఆకాశంలో కనిపించే కోటానుకోట్ల నక్షత్రాల్లా సూది మొనంత గ్రే మేటర్, వైట్ మేటర్లలో కోటానుకోట్ల న్యూరాన్లు అల్లుకుని ఉంటాయి. మెదళ్లోని ఒక క్యూబిక్ మిల్లీమీటర్ టిష్యూని శాస్త్రవేత్తలు స్కాన్ చేసే ప్రయత్నం చేశారు. దాని పూర్తి నిర్మాణాన్ని ఒడిసి పట్టుకోడానికి 1.4 పెటాబైట్స్ అంత డేటా అవసరమైంది. అర్థమయ్యేలా చెప్పాలంటే అధిక నిడివి గల పధ్నాలుగు వేల సినిమాల సమాచారాన్ని ఇసుకరేణువులో నిక్షిప్తం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే మెదడు సంబంధిత రుగ్మతల్ని నయం చేయడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది’’ అన్నాను.‘‘పార్కిన్సన్స్కి, ఏడీహెచ్డీకి కొన్ని మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కదమ్మా. మరి మీ ల్యాబ్లో చేస్తున్న ప్రయోగాలేమిటి?’’ ‘‘అవున్నాన్నా. కొన్ని మందులున్నాయి. వాటివల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది తప్ప పూర్తిగా నయంచేసే మందులు లేవు. మెదళ్లోని న్యూరోట్రాన్స్మీటర్లలో సమతుల్యత లోపించడం వల్ల ఈ రుగ్మతలు ఏర్పడతాయి. కొన్నిచోట్ల మెదడు టిష్యూలు దెబ్బతినడం కూడా కారణం కావొచ్చు. మొదట అవి ఏ ప్రాంతంలో దెబ్బతినడం వల్ల ఈ జబ్బులు ఏర్పడుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. మేము చేస్తున్న పని అదే. దెబ్బతిన్న మెదడు కణాల్ని పునరుజ్జీవింపచేసే పరిజ్ఞానంలో శాస్త్రవేత్తలు వేగంగా అడుగులు కదుపుతున్నారు. తొందర్లోనే విజయం సాధిస్తారన్న నమ్మకం ఉంది. అప్పుడు ఇటువంటి న్యూరొలాజికల్ డిజార్డర్స్ను పూర్తిగా నయం చేయవచ్చు’’ అన్నాను.బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాను. బాగా డస్సిపోయిన భావన... శారీరక శ్రమ ఎక్కువ కావడం వల్ల కాదు, మానసికంగా కుంగుబాటువల్ల కలుగుతున్న అలసట.తుషార్ మంచం చుట్టూ పరుగెత్తుతూ చేతిలో ఉన్న స్కేల్తో వార్డ్రోబ్స్ మీద, తలుపు మీద దబదబా బాదుతూ శబ్దం చేస్తున్నాడు.ఎంత అందమైన జీవితాన్ని వూహించుకున్నానో... పీజీలో రాహుల్తో ఏర్పడిన పరిచయం కొన్ని నెలల వ్యవధిలోనే ప్రేమగా మారింది. రాహుల్ ఓ ప్రైవేట్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేసేవాడు. నా ఎకౌంట్ అదే బ్యాంకులో ఉండటంతో, పనిమీద వెళ్ళిన ప్రతిసారీ రాహుల్ నవ్వు ఆత్మీయంగా పలకరించేది. ఎంత అందమైన నవ్వో... మెస్మరైజింగ్ స్మయిల్... నాకు శ్రమ లేకుండా అన్ని పనులు చేసిపెట్టేవాడు. నేనంటే అతనికి ఎంతిష్టమో అర్థమవడంతో నేను కూడా ఇష్టపడసాగాను. అందగాడు, మంచి మనసు ఉన్నవాడు, ప్రేమిస్తున్నవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు ... ఇంతకన్నా ఏ ఆడపిల్లయినా ఏం కోరుకుంటుంది? పీజీ పూర్తయిన రెండేళ్ళ తర్వాత రాహుల్తో నా పెళ్ళి జరిగింది.ఎన్ని మధురమైన అనుభవాలో... ఎన్ని తీయటి అనుభూతులో... స్వర్గం అంటే ఇదే కదా అనిపించేది. వసంతం తాకిన వనంలా విరబూసి, మంజుల వీణానిక్వణంలా రవళించి, మకరందం గ్రోలిన మధుపంలా మత్తిలి... జీవితం నిండా ఎన్ని రంగులో... వేనవేల హరివిల్లులు విరిసినట్టు...తుషార్ పుట్టాక జీవితం మరింత శోభాయమానంగా కనిపించసాగింది.కాని, జీవితంలో సంతోషాల జీవితకాలం తక్కువని తొందర్లోనే తెలిసొచ్చింది.రాహుల్కి అదే బ్యాంకులో పనిచేసే హర్షితతో సన్నిహిత సంబంధం ఉందని తెలిసిన రోజు పెద్ద గొడవైంది.‘మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదు. ఉత్త పుకారు’ అంటాడనుకుని ఆశపడ్డాను. ఒకవేళ నిజంగానే ఉన్నా, ‘తప్పు చేశాను. క్షమించు. ఇంకెప్పుడూ అటువంటి పొరపాటు చేయను’ అంటూ పశ్చాత్తాప పడతాడనుకున్నాను. సిగ్గులేకుండా ‘అవును. తనంటే నాకిష్టం. హర్షితతో శారీరక సంబంధం ఉన్నమాట వాస్తవమే. అయితే ఏమైంది? నీకేమీ తక్కువ చేయడం లేదు కదా. నిన్నొదిలేసి ఆ అమ్మాయిని చేసుకునే ఉద్దేశం ఏమీ లేదు. జస్ట్ ఫర్ ఫన్. అంతే. దానికింత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదు’ అన్నాడు.‘ప్రేమించానని కదా వెంటపడ్డావు. నీ ప్రేమ నిజమైందని నమ్మి కదా పెళ్ళి చేసుకున్నాను. ఇలా చేయడం నమ్మక ద్రోహం కాదా?’ అని అడిగాను.‘ఇప్పటికీ నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సౌమ్యా. హర్షితమీద నాకున్నది ప్రేమ కాదు. లస్ట్. అంతే. ఆ అమ్మాయికి మరో మూడేళ్ళలో పెళ్ళవుతుంది. అప్పుడు తనెవరో, నేనెవరో! అది టెంపరరీ బంధం. మనది శాశ్వత బంధం డియర్’ అంటూ నవ్వాడు.మొన్నటి వరకు మెస్మరైజింగ్గా కనిపించిన నవ్వు ఇప్పుడు మాయలమరాఠీ నవ్వులా వెగటుగా అనిపించింది.‘నేను కూడా కాపురం నీతో చేస్తూ సెక్స్ కోసం మరో మగాడితో సంబంధం పెట్టుకుంటే ఒప్పుకుంటావా?’ అన్నాను.నా చెంప పగిలేలా కొట్టి, విసురుగా గదిలోంచి బైటికెళ్ళిపోయాడు.ఇరు కుటుంబాల పెద్దలతో పంచాయతీ జరిగింది.‘నిన్ను వదుల్తాననడం లేదు కదా. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదంటున్నాడుగా. కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకు పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటావు’ అంటూ సలహాలిచ్చే వాళ్ళే అందరూ.ఆ సమయంలో నాకు సపోర్ట్గా నిలబడింది మా అమ్మ.విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించాను.నాకు విడాకులు మంజూరయ్యే నాటికి తుషార్కి మూడేళ్ళు...వాడికి ఏడాది వయసున్నప్పటి నుంచి రాహుల్తో మొదలైన గొడవలు, విడాకుల కోసం కోర్టుల చుట్టూ చేసిన ప్రదక్షిణలు, పడిన పాట్లు, పర్యవసానంగా అనుభవించిన మానసిక హింస... వీటివల్ల నేను తుషార్ని సరిగ్గా పట్టించుకోలేదనేది వాస్తవం. వాడి ఆలనాపాలనా అన్నీ అమ్మే చూసుకునేది.రాహుల్తో విడిపోయాక, ప్రశాంతత చిక్కడంతో తుషార్ని దగ్గరకు తీసుకునే అవకాశం దొరికింది. అప్పుడు గమనించాను వాడి స్వభావంలో ఉన్న వైపరీత్యాల్ని. ఒకచోట కుదురుగా కూర్చోడు. హైపర్ యాక్టివ్... మామూలుగా ఆ వయసు పిల్లలు చేసే అల్లరి గురించి నాకు అవగాహన ఉంది. కాని, తుషార్ చేసే అల్లరి దానికి రెట్టింపు స్థాయిలో ఉంటోంది. ఏమైనా చెప్తుంటే అస్సలు వినడు. చెప్పిన పని చేయడు. పిల్లలతో కలిసి ఆడుకోడు. ఆడే ఆటలో నిమిషాల్లోనే ఆసక్తిని కోల్పోయి మరో ఆట మొదలెడ్తాడు. ఇంపల్సివ్గా పనులు చేస్తాడు తప్ప వాటి పర్యవసానాల గురించి ఆలోచించడు. వాడిని నిద్ర పుచ్చడం పెద్ద సమస్య. నిద్ర పట్టినా చాలాసార్లు మధ్యమధ్యలో లేచి కూచుంటాడు. విపరీతమైన అసహనం, కోపం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న విషయానికే అతిగా స్పందించడం, నిర్లక్ష్యం, ప్రమాదం జరుగుతుందన్న భయం లేకపోవడం, హింసాత్మక ప్రవర్తన వంటి లక్షణాలు కన్పించడంతో నాలో ఏదో అనుమానం పడగ విప్పసాగింది. నిర్ధారణ కోసం చైల్డ్ సైకియాట్రిస్ట్కి చూపించాను. నా అనుమానం నిజమైంది. తుషార్కి ఏడీహెచ్డీ సమస్య ఉంది. అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్... రాహుల్ నాకు చేస్తున్న ద్రోహం గురించి తెల్సినపుడు కూడా ఇంత బాధపడ లేదు. విడాకుల తర్వాత సింగిల్ పేరెంట్గా మారినపుడు కూడా ఆందోళనకు లోనుకాలేదు. కాని, నా ప్రాణంలో ప్రాణమైన నా కొడుక్కి ఏడీహెచ్డీ ఉందని నిర్ధారణ కాగానే అంతులేని దుఃఖంలో కూరుకుపోయాను. రెండేళ్ళపాటు బిహేవియరల్ థెరపీ ఇప్పించాను. వాడికిపుడు ఎనిమిదేళ్ళు...ఏడీహెచ్డీతో బాధపడే పిల్లలు పెద్దయ్యాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడొచ్చు. ఎడీహెచ్డీకి, పార్కిన్సన్స్ వ్యాధికి డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటరే కారణం. ఆడి ఆడి అలసిపోయి, నాపక్కన పడుకున్న తుషార్ మీద లాలనగా చేయివేసి, కళ్ళు మూసుకున్నాను. అనాయాసంగానే కళ్ళలోంచి నీళ్ళు ఉబికుబికి వచ్చాయి.∙∙ బ్రూనో తలకు చేసిన ఎనిమిదో రంధ్రంలోకి టాక్సిన్ని పంపించాక, దాని ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని గమనించసాగాను. వారం గడిచేటప్పటికి దానిలో అసహనం, అలజడి స్పష్టంగా కన్పించసాగాయి. ఒకచోట కుదురుగా కూచోవడం లేదు. కంటెయినర్లో అట్నుంచిటు అవిశ్రాంతంగా తిరుగుతోంది. తనతోపాటు ఉన్న లిల్లీని కొట్టి కొరికి హింసిస్తోంది. నిద్ర కూడా బాగా తగ్గింది.ఇవన్నీ ఏడీహెచ్డీ లక్షణాలు కావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెదళ్లోని ఏ భాగంలో ఉన్న న్యూరాన్లు దెబ్బతినడం వల్ల ఏడీహెచ్డీ ఏర్పడుతుందో కచ్చితంగా తెలియడం వల్ల ఆ డిజార్డర్కి రెండు పద్ధతుల ద్వారా శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చు. మెదళ్లోని ఆ భాగంలోకి ఏ మందుని పంపించడం వల్ల అక్కడి న్యూరాన్లు పునరుజ్జీవం పొందుతాయో తెలుసుకోవడం ఓ పద్ధతి. ప్రయోగశాలలో అటువంటి మెదడు కణాల్ని ఉత్పత్తి చేసి, ఆ భాగంలో అమర్చడం ద్వారా నయం చేయడం మరో పద్ధతి.ఏడీహెచ్డీతో బాధపడే పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేయడం కోసం తన శరీరాన్ని పణంగా పెట్టిన బ్రూనో ఇప్పుడు నా కళ్ళకు దేవదూతలా కన్పిస్తోంది.నేను భయపడుతున్న ఘడియలు రానేవచ్చాయి... బ్రూనోని మెర్సీకిల్లింగ్కు లోను చేయాల్సిన ఘడియలు... నేను బ్రూనోవైపు జాలిగా చూశాను. ఒకప్పటిలా అది నన్ను గుర్తు పట్టడంలేదు. పెదవుల్ని సాగదీసి నవ్వడం ఎప్పుడో మర్చిపోయింది. దుమికే జలపాతంలా చురుగ్గా కదిలే ఒకప్పటి బ్రూనో కాదిప్పుడు. దాని కదలికల్లోనే కాకుండా, ప్రవర్తనలో కూడా చాలా మార్పులొచ్చాయి. అదిప్పుడు వైద్యశాస్త్ర ప్రరిశోధనలకు పనికిరాని ప్రాణి. దాన్ని చంపొద్దని ల్యాబొరేటరీ డైరెక్టర్ నీరవ్ని బతిమాలుకున్నాను.‘‘చంపకుండా ఉంచడం వల్ల ప్రయోజనం ఏముంది? దాని పోషణకయ్యే ఖర్చు వృథా కావడం తప్ప. అదిప్పుడు రకరకాల మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దాని శరీరంలోకి ఎన్ని యాంటీబయోటిక్స్ పంప్ చేశామో గుర్తుందా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దాని అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిని ఉంటాయన్న విషయం మీకు తెలుసుకదా’’ అన్నాడు.‘‘బ్రూనో మానవజాతికి చేసిన మేలు ఎలా మర్చిపోగలం? భవిష్యత్తులో ఏడీహెచ్డీకి పరిష్కారం కనుక్కుంటే ఆ క్రెడిట్ బ్రూనోకే దక్కుతుంది. దానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?’’ అన్నాను.‘‘దాన్ని చంపడమే మనం దానికి చేయగల మహోపకారం’’ అన్నాడు.‘‘నాకిచ్చేయండి. నేను పెంచుకుంటాను’’ అన్నాను.‘‘మీకేమైనా పిచ్చా? రకరకాల మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతున్న బ్రూనోని పెంచడం ఎంత కష్టమో, అందులో ఎంత రిస్క్ ఉందో ఆలోచించారా?’’ అన్నాడు.‘‘ఆ విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. పర్వాలేదు. నా కొడుకు ఏడీహెచ్డీతో బాధపడ్తున్నాడని మీకు తెలుసు. అటువంటి కొన్ని లక్షలమంది పిల్లల కోసం అది శారీరక హింసను భరించింది. నేను దానికోసం ఆ మాత్రం కష్టాన్ని భరించలేనా?’’ అన్నాను.నేనతన్ని ఒప్పించి, బ్రూనోని ఇంటికి తెచ్చుకున్నాను.బ్రూనో కోసం వసారాలో ఉన్న ఖాళీస్థలంలో అల్యూమినియంతో చిన్న గదిలా కట్టించాను.రోజూ రాత్రి యింటికి చేరుకునే సమయానికి బెడ్రూంలో తుషార్ పెద్దగా అరుస్తూ, మంచం పైనుంచి కిందికి జంప్ చేస్తూ గోల చేస్తుంటే, వసారాలో బ్రూనో అల్యూమినియం గదిలో అశాంతిగా, అలజడిగా తిరుగుతూ, కంటెయినర్ గోడల్ని చేతుల్తో బాదుతూ శబ్దాలు చేస్తూ ఉంటుంది.ఇప్పుడు మా యింట్లో ఏడీహెచ్డీతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలున్నారు. ∙సలీం -
కథాకళి: కారణం లేదు
