Family
-
పేదోళ్ల వకీలమ్మ
‘న్యాయవాది కావడం అనేది కేవలం వృత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం... సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కూడా’ అనే ప్రసిద్ధ మాటను న్యాయవాదుల గురించి చెబుతుంటారు.నిజామాబాద్కు చెందిన కాటిపల్లి సరళ మహేందర్రెడ్డి న్యాయవాదిగా పేదలకు అండగా ఉండటమే కాదు...‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే ఎరుకతో తన పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోంది. పిల్లలు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోంది.డిగ్రీ చదువుతున్నప్పుడే వివాహం అయినప్పటికీ భర్త, హైకోర్ట్ న్యాయవాది మహేందర్రెడ్డి(Sarala Mahender Reddy) ప్రోత్సాహంతో ఎల్ఎల్బీ పూర్తి చేసిన సరళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎన్ రోల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు చూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన బావగారు (భర్త అన్న) కాటిపల్లి రవీందర్రెడ్డి పేరుమీద ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 300 మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించారు. ఈ ఏడాది నుంచి ‘బాలసదన్ ’లో ఉంటున్న 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ‘బాలసదన్ ’ చిన్నారుల కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భవిష్య జ్యోతి’ ట్రస్ట్కు చైర్పర్సన్ గా సరళ మహేందర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆటల్లో మెరిసేలా...గ్రామీణ విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలు పాఠశాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆటలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో అడారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి జూడో మీట్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయిలో అండర్–17 విభాగంలో 3 కాంస్య పతకాలు సాధించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ సైతం జూడో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. – తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్సామాజిక సేవే... విలువైన సంపదన్యాయవాదిగా పేదలకు అండగా నిలవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని సేవాకార్యక్రమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. – సరళ మహేందర్రెడ్డి -
వియ్ హబ్ బ్రాండ్ అంబాసిడర్ వంట గెలిచింది
ఆమె... వంటతో జీవితాన్ని నిలబెట్టుకుంటానని, వంటలతో అవార్డులు అందుకుంటానని, వియ్ హబ్ (విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్)కి బ్రాండ్ అంబాసిడర్ అవుతానని కలలో కూడా కలగనలేదు. పాలతో కూరలు వండే గుజరాత్ వాళ్లు ఆమె చేసిన పుదీనా పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. కొబ్బరి, అరటితో మసాలాలు లేని తేలిక ఆహారం తీసుకునే కేరళ వాసులు కూడా ఆమె చేతి రుచికి ఫిదా అయ్యారు. గోవా వాళ్లకు చేపలతో కొత్త వంటలను పరిచయం చేశారామె. ఈ విజయాలన్నీ ఆమెను రాష్ట్ర సెక్రటేరియట్ వైపు నడిపించాయి. తెలంగాణ సెక్రటేరియట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ఆకుల కృష్ణకుమారి. ఊరు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మూడు చింతలపల్లి గ్రామం. నెలకు లక్షకు పైగా ఆర్జిస్తున్న కృష్ణకుమారి జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.కృష్ణకుమారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీసర్. తనకు వంటలు చేయడం, వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ ఇష్టంతో తాను చేసిన కొత్త వంటకాలను కొలీగ్స్కి ఇచ్చేవారామె. ‘‘మా నాన్న టైలర్. ఓ రోజు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) డీపీఎమ్ సురేఖ గారు మా షాప్కి వచ్చారు. నన్ను చూసి నేను చేస్తున్న పని తెలిసిన తర్వాత ఆమె నాకో డైరెక్షన్ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నా కుటీర పరిశ్రమ మొదలైంది. తొలి ఆర్డర్ యూఎస్కి, డాక్టర్ గీతాంజలి మేడమ్ పది వేల రూపాయల ఆర్డర్ ఇచ్చారు. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయంతో విజయవంతంగా సాగుతోంది. మిల్లెట్స్తో ప్రయోగాలు నన్ను నిలబెట్టాయి.’’ అన్నారు కృష్ణకుమారి.మహిళాశక్తి క్యాంటీన్డ్వాక్రా స్వయంసహాయక బృందంలో చేరిన తర్వాత తన కార్యకలాపాలను వేగవంతం చేశారు కృష్ణకుమారి. హైదరాబాద్, రాజేంద్రనగర్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్డీలో శిక్షణ తీసుకోవడంతోపాటు, తన ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టడంతో మొదలైన ఆమె జర్నీ సరస్ మేళా ఎగ్జిబిషన్లతో అండమాన్, కశ్మీర్ మినహా దేశమంతటికీ విస్తరించింది.ఆమె విజయపథం... ఎగ్జిబిషన్లో స్టాల్ కోసం అధికారులను అడగాల్సిన దశ నుంచి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్టాల్ పెట్టవలసిందింగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే దశకు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది జూన్ నెల రెండవ తేదీన జరిగిన వేడుకల్లో ఆమె స్టాల్ పెట్టారు. ఆ స్టాల్లోని ఉత్పత్తులను ఆసాంతం పరిశీలించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆమె అక్కడికక్కడే లైవ్ కౌంటర్లో వండిన తెలంగాణ రుచులకు కూడా సంతృప్తి చెందారు.డ్వాక్రా మహిళల కోసం శాశ్వతంగా ఒక వేదికను ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో ‘సెక్రటేరియట్ క్యాంటీన్ మహిళలకే ఇద్దాం’ అని నోటిమాటగా వచ్చిన ఉత్తర్వుతో అదే నెల 21న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ మొదలైంది. అందులో కృష్ణకుమారితో పాటు పదిమంది మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నారు. జయహో మహిళాశక్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిచిన్న రైతులేనా ఉత్పత్తులకు స్వాద్ అనే బ్రాండ్నేమ్ రిజిస్టర్ చేశాను. పరిశ్రమ దమ్మాయిగూడలో ఉంది. ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. నేను ఉదయం తొమ్మిదిన్నరకు సెక్రటేరియట్కు చేరుకుంటాను. తిరిగి ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదవుతుంది. యూనిట్లో నిన్న తయారైన మెటీరియల్ను ఈ రోజున కౌంటర్లో పెడతాను. ఏ రోజుకారోజు అమ్ముడైపోతాయి. సెక్రటేరియట్ క్యాంటీన్తోపాటు యూనిట్లోనే అవుట్లెట్ కూడా ఉంది. రాపిడో ద్వారా సప్లయ్ చేస్తున్నాం. వినియోగదారులు మా దగ్గరకు రావడం కంటే మేమే వినియోగదారుల దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతో మొబైల్ యూనిట్ ప్రారంభించనున్నాను.నా సక్సెస్కి కారణం తోటలే. పచ్చళ్లు, పొడులు ఏవి చేయాలన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోను. నేరుగా తోటలకే వెళ్లి తెచ్చుకుంటాను. భారీ స్థాయిలో పండించే వాళ్లు స్వయంగా మార్కెట్కు తరలించగలుగుతారు. చిన్న రైతులు తమకు తాముగా మార్కెట్కి తీసుకెళ్లాలంటే ఆ ఖర్చులు భరించలేరు. నేను వారి దగ్గర తీసుకుంటాను. నేను ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెషన్. నాకు ఉపాధినివ్వడంతోపాటు గుర్తింపును కూడా తెచ్చింది. ఇందులోనే భవిష్యత్తును నిర్మించుకుంటాను. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం పని చేస్తాను.– ఆకుల కృష్ణకుమారి, స్వాద్ ఫుడ్స్ -
లేడీ బౌన్సర్స్కు అడ్డే లేదు
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?⇒ క్రౌడ్ను కంట్రోల్ చేయడం⇒ ఈవెంట్ సెక్యూరిటీ⇒ సెలబ్రిటీల రక్షణ⇒ సెలబ్రిటీలను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం ⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు. ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్కు వచ్చే అతిథుల కోసం ఎయిర్పోర్ట్కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్డోర్ షూటింగ్లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.ఇబ్బందిగా మొదలయ్యి...‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.రెండు విధాలా ఆదాయంకొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.స్పోర్ట్స్ తెలిసినవారుస్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు. -
క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్నే బిజినెస్గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్బుక్ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. -
పిల్లల పెంపకం తపస్సు లాంటిది : మంచి పాటలతో మానిసిక ఉత్తేజం
ముంబై సెంట్రల్: ‘పిల్లల పెంపకమనేది వినోదం కాదు..అదో తపస్సు.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేటికాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు భవిష్యత్తులో ఆదర్శవంతంగా ఎదగాలంటే ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తన మార్చుకోవాలి. పిల్లలు కాపీ కొట్టేది ముందుగా తల్లిదండ్రుల్నే..’అన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా’’ఇండ్ల విశాల్రెడ్డి. ఆదివారం ఆంధ్ర మహాసభలో ‘విజ్ఞానం–వినోదం’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పిల్లలు ఎల్రక్టానిక్ గాడ్జెట్స్కు అలవాటు పడకుండా చూడాలనీ, వారిలో సర్వాంగ వికాసానికి తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వారిపై కఠినమైన ఆంక్షలు విధించడం, తల్లిదండ్రుల అభిరుచుల్ని బలవంతంగా రుద్దడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం ఆగిపోతుందని హెచ్చరించారు. మంచి పాటలతో మానిసిక ఉత్తేజం: డా. ఇండ్ల రామసుబ్బారెడ్డికార్యక్రమంలో భాగంగా ‘మనసు పాటలపై మానసిక విశ్లేషణ’అనే అంశంపై సుప్రసిద్ధ మానసిక నిపుణులు డా’’ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించి, సభికుల్ని అలరించారు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు మానసిక క్షోభకు గురవుతాడనీ, అలాంటి సమయంలో కుంగిపోకుండా, మోటివేషన్ కలిగించే మధురమైన పాటలు వింటే తాత్కాలికంగా మానసిక ఒత్తిడికి దూరమై నూతన ఉత్తేజాన్ని పొందుతాడని చెప్పారు. ఒక మానసిక వైద్యుడిగా ఇది తాను సాధికారికంగా చెప్పగలననీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ‘ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, మనసు పలికే మౌన గీతం, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో, మనసు గతి ఇంతే, పాడుతా తీయగా చల్లగా, ఆట గదరా శివా, కలకానిది విలువైనది.’లాంటి పలు పాటల్ని ప్రదర్శిస్తూ, ఆ పాటలు ప్రభావం మనిషి జీవితంపై చూపలగల ప్రభావాన్ని గురించి ఉదాహరణలతో సహా వివరించారు. తెలుగువారి ప్రయోజనాలే ముఖ్యం: అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆంధ్ర మహాసభలో వినోదాత్మక కార్యక్రమాలతో పాటు ఆధ్యాతి్మక, మానసిక వికాస, సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామనీ, తెలుగువారి ప్ర యోజనాలే తమకు ముఖ్యమని అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరందరికీ ఆంధ్ర మహాసభ తరపున టీ, టిఫిన్లు ఏర్పాటుచేశారు. అనంతరం ఇరువురు వైద్యుల్ని మహాసభ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సభకు సాహి త్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్ స్వా గతం పలకగా, ధర్మకర్తల మండలి సభ్యుడు గాలి మురళీధర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. గాలి మురళీధర్ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, తాళ్ళ నరేశ్, సంయుక్త కార్యదర్శులు మచ్చ సుజాత, కటుకం గణేశ్, అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేష్, క్యాతం సువర్ణ, కూచన బాలకిషన్, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వర్రావు, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్య దర్శి పిల్లమారపు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. -
నూరేళ్ల గ్రంథాలయం
పాల్వంచ సంస్థానంలో కుక్కునూరులో ఉన్న ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం (1925 మార్చి 25) గోదావరి తీరంలో ఉన్న ‘అమరవరం’లో ‘గౌతమి ఆశ్రమం’తో పాటు ఈ గ్రంథాలయాన్నీ, ఒక పత్రికా పఠన మందిరాన్ని, ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అమరవర వాస్తవ్యులు, ఆంధ్ర భాషా కోవిదులు బ్రహ్మశ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం తన పుస్తకాలు ఈ గ్రంథాలయానికి బహూకరించారు. వీటితో పాటు రెండు చెక్క బీరువాలు, బెంచీలు, బల్లలతో మౌలిక సదుపాయాలు కల్పించారు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు తమ పత్రికలను ఈ గ్రంథాలయానికి అందించడంతో పాటు దాని ఉన్నతికి ఎంతో కృషి చేశారు. అందుకే ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ అని దీనికి పేరుపెట్టారు. తరువాత ఈ గ్రంథాలయాన్ని కుక్కునూరుకు మార్చారు. గ్రంథాలయంలోని పత్రిక పఠన మందిరంలో ‘ఆంధ్ర పత్రిక, భారతి, నీలగిరి, తెలుగు, ఆంధ్ర రంpని, జన్మ భూమి, త్రిలింVýæ, సుజ్ఞాన చంద్రిక, బ్రహ్మానందిని, ఆంధ్ర అభ్యుదయం, శ్రీ శారద ధన్వంతరి, కృష్ణా పత్రిక’ వంటివి... కోటగిరి వెంకట అప్పారావు, మాజేటి రామచంద్ర రావు తదితరుల సహాయ సహకారాలతో గ్రంథాలయానికి వచ్చేవి. దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, పోతన జయంతి, శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ‘గ్రంథాలయ యాత్ర’ చేపట్టి విరాళాలు సేకరించి గ్రంథాలయం ఉన్నతికి కృషి చేశారు. 1960-70 కాలం వరకు చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల ప్రజలు ఈ గ్రంథాలయాన్ని చక్కగా వినియోగించు కున్నారు. 1970 తరువాత అనుకున్నంత స్థాయిలో ఈ గ్రంథాలయం తన ప్రతిభను కనపరచలేకపోయింది, కారణం ఆర్థిక వన రులూ, మానవ వనరుల కొరత, నాటి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు లేకపోవడం వంటి కారణాలతో 1980–85 మధ్యకాలంలో ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలయంలో విలీనం చేశారు. అప్పటికే ఆ గ్రంథాలయంలో ఉన్న చాలా విలువైన గ్రంథ సంపద అంతరించి పోయింది. – డా. రవి కుమార్ చేగొనితెలంగాణ గ్రంథాలయ సంఘం కార్యదర్శి(నేటితో దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయానికి వందేళ్లు) -
మానవ సేవతో...
మూడు శతాబ్దాలు చూసిన మునిగా పేరు గాంచిన కల్యాణ్ దేవ్... వివేకానుందుని బోధనలతో ఉత్తేజితుడై మానవ సేవ ద్వారా మాధవునికి సేవ చేసి తరించారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లాలోని కోటనా గ్రామంలో 1876లో జన్మించిన ఆయన అసలు పేరు కాలూరామ్. రిషీకేశ్లో స్వామి పూర్ణానంద శిష్యులై స్వామి కల్యాణ్ దేవ్ అయ్యారు. కొన్నేళ్ళు హిమాలయాలలో తపస్సు చేశారు. అనంతరం ఆయన తన ప్రాంతంలోని పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల ప్రజల కోసం దాదాపు మూడు వందల పాఠ శాలలు, వైద్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటరాని తనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన తన వాణిని వినిపించారు. నిర్లక్ష్యానికి గురైన మతపరమైన, చారిత్రక ప్రదే శాల పునర్నిర్మాణానికి కల్యాణ్దేవ్ మద్దతు ఇచ్చారు. ముజఫర్నగర్లోని శుక్తల్లో ఆయన ‘శుకదేవఆశ్రమం’, ‘సేవా సమితి’ని కూడా స్థాపించారు. హస్తినా పూర్లోని కొన్ని ప్రాంతాలను, హరియాణాలోని అనేక తీర్థయాత్రా స్థలాలను పునరుద్ధరించారు.ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కల్యాణ్దేవ్ మాట్లా డుతూ... 1893లో ఖేత్రిలో వివేకానందుడిని కలిసి నప్పుడు తనకు ప్రేరణ కలిగిందని, ఆయన తనతో... ‘నువ్వు దేవుడిని చూడాలనుకుంటే, పేదల గుడిసెలకు వెళ్ళు... నువ్వు దేవుడిని పొందాలనుకుంటే, పేదలకు, నిస్సహాయులకు, అణగారినవారికి, దుఃఖితులకు సేవ చేయి’ అని అన్నారని చెప్పారు. పేదల సేవ ద్వారా దేవుడిని పొందడమే తనకు స్వామీజీ నుండి లభించిన మంత్రమని కల్యాణ్దేవ్ పేర్కొన్నారు.భారత ప్రభుత్వం 1982లో ఆయనను పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది మీరట్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డి.లిట్. ప్రదానం చేసింది. తుదకు ఆయన 2004లో పరమపదించారు. – యామిజాల జగదీశ్ -
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
ప్రేమ, పెళ్లి అనేవి క్షణికమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అదీ మనవరాళ్ల మధ్య. గుజరాత్కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువుర్ని ఆకట్టు కుంటోంది. 80 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.1961 నాటి ప్రేమకథ1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్న ఊసే లేదు. ఇవి ఆచరణాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష్, మృధు మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన యువకుడు హర్ష్, బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ, ప్రేమ లేఖలతో మరింత బలపడింది. View this post on Instagram A post shared by The Culture Gully™️ (@theculturegully) యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చోపచర్చలు, తర్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిలబడ్డాయి ఇరుకుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ వీటి రెండింటి మధ్యా ప్రేమనే ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ ఇంటినుంచి పారిపోయారు.హర్ష్ -మృదు వివాహంకలిసిన ఈ రెండు హృదయాలకు..ఒకరికొకరే తోడు నీడు తప్ప మరెవ్వరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు, పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష్ మృదు పిల్లలు మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా వారి మదిలి మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా, కనీవిని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంట తడిపెట్టించింది.సాధారణ 10 రూపాయల చీరలో భర్తచేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇపుడు గుజరాతీ సాంప్రదాయంలో ఘర్చోలా చీర, గోరింటాకు, నగలతో అందంగా ముస్తాబైంది. ఆరు దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు , కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలునిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు; జీవిత పయనంలో వచ్చే ప్రతీ సవాల్ను స్వీకరించడం, అంతే బలంగా దాన్నుంచి బయటపడటం. ఓరిమితో , ఒకరికొరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసి రాజన్నారో, ఆ అవగాహనను, చైతన్యాన్ని తమబిడ్డల్లో కలిగించడం. ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతాయుష్షు అంటూ దీవించారు పెళ్లి కొచ్చిన అతిథులంతా.చదవండి: కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది! -
7 నిమిషాల్లోనే సంపూర్ణ వర్కవుట్
అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి.వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కురీ్చలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి.స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి.స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి.ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి.ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.హై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి.లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.సైడ్ ప్లాంక్లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్Œలోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. -
మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్ సీక్రెట్ ఆమే!
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్ -
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
అకాల వర్షాలు విరుచుకుపడటంతో గత రెండు, మూడు రోజులుగా అనేక చోట్ల అనేక పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఈ తోటల్లో పునరుద్ధరణకు, నష్ట నివారణకు సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.. మామిడివీలైనంత వరకు అకాల వర్షపు నీటిని 24 గంటల లోపు తోట బయటకు పంపాలి. అదే విధంగా నీరు నిలిచిపోయే పరిస్థితులను నివారించడానికి ఎతైన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 20గ్రా. కలిపి పేస్ట్ లాగ చేసి పూయాలి.రాలిపోయిన పండ్లను చెట్ల కింద నుంచి సేకరించి దూరంగా వేసి, నాశనం చేయాలి. వీటిని అలాగే వదలివేయటం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మామిడికి ప్రస్తుతం పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి 3 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా బాక్టీరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్ట్రె΄్టోమైసిన్ సల్ఫేట్ 0.5 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.పండ్ల పరిమాణం పెరగడానికి ఒక లీటర్ నీటికి కెఎన్03ను 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాయలకు పగుళ్లు రాకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి బోరాన్ను 1.25 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్, స్ట్రెపోటోమైసిన్ సల్ఫేట్, కెఎన్03, బొరాన్.. ఈ నాలుగింటిని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.ప్రస్తుతం తడి వాతావరణం వల్ల పండు ఈగ కాయల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉంది.నివారణకు మిథైల్ యూజీనాల్ (ఎర) ఉచ్చులను ఎకరానికి 10–20 అమర్చు కోవాలి.చెట్టుపైన మామిడి పండ్లను సంచులతో కప్పితే ఎగుమతికి అవసరమైన నాణ్యమైన పండ్లను పొందవచ్చు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుటమాటకాయలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బొరాక్స్ ఒక లీటర్ నీటికి 2 నుండి 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.పూత దశలో ఉంటే, పూత రాలి పోకుండా ఉండటానికి పోలానోఫిక్స్ ఒక మి.లీ., 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఒకలీటర్ నీటికి 5గ్రా. కలిపి పిచికారి చేయాలి.పసుపువర్షాల వల్ల ఆరబెట్టిన పసుపు తడిసి΄ోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ షీట్స్ను కప్పడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలు:శ్రీమతి కృష్ణవేణి – 9110726430పసుపు : శ్రీ మహేందర్ : 94415 32072మిర్చి : శ్రీ నాగరాజు : 8861188885 -
పెను గాలుల నుంచి టేపులతో అరటికి రక్షణ!
అరటి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు పెనుగాలులు తీవ్ర నషాన్ని కలిగిస్తూ ఉంటాయి. లక్షలు పెట్టుబడి పెట్టి పెంచిన అరటి తోటల్లో కొద్ది రోజుల్లో గెలలు కోతకు వచ్చే దశలో సుడిగాలులు, తుపాన్లకు విరిగి పడిపోతే రైతులకు నూటికి నూరు శాతం నష్టం జరుగుతుంది. వెదురు బొంగుల ఊతంతో అరటి చెట్లకు గాలుల నుంచి రక్షించుకునేందుకు రైతులు విఫలయత్నం చేస్తూ వుంటారు. అయితే, కర్ణాటకలో అరటి తోటలు సాగు చేస్తున్న ఒక యువ రైతు సరికొత్త ఆలోచనతో, తక్కువ ఖర్చుతోనే అరటి తోటలను పెను గాలుల నుంచి చక్కగా రక్షించుకుంటున్నారు. చెట్టుకు నాలుగు వైపులా గూటాలు వేసి, వాటికి ప్లాస్టిక్ టేప్లను కట్టటం ద్వారా పెను గాలుల నుంచి అరటి చెట్లను చాలా వరకు రక్షించుకోవచ్చని యువ రైతు సురేష్ సింహాద్రి చెబుతున్నారు.. సురేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తణుకు. కర్ణాటకలోని మైసూరుప్రాంతానికి వలస వెళ్లి కొన్ని సంవత్సరాల నుంచి యాలక్కి రకం అరటి తోటలను కౌలు భూముల్లో సాగు చేస్తున్నారు. చామరాజానగర జిల్లా కొల్లేగాలా తాలూకా, సత్తేగాల గ్రామంలో సురేష్ అరటి తోటలను సాగు చేస్తున్నారు. ఆయన అనుభవాలు.. ఆయన మాటల్లోనే..అరటి చెట్లకు నాలుగు వైపులా గూటాలు వేసి టేపులతో కట్టేస్తాంగాలుల నుంచి అరటి చెట్లకు గల సమస్యను అధిగమించడానికి తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాధారణంగా వెదురు బొంగులను ఆసరాగా పెట్టి అరటి చెట్లకు రక్షణ కల్పిస్తుంటారు. ఇందుకోసం కర్రల కొనుగోలుకే ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే, మేము కర్రల అవసరం లేకుండా కేవలం టేపులతోనే అరటి చెట్టుకు నాలుగు వైపులా కట్టి గాలుల నుంచి విజయవంతంగా రక్షించుకుంటున్నాం. చెట్టుకు నాలుగు వైపులా నేలలోకి కట్టె గూటాలు దిగవేసి, వాటికి టేపులతో అరటి చెట్టు పై భాగాన్ని కడుతున్నాం. చెట్టుకు గట్టిగా బిగుతుగా కట్టకుండా కొంచెం వదులుగా ఉండేలా చెట్టు చుట్టూతా టేపులను రక్షణ చక్రం మాదిరిగా కడతాం. గాలులు వీచి చెట్టు అటూ ఇటూ ఊగినప్పుడు చెట్టు కాండం విరిగి పడిపోకుండా రక్షించుకుంటున్నాం. చెట్టుకు 6 నెలల వయసులో పువ్వు దశలో టేపు కట్టాలి. గత ఏడాది ఎప్పుడూ ఎరుగని రీతిలో మాప్రాంతంలో గాలి వాన వచ్చి అరటి తోటలే కాదు, కరెంటు స్థంభాలు కూడా కూలిపోయాయి. అయినా, మా తోటలో కొన్ని చెట్లు మాత్రమే ఒరిగాయి. మిగతా చెట్లు అదృష్టం కొద్దీ గాలులను చాలా వరకు తట్టుకున్నాయి. టేపులతో కట్టటం వల్లనే ఇది సాధ్యమైంది.ఎకరానికి రూ. 12 వేల ఖర్చుఎకరం అరటి తోటకు రూ. 12 వేల ఖర్చుతోనే టేపులతో రక్షణ కల్పించుకుంటున్నాం. ఎకరానికి 25 కిలోల టేపు అవసరం అవుతుంది. కిలో ధర రూ. 130. టేపులు కట్టడానికి కట్టె గూటాలు కావాలి. యూకలిప్టస్ లేత కర్రలను కొనుగోలు చేసి, 2 అడుగుల గూటాలను తయారు చేసుకొని వాడుతున్నాం. అడుగున్నర లోతు వరకు నేలలోకి ఏటవాలుగా దిగగొట్టి, ఆ గూటాలకు టేపులు కడతాం. దీని వల్ల గాలులు వచ్చినప్పుడు అవి చెక్కుచెదర కుండా చెట్టును కాపాడుతున్నాయి. కూలీల ఖర్చుతో కలిపితే చెట్టుకు రూ. 10 లకు మించి ఖర్చు కాదు. 6“6 దూరంలో అరటి మొక్కలు నాటితే ఎకరానికి 1200 మొక్కలు పడతాయి. అంటే.. ఎకరానికి టేపులు కట్టడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 12,000 మాత్రమే! కట్టిన టేపు రెండో పంటకు వాడటానికి పనికిరాదు. ప్రతి పంటకు మళ్లీ కట్టుకోవాలి. మేం యాలక్కి రకం నాటు రకం పిలకలను తెప్పించి నాటుతున్నాం. టిష్యూకల్చర్ మొక్కలు నాటితే అవి మరీ ఎత్తు పెరుగుతాయి. నాటు పిలకలు అయితే ఎత్తు తక్కువ పెరుగుతాయి, కాండం గట్టిగా కూడా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, వినియకచవితి రోజుల్లో ఈ రకం అరటికాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కిలో కాయలను రూ. వందకు కూడా అమ్ముతూ ఉంటాం. రైతుగా నా అనుభవాలను, టేపులను అరటి చెట్లకు కట్టే విధానాన్ని చూపే వీడియోలను ‘మీ ఫార్మర్ సురేష్ (@MeFarmerSuresh)’ అనే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. రైతులు ఈ వీడియోలు చూసి అవగాహన పెంచుకోవచ్చు. నా ఫోన్ నంబర్: 99004 42287. -
బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్కి ఉస్మానియాలోనే అపెండిక్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్లు, పాస్లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్ను ఎదుర్కొన్నాం. కోవిడ్ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ -
మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్మేన్లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్క్వార్టర్ అయిన షోపియన్కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్మేన్గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి. -
యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్..
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన విక్రమ్ భట్ ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలు అందించారు. అంతేగాదు ఆయనకు ఫిల్మ్ఫేర్, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు కూడా వరించాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నప్పడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ఆ వ్యాధి కారణంగా తానెంతలా డిప్రెషన్కి గురయ్యానో కూడా వివరించారు. తన వ్యాధి నటి సమంత ఎదుర్కొంటున్న వ్యాధి దగ్గర దగ్గరగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అసలు విక్రమ్ భట్ ఈ వ్యాధిబారిన ఎలా పడ్డారు..? ఏంటా వ్యాధి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బాలీవుడ్లో మంచి పేరుగాంచిన రాజ్ మూవీ సీరిస్ దర్శకుడు విక్రమ్ భట్ తాను టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎదుర్కొంటున్న మైయోసిటిస్ లాంటి వ్యాధితోనే బాధపడుతునట్లు వెల్లడించారు. దీని కారణంగా చాలా డిప్రెషన్కి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే తన లైఫ్లో భార్య శ్వేత కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అయితే తన భార్య అది నీ ఛాయిస్ కాదని తన నోరు మూయించేసిందన్నారు. ఆ కష్టకాలంలో తనతో ఉండి భరోసా ఇచ్చిందన్నారు. నిజానికి వ్యాధి కంటే దాని కాణంగా వచ్చే డిపప్రెషన్, ఆందోళనలే అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్యం డిప్రెషన్ అని అన్నారు. దీనిపై సమంత, దీపికా పదుకునే లాంటి వాళ్లు మాట్లాడి యూత్ని చైతన్యపరుస్తున్నారని అభినందిచారు. దానివల్ల చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తగ్గుతాయన్నారు. ఇక అలాగే తాను ఎదుర్కొంటున్న వ్యాధి గురించి కూడా వివరించారు.ఆ వ్యాధి ఏంటంటే..విక్రమ్ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలు కలిసిపోతున్నట్లుగా ఉండే ఒక విధమైన ఆర్థరైటిస్ సమస్య అని తెలిపారు. ఫలితంగా చాలా నొప్పిని అనుభవిస్తానని 56 ఏళ్ల భట్ అన్నారు. ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ (AxSpA) అంటే..ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కారణంగా దీర్ఘకాలికి వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అది భరించలేనదిగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకు వస్తుందంటే..రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కీళ్లపై దాడి చేసినప్పుడు ఇది సంభవిస్తుందట. ఫలితంగా వాపుతో కూడిన భరించలేని నొప్పి ఎదురవ్వుతుందని అన్నారు. దీనికి కుటుంబ డీఎన్ఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఎందుకంటే కుటుంబంలో ఎవరికైన ఆర్థరైటిస్ ఉన్న చరిత్ర ఉంటే..ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ పరిస్థితితో ఉన్నవారు ఉదయం లేచిన వెంటనే హాయిగా నడలేరట. ఎక్కడకక్కడ ఎముకలు బలంగా బిగిసుకుపోయి అలసటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. కాలక్రమేణ వెన్నెముక కదలికలు కష్టమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సింపుల్గా చెప్పాలంటే కదలికలే ఉండవు. చికిత్స:అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి వేరుగా ఉంటుందట. చికిత్సలో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులతో నయం అయ్యేలా చెస్తారు వైద్యులు. రోగ నిర్థారణ ఎంత తొందరగా జరిగిందన్న దానిబట్టే త్వరగా కోలుకోవడం అనేది ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదట. కేవలం మందులతో ఈ రోగాన్ని అదుపులో ఉంచడమే మార్గమని అన్నారు వైద్యులు. మైయోసిటిస్కి పూర్తి భిన్నం..ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ కీళ్ల ధృడత్వాన్ని బలహీనపరుస్తుంది. అదే మైయోసిటిస్ అనేది కండరాల వాపుకి సంబంధించినది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరమవుతుంది. అదే ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అయితే వెన్నెముక, కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి, కదలకుండా ధృఢంగా అయిపోతాయి ఎముకలు. చెప్పాలంటే కదలికలనేవి ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరింత సమాచారం కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: 'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?) -
కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది!
ప్రాణాపాయంలో ఉన్న కన్నబిడ్డల్ని కాపాడుకునేందుకు తల్లి(Mother) ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు, ఎలాంటి కష్టాన్నైనా లెక్క చేయకుండా, తనబిడ్డల్ని రక్షించుకుంటుంది. ఆఖరికి కౄర మృగాలు ఎదురొచ్చినా సరే తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా కన్నపేగు బంధాన్ని కాపాడుకుంటుంది. తాజాగా ఇలాంటి ఉదంతమొకటి పలువుర్ని ఆకట్టు కుంటోంది. తన కొడుకును కాపాడుకునేందుకు ఒక తల్లి పడిన ఆరాటం విశేషంగా నిలుస్తోంది.కన్న కుమారుడిని కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. తెగించి పోరాడి చిరుతను అ డ్డుకుని తన ప్రాణాలు పోకుండా అడ్డుపడింది. తీవ్రంగా గాయపడిన బాలుడు గ్వాలియర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి దాదాపు 120 గాయాలైనాయి. వీటికి శస్త్రచికిత్స జరిగింది. అయితే చిరుతపులి లాలాజలం నుండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అతణ్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరా ట్రాప్ ఫుటేజ్ ఆధారంగా వేటాడే జంతువు చిరుతపులి అని అధికారులు నిర్ధారించారు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుఆ తల్లి పేరు సురక్ష ధకాద్. తన తొమ్మిదేళ్ల బాలుడు అవినాష్ ధకాడ్పై చిరుతపులి దాడి చేయడాన్ని గమనించింది. మృత్యుముఖంలోకి జారిపోతున్నబిడ్డను కాపాడుకునేందుకు తన పంజా విసిరింది. సోమవారం కునో నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న బఫర్ జోన్ అయిన విజయ్పూర్, షియోపూర్లోని ఉమ్రికాల గ్రామంలో జరిగిన ఆ భయంకరమైన దాడిని స్థానిక మీడియాకు వివరించింది. "నేను అక్కడికి చేరుకునేసరికి, చిరుత నా కొడుకుపై దాడి చేసింది. వాడిని చేయి పట్టుకుని నా వైపుకు లాగాను. 50 మంది అతన్ని అవతలి వైపు నుండి లాగుతున్నట్లు అనిపించింది. అయినా నా శక్తినంతా ఉపయోగించాను. చివరికి, నేను నా కొడుకును దాని నోటినుంచి నుండి బయటకు తీశాను, కానీ అతని ముఖమంతా గాయాలే. రక్తం ప్రవహిస్తోంది. ఈరోజు, నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు అంటూ తెలిపింది. కొడుకు ముఖం , మెడలోకి తన గోళ్లు , దంతాలను ఎలా గుచ్చుకుపోయాయో వివరించింది. బాధితుడు అవినాష్ ధకాడ్ తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా, అడవి జంతువు అకస్మాత్తుగా అతనిపైకి దాడి చేసిందని తెలిపింది. తన కొడుకు అరుపులు విన్న వెంటనే, సమీపంలో పశువులకు ఆహారం పెడుతున్న సురక్ష, సంఘటనా స్థలానికి చేరుకుని, అవినాష్ జంతువు పట్టులో చిక్కుకున్నట్లు గుర్తించింది. చాలా నిమిషాల పాటు పోరాటం జరిగింది, ఆ సమయంలో ఆమె తన కొడుకును విడిపించడానికి తీవ్రంగా పోరాడింది.ఇదీ చదవండి : ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్కార్బెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లు కూడా అదే గ్రామంలో చిరుతపులి కదలికలను నిర్ధారించాయని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. "ప్రతి చిరుతను ఒక పర్యవేక్షణ బృందం 24/7 పర్యవేక్షిస్తోంది. ప్రతి చిరుత కదలిక , అవి ఎక్కడికి వెళ్ళాయో మాకు ఖచ్చితంగా తెలుసు. మీరు చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఎక్కడా చిరుతపులి మానవుడిపై దాడి చేసినట్లు నమోదు కాలేదు, ప్రాణాంతకమైనది కాదు. భారతదేశంలోని చిరుతలు భిన్నంగా ప్రవర్తిస్తాయని తాను భావించడం లేదన్నారు. అయితే, అటవీ శాఖ ఈ అవకాశాన్ని తోసిపుచ్చింది, దాడి చేసే విధానం చిరుతపులి లక్షణం అని పేర్కొంది.ఉమ్రికాల గ్రామం విజయ్పూర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది కానీ కునో నేషనల్ పార్క్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టారు. దాడికి ఒక రోజు ముందు చిరుతను చూసినట్లు కొంతమంది గ్రామస్తులు నివేదించారు. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు -
పిల్లలకు పాఠశాల కంటే వీడియో గేమ్స్ అంటే ఎందుకు ఇష్టం?
“మా బాబుకు స్మార్ట్ఫోన్ ఇవ్వకపోతే అరుపులు, కేకలు. ఇల్లంతా రచ్చరచ్చ చేసేస్తాడు. కానీ పుస్తకాలు తీస్తే బోలెడంత బద్ధకం. చదువంటే ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే. కానీ అదే వీడియో గేమ్ ఆడేటప్పుడు ఏమీ తినకుండా, తల ఊపకుండా గంటల తరబడి కూర్చుంటాడు!”ఇలాంటి మాటల్ని మీరు రోజూ వింటూనే అంటారు.దానికి మీరేం సలహా ఇస్తారు? “ఈ తరం పిల్లలు స్క్రీన్కు బానిసలైపోయారు.” “వీడియో గేమ్స్ బ్రెయిన్ను వదిలిపెట్టకుండా హైపర్ యాక్టివ్ చేస్తాయి.” “ఇది డిజిటల్ డెమెజ్.”"పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు."కానీ, అసలు మర్మం ఎక్కడ ఉంది తెలుసా?వీడియో గేమ్స్ అనేవి సైకాలజీని వాడి డిజైన్ చేసిన అద్భుత ఇంజినీరింగ్.మొబైల్ గేమ్స్ ఆడే పిల్లవాడిని ఒకసారి గమనించండి… "ఈ లెవెల్ను కంప్లీట్ చేయాలి", "ఈ శత్రువును ఓడించాలి", "ఈ స్కోరు సాధించాలి" అని అతనికి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది.అతను ప్రయత్నం చేస్తాడు. ఓడిపోతాడు. మళ్లీ ట్రై చేస్తాడు. మళ్లీ ఓడతాడు. చివరికి గెలుస్తాడు.విజయం పొందిన వెంటనే స్క్రీన్ మీద – "Congratulations!", "You’re a winner!", "Unlocked new powers!" అంటూ మెసేజ్ వస్తుంది.ఈ ఫీడ్బ్యాక్ అతని మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కోసమే, అది ఇచ్చే హ్యాపీనెస్ కోసమే అతను మళ్ళీ మళ్ళీ మొబైల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు.ఇప్పుడు చదువును పరిశీలిద్దాం. ఓ ఏడో తరగతి పిల్లాడు, మొఘలుల వంశవృక్షం చదవాల్సి ఉంది. అతనికి పాఠం ఎంత పెద్దదో తెలియదు. ఎక్కడ మొదలుపెట్టాలో కూడా స్పష్టత లేదు. పుస్తకంలోని ప్రశ్నల్లో ఏది పరీక్షల్లో వస్తుందో, ఏది గుర్తుంచుకోవాలో తెలియక కంగారు.పరీక్షలో సరైన సమాధానం రాసినా – ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. పరీక్షలు వస్తున్నాయంటే "నువ్వేమైనా చదువుతున్నావా?" అంటూ తల్లి, తండ్రి, టీచర్లు ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి అతని మెదడులో కోర్టిసాల్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది.ఇదే అసలు తేడా. వీడియో గేమ్ మోటివేట్ చేస్తుంది. చదువు భయం, ఒత్తిడితో నడుస్తుంది.మా Genius Matrix వర్క్షాప్లో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని మిహిర ఏం చెప్పిందో తెలుసా? “సర్, నేను Minecraft ఆడేటప్పుడు ఎంత creative అవుతానో తెలుసా? నా మీద నాకే ఆశ్చర్యం. కానీ అదే స్కూల్లో డ్రాయింగ్ competition ఉంటే, ఒక్కసారిగా భయమేస్తుంది. గెలవకపోతే నన్ను తక్కువగా చూస్తారని.”ఇంకొక తండ్రి తన కొడుకును గురించి ఇలా చెప్పాడు... “డాక్టర్ గారు, మా వాడి PUBG స్టాటిస్టిక్స్ మామూలుగా ఉండవు. ప్లానింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్ – అన్నీ బాగా చూస్తాడు. కానీ అదే క్లాస్లో ప్రాజెక్ట్ వచ్చిందంటే మౌనంగా పడుకుంటాడు. ఎందుకంటే అక్కడ creativityతో పని లేదు, కేవలం marks కోసం పని చేయాలి.”వీడియో గేమ్లో చిన్న ప్రయత్నానికే పెద్ద గుర్తింపు వస్తుంది. చదువులో మంచి ప్రయత్నం చేసినా మార్కులు రాకపోతే ఎవరూ పట్టించుకోరు. వీడియో గేమ్లో స్వాతంత్య్రం ఉంటుంది. చదువులో నిబంధనలు, డెడ్లైన్లు, ఫలితాలపై భయం ఉంటుంది.ఒకసారి నేను ఓ క్లాస్లో పిల్లల్ని అడిగాను: “మీరు ఎక్కువ టైం ఏమి చేస్తారు?” ఒకటి: “గేమ్స్ ఆడతాను.” రెండు: “యూట్యూబ్ చూస్తాను.” మూడు: “కంప్యూటర్ మీద క్రియేట్ చేస్తాను.” చదువు ఎప్పుడూ నాల్గవ ఆప్షన్లా ఉంటుంది.మనం ఏమి చేయాలి? వీడియో గేమ్లు నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు. స్మార్ట్ఫోన్ తీసేయడం వల్ల కూడా సమస్య తీరిపోదు. “నీకు concentration లేదు” అని తిట్టడం వల్ల అస్సలు ఉపయోగం ఉండదు.మరేం చేయాలంటారా?పిల్లలు ఏది concentrationతో చేస్తారో గమనించాలి. మన పాఠశాల, మన ఇంటి వాతావరణం కూడా వీడియో గేమ్లా మారాలి.🔹చిన్న లక్ష్యాలు ఇవ్వండి – చిన్న విజయం పొందిన ఆనందాన్ని అనుభవించాలి.🔹ప్రయత్నాన్ని గుర్తించండి – “శబాష్, నువ్వు మంచి ట్రై చేశావు” అనే మాట ఎంతో విలువైనది.🔹విఫలమైనా మళ్లీ ప్రయత్నించేందుకు అవకాశం ఇవ్వండి – శిక్షలు కాదు, శక్తినివ్వండి.🔹విజయం చూపించండి – మార్కులు కాకపోయినా, మెరుగుదల కనబడాలి.🔹పిల్లల మనసును మెప్పించే చదువు… అలాగే వాళ్లే కోరుకునే అభ్యాసం కావాలి.🔹మనం పిల్లల మీద ఒత్తిడి పెట్టడం తగ్గించాలి. వాళ్లలో ఉత్తేజాన్ని పెంచాలి. 🔹వీడియో గేమ్ల మాదిరిగానే – విద్య కూడా ఒక అడ్వెంచర్ అనిపించాలి.చదువు ఒక బాధగా, భారంగా కాదు… ఒక ప్రయాణంగా మారితే – పిల్లలు కూడా చదువును “ఆటలా” ఆస్వాదిస్తారు.మొత్తానికి సమస్య స్క్రీన్ కాదు. చదువులో ఆనందాన్ని మేళవించడమే సమాధానం.-సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?
ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్లైన్ ఎక్కువ ఆర్డర్ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు. అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్. అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు. చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్ సంజ్యోత్ కీర్. (చదవండి: యూట్యూబ్ చూసి సెల్ఫ్ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైక సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకుని కర్రీస్ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్వేజ్ ఐటమ్స్లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగర వాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు. దాదాపు 400పైగా కర్రీ పాయింట్స్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్హౌస్పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్నగర్, మైపాడుగేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. అదే విధంగా హరనాథపురం, చిల్డ్రన్స్పార్క్, చిన్నబజారు, పెద్దబజారు, వీఆర్సీ సెంటర్, మద్రాసు బస్టాండు, దర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాల్లోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో... గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా రూ.20 నుంచి రూ.30లకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి రూ.60 నుంచి రూ.80లు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకుని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది. జీవనోపాధికి దోహదం హోటల్స్లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న వారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయ పడుతూ బుతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 నుంచి కర్రీకి సంబంధించి కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ వంటకాలు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది. సండే స్పెషల్స్ ఆదివారం వచ్చిందంటే నగర వాసులు సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు. రోజంతా పిల్లలతో గడుపుతుంటారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇçష్ట పడుతుంటారు. దీంతో ఆదివారం హోటల్స్తో పాటు కర్రీ సెంటర్లు కూడా ప్రత్యేకంగా నాన్వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తుంటాయి. రాగి సంగటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తుంటారు. సాధారణ రోజులో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుందని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు వివిధ రకాల పచ్చళ్లు... కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతుంటాయి. అదే విధంగా కారపు పొడులు సైతం విక్రయిస్తున్నారు. అదే విధంగా నాన్వెజ్లో ఫ్రై ఐటమ్స్, వెజ్లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రుచి, నాణ్యత ఉంటేనే.. చాలా కాలంగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నా. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తుంటాం. – వెంకటేశ్వర్లు, కర్రీ పాయింట్ నిర్వాహకుడు -
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్స్టాలో షేర్ చేసింది.సియోల్లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్నెస్ రహస్యాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది. View this post on Instagram A post shared by Sherrie 셰리 🌸 | 외국인 모델 (@shukiiii)ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్పర్ట్ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?షెర్రీ వెయిట్ లాస్ జర్నీఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్లో చేర్చుకుంది.ఇంకా ఇలా చెప్పింది:మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది. ఏమి తినాలి ? ఏమి తినకూడదు?షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.ఈ డైట్ ప్రోగ్రామ్లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది. స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం. నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్లోని బృందావన్కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..) -
వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు
గుండె పోటు అంటే బీపీ, సుగర్ లాంటి వ్యాధులున్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలోమాత్రమే వస్తుంది అని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తూఆరోగ్యంగా ఉన్నవారినికూడా గుండె పోటు బలి తీసుకుంటోంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువుర్ని విస్మయ పర్చింది. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు CCTV ఫుటేజ్లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు.. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.⚠️ Trigger Warning : Sensitive Visual⚠️जिंदगी–मौत का कुछ नहीं पता। इस Video को देखिए। 20 सेकेंड पहले तक जो इंसान एकदम फिट दिखाई दे रहा है, वो अचानक से मर जाता है।📍बुलंदशहर, यूपी pic.twitter.com/9jiDgbC2ay— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025 చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?గుండెపోటుఎందుకు వస్తుంది?గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్న మాట. గుండె నొప్పి లక్షణాలు:గుండె నొప్పి (ఛాతీ నొప్పి) తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా, టైట్గా అనిపించిడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చేయి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.ఇంకా తలనొప్పి, ఎడమ చేయి, మెడ, దవడ లేదా రెండు చేతుల్లో నొప్పి, బలహీనంగా, అనీజిగా అనిపించడం, చర్మం పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి. -
'విద్యార్థి భవన్ బెన్నే దోసె': యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..
కొన్ని రెస్టారెంట్ ఏళ్లనాటివి అయినా.. అక్కడ అందించే రుచే వేరు అనిపిస్తుంది. ఎన్నో కొంగొత్త హైరేంజ్ రెస్టారెంట్లు వచ్చినా..! ఏళ్ల నాటి మధురస్మృతులకు నిలయమైన ఆ పాత రెస్టారెంట్లకే ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది. ఎన్ని హంగు ఆర్భాటలతో ఐదు నక్షత్రాలలాంటి హోటల్స్ వచ్చినా.. వాటి క్రేజ్ తగ్గదు. కేవలం సామాన్యులే కాదు ప్రముఖులు, సెలబిట్రీలు సైతం అలనాటి రెస్టారెంట్ పాక రుచికే మొగ్గుచూపుతారు. వాటి టేస్ట్కి ఫిదా అంటూ కితాబిస్తారు కూడా. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రెస్టారెంటే ఈ బెంగళూరుకి చెందిన 'విద్యార్థి భవన్'. ఈ రెస్టారెంట్ అందించే విభిన్న దోసె, వాటిని మెచ్చిన ప్రముఖులు గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!. బెంగళూరు వాసులు ఇష్టపడే 1943ల నాటి రెస్టారెంట్ ఈ 'విద్యార్థి భవన్'. ఇది ఐకానిక్ బెన్నే దోసెలకు ఫేమస్. ఇక్కడ చేసే బెన్నే దోసెల రుచే వెరేలెవెల్. గాంధీనగర్లోని గల్లో ఉండే ఈ ఐకానిక్ రెస్టారెంట్ స్థానికులు, పర్యాటకులకు నోరూరించే రుచులతో మైమరిపిస్తోంది. ఎవ్వరైనా బెన్నే దోస తినాలంటే అక్కడకే వెళ్లాలనేంతగా పేరు తెచ్చుకుంది ఈ రెస్టారెంట్. నిత్యం రద్దీగా క్యూలైన్లు కట్టి ఉంటారు జనాలు ఆ రెస్టారెంట్ వద్ద. అంతేగాదు అక్కడ యాజమాన్యం 50% అడ్వాన్స్డ్ బుకింగ్ సీటింగ్కి ప్రాద్యాన్యత ఇస్తుందంటే..ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా బుక్ చేసుకోకపోతే వారాంతల్లో వెళ్లక పోవడమే బెటర్.ఈ రెస్టారెంట్ చరిత్ర..ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్లో బెన్నే దోసెలు, ఫిల్టర్ కాఫీలను ఆస్వాదించడానికి వచ్చే కస్టమర్లే ఎక్కువట. ఇక్కడ ఉండే సిబ్బంది కూడా విలక్షణంగా ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎనిమిది ప్లేట్ల బెన్నెదోసెలను సర్వ్ చేస్తుంటారు. ఆ విధానం చూస్తే..కచ్చితం కళ్లు బైర్లుకమ్ముతాయి. దీన్ని 1943-1944 ప్రారంభంలో వెంకటరామ ఉడల్ నగరం వెలుపల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అదీగాక ఆ టైంలో రెస్టారెంట్లకు చివర్లో భవన్ అని పెట్టేవారట. అలా దీనికి విద్యార్థి భవన్ అని పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ రెస్టారెంట్ సమీపంలో ఉంటే ఆచార్య పబ్లిక్ స్కూల్, నేషనల్ కాలేజ్ తదితర సమీప పాఠశాల విద్యార్థులకు బోజనం అందుబాటులో ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. అదీగాక ఆ రెస్టారెంట్ ఉన్న ప్రాంతం విద్యాసంస్థలకు నిలయం కావడంతో అనాతికాలంలోనే మంచి ఫేమస్ అయిపోయింది. అంతేగాదు ఇక్కడకు వచ్చే కస్టమర్లలో ఎక్కువ మంది ప్రముఖుల, సెలబ్రిటీలు, రచయితలేనట.ఈ దోసెను మెచ్చిన అతిరథులు..ముఖ్యంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, చెఫ్ సంజీవ్ కపూర్, స్టార్బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి వంటి ఎందరో ఈ రెస్టారెంట్ బెన్నే దోసకు అభిమానులట. అంతేగాదు ఈ రెస్టారెంట్ అనగానే ఠక్కున గుర్తువచ్చేది బెన్నేదోసనే అట. అందువల్ల ఆ హోటల్ సిగ్నేచర్ డిష్గా ఆ వంటకం మారిపోవడం విశేషం. ఇక్కడ ఆ దోస తోపాటు ఇడ్లీలు, కేసరి బాత్ లేదా రవా బాత్, మేడు వడ వంటి విభిపకప అల్పాహారాలను కూడా సర్వ్ చేస్తారు. అంతేగాదు అక్కడ టిఫిన్ ముగించి చివరగా ఫిల్టర్ కాఫీని ఆస్వాదించకుండా వెళ్లరట. అంతలా ప్రజాదారణ పొందిన ఈ ఐకానిక్ విద్యార్థి భవన్ రెస్టారెంట్ రుచిని మీరు కూడా ఓ పట్టు పట్టేయండి మరీ..!.(చదవండి: work life Balance: అలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..! టెకీ సలహ వైరల్) -
World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు -
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్. -
అలా చేస్తే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..!
ఇటీవల "వర్క్ లైఫ్ బ్యాలెన్స్" తెగ చర్చనీయాంశంగా మారింది. వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే మన భారత్ మరింత అభివృద్ధి చెందడానికి అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఏ ముహర్తానా అన్నారో గానీ అప్పటి నుంచి వర్క్లైఫ్ బ్యాలెన్స్ తెరపైకి వచ్చేంది. అందరూ ఇక పనికే అంకితమైతే వ్యక్తిగత జీవితం, బాంధవ్యాల పరిస్థితి ఏంటీ...?. ఆ తరువాత జీవిత చరమాంకలో ఎవ్వరూ మనతో ఉండరు అంటూ రకరకాలు మాటలు లెవెనెత్తారు నెట్టింట నెటిజన్లు. సరిగ్గా ఈ సమయంలో ఓ బెంగళూరు టెకీ ఇలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సులభంగా మెయింటైన్ చేయొచ్చు అంటూ ఓ సలహా సూచించాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్గా మారి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అతడు చెప్పిన సలహా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గానీ కానీ కాస్త ఆలోచింపచేసేలా ఉందంటున్నారు నెటిజన్లు. మరీ అదెంటో చూసేద్దామా..!.బెంగళూరు టెకీ హర్షిత్ మహావర్ లింక్డ్ ఇన్ పోస్ట్లో పని జీవిత సమతుల్య సాధించడానికి ఇలా చేయండి అంటూ ఓ ఉచిత సలహ ఇచ్చాడు. అదేంటంటే..మీ సహోద్యోగినే పెళ్లాడండి సింపుల్గా. అంతే ఇక ఎన్నో ప్రయోజనాలు పొందుతారంటూ జాబితా చిట్టా చెప్పుకొచ్చాడు. క్యాబ్లపై డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నుంచి పనిచేసిన అనుభూతే ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో అనుక్షణం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది కదా..!. కాబట్టి ఆఫీస్లో ఉన్నాం అనిపించదు. ఏ మాత్రం విరామం దొరికినా..కాసేపు మీ శ్రీమతి లేదా శ్రీవారితో ముచ్చటించొచ్చు. ఇక తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడూ ఏదో ఊరు నుంచి వెళ్తున్నట్లుగా జాలీగా గడపండి. మీ భాగస్వామితో గడపలేదన్న భాధ కూడా ఉండదు. అటు వర్కు హయిగా చేసుకోవచ్చు..ఇటు భార్యతోనూ హ్యాపీగా స్పెండ్ చెయ్యొచ్చు. ఇలా చేస్తే కుటుంబాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీల్ ఉండదు. రెండింటికి న్యాయం చేసినవారు అవుతారంటూ రాసుకొచ్చాడు లింక్డ్ఇన్ పోస్ట్లో హర్షిత్. అయితే నెటిజన్లు ఇదేదో బాగుందే..!.. ట్రై చేస్తా అని కొందరు, సహోద్యోగిని పెళ్లిచేసుకోవడం అనేది శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు అని మరికొందరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఊపిరి సలపని ఒత్తిడులు..ఆగిపోతున్న ఖాకీల గుండెలు..!) -
Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్
అందాల హీరోయిన్, తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఎథ్నిక్ వేర్లో అందంగా మెరిసిపోతున్న లుక్ ఫ్యాన్స్నువిపరీతంగా ఆకట్టుకుంటోంది. మిల్కీ బ్యూటీగా పాపులర్అయిన గులాబీ రంగు పువ్వుల డిజైన్తో ఉన్న శారీలో అందంగా మారిపోయింది. తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్లతో సందడి చేస్తున్నారు.తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన ఫ్యాషన్స్టైల్ను చాటుకుంటూ ఉంటుంది. తాజాగా వేసవి వార్డ్రోబ్లో పూల చీర ఎందుకు అవసరమో తమన్నా లుక్ రుజువు చేసింది. స్టేట్మెంట్-మేకింగ్ బోర్డర్ సారీకి మెరిసిపోయేతన లుక్తో మరింత సొగసుదనాన్ని జోడించింది. పింక్కలర్ శారీలో మెరిసి పోతున్న ఆమెను ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ కంటే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవతలా వుంది, వెరీ ప్రెటీ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (వెరైటీ ఇడ్లీ, చట్నీకూడా అదిరింది, ట్రై చేయండి!) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అందమైన తన శారీ లుక్కు మ్యాచింగ్గా ముత్యాల ఆభరణాలను ఎంచుకుంది. రెండు పొరల ముత్యాల చోకర్ , సొగసైన స్టడ్లు అతికినట్టు సరిపోలాయి. ప్రొఫెషనల్ లాగా ఆమె ఎథ్నిక్ స్టైల్ను పూర్తి చేయడానికి ఓపెన్ వేవ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు. కాగా అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా భాటియా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం 'ఒడెలా 2' (Odela 2) విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 రిలీజ్ అవుతోందంటూ తమన్నా ఇన్స్టాలో వెల్లడించింది. తమన్నా ప్రతిసారీ సాధారణం కంటే భిన్నంగా ఉండే దుస్తులతో ఆశ్చర్యపరుస్తుంటుంది. సాంప్రదాయ చీరలో అయినా, మోడ్రన్ దుస్తుల్లో అయినా, తన ఐకానిక్ స్టైల్తో ఆకట్టుకోవడం తమన్నా స్పెషాల్టీ. -
Manabendra Nath Roy మానవవాద విప్లవకారుడు
ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసు కోవాలంటే ఎం.ఎన్. రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాప కుడు (1917) కావడమేమిటీ? ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనను ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండ నివ్వలేదు. ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాప నతో పాటు భారత రాజ్యాంగ చిత్తుప్రతిని తయారు చేసి ప్రచురించారు. భారత దేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదానికి మేనిఫెస్టో’ని (న్యూ హ్యూమనిస్ట్ మేనిఫెస్టో) రూపొందించి విడుదల చేశారు. తను స్థాపించిన ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్ ద్వారా దేశాన్నే కదిలించారు. డెహ్రాడూన్లో ఆయన నివాసమున్న చోటు నుండే ఆ సంస్థను నిర్వ హించారు. అది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్ హౌస్’గా పేరు పొందింది. ఉత్తర భారత దేశం నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా ఆయన అనుచరులు, అభిమా నులు అక్కడికి తరలి వెళ్ళారు. మతతత్వ భావనకు వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమ న్నారు రాయ్. అందుకే ‘ఎడ్యుకేట్ ద ఎడ్యు కేటెడ్’ – విజ్ఞానవంతుల్ని వివేకవంతుల్ని చేద్దామన్న ఆలోచనని వ్యాప్తి చేశారు. 1887 మార్చ్ 21న పశ్చిమ బెంగాల్లో రాయ్ పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్ర నాథ్ భట్టాచార్య. క్యాలిఫోర్నియాలో ఉండగా అక్కడి నిఘా విభాగాల దృష్టి మరల్చడానికి మానవేంద్ర నాథ్ రాయ్గా పేరు మార్చుకున్నారు. 14వ ఏటే అనుశీలన్ సమితిలో చేరారు. అది రహస్యంగా పని చేసే ఒక విప్లవ సంఘం. కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్ ముఖర్జీ నిర్వహణలో నడిచే జుగాంతర్ గ్రూపులో చేరారు. ‘జతిన్ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు’ అని తన గ్రంథం (చైనాలో నా అనుభావాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుగాంతర్ సభ్యులు ఎన్నో కార్య క్రమాలు చేస్తుండేవారు. ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో ఇండోనేషియాకు వెళ్ళి వస్తుండేవారు. ఆయుధాలు సమకూర్చు కుని, బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టాలన్నది ఆయన ఉద్దేశం.రహస్యంగా అమెరికాలో ఉన్నప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని ఎవిలిన్ ట్రెంట్తో స్నేహం పెరిగి పెండ్లి చేసుకున్నారు. తప్పనిసరై అక్కడి నుండి మెక్సికో చేరుకున్నారు. అక్కడ ఆయనకు తగిన భద్రత, గుర్తింపు లభించాయి. అందుకే ఆయన ‘జ్ఞాపకాల పుస్తకం’లో – మెక్సికో తనకు కొత్త జన్మ నిచ్చిందని రాసుకున్నారు. అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలిగారు.మానవేంద్ర నాథ్ రాయ్ తర్వాత కాలంలో వ్లాదిమిర్ లెనిన్, జోసెఫ్ స్టాలిన్ను కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో భాగస్వాము లయ్యారు. 1926లో దాని విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ఆ విధి విధానాల్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించేట్లు ఒప్పించ డానికి రాయ్ 1927లో చైనా వెళ్ళారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. రాయ్ ఒప్పించ లేక పోయారని కాబోలు, 1929లో ఆయ నను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుండి బహి ష్కరించారు. 1930లో రాయ్ భారత్కు తిరిగి రాగానే, ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిషు ప్రభుత్వం 1924 నాటి కాన్పూర్ బోల్షివిక్ కుట్ర కేసుతో అరెస్ట్ చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలై వచ్చాక రాయ్ నాలుగేళ్ళ పాటు ఇండి యన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యుడిగా ఉండి బయటపడ్డారు. 1946లో డెహ్రాడూన్లో భారతీయ సాంస్కృతిక పునర్వికాస కేంద్రాన్ని స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాక, లోకాయత, బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదిక అయ్యింది. రాయ్ జీవితం నుండి, ఆయన ప్రతిపాదించిన ర్యాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్లు, కమ్యూనిస్ట్లు,కాంగ్రెస్ వాదులు, పార్టీరహిత కార్యకర్తలు ఎంతోమంది ప్రేరణ పొందారు. 1954 జనవరి 25న తన 67వ ఏట గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ‘ఉత్పత్తి చేస్తున్న వారికి ఆర్థిక స్వాతంత్య్ర సాధన’ అన్నది రాయ్ ఆశయాలలో ఒకటి. -వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతడా. దేవరాజు మహారాజు -
విధుల ఒత్తిడి.. వ్యాధుల ముట్టడి..!
