బాలీవుడ్ నటుడు పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా అక్టోబర్ 19, 2025లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తతల్లి పరిణీతి తన బిడ్డపై కేరింగ్ విషయంలో ఎలా టెన్షన్ పడుతోందో షేర్ చేసుకుంది. అంతేగాదు తన కుమారుడి కోసం ఇంటిని తీర్చిదిద్దిన విధం గురించి కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది. పాతకాలం నాటి వైబ్స్తో మన సంప్రదాయ బేబీ కేరింగ్ విధానం గురించి హైలెట్ చేసింది.
ప్రస్తుతం తాను తల్లిగా చాలా బిజీ అని, అతడి సంరక్షణతోనే తలమునకలవుతున్నట్లు పేర్కొంది. ఇది చాలా అలసట, బాధ్యతతో కూడినది, పైగా జీవితంలో అత్యంత సంతోషభరితమైన దశ కూడా అని అభిర్ణించింది. మనిషి ఉపయోగించే కలర్లను బట్టి అతడి మనస్తత్వం ఎలా చెప్పేయొచ్చో..అలాగే ఇక్కడ నటి పరిణీతి తన కొడుకు కోసం రూమ్ అలకరణకు ఏ రంగులకు ప్రాధాన్యత ఇచ్చిందో చూస్తే..ఆమె ఏంటనేది ఇట్టే అర్థమైపోతుంది.
తన కొడుకు నీర్ కోసం అన్ని లైట్ కలర్స్, తెలుపు, గోధమ రంగులకే ప్రాధాన్యత ఇచ్చారామె. "బ్రిటిష్-శైలి" ప్యానెలింగ్తో తీర్చిదిద్దారు. తనది, రాఘవా టేస్ట్ దగ్గర దగ్గరగా ఒకటేనని, అందువల్ల అందుకనుగుణంగా ఆ గదిని ఈ విధంగా డిజైన్ చేశానని చెబుతోంది. అక్కడ గోడలన్నీ వింటేజ్ కార్ ఆర్ట్వర్క్తో ఆకర్షించగా, అక్కడ రాఘవ్ తండ్రి గిఫ్ట్గా చెక్క ఫ్లోరింగ్ వింటేజ్ కార్పెట్తో అనుబంధంగా ఉంది. ఇవేగాక క్లాసిక్ రంగుల తెల్లటి తొట్టి, బొమ్లలు, కస్టమ్ మేడ్ లేత గోధమ రంగు వార్డ్రోబ్లు తదితరాలు ఉన్నాయి.
నిజానికి ఇది తన రీడిండ్ రూమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ గదిలోకి ఎవరు ప్రవేశించిన తమ ఇట్టే తమ సమస్యలన్నింటిని మరిచపోయేలా చేసే..అందమైన ప్రదేశం. ఇంత ప్రశాంతమైన ప్రదేశంగా మార్చినందుకు పరిణీతికి క్రెడిట్ ఇస్తూ..దీన్ని స్వర్గమపు అభయారణ్యంగా పిలిచారు రాఘవ చద్దా. కాగా, పరిణీతి, రాఘవ్లు మే 2023లో ఉదయపూర్లోని ది లీలా ప్యాలెస్లో అట్టహాసంగా పెళ్లిచేసుకున్నారు. వివాహం అయిన రెండేళ్లకు అక్టోబర్ 19, 2025న పండంటి మగబిడ్డ నీర్కు స్వాగతం పలికారు.
(చదవండి: మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!)