ఆ ఫిర్యాదు అందుకోగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్ స్పెక్టర్ని పిలిచి ఆదేశించాడు.‘‘కొత్తపేటలో ఓ ఇల్లాలు తన భర్తని చంపేసిందని ఫిర్యాదు వచ్చింది. వెళ్ళి చూడు.’’అతను ఓ కానిస్టేబుల్తో ఆ చిరునామాకి పావుగంటలో చేరుకున్నాడు. దూరం నుంచే ఆ ఇంటి బయట లైట్ స్తంభం వెలుతురులో గుమిగూడిన జనాన్ని చూశారు. వాహనంలోంచి దిగిన యూనిఫామ్లోని ఆ ఇద్దర్ని చూసి జనం పక్కకి తప్పుకున్నారు.‘‘ఫిర్యాదు చేసింది మీలో ఎవరు?’’ ఎస్.ఐ. అడిగాడు.ఒకతను ముందుకి వచ్చి చెప్పాడు.‘‘నేనే. పక్కింట్లో ఉంటాను. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూంటే ఇంట్లోంచి అనివర్తిగారి అరుపులు వినిపించాయి. పరిగెత్తుకు వెళ్ళి చూస్తే ఆయన మంచం మీద రక్తసిక్తమై కనిపించాడు. ఆవిడ చేతిలో కత్తి. ఆయన ఎదురుగా కూర్చుని ఆయన్నే చూస్తోంది. ‘ఏమైంద’ని అడిగితే ‘మా వారిని పొడిచాను’ అని చెప్పింది. వెంటనే మీకు ఫోన్ చేశాను.’’ఎస్.ఐ. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. లోపల మంచం మీది హతుడి చొక్కా రక్తంతో తడిసి, నేల మీద కూడా కొంత మడుగు కట్టింది. ఛాతీలో రెండు చోట్ల గాయాలు కనిపించాయి. ఎదురుగా ఏభై ఏళ్ళ ఆవిడ కూర్చుని ఉంది. మంచం మీద రక్తసిక్తమైన కత్తి ఉంది. ఆవిడ పోలీసుల వంక నిర్లిప్తంగా చూసింది.‘‘ఈయన ఎవరు? మీకు ఏమవుతారు?’’ ఎస్.ఐ. అడిగాడు.‘‘నా భర్త.’’‘‘ఈయన్ని మీరే చంపారా?’’‘‘అవును.’’‘‘ఆ కత్తితోనే పొడిచి చంపారా?’’‘‘అవును.’’‘‘ఎందుకు చంపారు?’’ ఎస్.ఐ. ప్రశ్నించాడు.‘‘నాకు తెలీదు.’’‘‘మీకు తెలుసు. కారణం లేకుండా మీరు ఆయన్ని చంపలేరు.’’‘‘ఏమో మరి?’’‘‘ఆయన మీకు తెలీకుండా మరో పెళ్ళి చేసుకోవడం, అక్రమ సంబంధం, ఏ కారణంగానైనా హింసించడం లాంటివి ఏమైనా జరిగాయా?’’‘‘లేవు. ఆయన ఎన్నడూ నా మీద చెయ్యి చేసుకోలేదు.’’‘‘మీరు చంపబోయే ముందు ఏం జరిగింది?’’‘‘పెద్దగా ఏం జరగలేదు. నేను బాత్రూంలోకి వెళ్ళి బయటకి రాగానే ఎందుకో ఆయన మీద కోపం వచ్చి ఉంటుంది. అందుకని పొడిచి ఉంటాను.’’‘‘ఎందుకు కోపం వచ్చిందో గుర్తు తెచ్చుకోగలరా?’’ ఎస్.ఐ. అడిగాడు.పెళ్ళైన కొత్తల్లో అనివర్తి ఆఫీస్ నించి ఆలస్యంగా వచ్చాడు.‘‘ఆలస్యమైనప్పుడు ఓ ఫోన్ కాల్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? మీ కోసం వండిన ఉప్మా చల్లారిపోయింది. రీహీట్ చేస్తే మీరు తినరు.’’అనివర్తి చొక్కా విప్పగానే వీపువైపు చినిగిన బనీన్ ని చూసింది.‘‘ఆ చిరుగుల బనీన్ వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదని అంతా అనుకుంటారు.’’మరో రోజు. ‘‘స్నానానికి వెళ్తూ మూడు విజిల్స్ రాగానే కుక్కర్ని ఆఫ్ చేయమన్నానా? అన్నమంతా ఎలా పొంగిపోయిందో చూడండి. మీరు ఏ పనీ సరిగ్గా చేయరు.’’‘‘ఇంగువ డబ్బా తేలేదే?’’ అనివర్తి సాయంత్రం షాప్కి వెళ్ళొచ్చాక సంచీలోవి కిచెన్ ప్లాట్ఫాం మీదకి కుమ్మరించి చూసి అడిగింది.‘‘మర్చిపోయాను.’’‘‘అసలు మిమ్మల్ని పంపించిందే అందుకు కదా?’’‘‘గుర్తు లేదు.’’‘‘న్యూస్ పేపర్ చదివాక టీవీ కింద షెల్ఫ్లో ఉంచమన్నానా? ఫేన్ గాలికి అవి ఎలా చిందరవందరగా పడ్డాయో చూడండి.’’‘‘రాత్రుళ్ళు మీ మొబైల్ని సైలెంట్ మోడ్లో ఉంచమన్నానా? టింగ్ టింగ్మని మెసేజ్ అలర్ట్స్కి మెలకువ వచ్చి తర్వాత నిద్రపట్టి చావటం లేదు.’’‘‘మనిద్దరికీ డయాబెటిస్. ఆ కాజు బర్ఫీ తీసుకురావద్దంటే ఎందుకు తెస్తారు? మీ కౌంట్ పోయినసారి టూట్వంటీకి వెళ్ళింది.’’‘‘బాత్రూం బయట ఆ పట్టా ఎందుకు వేశారు? దాని కింద బట్ట చిరిగి రబ్బర్ బయటకి వచ్చింది. కింద తడికి దాని మీద కాలు వేస్తే జర్రున జారి పడ్డాను. అదృష్టం. నా ఎముకలు విరగలేదు.’’‘‘ఎందుకిలా అనవసరపు ఖర్చులు పెడతారు? కిలో పదహారు వందలు పెట్టి పిస్తా కొనే తాహతు మనకి ఉందా అని ఆలోచించుకోనక్కర్లేదా?’’ఆ అర్ధరాత్రి అనివర్తి భార్యకి మెలకువ వచ్చింది. లేచి బాత్రూంలోకి వెళ్ళింది. ఆవిడకి గుప్పున యూరిన్ వాసన వేసింది. పెళ్ళైన కొత్తల్లో తన భర్తకి చెప్పడానికి ఆమె కొంత సిగ్గు పడింది. తర్వాత చెప్పేప్పుడు ఇబ్బందిగా చెప్పింది.‘‘మీరు బాత్రూంలో నీళ్ళు చక్కగా చుట్టూ కూడా కొట్టండి.’’వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి నిద్రపోయే భర్త ఛాతీలో రెండుసార్లు బలంగా పొడిచింది. తర్వాత ఎటాచ్డ్ బాత్రూంలోకి కాక కామన్ బాత్రూంలోకి వెళ్ళింది. ‘‘లేదు. నేను నా మావారిని చంపడానికి కారణం ఉందనుకోను. నిజానికి కొన్ని కారణాలు ఉన్నా అందులో ఏవీ చంపదగ్గ కారణాలుగా నాకు తోచలేదు. ఎందుకు చంపానో నాకే తెలీదు.’’ ఆవిడ ఎస్.ఐ.కి చెప్పింది. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
గుజరాతీ రుచులకు గ్లోబల్ క్రేజ్
ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లే వారు అయినా, ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులు అయినా.. విమానం ఎక్కేముందు వారి సూట్కేసుల్లో దుస్తుల కంటే ఎక్కువగా ఆహార ప్యాకెట్లు కనిపిస్తుంటాయి. దీనికి కారణం విదేశాల్లో భారతీయ ఆహారం అంతగా దొరకకపోవడం లేదా ఖర్చు అధికంగా ఉండటం. అందుకే ఇక్కడి నుంచి విదేశాలు వెళ్లేవారు తమతో పాటు ఇక్కడి ఆహారాన్ని మోసుకెళుతుంటారు. ముంబై, అహ్మదాబాద్ల నుంచి విదేశాలకు వెళ్లేవారికి ఇక్కడి గల్లీల్లో ఉండే గుజరాతీ కిచన్లే ‘అన్నపూర్ణలు’గా మారాయి. న్యూజెర్సీ, కాలిఫోర్నియా తదితర నగరాల్లో ఉండే భారతీయులు ఈ హోమ్ కిచెన్ల రుచుల కోసం క్యూ కడుతుంటారు.ఎన్ని పెద్ద బ్రాండ్లు ఉన్నా..న్యూజెర్సీలో పనిచేసే పలువురు భారతీయ టెక్కీలు తమ 30 కిలోల లగేజీలో దాదాపు 8 కిలోలు కేవలం ఈ తినుబండారాలకే కేటాయిస్తుంటారు. థెప్లా, ఫాఫ్డా, ఖాక్రా, రెడీ-టు-ఈట్ పావ్ భాజీ తదిరత వంటకాలు వాక్యూమ్ సీలింగ్ సాంకేతికతతో నెల రోజుల పాటు తాజాగా ఉంటున్నాయి. అమెరికాలో ఎన్ని పెద్ద బ్రాండ్లు అందుబాటులో ఉన్నా, గుజరాతీ మహిళలు (బెన్స్) ఎటువంటి రసాయనాలు లేకుండా చేసే ‘ఇంటి రుచి’కి ఏదీ సాటిరాదని ప్రవాసులు చెబుతుంటారు.బడ్జెట్ ఫ్రెండ్లీ రుచులువిదేశాలకు వెళ్లే కొత్తలో విద్యార్థులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆహార ఖర్చు . న్యూయార్క్ వంటి నగరాల్లో ఒక వెజిటేరియన్ శాండ్విచ్ ధర సుమారు 5 నుండి 7 డాలర్లు (రూ. 400 - 600) ఉండగా, భారత్లో కేవలం 20-30 రూపాయలకే లభించే థెప్లా ప్యాకెట్లు వారికి గొప్ప ఊరటనిస్తున్నాయి. అమెరికాలో లభించే ప్యాక్డ్ ఫుడ్ కంటే ఇవి ఐదు రెట్లు తక్కువ ధరకే లభిస్తుండటం విద్యార్థుల బడ్జెట్కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది.ప్రకటనలు లేని వ్యాపారంఈ గుజరాతీ కిచెన్ల వెనుక ఎటువంటి భారీ మార్కెటింగ్ టీమ్లు లేవు. ముంబైలోని విలే పార్లే, ఘాట్కోపర్ వంటి ప్రాంతాల్లోని గృహిణులు నాణ్యతనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయికి తమ వ్యాపారాన్ని తీసుకువెళ్లారు. ‘ఇందుబెన్ ఖాక్రావాలా’ లాంటి సంస్థల స్ఫూర్తితో తమ ఇంటి వంటగదుల నుంచే పలువురు మహిళలు టెక్కీల ఆకలిని తీర్చే పనిలో నిమగ్నమవుతున్నారు.తెల్లవారుజాము నుంచే విదేశీ ఆర్డర్ల సందడిఅహ్మదాబాద్కు చెందిన సెజల్ షా లాంటివారు తెల్లవారుజామున 4 గంటలకే తమ ‘కిచెన్’లో వంట పనిని ప్రారంభిస్తారు. విదేశాల్లో ఉండే ఐటీ నిపుణుల కోసం, విద్యార్థుల కోసం రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తారు. ఈ చిన్న కిచెన్ల నుండి వెళ్లే ఆహారం అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లోని భారతీయ మేధావుల ఆకలిని తీరుస్తోంది.సంస్కృతుల ఎగుమతివిదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ పిల్లల కోసం, బంధువుల కోసం ఈ వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. స్టార్టప్లు, గిగ్ ఎకానమీ యుగంలోనూ, గుజరాతీ మహిళల వ్యాపార దృక్పథం గ్లోబల్ మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించింది. కేవలం రుచి మాత్రమే కాదు, ఒక సంస్కృతిని, అనుబంధాన్ని ఈ వంటకాల ద్వారా వారు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం! -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?
"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?• డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్రూమ్ దాకా తీసుకొచ్చాయి.• గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.• ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్1. Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.2. Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.3. Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.4. Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.5. Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.మీ కోసం ఒక సెల్ఫ్-చెక్గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
నన్ను పెళ్లి చేసుకుంటావా ?!
‘వాలెంటైన్స్’ వీక్ మొదలైంది. నిన్నంతా గులాబీల పరిమళం (రోజ్ డే). నేడు, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?!’’ అని వేడుకొనే రోజు (ప్రపోజ్ డే). రేపు, మధురమైన చాక్లెట్ డే. 10న టెడ్డీ డే. 11న ప్రామిస్ డే. 12న హగ్ డే. 13న కిస్ డే.14 శనివారం, వాలెంటైన్స్ డే. ఎనిమిది రోజుల ప్రేమవారం.. ఈ వరుసంతా!అన్నిట్లోకి అపురూపమైనది ఇవాళ్టి ప్రపోజ్ డే. ఈ సందర్భంగా –కొందరు తత్వవేత్తల ప్రపోజల్స్ గురించి.తత్త్వవేత్తల ఆలోచనలు సాధారణ ప్రపంచానికి అంతుపట్టవు. వాళ్లకు ఎంతో సరళమైనది, లోకానికి కఠినాతికఠినంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి అనే లాలిత్యమైన భావనలు కూడా వారిలో ‘మేధాగర్భితమై’ ఉంటాయి. మానవ మాత్రులం పూలగుత్తులు, వెన్నెల రాత్రులతో ప్రేమను పండించుకోవాలని చూస్తుంటే... వారు మాత్రం తర్క వితర్కాలు, విడ్డూరమైన ఒప్పందాలతో ప్రేమను ‘కుదుర్చుకోవటం’ చరిత్రలో మనకు కనిపిస్తుంది! పాశ్చాత్య ఫిలాసఫర్లు మాత్రమే కాదు, భారతీయ తాత్త్విక చింతనాపరులూ ప్రేమ / పెళ్లి ‘ప్రపోజల్’ విషయంలో వాళ్లదైన స్థాయిలో సతమతమైనవారే లేదా తమ ప్రియురాళ్లను సతాయించినవారే.ఫ్రెడరిక్ నీషేనీషే 19వ శతాబ్దపు జర్మన్ తత్త్వవేత్త. ఈయన తన ప్రియురాలికి (వన్ సైడ్ లవ్) ముచ్చటగా మూడుసార్లు ప్రపోజ్ చేశారు. ఆ ప్రియురాలు ‘లూ ఆండ్రియాస్ సలోమీ’ అసాధారణ మేధావి! ఈయన్ని మించినావిడ! భావోద్వేగాల పరంగా ఆమె స్థాయి ఎక్కడో ఎగువన ఉంటే, నీషే స్థాయి ఎక్కడో దిగువన ఉండేది. ‘‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ఆయన ఆమెను ఒకసారి అడిగి ఊరుకోలేదు. మూడు ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయత్నంలో, నేరుగా అడిగే ధైర్యం లేక తన స్నేహితుడు పాల్ రేని రాయబారిగా పంపారు. అదే అతడు చేసిన పొరపాటు. ఆ రాయబారికి కూడా ఆమె అంటే ప్రాణం! నీషే ప్రేమ గురించి చెప్పకుండా తన ప్రేమ గురించి ఆమెకు చెప్పాడు. చివరికి ఆమె ఇద్దరికీ ‘నో’ చెప్పేసింది. అలాగని ఆమె ఆ రెండు పురుషాత్మల ఆశా దీపాన్ని ‘ఉఫ్’మనేమీ ఆర్పేయలేదు. ‘‘మన ముగ్గురం కలిసి ఒక ‘పరిశుద్ధ త్రిమూర్తులు’గా బ్రహ్మచర్యం పాటిస్తూ, కేవలం చదువుకు అంకితమై ఒకే ఇంట్లో ఉందాం’’ అని ప్రతిపాదించింది. నీషే మొదట అయిష్టంగానే ఒప్పుకున్నా, ఆ తర్వాత వారి పవిత్ర స్నేహబంధాన్ని ఆమెతో పెళ్లిగా మార్చుకుందామని రెండుసార్లు ప్రయత్నించారు. పాపం ఆయన తర్కం ఆమె దగ్గర చీమంత కూడా పని చేయలేదు.సోరెన్ కిర్కేగార్డ్కిర్కేగార్డ్ 19వ శతాబ్దపు డెన్మార్క్ వేదాంత వేత్త. రెజీన్ ఒల్సెన్ అనే యువతికి ఆయన చేసిన ప్రపోజల్ మొదట్లో చాలా పద్ధతిగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ప్రదర్శించిన విన్యాసాలే చరిత్రలో ఒక వింత అధ్యాయంగా మిగిలిపోయాయి. ఆయన అడిగారు, ఆమె సరేనంది... ఆ ఆనందం కనీసం మూణ్ణాళ్లైనా కాదు కదా, రెణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది! అందుకు కారణం ఆమె కాదు. అతడే. లవ్ని ప్రపోజ్ చేశాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది తనకున్న అకారణ విషాద భావన తత్వం (మెలంకలీ), దేవుని పట్ల ఉన్న భక్తి... ఒక మంచి భర్తగా ఉండటానికి ఏమాత్రం పనికిరావని ఆయన సిద్ధాంతీకరించుకున్నారు! పోనీ, గౌరవప్రదంగా విడిపోవచ్చు కదా? అదీ లేదు! ఆమెకు తన మీద ద్వేషం, అసహ్యం కలిగేలా చేసుకుని, బ్రేకప్ వల్ల ఆమె బాధపడకూడదనే వింత ఆలోచనతో తన గురించి తనే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టుకున్నారు. బయట అందరి ముందు కావాలనే ఒక మూర్ఖుడిలా, దుర్మార్గుడిలా ప్రవర్తిస్తూ తన పరువును తనే తీసుకున్నారు.ఇమ్మాన్యుయేల్ కాంట్ ఈయన 18వ శతాబ్దపు ప్రముఖ భావవాద జర్మనీ తత్త్వవేత్త. సమయాన్ని పాటించడంలో, విషయాలను విశ్లేషించి, వర్గీకరించటంలో మహాజ్ఞాని. సమస్య ఏంటంటే, లవ్ ప్రపోజల్ని ఆయన ఒక అందమైన అనుభూతిలా కాకుండా, తాను ఛేదించలేని ఒక క్లిష్టమైన గణిత సమస్యలా చూశారు. సంగతేంటంటే, ఇద్దరు అమ్మాయిలకు (ఒకేసారి కాదు లెండి, ఒకరి తర్వాత ఒకరికి) ఆయన ప్రపోజ్ చేయాలనుకున్నారు కాని, మేధస్సు ఆడిన ఊగిసలాటతో ఆ పని చేయలేకపోయారు. పెళ్లి వల్ల వచ్చే ఆర్థిక లాభనష్టాలు; తార్కికమైన ప్లస్లు, మైనస్లు లెక్కగట్టడానికి ఆయన ఎంత సమయం తీసుకున్నారంటే... చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి, పెళ్లికి మానసికంగా సిద్ధం అయ్యేనాటికి.. ఒకమ్మాయి ఊరు విడిచి వెళ్లిపోయింది. ఇంకో అమ్మాయి హాయిగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పాపం, కాంట్.. తన లోపల ఉండే ప్రాఫిట్ అండ్ లాస్ల గడియారం కంటే... మనుషుల జీవ గడియారమే వేగంగా తిరుగుతుందని గుర్తించలేకపోయారు!జి.డబ్ల్యూ.ఎఫ్. హెగెల్ఈయన ఒక తార్కిక ప్రేమికుడు! 18వ శతాబ్దం నాటి ప్రఖ్యాత జర్మన్ తత్త్వవేత్త. ప్రతి పదార్థానికీ చలనం ఉంటుందన్న హెగల్ సూత్రం, మార్క్సిస్టు గతి తార్కిక భౌతికవాదంపై ఎంతో ప్రభావం చూపింది. అర్థం కాని భాషకు, భారమైన సిద్ధాంతాలకు హెగల్ మారుపేరు. ‘మేరీ వాన్ టుచర్’ కి ఆయన చేసిన ప్రపోజల్ కూడా ఆయన శైలిలోనే కొంచెం గంభీరమైనది.