ఓ వైపు శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.. మరోవైపు ఆకతాయిలు పెచ్చు మీరుతున్నారు. ఇంకోవైపు గంజాయి బ్యాచ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ పోలీసులే కావాలి. కానీ సరిపోయేంత సంఖ్యలో ఖాకీలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో లేరు. ఫలితంగా ఉన్న వారిపైనే ఒత్తిడి పడుతోంది. ఊపిరి సలపనంత పనితో వారి గుండెపై భారం పడుతోంది. తీవ్ర నిద్రలేమి, సరైన సమయానికి భోజనం లేక 30 ఏళ్లు దాటిన పోలీసులకు సైతం బీపీ, మధుమేహం వస్తున్నాయి. చాలా మందికి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటున్నాయి. 50 ఏళ్లు దాటిన వారితో పాటు 35 ఏళ్లలోపు వారు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో ఈ కష్టం పంచుకోలేక చాలా మంది తమలో తామే కుమిలిపోతున్నారు. సిబ్బంది.. ఇబ్బంది జిల్లాలో 38 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నవాళ్లలో 20 శాతం మందిని దేవాలయాలు, రాజకీయ సమావేశాలు, పోలీస్ పికెటింగ్, విద్యార్థుల పరీక్షలు వంటి బందోబ స్తు కార్యక్రమాలకు పంపుతుంటారు. ఒక్కో స్టేషన్లో 50 నుంచి 70 మంది ఉండాల్సి ఉన్నా పట్టుమని 20 మందైనా ఉండడం లేదు. ఈలోగా స్టేషన్లలో పెండెన్సీ కేసులు, కొత్త కేసులు, కొత్త చట్టాలు, కొత్త యాప్లు, సంకల్పాలు, అవగాహనలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్ల కొరత వేధిస్తోంది. మరో 500 మంది సిబ్బంది ఉంటే తప్ప ఉన్న వారి ఆరోగ్యం బాగు పడేట్లు కనిపించడం లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ.. 50 ఏళ్లు దాటిన వారిని సైతం సుదూర (విజయవాడ)బందోబస్తులకు పంపిస్తుండటం ఇబ్బందిగా ఉంటుంది. టీఏ, డీఏలు, సరెండర్లీవ్లు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పదిమంది వెళ్లాల్సిన స్థానంలో వందమందినైనా అక్కడి వాళ్లు అడుగుతుండటం, సొంత డబ్బులతోనే సిబ్బంది వెళ్తుండటం జీతాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. స్టేషన్లలో పోలీసు వాహనాల కొరత ఉండటంతో సొంత వాహనాలకు పెట్రోల్ పోసి పరిసర ప్రాంతాల విధుల్లో తిరగాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జెమ్స్ లో ఇటీవల పోలీసులకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో 103మందికి పైగా సిబ్బందికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్స్ అవసరమని వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.వీరి పరిస్థితే హెచ్చరిక.. జనవరిలో నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో యువకుడైన నాగరాజు అనే హోంగార్డు గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, చిన్న పిల్లలున్నారు. జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో చెస్ట్ గార్డుగా ఉన్న ఏఆర్ హెడ్కానిస్టేబుల్ సవర జోక్యో గుండెపోటుతో మరణించాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వరుసగా మూడురోజులు విధుల్లో ఉన్నారు. మందస హెడ్కానిస్టేబుల్ గవరయ్య (59) గుండెపోటుతోనే మరణించారు. నగరంలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార బందోబస్తు విధులకు వెళ్లిన 57 ఏళ్ల ఆబోతుల లక్ష్మయ్య ఎండల వేడిమి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి విజయవాడలోనే మృతిచెందాడు. ఈయనది పోలాకి మండలం పల్లిపేట. సోంపేట ఎస్ఐ రవివర్మకు ఇటీవలే రెండోసారి స్ట్రోక్ వచ్చింది. తొలిసారి ఒక స్టంట్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరమన్నారు. ప్రస్తుతానికి లీవ్లో ఉన్నారు. కాశీబుగ్గ కానిస్టేబుల్కు హార్ట్ ప్రాబ్లెం ఉండటంతో స్టంట్ వేయించుకున్నారు. సోంపేటలో ఓ కానిస్టేబుల్కు ఇదే పరిస్థితి ఉంది. డే బై డే నైట్ డ్యూటీలతో సిక్.. గతంలో నైట్ బీట్ డ్యూటీల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండేవారు. ఎస్ఐలు, సీఐలు రౌండ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 ఏళ్లు నిండి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏఎస్ఐలు నుంచి హెడ్కానిస్టేబుళ్లు కూడా డే బై డే నైట్ బీట్లకు వెళ్లాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎస్ఐ–2లు వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు వరకు ఉండటమే కాక గంట గంటకూ లైవ్ లొకేషన్, రెండు ఫొటోలు పంపాల్సిందే. మళ్లీ ఉదయాన్నే రోల్కాల్ 8గంటలతో డ్యూటీ మొదలు. 7:45 కల్లా సిద్ధంగా ఉండాలి. సెట్కాన్ఫరెన్సు (ఎస్ఐ, ఆపై ర్యాంకు) అయితే 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5కి రోల్ కాల్, 7:30 నుంచి సెట్ కాన్ఫరెన్సు.. కొన్నిమార్లు జూమ్ కాన్ఫరెన్సులు.. సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఉంటాయి. (చదవండి: -
వండర్స్ ఆఫ్ వయనాడ్: కొండ కోనల్లో పడవ ప్రయాణం..!
పాత రాతియుగాన్ని చదువుకున్నాం... శిలాయుగాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ కాలంలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మ కట్టిన తిరునెల్లి ఆలయం ఉంది. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని చూడాలంటే... అరక్కల్... అంబల్వాయల్ మ్యూజియాలకు కళ్లప్పగించాలి. ఎడక్కల్ గుహల్లో ఎనిమిదివేల ఏళ్ల నాటి బొమ్మలను తాకి చూడాలి. మోడరన్ హిస్టరీ చెప్పిన పాఠాలకు ఆనవాళ్లుగా... ఏమేమి ఉన్నాయి? డచ్ కట్టడాలు... పోర్చుగీసు నిర్మాణాలు... బ్రిటిష్ కాలపు టెలిఫోన్లు. వాటిని చూడాలంటే ఏం చేయాలి?... వయనాడుకు ప్రయాణమవ్వాలి. ఎరుపెక్కిన కళ్లతో కప్పడ్ బీచ్లో వాస్కోడిగామా స్మారకాన్ని చూడాలి. గాంధీజీ జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించిన కాల్పెట్టలో బస చేయాలి. ఫారెస్ట్కు అర్థవంతమైన నిర్వచనం చెప్తున్న కురువద్వీపంలో అడుగుపెట్టాలి. పూకోద్ సరస్సులో కలువల మధ్య పడవ ప్రయాణం చేయాలి. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని గౌరవిస్తూ ముందుకుసాగాలి. ‘వండర్స్ ఆఫ్ వయనాడ్’ ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.సెలవులు వస్తున్నాయి... కేరళలో పర్యటనకు ప్లాన్ చేసుకోండి.మొదటి రోజు..ఉదయం ఆరుగంటల సమయంలో 12789 నంబరు కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.రెండోరోజుఉదయం ఆరు గంటల సమయంలో రైలు కన్నూరుకు చేరుతుంది. రైలు దిగి రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన హోటల్కు చేరుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఉపహారం తిన్న తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. ఏంజిలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం చూసుకున్న తర్వాత ప్రయాణం వయనాడు వైపు సాగుతుంది. దారిలో అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ వయనాడు, కాల్పెట్టలోని హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస అక్కడే.ఇక్కడికి గాంధీజీ వచ్చాడు!కన్నూర్ కోట (సెయింట్ ఏంజిలో ఫోర్ట్) పోర్చుగీసు, డచ్వాళ్ల పాలన సాగించిన ప్రదేశం. అరక్కల్ మ్యూజియం కన్నూరు సిటీకి మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. అరక్కల్ రాజవంశం నివసించిన ప్యాలెస్ అది. వాళ్లు ఉపయోగించిన ఫర్నిచర్ డిజైన్లు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా సంపన్నవర్గాల ఇళ్లలో కనిపిస్తున్నాయి. బ్రిటిష్పాలన కాలంనాటి టెలిఫోన్ కూడా ఉంది. రాత్రి బస చేస్తున్న కాల్పెట్ట అందమైన హిల్స్టేషన్. దట్టమైన అటవీ ప్రదేశం కూడా. కేరళలో భారత జాతీయోద్యమం పురుడుపోసుకున్న ప్రదేశం ఇది. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తినింపడానికి గాంధీజీ 1934లో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. మూడోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. కురువ ద్వీప్, తిరునెల్లి ఆలయం, బాణాసుర సాగర్ డ్యామ్ చూసుకుని హోటల్కి చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.బ్రహ్మ కట్టిన ఆలయంకురువద్వీపంలో విహారం మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. కబిని నది ఉపనదుల ప్రవాహం మధ్యలో ఏర్పడిన వెయ్యి ఎకరాల దీవి ఇది. పచ్చదనాన్ని పుష్పగుచ్ఛంగా ఒకచోట రాశి΄ోసినట్లుంటుంది. ఇక్కడ అరుదైన పక్షులు కనిపిస్తాయి. తిరునెల్లి ఆలయం ఓ విశిష్టత. దీని గురించి చారిత్రక ఆధారాలేవీ దొరకట్లేదు. పౌరాణిక ఆధారాల ప్రకారం వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో విష్ణువు కోసం బ్రహ్మ భూమ్మీద నిర్మించిన ఆలయం అని తెలుస్తోంది. లొకేషన్ సెలెక్ట్ చేయడానికి బ్రహ్మదేవుడు తన వాహనం హంస మీద భూమండలం అంతా పర్యటిస్తూ ఈ ప్రదేశాన్ని చూసి ముచ్చటపడ్డాడని, ఇక్కడే ఆలయాన్ని నిర్మించాడని, ఈ కొండకు బ్రహ్మగిరి అనే పేరు రావడానికి కారణం అదేనని చెబుతారు. ఆలయాన్ని నిర్మించే వరకు తనతో తెచ్చిన విగ్రహాన్ని ఉసిరి చెట్టులో దాచడంతో ఈ ఆలయానికి నెల్లి అనే పేరుతో తిరునెల్లి ఆలయం అనే పేరు వచ్చింది. పది–పదకొండు శతాబ్దాల్లో చేరరాజు భాస్కర రవివర్మ పాలించిన నాటికే ఇది గొప్ప యాత్రాస్థలంగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ప్రాచీన కాలం నాటి గ్రామాల ఆనవాళ్లను కూడా చూడవచ్చు. ఆ తర్వాత చూడాల్సిన బాణాసుర సాగర్ డ్యామ్ రెండువేల అడుగుల పొడవుతో దేశంలోనే అతి పెద్ద ఎర్త్డ్యామ్. జల విద్యుత్ తయారీ కేంద్రాన్ని కూడా చూడవచ్చు. నాల్గోరోజుబ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంబలవాయల్ హెరిటేజ్ మ్యూజియం, సూచిపారా జలపాతం, ఎడక్కల్ గుహలు, పూకోద్ సరస్సులో విహారం తర్వాత తిరిగి హోటల్కు చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.రాతియుగాన్ని చూసొద్దామా!ఇది వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం, అంబలవాయల్ అనే ప్రదేశంలో ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఇందులో రాతియుగం నాటి పదునైన రాతి ఆయుధాలు, 14 నుంచి 16వ శతాబ్దం నాటి శిల్పాలు, మృణ్మయపాత్రలు, టెర్రకోట శిల్పాలు ఉంటాయి. ఇక ఎడక్కల్ గుహలు కాల్పెట్టకు 25 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. వీటి వింత ఏమిటంటే... ఇవి నేలమీద విస్తరించిన గుహలు కావు. ఎవరూ పనిగట్టుకుని తొలిచినవీ కాదు. దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన గుహలు. ఈ గుహల్లో కనిపించే బొమ్మలు క్రీస్తు పూర్వం ఆరువేల ఏళ్ల నాటివని అంచనా. ఈ రోజు చివరగా పూకోద్ సరస్సులో పడవ విహారంతో సేదదీరడమే. ఈ సరస్సు దాదాపు ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో కొండల మీద ఏడెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. వర్షపునీరు కొండ కోనల నుంచి ఇక్కడికి చేరుతుంది. సరస్సు నిండిన తర్వాత నీరు కిందకు ప్రవహించి పనమారమ్ నదిగా మారుతుంది. ఈ నది కబిని నదిలో కలుస్తుంది. ఈ సరస్సులో కలువలు విరివిగా ఉంటాయి. అందుకే దీనికి పూలతీరం అనే అర్థంలో పూకోద్ అనే పేరు వచ్చింది. ఐదోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ప్రయాణం కోళికోద్ వైపు సాగుతుంది. దారిలో కప్పడ్ బీచ్ విహారం. సాయంత్రం ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఉంటుంది. షాపింగ్ తర్వాత కోళికోద్ రైల్వే స్టేషన్కి వెళ్లి రైలెక్కాలి. 12790 నంబరు మంగళూరు సెంట్రల్ – కాచిగూడ ఎక్స్ప్రెస్ రాత్రి 11.35 నిమిషాలకు బయలు దేరుతుంది. 24 గంటల తర్వాత ఆరవ రోజు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుతుంది.వాస్కోడిగామా అడుగుపెట్టాడు!కప్పడ్ బీచ్ అంటే ΄ోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించి మన నేల మీద పాదం మోపిన ప్రదేశం. ఇది 1498లో జరిగింది. భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ 1934లో కాల్పెట్టలో అడుగుపెట్టడానికి కారణమైన సంఘటన అన్నమాట. కష్టంగా అయినా నిష్టూరంగా అయినా ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే, వదిలేయడానికి వీల్లేదు. గుడ్లు పెట్టి పిల్లలను పొదగడానికి ఇక్కడికి వచ్చే తాబేళ్లను చూడడానికైనా కప్పడ్ బీచ్ని కవర్ చేయాలి. అలాగే సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సముద్రతీరాన గడపడానికి ఇది మంచి ప్రదేశం. ఇక చివరగా కోళికోద్ పట్టణంలోని ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఇస్తారు. వాహనం దిగి మార్కెట్ అంతటా కాలి నడకన తిరగాలి. ఏం కొన్నా కొనక΄ోయినా కోళికోద్ హల్వా తప్పకుండా రుచి చూడాలి. బంధువులు, స్నేహితుల కోసం ఇంటికి తెచ్చుకోవాలి. దీంతో ఈ టూర్ తీపి జ్ఞాపకపు రుచి కలకాలం గుర్తుంటుంది.వండర్స్ ఆఫ్ వయనాడ్ (ఎస్హెచ్ఆర్ 098) ప్యాకేజ్లో...ఇవి ఉంటాయిస్టాండర్డ్ ప్యాకేజ్లో స్లీపర్ క్లాస్లో ప్రయాణం. కంఫర్ట్ ప్యాకేజ్లో థర్డ్ ఏసీలో ప్రయాణం. రైలు దిగిన తరవాత లోకల్ జర్నీ ఏసీ వాహనంలో ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్. టోల్ ఫీజ్, పార్కింగ్ ఫీజులు ప్యాకేజ్లోనే. రాత్రి బస చేసిన హోటల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది.ఇవి వర్తించవుమధ్యాహ్నం, రాత్రి భోజనాలు. రైలు ప్రయాణంలో భోజనాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్ చార్జ్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి రిక్రియేషనల్ టికెట్ ఫీజులు, గైడ్ చార్జ్లు, ఇతర సర్వీసులు పర్యాటకులే భరించాలి. కొన్ని ప్రైవేట్ టూర్ ప్యాకేజ్లు ట్రీ హౌస్లో రాత్రి బస ఏర్పాటు చేస్తున్నాయి.వండర్స్ ఆఫ్ వయనాడ్ టికెట్ ధరలిలాసింగిల్ ఆక్యుపెన్సీలో (ఒక్కొక్కరికి ఒక్కో గది) కంఫర్ట్ ప్యాకేజ్ 37, 640 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్కి 34, 840 రూపాయలు.డబుల్ ఆక్యుపెన్సీలో (ఇద్దరికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 21,220 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 18,430 రూపాయలు.ట్రిపుల్ ఆక్యుపెన్సీలో (ముగ్గురికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 17,740 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 14,950 రూపాయలు. (చదవండి: ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..!) -
మాది ఆనందం.. మీది అనుబంధం..
బహుశా ఫిన్లాండ్ అనే చిన్న దేశం గురించి మిగిలిన సందర్భాల్లో ఎవరూ ఎక్కువ ముచ్చటించుకోకపోవచ్చు.. కానీ యేటా మార్చి నెల్లో మాత్రం కచ్చితంగా ఆ దేశం టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హ్యాపీనెస్ ఇండెక్స్లో తొలిస్థానంలో ఫిన్లాండ్ నిలుస్తోంది కాబట్టి. అదే క్రమంలో తాజా హ్యాపీ నెస్ ఇండెక్స్లోనూ ఫిన్లాండ్ తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దేశపు మహిళ.. మన తెలుగింటి కోడలు రైతా ముచ్చర్ల ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..ఫిన్లాండ్..‘హ్యాపీ’ బ్రాండ్.. మా దేశంలో పేద ధనిక గొప్ప తారతమ్యాలు ఉండవు. వాటికి చిన్నవయసులోనే పాతరేస్తారు.. దాదాపు 90 శాతం విద్యావ్యవస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటుంది. స్కూల్స్లో, కాలేజీల్లో డబ్బుల్ని బట్టి, హోదాల్ని బట్టి విద్యార్థులను విభజించడం ఉండదు కాబట్టి చిన్న వయసులోనే ఈక్వాలిటీ అనేది బాగా నాటుకుంటుంది. దీని వల్ల 100 శాతం అక్షరాస్యత సాధించగలిగారు. అలాగే చదువుతో పాటు ప్రతి నగరంలోనూ శిక్షణా సంస్థలు ఉంటాయి. విభిన్న రకాల కళలు, సామర్థ్యాలలో రాణించాలనుకునేవారు ఎవరైనా సరే వయసుతో ప్రమేయం లేకుండా నామమాత్రపు రుసుముతోనే నేరి్పంచే శిక్షణా సంస్థలు ఉంటాయి. అభిరుచులే.. ఆనంద మార్గాలు.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి/హాబీ మా దేశంలో తప్పకుండా ఉంటుంది. అక్కడ కూడా సినిమాలు ఉంటాయి కానీ.. వాటికన్నా కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలే ఎక్కువ ఉంటాయి. దానికి కళల పట్ల, కళారంగాల పట్ల వ్యక్తుల్లో ఉన్న అభిరుచే కారణం కావచ్చు.హరితం.. లంచాల రహితం.. పిల్లలను ప్రకృతికి దగ్గరగా ఉంచడానికి అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ప్రతి నగరానికీ ఆనుకుని ఒక అడవి ఉంటుంది. అందులో నెలకు ఒక్క రోజైనా పిల్లలను స్వేచ్ఛగా విహరించేలా చూస్తారు. రాజకీయాలు సంపాదనకు మార్గంగా భావించడం ఉండదు. రాజకీయాలనే కాదు, ఏ రంగమైనా సరే లంచగొండితనం జీరో అని చెప్పొచ్చు. తద్వారా ఒకరిని ఒకరు దోపిడీ చేస్తారనే భయాలు ఉండవు. అలాగే ఏ అర్ధరాత్రయినా సరే భద్రంగా సంచరించవచ్చు.. దొంగతనాలు, నేరాల రేటు కూడా అత్యంత స్వల్పం. ఒకరినొకరు అనుమానించుకోవడం, అపనమ్మకాలతో బంధాలు వంటివి అక్కడ కనపడవు. అన్నీ బాగున్నా.. అనుబంధాల్లో మీరే మిన్న.. ఫిన్లాండ్.. చాలా విషయాల్లో బాగున్నా.. అనుబంధాల్లో మాత్రం భారత దేశంతో పోలిస్తే వెనుకబడే ఉందని అనుభవపూర్వకంగా చెప్పగలను. తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నగరానికి వచి్చన యువతిగా.. ఈ దేశపు అనుబంధాలు నాకు ఆశ్చర్యానందాలను కలిగించాయి. పరస్పరం కేరింగ్ ఇక్కడ ఎక్కువ. వ్యక్తుల మధ్య అనుబంధాలకు ఇక్కడ ఇస్తున్నంత విలువ అక్కడ కనపడదు. అక్కడ విడాకుల సంఖ్య కూడా ఇక్కడితో పోలిస్తే ఎక్కువే. స్వేచ్ఛా ప్రియత్వం ఎక్కువగా ఉండడం వల్ల 20 నిమిషాల్లో పెళ్లి తంతు ముగించినట్టుగానే బంధాలకూ అంతే వేగంగా, సులభంగా వీడ్కోలు పలుకుతారు. దీనివల్లే అక్కడ ఒంటరితనం బాధితులు ఎక్కువగా కనబడతారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నంత పోటీ తత్వం కూడా అక్కడ ఉండదు. అన్ని రకాలుగానూ ఇతరుల్ని మించి ఎదగాలనే తపన, ఆరాటం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ క్రమంలోనే తమ హోదాలు, అంతస్తులు.. వగైరాలను ప్రదర్శించుకోవడం కూడా జరుగుతుంటుంది. అక్కడ ఇలాంటివి ఏ మాత్రం కనిపించవు. -
ఇళ్లకు వెళ్లి మరీ సేవలు చేశాం
క్యాన్సర్తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.నేరుగా వారి ఇళ్లకే..క్యాన్సర్ పేషంట్స్కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్తో కాదు క్యాన్సర్తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.వీడియోలలో దహన సంస్కారాలు.. ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్తో చనిపోయాడనే లెటర్తో పాటు అంబులెన్స్ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆత్మచైతన్యానికే ధ్యానం
దైవం అనేది బయట వెదికే విషయమే కాదు. సమాజంలోని నియమాలతో, నమ్మకాలతో పద్ధతులతో దానికి సంబంధమే లేదు. ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్న ఆధ్యాత్మికత అంతా సమాజానికి చూపించుకోవడానికి, నలుగురిలో మంచి అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు. నిజానికి ఆధ్యాత్మిక ప్రయాణం నీలోనికి నీవుచేసే ప్రయాణం. గర్భగుడిలోనికి ఒక్కరినే అనుమతించడంలోని అంతరార్థం ఇదే. సత్యాన్ని తెలుసుకోవడానికి బయటి వ్యక్తులు, మధ్యవర్తుల ప్రమేయమే అవసరం లేదు. సత్యం ఒకరు చెబితే అర్థమయ్యే విషయం కాదు. నీకు నీవుగానే సత్యాన్ని తెలుసుకోవాలి. నీ నమ్మకాల నుండి, అహం నుండి పూర్తిగా బయట పడాలి. నేను శరీరం కాదు. వీటికి సాక్షిగా ఉన్న దివ్య చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. ఆత్మ చైతన్యవంతమవ్వడమే ధ్యానం.విజ్ఞాన భైరవ తంత్రంలో శివుడు పార్వతికి 112 ధ్యానపద్ధతులను బోధిస్తాడు. మనం వాటిని పాటిస్తే దైవత్వాన్ని పొందుతామేమోగాని ఆరాధించడం వల్ల కాదు. శివుడు, బుద్ధుడు మొదలైన వారందరూ తాము దైవమని తెలుసుకొని ద్రష్టలైనారు. వారు తమలోని దైవత్వాన్ని తెలుసుకుని ఆ మార్గాన్ని మనకు బోధించారు. కానీ మనం ఆ మార్గాలను అనుసరించకుండా కేవలం వారిని ఆరాధించటం చేస్తున్నాము. దేవుడు భౌతికం కానేకాదు. శుద్ధచైతన్య స్థితిలోనే దైవగుణాలు ఉంటాయి. అది చావు పుట్టుకలు లేని స్థితి. తనను తాను తెలుసుకున్నవాడేస్వామి. నీ నిజస్థితిలో కేంద్రీకృతమై ఉంటే నీవే స్వామి. ఈ నిజమైన అర్ధాలు తెలియకపోవడం వల్లనే కొందరు గడ్డాలు పెంచి విచిత్ర వేషాలతో గురువులుగా, స్వాములుగా చలామణి ఔతున్నారు. అసలు దైవత్వానికి భౌతిక వేషధారణతో సంబంధమే లేదు. సంసారాన్ని భౌతికంగా వదలవలసిన అవసరం అస్సలు లేదు. సామాన్య జీవితంలో ఉంటూ,రోజువారీ పనులు చేస్తూనే నీ ఆత్మలో నీవు కేంద్రీకృతమై సాక్షిగా ఉండడానికి రూపంతో పనిఏముంది? భాషతో, మాయలతో, అద్భుతాలతో మతంతో దైవత్వాన్ని ముడిపెట్టినంతవరకు ఎన్నటికీ దైవత్వాన్ని చేరలేవు. వీటన్నింటికీ అంటని స్వచ్ఛమైన చైతన్యస్థితే దైవత్వమని తెలుసుకో. సాక్షీభూతుడవై ఉండు. ఆ స్థితిని చేరుకున్నారు కనుకే కృష్ణుడిని, బుద్ధుడిని, క్రీస్తును దేవుళ్ళన్నారు. నీలోని కల్మషాలను తొలగించుకొని స్వచ్ఛమైన చైతన్యంగా మిగిలిపో. అధ్యాత్మిక ప్రయాణాన్ని ఒంటరిగానే చేయాలి. మధ్యవర్తులెవ్వరూ నీకు సహాయం చేయలేరు. యాంత్రికమైన పద్ధతులను పాటిస్తూ, గుడ్డి నమ్మకాలతో ఉంటే మనస్సు ఉచ్చులో చిక్కుకుపోతావు కానీ ఆత్మవైపు వెళ్ళలేవు. ఆత్మ చైతన్యాన్ని మాత్రం పొందలేవు.దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నంతమాత్రాన దేవునికి దగ్గర ఉన్నట్టు కాదు. నమ్మకాలకు అతీతమైన స్థితే దైవత్వం. మనస్సుకు అతీతమైన స్థితే దైవత్వం. అందుకు మార్గమే ధ్యానం.దేవుడు ఒక మనిషి కాదు. దైవత్వం ఒక స్థితి, నీ నిజస్థితి. తనను తాను తెలుసుకున్నవాడే దేవుడు. నీ నిజస్థితిని తెలుసుకుంటే నీవే దైవం. – స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
కృతజ్ఞత కనీస సంస్కారం
మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞులై ఉండడం మన కనీస ధర్మం... మనం ఎవరి నుంచైతే మేలు పొందుతున్నామో, వారు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా, వారి ఉదారతను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధిగా భావించాలి. ఎందుకంటే అలా కృతజ్ఞతలు తెలియ చేసినపుడే మన సంస్కారం ఏమిటో ఇతరులకు అర్థమవుతుంది. అంతేకాదు అది మనసుకు కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.మనం ఇతరుల నుంచి ఎలాంటి సహాయం పొందినా వారికి కృతజ్ఞులై ఉండాలి. తల్లితండ్రులు మనకి జన్మనిస్తారు.. మన భవిష్యత్ కు పునాదులు వేస్తారు.. అందువల్ల మనం వారికి జీవితాంతం కృతజ్ఞులై ఉండాలి. మన గురువులు మన భవిష్యత్ కు దిశానిర్దేశం చేస్తారు, మన స్నేహితులు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు, ఇలా అనేక మంది పరోక్షంగా మన భవిష్యత్కు ఎంతగానో సహకరిస్తున్నారన్నమాట.. మన భవిష్యత్ను వారంతా తీర్చి దిద్దుతున్నపుడు వారికి మనం కృతజ్ఞతలు చూపించుకోవాలి కదా.. కృతజ్ఞతలు తెలియ చేయడం మన వ్యక్తిత్వాన్ని చాటి చెబుతుంది.. మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందినపుడు నవ్వుతూ ధాంక్సండీ.. మీ మేలు మరచి పోలేను అని చెప్పి వారి కళ్లలోకి ఒక్కసారి తొంగి చూస్తే, వారి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం మనకు కనిపిస్తుంది.. వారికి మన పట్ల మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దానివల్ల అవతలి వారు భవిష్యత్లో వారితో మనకేదైనా పని పడ్డప్పుడు, వారు ఇక ఆలోచించకుండా మనకు సహాయం చేస్తారు.శ్రీరామచంద్రుడ్ని మనం దేవుడిగా పూజిస్తాం.. అయితే రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్ముడే అయినా ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు తనను ఒక మానవమాత్రునిగానే భావించుకున్నాడు. అందరిలో తాను ఒకడిగా, అందరికోసం తాను అన్నట్లుగా మెలిగాడు. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అలా రాముడు ప్రతీ విషయంలోనూ కృతజ్ఞతను చాటుకోవడం వల్లనే ఆయనను మనం పూజిస్తున్నాం.. ఆరాధిస్తున్నాం... మనం భూమి మీద నడుస్తున్నాం. పంటలను పండించుకుంటున్నాం... కనుక భూమిని భూదేవి‘ అనీ, మనం బతికుండడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న నీటిని ‘గంగాదేవి’ అనీ, గాలిని వాయుదేవుడు అనీ పిలుస్తూ కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి. సమస్త ప్రకృతి మన భావాలను గ్రహించి తదనుగుణంగా స్పందిస్తుంది కనుక మనకు చక్కగా ఆక్సిజన్ ఇస్తున్న చెట్లకూ, నీటికీ కృతజ్ఞతలు చెప్పాలి. మన జీవితానికి ఉపయోగపడే ప్రతి వ్యక్తికీ, వస్తువుకు, జీవికి మనం కృతజ్ఞులై ఉంటే, అదే మన భావి జీవితానికి కొత్త బాటలు వేస్తుంది. మన జీవితాన్ని నందనవనం చేస్తుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి.– దాసరి దుర్గా ప్రసాద్, ఆధ్యాత్మిక పర్యాటకులు -
పుట్టగానే చంపేయాలని చూశారు! కానీ ఆ అమ్మాయే ఇవాళ..
ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు. కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు. అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది. అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం. తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్ ఆర్ట్స్తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే అల్టిమేట్ ఫైనల్ ఛాంపియనషిష్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది. అలా పూజ అల్టిమేట్ ఫైనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రెజిల్కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్సీ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్గా ఎదిగింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం. అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ. దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ. (చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే) -
సరదాగా ఈ సండే చేప, చికెన్తో వెరైటీ స్నాక్స్ చేయండిలా..!
ఫిష్ చిప్స్ కావలసినవి: చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)మైదా పిండి– అర కప్పుమొక్కజొన్న పిండి– పావు కప్పుబేకింగ్ పౌడర్– కొద్దిగాబ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్మిరియాల పొడి– అర టీ స్పూన్సోడా వాటర్– కొద్దిగాఉప్పు– తగినంతమసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి)నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.చికెన్తో స్పైసీ ఎగ్స్కావలసినవి: గుడ్లు– 5 లేదా 6 బోన్లెస్ చికెన్– 1 కప్పు కారం– 2 టీ స్పూన్లుపసుపు– చిటికెడుగరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే చికెన్ మసాలా– 1 టీ స్పూన్ ఉప్పు– తగినంతమిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా బోన్లెస్ చికెన్ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..) -
‘ఇనుములో ఓ మనిషే మొలిచెనే'..!
‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే..’ అన్నట్లు ఇప్పుడు ఇనుములో ఓ మనిషే మెులిచాడు. అమెరికన్ కంపెనీ ‘క్లోన్ రోబోటిక్స్’ మనిషిని పోలిన శరీరంతో ‘ప్రోటోక్లోన్’ పేరుతో రోబోను రూపొందించింది. ఇతర రోబోల మాదిరి కాకుండా ఇది వెయ్యి కృత్రిమ కండరాలు, 206 ఎముకలు, చర్మం, కీళ్లు వంటి ఇతర భాగాలతో నిజమైన మానవుడిలా పనిచేసే శరీరంతో ఉంటుంది. ఇందులో అమర్చిన 500పైగా సెన్సర్ల సాయంతో ఈ రోబో శ్వాస తీసుకోటం, వదలడం, చెమటలు పట్టడం, వణకడం, భయపడటం, నవ్వడం, ఏడ్వటం ఇలా మరెన్నో భావాలను వ్యక్తపరచగలదు.(చదవండి: ఏకంగా ఆన్లైన్లో మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?) -
ముత్యంలా మెరిసిపోయే హన్సిక ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
మీ వార్డ్రోబ్ను ట్రెండీగా మార్చాలంటే, నటి హన్సిక ఫ్యాషన్ స్టయిల్ను ఫాలో అయితే చాలు. ఎప్పటికప్పుడు స్టయిలింగ్లో భిన్నమైన సెలక్షన్స్తో అదరగొడుతూ ఒక ట్రెండ్ సెట్టర్గా, ఒక ఫ్యాషన్ గైడ్లా కనిపించే హన్సిక, ప్రస్తుతం ఉన్న ఈ లుక్ కోసం ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఎంటో ఇక్కడ చూద్దాం.. ఫ్యాషన్లు ఎన్ని మారినా వన్నె తరగని ట్రెండ్ ముత్యాలదే! తెల్లగా మెరిసిపోతూ మగువలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. వీటిని పెట్టుకున్న వెంటనే ధరించిన దుస్తుల లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. సింపుల్ పెర్ల్ జ్యూలరీతో ఆఫీస్ దుస్తులకు స్టయిలింగ్ చేసుకుంటే క్లాసిక్ లుక్ మీ సొంతం. చీర, లెహంగా, డ్రెసెస్ మీదనైనా కూడా ఇవి చక్కగా నప్పుతాయి. ఇందుకు తగ్గట్టుగానే ముత్యాల నగల్లో వివిధ ఆకర్షణీయమైన డిజైన్స్లో ముత్యాల ఆభరణాలు లభిస్తున్నాయి. ముత్యాలు ఎక్కువగా డార్క్ షేడ్ దుస్తులతో ఉత్తమంగా కనిపిస్తాయి. ఇక ముత్యాల నగలను ధరించేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. వీటిని వేరే ఇతర ఆభరణాలతో కలిపి స్టయిలింన్ చేయకూడదు. అన్నీ ఆభరణాలు ముత్యాలవే అయితే బాగుంటుంది. ఈ చిట్కానే పైన నటి హన్సిక కూడా ఫాలో అయిందని ఫొటో చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ హన్సిక ధరించిన చీర బ్రాండ్ సురుమయే, ధర రూ. 23,000. బ్లౌజ్ ధర రూ. 6,00 నెక్ పీస్ బ్రాండ్: ప్రీటో ధర: రూ. 5,800 ఇయర్ రింగ్స్ బ్రాండ్: గోల్డెన్ విండోధర: రూ. 1,890 -
ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?
ఆన్లైన్లో ప్రతి వస్తువు అమ్మకానికి ఉంచినట్లే, చైనాలో మట్టిని కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే, ఈ మట్టి అలాంటి ఇలాంటి మట్టి కాదు, ‘ఇదొక అదృష్టాల మట్టి, ఈ మట్టిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బుల వర్షం కురిపిస్తుంది’ అంటూ బ్యాంకుల ఆవరణలోని మట్టిని రాత్రివేళలో సేకరించి ఆన్లైన్లో అమ్ముతున్నారు. వంద గ్రాముల మట్టి ధర సుమారు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు ఉంటోంది. ఈ మట్టితో ఆర్థికంగా లాభాలు పొందవచ్చని చాలా మంది నమ్మి, బ్యాంకుల ముందు మట్టిని, బ్యాంక్ లోపల పూలకుండీల వద్ద ఉండే మట్టిని, కౌంటింగ్ మిషన్ నుంచి వచ్చిన ధూళిని కూడా సేకరిస్తున్న వీడియాలు వైరల్గా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం పబ్లిక్ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం నిషిద్ధంగా ప్రకటించింది. ఇలాంటివి నమ్మవద్దని ప్రకటనలు ఇస్తోంది చైనా ప్రభుత్వం. (చదవండి: -
అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే స్మార్ట్ ఆభరణాలు..! థర్మామీటర్ చెవిపోగు ఇంకా..
అందం కోసం ఆభరణాలను ధరించడం మామూలే కాని, అవే ఆభరణాలు అందంతోపాటు ఆరోగ్యాన్ని, టెక్నాలజీని అందిస్తే భలే బాగుంటుంది కదూ! అయితే, ఈ గాడ్జెట్స్ మీ కోసం..థర్మామీటర్చెవిపోగుశరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడే థర్మామీటర్ చేసే పనిని చేస్తుంది ఈ చెవిపోగు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో షిర్లీ, జుయే, యుజియా అనే ముగ్గురు విద్యార్థులు రూపొందించిన ఈ చెవిపోగుతో శరీర ఉష్ణోగ్రతను సులభంగా తెలుసుకోవచ్చు. డ్యూయల్ సెన్సర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ యాంటెనాతో తయారైన ఈ చెవిపోగు బ్యాటరీలతో పనిచేస్తుంది. దీనిని ధరించిన వ్యక్తి ఉష్ణోగ్రతతో పాటు, పరిసరాల ఉష్ణోగ్రతలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి, మొబైల్కు సమాచారం ఇస్తుంది. పీరియడ్స్ మూడ్ స్వింగ్స్కు చెక్అమ్మాయిలకు ప్రతినెలా వచ్చే పీరియడ్స్లో విపరీతమైన కడుపునొప్పితో పాటు, మూడ్ స్వింగ్స్ కుదురుగా ఉండనివ్వవు. ఇప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ఈ ‘ఫెమ్టెక్ బీబీ రింగ్’. ఇదొక స్మార్ట్ రింగ్, సాధారణ హెల్త్ ట్రాకర్ మాదిరిగానే ఇందులోనూ, వివిధ సెన్సర్లతో పాటు, ఎమోషన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో దీనిని ధరిస్తే ప్రతినెలా భావోద్వేగాల్లో వచ్చే మార్పులను పరిశీలించి సమాచారం ఇస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని, మొబైల్కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.బైస్కోప్ గాగుల్స్కళ్లకు ధరించే కళ్లజోడు స్మార్ట్గా మారిపోయిన విషయం తెలిసిందే! అయితే, మొబైల్కు కనెక్ట్ చేసుకొని, కావాల్సిన సమాచారాన్ని కళ్లజోడు అద్దాలపైనే చూసే వీలు కల్పించే వీటి లేటెస్ట్ వెర్షన్ వచ్చేసింది. వాటిలో ఒకటి మినీ ప్రొజెక్టర్లా పనిచేసే ఈ ఐఎన్ఎమ్ఓ2 వైర్లెస్ గ్లాసెస్. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో ఎప్పుడైనా సరే కావాల్సిన సమాచారాన్ని మీ కళ్ల ముందు ఇన్విజిబుల్ స్క్రీన్ వేసి చూపిస్తుంది. మల్టీమీడియా హెడ్సెట్ సాయంతో వాయిస్ కమాండ్స్తో ఆపరేట్ చేయవచ్చు. కేవలం వంద గ్రాముల బరువుతో, సౌకర్యవంతంగా ఉండే దీని ధర 599 డాలర్లు (అంటే రూ.52,302) మాత్రమే!‘లబ్డబ్’ లవ్ లాకెట్ ప్రేమికులు తరచు చెప్పుకునే మాట.. ‘నా హృదయ స్పందన నువ్వేనని’. మరి ఇప్పుడు మీ ప్రియమైన వారి గుండె చప్పుడును ఎల్లప్పుడూ మీరు వినేందుకు వీలుగా రూపొందించినదే ఈ లాకెట్. ఇదొక లవ్ లాకెట్. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు. ఇందుకోసం రెండు లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకరి వద్దే లాకెట్ ఉంటే, మొబైల్ యాప్లో వారి కాంటక్ట్ను సేవ్ చేసుకొని వాడాలి. లాకెట్లో ఉండే బటన్ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న వారికి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. ధర రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంది. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. (చదవండి: వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి..) -
డ్యూయెట్..వెడ్డింగ్ షూట్!
ఫొటో షూట్ల సందడి ఇటీవల బాగా ఎక్కువైంది.. ఏ శుభకార్యం జరిగినా స్పెషల్ ఫొటో షూట్ ఉండాల్సిందే.. ఇక పెళ్లిళ్ల విషయానికొస్తే ప్రీ వెడ్డింగ్.. పోస్ట్ వెడ్డింగ్.. సాంగ్ షూటింగ్ అంటూ హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ఓ మంచి లోకేషన్లో చిన్నపాటి సినిమాను తలపించేలా.. సెట్టింగ్లు.. యాక్షన్.. అంటూ టేకులు తీసుకుంటూ కొత్త జంటలు మురిసిపోతున్నాయి. ఇందులో పాటలు.. అదిరిపోయే సీన్లు.. వెరైటీ ఫోజుల్లో నూతన జంటలు కొత్త లుక్స్తో కనిపిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్ జిల్లాకు పాకింది. పెళ్లికి అయ్యే ఖర్చులను మించిపోతున్నా ఎవరూ తగ్గదేలేదంటూ కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్లను బాగా లైక్ చేస్తున్నారు.కాణిపాకం : పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర వేడుక. ఆ సంబరాలకు సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది.. ఫొటో, వీడియో షూట్. అయితే.. ఈ మధ్య ఫొటో, వీడియో షూట్ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి. సినిమాను తలపించే లైటింగ్, ఎఫెక్ట్స్, సెట్టింగులతో ఫొటో, వీడియో షూట్లు నిర్వహిస్తున్నారు. చేయి తిరిగిన ఫొటోగ్రాఫర్, అత్యాధునిక కెమెరా, స్వర్గాన్ని తలపించే లొకేషన్స్ ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్లో కిసిక్..కిసిక్కుగా కొత్తజంటలు మైమరిచిపోతున్నాయి. పెళ్లంటే పందిళ్లు....సందళ్లు తప్పెట్లు..తాళాలు తలంబ్రాలూ మూడుముళ్లు..ఏడడు గులు ఇదీ అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం వీటి తో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి సంబరాలు చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యు వకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్గా మా రింది. కొత్తగా పెళ్లి ఫిక్స్ అయితే ముందుగా ఫ్రీ వెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్కు రెడీ అవుతున్నారు. అదిరేలా... గతంలో పెళ్లాయ్యక హనీ మూన్కు ఎక్కడికెళ్లాలి అంటూ అందరితో ఆరా తీసేవారు. ఇప్పుడు నిశి్చతార్థం కాకముందే ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్కు సిద్ధమవుతున్నారు. అందమైన ప్రదేశంలో ఫొటో, వీడియో షూట్లు తీసే లా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నారు. వివాహానికి ముందే వధూ వరులు తమ హావభావాలు, సంభాషణలు, సాన్నిహిత్యాన్ని చిత్రీకరించుకుంటున్నారు. భిన్న కోణాల్లో చూసు కుని మురిసిపోయేందుకు.. రేపటి తరానికి చూపించేందుకు ఎంత వ్యయమైనా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ప్యాకేజీలతో... గతంలో పెళ్లికి ఫొటోలు, వీడియో తీయించుకోవాలంటే తెలిసిన ఫొటోగ్రాఫర్లకు చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా ఆల్బమ్, వీడియోలు అన్ని కలిపి ప్యాకేజీగా తీసుకుంటున్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలు రకాల ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి. వివాహానికి కొద్ది రోజుల ముందు, వివాహమైన తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ చేసి వీడియోలను చిత్రీకరిస్తున్నారు. పెళ్లి సీజన్లకు అనుగుణంగా ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోనే... జిల్లాలోని రిసార్ట్లు, పెద్ద హోటల్ ప్రాంతాలు, రద్దీగా లేని జాతీయ రహదారులు, తమిళనాడులోని వేలూరు, చెన్నై బీచ్, సినిమా స్పాట్లు, పాండిచ్చేరిలోని బీచ్, సినిమా చిత్రీకరించిన ప్రదేశాల్లో ఫొటో, వీడియో షూట్కు ఇష్టపడుతున్నారు. కర్ణాటకలోని జారువాలే జలపాతాలు, పొగ మంచుతో కమ్ముకునే ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. పల్లె ప్రాంతాల్లో పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటల గట్ల మీద, చెరువులు, పచ్చదనం పరుచుకున్న కొండ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. మీమ్స్ నయా ట్రెండ్ నూతన దంపతులు దిగిన ఫొటోలు, వీడియోలను మీమ్స్ మార్చి వాటిని పెళ్లిలోనే ప్రదర్శించి నవ్వులు పూయిస్తున్నారు. ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి వీక్షిస్తున్నారు. ఈ క్షణాలనూ వీడియో తీసుకుంటున్నారు. ప్రీవెడ్డింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పెట్టడానికి ఎక్కువ జంటలు ఆసక్తి చూపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో చనిపోయిన కుటుంబీకులను కూడా బతికి ఉన్నట్లుగా చూపిస్తున్నారు. వధూ వరులను ఆశీర్వదించేలా, కుటుంబీకులతో కలిసి ఫొటోలు దిగేలా తెర మీద చూసుకుంటున్నారు. ఇలాంటి వాటికి ఇప్పుడు మరింత క్రేజ్ ఏర్పడింది. సాంకేతికతతో.. అద్భుతంగా చిత్రీకరణ ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ద్వారా ఆధునిక కెమెరాలతో ఓ సినిమా పాటలా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయేలా ఫొటోకు అదిరిపోయేలా ఫోజులిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ను చిత్రీకరించేందుకు హైడెన్సిటీ (హెచ్ఏ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మంచి క్వాలిటీ ఉన్న‡ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఒక షూట్ చేయడానికి కనీసం నలుగురు కెమెరామెన్లు పనిచేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. మూడు నుంచి 4 నిమిషాల నిడివిగల పాటకు సుమారు 2 నుంచి 3 రోజుల పాటు పనిచేస్తారు. ఒక పాటకు ఒక్కోసారి ప్రదేశాలను మార్చాల్సి ఉంటుంది. ప్రదేశం మారిన సమయంలో దుస్తులను మార్చుకోవడం, మేకప్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమయం ఎక్కువ పడుతుంది. చిత్రీకరణను పాట రూపంలో తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటోంది. ఎడిటింగ్కు కనీసం 10 రోజుల సమయం పడుతుంది. ప్రీ వెడ్డింగ్తో పనులొచ్చాయి ముందు అయితే పెళ్లి సీజన్లో మాత్రమే గిరాకీలుండేవి. ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్ వల్ల కాస్త చేతికి కావాల్సినంత పని దొరికింది. ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల పెళ్లికి ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రా ఫర్లు పెళ్లికి ముందే గిరాకీలు వస్తున్నాయి. మంచి నైపుణ్యం ఉన్న వారికి భలే డిమాండ్ ఉంది. అత్యా ధునిక కెమెరాలనే షూట్కు వినియోగిస్తున్నాం. – కృష్ణంరాజు, ఫొటోగ్రాఫర్, చిత్తూరు -
అడినాయిడ్స్ వాపు ..?
అడినాయిడ్స్ ముక్కు లోపలి భాగానికి కాస్త వెనకన, నోటి లోపల అంగిటి పైభాగంలో ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై మెత్తగా, గుంపులుగా ఉంటాయి. రెండు రకాలుగా వీటి ఉనికి తెలుస్తుంది. మొదటిది... ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించడం ద్వారా... ఇక రెండోది తల ఎక్స్–రే తీసినప్పుడు, ఈ తల ఎక్స్–రేలో వాటి పరిమాణం కూడా తెలుస్తుంది. అడినాయిడ్స్ అన్నా, టాన్సిల్స్ అన్నా... ఈ రెండూ ఒకటేనని చాలామంది పొరబడుతుంటారుగానీ... ఈ రెండూ వేర్వేరు. నోరు బాగా తెరచినప్పుడు టాన్సిల్స్ కనిపిస్తాయిగానీ... అడినాయిడ్స్ కనిపించవు. నిజానికి అడినాయిడ్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లలను కాపాడుతుంటాయి. అయితే వాటికే ఇన్ఫెక్షన్స్ సోకడం కారణంగా అడినాయిడ్స్ వాచినప్పుడు వచ్చే సమస్య గురించి తెలుసుకుందాం. అడినాయిడ్స్లో కొన్ని యాంటీబాడీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు దేహంలోకి ప్రవేశించగానే... వాటిని శత్రుకణాలుగా గుర్తించి, వాటితో ΄ోరాడుతాయి. ఇలా ΄ోరాటంలో వాటిని తుదముట్టించడం ద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి సహజంగానే తక్కువగా ఉండటం వల్ల వాళ్ల పసి దేహాలను కాపాడటానికి ప్రకృతి అడినాయిడ్స్ అనే ఏర్పాటు చేసింది. అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ... వాళ్ల వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుండటం వల్ల కొంతకాలానికి ఇవి క్రమంగా సైజు తగ్గుతూపోతాయి. ఐదేళ్ల వయసులో దాదాపుగా ఇవి పూర్తిగా కృశించి΄ోతాయి. వారికి యుక్తవయసు వచ్చేనాటికి అవి పూర్తిగా మటుమాయమవుతాయి. అడినాయిడ్స్లో ఇన్ఫెక్షన్లతో వాపు ఇలా... కొందరు చిన్నారులపైకి బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేసినప్పుడు అడినాయిడ్స్ కణజాలంలో వాపు వచ్చే అవకాశాలుంటాయి. అలా జరగడం వల్ల ఇక అవి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వాటి నుంచి దేహాన్ని కాపాడలేవు. దేహంపై బ్యాక్టీరియా, వైరస్ దాడి పెరిగిన కొద్దీ వాటిలో వాపు కూడా పెరుగుతూపోతుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు పక్కనుండే టాన్సిల్స్కు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి, వాటిల్లో కూడా వాపు రావచ్చు. ఇలా వాపు వచ్చిన కొద్దీ పిల్లలు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. దాంతో చిన్నారుల్లో కొన్ని సమస్యలు రావచ్చు. అవి... ముక్కురంధ్రాలు మూసుకు΄ోయి గాలి పీల్చడం ఇబ్బందిగా మారడంతో నోటితో గాలి పీల్చడం. ∙నిద్ర సమయంలో పిల్లలో గురక రావడం. గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టం కావడం. ∙కొన్నిసార్లు మెడ్ర ప్రాంతంలోని గ్రంథులకూ వాపు రావడం. కొంతమందిలో వినికిడి సమస్యలూ లేదా దంత సమస్యలు కనిపించడం. ఊపిరి సరిగా అందక నిద్రాభంగమై లేచి ఏడ్వటం.చికిత్స...అడినాయిడ్స్లో వాపు వచ్చిన ప్లిలల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం కారణంగా వారికి తరచూ జ్వరాలు వస్తుంటాయి. అడినాయిడ్స్లో వాపు ఉన్నప్పుడు తొలుత యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు. త్వరగా చికిత్స పొందని పిల్లల్లో వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు అలాంటప్పుడు అడినాయిడెక్టమీ అనే శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా డాక్టర్లు వాటిని తొలగించాల్సి వస్తుంది. డా. ఈసీ వినయ కుమార్, ఈఎన్టీ నిపుణుల (చదవండి: పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?) -
పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?
‘శతమానం భవతి’ అన్నారు మన పెద్దలు. నూరేళ్లు జీవించి పిల్ల పాపల ఆనందాలు చూసి వీడ్కోలు తీసుకోవాలని భారతీయులు కోరుకుంటారు. ఒకప్పుడు ఆయుఃప్రమాణం బాగా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానాల వల్ల ఆయుఃప్రమాణం పెరిగింది. అయితే వైద్య విధానం ఎంత ఆధునికంగా ఉన్నా అది పూర్తిగా జబ్బు నయం చేయలేనివే ఎక్కువ. యధాతథ స్థితిని కొనసాగించి ఆయుష్షును పొడిగించగలుగుతున్నాయి. ఇది ఒక రకంగా వరం. మరో రకంగా ఇబ్బందిగా మారుతోంది. పెద్దవాళ్లు జబ్బుపడి ఎక్కువ రోజులు సహాయం పొందే స్థితికి వస్తే ఇంటిలో సమస్యలు మొదలవుతున్నాయి. మరి వీటిని ఎలా నివారించాలి?మన దేశంలో 70 ఏళ్ల వయసు దాటాక స్త్రీల కంటే పురుషులే ఎక్కువ జబ్బుల గురించి ఆందోళన చెందుతున్నారట. దానికి కారణం మంచాన పడితే ఎవరు చూడాలి అనేది ఒకటైతే పూర్తి కదలికలు నియంత్రణలోకి వెళితే జీవితం చాలా కష్టంగా మారుతుందనే భయం ఒకటి. స్త్రీలకు సేవ చేసే స్త్రీలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటే పురుషులకు సేవ చేసేవారు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 70లు 80లకు చేరుకున్న తల్లిదండ్రులు అనారోగ్యాల బారిన పడితే బాధ్యత ఎవరు తీసుకోవాలనే విషయం మీద చాలా ఇళ్లల్లో ఒక అనిశ్చితి నెలకొంటోంది.స్పష్టత వచ్చే వీలు ఉందా?తల్లిదండ్రులు జబ్బుపడితే వారి బాగోగులు చూసే స్థితిలో ఇప్పుడు సంతానం ఉండటం లేదు. దానికి కారణం బిజీ బతుకుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సం΄ాదించాల్సి వస్తోంది. దానికితోడు పిల్లల కెరీర్లకు వారి అవసరాలకు సమయం చాలదు. మధ్య తరగతి అయినా ఎగువ మధ్యతరగతి అయినా త్రీ బెడ్ నివాసాలు ఉండి జబ్బుపడ్డ తల్లిదండ్రులకు ఒక గది ఇచ్చే వీలు 90 శాతం ఇళ్లల్లో ఉండటం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగానే భవిష్యత్తులో రాబోయే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని అంటీముట్టనట్టు తయారవుతున్న సంతానం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇది తల్లిదండ్రులను మరింత బాధపెడుతోంది. ఇప్పుడే ఇలా వీరుంటే రేపెలా అనే చింత పట్టుకుంటోంది.కూర్చుని మాట్లాడుకోవాలిఅంతా బాగున్నప్పుడే తల్లిదండ్రులు, పిల్లలు కూచుని మాట్లాడుకోవాలి. తల్లిదండ్రుల అనారోగ్యం కోసం వారు సొంతంగా దాచుకున్న నిధిని, పిల్లలు తమ వంతుగా ఇవ్వగలిగిన నిధిని కలిపి ఒకచోట ఉంచి దాని గురించి సమాచారం ఇచ్చుకోవాలి. చూసే వీలు లేకపోతే ఏజెన్సీల సహాయం ఎలా తీసుకోవాలో తెలుసుకుని ఉండాలి. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ హాస్పిటల్లో చేర్చాలో ముందే నిర్ణయించుకొని ఆ హాస్పిటల్లో తరచూ చెకప్లు చేయిస్తూ ఉంటే సమయానికి కొత్త పేషంట్గా మారే పరిస్థితి ఉండదు. బడ్జెట్కు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఏయే అనారోగ్యాలకు ప్రభుత్వ/చారిటీ ఆస్పత్రులు అతి తక్కువ చార్జీలకు వైద్యసేవలు ఇవ్వగలవో తెలుసుకుని అందరూ ఆ సమాచారం పంచుకోవడం మంచిది. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాన్నే వెచ్చించి ఉంటారు కాబట్టి వారికి కచ్చితంగా సమయం ఇవ్వగలమని, బాధ్యతను పంచుకోగలమనే నమ్మకం వారిలో కలిగించాలి. సాధారణంగా ఎవరో ఒకరి నెత్తి మీద ఈ బాధ్యతను తోసే ధోరణి కొందరిలో ఉంటుంది. అది సమస్యను తీవ్రంగా పెంచుతుంది.పంతాలు విడవాలితల్లిదండ్రులు పెద్దవయసు వచ్చే వేళకు జీవితంలో వారి వల్ల లేదా సంతానం వల్ల ఎన్నో తప్పొప్పులు జరిగి పంతాలు పట్టింపులు ఏర్పడి ఉండవచ్చు. కాని తల్లిదండ్రులు అనారోగ్య స్థితికి చేరుకునేవేళకు అవి సమసే వాతావరణం కల్పించుకోవాలి. క్షమ చాలా సమస్యలు దూరం చేస్తుంది. మనుషులు దూరమయ్యాక చేయగలిగింది ఏమీ లేదు. అందుకే పెద్దవారు వారి చివరిదశను ప్రశాంతంగా గడిపేలా చూసుకోవాలి. ఇందుకు సామరస్య వాతావరణంలో ఎంత మాట్లాడుకుంటే అంత స్పష్టత వస్తుంది. వాట్సప్లు, ఫోన్ కాల్స్ మాని ఎదురుబొదురు కూచుంటే తప్ప ఇలాంటి సందర్భాలలో పరిష్కారాలు దొరకవు. అసలే జబ్బుపడ్డ పెద్దవారికి ఆత్మీయమైన ఇంటి వాతావరణానికి దగ్గర చేయడం అతిఒక్క కుటుంబ సభ్యుని బాధ్యత.(చదవండి: కాన్పులో రక్తస్రావం కావడంతో ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ పడకపోతే ఏం చేయాలి..?) -
Dog: ప్రేమకి, విశ్వాసానికి మారుపేరు..
కుక్క– ధర్మరాజుతో స్వర్గాన్ని, దేవదాసుతో దైన్యాన్ని సమానంగా పంచుకున్న ఈ జాతి విరోధాభాసకు చక్కటి ఉదాహరణ. కుక్కలు అరుచుకుంటాయి, అంతలోనే ఎంతకీ విడివడనంతగా కలుసుకుంటాయి. ప్రేమకి, విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి, అత్యంత నీచమైన తిట్టుగా వాడబడతాయి. వాటి గొడవలతో, అరుపులతో మిగతావాళ్లు పడే భయాన్ని పట్టించుకోనంత స్వార్థంతో ఉంటాయి. ఒక్కటీ అందిరాదని తెలిసినా, పుంజీడు పిల్లల్ని కని; తినీ తినకా, చచ్చీ చెడీ, నిస్వార్థంగా వాటిని పోషిస్తాయి.‘నా బుజ్జి బొచ్చు కుక్కపిల్ల ఏం చేచ్చోంది లా’ అంది వందన అతని వతైన తల చెరిపేస్తూ,‘ఏయ్, ఏంటిది? లే, ఇది హాలు. కిటికీలోంచి కనబడతాం’ అన్నాడు మౌళి లాప్టాప్లో పనిచేసుకుంటూ.‘ఎదురింటివాళ్ళు లేరు లేరా. అయినా ‘చౌ చౌ’ బ్రీడ్ కుక్కపిల్లలా ఇంత జుట్టేంటిరా? నీ జుట్టు నాకుండి, హాయిగా నీకు బట్టతల వస్తే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నా’ అంది వందన అతని ఒళ్ళో కూర్చుని, ఒతైన జుట్టుని వేలితో తిప్పుతూ.లాభం లేదని, లాప్టాప్ పక్కన పెట్టి, ‘అయితే తలుపేయ్, జుట్లు పీక్కుందాం’ అన్నాడతను కొంటెగా ఆమెని దగ్గరకి లాక్కుంటూ.‘నోర్మూసుకుని పని చూసుకో! ఇంత పిసరు చనువిస్తే చాలు, రెచ్చిపోతావ్. కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఏదో అప్పుడప్పుడూ ముద్దొస్తావు. అంతమాత్రాన బుద్ధిలేదూ?’ అంటూ అతని క్రాఫ్ సరిచేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది వందన.అంతలో వందనకి ఫోన్ వచ్చింది. ‘ఆ వదినా చెప్పండి, అవునా వెరీ గుడ్. ఆ.. ఇదిగో మీ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి, అలాగే, మేము రేపు ఉదయమే బయల్దేరి వస్తాం’ అంటూ భర్తకేసి తిరిగి, ‘ఏమండీ, మీ అక్క ఫోన్, మీ మేనకోడలు హడావిడి చేసిందట, మాట్లాడండి’ అంటూ ఫోన్ మౌళికి ఇచ్చింది.ఆ రాత్రి. పాలమీగడలాంటి ఆమె వంటిపై పాము కుబుసంలాంటి నైటీ మెరిసిపోతోంది. విరబోసుకున్న కురుల్లో విరిసిన మల్లెలు కారుమబ్బుల్ని చీల్చుకొచ్చిన వెలుతురు చుక్కల్లా ఉన్నాయి.‘రేపు ఊరెళ్తే ఓ మూడురోజులు మళ్ళీ పస్తే. అయినా ఇంతందంగా ఉండే నీకు ఏంగర్ ఇష్యూస్ ఏంటిరా’ అన్నాడతను ఆమెకి చేరువౌతూ.‘అక్కడకి నువ్వేదో శాంతమూర్తివైనట్టు. అయినా సత్యభామ కోపం కూడా కృష్ణుడిపై ప్రేమలో భాగమే! సహిస్తేనే సౌఖ్యం, భరిస్తేనే భోగం’ అందామె కొంటెగా.ఒక్క ప్రథమకోపం తప్పిస్తే, అతనికి ఎలా ఉంటే ఇష్టమో అలాగే ఉంటుంది వందన.అందుకే భర్తొదిలేసిన అక్కని, భార్యొదిలేసిన అన్నని, ఊళ్ళో అమ్మకొదిలేసి మరీ సిటీలో వందనకి వందనంగా ఉంటున్నాడు మౌళి.∙∙ ఆ మర్నాడు ఉదయమే కార్లో బయలుదేరి ఊరికి వెళ్లారు. పిల్లని చాప మీద కూర్చోపెట్టారు. నెమ్మదిగా పేరంటాళ్ళు రావటం మొదలుపెట్టారు.‘అక్కా అందరూ వచ్చారు కదా! ఇంకా దేనికి వెయిటింగ్?’ అడిగాడు మౌళి లోపలికి వస్తూ.‘అదే రా మీ ఆవిడ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళింది. అరగంటయింది, ఇంకా రాలేదు. తను లేకుండా మొదలుపెడితే ఏమనుకుంటుందో అని...’ అంటూ నసిగింది శ్యామల.‘వాళ్ళ వాళ్ళతో ఫోన్ మాట్లాడిందంటే ఓ పట్టాన వదలదు. ఉండక్కా, నేనెళ్ళి తీసుకొస్తా’ అంటూ మేడెక్కాడు మౌళి. అటూ ఇటూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వందనని కిందకి రమ్మని సైగ చేశాడు, అతన్ని ఆగమని, ఆమె ఫోన్లో మాట్లాడుతోంది. ‘హా అక్కా, వాళ్ళు పెళ్లి వైజాగ్లో చేయమంటున్నారు అంతేగా. నువ్వేం కంగారు పడకు. మీరు ఓకే అని చెప్పండి. నువ్వు, బావ, నీ కూతురు వచ్చేయండి. మొత్తం నేను చూసుకుంటా. అది నాకూ కూతురే. నేను దగ్గరుండి చేస్తా పెళ్లి. కల్యాణ మంటపం ఇప్పుడే బ్లాక్ చేస్తా’ అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో ఉత్సాహంగా మాట్లాడుతోంది వందన.ఆ సంభాషణ విని మౌళికి చిరాకేసింది. అతనికి తోడల్లుడు అంటే పడదు. నక్కు నక్కుగా ఉండి అందర్నీ వాడుకుంటాడని. దానికి తోడు పెళ్లి హడావిడి అంతా వందన నెత్తి మీదేసుకుంటే ఇంక ఆమె తనకి కనీసం ఓ రెండు మూడు నెలలు దొరకదు.ఆమె ఎంతకీ ఫోన్ ఆపకపోవటంతో ‘హే, ఆపు నీ సోది. ఎప్పుడో ఆర్నెల్ల తర్వాత పెళ్ళి. సాయంత్రానికి మన ఊరెళ్ళిపోతాం, అప్పుడు మాట్లాడుకో. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాం కదా. అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. రా కిందకి’ అన్నాడు విసుగ్గా. ఇంట్లో తనని ‘పెళ్ళాం కూచి’ అనుకోవటం మౌళికి తెలుసు. అది తప్పని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం కూడా అతనలా మాట్లాడ్డానికి ఓ కారణం.ఆ మాటలు అవతల ఫోన్లో ఉన్న వందన అక్కకి లీలగా వినబడ్డం వల్లనేమో,‘సరే వందనా, అత్తవారింట్లో బిజీగా ఉన్నట్టున్నావు, మళ్ళీ చేస్తాలే’ అని ఫోన్ పెట్టేసింది.అప్పటికే శ్యామల కూడా మేడమీదకి రావటంతో తమ్ముడు మరదల్ని విసుక్కోవటం చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న సంతోషపు తెర వందన చూసింది. అంతే, భర్త చూపించిన విసుగు కంటే, అక్క విందన్న ఉక్రోషంతో, ఆడపడుచు ఉందన్న అవమానంతో, వందనకి కోపం నషాళానికి అంటింది.‘మా అక్క కూతురి పెళ్లంటే నా కూతురి పెళ్లిలాంటిది. శుభమా అని పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే సోది అంటావా? మాటలు మర్యాదగా రానీ’ అంది వందన విసురుగా కిందకి వెళుతూ.అతనూ తగ్గలేదు. ‘చూడూ, మనమా వాళ్ళకంటే చిన్నవాళ్ళం. వాళ్ళు ఎత్తిపెట్టుకుని మనదగ్గరకి వచ్చేస్తే, అన్నీ మనమెక్కడ చూడగలం? పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత. పైగా మీ బావకి కనీసం బండి తొక్కడం కూడా రాదు. ఎక్కడికైనా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఏం? మీ అన్నయ్య కూడా వైజాగ్లోనే ఉంటున్నాడుగా! అతనితో మాట్లాడొచ్చుగా? మీ అక్క నీకే ఎందుకు చెబుతోంది. ఆ పిల్ల వాడికీ మేనకోడలే కదా?’అన్నాడు విసురుగా. అప్పటికే ఇద్దరూ కిందకి దిగారు. శ్యామల ముందే దిగిపోయింది.‘నోర్ముయ్. వాడూ, వీడు అంటున్నావేంటి రా’ వందన ఊగిపోతోంది కోపంతో.‘ఏయ్ మర్యాదగా మాట్లాడు’ అన్నాడు మౌళి. వాళ్లిద్దరూ చుట్టూ ఎవరున్నారో ఎప్పుడో మర్చిపోయారు. ఆ క్షణం వాళ్ళు వీధికుక్కల్ని తలపించారు.‘నీకు మర్యాదిచ్చేదేంటిరా. నోటికొచ్చినట్టు మాట్లాడి సిగ్గులేకుండా రాత్రికి నా పక్కలోకే చేరతావురా కుక్కా’అంతే. మౌళి చుట్టూ చూశాడు. అప్పటికే అక్కడికి చేరిన పేరంటాళ్ళు ఉండాలన్న ఉత్సుకతకీ, ఉంటే గొడవ ఆపేస్తారేమో అనే అనుమానానికి మధ్యలో ఊగిసలాడుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు గంటగంటకీ గడియారంలో పక్షి బైటకొచ్చినట్టు అడపాదడపా తలుపు సందుల్లోంచి ఓసారి మొహం బైటపెట్టి మళ్ళీతలుపుచాటుకి వెళ్లిపోతున్నారు. పిల్లలు ఒకప్పుడు చిత్రలహరి చూడ్డానికొచ్చినట్టు కిటికీల దగ్గరకి చేరారు. మౌళి స్పృహలోకొచ్చాడు. అమాంతం తనని లోపలికి తీసుకెళ్ళిపొమ్మని భూదేవిని వేడుకున్నాడు. భూదేవి పలక్కపోవటంతో, ఏం చెయ్యాలో తెలీని ఉక్రోషంతో వందన మీదకి వెళ్ళాడు.‘ఆగక్కడ. నా ఒంటిమీద చెయ్యి పడిందో ఇంటిల్లిపాదినీ జైల్లో తోయిస్తాను’ ఊగిపోతూ వేలు చూపిస్తోంది వందన.అంతే. ఒళ్ళో కూర్చున్న ‘చివావా’ కుక్కపిల్ల వృషణాలు కరిచినట్టు వణికిపోయాడు మౌళి.శ్యామల కారుతున్న చెమటని సైతం లెక్కచేయకుండా ఫ్యాన్ కూడా లేని కొట్టుగదిలోకి పరిగెత్తింది. అమ్మ వెనుకే ఉండి, చిమ్మిలి నలిగిందో లేదో, బెల్లం సరిపోయిందో లేదో ఆరారా రుచి చూస్తున్న విస్సుబాబు తల్లి వెనక్కి మరింతగా ఒదిగిపోయాడు.అందరికన్నా ముందు తేరుకున్నది రామలక్షే్మ! గబ గబా చెయ్యి కడుక్కుని, కోడలికి గ్లాస్తో మంచినీళ్ళిచ్చి, పక్కనే ఉన్న స్టూల్ జరిపి, ‘ముందు నువ్వు కూర్చో తల్లీ, వాడొట్టి మూర్ఖుడు, నేను మందలిస్తా’ అంది.‘చూడండి మీ కొడుకు బుద్ధి. ఏం? నేను మీ అందరితో కలివిడిగానే ఉంటున్నాను కదా. సాయంత్రం ఫోన్ చేస్తే పొద్దున్నకల్లా పరిగెత్తుకుని రాలేదా. నా వాళ్ళు అనుకోబట్టే కదా. అదే నీ కొడుక్కి మాత్రం మా వాళ్లంటే ఎరుసు. ఎప్పుడూ వాళ్ళని చులకనగానే మాట్లాడతాడు’ అంది వందన రొప్పుతూ.రామలక్ష్మి ఆమెని స్టూల్ మీద కూర్చోబెట్టి, మంచినీళ్లు తాగించి ఆమె పక్కనే కింద కూర్చుంది. మౌళిని బైటకి పొమ్మని హెచ్చరించింది. కాసేపాగి, వందన వణుకుతున్న గొంతుతో, ‘ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను. వాడితో నేను వెళ్ళను. నా దగ్గర ఒక్క రూపాయి ఉంచడు నీ కొడుకు. బస్సెక్కి వెళ్ళిపోతా, నాక్కొంచెం డబ్బివ్వండి’ అంది.‘అమ్మా, నువ్వు మంచిదానివి. ఇంటికోడలు ఇలా కంటతడి పెట్టి వెళ్ళిపోతే ఆ చంటిదానికి మంచిది కాదు. ఈ ఒక్కపూట ఉండి సాయంత్రానికి వెళ్లిపోదురు. మీరిద్దరూ విడివిడిగా వెళితే వీధిలో పరువు పోతుంది. వాణ్ణి నేను మందలిస్తాను. నిన్ను ఒక్క మాట అనకుండా ఉండే పూచీ నాది’ అంటూ వందన కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది రామలక్ష్మి.నెమ్మదిగా పేరంటం అయిందనిపించారు. మౌళి, వందన మాట్లాడుకోలేదు.అతికష్టం మీద పిల్లతో ఫోటోకి మాత్రం నించున్నారు. ఆ రోజు సాయంత్రం. మౌళి కారు స్టార్ట్ చేశాడు. రామలక్ష్మి వందన చేతిలో రెండువేలు పెట్టి, ‘అమ్మా, వాడిమాటలేం పట్టించుకోకు. నా బిడ్డలాంటిదానివి. నీకు వాడితో ఎప్పుడు చికాకు అనిపించినా ఇక్కడకు వచ్చేయ్’ అంది.వందన అతని పక్క సీట్లో కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుని డోర్ బలంగా వేసింది.ఆ శబ్దానికి రామలక్ష్మి గుండెలు అదిరాయి. కారు కీచు శబ్దం చేసుకుంటూ దుమ్ము రేగ్గొట్టి వెళ్ళింది. రామలక్ష్మి వీధి అరుగుమీద కూలబడింది.రామలక్ష్మికి పదిహేనో ఏట పెళ్లయింది. పద్దెనిమిదికి ముగ్గురు పిల్లలు. భర్తని పిచ్చికుక్క కరవటంతో రేబిస్ వచ్చి ఆర్నెల్లు నరకయాతన పడి మరణించాడు. అతని ఉద్యోగం ఆమెకిచ్చారు. కుక్కపిల్లల్ని తల్లికుక్క పొదువుకుని కాపాడినట్టు పిల్లల్ని పెంచుకొచ్చింది. కూతురు శ్యామలకి చెమటెక్కువ. ‘ఓస్ అంతేనా’ అనుకునేంత కాదు.డాక్టర్కి చూపిస్తే ‘హైపర్ హైడ్రోసిస్’ అని చెప్పేంత. ‘బుల్ డాగ్’లా వాసన కొడుతోందనిపెళ్ళైన వారానికే ఓ పిల్లని కనడానికి సరిపడా ‘అనుభవం’ ఆమెకి వదిలేసి ‘పరియా’ బ్రీడ్వీధికుక్కలా పారిపోయాడు భర్త.రామలక్ష్మి రెండో సంతానం విస్సుబాబు. అమ్మ కూచి. ‘మాస్టిఫ్’ బ్రీడ్ లా ఇంట్లో ఎక్కువ స్థలం ఆక్రమించడం తప్పిస్తే అతని వల్ల రామలక్ష్మికి మరే ఉపయోగం లేదు.పెళ్లయ్యే వరకు ఉద్యోగం ఉంది అనిపించాడు. అవగానే మానేశాడు. భార్య వేరు కాపురం పెట్టమంది. ‘అమ్మని, వదిలి ఎలా వెళ్తాం?’ అన్నాడు. ఎలా వెళ్లాలో ఆమె వెళ్లి చూపించింది. అప్పుడప్పుడూ స్వప్నస్ఖలనాలతో అతనికి భార్యలేని లోటు తెలియలేదు. వీళ్ళిద్దరినీ రామలకే‡్ష్మ పోషిస్తుంది.పిల్లల చిన్నప్పుడు చిలక జోస్యం చెప్పించుకుంది రామలక్ష్మి. ‘పుంజు’లకి, ‘పెట్ట’కి కూడా పెళ్లి గండం ఉందని తెలిసింది. భయపడినట్టుగానే కూతురు, పెద్దకొడుకు పెళ్లిళ్లు పెటాకులైపోయాయి. రెండు డక్ అవుట్ల తర్వాత దిగే బాట్స్మెన్ని పెవిలియన్ నించి చూస్తున్న మేనేజర్లా రామలక్ష్మి దడదడలాడుతూ మూడోవాడైన మౌళికి పెళ్లి చేసింది. కొడుక్కి కోరికెక్కువ, కోడలికి కోపమెక్కువ. వాళ్ళు చిన్న మాట అనుకున్నా ఆమెకి కంగారెక్కువ. ఆ రోజు జరిగిన గొడవతో చిన్నప్పుడు జోస్యం చెప్పిన చిలక ఇప్పుడు ఆమె తల్లో రాబందులా తిరగసాగింది.మౌళి, వందన, వాళ్ళింటికి చేరేటప్పటికి రాత్రయింది. ఇంత తిన్నామనిపించి, బెడ్రూమ్లో ‘ఇగో’ అనే పాముని చెరోవైపు పట్టుకుని సాగదీసి వీసెలకొద్దీ విషాన్ని చిమ్మిన తర్వాత ఏ అర్ధరాత్రికో అమృతం చిలికారు.మరి అదేరాత్రి రామలక్ష్మికి ఎలా గడిచింది? ‘కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో’ అని ఆలోచించటానికి మౌళి మహాకవి కాదు.ఆ మర్నాడు వాళ్లిద్దరూ పన్నెండు రోజులుండటానికి సరిపడా బట్టలూ, గట్రా తెచ్చుకుని మళ్ళీ కార్లో ఊరొచ్చారు. బతికుండగా బువ్వెట్టకపోయినా చితిలో చక్కెర పోశాడు. ఈ పదకొండు రోజులూ పాటించవలసిన నియమాలు చెబుతూ బ్రహ్మచర్యం కూడా పాటించాలని బ్రహ్మగారు మౌళిని చాటుకి పిలిచి చెప్పారు. తలైతే ఊపాడు కానీ, అందరికీ కనబడే భూశయనం, ఏకభుక్తం వరకే పాటించగలిగాడు. మధ్యలో ఓ రోజు రాత్రి వందన అతన్ని ఓదార్చడానికి దగ్గరకి తీసుకున్నప్పుడు పాలమీగడ, పాముకుబుసం మళ్ళీ తెరమీదకొచ్చాయి. ‘చౌ చౌ’ బ్రీడు, ‘చివావా’ బ్రీడూ కలిసి ఆ రాత్రి చిత్తకార్తెని తలపించాయి. అది చూసి (?) రామలక్ష్మి అస్సలు బాధపడలేదు. పైగా వాళ్లిద్దరూ కలిసున్నందుకు ఎంతో సంతోషించడంచేత, ఆమెకి ప్రేతత్వ విముక్తి కలిగి, హాయిగా యమదూతల ఎస్కార్ట్లో వెళ్ళిపోయింది.మునిసిపాలిటీ వాళ్ళు వలతో వస్తే, వయసులో ఉన్న కుక్కలన్నీ తలో రకంగా తప్పించుకోగా, ఎటూ కదల్లేక దొరికిపోయి, ఆ కుక్కలబండిలో బిక్కు బిక్కు మంటూ, కంటనీరు కారుస్తూ, చావుకెదురు చూస్తూ, ఒంటరిగా మిగిలిపోయిన వీధి కుక్కలా గొడవ జరిగిన రోజు రాత్రంతా గడిపిన రామలక్ష్మి దుఃఖం ఎవరికి పట్టాలి? బతికుండగా నరకం చూపించి, చచ్చాక ‘పున్నామనరకం’ తప్పించే ‘కొడుకు’ విరోధాభాసకు మరో ఉదాహరణ. -
యువ కథ: ఎంత ధైర్యం నీకు?
‘‘ఎంత ధైర్యం నీకు? మా వాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను తలచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కొట్టిందే కాక ప్రిన్సిపాల్కు కంప్లయింట్ చేస్తావా’’ కోపంతో చంద్రిక మీద విరుచుకు పడింది శ్యామల.‘‘మేడం! నా తప్పేమీ లేదు. సిద్ధార్థ్..’’అని ఏదో చెప్పబోయింది చంద్రిక.‘‘నోర్ముయ్యి! మర్యాదగా వచ్చి వాడికి సారీ చెప్పు. కంప్లయింట్ వెనక్కి తీసుకో..’’ బెదిరిస్తూ అంది సిద్ధార్థ్ తల్లి శ్యామల.‘‘అవును మేడం, మీరు ఏమైనా చేయగలరు!. అన్యాయానికి కొమ్ము కాయగలరు, నిజాన్ని సమాధి చేయగలరు. మీ అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసై పాశవికంగా ప్రవర్తించినందుకు కొట్టాను’’ ధారగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది చంద్రిక.ఆ మాట విన్న శ్యామల నెమ్మదించింది.‘‘ఏమిటి సిద్ధార్థ్ మత్తు పదార్థాలు వాడుతున్నాడా! నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు’’ నిజాన్ని జీర్ణించుకోలేక అంది.‘‘నిజం మేడం. మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి? మావి పేద బతుకులు మేడం. బాగా చదువుకుంటే మా బతుకులు కాస్తయినా బాగుపడతాయని మెరిట్లో ఈ కార్పొరేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి’’ అంది చంద్రిక.ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు చదువు కోసం తాను పడ్డ కష్టం గుర్తుకు వచ్చింది. చంద్రిక మాటల్లోఎటువంటి తడబాటు లేదు. ధైర్యంగా ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. శ్యామల మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగింది.తన కొడుకుని పది రోజులు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ మీద ఆమెకు కోపంగా ఉంది. తన పవర్ చూపించాలని వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, వాళ్ళు ఫోన్ ఎత్తక పోవడంతో విసుగొచ్చి, తానే స్వయంగా వెళ్లి ప్రిన్సిపాల్ను కలవాలనుకుంది.మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది.శ్యామల పలుకుబడి వున్న వ్యక్తి కావడంతో అటెండర్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు.‘‘ఎవరా ప్రిన్సిపాల్, మా వాడిని సస్పెండ్ చేసింది?’’ కోపంతో అడిగింది ఎదురుగా వచ్చిన అటెండర్ వైపు చూస్తూ.‘‘మేడమ్, ఆయన కొత్తగా వచ్చారు. రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు కూర్చోండి మేడం. ఆయన వచ్చేస్తారు’’ అని ప్రిన్సిపాల్ రూమ్ చూపిస్తూ చెప్పాడు అటెండర్.ప్రిన్సిపాల్ రూమ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ చైర్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.తాను అంతకు ముందు వచ్చినప్పటికి, ఇçప్పటికి ఆ రూమ్లో చిన్న మార్పులు జరగడం గమనించింది. ప్రిన్సిపాల్ చైర్ వెనుకగా వున్న గోడకు వేలాడుతున్న వివేకుని సూక్తి ఆమెను ఆకర్షించింది, ‘కెరటం నా ఆదర్శం. పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు’ అన్న సూక్తి చదువుకుంది.ఇంతలో అక్కడకు వచ్చాడు ప్రిన్సిపాల్ వివేకానంద. అతన్ని చూసిన శ్యామల ఏమీ అనకుండా అతని వైపు ఉరుముతూ చూస్తూ వుంది. ఆమె గురించి అటెండర్ చెప్పడంతో తన సీట్లో కూర్చొని, ‘‘నమస్తే మేడం! మీ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా?’’ అడిగాడు వివేకానంద.‘‘మాట్లాడడానికి ఏమీ లేదు. వాడిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ వాడిని కాలేజీకి వచ్చేలా చేయండి’’ దర్పం ప్రదర్శించింది.‘‘మేడం, అది జరగని పని. మీ వాడు చెడు వ్యసనాలకు లోనవడమే కాకుండా, అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించాడు. ఇది అతనికి వేసిన శిక్ష. అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే, అతన్ని ఈ కాలేజీ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది’’ స్థిరంగా చెప్పాడు వివేకానంద.ప్రిన్సిపాల్ మాటలకు ఒక్కసారిగా శ్యామలకు కోపం తలకెక్కి, ‘‘అసలు నీకెవరు ఇచ్చారు ఈ అధికారం?నేను తలచుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది’’ గట్టిగా అరుస్తూ అంది శ్యామల.‘‘చూడండి మేడమ్, నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మీ బెదిరింపులకు భయపడను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’’ అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు.‘ఇంత అవమానమా! ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. వీడి సంగతి తర్వాత చూస్తాను’ అని అనుకుంటూ కోపంతో అతని వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.ఇంటికి వెళ్ళేసరికి శ్యామల తల్లి ఇందిరమ్మ ముభావంగా కనిపించింది.‘‘అమ్మ! ఏమైంది? ఆరోగ్యం బాగాలేదు?’’ అని అడిగింది.‘‘శ్యామలా! సిద్ధు ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు.మాటల్లో తత్తరబాటు.. ఇవన్నీ చూస్తుంటే, అప్పుడు మీ అన్నయ్య మనకు దూరం అయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి’’ దిగులుగా అంది ఇందిరమ్మ.ఒక్కసారి తన అన్నయ్య మత్తు పదార్థాలకు బానిసై జీవితం పోగొట్టుకొని, జీవచ్ఛవం అయి తమకు దూరమైన రోజులు గుర్తుకు వచ్చాయి. తనను తాను సముదాయించుకుంటూ,‘‘అమ్మా! భయపడకు ఈ విషయం నాకు తెలిసింది. నా అనుమానం ప్రకారం ఆ అమ్మాయి కారణంగానే సిద్ధు వాటికి బానిస అయ్యాడు అనిపిస్తోంది. భయపడకు వాడికి కౌన్సెలింగ్ ఇప్పిద్దాం’’ అని తల్లికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.‘‘రేయ్ సిద్ధు! నీకేం తక్కువ చేశానురా? ఎందుకు ఇలాంటి వాటి జోలికి వెళ్తున్నావు?’’అని కొడుకును నిలదీసింది.‘‘అమ్మా! అది.. అది..’’ అంటూ మాటలు మారుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.శ్యామలకు కొడుకు పరిస్థితి అర్థమైంది. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అని అనుకుంది. కొడుకును తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళింది.మొత్తం పరీక్షలు చేసిన డాక్టర్, ‘‘శ్యామలగారు! చూస్తుంటే మీ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉన్నట్లుంది. దీని నుంచి బయట పడటానికి అవకాశాలు ఉన్నాయి కాని, మీరు చాలా కేర్ చూపించాలి. లేదంటే మీ అబ్బాయి మీకు దక్కడు. నా ప్రయత్నం నేను చేస్తాను’’అని కౌన్సెలింగ్ ఇచ్చి. మెడిసి రాసి ఇచ్చాడు. డాక్టర్ మాటలకు శ్యామల కంగారు పడింది. ‘‘లేదు డాక్టర్, నేను చూసుకుంటాను.’’ అని డాక్టర్తో చెప్పి కొడుకుతో ఇంటికి చేరుకుంది. ప్రతి క్షణంకొడుకును కనిపెట్టుకొని ఉంది. అయినా, అతను దొంగతనంగా వాటిని తీసుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడం ఆమెలో కంగారు పెంచింది.అక్కడికి వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆ కాలేజ్ చైర్మన్ వీరభద్రం శ్యామలకు ఫోన్ చేశాడు.శ్యామలకు వీరభద్రం బాగా తెలిసిన వ్యక్తి కావడంతో తన సమస్యను ఏకరవు పెట్టింది.‘‘శ్యామలగారు! మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, నేను క్యాంపులో ఉండటం వల్ల మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థుల మెరుగుదల కోసం తపించే వ్యక్తి. క్రమశిక్షణ వల్ల విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అతన్ని అపాయింట్ చేశాం. అతను ఇంకెవరోకాదు, ఒకప్పటి ఉత్తమ గురువు అవార్డు పొందిన పరమేశంగారి అబ్బాయి’’ అని చెప్పాడు. ఒక్కసారిగా శ్యామల గొంతు తడారిపోయింది. మాటలు పెగలడం లేదు. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం పోయింది.‘‘నే.. నేను మళ్ళీ మాట్లాడతాను’’ అని ఫోన్ పెట్టేసింది.ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అపరాధ భావం కలిగింది. ‘అంటే అతను గురువుగారి అబ్బాయా! ఎంత పని చేశాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువుగారు. అలాంటిది వాళ్ళ అబ్బాయిని అవమానించానా? ఎంత పాపం చేశాను? కొడుకు మీద ప్రేమతో ఇంత పాపానికి ఒడిగట్టానా’ అని అనుకుంటూ దిగులుతో ఒక్కసారిగా హాల్లోకి వెళ్ళి అక్కడే వున్న సోఫాలో కూర్చుండి పోయింది. ఏవేవో ఆలోచనలు ఆమెను సతమతం చేస్తున్నాయి.అప్పుడే తన భర్త వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కొడుకు మొబైల్ చూస్తూ పక్కనే ఉన్నాడు. ‘శ్రీరామ రామ రామేతి’ అని జపిస్తూ ఇందిరమ్మ దేవుని దగ్గర దీపం వెలిగించింది. శ్యామల దృష్టి ఆ దీపం వైపుకు మళ్ళింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం గమనించింది. రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత,‘గురువుగారు, నన్ను క్షమించండి. ఆస్తి, అధికార దర్పంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాను. కొడుకును క్రమశిక్షణలో పెంచలేకపోయాను. పిల్లలు తప్పు చేస్తే, ఆ తప్పు తల్లితండ్రులదే కదా! గురువు మాటను జవదాటిన శిష్యురాలిది తప్పే కదా! ఈ తప్పుకు నాకు శిక్ష పడాలి కదా! పడాలి కదా!’ అనుకుంటూబాధాతప్త హృదయంతో సోఫా నుంచి పైకి లేచి ఆ దీపం దగ్గరకు వెళ్ళింది.ఒక్కసారిగా తన చెయ్యిని ఆ దీపంపై పెడుతూ నిల్చుంది.అది చూసిన ఇందిరమ్మ కంగారు పడుతూ,‘‘శ్యామలా! ఏమిటి నీకు పిచ్చి పట్టిందా?’’ కూతురు చేస్తున్నది చూసి అరిచింది ఇందిరమ్మ.ఇందిరమ్మ అరుపుతో అక్కడకు చేరుకున్నారు భర్త, కొడుకు.అందరూ దగ్గరకు వచ్చి తనని వారించడానికి ప్రయత్నం చేస్తుండటం గమనించి, కోపంగా‘‘దూరంగా వెళ్ళండి. ఎవరూ దగ్గరకు రావద్దు. ఒకవేళ వచ్చారో, నా మీద ఒట్టు! కొడుకును మంచి మార్గంలో నడిపించలేని నాకు శిక్ష పడాలి. డబ్బు అహంకారంతో ఒక అమ్మాయిని తప్పుపట్టిన నాకు, గురువుగారి అబ్బాయిని అవమానించిన నాకు పడాలి శిక్ష. గురువు మాటలు మరచి దారి తప్పి ప్రవర్తించినందుకు నాకు శిక్ష పడాలి. నైతిక విలువలు నేర్పకుండా డబ్బు చూపించి కొడుకును గారాబం చేసినందుకు నాకు శిక్ష పడాలి’’ అని తన చేతిని దీపానికి మరింత దగ్గరగా పెట్టింది.అగ్ని సెగ ఆమె చేతిని తాకి నొప్పి పెట్టడం, ఆమె కళ్ళంట నీరు కారడం, ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.తల్లి మీద ఈగ వాలినా తట్టుకోలేని సిద్ధు– తనకు తాను శిక్ష వేసుకుంటున్న తల్లి బాధను చూసి తట్టుకోలేక పోయాడు.ఒక్కసారిగా వచ్చి తల్లి కాళ్ళ మీద పడుతూ, ‘‘అమ్మా! నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఈ క్షణం నుంచి నేను వాటి జోలికి వెళ్లను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు’’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.కొడుకు కన్నీళ్ళు ఆమె కాళ్ళ మీద పడ్డాయి. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్యామల ఒక్కసారిగా కొడుకుని పైకి లేవదీసి, వాడిని గట్టిగా హత్తుకుంది.తాను ఎన్ని చెప్పినా, మాట వినని కొడుకులో ఈ విధంగా మార్పు రావడం చూసిన శ్యామల ఆశ్చర్యపోయింది. నిజం తెలిసి తనను తాను పశ్చాత్తాపంతో శిక్షించుకోవడంతో ఏ లోకంలోనో ఉన్న గురువుగారు నా కొడుక్కి బుద్ధి ప్రసాదించారేమో! అని తనలో అనుకుంటూ, గురువుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు ఆనందం ఇచ్చింది. -
సోమదత్తుడి వృత్తాంతం
యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. పూర్వం చంద్రవంశంలో సోమదత్తుడు అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా, సుభిక్షంగా పరిపాలించేవాడు. సోమదత్తుడు సత్య ధర్మాలను పాటించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. సాధు సజ్జనులను సముచితంగా గౌరవించేవాడు. సోమదత్తుడి వైభవం నానాటికీ ద్విగుణం కాసాగింది. అతడి వైభవం శత్రువులకు కంటగింపుగా మారింది. ఎవరికి వారే అతడిపైకి యుద్ధానికి వెళితే ఎదిరించడం సాధ్యం కాదని తలచి, శత్రువులందరూ సోమదత్తుడికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. అందరూ కలసి అతడిపై యుద్ధం చేసి, అతడి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని తీర్మానించుకున్నారు.శత్రువులందరూ అదను చూసుకుని, సోమదత్తుడి రాజధాని మహిష్మతీపురాన్ని నలువైపుల నుంచి ముట్టడించారు. శత్రువుల దురాక్రమణ సంగతి తెలియగానే, సోమదత్తుడు సైన్యాన్ని ఆయత్తం చేసి, యుద్ధానికి బయలుదేరాడు. వేలాది అక్షోహిణుల చతురంగ బలాల మధ్య భీకర యుద్ధం సాగింది. యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా గజ తురగాలు నేలకొరిగాయి. వేలాది రథాలు విరిగిపోయాయి. యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.రాజ్యం శత్రువశం కావడంతో సోమదత్తుడు తన భార్య దేవికతో కలసి అడవుల్లోకి చేరుకున్నాడు. అడవులలో ప్రయాణిస్తుండగా, వారికి గర్గ మహాముని ఆశ్రమం కనిపించింది.మహర్షిని ప్రార్థిస్తే, తమ కష్టాలు తీరవచ్చని భావించింది దేవిక.ఆమె ఆశ్రమం వద్దకు చేరుకుని, గర్గ మహాముని ముందు మోకరిల్లింది.‘మహర్షీ! శరణు శరణు! శత్రువుల చేతిలో ఓటమి చెంది నా పతి రాజ్యభ్రష్టుడయ్యాడు. భర్తతో కలసి నేను అడవుల పాలయ్యాను. నా పతిని మీరే రక్షించాలి’ అని ప్రార్థించింది.గర్గ మహాముని ఆశ్రమం వెలుపలకు వచ్చాడు.ఆశ్రమం వెలుపల దీనవదనంతో నిలుచున్న సోమదత్తుడు కనిపించాడు.గర్గుడు రాజ దంపతులను ఆశ్రమం లోపలికి తీసుకువెళ్లాడు.‘రాజా! ఇది గార్గ్యాశ్రమం. ఇక్కడ భయమేమీ లేదు. నీకొచ్చిన కష్టం దుస్సహమైనది. విజయ సిద్ధి కలిగించే మంత్రాన్ని నువ్వు అనుష్ఠించలేదు. అందువల్లనే నీకు ఈ దుస్థితి వాటిల్లింది. ఎలాంటి కష్టాలు వాటిల్లినా, ధైర్యం రాజ లక్షణం. ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డడమే క్షాత్రధర్మం. అందువల్ల ధైర్యంగా ఉండు. పరిస్థితులు చక్కబడతాయి’ అని సోమదత్తుడికి నచ్చజెప్పాడు గర్గ మహాముని.‘మునీశ్వరా! నా కష్టాలు గట్టెక్కే మార్గం బోధించండి. ఈ గడ్డుకాలాన్ని దాటడానికి నేను ఆచరించవలసిన వ్రతమైనా, జపించదగ్గ మంత్రమైనా సెలవీయండి. అందుకు పాటించవలసిన నియమాలను ఆదేశించండి’ అని వినయంగా అభ్యర్థించాడు సోమదత్తుడు.‘రాజా! సమస్త బాధలను తొలగించి, అఖండ విజయాలను అందించే అమోఘమైన విద్య ఒకటి ఉంది. అది పంచముఖ ఆంజనేయ విద్య. నీకు ఆ విద్యను ఉపదేశిస్తాను. శ్రద్ధగా విను’ అని పలికి, గర్గుడు ఇలా చెప్పాడు:‘వైశాఖమాస కృష్ణపక్ష దశమి రోజున గాని, ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజున గాని, మాఘం మొదలుగా మొదటి ఐదు మాసాలలో వచ్చే మొదటి శనివార దినాలలో గాని, మృగశిరా నక్షత్రం వచ్చే రోజున గాని, శ్రావణ పౌర్ణమి రోజున గాని, కార్తీక శుక్ల ద్వాదశి రోజున గాని, మార్గశిర శుక్ల త్రయోదశి రోజున గాని హనుమద్వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు పవిత్ర తోరాన్ని పదమూడు ముడులతో ధరించి, వ్రతదీక్ష చేపట్టాలి. బంగారం, వెండి, రాగి వంటి లోహపు రేకుల మీద చెక్కిన హనుమద్ యంత్రం గాని, భూర్జపత్రం లేదా తాళపత్రం మీద గీసిన యంత్రం గాని, లేదా పిండిలో గీసిన యంత్రం గాని, పూర్ణకుంభం లేదా హనుమద్ప్రతిమను గాని పూజామండపంలో నెలకొల్పి ఆవాహనాది షోడశోపచార పూజ చేయాలి. వ్రతపూజ పరిసమాప్తం అయిన తర్వాత పదమూడు నేతి అప్పాలను వాయనంగా ఇవ్వాలి. గురువుకు ధనధాన్యాదులను కానుకగా ఇవ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు అన్న సమారా«ధన చేయాలి. గొప్ప సంకల్పసిద్ధి కోరేవారు పదమూడేళ్ల పాటు ఈ హనుమద్వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించాలి. దీనివల్ల హనుమదనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఘనవిజయాలు దక్కుతాయి.’గర్గుడు చెప్పిన హనుమద్వ్రత విధానాన్ని సోమదత్తుడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. గర్గుని ఆధ్వర్యంలోనే భార్యా సమేతుడై, హనుమద్వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. హనుమదనుగ్రహంతో ఖడ్గసిద్ధి పొందినవాడై, శత్రువులను దునుమాడి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు.రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత సోమదత్తుడు గర్గుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. ఆయనకు ఘనంగా ధన ధాన్యాలను, గోవులను సమర్పించి, సత్కరించాడు. సాంఖ్యాయన -
ఏంటీ సుపారీ..? ఏమా కథ..?
తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు దోషులుగా తేలారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు. వారిలో అమృత తండ్రి మారుతీరావు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం 2025 మార్చి 10న తీర్పు ఇచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ను హత్య చేయడానికి మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడు. అంటే, అతడికి హత్య చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ అంటే వక్కలు. తాంబూలంలో ఉపయోగించే వక్కలకు, కిరాయి హత్యలకు సంబంధం ఏమిటో, నేర పరిభాషలో ‘సుపారీ’కి వేరే అర్థం ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.కిరాయి హత్యలకు ‘సుపారీ’ అనే మాట ముంబై మాఫియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారకుడు అక్కడి మహిమ్ ప్రావిన్కు రాజు భీమ్దేవ్. అక్కడి మహేమీ తెగకు అధినేత అయిన భీమ్దేవ్కు ఒక వింత ఆచారం ఉండేది. ఏదైనా కష్టమైన పనిని ఎవరికైనా అప్పగించాలంటే, ఆయన ‘సుపారీ’కి ఆహ్వానించేవాడు. మాహిమ్ కోటలో సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యంలోని యోధులను పిలిచి, వారికి విందు భోజనం పెట్టేవాడు. ఆ తర్వాత తమలపాకులు, వక్కలు ఉన్న తాంబూలం పళ్లేన్ని సభ మధ్యలో ఉంచేవాడు. ఆపై తన కోసం చేయాల్సిన పనిని చెప్పి, చేసే సత్తా ఉన్న వాళ్లు ‘సుపారీ’ తీసుకోవాలని కోరేవాడు. ఎవరైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు, వక్కలు తీసుకుంటారో వారికి ఆ పని అప్పగించేవాడు. ఇలా ‘సుపారీ’ పదం మహారాష్ట్రలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టులు తీసుకోవడాన్ని కూడా సుపారీగానే పిలిచే వాళ్లు. కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు నేరుగా పని చేయకుండా, మేస్త్రీలను పెట్టి చేయించేవాళ్లు. ముంబైలో మాఫియా సామ్రాజ్యం విస్తరించాక ‘సుపారీ’ని కిరాయి హత్యలకు వినియోగించడం మొదలుపెట్టారు. మాఫియా ముఠాల ద్వారా ‘సుపారీ’ మాట దాదాపు ఆసియా మొత్తం ప్రాచుర్యం పొందింది. ప్రత్యర్థులను హత్య చేయడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎక్కడా తెరపైకి కనిపించడు. మధ్యవర్తులపై ఆధారపడి తన పని పూర్తి చేయించుకుంటాడు. ఈ మధ్యవర్తి నేరుగా రంగంలోకి దిగి హత్యలు చేయడు. హిట్మెన్గా పిలిచే ప్రొఫెషనల్స్కు ఆ పని అప్పగిస్తాడు. ప్రణయ్ హత్య విషయాన్నే తీసుకుంటే, ఈ పని చేయడానికి మారుతీరావు అస్ఘర్ అలీకి సుపారీ ఇచ్చాడు. అతడి ద్వారానే బిహార్కు చెందిన సుభాష్కుమార్ శర్మ రంగంలోకి దిగి ప్రణయ్ను దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన రోజు సుభాష్ మినహా మరెవ్వరూ తెరపైన కనిపించలేదు. ‘సుపారీ’ సంస్కృతిలో రేటు అనేది టార్గెట్ చేయాల్సిన వ్యక్తి ప్రొఫైల్, హత్య పథకాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టనష్టాలపై ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు సైతం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా జరుగుతాయి. ప్రణయ్ విషయంలో మారుతీరావు కులహంకారం వల్లే కోటి రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960ల్లోనే నాటి బొంబాయిలో (నేటి ముంబై) స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించే వాళ్లు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. బాలీవుడ్లో ఫిల్మ్ ఫైనాన్సింగ్తో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి ముంబైలోని మరో డాన్ యూసుఫ్ పటేల్తో స్పర్థలు ఏర్పడ్డాయి. పటేల్ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు పదివేల రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డులు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా ముంబై పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుపారీ కిల్లింగ్స్. దావూద్ ఇబ్రహీం, బడా రాజన్, ఛోటా రాజన్లు డాన్లుగా ఎదిగాక సుపారీ సంస్కృతి పెరిగిపోయింది. క్రమంగా కిరాయి హత్యలు దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై కత్తికట్టిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఉన్న సుపారీ గ్యాంగ్స్లో కీలకమైన వ్యక్తి. 2024లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ సహా అనేక మందిని చంపించిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అక్కడ నుంచే తన దందా నడిపిస్తున్నాడు. ఇతడి కనుసన్నల్లో పని చేసే దాదాపు 700 మంది షార్ప్షూటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి ప్రధాన అనుచరుడు, సుపారీ కిల్లర్ సంపత్ నెహ్రా 2018 జూన్ 7న హరియాణా స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్త బృందం మియాపూర్ వచ్చిన అతడిని గోకుల్ ప్లాట్స్లో పట్టుకుంది. హైదరాబాద్లోని జరిగిన వ్యాపారులు రాజీవ్ సిసోడియా, రామ్ ప్రసాద్లవీ సుపారీ హత్యలే! రియల్ బూమ్ రోజుల్లో సుపారీ హత్యలతో పాటు సుపారీ కిడ్నాప్లూ జరిగాయి. -
వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?
నడివయసుకు చేరుకుంటున్న సమయంలో వయసుతో వచ్చే మార్పుల్లో, శరీరంలోని కండరాల్లో దారుఢ్యం సడలి, కొలతలు మారిపోవడం ప్రధాన సమస్యగా మారుతుంటుంది. శరీర నిర్మాణంలోనే కాదు, ముఖంలోనూ ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిమ్కి వెళ్తే శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలి? ఇదిగో చిత్రంలోని ఈ ఫేస్ జిమ్ టూల్, ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. మునివేళ్లతో పట్టుకుని వాడుకోగలిగే ఈ పరికరంతో శిల్పాన్ని మలచుకున్నట్లుగా ఎవరికి వారే తమ ముఖాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ పరికరంతో మర్దన చేసుకుంటే ముఖ కండరాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, ముఖం పునర్యవ్వనం పొందుతుంది. సురక్షితమైన నాణ్యమైన మెటీరియల్తో రూపొందిన ఈ గాడ్జెట్ ఎలాంటి చర్మానికైనా హాని కలిగించదు. పైగా పట్టుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఇది రూపొందింది. దీనికి ఒకవైపు ఐదు దువ్వెన పళ్లులాంటి ఊచలు, వాటి చివర బాల్స్ ఉండగా.. మరోవైపు మెలితిరిగిన మృదువైన కొన, దానికో గుండ్రటి బాల్ అటాచ్ అయ్యి ఉంటుంది. మీ చర్మానికి సరిపడే సీరమ్ లేదా క్రీమ్ అప్లై చేసుకుని ఈ టూల్తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా, చర్మానికి ఆనించి, కింది వైపు నుంచి పైకి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.(చదవండి: 'ఫైట్ ఎగైనెస్ట్ ఒబెసిటీ'కి ప్రధాని మోదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
అరబిక్ వంట.. కడప ముంగిట!
రంజాన్లో అత్తర్ల గుబాళింపులే కాదు రకరకాల వంటలూ ఘుమఘుమలాడిస్తున్నాయి. పసందైన రుచులతో నోరూరిస్తున్నాయి. అల్ ఫహమ్... అల్ మంది..షవర్మ.. హలీం.. ఇలా ఒకటా రెండా అనేక అరబిక్ వంట లు.. కడప ముంగిట వాలిపోయాయి. రుచుల పంటను ఆస్వాదించమని ఆహారప్రియులను ఆహా్వనిస్తున్నాయి. అసలే రంజాన్.. ఆపై కొత్త వంటకాలు తొంగిచూసిన నేపథ్యంలో సాక్షి సండే స్పెషల్.కడప కల్చరల్: రంజాన్... మనిషిని మానవత్వంగల పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు అవకాశాలను అందించే పండుగ. శారీరకంగా, మానసికంగా మనిషిని ఉన్నతుడినిచేసే ఆధ్యాత్మికత వేడుక. ఈ సందర్భంగా మార్కెట్లు, వీధులలో సెంట్లు, అత్తర్ల గుబాళింపులు మనసులను దోచేస్తాయి. ఒక్క సెంట్లు.. అత్తర్లే కాదు.. రంజాన్ అనగానే హలీం.. తదితర పౌష్టికాహారం వంటకాలూ గుర్తుకొస్తాయి. కొన్నేళ్లుగా పలు రకాల అరబిక్ వంటలు కడప ముంగిట వాలిపోయాయి. దాదాపు రెండేళ్లకో సారి ప్రత్యేకమైన అరేబియన్ వంటకం పరిచయం అవుతుండడం విశేషం. అల్ ఫహమ్... ఇటీవలి కాలంలో ఎక్కువ ఆదరణ పొందిన వంటకం అల్ ఫహమ్. బొగ్గులపై కాల్చిన కోడి మాంసం కావడంతో రుచి బాగుంటుంది. పైగా నూనెలు.. మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికీ మంచిదన్న కారణంతో ఇప్పుడందరూ ఈ వంటకాన్ని ఇష్టపడుతున్నారు. కాగా కడప నగరానికి చెందిన జమాల్ వలీ దశాబ్దం పైగా అరబ్ దేశాల్లో వంటమాస్టర్గా పని చేశారు. ఆ అనుభవంతో కడప వాసులకు తొలిసారిగా 2006లో ఫహమ్ను పరిచ యం చేశారు. ప్రస్తుతం ‘మాషా అల్లాహ్’ ఫహం నడుపుతూ 8 మందికి ఉపాధి కలి్పస్తున్నారు. అల్ మందీ... రంజాన్ మాసంలోనే కాకుండా ఏడాదంతా లభించే మరో అరబిక్ వంట అల్ మందీ. ఒక పెద్ద పళ్లెంలో పెట్టిన ఆహారాన్ని చుట్టూ ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇష్టంగా తింటుంటూరు. సరదాగా ఇతరులతో కలిసి ఆనందించాలనుకునే వారు దీనిని ఇష్టపడతారు. ఆహారంతోపాటు ఆత్మీయతలను కూడా పంచుకునే అవకాశం లభిస్తోంది. ఇక వీటితో పాటు,కబాబ్, షవర్మ, మస్బూస్ తదితర రకాలు ఆహార ప్రియులను ఆకర్శిస్తున్నాయి. సాయంత్రాలలో రంజాన్ ఉపవాస దీక్ష విరమించి స్వీకరించే ఇఫ్తార్లో ఇటీవల ఖబాబ్లు సాధారమైపోయాయి. హలీం... రంజాన్ అనగానే ప్రత్యేక వంటకమైన హలీం గుర్తుకు వస్తుంది. ఉపవాస దీక్షల్లో ఉన్న వారితోపాటు ఇతరులకు కూడా ఇది పౌష్ఠికాహారం. నిన్నా మొన్నటివరకు కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభిస్తుండిన ఈ వంటకం ప్రస్తుతం అక్కడక్కడ ఇతర సీజన్లలో కూడా అందుబాటులో ఉంటోంది. దానికి ముస్లిమేతరుల నుంచి కూడా లభిస్తున్న ఆదరణ కారణంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా అందుబాటులో ఉండడంతోపాటు రోజువారి స్పెషల్ వంటకం స్థాయికి ఎదిగింది. పైగా పెళ్లిళ్లలోనూ హలీం దర్శనమిస్తుండడం విశేషం. ప్రస్తుతం కేవలం కడప నగరంలోనే హలీం విక్రయించే హోటళ్లు, దుకాణాలు 50కి పైగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 250కి మించాయి. వ్యాపారం అదుర్స్.. నాన్ వెజ్ వంటకాల దుకాణాలు గణనీయంగా పెరగడంతోపాటు వాటికి ఈ సీజన్లో మంచి వ్యాపారం ఉంది. జిల్లా అంతటా ప్రత్యేకించి అరేబియన్ వంటకాల రెస్టారెంట్లు 100కు పైగానే ఉన్నాయి. ఇవిగాక హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు చిన్నచిన్న రోడ్డుసైడు దుకాణాలలో కూడా వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఇటీవల అరేబియన్ ప్రాంతం వంటకాలకు మన ప్రాంతంలో విపరీతమైన ఆదరణ లభిస్తుండడంతో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. స్వీట్లు కూడా.. కేవలం మాంసాహారమే కాకుండా ఇటీవల రంజాన్ సీజన్లో తీపి పదార్థాలను ఆస్వాదించడం కూడా మొదలైంది. ఇటీవల ఇలాంటి వంటకాలలో ఖద్దూకీ ఖీర్, సొరకాయ, ఇతర కాయగూరలతో చేసిన స్వీట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయన్న నమ్మకంతో ఆరగిస్తున్నారు. ఇవికాకుండా మంచి శక్తినిచ్చే వస్తువులతో తయారు చేసిన గంజి, ఫలుదా, ఫ్రూట్ సలాడ్ బకెట్ కూడా రంజాన్ స్పెషల్ వంటకంగా ఆదరణ పొందుతున్నాయి. -
ఐరన్ టాబ్లెట్స్ పడకపోతే ఏం చేయాలి..?
నేను డెలివరీ అయి వారం రోజులు అవుతుంది. కాన్పులో రక్తస్రావం ఎక్కువ అయింది అని ఐరన్ టాబ్లెట్స్ రోజుకి రెండు వేసుకోమన్నారు. అవి నాకు పడటం లేదు. ఏదైనా వేరే మార్గం ఉంటే చెప్పండి? – లలిత, గుంటూరు. ఐవీ ఐరన్ ఇన్ఫ్యూజన్ థెరపీ అనేది మీకు ఉత్తమ మార్గం. ఐరన్ మాత్రలు పడనివారికి, ఐరన్ మాత్రలతో వాంతులు, వాంతి వచ్చినట్టు ఉబ్బరం ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఐవీ లైన్ పెట్టి గ్లూకోజ్లో వేసి ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఇది డే కేర్ పద్ధతిలో ఇస్తారు. మీ హీమోగ్లోబిన్ లెవెల్, మీ బరువును బట్టి ఎంత మోతాదు, ఎన్ని సార్లు ఇవ్వాలి అనేది డాక్టర్ పరిశీలించి ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీ లేదా కాన్పు జరిగిన తరువాత కూడా రక్తహీనతను నయం చేయడానికి ఇస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా సేఫ్గా తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ తీసుకునే రోజు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకూడదు. రెండు నుంచి నాలుగు డోసులు దాకా ఇస్తాం. రెండు నుంచి మూడు రోజుల గ్యాప్లో తీసుకోవాలి. కొంతమందికి ఇంజెక్షన్లోని రసాయనాలకు రియాక్షన్స్ రావచ్చు. దద్దుర్లు, ఆయాసం, దురదలు ఉంటాయి. అందుకే, టెస్ట్ డోస్ ఇచ్చి మీకు ఓకే అయితేనే ఫుల్ డోస్ ఇస్తాం. అన్నీ డోసులు పూర్తి అయిన నాలుగు వారాల తరువాత హీమోగ్లోబిన్ ఎంత పెరిగిందో చెక్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ ఏ సమయంలో అయినా, ఆసుపత్రిలో డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. కొంతమందికి ఇంకేదైనా కారణంతో రక్తహీనత ఉంటే, అది హీమోగ్లోబినోపతీ క్యారియర్– సికిల్ సెల్, థలసీమియా ఉన్నా ఈ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. ఐరన్ ఓవర్లోడ్ శరీరానికి ప్రమాదకరం అవుతుంది. చిన్న అసౌకర్యం, ఉబ్బసం, ఆయాసం మొదట కాస్త ఉన్నా వెంటనే తగ్గిపోతాయి. అందుకే, రక్తం తక్కువ ఉండి, సరిగ్గా ఆహారం తీసుకోలేని వారు, మాత్రలు పడనివారు, రక్తమార్తిడి వద్దనుకునేవారు, ఈ ఐవీ ఐరన్ థెరపీని తీసుకోవటం మంచిది. అవి నాకు పడటం లేదు.డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవాలంటే ఏం చేయాలి..?) -
ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవాలంటే ఏం చేయాలి..?
నాకు ఇప్పుడు తొమ్మిదో నెల. నొప్పులు తట్టుకోలేను అనిపిస్తోంది. ఎపిడ్యూరల్ లాంటి ఇంజెక్షన్స్ అంటే భయం. నొప్పులు తట్టుకోవడానికి వేరే మార్గాలు ఉంటే చెప్పండి?– కావేరి, నెల్లూరు. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఈ రోజుల్లో చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగానే ఉంటాయి. కాని, అది వద్దనుకే వాళ్లకి కొన్ని ఆసుపత్రుల్లో కాంప్లమెంటరీ థెరపీస్ లేదా ఎండోక్సాన్ వంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ని సూచిస్తున్నారు. కాంప్లమెంటరీ థెరపీస్ను సంబంధిత ఎక్స్పర్ట్ థెరపిస్ట్లతోనే తీసుకోవాలి. వాటిలో హిప్నోథెరపీ, అరోమాథెరపీ, మసాజ్, రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్ లాంటివి ఉంటాయి. హిప్నోగ్రఫీలో ప్రశాంతమైన ఒత్తిడిలేని ప్రసవం జరిగేటట్టు హిప్నో క్లాసులలో నేర్పిస్తారు. దీంతో ఆందోళన తగ్గి, బర్తింగ్ మజిల్స్ సరిగ్గా పనిచేస్తాయి. అరోమాథెరపీలో శారీరక, భావోద్వేగ ఆరోగ్యానికి అవసరమైన నూనెలు ఉపయోగించడం వలన భయం, ఆందోళన తగ్గుతుంది. కాని, దీనితో అంత పెద్దగా లాభం ఉండదని పరిశోధనల్లో తేలింది. రిఫ్లెక్సాలజీ లేదా మసాజ్లో మీ శరీరంలోని కొన్ని ప్రాంతాలు, చేతులు, కాళ్లను మసాజ్ చేయటం వలన లేబర్ పెయిన్ తగ్గుతుంది. వివిధ పరిశోధనల్లో ఇది కూడా పూర్తి ఉపశమనం ఇవ్వదని తేల్చారు. ఇక ఆక్యుపంక్చర్లో సన్నని స్టెరైల్ సూదులతో శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన పాయింట్స్ని ప్రెస్ చేస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. ఈ సూదులను ఆ నిర్దిష్టమైన స్పాట్స్లో ఇరవై నిమిషాల నుంచి మొత్తం కాన్పు జరిగే వరకు ఉంచుకోవచ్చు. ఇది థెరపిస్ట్ మీతోనే ఉండి, చేయాల్సిన చికిత్స. ఎంటోనాక్స్ అనే గ్యాస్నే ఒక ఆక్సిజన్ పంపు లాంటి దాని ద్వారా నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిక్స్చర్ని పీల్చుకునే పద్ధతి. దీనితో చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది రోగి సొంతంగానే ఉపయోగించుకోవచ్చు. అంటే నొప్పి మొదలైనప్పుడు ఒక పఫ్ పీల్చుకుంటే ఆ గ్యాస్ ద్వారా నొప్పి ఒక నిమిషం వరకు తగ్గుతుంది. మళ్లీ నొప్పి వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగించాలి. కొంచెం మగతగా ఉంటుంది. యాభై శాతం వరకు నొప్పి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ మార్గాల ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా లేబర్ పెయిన్స్ను తగ్గించుకునే అవకాశం ఉంది. వీటిల్లో మీకు అందుబాటులో ఏది ఉంది అని ఆసుపత్రుల్లో పరిశీలించి తీసుకోవాలి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రపంచ వాతావరణ సదస్సు ఎలా ఏర్పాటైందంటే..ఇప్పటికీ 75 ఏళ్లా..?) -
ప్రపంచ వాతావరణ సంస్థ ఎలా ఏర్పాటైందంటే..! ఇప్పటికీ 75 ఏళ్లా..?