ఆమె కోసం ఆయన కవితలు రాశారు. కానీ అవి మెదడుకు మేత పెట్టేలా ఉండేవి తప్ప, మనసున మల్లెల మాలలను ఊగించేవి కావు. ‘‘నిష్కల్మషమైన ప్రేమ అనేది బాగానే ఉంటుంది కానీ, ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ‘పెళ్లి’ అనేది ఒక చట్టపరమైన, సామాజికమైన అవసరం. అందుకే మనం పెళ్లి చేసుకుందాం..’’ అని ఆమెతో అనేవారు. అంటే తన లవ్ ప్రపోజల్ని కూడా ఆయన తన ‘ఫెనోమెనాలజీ ఆఫ్ స్పిరిట్’ అనే గ్రంథంలోని ఒక క్లిష్టమైన పాఠంలా మార్చేశారు. అదృష్టవశాత్తూ, మేరీకి ఆయన ప్రపోజల్ నచ్చటంతో ఆయన్ని పెళ్లాడింది.జీన్ పాల్ సార్త్రే సార్త్రే 20వ శతాబ్దారంభపు ఫ్రెంచి తత్త్వవేత్త. నాటక రచయిత, రాజకీయ కార్యకర్త, సాహితీ విమర్శకుడు. ‘విడ్డూరం’ అనే పదానికి అసలైన అర్థం సార్త్రే, ఆయన ప్రియురాలు సిమోన్ డిబోవర్. వీరు ప్రేమించుకున్నారు కాని, పెళ్లి చేసుకోలేదు! ‘చేసుకోకపోవడమే ప్రేమ పరమార్థం’ అన్నట్లు ఉండిపోయారు. సార్త్రే, ఆమెకు ఒక వినూత్నమైన ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే, ప్రతి రెండేళ్లకు ఒకసారి తమ పెళ్లిని ‘రెన్యువల్’ చేసుకునే ఒక ఒప్పందం! ‘‘మన మధ్య ఉన్నది అత్యంత ‘అవసరమైన’ ప్రేమ (!); కాని లోకంలో ఉన్న ‘అనవసరమైన’ పెళ్లిని కూడా మనం చవి చూడటం మంచిది’’ అని సార్త్రే ఆమెను ఒప్పించారు. ఫలితంగా, వారు రెండేళ్లకోసారి పెళ్లి అనే భావనను (!) పొడిగించుకుంటూ 51 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అలాగని ఏనాడూ ఒకే ఇంట్లో నివసించలేదు. పైగా, తమ తమ ఇతర ప్రేమాయణాల గురించి కాఫీ తాగుతూ హాయిగా చర్చించుకునేవారు. ‘ఓపెన్ రిలేషన్షిప్’ అనే పదం పుట్టకముందే, ఆ కాన్సెప్ట్కి వీరు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారు!మొత్తానికి ఈ పాశ్చాత్య తత్త్వవేత్తల ప్రేమకథలు వింటుంటే.. ‘ప్రేమ గుడ్డిది’ అనే మాట కంటే, ‘ప్రేమ తాత్త్వికమైనది’ అనే మాట కరెక్ట్ ఏమో అనే ఆలోచన కలుగుతుంది.::: భారతీయ తత్త్వవేత్తల ప్రపోజల్స్ :::మనవాళ్ల తాత్త్విక సంప్రదాయాలు ఎక్కువగా వైరాగ్యం, మోక్షం వైపు మొగ్గు చూపుతాయి. అందుకే, ఒక జ్ఞాని సంసార జీవితంలోకి (గృహస్థాశ్రమం) అడుగుపెట్టడం అంటే ప్రాచీన భారతదేశంలో అదొక పెద్ద ‘మేధాపరమైన కల్యాణ వేదిక’! పెళ్లి ప్రపోజల్స్ అంటే కేవలం మనసులు కలవడం మాత్రమే కాదు... అవి ధర్మం గురించి, ఆత్మల అనుసంధానం గురించి జరిగే హై–వోల్టేజ్ డిబేట్లు!యాజ్ఞవల్క్య మహర్షిఉపనిషత్తుల కాలం నాటి మేధావు లందరిలో యాజ్ఞవల్క్యుడు ఒక శిఖరం లాంటి వాడు. పెళ్లి విషయంలో కూడా ఆయనది ఒక రకమైన ‘మెటాఫిజికల్’ (అధిభౌతిక) అప్రోచ్! ఆయన తన రెండో భార్య మైత్రేయిని పెళ్లి చేసుకున్నప్పుడు, అది ఇప్పట్లో లాగా ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?‘ అని అడిగే మామూలు ప్రపోజల్ కాదు. మైత్రేయి అసామాన్యురాలు. గొప్ప విదుషీమణి. అంటే, మహా పండితురాలు. ఆమెకు కావలసింది నగలు, బంగారం లేదా హోదా కాదు. ఆమెకు ‘అమరత్వ సిద్ధి’ రహస్యం కావాలి. యాజ్ఞవల్క్యుడు ఆమెకు ఒక సంసార బంధాన్ని కాకుండా, ఒక ‘ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని’ ఆఫర్ చేశారు. ఆయన ఆమెతో ఒక మాట అన్నారు. ‘‘భర్తను భర్త కోసం ప్రేమించకూడదు, ఆయనలో ఉన్న ‘ఆత్మ కోసం ప్రేమించాలి’’ అని! అదే, ఆమెకు ఆయన చేసిన పెళ్లి ప్రపోజల్. దానర్థం ఏమిటంటే, మనం హాయిగా అడవికి వెళ్లి కూర్చుని, మోక్షం వచ్చే వరకు ఈ విశ్వం గురించి వాదించుకుంటూ ఉందాం – అని! ఇదొక రకమైన ‘స్టడీ–బడ్డీ’ లేదా క్లాస్మేట్ ప్రపోజల్ లాంటిది. పెళ్లి తర్వాత పార్టీలు, ఫంక్షన్లు కాదు... నేరుగా పరలోకానికి టికెట్ బుక్ చేసుకునే ప్రణాళిక అన్నమాట.మండన మిశ్రుడు 8వ శతాబ్దంలో, గొప్ప మీమాంస పండితుడైన మండన మిశ్రుడికి ఉభయభారతి అనే తాత్త్వికురాలితో వివాహం జరిగింది. నిజానికి ఆమె తెలివితేటల ముందు ఆయన మేధస్సు కాస్త తక్కువేనని ఆ కాలంలోనే చెప్పుకునేవారు. నిజానికైతే వీరి వివాహాన్ని ఒక ప్రేమ బంధంలా కాకుండా, ఇద్దరు మేధావుల మధ్య జరిగిన ‘జ్ఞాన సమ్మేళనం’ లాగా అభివర్ణించాలి. మండన మిశ్రుడి పెళ్లి ప్రపోజల్ కూడా అదే విధంగా జరిగింది. ఇక, వీరి కాపురం ఎలా ఉండేదంటే... అదొక నిరంతర తాత్త్వికాంశాల తరగతి గదిలా ఉండేది. ఒకసారి సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదనకు దిగారు. అప్పుడు మండన మిశ్రుడు ఏ మగ పండితుడినీ న్యాయనిర్ణేతగా పెట్టుకోకుండా, తన భార్యనే ఆ స్థానంలో ఉండమన్నారు! ఆ చర్చలో భర్త ఓడిపోతుంటే, ఆమె ఏమాత్రం మొహమాటపడకుండా నిజాన్ని అంగీకరించింది. అయితే, ఆమె అక్కడితో ఆగిపోలేదు. ‘‘నా భర్తను ఓడించినా, ఆయనలో సగభాగమైన నన్ను ఓడిస్తేనే మీ విజయం పూర్తవుతుంది’’ అని శంకరాచార్యుల వారికే సవాలు విసిరింది! పైగా, ‘‘నువ్వు సన్యాసివి, అసలు పెళ్లి చేసుకుంటే వచ్చే జీవితానుభవాలే నీకు తెలియవు. మరి నీకు సంపూర్ణ జ్ఞానం ఉందని ఎలా చెబుతావు?’’ అని శంకరాచార్యుల వారిని ప్రశ్నించింది.మహావీరుడుజైనమతంలో 24వ తీర్థంకరుడైన మహావీరుడు చివరికి సర్వసంగ పరిత్యాగిగా మారినప్పటికీ, ఆయన వివాహం గురించి చరిత్రలో ఒక పెద్ద తాత్త్విక చర్చే నడిచింది. పురాణ గాథల ప్రకారం, ఆయన మనసు లోక కల్యాణం మీద ఉండటంతో, ఆయనను ఈ ప్రాపంచిక బంధాల్లో బంధించాలని తల్లిదండ్రులు యశోదతో పెళ్లి నిశ్చయించారు. అంటే, ఆయన పెళ్లి ప్రపోజల్ వెనుక ఆయన ప్రమేయం కంటే, వారి తల్లిదండ్రుల ప్లానే ఎక్కువగా ఉందన్నమాట! మొత్తానికి మహావీరుడు పెళ్లి చేసుకున్నారు కాని, ఆ సంసార జీవితంలో ఉంటూనే అంతర్గతంగా పూర్తి వైరాగ్యంతో ఉండేవారు. ఒకసారి ఊహించుకోండి... ‘‘నేను నీ పక్కనే కూర్చొని ఉంటాను కాని, నా మనసు మాత్రం ఎక్కడో విశ్వంలోని అనంతమైన శూన్యంలో విహరిస్తూ ఉంటుంది’’ అని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? సామాన్యులకు బోధపడే తత్త్వం అయితే కాదు.::: ‘సారీ, నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’:::భక్తి, అద్వైత సంప్రదాయాల్లోని కథలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది అక్కడి తత్త్వవేత్తలు ప్రపోజ్ చేసే విధానం చాలా భిన్నంగా, విచిత్రంగా ఉంటుంది. వారు తమ భాగస్వామికి ప్రాపంచిక విషయాల పట్ల ఎంత ‘నిర్లిప్తత’ ఉందో పరీక్షించి కానీ ముందడుగు వేసేవారు కాదు. నాటి పురుష తాత్వికులు ప్రపోజ్ చేయాలంటే, ఒక షరతు పెట్టేవారు. తనకు కాబోయే భార్య తన ‘దైవ చింతన’కు ఏమాత్రం అడ్డంకి కాకూడదు– అని! పెళ్లి్ల సంబంధం అని అమ్మాయిని చూడటానికి వెళ్లినప్పుడు కూడా మన తత్త్వవేత్తలు ఆమె అందం గురించి కాకుండా... జనన మరణాల గురించి, దేహం తాలూకు అశాశ్వతత్వం గురించి అత్యంత కఠినమైన ప్రశ్నలు అడిగేవారు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా ప్రాపంచికమైన ఆశలతోనో లేదా మామూలు భావోద్వేగాలతోనో సమాధానం చెబితే, ‘‘సారీ... నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’’ అని తిరస్కరించేవారు. అంటే, అది పెళ్లి చూపుల్లా కాకుండా, ఒక ఆత్మకు జరిగే టెక్నికల్ ఇంటర్వ్యూ లాగా ఉండేది! మొత్తానికి పశ్చిమ దేశాల తత్త్వవేత్తలైనా, మన భారతీయ మేధావులైనా... ప్రపోజల్ విషయంలో వారి లాజిక్కులు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయని అర్థమౌతోంది. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
కనువిప్పు
ఒక అడవిలో ఒక బోదురు కప్ప ఉండేది. ఆ బోదురు కప్ప గొప్పలకి పోవడం మొదలు పెట్టింది. నీటిలో ఉన్న జీవులను నేల మీద ఉండలేరని వెటకారం చేసేది. నేలమీద ఉన్న జీవులను నీటిలో ఉండలేరని ఎగతాళి చేసేది. నీటిలోను, నేల మీద ఉండగల జీవి తానొక్కటేనని విర్రవీగడం మొదలు పెట్టింది. ఓ కాకి ఇదంతా గమనించింది. ఎలాగైనా కప్పకు బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒక రోజు చెరువులోంచి నేల మీదకొచ్చిన కప్పకు, నేలపై అన్నం మెతుకులు తింటున్న కాకి కనిపించింది. ‘ఏం కాకి బావా! ఎంత సేపైనా నేల మీదేనా, నాలాగా నీటిలోకి వచ్చేదేమైనా ఉందా?’ అంటూ వ్యంగ్యంగా అంది కప్ప. ఆ మాటకు కాకి ‘ఎందుకు రాను బావా! నువ్వు మా ఆకాశానికి ఎగురుకుంటూ రా! నేను అలాగే మీ చెరువులోకి ఈదుకుంటూ వస్తా’ అని తడుముకోకుండా అంది. ఆ మాటకు కంగు తిన్నది కప్ప. ‘నిజమే కదా! రెండు చోట్లా ఉండగలను కాని, ఆకాశంలో ఎగరలేను కదా! ఇందులో పెద్ద గొప్ప ఏముంది?ఎలాగైనా ఆకాశంలో కూడా ఎగిరి, మూడు చోట్లా ఉండగలనని నిరూపించుకుని, ఎగిరే పక్షులకు కూడా నా సత్తా ఏమిటో చూపాలి’ అనుకుంది. అనుకున్నదే తడవుగా, ‘ఓస్ అదంత కష్టమేమీ కాదు, నీటిలోనూ, నేలపైనా ఉన్న దాన్ని ఆమాత్రం ఆకాశంలోకి ఎగరలేనా? రేపు ఉదయం ఎగురుతాను చూడు’ అని కాకితో తల ఎగరేస్తూ అంది. అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కప్పకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి సమయం అని కాకి సరే అంది.ఎగరడానికి ముందు రెక్కలు కావాలి కనుక కప్ప వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళింది. ‘నెమలి మిత్రమా! నీ ఈకలు కొన్ని నాకు కావాలి. దానికి ప్రతిగా నీకు మొక్కల విత్తనాలు ఇస్తాను’ అని అడిగింది. నెమలి కొన్ని ఈకలు ఇచ్చింది. ఆ ఈకలు తీసుకుని దర్జీపిట్ట దగ్గరకు వెళ్ళింది కప్ప.‘దర్జీపిట్ట మిత్రమా! నాకు ఈ ఈకలతో రెక్కలు కుట్టివ్వవా! దానికి బదులుగా నీకు గింజలు ఇస్తాను’ అంది. ‘సరే’నని దర్జీ పిట్ట కప్పకు నెమలి ఈకలతో రంగు రంగుల రెక్కలను కుట్టి ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం కాకి దగ్గరకు వెళ్లి, ‘చూడు! నాకు రెక్కలు లేవనే కదా, ఎగరలే ననుకున్నావ్. నీ రెక్కలు నల్లవి. నా రెక్కలు చూడు రంగు రంగులవి. నీకన్నా పైకి ఎగరగలను’ అంటూ బలమంతా కూడగట్టుకుని రెక్కలను ఊపుతూ పైకెగిరింది. కప్ప బరువుకి రెక్కలు ఊడిపోయి, గాల్లో ఎగిరిపోయాయి. కప్ప గిరా గిరా గిరికీలు కొడుతూ కిందకు పడబోయింది. కప్పకు కళ్ళు తిరుగుతున్నట్టు, గుండె ఆగిపోతున్నట్టు అనిపించింది. అహంకారానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నానని భయంతో బెక బెకమని అరవసాగింది.అంతా గమనిస్తున్న కాకి వెంటనే ఎగిరి తన వీపుపై కప్పను పెట్టుకుని, కింద పడకుండా జాగ్రత్తగా చెరువు గట్టు మీద దించింది. తను గొప్పలకు పోయి అందరినీ హేళన చేసినా, తనను కాపాడిన కాకి ముందు తలదించుకుని, క్షమించమని అడిగింది కప్ప. ‘ప్రతి జీవి శరీర ఆకృతి, నిర్మాణం ఒకో రకంగా ఏర్పడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా జీవన విధానం ఉంటుంది. అది తెలుసుకుని నడుచుకోకపోతే ఏ జీవికైనా ముప్పు తప్పదు. అహంకారపు పొరలు బుద్ధిని కమ్మేస్తాయి. వాటికి మనం దూరంగా ఉండాలి. ఇకనైనా ఎవరినీ హేళన చేయకుండా బుద్ధిగా ఉండు’ అంటూ కాకి కప్పకు సుద్దులు చెప్పింది. కాకి మాటలను విన్న కప్ప బుద్ధి తెచ్చుకుని, ఎవరినీ ఎగతాళి చేయకుండా అందరినీ గౌరవిస్తూ, స్నేహ పూర్వకంగా మెలగసాగింది. కప్పకు కనువిప్పు కలిగించినందుకు నీటిలోని జీవులు, నేలపైన జీవులు కాకిని అభినందించాయి.కథాకళి25.1.2026 ఫన్డేలో ప్రచురించిన ‘మధురం’ కథకి పాఠకులు సూచించిన టాప్ 5 పేర్లు. హ్యాపీ జర్నీసెడింబి జయలక్ష్మి నరసింహరావుసెకండ్ ఇన్నింగ్స్టి. సూర్య కుమారి (హైదరాబాద్)వైతరణి వెళ్ళొస్తా!డాక్టర్ కోటేశ్వరరావు (గూడూరు)స్వర్గానికి స్మాల్ ట్రిప్ఏ వి సోమయాజులు (కాకినాడ)చావు (అ)భయందీక్షిత (నంద్యాల)-కయ్యూరు బాలసుబ్రమణ్యం -
ప్యాచెస్ కనిపిస్తున్నాయి