మనిషి జాతకాన్ని పంచాంగాలు చెబుతాయి. పంచాంగాలు చెప్పే జాతకాలను సైతం మార్చగల పంచభూతాల ‘మూడ్’.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (ప్రవాస) చెబుతుంది! పంచాంగమైనా కాస్తా అటూఇటూ అవొచ్చు. లేదా, అసలెటూ కాకపోవచ్చు. పంచభూతాలు ఎలా ఉండబోతున్నాయో ‘ప్రవాస’ చెబితే మాత్రం... దాదాపుగా చెప్పిందే జరుగుతుంది. ‘మబ్బు పట్టి.. గాలి కొట్టి..’ఆకాశం మేఘావృతమై ఉంటుంది అంటే ‘ప్రవాస’ చెబితే ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుంది! భూమి భగభగమంటుంది అంటే భగభగమన్నట్లే ఉంటుంది. చిరుజల్లులు, కుంభవృష్టి, ఈదురుగాలులు, సముద్రపు ఆటు పోట్లు, సముద్రం లోపలి సుడిగుండాలు, సముద్ర గర్భంలో బద్ధలయ్యే అగ్ని పర్వతాలు, వరదలు, విపత్తులు, ప్రకృతి విలయాలు అన్నిటినీ ‘ప్రవాస’ సరిగ్గా అంచనా వేస్తుంది. ‘‘ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి ఇంట్లోంచి బయటికి రావద్దు..’’ అని జాగ్రత్త చెబుతుంది. చలి తీవ్రత, చలి గాలులు పెరిగే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తుంది. ‘‘వాయుగుండం పడబోతోంది సముద్రంలోకి వెళ్లొద్దు’’ అని మత్స్యకారులను హెచ్చరిస్తుంది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వాలకు ముందే సమాచారం అందిస్తుంది. ఇలా అనుక్షణం ప్రకృతి ధోరణులను గమనిస్తూ, ప్రపంచ దేశాల వాతావరణ శాఖలకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం పంపుతూ, మానవాళి మనుగడలో అంత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్న ‘ప్రవాస’కు నేటికి 75 ఏళ్లంటే చరిత్రలో ఒక విశేషమే కదా. ‘ప్రవాస’ స్వయం ప్రతిపత్తి కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్య సమితి 1950 మార్చి 23న ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అప్పట్నుంచీ ఏటా ఈ రోజును ‘వరల్డ్ మీటియరలాజికల్ డే’ (ప్రపంచ వాతావరణ దినోత్సవం)గా జరుపుకుంటున్నాం. సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది.‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం’మనిషి పంచభూతాలను ‘డిస్టర్బ్’ చేయకుండా ఉంటే ‘ప్రవాస’కు గానీ, ఇండియన్ మీటియరలాజికల్ వంటి ఇతర దేశాల వాతావరణ శాఖలకు గానీ ఇంతగా ‘వాతావరణ జోస్యం’ చెప్పే అవసరం లేకపోయేది. కవులు కూడా ప్రకృతిపై కాస్త కనికరం చూపండి అని మనిషికి ఏనాటి నుండో చెబుతూనే వస్తున్నారు. ‘‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం.. ’’ అంటాడు కవి. మేఘాలు లేకుండా ఆకాశం ఎందుకు ‘ఎండిపోతుంది’? మనిషి వల్లే. ఎండల్ని మండిచేస్తున్నాం కదా! ‘‘ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి’’ అంటాడు కవి. ఎందుకు మనం అసలు ప్రకృతి వైపే చూడము? ప్లాస్టిక్ సౌఖ్యాల్లో మునిగిపోయాం కదా.. అందుకు! ‘‘చెట్లను చూడండి. పక్షులను చూడండి. నక్షత్రాలను చూడండి’’ అంటాడు కవి. చూస్తూనే ఉన్నాం. కానీ కూలిపోతున్న చెట్లను, అంతరించిపోతున్న పక్షులను, ధూళి కొట్టుకుని పోయిన నక్షత్రాలను!! ఎప్పటికి మనం మారుతాం? వాతావరణం పూర్తిగా మారిపోయి, మనిషి ఉనికే లేకుండా పోయాక, ఈ భూగోళపు పునఃప్రారంభంలోనా?‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని రాశారు కొసరాజు రాఘవయ్యగారు. నిజమే. ఊహించలేం. కానీ మనమింకా మహర్జాతకులంగానే మిగిలి ఉన్నాం అంటే వాతావరణ సంస్థలు, శాఖల వల్లనే. ఏం జరగబోతోందో అవి చక్కగా అంచనా వేసి మనల్ని ఆపదల నుండి తప్పిస్తున్నాయి. మన వల్ల వాతావరణానికి ఆపద రాకుండా మనమూ బాధ్యతగా ఉండాలి. ‘ప్రవాస’ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సెలెస్ట్ సౌలో ఇటీవలే జనవరి 15న ‘భారత వాతావరణ శాఖ’ (ఐ.ఎం.డి) 150 వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఇండియా వచ్చి వెళ్లారు! ఆ సందర్భంగా వాతావరణ మార్పులపై భారత్ సహసోపేతమైన చర్యలు తీసుకుంటోందని కూడా ఆమె ప్రశంసించారు. భారతదేశంలో 1875లో ఐ.ఎం.డి. ప్రారంభం అయింది. అంతకన్నా ముందు, ప్రపంచంలోనే తొలి ఐ.ఎం.డి. 1854లో బ్రిటన్లో ఏర్పాటైంది. అంటే ఇప్పటికి సుమారు 170 ఏళ్ల క్రితం. భారత్లో ఐ.ఎం.డి.ని నెలకొల్పింది కూడా బ్రిటిష్ వారే. 1864 కలకత్తా సైక్లోన్లో 80 వేల మంది ప్రాణాలు కోల్పోవటంతో, భవిష్యత్తులో మళ్లీ అంతగా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అప్పటి దేశ రాజధాని కలకత్తా ప్రధాన కార్యాలయంగా ఐ.ఎం.డి.ని నెలకొల్పారు. తర్వాత సిమ్లాకు, అక్కడి నుంచి పుణె, చివరికి 1944లో ఢిల్లీ ఐ.ఎం.డి.కి ప్రధాన కార్యాలయం అయింది. బ్రిటన్లోను, ఇండియాలోనూ ఐ.ఎం.డి.లు ఏర్పాటు చేయకముందు వరకు మేఘాల పోకడలు, జంతువుల ప్రవర్తనలు, రుతు చక్రాల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నదో అంచనా వేసేవారు. అలాగే ఉష్ణోగ్రత, పీడనం, తేమ, గాలి వేగాలను కొలిచే సాధనాలు కొన్ని ఉండేవి. వాతావరణ హెచ్చరిక కేంద్రాల స్థాపన తర్వాత తొలిరోజుల్లో వర్షపాత సమాచారాన్ని పోస్ట్ కార్డ్లపైన, టెలిగ్రాఫిక్ సిస్టమ్ల ద్వారా అందించేవారు. తర్వాత రాడార్లు, ఇప్పుడు జీపిఎస్.. వాతావరణ సూచనల సమాచారాన్ని చేరవేయటంలో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. (చదవండి: ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..
మన దేశానికి నానా సమస్యల శిరోభారాలు ఉన్నాయి. జనాల్లో పెరుగుతున్న దేహభారం దేశానికి అదనపు శిరోభారంగా మారింది. ఐదేళ్ల పిల్లలు మొదలుకొని ముప్పయ్యేళ్ల లోపు యువత వరకు స్థూలకాయులుగా తయారవుతున్నారు. చిన్న వయసు వారిలో పెరుగుతున్న దేహపరిమాణం ఇటీవలి కాలంలో జాతీయ సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ‘స్థూలకాయంపై పోరాటం’ ప్రకటించాల్సిన పరిస్థితి వాటిల్లింది. స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ఎంపిక చేశారు.అధిక బరువు స్థూలకాయంశరీరం ఉండవలసిన దానికంటే అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నట్లు తెలుసుకోవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ను (బీఎంఐ) ప్రమాణంగా పరిగణిస్తారు. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా దీనిని లెక్కిస్తారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే, తక్కువ బరువుతో ఉన్నట్లు లెక్క. 18.5–25 ఉంటే ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు, 25–29.9 ఉన్నట్లయితే, అధిక బరువుతో ఉన్నట్లు లెక్క. బీఎంఐ 30–34.9 ఉంటే, స్థూలకాయంతో ఉన్నట్లు, బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. స్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు దాదాపు ఒకటే! ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే, తొలి దశలోనే జాగ్రత్తలు ప్రారంభించినట్లయితే, స్థూలకాయాన్ని నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు:శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడంఅనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలం తగినంత నిద్ర లేకపోవడంమితిమీరిన ఒత్తిడఇతరేతర ఆరోగ్య సమస్యలుజన్యు కారణాలుకొన్ని ఔషధాల దుష్ప్రభావంచికిత్స పద్ధతులుఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఆహారంలో అనవసర కేలరీలను తగ్గించుకోవడంఅధిక బరువు ఉన్నట్లయితే, వెంటనే వ్యాయామం ప్రారంభించడంస్థూలకాయం అదుపు తప్పితే, శస్త్రచికిత్స చేయించుకోవడంస్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.మన దేశంలో స్థూలకాయం తీవ్రతమన దేశంలో గడచిన పదేళ్లలో స్థూలకాయుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో స్థూలకాయుల సంఖ్య 10 కోట్లకు పైబడింది. మహిళల్లో 40 శాతం, పురుషుల్లో 12 శాతం మంది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల స్థూలకాయులుగా మారారు. సాధారణ స్థూలకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థూలకాయం మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని 5–14 ఏళ్ల లోపు చిన్నారుల్లో 1.44 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారు. ‘కోవిడ్–19’ తర్వాత దేశంలో స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చిన్నారుల్లో స్థూలకాయం దేశ ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. విద్యా విధానంలో మార్పులు; సామాజిక, ఆర్థిక కారణాలు; టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడటం వల్ల నిద్ర సమయం తగ్గడం; ఇదివరకటి పిల్లలతో పోల్చుకుంటే ఇప్పటి పిల్లల్లో వ్యాయామం లోపించడం; చాలా పాఠశాలలకు అనుబంధంగా పిల్లలు ఆడుకోవడానికి తగిన మైదానాలు లేకపోవడం; చదువుల్లో ఒత్తిడి పెరగడం; అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు; పాఠశాలల పరిసరాల్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఐస్క్రీమ్ పార్లర్లు వంటివి ఉండటం తదితర కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దోహదపడుతున్నాయి. స్థూలకాయం, దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.3.11 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది.పొట్టు చుట్టూ కొవ్వు ప్రమాదకరంపొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే స్థూలకాయాన్ని ‘సెంట్రల్ ఒబేసిటీ’ అంటారు. ఒళ్లంతా విస్తరించి ఉండే స్థూలకాయం కంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువ ప్రమాదకరం. పొట్ట కండరాల లోపలి వైపు మాత్రమే కాకుండా జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ‘సెంట్రల్ ఒబేసిటీ’ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హై బ్లడ్ప్రెషర్, రక్తంలో కొవ్వు పెరగడం వల్ల హైపర్ లిపిడీమియా వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణ స్థూలకాయులతో పోల్చుకుంటే, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిలో ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వులను తగ్గించుకోవడం, తగిన వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని జయించవచ్చు.ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే..అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడి నిద్రకు దూరం కావడం వంటి కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్నాయి. ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా మార్చుకుంటేనే పిల్లల్లో స్థూలకాయాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో చాలామంది వేళకు తగిన పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. ఉదయం ఫలహారం చేసి బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఎక్కువ మోతాదులో తింటున్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే రాత్రి భోజనం చేస్తున్నారు. ఎక్కువగా జంక్ఫుడ్కు అలవాటుపడుతున్నారు. పిల్లలు వేళకు సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతో పాటు వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే, స్థూలకాయం బారిన, దానివల్ల కలిగే ఇతర వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. పిల్లల్లో స్థూలకాయం లక్షణాలుకొందరు పిల్లలు మిగిలిన పిల్లల కంటే కాస్త ఎక్కువ బరువు ఉండవచ్చు. అంతమాత్రాన వారిని స్థూలకాయులుగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. ఎముకల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల కొందరు పిల్లలు కాస్త ఎక్కువ బరువుతో ఉంటారని అంటున్నారు. బీఎంఐ పద్ధతి ద్వారా పిల్లలు అధిక బరువుతో ఉన్నారా, స్థూలకాయులుగా ఉన్నారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. స్థూలకాయులైన పిల్లల్లో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపించవచ్చని, వాటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు.ఇవీ లక్షణాలుఒక పట్టాన తగ్గని తలనొప్పిఅధిక రక్తపోటువిపరీతమైన దాహంతరచు మూత్రవిసర్జన చేయడంఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు నిద్రలో శ్వాసక్రియ కష్టంగా మారడంవయసుకు తగిన ఎదుగుదల లేకపోవడంపిల్లల్లో స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు మరికొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. స్థూలకాయులైన పిల్లలు టైప్–2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, శ్వాస సమస్యలు, శరీరంలోని జీవక్రియ మందగించడం, లివర్ జబ్బులు, హార్మోన్ల అసమతుల్యతలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయులైన పిల్లలకు బడిలో మిగిలిన పిల్లల నుంచి వెక్కిరింతలు ఎదురవుతుంటాయి. వాటి కారణంగా వారు ఆందోళన, మానసిక కుంగుబాటు, చురుకుదనం లోపించడం, తిండి తినడంలో నియంత్రణ కోల్పోవడం వంటి మానసిక సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. (చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..)స్థూలకాయం వల్ల పిల్లల్లో అనర్థాలుపిల్లల్లో స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో స్థూలకాయం కలుగుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హైబీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బరువు పెరిగే కొద్ది వారి ఎముకలపై భారం, ఒత్తిడి పెరిగి, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు తలెత్తుతాయి. స్థూలకాయం వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు లోనై రకరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. పరీక్షల్లో రాణించలేకపోతారు. స్థూలకాయం వల్ల ఆడపిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని త్వరగా రుతుక్రమం మొదలవడం వంటి సమస్యలు వస్తాయి.డాక్టర్ శివనారాయణ రెడ్డి, పిల్లల వైద్యనిపుణుడుస్థూలకాయంపై పోరాటందేశంలో స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో స్థూలకాయంపై పోరాటాన్ని ప్రకటించింది. దీని కోసం ‘స్వస్థ భారత్, సుదృఢ భారత్: స్థూలకాయంపై ఉమ్మడి పోరాటం’ అనే థీమ్ను ఎంచుకుంది. స్థూలకాయంపై పోరాటం కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రధాని నరేంద్ర మోదీ పదిమంది ప్రముఖులను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక చేసిన వారిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, భోజ్పురి నటుడు దినేశ్లాల్ యాదవ్, ఒలింపిక్స్ విజేత, షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చానూ, మలయాళ నటుడు, ఎంపీ మోహన్లాల్, తమిళ నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. వీరు ఒక్కొక్కరు తమకు నచ్చిన మరికొందరు సెలబ్రిటీలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయవచ్చు. ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి ఇంట్లోనూ వంటనూనె వినియోగాన్ని కనీసం పదిశాతం తగ్గించుకున్నట్లయితే, దీని వల్ల ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. అధిక బరువు, స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, స్థూలకాయంపై పోరాటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..) -
ప్రతి పేషెంట్ కోసం మొక్కుకునేదాన్ని!
కోవిడ్ టైమ్లో ఫ్రంట్లైన్ వారియర్స్గా నిలబడ్డ నర్స్లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, చేసిన సాయం గురించి మపం గుర్తు చేసుకుంటున్నాం... అందులో భాగంగా నేడు కోవిడ్ ఫస్ట్ వేవ్లో తెలంగాణలోనే ఏకైన కోవిడ్ వైద్యశాలగా సేవలందించిన గాంధీ ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తించిన మహిళ కానిస్టేబుల్ వేలుపుల ప్రమీల అప్పటి వాతావరణాన్ని తలుచుకుంటూ చెప్పిన విషయాలు..ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. – వేలుపుల ప్రమీలనేను పుట్టి, పెరిగిందంతా సికిందరాబాద్లోనే! మొదటి నుంచీ యూనిఫామ్ అంటే రెస్పెక్ట్. అందుకే పోలీస్ జాబ్లోకి వచ్చాను. 2003లో సిటీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా ఎంపికయ్యా. ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ లో పని చేస్తున్నా. కరోనా టైమ్లో బేగంపేట ఠాణాలో పని చేసేదాన్ని.అప్పుడు గాంధీ హాస్పిటల్కి తెలంగాణ వివిధప్రాంతాల నుంచి రోగులు వచ్చేవారు. ఇందుకోసం పోలీసు విభాగం అక్కడ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. దానికోసం ప్రతి స్టేషన్ నుంచి సిబ్బందిని తీసుకున్నారు. అలా బేగంపేట పోలీసుస్టేషన్ నుంచి నేనూ గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ఐదు వారాలకు పైగా డ్యూటీలో ఉన్నా. అక్కడ పని చేయడానికి ఎస్సై నేతృత్వంలో పని చేసిన ఐదుగురు సభ్యుల్లో భాగమయ్యా. వాళ్లూ మన లాంటి మనుషులే కదా అనుకున్నా..ఓపక్క విజృంభిస్తున్న కరోనా.. మరోపక్క గాంధీ హాస్పిటల్కి రోజూ రోగుల తాకిడి. అలాంటి సమయంలో అక్కడ డ్యూటీ ఓ అరుదైన అవకాశంగానే భావించా. ఎంత కరోనా బారినపడితే మాత్రం వాళ్లూ మనలాంటి మనుషులే కదా! వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విషయంలోనూ వారికి సహాయం చేయాలనుకున్నా. నడుస్తూ కొందరు, నడవలేని స్థితిలో మరికొందరు, అసలు స్పృహలోనే లేకుండా ఇంకొందరు.. చూస్తే బాధనిపించేది. కుటుంబ సభ్యుల సాయంతో వచ్చేవాళ్లు. అయితే గేట్ లోపలికి పేషెంట్స్కి తప్ప మిగిలిన వారికి ప్రవేశం ఉండేది కాదు. పేషంట్స్ని గేట్ దగ్గరే వదిలేయాల్సి వచ్చేది. దాంతో కొందరు వాదనకు దిగేవాళ్లు. వారిని సముదాయించి, పరిస్థితి వివరించి పంపడం పెద్ద సవాల్గా ఉండేది.రోజూ విషాద వార్త వినాల్సి వచ్చేది..గాంధీ హాస్పిటల్ మెయిన్గేట్ దగ్గర రోజూ ఎనిమిది గంటల డ్యూటీ. చికిత్స కోసం వచ్చే రోగులు అనేక మంది తారసడేవాళ్లు. అప్పుడు లాక్డౌన్ అమలులో ఉండటంతో వారితో పాటు సహాయకులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లం. ఇలా చాలామందితో మాట్లాడాల్సి వచ్చేది. ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. ఒకోసారి అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. ఆ పేషంట్తో తమకున్న జ్ఞాపకాలను వాళ్లు మాతో పంచుకుంటుంటే మనసు భారమయ్యేది. ఓదార్చడం తప్ప ఏమీ చేయలేని నిన్సహాయ స్థితి మాది. ప్రతి పేషెంట్ క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకునేదాన్ని.నాకూ కరోనా..గాంధీ హాస్పిటల్ దగ్గర ఐదు వారాల డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి బేగంపేట పోలీసు స్టేషన్కు వెళ్లిపోయా. అప్పుడు ఇతర రాష్ట్రాలు,ప్రాంతాల వారిని తరలించే ప్రక్రియ మొదలైంది. ప్రతిరోజూ ఏరియాల వారీగా బయటి వారిని గుర్తించడం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ్రపాధాన్య క్రమంలో అక్కడ నుంచి బస్సుల్లో రైల్వే స్టేషన్ కు తరలించడం మా డ్యూటీగా మారింది. దీనికోసం వారితో సంప్రదింపులు జరపాల్సి వచ్చేది. ఆ సందర్భంలో నాకూ కరోనా సోకింది.నా నుంచి నా హజ్బెండ్కీ వచ్చింది. ముగ్గురు పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించినప్పటికీ మా అత్తగారిని మాత్రం మేమే చూసుకోవాల్సి వచ్చింది. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, ఆ మహమ్మారి ఆమెకు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నా. పీపీఈ కిట్, మాస్క్, గ్లోవ్స్ వేసుకుని వంట చేసేదాన్ని. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడంతో పదిహేను రోజులకు నాకు, నా హజ్బెండ్కి నెగటివ్ వచ్చింది. అప్పటివరకు పిల్లల్ని కంటితో కూడా చూడలేదు. ఆ రోజులు, ఆ అనుభవాలు గుర్తొస్తే ఇప్పటికీ భయమేస్తుంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. – శ్రీరంగం కామేష్, క్రైమ్ బ్యూరో, సాక్షి, హైదరాబాద్ -
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?
ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాల తోపాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్ తీసుకుంటాం. అదే టోకెన్ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా ’యూరో’ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు. (చదవండి: ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందంటే.. ) -
ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందో తెలుసా?
‘నేను బతుకుతానా అమ్మా?‘ అని అమాయకంగా అడిగింది సడాకో. తల్లి ఏమీ చెప్పలేక పక్కకు వెళ్లి ఏడ్చింది. సడాకోను ఆసుపత్రిలో ఉంచి రకరకాల చికిత్సలు అందిస్తున్నారు. 12 ఏళ్ల సడాకోది జపాన్ దేశం. ఆటపాటల్లో, చదువులో ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి పిల్ల ఒక రోజు ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. డాక్టర్లు తనకు రకరకాల పరీక్షలు చేశారు. పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ చిన్నారి పాపకు లుకేమియా. అంటే కేన్సర్. తనకీ పరిస్థితి ఎందుకు వచ్చిందని సడాకో తల్లిని అడిగింది.‘అణుబాంబు వల్ల’ అంది తల్లి. 1945 ఆగస్టులో అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసే సమయానికి సడాకో వయసు రెండేళ్లు. సరిగ్గా బాంబు వేసిన ప్రదేశానికి మైలు దూరంలోనే సడాకో కుటుంబం ఉంటోంది. ఆ బాంబు దాడి నుంచి ఆ కుటుంబం ఎలాగో తప్పించుకుని బతికింది. కానీ అణుధార్మికత వల్ల సడాకోకు క్యాన్సర్ వచ్చింది.‘అలాంటి బాంబును ఎందుకు వేశారు? ఎందుకు ఇంత నష్టం కలిగించారు?‘ అని అడిగింది సడాకో. తల్లి దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్పగలదు? దేశాల మధ్య వైరంలో సామాన్యులే బాధితులు అని ఆ చిన్నారికి ఎలా అర్థం చేయించాలి? ‘ఇకపై ఎక్కడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?‘ అని మరో ప్రశ్న వేసింది సడాకో. ‘ప్రపంచంలో శాంతి నెలకొనాలి‘ అంది తల్లి.’అవును! శాంతి నెలకొనాలి. ప్రపంచంలో అందరూ హాయిగా ఉండాలి. ఎవరికీ ఏ కష్టం రాకుండా ఉండాలి’ అని సడాకో నిర్ణయించుకుంది. కానీ తాను ఏం చేయగలుగుతుంది? తట్టిందో ఆలోచన.జపాన్ దేశ నమ్మకం ప్రకారం కాగితంతో కొంగు బొమ్మలు చేసి దేవుణ్ని ప్రార్థిస్తే అనుకున్నది నెరవేరుతుంది. వెంటనే ఆస్పత్రి మంచం మీదే సడాకో కాగితాలతో కొంగ బొమ్మలు చేయడం ప్రారంభించింది. ఒకటి.. రెండు.. మూడు.. చేతులు నొప్పి పుట్టేవి. అలసట వచ్చేది. అయినా సడాకో ఆగిపోకుండా బొమ్మలు చేసేది. అలా చేస్తూ ఉంది. చేస్తూనే ఉంది. 1300 బొమ్మలు తయారు చేసింది. ఆపై చేయలేక΄ోయింది. 12 ఏళ్లకే సడాకో క్యాన్సర్తో మరణించింది. ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన కోరిక ఇంకా సజీవంగా ఉంది. ఈ విషయం తెలిసిన జపాన్ ప్రభుత్వం సడాకో కోసం స్మారకం నిర్మించింది. కాగితపు కొంగ బొమ్మ పట్టుకున్న సడాకో విగ్రహాన్ని చూస్తే ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన ఆశ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నేటికీ అనేక మంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి కాగితంతో కొంగ బొమ్మలు చేసి అక్కడ పెడతారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తారు. కాని నేటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. పిల్లలు ఈ పెద్దల్ని చూసి ఏమనుకుంటారు? వీరికి బుద్ధి లేదు అనే కదూ..?. (చదవండి: యమ్మీబ్రదర్స్: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!) -
Kid Entrepreneurs: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!
ఈ అన్నదమ్ములను అంబానీ బ్రదర్స్ అనొచ్చా? ఇంత చిన్న వయసులో వ్యాపారంలో ఢమఢమలాడిస్తుంటే అనక తప్పదు మరి. ఈ అన్నదమ్ముల్లో పెద్దవాడి వయసు 17. మిగిలినవారికి 15, 13, 11. వీళ్లను అందరూ ‘బిల్లింగ్స్లియా బాయ్స్’ అనీ ‘యమ్మీ బ్రదర్స్’ అనీ అంటుంటారు.అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాషువా, ఇషయా, కాలెబ్, మైకా అన్నదమ్ములు. చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యారు. అందుకు వారు చేసే వ్యాపారమే కారణం. వారు కుకీలు(బిస్కెట్లు) తయారు చేసి అమ్ముతుంటారు. అలా స్థానికంగా వారు పేరు తెచ్చుకున్నారు.వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చింది? ఒకరోజు కుకీలు ఎలా తయారు చేయాలో వారికి వారి తాతమ్మ సరదాగా నేర్పింది. దాంతో ఆ నలుగురు అప్పుడప్పుడూ ఆ కుకీలు చేసి వీధిలో పంచేవారు. అవి చాలా కొత్తగా, రుచికరంగా ఉన్నాయని అందరూ మెచ్చుకునేవారు. దీంతో దాన్నే వ్యాపారంగా మార్చుకోవచ్చని వారికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే వెళ్లి వాళ్ల నాన్నకు చెప్పారు. ఆయన అంగీకరించడంతో వెంటనే పని మొదలుపెట్టారు. కుటుంబమంతా వారికి సహకరించింది. అలా ‘యమ్మీ బ్రదర్స్’ సంస్థ ప్రారంభమైంది. సుమారు 36 రకాల కుకీలు వారు తయారు చేసి మార్కెట్లో పెట్టగా, జనం వాటిని ఎగబడి కొన్నారు. అలా వారి కుకీలకు డిమాండ్ పెరిగింది. సంస్థలో మైకా ఆర్థిక అధికారి అయితే, ఇషయా మార్కెటింగ్ ఆఫీసర్, కాలెబ్ ఆపరేటింగ్ అధికారి, జాషువా ఎగ్జిక్యూటివ్ అధికారి. నలుగురూ ఒక్కొక్క పనిని పంచుకుని క్రమపద్ధతిలో చేస్తారు. తమ పనిలో చిన్న తేడా కూడా రాకుండా చూసుకుంటారు. మొదట స్థానికంగా మొదలైన వారి కార్యకలాపాలు ఆ తర్వాత దేశమంతా వ్యాపించాయి. దేశంలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా వారు కుకీలను పంపిస్తారు. రుచి, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు నాలుగు లక్షలను కుకీలను అమ్మేశారు. ప్రస్తుతం వారి వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒక్క పక్క వ్యాపారం చేస్తూనే, చదువును నిర్లక్ష్యం చేయకుండా కాలేజీకి, స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు. (చదవండి: అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు..!) -
అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్వాక్..ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్పోచంపల్లికి మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మిస్వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. విజయ విహార్లో విడిదిప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరికి.. మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. (చదవండి: -
స్థిరత్వం, నిలకడ బుద్దికోసం..!
ఆంజనేయాసనం అనేది యోగాలో ఒక భంగిమ. దీనిని క్రెసెంట్ మూన్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం హనుమంతుడి తల్లి అంజన చేసే నృత్య భంగిమలోదిగా చెబుతారు. అందుకే ఈ ఆసనానికి ఆంజనేయాసనం అని పేరు. ఈ ఆసనం ప్రయోజనాలు...శరీరాన్ని ఒక కాలు మీద స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమతుల్యత కలుగుతుంది. స్థిరత్వం మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి– మనసుకు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. హిప్ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. శరీరంపై అవగాహన కలుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల పనితీరును, ఉచ్ఛ్వాస–నిశ్వాసలను మెరుగు పరుస్తుంది. మానసిక, శారీరక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దిగువ శరీరాన్ని సాగదీయడానికి, ఛాతీని విశాలం చేయడానికి ఈ ఆసనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలా చేయాలంటే... ఎడమ మోకాలిని ముందుకు చాపి, కుడి కాలిని వెనక్కి వంచి, కుడి కాలి మునివేళ్లమీద ఉండాలి. తలను నిటారుగా ఉంచి, రెండు చేతులను కంటికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉంచాలి. ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనసును స్థిరంగా ఉంచే ఈ ఆసనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆసనాన్ని సాధనం చేయడం వల్ల మానసిక వికాసం కూడా మెరుగవుతుంది. (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
Round Egg: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..!
ఓ కోడిగుడ్డు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ విషయం వింటే..ఇది జోక్ ఏమో అనిపిస్తుందే తప్ప నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ విషయమే అలాంటిది మరి.. అందులోనూ ఓ కోడి గుడ్డు వేలానికి వెళ్లడమే విడ్డూరం అనుకుంటే..ఇక ఆ వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో వింటే నోరెళ్లబెడతారు. ప్చ్..! ఇదెలా అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించొద్దు..ఆలస్యం చేయకుండా అసలు కథేంటో చదివేయండి మరీ.. సాధారణంగా కోడిగుడ్డులు అండాకారం లేదా ఓవెల్ ఆకృతిలోనే ఉంటాయి. అందరికీ తెలిసింది. కానీ ఓ గుడ్డు మ్రాతం అత్యంత విచిత్రంగా పర్ఫెక్ట్ గుండ్రని ఆకారంలో బంతిలా కనిపించింది. నమ్మబుద్ధి కావడం లేదు కదా..!. ఈ ఘటన ఇంగ్లాండ్లోని సోమర్సెట్ డెవాన్ సరిహద్దులోని ఫెంటన్ ఫామ్లో చోటు చేసుకుంది. ఆ ఫామ్లో ఎన్నోఏళ్లుగా పనిచేస్తున్నా అలిసన్ గ్రీన్ అనే మహిళ అలా గుండ్రంగా ఉన్న కోడిగుడ్డుని చూసి అవాక్కయ్యింది. ఆ విధంగా ఆ గుడ్డు వేలానికి వెళ్లింది. అయితే అది ఏకంగా రూ. 43000లకు అమ్ముడైంది. ఆ డబ్బుని అఘాయిత్యాలకు గురైన బాధిత మహిళల కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థ డెవాన్ రేప్ క్రైసిస్కు అందివ్వనున్నట్లు పేర్కొంది అల్లిసన్. ఈ మేరకు అల్లిసన్ మాట్లాడుతూ..మూడేళ్లుగా ఫెంటన్ ఫామ్లో పనిచేస్తున్నా..ఇప్పటి వరకు దాదాపు 42 మిలయన్ల గుడ్లను సేకరించా..కానీ ఇలాంటి గుండ్రని గుడ్డుని మాత్రం చూడలేదని అన్నారు. ఇది తనను ఎంతగానో ఆకర్షించిందని..అందువల్లే వేలంలో పెట్టి వచ్చిన డబ్బు దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని అనుకున్నట్లు పేర్కొంది. అందుకు తమ ఫామ్ యజమాని కూడా ఒప్పుకోవడంతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది అలిసన్.(చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయొద్దు..! కొంచెం చూసి తిందామా..) -
ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..
చాలా మంది తెలిసో తెలియక కొన్ని ఫుడ్స్ను ఆరోగ్యానికి మంచిదని గుడ్డిగా నమ్మి తినేస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా?ఫ్లేవర్డ్ ఓట్ మీల్...ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. కానీ ఇది స్వచ్ఛమైన, సాదా ఓట్ మీల్కి మాత్రమే వర్తిస్తుంది. అయితే రకరకాల ఫ్లేవర్స్తో రకరకాల ఓట్ మీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, చక్కెర సిరప్ వంటి అనేక ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల్ని కలుపుతారు. ఇవి తినడం మంచిది కాదు. బ్రౌన్ బ్రెడ్...ఈ రోజుల్లో మార్కెట్లో లభించే బ్రౌన్ బ్రెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పేరుకు మాత్రమే బ్రౌన్ బ్రెడ్స్. చాలా మంది వీటిని చౌకగా అమ్ముతున్నారు. అంటే ఇలాంటి బ్రౌన్ బ్రెడ్లో శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచి, రంగు, చక్కెరను ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మంచి బ్రాండ్ కొనడం మేలు.ప్యాక్ చేసిన పండ్ల రసాలు లేదా స్మూతీలు...మార్కెట్లో వివిధ రకాల పండ్ల రసాలు, స్మూతీలు ప్యాకెట్లలో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యానికి మంచిదని వీటిని తెగ కొనేస్తున్నారు. నిజానికి, ఈ ప్యాక్ చేసిన జ్యూస్లలో కృత్రిమ రంగులు, చక్కెర, కృత్రిమ రుచులు మొదలైన అనారోగ్యకరమైన వస్తువులు కూడా ఉంటాయి. అందుకే వీటిని కొనే ముందు వాటి ΄్యాక్ చెక్ చేస్తే పండ్ల రసాలు, స్మూతీల్లో ఏం వాడారో తెలుస్తుంది.ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్...ఈ రోజుల్లో స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంది. అయితే, ఈ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందేమో కానీ.. రాను రాను అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రింక్స్ తాగనివ్వకండి. వీటి బదులు ఇంట్లో చేసుకున్న పండ్ల జ్యూస్లు బెస్ట్.బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్...ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మార్కెట్లో బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ అమ్ముతున్నారు. చాలా మంది ఈ ప్యాకేజ్డ్ మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని భావించి కొని తింటున్నారు. నిజానికి వీటిని తయారు చేయడానికి అదనపు చక్కెర, కత్రిమ రుచి కలుపుతారు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఉండదు. వీటి బదులు సహజంగా దొరికే తృణధాన్యాలతో ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. -
నచ్చినట్లే ఉంటున్నారా..?
ఇతర పరిస్థితులు ఎలా ఉన్నా సరే, జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, డబ్బు, ఆస్తులు, పరపతి ఉన్నా కొందరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఇతరుల మాటలు, సలహాల వల్ల చాలా మంది తమను తాము మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమ సెల్ఫ్ ఐటెంటిటీని, తద్వారా సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. జీవితంలో ఇతరుల కోసం మార్చుకోకూడని అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. మీ గుర్తింపును కాపాడుకోండిఇలా ప్రవర్తించవద్దు, అలా మాట్లాడవద్దు, ఇలా ఆలోచించవద్దు అని ఇతరుల మీకు సలహాలు ఇస్తుంటే వాటిని అంతగా పట్టించుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరించే ముందుకు సాగాలి. ఇతరుల్ని ఫాలో అయితే మీ సొంత గుర్తింపును కోల్పోయే ప్రమాదముంది. ఇతరుల కోసం ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూపోతే.. చివరికి మిగిలేది ఏముండదు. ప్రపంచానికి భిన్నంగా ఉండటం, మీ గుర్తింపును కాపాడుకోవడం ఏ మాత్రం తప్పు కాదని గుర్తుంచుకోండి.వ్యక్తిగత వ్యవహారాలలో తలదూర్చనివ్వద్దుప్రతి వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ దాచడంతో ΄ాటు ఒంటరిగా గడిపే హక్కు ఉంది. అయితే, ఎవరైనా మిమ్మల్ని పదే పదే నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వారికి దూరంగా ఉండటమే మేలు. వేరే వాళ్లు మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే అది ఏ మాత్రం సరైనది కాదని గమనించండి. మీ పర్సనల్ స్పేస్ని గౌరవించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో దూరవద్దని స్పష్టంగా చెప్పేయండి.పీస్ ఆఫ్ మైండ్ఎవరైనా సరే, మీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఏం కాదు అంతా కరెక్ట్గా ఉందని మీ మనసును చికాకు పెట్టవచ్చు. కానీ, మీరే సంతోషం లేకుంటే దాని ఉపయోగం ఏంటి? అందుకే ప్రతికూల పరిస్థితులు, వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి.నైతిక విలువలపై రాజీ వద్దుకొందరు లేదా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మోసగాళ్లుగా, అబద్ధాల కోరుగా మార్చటానికి ప్రయత్నించవచ్చు. కొందరు మీ చేత తప్పు పనులు చేయించడానికి బలవంతం పెడతారు. అయితే, ఇక్కడ నైతిక విలువలు పాటించడం ముఖ్యమని గుర్తించుకోండి. ఎవరో చె΄్పారని, వాళ్లు బలవంతం చేశారని చెడ్డ పనులు చేస్తే భవిష్యత్తులో కష్టాలే పలకరిస్తాయి. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ.. ఏది కరెక్టో దానివైపే నిలబడండి.నో చెప్పడం నేర్చుకోండిఇతరులు ఎల్లప్పుడూ వారి మాటలే వినాలని, వారి కోసమే సమయం కేటాయించాలని భావిస్తారు. అంతేకాకుండా వారి కోరికల ప్రకారం ఇతరుల జీవించాలని కోరుకుంటారు. అయితే, వేరే వాళ్లు చెప్పే పనులన్నింటికీ యస్ చెప్పుకుంటూ ΄ోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం అన్నీ దూరమై΄ోతాయి. అందుకే ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఇతరులకు నో చెప్పడానికి ఎందుకు సంకోచం. మీ పరిమితుల్ని మీరే నిర్ణయించుకోండి.కలల్ని, ఆశయాల్ని వదులుకోకండిచాలా మంది మనం ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సూటి ΄ోటి మాటలతో వెనక్కు లాగే ప్రయత్నం చేస్తారు. ఈ వయసులో నువ్వు ఏం సాధిస్తావు. ఇందులో నష్టం తప్ప లాభం ఉండదు, వేరే పని చూసుకుంటే మంచిదని లేని΄ోని సలహాలు ఇస్తుంటారు. అయితే, ఒకటి మాత్రం ఆలోచించండి. మీ జీవితాన్ని ఇతరుల ప్రకారం జీవించాలనుకోకూడదు. మీకు ఏదైనా సాధించాలని ఉంటే ఆ దిశగా అడుగులు వేయండి. మీ కలలకు విలువ ఇవ్వండి. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు.మీకు మీరే ముఖ్యంమన అవసరాల్ని తీర్చుకుని మిగతావారిని పట్టించుకుంటే చాలా మంది స్వార్థుపరులనే ట్యాగ్ వేసేస్తారు. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదని గుర్తుంచుకోండి. అది మీపై మీరు చూపించుకునే స్వీయ ప్రేమ. మీ ఆనందాన్ని, అవసరాల్ని ఇతరుల కోసం మార్చుకుంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే సాయం చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని ఇతరుల కోసం మీ అవసరాల్ని త్యాగం చేస్తే చాలా కోల్పోతారు. (చదవండి: పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..) -
మామిడికాయతో ఆవకాయేనా..? తియ్యటి మిఠాయిలు కూడా చెసేయండి ఇలా..!
పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్లూ తాగించొచ్చు.కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి; ఈ పేస్ట్లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.పచ్చి మామిడి హల్వాకావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలుతయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.మ్యాంగో బనానా షర్బత్కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంతతయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. (చదవండి: -
పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..
ఇంతకాలం పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడం, నానో యూరియా వంటి ఎరువులు చల్లడం వంటి క్లిష్టతరమైన పనులను పురుషులే చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులను కూడా ఇకపై మహిళలే చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లతో వ్యవసాయ పనులను చేయడంపై గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 54 మంది ఎస్హెచ్జీ మహిళలను ఎంపిక చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఈ డ్రోన్లను అందించనున్నారు. బెంగుళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.80 శాతం సబ్సిడీపై...కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద ఈ డ్రోన్లకు 80 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ డ్రోన్ తోపాటు, సంబంధిత మెటీరియల్తో కలిపి యూనిట్ వ్యయం రూ.పది లక్షలు. ఇందులో లబ్ధిదారులు 20 శాతం (రూ.రెండు లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.ఎనిమిది లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. ఈ డ్రోన్ సేవలను తమ వ్యవసాయ పొలాలకు వినియోగించడంతోపాటు, గ్రామంలో ఇతర రైతుల పొలాలకు సేవలందించనున్నారు. ఇందుకోసం నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా ఎస్హెచ్జీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతోపాటు, రైతులకు తమ పంట పొలాలకు పురుగుమందుల పిచికారీ కష్టాలు తప్పనున్నాయి. పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మేలు..డ్రోన్ స్ప్రేపై మాకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని వినియోగించడం ద్వారా మేము ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అలాగే రైతులకు తక్కువ ఖర్చుతో పురుగు మందుల పిచికారీ చేసే సేవలు అందుబాటులోకి వస్తాయి. మా లాంటి మహిళా సంఘాలకు ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల సంతోషంగా ఉంది.– అనిత, ఎస్హెచ్జీ మహిళ,అల్మాయిపేట, సంగారెడ్డి జిల్లా.డ్రోన్లను వినియోగించి పంటలకు పురుగుమందులు ఎలా పిచికారీ చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. రైతులకు ఈ సేవలు అందించడం ద్వారా మాకు ఆర్థికంగా కలిసొస్తుందని భావిస్తున్నాము. అలాగే రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. మాకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు. డ్రోన్ల సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.– లక్ష్మి, ఎస్హెచ్జీ మహిళ, అన్నాసాగర్, సంగారెడ్డి జిల్లా (చదవండి: లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన) -
మహమ్మారి మా గౌరవాన్ని పెంచింది!
2020 మార్చి 24.. జనతా కర్ఫ్యూ... అదే లాక్డౌన్ గుర్తుందా? ఆనాడు రోజులను గుర్తుపెట్టుకోవడం కూడానా అని ముఖం చిట్లిస్తున్నారా?నిజమే చేదు అనుభవాలను అదేపనిగా గుర్తుపెట్టుకోనక్కరలేదు! కానీ కష్టకాలంలో అందిన సేవలు, సహాయాన్ని మాత్రం మరువకూడదు కదా!అలా కోవిడ్ టైమ్లో ఫ్రంట్లైన్ వారియర్స్గా నిలబడ్డ నర్స్లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, సాయం గురించి మార్చి 24 లాక్డౌన్ డే సందర్భంగా ఒక్కసారి గుర్తుచేసుకుందాం.. ఓ సిరీస్గా! అందులో భాగంగా నేడు .. సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శిరీష ఏం చెబుతున్నారంటే..ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ భయమే! నేనప్పుడు ఉస్మానియాలో పనిచేసేదాన్ని. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని తేలాకే అందులో జాయిన్ చేసుకునేవారు. జనరల్ పేషంట్స్, కోవిడ్ లక్షణాలున్న వాళ్లు ఉస్మానియాకు వచ్చేవాళ్లు. టెస్ట్ చేసి.. పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపేవాళ్లం. ఉస్మానియా కోవిడ్ కాదు, ఎన్ 95 మాస్క్లు, పీపీఈ కిట్స్ ఖరీదైనవి కూడా .. కాబట్టి వాటిని ముందు డాక్టర్స్కే ఇచ్చారు. అయితే నిత్యం పేషంట్స్తో ఉంటూ వాళ్లను కనిపెట్టుకునేది నర్సింగ్ స్టాఫే కాబట్టి మాస్క్లు, పీపీఈ కిట్లు ముందు వాళ్లకు కావాలని మాకు ఇప్పించారు అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సర్.మామపోయాడు.. అల్లుడు బతికాడుఒక కేస్లో మామ, అల్లుడు ఇద్దరికీ కోవిడ్ సోకింది. ఇద్దరినీ గాంధీలో చేర్పించాం. మాకు రెండు ప్రాణాలూ ఇంపార్టెంటే! ఇద్దరికీ ఈక్వల్ సర్వీసే ఇస్తాం. దురదృష్టవశాత్తు పెద్దాయన అంటే మామ చనిపోయాడు. ఆ అమ్మాయి భర్త డిశ్చార్జ్ అయ్యాడు. అల్లుడిని చూసి అత్తగారు తన భర్త కూడా తిరిగొస్తాడనుకుంది. వెంటనే నిజం చెబితే ఆమెకేమన్నా అయిపోతుందన్న భయంతో నెల తర్వాత అసలు విషయం చెప్పారురు. ఇలా ఎన్నికేసులో! కోవిడ్ నుంచి బయటపడగలమా అని దిగులేసేది. అలాంటి సిట్యుయేషన్ ఎప్పటికీ రావద్దు!వెంటిలేటర్ మీదుంచే స్థితిలో..లాక్డౌన్ టైమ్లో మాకు వారం డ్యూటీ, వారం సెలవు ఉండేది. రెండో వారమే నాకు కాళ్లు లాగడం, కళ్లు మండటం స్టార్టయింది. దాంతో తర్వాత వారం కూడా సెలవు తీసుకున్నాను. ఇది కోవిడా లేక నా అనుమానమేనా అని తేల్చుకోవడానికి డ్యూటీలో జాయినయ్యే కంటే ముందురోజు అంటే పదమూడో రోజు టెస్ట్ చేయించుకున్నాను. స్వాబ్ టెస్ట్లో నెగటివ్ వచ్చింది. సీటీ స్కాన్ కూడా చేయిస్తే.. సీవియర్గా ఉంది కోవిడ్. ఆ రిపోర్ట్స్ని మా హాస్పిటల్లోని అనస్తీషియా డాక్టర్కి పంపాను. వాటిని చూసిన ఆవిడ ‘వెంటిలెటర్ మీదుంచే స్థితి తెలుసా నీది? అసలెలా ఉన్నావ్?’ అంటూ గాభరాపడ్డారు. కానీ నేను మాత్రం బాగానే ఉన్నాను. అయినా ఆవిడ కొన్ని జాగ్రత్తలు చె΄్పారు. తెల్లవారి డ్యూటీలో జాయిన్ అయ్యాను. అయితే డాక్టర్స్, కొలీగ్స్ చాలా కేర్ తీసుకున్నారు. ఇంట్లో మా ఆయన, పిల్లలు కూడా! డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మావారు వేడినీళ్లు పెట్టి ఉంచేవారు. మా పెద్దబ్బాయి రోజూ నాన్వెజ్ చేసిపెట్టేవాడు.‘ నువ్వు డ్యూటీ చేయాలి కదమ్మా.. మంచి ఫుడ్ అవసరం’ అంటూ. అందరూ చాలా స΄ోర్ట్గా ఉన్నారు.అంత విషాదంలోనూ సంతోషమేంటంటే.. మా నర్సింగ్ స్టాఫ్లో డెబ్భై శాతం మందికి కోవిడ్ సోకింది. ఐసొలేషన్ పీరియడ్ అయిపోగానే వెంటనే డ్యూటీకొచ్చారు.. భయపడలేదు. పీపీఈ కిట్తో ఉక్కపోతగా ఉండేది. అది వేసుకున్న తర్వాత ఒక్కసారి తీసినా మళ్లీ పనికిరాదు. దాంతో వాష్రూమ్కి కూడా వెళ్లేవాళ్లం కాదు. దానివల్ల డీహైడ్రేషన్ అయింది. అయినా, సహనం కోల్పోలేదు. కోవిడ్ మా సర్వీస్కి పరీక్షలాంటిది. నెగ్గాలి.. మానవ సేవను మించిన పరమార్థం లేదు అనుకునేదాన్ని! అంత విషాదంలోనూ సంతోషమేంటంటే మా నిబద్ధత, సేవ ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వాసుపత్రుల మీదున్న చెడు అభిప్రాయం పోయింది. మమ్మల్ని గౌరవిస్తున్నారు. – సరస్వతి రమ (చదవండి: లాభాల తీరం మత్స్య సంపద యోజన) -
లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
పీఎమ్ఎస్సెస్వై (ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన) కిందకు వచ్చే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా చేపలపెంపకందారులకు ఏడు శాతం వడ్డీతో రెండు లక్షల రూపాయాల వరకు రుణాన్ని అందిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంపై ఉచిత శిక్షణనూ అందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు 60 శాతం వరకు గ్రాంట్ అందుతోంది. ఈ పథకం తీర్రప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చేపల ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఫిషరీస్, మత్స్యకారుల సంక్షేమశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో మరిన్ని వివరాలను పొదవచ్చు. జిల్లా మత్స్యశాఖ లేదా ఏదైనా హేచరీ నుంచి ఉచితంగా చేప సీడ్ను పొందవచ్చు. ఈ పథకానికి అధికారిక వెబ్సైట్ https://pmmsy.dof.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో స్కీమ్ లింక్పై క్లిక్ చేయాలి. నింపాల్సిన ఫామ్ కనిపిస్తుంది. అందులోని వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, భూమి వివరాలనూ పొందుపరచాలి. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సహా సూచించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి.. ఫామ్ను సమర్పించాలి. దరఖాస్తుదారు అర్హతలు, సంబంధిత పత్రాలను ఆమోదించిన తరువాత పథకం ప్రయోజనాలను పొందవచ్చు. తీర్రప్రాంతం లేని చోటా మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం రుణాన్ని అందిస్తోంది. కమర్షియల్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కింద ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 20 లక్షలు అయితే రూ. 5 లక్షల వరకు సొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడు రూ. 15 లక్షల రుణాన్ని పొందవచ్చు. ఇందులో సబ్సిడీ ఉంటుంది. (చదవండి: Earth Hour: "'స్విచ్ ఆఫ్": ఆ ఒక్క గంగ ప్రకృతితో కనెక్ట్ అవుదామా..!) -
నీటిని ఒడిసిపట్టారు
‘నీరు ఉన్న చోట ఊరు ఉంటుంది’ అనే మాట ఉంది. ఊరు సరే... నీటి మాట ఏమిటి?‘నీటిని డబ్బులా ఖర్చు చేయవద్దు’ అనే రోజులు వచ్చాయి.నీటి విలువ గురించి అవగాహన కలిగించడం నుంచి సంరక్షణ వరకు విమెన్ వాటర్ వారియర్స్ క్షేత్రస్థాయిలో, ఉద్యమ స్థాయిలో పనిచేస్తున్నారు...అస్సాంలోని అమ్తోలా గ్రామానికి చెందిన అరుణా దాస్ గుస్తా సామాజిక సమస్యలపై నిర్వహించే సమావేశాలకు తరచుగా హాజరయ్యేది. ఆ అలవాటే తనని నీటి పరిరక్షణ ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది. గ్రామంలోని వాటర్ యూజర్ గ్రూప్ (డబ్ల్యూయుజీ) అధ్యక్షురాలిగా నీటి సమస్యలపై గళమెత్తడంలో గణనీయమైన పాత్ర పోషించింది. ‘ప్రతి విషయం నీటితో ఆరంభమై నీటితో ముగిసిపోతుంది’ అంటున్న అరుణ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ్రపోగ్రామ్ (ఇండియా) ద్వారా ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది.ఉత్తర్ప్రదేశ్లోని లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలోని పాలియ కాలన్ గ్రామానికి చెందిన రమణ్దీప్ కౌర్ నీటి సంరక్షణ నుంచి నీటి కాలుష్యం వరకు....ఎన్నో విషయాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. కౌర్ సోషల్ సైన్సెస్లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది. గ్రామంలో ‘వాటర్ మేనేజ్మెంట్ కమిటీ’లు ఏర్పాటు చేసింది.ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళలను వాటర్ మేనేజ్మెంట్ గ్రూపులలో భాగమయ్యేలా చేసింది.మహారాష్ట్రలోని కోటంబ గ్రామంలో మహిళలు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం రేణుక. కోడలుగా ఆ ఊళ్లోకి అడుగు పెట్టిన రేణుక కొంత కాలానికి ఆ గ్రామానికి సర్పంచ్ అయింది. ‘వాటర్ ఎయిడ్ ఇండియా’ సహకారంతో గ్రామంలో ప్రభుత్వ భవనాలపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేసింది. నీటి వృథాను అరికట్టడానికి, నీటి సంరక్షణపై అవగాహన కలిగించడానికి గ్రామీణ మహిళలతో కమిటీని ఏర్పాటు చేసింది.మధ్యప్రదేశ్లోని నయాపూరా గ్రామానికి చెందిన బబితా లిరోలియా నీటి సంరక్షణ, నీటి నాణ్యత పరీక్షించడం, నీటి పంపుల రిపేర్...మొదలైన ఎన్నో విషయాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ఇంటర్నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్’ బబితాను ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తించింది.మధ్యప్రదేశ్లోని మహుకల గ్రామానికి చెందిన రాధ మీనా ‘విమెన్ ప్లస్ వాటర్ అలయెన్స్’ ్రపోగ్రామ్ వాలెంటరీ వర్కర్. గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయడం నుంచి కుళాయిల్లో లీకేజీ సమస్య లేకుండా చేయడం, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం వరకు ఎన్నో పనులు చేస్తోంది. ప్రతీ వీధి తిరుగుతూ నీటి సంరక్షణ గురించి లౌడ్ స్పీకర్తో ప్రచారం చేసేది..దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది విమెన్ వాటర్ వారియర్స్లో వీరు కొందరు మాత్రమే. ‘వరల్డ్ వాటర్ డే’ సందర్భంగా అందరికీ వందనాలు. – శిరీష చల్లపల్లినీటి నిజాలు⇒ ప్రపంచంలో 2 బిలియన్ మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది కలుషిత నీటి వల్ల సంభవించే వ్యాధులతో మరణిస్తున్నారు ⇒భవిష్యత్తులో నీటి కొరత ఒక ప్రధాన సమస్యగా మారనుంది. పరిష్కారంగా, డీసాలినేషన్ (సముద్ర జలాన్ని తాగే నీటిగా మార్చడం), వర్షపు నీటి సేకరణ, జల పునర్వినియోగం వంటి టెక్నాలజీలు అవసరం. ప్రతి వ్యక్తి నీటిని పొదుపుగా వాడడం ముఖ్యం.వాటర్ గర్ల్... నీటి పుస్తకాలు‘వాటర్ గర్ల్’గా గుర్తింపు పొందిన గర్విత గుల్హాటీ ‘వై వేస్ట్?’ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, సీయివో. తన ఫౌండేషన్ ద్వారా నీటి విలువ, నీటి సంరక్షణ గురించి యువ రచయితలు రాసిన రచనలను ప్రచురిస్తోంది. -
ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి ఈ ఎర్త్ అవర్. అసలేంటిది..? ఆ ఒక్క రోజు.. ఒక్క గంటపాటు పాటించేస్తే నిజంగానే భూమిని కాపాడేసినట్లేనా..? అంటే..?. .ఎర్త్ అవర్ అంటే.. పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్య జరుగుతుంది. ఈపాటికే ఇరు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు మార్చి 22 శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేసింది కూడా. అలాగే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందురూ స్వచ్ఛందంగా భాగం కావాలని కోరాయి ఇరు ప్రభుత్వాలు.ఎలా ప్రారంభమైందంటే? 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. WWF (World Wildlife Fund) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం.ప్రాముఖ్యత ఎందుకు..మన ప్రపంచానికి మన సహాయం కావాలి. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. అది మనల్ని ఆరోగ్యంగా, అభివృద్ధి చెందేలా చేస్తుంది. డబ్ల్యూబడ్యూఎఫ్(WWF) ఎర్త్ అవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మనం నివశించే గ్రహానికి(భూమి) తిరిగి ఇవ్వడానికి సరైన సమయం. ఎందుకంటే మనం ప్రకృతిని పునరుద్ధరించినప్పుడే అది మనల్ని పునరుద్ధరిస్తుంది.'స్విచ్ ఆఫ్'లో ఉన్న ఆంతర్యం..ఎర్త్ అవర్ అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు - మానసికంగా "స్విచ్ ఆఫ్" చేసి అంతర్ముఖులం కావడమే. అంటే ఇది వరకు చూడండి కరెంట్ పోతే చాలు అంతా బయటకు వచ్చి ముచ్చటలు ఆడుకునేవాళ్లు. ఆ వసంతకాలం వెన్నెలను వీక్షిస్తూ భోజనాలు చేస్తూ..హాయిగా గడిపేవాళ్లం గుర్తుందా..?. అచ్చం అలాగన్నమాట. ప్రకృతితో గడపటం అంటే ఏ అడువులో, ట్రెక్కింగ్లే అక్కర్లేదు..మన చుట్టు ఉన్న వాతావరణంతో కాసేపు సేదతీరుదాం. చిన్న పెద్ద అనే తారతమ్య లేకుండా ఫోన్ స్క్రీన్లతో గడిపే మనందరం కాసేపు అన్నింటికి స్విచ్ ఆఫ్ చెప్పేసి.. మనుషులతోనే కాదు మనతో మనమే కనెక్ట్ అవుదాం. తద్వారా గొప్ప మానసిక ఆనందాన్ని పొందుతాం కూడా. ఎందుకంటే సెల్ఫోన్ లేకుండా ప్రాణామే లేదన్నట్లుగా హైరానా పడుతున్న మనకు ఆ ఒక్క గంట అమూల్యమైన విషయాలెన్నింటినో నేర్పిస్తుందంటున్నారు మానసిక నిపుణులు.మరి అంత గొప్ప ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందామా..!. ఇది కేవలం భవిష్యతరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడమే గాక మనకు ఈ ఒక్క గంట లైట్స్ ఆపి చీకటిలో గడిపే చిన్నపాటి విరామంలో అయినా మనలో ఆరోగ్యం, ప్రకృతిని రక్షించుకోవాలనే మార్పు వస్తుందేమోనని ఆశిద్దాం.(చదవండి: ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్లో ఇంత మోసమా..? వైరల్గా హర్ష గోయెంకా పోస్ట్) -
చీటింగ్ యాప్ : భర్త ఫోన్లను ఎక్కువగా చెక్ చేస్తోంది ఈ నగరంలోనేనట!
భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పరం విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుకుంది. ఆ నమ్మకం వమ్ము అయినపుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ఫోన్లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు, షాపింగ్ దాకా అంతా అన్లైన్లోనే. అందుకే తమ భాగస్వాములను వ్యవహారాల్ని పసిగట్టేందుకు స్మార్ట్ఫోన్ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్లుకూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్లో ఉందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా. అన్నట్టు ఇది నేరుగా ఉండదు సుమా. గుట్టుచప్పుడు గాకుండా సాగుతుందన్నట్టు అచ్చం వాళ్లు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో... అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుసుకుందాం.CheatEye.ai నివేదిక ప్రకారం, మహిళలు తమ భాగస్వాములను అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్లో జరిగిన టిండర్-సంబంధిత శోధనలలో 27.4శాతం మంది తమ భాగస్వామి గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని ఇటీవలి విశ్లేషణలో వెల్లడైంది. ముఖ్యంగా, ఈ శోధనలలో 62.4శాతం తమ భర్తలు లేదా బాయ్ఫ్రెండ్లు డేటింగ్ యాప్ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ యాప్లోకి వస్తున్నారట. ఇక లండన్ తరువాత మాంచెస్టర్ బర్మింగ్హామ్ తరువాతి టాప్ ప్లేస్లో నిలిచాయి. భాగస్వాములపై అనుమానంతో జరిగి టిండర్ చెకింగ్స్లో మాంచెస్టర్లో, 8.8శాతంగా బర్మింగ్హామ్లో 8.3శాతంగా ఉన్నాయి. అయితే, బర్మింగ్హామ్ లో 69 అనుమానాస్పద శోధనలు పురుష భాగస్వాములపై మహిళలే నిర్వహింనవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా కూడా ఈ జాబితాలో కనిపించింది, 4.7శాతం టిండర్-సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో, 62.1శాతం మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాములను లక్ష్యంగా ఉన్నాయట. దీనికి ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా యువకులలో డేటింగ్ యాప్లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణమని నిపుణురాలు సమంతా హేస్ విశ్లేషించారు."లండన్ వంటి నగరాల్లో, డేటింగ్ అనేది డైనమిక్గా ఉంటుంది. ఇది సహజంగానే భాగస్వాముల కార్యకలాపాలపై అనుమానం పరిశీలనకు దారితీస్తుంది" అని ఆమె వివరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ భాగస్వాముల విశ్వసనీయత గురించి ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు.ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జర జాగ్రత్త భయ్యో అంటూ కమెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో.. మూడో వ్యక్తి రాకూడదు. అప్పుడ అది నూరేళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది. -
మూస ధోరణికి భిన్నంగా..
ఒక జాతి సంస్కృతి తెలుసుకోవాలంటే.. ఆ జాతి ఏర్పాటు చేసుకున్న రంగస్థలమేంటో తెలుసుకుంటే సరిపోతుందంటారు సామాజికవేత్తలు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, సమకాలీన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో చూపడంలో రంగస్థలం అత్యంత ప్రధానమైంది. నలభయ్యేళ్లుగా ప్రవాహంలా సాగిపోతున్న నాటక రంగానికి తమవంతు బాధ్యతగా దశాదిశ చూపే ప్రయత్నం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) ప్రాంత కళాకారులు.తొర్రూరు ప్రాంతానికి చెందిన చైతన్య కళా సమాఖ్య ప్రతినిధులు 1985 నుంచి నాటక రంగానికి జీవం పోస్తున్నారు. నాటక ప్రదర్శనల్లో.. తెలుగు రాష్ట్రాల్లోనే చైతన్య కళా సమాఖ్య మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 200 పైచిలుకు నాటక ప్రదర్శనలకు అవకాశమిచ్చిన కళా సమాఖ్య.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గుర్తింపు పొందుతోంది. ఆదర్శం.. చైతన్య కళా సమాఖ్య నాటక సేవ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 1985లో మన్నూరు ఉమ బృందం చైతన్య కళా సమాఖ్యను స్థాపించింది. అప్పటినుంచి సమాఖ్య 40 ఏళ్లుగా కళా రంగానికి తన వంతు సేవ చేస్తోంది. ఏటా మార్చిలో వారం రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ జాతీయ తెలుగు ఆహ్వాన నాటికల పోటీల్లో.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక నాటక సంఘాలు ప్రదర్శనలిచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, గుంటూరు కళాకారులు నాటకాలను ప్రదర్శించారు. ఈ కళా సమితి వేదికపై ప్రదర్శనలు ఇచ్చి పలువురు గుర్తింపు పొందారు. మూస ధోరణికి భిన్నంగా.. 1980 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో పండుగల సందర్భాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవారు. వాటికి విపరీతమైన ఆదరణ ఉండేది. ఒకప్పుడు వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది. ప్రస్తుతం నాటక ప్రదర్శనలకు పెద్దలు మినహా నేటితరం యువత రావడం లేదు. ఇలాగే కొనసాగితే తెలుగు నాటకం (Telugu Natakam) మసకబారే ప్రమాదముందని భావించిన తొర్రూరు చైతన్య కళా సమాఖ్య కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ నాటకాలను ఎంచుకుని ప్రదర్శనలకు ఆహ్వానిస్తోంది. పోటీకి వచ్చిన నాటికల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తోంది. ఉత్తమ నటులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.చదవండి: దేవాలయాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?నాటక వారసత్వాన్ని కొనసాగించాలని.. ప్రస్తుతం టీవీ, సినిమాలు చూస్తే.. వాటిలో ఎలాంటి సందేశం ఉండటం లేదు. కానీ నాటకాలను తిలకించినప్పుడు.. అందులోని పాత్రలు, సారాంశం నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయి. నాటకాల వారసత్వాన్ని నేటి తరానికి అందించే లక్ష్యంతో చైతన్య కళా సమాఖ్య ఏటా పోటీలు నిర్వహిస్తోంది. కళా సమాఖ్య ద్వారా తొర్రూరులో మా వంతుగా కళా రంగాభివృద్ధికి కృషి చేస్తున్నాం. – మన్నూరు ఉమ, అధ్యక్షుడు, చైతన్య కళా సమాఖ్య, తొర్రూరునాటకానికి జవసత్వాలు నింపాలి ప్రాచీన కళలు అంతరించి పోకుండా ఐక్యంగా కృషి చేయాలి. నాటక పోటీల ద్వారా ఈ రంగానికి జవసత్వాలు నిండాలన్నదే మా ఆకాంక్ష. ఇటీవల తొర్రూరులో నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు ఆహ్వానిత నాటక పోటీలకు ఎన్నడూ లేనంత ఆదరణ లభించింది. ప్రేక్షకులు నాటకాలు వీక్షించేందుకు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోయారు. రానున్న రోజుల్లోనూ నాటక ప్రదర్శనలు కొనసాగిస్తాం. – సుంకరనేని పినాకపాణి, ప్రధాన కార్యదర్శి, చైతన్య కళా సమాఖ్య -
ఐక్యతా విగ్రహ శిల్పి రామ్సుతార్కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు ప్రముఖ శిల్పి రామ్ సుతార్ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం శాసనసభలో ప్రకటించారు. మార్చి 12న ఆయన తన నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫడ్నవీస్ తెలియజేశారు. ఈ అవార్డుకింద ఆయనకు రూ.25లక్షల నగదు, మెమెంటో అందజేస్తామని వెల్లడించారు. ‘ఆయనకు ఇప్పుడు వందేళ్ళు. కానీ దాన్ని లెక్కచేయకుండా ముంబైలోని ఇందు మిల్లు స్మారక ప్రాజెక్టులో అంబేద్కర్ విగ్రహం రూపకల్పనలో ఆయన నిమగ్నమై ఉన్నారు.’అని ప్రశంసించారు. పలు భారీప్రాజెక్టుల రూపశిల్పి గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఈ ఏడాదితో వందేళ్లు పూర్తిచేసుకున్న రామ్సుతార్ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. సుతార్ తన కుమారుడు అనిల్తో కలిసిస్టాట్యూ ఆఫ్ యూనిటీ, అయోధ్యలో రెండు వందల యాభై ఒక్క మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం, బెంగళూరులో నూటయాభై మూడు అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, పూణేలోని మోషిలో వంద అడుగుల ఎత్తైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ విగ్రహం వంటి అనేక ప్రధాన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తో సంబంధం కలిగి ఉన్నారు.గతేడాది మాల్వాన్లోని రాజ్కోట్ కోటలో ముప్పై ఐదు అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయి రాష్ట్రంలో భారీ రాజకీయ దుమారం చెలరేగింది. ఆ సంఘటన జరిగిన నాలుగునెలల తరువాత ప్రభుత్వం అరవై అడుగుల కొత్త విగ్రహాన్ని నిర్మించే కాంట్రాక్టును రామ్ సుతార్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందినవారు. -
ఇది ఓయో కాదు.. దూరం ప్లీజ్ : క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్
ప్రేమికులు ప్రైవసీ కోసం పార్క్లు, సినిమా థియేటర్లను వెతుక్కుంటారు. కాసేపు అచ్చిక బుచ్చికలు, మాటా ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇపుడు ఈ జాబితాలో ప్రైవేట్ క్యాబ్లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పిమాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది హద్దు మీరనంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది కానీ మరికొంతమంది మితి మీరుతున్నారు. తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ పెట్టిన నోటు దీనికి ఉదాహరణగా ని లుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్అవుతోంది. తన క్యాబ్లో ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమోగానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక నోట్ పెట్టాడు. జంటలను నో రొమాన్స్.. దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. "హెచ్చరిక!! నో రొమాన్స్.. ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేసో, OYO కాదు.. సో దయచేసి దూరంగా, కామ్గా ఉండండి." అంటూ ఒక నోట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఆలోచన రేకెత్తించింది. డ్రైవర్ ముక్కుసూటి తనం తెగ నచ్చేసింది నెటిజనులకు. హ్హహ్హహ్హ.. పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో అని ఒకరు, డ్రైవర్లను తలచుకుంటే జాలేస్తోంది. కొంతమంది జంటలు క్యాబ్లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి విన్నాను.. అని ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబూ మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్లు క్యాబ్లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్లను పునరాలోచించుకునేలా చేసే విషయాలను చూశారు. ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం!" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు హైలైట్గా నిలుస్తాయి. ఆన్లైన్ మీమ్లకు కేంద్రంగా ఉంటాయి. -
వెరైటీ ఇడ్లీ, చట్నీకూడా అదిరింది, ట్రై చేయండి!
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారం ఇడ్లీ. సాధారణంగా మినప్పప్పు, ఇడ్లీ రవ్యతో చేసే క్లాసిక్ ఇడ్లీ చాలా పాపులర్. అలాగే దీనికి పల్లీ, అల్లం చట్నీ, కారప్పొడి,నెయ్యి మంచి కాంబినేషనల్.అంతేకాదు ఇడ్లీని సాంబారులో ముంచుకొని తింటే ఆ టేస్టే వేరు. దీంతోపాటు సెనగపిండితో చేసే బొంబాయి చట్నీ కూడా చాలా ఫ్యామస్. ఇలా రకాలు ఈసూపర్ టిఫిన్ను మనోళ్లు ఆస్వాదిస్తారు. ఇడ్లీలో చాలారకాలుగా రవ్వ ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీతో సహా అనేక రకాల ఇడ్లీలు కూడా ఉన్నాయి. అయితే అరటి ఆకు ఇడ్లీని ఎపుడైనా చూశారా? దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) అరటి ఆకుల్లో ఇడ్లీ పిండి వేసి గట్టిగా చుట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ తరహా ఇడ్లీలను కన్నడ/తుళులో 'మూడ్' అని పిలుస్తారు. అరటి ఆకులు ఇడ్లీలకు ప్రత్యేకమైన రుచి ,సువాసనను జోడిస్తాయి. అయితే జ్యోతి కల్బుర్గి అనే ఇన్స్టా యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. అరటి ఆకును కట్ చేసి, టూత్ పిక్ల సాయంతో చక్కగా చతురస్రాకారంగా కటోరీలు (గిన్నెలు)తయారు చేసింది. ఆ తర్వాత గిన్నెల్లో ఒక లేయర్ ఇడ్లీ పిండి, మరో లేయర్ తురిమిన కొబ్బరి , దానిపై మరొక పొర పిండిని నింపింది. దీన్ని ఆవిరిమీద ఉడికించింది.చదవండి: పోక్సో కేసులో నిందితుడికి టీచర్ ఉద్యోగం, లైసెన్స్ ఇచ్చినట్టా..!?పల్లీలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా చట్నీ చేసింది. వేడి వేడిగా ఉన్న ఇడ్లీలపై (అరటి ఆకు గిన్నెల్లోనే) తురిమిన కొబ్బరితో గార్నిష్ చేసి, చట్నీతో కమ్మగా ఆరగించింది. దీనికి అరటి ఆకు ఇడ్లీ అని పేరు పెట్టింది. దీంతో ఇది నెట్టింట తెగ వైరల్గా మారింది.ఫుడ్ లవర్స్, నెటిజన్లు దీనిపై ప్రశంసలు కురిపించారు. 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. చాలా బావుంది అంటూ ఫుడ్ లవర్స్ దీన్ని ప్రశంసలతో ముంచెత్తారు. చాలా మంది “చాలా బాగుంది” అని, దయచేసి చట్నీ రెసిపీని పంపండి అని మరొకరు వ్యాఖ్యానించారు. పైన కొద్దిగా దేశీ నెయ్యి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది అని మరొక యూజర్ సూచించారు. ముఖ్యంగా నూనెలో వేయించకుండా పల్లీ చట్నీ చేయడం ఎక్కువ ఆకర్షించింది. ఆ వైరేటీ ఏంటో మీరు కూడా చూసేయండి మరి. -
ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్లో ఇంత మోసమా..? వైరల్గా హర్ష్ గోయెంకా పోస్ట్
ఆహార ప్యాకేజింగ్ లేబుల్స్పై ఉన్న సమాచారం నమ్మి..కొనుగోలు చేయకండి అని హెచ్చరిస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. నెటిజన్లతో మంచి విషయాలను ముచ్చటించే హర్ష్ గోయెంకా తాజాగా ఆహార కంపెనీలు వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నాయో వివరించే వీడియోను పంచుకున్నారు. ఇన్ని ప్రముఖ ఆహార కంపెనీలు తన ప్యాకేజీ లేబుల్పై ఇంతలా తప్పుదారి పట్టించేలా సమాచారం ఇస్తున్నాయా..? అని తెలిసి షాకయ్యా అంటూ పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతకి హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..?హర్ష గోయెంకా ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఓ సమస్యను బయటపెట్టారు. మన ఆహార కంపెనీలు మనల్ని ఎలా మోసగిస్తున్నాయో ఈ వీడియోలో సవివరంగా ఉందని, అది చూసి విస్తుపోయానంటూ రాసుకొచ్చారు పోస్ట్లో. ఆ వీడియోలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అయిన రేవంత్ హిమత్సింగాక్ ఆహార కంపెనీలు వినియోగదారులను తప్పుపట్టించేలా చేస్తున్న మోసపూరిత వ్యూహాల గురించి మాట్లాడారు. అందులో గుడ్ డే బిస్కట ప్యాకేట్స్, కుకీలు వంటి వాటిల్లో బాదం, జీడిపప్పుల క్యాండిటీ 50-60 శాతం ఉంటాయని లేబుల్పై ఉంటుంది. కానీ కేవలం బాదం 1.8 శాతం, జీడిపప్పలు 0.4 శాతం మాత్రమే ఉంటాయన్నారు. మరోక బిస్కెట్ ప్యాకెట్ని చూపిస్తూ..దీన్ని హోల్వీట్ కుకీగా ప్రచారం చేస్తుంటారు. కానీ దానిలో 52 శాతం శుద్ధి చేసిన పిండి, 19.5 శాతం మాత్రమే హోల్వీట్ ఉంటుందన్నారు. అలాగే హెర్బ్ కుకీగా అమ్ముడవుతున్న మరో ప్రొడక్ట్లో అశ్వగంధ, పసుపు, తులసి, గిలోయ్, ఆమ్లా (గూస్బెర్రీ) ఉన్నాయని పేర్కొంది. అవి లేబుల్లో చెప్పినంత శాతంగా కాకుండా కేవలం 0.1 శాతం మాత్రమే ఉన్నాయి. ఇలా మనకు తెలియకుండా చాలా పెద్ద నకిలీ మార్కెట్ జరుగుతోంది. ఇది ఒక విధమైన పెద్ద సమస్య, ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని వీడియోలో న్యూట్రిషన్ రేవంత్ చెబుతున్నట్లు కనిపిస్తుంది. మం గనుక ప్రొడక్ట్లపై ఉన్న సమాచారాన్ని నమ్మి తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడటమేగాక ఆస్పత్రి పాలవ్వుతామని అన్నారు. ఏదో రకంగా వినియోగదారుడుకి కట్టబెట్టడంలో నైపుణ్యం కలిగిన ఆహార కంపెనీలు అవి. అవన్నీ ఒక దానికొకటి పోటీ పడుతూ మనల్ని దారుణంగా తప్పుదారి పట్టించేలా మోసం చేస్తన్నాయని చెప్పారు న్యూట్రిషన్ రేవంత్. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు కంటే మొక్కల ఆధారిత ఆహరానికే ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటివి కొనుగోలు చేసి ఒళ్లు, జేబు గుల్ల చేసుకుని వాడి లాభాలు తెచ్చిపెట్టే కంటే..ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదన్నారు న్యూట్రిషన్ రేవంత్. చివరగా హర్ష గోయంకా ఆరోగ్యకరంగా తింటూ ఆరోగ్యంగా ఉందాం అని పోస్ట్ని ముగించారు. How our food companies are taking us for a ride! I was truly shocked by these revelations. pic.twitter.com/oRWTeVuYxw— Harsh Goenka (@hvgoenka) March 19, 2025 (చదవండి: నటి రాణి ముఖర్జీ టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్యనమస్కారాలు ఇంకా..) -
రికార్డ్ ధర పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్, రూ.118 కోట్లు
ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. 1950ల నాటి ఈ లెజెండరీ ఆర్టిస్టు మోడ్రన్ ఆర్ట్కు పెట్టింది పేరు.మార్చి 19న న్యూయార్క్లో జరిగిన క్రిస్టీ వేలంలో గతంతో పోలిస్తే రెట్టింపు ధర పలికింది. 2023లో ముంబైలో జరిగిన వేలంలో దాదాపు రూ.61.8 కోట్లు పలికిన పెయింటింగ్ పోలిస్తే 13.8 మిలియన్ల డాలర్లకు (రూ.118 కోట్లకు పైగా) ధర పలికింది. ఇది అత్యంత ఖరీదైన వేలంగా సరి కొత్త రికార్డును సృష్టించింది.గతంలో రికార్డు సృష్టించిన అమృతా షేర్-గిల్ 1937 నాటి "ది స్టోరీ టెల్లర్" పెయింటింగ్ కంటే హుస్సేన్ ఆర్ట్ దాదాపు రెట్టింపు ధర సాధించింది. గతంలో, హుస్సేన్ అత్యంత ఖరీదైన పెయింటింగ్, అన్టైటిల్డ్ (పునర్జన్మ) గత సంవత్సరం లండన్సుమారు రూ. 25.7 కోట్లకు అమ్ముడైంది. ఒకే కాన్వాస్లో దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో 13 ప్రత్యేకమైన చిత్రాలతో'గ్రామ తీర్థయాత్ర' పెయింటింగ్ను తీర్చిదిద్దారు హుస్సేన్. హుస్సేన్ పెయింటింగ్స్లో దీన్ని ప్రముఖంగా పేర్కొంటారు. దీనిపై క్రిస్టీస్ సౌత్ ఆసియన్ మోడరన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ హెడ్ నిషాద్ అవారి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన పనితనానికి కొత్త బెంచ్మార్క్ విలువను నిర్ణయించడంలో తాము భాగం కావడం ఆనందదాయకమన్నారు. ఇదొక మైలురాయి అని ప్రకటించారు.1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిందీ ఈ పెయింటింగ్. ఉక్రెయిన్లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీనిని కొనుగోలు చేశారు. ఎలియాస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోసం థొరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని ఢిల్లీలో స్థాపించారు. వోలోడార్స్కీ 1964లో దీన్ని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్కు అప్పగించారు. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుంది.కాగా 1915 సెప్టెంబర్ 17న మహారాష్ట్రలోని పంధర్పూర్లో జన్మించారు హుస్సేన్. ఇండియాలో టాప్ ఆర్టిస్ట్గా పేరు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కళాకృతులు ఆదరణ సంపాదించాయి. అయితే దేవుళ్ళు , దేవతలపై వేసిన చిత్రాలు వివాదాన్ని రేపాయి. కేసులు, హత్యా బెదిరింపుల నేపథ్యంలో విదేశాల్లో తలదాచుకున్నాడు. 2011 జూన్ 9న 95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. -
Rani Mukerji: టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!
బాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్బస్టర్ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్ బాడీతో మెస్మరైజ్ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్ ప్లాన్, వర్కౌట్లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్నెస్ ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్ ఫిగర్ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్-వర్కౌట్ ప్లాన్ని అనుసరించిందంటే. రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్రెండు గంటలు వ్యాయామంఅల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవుచివరగా టైనర్ సత్యజిత్ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన్గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్ ప్లాన్ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!) -
పోక్సో కేసులో నిందితుడికి టీచర్ ఉద్యోగం, లైసెన్స్ ఇచ్చినట్టా..!?
జైలు నుంచే బీపీఎస్సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడో వ్యక్తి. సంకెళ్లున్న చేతులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా అప్పాయింట్మెంట్ లెటర్ను అందుకున్నాడు. ఈ అసాధారణమైన, దిగ్భ్రాంతికరమైన ఉదంతంతో ఎక్కడ చోటుచేసుకుంది. అసలేంటీ స్టోరీ తెలుసుకుందాం.బిహార్లో గయలో సంఘటన జరిగింది. గత 18 నెలలుగా జైలులో ఉన్న విపిన్ కుమార్ ఉపాధ్యాయ పదవికి నియామక లేఖ అందుకున్నాడు. పట్నాలోని బూర్ జైలులో ఉండగానే, TRI-3 పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ప్రభుత్వం అతన్ని ఉపాధ్యాయుడిగా నియమించింది. గయా జిల్లాలోని మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎర్కి గ్రామానికి చెందిన విపిన్ కుమార్ గతంలో పాట్నాలోని దనాపూర్లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో టీచర్గా పనిచేసేవాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న ఒక మైనర్ బాలిక అతనిపై పోక్సో చట్టం కింద దానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోక్సో చట్టం కింద పోలీసులు వెంటనే విపిన్ను అరెస్టు చేశారు అప్పటి నుండి అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.ఉన్న నిందితుడు విపిన్ కుమార్ బీపీఎస్సీ పరీక్ష రాసి విజయం సాధించాడు. ఒకటి నుండి ఐదు తరగతుల వరకు జనరల్ సబ్జెక్టులను బోధించేందుకు పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. దీంతో చేతులకు బేడీలతోనే పోలీసు కస్టడీలో బుద్ధ గయలోని మహాబోధి సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యాడు. తాత్కాలిక నియామక లేఖను అందుకున్నాడు.18 నెలల జైలు శిక్ష సమయంలో, అనేక సవాళ్లను మధ్య ఈ పరీక్షలో విజయవంతం కావడం విశేషంగా నిలిచింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన విపిన్ తన భవితవ్యం ఆందోళన వ్యక్తం చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నాడు. కోర్టు తనను దోషిగా గుర్తిస్తే, ఈ ఉద్యోగం రద్దవతుందని వాపోయాడు అయితే జైలులోని ఇతర ఖైదీలకు విద్యను అందించాల భావిస్తున్నానని, తద్వారా వారిలో విద్య వెలుగులను వ్యాప్తి చేయాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్తభిన్న వాదనలుపోక్సో నిందితుడు విపిన్ కుమార్ టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించి జాయినింగ్ లెటర్ అందుకోవడంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికను అత్యాచార చేశాడన్న ఆరోపణలపై జైలులో ఉన్నఅతనికి టీచర్ ఉద్యోగమా; అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అతన్ని ఎలా నమ్మాలి? అంటూ మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి శిక్షపడుతుందా? లేదంటే నిర్దోషిగా బైటపడి, తన ప్రభుత్వ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటాడా? అనేదే సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
World Poetry Day 2025 : పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే!
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) మనసుల్లోతుల్లో దాగివున్న భావాన్ని, అనుభవాన్ని, బాధను, లోతైన గాథల్ని వ్యక్తికరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత. హృదయాంతరాలలోని భావాలను అర్థవంతంగా, స్ఫూర్తివంతంగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే లభించే వరం. సాంస్కృతిక ,భాషా వ్యక్తీకరణ రూపాలలో ఒకటైన ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం ఆనవాయితీ. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని మొదలు పెట్టింది. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఆమోదించారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి, . సృజనాత్మకతను ప్రోత్సహించడం కవిత్వం అంతరించిపోతున్న భాషలతో సహా భాషల గొప్పతనాన్ని చాటుకోవడం, సమాజాలకు స్వరాన్ని అందివ్వడం దీని ఉద్దేశం. విభిన్న సంస్కృతుల నుండి కవితలను పంచుకోవడం ద్వారా ఇతర ప్రజా సమూహాల అనుభవాలు, దృక్కోణాలపై అంతర్దృష్టులను పొందుతారు, సానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తారు.ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా కొంతమంది మహిళా కవయిత్రుల కవితలను చూద్దాం. సమాజంలోని పురుషాహంకార ధోరణిని నిరసిస్తూ, ఆ భావజాలాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది స్త్రీవాద కవిత్వం. స్త్రీల భావాలను, బాధలను, స్త్రీలు మాత్రమే ప్రభావవంతంగా ఆవిష్కరింగలరు అనేదానికి అక్షర సత్యాలుగా అనేక కవితలు తెలుగు కవితా ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాయి. స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అన్ని రంగాల్లో సమాన హక్కులతో పాటు సంతానోత్పత్తి , మాతృత్వం మాటున దాగివున్న పురుషాధిక్యాన్నిచాటి చెప్పిందీ కవిత్వం.ఇందులో సావిత్రి, బందిపోట్లు కవిత మొదలు ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్. జయ, శిలాలోలిత, విమల ఇలా ఎంతోమంది తమ కవితలను ఆవిష్కరించారు.తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది, ‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.ఇంకా ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్న పాటిబండ్ల రజనీ కవితతో పాటు, ‘లేబర్ రూం* రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ. ఇది ప్రసవ వేదన కవితగా మారిన వైనం. ఇంకా పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్ స్టేట్మెంట్, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్గళ్స్ మొనోలాగ్, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాం, విమల సౌందర్యాత్మకహింస లాంటివి ఈ కోవలో ప్రముఖంగా ఉంటాయి.ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరో కవితమనసుకు అలసటతో చెమట పట్టినపుడోదేహంలోని నెత్తురు మరిగినపుడోగొంతు అక్షరాల సాయం తీసుకుంటుందివేదన కళగా మారిసృజనాత్మకతనులేపనంగా అద్దుకుంటుందిశిశిరాలు వెంటపడిఅదేపనిగా తరుముతున్నప్పుడువసంతం కోసం చేసే తపస్సుపెనవేసుకున్న శీతగాలి ఖాళీతనపు భావాగ్నిని అల్లుకున్నపుడుతుపాన్లతో చైతన్య పరిచేదిచందమామ మాగన్నుగా నిద్రిస్తున్నపుడుకళ్ళు మూసుకున్న ప్రపంచాన్నివేకువ గీతాలై నిద్రలేపేదిఎప్పటికీ కాలని, విడగొట్టినా చీలనిఅనంతం నిండా వ్యాపించినఅక్షయం కాని అక్షర సముదాయంఒకానొక మహావాక్యమైఅద్వితీయ కావ్యమై నిలుస్తుంది.– ర్యాలి ప్రసాద్ -
ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు) -
Avocado: పోషకాల పండు.. లాభాలు మెండు
విదేశీ పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడా ఇస్తున్నాయి. గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టìకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
సుమనోహరం వెడ్డింగ్ ట్రెండ్స్..!
పెళ్లిళ్ల సీజన్కు ముందు బుక్ మార్క్ చేసుకోదగిన అతిపెద్ద ఫ్యాషన్ ట్రెండ్స్ ఈ ఏడాది మనల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయం, ఆధునిక ధోరణులను కలబోసి మన ముందుకు తీసుకువచ్చాయి. వధువుల కోర్సెట్ చోళీలు, భారతీయ సంప్రదాయ నేత చీరలు, పలుచటి మేలి ముసుగులు, ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా కనిపించాయి. పెళ్ళిళ్లకు ముందే బుక్ మార్క్ చేసుకోదగిన పెళ్లికూతురుట్రెండ్స్లో ప్రధానంగా కనిపించిన జాబితాను చెక్ చేద్దాం..భారతీయ చేనేతక్లాసిక్ ఇండియన్ చేనేత పునరుజ్జీవనాన్ని మనం గమనించి తీరాలి. వివాహ వేడుకలకు కాంజీవరం, బనారసి, చికంకారి వంటి చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఈ కాలాతీత డిజైన్లు సంప్రదాయ రూపంలో ధరించినా లేదా ఆధునిక ట్విస్ట్తో మెరిపించినా, ఇవి మసకబారే సూచనలు కనిపించడం లేదన్నది నిజం.కోర్సెట్లు ఫ్యాషన్ రంగాన్ని ఆక్రమించాయి అని చెప్పవచ్చు. వీటిని సంప్రదాయ వివాహ వేడుకలకు తీసుకురావడం ఎలా అనే అంశంపై పెద్ద కసరత్తే జరిగింది. అందుకు పెళ్లికూతుళ్లు కూడా తమ వివాహ సమయంలో ఆధునికంగా కనిపించడానికి కోర్సెట్ చోళీలను ఎంచుకుంటున్నారు. దాంతో దిగ్గజ డిజైనర్లు తమ డిజైన్స్కు ఆధునికతను జోడిస్తున్నారు. సాంప్రదాయ పెళ్లి బ్లౌజ్లకు ఇవి ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. ఫిష్టైల్ లెహంగాతో కోర్సెట్ చోళీలు జతగా చేరి అద్భుతంగా కనిపిస్తున్నాయి. సంగీత్ నుంచి రిసెప్షన్ వరకు కోర్సెట్లు అంతటా రాజ్యమేలుతున్నాయి.లాంగ్ వెయిల్స్పాశ్చాత్య వివాహాల నుంచి వీటిని స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వధువులలో ట్రైల్ లేదా వెయిల్ ఉన్న లెహంగాలను ధరించే ధోరణి పెరుగుతోంది. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకునే వధువులకు ఈ లుక్ ఒక గొప్ప ఎంపిక. లాంగ్ ట్రైల్స్ లేదా వెయిల్స్ ఉన్న లెహంగాలు ప్రిన్సెస్ లుక్తో అందంగా కనిపిస్తాయి. (చదవండి: 'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!) -
Betting Apps Case: ఇన్ఫ్లూయన్సర్లు.. జర జాగ్రత్త..!
క్లాసులూ, స్నేహితులతో ఊసులు తప్ప వేరే విషయాలు తెలియని ఓ కళాశాల విద్యార్థి ఓవర్నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోతాడు.. గడప దాటడం ఎరుగని ఓ గృహిణి కిచెన్లో గరిటె తిప్పుతూ లక్షల సంఖ్యలో ఫాలోయర్లను కూడగట్టుకుంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన అవ్వ మొదలు పట్నం ముఖం చూడని తాత వరకూ.. ఎందరో స్టార్లు.. పుట్టుకొచ్చేస్తున్న కాలమిది. కారెవరూ సెలబ్రిటీ స్టేటస్కు అనర్హం అన్నట్లు.. నేమ్.., ఫేమ్తో పాటు ఇన్కమ్ అంతా ఓకే. కానీ వీరి పాపులారిటీని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయా వ్యాపారులే సోషల్ స్టార్స్కు చిక్కులు తెచ్చిపెడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోదాదాపు నాలుగు నెలల క్రితం ఔటర్ రింగ్రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లి మనీ హంట్ నిర్వహించిన బాలానగర్ నివాసి యాంకర్ చందు అలియాస్ భాను చందర్, అదే విధంగా నోట్లను కూకట్పల్లిలో నడిరోడ్డు మీద విసిరేసిన కూరపాటి వంశీ అనే ఇన్ఫ్లూయన్సర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నగర ఇన్ఫ్లూయన్సర్లలో లోపించిన చట్టపరమైన అవగాహనకు ఈ తరహా ఉదంతాలెన్నో అద్దం పడతాయి. ఇదొక్కటే కాదు గతంలో ఓ కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి నగరవ్యాప్తంగా 18వేల మందిని ముంచేసిన ఉదంతంలో ఆ కంపెనీని ప్రమోట్ చేసిన పాపం కూడా సోషల్ మీడియా స్టార్లకే చుట్టుకుంది. అడపాదడపా జరుగుతున్న ఇలాంటివి ఒకెత్తయితే తాజాగా గేమింగ్ యాప్స్కు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం సిటీ ఇన్ఫ్లూయన్సర్స్ కమ్యూనిటీని అప్రమత్తం చేస్తున్నాయి. స్టార్లందు సూపర్స్టార్లు వేరయా.. సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్ బుక్, బ్లాగ్స్, వ్లాగ్స్.. వగైరాల ద్వారా వేలు, లక్షల సంఖ్యలో ఫాలోయర్లను పొందుతున్నవారినే ఇన్ఫ్లూయన్సర్లుగా పేర్కొంటున్నారు. అలాంటి వారు నగరంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో 10 వేల నుంచి లక్ష మంది ఫాలోయర్ల లోపు ఉన్నవారిని మైక్రోఇన్ఫ్లూయన్సర్లుగా అలాగే లక్ష నుంచి 5లక్షల లోపు ఉన్నవారిని మిడ్–టైర్ ఇన్ఫ్లుయెన్సర్లు, 5లక్షల నుంచి 10లక్షల మంది ఉన్నవారిని మ్యాక్రో ఇన్ఫ్లూయన్సర్లు, 10లక్షలు ఆ పైన ఉంటే టాప్ క్రియేటర్స్గా పేర్కొంటారు. వీళ్లు మాత్రమే కాకుండా ప్రతి పోస్టుకూ లక్షల సంఖ్యలో స్పందన అందుకునే వారిని సెలబ్రిటీ ఇన్ఫ్లూయన్సర్లుగా పిలుస్తారు. సాధారణంగా సినిమా తారలు, క్రికెటర్లు.. ఈ విభాగంలోకి వస్తారు. అనుసరణ.. అనుకరణే ఆదాయంఈ ఇన్ఫ్లూయన్సర్లకు ఆదాయం వారిని అనుసరించే ఫాలోయర్ల సంఖ్యను బట్టఆధారపడి ఉంటుంది. మైక్రో కిందకి వచ్చేవారికి పోస్టుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకూ, అలాగే లిమిడ్ టైర్ విభాగంలో ఉన్నవారికి రూ.50వేల నుంచి రూ.2లక్షలు, మ్యాక్రో స్టార్స్కి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ, టాప్ క్రియేటర్స్కు రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకూ క్లయింట్స్ చెల్లిస్తున్నారు. ఇక సెలబ్రిటీ ఇన్ఫ్లూయన్సర్లకు ఆదాయం కొన్ని సార్లు రూ. కోట్లలో కూడా ఉంటుంది. సాధారణంగా ఫాలోయర్ల సంఖ్యను బట్టే పేమెంట్ ఉంటుంది. అయితే లైక్స్, కామెంట్స్, షేర్స్ కూడా కొన్ని సార్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ, టెక్నాలజీ.. రంగాలకు సంబంధించిన ప్రమోషన్లకు అధిక మొత్తాలు లభిస్తాయి. నగరంలో వేగంగాఇన్ఫ్లూయన్సర్ల సంఖ్యను పెంచుకోవడంలో నగరం దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో పేరొందిన ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్లు 761 మంది వరకూ ఉన్నట్లు మోదాష్ అనే ఆన్లైన్ సంస్థ అంచనా వేసింది. నగరం ఇటీవల ఫ్యాషన్, ఫుడ్, ఫిట్నెస్, టెక్నాలజీ హబ్గా మారుతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్స్ లోకల్ స్టార్స్తో ఒప్పందాలు కుదుర్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి నగరానికి చెందిన ఇన్ఫ్లూయన్సర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. వీరిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకోవాలంటే.. వారి ఇన్స్టా ఖాతాల్లోకి వెళ్లడం, తమ బ్రాండ్ గురించి క్లుప్తంగా చెప్పడం, ఎన్ని రోజులు, ఎలాంటి ప్రచారం కావాలి? తదితర వివరాలు మెసేజ్ చేస్తే.. సరిపోతుంది. ఆన్లైన్, చాట్స్ ద్వారానే కుదిరిపోయే డీల్స్ కోకొల్లలు. అందువల్లే చట్ట వ్యతిరేక, చట్ట పరిధిలో లేని గేమింగ్ యాప్స్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ.. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇదీ చదవండి:సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త ఇన్ఫ్లూయన్లర్లు, జర జాగ్రత్త..ఈ నేపథ్యంలో ఎడా పెడా ప్రమోషన్స్లో పాల్గొంటున్న ఇన్ఫ్లూయన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై.. తాము ప్రమోట్ చేస్తున్న బ్రాండ్స్ గురించి మరోసారి సమీక్షించుకోవాలని అడ్వర్టయిజింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాణిజ్య సంబంధిత ప్రచారాలకు సంబంధించి చట్ట పరమైన నియమ నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ కోవిదులు సూచిస్తున్నారు. -
'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!
ఒకకళ... కలకాలం మనుగడలో ఉండాలన్నా కళ కళకళలాడాలన్నా రాజపోషణ కావాలి. రాజ్యాలనేలే మహారాజులు లేని ఈ రోజులలో మనసున్న మహారాజులే కళను బతికించాలి.ఆభరణాలు, లోహపు వస్తువుల తయారీ వృత్తి సాధారణంగా మగవారికే పరిమితం. ఇటీవల చాలామంది మహిళలు ‘ఫలానా వృత్తిలో మహిళలు ఉండరు, అది మగవారి సామ్రాజ్యం’ అనే ‘హద్దు’లను చెరిపేస్తూ తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. అవార్డులతో గౌరవాలు పొందుతున్నారు. ఫిలిగ్రీ కళలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు అర్రోజు ధనలక్ష్మి. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో స్వదేశ్ చేతివృత్తుల సంగమ పురస్కారం కూడా ఆమెను వరించింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.భర్త నేర్పించాడు!ధనలక్ష్మి సొంతూరు కరీంనగర్ జిల్లా నర్సింగాపురం. తండ్రి తపాలా శాఖ ఉద్యోగి. టెన్త్ క్లాస్ తర్వాత చదువు మాన్పించి పెళ్లి చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులో అత్తగారింట్లో అడుగు పెట్టిన ధనలక్ష్మికి తన భర్త, మామగారు చేస్తున్న కళాత్మకమైన పని మీద ఆసక్తి కలిగింది. ఆమె ఆసక్తిని గమనించి పని నేర్పించారు. ఆమెకి పని త్వరగానే పట్టుపడింది. మూడేళ్ల సాధన తర్వాత ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఒక కుంకుమ భరిణె చేయగలిగారు ధనలక్ష్మి. ఆ తర్వాత రకరకాల కళాకృతుల తయారీ నేర్చుకున్నారు. ఫిలిగ్రీ కళకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఒక థీమ్తో ఏదైనా చేయాలనుకున్నారు. రెండు తబలాలు, డోలు, సన్నాయి, పన్నీరు బుడ్డీ, అత్తర్దాన్, కుంకుమ భరిణె, పసుపు పాత్ర, అక్షింతల గిన్నె ఇవన్నీ పెట్టడానికి ఒక పళ్లెం... ఇలా మ్యారేజ్ సెట్ తయారు చేశారామె. ఒకటిన్నర కేజీల వెండితో రెండు నెలలు శ్రమ పడితే ఇవన్నీ తయారయ్యాయి. ఆమె పనితనం నచ్చిన రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ జాతీయ స్థాయి అవార్డు ఎంపిక కోసం పంపింది. అంతకుముందే 2008లో రాష్ట్రస్థాయి పురస్కారం, 2010లో జాతీయ పురస్కారం అందుకున్నారు.మార్కెట్ బాగుంది!‘‘హస్త కళలకు ఆదరణ లేని రోజుల్లో మా వృత్తి పెద్దగా ఉపాధినివ్వలేదు. చాలామంది చదువుకుని ఉద్యోగాలకు వెళ్లారు. అలాంటి పరిస్థితిలో కూడా మా కుటుంబం ఈ కళను వదల్లేదు. ఇప్పుడు హస్తకళలకు మార్కెట్ బాగుంది. మెమెంటోలుగా పీకాక్ బొమ్మలు, గణేశ్, మ్యారేజ్ సెట్, పర్సులను ఎక్కువగా అడుగుతున్నారు. కొంతమంది తమ ఫొటో ఇచ్చి ఆ రూపాన్ని ఫిలిగ్రీ వర్క్లో చేయమని అడుగుతారు. సుమారు 200 గ్రాముల్లో తయారవుతుంది. మేకింగ్ చార్జ్ గ్రాముకు యాభై రూ΄ాయలు తీసుకుంటాం.ప్రధాని ప్రశంస!జీ 20 సదస్సు తర్వాత మా విశ్వకర్మకారుల సమస్యలను తెలియచేయడానికి ప్రధాని మోదీని కలిశాం. అప్పుడు ఆయన మా కళాఖండాలను చూశారు. అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాత్మకమైన వృత్తి ఇది. ఒక్కొక్క కుటుంబం ఒక్కో యూనివర్సిటీతో సమానం. కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టినా సరే, ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కోసం మా దగ్గరకు రావాల్సిందే. అందుకే మా పిల్లలిద్దరూ బీటెక్ చేసినా సరే వారికి కూడా ఫిలిగ్రీ వర్క్ నేర్పించాం. నాకు, మా వారికి ఈ కళలో నైపుణ్యం మాత్రమే తెలుసు. ఈ కళను విదేశాలకు విస్తరింపచేయడంలో మా పిల్లల చదువు ఉపయోగపడుతుంది. మా పిల్లలే కాదు వారి పిల్లలు కూడా ఇదే కళతో గుర్తింపు ΄÷ందాలని నా ఆకాంక్ష’’ అన్నారు అర్రోజు ధనలక్ష్మి.జీఐ ట్యాగ్ వచ్చింది:మెసపటోమియా నాగరకత కాలంలో విలసిల్లిన కళ. క్రీ.పూ మూడవ శతాబ్దం నుంచి మనదేశంలోనూ విరాజిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ ఈ కళకు కేంద్రం. కరీంనగర్ పట్టణంతోపాటు పరిసర గ్రామాలలో ఈ కళతో జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆధునికత వెల్లువలో ఈ కళ కొంతకాలం కళ తప్పింది కానీ ఇప్పుడు సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా పుంజుకుంటోంది. సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ క్లస్టర్కు 2007లో జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ వచ్చింది.భద్రమైన కళఫిలిగ్రీ... గొప్ప పనితనంతో కూడిన ఆభరణాల తయారీ నైపుణ్యం. ఫిలిగ్రీ డిజైన్లలో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తారు. వెండిలో ఆభరణాలతో΄ాటు కీ చైన్లు, ఆభరణాలు భద్రపరుచుకునే బాక్సులు, గిఫ్ట్ బాక్సులు, అలంకరణ వస్తువులు, కుంకుమ భరిణెలు, అత్తర్దాన్, పాన్దాన్, ట్రేలు, పూజ సామగ్రి, ఫ్లవర్ వేజ్లు, పాత్రలు, వాల్ ఫ్రేమ్లు, టేబుల్ టాప్ షో పీస్లు, జంతువులు, పక్షుల బొమ్మలు, దేవుని ప్రతిమలు చేస్తారు. (చదవండి: -
'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!
బిడ్డ ఎదుగుదలకు తోడ్పడే పోషకాలన్నీ కలిపి అమ్మచేతి గోరుముద్ద రూపంలో బుజ్జాయి బొజ్జలోకి వెళ్తాయి. అలాంటి అమ్మ చేతి ముద్దలో ఉండే ఆహారం రసాయనాలతో నిండితే.. భవిష్యత్తు తరం ఏమవుతుందోనన్న ఆలోచనే ఓ వినూత్న కార్యక్రమానికి పురుడు పోసింది. ఒకప్పటి విష రహిత దేశీ విత్తనాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో డీఆర్డీఓ విజయలక్ష్మి తమ కలెక్టర్ అభిలాష అభినవ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం నిర్మల్ కలెక్టరేట్లో మహిళా అధికారులు, మహిళా రైతులు, మహిళా సంఘాల సభ్యులు అందరూ కలిసి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.వాక్ ఫర్ దేశీ సీడ్...‘మన విత్తనం – మన భవిష్యత్తు‘ అన్న ట్యాగ్ లైన్తో ‘వాక్ ఫర్ దేశీ సీడ్‘ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాతన దేశీ విత్తనాలను సేకరించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం జిల్లా అధికారులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఇప్పటికీ సాగులో ఉన్న దేశీ విత్తనాలను సేకరించారు. వరి, పప్పు దినుసులతో పాటు కూరగాయలలోనూ అందుబాటులో ఉన్న దేశీ సీడ్ రకాలను తెప్పించారు. బహురూపి వంటి అరుదైన రకాలను సేకరించారు. జిల్లాలో ఆరువేల మంది సభ్యులుగా ఉన్న ‘మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ‘లో ఆధ్వర్యంలో వీటిని సాగు చేయించడం మరో ప్రత్యేకత. ముందుగా 20ఎకరాలలో 200 మంది మహిళ రైతులతో దేశీ విత్తనాలతో సాగు చేయించాలని నిర్ణయించారు. ఇలా సాగుచేసిన పంటలను సైతం తిరిగి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు చేస్తాయి. పెరటి తోటల పెంపకంపై ఆసక్తి గల వారికి సైతం దేశీ విత్తనాలు అందిస్తామని చెబుతున్నారు.మిట్టి దీదీ...ఎంతటి విత్తనమైనా మట్టి బాగుంటేనే బతికి బట్ట కడుతుంది. అందుకే ఈ మహిళా అధికారులు కేవలం దేశీ విత్తనాలనే కాకుండా.. మట్టిని సైతం పరీక్షించిన తర్వాతే సాగు చేయాలన్న మరో లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘భూసార పరీక్ష – నేలతల్లికి రక్ష‘ ట్యాగ్ లైన్ తో ‘మిట్టి దీదీ‘ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కలిగిన ఫార్మోసిస్ యంత్రంతో భూసార పరీక్షలను చేసి అప్పటికప్పుడే అక్కడ ఎలాంటి పంటలు పండిస్తే బాగుంటాయో చెప్పేస్తారు. ఇలా భూసార పరీక్షలు చేయడం కూడా మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘాలే చేయనుండటం విశేషం.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్దేశీ విత్తనాలు కాపాడుకోవాలని...ప్రస్తుత పరిస్థితులలో ఆర్గానిక్ ఆహారం పైన చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అధిక ధరలు ఉండటంతో ΄ాటు తక్కువ మొత్తంలో లభ్యమవుతుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో మహిళా రైతులను ్ర΄ోత్సహించడంతో΄ాటు మనవైన దేశీ విత్తనాలను ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ అభిలాష అభినవ్ గారి సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. – విజయలక్ష్మి, డీఆర్డీఓ, నిర్మల్ -
వయసు 60..టైలరింగ్తో పొట్టపోసుకునే మహిళ ఏకంగా ఎవరెస్టునే..!
ఆమె వయసు 60... ఊరు కేరళ. టైలరింగ్తో పొట్ట పోసుకునే సగటు స్త్రీ. కాని ఎవరెస్ట్ బేస్క్యాంప్కు ఎలాగైనా చేరాలని పట్టుదల. ట్రైనింగ్ లేదు... బృందాలతో కలవడం లేదు. కేవలం యూట్యూబ్ను గురువుగా పెట్టుకుంది. అడుగులో అడుగు వేస్తూ వయసును లెక్కచేయక గమ్యం చేరుకుంది.చిన్న మనుషులూ పెద్ద కలలు కనొచ్చు. వసంతి చెరువీట్టిల్ స్ఫూర్తి గాథ.‘అది ఆనందమో దుఃఖమో తెలియదు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, కేరళ సంప్రదాయ చీరలో నేను నిలుచుంటే రివ్వుమనే చల్లగాలిలో అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి‘ అంటుంది వసంతి చెరువీట్టిల్.సమున్నతంగా శ్వేత కిరీటాలతో నిలుచుని ఉండే హిమాలయాలను పలకరించడానికి కేరళలోని కన్నూరు నుంచి ఈమె బయలుదేరినప్పుడు తోడు ఎవరూ లేరు తనకు తాను తప్ప. భర్త చనిపోయాక ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి వారి జీవితానికి దారి చూపించాక ఈ ప్రపంచాన్ని చూడాలని చిన్న ఆశ కలిగింది వసంతికి. చేసే పని టైలరింగ్. ఆదాయం కొద్దిగా. కాని అందులోనే దాచి ఎంత వీలైతే అంత తిరిగి చూడాలనుకుంది. తన చుట్టూ ఉన్నది తనలాంటి వారే కాబట్టి ‘అమ్మో అంత ఖర్చా? మేము నీతో రాము’ అన్నారు. ‘వెళితే నువ్వొక్కదానివే వెళ్లు’ అన్నారు. ‘వెళ్లలేనా?’ అనుకుంది వసంతి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు. కాని వసంతి ఇద్దరు కొడుకులూ వెళ్లిరామ్మా అన్నారు. అలా ఆమె మొదట థాయ్ల్యాండ్ తిరిగి వచ్చింది ఒక్కత్తే. ఆ తర్వాత హిమాలయాలు కనీసం బేస్ క్యాంప్ అయినా చూడాలనుకుంది.యూట్యూబే ట్రెయినర్గా...ఎవరెస్ట్ అధిరోహించడంలో రెండు దశలు. ఒకటి బేస్ క్యాంప్కు చేరుకోవడం. రెండు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. ఎవరెస్ట్ శిఖరం పై చేరడం చాలా కష్టం కాబట్టి కనీసం బేస్ క్యాంప్ అయినా చేరాలనుకుంటారు. అయితే సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్క్యాంప్ వరకూ వెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. 7 నుంచి 9 రోజులు పడుతుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు ట్రెకింగ్ బూట్లతో నడవగలగడం ఇవన్నీ సాధన చేయాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వసంతి కేవలం యూట్యూబ్లో చూసి ఇవన్నీ నేర్చుకుంది. రోజూ వ్యాయామం చేసింది. నాలుగు గంటల పాటు వాకింగ్ చేసింది. ట్రెకింగ్ షూస్ వేసుకుని నడిచింది. హిమాలయాల్లో కమ్యూనికేషన్ ఇబ్బంది రాకుండా కాస్తో కూస్తో హిందీ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అందరికీ చెప్తే విస్తుపోయారు. చివరకు అభినందనలు తెలిపి సాగనంపారు.ప్రతికూలతలునేపాల్లోని లుల్కా ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి దశల వారీగా బేస్క్యాంప్ వెళ్లాలనుకుంది వసంతి. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆమె ఎక్కాల్సిన లుల్కా విమానం ఎగరలేదు. దాంతో చిక్కుబడిపోయింది. అప్పుడు ఒక జర్మన్ జంట లుల్కా నుంచి కాకుండా సుర్కె నుంచి వెళదామని సాయం చేశారు. ఫిబ్రవరి 15న సుర్కె నుంచి ఆమె ట్రెకింగ్ మొదలైంది. ఏమాత్రం అనువుగా లేని కాలిబాట దారుల్లో ఆమె ప్రతి ఐదు నిమిషాలకు దీర్ఘశ్వాస తీసుకుంటూ రోజుకు 7 గంటలు నడిచి విశ్రాంతి తీసుకుంటూ మొత్తం 9 రోజులు నడిచి చివరకు బేస్ క్యాంప్కు చేరుకోగలిగింది.నా సంప్రదాయం నా గౌరవంవసంతి తనతో పాటు కేరళ సంప్రదాయ చీర తెచ్చుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చేరాక దానిని కట్టుకుని ఫొటో దిగింది. తన సంప్రదాయ ఘనత చాటింది. వసంతిని ఇప్పుడు కేరళ మాత్రమే కాదు నెరవేరని ఆకాంక్షలు గల స్త్రీలందరూ అబ్బురంగా చూస్తున్నారు. (చదవండి: ఏడు పదుల వయసులో ఫిట్గా మోదీ..! ఆరోగ్య రహస్యం ఇదే..) -
175 ఆన్లైన్ కోర్సులు నాన్స్టాప్ లెర్నర్
పది విషయాలు నేర్చుకున్నప్పుడు కూడా... నేర్చుకోవడానికి మరో పది విషయాలు రెడీగా ఉంటాయి. ‘నేర్చుకోవడానికి నేను రెడీ’ అనుకుంటే మీరే విజేత. అలాంటి ఒక విజేత... బి. ప్రవల్లిక. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 175 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసి ‘ఔరా’ అనిపించింది...విశాఖ జిల్లా భీమిలిలోని ‘కస్తూర్బా గాంధీ విద్యాలయం’లో పదవ తరగతి చదువుతున్న బి. ప్రవల్లిక చదువులో ముందుండడమే కాకుండా పలు కోర్సులలో విశేష ప్రతిభ చూపుతూ ప్రశంసలు అందుకుంటోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన ప్రవల్లిక తండ్రి కోవిడ్ వల్ల చనిపోయారు. తల్లి ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది.ఆన్లైన్ కోర్సుల హవా...గతంలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పని చేసిన బి.శ్రీనివాసరావు ఇక్కడి విద్యార్థినులు ఆధునిక కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇన్ఫోసిస్ వారి సహకారాన్ని తీసుకున్నారు. కోర్సుల కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా కోర్సులను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.ఎంపిక చేసుకున్న కోర్సులకు సంబంధించిన సమాచారం, సూచనలు అందిస్తారు. ఆ తరువాత ఆన్ లైన్ లో నిర్వహించే పరీక్షల్లో పాల్గొనాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్, డ్రోన్ ... మొదలైన వాటితోపాటు మొత్తం 175 కోర్సులు పూర్తి చేసింది ప్రవల్లిక. కోర్సును బట్టి కొన్ని గంటలు లేదా ఒకటి, రెండు రోజుల్లో నేర్చుకుని పరీక్షల్లో పాల్గొంటూ మంచి మార్కులు పొదుతూ సర్టిఫికెట్లు సాధించింది.నాడు... నేడుగత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘నాడు–నేడు’ పనుల ద్వారా ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల ఆన్ లైన్ కోర్సుల అభ్యసనకు వీలు కలిగింది. రూ. 51 లక్షలతో అదనపు గదులు, విద్యార్థినులు ప్రశాంతంగా చదువుకోవడానికి పెద్ద షెడ్డు, అవసరమైన ఇతర సదుపాయాల కల్పన జరిగింది. ‘ఆసక్తి ఉన్నచోటే ప్రతిభ ఉంటుంది. ప్రవల్లికకు కొత్త విషయాలపై ఎంతో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే ఆమెను 175 కోర్సులు పూర్తి చేసేలా చేసింది. భవిష్యత్తులో తన చదువుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. 175 కోర్సులు పూర్తి చేయడం అనేది ఆమెకే కాదు విద్యాలయానికి గర్వకారణం’ అంటుంది కేజీబీవీ ప్రిన్సిపాల్ గంగా కుమారి.టార్గెట్... ఐఏఎస్ఎంతోమంది ఐఏఎస్ అధికారుల విజయగాథలను క్లాస్రూమ్లో వింటున్నప్పుడు ప్రవల్లిక మదిలో ‘ఐఏఎస్’ కలకు బీజం పడింది. ‘లక్ష్యసాధనకు మన ఆర్థిక స్థితిగతులతో పనిలేదు. కడు పేదరికంలో పుట్టిన వారు కూడా ఎంతో కష్టపడి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. మనకు కావాల్సింది సాధించాలనే పట్టుదల మాత్రమే’... ఇలాంటి మాటలు ఎన్నో ప్రవల్లికకు స్ఫూర్తినిచ్చి ‘ఐఏఎస్’ లక్ష్యానికి బలాన్ని ఇచ్చాయి. – సింగారెడ్డి రమణప్రసాద్, సాక్షి, భీమిలి -
దేవాలయాల్లో రావి, వేపచెట్టు ఎందుకు ఉంటాయి!
మన సంప్రదాయాలలో ప్రతి ఒకటి అద్భుతమే,ప్రతి ఒక్కటీ జీవనవిధానానికి సంబంధించినవే. అందుకే చాలా ఆలయాలలో రావిచెట్టు, వేపచెట్టు ఉంటాయి, ఎక్కువ చోట్ల రావి, వేప చెట్లు కలిపి ఉంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగానూ, వేపచెట్టును లక్ష్మీస్వరూపంగానూ భావించి పెళ్లిళ్లు చేయిస్తుంటారు. అలా పెళ్లి చేసిన జమిలి వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగి సంసారం సజావుగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆ రెండు వృక్షాల మీదినుంచి వచ్చే గాలికి శారీరక, మానసిక రుగ్మతలను పారద్రోలే శక్తి ఉందని ఆధునిక పరిశోధనలు సైతం నిరూపిస్తున్నాయి. జోతిష శాస్త్రం ప్రకారం శనిదోషం పోవాలంటే ప్రతిరోజు రావిచెట్టు నీడన నిలబడటం, రావిచెట్టుకి నమస్కారం చెయ్యడం, రావిచెట్టుకు ప్రదక్షిణ చేయడం, శనివారం నాడు మాత్రం రావిచెట్టుని హత్తుకోవడం మంచిదని, ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలుగుతుందట. రావిచెట్టు (Peepal Tree) నీడన కొంచం సేపు కూర్చుంటే రక్తపోటు సక్రమ రీతిలో ఉంటుందని, రావిచెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుందనీ చెబుతారు వైద్యులు. అదేవిధంగా వేపచెట్టుకు కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు (Neem Tree) గాలికి అన్నో రోగాలను కలిగించే క్రిములు చచ్చిపోతాయి, అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం. అందుకే జాతర్ల సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు. చదవండి: బౌద్ద వాణి.. మీకూ, నాకూ అదే తేడా ! -
కణ,జన్యు చికిత్సలు మరింత సులభం!
సాక్షి, హైదరాబాద్: టీకా తయారీలో పేరొందిన హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ మరో కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి జన్యు, కణాధారిత చికిత్సలకు ఉపయోగపడే వ్యవస్థలను ప్రారంభించింది. హైదరాబాద్ శివార్లలోని జినోమ్ వ్యాలీలో సుమారు యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ద్వారా కేన్సర్సహా అరుదైన వ్యాధులు కొన్నింటికి చికిత్సను అభివృద్ధి చేయడం వేగవంతం కానుంది. కేన్సర్ వంటి వ్యాధులకు ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త రకం చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన శరీరంలోని రోగ నిరోధక కణాలను చైతన్యపరచడం ద్వారా అవి కేన్సర్ కణాలను మట్టుబెట్టేలా చేసే కార్-టీ చికిత్స వీటిల్లో ఒకటి. అలాగే కొన్ని వ్యాధులకు జన్యు ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ.. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే లభించే ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలోనే తాము కణ, జన్యు ఆధారిత చికిత్సలను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, శరీర కణాలు ఎక్కువ కాలం పాటు మనగలిగే చేయడం, మన లక్ష్యాలకు అనుగుణంగా జన్యువులు తగిన ప్రొటీన్లు ఉత్పత్తి చేసేలా చేయడం ఈ కొత్త వ్యవస్థ నిర్వహించే పనులు. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని వ్యాధుల చికిత్సకు అవసరమైన ప్రత్యేకమైన వైరస్లను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విదేశాల్లో ఎంతో ఖర్చుపెట్టి చేయించుకోవాల్సిన కేన్సర్ చికిత్సలకు మనకు చవకయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హీమోఫీలియా వంటి జన్యుపరమైన వ్యాధులకూ చికిత్స లభించడం మొదలవుతుంది. ‘‘జన్యు, కణ చికిత్సలు చాలా సంక్లిష్టమైనవి. అత్యాధునిక పద్ధతులు, టెక్నాలజీల వాడకం ఉంటుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ.. మన అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లోమార్పులు చేయడం కుదరదు. అయితే వైరస్లతో టీకాలు తయారు చేయడంలో భారత్ బయోటెక్ ఇప్పటికే ఎంతో అనుభవం సాధించింది. నైపుణ్యాలను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత అరుదైన, కేన్సర్ వంటి సంక్లిష్టమైన వ్యాధులపై పోరును ముందుకు తీసుకెళ్లగలిగేలా, క్లినికల్ ట్రయల్స్కు ఉపయోగపడే హ్యూమన్ గ్రేడ్ వెక్టార్లను తయారు చేసేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచెస్ ఎల్లా మాట్లాడుతూ.. ‘‘ఏఏవీ, లెంటివైరస్, అడినోవైరస్ వంటి వైరల్ వెక్టార్లు కణ, జన్యు చికిత్సల్లో చాలా కీలకపాత్ర పోషిస్తాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలో వీటిని అత్యధిక నాణ్యతతో అభివృద్ధి చేయగలం. తద్వారా రక్త కేన్సర్లు, అవయవాల్లోని కేన్సర్ల చికిత్సకు అవసరమైన వెక్టార్లను తయారు చేయగలం’’ అని తెలిపారు. -
74 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటానికి కారణం అదే..!: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అనూహ్యంగా ఉంటాయో.. అలాగే అత్యంత విభిన్నంగా ఉండే ఆయన వ్యవహారతీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అయితే మోదీ ఏడుపదుల వయసులోనూ అంతే ఫిట్గా, చలాకీగా ఉంటారు. ఎక్కడ అలసటను దరిచేరనీయరు. ఏ కార్యక్రమంలోనైన ముఖంపై రచిరునవ్వు, ఉత్సాహం చెరగనివ్వరు. మోదీ ఈ ఏజ్లో కూడా యువకుల మాదిరి నూతనోత్సహాంతో పనులు చక్కబెట్టుకుంటారు. అలా చలాకీగా ఉండేందుకు తాను పాటించే ఆ దినచర్యేనంటూ తన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.24 గంటల్లో ఒక్కసారే భోజనం..అమెరికాకు చెందిన పాడ్కాస్టర్ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన సంభాషణలో మోదీ తన ఉపవాస షెడ్యూల్ గురించి, జీవనశైలి గురించి వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమైన దీపావళి నుంచి 4 నెలలు పాటు భారత వైదిక ఆచారమైన చాతుర్మాస్ దీక్షను అవలంభిస్తారట. ఆ రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఏమైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మోదీ. సరిగ్గా అది వర్షాకాలం ఆ టైంలో మనిషి జీర్ణక్రియ ఎలా మందగిస్తుందో వివరించారు. అంతేకాదు తాను పాటించే నవరాత్రి ఉపవాస దీక్ష గురించి కూడా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ పూర్తిగా ఆహారం తీసుకోకుండా తొమ్మిది రోజులు కేవలం వేడినీరు మాత్రమే తీసుకుంటానని అన్నారు. అయితే వేడినీరు ఎల్లప్పుడూ తన దినచర్యలో ఒక భాగమేనని చెప్పారు. అది తనకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే మోదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి ఉపవాసాన్ని కూడా అనుసరిస్తానన్నారు. అంతేగాదు తన దృష్టిలో ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ-క్రమశిక్షణగా పేర్కొన్నారు. ఇది భక్తితో కూడిన దినచర్య. నెమ్మదించేలా చేయదు. మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉపవాసం శక్తి..ఉపవాసం శరీరాన్ని బలహీనపరస్తుందనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తూ..మనస్సు, ఆత్మ రెండింటిని రీచార్జ్ చేసుకునే ఓ గొప్ప మార్గంగా అభివర్ణించారు. ఆ టైంలో వాసన, స్పర్శ, రుచి వంటి జ్ఞానేంద్రియాలు సున్నితంగా మారడాన్ని గమనించొచ్చన్నారు. ఉపవాసం అంటే భోజనం దాటవేయడం మాత్రమే కాదు. శరీరాన్ని తిరిగి సమతుల్యం చేసుకోవడం, సంకల్ప శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత సామరస్యాన్ని సాధించడం అని ఆయన వివరించారు. (చదవండి: Coconut Water Vs Sugarcane Juice: భగభగమండే ఈ ఎండలకు ఏ పానీయం మేలు అంటే..?) -
కెపాసిటీ ఉన్న వారికి మధ్యంతర భరణం ఎందుకు : ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
భార్యాభర్తల విభేదాలు, మధ్యంతర భరణం విషయంలోఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామర్థ్యం ఉన్న మహిళలు మధ్యంతర భరణం కోరకూడదంటూ భర్త నుండి తాత్కాలిక భరణం నిరాకరించిన చర్చకు తావిచ్చింది. సంపాదనా సామర్థ్యం ఉన్న అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుండి మధ్యంతర భరణం కోరకూడదని, పనిలేకుండా ఉండటానికి చట్టం ప్రోత్సహించదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ నిరుద్యోగిగా ఉన్న ఒక మహిళకు మధ్యంతర భరణం తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 [ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 (BNSS) సెక్షన్ 528] కింద మధ్యంతర భరణాన్ని నిరాకరించిన కుటుంబ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను జస్టిస్ చంద్ర ధరి సింగ్ తోసిపుచ్చారు.చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త మార్చి 19న జస్టిస్ చంద్ర ధరి సింగ్ మాట్లాడుతూ, CrPCలోని సెక్షన్ 125 (భార్యలు, పిల్లలు మరియు తల్లిదండ్రుల భరణం కోసం ఆర్డర్) జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి భార్యలు, పిల్లలు ,తల్లిదండ్రులకు రక్షణ కల్పించడానికి చట్టం ఉంది కానీ, ఈ పేరుతో వారు పనీ పాటా లేకుండా ఉండడాన్ని కోర్టు ఆమోదించదన్నారు. బాగా చదువుకున్న భార్య, చక్కటి ఉద్యోగంలో ఉన్న భర్త నుండి భరణం పొందడానికి మాత్రమే ఖాళీగా ఉండకూడదన్నారాయన. అంతేకాదు తన చదువుకు తగిన ఉద్యోగాన్ని వెదుక్కోవాలని పిటిషనర్కు సూచించింది. ప్రాథమిక అవసరాలకోసం భర్తలపై పూర్తిగా ఆధారడే, ఇతర చదువురాని మహిళల మాదిరిగా ఉండకూదని హితవు పలికింది.కేసు నేపథ్యంఈ కేసులోని జంట 2019 డిసెంబర్ 11 వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట త్వరలోనే విదేశాలకు మకాం మార్చారు. అయితే, వైవాహిక విభేదాలు కారణంగా రెండేళ్లకు (ఫిబ్రవరి 20, 2021) ఇండియాకు తిరిగి వచ్చేసింది.భర్త తనను క్రూరంగా హింసించాడని, జీవిత భాగస్వామి వీసా చేశాడని ఆరోపించింది. ఇంటికి తిరిగి రావడానికి తన నగలను అమ్మమని బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. తదనంతరం, ఆమె CrPC సెక్షన్ 125 కింద తాత్కాలిక ఉపశమనం కోసం దరఖాస్తుతో పాటు భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కుటుంబ న్యాయస్థానం మధ్యంతర భరణం పిటిషన్ను 2022 నవంబరులో తిరస్కరించింది.దీనిపై దాఖలైన రివిజన్ పిటిషన్ను దాఖలు చేసింది. చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!పెళ్లికి ముందు కూడా తాను ఆర్థికంగా స్వతంత్రంగా లేనదిభార్య వాదన. భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి నిరుద్యోగిగా ఉన్నాననీ, భర్త నెలకు రూ. సుమారు 27.22 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి నెలకు రూ.3.25 లక్షలు భరణం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే తన భార్య ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ వ్యాపారంలో మాస్టర్స్ పట్టా పొందింది. గతంలో టాప్ కంపెనీలో పనిచేసింది. సొంత కృత్రిమ ఆభరణాల వ్యాపారాన్ని నడిపింది. పైగా ప్రస్తుతం తాను ఉద్యోగం లేదు. కనుక అంత భరణం చెల్లించ లేనని భర్త వాదన -
సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త
భారత సంతతికి చెందిన నాసా వోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ రోదసి నుంచి భూమిమీద సురక్షితంగా అడుగు పెట్టారు. తొమ్మిది నెలల తీవ్ర ఉత్కంఠ తరువాత వీరు భూమిపై అడుగు పెట్టిన క్షణాలను యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా ఒక అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ (Neil deGrasse Tyson) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని వెనుక మర్మమేమిటి? తెలుసు కుందాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్మీద వెళ్లి తొమ్మినెలలపాటు చిక్కుకున్న సునీతా విలియమ్స్ పట్ల తనకేమీ సానుభూతి లేదంటూ టైసన్ వ్యాఖ్యానించారు. అయితే వారిని భూమి మీదికి తీసుకురావడంలో ఆలస్యం గురించి,వారి భద్రత కోసం తాను ఆందోళన చెందానని అన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన జీరో గ్రావిటీనుంచి భూమి గురుత్వాకర్షణకనుగుణంగా సర్దుబాటు చేసుకునే సమయమని సునీత, బుచ్ విల్మోర్ త్వరగా కోలుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇపుడు వాళ్లకి గ్లాసు ఇస్తే పట్టుకోలే రు (ఎందుకంటే కండరాలు బలహీనంగా ఉంటాయి) కాబట్టి, తొలుత తేలికపాటి, ప్లాస్టిక్ కప్పులు వాడాలని సూచించారు.అయితే వారి భద్రత గురించి లేదా వారు ఇంటికి తిరిగి రావడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని వివరించారు.ఎందుకంటే ప్రొఫెషనల్ వ్యోమగాములు, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా దృఢంగా ఉంటారు అంటూ పరోక్షంగా వారిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు ఎంపికయ్యారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎనిమిది రోజులైనా, తొమ్మిది నెలలైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే తనకు వారి పట్ల వ్యక్తిగతంగా సానుభూతి లేదని ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యాయామానికి చాలా మార్గాలుంటాయి కాబట్టి వారి కండరాలు, చలనంపై కూడా ఆందోళన అవసరం లేదన్నారు. జీరో గ్రావిటీలో పైకి, కిందికీ తేలుతూ ఉంటారు. ఇపుడు దిశానిర్దేశం చేసే సామర్థ్యం దెబ్బతింటుంది అదే తేడా అన్నారు టైసన్. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలోకి వెళ్ళలేదు... కానీ వ్యోమగాములతో మాట్లాడాను, నా స్నేహితులు రోదసిలో చాలా సమయం గడిపారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటామని వారు చెప్పారన్నారు టైసన్. అంతేకాదు సునీత, విల్మోర్ మానసిక స్థితి ప్రభావిత మవుతుందనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. శారీరకంగా, మానసికంగా బలమైన వారిని మాత్రమే వ్యోమగాములుగా నాసా ఎంచుకుంటుందని గుర్తు చేశారు.చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది! -
ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!