నాకిప్పుడు 24 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూ ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నాను. ఇటీవల తలపై ఒకటి రెండు చోట్ల గుండ్రంగా జుట్టు పూర్తిగా రాలిపోయిన ప్యాచెస్ కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో నొప్పి లేదా దురద ఏమీ లేదు. ఇది ప్రమాదకరమైన సమస్యా? – రాధిక, గుంటూరురాధిక గారు, మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది అలోపేషియా ఎరియాటా అనే జుట్టు రాలే సమస్యగా భావించవచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలోపేషియా ఎరియాటా అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. ఇందులో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున జుట్టు మూలాలపై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై లేదా జుట్టు ఉన్న ఇతర ప్రాంతాల్లో గుండ్రంగా జుట్టు పూర్తిగా ఊడిపోయిన ప్యాచెస్ కనిపిస్తాయి. ఇది తలకే కాకుండా కనుబొమ్మలు, వెంట్రుకలు, శరీరంపై ఉన్న జుట్టు, పురుషుల్లో గడ్డం భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలో జుట్టు మూలాలు పూర్తిగా నాశనం కావు. అందువల్ల సరైన చికిత్సతో జుట్టు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. అయితే పిల్లలు, యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో మానసిక లేదా భావోద్వేగ ఒత్తిడి, పోషక లోపాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం, శస్త్రచికిత్సల తర్వాత వచ్చే మార్పులు ముఖ్యమైనవి. అలాగే థైరాయిడ్ వ్యాధులు, విటిలిగో వంటి ఇతర ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నవారిలో కూడా ఇది కనిపించవచ్చు. ఇది అంటువ్యాధి కాదు. నూనె వాడటం, షాంపూ మార్చడం లేదా తల శుభ్రం చేయకపోవడం వల్ల వచ్చే సమస్య కూడా కాదు. కాబట్టి ఈ విషయంలో అపోహలకు లోనవ్వాల్సిన అవసరం లేదు. సమస్యను నిర్ధారించడానికి చర్మవైద్యులు ప్రత్యేకంగా తల చర్మాన్ని పరిశీలించే పరీక్షలు చేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు కూడా సూచించవచ్చు. రక్తహీనత, ఐరన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ డీ లేదా విటమిన్ బి12 లోపాలు ఉన్నాయా లేదా అనేది పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. చికిత్సలో భాగంగా పోషక లోపాలను సరిచేయడం, తలకు అప్లై చేసే మందులు, అవసరమైతే ప్రత్యేక ఇంజెక్షన్లు వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స ప్రారంభించిన తర్వాత సాధారణంగా ఆరు నుంచి పన్నెండు వారాల్లో జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అర్హత గల చర్మవైద్యుణ్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా ఈ సమస్యను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. -డా. ఇందిర పవన్ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ -
శ్రుతి మించిన ఆశావాదం టాక్సిక్ పాజిటివిటీ
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చెప్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది.అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే పాజిటివ్ యాటిట్యూడ్ నూరిపోసినా, ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకుపోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. -
వినువీథిలో సారథులు
ప్రపంచంలోనే అధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్ మారుతోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల సరళీకరణ మన దేశాన్ని మహిళా పైలట్ల హబ్గా మార్చాయి. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వేసిన అడుగులే భారత్ను నేడు ప్రపంచానికి ఆదర్శంగానిలబెట్టాయి.ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం..→ 2021 నుంచి 2025 మధ్యకాలంలో మహిళా పైలట్ల సంఖ్య 90% మేర పెరిగింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, భారతీయ మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. → 2021లో మహిళలకు 243 లైసెన్సులు జారీ చేయగా, 2025 నాటికి ఆ సంఖ్య 461కి పెరిగింది. అంటే ఈ నాలుగేళ్లలో సుమారుగా 89.71% వృద్ధిని సూచిస్తోంది. → డిసెంబర్ 31, 2025 నాటికి భారతదేశంలో మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 3,327.→ ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5% నుంచి 6% మాత్రమే ఉండగా, భారతదేశంలో ఇది 15% గా ఉంది. అంటే ప్రపంచ సగటు (5%) కంటే మూడు రెట్లు ఎక్కువ. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కంటే కూడా భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది.→ ఒక్క ఏడాదిలోనే అంటే 2025 లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు 61 కొత్త శిక్షణ విమానాలను ప్రవేశపెట్టడం విమానయాన రంగంలో ఒక పెద్ద అడుగు. ప్రస్తుతం దేశంలో మొత్తం 385 శిక్షణ విమానాలు ఉన్నాయి.→ సాంకేతిక విభాగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ విభాగాల్లో మహిళల వాటా 14% వరకు ఉంది.→ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో మహిళల సంఖ్య సుమారు 2.6% మాత్రమే ఉన్నప్పటికీ, ఇటీవల ఇండిగో వంటి సంస్థలు కేవలం మహిళలతో కూడిన మెయింటెనెన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.→ 2025 నాటికి విమానయాన రంగంలో మహిళల వాటాను 25 శాతానికి పెంచాలని పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఏ) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక హ్యూమన్ రిసోర్స్ పాలసీలు, ప్రసూతి సెలవులు, శిక్షణ తర్వాత తిరిగి విధుల్లో చేరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిర్ణయించింది.అంతర్జాతీయంగానూ..చాలా మంది భారతీయ మహిళా పైలట్లు ఇప్పుడు అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలను నడుపుతున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో విమానయాన రంగంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదగనున్నారు. పలు ఎయిర్లైన్స్లో మహిళా పైలట్ల శాతం అలయన్స్ ఎయిర్... అత్యధికంగా 17.36% మంది మహిళా పైలట్లు ఉన్నారు.ఇండిగో... గరిష్ట సంఖ్యలో మహిళా పైలట్లను (సుమారు 791 మంది) కలిగి ఉన్న సంస్థ.స్పైస్జెట్... 16.39% మహిళాపైలట్లతో రెండోస్థానంలో ఉంది.ఎయిర్ ఇండియా... 15.62% మహిళా పైలట్లు ఉన్నారు. -
పెళ్లంత థ్రిల్లింతలు
ఒకప్పుడు పెళ్లి అనగానే ‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి’ అనే పాటందుకునేవారు వధూవరులు. ఏ పెళ్లిలోనైనా పీటలపై కూర్చున్న జంట ఒకే రకం పెళ్లి చీర, ఒకేరకం పట్టు లాల్చీతో కనిపించగానే, సంప్రదాయం ఉట్టిపడేది. పురోహితుడి మంత్రాల దగ్గర నుంచి గట్టిమేళం వరకు ఇంచుమించు ఒకే తీరులో పెళ్లివేడుక నడిచేది. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఊహల్లో ఊగులాడుతూ– ఊరంత పందిరినీ, ఊరంతా సందడినీ కోరుకునేవారు. కాని, ట్రెండ్ మారింది. ఇప్పటి యువత ఎక్కువగా స్పెషల్ అండ్ యూనిక్ మ్యారేజెస్కే ఓటేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో సాహసాలను కోరుకుంటున్నారు. శుభాశుభాలను, తిథి నక్షత్రాలను పక్కనపెట్టి, పెళ్లిని వ్యక్తిగత వేడుకగా మార్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నడుస్తోంది. ఆచారాలు, ఆత్మీయ ఆహ్వానాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన యువత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ట్రెండీ లుక్ కోసం సరికొత్త వివాహ పద్ధతుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు.ప్రస్తుతం ట్రెడిషన్ ఫాలోవర్స్ కంటే ట్రెండ్ సెట్టర్స్ ఎక్కువైపోతున్నారు. వైరల్ కావాలనే కుతూహలం కొందరిది; తమ యవ్వనంలోనే ఏదో ఒక ప్రత్యేకతను చాటుకోవాలన్న తాపత్రయం మరికొందరిది; మరపురాని మధుర క్షణాలను సృష్టించుకోవాలన్న ఆరాటం ఇంకొందరిది. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లికి సిద్ధమయ్యే యువత– సంప్రదాయాలను పక్కనపెట్టి అనూహ్యంగా ఆలోచిస్తున్నారు. విస్మయకరంగా విచిత్రరీతుల్లో వివాహాలు చేసుకుంటూ ‘ద్యావుడా’ అనిపిస్తున్నారు. తమ పెళ్లి అందరిలా కాకుండా– అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని తపిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెళ్లి మండపాలు– వింత పందిళ్లను వేçస్తూ, విడ్డూరాలకు తెరలేపుతున్నాయి.పెళ్లి అంటే ప్రమాణం. నీకు నేను, నాకు నువ్వు అనే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని ప్రపంచంలోని ఒక్కో ఆచారం– ఒక్కో తంతుతో నిర్వహిస్తుంది. ప్రతి ఆచారంలోనూ పెళ్లి పేరుతో ఏకమైన జంటకు దైవమే సాక్ష్యమంటూ బంధుగణం ఆశీర్వదిస్తుంది. అలాంటి పవిత్రమైన వేడుక రానురాను ట్రెండ్ మార్చుకుంటోంది. కొన్నిసార్లు గతి తప్పుతోంది. మరికొన్నిసార్లు మతులు పోగొడుతోంది.అడ్వెంచరస్ వెడ్డింగ్స్‘సంసార జీవితమంటేనే ఓ సాహసం’ అనే అనుభవజ్ఞుల మాటల్ని ఫాలో అవుతున్నారో ఏమో కాని, చాలామంది యువత తమ పెళ్లి జీవితాన్ని అదే సాహసంతో ప్రారంభిస్తున్నారు. అలాంటి అడ్వెంచరస్ వెడ్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం!స్కైడైవింగ్ వెడ్డింగ్అడ్వెంచరస్ వెడ్డింగ్స్లో స్కైడైవింగ్తో కూడిన బేస్ జంపింగ్ పెళ్లిళ్లు చేసుకుని వైరల్ అవుతున్నాయి కొన్ని కొత్త జంటలు. నిజానికి ఇలాంటి పెళ్లిళ్లు యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా, హవాయి, మొజూరి వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అలాస్కా మంచుదారుల్లో ఇలాంటి సాహసాలు అధికంగా తారసపడతాయి. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాలతో పాటు ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాలన్నీ స్కైడైవింగ్తో పాటు బేస్ జంపింగ్ వెడ్డింగ్స్కు అనుకూలంగా ఉంటాయి.నిజానికి ఆస్ట్రేలియా, న్యూజీలండ్ దేశాలు సాహస క్రీడలకు కేంద్రం కావడంతో పాటు– అక్కడ బీచ్లు, పర్వతాలు స్కైడైవింగ్కి అనుకూలంగా ఉండటంతో ఈ రకమైన వివాహాలు తరచుగా జరుగుతాయి. మరోవైపు యూకేలో కొందరు వధూవరులు పెళ్లి వేదికకు విమానం, స్కైడైవింగ్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటారు. 2023లో ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను థ్రిల్లింగ్గా నిర్వహించుకుని ప్రపంచాన్ని అవాక్ చేశారు.ఎత్తైన కొండ అంచున పెళ్లి చేసుకుని, వివాహం పూర్తయిన వెంటనే, ఆ కొండ అంచు నుంచి బేస్ జంపింగ్/ స్కైడైవింగ్ చేశారు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట భీకరంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలోనే త్వరగా పాపులర్ అయ్యింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా సాహస ప్రియులైన వ«ధూవరులు– ఈ విధానాన్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు.స్పేస్నెట్ వెడ్డింగ్స్ ఈ స్పేస్నెట్ వెడ్డింగ్ సాహసానికి పరాకాష్టగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కిమ్ వెగ్లిన్, ర్యాన్ జెంక్స్ అనే జంటను ఈ వివాహానికి ట్రెండ్ సెట్టర్స్గా చెబుతుంటారు. వీరు అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని మోయాబ్ ఎడారిలో 400 అడుగుల ఎత్తులో లోయ పైభాగంలో కట్టిన స్పేస్నెట్పై వివాహం చేసుకున్నారు. కిమ్, ర్యాన్ ఇద్దరూ ప్రొఫెషనల్ స్లాక్లైనర్లు. వీరు మోయాబ్లో జరిగే ప్రసిద్ధ హై–లైనింగ్ ఫెస్టివల్లో కలుసుకుని ప్రేమించుకున్నారు. అందుకే, తమ వివాహాన్ని కూడా అదే స్పేస్నెట్లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పదిమంది బేస్ జంపర్లు టూటూ దుస్తులు ధరించి, పారాషూట్లలో పూల రేకులను వదులుతూ ఈ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపారు. ఈ వివాహం 2017లో జరిగింది. అంతకు ముందు పర్పుల్, మిక్కీ అనే మరో జంట మోయాబ్లోనే స్పేస్నెట్పై వివాహం చేసుకున్నట్లు సమాచారముంది. ఇంతటి సాహసం చేసి పెళ్లి చేసుకుంటున్న జంటలు అరుదుగా ఉన్నప్పటికీ ఈ పెళ్లితంతు ప్రపంచ యువత దృష్టిని ఆకట్టుకుంది.అండర్ వాటర్ వెడ్డింగ్స్సాహస ప్రియులైన జంటలకు అండర్ వాటర్ వెడ్డింగ్ అనేది తమ ప్రేమలోని లోతును ప్రకటించుకునే ఒక అద్భుత అవకాశం. షాంపేన్ కంటే ఎక్కువ బుడగలతో, ప్రశాంతమైన సముద్రపు అడుగున, రంగురంగుల పగడపు దిబ్బలు, చిన్నాపెద్దా చేపల సాక్షిగా వివాహం చేసుకోవడం ఇవన్నీ ఈ ట్రెండ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారతదేశంలో నీటి అడుగున వివాహాలకు ప్రధాన కేంద్రం అండమాన్ దీవులు. ఇక్కడ హేవ్లాక్ ఐలాండ్ ఈ వినూత్న వేడుకలకు వేదికగా మారుతోంది. ఇది దేశంలోనే నీటి అడుగున వివాహాలకు ఆదరణ పొందుతున్న ఏకైక ప్రదేశం. వధూవరులు స్కూబా గేర్ లేదా ఆడియో సిస్టమ్ ఉన్న అండర్ వాటర్ హెల్మెట్లు ధరించి నీటి అడుగుకు వెళ్తారు.ఇక్కడ నోటి మాటలకు బదులు, డైవింగ్ స్లేట్లు ఉపయోగించి ప్రమాణాలు చేసుకుంటారు. అనంతరం ఉంగరాలు మార్చుకుంటారు. అండమాన్ లో ఈ వివాహ ఏర్పాట్లకు ఖర్చు సుమారుగా రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. డైవింగ్ మాస్టర్లు, భద్రతా సిబ్బంది, కెమెరామెన్ వివాహం చేసుకోబోయే జంట వెంటే ఉంటారు. నిజానికి అండర్ వాటర్ వెడ్డింగ్స్ గ్లోబల్ ట్రెండ్. అయితే ఈ వివాహానికి మురికి లేని స్వచ్ఛమైన నీరు, పగడపు దిబ్బలు కలిగిన సుందరమైన వాతావరణం ఉండాలి. థాయ్లాండ్ ఈ వివాహాలకు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నీటి అడుగున సామూహిక వివాహాలు జరుగుతాయి. 2001లో క్రాదాన్ ద్వీపంలో 22 దేశాల నుంచి 34 జంటలు ఒకేసారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించి, ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు.అక్కడ కొన్ని రిసార్ట్లలో ప్రత్యేకంగా నీటి అడుగున వివాహాల కోసం చాపెల్స్ అందుబాటులో ఉంటాయి. కైమాన్ దీవులు, మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా కూడా ఈ డైవింగ్కు అనుకూలమైన ప్రాంతాలు కాబట్టి, ఈ ట్రెండ్ను అక్కడ కూడా అనుసరిస్తున్నారు. థాయ్లాండ్లోని ట్రాంగ్ ప్రావిన్స్లో 1997లో వార్షిక సామూహిక జలాంతర వివాహ వేడుక ప్రారంభమవడంతో ఈ కాన్సెప్ట్కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు, ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ట్రెండ్ తరచుగా అత్యంత విలాసవంతమైన లేదా సాహసోపేతమైన గమ్యస్థానాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డైవింగ్ అనుభవం ఉన్న లేదా శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు ఈ పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఎగబడుతున్నారు.హాట్ ఎయిర్ బెలూన్ వెడ్డింగ్స్నిజానికి చాలామంది జంటలు పెళ్లి ప్రతిపాదనలు చేసుకోవడానికి ఈ హాట్ ఎయిర్ బెలూన్ను ఎక్కుతుంటారు. ఈ వివాహం ఆకాశంలో తేలియాడుతూ, భూమిపై అద్భుతమైన దృశ్యాలను చూస్తూ జరుపుకునే సాహస వేడుక. ఈ రకమైన వివాహం– కేవలం వధూవరులు, పూజారి, ఫొటోగ్రాఫర్ల సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఈ వేడుకకు పెద్ద బెలూన్ బాస్కెట్ ఉపయోగిస్తారు. ఈ సాహసానికి టర్కీలోని కప్పడోసియా ప్రత్యేకం. అక్కడి రాతి నిర్మాణాలు, లోయలను పైన హాట్ఎయిర్ బెలూన్ నుంచి చూస్తే కళ్లు చెదురుతాయి.దాంతో చాలామంది ఈ వివాహాలను చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఈజిప్ట్లోని లక్సర్లో పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాల మీదుగా సూర్యోదయాన్ని చూస్తూ బెలూన్ ప్రయాణం చేస్తే అదిరిపోతుంది. అలాగే ఇటలీలోని టస్కనీలో పచ్చని కొండలు, ద్రాక్ష తోటలు, పురాతన కోటల మీదుగా బెలూన్పై ప్రయాణించే అనుభూతి చాలా బాగుంటుంది. అందుకే చాలామంది జంటలు ఆయాప్రాంతాల్లో ఈ ప్రయాణం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక భారత్లో కూడా ఈ వివాహాల ట్రెండ్ పెరుగుతోంది. సాధారణంగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు జరిగే ప్రదేశాలలోనే ఈ వివాహాలను ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ (జైపూర్), గోవా ఈ జాబితాలోకి వస్తాయి.హాట్ ఎయిర్ బెలూన్ చరిత్ర 18వ శతాబ్దంలోనే కనిపిస్తుంది. మొట్టమొదటి మానవ ప్రయాణంతో కూడిన హాట్ ఎయిర్ బెలూన్ విమానం, 1783 నవంబర్ 21న ఫ్రాన్స్లోని పారిస్లో ప్రయోగించారు. ఆధునిక, సురక్షితమైన ప్రొపేన్ బర్నర్లు కలిగిన హాట్ ఎయిర్ బెలూన్ లు 1950ల చివరలో అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి, బెలూనింగ్ ఒక వినోద కార్యక్రమంగా, ఆపై ఒక రొమాంటిక్ వేదికగా మారింది.డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ పెరిగిన తరువాతే, హాట్ ఎయిర్ బెలూన్ లలో వివాహాలు కూడా క్రమంగా మొదలయ్యాయి. అంటే, సాంకేతికంగా బెలూన్లు చాలా పాతవి అయినప్పటికీ, వాటిలో వివాహాలు జరుపుకోవడం అనేది కొత్త ట్రెండ్ అనే చెప్పుకోవాలి. భారత్లో, కొన్ని కొత్త జంటలు వివాహ వేడుక పూర్తయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి కారుకు బదులుగా హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిస్తూ వైరల్ అవుతున్నారు.మంచుశిఖరాల్లో..ఎవరెస్ట్ శిఖరం పైన, మంచుతో నిండిన అంటార్కిటికాలో, మంచు ఎడారులలో లేదా అడవుల లోపల వివాహాలు సాహసోపేతమైన ట్రెండ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఈ రకమైన వివాహాలకు అతిథులు చాలా తక్కువ మంది ఉంటారు. లేదా అసలు ఉండరు.ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (నేపాల్)– ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వివాహ వేదికలలో ఇదొకటి. ఇక్కడ చాలామంది యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అంటార్కిటిక్ క్రూయిజ్–భూమిపై అతి తక్కువ మంది అడుగుపెట్టిన ప్రదేశాలలో ఒకటి అంటార్కిటిక్ ఖండం. అయితే ఇప్పటి ట్రెండీ యూత్కి అటుగా ప్రయాణించే క్రూజ్ షిప్స్ కూడా వివాహ వేదికలే. పెంగ్విన్స్, మంచు దిబ్బల మధ్యలో తీరానికి దగ్గరల్లో క్రూయిజ్ నుంచి ఒక చిన్న పడవలోకి మారతారు. అందులో తీరానికి చేరుకుని అక్కడ వివాహం చేసుకుంటున్నారు.ఎడారుల్లో..ఎడారి పెళ్లిళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండీగా మారిన సాహసోపేతమైన వివాహ వేడుకల్లో ఒకరకం. కాలిఫోర్నియా, జోషువా ట్రీ, పామ్ స్ప్రింగ్స్ వంటి ప్రదేశాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే అరిజోనా, దుబాయ్ ఎడారిలో లగ్జరీ రిసార్ట్లు లేదా ప్రైవేట్ క్యాంపుల్లో విలాసవంతమైన వివాహ వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక భారత్లోని రాజస్థాన్లో జైసల్మేర్, జోధ్పూర్ వంటి నగరాల్లోని ప్యాలెస్లు, డెసర్ట్ క్యాంపులు వివాహవేదికలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి చోట్ల పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యాస్తమయం సమయంలో లేదా నక్షత్రాల కింద రాత్రిపూట ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి.‘హడలెత్తించే’ పెళ్లిళ్లుప్రస్తుత పెళ్లిళ్ల నిర్వహణలో సంప్రదాయాలకు ఆధునికత, వ్యక్తిగత ఆశలు తోడై– కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. సాంప్రదాయ వివాహ వేదికలకు బదులుగా, కొంతమంది జంటలు తమ వైవాహిక జీవితంలో కొత్త సాహసాన్ని కోరుకుంటూ అసాధారణమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.వనాల మధ్యలో..దట్టమైన అడవిలో లేదా పచ్చని చెట్ల తోటల్లో వివాహం చేసుకోవడం ఇప్పుడు యువత మెచ్చిన ట్రెండ్లో ఒకటి. ఈ ఫారెస్ట్ వెడ్డింగ్స్ కాలిఫోర్నియా, యోసెమిటీ నేషనల్ పార్క్లో పొడవాటి చెట్లు, గ్రానైట్ కొండల మధ్య పెళ్లి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కెనడాలోని కొలంబియా కూడా ఇలాంటి పెళ్లిళ్లకు పందిళ్లు వేస్తోంది. ప్రపంచ యువతను ఆకర్షిస్తోంది. ఇక భారత్లో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కర్ణాటకలోని కూర్గ్, కబిని వంటి ప్రాంతాల్లో ఈ పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి.హాంటెడ్ వెడ్డింగ్స్కొన్ని దేశాల్లో, ముఖ్యంగా హాలీవుడ్ థీమ్ల ప్రభావంతో, దయ్యాల కోటలు, పాత జైళ్లు, పాడుబడిన పట్టణాలు లేదా చారిత్రక శ్మశానవాటికల పక్కన వివాహాలు చేసుకుంటున్నారు. సంప్రదాయ వివాహాలకు భిన్నంగా, తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకునే జంటలు ఇలాంటి ప్రత్యేక వేదికలను ఎంచుకుంటున్నారు. హారర్ సినిమాలు, హడలెత్తించే నవలలు, హాలోవీన్ థీమ్ల పట్ల ఆసక్తి పెరగడంతో ఈ రకమైన వివాహాలు ప్రాచుర్యం పొందాయి. పాత కోటలు, పాడుబడిన భవనాలు వేదికలుగా మారి, దయ్యాల కథలు జతచేర్చి చిత్రవిచిత్రమైన అనుభవాన్నిస్తాయి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ ధోరణిఎక్కువగా కనిపిస్తుంది.కొలరాడోలోని ‘ది స్టాన్లీ హోటల్’– ‘ది షైనింగ్’ నవలకు స్ఫూర్తినిచ్చిన ప్రదేశం, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ ప్రాంతాన్నే వివాహ వేదికగా మార్చుకుంటున్నారు చాలామంది వధూవరులు.కాలిఫోర్నియాలో పర్మనెంట్గా డాక్ చేసిన ‘ది క్వీన్ మేరీ’ అనే లగ్జరీ నౌకలో ఒకప్పటి సిబ్బంది, ప్రయాణికులంతా దయ్యాలుగా మారారని, అక్కడే సంచరిస్తున్నారని స్థానికుల నమ్మకం. హడలెత్తించే ఈ ప్రాంతం కూడా వివాహ వేదికే. ఇక కాలిఫోర్నియాలో చారిత్రక గోస్ట్ టౌన్ లోని పాత చర్చిలు లేదా ఆయా పరిసరప్రాంతాలు యువతను పెళ్లి చేసుకోమని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి.భారతదేశంలో పాత మిల్లులు/పాత భవనాలుకొన్ని ఈవెంట్ సంస్థలు పాత మిల్లులు లేదా పాడుబడిన భవనాలను థీమ్డ్ డెకరేషన్తో వివాహ వేదికలుగా మారుస్తున్నాయి. అందులోనే వివాహాలు చేసుకోవడానికి యువత ఇష్టపడుతున్నారు.‘సోలో వెడ్డింగ్స్’తమ సంతోషానికి మరొకరిపై ఆధారపడకుండా, తమ జీవితాన్ని తామే నియంత్రించుకుంటామని ప్రకటిస్తూ.. చాలామంది యువత– సోలో వెడ్డింగ్స్కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది అన్నింటికంటే ప్రత్యేకమైన ట్రెండ్. పెళ్లి చేసుకోమని ఇతరులు ఒత్తిడి చేస్తున్నప్పుడు, తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి తామేనని చెప్పుకోవడానికి కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ సోలో పెళ్లిళ్లు కూడా సంప్రదాయ పెళ్లిళ్లకు మాదిరిగానే అంగరంగ వైభవంగా, అతిథులతో, కేక్తో, రిసెప్షన్ తో జరుగుతాయి. కాని, పార్టనర్ మాత్రమే ఉండరు. ఈ వివాహాలు ప్రస్తుతం జపాన్లో ఎక్కువగా జరుగుతున్నాయి.పెళ్లి అనేది ట్రెడిషనల్ ట్రాక్ నుంచి ట్రెండీ ట్రాక్ ఎక్కి చాలాకాలమే అయింది. కొన్ని వెడ్డింగ్స్ ‘అరే భలే జరిగాయి కదా!’ అనిపిస్తుంటే, కొన్ని వెడ్డింగ్స్ మాత్రం ‘అరే పాపం, ఎందుకురా ఇంత కష్టం.. ఏంట్రా ఈ పిచ్చి?’ అనిపించక మానడం లేదు!చైనా వినూత్న ప్రయత్నం..చైనా ప్రభుత్వం తగ్గుతున్న జననాల రేటును అరికట్టడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి పెళ్లి నిబంధనలను సరళతరం చేసింది. పలు సంప్రదాయేతర ప్రదేశాలలో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, వివాహ వేదికలను ఏర్పాటు చేసింది. సబ్వే స్టేషన్ దగ్గర నుంచి నైట్ క్లబ్స్ వరకూ జనసంచారం ఉన్న ప్రతిచోట పెళ్లి బూత్లను ప్రారంభించింది. దాంతో అక్కడ పెళ్లి చేసుకునే ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ట్రెండ్ని కోరుకునే యువత ఈ విధానానికి అట్రాక్ట్ అవుతోంది.సంహిత నిమ్మన -
నా జీవితంలో స్టార్ ఉన్నాడు!
సొసైటీ ఇచ్చే స్టేట్మెంట్ లేబుల్స్ అంటే అలర్జీ. ఇతరుల అంచనాలన్నింటినీ లైట్గా స్కిప్ చేస్తూ, తనదైన దారిలో తన సొంత ప్రపంచంలో జీవిస్తోంది ఫారియా అబ్దుల్లా. ఇప్పుడు ఆ ప్రపంచం గురించిన విషయాలన్నీ ఆమె మాటల్లోనే...⇒ నా పేరు ఫారియా. చాలామంది ‘ఫైరియా’ అని పిలుస్తారు. నటనకు ముందు ఆరు సంవత్సరాలు హైదరాబాద్లో థియేటర్ ఆర్టిస్ట్గా పని చేశాను. అక్కడే నటిగా పునాది పడింది. అంతకంటే ముందే నేను డాన్సర్, మ్యూజీషియన్ , క్రియేటివ్ ఆర్టిస్ట్ని.⇒ ‘జాతి రత్నాలు’ వచ్చాక నా జీవితం ఫుల్ టర్న్ తీసుకుంది. ఎంతలా అంటే ‘ఎవరు ఈ అమ్మాయి?’ నుంచి, ‘మన చిట్టి!’ అంటూ ప్రతి కుటుంబం నన్ను వాళ్ల అమ్మాయిలా దగ్గరకు తీసుకుంది.⇒ అవును, నేను రిలేషన్ లో ఉన్నాను. ఇది సీక్రెట్ కాదు, ప్రైవేట్. అతను ఒక కొరియోగ్రాఫర్. నేను ముస్లిం, అతను హిందువు. కాని, మా మధ్య ఇవన్నీ ఎప్పుడూ సమస్య కాలేదు. మాది ప్రేమకథ అనడం కన్నా పార్ట్నర్షిప్ అనడమే నాకు ఇష్టం. నా డాన్స్, నా ర్యాప్లో కనిపించే ఎనర్జీ వెనుక అతని సపోర్ట్ బోనస్లా పనిచేస్తుంది.⇒ ఇప్పటివరకు అతని పేరు, ముఖం రివీల్ చేయలేదు. కాని, నా వీడియోల్లో క్లూస్ వెతుకుతున్న ఇంటర్నెట్ డిటెక్టివ్లను చూస్తే నవ్వొస్తుంది. ‘సారీ గైస్’ మీరు ఇంకా లెవెల్ అప్ కాలేదు.⇒ ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఒకప్పుడు మైనస్ అన్నారు. కేవలం గెస్ట్ రోల్స్కే సరిపోతావు అని కామెంట్స్ చేసేవారు. నేను మాత్రం నా సినిమాలతోనే వాళ్లకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.⇒ డాన్స్ నా ఫస్ట్ లవ్. నన్ను నేను ‘మూవ్మెంట్ ప్రాక్టీషనర్’గా పిలుచుకుంటాను. హిప్హాప్, కథక్, బెల్లీ, బీ–బాయింగ్ ఇలా నా శరీరమే నా భాష.⇒ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ ఇలా ప్రతి సినిమా నాకు కొత్త పాఠం నేర్పింది. ఇప్పుడు తమిళంలో ‘వల్లి మయిల్’. అందులో స్టంట్స్ కూడా చేశాను. ఈసారి కొత్త ఫారియాను చూడబోతున్నారు.⇒ నటనతో పాటు సంగీతం కూడా నా ప్రాణం. నేను పాడుతాను, రాస్తాను, కంపోజ్ చేస్తాను. ‘డ్రామా నక్కో మామ’ పాట పూర్తిగా నా మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్.⇒ నా బ్యూటీ రొటీన్ చాలా సింపుల్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కాన్షస్ ఈటింగ్ అదే నా గ్లో సీక్రెట్. మేకప్ తీసేయడానికి బేబీ ఆయిల్, హెయిర్కు వారానికి రెండు మూడుసార్లు ఆయిల్ మసాజ్ తప్పనిసరి.⇒ తినడంలో బిర్యానీ నా బలహీనత. దోశ, ఇడ్లీ లాంటి సింపుల్ ఫుడ్ అంటే కూడా ఇష్టం. ట్రావెల్ చేసినప్పుడు మక్బూస్, లుకైమాత్ లాంటి రుచులు కూడా ట్రై చేశాను.⇒ నా జీవితంలో ఇంకొక స్టార్ ఉన్నాడు. అదే నా పిల్లి ‘సెబాస్టియన్ ’. అతను లేకపోతే నా సోషల్ మీడియా అకౌంట్ అసంతృప్తిగానే ఉంటుంది. -
అదే.. నా బ్యూటీ వెపన్!