ఐడియా ఉండాలే గానీ, వేస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే ఎందుకూ పనికి రాదు అనుకున్న వాటి ద్వారా కోట్లకు పడగలెత్తవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే. ఇక అది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అయితే ఇక తిరుగే లేదు.జపాన్లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాడు. ఆ తరువాత వాటిని రెంట్కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిది కోట్లు సంపాదించాడు.‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం..హయతో కవాముర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాట. 200 పాతబడిన ఎవరూ పట్టించుకోని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు హయాటో కళ్ల బడ్డాయి. అంతే రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి, వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.చిన్నప్పటి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా, తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించే వాడు. చదువు తరువాత జాబ్లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్మెంట్తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వైదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యంమీద ఆధారపడి ఉండవు, పై అధికారి మన్నలి ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధార పడి ఉంటుందని కవామురాకి అర్థమైంది రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో, అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మెర్రీహోమ్ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో, వేలంలో 1.7 మిలియన్ యెన్ (10.1 లక్షలు) కు ఒక ఫ్లాట్ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం. రూ. 2 లక్షలు. రెండేళ్ల తరువాత దీన్ని రూ. 25.6 లక్షలకు విక్రయించాడు. “రాత్రికి రాత్రే ధనవంతుడవుతానని అస్సలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్లో లాభాలు రావాలంటే అపెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక , జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తోంది. -
కొబ్బరి నీరు వర్సెస్ చెరకు రసం: ఈ సమ్మర్లో ఏ పానీయం బెస్ట్..!
అప్పుడే మే నెల రాకుండానే ఎండలు భగభగ మంటున్నాయి. ఉక్కపోతలతో తారెత్తిస్తోంది. ఈ ఎండలకు ఏం తినాలనిపించదు. ఒక్కటే దాహం.. దాహం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీంతో అందరు మజ్జిగ, నిమ్మకాయ పంచదార నీళ్లు, పండ్లపై ఆధారపడుతుంటారు. అంతేగాదు ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ హైడ్రేషన్కి గురవ్వుతారు. అందుకే అంతా ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి అందించే సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిపై ఆధారపడుతుంటారు. ఈ రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? అందరూ తీసుకోవచ్చా అంటే..చెరకు రసంఇది అద్భుతమైన వేసవి పానీయం. తక్షణ శక్తిని అందించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది సహజంగా చక్కెరలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రభావవంతమైన శక్తి వనరుగా ఉంటుంది.శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి అందివ్వడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో మంచి హెల్ప్ అవుతుందిచెరకురసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చెరకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయిఆమ్లత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిదీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎవరు తీసుకోవాలంటే..?బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెరుకు రసాన్ని మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. చెరకు రసంలో అధిక స్థాయిలో సహజ చక్కెర ఉంటుందిఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.దీనిలో ఉండే అధిక చక్కెరలు, కేలరీల కంటెంట్ కారణంగా పరిమితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.కొబ్బరి నీరుదీన్ని ప్రకృతి స్పోర్ట్స్ డ్రింక్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.చెరకు రసంలా కాకుండా, కొబ్బరి నీళ్ళల్లో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు నిర్వహణకు అనువైనదిగా చెబుతుంటారు. జీర్ణక్రియకు సహాయపడుతుందివిషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందిపేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందిఅదనపు నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.రెండింటిలో ఏది బెటర్ అంటే..కొబ్బరి నీళ్ళలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల సోడియం అసమతుల్యతకు దారితీసే ప్రమదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. చెరకు రసం, కొబ్బరి నీరు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. ప్రతిది వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తికోసం అయితే చెరకు రసం బెస్ట్ ఆప్షన్. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీరు మంచిది. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్(Hydration)గా ఉండేలా చూసుకోండి. ఈ రిఫ్రెష్ పానీయాల ప్రయోజనాలను పొందేలా సరైన పద్ధతిలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!) -
చంటి పిల్లలతో జాగ్రత్త : నాటు వైద్యంతో ప్రమాదం!
వేసవి కాలం ప్రారంభమైతే చాలు చికెన్ ఫాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటి సమస్య పిల్లల్లో అధికంగా కనిపిస్తాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఈ సమస్యలతో చిన్నపిల్లలు బాధపడుతున్నారు. చాలా మంది తమ పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకువస్తుంటే.. కొంతమంది పూర్వకాలం పద్ధతుల్లో నాటు వైద్యం చేయిస్తున్నారు. అన్ని వయసుల వారికి ఈ వ్యాధులు సోకే అవకాశం ఉన్నా చిన్నారులకు త్వరగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా బిళ్లలు, నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ముందు జాగ్రత్తతోనే ఈ ప్రమాదకర అంటువ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, 15 ఏళ్లలోపు బాలబాలికలపై మరింత శ్రద్ధ వహించాలంటున్నారు. జాగ్రత్త వహించాలి రామచంద్రపురం నియోజకవర్గంలోని ఐదేళ్లలోపు చిన్నారులు కాజులూరు మండలంలో 3887 మంది, కె.గంగవరం మండలంలో 4922 మంది, రామచంద్రపురం మండలంలో 3890 మంది మొత్తం 12,699 మంది చిన్నారులు ఉన్నారు. ఈ వేసవిలో వారిపట్ల మరింత శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఈ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా వ్యాధి సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడంతో ఆహారం సరిగ్గా తీసుకోలేక బాగా నీరసించిపోతారు. చర్మంపై నీటి పొక్కులు, దురదలు వంటి లక్షణాలు వారం నుంచి పదిహేను రోజులకు పైగా బాధిస్తాయి. తొలుత జలుబుతో ప్రారంభమయ్యే ఈ వ్యాధులు క్రమంగా వాటి ప్రభావం చూపుతాయి. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి తక్షణం వైద్యులను సంప్రదించాలి. నాటు వైద్యం వైపు వెళ్లరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా, వేగంగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. ఆటలమ్మ... జాగ్రత్తలు సాధారణంగా ఈ వ్యాధి వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆటలమ్మ అంటువ్యాధి కావడం వల్ల వ్యాధి సోకిన వారిని మిగిలిన వారికి దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన పిల్లలను పాఠశాలకు పంపకూడదు. ప్రతి రోజూ స్నానం చేయవచ్చు. జ్వరం ఉంటే వేడి నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. దురద రాకుండా పరిశుభ్రత పాటించాలి. చిన్నారులకు చేతి గోళ్లు తీసివేయడం మంచిది. మంచి పౌష్టికాహారం అందించాలి. ఆటలమ్మ వచ్చిన వారు కోరినవన్నీ ఇవ్వాలన్న అపోహతో అన్ని రకాల తినుబండారాలను ఇవ్వడం మంచిది కాదు. తేలికగా జీర్ణమయ్యే మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. గవదబిళ్లలు... జాగ్రత్తలు గవదబిళ్లల వ్యాధిలో తీవ్రంగా గొంతునొప్పి ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంలో ద్రవాల శాతం తగ్గుతుంది. కాబట్టి ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం మంచిది. నాటువైద్యం ప్రమాదకరంచికెన్పాక్స్, గవద బిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వైద్యులను సంప్రదించాలి. చాలామంది మూఢనమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వైద్యుని సలహా తీసుకుని అవసరమైన మందులకు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాధి ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గర్భిణులపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది. నాటువైద్యాన్ని ఆశ్రయిస్తే ప్రమాదానికి దారి తీస్తుంది. వైద్యులను సంప్రదించాలి అటలమ్మ, గవద బిళ్లలు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రస్తుతం చిన్న పిల్లలు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులు వాడాలి. – ఎన్.ప్రశాంతి, డివిజనల్ వైద్యాధికారి, రామచంద్రపురం -
'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!
పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు కనువిందు చేస్తున్నాయి. హాబీగా చేపట్టిన బోన్సాయ్ మొక్కల పెంపకం సిరులు కురిపిస్తోంది. ఎడారికి అందాలు అద్దే అడీనియం మొక్కలకు మండలంలోని వెలివోలు గ్రామం చిరునామాగా మారింది. ఈ కుగ్రామం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు అడీనియం మొక్కలు సరఫరా అవుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణజిల్లా వెలివోలు గ్రామానికి చెందిన కుంభా సాంబ శివరావు ప్రైవేటు స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడగా పనిచేసేవారు. 2020లో తన హాబీ మేరకు తెలిసిన వారి దగ్గర నుంచి 12 రకాల అడీనియం మొక్కలను తెచ్చి తన ఇంటి పెరటిలో నాటారు. కరోనా సంక్షోభం కారణంగా ఓ పక్క స్కూల్స్ మూతపడటం, మరోపక్క చేసేందుకు ఎక్కడా పని దొరక్కపోవటంతో తన దృష్టిని ఎడారి మొక్కల పెంపకంపై కేంద్రీకరించారు. తన పెరటిలో ఉన్న 12 అడీనియం మొక్కల నుంచి విత్తనాలను సేకరించి, వాటి నుంచి మొక్కలను పునరుత్పత్తి చేయడం ప్రారంభించారు. రెండు పద్ధతుల్లో మొక్కల పునరుత్పత్తి తన పెరటిలో ఉన్న అడీనియం మొక్కలతోపాటు థాయ్ల్యాండ్, కేరళ, తమిళనాడు నుంచి మరికొన్ని రకాల మొక్కలను సాంబశివరావు దిగుమతి చేసుకున్నారు. వాటి ద్వారా అరుదైన అడీనియం రకాలను సృష్టించడం ప్రారంభించారు. తన ఇంటి పెరట్లో 12 మొక్కలతో ప్రారంభమైన నర్సరీ నేడు 75 సెంట్ల స్థలంలో సుమారు 10 వేల అడీనియం మొక్కలతో విరాజిల్లుతోంది. ఇక్కడ మొక్కలను రెండు రకాలుగా పునరుత్పత్తి చేస్తున్నారు. అంటుకట్టు పద్ధతిలో ఇప్పటి వరకూ 100 రంగులకు పైగా పూలు పూసే మొక్కలను ఉత్పత్తి చేశారు. రెండో పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా మరో 200 రకాల మొక్కలను సృష్టించినట్లు సాంబశివరావు తెలిపారు. 5 వేల మొక్కల విక్రయం సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్ల వయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్ఫామ్, రూట్ ట్రెయిన్ప్లాంట్, అనకొండ వంటివి ఉన్నాయి. నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టా్రగామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు. మక్కువే పెట్టుబడి కరోనా తరువాత ఉద్యోగం లేక పనిదొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొక్కల పెంపకంపై ఉన్న నా మక్కువను అడీనియం వెలల మొక్కల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టా. 12 మొక్కలతో ప్రారంభించిన నర్సరీ 10 వేల మొక్కలకు విస్తరిం చింది. మారుమూల గ్రామమైన వెలివోలు నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు మొక్కలు సరఫరా చేస్తున్నా. ఇష్టమైన అలవాట్లను వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే తప్పక విజయం సాధిస్తామని నా నమ్మకం. –కుంభా సాంబశివరావు, నర్సరీ యజమాని, వెలివోలు (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
సివిల్స్లో సక్సస్ కాలేదు..కానీ ఇవాళ ఓ కంపెనీ సీఈవో..!
ఒక్కోసారి మనం వెళ్లేదారిలో గమ్యం కానరాకపోవచ్చు. సక్సస్ అంత తేలిగ్గా రాకపోవచ్చు. లేదా మనం ఎంపిక చేసుకున్నదాంట్లో సక్సెస్ రాకపోవచ్చు అయినంత మాత్రాన ఓడిపోయినట్లు, అసమర్థులు కాదు. ఇంకోచోట గెలుపుని అందుకోవచ్చు. అది మనం ధైర్యంగా తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. ఆ దిశగా ఫెయిల్యూర్స్ వైపు చూడకుండా వెళ్తే..సక్సస్ కచ్చితంగా మన కాళ్ల వద్దుకు వచ్చి తీరుతుందని చేసి చూపించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన స్ఫూర్తిదాయకమైన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు.అతడే చాయ్ సుత్తా బార్ సహ వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే. సోషల్ మీడియా పోస్ట్లో యూపిఎస్సీ కల చెదరిపోవడంతో తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తన స్నేహితుడితో కలిసి తీసుకున్న ఆ నిర్ణయం తన లైఫ్నే ఛేంజ్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఒక్కచోట విజయం అందుకోలేదని అక్కడే నిరీక్షించటం కంటే మరో చోట ప్రయత్నించి చూస్తే.. సక్సెస్ తథ్యం అంటున్నాడు. తాను యూపీఎస్సీకి ప్రిపేరవుతున్నప్పుడూ..వరుసగా వైఫల్యాలు పకరిస్తూనే ఉన్నాయి. ఇక రాసే ఛాన్స్ అయిపోయింది. ఇంకో పక్క జీవితంలో ఏం సాధించలేకపోయానన్న ఆత్మనూన్యత నిరాస నిస్ప్రుహలతో సతమతమవుతున్న తరుణంలో స్నేహితుడితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచన తెరతీశాడు. ఆ నిర్ణయం కరెక్టో కాదో కూడా తెలియదు. కానీ ఏదో నమ్మకం, గెలవాలన్న పట్టుదల అంతే..ఆ కసితోనే చిన్ని టీ స్టార్టప్తో వచ్చాను. మట్టికప్పుల్లో టీ సర్వ్ చేయాలన్న విన్నూత్న ఆలోచనే తన స్టార్టప్ని విస్తరించేలా చేసింది. 300 కి పైగా నగరాల్లో 500కి పైగా టీ రిటైల్ చైన్గా విస్తరించింది. అదోకా బ్రాండ్లా తన చాయ్ సుత్తా బార్ స్టార్టప్ని తీసుకొచ్చాడు. ఇలా తన టీస్టాల్ పేరు వెరైటీగా ఉండటం కూడా ప్రజాదరణకు కారణమైంది. ఇండోర్కు చెందిన ఈ చాయ్ సుత్తా బార్ (CSB) అతిపెద్ద టీస్టాల్ విక్రేతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అలా తన బ్రాంచ్లన్నింటికి హెడ్గా సహా వ్యవస్థాపకుడిగా మారాడు. "తాను చదువులో బ్యాక్బెంచర్ని. చిన్నప్పటి నుంచి ఎలాంటి అవార్డులు, సర్టిఫికేట్లు పొందలేదు. కానీ ఈరోజు తన చాయ్ సుత్తా బార్ (CSB) క్యాబిన్ ంనిండా అవార్డులు, సర్టిఫికేట్లతో నిండిపోయింది. గెలుపురాలేదని అలానే ఉండిపోవద్దు..మరోచోట కచ్చితంగా అంతకుమించిన సక్సెస్ని చవిచూస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి అని విలువైన సందేశంతో పోస్ట్ని ముగించారు అనుభవ్ దూబే.This is for those who haven’t received any award or recognition in their life.Till the age of 25, I hadn’t received a single award. I was a backbencher. Awards, certificates se mera door door tak koi lena dena nahi tha.When I started feeling that I might not clear my UPSC… pic.twitter.com/CxX8sCVObR— Anubhav Dubey (@tbhAnubhav) March 18, 2025 (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
అవును వాళ్లిద్దరికీ పెళ్లైంది : అదిరే స్టెప్పులతో పెళ్లి వీడియో వైరల్
మన దేశంలో పెళ్లి అంటే కేవలం వేడుక, ఆనందం మాత్రమేకాదు ఆడంబరం, ఆర్బాటం కూడా. ఎంత ఖర్చైనా పరవాలేదు విలాసవంతంగా మూడు ముళ్ల వేడుక పూర్తి కావాల్సిందే. ఇదీ నేటి ప్రజ తీరు. దీనికి తోడు ఇలాంటి వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం క్రేజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అంటే ముందుగా గుర్తొచ్చే నెటిజన్లు కమెంట్లే గదా. తాజాగా ఒక పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.అయితే ఈ పెళ్లి వెనుక విశేషం ఇదే అంటూ ఇంటర్నెట్ యూజర్లు కమెంట్లతో హోరెత్తించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.ఈ వైరల్ వీడియోలో వధువు గ్రాండ్ జర్జోజీ వర్క్తో తయారైన మెరూన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డబుల్ దుపట్టాలతో మరింత అందంగా కనిపించింది.ఆకర్షణీయమైనమేకప్, చోకర్,నెక్లెస్లు,చెవిపోగులు ఇలా సర్వహంగులతో పెళ్లికూతురి లుక్లో స్టైలిష్గా కనిపిస్తోంది. మరోవైపు, వరుడు కూడా ఐవరీ కలర్ షేర్వానీలో బాగానే తయారయ్యాడు. ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా స్టెప్పులేసింది. అటు 40 ఏళ్ల పెళ్లి కొడుకుగా సిగ్గుపడుతూ ఆమెతో జత కలిశాడు. View this post on Instagram A post shared by mayank Kumar Patel (@mayank_kumar_patel473)అసలు స్టోరీ ఇదట! వరుడు వయసు 46, వధువు వయసు 24.తనకంటే పదహారు సంవత్సరాలు పెద్దవాడిని సంతోషంగా వివాహం చేసుకుంది. వయసులో చాలా తేడా ఉన్నా కూడా ఆమె ఆనందంగా కనిపిస్తోంది. వరుడు గవర్నమెంట్ టీచర , సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం అందుకే ఇలా అంటూ గత ఏడాది డిసెంబరులో చేసిన పోస్ట్లో వెల్లడించింది. వీడియో అప్లోడ్ కాగానే కమెంట్ సెక్షన్ను నెటిజన్లు చమత్కారాలు, వ్యంగాలతో నింపేశారు. కొంతమంది పెళ్లి కొడుకు వయస్సును ఎగతాళి చేయగా, మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగం బాబూ అని వ్యాఖ్యానించారు. పెళ్లి చేయాలంటే అందం, కులంతోపాటు, వయసు, హోదాకూడా పరిశీలిస్తారు పెద్దలు సాధారణంగా. సమయాన్నిబట్టి, తమ సౌలభ్యాన్ని వీటిల్లో అనేక మినహాంపులతో పెళ్లిళ్లు జరిగిపోతాయి. దాదాపు వీరంతా చాలా హ్యాపీగా జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం, చమత్కారాలతో, మీమ్స్ సందడిచేస్తూనే ఉంటారు. ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అన్న సామెత వీళ్లు అసలు పట్టించుకోరు. -
పోషకాహార ప్రాధాన్యత : రెసిపీ & డైట్ గైడ్ ఆవిష్కారం
తెలంగాణలోని ప్రముఖ ఆలివ్ హాస్పిటల్ (Olive Hospital) కొత్త ఆరోగ్యకరమైన వంటకాలతో మరో పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రసిద్ధ వంటకాలతో , "హోల్సమ్ రెసిపీస్ ఫర్ ఎ వైబ్రెంట్ లైఫ్" (Wholesome Recipes for a Vibrant Life) ఐదో ఎడిషన్ను ప్రారంభించింది. ఆసుపత్రి నిపుణులైన డైటీషియన్లు ఈ పుస్తకం,రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించేలా ఈ రెసిపీలను రూపొందించారు.2025 ఎడిషన్లో భారతదేశపు గొప్ప పాక సంప్రదాయాలను సమతుల్య పోషకాహారంతో మిళితం చేసే 60 కి పైగా వంటకాలు ఉన్నాయి. ఇందులో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,రోగనిరోధక శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు వంటి వివిధ పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కాశ్మీరీ పులావ్ బిసి బెలె బాత్, పనీర్ టిక్కా బిర్యానీ, స్పినాచ్ పులావ్ ఉన్నాయి.ఇవన్నీ ఇంట్లో సులభంగా తయారు చేయడంతోపాటు, ఇవి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, నాణ్యమన వైద్య విధానాలతో మెరుగన ఆరోగ్య సేవలను అందిసున్న ఆలివ్ హాస్పిటట్ పోషకాహారం పాధాన్యతను వివరిస్తూ దీన్ని విడుదల చేసింది.మెరుగైన ఆరోగ్యం వైపు ఒక అడుగుఆలివ్ హాస్పిటల్ గత నాలుగేళ్లుగా తీసుకొస్తున్న డైట్ ప్లాన్ పుస్తకం ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, రోగులకు ఉపయోగ పడుతోంది. ఆసుపత్రి వారి శ్రేయస్సు పట్ల నిరంతర నిబద్ధతలో భాగంగా ఇది రోగులకు పంపిణీ చేస్తారు. ప్రోటీన్-రిచ్ వంటకాల్లో పనీర్ టిక్కా బిర్యానీ, మాటర్ పులావ్ ఫీచర్లు, ప్రోటీన్ సుసంపన్నం కోసం పనీర్, టోఫు, కాయధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఆకుకూరలతో సమృద్ధిగా ఉండే పాలకూర పులావ్, కాలీఫ్లవర్ లెమన్ రైస్, ఫైబర్-ప్యాక్డ్ రెసిపీలుంటాయి. ఇందులోని వంటకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి మరియు శక్తి స్థాయిలను నిలబెట్టడానికి పదార్థాల సమతుల్య మిశ్రమాన్ని అందిస్తుందని డైటెటిక్స్ హెడ్ సుగ్రా ఫాతిమా చెప్పారు. -
బిందె నిండాలంటే.. జాగారం చేయాల్సిందే!
వేసవి వచ్చిందంటే.. మండించే ఎండలేకాదు. నీటి ఎద్దడి కూడా భయపెడుతుంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా తాగు నీరు కోసం ప్రజలు పడే బాధలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల మహిళల అవస్థలు వర్ణనాతీతం. బిందెడు నీళ్లకోసం వారు పడే ఆవేదనకు అద్దం పట్టే కథనం ఇది!ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో భూగర్భ జలాలు క్రమేణా అడుగంటిపోతున్నాయి. దీంతో నీటి సమస్య జఠిలమవుతోంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నప్పటికీ ఆ ట్యాంకు ఎప్పుడు నిండుతుందో తెలియక ప్రతియేటా గ్రామ శివారులోని చేదబావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అయితే ఎండల తీవ్రతతో ఆ బావి ఎండిపోవడంతో మిషన్ భగీరథే దిక్కైంది. అది కూడా మూడునాలుగు రోజులకు ఒకసారి ఆ ట్యాంకు నిండుతుంది. ఒక్కొక్కరికి రెండు బిందెలే వస్తుండటంతో వాటి కోసం గ్రామస్తులు వేకువజామునే బిందెలతో ట్యాంకు వద్దకు చేరుకుని జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీరే అందకపోగా మూగజీవాలకు, ఇతర అవసరాలకు నీరు లభించడం గగనమైంది. దీంతో గ్రామస్తులు పాలకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఆదిలాబాద్ చదవండి: అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం -
అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం
ఒక అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు వివాదాన్నిరేపుతున్నాయి వక్షోజాలను పట్టుకోవడం(Grabbing Breasts), పైజామా నాడాను చింపేయడం (Snapping Pyajama String) అత్యాచార యత్నం కిందికి రావంటూ హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ చర్యలు అత్యాచారంగా పరిగణించ లేమని పేర్కొంది దీనిని పోక్సో చట్టం కింద తీవ్రమైన లైంగికదాడిగా పరిగణించవచ్చని వెల్లడించింది. అత్యాచారయత్న దశ (preparation stage) కు, వాస్తవ ప్రయత్నం (actual attempt) మధ్య తేడాను ఉందని వ్యాఖ్యానించింది. నిందితుడు అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నట్లు రికార్డులో ఉన్న ఏ సాక్ష్యమూ లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. దీనిపై మహిళా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రముఖ గాయని, చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) కూడా ఈ వివాదాస్పద తీర్పుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది.2021 నాటి కేసులో పవన్, ఆకాశ్ అనే వ్యక్తులు 11 ఏళ్ల చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు నమోదైనాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, లిఫ్ట్ ఇస్తామని చెప్పి నిందితులు మైనర్ బాలిక పట్ల అభ్యంతకరంగా ప్రవర్తించారు. బలవంతంగా ఆమెను కల్వర్ట్ క్రింద లాగే ప్రయత్నం చేశారు. బాటసారులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు.వారు ఆ బాలికను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నిందితులైన పవన్ , ఆకాష్లపై మోపబడిన ఆరోపణలు అత్యాచార ప్రయత్నం నేరంగా పరిగణించబడని స్పష్టం చేసింది.ఈ చర్య వల్ల బాధితురాలు నగ్నంగా లేదా వివస్త్రగా మారినట్టు సాక్షులు చెప్పలేదు. అంతేకాదు లైంగిక దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణ లేవీ లేని కోర్టు తెలిపింది.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?నిందితులను ఐపీసీ సెక్షన్ 354-బి (దుస్తులను తొలగించే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక దాడి) కింద విచారించాలని ఆదేశించింది. మరోవైపు పవన్ తండ్రి, మూడో నిందితుడు అశోక్ బాధితురాల్ని దుర్భాషలాడి, బెదిరించాడన్న ఆరోపణలున్నాయి. -
నిర్మల వాణి : భూమి ఇరుసే సుషుమ్న
మనిషిలో సమతుల్యత అనేది భూమి మధ్యలో వున్న ఇరుసు లాంటిది. మానవుడిని అతిగా భవిష్యత్ లేక గతం వైపు వెళ్లకుండా ఒక నిశ్చలమైన, నిర్దిష్టమైన సమతుల్య స్థితిలో ఉంచేది అతనిలో అంతర్గతంగా సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థలో ఉన్న సుషుమ్నా నాడి. అదే మనలోని ఇరుసు (అక్షం). మనం ఎప్పుడూ మనలోని ఇరుసు అయిన సుషుమ్న మీదనే ఉండాలి.అలాగే భూమి ఇరుసే (అక్షం) సుషుమ్న. భూమాతలో నిక్షిప్తమై ఉన్న ఇరుసు ఎంత బలంగా పనిచేస్తుందంటే, విశ్వం ఎంత విశాలంగా వ్యాప్తి చెంది ఉన్నా సరే, భూమి తన ఇరుసు ఆధారంతో అత్యంత వేగంగా తిరుగుతూనే ఉంటుంది. తద్వారా పగలు మనం పనిచేసుకొనేటట్లు, రాత్రి నిద్రించేటట్లుగా మనలను సమతుల్య స్థితిలో ఉంచడానికి అది పగలు, రాత్రులను సృష్టించింది. అంతేకాకుండా తాను సూర్యుని చుట్టూ తిరుగుతూ, సగం దేశాలలో వేసవికాలం, సగం దేశాలలో శీతాకాలాన్ని కలిగించేలా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇరుసే ఇదంతా నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఈ ఇరుసు విశ్వంలో పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలకు భూమిని అవసరమైనంత దూరంలో ఉంచుతుంది.చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!ఈ కేంద్రం లేక ఇరుసు భూమి మేధస్సునే కాదు, పరిమళాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ కేంద్రమే భూమి సుషుమ్నా నాడి అని చెప్పవచ్చు. ఈ కేంద్రం ద్వారానే ’స్వయంభూలు’ వెలుస్తూ ఉంటాయి. భూకంపాల లాంటి గొప్ప విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. నిజానికి కదిలేది ఈ ఇరుసే. అదొక గొప్పశక్తి. ఆ శక్తి భూమాతలోని లావాను వివిధ దిశలలో పంపిస్తుంది. ఆ లావా భూమిపైకి చొచ్చుకుని రావడం వల్ల భూకంపాలు, అగ్ని పర్వతాలలాంటివి ఏర్పడతాయి. ఇవన్నీ భూమాతలోని ఇరుసుకు ఉన్న అవగాహన వలననే ఏర్పడతాయి. అంతేకాదు ఋతువులు కూడా ఏర్పడతాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, వాటిని మనకు అందించడానికే ఈ కాలాలు సృష్టించబడ్డాయి. భూమాత తనలోని ఉష్ణాన్ని కోల్పోతే, మొత్తం మంచుతో గడ్డకట్టిపోవడం వలన మనకు తినడానికి ఏమీ ఉండదు. చంద్రగ్రహమే ఇక్కడ ఉన్నట్లుగా ఉంటుంది. (తరువాయి వచ్చేవారం)– డా. పి.రాకేష్ (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
ఆంతర్యంలోని ఆత్మీయతతోనే ఆశీర్వాదాలు...
గిబియోనీయులంటే అమ్మోరీయులనే శాపగ్రస్తుల సంతతికి చెందిన కనాను ప్రజలు. వాగ్దాన దేశమైన కనానులో యెహోషువా నాయకత్వంలో సాగుతున్న జైత్రయాత్రలో యెరికో, హాయి పట్టణాలు అప్పటికే నేలకూలగా ఆ వార్త విని, తాము కూడా వారిలాగా త్వరలోనే సంహారం కానున్నామని గ్రహించి గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో శాంతియుత సంధి చేసుకోవడానికి నిర్ణయించుకొని, తాము ఎక్కడో దూరదేశానికి చెందిన వారమంటూ కపట నాటకమాడి యొహోషువా శరణు కోరారు. దేవుని వద్ద విచారణ కూడా చెయ్యకుండానే, యొహోషువ, ఇతర ఇశ్రాయేలీయుల పెద్దలు గిబియోనీయుల జోలికి రాబోమంటూ వారికి ప్రమాణం చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు వాస్తవం తెలిసి వారిని నిలదీస్తే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని విని ఆయన శరణులో, మీ నీడలో బతకాలని నిర్ణయించుకున్నామని వారు వెల్లడించారు. మాటిచ్చిన తర్వాత మడమ తిప్పకూడదన్న దేవుని ఆజ్ఞకు లోబడి ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. సంధి ఒప్పందానికి దేవుడు కూడా ఆమోద ముద్ర వేశాడు. గిబియోనీయుల ఉదంతం విని ఆ వెంటనే మిగిలిన కనాను రాజులంతా కలిసి గిబియోనీయులతో సమిష్టిగా మహా యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు కూడా వారికి అండగా నిలిచారు. దేవుడైతే ఒక రోజుపాటు సూర్యుణ్ణి ఉన్నచోటే నిలిపి మరీ వారికి ఘనవిజయా న్నిచ్చాడు(యొహో 10:12). ఇశ్రాయేలీయుల మధ్య పనివారుగా ఉండేందుకు అంగీకరించిన గిబియోనీయులకు, ఆలయంలో బలిపీఠం వద్ద కట్టెలు నరికే, నీళ్లు మోసితెచ్చే పనినిచ్చి, దేవుడు తన ఆరాధనా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యాన్నిచ్చాడు. లేవీయులు అంటే అర్చకులుండే పట్టణాల్లో దేవుడు గిబియోను పట్టణాన్నికూడా చేర్చాడు. దావీదు వద్ద ఉన్న 30 మంది మహా వీరుల్లో ఇష్మాయా అనే గిబియోనీయుడు కూడా ఉన్నాడని బైబిల్ చెబుతోంది. చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!చక్రవర్తిగా సొలొమోను గిబియోనులో బలులర్పించినప్పుడు దేవుడు అక్కడేప్రత్యక్షమై అతనికి వరాలనిచ్చాడు, బబులోను చెరనుండి తిరిగొచ్చిన వారిలో 95 మంది గిబియోనీయులు కూడా ఉన్నారని బైబిల్లో నెహెమ్యా రాశాడు. ఝెరూషలేము ప్రాకారాలు తిరిగి నిర్మించిన వారిలో కూడా గిబియోనీయుల ప్రస్తావన ఉంది. మామూలుగా అయితే కాలగర్భంలో కలిసి΄ోవాల్సిన గిబియోనీయులకు దేవుడు ఇంతటి మహా చరిత్రనిచ్చాడు. ఇశ్రాయేలీయులతో తలపడి కనానీయులంతా సంహారం కాగా. గిబియోనీయులనే కనాను ప్రజలు మాత్రం, దేవునికి తలవంచి, దేవుని ప్రజలతో సఖ్యత కోరుకొని తమ ప్రాణాలే కాదు, తమ ఉనికిని కూడా కాపాడుకున్నారు. పాములకున్న వివేకం, పావురాలకున్న నిష్కపటత్వం విశ్వాసి కుండాలన్న యేసుప్రభువు వారి బోధనలకు గిబియోనీయలే ఉదాహరణ. తలుపు చిన్నదైతే, లోనికి వెళ్లేందుకు తలవంచడమొక్కటే మార్గం. నేను తల వంచడమా? అనుకుంటే, తల బొప్పికట్టడం ఖాయం. అపకార దృష్టితో కాక ప్రాణభీతితోనే గిబియోనీయులు కపటనాటకమాడారని దేవునికి ముందే తెలుసు. ఆయన వారి పై వేషాలను కాదు, ఆంతర్యంలో తన పట్ల వారికున్న విశ్వాసాన్ని, భయభక్తుల్ని చూశాడు. పైకి మాత్రం నీతిమంతుల్లాగా నటిస్తూ గొప్పగా జీవించేవారి ఆంతర్యంలోని దుష్టత్వాన్ని, పైకి నాటకాలాడినా ఆంతర్యంలో వారి ఆత్మీయతను చూసి మరీ దేవుడు ప్రతిస్పందిస్తాడు. లేకపోతే వారితో సంధి చేసుకోవద్దని దేవుడు ఏదో విధంగా యెహోషువాకు తెలియజేసేవాడే లేదా వారితో సంధి చేసుకున్నావెందుకని ఆ తర్వాతైనా యెహోషువాను మందలించేవాడే. కత్తితో తలపడటం కన్నా యుక్తితో మెలగడమే మెరుగనుకొని గిబియోనీయులు అలా గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకోవడమే కాక, దేవుని ప్రజల్లో భాగమయ్యారు, దేవుని ఆశీర్వాదాలకూ పాత్రులయ్యారు.పై వేషాలు, పదవులు, నాటకాలను బట్టి కాక ఆంతర్యంలోని భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టి దేవుడు ప్రతిఫలాన్నిస్తాడు. మనవాడు కదా, ఇలా చేయవచ్చా... అని ఇతరులను నిందించే ముందు, పైకి ఎంతో భక్తిగా, పవిత్రంగా, నీతిమంతుల్లాగా ప్రవర్తించే నా ఆంతర్యంలో లేదా మనవాళ్ళ ఆంతర్యంలో ఇంతటి ఆత్మీయ దుర్గంధమా? ఇన్ని మురికి కాలువలా? ఇంతటి భ్రష్టత్వమా... అని ప్రశ్నించుకునేవాడే నిజమైన విశ్వాసి. దేవుడు విశ్వాసి ఆంతర్యంలోని ఆత్మీయత, ఉదాత్తమైన ఆలోచనలను బట్టే అనూహ్యమైన విజయాలు, ఆశీర్వాదాలిస్తాడు, కోట్లాదిమందికి విశ్వాసిని ఆశీర్వాదంగా మార్చుతాడు. – సందేశ్ అలెగ్జాండర్ -
బౌద్ధ వాణి : మీకూ నాకూ అదే తేడా..!
బుద్ధుడిని చూడడం కోసం ఓరోజు అనేక మంది వచ్చారు. ఆ సమయంలో బుద్ధుడు ఓ చెట్టు కింద ఉన్న అరుగుమీద కూర్చుని ఉన్నారు. బుద్ధుడు చేతిలో ఓ పట్టు రుమాలు ఉండటం చూసి అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం వేసింది. విలాసాలకూ ఖరీదైన వస్త్రాలకూ ఆమడదూరంలో ఉండే బుద్ధుడి దగ్గర పట్టు రుమాలు ఉండటమేమిటని అందరూ చెవులు కొరుక్కున్నారు. అక్కడ మౌనం ఆవరించిన తర్వాత బుద్ధుడు తన చేతిలో ఉన్న రుమాలుని చూపిస్తూ ఏమిటది అని ఆడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలు అని చెప్పారు. అనంతరం బుద్ధుడు ఆ రుమాలులో అయిదు ముళ్ళు వేసి చూపిస్తూ ఇప్పుడిదేమిటీ అని అడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలని చెప్పారు. అప్పుడు బుద్ధుడు ‘అదే మీకూ నాకూ తేడా. ఆ తేడా వల్లే మీరక్కడా నేనిక్కడా ఉన్నాను‘ అంటూ తన మాటలు కొనసాగింంచారు. ‘అయిదు ముళ్ళు ఏంటంటే హింసకు పాల్పడకపోవడం, చైతన్యం కలిగి ఉండటం, అత్యాశకు దూరంగా ఉండటం, ఏం జరిగినా అబద్ధం చెప్పకపోవడం, నిజాయితీతో కూడిన సత్పవ్రర్తన కలిగి ఉండటం‘ అని చెప్పారు. ఈ అయిదూ అనుసరించగలిగితే ఎవరితోనూ ఏ గొడవలూ రావని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ అయిదు పురోగతికీ, మానసిక ప్రశాంతతకూ ఎంతో అవసరం. అందుకోసమే బుద్ధుడు అయిదు ముడులు వేసారు. కానీ ఆ ముళ్ళ విషయం ఆలోచించని వాళ్ళందరూ ఆ రుమాలు పట్టుదనే చెప్పారు తప్ప వాళ్ళెవరికీ బుద్ధుడెందుకు ముళ్ళు వేసారన్నది ఆలోచించలేదు. చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా! -
పంచారామాలలో ప్రసిద్ధం : క్షీరారామం
పూర్వం ‘‘ఉపమన్యుడనే బాల భక్తుడు పాలకై పరమేశ్వరుని ప్రార్థించగా, శివుడు కరుణించి తన త్రిశూలాన్ని అక్కడి నేలపై గుచ్చాడట. అప్పుడు ఆ ప్రదేశం నుంచిపాలు ఉద్భవించాయని, అందుకే దీనికి ‘క్షీరపురం’,పాలకొలను’’ అన్న పేర్లు కలిగాయని, అలాగే ఆ బాలభక్తుడి పేరు మీదుగా ‘ఉపమన్యుపురం’ అనే పేరు వచ్చిందని పండితుల వాక్కు. అదే నేటి పాలకొల్లు.ఆలయ విశేషాలు...క్షీరారామంలో వెలసిన స్వామి శ్రీ క్షీరా రామలింగేశ్వరుడు. తెల్లగా పాల వలె మెరిసే ఈ శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగంపై ఉన్న నొక్కులు కుమారస్వామి అమృత లింగాన్ని భేదించినపుడు తగిలిన బాణపు దెబ్బలని భక్తుల విశ్వాసం. ఈ శివలింగం పై భాగం మొనతేలి ఉండటంతో ఇది శివుడి కొప్పు భాగాన్ని సూచిస్తోందని పెద్దల వాక్కు. కాగాశాసనాల్లో ఈ స్వామిని ‘కొప్పు లింగేశ్వరుడు’గా పేర్కొనటం విశేషం. ప్రతి ఏడాదీ ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ సమయాల్లో, భానుడి కిరణాలు పెద్దగోపురం రెండో అంతస్థు నుంచి ప్రాకారాల మధ్యగా క్షీరా రామలింగేశ్వర లింగంపై ప్రసరించటం విశేషం.చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్! పెద్దగోపురం...దేవాలయానికి శిఖరం–శిరస్సు, గర్భాలయం–కంఠం, ధ్వజస్తంభం–జీవం కాగా గోపురం పాదం లాంటిదని ఆగమశాస్త్రం చెబుతోంది. ఎంతో పురాణ, చారిత్రక ప్రాశస్త్యం, అద్భుత శిల్పకళ కలిగిన శ్రీ క్షీరారామలింగేశ్వరాలయ గోపురం పాలకొల్లు పెద్దగోపురంగా ప్రసిద్ధి పొందింది. ఇది సుమారు 120 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్థులతో గోపురం చివరిదాకా వెళ్లేందుకు అనువుగా లోపలి వైపు మెట్లు కలిగి ఉంది. ఈ గోపురం మీది ఎన్నో అద్భుత శిల్పాలు చూపరులను కట్టి పడేస్తాయి.ఉత్సవాలు...ఈ క్షేత్రంలో ఉగాది, చైత్రశుద్ధ దశమినాడు స్వామి వార్ల కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశినాడు రథోత్సవం, వినాయక చవితి, శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి, కార్తీకమాస అభిషేకాలు, జ్వాలా తోరణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ముక్కోటి, లక్ష కుంకుమ, బిల్వార్చనలు, కోటి బిల్వార్చనలు, సహస్ర ఘటాభిషేకాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇవి కాక ఆయా సందర్భాలలో మరెన్నో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మహా శివరాత్రి నాడు శ్రీ పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర, లక్ష్మీ జనార్ధనుల ఊరేగింపు రంగురంగుల విద్యుద్దీప కాంతుల నడుమ సాంçస్కృతిక వేడుకలతో కన్నుల పండుగగా జరుగుతుంది. పర్వదినాల్లో భక్తి, భజన కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు జరుగుతాయి.– డి.వి.ఆర్. -
World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!
‘ఆ రోజుల్లో’ ‘మా రోజుల్లో’ అంటూ పిచ్చుకలను తలచుకుంటూ బాధపడితే ఏం లాభం? సొంత లాభం కొంత మానుకొని ‘నా ఇల్లు... నా పక్షులు’ అనుకుంటే పిచ్చుకలు పూర్వకళతో సందడి చేస్తాయి. పిచ్చుకలు కనిపించడం అరుదైన దృశ్యం కావడం హైదరాబాద్కు చెందిన భావన శ్రీనివాస్ను బాధించింది. ఆ బాధే పిచ్చుకల సంరక్షణను ఉద్యమ స్థాయిలో చేసేలా చేస్తోంది. సమాజంలో పర్యావరణం పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం భావన శ్రీనివాస్ను ఆలోచనలో పడవేసింది. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనే ‘జాగృతి అభ్యుదయ సంఘం’కు బీజం వేసింది. ఈ సంస్థ పక్షుల సంరక్షణ, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలాంటి అంశాలపై పనిచేస్తుంది.ప్రతి ఇంటికి ఒక గూడుఇంటి చుట్టుపక్కల, తోటల్లో, రహదారుల పక్కన కనిపించే పిచ్చుకలు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. చెట్లు కొట్టివేయడం, ఆధునిక నిర్మాణాల వల్ల వాటికి గూళ్లు లేకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భావన శ్రీనివాస్ ‘పిచ్చుక గూళ్ల సంరక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక మట్టిగూడు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో మట్టి గూళ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.విద్యార్థులే వెన్నెముకగా...గూళ్ల తయారీని గ్రామీణ మహిళలకు అప్పగించి వారికి ఉ పాధి కల్పిస్తున్నారు. వేసవికాలంలో పిచ్చుకలు దాహంతో బాధపడకుండా, ప్రతి ఇంటిముందు చిన్న నీటి తోగులు (నీటి గిన్నెలు) పెట్టేలా అవగాహన కలిగిస్తున్నారు. చెట్లు, బడులు, వృద్ధాశ్రమాలలో కూడా ఈ తోగులను ఏర్పాటు చేస్తున్నారు. పిచ్చుకల ప్రాముఖ్యతపై బడులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక ఇంట్లో ఒక గూడు’ అనే ఉద్యమాన్ని విద్యార్థుల సహకారంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలు పక్షుల సంరక్షణ ఉద్యమంలో భాగమయ్యాయి. చదవండి : Sunita William Gujarat Home: పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియోపిచ్చుకలు ఎందుకు కనిపించడం లేదో తెలుసా?నగరీకరణ: కొత్త కాంక్రీట్ భవనాల నిర్మాణం, చెట్ల కొట్టివేత వల్ల పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశం తగ్గిపోయింది.ప్లాస్టిక్ వినియోగం: మనం విసిరేసే ప్లాస్టిక్ వ్యర్థాలలో పక్షులు చిక్కుకుని మరణించడం పెరిగిపోయింది.రసాయనాల ప్రభావం: వ్యవసాయ రంగంలో అధికంగా ఉపయోగించే రసాయనిక ఎరువుల వల్ల పురుగులతో పాటు చిన్నపాటి పక్షులు చనిపోతున్నాయి.నీటి కొరత: ప్రత్యేకించి వేసవిలో పిచ్చుకలకు తాగేందుకు నీరు దొరకక పోవడం వాటి మనుగడకు కష్టంగా మారింది.అవిగో పిచ్చుకలు! రకరకాల కారణాల వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతోంది. వాటిని రక్షించుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పక్షి విభాగం శాస్త్రవేత్త వాసుదేవరావుతో మాట్లాడాను. అట్టపెట్టెలతో చేసిన పిచ్చుక గూళ్లు ఇచ్చారు. మంచి మట్టితో తయారుచేసిన గూళ్లు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనే ఆలోచనతో ఒక కుమ్మరి కళాకారుడికి నా కాన్సెప్ట్ చెప్పాను. అతను చేసి ఇచ్చాడు. సక్సెస్ అవుతామా లేదా తెలుసుకోడానికి ముందు మా ఇంట్లోనే పెట్టాము. సూపర్ సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మా ఇంటి చుట్టూ వెయ్యి వరకు పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకలను ఎవరు తీసుకెళ్లినా ఇతరులలో స్ఫూర్తి నింపడానికి ఆ విషయాన్ని వాట్సాప్ గ్రూపులో పెట్టండి అని చెబుతుంటాను. – భావన శ్రీనివాస్ – శిరీష చల్లపల్లి -
‘లైఫ్లో ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి బ్రో..’
‘లైఫ్లో ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి బ్రో..’ ఇలాంటి మాటలు నగరవాసుల రోజువారీ సంభాషణల్లో సర్వసాధారణంగా మారాయి. సంతోషాన్ని మించిన సంతృప్తి లేదనే ఆలోచన రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఎన్ని కష్టనష్టాలున్నా సంతోషం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఉన్నదాంట్లో హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్నారు. పదేళ్ల క్రితం ఐఎమ్ఆర్బీ అధ్యయనంలో 190 పాయింట్లు దక్కించుకున్న చత్తీస్ఘడ్ తొలి స్థానంలో నిలిచింది. లక్నో, చెన్నై, బెంగళూర్లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మన హైదరాబాద్ 75 పాయింట్లను దక్కించుకుని 12వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆ తర్వాత నిదానంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోంది. 5 ఏళ్ల క్రితం గురుగ్రామ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లో స్ట్రాటజీ ప్రొఫెసర్ డా.రాజేష్ పిలానియా టీమ్ ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ రూపొందించింది. దీని కోసం 34 నగరాల్లో అధ్యయనం నిర్వహించగా.. లూథియానా, అహ్మదాబాద్, చండీగఢ్ సంతోషకరమైన నగరాలుగా అవతరించాయి. గురుగ్రామ్, విశాఖపట్నం, రాయ్పూర్ చివరి స్థానాలు దక్కించుకున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్ను టైర్–2 నగరాలుగా విభజించి నిర్వహించిన అధ్యయనంలో.. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ మొదటి మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే హైదరాబాద్ టాప్–10లో నిలిచింది. అప్పటి నుంచి హైదరాబాద్ 5 నుంచి 10లోపు ర్యాంకింగ్లో ఉంటూ హ్యాపీనెస్ రిపోర్ట్లో ప్రముఖంగా ఉంటోంది. కోవిడ్ తర్వాత కొలత మారింది.. ఈ అధ్యయనాలు విశ్లేషిస్తున్న ప్రకారం.. నగరాల్లోని హ్యాపీనెస్ ట్రెండ్స్లో కోవిడ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అసలైన సంతోషానికి కొలమానం తెలిసి వచి్చంది. కరోనా మహమ్మారి కారణంగా అనూహ్యంగా ప్రపంచం స్తంభించిపోవడం ఉరుకులు పరుగుల జీవనంలోని డొల్లతనాన్ని పట్టిచి్చంది. దాంతో తమ తమ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూనే సంతోషానికి కూడా తమ డైలీ రొటీన్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది. విభిన్న రకాల హాబీలకు సానపెట్టడం, టూర్లకు, పిక్నిక్లకు వెళ్లడం మరింత ఎక్కువైంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక భావనలు, తాతి్వక చింతనలూ పెరిగి ప్రశాంత జీవనం వైపు ఆలోచనలు మళ్లిస్తున్నారు. ట్రావెలింగ్.. ఫొటోగ్రఫీ.. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఎన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం అనేదాని కన్నా.. ఎంత సంతోషంగా ఉన్నాం.. అనేదే ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకు అనుగుణంగానే నా లైఫ్స్టైల్ ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్గా కొంత కాలం పనిచేశాను. ఆ తర్వాత సినిమా నటుడిగా మారాక అదే ఫొటోగ్రఫీ నాకు సంతోషాన్ని అందించే హాబీగా మారింది. అలాగే ట్రావెలింగ్ కూడా నాకు చాలా ఆనందాన్ని అందిస్తుంది. – కృష్ణుడు, సినీనటుడు పాజిటివ్ మైండ్.. ఏదో ఒక రోజు అని కాదు.. ప్రతీ రోజూ సంతోషంగానే ఉంటాను. సంతోషం అనేది ప్రత్యేకంగా ఒక మార్గంలో తెచ్చుకోవడం అనేది కాదు. ముఖ్యంగా నేను దేనికీ టెన్షన్ పడను.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏడవను.. హ్యాపీగా ఉండాలి అని నా మనసును ట్యూన్ చేసుకున్నాను కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. – సుధ, సినీ నటిమ్యూజిక్ కిక్.. రైడింగ్ బైక్.. కొన్ని హాబీస్ నాకు హ్యాపీనెస్ని అందిస్తాయి. అలాంటి వాటిలో మొదటిది మ్యూజిక్ అని చెప్పాలి. నా ఉదయం ఎప్పుడూ సంగీతంతో ప్రారంభిస్తా.. నచ్చిన మ్యూజిక్ వింటూ డే స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరు. రోజులో ఏ మాత్రం డల్గా అనిపించినా నా చూపులు బైక్ మీదకు వెళ్తాయి. చిన్నప్పటి నుంచీ బైక్ రైడింగ్ బాగా ఇష్టం. – ప్రిన్స్, సినీనటుడు హ్యాపీ హార్మోన్లు.. కీలకం.. రోజువారి కొన్ని అలవాట్లు చేసుకుంటే మెదడు సంతోషకర హార్మోన్లను విడుదల చేస్తుంది. ఉదాహరణకుక్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేసే వారిలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి ప్రతికూల భావాలు దరిచేరవు. అలాగే బరువు తగ్గడం, శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచుకోవడం లాంటి చిన్నా, పెద్దా లక్ష్యాలను మనం చేరుకోగలిగినప్పుడు ఫీల్గుడ్ హార్మోన్ డోపమైన్.. అధికంగా ఉత్పత్తి అవుతుంది. జీవితంలో మనకున్న వాటితో సంతృప్తి చెందడం, కృతజ్ఞతాభావం కలిగి ఉండటం కూడా మనసులో సానుకూల భావాలను నింపుతుంది. ఫలితంగా సెరటోనిన్ స్థాయి పెరిగి జీవితం ఆనందమయంగా కనిపిస్తుంది. మనసుకు దగ్గరైన వారితో సరదాగా గడపడం చేస్తే మెదడు ఆక్సిటోసిన్ను విడుదల చేస్తుంది. మూడ్ మెరుగుపరచడంలో ఆహారం పాత్ర కూడా కీలకం. వారంలో రెండుసార్లు 50 నుంచి 100 గ్రాముల వరకు డార్క్ చాక్లెట్ని తినడం వల్ల మనలో హ్యాపీ హార్మన్లు విడుదలవుతాయి. అయితే ఆ డార్క్ చాక్లెట్లో 70 నుంచి 85 శాతం కొకొవా మాత్రమే ఉండాలని గుర్తుంచుకోవాలి. ట్రిఫ్టోఫాన్ అధికంగా ఉండే టర్కీ కోడి, గుడ్లు, బాదంపప్పులు వంటి ఆహారాలతో సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఓమెగా3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే చేపలు కూడా డోపమైన్ స్థాయిల్ని పెంచి మూడ్ను మెరుగుపరుస్తాయి. వనజా శ్రీపెరంబుదూరు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
సంతృప్తే సదానందం
బ్రహ్మాండమైన హాస్యనటుడు బ్రహ్మానందం. కానీ తనని మించిన హాస్య నటులు చాలామంది ఉన్నారని ఆయన అంటున్నారు. ఎలా అంటే..? ‘చుట్టూ ఉన్నవాళ్లని చూస్తూ... ఆనందపరుస్తూ... నవ్విస్తూ ఉండగలిగితే నీ అంతటి హాస్య నటుడు ఇంకొకడు లేడు’ అన్నారు బ్రహ్మానందం. సంతృప్తే సంతోషం అనే ఈ సదానందం ‘వరల్డ్ హ్యాసీనెస్ డే’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు.→ ఆనందానికి మీరిచ్చే నిర్వచనం? ఆనందం అనేది ఓ అనుభూతి... ఓ భావోద్వేగం. నవ్వు కూడా ఓ అనుభూతి. కేవలం శబ్దం కాదు. ఇక ఆనందం ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నువ్వు చేసే పని ద్వారా నువ్వు ΄పొందే అనుభూతే ఆనందం. మన మనసుకి ఏదైతే ఆనందాన్నిస్తుందో అదే ఆనందానికి నిర్వచనం.→ ఒక మనిషి నవ్వుతూ ఉన్నాడంటే ఆనందంగా ఉన్నట్టేనా? ఉన్నట్టు కాదు. నవ్వు నిస్సహాయతలోనూ వస్తుంది. అలానే ఏడుస్తున్నాడంటే విపరీతమైన బాధలోనూ ఉన్నట్టు కాదు. మనం ఒక ట్రాజెడీ నాటకం చూస్తున్నప్పుడు ఏడుస్తుంటాం. కానీ అది మన వ్యక్తిగత బాధ కాదు. మనం చూస్తున్న దాని ద్వారా ΄పొందిన అనుభూతి. ‘వియ్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ట్రాజెడీనెస్ ఆల్సో’. ఇక మనిషి భావాలను బట్టి అతను బయటకు కనిపించేది... అతని లోపల జరిగేది ఒకటే అనుకోలేం.→ చిన్నప్పుడు మీరు ఆర్థికపరమైన, ఇంకా ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సో... మీకు పరిపూర్ణమైన ఆనందం పరిచయమైనది ఎప్పుడు? నే¯ð ప్పుడూ ఆనందం ఇలా ఉంటుంది... దుఃఖం ఇలా ఉంటుందీ అనుకోలేదు. రెండింటినీ వేరువేరుగా చూడలేదు... తెలియదు కూడా. ఆర్థిక సమస్యలుంటే దుఃఖం, అవి లేకుంటే ఆనందం అనుకోలేదు. ఒక మహర్షిలా తలకిందులుగా తపస్సు చేసి, నేర్చుకున్నటువంటి జ్ఞానం కాదిది. స్వతహాగానే ఏర్పడింది. ఈ పూట భోజనం ఉండదే అని బాధపడిపోలేదు. బట్టలు సరిగ్గా లేవా... ఓకే అనుకునేవాణ్ణి. అమ్మ పెట్టిందే బాగుందనుకోవడం.... నాన్న ఇచ్చినవే బాగున్నాయనుకోవడం. ఆనందాన్ని, దుఃఖాన్ని విభజించడం రాకపోవడం నాకు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి. బావుంది. అలాగని బ్రహ్మానందపడిపోలేదు. అప్పటి ఆ దుఃఖం తెలియకపోవడంవల్లే ఇప్పటి ఈ ఆనందం కూడా మనసుకి ఎక్కలేదు అనుకుంటుంటా. అయినా ప్రతిదీ లోతుగా విశ్లేషించి చూడక్కర్లేదు. సౌకర్యం ఇచ్చేది ఆనందం అంటా. అలాగే అసౌకర్యం ఆనందం ఇవ్వనిది కాదు కానీ విషాదం అని మాత్రం అనను.→ స్థితప్రజ్ఞతతో ఉండటం అనేది మీకు చిన్నప్పుడే అలవాటైందనుకోవచ్చా? ఏమో... ఏది ఏమైనా జీవితం నేర్పినపాఠాలు కొన్ని ఉంటాయి. పేదరికమంటే నాకు విపరీతమైన ఇష్టం. అందుకే నేను పేదవాళ్లకి సహాయం చేసినా బయటకు చెప్పను... కానీ చేస్తూనే ఉంటా. ఇక పేదరికం అనేది మన దగ్గర ఏది లేదో దాన్ని సంపాదించడానికి కృషి చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నీ దగ్గర తిండి, డబ్బు, గౌరవం లేకపోతే వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచిస్తావు. అలా నీకు లేనిదాన్ని ΄పొందడానికి దారి చూపించే ఓ మంచి మార్గం పేదరికం. అందులో నుంచి ఎలా బయటకు రావాలనే తపన ఉండాలి తప్ప మనకు లేదు... వాడికి ఉంది అని పోల్చి చూసుకోవడాలు ఉండకూడదు. ఈ లేదూ... ఉంది అనే ఆలోచనల్లో కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు.→ పేరుకు తగ్గట్టు మీరు బ్రహ్మానందాన్ని పంచుతున్నారు... ‘నాకీ పేరు ఎందుకు పెట్టాలనిపించింది’ అని మీ తల్లిదండ్రులను ఎప్పుడైరా అడిగారా?ఇలా మన గురించి ఒకరు అనుకుంటే హ్యాపీగా ఉంటుందేమో. నేనెప్పుడూ వాళ్లని అడగలేదు. అడుగుదామనే స్థాయికి చేరుకునే సరికి వాళ్లు పెద్దవాళ్లై పోయారు. మేం ఎనిమిది మంది సంతానం. నేను ఏడోవాడిని. ఏదో పేరు పెట్టారు... అనుకున్నానంతే. ఇప్పుడీ స్థితికి వచ్చాక నా తల్లిదండ్రులు పెట్టిన పేరుకి జస్టిఫికేషన్ జరిగిందని అనుకుంటుంటాను.→ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొందరు మీ కామెడీ సీన్లు చూసి, రిలీఫ్ అవుతుంటారు. మరి... మీ స్ట్రెస్ బస్టర్? నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. నా ఫిలాసఫీ చె΄్పాను కదా. బాధ, ఆనందం వేరు వేరు అనుకోను. కెరటం ఎగిసినప్పుడు విజయం అని, కిందపడినప్పుడు అపజయం అనీ అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకటే. అలాగే ఆనందం, బాధ కూడా. గతంలో ఇదే ప్రశ్న అడిగి ఉండుంటే, మంచి భోజనం తింటే ఆనందం అనేవాణ్ణేమో. కానీ ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో తినే ఓపిక, తిన్నా అరిగించుకునే ఓపిక రెండూ లేవు. ‘ఏంటోనండీ ఓ ముద్ద తినలేకపోతున్నాం’ అనుకోవాలి. దీన్ని మళ్లీ బాధ అంటున్నాం. ఇది కూడా బాధ కాదు. ఆనందం, బాధ... ఈ రెండూ మన ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటాయి.→ మీ లైఫ్లో డల్ మూమెంట్స్ ఉంటాయా? సూర్యుడే డల్ అయిపోతాడు సాయంత్రానికి. మనమెంత? ఇదంతా ఓ నిరంతర ప్రక్రియ. అయితే కోరి డల్నెస్ తెచ్చుకోవడం వేరు... రావడం వేరు. సాగుతున్నప్పుడు డల్నెస్ అదే వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నాకు నాలుగు గంటలకల్లా కాఫీ ఇవ్వాలనుకోండి... ఓ రెండు నిమిషాలు లేట్ అయిందంటే... ఏంటో ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారని డల్ అయిపోవచ్చు... ఏముందీ కాస్త లేట్ అయిందని కూల్గానూ ఉండొచ్చు. సో... డల్నెస్ అనేది సాగనప్పుడు రాదు. జీవితం అనేది మన చేతిలో స్టీరింగ్ లాంటిది. ఎటు తిప్పుతున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది.→ ఇప్పుడు యువత చిన్న చిన్న విషయాలకే విపరీతంగా బాధపడిపోతున్న ధోరణి కనబడుతోంది... వాళ్లకి ఏం చెబుతారు? ఇప్పుడు యువత ఆనందంగా లేరని చెప్పలేం. అయితే ఇప్పుడు యూత్లో ఎక్కువమంది కష్టపడకుండా ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెడుతున్నట్లున్నారు. అలా కాకుండా కష్టపడి పని చేసి, సక్సెస్ సాధించాలి. వేరే ఇతర మార్గాల వైపు... అంటే సులువైన మార్గాల్లో వెళ్లి సంపాదించుకుంటే, కష్టపడి సాధించేదాంట్లో దొరికే తృప్తి దొరకదు. ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకూ చెప్పే ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం గొప్పదనం ఏంటంటే... ఎదుటివారిని బాధించకుండా ఉండటం. ఎవరి అభిప్రాయం వారిది అని గౌరవించడం. → ప్రస్తుతం దాదాపు అందరి జీవితం ఒత్తిడి అయిపోయిన ఫీలింగ్...ఒత్తిడి లేకుండా ఎప్పుడుంది? పూర్వం కూడా ఒత్తిడి జీవితమే. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అంటున్నాం. మరి... జనాభా పెరిగిపోయారు కదా. సమస్యలు పెరిగాయి. భక్తి పెరిగింది. అన్ని రకాలుగా పెరుగుదలలు ఉన్నప్పుడు ఒత్తిడి కూడా వస్తుంది. అలాగే ఒత్తిడి సహజంగా రావడం... లేదా మనం తెచ్చుకుంటే రావడం... రెండు రకాలుగానూ వస్తుంది.ప్రస్తుతం నెగటివిటీ వైపే చాలామంది ఆకర్షితులవుతున్నారు... ఈ పరిస్థితి గురించి?ప్రస్తుతం ఏ మనిషికైనా రెండే పద్ధతులు పని చేస్తాయి. నచ్చింది తీసుకోవడం.... నచ్చనిది పట్టించుకోకపోవడం.పాజిటివ్గా ఉండాలంటే నెగటివ్వైపు వెళ్లకుండా ఉండటమే. పోనీ వెళ్లడంలోనే ఆనందం ఉందీ అనుకుంటే... అది వారి ఆలోచనా విధానం. ఎక్కడైనా ఫలానాది జరిగింది అంటూ ఓ నెగటివ్ హెడ్లైన్ చదివితే... ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం. తీరా అసలు విషయంలో ఏమీ ఉండదు. సో... నెగటివిటీకి ఎట్రాక్ట్ అవుతున్నారు. అందుకే పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు కూడా కారణం మనమే. అందుకే పాజిటివిటీని పెంచడానికి ప్రయత్నించడం మంచిది.– డి.జి. భవానిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్ చేస్తూనే ఉంది. ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా. నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్ విల్మోర్ ప్రత్యేక డైట్ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు. మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్ఫాస్ట్లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ జస్ట్ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్ని ఉపయోగించినట్లు సమాచారం.సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..విలియమ్స తన మిషన్లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు. అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్ మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ..) -
అభివృద్ధి చర్యలు కావాలి, పేర్ల మార్పిడితో ఒరిగేదేమిటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, అలాగే 55 సంవత్స రాల నుంచి ఉన్న బల్కంపేట ‘గాంధీ ప్రకృతి వైద్యశాల’కు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వైశ్యులకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తగా చర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘అమరజీవి పొట్టి శ్రీరాములు టెర్మినల్’గా నామకరణం చేయాలని ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటించారు.అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుల ప్రతినిధి కాదు. ఆయనను కులం గాటికి కట్టకూడదు. ఆయన విశ్వమానవుడు. ప్రకృతి వైద్యం అంటే గాంధీ అనీ, గాంధీ అంటే ప్రకృతి వైద్యం అనే భావన చాలామంది మదిలో ఉంది. అటువంటి జాతిపిత పేరు తీసి రోశయ్య పేరు పెట్టడం సముచితం కాదు. 55 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్, కళాశాల ఏమాత్రం పురోగతి లేకుండా ఉంది. అప్పుడు మొదలుపెట్టిన బిఎన్వైఎస్ కోర్సు తప్ప కొత్తగా పెట్టిన డిప్లొమా, పీజీ కోర్సులు ఏవీ లేవు. ఈ ఆస్పత్రి ఎప్పుడూ పేషంట్స్ తాకిడితో రద్దీగా ఉంటుంది. అయితే తొంభై శాతం డాక్టర్లు, సహాయ సిబ్బంది పదవీ విరమణ చేయడంతో ఔట్ సోర్సింగ్ స్టాఫ్తో ఆస్పత్రి నడుస్తోంది. సిబ్బంది నియామకం, పరిశోధనను పోత్సహించడం, పీజీ కోర్సును ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధికరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి... పేర్ల మార్పు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకు రావడం సరైనదేనా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి తోడు జిల్లా స్థాయి ప్రకృతి వైద్యశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ యాంత్రిక ప్రపంచంలో ప్రజలకు సహజ (ప్రకృతి) వైద్యాన్ని అందుబాటులోకి తెస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు. ప్రస్తుతం పేర్ల మార్పిడి తతంగాన్ని అలా వదిలేసి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకూ, సంస్థలకూ ఇప్పుడు నామకరణం చేయాలనుకున్న పేర్లను పెట్టవచ్చు. – డా.యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు -
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం. గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్ట్రిప్గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే. -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
వేసవిలో పెరుగు పులిసిపోయిందా? బెస్ట్ టిప్స్ ఇవిగో!
పెరుగు లేనిదే అన్నం తిన్నట్టే ఉండదు చాలామందికి. అంతేకాదు పెరుగు కమ్మగా ఉండాలి. కొంచెం పులిసినా ఇక దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది గృహిణులకు పెద్ద టాస్కే. అందులోనూ వేసవి కాలంలో పెరుగు తొందరగా పులిసిపోతుంది. కానీ పెరుగు మిగిలినా, పుల్లగా అయినా పాడేయక్కర్లేదు. మిగిలిన పెరుగు,పుల్లటి పెరుగుతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు తెలుసా? దీంతోపాటు కొన్ని ఇంట్రిస్టింగ్ టిప్స్ మీకోసం..వేసవికాలంలో ఫ్రిజ్లో పెట్టినా కూడా టేస్ట్ మారిపోతుంది. మిగిలిపోయిన, లేదా పులిసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే మిగిలిన పెరుగును తాలింపు పెట్టుకుంటే, రుచిగానూ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ పెరుగులో కాస్త మైదా, వరిపిండి కలిపి అట్లు పోసుకొని తినవవచ్చు. బోండాల్లా వేసుకొని తినవచ్చు. పుల్లట్లుపెరుగుతో చేసుకునే అట్లు భలే రుచిగా ఉంటాయి. పెరుగులో ఒక కప్పు మైదా, రెండు కప్పుల బియ్యం పిండి కలిపి కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాలంటే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా కలుపు కోవచ్చు. దోసెలు వేసుకునే ముందు సన్నగాతరిగిన ఉల్లి, పర్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఉప్పు వేసి దోశల పిండిలా జారుగా ఉండాలి. వేడి వేడి పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ దోసలను దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. అల్లం లేదా టమాటా చట్నీతో బ్రేక్ఫాస్ట్లా లేదంటే ఈవినింగ్ టిఫిన్లా తినవచ్చు.మజ్జిగ పులుసు పులిసిన పెరుగును కాస్త నీరు కలిపి మజ్జిగలా చేయండి. దాంట్లో రెండు టీ స్పూన్ల శెనగపిండి కలిపి పక్కనుంచుకోవాలి. కుక్కర్లో సొరకాయ, బెండకాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కాసిన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. రెండు, మూడు కూతలు వచ్చేదాకా ఆగాలి. ఆ తరువాత మూత తీసి, కొత్తి మీర చల్లి, కొద్దిసేపు మరగనివ్వాలి. ఇపుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి మరో రెండు నిమిషాలు మరగనిస్తే చాలు. చివరిగా దీన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు పెట్టుకోండి. ముద్దపప్పు , మజ్జిగపులుసు కాంబినేషన్ అదుర్స్ . సింపుల్గాఎండుమిర్చి, మెంతులు, కరివేపాకుతో తాలింపు వేసి, పచ్చి ఉల్లిపాయ ముక్కులు, క్యారెట్ తురుము కలుపుకుని వేడి వేడి అన్నంతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. బోండాలుపెరుగులో మైదా, బియ్యం పిండి,కాస్త వంట సోడా కలిపి పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే రెండు మూడు గంటలు నానిన తరువాత బాగా బీట్ చేసి బోండాల్లాగా వేసుకుంటే రుచిగా ఉంటాయి. (పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే బోండాలు పేలే అవకాశం ఉంది). కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ, పర్చిమిర్చి, కొత్తిమీరలను ముక్కలుగా చేసి కలుపుకుని కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకోవడమే. అల్లం ,లేదా పల్లీ చట్నీతో తింటే ఆహా అనాల్సిందే.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?మరికొన్ని చిట్కాలు మిగిలిపోయిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు.. దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్ తయారీలోనూ వాడుకోవచ్చు. స్మూతీస్ చేసే క్రమంలోనే బ్లెండర్లో పండ్లు, తేనె, కొన్ని ఐస్ముక్కలతో ΄ాటు కొద్దిగా పెరుగు వేసి బ్లెండ్ చేస్తే దాని రుచి పెరుగుతుంది.మటన్, చికెన్ వండే ముందు చాలా మంది మ్యారినేట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పెరుగును కూడా కలిపితే మాంసం ముక్కలు మరింత మృదువుగా మారి త్వరగా ఉడకటమే కాదు, కూర రుచి మరింత పెరుగుతుంది.సలాడ్ గార్నిష్/డ్రస్సింగ్ కోసం కొత్తమీర/పుదీనా వంటి ఆకులు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ నూనె వంటివి వాడుతుంటారు. అయితే క్రీమీగా చిలికిన పెరుగును వాటి పైనుంచి సన్నటి తీగలాగా పోస్తే సలాడ్ నోరూరిస్తుంది. ఇంకా తింటుంటే మధ్యమధ్యలో పుల్లపుల్లగా నోటికి తగులి టేస్టీగా ఉంటుందని అంటున్నారు.చిప్స్, క్రాకర్స్, కాల్చిన కాయగూర ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రై స్ వంటి వాటిని వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన డిప్పింగ్ సాస్లో ముంచుకొని తింటుంటారు. అయితే ఈ డిప్స్ తయారీలో కొద్దిగా పెరుగును ఉపయోగిస్తే వాటి రుచి, చిక్కదనం పెరుగుతాయి. పెరుగుతో రుచికరమైన డిప్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ఒక క్లాత్లో వేసి అందులోని నీటిని తీసేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా చిలికితే క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలుపుకోవాలి. ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్వీట్కార్న్ వంటివి జత చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్! -
విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే ఎలా? కృష్ణ మందహాసం
సరిగ్గా యుద్ధం ఆరంభం కాబోతుండగా, అర్జునుడు అకస్మాత్తుగా అశ్రునయనాలతో ‘నేను ఈ యుద్ధం చేయ లేను!’ అనేశాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ‘తం ఉవాచ హృషీకేశః ప్రహసన్ ఇవ.’ సమాధానం విషయం తరవాత. తనకు అత్యంత ఆప్తుడూ, మహావీరుడూ అంతటి విషాదగ్రస్థుడై ఉంటే, అచ్యుతుడికి చిరునవ్వు ఎందుకు వచ్చినట్టు అంటే చాలా కారణాలు కనిపిస్తాయి. సమ్మోహనకరమైన చిరునవ్వు శ్రీకృష్ణుడి సహజ లక్షణం. ఆయన నల్లనివాడూ, నవ్వు రాజిల్లెడి మోమువాడూ కదా! అదొక కారణం.ఎన్నో ఆశలు తన మీద పెట్టుకొని, ఇంత సేన యుద్ధంలోకి దిగ గానే, తమ పక్షంలో అందరికంటె గొప్పవీరుడు ‘నేను యుద్ధం చేయను, పొ’మ్మంటే, సామాన్యుడయితే కోపావేశంలో మునిగి పోయేవాడు. కానీ, విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే, తల పెట్టిన కార్యం తలకిందులవుతుందని ఆ ఘటనాఘటన సమర్థుడికి బాగా తెలుసు. కనక ఆయన చిరునవ్వు చెదరలేదు.శ్రీకృష్ణుడి చిరునవ్వుకు ముఖ్య కారణం అర్జునుడి ఆవేదన వెనక ఉన్న అజ్ఞానమూ, అమాయకత్వమూ! ‘నేను స్వజనాన్ని చంపితే పాపాన్ని పొందుతాను!’ అన్న అభ్యంతరం ఆధ్యాత్మిక దృష్ట్యా అన్నివిధాలా అవక తవకగా ఉంది. ఆయన ‘నేను, నేను’ అని అహంకరిస్తు న్నాడు, ‘నేను’ అంటే ఎవరో గ్రహించకుండా. ‘స్వజనం, బంధుమిత్రులూ’ అంటూ ‘మమ’కారం చూపుతున్నాడు, ఆత్మస్వరూపుడైన తనకు స్వజనం–పరజనం అన్న పరి మితులు లేవని విస్మరించి! ‘చంపటం’ గురించి వాపోతు న్నాడు, చావు గురించిగానీ, చంపేదెవరూ, సమసేదెవరూ అని గానీ సరైన ఎరుక లేకుండా! ‘పాపం తగులుతుంద’ని బాధపడుతున్నాడు, ఎటువంటి కర్మల వల్ల పాప పుణ్యాలు చుట్టుకొంటాయో, ఎలాంటి కర్మలవల్ల పాప పుణ్యాల బంధనాలను తప్పించుకోవచ్చో మరచిపోయి! మహామహా వీరులు కూడా జగన్మాయకు అతీతులు కాలేరు గదా అన్న స్ఫురణ కలిగి, మాధవుడి ముఖాన ముందొక మందహాసం వెలిగింది. ఆ తరవాత వివరంగా గీతాబోధ చేశాడు.– ఎం. మారుతి శాస్త్రి -
ఏడేళ్లకే తైక్వాండో శిక్షకురాలిగా గిన్నిస్ రికార్డు..!
కొంతమంది చిన్నారులు అత్యంత చిన్న వయసులో అపారమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంటారు. వారి అద్భుతమైన ప్రతిభ ఎవ్వరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడమే గాక కట్టిపడేస్తాయి. అంతేగాదు వాళ్లని చూడగానే "పిట్ల కొంచెం కూత ఘనం" అనే ఆర్యోక్తి గుర్తుకురాక మానదు. అలాంటి ప్రతిభ పాటవాలనే ప్రదర్శిస్తోంది ఈ చిన్నారి. చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన విద్యలో ఆరితేరి శెభాష్ అనిపించుకుంటోంది.ఆ చిన్నారే మధురైకి చెందిన ఏడేళ్ల సంయుక్త నారాయణన్. అసాధారణమైన తైక్వాండో నైపుణ్యాలతో యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఆ అసాధారణమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా. అంతేగాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్స్టా పోస్ట్లో ఏడేళ్ల 270 రోజుల వయసులో అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా చరిత్ర సృష్టించిందని పేర్కొంది. ఈ చిన్నారి ఎంతో మంది పిల్లలకు ప్రేరణ. పిల్లలను క్రీడలకు సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే వారిలోని అపారమైన నైపుణ్యాలు వెలికివస్తాయనేందుకు ఈ చిన్నారే నిదర్శనం. అయితే నెటిజన్లు ఈ గిన్నిస్ పోస్ట్పై రకరకాలుగా స్పందించారు. కొందరేమో చిన్న వయసులో తైక్వాండో సాధన చేయడం హానికరం అని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం పిల్లలు అసాధారణమై విజయాలు అందుకోగలరని ప్రూవ్ చేసింది ఆ చిన్నారి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..! తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..) -
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
సునీతా విలియమ్స్కు స్పేస్ సెంటరే కుటుంబం అంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. ఆమెకు ఏది ఇష్టమో తమకు అదే ఇష్టం అని చెబుతారు. తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా (Ursuline Bonnie Zalokar) వారి ముగ్గురు సంతానంలో సునీత చిన్నది. అన్నయ్య జె.థామస్తో పాటు అక్క దీనా ఆనంద్ ఉన్నారు. అమెరికాలోనే జన్మించిన సునీత చదువు అంతా అక్కడే సాగింది. చదువు పూర్తయ్యాక తండ్రి దీపక్ పాండ్యా (Deepak Pandya) సూచనలతో అమెరికన్ నేవీలో జాయిన్ అయ్యారు.నేవీలో పనిచేస్తున్న సమయంలోనే మైఖేల్ జె.విలియమ్స్ (Michael J. Williams)తో పరిచయం స్నేహంగా మారింది. వివాహ బంధంతో ఒక్కటై 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. టెక్సాస్లోని హ్యూస్టన్ శివారులో నివసిస్తున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని చెప్పే సునీతకు పెంపుడు కుక్క గార్బీ అంటే చాలా ఇష్టం. గార్బీతో ఉన్న ఫొటోలను సునీత తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది. 2012లో ఓం సింబల్ తీసుకెళ్లినట్టు చెప్పిన సునీత గణేష్ విగ్రహాన్ని ఎప్పుడూ తనకు తోడుగా తీసుకెళుతుందట. సునీత విశ్వాసాలకు విలియమ్స్ మద్దతు ఇస్తాడు. తల్లి బోనీ పాండ్యా కూతురి గురించి వివరిస్తూ.. ‘ఆమె సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. విధి నిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేస్తుంది. కూతురి నుండి చాలా కాలం దూరంగా ఉండటం మొదట్లో కష్టమయ్యేది. కానీ, ఇప్పుడు అది అలవాటయ్యింది. తను తనకు ఇష్టమైనది చేస్తోంది. అలాంటప్పుడు నేను బాధపడటం అంటూ ఉండదు. తన ప్రయత్నాల్లో తను ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకించి ఆమెకు ఎటువంటి సలహాలు ఇవ్వను. ఎందుకంటే, ఏం చేయాలో తనకే బాగా తెలుసు. అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ధీమాను వ్యక్తం చేస్తారు ఆమె తల్లి బోనీ పాండ్యా.బాల్యం నుంచి ధైర్యం ఎక్కువసునీతా విలియమ్స్ (Sunita Williams) తిరిగి భూమి పైకి వస్తున్న వార్త గురించి యావత్ ప్రపంచం స్పందన ఒకటే... ‘చాలా సంతోషంగా ఉంది’ అయితే ఇండియాలోని ఆమె కజిన్ మాత్రం ‘భయంగా ఉంది’ అంటున్నాడు. ‘వీలైనంత త్వరగా ఆమె భూమి మీదికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకో నాకు భయంగా ఉంది. ఆమె చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అంటున్నాడు దినేష్ రావత్.సుదీర్ఘమైన ప్రయాణం తరువాత భూమికి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ ఆ తర్వాత విపరీతమైన శారీరక మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఆయన ‘భయం’ అనే మాట వాడాడు. సునీతా విలియమ్స్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సునీత చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. నేను ఆమెను ఒంటె సవారీలకు తీసుకువెళ్లేవాడిని. సవారీ అయిపోయిన తరువాత కూడా దిగేది కాదు! సోమనాథ్ తీర్థయాత్రలతో పాటు దేశంలోని వివిధప్రాంతాలకు వెళ్లాం. సునీతకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఆమె తరచుగా నా చెయ్యి పట్టుకునేది. ఎందుకు ఇలా? అని అడిగితే నాన్నలా అనిపిస్తావు అని చెప్పింది’ అంటూ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లాడు దినేష్ రావత్.మా తరానికి స్ఫూర్తిప్రదాతనేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి సునీతా విలియమ్స్ గురించి చదువుతూ పెరిగాను. సైంటిస్ట్ (Scientist) కావాలనుకునే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కల్పనాచావ్లా భారతీయ మహిళల్లో కొత్త ఆలోచన రేకెత్తించారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చేసిన పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయి. మనదేశంలో అంతరిక్షం, పరిశోధన రంగాలను కెరీర్ ఆప్షన్స్గా ఎంచుకునే యంగ్ జనరేషన్ తయారైంది. మా తరం అలా తయారైనదే.సైంటిస్ట్గా సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్. అకుంఠిత దీక్ష, అంకితభావంతో పని చేయడం, అంతరిక్ష పరిశోధనల ద్వారా కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడంలో ఆమెకున్న ఆసక్తి, వాటిని ఛేదించడానికి చూపించే చొరవ అమోఘం. స్టెమ్ ఫీల్డ్లో భవిష్యత్తు తరాలు ఆమె అడుగుజాడల్లో నడుస్తాయి. మగవాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్న రంగంలో మహిళ కూడా విజయవంతంగా రాణించగలరని సునీతా విలియమ్స్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. – శరణ్య. కె. సైంటిస్ట్, బయోటెక్నాలజీ -
ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..!
పెర్ఫ్యూమ్లు తయారీలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాని తయారీ వెనుకున్న కృషని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పెర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పెర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ..దాని క్రేజ్కి సాటిలేదు ఏదీ..!. ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్ గ్రీన్ ఇదే. గంటకు వందలకొద్దీ బాటిళ్లు సేల్ అయిపోతాయట. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పెర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైనా స్టోరీ చూస్తే.."ప్రేమ" గొప్ప ఆవిష్కరణాలకు దారితీస్తుందా..! అనిపిస్తుంది. మరీ ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త..దాని తయారీకి ప్రేరేపించిన లవ్స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పెర్ఫ్యూమర్ జాక్వెస్ గెర్లైన్. 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ పెర్ఫ్యూమ్గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాలు రికార్డు స్టాయిలోనే ఉంటాయట. ఎన్నెన్ని కొంగొత్త బ్రాండ్లు కూడా దానిముందు నిలవజాలవని అంటారు మార్కెట్ నిపుణులు. జాక్వెస్ని ఈ పెర్ఫ్యూమ్ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథ అట. పారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వెస్కి షాజహాన్ లవ్స్టోరీ గురించి తెలిసిందట. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టమో తెలుసుకున్నాడట. ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్ని సృష్టించాడట. ఇక్కడ షాలిమార్ అంటే అత్యంత సువాసనా భరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయిందని, ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ని కట్టించాడని తెలుసుకుని చలించిపోయాడట. షాజహాన్ ప్రేమ ఆ ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి చక్రవర్తి గొప్ప ప్రేమను పొందిన మహారాజ్ఞీ ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువానభరితమైన సెంట్ని తయారుచేయాలని ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకున్నాడట. అలా జాక్వెస్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్ వెనిల్లా, గంధం,రెసిన్ బెంజోయిన్, ఐరిస్, ప్యాచౌలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపడేసే అద్భుతమైన పెర్ఫ్యూమ్ని తయారు చేశాడు. అయితే దాని బాటిల్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండాలని భావించి అసాధారణమైన డిజైన్ని ఎంపిక చేసుకున్నాడు. నీలిరంగు, ఫ్యాన్ ఆకారపు బాటిల్తో ఈ పెర్ఫ్యూమ్నీ తీసుకొచ్చాడు. ఈ బాటిల్ని బాకరట్ క్రిస్టల్తో తయారు చేశారట. అంతేగాదు ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళల ప్రదర్శన అవార్డు(ఇంటర్నెషనల్ డెకరేషన్ అవారడు)ని గెలుచుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఫెర్ఫ్యూమ్ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పెర్ఫ్యూమ్గా రికార్డులకెక్కింది. (చదవండి: లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..! వైరల్గా ఐఐటీ స్టూడెంట్ పోస్ట్) -
భూమి మీదకు రాగానే.. స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువ సమయం ఎందుకు?
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్కిచ్చే ట్రైనింగ్లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్లనే స్పేస్కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది.ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్సెట్తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్ను స్పేస్ స్టేషన్కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్లోనే ఫుడ్ ఇస్తారు. – డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రోభూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!సునీతా విలియమ్స్కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్తో జెట్లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది. చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందంఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది. -
పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే!
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో.. ఇంటి ముందున్న కరెంటి వైర్ల మీద చిలుకలతోబాటు కోయిలలు.. లెక్కకుమిక్కిలిగా ఊరపిచ్చుకలు.. కత్తెర పిట్టలు.. పాలపిట్టల.. ఒకటేమిటి.. ఊరు అంటేనే మనుషుల కన్నా పక్షులే ఎక్కువగా ఉండేవి.. కానీ కాలం మారింది.. మారుతోంది.. వేలాది పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. మనిషి తాను బతకడం కోసం పక్షులను పొట్టనబెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే సెల్ ఫోన్ టవర్ల కారణంగా పిచ్చుకలవంటి జీవాలు కనుమరుగైపోతున్నాయి.ఈ భూమి మనుషులకోసమే కాదు.. పశుపక్ష్యాదులు వంటి ఎన్నో జీవులకు ఆలవాలం.. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి మిగతా జీవులన్నింటినీ మింగేస్తూ తానొక్కడే భూగోళాన్ని ఏలాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే తూనీగలు.. నత్తగుల్లలు.. పలు రకాల చేపలు.. పిచుకలు వంటివి అంతరించిపోతున్నాయి. అయితే అందరూ ఇలా దారుణాలు చేస్తూ పోతుంటే ఎలా.. దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఈ జీవాల రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండే ఉంటారు.. దేవుడే ఎవరోఒకరికి బాధ్యత అప్పగించి ఉంటారు.. వాళ్ళే ఈ చిరు జీవుల రక్షణ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు. అనంతపురం పట్టణ యువత పక్షులను సంరక్షించేందుకు హోమ్ ఫర్ బర్డ్స్(Home For Birds) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనిల్ కుమార్(Anil Kumar) అనే యువకుడి సారథ్యంలోనే ఈ బర్డ్స్ సొసైటీ పక్షులకు ఇళ్ళు నిర్మిస్తోంది.. అవును.. పక్షుల కోసం గూళ్ళు కడుతూ వాటిని చెట్లకు వేలాడతీస్తోంది. అంతేకాకుండా ఔత్సాహికులకు వాటిని ఉచితంగా ఇస్తోంది.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని ఎలా అనిపించింది అనే ప్రశ్నకు అయన నా బాల్యంలో మా ఊళ్ళో... ఇంట్లో.. పొలంలో పెరట్లో ఎన్నో మొక్కలు చెట్లు ఉండేవి.. వాటిమీద రకరకాల పిచ్చుకలు.. పక్షులు సందడి చేసేవి.. వాటిని చూస్తూ ఆడుకునేవాళ్ళం .. ఇప్పుడు పట్టణాల్లో పారిశ్రామికీకరణ పెరిగింది.. ఎక్కడ చూసినా సెల్ ఫోన్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయి తప్ప పక్షులు వాలెందుకు.. అవి గూళ్ళు కట్టుకునేందుకు చెట్లే కరువయ్యాయి. దీంతో అవి తమ సంతతిని వృద్ధి చెందించుకోలేక క్రమేణా తగ్గిపోతున్నాయి. వాటికి మళ్ళీ మనం గూళ్ళు కల్పించి.. ఆహారం అందిస్తే మళ్ళీ మనచుట్టూ తిరుగుతూ సందడి చేస్తాయి. అందుకే వాటిని మళ్ళీ ఆహ్వానించాలని భావించి అనంతపురం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇలా గూళ్ళు అందిస్తున్నాం. రకరకాల పక్షులు తమ గూళ్ళను ఎలా రూపొందిస్తాయో. మేమూ అచ్చం అలాగే వాటిని తయారు చేసి పంచుతున్నాం. వీటిలో ఇప్పుడు పిచ్చుకలు.. పక్షులు నివాసం ఉంటున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన అంశం అని అయన చెబుతున్నారు.హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ పక్షుల అలికిడిని బట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉంటున్నాయనేది ఒక సర్వే మాదిరి చేసి ఆయా ప్రాంతాల్లో అలంటి గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.. స్కూళ్ళు.. విద్యాసంస్థలు.. కాలేజీలు.. పార్కులు.. పెద్దపెద్ద చెట్లు ఉన్న చోట్ల ఈ గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వాటికీ నీళ్లు ఆహారం కూడా అందిస్తూ వాటి మనుగడకు ఎంతో దోహదం చేస్తున్నారు. పక్షి నిపుణులతో మాట్లాడి.. ఏయే జాతి పక్షులు ఎలాంటి గూళ్ళు కడతాయనేది తెలుసుకుని ఆమేరకు నాలుగు రకాల గూళ్ళు తయారు చేసి అందజేస్తున్నారు. ఈ సంస్థ పుణ్యాన ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల పక్షుల సంతతి పెరిగింది.. వాటి సందడి సైతం పెరిగింది. మనం బతుకుదాం.. చిరు జీవులను బతికిద్దాం :::సిమ్మాదిరప్పన్న -
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్!
భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరేబియన్ దేశానికి విహారయాత్ర కోసం వెళ్లి, కనిపించ కుండా పోయిన సుదీక్ష ఆచూకీ ఇంకా మిస్టరీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తప్పిపోయిన తమ కుమార్తె సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించమని కోరినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోది. ఈ మేరకు సుదీక్ష కుటుంబం డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసులకు లేఖ రాసింది.అమెరికాలో శాశ్వత నివాసి వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష చివరిసారిగా మార్చి 6న పుంటా కానా పట్టణంలోని రియు రిపబ్లిక్ రిసార్ట్లో కనిపించింది. మెడిసన్ చదవాలని కలలు కన్న ఆమె, వెకేషన్లో భాగంగా ఐదుగురు స్నేహితులతో కలిసి డొమినికా రిపబ్లిక్ దేశానికి వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికినా, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినా ఆమె ఆచూకీ లభించలేదు. View this post on Instagram A post shared by De Último Minuto (@deultimominutomedia)మరోవైపు తమ కుమార్తె అదృశ్యమై 12 రోజులు కావొస్తున్నా ఎలాంటి ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసు ప్రతినిధి డియాగో పెస్క్వేరా మాటలను ఉటంకిస్తూ NBC న్యూస్ మంగళవారం నివేదించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘సుదీక్ష కోణంకి అదృశ్యం విషాదకరం, ఆమె కుటుంబం అనుభవిస్తున్న దుఃఖాన్ని ఊహించలేం.. సుదీక్ష మునిగిపోయి ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె ఫ్యామిలీ వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటన చేయాలనే తుది నిర్ణయం డొమినికన్ రిపబ్లిక్ అధికారులదే అయినప్పటికీ, తాము బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని’ అధికారులు ప్రకటించారు. ఇది మిస్సింగ్ కేసు తప్ప, క్రిమినల్ విషయం కాదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే ఆమె మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్నిచట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. సుదీక్ష అదృశ్యంలో ఎవరినీ అనుమానితులుగా పరిగణించలేదని డొమినికన్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు.కాగా సుదీక్ష ఆచూకో కోసం అక్కడి పోలీసులు అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో గాలించారు. కిడ్నాప్కు గురైందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఈక్రమంలోనే బీచ్ వద్ద ఆమె బట్టలు, చెప్పులు దొరకాయి. వాటిని సుదీక్ష స్నేహితులు గుర్తించారు కూడ . సుదీక్షతో కలిసిచివరిసారి కనిపించిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబెత్ అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే మార్చి 6వ తేదీ రోజు తామిద్దరం కలిసే బీచ్కు వెళ్లామని,సుదీక్షతో పాటు తాను కూడా ఉన్నట్లు రిబె అంగీకరించాడు. ఒక పెద్ద అల వారిని బలంగా తాకిందని, దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని, అలల తాకిడికి గురైన ఆమెను రక్షించలేక పోయానన్నరిబె మాటలను విశ్వసింఇన పోలీసులు అతనిపై ఎలాంటి ఆరోపణలు నమోదు చేయలేదు. కానీ అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. -
లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..!
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఏ విద్యార్థి అయినా లక్షల ప్యాకేజీ జీతంపైనే దృష్టిపెడతారు. అందుకోసం అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం అహోరాత్రులు కష్టపడతారు. అయితే ఈ మహిళ కూడా ఆ ఆశతోనే అంతలా కష్టపడి ఐఐటీ, ఐఐఎం వంటి వాటిలలో విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసింది. అనుకున్నట్లుగానే ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలలో లక్షల ప్యాకేజీ ఉద్యోగ పొందింది. అయితే లైఫ్ ఏదో సాదాసీదాగా ఉందన్నే ఫీల్. ఏదో మిస్ అవుతున్నా..అన్న బాధ వెంటాడటంతో తక్షణమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఓబ్రాండెడ్ బిజినెస్ పెట్టాలనుకుంది. అందులో పూర్తి విజయం అందుకుంటానా..? అన్నా ఆలోచన కూడా లేకుండా దిగిపోయింది. మరీ ఆ ఆమె తీసుకున్న నిర్ణయం లైఫ్ని ఎలా టర్న్ చేసింది ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఆ మహిళే రాధిక మున్షి. ఆమె రెండు ప్రతిష్టాత్మక సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థిని. తాను లక్షల జీతం అందుకునే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని చీరబ్రాండ్ అనోరాను స్థాపించాలనే నిర్ణయంతో మలుపు తిరిగిన తన కెరియర్, ఆ తాలుకా అనుభవం తనకు ఏ మిగిల్చాయో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. మరీ ఇంతకీ రాధికా తన నిర్ణయం కరెక్టే అంటోందా..?ఇన్స్టా పోస్ట్లో "తాను ఐఐటీ, ఐఐఎంలలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో అత్యధిక జీతం అందుకోవడమే నా ప్రథమ లక్ష్యం. అయితే నేను ఎన్నడు అనుకోలేదు సొంతంగా బిజినెస్ పెడదామని. అందువల్లే నేను అనుకున్నట్లుగానే పెద్ద కార్పొరేట్లో అత్యథిక పారితోషకంతో ఉద్యోగం సాధించాను. అయితే ఏదో రోటీన్గా తన ఉద్యోగం లైఫ్ సాగిపోతుందంతే. ఆ తర్వాత ఎందుకనో ఇది కెరీర్ కాదనిపించి వెంటనే చీర బ్రాండ్ అనోరాను ప్రారంభించాను. మొదట్లో చీరల డిజైన్ చూసి కాస్త భయం వేసింది. అసలు జనాలు నా చీరలను ఇష్టపడతారా అని?..కానీ జనాలకు నచ్చేలా ఏం చేయాలో కిటుకు తెలుసుకున్నాక.. సేల్స్ చేయడం ఈజీ అయిపోయింది. ఇలా వ్యవస్థాపకురాలిగా మారిన క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా..అయితే వాటిని అధిగమిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం, కిక్కు దొరికేది. తాను లక్షల కొద్ది జీతం పొందినప్పుడు కూడా ఇలాంటి సంతృప్తిని అందుకోలేకపోయానంటూ సగర్వంగా చెప్పింది. అయితే సమాజం, చుట్టూ ఉండే బంధువులు ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచిత, తప్పుడు నిర్ణయంగా చూస్తారు. కానీ మనమే ధైర్యంగా ముందడుగు వేయాలి, ఏం జరిగినా సహృద్భావంతో ముందుకెళ్లాలి. పడినా గెలిచినా అది మన ఆలోచన నిర్ణయంతోనే జరగాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం అంటూ తన స్టోరీ పంచుకుంది". వ్యవస్థాపకురాలు మున్షీ. కాగా, ఆమె 2023లో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె బ్రాండ్కి చాలామంది కస్టమర్లు ఉన్నారు. వారిచ్చే రివ్యూలను బట్టే చెప్పొచ్చు ఆమె బ్రాండ్ ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన స్థానం పొందిదనేది. View this post on Instagram A post shared by Anorah ✨ Contemporary sarees (@anorah.in) (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
Sai Divesh Chowdary : అమెరికాలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల ప్యాకేజీ
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్మేకర్ ఎన్విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు. -
స్ప్రే డ్రైడ్ అవొకాడో పౌడర్..!
అవొకాడో పండులో పౌష్టిక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా మెండుగా ఉన్నాయి. ఇది సీజనల్ ఫ్రూట్. కొద్ది నెలలే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు కాబట్టి, పొడిగా మార్చి పెట్టుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రీసెర్చ్ పండ్ల పరిశోధనా విభాగం అధిపతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. జి. కరుణాకరన్, తదితర శాస్త్రవేత్తలు అవొకాడోపై విస్తృత పరిశోధన చేస్తున్నారు. ఐఐహెచ్ఆర్ అవొకాడో పండును ప్రీసెసింగ్ చేసి స్ప్రే డ్రయ్యింగ్ పద్ధతిలో పొడిగా మార్చే సాంకేతికతను రూపివదించింది. అత్యంత నాణ్యమైన అవొకాడో పొడిని ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. గది సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే ఈ పొడి మూడు నెలల పాటు నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అవొకాడో పండును ఏడాది పొడవునా నిల్వ చేయటం కష్టం. అయితే, ఈ పొడిని నిల్వ చేయటం, రవాణా చేయటం సులభం. ఈ ఉత్పత్తికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. రూపాయి పెట్టుబడి పెడితే 1.78 రూపాయల ఆదాయాన్ని పొందటానికి స్ప్రే డ్రయ్యింగ్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఆసక్తి గల ఆహార పరిశ్రమదారులు ఐఐహెచ్ఆర్కు నిర్దేశిత ఫీజు చెల్లించి ఈ సాంకేతికతను పొంది అవొకాడో పొడిని తయారు చేసి అనేక ఉత్పత్తుల్లో వాడుకోవచ్చు లేదా దేశ విదేశాల్లో విక్రయించుకోవచ్చు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ వెబ్సైట్ చూడండి. (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!
ఇంటిని పచ్చని పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చిన విశ్రాంత ప్రధానోపాధ్యాయిని ఆహారమే ఆరోగ్యం అనే సూత్రాన్ని నమ్మి.. ఇంటినే ఆరోగ్యదాయక పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చారు మచిలీపట్నానికి చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుని. ఆమే ఎండీ ముంతాజ్బేగం.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా 2019లో ముంతాజ్బేగం ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేస్తుందని ఆమె ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. తాను మొదట ఆచరించి, తర్వాత ఇతరులకు చెప్పాలన్నా వ్యక్తిత్వం ఆమెది. ఇంటి నుంచి వచ్చే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేసి పెంచుతూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. మునగాకు, బెల్లం కలిపి నీళ్లలో నానబెట్టి మొక్కలకు పోయటం.. పొగాకును నీళ్లలో వేసి రెండు, మూడు రోజులు నానబెట్టి మొక్కల వేర్లకు వేస్తే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు నివారించవచ్చని ఆమె తెలిపారు. పెసలు, మినుము, ఉలవలు, బార్లీ, నువ్వులు నానబెట్టి గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి మొక్క వేళలో వేస్తే, మంచి దిగుబడి వస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్యదాయకంగా పెంచుకున్న కూరగాయలు, పండ్లు తింటే ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆమె ఘంటాపధంగా చెబుతున్నారు. సేంద్రియ ఇంటిపంటలు ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.మానసిక, శారీరక ఆరోగ్యంముంతాజ్ ఇంటి ఆవరణలో, మిద్దెపై ఎన్నో రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మొక్కలను సంరక్షిస్తే మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని ఆమె చెబుతున్నారు. మామిడి, జామ, అరటి, డ్రాగన్, చెర్రీ, వాటర్ యాపిల్, నేరేడు, అంజూర, ఫ్యాషనఫ్రూట్, పీ నట్ బటర్, బొప్పాయి పండ్ల మొక్కలతో పాటు ΄పాలకూర, చుక్కకూర, ఆకుకూరల మొక్కలతోపాటు వంగ, టమాట, అలసంద, మునగ, అరటి, మల్బరీ ఆకులతోపాటు వంద రకాల క్రోటస్ను ఆమె తమ ఇంటి ఆవరణలో, మేడపైన పెంచుతున్నారు. మొక్కలే ప్రాణం.. ఇంటిపంటల ధ్యానం!మొక్కలే ప్రాణంగా ప్రతి రోజు నా దినచర్య ఉంటుంది. రోజు మూడు, మూడున్నర గంటలు వీటి సంరక్షణ కోసం వెచ్చిస్తుంటాను. మొక్కలను సంరక్షిస్తే సమాజం ఆరోగ్యం బాగుంటుందని, భవిష్యత్తు మన చేతిలోనే ఉందనేది అందరికీ తెలియజేయాలనేదే నా తపన. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర సేంద్రియ చెత్తను మునిసి΄ాలిటీ వారికి ఇవ్వకుండా, ఇంటిపట్టునే కం΄ోస్టు ఎరువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నర్సరీ నుంచే పిల్లలకు మొక్కలను పెంచటంపై అవగాహన కల్పిస్తే మంచి భవిష్యత్తు సమాజాన్ని సృష్టించుకోవచ్చు. – ఎండీ ముంతాజ్ బేగం, ఇంటి పంటల సాగుదారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, మచిలీపట్నం – అంబటి శేషుబాబు, సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం). (చదవండి: ఎదురు లేని వెదురు) -
ఎదురు లేని వెదురు
వెదురు.. గ్రీన్ గోల్డ్.. అవును! ఈ విషయంలో మీకేమైనా సందేహం ఉందా? అయితే.. శివాజీ రాజ్పుట్ అనే అద్భుత ఆదర్శ వెదురు రైతు విశేష కృషి గురించి తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన శివాజీ 25 ఎకరాల్లో వెదురును చాలా ఏళ్ల నుంచి సాగు చేస్తూ ప్రతి ఏటా రూ. 25 లక్షలను సునాయాసంగా ఆర్జిస్తున్నారు. తనకున్న 50 ఎకరాల పొలంలో పాతిక ఎకరాల్లో 16 రకాల వెదురు తోటను పెంచుతున్నారు. మిగతా 25 ఎకరాలను ఇతర రైతులకు కౌలుకు ఇచ్చారు.వెదురు సాగులో కొద్దిపాటి యాజమాన్య చర్యలు తప్ప చీకూ చింతల్లేవు, పెద్దగా కష్టపడాల్సిందేమీ ఉండదు. ఏటేటా నిక్కచ్చిగా ఆదాయం తీసుకోవటమే అంటున్నారు శివాజీ. వెదరు సాగు ద్వారా పర్యావరణానికి బోలెడంత మేలు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ఉద్యమ స్ఫూర్తితో బంజరు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటటం ద్వారా పర్యావరణానికి మరెంతో మేలు చేస్తున్నారు. ఆయన నాటిన 7 లక్షల చెట్లు ఆయన హరిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఆయనకు 30కి పైగా పర్యావరణ పరిరక్షణ పురస్కారాల పంట పండించాయి! ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, యుఎస్ఎ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వంటి పురస్కారాలు ఆయనకు లభించాయి. పెద్ద కమతాల్లో వెదురు సేద్యానికి సంబంధించి శివాజీ రాజ్పుట్ అనుభవాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.శివాజీ రాజ్పుట్ వయసు 60 ఏళ్లు. వినూత్న రీతిలో వెదరును సాగు చేయటం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయటం ద్వారా ఆయన తన జీవితాన్ని ఆకుపచ్చగా మార్చుకోవటమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఆకుపచ్చగా మార్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాతికేళ్లుగా విశేష కృషి చేస్తున్న శివాజీ గత ఆరేళ్లుగా వెదురు తోటను సాగు చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనేలా వ్యవసాయాన్ని కొనసాగించటంలో, పర్యావరణ పరిరక్షణ కృషిలో, గ్రామీణాభివృద్ధి రంగంలో మహారాష్ట్రలో ఇప్పుడాయన ఒక మేరు పర్వతం అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేస్తున్న కృషి భూతాపోన్నతిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతోంది.వెదురు సాగుకు శ్రీకారం..రాజ్పుట్ గతంలో అందరు రైతుల మాదిరిగానే ఒకటో రెండో సీజనల్ పంటలను రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పండించే వారు. అయితే, భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపరీత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడేవారు. ‘భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపత్తులు వచ్చిపడినప్పుడు సాధారణ పంటలు సాగు చేస్తున్నప్పుడు ఒక్కోసారి పంట పూర్తిగా చేజారిపోయేది. కానీ, వెదురు తోట అలాకాదు. నాటిన ఒక సంవత్సరం తర్వాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏటేటా నిరంతరం పెట్టుబడుల అవసరమే ఉండదు..’అంటారు శివాజీ. సాధారణ పంటల సాగును చుట్టుముట్టిన అనిశ్చితే తనను నిశ్చింతనిచ్చే వెదరు సాగువైపు ఆకర్షించిందంటారాయన. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలను కౌలుకు ఇచ్చి, 25 ఎకరాల్లో వెదురు నాటారు. ఈ నిర్ణయమే తన వ్యవసాయాన్ని మేలి మలుపు తిప్పింది. ‘వెదురు సాగులో విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిందేమీ ఉండదు.వెదురు మొక్కలు వేరూనుకొనే వరకు మొదటి ఏడాది కొంచె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పని గానీ, పెట్టుబడి గానీ అవసరం ఉండదు. మొదటి ఏడాది తర్వాత నేను పెద్దగా పెట్టిన ఖర్చేమీ లుదు. కానీ, ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. వెదురు తోట ద్వారా నాకు ఏటేటా రూ. 25 లక్షల ఆదాయం వస్తోంది..’ అంటారు శివాజీ గర్వంగా!వెదురు: ఆకుపచ్చని బంగారంవెదరుకు ఆకుపచ్చని బంగారం అని పేరు. ఈ తోట సాగులో అంత ఆదాయం ఉంది కాబట్టే ఆ పేరొచ్చింది. ‘ఈ భూగోళం మీద అతి త్వరగా పెరిగే చెట్టు వెదురు! పర్యావరణానికి ఇది చేసే మేలు మరేఇతర చెట్టూ చెయ్యలేదు. ఇది 24 గంటల్లో 47.6 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఇతర చెట్ల కన్నా 35% ఎక్కువ కార్బన్ డయాక్సయిడ్ను పీల్చుకొని 30% అదనంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. భూతాపోన్నతిని ఎదుర్కొనే కృషిలో ఇందుకే వెదురు అతికీలకంగా మారింది’ అని వివరించారు శివాజీ. బహుళ ప్రయోజనకారి కావటం అనే మరో కారణం వల్ల కూడా వెదురు సాగు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాజ్పుట్ తన తోటలో 19 రకాల వెదురును సాగు చేస్తున్నారు. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగరొత్తుల ఉత్పత్తి ఉపయోగపడేది ఒకటైతే, బొగ్గు తయారీకి మరొకటి, బయోమాస్ ఇంధనం ఉత్పత్తికి మరొకటి.. ఇలా ఒక్కో రకం ఒక్కో పనికి ఎక్కువగా పనికొస్తాయి. ‘వెదురు బొంగులు, ఆకులు పెల్లెట్లు తయారు చేస్తారు.పౌడర్లు బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడుతారు. ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. సాధారణ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి అంటారు శివాజీ. వెదురును సాగు చేయటం దగ్గరే ఆయన ఆగిపోవటం లేదు. వెదురు బొంగులతో ఫర్నీచర్ను, అగరొత్తులను కూడా తానే తయారు చేయాలన్నది ఆయన సంకల్పం. సుస్థిర జీవనోపాధిని అందించగలిగిన వెదురు సాగు ప్రయోజనాల గురించి ఆయన ఇతర రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ‘136 రకాల వెదురు వంగడాలు ఉన్నాయి. వాటిల్లో 19 రకాలను నేను సాగు చేస్తున్నా. ప్రతి రకానికి ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వెదురు బొంగుల బలం, బరువు ఆధారపడి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఏ రకాలు కావాలో ఎంపిక చేసుకొని నాటుకోవటం ఉత్తమం’ అనేది ఆయన సూచన.ఆచరణాత్మకంగా ఉండే ఆయన సూచనలు ఇతర రైతులను అనుసరించేలా చేస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం నుంచ వనశ్రీ పురస్కారంతో పాటు ఇందిరా ప్రియదర్శిన వృక్షమిత్ర అవార్డు వంటి మొత్తం 30 వరకు అవార్డులు ఆయనను వరించాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటినిపొదుపుగా వాడుకోవటం వీలుకావటంతో పాటు వెదురు మొక్కలు ఏపుగా పెరగానికి కూడా ఇది ఉపయోగపడిందంటారాయన.వనశ్రీ ఆక్సిజన్ పార్కువనశ్రీ ఆక్సిజన్ పార్క్ను రాజ్పుట్ మూడేళ్ల క్రితం నిర్మించారు. చనిపోయిన తమ ప్రియతముల గౌరవార్థం ఇటువంటి వనశ్రీ ఆక్సిజన్ పార్కులు ్రపారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నా ప్రియతముల పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నా. ఇతరులను కూడా ఇదే కోరుతున్నా’ అన్నారాయన. వెదురు సాగు భవిష్యత్తు తరాల బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు పెట్టే తెలివైన పెట్టుబడే అంటారాయన. ఇతర రైతులకు ప్రేరణరాజ్పుట్ వెదురు తోట విజయగాథతో ప్రేరణ పొందిన రైతులు పలువురు ఆయనను అనుసరిస్తున్నారు. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో ఆయన సూచనల ప్రకారం 250 ఎకరాలకు వెదురు తోటలు విస్తరించాయి. పేపరు ఉత్పత్తికి వెదురు ఉపయోగపడుతుంది. స్థానికులకు, గ్రామీణ జనసముదాయాలకు వెదరు సాగు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదంటారాయన. భూమిని పర్యావరణానికి అనుగుణంగా వినియోగించడాన్ని ్రపోత్సహించదలిస్తే వెదురును విస్తృతంగా సాగు చేయించాలని సూచిస్తున్న రాజ్పుట్ వెదురు భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆయన 7 లక్షలకు పైగా ఇతరత్రా మొక్కలు నాటించటం వల్ల ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పూర్వస్థితికి పెరిగింది. వర్షానికి మట్టి కొట్టుకుపోవటం తగ్గింది. వన్య్రపాణులకు ఆవాసాలు పెరిగాయి. -
గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్స్టేషన్లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్స్టేషన్లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
నీతా అంబానీ ధరించిన ఈ లాకెట్ స్పెషాల్టీ తెలిస్తే... ఆశ్చర్యపోతారు!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (nita ambani) ఫ్యాషన్కి పెట్టింది పేరు. ప్రతీ సందర్భంలోనూ తన స్టైల్తో ఆకట్టుకుంటుంది. అది ట్రెడిషనల్ లుక్ అయినా మెడ్రన్ లుక్ అయినా అందరి దృష్టినీ ఆకర్షించాల్సిందే. అది అత్యంత విలువైన చీర అయినా, ఖరీదైన డైమండ్ నగలైనా దానికొకి స్పెషాల్టీ ఉంటుంది. ఫ్యాషన్ (Fashion) నిపుణులు కూడా ఫ్యాఆమెను ప్రశంసలతో ముంచెత్తేలా చేస్తుంది. తాజాగా ఆమె ధరించిన హారంలోని పెండెంట్ విశేషంగా నిలుస్తోంది.నీతాఅంబానీఅందమైన దుస్తులు, విలాసవంతమైన ఆభరణాలతో అభిమానులను ఆశ్చర్యపర్చడం కొత్తేమీదు. 20 ఏళ్ల నాటి చిలుక లాకెట్టు (Parrot Pendant) ఇపుడు హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఇది మైసూర్ మహారాజా యదువీర్ తన పెళ్లి రోజున ధరించిన దానితో పోలీ ఉండటం విశేషం. ప్రాముఖ్యత కూడా చాలానే ఉంది .అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రైవేట్ విందు కోసం నీతా అంబానీ రెండు శతాబ్దాల నాటి, ప్యారెట్ లాకెట్తోపాటు, బ్లాక్, పర్పుల్, గ్రీన్ కలర్ కాంచీపురం చీరలో మెరిసారు. ఈ చీరలో 100 కంటే ఎక్కువ ముఖ్యమైన సాంప్రదాయ నమూనాలు ఉన్నాయి. ముఖ్యంగా న కాంచీపురంగొప్ప దేవాలయాల ప్రేరణ, చారిత్రక ,ఆధ్యాత్మిక సారాంశం కలయికలో దీన్ని తయారు చేశారు. ఈ చీరకున్న గ్రీన్, పర్పుల్ అంచులు మొత్తం చీర రూపాన్ని హైలైట్ చేశాయి. అలాగే దీనికి మ్యాచింగ్గా స్వదేశ్ నుండి వచ్చిన మణికట్టు మీద నిగనిగలాడే అంచులతో పూర్తి చేతుల బ్లౌజ్తో ధరించారు. చిన్న నల్ల హ్యాండ్బ్యాగ్ను కూడా దీనికి జతచేసింది. ప్యారెట్ పెండెంట్ఈ విందులో నీతా అంబానీ ధరించిన పచ్చ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. వజ్రాలు, కెంపులు , పచ్చలతో ముత్యాలతో పొదిగిన చిలుక ఆకారపు లాకెట్. దీని మధ్యలో పొదిగిన రూబీ హార్ట్ హైలైట్ అని చెప్పవచ్చు.దీన్ని మొదట దక్షిణ భారతదేశంలో తయారు చేశారు. దీన్ని మైసూర్ మహారాజు యదువీర్ చామరాజ వడియార్, యువరాణి త్రిషికా కుమారితో తన వివాహ సమయంలో ఇలాంటి రకమైన చిలుక లాకెట్టును ధరించాడు. లాకెట్టుకు లోతైన ప్రాముఖ్యత ఏంటంటే.. లాకెట్టులోని పక్షి బొమ్మ వాస్తవానికి కామదేవుడి వాహనము (ప్రేమ దేవుడు).అంతకుముందు నీతా అంబానీ మొఘల్ కాలం పురాతన ఆభరణాలను ఎంచుకున్నారు. గత ఏడాది నీతా అంబానీ మిస్ వరల్డ్ పోటీలో కనిపించారు. బ్లాక్ టోన్ సారీ, క్లాసీ బాజుబంద్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బాజుబంద్ వాస్తవానికి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కల్గి అట. దీని ధర రూ. 200 కోట్లు అట.అత్యంత అందమైన ఆభరణాలలో మరొకటి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ డైమండ్ రింగ్. అనంత్ అంబానీ మంగళ్ ఉత్సవ్ వేడుకలో ఆమె దీనిని ధరించింది. ఈ ఉంగరం బరువు 52.58 క్యారెట్లు, టేపర్డ్ బాగెట్-కట్ వజ్రాలను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 53 కోట్లు అని తెలుస్తోంది. -
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్: బాడీలో ఇన్ని మార్పులా..?