బాల నటిగా మొదలైన ప్రయాణం నుంచి, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిత్వం వరకు ఆమె ఫ్యాషన్ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. సంప్రదాయానికి గర్వంగా నిలుస్తూనే, ఆధునిక ప్రయోగాలు చేసే ఆమె స్టయిల్, బ్యూటీ ఫిలాసఫీ ఇదిగో!చీర.. బ్రాండ్: స్వాతికపూర్ లెహంగా ధర రూ. 47,700బ్లౌజ్ ధర రూ. 14,310ఓణీ ధర రూ. 21,200జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూవెల్స్ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.కళ్ల అందాన్ని హైలైట్ చేయడానికి బ్లాక్ కాజల్ కంటే బ్రౌన్ కాజల్ నా సీక్రెట్ బ్యూటీ వెపన్ . దాన్ని స్వల్పంగా స్మడ్జ్ చేస్తే కళ్లకు సాఫ్ట్, మేజికల్ లుక్ వస్తుంది. ఫ్యాషన్ లో మాత్రం నేను సేఫ్ గేమ్ ఆడను. సంప్రదాయ దుస్తులు, చీరలు, అనార్కలీలు లాంటి క్లాసిక్ వేర్ను ఫ్యూచరిస్టిక్ ఔట్ఫిట్స్గా మలచుకుంటూ, మైథాలజీకి మోడ్రన్ టచ్ ఇచ్చే స్టయిల్ను ఫాలో అవుతాను. – సారా అర్జున్ -
మాస్క్ల మాయాజాలం
వెనిస్ వీథులు గత చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఆధునిక ప్రపంచపు కోలాహలాన్ని విడిచిపెట్టి ఒక్కసారిగా మధ్యయుగపు రాజవైభవంలోకి చేరిపోయాయి. బంగారు వర్ణపు పట్టు వస్త్రాలు, వెల్వెట్ గౌన్లతో పురాతన రాజులు, రాణుల వేషధారణతో స్ధానిక వీథులన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇటలీలోని వెనిస్ నగరం ఒక రంగుల హరివిల్లులా మారింది. ప్రతి మలుపులోనూ ముసుగుల సంబరాలు సందడిగా నడుస్తున్నాయి. ముసుగుల వెనక దాగి ఉన్న నవ్వులు, ప్రత్యేకంగా మెరిసే వస్త్రాలతో వెనిస్ నగరం తళుక్కుమంటోంది. కాలం వెనక్కి వెళ్లిందా అన్నంతగా ఈ సంబరం ఆకట్టుకుంటోంది.ఈ పండగకు 864 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1162వ సంవత్సరంలో వెనిస్ గణతంత్ర రాజ్యం ఆక్విలేయాపై విజయం సాధించింది. దీనికి గుర్తుగా ప్రజలందరూ సెయింట్ మార్క్స్ స్క్వేర్ దగ్గర నృత్యాలు చేశారు. ఇదే కాలక్రమేణా కార్నివాల్ ఆఫ్ వెనిస్ ఫెస్టివల్గా మారిపోయింది. ఆనాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికీ అంతే జోరుతో కొనసాగుతున్నాయి. మధ్యలో కొన్నేళ్లు ఆగిపోయినా, 1979 నుంచి అధికారికంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ కార్నివాల్ కేవలం ఇటలీ సంప్రదాయంలా కాకుండా అంతర్జాతీయ పర్యాటక వేడుకగా మారిపోయింది.ఈ ఏడాది జరుగుతున్న ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇటలీలో 2026లో జరగనున్న మిలానో కార్టినా వింటర్ ఒలింపిక్స్ను పురస్కరించుకొని ఈ కార్నివాల్కు ఒలింపస్–ది ఆరిజన్స్ ఆఫ్ ది గేమ్ అనే థీమ్ను పెట్టారు. ఈ కార్నివాల్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. ప్రధాన వేడుకలు మాత్రం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం అవుతాయి.నిజానికి వెనిస్ నగరానికి కాలువలే ప్రధాన ఆకర్షణ. ఆ కాలువలే ఈ కార్నివాల్కు వేదికలు. ఈ కార్నివాల్లో జరిగే వేడుకలన్నీ కాలువల చూట్టూనే జరుగుతాయి. వీటిలో అత్యంత ఆకర్షణీయమైనది గ్రాండ్ వాటర్ పరేడ్. ఈ పరేడ్లో అద్దంలా మెరిసే వెనిస్ కాలువల్లో రంగురంగుల పడవలు వందలాదిగా కదులుతూ ఉంటాయి. ఈ దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. వెనిస్ కార్నివాల్లో మాస్క్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.మనుషుల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఉత్సవంలో అందరూ కలిసి పాల్గొనేందుకు మాస్క్లు ధరిస్తారు. ఈ వేడుకలో బౌటా, మెడికో డెల్లా పెస్టే అనే మాస్క్లు చాలా ఫేమస్. వీటితో పాటుగా రాజులు, రాణులు మాదిరిగా స్థానిక కళాకారులు వేషాలు ధరిస్తారు. సెయింట్ మార్క్స్ బెల్ టవర్ నుంచి దేవదూత వేషధారణలో అమ్మాయి కిందకి దిగి వచ్చే ‘ఫ్లైట్ ఆఫ్ ది ఏంజెల్’ అనే ఘట్టం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. వెనిస్ కార్నివాల్ చూసేందుకు ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మంది పర్యాటకులు నగరానికి వస్తుంటారు. ఈ సమయంలో వెనిస్ నగరంలో ప్రత్యేకమైన విందులు, నాటక ప్రదర్శనలు, వాటర్ లైట్ షోలు ఉంటాయి. -
ఏం కొడుకువిరా నువ్వు..
''నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి'' అని వన దేవతలు సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భక్తుడు. తన వేదనను వంద రూపాయల నోటుపై రాసి హుండీలో వేశాడు. మరికొంత మంది భక్తుల నుంచి కూడా ఇలాంటి వేడుకోళ్లు వచ్చాయి. ముదిమి వయసులో ముసలి తల్లిదండ్రులను వేదనకు గురిచేస్తున్న విదారక ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. కడుపున పుట్టిన పిల్లలను పెంచి, ప్రయోజకులను చేసిన అమ్మనాన్నలకు చివరి రోజుల్లో చీదరింపులే ఎదురవుతున్నాయి. జీవిత చరమాంకంలో తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన పిల్లలు వదిలించుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ పట్టణంలోని బస్టాండ్లో 80 ఏళ్ల వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికుడొకరు ఏమైందని ఆరా తీశాడు. తనను కొడుకు, కోడలు వదిలేసి వెళ్లిపోయారని పెద్దావిడ వాపోయింది. తన కుమారుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, అతడి పేరు సురేష్ శర్మ అని తెలిపింది. తనను కొడుకు- కోడలు సరిగ్గా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది. అమ్మను వదిలేసి వెళ్లిన కొడుకుపై నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.నెటిజన్ల స్పందనపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను ధారపోస్తారని, అలాంటి వారిని చివరి రోజుల్లో చూసుకోవడం వారసుల బాధ్యత మాత్రమే కాదు.. గౌరవం కూడా అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి అతడికి వాళ్లమ్మ పెట్టిన డబ్బు, ఆహారం, భద్రత, ఆశ్రయం, సంరక్షణకు మూల్యం వసూలు చేయడానికి కేసు పెట్టాలని మరొకరు సూచించారు. ఓరి దేవుడా! వృద్ధురాలు అలా ఏడుస్తుండటం తాను చూడలేకపోతున్నానని, ఇది చాలా హృదయ విదారకంగా ఉందని ఇంకొకరు ఆవేదన చెందారు. మన సమాజంలో మానవత్వం ఇంత దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నానని మరొకరు అన్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎక్కువ కాలం బతకం కూడా శాపంగా కింద భావించాల్సి వస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.చదవండి: 100 రూపాయల నోటుపై రాసి.. కాపాడాలని వేడుకోలువీడియోలోని వృద్ధురాలికి ఎవరైనా సహాయం చేశారా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందనే వివరాలు తెలియరాలేదు. తల్లిని వదిలేసి వెళ్లిన కొడుకును కచ్చితంగా శిక్షించాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో కనుమరుగవుతున్న మానవీయ విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోందని ఆలోచనాపరులు నిట్టూరుస్తున్నారు. Elderly Mother aged 80 Abandoned at Bus Stand in Mandsaur by son after pressure from his wifeThe idea of family losing its meaning?Are aging parents become inconvenient liabilities in their own homes?This incident is not an isolated case. It reflects a growing moral crisis… pic.twitter.com/Cjsemah4AE— Woke Eminent (@WokePandemic) February 4, 2026 -
ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!
మార్పు అన్నది ఎక్కడ నుంచో కాదు మన నుంచే రావాలి అంటుంటారు పెద్దలు. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రతీక్ ఖండేల్వాల్. కష్టం రాగానే అనిపించేది.. 'నాకే ఎందుకు అని'..కానీ ప్రతీక్ తనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరూ.. అని ఆలోచించాడు. తనకు సవాలుగా మారిన పరిస్థితులన్ని..తనలాంటి వాళ్లెందరు ఎదుర్కొంటున్నారో గమనించాడు. ఆ మార్పుకు తానే ఎందుకు శ్రీకారం చుట్టుకూడదు అనుకున్నాడు. ఆ క్రమంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు, సవాళ్లు. అయితేనేం తను అనుకున్నట్లుగా మార్పు వచ్చేలా చేసి..అందరికీ ఆమోదయోగ్యమైన వాతావరణాన్ని సృష్టించి శెభాష్ అనిపించుకోవడమే గాక 'ది బెస్ట్ రోల్మోడల్'గా జాతీయ అవార్డు అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. అతడే బెంగళూరుకి చెందిన ప్రతీక్ ఖండేల్వాల్. 2014లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుముక తీవ్రంగా దెబ్బతింది. దాంతో అతడు పూర్తిగా మంచానికే పరిమితయ్యాడు. 20 ఏళ్లకే అతడి జీవితం..గమనం లేకుండా అయిపోయింది. వీల్ఛైర్కే పరిమితమైపోయాడు. అయితే అప్పుడే తెలిసింది తనలాంటి దివ్యాంగులు పడుతున్న కష్టాల గురించి. ఈ నగరాలన్నీ అవయవాలు బాగున్న వాళ్లకే సౌకర్యంగా ఉన్నాయని గుర్తించాడు. పబ్లిక్ ప్రదేశాలు..కార్యాలయాలు, ఆస్పత్రులు ఇలా ప్రతీది దివ్యాంగులకు అననుకూలమైనవని గుర్తించాడు. ఈ మహానగరాలు మాలాంటి వాళ్లకు సౌలభ్యాన్ని అందిచలేనివా.. అనే ప్రశ్నలు ప్రతీక్ని చుట్టుముట్టాయి. అక్కడ నుంచి పుట్టుకొచ్చిందే.."ర్యాంప్మైసిటీ" సంస్థ. నగరాలను అందరికీ సౌలభ్యకరంగా మార్చే లక్ష్యంతో ర్యాంప్మైసిటీని ప్రారంభించి..ఎన్నో ప్రదేశాల్లో వికలాంగులు, పెద్దవాళ్లు, ఈజీగా నడవ గలిగేలా ర్యాంప్లు ఏర్పాటు చేశాడు. పోలీస్ స్టేషన్తో సహా అన్ని ప్రదేశాల్లో ఇవి ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాడు. మొదట్లో ఇవెందుకు చాలా ఖర్చు అనే ప్రశ్నలతో వ్యతిరేత వచ్చినా..ఆగలేదు ప్రతీక్. ఎలాగైనా, ఏనాటికైనా..తాను అనుకున్నది నెరవేరాలనే సంకల్పంతో ముందగుకు సాగి..ఇప్పటి వరకు మొత్తం 600 బహిరంగ ప్రదేశాల్లో ఈ ర్యాంప్లను ఏర్పాటు చేశాడు. పట్టణ జీవితం అందరికీ అనుకూలంగా ఉండాలి..అన్ని సౌకర్యాలు అనుభవించాలి అన్న ఆ కాంక్ష నుంచి వచ్చిన ఈ ఆలోచన..తనలాంటి వాళ్లకు ఎందరికో ఉపయోగపడింది. అనుకోని వైకల్యం శాపమైందని అనిపించేలా పబ్లిక్ ప్రదేశాలు..రోజువారీ ప్రదేశాలు కనిపించకూడదు..మాలాంటి వాళ్ల ఉనికి సులభతరం చేసేలా ఉండాలి అంటాడు ప్రతీక్. అతడి నిస్వార్థపూరితమైన ఆ ఆలోచనే ప్రతీక్ని ఏకంగా రాష్ట్రపతిచే ది బెస్ట్ రోల్ మోడల్గా జాతీయ అవార్డుని అందుకునేలా చేసింది. అంతేగాదు అనుకోని వైకల్యం లేదా పుట్టుకతో వైకల్యం అయినా..మన సంకల్ప శక్తి ముందు చాలా చిన్నది..మన గమనాన్ని ఎన్నటికీ ఆపలేదని నొక్కి చెబుతుంటాడు ప్రతీక్. ఇక్కడ ప్రతీక్ తన గాయాన్నే బలంగా మార్చుకుని..తనలాంటి వాళ్లకు నగరాలకు అనుకూలంగా మార్చే ఆవిష్కరణకు నాంది పలికి..శెభాష్ అనిపించుకున్నాడు. ఈ కథ విధి వెక్కిరించే ప్రయత్నం చేస్తే..తగిన విధంగా బదులివ్వాలే గానీ నిరాశ నిస్ప్రుహల్లోకి వెళ్లిపోకూడదు అని చెబుతోంది కదూ..!. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నానుడికి అసలైన అర్థం ఈ ప్రతీక్.(చదవండి: అందువల్లే భారత్ చాలా స్పెషల్..! ఫ్రెంచ్ మహిళ ప్రశంసల జల్లు) View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: అందువల్లే భారత్ చాలా స్పెషల్..! ఫ్రెంచ్ మహిళ ప్రశంసల జల్లు) -
మోగనుంది పెళ్లి బాజా
పెళ్లి బాజాలు మోగే సమయం సమీపిస్తోంది. యువతీ యువకులు మూడుముళ్లతో ఒక్కటై పెద్దల ఆశీర్వచనాలు అందుకోవాలని భావిస్తున్నారు. మూడు నెలల మూఢం ముగియనుంది. ఈ నెల 19 నుంచి సుముహూర్తాలు ఉండటంతో సందడి మొదలుకానుంది. పెళ్లి ముహూర్తాలు సమీపిస్తుండటంతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.కల్యాణ వీణ మోగే వేళ దగ్గరకొస్తోంది. మూడు నెలల విరామం తర్వాత సుముహూర్తాలు రావడంతో శుభకార్యాల సందడి మొదలుకానుంది. గతేడాది నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 13 వరకు మూఢం కావటంతో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. మాఘ మాసం శుభప్రదమైనా మూఢం కారణంగా ఈ నెల 18 వరకు ముహూర్తాలు లేవు. ఎట్టకేలకు ఈ నెల 19 నుంచి ఫాల్గుణమాసం మొదలు కావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. శుభకార్యాల సీజన్.. శుభకార్యాల సీజన్ కావడంతో ఊరువాడా సందడి మొదలు కానుంది. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, పెద్దల దీవెనలతో జంటలు ఒక్కటికానున్నాయి. వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, నిశి్చతార్థాలులు జరగనున్నాయి. ఇప్పటికే రెండు, మూడు నెలల ముందు నుంచి సంబంధాలు కుదుర్చుకున్న జంటల తల్లిదండ్రులు కల్యాణ మండపాలు మాట్లాడటం, బంగారం, పట్టుబట్టలు ఇతర సామగ్రి కొనుగోలును ముమ్మరంగా చేస్తున్నారు. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అన్నిచోట్లా బాజాభజంత్రీలు మార్మోగనున్నాయి. ఎందరికో ఉపాధి.. శుభఘడియలు రానుండటంతో చాలా వర్గాల వారికి ఉపాధి దొరకనుంది. 20 నుంచి 25 వర్గాలకు ఉపాధి లభించనుంది. ప్రధానంగా పురోహితులు, షామియానా సెట్టింగ్లు, వాయుద్య కళాకారులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, ఆర్కెస్ట్రా, క్యాటరింగ్, బ్యూటీ పార్లర్, ట్రావెల్ ఏజెన్సీలకు డిమాండ్ ఏర్పడింది. చాలామంది ఇప్పటికే బుక్ చేసుకోవటంతో వాటికి డిమాండ్ పెరిగింది. సుముహూర్తాలు ఇవే ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగషు్ట, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్నాయని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలలో: 19,20,21,24,25,26 మార్చిలో: ,5,6,7,8,11,12,13,14,20,21,25,29 ఏప్రిల్లో: 1,2,3,4,5,6,7,8,10,11,12,21,25,26, 28,29,30సిద్ధమవుతున్నారు గత ఏడాది నవంబర్ నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండటంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలతో పాటు పలు శుభకార్యాలు జరగనున్నాయి. ముందుగా సంబంధాలు కుదుర్చుకున్న వారు వివాహాలు సిద్ధమవుతున్నారు. –లంకా లక్ష్మణశర్మ, వేదపండితులుఅభిరుచికి తగిన విధంగా మూడు నెలలుగా మూఢం ఉండటంతో పెళ్లిళ్లు లేవు. దీంతో పనులు లేకుండా పోయాయి. ఫిబ్రవరి 19 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో సీజన్ మొదలైంది. వరుసగా మూడు నెలలు పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శుభకార్యాలు చేసుకునే వారి అభిరుచికి తగ్గట్లుగా ప్రోగ్రాంలు తీస్తున్నాం. –ఎ.దేవివరప్రసాద్, ఫొటోగ్రాఫర్ముందుగానే బుక్ చేసుకుంటున్నారు ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో కల్యాణ మండపాలు ముందే బుక్ చేసుకుంటున్నారు. అడ్వాన్స్లు కడుతున్నారు. కల్యాణ మండపాలతో పాటు పచ్చిపూల మండపాలు కట్టేవారు, క్యాటరింగ్, వంటమేస్త్రి, పురోహితుల ఇలా ఎంతో మందికి డిమాండ్ ఏర్పడనుంది. వ్యాపారాలు బాగుంటాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. –దేరంగుల శ్రీనివాసరావు, ఫంక్షన్హాల్ నిర్వాహకుడు -
అందువల్లే భారత్ చాలా స్పెషల్..!
భారత్లో నివశించిన చాలామంది విదేశీయలు భారత్పై మనుసు పారేసుకుని ఇక్కడే ఉండిపోవడమే కాదు..తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుచున్నామని కూడా చెప్పారు చాలామంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ఫ్రెంచ్ మహిళ కూడా చేరిపోయింది. భారత్ని ప్రత్యేకంగా చూపే విషయాలను వివరించి అందరి మనుసులు దోచుకుంది. మన దేశ గొప్ప తనాన్ని, ఔన్యత్యాన్ని రెండు మాటల్లో చాలా చక్కగా వివరించారామె. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..భారతదేశంలో నివసిస్తున్న ఓ ఫ్రెంచ్ మహిళ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక అందర్నీ అమితంగా ఆకర్షించింది. తన స్వదేశమైన ఫ్రాన్సుతో భారత్ని పోలుస్తూ..ఆ విషయాల్లో ఫ్రాన్స్ కంటే భారత్ ముందు ఉందని అన్నారామె. అలాగే భారత్ని ప్రత్యేకంగా చూపించే అంశాలను సైతం ప్రస్తావించారామె. ఈ మూడు ఏంటంటే..బలమైన సమాజ భావం, దేశ సహజ సౌందర్యం, చేతితో తయారు చేసిన వస్త్రాలు. అంతేగాదు తన స్నేహితులు తరచుగా భారత్లోని సమాజ భావం గురించి చర్చిస్తారని, వాటి అంచనాల ఒత్తిడి అధికంగా ఉంటుందని వాళ్లంతా అంటుంటారని అన్నారామె. అయితే తాను దీన్ని పూర్తి చేసుకోలేనని, తాను అలా ఉండేలనని కూడా ఒప్పుకున్నారామె. అయితే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు ఆదరించుకుంటూ.. సహాయసహకారాలు అందించుకోవడం చూస్తుంటే..చాలా సంతోషంగా అనిపిస్తుందని అందామె. ఇది కుందేళ్లకు ఆహారం ఇచ్చేదాంతో పోల్చారామె. అదే సమయంలో తన స్వదేశం ఫ్రాన్సుకి కూడా దాని స్వంత ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయన్నారామె. అలాగే భారత్లో ప్రతి వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు. ఇక ఇక్కడ దుస్తులు ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటోంది. ఎంబ్రాయిడరీ, పూసల పనిలో ఉన్న నైపుణ్యం తనను ఆశ్చర్యపరుస్తాయిని అన్నారామె. తనకు ఇక్కడ కుర్తీలు కూడా అద్బుతంగా కనిపిస్తాయిని, అవి ఫ్రాన్స్లో హైఫ్యాషన్గా పరిగణిస్తారని, ఖరీదు కూడా ఎక్కువేనని తెలిపింది. చివరగా పోస్ట్లో భారత్లో బలాలుగా భావించిన వాటిని గురించి కూడా హైలెట్ చేశారామె. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే గాక, మా దేశంలో ఈవిషయాలను ఇష్టపడటం చాలా బాగుంది అంటు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Freldaway (@freldaway) (చదవండి: పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!) -
చూడాలని వచ్చి.. భారతీయురాలిగా మారి..
ఆమె బ్రిటన్లో జన్మించారు. భారతదేశంపై ప్రేమ పెంచుకుని ఇక్కడే ఉండిపోయారు. కేరళలో స్థిర నివాసం ఏర్పరుచుకుని, అనేక రచనలు చేయడంతో పాటు, స్థానిక కళల ప్రాచుర్యానికి పాటుపడ్డారు. ఈ నేపధ్యంలో భారత పౌరసత్వం పొందాలని ఆమె తాపత్రయ పడ్డారు. ఎట్టకేలకు ఆమె తన కలను నెరవేర్చుకున్నారు. ఆమె మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత పెపిటా సేథ్ (84). తాజాగా ఆమె అధికారికంగా భారత పౌరసత్వాన్ని పొందారు.గత 50 ఏళ్లుగా కేరళలోనే ఉంటున్న పెపిటా సేథ్.. 2024లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా త్రిశూర్ జిల్లా కలెక్టర్ అర్జున్ పాండియన్ చేతుల మీదుగా ఆమె పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. సహజసిద్ధ పౌరసత్వ విధానం ద్వారా ఆమెకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు వెల్లడించారు. తనకు భారత పౌరసత్వం రావడంపై పెపిటా సేథ్ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను ఇక్కడ ఉన్నందుకు, భారత పౌరురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా చిరకాల స్వప్నం’ అని ఆమె పేర్కొన్నారు. #WATCH | Thrissur, Kerala | Padma Shri awardee Pepita Seth says, "I was born and brought up in UK. I came to India and gradually, I arrived in Kerala... Slowly I grew interested in the culture here and wrote many books... I stayed here for nearly 12 years..." (06.02) https://t.co/96oBzpVFuP pic.twitter.com/8aHrpsBeSu— ANI (@ANI) February 7, 2026యూకేలో పుట్టి పెరిగిన ఆమె తొలుత భారత్ను సందర్శించేందుకు వచ్చారు. ఢిల్లీ, ముంబై తదితర నగరాలను సందర్శించిన తర్వాత ఆమె కేరళకు చేరుకున్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమె కేరళనే తన నివాసంగా మార్చుకున్నారు. కేరళలోని కథాకళి, తెయ్యం వంటి కళారూపాలతో పాటు స్థానిక ఉత్సవాలైన మేళాలు, ఉత్రాలిక్కావు వంటి కార్యక్రమాలపై పెపిటా సేథ్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ఉత్తర కేరళలో ప్రసిద్ధి చెందిన 'తెయ్యం' అనే నృత్యంపై ఆమె పరిశోధన చేసి, పలు పుస్తకాలు కూడా రచించారు.గత 12 ఏళ్లుగా త్రిస్సూర్లో నివసిస్తున్న ఆమె, ఈ ప్రాంతాన్ని తన పరిశోధనలకు, ప్రయాణాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. ఫోటోగ్రఫీ ద్వారా కేరళ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కళ, సాంస్కృతిక రంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2012లో ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. పర్యాటకురాలిగా వచ్చి, భారతీయతను అలవరచుకున్న పెపిటా సేథ్ ఇప్పుడు అధికారికంగా భారతీయురాలిగా మారారు.ఇది కూడా చదవండి: రిటైర్మెంట్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -
ఈ నెల 9 నుంచి శంకర నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరం
"నేత్రదానం కన్నా మిన్న.. ఉన్న చూపును కాపాడటం." ఈ ఆశయంతోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శంకర నేత్రాలయ సంస్థ దాతల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా లక్షలాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన లేక, ఆర్థిక స్తోమత సరిపోక అధిక సంఖ్యలో కంటి పొరలతో పాటు ఇతర చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా శంకర నేత్రాలయ అనేక ఉచిత శిబిరాలను నిర్వహిస్తోంది.కన్నవారినీ....జన్మభూమినీ స్మరించుకుంటూ! ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా శాంతాబయో టెక్నీక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్. కోడూరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి - వసంత దంపతులు తమ స్వగ్రామం పాపిరెడ్డిపాళెం తోపాటు పరిసర గ్రామ ప్రజల నేత్ర సంరక్షణే లక్ష్యంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శంకర నేత్రాలయ కంటి వైద్యశాల - చెన్నై , శాంతా - వసంతా ట్రస్టు - హైదరాబాదు సంయుక్తంగా ఈ ఉచిత కంటి పొర చికిత్స కార్యక్రమాన్ని తొమ్మిది రోజులపాటు జరుపనున్నారు. తమని కన్న అమ్మా, నాన్నలని తాము పుట్టిన జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదన్న సందేశం ఇస్తూ ఇతరులకి స్ఫూర్తి కలిగించేలా వరప్రసాద్ రెడ్డి ఈ మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టారు. తోటపల్లి గూడూరు మండలం లోని ఇస్కపాళెం గ్రామంలో గల ప్రభుత్వ బీ. సీ. హాస్టల్ ప్రాంగణంలో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 9 రోజులపాటు దాదాపు మూడు వేలమందికి అవసరమైన పరీక్షలు జరిపి, ఇదే శిబిరంలో చివరి 5 రోజులు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. రోగికి కావలసిన మందులతో పాటు కంటి అద్దాలని కూడా ఉచితంగానే అందివ్వనున్నారు. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యం.! అత్యాధునిక పరికరాలతో కూడిన సంచార వాహనాల ద్వారా గ్రామాల వద్దకే వెళ్లి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం. కంటి పొరలు ఉన్నట్లు గుర్తించిన రోగులకు అదే శిబిరంలో ఎటువంటి ఖర్చు లేకుండా శస్త్రచికిత్స చేసి అవసరమైన లెన్స్ లు అమర్చడం. దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం. మధుమేహం (Diabetes) ఉన్నవారిలో వచ్చే కంటి సమస్యల (Diabetic Retinopathy) పై ప్రత్యేక అవగాహన కల్పించడం.కంటి పొరలు ఆధునిక చికిత్స....! కంటిలోని సహజసిద్ధమైన లెన్స్ (Lens) మసకబారడాన్నే 'కంటి పొర'లేదా 'కాటరాక్ట్' అంటారు. ఇది సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంది. అయితే, ఆధునిక వైద్యం ఇప్పుడు ఈ సమస్యను చాలా సులభంగా, నొప్పి లేకుండా పరిష్కరిస్తోంది. శంకర నేత్రాలయ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు కంటి వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. వీరు ఉచితంగా పేదవారికి కూడా అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు.ఆపరేషన్ విధానాలు ....! ప్రస్తుతం కంటి పొర చికిత్సలో ప్రధానంగా రెండు రకాల పద్ధతులు వాడుకలో ఉన్నాయి. మొదటిది ఫాకో ఎమల్సిఫికేషన్, ఇది అత్యంత ఆధునిక పద్ధతి. ఇందులో కుట్లు ఉండవు. అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా మసకబారిన పొరను కరిగించి తీసివేస్తారు. దాని స్థానంలో 'ఫోల్డబుల్ లెన్స్'ను అమరుస్తారు. ఇది చాలా చిన్న రంధ్రం ద్వారా జరుగుతుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది.రెండవది లేజర్ కాటరాక్ట్ సర్జరీ , ఇది మరింత ఖచ్చితత్వంతో కూడిన పద్ధతి. బ్లేడ్ వాడకం లేకుండా లేజర్ సాయంతో ఆపరేషన్ చేస్తారు."కంటి చూపు మనిషికి దేవుడు ఇచ్చిన అతిపెద్ద వరం." కంటి పొరలు వచ్చాయని భయపడకుండా పరీక్షలు చేయించుకుని, సకాలంలో ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ప్రపంచాన్ని స్పష్టంగా చూడవచ్చు.గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి...! డబ్బు లేని కారణంతో ఎవరూ చూపు కోల్పోకూడదనే ఉదాత్తమైన భావంతో గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం శంకర నేత్రాలయ , శాంతా - వసంతా ట్రస్టు సంయుక్తంగా ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పేద ప్రజలకు, వృద్ధులకు ఈ సమాచారాన్ని చేరవేసి, ఉచిత సేవలని సద్వినియోగం చేసుకునేలా తోటపల్లి గూడూరు పరిసర ప్రాంత ప్రజలకి చైతన్యం కల్పించాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. -
పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!
కొన్ని చిన్న సంఘటలను మనల్ని ఎంతగానో కదలించి..నిశబ్దమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి. ఆ క్షణంలో మనకు నచ్చనిది కూడా ఎందుకనో ఇష్టంగా మారుతుంది. అది మనకు అపురూపమైన క్షణంగా మారుతుంది. చుట్టూ పరిస్థితులు ఎంత హృద్యంగా ఉన్నా.. వాళ్ల ముఖాల్లోని నవ్వు మనకెంతో నేర్పిస్తుంది. అందుకు ఉదాహరణ ఈ పూలు అమ్మే అమ్మాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో పూలు అమ్మే అమ్మాయికి, ఒక యువతికి జరుగుతన్న చక్కటి సంభాషణ ఇది. మహెక్ షా అనే అమ్మాయి తనకెదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. తనకు సాధారణంగా పూలంటే ఇష్టముండదని, అవి ఒక్కరోజులోనే వాడిపోతాయనే బాధతోనే ఇష్టపడని అన్నారామె. అందుకే తాను పూలకు చాలా చాలా దూరంగా ఉంటానని అన్నారామె. అయితే అదేం తెలియని ఆ పూలమ్మే అమ్మాయి..ఓ పువ్వుని తీసుకొచ్చి నేరుగా ఒళ్లో పెట్టేసింది. తనకు నచ్చవని చెప్పిన పర్లేదు..ఉచితంగానైనా తీసుకోండని అభ్యర్థించింది. చివరికి తాను ధర ఎంత అని అడగగానే..తోచింది ఇమ్మని కోరింది. దాంతో కొంత మొత్తం చెల్లించాను. దాంతో ఆమె ఎంతో సంతోషంతో వెనుదిరిగింది. అయితే ఆమె ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ పూలు తన ఒళ్లోబెట్టిన విధానం..తనను ఆ క్షణం పూలను ఇష్టపడేలా చేసింది. పైగా ఎంతో అప్యాయంగా నవ్వతూ మాట్లాడిన ఆ అమ్మాయిని చూసి.సదా ఉల్లాసభరితంగా ఉండటం ఎలాగో తెలిసిందంటూ.. అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అంతేగాదు షా ఆ వీడియోకి..ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్న మనం మాత్రం దయగానే ప్రవర్తించాలి. అలా ఉండాటానికి మించి గొప్ప నైపుణ్యం మరోకటి లేదంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు..ఈ ఘటన దయకు చిరునామా, అలాగే..ఏ పనిచేసినా..నవ్వుతూ చేస్తే మనంత ధనవంతుడు మరొకరు ఉండరు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mahek shah (@trulymicky) (చదవండి: 50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!) -
జీవనశైలిపై చెరగని ముద్ర: టాటూ ట్రెండ్
ఒకప్పుడు సంప్రదాయానికి, ఆచారాలకూ పరిమితమైన పచ్చబొట్టు (టాటూ) నేడు ఆధునిక జీవనశైలిలో ఫ్యాషన్, వ్యక్తిగత గుర్తింపు, భావ వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో టాటూ అనేది శరీరంపై వేసుకునే డిజైన్ మాత్రమే కాదు.. ఇది ‘లైఫ్స్టైల్ చాయిస్’. కాలేజీ విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు, సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరిలోనూ టాటూ పట్ల ఆసక్తి పెరుగుతోంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే ఆకాంక్ష అందరిలోనూ పెరుగుతోంది. ఈ కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన రెండు కళ్లలోనూ టాటూ వేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నప్పటికీ.. ప్రస్తుత జీవనశైలిలో ఇది స్టైల్ స్టేట్మెంట్గా మారింది. మన సంస్కృతిలో పచ్చబొట్టు అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. గిరిజన తెగలు, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ, ఆధ్యాతి్మక విశ్వాసాలకు ప్రతీకగా పచ్చబొట్లు వేసుకునేవారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం ఆధునికతను సంతరించుకుని ‘స్టైల్ స్టేట్మెంట్’గా మారింది. నేడు టాటూ అంటే ప్రేమ, స్నేహం, కుటుంబం, నమ్మకం, స్వీయ భావనం ఇలా ఎన్నో భావోద్వేగాలకు ప్రతిరూపం. అయితే ఈ టాటూ ఆర్ట్కు ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రస్తుత తరంలో మరింత వినూత్నత్వాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న శైలి మోడ్రన్ ఫ్యాషన్లో భాగమౌతోంది. బ్లాక్ అండ్ గ్రే టాటూలు క్లాసిక్గా ఉంటే, కలర్ టాటూలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇందులో చిన్న డిజైన్లు, సూక్ష్మ అక్షరాలతో మినిమలిస్ట్ టాటూలు, మనుషులు, జంతువుల ముఖాలు, ప్రకృతి దృశ్యాలతో రియలిస్టిక్ టాటూలు రూపుదిద్దుకుంటున్నాయి. సంప్రదాయ గిరిజన శైలితో ట్రైబల్ టాటూలు, విభిన్న ఆకృతులు, రేఖల సమ్మేళనంతో జియోమెట్రిక్ టాటూ.., అంతేకాకుండా రంగుల మేళవింపుతో వాటర్కలర్ టాటూలు సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో 3డీ టాటూలు, గ్లో ఇన్ ద డార్క్ టాటూలు ట్రెండ్గా మారుతున్నాయి.కెరీర్గా.. టాటూ ఆర్టిస్ట్! నగరంలో టాటూ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో హైఎండ్ టాటూ స్టూడియోలు ఉన్నాయి. సెలబ్రిటీలు, యూత్ ప్రభావంతో లాభదాయక వ్యాపారంగా మారింది. టాటూ ఆరి్టస్ట్ ఓ ప్రత్యేక కెరీర్గా మారింది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో టాటూ ఒక కీలక భాగంగా మారింది. ర్యాంప్ వాక్లు, ఫొటోషూట్లు, బ్రాండింగ్లో టాటూలు వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తున్నాయి. టాటూ అంటే స్వీయ వ్యక్తీకరణకు ఒక మాధ్యమంగా మారింది. సున్నితమైన ప్రదేశాల్లో సేఫేనా..?! టాటూ వేసుకోవడంలో చేతులు, భుజాలు, వెన్ను, మెడ వంటి ప్రదేశాలు సాధారణం. కానీ ఇటీవల కాలంలో కళ్లలో (ఐబాల్ టాటూ), నాలుక, పెదాలు, చెవుల వెనుక.. ఇలా అత్యంత సున్నిత ప్రాంతాల్లోనూ టాటూలు వేయించుకుంటున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం సున్నిత ప్రదేశాల్లో టాటూ వేయించుకోవడం తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. దృష్టి కోల్పోవడం, ఇన్ఫెక్షన్లు, నరాల సమస్య వంటి ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.. టాటూ రంగంలో ఆధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచి్చంది. స్కిన్ ఫ్రెండ్లీ ఇంక్స్, డిజిటల్ డిజైన్ ప్రివ్యూలు, నొప్పి తగ్గించే టెక్నిక్స్ టాటూలను మరింత సురక్షితంగా మార్చాయి. కొన్ని స్టూడియోలు పూర్తి మెడికల్ స్టాండర్డ్స్తో పనిచేస్తుండటం విశేషం. ఇటీవల ఒక వ్యక్తి కంట్లోనే టాటూ వేయించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైద్యుల సలహాతో అధునాతన పద్ధతిలో నేపాల్ వెళ్లి మరీ టాటూ వేయించుకున్నాడు. అతను స్వయంగా టాటూ ఆరి్టస్టు కావడం గుర్తించాల్సిన అంశం.సరి్టఫైడ్ టాటూ ఆర్టిస్ట్లు.. టాటూ వేయించుకునే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టాటూ ఫ్యాషన్ అయినా, జీవితాంతం ఉండే గుర్తు. టాటూ వేసుకునే ముందు ముఖ్యంగా సర్టిఫైడ్, అనుభవజ్ఞుడైన టాటూ ఆరి్టస్ట్ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్టెరిలైజ్డ్ సూదులు, సేఫ్ ఇంక్ ఉపయోగిస్తున్నారా అనేది ప్రధానం. స్కిన్ అలర్జీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. టాటూ తర్వాత ఇచ్చే ఆఫ్టర్ కేర్ సూచనలు తప్పక పాటించాలి.నచ్చకుంటే లేజర్ రిమూవల్.. అప్పుడెప్పుడో వేసుకున్న టాటూ ప్రస్తుతం నచ్చకపోతే..? దీనికి పరిష్కారం లేజర్ టాటూ రిమూవల్. లేజర్ టెక్నాలజీ ద్వారా టాటూను దశలవారీగా తొలగిస్తారు. అయితే ఇది పూర్తిగా రిస్క్ ఫ్రీ కాదు. స్కిన్ డార్కెనింగ్, మచ్చలు వంటి సమస్యతో పాటు ఖర్చుతో కూడినది. డాక్టర్ సలహాతో మాత్రమే చేయించుకోవాలి. నగర జీవనంలో స్టైల్ స్టేట్మెంట్గా మారినప్పటికీ ఈ ట్రెండ్ అనుసరించే ముందు సరైన జాగ్రత్తలు పాటించాలని, ఎందుకంటే ఫ్యాషన్ క్షణికం, కానీ టాటూ జీవితాంతం అంటున్నారు నిపుణులు. -
చర్మ సౌందర్యం కోసం..!
చర్మ సౌందర్యం కోసం ఎన్నో మాయిశ్చరైజన్లు రాసి విసిగిపోయి ఉంటారు. అలాంటి వాళ్లు సహజసిద్ధంగా ముఖానికి తేమను అందించి కోమలంగా ఉంచే ఈ టిప్స్ని ఫోలో అయితే సరి. పొడిబారటం తగ్గుతుంది..అలాగే మేను ప్రకాశవంతంగా మెరుస్తుంది కూడా. మరి అవేంటో చూద్దామా..వేడినీటిలో కప్పు పాలను కలిపి స్నానం చేస్తే చర్మ లావణ్యం పెరుగుతుంది. చలికి పొడి బారిన చర్మానికి మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్లు చేయడం సాధ్యం కానప్పుడు ఇలా చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పనిచేస్తుంది. పొడి చర్మానికి ఈ కాలంలో సబ్బు కూడా శత్రువుగా మారుతుంది కాబట్టి సున్నిపిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సున్నిపిండిలో పాలు పోసి పేస్టులా చేసుకుని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కోల్పోదు. అంతేకాకుండా సహజమైన నూనె అందడం వల్ల మృదువుగా మారుతుంది.తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి వలయాకారంగా మర్దన చేయాలి (కళ్ల చుట్టూ మినహాయించాలి). ఇది నాచురల్ స్క్రబ్. చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగాఈ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. -
50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!
50 ఏళ్లు దాటాక ఇదివరకటిలా అధిక ప్రభావ వ్యాయామాలు చేయడం కష్టం. మోకాలి నొప్పి, గాయం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. పైగా ఒంట్లో మునుపటి ఎనర్జీ ఉండదు. అందువల్ల ప్రజలు సులభమైన తక్కువ ప్రభావ వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఓ వయసు వచ్చాక బరువు తగ్గించే వ్యాయామాలకు శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు ఇంట్లో సులభంగా చేసే ఈ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అవేంటో చూద్దామా..!.మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉపయోగకరంగా ఉండే ఈ వ్యాయామాలు 80,90 లేదా వంద కిలోలు బరువుతో ఉండే వాళ్లకు అత్యంత ఉపయుక్తమైనవి. చాలా తేలిగ్గా చేసుకునేవి.మడమ నుంచి తుంటి వరకు నిలబడటం..ఒక కాలు వంచి తుంటికి తాకే ప్రయత్నం చేయాలి. అలాగే చేతులు నిటారుగా ఉంచాలి. ఈ వ్యాయామం మోకాళ్లను సురక్షితంగా ఉంచుతూ తొడలు, పిరుదులను సక్రియం చేయడానికి హెల్ప్ అవుతుంది.తక్కువ-ప్రభావ జంపింగ్ జాక్ఇది మోకాలికి అనుకూలమైన వెర్షన్. పక్కపక్కలకు కాళ్లను కదుపుతూ చాలా తక్కువ మోతాదులో జంప్ చేయడం. ఇది హృదయ స్పందన రేటుని సున్నితంగా పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. కీళ్లపై ఒత్తిడి పడకుండా సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.ఒక వైపు నుంచి ఒక వైపుకి..నియంత్రిత పద్ధతిలో ఒక వైపు నుంచి ఒక వైపు నడక. చాలా ఈజీగా చేసే వ్యాయామం. ఇది తుంటి కండరాలను బలోపేతం చేయడానికి, స్థిరత్వాన్నిఇ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని 20 సార్లు చేసి, ఐదు సెట్లు పునరావృతం చేస్తే చాలని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. స్థిరత్వంపై దృష్టి పెడుతూ..తేలికైన ఈ కదలికలు బాడీని ఫిట్గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల బరువు తగ్గడమే గాక, మోకాళ్ల గాయాలు గానీ, సమస్యలు ఎదురవ్వవని అంటున్నారు. View this post on Instagram A post shared by Nehafun&fitness🤸♂️🧘♀️ (@nehafunandfitness) (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
పాత్రికేయులూ... మమ్మల్ని అలా పిలవద్దు... ప్లీజ్!
గౌరవనీయులైన పాత్రికేయులకు సమస్త మగపురుగులూ నమస్కరించి వ్రాయునది ఏమనగా! అయ్యా... మా జంతు ప్రపంచంలో మగపురుగులైన మేము మా సాటి ఆడజీవులకు ఎంతో గౌరవమిస్తూ ఉంటాం. అదెలాగో చెబుతాం వినండి. ఒకవేళ... మాలో తేళ్ల జాతి గనక ‘షోలే’ సినిమా తీశాయనుకోండి. అప్పుడు మా జాతిలోని ఆడ బసంతీయే... మగతేలును పట్టుకుని గావుకేక పెడుతుంది. ఏమనీ... ‘‘వీరూ... ఏ బిచ్ఛువోకే సామ్నే మత్ నాచ్ నా’’ అంటూ అరిచి గీపెడుతుంది. ఎందుకంటే... మా తేళ్లజాతిలో లేడీతేలును పడేయాలంటే తేలు మగపురుగులైన మేము మా జాతి శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించి చూపాలి. మీలో సాల్సా, హిప్హాపుల్లా మా తేలుజాతి శాస్త్రీయనృత్యం పేరేమిటో తెల్సా? దాని పేరు ‘ ప్రొమెనాడ్ ఎ డియో’’ (Promenade à deux). మా పెళ్లి తర్వాత మా ట్రెడిషనల్ డాన్స్ చూపాకే మాకు శోభనం జరుగుతుంది. మా తేళ్ల జాతిలో తరతరాలుగా యుగయుగాలుగా కొనసాగుతూ వస్తున్న పవిత్రమైన ఆచారమిది. శోభనపు గదిలో ఓ తేలుజంట ఎంటర్ కాగానే... మా ఆడలేడీస్ మమ్మల్ని చూస్తూ... మీ మానవులు ‘పాడు గజాలా పాడు’ అన్నట్టుగానే, ‘‘ఆడరా... తేలుగా ఆడు’’ అని ఆదేశిస్తాయి. అప్పుడు మేమూ... ‘తకిట తధిమి తకిట తధిమి తందానా... హృదయ లయల జతుల గతుల థిల్లానా’ అంటూ డాన్స్ చేయాల్సిందే. ‘తడబడు అడుగుల తప్పని తాళానా...’’అంటూ పొరబాటున మా అడుగులు తడబడ్డాయనుకోండి. సదరు ఆడతేలు ‘ఏయ్... చంద్రమోహన్. నువ్వు ఆడుతున్న ఆ డాన్సేమిటీ... పడుతున్న ఆ అడుగులేమిటీ?’ అంటూ అరవదు సరికదా... మా డాన్స్ సరిగా కుదరనందుకు పనిష్మెంట్గా గబుక్కున మమ్మల్ని పట్టేసి గుటుక్కుమంటూ మింగేస్తుంది. అన్నట్టు మా తేలు చిన్నారులకు నర్సరీలలో చెప్పే రైమ్ ఏమిటో తెల్సా?చిట్టి తేలమ్మా... అమ్మ చెప్పిందాపెళ్లికెళ్లావా... మొగుణ్ణి చూశావాడాన్సులాడావా... గుటుక్కున మింగావా!∙∙ ఇక ‘జంపింగ్ స్పైడర్’ అని పిలిచే మా సాలీడుజాతి మగపురుగుల గురించి సాలిడ్గా చెప్పాల్సిందెంతో ఉంది. మా జాతిలో డాన్స్ ఒకటే సరిపోదు. కాళ్లూ చేతులూ వేగంగా కదిలిస్తూ పుట్టే వైబ్రేషన్స్తో పాట కూడా పాడాలి. ఆ పాటకు మేమే బాణీ కట్టుకోవాలి. మా బాణీలు ఎంత బాగుంటాయో తెల్సా. పొరబాటున మీరుగానీ విన్నారంటే...‘ఏంట్రా బాబూ ఈ జంపింగు స్పైడర్ల బాణీల్లో ఇంత మ్యూజిక్ ఉందీ!’ అంటూ ఆశ్చర్యపోతారు. ఇలా మా పాటకు మేమే ‘కొరియోగ్రఫీ’ చేసుకుని, మా లేడీస్ ముందు జంపింగ్ చేస్తూ మరీ డాన్స్ ఆడాలి. ఇక మా జంపింగు స్పైడర్లలో ఒకజాతి తాలూకు డాన్స్ ఎంతబాగుంటుందో తెల్సా? అందుకే... మీ మనుషుల్లాగే మేము మావాటిని ‘పీకాక్ స్పైడర్స్’ అని పిలుస్తాం. ఎంతైనా... అవి మా జాతి నాట్యమయూరాలు కదా మరి! ఇదంతా చేసి మా లేడీస్ను ఇంప్రెస్ చేస్తేనే మా పెళ్లి... లేదంటే ఆ పూటకు దాని బ్రేక్ఫాస్టూ, లంచూ, డిన్నరూ, చిరుతిండీ, అంచూ, అప్పడం... అన్నీ మేమే! ఇక మాలోనే ఇంకో జాతి ఉంది. పెళ్లి తర్వాత అది మొగుణ్ణి తప్పక తినేస్తుంది కాబట్టే దాని పేరు బ్లాక్ ‘‘విడో’’ అట! ∙∙ ఇంకా చెప్పాలంటే... పురుగుల్లోనే ఒక రకమైన ‘ప్రేయింగ్ మేంటిస్’ జాతి ఖర్మ ఎలా తగలడిందంటే... శోభనం జరుగుతుండగానే అలా లిప్కిస్తో మొదలుపెట్టి... మా పెళ్లాలు మమ్మల్ని ఇలా తినేయడం మొదలుపెడతారు. మరి మగాళ్లమైన మేము శుభకార్యం మధ్యలోనే చనిపోతే ఎలా? అందుకే... మా ఆడ మేంటిసులు మమ్మల్ని తినేసినా అసలు పని ఆగకుండా ఉండటం కోసం ఓ స్పేర్ మెదడును (గ్యాంగ్లియాన్లను) కడుపులో ఉంచుకుంటాం. ఇలా మా తర్వాతి తరాలు బలంగా ఉండటం కోసం... పొదగాల్సిన లేదా పిల్లలు పెట్టాల్సిన మా ఆడలేడీస్కి శక్తి సమకూర్చడం కోసం మా దేహాన్నే త్యాగం చేసేస్తాం. మా ఆడవారి అంగీకారమైతే తప్ప... వాళ్లను బలవంతం చేయడమో, మా ప్రేమను ఒప్పుకోమంటూ ఇబ్బంది పెట్టడమో, కుదరకపోతే యాసిడ్ విసరడమో చేయం గాక చేయం.కాబట్టి... మా మృగప్రపంచపు మగపురుగుల క్యారెక్టరును దృష్టిలో పెట్టుకుని... మా మనోభావాలు గాయపడేలా... ‘మృగాళ్లూ’, ‘మగపురుగులూ’ అంటూ మీ మానవ మగాళ్లతో పోల్చి... మమ్మల్ని కించపరచవద్దని మనవి. – యాసీన్ -
రీల్స్ మాయలో బాల్యం బందీ
పిల్లలు రీల్స్, షార్ట్ వీడియోలకు అడిక్ట్ అవడం అనేది ప్రస్తుతం తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, వారి మెదడు పనితీరును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏకాగ్రత సమయం తగ్గిపోవడంరీల్స్ వల్ల కలిగే అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ఏకాగ్రత సమయం తగ్గడం. సాధారణంగా మనిషి సగటు ఏకాగ్రత సమయం సుమారు 12 సెకన్ల వరకు ఉంటుంది. కానీ రీల్స్, షార్ట్ వీడియోలు చూసే వారిలో అది 8 సెకన్ల కంటే తక్కువకు పడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం 15–30 సెకన్ల వీడియోలకే అలవాటు పడటం వల్ల, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడం, కష్టమైన సమస్యను పరిష్కరించడం మెదడుకు భారంగా అనిపిస్తుంది.సహనం నశించడంనిజ జీవితంలో పనులు నెమ్మదిగా జరుగుతాయి. కానీ రీల్స్ ప్రపంచంలో అన్నీ వేగంగా జరిగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విపరీతమైన చిరాకు, అసహనం కలుగుతాయి. ఫోన్ నిరంతరం వేగవంతమైన సమాచారాన్ని అందించడం వల్ల మెదడు కేవలం తక్షణ వినోదం కోసం మాత్రమే ఎదురు చూసేలా మారిపోతుంది. కష్టపడి సాధించే ఫలితం కంటే, వెంటనే వచ్చే వినోదాన్ని కోరుకుంటారు.స్పీచింగ్ థెరపీ సెంటర్లకు డిమాండ్రీల్స్, వీడియోలు చూసే పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సంవత్సరాలు పెరుగుతున్నా తమ పిల్లలకు మాటలు రావడం లేదంటూ స్పీచ్ థెరపీ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రీల్స్ చూసే పిల్లలు .. ఇంట్లో వారితో మాట్లాడే ప్రయత్నం కంటే స్క్రీన్ను చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.ఆందోళన, నిరాశఇతరుల జీవితాలను రీల్స్లో చూసి, తమ జీవితాన్ని వారితో పోల్చుకోవడం వల్ల పిల్లల్లో ఆందోళన, నిరాశ పెరిగిపోతాయి. ఫిల్లర్లతో కూడిన వీడియోలని చూసి, తమ రూపం పట్ల ఆత్మన్యూనతా భావానికి గురవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇది పిల్లల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది.భావోద్వేగాలు మొద్దుబారడంరీల్స్లో హాస్యం, హింస, విషాదం అన్నీ వెంటవెంటనే వస్తాయి. దీనివల్ల మెదడుకు ఒక భావోద్వేగాన్ని సరిగ్గా ప్రాసెస్ చేసే సమయం ఉండదు, ఇది పిల్లలను భావోద్వేగపరంగా మొద్దుబార్చే అవకాశం ఉంది. ఇది నిజజీవితంలో మరింత ప్రమాదకరం.నిద్ర పట్టకపోవడంస్మార్ట్ఫోన్తో మరో ముఖ్యమైన సమస్య నిద్ర పట్టకపోవడం. రీల్స్ చూడటం, మెసేజ్లు చేయడం వల్ల మెదడు ఉద్వేగానికి గురవుతుంది. దీనివల్ల స్లీపింగ్ సైకిల్ దెబ్బతిని .. పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. దాంతో చిరాకు, కోపం, మొండిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ప్రత్యామ్నాయమే పరిష్కారంఫోన్ వద్దు అని ఒకేసారి చెప్పడం కంటే వారికి నచ్చిన కథల పుస్తకాలు, బోర్డ్ గేమ్స్ లేదా ఏదైనా క్రీడావిశేషాలను చర్చించడం వల్ల వారి మనసు మరోవాటి మీదకి మళ్లుతుంది. బోర్గా ఉందని చెప్పగానే పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానుకోవాలి. వారితో మాట్లాడాలి, ఆడుకోవాలి. అలాగే మీరు నిరంతరం ఫోన్ చూస్తూ ఉంటే, వారు కూడా మిమ్మల్ని అనుకరిస్తారు గనుక స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్ను.. మనం ఎలా వాడుతాము అనేదానిపైనే అది మనకు మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా అనే అంశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి లేదా వీటిలో భాగస్వామ్యం చేయాలి. బాల్యం నుంచే పిల్లల దృష్టి రీల్స్ నుంచి రియల్కు మళ్లించే ప్రయత్నం చేయాలి.