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్లు వస్తాయో తెలిపారు. స్లిమ్గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు. వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్గా అర్థమైందన్నారు.జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..ఈ డైట్ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు. గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది. కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు. View this post on Instagram A post shared by Justin Gichaba | Nutrition Coach (@justin_gichaba) శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఆకలి తగ్గిపోవడం: కీటోన్లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు. జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు. ఎలా తీసుకుంటే బెటర్..జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?) -
HKU1 కోలకతా మహిళకు అరుదైన కరోనా, అప్రమత్తం అంటున్న వైద్యులు
కోల్కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనావైరస్ HKU1 (HCoV-HKU1) ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజా నివేదికల ప్రకారం హెచ్ కేయూ1 వైరస్ కారణంగా బాధిత మహిళ గత 15 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ వార్తతో దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి వచ్చిందనే ఆందోళన మొదలైంది. అసలు హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి? కరోనా అంత తీవ్రమైనదా? తెలుసుకుందాం ఈ కథనంలో.హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి?మానవ కరోనావైరస్ HKU1 (హాంకాంగ్ విశ్వవిద్యాలయం) 2004లో తొలుత గుర్తించారు.ఇది కరోనా వైరస్ జాతికి చెందినదే. కానీ అంత తీవ్రమైనదే. అయితే అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని నివారించాలని వైద్యులు కోరుతున్నారు. బాధిత మహిళను ఐసోలేషన్లో ఉంచినట్టు తెలిపారు. ఇది కోవిడ్-19 లాంటిది కాదని, కోవిడ్-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ కంటే తక్కువ తీవ్రమైనదని వారు స్పష్టం చేశారు.హ్యూమన్ కరోనావైరస్ HKU1ని బెటాకోరోనావైరస్ హాంగ్కోనెన్స్ అని కూడా పిలుస్తారు. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. అనేక రకాల హ్యూమర్ కరోనావైరస్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 229E, NL63, OC43, HKU1.. ఈ వైవిధ్యాలు సాధారణంగా సాధారణ జలుబు వంటి తేలికపాటి నుండి ఊపిరి ఆడకపోవడం లాంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.లక్షణాలు ఏమిటి?సీడీసీ (CDC), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institutes of Health) జలుబు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలుంటాయి. నిజానికి చాలా సాధారణమైనవి, తేలికపాటివి, కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే బ్రోన్కియోలిటిస్ , న్యుమోనియాకు దారితీస్తుంది.ముక్కు కారటం, జ్వరం, ముక్కు దిబ్బడ, సైనస్,, గొంతు నొప్పి, అలసట తలనొప్పిఎవరికి ప్రమాదం ఉంది?వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి.చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!ఎలా వ్యాపిస్తుంది?సాధారణంగా సోకిన వ్యక్తి నుండి దగ్గు, తుమ్ములనుంచి తుంపర్ల ద్వారా, రోగి దగ్గరి సంబంధం ఉన్నవారికి సోకవచ్చు. డోర్ హ్యాండిల్స్, ఫోన్లు లేదా టేబుల్స్ వంటి వస్తువులపై వైరస్ జీవించగలదు. రోగి తాకిన వాటిని తాకిన వస్తువులను తాకి శానిటైజ్ చేసుకోకుండా ముక్కు, నోరు లేదా కళ్ళను తాకిన వారు వ్యాధి బారిన పడవచ్చు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?సురక్షితంగా ఎలా ఉండాలిమానవ కరోనావైరస్లకు టీకా లేదా నిర్దిష్ట చికిత్స లేదు. చాలామంది తొందరగానే కోలుకుంటారు. అయితే, కొన్ని రోజుల్లో తగ్గకపోయినా, లక్షణాలు మరింత ముదిరినా వైద్యుడిని సంప్రదించడం మంచిది. -
అడవులకే వెళ్ళాలా? మనసే కీలకం!
పూర్వం అనుభవజ్ఞులైన ఆలోచనాపరులు జీవితానికి సంబంధించి వివిధ దశలలో వివిధ నియమాలను, జీవన పద్ధతులను నిర్దేశించి చెప్పి, ఆ పద్ధతుల ప్రకారం జీవనం సాగిస్తే జీవితం సాఫీగా సాగడమే కాకుండా, ఇహలోకం నుండి నిష్క్రమించడం కూడా అంతగా బాధ అనిపించకుండా జరుగుతుందని చెప్పారు. ఆ పద్ధతులలో ఒక వ్యక్తి గృహస్థుడిగా జీవితాన్ని గడిపి, నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నిర్వర్తించాక, వృద్ధాప్యంలో సన్యాసాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయి, శేషజీవితం అక్కడ గడిపి ప్రశాంతంగా ఇహలోకాన్ని వదిలి ప్రకృతిలో కలిసి పొమ్మన్నారు. అయితే, సన్యాసం స్వీకరించడం అందరూ చేయగలిగే పని కాదనీ, ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న బంధాలను ఒక్కసారిగా తెంచు కుని వెళ్ళిపోవడం ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యమయ్యే పనీ అని ఆచరణలో తేలింది. ఫలితంగా, అడవులకే వెళ్ళాలా? అన్న ప్రశ్న ఉదయించి, అన్నిటికీ మనసే మూలం కనుక, మనసు చేసే ఆలోచనలను కట్టడి చేస్తే, అడవులకు వెళ్ళవలసిన పనిలేదని చెప్పుకోవడం జరిగింది. ఈ విషయంపై దంతులూరి బాపకవి రచించిన ‘మూర్తిత్రయో పాఖ్యానము’ ద్వితీయాశ్వాసంలో ఆసక్తికరమైన వివరణ ఉంది. ‘ఇల్లు వదిలిపెట్టి అడవులలోకి అడుగుపెట్టగానే కామ సంబంధమైన ఆలో చనలు కరిగిపోయి, బుద్ధి నిష్కామమై మిగులుతుందా? మిగలదు కదా! అలాగే క్రోధ మోహ మద మాత్సర్యాలనే లక్షణాలు కూడా జీవితంలో ఏదో ఒక క్షణం నుండి మొదలై, మరొక క్షణంలో అంత మవ్వాలని కోరుకున్నప్పుడు అంతమయ్యేవిగా ఉండవు. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే, తాను అలా అయిపోయానని అంటే... అతడిని మించిన మోసగాడు మరొకడు ఉండడు!’ అన్నది ఆ వివరణ సారాంశం. ఆ సందర్భంలో ముఖ్య విషయానికి ముక్తాయింపుగా ఈ క్రింది పద్యం చెప్పబడింది.చదవండి: UoH వర్సిటీ భూములను కాపాడాలి! తే. మనసు నిలుపలేని మనుజుండు వనములోనున్నయంత మోక్షయుక్తి లేదువహ్నిలోన నెన్ని వారముల్ వైచినంగుప్యమునకు హేమగుణము గలదె? ‘మనసును కట్టడి చేసుకోలేకపోతే అడవిలో ఉండి కూడా ప్రయో జనం ఏమీ కలగదు. అగ్నిలో ఎన్ని వారాల పాటు మండించి కరి గించినా కుప్యం (బంగారం, వెండి తక్క అన్యలోహం) బంగారమవు తుందా? కాదు కదా! ఆ విధంగానే ఆలోచనలను అదుపులో ఉంచు కోకుండా కొనసాగించే అడవులలో జీవనం ప్రయోజనం లేనిదిగా పరిణమిస్తుంద’ని భావం.ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?– భట్టు వెంకటరావు -
వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అవేంటంటే..గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట. దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది. తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?) -
UoH వర్సిటీ భూములను కాపాడాలి!
1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 399 మంది పోరాట యోధుల బలిదానం కారణంగా... 610 జీవో విడుదలయ్యింది. తెలంగాణ ఉద్యమం మొదటి దశలోని ఆరు పాయింట్ల ఫార్ము లాలో రెండవ అంశంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad (UoH)) ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 371ఈ ప్రకారం ఏర్పడిన ఈ విశ్వ విద్యాలయానికి ప్రాథమికంగా 2,324.05 ఎకరాల భూమిని కేటా యించారు. అయితే, కాలక్రమేణా గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ హైదరాబాద్, బస్ డిపో, టీఐఎఫ్ఆర్ లాంటి అనేక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూమిని బదిలీ చేయడంతో ప్రస్తుతం విశ్వ విద్యాలయం వద్ద కేవలం 1,800 ఎకరాల భూమి మాత్రమే మిగి లింది. యూనివర్సిటీకి మొదటి వైస్ చాన్సలర్గా ఉన్న గుర్ భక్షి సింగ్ 2 సంవత్సరాల నిర్విరామ కృషితో దాదాపు 29 కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీని’ నిర్మించారు. ఆ తదనంతర పరిస్థితుల్లో హైద్రాబాద్ నగరం అభివృద్ధి చెంది, ఐటీ హబ్గా మారడంతో ఇక్కడి భూములకు విలువ పెరిగిపోయింది. దీంతో ఈ భూములను కబ్జా చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ఈ చర్యలకు వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఉన్న లెఫ్ట్, రైట్ వింగ్ల విద్యార్థి సంఘాలు, దళిత, బహుజన, బీసీ విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ అధికారులు పోరాడుతున్నారు. యూనివ ర్సిటీకి చెందిన భూమిలో ఎలాంటి ఆదేశాలు, అనుమతులులేకుండా ఇప్పటికే దేవాలయ నిర్మాణాలను చేపట్టారు. యూనివ ర్సిటీ చూట్టు రక్షణ కవచంగా నిర్మించిన గోడను పడగొట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రహరీ గోడను కూల్చడం వల్ల బయటి వ్యక్తులు యూనివర్సిటీలో ప్రవేశించి, విద్యార్థినీ విద్యార్థులపై భౌతికపరమైన దాడులు చేయడానికీ, అలాగే క్యాంపస్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడా నికీ అవకాశం ఉంది.చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!యూనివర్సిటీ అద్భుతమైన జీవావరణాన్ని కలిగి ఉంది. ఇందులో 3 చెరువులు, కొండ ప్రాంతాలు, 734 రకాల మొక్కలు, జింకలు, అడవి పందులు, నెమళ్ళు, 15 రకాల కుందేళ్ళు, 220 రకాల పక్షులున్నాయి. ఈ భూములను కబ్జా చేసి పరిశ్రమలు, ఇతర భవనాలు నిర్మిస్తే కాంక్రీట్ జంగిల్గా మారి ఈ జీవావరణం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఈ యూనివర్సిటీ భూములు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?– వై. శివ ముదిరాజ్, తెలంగాణ బీసీ కులాల జాక్ చైర్మన్ -
టెలివిజన్ షోలో హైలెట్గా 'కివీ ఐస్ క్రీం డెజర్ట్'! సెలబ్రిటీ చెఫ్లే ఫిదా
స్టార్ ప్లస్లో మంచి ఫేమస్ అయిన షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా. ఇది పాకకళకు సంబంధించిన రియాలటీ షో. ఈ ఈవెంట్లో ప్రముఖ సినీ సెలబ్రిటీలు, మాస్టర్ చెఫ్ల సమక్షంలో కంటెస్టెంట్లు తమ పాక కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దగ్గర దగ్గర 12 నుంచి 15 మంది దాక పోటీదారులు పాల్గొంటారు. అయితే ఈ సారి మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1లో ఓ వైరైటీ వంటకం ఆ షో న్యాయనిర్ణేతలని కట్టిపడేసింది. తప్పనిసరిగా ఆ డెజర్ట్ని తమ భోజనంలో భాగంలో చేసుకుంటామని అన్నారు. అదేంటో చూసేద్దామా..:తన పాక నైపుణ్యంతో న్యాయనిర్ణేతను ఫిదా చేసింది అర్చన గౌతమ్ అనే పోటీదారురాలు. ఆమె ఈ సీజన్ పోటీలో జడ్జీలను తన పాక కళతో అమితంగా జడ్జీలను ఆకట్టుకుంది. వండిన విధానమే గాక సర్వ్ చేసే తీరు హైలెట్గా నిలిచింది. అయితే ఆమె ఇటీవల జరిగిన ఎపిసోడ్లో చేసిన వంటకంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.ఆ షో న్యాయనిర్ణేతలు కూడా ఆ వంటకం చేసిన తీరు, ప్రెజెంట్ చేసిన విధానానికి ఫిదా అయ్యి ప్రశంసలతో ముంచెత్తారు. మరీ ఆ కంటెస్టెంట్ తయారు చేసిన వంటకం ఏంటంటే.. కివి ఐస్ క్రీం:ఆ షోలో ఆమె కివి ఐస్క్రీంని తయారు చేసింది. ఆకృతిపరంగానే కాకుండా తయారు చేసిన విధానం కూడా వేరెలెవెల్. కివిని పచ్చిపాలతో కలపి, అల్లం, పుదీనా, మిరపకాయలతో అత్యద్భుతంగా తయారుచేసింది. దాన్ని క్యాండీ ఫ్లాస్తో అందంగా సర్వ్ చేసింది. చూడటానికి ఏదో కళాత్మక ఖండంతో కలగలిసిన వంటకంల ఆకర్షణీయంగా ఉంది. ఇక ఆ షోలో సెటబ్రిటీలు ఫరా ఖాన్, రణవీర్ బ్రార్ , ప్రముఖ చెఫ్ ఈ వంటకాన్ని ఎంతో బాగుందంటూ ప్రశంసించారు. అంతేగాదు తాము ఇక నుంచి తమ భోజనంలో ఈ వంటకం ఉండేలా చూసుకుంటామని అన్నారు. కొన్ని వంటకాల తయారీ మనలో దాగున్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీస్తాయంటే ఇదే కదూ. అందులోనూ ఆ కంటెస్టెంట్ ఆరోగ్యకరమైన వాటితోనే రుచికరమైన డెజర్ట్ చేసి మరిన్ని ఎపిసోడ్లు కొనసాగేలా అర్హత పొందింది. View this post on Instagram A post shared by Viral Duniya (@viral_duniya_247) (చదవండి: కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!) -
టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!
అనుకోకుండా రైల్లో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు మహిళలకు చాలా ఆందోళనగా ఉంటుంది. అదీ టిక్కెట్ లేకుండా అయితే ..ఫైన్ కట్టాలన్న భయం వెంటాడుతుంది. సరే.. ఇక తప్పదు కదా ఫైన్ కడదాంలే అని పర్సు చూసుకుంటే.. సరిపడా డబ్బుల్లేకపోతే.. అమ్మో.. ఈ పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది కదా. గుండె గుభేలు మంటుంది. ఏం చేయాల్రా దేవుడా అంటూ ఆ సమయంలో పడే బాధ వర్ణనాతీతం. మరి ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే... ఏం చేయాలి? మహిళలు ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నట్టయితే ఈ రైల్వే యాక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! ద రైల్వే యాక్ట్ 1989, సెక్షన్ 139 ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా ఆందోళన చెందక్కర్లేదు. టికెట్ లేదని రైల్లోంచి దింపే అధికారం టీటీఈకి లేదు. ఫైన్ కట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేకపోయినా భయపడక్కర్లేదు. లేడీ కానిస్టేబుల్ లేకుండా రైలు దింపడానికి వీల్లేదు.సెక్షన్ 311 ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో మహిళల కంపార్ట్మెంట్లోకి మిలటరీ సహా పురుషులెవరూ ఎక్కడానికి వీల్లేదు. ఎక్కితే వారు శిక్షార్హులు. సెక్షన్ 162 ప్రకారం.. పన్నెండేళ్ల లోపు మగపిల్లలు మాత్రం తల్లి, సోదరి, అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్లతో కలసి మహిళల కంపార్ట్మెంట్లో ప్రయాణించవచ్చు. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అలాగే ప్రతి స్లీపర్ (మెయిల్, ఎక్స్ప్రెస్) క్లాస్లో, గరీబ్రథ్, రాజధాని, దురంతో లాంటి రైళ్లు లేదా మొత్తం ఎయిర్ కండిషన్డ్ రైళ్లలోని థర్డ్ ఏసీ (3 ఏసీ)లో మహిళలకు 6 బర్త్లు రిజర్వ్ అయి ఉంటాయి. గ్రూప్గా ప్రయాణిస్తున్న మహిళలూ వీటిని వినియోగించుకోవచ్చు. రైలు ఎక్కినప్పటి నుంచి గమ్యానికి చేరేవరకు మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘మేరీ సహేలీ’ యాప్నూ లాంచ్ చేశారు. అంతేకాదు రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమేరాలు, మానిటరింగ్ రూమ్స్ను ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థితుల్లో రైల్వే హెల్ప్లైన్ 139 ఉండనే ఉంది. ఇదీ చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
Sunita Williams అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
ఋతుక్రమం లేదా పీరియడ్స్ను భరించడం, ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండటం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. మూడు రోజుల శారీరక బాధలతోపాటు, డ్రెస్కు ఏదైనా మరకలు ఉన్నాయా చూడవే బాబూ.. అని తోటి ఫ్రెండ్స్ను అడగడం మొదలు, ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరో రకం ప్యాడ్స్ను ఎంచుకోవడం, మంచంపైన దుప్పటికి మరకలైతే, అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలో చిక్కుకున్న నాసా( NASA) వ్యోమగామి సునీతా విలియం (Sunita Williams) బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. కేవలం ఎనిమిది రోజులు అనుకున్న ఈ ప్రయాణం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీతా విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్ను ఎలా మేనేజ్ చేశారు అనేది సందేహం కలుగక మానదు. గ్లాస్ సీలింగ్స్ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నపుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే.హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్, అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు.Astronaut Periods: అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలనుఅనుసరించి అతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా వ్యోమగాములకు అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేస్తుంది. వారు భూమిపై ఉన్న మాదిరిగానే ప్రామాణిక శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగిస్తారు , అవి అంతరిక్షంలో ప్రభావవంతంగా ఉంటాయి కూడా.చదవండి : ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టుమహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నపుడు పీరియడ్స్ సమస్యలొస్తాయని రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప, ఈ ప్రక్రియ అంతరిక్షంలో సాధారణంగా జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లూ నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు(Birth control pills) వంటి గర్భనిరోధకాల (Hormonal contraceptives)ను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు స్త్రీపురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి. శుభ్రత కూడా సులభవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే, భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో, అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సలాం మీకు!అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యోమగాముల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్యానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భార రహిత స్థితిలో శ్యానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతి పెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో నీటి కొరత ఎంత సమస్యో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యోమగాములకు సలాం! ఇదీ చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!
కృత్రిమంగా గుండెని తయారు చేయడం అనేది వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. పైగా దాన్ని ఒక మనిషికి అమర్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడటం మరో అద్భుతం. అయితే అది ఏ కొన్ని గంటలో కాదు ఏకంగా వంద రోజులకు పైగా ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలిపింది. దాత దొరికేంత వరకు ఊపిరిని అందించింది. గుండె వైఫల్యంతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. వైద్య చరిత్రలోనే ఈ కేసు ఓ అద్భుతమని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ కృత్రిమ గుండెని ఎవరికీ అమర్చారు. దాని విశేషాలేంటో చూద్దామా..!.టైటానియంతో తయారు చేసిన కృత్రిమ గుండెతో వందరోజులకు పైగా జీవించిన తొలి వ్యక్తిగా ఆస్ట్రేలియన్ న్యూ సౌత్ వేల్స్ చరిత్ర సృష్టించాడు. ఈ 40 ఏళ్య వ్యక్తికి గత నవంబర్లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో టైటానియంతో తయారు చేసిన బివాకర్ అనే పరికరాన్ని అమర్చారు. ఆయన తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతుండటంతో విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ పాల్ జాన్జ్ నేతృత్వంలో దాదాపు ఆరుగంటలు శ్రమించి ఈ కృత్రిమ గుండె ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేశారు. ఈ ఆధునాత వైద్యాన్ని అందించిన తొలి వైద్య బృందం తామే కావడం గర్వంగా ఉందన్నారు వైద్యుడు జాన్జ్. అంతేగాదు ఇలా ప్రపంచంలో కృత్రిమ టైటానియం గుండెని పొందిన ఆరవ వ్యక్తి అతడేనని చెప్పారు. అతను ఈ గుండెతో పెద్దగా ఎలాంటి సమస్యలు లేకుండా వందరోజులకు పైగా బతికి బట్టగట్ట గలిగాడన్నారు. అతడికి ఈ నెల ప్రారంభంలో ఒక దాత గుండెని అమర్చినట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె ఇంప్లాంట్ ప్రక్రియని "అద్భుతమైన క్లినికల్ విజయం"గా ప్రకటించారు ఆస్ట్రేలియన్ వైద్య బృందం.ఏంటీ టైటానియం బివాకర్..క్వీన్స్ల్యాండ్లో జన్మించిన డాక్టర్ డేనియల్ టిమ్స్ ఈ గుండె మార్పిడి బివాకర్ పరికరాన్ని కనుగొన్నారు. దాత గుండె మార్పిడి అందుబాటులోకి వచ్చే వరకు రోగులను సజీవంగా ఉంచడానికి ఇది వారధిలాగా పనిచేస్తుంది. ఇది నిరంతర పంపుగా పనిచేస్తుంది. దీనిలో అయస్కాంతంగా సస్పెండ్ చేసిన రోటర్ శరీమంతా సాధారణ పల్స్లో రక్తం ప్రసరించేలా చేస్తుంది. ఇలా సస్పెండ్ చేసి ఉన్న అయస్కాంతం చర్మం వెలుపల ఉన్న త్రాడు మాదిరి పరికరంతో బయట పోర్టబుల్ కంట్రోలర్కు కలుపుతుంది. పగటిపూట బ్యాటరీలతో పనిచేస్తుంది. రాత్రిపూట మెయిన్స్లో ప్లగ్ చేసి ఉంటుంది. ఇక్కడ టైటానియంని ఉపయోగించడానికి ఇది తుప్పు నిరోధకత కలిగినది, అలాగే బలమైన జీవన వ్యవస్థకు అనూకూలమైనది కావడమే. ప్రస్తుతం ఈ పరికరాన్ని తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు..భవిష్యత్తులో ఇది ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా గుండె మార్పిడికి అర్హత లేనివారికి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆ దిశగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె పనితీరు కాల వ్యవధి దాత గుండె కంటే చాలా తక్కువ అనేది గమనించదగ్గ విషయం.(చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
‘మన పంటలు – మన వంటలు’ మూడు రోజుల సదస్సు
మారుతున్న వాతావరణం నేపథ్యంలో ‘మన పంటలు – మన వంటలు’ అనే శీర్షికతో అనంతపురంలోని పోలిస్ కళ్యాణ మండపంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహించనున్నట్లు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డా. వై.వి. మల్లారెడ్డి తెలిపారు. ఆహారమే ఆరోగ్యం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు.. వర్షాధార ప్రకృతి వ్యవసాయంలో పంటలు, వంటల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మూడు రోజులూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 23 (ఆదివారం) న ఉ.10.30 గం.కు డా. ఖాదర్ వలి ప్రసంగం ఉంటుందన్నారు. 20 స్వచ్ఛంద సంస్థలు కలసి వరుసగా రెండో ఏడాది ఈ సదస్సులు నిర్వహిస్తుండటం విశేషం. 22,23 తేదీల్లోబయోచార్పై శిక్షణ వ్యవసాయ వ్యర్థాలతో బయోచార్ (బొగ్గు పొడి)ని తయారు చేసి పొలంలో తగిన మోతాదులో చల్లితే భూసారం పెరుగుతుంది. ఈ విషయమై రైతులకు లోతైన అవగాహన కల్పించటం కోసం ఘట్కేసర్ సమీపంలోని పిట్టల ఆర్గానిక్ ఫామ్ (ఎన్ఎఫ్సి నగర్ – అంకుష్పుర్ మధ్య)లో జరగనుంది. ప్రసిద్ధ బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్ రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు పిట్టల శ్రీశైలం తెలిపారు రు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు.. 70137 84740 నెంబర్ను సంప్రదించవచ్చు. చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
ఇస్రో శాస్త్రవేత్త ఆధ్యాత్మిక సేవ..! బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని..
ఆయనో శాస్త్రవేత్త.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇష్రో)లో పనిచేసి, వృత్తిలో తన ప్రతిభను కనబర్చిన విజ్ఞాన వేత్త. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయంలోని విశిష్టతను అవసోపన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందులో భాగంగానే తేనెలొలికే తెలుగు పదాలతో పుణ్య చరితుడు బమ్మెర పోతన రచించిన పద్య భాగవతాన్ని ఈ తరానికి మరింత చేరువ చేయాలనుకున్నారు. అంతటి బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని అచ్చు పుస్తక రూపంలో, ఇంటర్నెట్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయనే.. న్యూనల్లకుంటకు చెందిన మందడి కృష్ణారెడ్డి. – ఇప్పటికే వివిధ రూపాల్లో లభ్యమవుతున్న భాగవత సంబంధిత సమాచారానికి ఆయన చేసిన ఆధునాతన రూపకల్పన ఈతరం భాగవత విశ్లేషకులకు, ఔత్సాహికులకు సులభతరం చేసింది. ఒక ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తగా ఇస్రో ఐఐఎస్యూ తిరువనంతపురం నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తర్వాత విశ్రాంత సమయాన్ని దైవకార్యంగా భావించి సాహిత్య విశిష్టతలను కలగలిపి ఉన్న శ్రీమద్భాగవతాన్ని అందరికీ సులువైన మార్గంలో అందించడానికి సమగ్ర సంకలన రూపకల్పనకు నాంది పలికారు. ఇందులో భాగంగా సాంకేతిక అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో వినూత్నంగా ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ అనే మార్గాన్ని ఎంచుకుని శ్రీమద్భాగవతంలోని 12 స్కందాలు, 688 ఘట్టాలలోని 10,061 పద్యాలకు భావాన్ని, పదోచ్చారణ నేర్చుకోవడానికి వీలుగా ఆ పద్యాల ఆడియోను రూపొందించారు. ప్రతి పద్యంలోని పదాలకు అర్థం, ఆ పద్యానికి సంబంధించిన వ్యాకరణ అంశాలు ఛందస్సు, అలంకారాల వివరాలన్నీ ఒక పద్యం నుంచి మరొక పద్యానికి విషయ సూచిక ఆధారంగా సులువుగా వెళ్లేలా సమకూర్చారు. ఇవన్నీ కేవలం ఒక ప్రధాన పవర్ పాయింట్ స్లయిడ్ నుంచి ఒక్క క్లిక్తో సాధ్యమయ్యేలా చేశారు. సాహిత్యం, శ్రీమద్భాగవతం వంటి గ్రంథ పఠనం కష్టతరమైన ప్రస్తుత కాలంలో ఇంత సులభతరంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం అమృతప్రాయమైన విషయంగా భావిస్తున్నారు. ఈ అనితర సాధ్యమైన సాధనం ఉపయోగించడంలో ఒక ప్రధాన స్లయిడ్ నుంచి వేల పద్యాలకు సంబంధించిన పేజీలకు ఏర్పరచిన హైపర్ లింక్స్ ద్వారా సులువుగా వెళ్లేలా విస్తృతమైన ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ చేయటం ఇదే ప్రథమం. మందడి చెన్నకృష్ణారెడ్డి, రంగనాయకమ్మ పుత్రుడైన కృష్ణారెడ్డి ఒకప్పటి ఆర్ఈసీ ఇప్పటి నిట్ వరంగల్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, ఐఐటీ చెన్నై నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలోనూ తన ప్రతిభతో ఎన్నో అవార్డులు అందుకున్నారు.సమగ్ర సంకలనంగా రూపొందించా.. ఈ సంకలనానికి, ‘శ్రీభాగవత సుధానిధి‘ అని నామకరణం చేశాను. ఎందరో మహానుభావులు పద్య భావాన్ని, ఆ పద్యాలకు సంబంధించిన ఎన్నో విశేషాలను క్రోడీకరించి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ అంతర్యామి లీలా విశేష గ్రంథమైన శ్రీమద్భాగవతానికి సంబంధించి గ్రంథ విశేషాలను ఒక సమగ్ర సంకలనంగా రూపొందించాను. తెలుగు భాష, గ్రంథ పఠనంపై ఆసక్తి మాత్రమే అర్హతగా విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా అమృత తుల్యమైన పోతనామాత్యుల విరచిత శ్రీమద్భాగవత గ్రంథ విశేషాలను సులువైన మార్గంలో ఆకళింపు చేసుకునేలా రూప కల్పన చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీమద్భాగవత పద్యాలు, ఆ పద్యాల భావాన్ని, పదోచ్చారణ, ప్రతిపదార్థం, పద్యాలలోని అలంకార విశేషాలు విడివిడిగా ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలలో లభ్యమవుతున్న వాటిని సమగ్ర సంకలనంగా మార్పు చేశాను. – కృష్ణారెడ్డి (చదవండి: మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!) -
Avocado డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. సాగు ఎలా చెయ్యాలి?
మన దేశంలో పట్టణ ప్రాంత ప్రజల్లో ఆహార – ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల దేశ, విదేశీ జాతుల పండ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. అందులో ఒకటి అవొకాడో. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి. కరుణాకరన్ మాటల్లో చెప్పాలంటే.. అవొకాడో, డ్రాగన్ సహా పన్నెండు రకాల దేశ, విదేశీ ఖరీదైన పండ్ల జాతుల సాగు విస్తీర్ణం మన దేశంలో గత మూడేళ్లుగా పెరుగుతోంది. ఈమొక్కలకు గిరాకీ 30% పెరిగింది. పరిమిత నీరు, పోషకాలు, శ్రమతో సాగు చేయడానికి అవకాశం ఉండటం.. ధాన్యపు పంటలతో పోల్చితే అధికాదాయం రావటం.. యాంత్రీకరణకు అనుకూలం కావటం.. పౌష్టిక విలువలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం.. మార్కెట్లో డిమాండ్ ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే, అవొకాడో పండ్ల తోటలు ఏయే భూముల్లో సాగు చెయ్యాలి? ఏయే రకాలు అనువైనవి? వంటి ప్రశ్నలకు సమాధానాలు డా. కరుణాకర్ మాటల్లోనే చదవండి.అవొకాడో సాగు మనకు కొత్తది కాదు. 70 ఏళ్లుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, సిక్కిం, మహారాష్ట్రల్లో సాగవుతోంది. అయితే, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అవొకాడో తోటలను తామర తంపరగా నాటుతున్నారు. గత మూడేళ్లలోనే 8–10 లక్షల అవొకాడో మొక్కలు నాటారు. ఉష్ణమండలం, తేమ ఎక్కువగా ఉండే ఉప–ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పెరిగే లక్షణం దీనికి ఉన్నప్పటికీ, తగిన వాతవరణం, నేలల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాను. 18–33 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు, 700–1500 ఎం.ఎం. వర్ష; ఉన్న ప్రాంతాలు.. 5.5 - 8 వరకు ఉదజని సూచిక (పిహెచ్) ఉన్న భూములు అనుకూలం. మొక్కలు నాటిన 5 ఏళ్లకు పూర్తిస్థాయి దిగుబడినిచ్చే స్థితికి పెరుగుతుంది. ప్రస్తుతం మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందుకే రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, అవొకాడో ఖరీదైన పండు కాబట్టి మిల్క్షేక్, ఐస్క్రీమ్లు, డిసర్ట్ స్వీట్ల తయారీలో మాత్రమే వాడుతున్నారు. మున్ముందు దిగుబడి పెరిగే నాటికి ప్రాసెసింగ్ సదుపాయాలు పెరిగి వేర్వేరు రూపాల్లో వాడకం పెరగాలి. లేదంటే మార్కెట్ పడిపోయే ముప్పు ఉంటుంది. ఇక రైతుల విషయానికొస్తే.. తోటలు నాటేటప్పుడు అది ఏ రకమో తెలియకుండానే, ఏయే నేలలకు సరి;yతుందో తెలుసుకోకుండానే స్థానిక నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు నాటుతున్నారు. దీంతో సాగులో చాలా సమస్యలు వస్తున్నాయి.‘హాస్’ రకం మొక్కలు వద్దుబెంగళూరులోని ఐఐహెచ్ఆర్లో 16 రకాల అవొకాడో మొక్కలున్నాయి. మీ భూమి, నీరు, వాతావరణానికి అనువైన రకాన్ని ఎంచుకోవటంపై శ్రద్ధ పెడితే విజయం సాధించవచ్చు. అర్క సుప్రీం, అర్క రవి, లాంబ్ హాస్, పింకర్టన్ రకాలు మేలైనవి. చాలా మంది హాస్ రకం సాగు చేస్తున్నారు. ఇది మనకు సూట్ కాదు. నెర్రెలిచ్చే భూముల్లో వద్దుఅవొకాడో చాలా సున్నితమైన పంట. నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. అవొకాడోకే కాదు ఏ పండ్ల తోటలకైనా ఎండా కాలం నెర్రెలిచ్చే నల్లరేగడి నేలలు పనికిరావు. వేర్లు తెగి΄ోతాయి. నీరు నిలవని, బాగా గాలి సోకే ఎర్ర గరప నేలలు (రెడ్ శాండీ సాయిల్) మేలు. 40% ఇసుక కలిసిన చెరువు మట్టిలో కూడా బాగా పెరుగుతుంది. బంక మట్టి నేల (క్లే సాయిల్) అసలు పనికిరాదు. ఈ నేలలో సాగు చేయాలంటే... 4x3 అడుగుల గుంతల్లో ఎర్ర మట్టిపోసి, మొక్కలు నాటుకోవాలి. పిహెచ్ సమతుల్యంగా ఉండాలి. నీటిలో ఈసీ 1 కన్నా ఎక్కువ ఉంటే సరిగ్గా పెరగదు. అందుకని, అవొకాడో మొక్కలు నాటే ముందు మట్టి, నీటి పరీక్షలు చేయించి ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలి.పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉంటే, కాల్షియం కార్బొనేట్ 20% కన్నా ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం కాదు. నీరు తగుమాత్రంగా ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఐరన్ లభ్యత సమస్య వస్తుంది. నీటి ఉప్పదనం 2% కన్నా ఎక్కువ ఉంటే పనికిరాదు. క్లోరైడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న నేలలకు తగిన రకాల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.ఏటా రెండు సీజన్లుఅవొకాడో పూత వచ్చిన తర్వాత 120–150 రోజుల్లో పండ్లు కోతకు వస్తాయి. ఏప్రిల్–జూలై, అక్టోబర్– ఫిబ్రవరి సీజన్లలో రెండు దఫాలుగా పండ్ల దిగుబడి వస్తుంది. విత్తనం నాటితే 5–6 ఏళ్లలో, అంటు మొక్కలు నాటితే 3–4 ఏళ్లలో కాపుకొస్తాయి. చెట్టుకు 100 నుంచి 500 కాయలు కాస్తాయి. కాయలు పక్వానికి వచ్చినా చెట్టు మీద గట్టిగానే ఉంటాయి. కోసిన తర్వాత మెత్తబడతాయి. ముదురు రంగులోకి మారితే పక్వానికి వచ్చినట్లు గుర్తించి కోయాలి. పక్వ దశను గుర్తించడానికి ఇతర దేశాల్లో చిన్న΄ాటి యంత్రాలను వాడుతున్నారు. మన శరీర ఉష్ణోగ్రతను సెన్సార్లతో గుర్తించే పరికరంతోనే అవొకాడో పక్వ దశను తెలుసుకోవచ్చు. 24% ఆర్గానిక్ కంటెంట్ ఉన్న దశలో పండును కోయాలి. కాయ కోసిన తర్వాత రంగు మారుతుంది. అవొకాడోతో ఒక ఉపయోగం ఏమిటంటే పండు పక్వానికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ధర లేకపోతే చెట్టు మీదే 1–2 నెలల వరకు కాయ కోతను వాయిదా వేసుకోవచ్చు! ముందుగా/ఆలస్యంగా కోతకు రావటం.. మంచి సువాసనతో అధిక గుజ్జు ఉండటం.. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. మార్కెట్లో గిరాకీ ఉండటం.. కోసుకు తినటానికి లేదా ప్రాసెసింగ్కు అనువుగా ఉండటం.. వంటి అనేక అంశాలను పరిశీలించి అవొకాడో సాగుచేసే రకాలను ఎంపిక చేసుకోవటం కీలకం. మరికొన్ని మెళకువలుసముద్రతలం నుంచి 1,000 మీటర్ల ఎత్తుగల ప్రదేశాల్లో వెస్ట్ ఇండియన్ అవొకాడో వెరైటీలను నాటుకోవాలి. వీటి కొమ్మలు, విత్తనాల ద్వారా మొక్కలు తయారు చేసుకోవచ్చు. మొదటి 5 ఏళ్లూ మధ్యాహ్నపు ఎండ నుంచి మొక్కల్ని కాపాడాలి. 5 ఏళ్ల వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూత, కాతను ఉంచకూడదు. తీసెయ్యాలి. 5 మీ.“ 5 మీ. సైజులోగొయ్యి తవ్వి, అది 3 నెలలు ఎండిన తర్వాత మొక్కలు నాటుకోవాలి. అవొకాడో పండ్లను ప్రాసెస్ చేసి అనేక ఉత్పత్తుల తయారు చేయటం, స్ప్రే డ్రయ్యింగ్ ద్వారా పొడిని తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. విలువ జోడించి ఉత్పత్తులు అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి అవొకాడో 2 – నీరు నిలవని ఎర్ర గరప నేల (రెడ్ శాండీ సాయిల్)లో అవొకాడో చెట్టు చక్కగా పెరుగుతుంది. బంక మన్ను (క్లే సాయిల్) దీనికి సరిపడదు. ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. కరుణాకరన్ ఈ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా చె΄్పారు. బంక మన్ను నేలలో అవొకాడో సాగు చేయదలిస్తే 4 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పున గొయ్యి తీసి, ఆ గోతిలో 90% వరకు ఎర్ర గరప మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపి సాగు చేయవచ్చని ఆయన తెలిపారు. గుంతలో సగం వరకే ఎర్ర గరప మట్టిని నింపితే.. చెట్టు కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత వేర్లు బంకమన్నులోకి విస్తరించినప్పుడు పోషకాలు, నీరు అందక (చిత్రంలోచూపిన విధంగా) నిలువునా ఎండిపోతుందని వివరించారు. అవొకాడో చాలా సున్నితమైన పంట. వేరుకుళ్లు బెడద ఉంటుంది. అవొకాడో మొక్కల్ని (ఆ మాటకొస్తే ఏ పండ్ల తోటైనా) 5 అడుగుల ఎత్తుమడి (రెయిజ్డ్ బెడ్) పైనే నాటుకోవాలి. ట్రాక్టర్తో అంతర సేద్యం చేసినా బెడ్ దెబ్బతినదు. సాళ్ల మధ్య వర్షపు నీరు బయటకు త్వరగా వెళ్లిపోవటానికి కందకం తియ్యాలి. ఇజ్రాయెల్, సౌతాఫ్రికాలో కూడా ఎత్తుమడులపైనే నాటుతారు.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి.థాంక్స్ టు ‘టొక్సోడాన్’!అవొకాడో.. అమెజాన్, మెక్సికన్ అటవీ ప్రాంతాల్లో నివసించే భారీ శాకాహార జంతువు ‘టొక్సోడాన్’కు పండ్లు తినే అలవాటుంది. అయితే, దానికి ఏ పండూ సరిగ్గా నచ్చేది కాదు. అవొకాడో పండు టొక్సోడాన్కు తెగ నచ్చేసిందట. అందులో పుష్కలంగా ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్సే అందుకు కారణమట. ఇందులో 20% కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా ‘సంతృప్తినిచ్చేది’ కూడానట! అందుకే దీనికి ‘వెన్న పండు’ అని పేరు. ఆ విధంగా దీని గొప్పతనాన్ని జనానికి తెలిసేలా చేసినందుకు టొక్సోడాన్కి థాంక్స్ చెప్పాలి అన్నారు ఐఐహెచ్ఆర్ (బెంగళూరు)లో పండ్ల పరిశోధనా విభాగాధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. జి. కరుణాకరన్! అదేవిధంగా, 1950లలో కూర్గ్, వయనాడ్ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ల యజమానులు వ్యాహ్యాళికి వెళ్తూ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. దారి పక్కన చెట్ల కింద రాలినపడి ఉన్న అవొకాడో పండ్లను కుక్కలు ఇష్టంగా తినటం గమనించారు. అప్పటి వరకు ఇవి తినదగిన పండ్లని చాలా మందికి తెలియదు. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో ‘డాన్ ఆఫ్ ఫ్రూట్స్’ అయ్యింది! -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!
జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చత్తీస్గఢ్లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025 అనే ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక తారే అద్భుత ప్రతిభావంతురాలు. ఎంఎన్సీసీలో హెచ్ఆర్, సీఎస్ఆర్గా పలు ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు . ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది. (చదవండి: 'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!) -
'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!
మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇంటిల్లి పాదీ కలిసి పేరున్న రెస్టారెంట్/కేఫ్లకు లంచ్, డిన్నర్లకో వెళ్లడం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సమయం కూడా సిటిజనుల మీట్ అండ్ ఈట్లకు కేరాఫ్గా మారింది. లేట్నైట్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేసెస్ గురించి మాట్లాడుకుని ఉదయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనులు తమ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం కోసం తరచూ ఎంచుకునే వాటిలో ఇవీ.. టేస్టీ ఫుడ్ ఆస్వాదించి సంతృప్తిగా రోజును ప్రారంభించడం కన్నా మంచి రోజు ఏముంది? అద్భుతమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మన నగరం, రుచికరంగా రోజును కిక్స్టార్ట్ చేయడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. దోసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ దక్షిణ భారతీయ ఇష్టమైన వాటి నుంచి ఆమ్లెట్లు, వాఫ్ఫల్స్ వంటి అంతర్జాతీయ వెరైటీల వరకు మన సిటీలోని అల్పాహార సమయం.. వైవిధ్యంగా ఉంటుంది. రుచులు అనుభవాల విందోదయాల కోసం అందుబాటులో కొన్ని.. కోఠిలోని సందడిగా ఉండే వీధుల్లో ఉన్న ప్రగతి టిఫిన్ సెంటర్ దక్షిణ భారత అల్పాహార ప్రియుల సందడితో నిండి ఉంటుంది. క్రిస్పీ దోసెలు, మెత్తటి ఇడ్లీలు, ఊతప్పమ్లకు ఈ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ప్రతి వంటకంతో పాటు అందించే చట్నీలు. ఉదయం 7గంటల నుంచి 9 గంటలలోపు హనుమాన్ టేక్డి, హెచ్వీఎస్ రోడ్లో ఉన్న ఈ సెంటర్ను సందర్శించం అంటే నోరూరించే దక్షిణాది వంటకాలను ఆస్వాదించినట్లే.. సంప్రదాయ రుచులను కోరుకునే వారు గచ్చిబౌలిలోని ఇందిరానగర్లో ఉన్న ఉడిపి ఉపహార్కు చలో అంటున్నారు. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఊతప్పమ్ వంటి అనేక రకాల దక్షిణ భారతీయ ప్రధాన వంటకాలను అందిస్తుంది. మెనూలో డబుల్ కా మీఠా, బొబ్బట్టు వంటి స్వీట్ ట్రీట్లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అల్పాహారం ఉదయం 7 నుంచి 10.30గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.మాదాపూర్లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్లో కేఫ్ స్టైలి ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే సిటిజనులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మష్రూమ్ ఆమ్లెట్ల నుంచి బ్రోకలీ చీజ్ ఆమ్లెట్ల వరకు రోజంతా అల్పాహారం అందించడం విశేషం. ఆహారం పోషకాలతో నిండిన సూప్లు, సలాడ్లతో పాటు కాఫీలూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 దాకా అందుబాటులో ఉంటుంది. పిజ్జాదోస, పాస్తా దోస, మంచూరియా దోస వంటి వెరైటీ ఆధునిక దక్షిణ భారత బ్రేక్ఫాస్ట్లను కోరుకునేవారు బంజారాహిల్స్లోని రాయల్ టిఫిన్ సెంటర్ను ఎంచుకుంటున్నారు. వీరి మెనూలో ఉప్మా ఊతప్పమ్ల వంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. ఆహ్లాదకరమైన అలంకరణ, ప్రత్యేకమైన మెనూతో జూబ్లీహిల్స్లోని ది హోల్ ఇన్ ది వాల్ కేఫ్ అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ వెరైటీల్లో.. వెజ్జీ పిజ్జా ఆమ్లెట్, గోల్డెన్ ఫ్రిటాటా మిక్స్ ఇక్కడ హైలైట్స్గా చెప్పాలి. స్వీట్ టూత్ ఉన్నవారు ఇక్కడి చాక్లెట్ వాఫ్ఫల్స్, బ్లూబెర్రీ చీజ్ వాఫ్ఫల్స్ తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. ఉదయం 8.30గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. సిటిజనులకు చిరపరిచితమైన పేరే మినర్వా కాఫీ షాప్. ఈ పేరు దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా ఉంది. టమాటా చట్నీ రైతాతో కలిపిన రైస్ పొంగల్, నెయ్యితో నింపిన ఇడ్లీలు క్రిస్పీ దోసెలు ఇక్కడ స్పెషల్.. ఇక్కడి ఫిల్టర్ కాఫీ వావ్ అనిపిస్తుందంటారు కాఫీప్రియులు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకూ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. నగరంలోని దారుల్షిఫా, చట్టా బజార్లో ఉన్న హోటల్ నయాబ్ ఉదయం 5 గంటల నుంచే సంప్రదాయ అల్పాహారాన్ని అందిస్తుండటం ఎర్లీ బైకర్స్ను ఆకర్షిస్తోంది. బటర్ నాన్, లుక్మీతో పాటు భేజా ఫ్రై వంటి స్థానిక హైదరాబాదీ ప్రత్యేకతలతో బ్రేక్ ఫాస్ట్ చేయిస్తోంది. ఇరానీ చాయ్తో సహా మన అసలైన రుచులను ఇష్టపడేవారు నయాబ్ను సందర్శిస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇక్కడ బ్రేక్పాస్ట్ ప్రియుల సందడి కనిపిస్తుంది. (చదవండి: -
ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్నోడ్స్కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
రైల్.. రైట్స్
మహిళలు ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నట్టయితే ఈ రైల్వే యాక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! ద రైల్వే యాక్ట్ 1989, సెక్షన్ 139 ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా ఆందోళన చెందక్కర్లేదు. టికెట్ లేదని రైల్లోంచి దింపే అధికారం టీటీఈకి లేదు. ఫైన్ కట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేకపోయినా భయపడక్కర్లేదు. లేడీ కానిస్టేబుల్ లేకుండా రైలు దింపడానికి వీల్లేదు.సెక్షన్ 311 ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో మహిళల కంపార్ట్మెంట్లోకి మిలటరీ సహా పురుషులెవరూ ఎక్కడానికి వీల్లేదు. ఎక్కితే వారు శిక్షార్హులు. సెక్షన్ 162 ప్రకారం.. పన్నెండేళ్ల లోపు మగపిల్లలు మాత్రం తల్లి, సోదరి, అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్లతో కలసి మహిళల కంపార్ట్మెంట్లో ప్రయాణించవచ్చు. అలాగే ప్రతి స్లీపర్ (మెయిల్, ఎక్స్ప్రెస్) క్లాస్లో, గరీబ్రథ్, రాజధాని, దురంతో లాంటి రైళ్లు లేదా మొత్తం ఎయిర్ కండిషన్డ్ రైళ్లలోని థర్డ్ ఏసీ (3 ఏసీ)లో మహిళలకు 6 బర్త్లు రిజర్వ్ అయి ఉంటాయి. గ్రూప్గా ప్రయాణిస్తున్న మహిళలూ వీటిని వినియోగించుకోవచ్చు. రైలు ఎక్కినప్పటి నుంచి గమ్యానికి చేరేవరకు మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘మేరీ సహేలీ’ యాప్నూ లాంచ్ చేశారు. అంతేకాదు రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమేరాలు, మానిటరింగ్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రైల్వే హెల్ప్లైన్ 139 ఉండనే ఉంది. -
ఈ వేదనకు జడ్జి గారి గుండె నీరయ్యింది
‘ఆమె తండ్రి పరిహారం పెంచమని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి వేదనను చేస్తే మనకే గుండె తరుక్కుపోతోంది. కన్నవారికి ఎలా ఉంటుంది?’ అని ఆవేదన చెందారు ముంబై హైకోర్టు బెంచ్ మీదున్న ఇద్దరు జడ్జ్లు. 2017లో రైల్వే వారి కారు ఢీకొనగా కోమాలోకి వెళ్లిన 17 ఏళ్ల నిధి జత్మలాని కేసుకు ముగింపు పలుకుతూ రైల్వే మంత్రిని 5 కోట్ల పరిహారం ఇవ్వడం గురించి సానుభూతితో ఆలోచించమని కోరింది కోర్టు. వివరాలు...ఒక జీవితానికి పరిహారం ఎంత? ఒక తూనీగకు రెక్కలు విరిగిపడితే నష్ట పరిహారం ఎంత? కోయిల గొంతును నులిమి పాట రాకుండా చేస్తే ఆ నష్టాన్ని ఏమి ఇచ్చి భర్తీ చేయగలం? ఒక ఎగిరి దుమికే జలపాతాన్ని ఎండపెట్టేశాక ఎన్ని డబ్బులు ధారబోస్తే జల ఊరుతుంది?నష్టపరిహారం ఏ నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదు. కాకపోతే కొంత సాయం చేయగలదు అంతే. అందుకే ముంబై హైకోర్టుకు చెందిన జడ్జీలు గిరిష్ కులకర్ణి, అద్వైత్ సెత్నా ఒక అమ్మాయికి వచ్చిన కష్టాన్ని లెక్కలతో కాకుండా హృదయంతో చూడమని రైల్వే మినిష్టర్ని కోరారు. పరిహారం పెంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. జడ్జీలను కదిలించిన ఆ కేస్ ఏమిటి?రెక్కలు తెగిన పిట్ట2017, మే 28. ముంబై మెరైన్ డ్రైవ్లో 17 ఏళ్ల నిధి జెత్మలాని రోడ్డు దాటుతోంది. ఆ రోడ్డులోనే ఉన్న కేసీ కాలేజ్లో ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆమె రోడ్డు దాటడం మొదలుపెట్టగానే అతివేగంతో వచ్చిన ఇన్నోవా ఆమెను ఢీకొట్టింది. నిధి ఎగిరి దూరం పడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఢీకొట్టాక ఇన్నోవా రోడ్డు డివైడర్ను కూడా ఢీకొట్టి ఆగింది. అప్పటి వరకూ ఎగురుతూ తుళ్లుతూ చదువుకుంటూ ఉన్న నిధి ఆ రోజు నుంచి మళ్లీ మాట్లాడలేదు. నవ్వలేదు. నడవలేదు. నిలబడలేదు. జీవచ్ఛవంలా మారింది. కొన్నాళ్లు కోమాలో ఉండి ఆ తర్వాత పడక్కుర్చీకి పరిమితమైంది. ఇంత పెద్ద నష్టం చేకూర్చిన ఈ కేసులో నష్టపరిహారం కోసం పోరాటం మొదలైంది.నిధి వెర్సస్ వెస్ట్రన్ రైల్వేస్నిధిని ఢీకొట్టిన ఇన్నోవా వెస్ట్రన్ రైల్వేస్ వారి సిగ్నలింగ్ సర్వీసెస్ విభాగానికి చెందినది. కనుక దీనిలో ప్రతివాది ఆ సెక్షన్కు చెందిన సీనియర్ ఇంజనీర్ అయ్యాడు. కేసు నమోదయ్యాక ‘మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్’ 2021లో 69,92,156 రూపాయల (సుమారు 70 లక్షలు) పరిహారం వడ్డీతో సహా నిధి తల్లిదండ్రులకు ఇవ్వాలని, కోర్టుకు ఒకటిన్నర కోటి రూపాయలు డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీని నెల నెలా నిధి వైద్య అవసరాలకు ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది. రైల్వే శాఖ ఒకటిన్నర కోటి డిపాజిట్ చేసింది. అయితే ఈ పరిహారం చాలదని నిధి తండ్రి హైకోర్టుకు వెళ్లాడు.ఆమె తప్పు ఉంటే?హైకోర్టులో నష్టపరిహారానికి సంబంధించి వాదనలు మొదలైనప్పుడు రైల్వే శాఖ తరఫు అడ్వకేటు రోడ్డు దాటే సమయంలో నిధి పెడస్ట్రియన్ క్రాసింగ్లో నడవలేదని, పైగా ఆ సమయంలో సెల్ఫోన్ మాట్లాడుతోందని వాదనలు వినిపించాడు. అయితే కోర్టు పట్టించుకోలేదు. నిధి తరఫు లాయర్లు ఇప్పుడు నిధికి 25 సంవత్సరాలని జీవితాంతం ఆమె వీల్చైర్ మీద మాటా పలుకూ లేకుండా జీవచ్ఛవంలా బతకాలని అందుకు చాలా డబ్బు అవసరమవుతుందని అందువల్ల నష్టపరిహారం కనీసం 7 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రతివాదులు ‘ఇది చాలా ఎక్కువ’ అని అభ్యంతరం చెప్పారు. ఇదంతా పరిశీలించిన న్యాయమూర్తులు ‘మేము ఆ అమ్మాయివి యాక్సిడెంట్కు ముందు ఫొటోలు ఇప్పటి ఫొటోలు చూశాం. మా గుండె తరుక్కుపోయింది. ఒక ఆడేపాడే అమ్మాయి ఈ వ్యథను ఎలా భరించగలదు? మాకే ఇలా ఉంటే తల్లిదండ్రులు ఈ బాధను ఎలా తట్టుకుంటారు. వారు ఇప్పటికే చేయవలసిందల్లా చేశారు. ఇకపైనా చేయాలి. ఇది ఎంతో వ్యథ. ఇది అరుదైన కేసుల్లోకెల్లా అరుదైనది. అందుకే సహానుభూతిని చూపాలి. అందుకే మేము రైల్వే మంత్రిని ఇప్పటి వరకూ ఇచ్చిన దానితో సహా అంతా కలిపి ఐదు కోట్ల రూపాయల పరిహారంతో కేసును సెటిల్ చేసుకునే అవకాశం పరిశీలించమని కోరుతున్నాం’ అన్నారు.బహుశా రైల్వే మంత్రి స్పందించవచ్చు. స్పందించకపోవచ్చు. కాని రోడ్డు సెఫ్టీ గురించి మన దేశంలో ఎంత చైతన్యం రావాలో మాత్రం ఈ కేసు తెలియచేస్తూ ఉంది. పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త చెప్పాలి. రోడ్డు మీద నడిచినా, వారికి వాహనాలు కొనిచ్చి పంపినా ఎంత భద్రం చెప్పాలో అంతా చెప్పాలి. జర భద్రం. -
సర్వమతాల భక్తులు కొలిచే సాగర్ మాత
సర్వ మతాల భక్తుల కోర్కెలు తీర్చే క్షేత్రంగా వెలుగొందుతోంది సాగర్ మాత ఆలయం. ఈ ఆలయం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం తీరంలో ఉంది. సాగర్మాత మహోత్సవాలను ఏటా మార్చి 7, 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు. విదేశీయులు సైతం ఈ ఉత్సవాలకు హాజరుకావడం విశేషం. ఉత్సవాల సమయంలోనే కాకుండా.. ప్రతి ఆదివారం భక్తులు ఆలయానికి వస్తుంటారు.ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగర్మాత (Sagar Matha) ఆలయానికి రాష్ట్రంలోనే విశిష్టత ఉంది. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్రకళా నైపుణ్యం వీటిలో కనిపిస్తుంది. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాత.. సాగర్మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు తదితర అన్ని మతాల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ సంప్రదాయ రీతుల్లో నిర్మాణం ఈ ఆలయం దేశంలోనే భారతీయ సంప్రదాయ రీతులలో నిర్మించిన తొలి క్రైస్తవ మందిరంగా చెబుతారు. ధూప, దీప, నైవేద్యాలు, తలనీలాలు సమర్పించటం వంటి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందూ పద్ధతిలో జరిగే క్రైస్తవ ఆలయం కావడం విశేషం. కోర్కెలు తీరిన భక్తులు జీవాలను బలి ఇస్తారు. సాగర తీరంలో వంటలు చేసుకొని ఆరగించి వెళ్తారు. సాగర్లో పయనించే నావికుడు.. రాత్రి వేళల్లో నక్షత్రాల సహాయంతో ఓడను నడిపి గమ్యస్థానం చేరినట్లు.. పాపపంకిలమైన లోకమనే సముద్రంలో మానవునికి మంచి అనే దారి చూపేందుకు మరియమాత నక్షత్రంగా ప్రకాశిస్తుందని.. భక్తులు చెబుతారు. ఆ నమ్మకంతోనే దీనికి సాగర్మాత మందిరం అని పేరు పెట్టారు. చదవండి: ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!ఈ మందిరానికి 1977 అక్టోబర్ 10వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అప్పటి గుంటూరు మండల పీఠాధిపతి కాగితపు మరియదాసు ప్రారంభోత్సవం చేశారు. దీని నిర్మాణానికి మరియదాసుతో పాటు ముమ్మడి ఇగ్నేషియన్, తాను గుండ్ల బాలశౌరి విశేష కృషి చేశారు.ఆకట్టుకుంటున్న జపమాల స్థలాలు 2011 మార్చి 6న కృష్ణానదీ (Krishna River) తీరంలో నిర్మించిన జపమాల క్షేత్రాన్ని గుంటూరు పీఠాధిపతులు గాలిబాలి ప్రారంభోత్సవం చేశారు. ఏసుక్రీస్తు జననం నుంచి మరణం వరకు ఆయన జీవిత చరిత్ర గురించి ఏర్పాటు చేసిన 20 జపమాల స్థలాలు, ధ్యానమందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2024లో సాగర్మాత ఆలయంపై, ఆలయంలోని 14 స్థలాల విగ్రహాలపై దేవదూతల విగ్రహాలను విచారణ గురువులు హృదయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగర్మాతకు కొబ్బరికాయ కొట్టి అగర్బత్తీల హారతి, తలనీలాలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. పుణ్యస్నానాలు చేసి ప్రార్థనలు జరుపుతారు. -
ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!
పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి యాదవరాజులైన భోజరాజు తవ్వించారు. నాటి నుంచి నేటికీ గ్రామస్థులు, ఆ బావి నీటిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దాదాపు 70 అడుగుల లోతు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ బావి ఎన్నో ప్రాచీన విగ్రహాలతో ఆకట్టుకుంటుంది. ఈ బావిని ఎలాంటి మట్టి, ఇతర సామగ్రిని వినియోగించకుండా రాతి మీద రాతిని పేర్చి, హెచ్చుతగ్గులు కనిపించకుండా కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాతి కట్టడంపై దేవతామూర్తులు, నర్తకుల నృత్యభంగిమలు, జలచర జీవుల రూపాలు, జలకన్యలు ఇలా వందలకొద్ది శిల్పాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. పదేళ్ల క్రితం వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ బావి నీటినే వినియోగించేవారు. కాలక్రమేణా నీళ్ల వ్యాపారం మొదలైననాటి నుంచి, ఎవరికి వారు, వాటర్క్యాన్స్ కొనుక్కుంటూ ఈ బావి నీటిని గృహ అవసరాలకు వాడటం మానేశారు. ప్రస్తుతం ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ‘అప్పట్లో ఈ నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఉండేవి కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు’ అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.కరువులోనూ ఆదుకుంది..దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు మా వంశస్తులు నిర్మించిన భోజరాజు బావి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం 15 ఎకరాల వ్యవసాయ భూమికి ఈ బావి నీరే ఆధారమైంది--విజయ రామరాజు జమేదార్ మద్దికెరపి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు డెస్క్టి.వెంకటేశ్వర్లు, మద్దికెర(చదవండి: ఈ తిను 'బండారం' గురించి తెలుసుకోండి..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?
హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.'జన్యుపరమైన కారణాల వల్లే'మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీజైగోటిక్ అంటారని తెలిపారు వైద్యులు. (చదవండి: అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!) -
లక్కీ డ్రా.. గిఫ్ట్లు అంటే ఆశపడ్డారో, ఖేల్ ఖతం!
ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు తమ చోర బుద్ధికి పని చెబుతూనే ఉంటారు. మరి అలాంటిది ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 20 కోట్లు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం..అంటే, ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి , పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్.దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సైబర్ మోసగాళ్ల వలలో పదవద్దని అధికారులు, పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ కీలక సూచనలు చేశారు.సరదాగా సినిమాకు వెళ్ళినపుడో, .పెట్రోల్ బంకులోనో సార్..మీ ఫోన్ నెంబర్ ఇస్తారా..లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం. అని చెప్పే వాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దు. వాళ్లకి ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు అని వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఇటీవల హైదారాబాద్ లో మాట్లాడుతూ.. కొన్ని వ్యాపార సంస్థలు తెలివిగా ,సార్వత్రిక ప్రదేశాల లో జనం వద్ద నుంచి ఫోన్ నెంబర్లను సేకరించి,ఆ తర్వాత మీ కు లక్కీ డ్రా లో గిఫ్ట్ వచ్చింది అంటూ పలు రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు. చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ పెట్రోల్ బంకు యాజమాన్యాలు, సినిమా టాకీస్ ల వద్ద జనం జాగృతం గా ఉండి. తమ ఫొన్ నెంబర్ లను ఇవ్వకుండా జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. డెక్కన్ రిసార్ట్స్ అనే సంస్థ ఇలాగే వేలాది మంది నుంచి ఫోన్ నెంబర్లను సేకరించి వారినుంచి కోట్ల రూపాయలు దోచుకుని మోసం చేసిందన్నారు.ఈ మేరకు సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ఫలితం లేదని రఘునందన్ వివరించారు.చదవండి: ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు