Tamil Nadu
-
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. -
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
సీఎం విజయ్, రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందన ఇదే..
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
ఇసుక క్వారీల అక్రమాలకు బ్రేక్
– ఆదాయ వనరుపై ప్రభుత్వం దృష్టి సాక్షి, చైన్నె : తమిళనాడులో అధికార మార్పిడి అనంతరం ఇసుక క్వారీల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో, ఖనిజ వనరుల శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెంచేందుకు సీఎం విజయ్ సిద్ధమయ్యారు. రాజకీయ జోక్యం.. ప్రభుత్వానికి నష్టం తమిళనాడు వ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్రావెల్ మట్టికి ఎప్పుడూ కొరత ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని గతంలో మెజారిటీ క్వారీలను రాజకీయ నాయకులే నడిపించేవారు. ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేయడం, డ్రోన్ల ద్వారా తవ్వకాలను పర్యవేక్షించడం వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టినప్పటికీ.. నాటి అధికార పార్టీ నేతల జోక్యంతో అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. అనుమతి పొందిన పరిమితి కంటే ఎక్కువ తవ్వకాలు జరపడం, ఒక చోట అనుమతి తీసుకుని మరోచోట మట్టిని తరలించడం వంటి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. మామూళ్ల దందాకు ముగింపు గతంలో 6 యూనిట్ల (30 టన్నులు) మట్టిని తరలించడానికి ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా రూ. 2,500 చెల్లించాల్సి ఉండేది. అయితే దీనితో పాటు కంపెనీ పేరుతో పైస్థాయి నేతలకు రూ. 2,400, స్థానిక నాయకులకు రూ. 1,200 చొప్పున మొత్తం రూ. 3,600 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అదనపు భారాన్ని తట్టుకోవడానికి, వ్యాపారులు ఆన్లైన్లో ఒకే ఒక్క ఒరిజినల్ పర్మిట్ తీసుకుని, దాని ఆధారంగా నకిలీ రశీదులను సృష్టించి పదే పదే మట్టిని తరలించేవారనిఇ సమాచారం. ఫలితంగా ప్రభుత్వానికి రావలసిన లక్షలాది రూపాయల ఆదాయంకు గండి కొట్టినట్లయ్యింది. డ్రోన్ల నిఘా.. కఠిన చర్యలు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ప్రకటన సమయం నుంచే అధికారుల నిఘా పెరగడంతో అక్రమ క్వారీలు మూతపడ్డాయి. అదే సమయంలో ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం అధికారంలోకి రావడంతో, రాజకీయ నాయకులు అక్రమ క్వారీల జోలికి వెళ్లడం మానేశారు. ప్రస్తుతం పర్మిట్ల అవినీతికి పూర్తిగా ముగింపు పడే రీతిలో అధికారులు కొరడా ఝుళిపించి ఉన్నారు. దీంతో నిర్వాహకులు నిబంధనల ప్రకారం ఆన్లైన్ పర్మిట్లు తీసుకునే పనిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం పుంజుకునే అవకాశాలు అధికమయ్యాయి. అలాగే ఖనిజ వనరుల శాఖ అధికారులు డ్రోన్ల సహాయంతో తవ్వకాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మట్టిని తీస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. లీజు పొందిన స్థలాన్ని కాకుండా వేరే చోట తవ్వకాలు జరిపితే సదరు క్వారీలను తక్షణమే సీజ్ చేసే విధంగా ఉరకలు తీస్తుండటంతో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం క్రమంగా పెరిగనున్నది. ఈ విషయంగా శివగంగై జిల్లా ఖనిజ వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ పన్నీర్సెల్వం మాట్లాడుతూ.. ప్రస్తుతం శివగంగై జిల్లాలో అనుమతి పొందిన 16 క్వారీలు మాత్రమే నడుస్తున్నాయి. జిల్లాలో ఎలాంటి అక్రమ క్వారీలు లేవని. రవాణా చేసే వాహనాలు సక్రమంగా పర్మిట్లు కలిగి ఉన్నాయా లేదా అనే అంశంపై క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచాం అని తెలిపారు. -
పురుషుల రక్షణ కోసం హెల్ప్లైన్ కావాలి
తమిళసినిమా: ఇటీవల నటుడు రవిమోహన్ తన భార్య కుటుంబం వేధిపుల గురించి మీడియా ముందు వెల్లడిస్తూ కంటతడి పెట్టిన విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్లుగా తన భార్య, ఆమె కుటంబం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తోందని, తన పిల్లలను కూడా చూడనీయకుండా చేస్తున్నారని, తాను పలుమార్లు చేతి నరాలు కట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో పురుష రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుల్ తుమిళన్ ముఖ్యమంత్రి విజయ్కు ఒక విజ్ఞాపన లేఖను రాశారు. అందులో తమిళనాడులో భార్యా బాధితుల మరణాలు అధికం అవుతున్నాయని, వారిని రక్షించడానికి పురుష రక్షణ కోసం ఒక హెల్ప్లైన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన దేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియాలో పురుష రక్షణ కోసం హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారని,అదే విధంగా తమిళనాడులోనూ ఆ దిశగా చర్యలు చేపట్టాలాని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 162 మంది టెక్నికల్ ఎస్ఐల బదిలీ కొరుక్కుపేట: పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 162 మంది టెక్నికల్ ఎస్ఐలను డీఐజీ (టెక్నికల్ డివిజన్) జయలక్ష్మి బదిలీ చేశారు. తమిళనాడు పోలీసులోని వివిధ సాంకేతిక విభాగాలలో ఎస్ఐలు పనిచేస్తున్నారు. వారు 3 సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేస్తున్నందున, పరిపాలనా సౌలభ్యం కోసం, ఇతర విభాగాలకు బదిలీ కావాలని ఎస్ఐలు చేసిన అభ్యర్థనల మేరకు, 162 మంది ఎస్ఐలను పోలీసులోని వివిధ విభాగాలకు బదిలీ చేయాలని ఉత్తర్వులిచ్చారు. ఇందులో సి.బి.సి.ఐ.డి సాంకేతిక విభాగంలో పనిచేసిన ఎస్ఐ బాల ఆత్మనేసర్ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి బదిలీ చేశారు. తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ కమిషన్లో పనిచేసిన ఇర్ఫాన్ అయాజ్ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి, ఆర్థిక నేరాల విభాగంలో పనిచేసిన రాబర్ట్ బ్రూస్ను చైన్నెలోని ఉగ్రవాద నిరోధక దళానికి బదిలీ చేశారు. వీరపురంలోని తమిళనాడు 3వ బెటాలియన్లో పనిచేసిన కలైసెల్విని ఉగ్రవాద నిరోధక దళానికి, ఆవడి మెట్రోపాలిటన్ పోలీస్ను చైన్నెలోని ఉత్తర మెట్రోపాలిటన్ పోలీస్ జోన్, పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బైకు – బస్సు ఢీ అన్నానగర్: విల్లుపురం జిల్లా, మరకానం మండవాయి,పుదుక్కుప్పం సమీపంలోని ఆలపాక్కంకి చెందిన శేషాద్రి కుమారుడు సిలంబరసన్ (29). ఇతనికి పెళ్లి కాలేదు. ఆదివారం తెల్లవారుజామున సిలంబరసన్ను అతని బావ స్టాలిన్ (37), కలపట్టులోని కనకశెట్టి కుళం ప్రాంతంలో హోటల్ నడుపుతున్న మరో బావ కార్తికేయన్ (33) ఒకే బైకుపై పుదుచ్చేరిలోని అభిషేకప్పక్కం ప్రాంతానికి వెళ్లారు. స్టాలిన్ బైక్ నడుపుతున్నాడు. పుదుచ్చేరిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో కొట్టకుప్పం సమీపంలో ఉన్న పెరియముదలియార్ చావడి ఎకై ్సజ్ చెక్ పోస్ట్ వద్దకు వారు సమీపిస్తుండగా, అతివేగంగా వస్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సు, చైన్నె నుండి పుదుచ్చేరి వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. ఇదే క్రమంలో ఆ బస్సు స్టాలిన్ ప్రయాణిస్తున్న బైకును కూడా ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న స్టాలిన్తో సహా ముగ్గురు బస్సు ముందు చక్రలో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. దిండుక్కల్ వెస్ట్ గక్కన్ రోడ్కు చెందిన బస్సు డ్రైవర్ మురుగేశ్వరన్ (30), అక్కడ బస్సును ఆపి పారిపోయాడు. అనంతరం, బస్సు డ్రైవర్ మురుగేశ్వరన్ పుదుచ్చేరిలోని ఉరులయన్పేట పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. బస్సు ఢీకొన్న కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగులు శివాసిస్ పట్టి నాయక్ (35), నరేంద్ర (25), యశ్వంత్ భూపతి (30), తరుణ్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పుదుచ్చేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరువళ్లూరు: పిచ్చికుక్క దాడిలో ఒకే రోజు ముగ్గురు మహిళలు సహా 18 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తిరువళ్లూరులో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కాకలూరు లోని నివాస ప్రాంతాల్లో పిచ్చికుక్క సంచరిస్తూ కనిపించింది. అదేసమయంలో అటువైపు వెళు తున్న ముగ్గురు మహిళలు సహా 18 మందిపై దాడి చేసి గాయపరిచింది. కుక్క దాడిలో కాకలూరుకు చెందిన గజేంద్రన్ (65), సురేష్ (42), రవికుమార్ (26), భాస్కర్ (29), గోకనాథన్ (60), మాల (22) సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని తిరువ ళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. -
విజయ్ నాకు సమకాలికులు కారు!
సాక్షి, చైన్నె : ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో తన భేటీ చర్చకు దారితీయడంతో రజినీకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘స్టాలిన్కు, నాకు మధ్య ఉన్న బంధం రాజకీయాలకు అతీతమైంది. ఆయన నాకు సుదీర్ఘకాలంగా మంచి మిత్రుడు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. అయితే కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. ఒక మంచి స్నేహితుడిగా, ఆయనకు ధైర్యం చెప్పడానికే నేను వెళ్లాను‘ అని వివరించారు. విజయ్ సీఎం కాకూడదని, ఆయనను అడ్డుకోవడానికే రెండు పెద్ద పార్టీలు కలవాలంటూ తాను అక్కడ మాట్లాడినట్లు వస్తున్న వార్తలను రజినీ తీవ్రంగా ఖండించారు. అటువంటి దిగజారుడు రాజకీయాలు మాట్లాడే వ్యక్తిని తాను కాదన్నారు. విజయ్కు రజినీకాంత్ శుభాకాంక్షలు చెప్పలేదని, ఆయనపై రజనీకి అసూయ ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సూపర్ స్టార్ ఘాటుగా స్పందించారు. ‘విజయ్ గెలవగానే నా ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా అభినందనలు తెలిపానని గుర్తు చేశారు. ఇటీవల ఎయిర్పోర్టులో ఒకరు ఫోన్ చూపిస్తూ విజయ్ సీఎం అయ్యారు అని చెబితే, నవ్వుతూ వెళ్లిపోయానని, దాన్ని పట్టుకుని శుభాకాంక్షలు చెప్పలేదనడం సరికాదన్నారు. సినిమా రంగం నుంచి వచ్చి ఒంటరి పోరాటంతో విజయ్ సాధించిన విజయాన్ని రజినీకాంత్ ఆకాశానికెత్తారు. చాలా చిన్న వయసులోనే విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి మహానుభావులు సాధించిన రికార్డుల కంటే విజయ్ సాధించిన ఘనత చాలా పెద్దది. ఇది తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఒక ఒంటరి వ్యక్తిగా, పెద్ద పెద్ద పార్టీలను ఎదిరించి ఆయన విజయం సాధించారు. ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓటేశారని, కచ్చితంగా ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు. అభిమానులకు, కార్యకర్తలకు రజినీ పలు సూచనలు చేశారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి రాలేదో గతంలోనే సుదీర్ఘమైన ప్రకటన ద్వారా స్పష్టం చేశానని గుర్తుచేశారు. ‘సినిమాలో నష్టం వస్తే కేవలం నిర్మాత మాత్రమే నష్టపోతాడని పేర్కొన్నారు. అయితే, రాజకీయం అలా కాదు.. దాని బాధ్యత చాలా పెద్దది. కమల్ హాసన్తో సహా సినిమా ప్రముఖులు చాలా మంది విజయ్ను కలిశారు. నేను కేవలం ఫార్మాలిటీ కోసం వెళ్లి కలిసే వ్యక్తిని కాను అని పేర్కొన్నారు. విజయ్ పాలనను నిరూపించుకోవడానికి ప్రజలు కనీసం రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు. విజయ్ పార్టీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వారు చేసే చిన్న తప్పు కూడా విజయ్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత సినిమా గ్లామర్, యువత, మహిళల మద్దతుతో ఒక పెను మార్పు వచ్చిందని రజినీకాంత్ ముగించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తనపై వస్తున్న విమర్శలకు, రాజకీయ ఊహాగానాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆదివారం గట్టి కౌంటర్ ఇచ్చారు. పోయేస్ గార్డెనన్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ను తాను కలవడం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూనే, కొత్తగా సీఎం పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్పై తనకు ఎలాంటి అసూయ లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. నాకు, విజయ్కు జనరేషన్ గ్యాప్ ‘నేను రాజకీయాల్లోనే లేను.. అలాంటప్పుడు విజయ్పై నాకు ఎందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయినా నాకు ఆ భావన రాదు. నాకూ, విజయ్కు మధ్య ఒక తరం వ్యత్యాసం ఉంది. చిన్నప్పటి నుంచి అతడిని చూస్తున్నాను. అతను సీఎం అవ్వడం నాకెందుకు అసూయ?‘ అని ప్రశ్నించారు. అభిమానులకు సూచన ఎంజీఆర్, ఎన్టీఆర్ రికార్డులను మించిన ఘనత రెండేళ్లు సమయం ఇవ్వాలి విజయ్ విజయం అద్భుతం.. -
పువ్వుల్లో దాగున్న అందం
తమిళసినిమా: పువ్వులు వికసించగానే పరిమళిస్తాయి. అలాంటి పువ్వుల చూడగానే మగువుల తలపులు వికసిస్తాయి. వాటిని తమ సిగలో దాల్చుకోవాలని తహతహలాడుతుంటారు.. పువ్వులకు, మగువులకు అంతగా అనుబంధం ఉంటుంది. మగువులకు చీరలెంత అందమో, పువ్వులు అంత అందాన్నిస్తాయి. ఇకపోతే మగువులను పువ్వులతో పోల్చుతారు. వారి మనసులు అంత సుకుమారమనే అలా పోలుస్తారు. పువ్వులను ఇష్టపడని సీ్త్ర ఉండదని చెప్పొచ్చు. నయనతారకు పువ్వులంటే చాలా ఇష్టం అనుకుంటా. దాన్ని ఇప్పుడు చేతల్లో చూపించారు. దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ భామ, జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ పాగా వేసి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా మరోసారి సల్మాన్ఖాన్కు జంటగా హిందీలో నటిస్తున్నారు. తమిళంలోనూ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలా ఈమె నటించిన మూక్కుత్తి అమ్మన్–2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఏంచేసినా వార్తే అవుతుంది. ప్రచారంలో ఈమె స్టయిలే వేరుగా ఉంటుంది. ఎలాంటి అకేషన్ వచ్చినా ఫొటోలు తీసుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. అలా ఇటీవల అందమైన పువ్వులు ఈమె కంటపడ్డాయి. అంటే వెంటనే ఆ పువ్వులను సృశించి, పరిమళాలను ఆస్వాదించడంతో సరిపెట్టుకోకుండా వాటితో రకరకాల భంగిమల్లో ఫొటోలను తీయించుకున్నారు. పువ్వుల మధ్యలో దాగి వాటి అందాల్లో అందంగా మారిపోయారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజాక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
త్వరలో మంత్రివర్గ విస్తరణ
సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టి న ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనుందని ఆర్థిక మంత్రి సెంగోట్టయ్యన్ వెల్లడించారు. కోయంబత్తూ రు విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం, మిగిలిన మంత్రి పదవుల భర్తీని ముఖ్యమంత్రి విజయ్ క్ర మంగా చేపడతారని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇంకా 15 మందిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు త్వరలోనే మరో 13 మందిని క్యాబినెట్లోకి తీసుకుని మంత్రిత్వ శాఖల పరిధిని విస్తరించనున్నట్లు సెంగోట్టయ్యన్ తెలిపారు. గతంలో జయలలిత మొదట చిన్న క్యాబినెట్తో ప్రారంభించి ఆ తర్వాత క్రమంగా విస్తరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విజయ్ సంచలన నిర్ణయాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 717 మద్యం దుకాణాల మూసివేత వంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే విజయ్ చారిత్రాత్మక విజయాలు సాధించారని మంత్రి కొనియాడారు. భారతదేశంలో మరెవరూ ఇంత వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు. మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయి అని సెంగోట్టయ్యన్ ప్రశంసించారు. వారికి ఎవరు పదవులు ఇస్తామన్నారు మంత్రివర్గంలోఅన్నాడీఎంకే ఎమ్మెల్యేల చేరికపై మీడి యా ప్రశ్నించగా.. ‘సీఎం విజయ్ ఏది ఆలోచించినా దాన్ని అమలు చేయడమే తమ బాధ్యతగా పేర్కొన్నా రు. మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి స్వయంగా తన హోదా నుంచే తుది నిర్ణయం తీసుకుంటారని సెంగోట్టయ్యన్ స్పష్టం చేశారు. అయితే, వారికి మంత్రి పదవులు ఇస్తామని ఎవరు చెప్పారని, ఇంత వరకు అలాంటి ప్రస్తావనే లేదన్నారు. ఏనిర్ణయమైనా తమ నాయకుడు, సీఎం విజయ్ తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మంత్రి వర్గంలో చేరడం గురించి ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం, ఎంఆర్ విజయ భాస్కర్, విజయ భాస్కర్ తదితర అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆదివారం చైన్నెలో సమావేశం కావడం ప్రాధాన్యకు దారి తీసింది. -
కథానాయకిగా నటుడు కొట్టాచ్చి కుమార్తె
తమిళసినిమా: ఇంతకు ముందు బాలతారలుగా రాణించిన పలువురు ఆ తరువాత కథానాయికలుగా పరిచయం అయ్యి ఉన్నత స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొట్టాచ్చి కూతురు మానసీ పలు విజయవంతమైన చిత్రాల్లో బాలతారగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా తాజాగా బాలతార మానసి హీరోయిన్గా పూ కాయ్ కని అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం ద్వారా కేసీపీ. మిథున్ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు అడియే వెళ్లళగి, ఏన్ ఎన్నై కాదలిచ్చా వంటి ఇండిపెండెంట్ ఆల్బమ్లలో నటించి గుర్తింపు పొందారన్నది గమనార్హం. అదే విధంగా టూలెట్ చిత్రం కథానాయకుడు సంతోష్ నంబిరాజన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. దీనికి వెట్రివీరన్ మహాలింగం దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అరుంబు మీసై కురుంబు పార్వై, వెన్నెలా వీడు, విసిరి వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా ఈయన ఇటీవల దర్శకత్వం వహించిన సూట్కేస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా పూర్తి నేటివిటితో రూపొందిస్తున్న చిత్రం పూ కాయ్ కని. ఇది 1986 ప్రాంతంలో జరిగే మూడు పరిమాణాల్లో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీన్ని ఇంతకు ముందు సూట్కేస్ చిత్రానికి నిర్మాణ నిర్వహణ భాద్యతలను నిర్వహించిన రాజేశ్వరి వెట్రివీరన్ ఈ చిత్రాన్ని పళయనూర్ సందనం పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా డబ్బింగ్ కళాకారుడిగా పలువురు నటులకు డబ్బింగ్ చెప్పిన దర్శకుడు వెట్రివీరన్ కొడుకు రాజు మహాలింగంతో పాటు కూత్తుపట్టరైలో శిక్షణ పొందిన పలువురు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కవితాత్మకంగా ఉన్న చిత్ర టైటిల్ మాదిరిగానే చిత్రం జనరంజకంగా ఉంటుంద ని దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రానికి పీజీ.ముత్తయ్య ఛాయాగ్రహణంను, ధన్రాజ్ మాణిక్యం సంగీతాన్ని అందిస్తున్నారు. -
సీనియర్ నిర్మాత, నటుడు కె.రాజన్ ఆత్మహత్య
తమిళసినిమా: సీనియర్ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె.రాజన్ (80) ఆదివారం సాయంత్రం స్థానిక ఆడయార్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కె.రాజన్ 1983లో బ్రహ్మచారిగళ్ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తరువాత పలు చిత్రాలు నిర్మించిన ఈయన నటుడు నిళల్గళ్ రవి, శరత్కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన నమ్మ ఊరు మారియమ్మ అనే చిత్రానికి దర్శత్వం వహించారు. దర్శకుడు సెంథిల్నాథన్ కోసం ఆయన దర్శకత్వం వహించిన తంగమాన తంగచ్చి చిత్రానికి కథను అందించారు. అదే విధంగా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన కె.రాజన్ పలు సినీ సంఘాల్లో కీలక పాత్రను నిర్వహించారు. ప్రస్తుతం సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతను నిర్వహిస్తూ వచ్చారు. కాగా సినీ వేదికపలై ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడే ఈయన ముఖ్యంగా చిన్న చిత్రాల రక్షణ కోసం గళమెత్తేవారు. అంతే కాకుండా నిర్మాతలను కాపాడే విధంగా స్టార్ హీరోల పారితోషికాలను తగ్గించుకోవాలని గొంతేత్తడంలో ఎప్పుడూ ముందుండేవారు. అంతే కాకుండా కె.రాజన్ విద్యాదాత కూడా. చిన్న పిల్లల కోసం పాఠశాలను నిర్విస్తూ వచ్చారు. ఎందరికో ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అలాంటి కె.రాజన్ ఇలా నదిలో పడి ఆత్యహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమను ధిగ్బ్రాంతికి గురి చేసింది. ఈయన భౌతిక కాయాన్ని అగ్నిమాపక దళం అడయారు నదిలో నుంచి పైకి తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా కె.రాజన్ ఆత్మహత్య హత్యకు కారణాలు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈయన స్థానికి ఓల్డ్ వాషర్పేటలోని కప్పల్ పొలు వీధిలో నివశిస్తూ వచ్చారు. -
ఈగో రామన్లో రోబోశంకర్
తమిళసినిమా: ఉపాధ్యాయలు, విద్యార్థుల ఇతివృత్తంతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. కాగా అలాంటి విభిన్న కథాంఽశంతో రూపొందిన తాజా చిత్రం ఈగో రామన్. ఇది ఉపాద్యాయుడికి, విద్యార్థికి మధ్య మానసిక పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని అసృతా ప్రొడక్షన్స్ పతాకంపై జి.సుధ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను గణేశన్ నాంజిముత్తు నిర్వహించారు. రోబోశంకర్ ప్రధాన పాత్రను పోషించిన ఇందులో సిబి భువనచంద్రన్, కీర్తన కథానాయికలుగా నటించారు. కవిత రమేశ్, సప్పాణి మురళి, చరణ్రాజ్, లత ముఖ్యపాత్రలు పోషించారు. రెమన్ నాట్రిక్స్ పాటలు రాసి సంగీతాన్ని అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తన తల్లి కల నెరవేర్చడానికి ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాస్తాడన్నారు. అయితే ఆ ఉద్యోగం అతనికి రాకుండా ఆటంకం కలిగిస్తారన్నారు. దీంతో ఆ తరువాత పరిణామాలతో ఆ యువకుడికి , ఉపాధ్యాయుడికి మధ్య కోల్డ్ వార్ మొదలవుతుందన్నారు. ఈగో రామన్ చిత్రంలో నాలుగు చక్కని పాటలు ఉంటాయని చెప్పారు. చిత్ర షూటింగ్ను పొల్లాచ్చి, కోవై పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా 45 రోజులు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. తమిళసినిమా: మలయాళ ప్రముఖ నటుడు ఫాహత్ ఫాజిల్ తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన హీరోగా, విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వివి ధ రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. అలాంటి ఫాహద్ ఫాజిల్ తాజాగా తమిళంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పలువురు ప్రముఖ హీరోలతో చిత్రాలు చేస్తున్న ఈ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి సి.ప్రేమ్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయ న ఇంతకుముందు 96, మెయ్యళగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. సరైన సమయాన్ని తీసుకుని పక్కా, స్క్రిప్ట్తో షూటింగ్కు రెడీ అవడం ఈయన విధానం కావడం గమనార్హం. ఫాహద్ ఫాజిల్, దర్శకుడు ప్రేమ్కుమార్ల రేర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యు లు పేర్కొన్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం చైన్నెలో నిర్వహించారు. ఇందులో నటించే హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. వేల్స్ ఫిలింస్లో ఫాహద్ ఫాజిల్ -
అక్రమంగా పేలుడు పదార్థాల తయారీ
– మహిళ సహా నలుగురు అరెస్టు అన్నానగర్: కుంభకోణం సమీపంలోని మనప్పడైయూర్లో లైసెన్సు లేకుండా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్న ఓ మహిళ సహా నలుగురిని అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు తయారు చేసిన ఇంటిని కూడా సీల్ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లాలో ని కుంభకోణం సమీపంలో ఉన్న తిరువలంచుళి మన ప్పడైయూర్ గ్రామంలోని ఓ స్థానిక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో కొన్ని రోజుల క్రితం, జరిగిన పేలుడులో రెండు భవనాలు నేలమట్టమయ్యా యి. ఈ ఘటన రాత్రి జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది. దీనితర్వాత, పోలీసులు ఆ ప్రాంతాల్లోని పేలు డు పదార్థాల తయారీ కర్మాగారాలు, గిడ్డంగులు, ఇళ్ల లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ స్థితిలో ఆదివారం తిరువలంచుళి సమీపంలోని మనప్పడైయూర్ రోడ్డులో ఉన్న ఒక ఇంటిని గహనిర్మిత పేలు డు పదార్థాల తయారీకి ఉపయోగిస్తున్నట్లు గుర్తించా రు. పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా, వారు ప్రభుత్వ లైసెన్సు లేకుండా రహస్యంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు తేలింది. అనంతరం, పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించిన కిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పేలుడు పదార్థాలు తయారు చేసిన కుటుంబానికి చెందిన అరుల్ డేవిడ్ (33), అరుల్ సెల్వన్ (48), మణికంఠన్ (35), శశి మేరీ (38)ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్నెలో సరికొత్త హెల్త్ రెవల్యూషన్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల ఆరోగ్య శైలిని మార్చేందుకు చైన్నెలో ఓ వినూత్నమైన భాగస్వామ్యం కుదిరింది. ప్రముఖ హెల్త్కేర్ అండ్ వెల్నెస్ క్లినిక్ లివ్యా హబ్, ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ బ్రాండ్ టీమ్ హై పెర్ఫార్మెనన్స్తో చేతులు కలిపింది. ఈ ఇరు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన లివ్యా అడ్వానన్స్డ్ మెటబాలిక్ రీసెట్ ప్రోగ్రామ్ చైన్నెలో అధికారికంగా ప్రారంభించారు. చైన్నెలోని ఆల్వార్పేటలో ఉన్న ‘లివ్యా క్యూర్ హబ్’ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ పరిచయ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, టాప్ ఫిట్నెస్ కన్సల్టెంట్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ వి. శ్రవంతి, డాక్టర్ ఆశాలత శ్రీనివాసన్; లివ్యా క్యూర్ హబ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.కె.టి. రాజు, టీమ్ హై పెర్ఫార్మెనన్స్ వ్యవస్థాపకులు శ్రీ హరి ప్రసాద్ తదితరులు పాల్గొని ఈ సరికొత్త హెల్త్ ఇనిషియేటివ్ను ఆవిష్కరించారు. చైన్నె నగర చరిత్రలో ఒక వెల్నెస్ క్లినిక్, ఒక ఫిట్నెస్ బ్రాండ్తో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్ను తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు, ఫిట్ నెస్ బ్రాండ్స్ సంయుక్తంగా ఈ ట్రానన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్ను క్లినికల్గా డిజైన్ చేశారు. శరీరంలోని జీవక్రియలను పునరుద్ధరించడం, శక్తి సామర్థ్యాలను పెంచడం, స్థిరమైన పద్ధతిలో శరీర బరువును నియంత్రించడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. 90 రోజుల సమగ్ర ప్యాకేజీలో అత్యాధునిక కతమైన రోగనిర్ధారణ పరీక్షలు,నిపుణుల పర్యవేక్షణలో రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలు, నిరంతర వైద్య పర్యవేక్షణ ఇందులో ఉంటాయి. -
సమస్యల పరిష్కారం కోసం..
వేలూరు: వేలూరు నియోజక వర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు అన్ని వార్డుల్లోను క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నట్లు టీవీకే వేలూరు ఎమ్మెల్యే వినోద్ కన్నన్ అన్నారు. వేలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో టీవీకే ఎమ్మెల్యే విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ఉదయం వేలూరు అన్నా రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయనకు వేలూరులోని ఆ పార్టీ జిల్లా కార్యదర్శులు, యూనియన్ కార్యదర్శులు, విజయ్ అభిమానుల సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో చేరుకొని సాలువ కప్పి సన్మానించారు. అనంతరం కేవీ కుప్పం ఎమ్మెల్యే తెండ్రల్కుమార్, గుడియాత్తం ఎమ్మెల్యే సిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట అభిమానుల కోసం సుమారు ఐదు వేల మందికి బిర్యాని విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వినోద్ కన్నన్ విలేకరులతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కార్యాలయంలో రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాను అసెంబ్లీకి వెళ్లినా కార్యాలయంలో ఇద్దరిని నియామకం చేయడంతో పాటు అన్ని వార్డుల్లోను గ్రామ పంచాయతీలోనూ క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను వాటి ద్వారా తెలుసుకుంటామన్నారు. అదే విధంగా సమస్యలను 24 గంటల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. మరో మూడు నెలల పాటూ నియోజక వర్గంలోని ప్రతి వార్డుకు వెళ్లి ఇంటింటికి వెల్లి కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు తెలిపారు. -
విజయ్కి 6 నెలల సమయం ఇవ్వాలి !
సాక్షి, చైన్నె: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది: సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు. తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తన ఉద్దేశం ప్రకారం... తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు. మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
క్లుప్తంగా
బైక్పై తీసుకెళ్లి దాడి దోపిడీ అన్నానగర్: రాజస్థాన్కు చెందిన లీలా రామ్ (27) అంబత్తూరు సమీపంలోని కల్లి కుప్పం ప్రాంతంలో నివసిస్తూ, పని చేస్తు వచ్చాడు. ఇతను ఆదివారం తన స్వగ్రామానికి వెళ్లి రైలులో చైన్నెకి వచ్చాడు. ఇతను రైల్వే స్టేషన్ నుండి అంబత్తూరు వెళ్లడానికి ఒక యాప్ ద్వారా బైక్ టాక్సీ బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే, మోటార్ సైకిల్ మీద అక్కడికి వచ్చిన ఓ యువకుడితో లీలారామ్ ప్రయాణిస్తున్నాడు. అయితే, ఆ యువకుడు అంబత్తూరు వైపు వెళ్లకుండా, మాధవరం రౌంటనా సమీపంలో ఉన్న తట్టన్కుళం రోడ్డు వైపు వాహనాన్ని అకస్మాత్తుగా మలుపు తిప్పాడు. ఆ సమయంలో, అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో యువకుడు, బైక్ టాక్సీ నడుపుతున్న ఇంకో యువకుడితో కలిసి లీలరామ్ పై దాడి చేసి బెదిరించారు. ఆ తర్వాత వారు అతని వద్ద నుండి డబ్బు, సెల్ఫోన్ తీసుకుని, ’జిపే’ ద్వారా మరింత డబ్బు పంపించామని బెదిరించి, అక్కడి నుండి పారి పోయారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన లీలా రామ్, మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశా డు. పోలీసులు కేసు నమోదు చేసి, నిఘా కెమెరా, బైక్ ట్యాక్సీ బుకింగ్ వివరాల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని, ఈ దోపిడీలో పాల్గొన్న వ్యాసర్పాడి కాక్కన్ వీధికి చెందిన సంతోష్ (24)ను అరెస్టు చేశారు. ఇతని నుంచి మోటార్బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు జనపద గాయకుల హత్య తిరువొత్తియూరు: తాంబరం సమీపంలోని వరదరాజపురం ప్రాంతానికి చెందిన భరత్ (22), శీను (23) అనే ఇద్దరు (గానాపాట) జనపద గాయకులు. శనివారం రాత్రి స్నేహితులిద్దరూ ఒక చోట గానా పాటల కచేరీ నిర్వహించారు. అనంతరం పడప్పై సమీపంలోని అమ్మణంపాక్కం గ్రామానికి చెందిన తమ స్నేహితుడు లోకేష్ ఇంట్లో బస చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6 మందికి చెందిన ముఠా మోటార్ సైకిళ్లపై అక్కడికి చేరుకున్నారు. కత్తు లు, కొడవళ్లతో లోకేష్ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న భరత్, శీనులను ఆ ముఠా తీవ్రంగా దాడి చేశారు. తరువాత ఆ ముఠా అక్కడి నుండి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన భరత్, శీను అదే చోట మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మణిమంగళం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హంతకులందరూ హెల్మెట్లు ధరించి వచ్చారు. దీనివల్ల వారిని గుర్తించడంలో చిక్కులు ఏర్పడ్డా యి. హంతకులు ఎవరు? హత్యకు గల కార ణం ఏమిటో తెలియరాలేదు. శనివారం రాత్రి ’గానా’ పాటల కార్యక్రమం జరుగుతున్న సమ యంలో ఏవైనా ఘర్షణలు జరిగాయా? లేదా చనిపోయిన వారి స్నేహితుడి కోసం వెతుకుతూ వచ్చిన అజ్ఞాత ముఠా ఈ జంట హత్యలకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. చోళుల కాలం నాటి రాగి ఫలకాలను శాశ్వతంగా ప్రదర్శించాలి – జవహిరుల్లా డిమాండ్ కొరుక్కుపేట: నాగపట్టణంలో చోళుల కాలం నాటి రాగి ఫలకాలను శాశ్వతంగా ప్రదర్శించాలని హ్యుమానిటీ పీపుల్స్ పార్టీ నాయకు డు, ఎమ్మెల్యే జవహిరుల్లా అన్నారు. ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ 300 సంవత్సరాల తర్వాత నెదర్లాండ్స్ ప్రధానమంత్రి చోళుల అనైమంగళం రాగి ఫలకాలను ప్రధానమంత్రి మోదీకి అందజేయబోతున్నారని తెలిసి నేను చాలా సంతోషించాను. ఈ రాగి ఫలకాలు సాధారణమైనవి కావు, ఇవి రాజరాజ చోళ, రాజేంద్ర చోళుల కాలపు వైభవానికి, సముద్రాలు దాటి విస్తరించిన రాజకీయ స్నేహానికి, తమిళుల సంస్కృతికి సాక్ష్యాలు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో, ఈ రాగి ఫలకాలను తమిళనాడుకు తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని మాజీ మంత్రి తంగం తెన్నరసు శాసనసభలో ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పదేపదే నొక్కి చెప్పింది.అందరి నిరంతర కృషి నేటి ఇటువంటి ఫలితాలను ఇవ్వడం సంతోషకరమైన విషయం అన్నారు అదే సమయంలో ఈ అనమంగళం రాగి ఫలకాల అసలు స్థానం నాగపట్టణం. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, ఈ రాగి ఫలకాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలి. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా ఇందుకు తగిన ప్రయత్నాలు చేసి, ఈ విలువైన చారిత్రక పత్రాలు తమ మాతృభూమి అయిన నాగపట్టణానికి తిరిగి వచ్చేలా చూడాలి అని కోరారు. ఈ శిల్పాలను ప్రజలు చూసేందుకు వీలుగా నాగపట్టణంలో శాశ్వతంగా ప్రదర్శించాలని, దీనిపై తమిళనాడు ప్రభు త్వం గట్టిగా పట్టుబట్టాలని తాను అభ్యర్థిస్తున్నాను అని ఆయన అన్నారు. తిరువళ్లూరు: మూర్చ రావడంతో మిద్దైపె నుంచి కిందపడి పెయింటర్ మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ వెంగత్తూరు గ్రామానికి చెందిన మణిగండన్(35) అవివాహితుడు. ఇతను పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గణేషపురంలో పెయింటింగ్ పనులు చేస్తుండగా హఠాత్తుగా ఫిట్స్ రావడంతో మిద్దైపె నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహచర కార్మికులు అతడ్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనవాలనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సర్వసభ్యం’ భేటీకి పట్టు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్మామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళణి స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ లుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళని స్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయ వద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
మంత్రి సమీక్షకు ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మా
సాక్షి, చైన్నె : తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో అధికార పక్షానికి చెందిన మంత్రి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షకు ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇందులో టీవీకే ఎమ్మెల్యేలు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష శివకాశి నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కీర్తన, ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె విరుదునగర్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుగపుత్ర, ఇతర ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శనివారం సాయంత్రం నుంచి పొద్దుపోయే వరకు జిల్లా కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో మంత్రి కీర్తన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ సుగపుత్రతో పాటు జిల్లా ఎస్పీ శ్రీనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి ఆనంది సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల వారీగా అమలవుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వివరాలను మంత్రి కీర్తనకు వివరించారు. ఆరుగురు డుమ్మా ఈ కీలక సమావేశానికి హాజరు కావాల్సిందిగా విరుదునగర్, శ్రీవిల్లిపుత్తూరు, రాజపాళయం నియోజకవర్గాల టీవీకే ఎమ్మెల్యేలకు.. అలాగే అరుప్పుకోట్టై, తిరుచ్చుళి, సాత్తూరు నియోజకవర్గాల డీఎంకే ఎమ్మెల్యేలకు మంత్రి కార్యాలయం, జిల్లా యంత్రాంగం ముందస్తుగానే ఆహ్వానాలు పంపింది. అయితే, ఈ అధికారిక సమీక్షా సమావేశానికి జిల్లాకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవడం గమనార్హం. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటూ ప్రతి పక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. టీవీకే జిల్లా కార్యదర్శి, విరుదునగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సెల్వం సమీక్షకే కాకుండా, మంత్రికి ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి కూడా గైర్హాజరు కావడం గమనార్హం. -
టాస్మాక్ దుకాణం ముట్టడి
పళ్లిపట్టు: స్థానిక బస్టాండులో టాస్మాక్ దుకాణం తొలగించాలనే డిమాండ్తో ఆదివారం టాస్మాక్ ముట్టడికి ప్రయత్నించిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయ్ అధికారం చేపట్టిన తరువాత బస్టాండ్లు, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు 500 మీటర్ల దూరంలోని 717 టాస్మాక్ దుకాణాలు మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. దీంతో పళ్లిపట్టు బస్టాండులో వున్న టాస్మాక్ దుకాణం మూసివేస్తారని స్థానికులు ఎదురుచూశారు. అయితే టాస్మాక్ దుకాణం మూసివేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవంతో ఆగ్రహం చెందిన స్థానికులు ఆదివారం దుకాణాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐ కార్తీక్ స్థానికులతో చర్చించి టాస్మాక్ తొలగింపునకు సంబంధించి ఫిర్యాదు చేస్తే సంబంధింత అధికారులకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో టాస్మాక్ దుకాణం తెరిచి సిబ్బంది వ్యాపారం నిర్వహించారు. -
డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు
తిరువొత్తియూరు: రాష్ట్రంలోని డెల్టా జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తిరుచ్చిలో 50 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అనేక జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. డెల్టా జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభకోణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కామరాజర్ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుచ్చిలో వరుసగా రెండో రోజు భారీ వర్షం పడింది. చత్రం బస్టాండ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నీరు నిలవడంతో రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని 50కి పైగా ఇళ్లలోకి నీరు చేరింది. తంజావూరు, నాగపట్నంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. అలాగే ముసిరి, పెరంబలూరు, అరియలూరు ప్రాంతాల్లో కూడా బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. పెరంబలూరు జిల్లాలో వడగళ్ల వాన పడి వాతావరణం చల్లబడింది. రోడ్ల పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు వేళ్లతో సహా నేలకూలడంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది .ఈ వర్షం కురువై (ఖరీఫ్) పంట సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఏర్కాడులో పర్యాటకుల సందడి
పోలీసుల బందోబస్తుతో టాస్మాక్ నిర్వహిస్తున్న సిబ్బంది ఏర్కాడులో పర్యాటకుల బోటింగ్ రైడ్ సేలం: సేలం జిల్లాలోని ఏర్కాడును పేదల ఊటీ అని పిలుస్తారు. ఈ పర్యాటక ప్రదేశానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రోజ్ గార్డెన్, లేడీస్ సీట్, అన్నాపార్క్, లేక్ పార్క్, పకోడా పాయింట్, సర్వరాయన్ గుహ ఆలయం, బోట్ హౌస్ వంటి ఏర్కాడులోని ప్రధాన ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేశారు. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఏర్కాడులో వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ జామ్ అయిన రోడ్లపై ట్రాఫిక్ను నియంత్రించడానికి పోలీసు లేరని ఆరోపిస్తూ, పర్యాటకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
కొరుక్కుపేట: మొగప్పేర్ తెలుగు కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్ (ఎంటీసీఎస్ఏ) 13వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి అన్నానగర్లోని చిన్నస్వామి మ్యారేజ్ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు.. అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు, ప్రొఫెసర్ సి.ఎం.కె.రెడ్డి, ఎస్డీఏటీ మెంబర్ సెక్రటరీ జె.మేఘనాథరెడ్డి, మాజీ డీజీపీ ఆర్. శేఖర్, ఏఐటీఎఫ్ జనరల్ సెక్రటరీ ఆర్.నందగోపాల్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వి. వీరభద్రరావు పాల్గొని ప్రసంగించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈసందర్భంగా అధ్యక్షుడు డాక్టర్ గిరి హనుమంతరావు, ముఖ్యఅతిథులు ప్రసంగిస్తూ పరాయి రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలుగు వారు తమ మూలాలను మర్చిపోకుండా, భాషా సాంస్కృతిక విలువలను కాపాడుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ముగప్పైర్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో 500 కుటుంబాలకు పైగా పాల్గొనడం ఇదే మొదటిసారి అని వారుకొనియాడారు. 10వ,12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉన్న ప్రతిభావంతులైన తెలుగు విద్యార్థులకు పురస్కారాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.నిర్మల్చందర్, జాయింట్ సెక్రటరీలు ఢిల్లీబాబు, మోహన్నాయుడు; డిప్యూటీ సెక్రటరీలు ఇక్కుర్తి సురేష్బాబు, ఆర్జీ. సురేష్బాబు, కోశాధికారి వై.గిరి, జాయింట్ ట్రెజరర్ పి. రామజయండాక్టర్ కల్పన, గౌరవాధ్యక్షుడు టి.ఎం.కె.కుమార్ పాల్గొన్నారు. -
ముగిసిన ఘంటసాల జాతీయ మహాసభలు
కొరుక్కుపేట: ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక (ఏఐజీసీవీ), మిత్ర సంఘాల ఆధ్వర్యంలో చైన్నెలో నిర్వహించిన 16వ జాతీయ హాసభలు ఆదివారంతో విజయవంతంగా ముగిసాయి. చైన్నె మైలాపూర్లోని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవనంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటాలకు ఏఐజీసీవీ అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నిర్వాహకులతో కలిసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో తమ సంస్థ తరఫున మహాసభలు నిర్వహించి తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. శని, ఆదివారాలు జరిగిన ఈ కార్యక్రమాల్లో ఘంటసాల సంగీత విభావరిలో గాయకులు ఎంఆర్ సుబ్రమణ్యం, కిడాంబి లక్ష్మీకాంత్, జయప్రభు, సుహాసిని, కేవీబీ ఆనంద్, తారకరామ శర్మ, సోము ఉమాపతి సినీ గీతాలను ఆలపించారు. అలాగే ఏఐజీసీవీ కార్యదర్శి చింతకాయల చిట్టిబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూచిపూడి, భరతనాట్యం, శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలతో కళాకారులు అందరిని ఆకట్టుకున్నారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, తమిళనాడు సైన్స్ ఫారమ్ ప్రతినిధులు అంబికా, సుధాకర్ పాల్గొన్నారు. -
కార్పొరేట్ గవర్నెన్స్లో సరికొత్త విప్లవం
ప్రకటించిన ఐసీఎస్ఐ సాక్షి, చైన్నె: కార్పొరేట్ గవర్నెన్స్, వృత్తిపరమైన నైపుణ్యాలు, పారదర్శకతను మరింత బలోపేతం చేసేందుకు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కీలక నిర్ణయాలను ప్రకటించింది. చైన్నె వేదికగా జరిగిన ఐసీఎస్ఐ సదస్సులో పలు నూతన కార్యక్రమాలు, అంతర్జాతీయ విద్యా ఒప్పందాలు సరికొత్త స్పెషలైజ్డ్ కోర్సులను ఐసీఎస్ఐ వెల్లడించింది. చైన్నెలో తమిళనాడు స్టేట్ కాన్ఫరెన్స్ ఐసీఎస్ఐ సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చైన్నెలో రెండు రోజుల పాటు తమిళనాడు స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెటమార్ఫోసిస్ సెక్టార్ స్పెసిఫిక్ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సుకు ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి కార్పొరేట్ నిపుణులు, పరిశ్రమల అధిపతులు హాజరై వివిధ రంగాల గవర్నెన్స్ నిర్మాణాలపై ప్యానెల్ చర్చలు జరిపారు. 2047 నాటికి 1.5లక్షల కంపెనీ సెక్రటరీల అవసరం ఈ సదస్సులో ఐసీఎస్ఐ జాతీయ అధ్యక్షుడు సిఎస్ పవన్ జి.చందక్ మాట్లాడుతూ.. మారుతున్న నియంత్రణ నిబంధనల నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలకు దేశంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుత అవసరాలకు అదనంగా మరో 10,000 మంది కంపెనీ సెక్రటరీలు అవసరమని ఆయన పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుంటే, వచ్చే 2047 నాటికి దేశంలో సుమారు 1.5 లక్షల మంది సెక్రటరీలు అవసరమవుతారని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న 80,000 మంది కంపెనీ సెక్రటరీలలో దాదాపు 35,000 మంది మహిళా నిపుణులే ఉన్నారని, ఈ వృతిలో మహిళల భాగస్వామ్యం ఏటా పెరుగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, జూన్ 13–14 తేదీల్లో పూణేలో 27వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీస్ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రకటించారు. -
కలిసికట్టుగా రక్తపోటును అదుపు చేద్దాం..!
సాక్షి, చైన్నె: ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే అతిపెద్ద సైలెంట్ కిల్లర్స్లో రక్తపోటు మొదటి స్థానంలో ఉందని, ఈఅధిక రక్తపోటుపై ప్రజల్లో అవగాహన పెంచడం, సరైన పద్ధతిలో బీపీని కొలవడం , సమర్థవంతమైన నివారణా చర్యల ప్రాధాన్యతను వివరించడం లక్ష్యంగా చైన్నెలో ఆదివారం సదస్స జరిగింది. ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవం సందర్భంగడా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరల్డ్ హైపర్టెన్షన్ లీగ్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.ఎన్. నరసింగన్ నేతృత్వంలో చైన్నెలో ఒక రోజు అంతా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ మొదట మూడు సార్లు బీపీ రీడింగ్స్ తీసుకుని పరీక్షలు చేశారు. అవగాహన సదస్సు.. ప్రతిజ్ఞ అనంతరం అధిక రక్తపోటు వల్ల కలిగే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దీనిని ఎలా నియంత్రించాలో వివరించిన తర్వాత, హాజరైన వారందరితో కలిసి ఒక సంతకాల ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరల్డ్ హైపర్టెన్షన్ లీగ్ ఒంటరిగా కాకుండా భారత్లోని ప్రముఖ వైద్య సంస్థలతో కలిసి నిర్వహించింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్టెన్షన్ (తమిళనాడు చాప్టర్) తరఫున చైర్మన్ డాక్టర్ కె. కన్నన్, సెక్రటరీ డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ , అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (చైన్నె చాప్టర్) తరఫున హానరరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ విజయ్ విశ్వనాథన్ ఈ సదస్సులో భాగస్వాములుగా వ్యవహరించారు. హైపర్టెన్షన్ మేనేజ్మెంట్లో వచ్చిన సరికొత్త అంతర్జాతీయ మార్గదర్శకాలు , క్లినికల్ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. నగరంలోని ప్రముఖ కార్డియాలజిస్టులు (గుండె వైద్య నిపుణులు), నెఫ్రాలజిస్టులు (కిడ్నీ నిపుణులు), మరియు న్యూరాలజిస్టులు (నరాల వైద్య నిపుణులు) ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
కొరుక్కుపేట: క్రీడాపోటీలు విద్యార్థుల్లో సజనాత్మకను పెంపొందింపజేయడమే కాకుండా ఉజ్వల భవిష్యత్ కి దోహదం చేస్తుందని తమిళనాడు రంజీ ట్రోఫీ మాజీ ప్లేయర్ సోమిశెట్టి సురేష్ పేర్కొన్నారు. తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ (టీఏవీఎం), గ్రేటర్ చైన్నె యూత్ వింగ్, అండ్ యువశక్తి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పెరంబూరు కేఆర్ఎం పబ్లిక్ పాఠశాల ప్రాంగణంలో చెస్, క్యారమ్స్ పోటీలు, వివాహ మాల, వైశ్య బజార్ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు వాసవీ మాతకు ప్రత్యేక ప్రార్థనతో ప్రారంభమై సాయంత్రం 6.30 గంటల వరకు సాగాయి. యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఉమేష్ దయాళన్, కార్యదర్శి యశ్వంత్ కనిగెలుపుల పర్యవేక్షణలో మూడు కేటగిరీలుగా ఒలంపిక్స్ నిబంధనల ప్రకారం నిర్వహించిన ఈ పోటీల్లో 5 నుంచి సీనియర్ సిటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 36 మంది విజేతలకు సోమిశెట్టి సురేష్, డాక్టర్ వసంతగౌరి, అజంతా డా.కనిగెలుపుల శంకర్రావు, వామ్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ. టీఏవీఎం చైర్మన్ కేకే త్రినాథ్కుమార్, ప్రధాన కార్యదర్శి దయాళమ్ వాసుదేవన్, ఎ.బద్రినారాయణ మెమెంటోలు, పతకాలు అందజేసి అభినందించారు. కేఆర్ఎం పాఠశాలల సీఈఓ ఆర్జే భువనేష్, ఎన్ఆర్ చేతన్, లింగేష్, పి.హరిప్రియ, కె.జయకుమార్, తిరవళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల యూత్ వింగ్ టీమ్ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. -
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్ భేటీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.నిజాలు మాత్రమే చెప్పండి ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి జూన్ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్ కోరారు. -
పుదుచ్చేరి ప్రోటెం స్పీకర్గా అన్బళగన్
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ ఎంపికయ్యారు. ఈనెల 18వ తేదిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 13న ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, కీలక శాఖల కేటాయింపుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో నమశ్శివాయం, మల్లాడికృష్ణారావు ఉన్నారు.వీరికి శాఖల కేటాయింపు అన్నది ఇంకా జరగలేదు. ఇందుకు కారణం కీలక శాఖలపై గురి పెట్టడమే. అదే సమయంలో స్పీకర్ (సభాపతి) పదవి కోసం పోటీ నెలకొంది. ఈ పదవిని ఎన్ఆర్ కాంగ్రెస్కు చెందిన మాజీ స్పీకర్ శివకొలుందు లేదా మాజీ మంత్రి తిరుమురుగన్లలో ఒకరికి ఇవ్వాలని సీఎం రంగస్వామి భావిస్తున్నారు. అయితే, బీజేపీ తమ పార్టీకి చెందిన జి.ఎన్.ఎస్. రాజశేఖరన్కు ఇవ్వాలని పట్టుబడుతోంది. అలాగే, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఎన్నికల్లో పోటీ చేయని వారికి మాత్రమే ఆ పదవులు ఇవ్వాలని సీఎం రంగస్వామి స్పష్టం చేశారు. ఈ పరిస్థితులలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధం చేశారు. ఈనెల 18వ తేదీన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం ప్రోటెం స్పీకర్గా అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ నియమితులయ్యారు. పుదుచ్చేరి అసెంబ్లీ -
తిరుత్తణి ఆలయంలో వైఖాసి కృత్తిక సందడి
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో వైఖాసి కృత్తిక సందర్భంగా భక్తజనం సందడి నెలకొంది. వైఖాసి మాసం కృత్తిక సందర్బంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం ఉదయం మూలవర్లకు విభూది, చందనం, సహా సుగందద్రవ్యాలతో పాటు పంచామృత అభిషేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలతో అలంకరించి బంగారు కవచం తొడిగి మహా దీపారాధన పూజలు చేపట్టారు. కృత్తికతో తమిళనాడులో పలు ప్రాంతాల నుంచి భక్తులు రైళ్లు, బస్సులు, వాహనాలతో పాటు ద్విక్షక్ర వాహనాల్లో కొండకు పోటెత్తారు. దీంతో కొండ ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తులు మొక్కులు చెల్లించే విధంగా తలనీలాలు సమర్పించి శరీంకు ఇనుప చువ్వలు గుచ్చుకుని కావళ్లు మోస్తూ మెట్ల మార్గంతో పాటూ ఘాట్ రోడ్డులో కొండ ఆలయంకు చేరుకుని ఉచిత దర్శనం క్యూలైన్లో మూడు గంటల పాటూ వేచివుండి స్వామికి తమ మొక్కులు చెల్లించి స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. రాత్రి స్వామివారు వాహన సేవలో కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. -
కళ్లకురిచ్చిలో జోస్ అలుక్కాస్ సిగ్నేచర్ స్టోర్
సాక్షి, చైన్నె: నాణ్యత, నూతన ఆవిష్కరణలు , సమకాలీన డిజైన్లకు మారుపేరైన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోస్ అలుక్కాస్ తమిళనాడులో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ కళ్లకురిచ్చిలో శనివారం సిగ్నేచర్ స్టోర్ను ఏర్పాటు చేసింది. దీనిని సినీ నటి కీర్తీ సురేష్ ప్రారంభించింది. కళ్లకురిచ్చి ఎమ్మెల్యే సి. అరుళ్ విఘ్నేష్, మున్సిపాలిటీ చైర్మన్ ఆర్. సుబ్బరాయులు, వైస్ చైర్మన్ కె. అబ్దుల్ రజాక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ అలుక్కాస్, పాల్ అలుక్కాస్ జాన్ అలుక్కాస్ కూడా పాల్గొన్నారు. వినియోగదారులకు సరికొత్త ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందించేలా ఈ స్టోర్ను తీర్చిదిద్దారు: అత్యంత భారీ శ్రేణిలో సర్టిఫైడ్ బంగారు ఆభరణాల కలెక్షన్ అందుబాటులో ఉంచారు. అంతర్జాతీయ సర్టిఫైడ్ వజ్రాభరణాల తో పాటు ప్లాటినం, వెండి ఆభరణాల లేటెస్ట్ డిజైన్లు ఇక్కడ కొలువుదీర్చారు. ఈసందర్భంగా నటి కీర్తి సురేష్ మాట్లాడుతూ, జోస్ అలుక్కాస్ కుటుంబంలో భాగం కావడం, వారి విజయ ప్రస్థానంలో మరో మైలురాయిని దగ్గరుండి చూడడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. సంప్రదాయాలు, వేడుకలతో ఆభరణాలకు విడదీయరాని బంధం ఉందని, జోస్ అలుక్కాస్ నైపుణ్యం, చక్కదనం , వైవిధ్యాన్ని జోడించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అద్భుతమైన వజ్రాభరణాలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. -
పళణి రాజీనామా చేయాలి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళణి స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే. ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. కొత్త నినాదం. ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళణిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కై వశం చేసుకోవడం ఖాయం అని పళణి వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అనర్హత వేటుకు పళణి వ్యూహం ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం. ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళణి స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల డిమాండ్ -
శాఖల కేటాయింపు..
ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే అత్యంత కీలకమైన శాఖలను ఉంచుకున్నారు. ఇందులో జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సాధారణ పరిపాలన), హోంశాఖ , మహిళా సంక్షేమ శాఖ, యువజన సంక్షేమ శాఖ, పోలీస్ (శాంతిభద్రతలు) ఉన్నాయి. కే.ఎ. సెంగోట్టయన్ ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించారు. బుస్సీ ఆనంద్కు గ్రామీణాభివృద్ధి, నీటి వనరుల శాఖ, ఆధవ్ అర్జునకు ప్రజాపనులు, క్రీడల శాఖ, అరుణ్ రాజ్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, వెంకట్ రమణన్ ఆహార , పౌర సరఫరాల శాఖ, నిర్మల్ కుమార్ విద్యుత్ , న్యాయ శాఖ, డి.కె. ప్రభు గనులు, ఖనిజ వనరుల శాఖ, రాజ్మోహన్ పాఠశాల విద్యాశాఖ, తమిళ అభివృద్ధి శాఖ, కీర్తన పరిశ్రమల శాఖకు అప్పగించారు. సీఎం విజయ్, మంత్రులు సెంగోట్టయన్, ఆనంద్, ఆధవ్ -
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
సాక్షి, చైన్నె: సీబీఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగించడం, నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం చైన్నెలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగై కేంద్ర ప్రభుత్వం వరుసగా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించడాన్ని తప్పుబడుతూ, అలాగే నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతి నిరాకరిస్తున్న కేంద్రాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చైన్నెలోని తండయార్పేట పోస్టాఫీస్ సమీపంలో భారీఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగై నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిరంతరం చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందన్నారు.. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు పదే పదే పదవీ కాలం పొడిగించడం ఏ రకమైన న్యాయం?, దేశానికి ఏది మంచిదో అది చేయండి అని పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరంతరం కేంద్రానికి సూచిస్తున్నారని పేర్కొన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వీటిని చెవికెక్కించుకోవడం లేదని పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ఇక డీఎంకే కూటమి పార్టీలైన ద్రవిడ కళగం తదితర పార్టీలు సైతం రాష్ట్రంలో పలు చోట్ల నీట్కు వ్యతిరేకంగా ఆందోలన కార్యక్రమాలను నిర్వహించాయి. -
బ్యాంగ్ బ్యాంగ్ అంటున్న ప్రభుదేవా
తమిళసినిమా: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, కామెడీ కింగ్ వడివేలు 25 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం బ్యాంగ్ బ్యాంగ్. కేఆర్జీ కన్నన్ రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తీర్పుకు రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ రోడ్రిగస్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటుందని, త్వరలో చిత్రాన్ని తెరపైకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పారు. ఇందులో బబ్లూ పృథ్వీరాజ్ కీలకపాత్రను పోషించినట్లు, ఇది వైవిధ్య భరిత నేపథ్యంలో సాగే హర్రర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఇప్పటికే విధులైన టీజర్ టైటిల్కు దీక్ష నుంచి విశేష స్పందన వచ్చిందని చిత్రంలో ప్రభుదేవా, వడివేలు మాస్ సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరలై చిత్రంపై ఆసక్తిని పెంచాయన్నారు. ఇకపోతే ప్రభుదేవా వడివేలు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించడంతో మంచి అంచనాలు నెలకొంటున్నాయన్నారు. యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి హెచ్ సి. వేణు చాయాగ్రహణం అందించినట్లు చెప్పారు. -
విజయానికి సోపానం నిజాయితీ
కొరుక్కుపేట: నిజాయితీ, నిబద్ధత ఉంటే ఏ రంగంలోనైనా విజయాలు అందుకోవచ్చునని సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఈమేరకు చైన్నె వానగరంలోని కె.ఎం. స్పెక్ట్రాలో రిఫా చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సు శనివారం విజయవంతంగా జరిగింది. రిఫా చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు యూనస్ సయ్యద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రిఫా అనేది ఒక లాభాపేక్ష లేని వ్యాపార నెట్వర్క్ అని భారతదేశంలోని 18 రాష్ట్రాలలో సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. సదస్సులో 500 మందికి పైగా వ్యాపారవేత్తలు, పది మందికి పైగా వక్తలు, మేధావులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు వాణిజ్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఐదు కంపెనీలకు రిఫా అవార్డులను ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు. గో బటన్స్ గ్రూప్ సీఈఓ ఉమర్ ముఖ్తార్, యూఈఎఫ్ అధ్యక్షుడు అహ్మద్బుహారి, జావద్ పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,688 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,264 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
నీట్ రద్దు చేయాలని మహాధర్నా
తిరుత్తణి: వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో తిరుత్తణిలో శనివారం ధర్నా చేపట్టారు. నీట్ రద్దు చేసి ప్లస్–2 మార్కుల మెరిట్ ఆధారంగా వైద్య విద్య ప్రవేశానికి అనుమతివ్వాలనే డిమాండ్ మేరకు ద్రవిడ కళగం తిరువళ్లూరు జిల్లా అధ్యక్షడు మణి ఆధ్వర్యంలో తిరుత్తణిలో ధర్నా చేపట్టారు. ఇందులో వీసీకే, సీపీఎమ్ పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. ద్రవిడ కళగం రాష్ట్ర ప్రతినిధి పొదటూరు పువియరసు పాల్గొని ధర్నా ప్రారంభించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే నీట్ రద్దు చేయాలని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్ధులు సైతం వైద్య విద్య అభ్యసించేందుకు వీలుగా వైద్య విద్య ప్రవేశానికి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మేరకు నినాదాలు చేసి ధర్నా చేపట్టారు. వీసీకే జిల్లా కార్యదర్శి దండపాణి, ద్రవిడ కళగం నేత రమేష్ సహా అనేక మంది పాల్గొన్నారు. -
● నగలు అపహరణ ● ఇద్దరి అరెస్ట్
వృద్ధురాలి హత్యతిరువళ్లూరు: వృద్ధురాలిని హత్య చేసి నగలను అపహరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా సూరపట్టు తులకానత్తమ్మన్ ఆలయ వధికి చెందిన రిటైర్డ్ కేంఽద్ర ప్రభుత్వ ఉద్యోగి దామోదరన్. ఇతను రెండు సంవత్సరాల క్రితం మృతిచెందాడు. ఇతడి భార్య పొన్నమ్మాల్(70) ఒంటరిగా వుంటున్నారు. వీరికి ఆరుగురు కుమార్తెలు వుండగా వీరికి వివాహమై వేర్వేరు చోట్ల వుంటున్నారు. ఈ క్రమంలో పొన్నమ్మాల్ ఇంట్లో దారుణ హత్యకు గురై శవమై వున్నట్టు స్థానికులు ఐదవ కుమార్తె గజలక్ష్మికి స్తానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన గజలక్ష్మి పుదూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించి మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతదేహంపై కత్తిపోట్లు, గాయాలు వున్నట్టు గుర్తించిన పోలీసులు హత్యగా నిర్ధారించి, అక్కడ వేలీముద్రలను సేకరించి పాతనేరస్తుల వేలిముద్రలతో పోల్చిచూశారు. వీటిలో చైన్నెకి చెందిన పళణి(48), కాశిమేడు గ్రామానికి చెందిన తులసీదాస్(51) ఇద్దరి వేలిముద్రలు ఒకటే కావడంతో వారిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వృద్ధురాలిని నగల కోసం హత్య చేసినట్టు గుర్తించారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
రోగులతో ప్రేమగా నడుచుకోవాలి
వేలూరు: నర్సింగ్ సిబ్బంది సేవాభావాన్ని కలిగి ఉండాలని సినీ నటుడు గోపినాథ్ అన్నారు. వేలూరు సమీపంలోని శ్రీపురం బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ ఆశీస్సులతో నడుస్తున్న నారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, వంద కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయం కావడంతో అభినందన కార్యక్రమం ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. గోపినాథ్ మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సులు చేసే సేవ మరవరాదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని వైద్యుల కన్నా ముందుగా నర్సులే చూస్తారని వారితో ప్రేమతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. నర్సులు ఈ వృత్తిని ఉద్యోగంగా చూడకుండా సేవాభావంతో చూడాలన్నారు. రోగుల పట్ల ప్రేమగా మాట్లాడడం వల్లనే వారికి సగం రోగం నయం అవుతుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రతిఒక్కరూ స్నేహపూర్వకంగా కుటుంబసభ్యుల తరహాలో చూడాలన్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ నర్సుల సేవలు అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందజేసిన నర్సులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం గోపినాథ్కు ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఆస్పత్రి సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వచ్చే వారిని గౌరవించాలి కొరుక్కుపేట: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వచ్చే వారిని గౌరవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ దినేష్ పొన్రాజ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక సర్కులర్ను జారీ చేశారు. అందులో ఆయన పేర్కోంటూ ప్రజలు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినప్పుడు, సబ్–రిజిస్ట్రార్ గారి బల్ల ఎదుట సహాయక, జూనియర్ సహాయకుల బల్లలకు ఎదురుగా తప్పనిసరిగా కుర్చీలను అమర్చాలి ప్రతి అధికారి ముందు కనీసం రెండు కుర్చీలు ఉంచాలి. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శాఖ పరిధిలోని 587 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శిస్తుంటారు. ఈ కార్యాలయాలలో నమోదు చేసుకోవడానికి వచ్చినప్పుడు, సబ్–రిజిస్ట్రార్లు, సిబ్బంది ప్రజలను నిలబెట్టి వారితో మాట్లాడతారని ఫిర్యాదులు వచ్చాయి. ఉప–రికార్డర్లు కుర్చీలో కూర్చొని మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నిలబెట్టి రికార్డ్ చేయించకూడదని ఆదేశించారు. విదాశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం అన్నానగర్: విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి రూ.50 లక్షలు మోసం చేసిన ఒక మహిళా కళాశాల ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని చూలైమేడు ప్రాంతంలో ప్రధాన కార్యాలయం కలిగిన అన్నామ్మాళ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి, తమిళనాడులోని వివిధ జిల్లాలలో కళాశాలలు ఉన్నాయి. ఈ విషయమై, కాంచీపురం పూకడైచత్తిరం ప్రాంతంలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ శాఖలోని ఉద్యోగులు, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్నామని, వారి ట్యూషన్ ఫీజులు చెల్లిస్తున్నామని చెప్పి, రూ.50 లక్షల వరకు మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బాధితులైన కళాశాల విద్యార్థులు ఈ విషయమై కాంచీపురం జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వపోలీసుల దర్యాప్తులో కళాశాలలో పనిచేస్తున్న చాముశ్రీ, విఘ్నేష్, పవన్, ఫ్రాంక్లిన్, సత్యకళ ఈ మోసంలో పాలుపంచుకున్నట్లు వెల్లడైంది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ట్యూషన్ ఫీజులను కళాశాల ఖాతాలో జమ చేయకుండా, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి, ఆ ఐదుగురూ కలిసి మొత్తం రూ. 50 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మహిళా ఉద్యోగిని చాముశ్రీని పొల్లాచిలో శుక్రవారం అరెస్టు చేశారు. కాంచీపురం కోర్టులో హాజరుపరిచారు. పరారీలో మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికా పౌరుడి అరెస్ట్ కొరుక్కుపేట: ఆక్రమంగా ఓటు వేశారన్న నెపంతో చైన్నె విమానాశ్రయంలో ఓ అమెరికా పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో చాలా మంది ప్రవాస భారతీయులు అక్రమంగా ఓటు వేశారని ఎన్నికల సంఘానికి సమాచారం అందింది. దీంతో భారత ఎన్నికల సంఘం విమానాశ్రయ పౌరసత్వ అధికారులకు సమాచారం అందించి, విమానాలలో ప్రయాణించే విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల వేలిముద్రలను పర్యవేక్షించాలని, ఒకవేళ వారి వేలిముద్రలపై ఓటింగ్ వేలిముద్రలు ఉంటే, వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్న్కు అప్పగించాలని ఆదేశించింది. ఆమేరకు చైన్నె, మదురై విమానాశ్రయాలలో పౌరసత్వ అధికారులు నిర్వహించిన తనిఖీలలో, విదేశీ పౌరసత్వం కలిగిన 17 మంది భారతీయులు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అక్రమంగా ఓటు వేసినట్లు తేలింది. అనుమానితులను గుర్తించి, పోలీసులకు అప్పగించి, చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో శుక్రవారం రాత్రి 10 గంటలకు, చైన్నె నుంచి దుబాయ్కి వెళ్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్న్స్ విమానంలో వెళ్లేందుకు చైన్నెలోని కె. కె. నగర్కు చెందిన కిషోర్(64) విమానాశ్రయానికి వెళ్లారు. చైన్నెలోని విరుగంబాక్కం ప్రాంతంలో ఓటు వేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీసిటీలో చిన్మయ అమృత మహోత్సవ్ శ్రీసిటీ (వరదయ్యపాళెం) : చిన్మయ మిషన్ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘చిన్మయ అమృత మహోత్సవ్’లో భాగంగా శ్రీసిటీలో ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందు కోసం విచ్చేసిన చైన్నె – నార్త్ ఈస్ట్ చిన్మయ మిషన్ రెసిడెంట్ ఆచార్యులు స్వామి మిత్రానందకు శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. మిత్రానందతో పాటు కోయంబత్తూరులోని చిన్మయ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెంట్ డైరెక్టర్ స్వామి అనుకూలానంద, కడప చిన్మయ మిషన్ అధ్యక్షుడు స్వామి తురియానంద, గుంటూరు – విశాఖపట్నం చిన్మయ మిషన్ ఇన్చార్జి స్వామి సువీరానందకు ఆయన ఆహ్వానం పలికారు. తమిళనాడు నుంచి ఆంధ్రలో ప్రవేశించిన చిన్మయ అమృత్ యాత్ర వాహనంలో ఏర్పాటు చేసిన స్వామి చిన్మయానందకు సంబంధించిన పవిత్ర వస్తువులు, జ్ఞాపికలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు స్వామి చిన్మయానంద జీవిత స్ఫూర్తిని పరిచయం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి భువనేశ్వరి తెలిపారు. -
అట్టహాసంగా చేపల వేట ఉత్సవం
తిరువొత్తియూరు: తమిళనాడు, మధురై జిల్లా మేలూరు సమీపంలో ఉన్న కళ్లంద్రి గ్రామంలో శతాబ్దాల నాటి సంప్రదాయ చేపల వేట ఉత్సవం ఘనంగా జరిగింది. మధురై జిల్లాలోని తిరువదనూర్, వెల్లరిపట్టి, మేలవళవు వంటి వివిధ గ్రామాల్లో ఏటా ఈ సంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. కళ్లంద్రిలోని చెరువు వద్ద ఈ ఏడాది వేడుకలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, వ్యవసాయం పచ్చగా సాగాలని కోరుకుంటూ గ్రామస్తులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. రైతులు ఏటా ఈ చెరువులో చేప పిల్లలను వదులుతారు. పంట కోతలు ముగిసిన తర్వాత, వేసవిలో నీటిమట్టం తగ్గినప్పుడు పెరిగిన చేపలను పడతారు. గ్రామ పెద్దలు తెల్ల జెండా ఊపి అనుమతి ఇచ్చిన వెంటనే, వేలాది మంది ప్రజలు ఒకేసారి చెరువులోకి దిగి చేపలను పట్టారు. కులమతాలకు అతీతంగా సుమారు 18 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇది సామాజిక సామరస్యానికి, ప్రకృతితో మమేకమవ్వడానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ వేటలో ప్రజలకు రోహు, కట్ల, జలేబి (తిలాపియా), వాలుగ వంటి వివిధ రకాల నాటు చేపలు దొరికాయి. కొందరు కిలోల కొద్దీ చేపలను పట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్లారు. ఈ ఉత్సవం ద్వారా దొరికిన చేపలను వండి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, అనంతరం అందరూ కలిసి భోజనం చేస్తారు. -
గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్
తిరువళ్లూరు: ఆవడి, అంబత్తూరు వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి, మత్తుమాత్రలు విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిని నుంచి 180 కిలోల గంజాయి, రెండువేల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని జేపీ ఎస్టేట్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గరుని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తులు అయపాక్కం ప్రాంతానికి చెందిన గాంధీ కుమారుడు ధయాళన్(21), శాంతకుమార్ కుమారుడు ఉదయప్రశాంత్(21), వేణుగోపాల్ కుమారుడు గోపాలకృష్ణన్(21)గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి గంజాయి, మత్తుమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు అంబత్తూరు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు తిరుపతి కుమారుడు గోపి(19)తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచి సైతం గంజాయి, మత్తుమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి రెండు ప్రాంతాల్లో 180 కిలోల గంజాయి, రెండు వేల మాత్రలను స్వాధీనం చేసుకుని పలు వాహనాలను సీజ్ చేశారు. -
మూడేళ్లు కాంగ్రెస్ శ్రేణులు కష్టపడాలి
–కాంగ్రెస్ ఎంపీ శశికాంత్సెంథిల్ తిరువళ్లూరు: కేంఽద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రానున్న మూడేళ్లు ప్రధానమని, కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పని చేసి కాంగ్రెస్ విజయానికి కృషిచేయాలని తిరువళ్లూరు ఎంపీ శశికాంత్ సెంథిల్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నేతలతో ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు శశికుమార్, కాంగైకుమార్ ఆవడి కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు అమిత్బాబు అధ్యక్షత వహించగా మాజీ డీసీసీ అధ్యక్షుడు పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు చిదంబరం ప్రసంగించారు. ఎంపీ శశికాంత్ సెంథిల్ హాజరై ప్రసంగిస్తూ మూడేళ్లు కాంగ్రెస్ శ్రేణులకు క్లిషమైందన్నారు. ఈ మూడేళ్లు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేస్తే రాహుల్గాంధీని ప్రధానిని చేయొచ్చన్నారు. అనంతరం మీడియాతో ఎంపీ మాట్లాడుతూ దేశంలోని పౌరులకు పొదుపు పేరిట హితబోధ చేసి ప్రధాని మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశీయాత్రలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లోనూ వెనుకుబాటుతనం కనిపిస్తోందన్నారు. నీట్ పరీక్షలను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించినా మోదీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడే ప్రమాదం వుందని విమర్శించారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్ రెహ్మాన్, పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదనరావు, సతీష్ పాల్గొన్నారు. -
ఎడపాడికే నా మద్దతు
వేలూరు: అసెంబ్లీలో టీవీకే పార్టీకి మద్దతు తెలిపిన అన్నాడీఎంకే జోలార్పేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేసీ వీరమణి ఎడపాడి పయణిస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిన విషయం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే పార్టీలోని సీవీ షణ్ముగం, వేలుమణి తో పాటు తిరుపత్తూరు జిల్లా జోలార్పేట నియోజక వర్గానికి చెందిన మాజీ మంత్రి కేసీ వీరమణి కూడా ఉన్నారు. అయితే అసెంబ్లీలో టీవీకేకు మద్దతుగా ఓట్లు వేశారనే నేపథ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శులను మార్పు చేశారు. ఈ జాబితాలో తిరుపత్తూరు జిల్లా కార్యదర్శిగా ఉన్న కేసీ వీరమణిని మార్పు చేస్తూ ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే పశుపతిని జిల్లా కార్యదర్శిగా నియమించారు. చైన్నె నుంచి సొంత నియోజక వర్గానికి వచ్చిన ఆయన జోలార్పేటలోని కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా తాను అన్నాడీఎంకే పార్టీలో ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మూడవ స్థానానికి చేరుకోవడంతో పాటు వంద స్థానాలకు పైగా డిపాజిట్ కోల్పోయిందన్నారు. దీంతోనే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఏమీ చేయలేమని టీవీకేతో కూటమి చేరి ప్రజలకు మంచి చేయాలనుకుని టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. దీంతోనే తమను పార్టీ నుంచి తొలగించారన్నారు. తాను అన్నాడీఎంకేలోనే ఉంటానని, ఎడపాడి పళనిస్వామితోనే ప్రయాణం చేస్తాననని తనకు అన్నాడీఎంకే పార్టీ, కార్యకర్తలు ముఖ్యమన్నారు. ఎడపాడితోనే తాను కలిసి ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించారు. టిప్పర్ కింద పడి ఆన్లైన్ డెలివరీ బాయ్ మృతి తిరువొత్తియూరు: చైన్నె, కోయంబేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ లారీ కింద పడి ఆన్లైన్ డెలివరీ ఉద్యోగి మృతి చెందారు. కరూర్ జిల్లా, కోయంపల్లి ప్రాంతానికి చెందిన తరుణ్కుమార్ (28), చైన్నె కొలత్తూరులో తన స్నేహితుడితో కలిసి ఉంటూ ఆన్లైన్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో, తరుణ్కుమార్ కోయంబేడు మార్కెట్ సమీపంలోని రోడ్డుపై తన మోటార్ సైకిల్పై వెళ్తున్నాడు. అదే సమయంలో మార్కెట్ ప్రాంగణంలో చెత్తను సేకరించే ఒక ‘టిప్పర్ లారీ‘ వేగంగా వచ్చి తరుణ్కుమార్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నియంత్రణ కోల్పోయి కింద పడిపోయిన తరుణ్కుమార్, లారీ వెనుక చక్రాల కింద చిక్కుకున్నాడు. తల నలిగిపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కోయంబేడు ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, మయిలాడుతురైకి చెందిన రాజీ (26)ని అరెస్ట్ చేశారు. -
బ్రిటీష్కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్ను ముగించాలంటూ విజయ్కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కు చేసిన రిక్వెస్ట్తో ఆమె వార్తల్లో నిలిచింది. -
నీట్ రద్దు చేయండి
సాక్షి, చైన్నె: దేశవ్యాప్తంగా వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతూ, దానిని రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. 2026–27 విద్యాసంవత్సరానికి నీట్ పరీక్షను రద్దు చేసి, ప్లస్టూ మార్కుల ఆధారంగానే వైద్యవిద్య సీట్లను భర్తీ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ తక్షణమే ఆర్డినెన్న్స్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ వ్యవస్థలో లోపాలు..స్టాలిన్ ఆరోపణలు తన లేఖలో స్టాలిన్ నీట్ పరీక్షా విధానంపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2026 నీట్ పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా పరీక్ష రద్దు కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ అక్రమాల్లో 45 మంది అరెస్టయ్యారని, 22.8 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని పేర్కొన్నారు. 2015లో ఏఐపీఎంటీ నుంచి 2024 వరకు నీట్ పరీక్షలో ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయని, బ్లూటూత్ పరికరాల వినియోగం, డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించడం వంటివి సర్వసాధారణం అయ్యాయని వివరించారు. నీట్ అనేది కేవలం ధనవంతులకు, కోచింగ్ సెంటర్లకు మాత్రమే మేలు చేసేలా ఉందని స్టాలిన్ ఆరోపించారు. దేశంలో కోచింగ్ సెంటర్ల వ్యాపారం రూ.70 వేల కోట్లకు చేరుకుందని, భారీగా డబ్బు ఖర్చు చేసి శిక్షణ పొందనిదే ఈ పరీక్షలో నెగ్గడం అసాధ్యమని ఆయన అన్నారు. గ్రామీణ విద్యార్థులకు శాపం నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు శాపంగా మారిందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సిలబస్లో చదివే విద్యార్థులు సీబీఎస్ఈ ఆధారిత నీట్ పరీక్షను ఎదుర్కోలేకపోతున్నారని, ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో తమిళనాడులో అమలు చేసిన ప్లస్టూ మార్కుల ఆధారిత వైద్య సీట్ల భర్తీ విధానం అత్యంత పారదర్శకమైందని, దానివల్లే రాష్ట్రంలో వైద్య రంగానికి బలమైన పునాదులు పడ్డాయని గుర్తు చేశారు. నీట్ పరీక్ష వలన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి స్వస్తి పలకాలని ప్రధానిని లేఖలో కోరారు. -
ప్రభుత్వ వైద్యశాలలో సేవ చేస్తా
తిరువళ్లూరు: ప్రభుత్వ వైద్యశాల పనితీరును తెలుసుకోవడానికి ప్రభుత్వ వైద్యశాలను ప్రతి నెలా సందర్శించడంతోపాటు రోగులకు 24 గంటలపాటు సేవ చేస్తానని తిరువళ్లూరు ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్కుమార్ తెలిపారు. తిరువళ్లూరు ఎమ్మెల్యేగా టీవీకే తరఫున పోటీ చేసిన డాక్టర్ అరుణ్కుమార్ విజయం సాధించారు. అనంతరం పదవి ప్రమాణస్వీకారం చేసిన తరువాత నియోజకవర్గానికి వచ్చిన డాక్టర్ అరుణ్కుమార్, కలెక్టర్ ప్రతాప్ను కలిసి నియోజకవర్గంలోని సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న పనులను వేగంగా పూర్తిచేయడంతో పాటు ఆలస్యం చేయకుండా అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం తిరువళ్లూరు మెడికల్ కళాశాల, వైద్యశాలను పరిశీలించి రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, మందుల స్టాక్, డాక్టర్లు, నర్సుల హాజరుపట్టిక పరిశీలించి వివరాలను డీన్ ద్వారా డాక్టర్ అరుణ్కుమార్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరుకు వచ్చే రోగులను చైన్నె ప్రాంతాల్లోని వైద్యశాలలకు రెఫర్ చేయకుండా అన్ని రకాల వైద్యసేవలను తిరువళ్లూరులో అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. దీంతోపాటు కార్డియాలజీ, ఏంజియోగ్రామ్, న్యూరోసర్జరీ విభాగాల పనితీరును సైతం మెరుగుపరచడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ఏఆర్ఎంఓ డాక్టర్ ప్రభుశంకర్, డాక్టర్ జగదీష్, డాక్టర్ విజయరాజ్ పాల్గొన్నారు. -
మహిళల ఖాతాల్లో రూ.1000
సాక్షి, చైన్నె: గత ప్రభుత్వ మగళీర్ ఉరిమై తిట్టం పథకం మేరకు శుక్రవారం మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.1000 నగదును జమ చేశారు. సీఎం విజయ్ గత ప్రభుత్వ పథకాన్ని కొనసాగించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. డీఎంకే హయాంలో ఈ పథకం మహిళలో విస్తృత ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ప్రతినెలా 15వ తేదీ 1.31 కోట్ల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. ఈ పథకాన్ని అస్త్రంగా చేసుకుని మహిళలకు తాము అధికారంలోకి వస్తే రూ.2 వేలు ఇస్తామని డీఎంకే, అన్నాడీఎంకేలో ప్రకటించాయి. ఇక, టీవీకే విజయ్ అయితే, రూ.2,500 ఇస్తామన్నారు. తాజాగా ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రూ.2,500 ప్రస్తుతం బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ఆర్థిక భారంగా ప్రభుత్వానికి మారింది. దీంతో ఈ పథకం పునర్వ్యవస్థీకరిస్తామని, అంతవరకు గత ప్రభుత్వం అమలు చేసినట్టుగా రూ. 1000 అందజేస్తామని సీఎం విజయ్ ప్రకటించారు. ఇందుకనుగుణంగా లబ్ధిదారులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.1000 నగదు శుక్రవారం జమ చేశారు. దీంతో సర్వత్రా మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. రూ.2,500 మాట పక్కన పెడితే, కనీసం రూ.1000 జమ కావడం తమకు ఊరటేనని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. సామాన్యుడిలా సీఎం విజయ్ ముఖ్యమంత్రి విజయ్ తన పనితీరుతో సచివాలయ అధికారులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకే సచివాలయానికి చేరుకుని, సాయంత్రం 5 గంటల వరకు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత ముఖ్యమంత్రులు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లడం లేదా బయట నుంచి తెప్పించుకోవడం చేసేవారు. కానీ, విజయ్ ప్రతిరోజూ తన ఇంటి నుంచే భోజనాన్ని వెంట తెచ్చుకుంటున్నారు. అధికారుల మాదిరిగానే తన చాంబర్లోనే భోజనం ముగించి వెంటనే విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఆయన క్రమశిక్షణను చూసి అధికారులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం విజయ్ ఫొటో తప్పనిసరిచేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేశారు. ఈ ఫోటోను తప్పనిసరిగా అన్ని కార్యాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. ఇదిలాఉండగా ప్రతిరోజూ విజయ్ సచివాలయం నుంచి నీలాంకరైలోని తన నివాసానికి 17కి.మీ దూరం వెళ్లి రావాల్సి ఉంది. ఈమార్గంలో ఆయన భత్రకు 400 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈమార్గం నిత్యం రద్దీతో ఉండడంతో టాఫ్రిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. విజయ్ను చూసేందుకు ఈ మార్గంలో జనం ఎగబడుతున్నారు. ఈపరిణామాల దృష్ట్యా, సీఎం విజయ్ తన మకాంను సచివాలయానికి సమీపంలో ఉన్న పట్టినంబాక్కం నివాసం లేదా, మరింత దగ్గరగా మార్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. పెట్టుబడులే లక్ష్యం సచివాలయంలో పారిశ్రామిక రంగ ప్రముఖులతో సీఎం విజయ్ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు శంకర్ వానవరాయర్ నేతృత్వంలో ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే,రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించిన కొత్త పెట్టుబడులను ఆకర్షించే వ్యూహాలపై చర్చలు జరిగాయి. బీఎండబ్ల్యూ, టీవీకేఎస్, హడ్సన్ మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. అలాగే, వ్యవసాయం, నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలాశయాలలో నీటి నిల్వ, రిజర్వాయర్ల పరిఽస్థితి, ఈ సీజన్లో వరి సాగుకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. -
క్లుప్తంగా
వేలూరు: మధుమేహ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వేలూరు ఇండియన్ రెడ్క్రాస్ కార్యదర్శి ఉదయశంకర్ అన్నారు. రెడ్క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు పాత బస్టాండ్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణలో రెడ్క్రాస్ సంస్థ, వేలూరు సీఎంసీ ఆస్పత్రి, సంయుక్తంగా మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం, వైద్యశిబిరం నిర్వహించారు. సీఎంసీ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఫాస్ట్ఫుడ్లకు అలవాటు పడకుండా పారంపర్య ఆహారాలను తీసుకోకలిగితే మధుమేహ వ్యాధి నుంచి బయట పడొచ్చన్నారు. వేపాకును ఉపయోగించి ఇతర దేశాల్లో మధుమేహ వ్యాధికి మందుగా పొడిచేసి ఇస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చేదు రుచికి కూడా అలవాటు పడాలన్నారు. మధుమేహ వ్యాధిలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండియా రెండవ స్థానంలో ఉందన్నారు. రెడ్క్రాస్ కార్యదర్శి పర్వద, కోశాధికారి పాండియన్, సభ్యులు ఇంద్రనాథ్, వేల్మురుగన్, మేనేజర్ దీపన్, సీఎంసీ ఆస్పత్రి వైద్యులు నిత్య, సెల్వి, హరిణి పాల్గొన్నారు. తిరుత్తణి: తిరుత్తణి కొత్త బస్టాండులో దుకాణాల వేలం డిపాజిట్ తగ్గించాలని మున్సిపల్ కమిషనర్కు వ్యాపారులు డిమాండ్ చేశారు. తిరుత్తణిలో కొత్త బస్టాండు నిర్మాణపు పనులు పూర్తి కావడంతో ఎన్నికలకు ముందు బస్టాండు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొత్త బస్టాండులోని 24 దుకాణాలకు వేలం నిర్వహించారు. దుకాణాలను వేలం ద్వారా దక్కించుకునేందుకు వీలుగా మున్సిపాలిటీ కమిషనర్ దుకాణానికి డిపాజిట్గా రూ.4 లక్షలు చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. ఈ క్రమంలో 24 దుకాణాలకు వేలంలో 6 దుకాణాలకు మాత్రం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ కన్నియప్పన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో డిపాజిట్తోపాటు నెల అద్దె కనీసం రూ.10 వేలు ప్రభుత్వం ప్రకటించింది. 6 దుకాణాలకు మాత్రం డిపాజిట్ చెల్లించి వ్యాపారులు వేలం పాటలో పాల్గొన్నారు. తక్కిన 18 దుకాణాలకు వేలంలో వ్యాపారులు పాల్గొనకపోవడంతో మరో తేదీ వేలానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్టాండులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా వుంది. చిన్న దుకాణాలు మాత్రమే వుంచి వ్యాపారం చేసే చిరు వ్యాపారులు డిపాజిట్ రూ.4లక్షలతోపాటు నెలకు అద్దె రూ.10వేలు చెల్లించి వ్యాపారం చేయడం అతికష్టం. దీంతో డిపాజిట్ సొమ్ము తగ్గించడంతో పాటు అద్దె సైతం తగ్గించాలని వ్యాపారులు మున్సిపాలిటీ కమిషనర్కు వ్యాపారులు డిమాండ్ చేశారు. తిరుత్తణి: రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి విజయ్ అమలు చేయాలని అగ్రీ గ్రీవెన్స్లో రైతులు కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించి విజయ్ సీఎంగా పదవీ చేపట్టారు. ఈ క్రమంలో తొలిసారిగా తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం అగ్రీ గ్రీవెన్స్ నిర్వహించారు. ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సబ్ డివిజన్లోని పలు గ్రామాల నుంచి రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా సీఎంగా పదవీ స్వీకరించిన విజయ్కు రైతులు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చెరుకు టన్నుకు రూ.4,500, వరి క్వింటాల్ రూ.3,500 అందజేయాలని, సహకార సంఘాల్లో రైతులు పొందిన పంట రుణాలు మాఫీ చేయాలి, రైతులు పంట సాగుకు ఏడాదికి రూ. 15 వేలు అందజేయాలి, సంట బీమా పూర్తిగా ప్రభుత్వం చెల్లింపు సహా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డీబీసీ ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు నిర్మూలించి పారదర్శకంగా రైతుల నుంచి వరి కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కారపాక్కంలో భారీ అగ్ని ప్రమాదం తిరువొత్తియూరు: చైన్నె శివారులోని షోళింగనల్లూరులోని కారపాక్కంలో ఉన్న ఓ ప్రైవేటు ఐ టీ సంస్థకు చెందిన గోడౌన్లో శుక్రవారం సా యంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించి దట్టంగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ మంటల కారణంగా పక్క పక్కనే ఉన్న ఐటీ సంస్థల సిబ్బంది బయటకు పంపించేశారు. -
మదురై కార్పొరేషన్లో రూ.400 కోట్ల అవినీతి
సాక్షి, చైన్నె: గత నాలుగేళ్లలో మదురై కార్పొరేషన్న్లో రూ.400 కోట్ల మేర అవినీతి జరిగిందని, ప్రజల సొమ్మును దోచుకున్నారని మంత్రి సి.టి.ఆర్. నిర్మల్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మదురైలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీవీకే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి విజయ్ అనేక నిర్మాణాత్మక పనులు చేస్తున్నారని ప్రశంసించారు. సింగపెన్ పథకం ద్వారా మహిళల రక్షణకు, టాస్మాక్ దుకాణాల తగ్గింపునకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పాత ప్రభుత్వ పథకాలైన మగళీర్ ఉరిమై తిట్టం వంటి పథకాలు కొనసాగుతాయని, వచ్చే బడ్జెట్లో ఈ మొత్తాన్ని మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మదురై అభివృద్ధిపై దృష్టి మదురైలో మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో జరిగిన రూ.400 కోట్ల అవినీతిని అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నీట్ పరీక్ష ఒక పెద్ద వ్యాపారంగా మారిందని మంత్రి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒక పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందని, దీనివలన లక్షలాది మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. నీట్ రద్దు చేయాలన్నదే తమ ప్రభుత్వ నిశ్చితాభిప్రాయమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ప్రస్తుతం 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి రహిత తమిళనాడును నిర్మించడమే ముఖ్యమంత్రి విజయ్ లక్ష్యమని, ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. -
59 ఏళ్ల తర్వాత మంత్రి వర్గంలోకి..
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడుతోందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళ వెట్రి కళగం నేత, సీఎం విజయ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడారు. 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మంత్రి వర్గంలో చేరబోతున్నారని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ, వీసీకేలు బయటి నుంచి మద్దతు ఇస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అధికారంలో వాటాను ఆశించింది. దీంతో ఆ పార్టీకి మంత్రి పదవి గ్యారంటీ అన్న చర్చ ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చాక్జ్ గిరీష్ చోడన్కర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీలతో సమావేశమయ్యారు. ఈ ఐదుగురిలో ఎవరిని మంత్రి పదవి వరించనున్నదో అన్న చర్చ సాగుతూ వచ్చింది. ఈ సమయంలో మాణిక్యం ఠాకూర్ ట్వీట్ ప్రాధాన్యతకు శుక్రవారం దారి తీసింది.కొత్త చరిత్ర తమిళనాడులో కొత్త చరిత్ర మొదలైందని ఆయన ట్వీట్ చేశారు. గతంలో అధికారంలో వాటా ఇవ్వబోమని ప్రకటించిన వారికి ప్రజలే తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఖద్దర్ ధరించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రకటించారు. ఇది తనలాంటి వేలాది మంది కార్యకర్తలకు ఎంతో ఉద్వేగభరితమైన క్షణంగా అభివర్ణించారు. తమిళనాడును 36 శాతం కమిషన్ రాజకీయాల నుంచి విముక్తి చేసి, అవినీతిలేని పాలన వైపు నడిపించాలని కొత్త ప్రభుత్వం కోటి ఆశలతో ముందుకు సాగుతోందన్నారు. 1967లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ద్రవిడ పార్టీల హయాంలో ఆ పార్టీకి ఎప్పుడూ మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. అయితే, ఈసారి ఎన్నికల్లో డీఎంకే– కాంగ్రెస్ బంధంలో వీడిన నేపథ్యంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడం చకచకా జరిగిపోయాయి. త్వరలోనే విడుదల కానున్న అధికారిక మంత్రివర్గ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరికి కీలక శాఖలు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు మాణిక్యం ఠాకూర్ ట్వీట్ మరింత బలాన్ని ఇచ్చినట్లైంది. -
కరుప్పు కోసం అలా..
తమిళసినిమా: హీరోయిన్లు అందరూ ఒకేలా ఉండరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. ఎవరి భావాలు వారివి. అదేవిధంగా ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వారిలో నటి త్రిష రూటే సపరేట్ అని చెప్పక తప్పదు. ఎప్పుడూ ఏదో సంఘటనతో ట్రెండింగ్లో ఉంటారీ బ్యూటీ. ఇటీవల ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో రకరకాల ట్రోలింగ్లకు గురయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లో సెంట్రిక్ పాయింట్గా మారారు. సినిమాకు గుడ్బై చెప్పబోతున్నట్లు ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది తాజాగా త్రిష కథానాయకిగా బిజీ అవుతున్నారు. ఇకపోతే ఈ సంచలన నటి సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదురొడ్డి ఒక్క రోజు ఆలస్యంగా అంటే గురువారం తెరపైకి రావలసిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లల్లోకి వచ్చింది. దీంతో సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వారిని మరింత ఖుషీ పరిచేలా త్రిష చిత్రం విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల మధ్య చూడడానికి చైన్నెలోని రోహిణి థియేటర్ వద్ద చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షం అయ్యారు. దీంతో అభిమానులు ఫిదా అవ్వడం, ఫొటోగ్రాఫర్లు ఆమె అభినయం భంగిమలను తమ కెమెరాల్లో బంధించడంలో మునిగిపోయారు. అలా త్రిష కరుప్పు చిత్ర ప్రచారంలో భాగం అయ్యారు. ఆమె ఇంతకుముందు కరుప్పు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనని వెలితిని ఇలా తీర్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
టీవీకేలోకి అన్నాడీఎంకే మాజీ మంత్రి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఈరోడ్ నగర కార్యదర్శి పదవి నుంచి తొలగించబడిన మాజీ మంత్రి కె.వి.రామలింగం శుక్రవారం టీవీకేలో చేరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మద్దతుగా వ్యవహరిస్తున్న వారిని అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎడపాడి పళనిస్వామి తొలగిస్తున్నారు. ఈరోడ్ నగర, జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన మాజీ మంత్రి కె.వి.రామలింగంను కూడా ఆయన పదవి నుంచి తొలగించారు. దీంతో కె.వి.రామలింగం గోబిచెట్టి పాళయంలో మంత్రి సెంగోట్టయ్యన్ సమక్షంలో టీవీకేలో మద్దతుదారులతో కలిసి చేశారు. యూట్యూబ్ చానెల్ క్రియేషన్పై శిక్షణ సాక్షి, చైన్నె: డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్న్ స్టిట్యూట్ చర్యలు తీసుకుంది. చైన్నె ఒక సరికొత్త శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. ‘మీ సొంత యూట్యూబ్ చానల్ను ప్రారంభించండి‘ అనే అంశంపై మే 25 నుంచి 27 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీడియో, స్లైడ్షోల తయారీ, సోషల్ మీడియా మార్కెటింగ్ , ప్లాట్ఫారమ్ ఇంటిగ్రేషన్, ఆన్లైన్ మార్కెటింగ్ పద్ధతులు, కస్టమర్ నెట్వర్క్ను పెంచుకునే వ్యూహాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ గిండి ఈకాట్టు తాంగల్లోని ఇన్స్టిట్యూట్ ఆవరణలో జరుగుతుందని, 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి, 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ అందజేయనున్నట్టు తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు తిరువళ్లూరు: పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలకు కల్పించాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్లోని ఉలుందై గ్రామంలో శుక్రవారం జరిగిన కేఎస్టీ ప్లాంట్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేస్తున్న క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడాలని ఆయన సూచించారు. తిరువళ్లూరు జిల్లా రాష్ట్ర రాజధాని చైన్నెకి సమీపంలోని జిల్లా. తిరువళ్లూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. కాంచీపురంలోని పరందూరు విమానశ్రయం, మప్పేడులో రైల్వే గోడౌన్ ట్రాక్ కనెక్టవిటీ, ఎన్నూరు, కారపాక్కం పోర్టులు అందుబాటులో వున్న క్రమంలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. అయితే పరిశ్రమలు ఏర్పాటు చేసిన తరువాత ఉద్యోగ ఉపాది అవకాశాల్లో ఎక్కువగా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. -
సట్టెండ్రు మారుదు వానిలై
క్రైమ్ థ్రిల్లర్గా తమిళసినిమా: చిన్న గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సట్రెండ్రు మారుదు వానిలై. నటి మీనాక్షి గోవిందరాజన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని బీవీ ఫ్రేమ్స్ పతాకంపై బీవీ.షర్మిళ నిర్మించారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరిగా హీరోయిన్ మీనాక్షి గోవిందరాజన్ను చూడగానే, హీరో జయ్కు ప్రేమ పుడుతుంది. అదేవిధంగా వీరిద్దరూ ఒక పబ్లో అనుకోకుండా ఒకరికొకరు తారసపడతారు. ఆ తరువాత జరిగిన ఒక సంఘటనలో పోకిరీల మధ్య చిక్కుకున్న హీరోయిన్ను హీరో కాపాడుతాడు. దీంతో ఆమెకు హీరోపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అదేవిధంగా హీరోయిన్కు మరో సమస్య ఉత్పన్నం అవుతున్న తరుణంలో అనుకోకుండా అక్కడికి వచ్చిన హీరో ఆమెను రక్షించడంతోపాటు ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఆ తరువాత పెద్దలకు కూడా తెలియకుండా ఇద్దరు రిజిస్టర్ పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత జరిగే అనూహ్య సమస్యలు ఈ నూతన జంట జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి? హీరో ఎందుకు జైలు పాలయ్యాడు? వారు మళ్లీ కలుసుకున్నారా? వంటి పలు ఆసక్తికరమైన సంఘటనలతో రూపొందిన చిత్రం సట్టెండ్రు మారుదు వానిలై. ఈ చిత్రంలో గరుడారామ్, సత్యన్, శ్రీమాన్, ఆదిత్యకదిర్ ముఖ్యపాత్రలు పోషించారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎన్.నాథన్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. -
ఘనంగా అనిల్రెడ్డి బర్త్డే వేడుకలు
సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని శుక్రవారం చైన్నెలో వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు విభాగం నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ అనిల్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ఈసీఆర్లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో కేక్ కట్ చేయించి ఆనందాన్ని సేవాదళ్ వర్గాలు పంచుకున్నాయి. సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే.జహీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి సేవాదళ్ వర్గాలు పెరంబూరు డాన్బాస్కో వృద్ధుల ఆశ్రమానికి వెళ్లారు. అనిల్ రెడ్డి ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వృద్దులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు. సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, పార్టీ నేత శరత్కుమార్రెడ్డి, సేవాదళ్ అధికార ప్రతినిధులు కీర్తి, సాయిసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీలు భానుప్రకాశ్, రెడ్డిశేఖర్, నవీన్ నరేంద్ర, సంపత్, ప్రకాష్, మణివణ్ణన్, జీవన్, కొండయ్య, జితేంద్ర, మహిళ నాయకులు నాగమణి , లక్ష్మీ, రాణి పాల్గొన్నారు. -
అధికారులపై రైతుల ఫిర్యాదు
తిరుత్తణి: విద్యుత్ గ్రీవెన్స్లో అధికారులపై రైతులు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి విద్యుత్శాఖ డివిజనల్ కార్యాలయంలో డివిజినల్ ఇంజినీర్ మురుగభూపతి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఇందులో తిరువళ్లూరు సూపిరింటెండెంట్ ఇంజినీర్ శేఖర్ పాల్గొన్నారు. గ్రీవెన్స్లో రైతులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొని విద్యుత్ సేవలకు సంబంధించి ఫిర్యాదులు అందజేశారు. ఆర్కేపేట సమీపం ఆదివరాహపురానికి చెందిన మహిళా రైతు ఫిర్యాదు చేశారు. తనకు ఒకటిన్నర ఎకరా పొలానికి విద్యుత్ లైన్ కోసం తత్కాల్ పథకం కింద ఆరు నెలల కిందట రూ. 2.50 లక్షలు చెల్లించాను. అయితే ఇంతవరకు తనకు విద్యుత్ కనక్షన్ ఇవ్వలేదు. విద్యుత్ శాఖ అధికారులను పలుసార్లు కలుసుకుని పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అలాగే ఇటీవల గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు కూలితే విద్యుత్ శాఖ సిబ్బంది రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి స్తంభాలు ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ నింపేందుకు రైతుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులతో విద్యుత్ గ్రీవెన్స్లో కలకలం రేపింది. -
ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాల్లో తమిళ చిత్ర మాస ప్రదోష దినోత్సవం పురస్కరించుకొని ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని నంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోంహర నామ స్మరణల మధ్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివారిని నంది వాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్కు శివాచార్యులు ప్రత్యేక పూజలు చేసి కాయగూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
పీఠం కోసం హోరాహోరీ
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయభాస్కర్ ఒక వర్గంగా ఏర్పడి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పళణి స్వామిని పార్టీ అధికార గద్దె నుంచి దించే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. దీంతో అన్నాడీఎంకే పీఠం సమరం హోరాహోరీగా మారినట్లైంది. అదే సమయంలో శశికళ సైతం రంగంలోకి దిగారు. రెండుగా చీలిన అన్నాడీఎంకే పార్టీ ఆవిర్భావ కాలం నుంచి అన్నాడీఎంకేలో చీలిక కొత్తేమీ కాదు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటమితో అన్నాడీఎంకేలో రెండు వర్గాలుగా చీలిపోయిన ఎమ్మెల్యేలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీలో పార్టీ పక్ష నేతగా ఎస్పీ వేలుమణిని ఎన్నుకున్నట్లు ఓ శిబిరం ప్రకటించింది. మరో శిబిరం పళణిస్వామి వైపే మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు ఉన్నట్టుగా మరో శిబిరం ప్రకటించింది. రంగంలోకి శశికళ? ఈ అంతర్గత పోరును ఆసరాగా చేసుకుని, పార్టీని మళ్లీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి శశికళ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సంకేతాలు వెలువడడం మరో ట్విస్టుగా మారింది. పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య పోరు పార్టీని ఎటు వైపు తీసుకెళ్తుందోనని(బాటం)క్యాడర్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో శశికళ సైతం పావులు కదుపుతుండడంతో మున్ముందు అన్నాడీఎంకే ధారావాహిక ఎపిసోడ్లు ఎలాంటి మలుపులు తిప్పనున్నాయో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దయచేసి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే ప్రధాన కార్యదర్శి, ఎంపీ రవికుమార్ సీఎం విజయ్కు సూచించడం గమనార్హం. అన్నాడీఎంకేలో అంతర్గత సమరం నేపథ్యంలో పరిణామాలు అనర్హత వేటు దిశగా పయనించిన పక్షంలో కొత్త సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు సైతం స్పందిస్తూ, మాజీ మంత్రులను రక్షించే విధంగా వ్యవహరించ వద్దని విజయ్ను హెచ్చరించడం కొసమెరుపు. ఇక ఇరు తరఫు ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేత, విప్ పదవుల కోసం ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని చట్టపరంగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీవీ షణ్ముగం వర్గం అనూహ్యంగా తమిళ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడంతో అన్నాడీఎంకే మళ్లీ ముక్కలైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన పళనిస్వామి తిరుగుబాటు దారులైన వేలుమణి, షణ్ముగం, విజయభాస్కర్లను వారి జిల్లా కార్యదర్శి పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరి చర్యలన్నీ వెన్నుపోటుతో సమానమని పళణి అభివర్ణించారు. కేవలం మంత్రి పదవుల కోసమే వీరి వ్యూహాలు అని ధ్వజమెత్తారు. దీంతో చైన్నె రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్ మాళిగైని చేజిక్కించుకునేందుకు షణ్ముగం వర్గం ప్రయత్నిస్తుందన్న సమాచారంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై షణ్ముగం స్పందిస్తూ పార్టీ కార్యాలయం తమకు దేవాలయం వంటిది. చట్టబద్ధంగా మేమే నిజమైన కార్యకర్తలం అని నిరూపించుకున్నాకే అక్కడ అడుగు పెడతాం అని వ్యాఖ్యానించారు. ఓ వైపు సీవీ షణ్ముగం, మరో వైపు పళణిస్వామి వ్యాఖ్యల తూటాలను పేల్చుతుండడంతో వివాదం వారి ఇళ్ల వద్దకు చేరవచ్చు అన్న సంకేతాలు బయలుదేరాయి. దీంతో ఇద్దరు నేతల ఇంటి పరిసరాలలో సైతం పోలీసులు భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.వెన్నుపోటు అన్న పళణిస్వామి గవర్నర్ గడప తొక్కనున్న పళనిస్వామి మరోవైపు, టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో గురప్రు బేరాలు జరిగాయని పళనిస్వామి వర్గం ఆరోపిస్తున్నది. ఇందుకు నిదర్శనం తమ ఎమ్మెల్యేలు టీవీకే వైపుగా చేరడాన్నే పరిగణించారు. ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా గవర్నర్ అర్లేకర్కు ఫిర్యాదును స్వయంగా అందించేందుకు పళణి సన్నద్ధం అవుతున్నారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ జె.సి.డి.ప్రభాకర్ను కోరిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే దిశగా ముందుడుగు వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేను చేజిక్కించుకునే దిశగా సీవీ షణ్ముగం శిబిరం వ్యూహాలకు పదును పెట్టినట్టు తెలిసింది. -
కంకణం ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: కల్యాణి ఈ ఎంటర్ ప్రైజర్స్ పతాకంపై కల్యాణి.కే.సిరంధన్ కేజీ కలిసి నిర్మిస్తున్న చిత్రం కంకణం. ఏ.ఇసైయరసన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన జాతీయ నాటక పాఠశాల శిక్షకుడు కావడం గమనార్హం.ఇంతకు ముందు ఎన్.కన్నే అనే షార్ట్ ఫిలిం చేసి ఐదు అవార్డులు పొందారు. ఇందులో కూత్తుపట్టరై సౌందర్ కథానాయకుడిగా నటించగా, నటి అశ్విని చంద్రశేఖర్, పిరాణ నటించారు. పరుత్తివీరన్ శరవణన్ కీలక పాత్రను పోషించిన ఇందులో సంపత్రామ్ ప్రతినాయకుడిగా నటించారు. విజయ్ టీవీ రామర్, సేతుపతి, జయచంద్రన్, కయల్ మణి, కేఎస్.వళ్లల్ ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్ర షూటింగ్ను చైన్నె, మేలూర్, తేనీ, అదిరామ్పట్టినమ్, పుదుకోట్టై ప్రాంతాల్లో 53 రోజుల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం నిర్మాత కలైపులి ఎస్.థాను విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. ఈ చిత్రానికి జీఏ.శివసుందల్ చాయాగ్రహణం, సెల్వ సంగీతాన్ని, తమీమ్ అన్సారీ నేపథ్య సంగీతాన్ని అందించారు. ఫస్ట్లుక్ పోస్టర్ను ఆవిష్కరించిన కలైపులి ఎస్.థానుతో యూనిట్ సభ్యులు -
అమ్మన్ శిరస్సు ఊరేగింపు
కోలాహలం.. వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం గంగయమ్మన్ ఆలయ జాతరను పురస్కరించుకొని అమ్మన్ శిరస్సు జాతర శుక్రవారం ఉదయం కోలాహలంగా జరిగింది. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగయమ్మన్ జాతర ప్రతి ఏడాది నిర్వహించడం ఆనవాయితీ. ఇందులోబాగంగా శుక్రవారం ఉదయం ముత్తాలమ్మన్ ఆలయంలోని అమ్మన్ శిరస్సుకు ప్రత్యేక పూజలు చేసి భక్తుల కోలాహలం మధ్య శిరస్సు ఊరేగింపుగా తీసుకొచ్చి పాలారు నది ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహానికి అమర్చారు. ఊరేగింపులో ఓంశక్తి భక్తులతో పాటు, భక్తులు వివిధ వేషధారణలు ధరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా విపరీతమైన ఎండ తీవ్రతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతరకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు నీరు, మజ్జిగ, అంబలితో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జాతరలో దేవదాయశాఖ ఆలయ ఈఓ శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ నిత్య, ఆలయ ధర్మకర్త ఆర్పీఎస్ సంపత్, ఆర్జేఎస్ కార్తికేయన్ నిర్వాహకులు భక్తులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ శివరామన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగింపులో రాత్రి బాణసంచా వేడుకలను ఏర్పాటు చేశారు. -
చైన్నెలో తైవాన్ ఉత్పత్తి కేంద్రం
సాక్షి, చైన్నె : ఎలక్ట్రికల్ టెర్మినల్స్, కనెక్టర్లు, ఇంటర్కనెక్ట్ సొల్యూషన్న్స్లో ప్రసిద్ధి చెందిన తైవాన్ కంపెనీ కేఎస్ టెర్మినల్స్ చైన్నె శివారుల్లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తిరువళ్లూరు జిల్లా పరిధిలోని కడంబత్తూరు యూనియన్ ఉలుందై గ్రామంలో భారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఆ సంస్థ శుక్రవారం ప్రారంభించింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా కేఎస్ టెర్మినల్స్ ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, పారిశ్రామిక రంగాలకు అవసరమైన అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించనుంది. ఇక్కడ ప్రధానంగా ఆటోమోటివ్ కనెక్టర్లు, ఈవీ చార్జింగ్ కనెక్టర్లు, బ్యాటరీ మోడ్యులర్ కనెక్టర్లు, కార్డ్ ఎండ్ టెర్మినల్స్, ఇన్సులేటెడ్ టెర్మినల్స్ తయారు చేయనున్నారు. ఆ సంస్థ సీఈఓ జోచెంగ్ మాట్లాడుతూ చైన్నె ఫెసిలిటీ ద్వారా ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లోని తయారీదారులకు తాము నమ్మకమైన స్థానిక భాగస్వామిగా ఉంటామన్నారు. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా, స్థానికంగా ఉత్పత్తులపై దృష్టి పెట్టనున్నామన్నారు. -
విలక్షణ నటనతో పబ్లిక్ స్టార్గా..!
తమిళసినిమా: ఏ తరహా పాత్రలు అయినా పోషించే వారే నటులు. అందుకే చాలా మంది హీరోలుగా కాకుండా మంచి నటులు అనిపించుకోవాలని కోరుకుంటారు. అలాంటి కోవకు చెందిన నటుడు దురై సుధాకర్. అందుకే ఈయన్ని అభిమానులు పబ్లిక్ స్టార్ సుధాకర్ అని పిలుస్తుంటారు. ఏ తరహా పాత్రలో నైనా తనదైన ముద్ర వేసుకునే దురై సుధాకర్ తప్పాట్టం చిత్రంలో గుబురు గడ్డంతో శోకమైన పాత్రలో నటించి ఆ పాత్రకు జీవం పోశారు. పలువురి ప్రశంసలు అందుకున్న పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ ఎక్స్ ప్లొట్ ఫామ్ అధినేత ఎలన్ మస్క్ నుంచి అభినందనలు అందుకున్నారు. అదేవిధంగా సర్గుణం దర్శకత్వంలో విమల్, ఓవియ జంటగా నటించిన కళవాణి – 2 చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపును పొందారు. నటి వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన డేనీ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి తన సత్తా చాటుకున్నారు. ఇలా పలు రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్న ఈయన తాజాగా మరోసారి ఎగ్జామ్ అనే వెబ్ సిరీస్లో నిజాయితీ పరుడైన పోలీస్గా కీలక పాత్రను నటించారు. పుష్కర్ –గాయత్రిలో ద్వయం తమ వాల్ వాచ్చర్ పతాకంపై సర్గుణం దర్శకత్వంలో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రైమ్ టైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తన పాత్రకు మంచి పేరు వస్తుందనే నమ్మకాన్ని పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ వ్యక్తం చేస్తున్నారు. –పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ -
మద్దతు ధరలను సమీక్షించాలి
సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 2026–27 ఖరీఫ్ సీజన్ మద్దతు ధరలు రైతులకు తీవ్ర నిరాశ కలిగించాయని తమిళనాడు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.ఎస్.మాసిలామణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయం రైతులను మోసం చేసేలా ఉందని ఆయన విమర్శించారు. గత 16 ఏళ్లుగా రైతులు పోరాడుతున్న ప్రధాన డిమాండ్ అయిన సాగు ఖర్చుపై 50 శాతం లాభం విధానాన్ని ఈసారి కూడా అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. వరి క్వింటాల్కు కేవలం రూ.72 మాత్రమే పెంచడం అన్యాయమన్నారు. తాజా పెంపుతో సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ 2,441 గాను, సన్న రకం వరి ధర రూ. 2,461గా నిర్ణయించారని పేర్కొన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు శాసీ్త్రయంగా ధరలను పునఃసమీక్షించి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్ష సూచనతో రైతుల ఆందోళన నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశాల నేపథ్యంలో అన్నదాతలో ఆనందం నెలకొన్నా, తాజాగా వేసిన పంట మేరకు వరి కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం అకాల వర్షాల నేపథ్యతంలో చేతికి అంది వచ్చిన వరి పంటను పరిరక్షించుకునే దిశగా అనేక జిల్లాలోని పలు గ్రామాల్లో వరి కోతలు పూర్తి చేసే పనిలో రైతులున్నారు. ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. అయితే, కొనుగోళ్లు ఆలస్యం అన్న సమాచారంతో ఎక్కడ వరి బస్తాలు తడిసి ముద్దై పోతాయో అన్న ఆందోళన రైతులో పెరిగింది. తాజాగా చెంగల్పట్టు జిల్లావ్యాప్తంగా 171 ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ వంతు కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం వర్షానికి తడిసి పాడవకముందే ప్రభుత్వం స్పందించి, త్వరితగతిన అన్నికేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కాలుష్యంలో తిరుత్తణి పుష్కరిణి
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ పుష్కరిణి కాలుష్యంతో నిండి దుర్వాసన వెదజెల్లుతోంది. భక్తులు బకెట్ నీటిని కొని స్నానం చేసి స్వామి దర్శనానికి వెళుతున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. చాలా మంది భక్తులు తల నీలాలు సమర్పించి ఆలయ శరవణ పొయ్గై పుష్కరిణిలో స్నానం ఆచరించి దర్శనానికి వెళుతుంటారు. భక్తులు తమ మొక్కులు చెల్లించే విధంగా పుష్కరిణిలో పుష్పాలు, బెల్లం సహా పూజా సామగ్రి వస్తువులు వేస్తుంటారు. స్థానికులు దుస్తులు సైతం ఉతుకుతుంటారు. వర్షాకాలంలో వర్షపు నీటితో పాటు మురుగునీరు సైతం పుష్కరిణిలో నిండడంతో నీరు కాలుష్యంగా మారి దుర్వాసన వెదజెల్లుతోంది. దీంతో ఆ నీటిలో స్నానం చేసేందుకు భక్తులు మొహం చాటేస్తున్నారు. పుష్కరిణిలో మురుగునీరు చేరకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని, పుష్కరిణి నిత్యం పరిశుభ్రం చేసి స్వచ్ఛంగా వుంచాలని భక్తులు కోరుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈక్రమంలో భక్తులు తలనీలాలు సమర్పించి బకెట్ నీటిని రూ. పదికి కొనుగోలు చేసి అరకొరగా స్నానం చేస్తున్నారు. ఆలయ అధికారులు స్పందించి పుష్కరిణి కాలుష్యం కాకుండా పరిశుభ్రంగా వుంచి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. -
తమిళనాడులో విస్తృతంగా అమెజాన్ సేవలు
సాక్షి, చైన్నె : తమిళనాడులో అసాధారణ వృద్ధిని నమోదు చేసి ఆర్డర్లు ఐదు రెట్లకు పెంచినట్టు అమెజాన్ ఇండియా పరిధిలోని అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లాల్వానీ ప్రకటించారు. గురువారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెజాన్ బజార్కు తమిళనాడు అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్గా నిలిచిందన్నారు. ఈ వృద్ధిలో రాజధాని చైన్నె అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, ఇక్కడ కొత్త కస్టమర్ల సైన్–అప్లు 2 రెట్లు పెరిగాయని వివరించారు.. చైన్నెతో పాటు వేలూరు, మధురై, తిరుచ్చి నగరాల నుంచి కూడా భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు వివరించారు. పలు ఆఫర్లతో 3 కోట్లకు పైగా ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. తమిళనాడులో అమెజాన్ ప్లాట్ఫారమ్పై మొత్తం లక్ష మందికి పైగా విక్రేతలు ఉండగా, అందులో 1,700 మందికి పైగా వ్యాపారులు నేరుగా ’అమెజాన్ బజార్’ ద్వారా విక్రయాలు జరుపుతున్నారని వివరించారు. తమిళనాడులో 7 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 4 సార్టేషన్ సెంటర్లు ,సుమారు 1,600 మంది హబ్ డెలివరీ పార్ట్నర్లు పనిచేస్తున్నారని తెలిపారు. -
చిన్నప్పుడే లైంగికదాడికి గురయ్యా!
తమిళసినిమా: గాయని కెనీషాపై ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె రవిమోహన్ (జయంరవి)తో కలిసి తిరుగుతున్నారని ఆయన వివాహబంధం విడాకులకు కారణం ఈమేనని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కెనీషా తాజాగా ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే బంధువులకు చెందిన వ్యక్తి కారణంగా లైంగికదాడికి గురయ్యాను. ఆ తీరని వ్యథ నుంచి బయటపడక ముందే 2013లో అమ్మను, 2017లో నాన్నను కోల్పోయాను. 18, 19 ఏళ్ల వయసులోనే నా పెళ్లి జరిగిపోయింది. అప్పుడు నాకు వివాహ బంధం గురించి తెలియదు. వివాహానంతరం నా భర్త పైశాచికంగా కడుపుపై తన్నడం కారణంగానే నా కడుపులోని నాలుగు నెలల గర్భస్థ శిశువు మృతిచెందింది. ఆ తర్వాతే నన్ను నేను దృఢపరుచుకోవడం ప్రారంభించాను. అవును నేను క్లబ్లో డాన్స్ చేశాను. అందులో తప్పేముంది అందుకు నాకు రోజుకు రూ.500 ఇచ్చేవారు. అప్పట్లో అదే నాకు జీవనాధారంగా మారింది. అలాంటి నా గురించి తప్పుగా మాట్లాడే వారికి బుద్ధి లేదా అనే భావన కలుగుతుంది. నాకు నలుగురైదుగురు పిల్లలు ఉన్నారని, నేను ఆంటీని అని, తండ్రిని అనాథాశ్రమంలో చేర్చి రవిమోహన్తో తిరుగుతున్నానని ఏవేవో ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటి వారిని అడుగుతున్నాను మీకు కొంచమైనా బుద్ధి ఉందా? నేను, రవిమోహన్ మీ కళ్ల ముందే తిరుగుతున్నాం కదా మేమేదో విదేశాలకు వెళ్లిపోయినట్లు ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు? నన్ను కలిసినప్పుడు ఆయన మానసిక వేదనకు గురయ్యారు. దీంతో నేను ఆయనకు ఒక థెరపిస్టుగా కొన్ని సూచనలు చేశాను. అది మా మధ్య పరిచయంగా మారింది. గర్భ శిశువును పోగొట్టుకున్న నేను రవిమోహన్ కుటుంబాన్ని నాశనం చేస్తానా? దయచేసి ఇలాంటి ప్రచారాన్ని కట్టిపెట్టి, మీ పనులపై దృష్టి పెట్టండని కెనీషా హితవు పలికారు. కెనీషా -
వృద్ధుడి సరసానికి నగలు గోవిందా..!
● మహిళ అరెస్ట్ తిరువొత్తియూరు: సరదాగా గడుపుదామని ఇంటికి రప్పిస్తే చివరకు నగలు కాజేసింది వెళ్లిందిరా బాబూ అని ఓ వృద్ధుడు తేలుకుట్టిన దొంగలా గొల్లుమనాల్సి వచ్చింది. వివరాలు.. చైన్నెలోని నెర్కుండ్రం ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు తన కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. వేసవి సెలవుల కారణంగా గత వారం ఆయన కుమార్తె ఊరికి వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న వృద్ధుడు తనకు పరిచయం ఉన్న అ న్నానగర్, శాంతి కాలనీకి చెందిన ఓ మహిళను తన ఇంటికి ఆహ్వానించి సాన్నిహిత్యంగా గడిపాడు. ఆ సమయంలో వృద్ధుడి దృష్టిని మళ్లించిన ఆ మహిళ బీరువాలోపి 6 సవర్ల బంగారు నగలను దొంగిలించి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయింది. గురువారం ఇంటికి తిరిగి వచ్చిన వృద్ధుడి కుమార్తె బీరువా తెరచిచూసింది. నగలు కనిపించకపోవడంతో తన తండ్రిని నిలదీసింది. ఇంటి పని కోసం ఒక మహిళను పిలిపించిన ట్లు చెప్పి ఆయన తప్పించుకోవాలని చూశారు. చివరకు కోయంబేడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నగలు చోరీ చేసిన మహిళను అరెస్టు చేశారు. రాతియుగం నాటి ఆయుధం లభ్యం! కొరుక్కుపేట: చిదంబరం సమీపంలోని దక్షిణ పెన్నా నదిలో ఒక పురాతన రాతి ఆయుధం లభ్యమైంది. బన్రిటీ సమీపంలోని కందరకోట్టై దక్షిణ నదిని పురావస్తు శాస్త్రవేత్త ఇమ్మాన్యుయేల్, చారిత్రకవేత్తలు కనుగొన్నారు. అధికారి ప్రతాప్ అగర్వాల్ క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. నది దక్షిణ భాగంలో పాలియోలిథిక్ కాలం నాటి రాతి ఆయుధాన్ని కనుగొన్నారు. ఇది సుమారుగా 7.8 సెం.మీ పొడవు, 5.7 సెం.మీ వెడల్పు ఉందని ఇమ్మాన్యుయేల్ తెలిపారు. ఇది రాతి యుగానికి చెందిన పురాతన రాతి ఆయుధం, సుమారు 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని వెల్లడించారు. టీటీడీకి ఇన్నోవా విరాళం తిరుమల: చైన్నెకి చెందిన పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మగేష్సుందర్ శుక్రవారం టీటీడీకి రూ.40 లక్షల విలువచేసే టయోటా ఇన్నోవా హైక్రాస్ వీజెడ్ మోడల్ కారును విరాళంగా అందించారు. దాత శ్రీవారి ఆలయం ముందు కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథంకు కారు తాళాలు అందజేశారు. -
నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి
– వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా నిర్ణయం సాక్షి,చైన్నె: కాంక్రీట్ ఆధారిత అంతర్జాతీయ ప్రదర్శన వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా–2026, 12వ ఎడిషన్ నేపథ్యంలో, చైన్నెలో కీలకమైన పరిశ్రమల ప్రతినిధులు, మీడియా రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. జూన్ 3 నుంచి 5 వరకు ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న ప్రధాన ప్రదర్శనకు ముందు దక్షిణాది మార్కెట్ను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. నిర్మాణ రంగం వృద్ధి లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమ నిపుణులు, అగ్రగామి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ రంగ విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా దక్షిణాదిలో కాంక్రీట్, నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. నిర్మాణ రంగం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. సమావేశంలో ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా సీనియర్ గ్రూప్ డైరెక్టర్ రజనీష్ ఖట్టర్తోపాటు టీ. అశోకన్ (ఫ్లోరింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్), మోహన్ రామనాథన్ (ఇండియన్ డెమోలిషన్ అసోసియేషన్), మురళీధరన్ ఎన్.జి (ఐసీఐ చైన్నె సెంటర్), అపూర్వ అశోక్ కాటే (దురాక్లీన్) పాల్గొన్నారు. -
ఇదే సరైన సమయం.. కమల్హాసన్ బహిరంగ లేఖ
చెన్నై: భారతీయ సినీ పరిశ్రమను ఉద్దేశించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ రాశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతోందన్న కమల్.. ఇంధనం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.‘‘పెరుగుతున్న ఖర్చులు కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే నెలల్లో వినోదం కోసం వినియోగదారుల ఖర్చు చేసే విధానాలు కూడా మారవచ్చు. ఆ భారం అనివార్యంగా నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు, మొత్తం వ్యవస్థపై పడుతుంది. సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే, ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం భారీ స్థాయి ప్రదర్శనకే కాకుండా, సినిమాకే ఉపయోగపడేలా మనం నిర్ధారించుకోవాలి.’’ అని కమల్హాసన్ లేఖలో సూచించారు.‘‘ప్రతి ప్రేమకథ పారిస్లోనే ఎందుకు వికసించాలి. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్లోనే ఎందుకు ముగియాలి?. అదృష్టవశాత్తూ ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదు. భారతీయ సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఒకే అభిప్రాయానికి రావడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై పరిశ్రమ వ్యాప్తంగా చర్చ జరగాలి. నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్ఫారమ్లు, గిల్డ్ల మధ్య సంప్రదింపులు జరగాలి.సమర్థవంతమైన సినిమా నిర్మాణం కోసం, మనమందరం కలిసి ఆచరణాత్మకమైన, సుస్థిరమైన నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలి. అనవసరమైన విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్లు, స్టూడియోల అంతటా విద్యుత్ ఆదా చేయడం, సుస్థిరమైన సెట్ నిర్మాణం, వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం చేయాలి. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం.మన పరిశ్రమ సంస్కృతిని తీర్చిదిద్దుతుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. సినిమా కేవలం వినోదానికి మించిన బాధ్యతలను కలిగి ఉంటుంది. ఈ పరిశ్రమ నుండి అత్యధికంగా లబ్ధి పొందిన మనము ముందుగా ఆదర్శంగా నిలవాలి. ఈ రోజు సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగితే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడగలిగినట్లే’’ అంటూ కమల్హాసన్ లేఖలో పేర్కొన్నారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఆగ్రహం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు. ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావంమైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ஒன்றிய அரசின் பொதுத்துறை எண்ணெய் நிறுவனங்கள் பெட்ரோலியப் பொருட்களின் விலையை இன்று (15.05.2026) உயர்த்தியுள்ளது தொடர்பாக மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்களின் அறிக்கை#CMJosephVijay pic.twitter.com/FZIcuTHdCQ— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 -
ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.డీఎంకేలో భారీ మార్పులుడీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, కోశాధికారి టీఆర్బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.ఓటమికి నేనే బాధ్యుడిని..పార్టీ ఓటమిపై స్టాలిన్ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్గా మారుతోంది. విజయ్ సర్కార్కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్ను తమిళన్కు ముందు.. తమిళ్కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
అవయవ దానంపై అవగాహన సదస్సు
సాక్షి, చైన్నె: ఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రామాపురం, తిరుచ్చి చైర్మన్ డాక్టర్ ఆర్ శివకుమార్ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్టాన్లీ అల్యుమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అవయవ దాన అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. విద్యార్థులు , అధ్యాపకులలో అవయవ దానంపై అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్లారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్వహించిన అవగాహన సదస్సుతో స్ఫూర్తి పొందిన 60 మందికి పైగా ఎస్ఆర్ఎం సిబ్బంది తమ అవయవాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలను స్టాన్లీ అల్యుమినీ అసోసియేషన్కు అందజేశారు. కార్యక్రమంలో స్టాన్లీ అల్యుమినీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. వరదరాజన్, ఫైనానన్స్ సెక్రటరీ డాక్టర్ శరవణన్ వేదగిరితో పాటూ 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థులు డాక్టర్ బాబా, డాక్టర్ ప్రేమ్ కూడా పాల్గొని అవయవ దాన విశిష్టతను వివరించారు. ఎస్ఆర్ఎం విద్యా సంస్థల డైరెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, బోధనా , బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. -
అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా..!
తమిళసినిమా: నటుడు సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్.ప్రకాష్ బాబు, ఎస్ ఆర్.ప్రభు నిర్మించారు. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర టైటిల్ తో పాటూ ట్రైలర్ విడుదలై కరుప్పు పై ఆసక్తిని పెంచేశాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గురువారం (మే 14న) విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఉదయం 9 గంటల ఆటను ప్రదర్శించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చింది. అయితే నిర్ణయించిన ప్రకారం కరుప్పు చిత్రం గురువారం ఉదయం ఆటలే కాదు, మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు కూడా థియేటర్లో పడలేదు. ఫైనాన్షియల్ సమస్య కారణంగా కరుప్పు చిత్రం విడుదలలో ఆలస్యం జరిగిందని నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఇన్ స్ట్రాగామ్లో పేర్కొన్నారు. అదేవిధంగా చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ కరుప్పు చిత్రాన్ని అనుకున్న ప్రకారం విడుదల చేయలేక పోయినందుకు చింతిస్తున్నట్లు ఓ ఆడియోను విడుదల చేసి కంటతడి పెట్టారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నటుడు సూర్య రంగంలోకి దిగినట్లు సమాచారం. -
అవార్డులను సకాలంలో అందిస్తేనే..!
తమిళసినిమా: ప్రైవేట్ మ్యూజికల్ వీడియోలను కూడా ఇప్పుడు చాలా గ్రాండ్గా రూపొందిస్తున్నారు. సంగీత ప్రియుల నుంచి అలాంటి ఆల్బమ్స్కు మంచి ఆదరణ లభిస్తుండటమే ఇందుకు కారణం. కాగా తాజాగా సైలెంట్ ఇన్ ప్లూయెన్సర్ పేరుతో అలాంటి కలర్ఫుల్ మ్యూజికల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషనన్స్ పతాకంపై బలరాం జె.బాలాజీ నిర్మించి నటించిన ఈ ఆల్బమ్లో ఆయనతో పాటూ నటి ఐకీ బెర్రీ, నృత్య దర్శకుడు దినేష్ నటించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి రాజా దర్శకత్వం వహించిన ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఈ తరం యువతను ప్రతిబింబించే ఈ మ్యూజికల్ ఆల్బమ్కు దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. దర్శకుడు పేరరసు, ఆర్వీ.ఉదయకుమార్, చరణ్, ఎస్.ఎళిల్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని నిర్మాత కుటుంబం ఆవిష్కరించిన ఈ వీడియో ఆల్బమ్ తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఈ ఆల్బమ్ హీరో బలరాం జె.బాలాజీ నటుడు విజయ్ వీరాభిమానినని చెప్పారన్నారు. ఎంజీఆర్ తరువాత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిన నటుడు విజయ్ అని, ఆయన చిత్ర పరిశ్రమలోని సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఎంజీఆర్, కరుణానిధి చిత్ర పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారన్నారు. ఆ తరువాత వారు సినీ పరిశ్రమను పట్టించుకోలేదన్నారు. సినీ అవార్డుల ఈ ఏడాదిలో విడుదల అయిన చిత్రాలకు వచ్చే ఏడాది అందిస్తేనే ఆనందం కలుగుతుందన్నారు. అలా కాకుండా ఎప్పుడో 10 ఏళ్లకు ఇస్తే ఆ భావోద్రేకాలు కలగవన్నారు. ఈ ఆల్బమ్ హీరో బలరాం జె.బాలాజీ మాట్లాడుతూ తనకు పాఠశాల రోజుల నుంచి సినిమాలపై ఆసక్తి అని, అనివార్య కారణాల ఈ రంగంలో ఆలస్యంగా వచ్చానని చెప్పారు. తాను దళపతి విజయ్ వీరాభిమాని అని, ఈ ఆల్బమ్లో ఆయన స్టైల్, యాక్టింగ్ కనిపించడానికి అదీ ఒక కారణం అని పేర్కొన్నారు. సైలెంట్ ఇన్ప్లూయెన్సర్ ఆల్భమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులు, యూనిట్ సభ్యులు -
70 సవర్ల బంగారం, 10 కిలోల వెండి చోరీ
తిరువొత్తియూరు: నాగర్కోయిల్ సమీపం ఎన్.జి.ఓ. కాలనీ పెరుంగుళం ప్రాంతానికి చెందిన అన్బయ్య అదే ప్రాంతంలోని కామరాజర్ రోడ్డులో జ్యువెలరీ షాపు నడుపుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో, మోటార్ సైకిళ్లపై వచ్చిన నలుగురుగుర్తుతెలియని వ్యక్తులు అన్బయ్య నగదు దుకాణం వద్దకు చేరుకుని దుకాణం షట్టర్కు ఉన్న ఇనుప కడ్డీలను పగలగొట్టారు. ఆ శబ్దం విని ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి చూడగా, గుర్తుతెలియని వ్యక్తులు దుకాణాన్ని పగలగొట్టడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు , సుచీంద్రం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే దుండగులు లోపలికి ప్రవేశించి, అద్దాల పెట్టెలను పగలగొట్టి అందులో ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులను చోరీ మోటార్ సైకిళ్లపై పరారయ్యారు. సమాచారం అందుకున్న అన్బయ్య వెంటనే దుకాణం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో సుచీంద్రం పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దుకాణ యజమాని, పోలీసులు లోపలికి వెళ్లి పరిశీలించగా, దుకాణంలో రూ.కోటి విలువైన 70 సవర్ల బంగారు నగలు, 10 కిలోల వెండి వస్తువులు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై సుచీంద్రం పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్ – శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి పిలుపు సాక్షి, చైన్నె: మహిళా నాయకత్వం, వ్యవస్థాపకత, ఆర్థిక భాగస్వామ్య రంగాలలో భారత్, శ్రీలంక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇరు దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మహిళల అత్యున్నత సంస్థ అయిన ’ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్’, శ్రీలంక మహిళా ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సరోజ సావిత్రి పౌల్రాజ్ నేతృత్వంలోని శ్రీలంక మహిళా పార్లమెంటరీ ప్రతినిధి బృందం చైన్నెకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక బంధాల బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్లో మహిళల నాయకత్వం, సమగ్ర అభివృద్ధి, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫిక్కీ మహిళా విభాగం అధ్యక్షురాలు పూజా గార్గ్, శ్రీలంక మంత్రి సరోజ సావిత్రి పౌల్రాజ్, ఫిక్కీ మహిళా విభాగం కార్యదర్శిఅనంత్ స్వరూప్, ఫిక్కీ మాజీ అధ్యక్షురాలు పూనమ్ శర్మ, ఫిక్కీ ఫ్లో వైస్ ప్రెసిడెంట్ పూజా చౌదరి, గవర్నింగ్ బాడీ సభ్యులు , పలువురు ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే రాజకీయాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. ఆశించిన స్థాయిలో మెజారిటీ రాకపోవడం, అధికారాన్ని కోల్పోవడంతో పార్టీ క్యాడర్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ రంగంలోకి దిగారు. గురువారం చైన్నెలోని అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. -
అధికారం వద్దా!
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీలో సనాతన ధర్మం అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారంపై ప్రముఖ ఐటీ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా డీఎంకే భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా ఉదయనిధి స్వయంగా అడ్డుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వివరాలు.. తమిళనాడు శాసనసభ స్పీకర్గా జె.సి.డి. ప్రభాకర్ ఎన్నికై న సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, తన ప్రసంగం చివరలో.. ‘ప్రజలను విడదీసే సనాతనాన్ని కచ్చితంగా నిర్మూలించాలి‘ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు నైనార్ నాగేంద్రన్, వానతీ శ్రీనివాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ మద్దతు పలికారు. ఈ వివాదంపై శ్రీధర్ వేంబు తనదైన శైలిలో విశ్లేషించారు. భాషా మాయాజాలం సనాతనం అనే పదం తమిళ ప్రజల దైనందిన భాషలో అంతగా వాడకంలో లేదని, అందుకే ఉదయనిధి ఆ పదాన్ని పదేపదే వాడుతున్నారని వేంబు పేర్కొన్నారు. ఒకవేళ ఆయన ధర్మం లేదా అరమ్ అనే పదాలను విమర్శించి ఉంటే, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చేదని అభిప్రాయపడ్డారు. హిందూ దేవుళ్లపై, ఆచారాలపై డీఎంకే నిరంతరం చేస్తున్న దాడుల వల్లే ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషించారు. అన్నాడీఎంకే ఎప్పుడూ ఇలాంటి దాడులు చేయలేదని, అందుకే డీఎంకే వ్యతిరేక ఓట్లను వారు గతంలో సులభంగా పొందగలిగారని వివరించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భారీగా ఖర్చు చేసినా, బలమైన కూటమి ఉన్నా ఓడిపోవడానికి ఉదయనిధి వ్యాఖ్యలు ఒక కారణమని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీకి కూటమి లేకపోయినా డీఎంకేను ఓడించగలిగిందని పేర్కొన్నారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకూడదని ఉదయనిధి స్టాలిన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుందని వ్యాఖ్యలు చేశారు. ఆ నిత్యమైన సనాతన ధర్మమే ఆయన కోరికను నెరవేరుస్తుందని శ్రీధర్ వేంబు తన పోస్ట్ను ముగించారు. -
ధర్మరాజు ఆలయంలో జాతర ఉత్సవాలు
తిరువళ్లూరు: మేట్టుపాళ్యంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ద్రౌపతి అమ్మవారు సమేత ధర్మరాజు ఆలయంలో చైత్రమాసం జాతర ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా మేట్టుపాళ్యంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ద్రౌపతి అమ్మవారు సమేత ధర్మరాజుల ఆలయం ఉంది. ఇక్కడ ఏటా చైత్రమాసంలో పది రోజుల పాటూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే గత ఏడు రోజుల క్రితం ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. ఏడవ రోజైన గురువారం ఉదయం స్వామి వారిని గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద స్వామి వారికి మంచంపై నైవేద్యంగా పండ్లు, స్వీట్లు తదితర వాటిని పెట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. కాగా ఉత్సవాల సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. ఉత్సవాలకు పట్టణాల్లో వున్న వారు సైతం గ్రామంలోకి రావడంతో కలకలాడింది. ఇది ఇలా ఉండగా ఆదివారం అమ్మవారి ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశం తదితర ఉత్సవాలు జరగనుంది. -
సింగపెన్ ప్రత్యేక దళం సిద్ధం
సాక్షి, చైన్నె : మహిళల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘సింగపెన్ స్పెషల్ ఫోర్స్’ ప్రపథమంగా సేలం నగరంలో గురువారం నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. మహిళా పోలీసులు నేతృత్వం వహించే ఈ ప్రత్యేక దళం, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే గస్తీని మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేస్తానని విజయ్ ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలోనే మొదటిసారిగా సేలం నగర పోలీసు విభాగంలో ఈ విభాగం ప్రారంభమైంది. సింగపెన్ ప్రత్యేక దళం సేలం సిటీ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ గిరి పర్యవేక్షణలో, సూరమంగళం రేంజ్ అసిస్టెంట్ కమిషనర్ రమలి రామలక్ష్మి ఈ దళాన్ని పర్యవేక్షిస్తారు.ఈ బృందంలో ఒక ఎస్.ఐ (అరుళ్మొళి), ఇద్దరు ఎస్.ఎస్.ఐలు, , మహిళా హెడ్ కానిస్టేబుల్స్ సభ్యులుగా ఉన్నారు. కేవలం వాహన డ్రైవర్ మాత్రమే మగ పోలీసు ఉన్నారు. ఈ దళానికి ప్రత్యేక వాహనం, బాడీ వోర్న్ కెమెరాలు, ఇతర భద్రతా పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు ఐటీ కంపెనీల వంటి మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహించడం ఈ బృందం విధులు. మహిళలపై జరిగే అక్రమ చర్యలను అరికట్టడం , ఫిర్యాదు అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకోవడం కూడా. సామాజిక సంక్షేమ , విద్యా శాఖలతో కలిసి మహిళా భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. బాధితులకు తక్షణ సహాయం అందేలా ప్రభుత్వం , స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడంలో ఈ బృందం నిమగ్నం అవుతుంది. ఈ దళాన్ని ప్రారంభించిన సందర్భంగా కమిషనర్ అనిల్ కుమార్ గిరి మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా లేదా అత్యవసర నంబర్కు కాల్ చేసినా, సింగపెన్ దళం వెంటనే స్పందించి వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
వేపంబట్టు రైల్వే బ్రిడ్జి పూర్తికి వినతి
తిరువళ్లూరు: పూందమల్లి నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని పూందమల్లి ఎమ్మెల్యే కుట్టి అలియాస్ ప్రకాశం కలెక్టర్ ప్రతాప్కు విన్నవించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్ను పూందమల్లి ఎమ్మెల్యే ప్రకాశశం మర్యాదపూర్వకంగా గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. అనంతరం పూందమల్లి నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో పెండింగ్లో వున్న ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని, నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లు, వీధిధీపాలు, తాగునీటి సదుపాయంతో పాటు ఇతర సదుపాయాలను కల్పించాలని కోరారు. దాదాపు 15 ఏళ్ల నుంచి పెండింగ్లో వున్నసెవ్వాపేట, వేపంబట్టు రైల్వే బ్రిడ్జీ నిర్మాణపు పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. కుత్తంబాక్కం బస్టాండును సైతం అందుబాటులోకి తేవాలని కోరారు. కాగా కలెక్టర్ను కలిసి వారిలో పలువురు టీవీకే నేతలు కార్యకర్తలు ఉన్నారు. -
ప్రభుత్వ బస్సులో టీవీకే ఎమ్మెల్యే
వేలూరు: వేలూరు జిల్లాలోని కేవీకుప్పం నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే తెండ్రల్కుమార్ తన బాధ్యతలు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గానికి ప్రభుత్వ బస్సులో వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేలూరు జిల్లా కేవీ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా తెండ్రల్కుమార్ గెలుపొందారు. విజయం సాధించిన వెంటనే ఈనెల 4న సాయంత్రం కాల్ట్యాక్సీని బుక్ చేసుకొని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలోని టీవీకే కార్యాలయం నుంచి అసెంబ్లీ కూడా ఎమ్మెల్యేలకు కేటాయించిన ప్రభుత్వ బస్సులోనే వచ్చి వెళ్లేవారు. ఇది గమనించిన పలువురు ఇతని వద్ద ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంటర్వ్యూలో తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని తనకు కారు లేదని ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే కాల్ ట్యాక్సీలో చైన్నెకి వచ్చానని ప్రస్తుతం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నానని తన నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి చెప్పుల వేసుకుంటానని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఇదిలా ఉండగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈనెల 13వ తేదీన సాయంత్రం చైన్నె సచివాలయం నుంచి కాట్పాడికి రైలు మార్గంలో చేరుకొని అక్కడ నుంచి కేవీ కుప్పంలోని తన నియోజక వర్గానికి బస్సులో ప్రయాణం చేశారు. అయితే తనకు ఎటువంటి ఆస్తులు లేవని ప్రభుత్వ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రావడంతో అఽధికారులు, వివిధ పార్టీల నేతలు విచారణ జరిపారు. అయితే ఎన్నికల నామినేషన్ వేసిన సమయంలో తనకు రూ.2 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అందులో చూపించారు. అయితే ఇతని భార్య పేరుపై రూ.10 కోట్ల దాకా ఆస్తులు ఉన్నట్లు స్థానికులు చెప్పడం గమనార్హం. -
విస్తరించిన చరిత్రాత్మక ’మిషన్ శక్తిశాట్’
సాక్షి, చైన్నె: అంతరిక్ష రంగంలో సరిహద్దులను చెరిపేస్తూ, సరికొత్త అంతర్జాతీయ దౌత్యానికి ’స్పేస్ కిడ్జ్ ఇండియా’ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా బాలికల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న చరిత్రాత్మక చంద్రుడి శాటిలైట్ ప్రాజెక్ట్ ‘మిషన్ శక్తిశాట్‘ను తాజాగా శ్రీలంకకు కూడా విస్తరించింది. ఉమెన్ ఇన్ మేనేజ్మెంట్ గ్లోబల్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఈ మిషన్లో మరో కీలక మైలురాయి నమోదైంది. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యానికి సంబంధించి స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్, శ్రీలంక డిజిటల్ ఎకానమీ గౌరవ డిప్యూటీ మంత్రి ఎరంగ వీరరత్నేతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అంతరిక్ష శాస్త్రం, స్టెమ్ విద్య, ఆవిష్కరణలు, బాలికల సాంకేతికత సాధికారతపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా శ్రీమతి కేసన్ మాట్లాడుతూ, 108 దేశాలకు చెందిన సుమారు 12,000 మంది బాలికలు కలిసి ఒక చంద్రుడి ఉపగ్రహాన్ని డిజైన్, కోడింగ్, లాంచ్ చేయనున్నారని తెలిపారు. యువతులకు శాటిలైట్ టెక్నాలజీ, పీసీబీ డిజైనింగ్, కోడింగ్, సిస్టమ్స్ ఇంజినీరింగ్ వంటి అంశాల్లో ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 7,800 మందికి పైగా విద్యార్థినులు ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములయ్యారని, ఈ వినూత్న ప్రయత్నాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇటీవలే ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. -
క్లుప్తంగా
చైన్నె నుంచి 1600 ప్రత్యేక బస్సులు కొరుక్కుపేట: సెలవుల సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. మే 14, 15, 16, 17 మంచి ముహూర్తాలు, సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైన్నె సెంట్రల్ బస్ టెర్మినల్ నడిపే రోజూవారి బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులను నడపాలని తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ నిర్ణయించింది. చైన్నె సెంట్రల్ బస్ టెర్మినల్ నుంచి గురువారం నుంచి తిరుచ్చి, కుంభకోణం, మదురై, తిరునెల్వేలి, నాగర్కోయిల్, కన్నూర్, తూత్తుకుడి, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ ప్రాంతాలకు 80 బస్సులు నడపనున్నారు. శుక్రవారం 620, శనివారం 655 బస్సులు నడపనున్నారు. మాధవరం నుంచి 120 బస్సులు, తిరుప్పూర్, ఈరోడ్, బెంగళూరు, కోయంబత్తూరు, వివిధ ప్రదేశాల నుంచి 25 బస్సులు నడపనున్నారు. మరణంలోనూ వీడని బంధం –భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా మృతి కొరుక్కుపేట: భర్త మృతిని తట్టుకోలేక మనస్తాపం చెంది భార్య కూడా మృతిచెందింది. కల్లకురిచి జిల్లాలోని ఉలుందూరుపేట సమీపం కలత్తూరు గ్రామానికి చెందిన నంగూరన్ (67) అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం మృతిచెందారు. బుధవారం ఆయన బంధువులు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆ సమయంలో, ఓదార్చడానికి వచ్చిన బంధువులను నంగూరన్ భార్య అంజలై (63)ను కౌగిలించుకుని ఏడుస్తుండగా ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ సమయంలో అకస్మాత్తుగా అంజలైకి గుండెపోటు వచ్చి స్పృహ కోల్పోయారు. దిగ్భ్రాంతికి గురైన బంధువులు వెంటనే ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అంజలై మృతిచెందింది. ట్యాంకులో మునిగి ఇద్దరి మృతి అన్నానగర్: నీటి ట్యాంకులో మునిగి ఇద్దరు బాలురు మృతిచెందారు. నాగై జిల్లాలోని సికల్ ప్రాంతానికి చెందిన కలైవానన్. ఇతని కుమారుడు ప్రవీణ్సాయి(4). అదేప్రాంతానికి చెందిన ఇతని బంధువు సామిదురై కుమారుడు పవన్న్సాయి (4). ఆ ఇద్దరు వేలన్కన్ని ప్రాంతంలో ఉంటున్న భారతీమోహన్ ఇంటికి వెళ్లారు. బుధవారం సాయంత్రం వీరిద్దరు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చాలా సేపటి వరకు వారిద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. వారి కోసం వెతకగా, భారతీ మోహన్ ఇంటి సమీపంలో కొత్త ఇల్లు కడుతున్న ఒక వ్యక్తి ఇంట్లోని నీటి ట్యాంక్లో పడి ఆ ఇద్దరు మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అవయవాలు దానం అన్నానగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంసభ్యులు దానం చేశారు. తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలైపేట్టై ప్రాంతానికి చెందిన కరుప్పస్వామి (22). గత 10వ తేదీ బైక్లో వెళుతూ అదుపుతప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కరుప్పస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యిందని బుధవారం వైద్యులు తెలిపారు. దీంతో, కరుప్పస్వామి కుటుంబసభ్యులు అతని అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. అనంతరం, అతని కాలేయం, మూత్రపిండాన్ని కోయంబత్తూర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, మరో మూత్రపిండాన్ని సేలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేశారు. మినీ బస్సు దగ్ధం వేలూరు: నడిరోడ్డు ఓ మినీ బస్సు దగ్ధమైంది. వేలూరు సైదాపేటకు చెందిన మొయిద్దీన్. ఇతను పాత బస్సులను కొనుగోలు చేసి వాటిని ధ్వంసం చేసి అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో కోవై నుంచి పాత మినీ బస్సును కొనుగోలు చేశాడు. ఈ బస్సును కాట్పాడికి చెందిన వినోద్కుమార్ క్రేన్ ద్వారా వేలూరుకు తీసుకొస్తున్నాడు. మినీబస్సు గురువారం ఉదయం 10 గంటల సమయంలో వేలూరు జిల్లా పొయిగై వద్ద వస్తుండగా మినీ బస్సులో పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన క్రేన్ డ్రైవర్ వినోద్కుమార్ క్రేన్ను నిలిపి వేసి అక్కడ నుంచి పరుగులు తీశాడు. అప్పటికే మంటలు చెలరేగడంతో విషయం తెలుసుకున్న వేలూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని గంట పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో బెంగళూరు నుంచి చైన్నె వెళ్లే జాతీయ రహదారిలో వాహన రాకపోకలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సర్వీస్ రోడ్డుకు వాహనాలను మల్లించారు. గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. -
నియోజకవర్గాల వారీ సమీక్షలకు సీఎం ఆదేశాలు
– మంత్రి ఆధవ్ సాక్షి, చైన్నె : సీఎం విజయ్ ఆదేశాలతో ప్రజల ప్రాథమిక సవుస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందడుగు వేశామని మంత్రి ఆధవ్ అర్జున తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీవీకే ప్రభుత్వ కార్యాచరణను వివరించారు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. అయితే, తమ నాయకుడు, సీఎం విజయ్ మాత్రం అంతకంటే ముందే ప్రజల కనీస అవసరాలు, నియోజకవర్గాల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగానే విల్లివాక్కం నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళా భద్రత, డ్రగ్స్ రహిత రాష్ట్రమే తొలి లక్ష్యంగా చర్యలు విస్తృతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వారిని గుండా చట్టం కింద జైల్లో పెట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మద్యం దుకాణాలను మూసివేయాలని కచ్చితంగా ఆదేశించామన్నారు. పోలీస్ స్టేషన్లలో 24 గంటల నిఘా పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకతను పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్లలో 24 గంటలూ సీసీ కెమెరాలు పనిచేయాలని, స్టేషన్లో ఎవరు ఫిర్యాదు చేసినా దానిని వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించామన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని, జీరో కరప్షన్, జీరో కమిషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రకటలించారు. టీవీకే నేతలు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ప్రభుత్వ టెండర్లలో జోక్యం చేసుకోకూడదని, ఎవరికీ సిఫార్సులు చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ పనుల పురోగతిపై ప్రతి నెలా ’రివ్యూ మీటింగ్’ నిర్వహిస్తామని పేర్కొన్నారు. టాస్మాక్ ఆదాయం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం అని మూసి వేస్తున్న మద్యం దుకాణాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి, విధులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
క్లుప్తంగా
కంటెంట్ క్రియేటర్ల కోసం సరికొత్త ఆవిష్కరణ సాక్షి, చైన్నె: ప్రముఖ డిజిటల్ ఇమేజింగ్ సంస్థ కానన్ ఇండియా నేతృత్వంలో సరికొత్త తరం ఫిల్మ్ మేకర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం అత్యాధునిక వీడియో–ఫోకస్డ్ కెమెరాగా ఈఎస్ఓఆర్6వీ ఆవిష్కరించారు. అలాగే మొట్టమొదటి ఎల్–సిరీస్ పవర్ జూమ్ లెన్స్ఆర్ఎఫ్ 20–50 ఎఫ్4ఎల్ను కూడా పరిచయం చేవారు. వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీని దృష్టిలో ఉంచుకుని సరికొత్త కొత్త ఉద్యమంలో భాగంగా ఈ ఉత్పత్తులను లాంచ్ గురువారం స్థానికంగా ఆవిష్కరించారు. ఓ ఓపెన్ గేట్ రికార్డింగ్ ఫీచర్ ద్వారా వీడియోను హారిజాంటల్ నుండి వర్టికల్ ఫార్మాట్కు మార్చుకోవడానికి ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు కల్పించారు. ఇది సోషల్ మీడియా క్రియేటర్లకు ఎంతో ఉపయోగకరం, సుదీర్ఘ సమయం పాటు అంతరాయం లేకుండా వీడియో రికార్డింగ్ చేయడానికి వీలుగా ఇందులో బిల్ట్–ఇన్ కూలింగ్ ఫ్యాన్ను అమర్చారు. 32.5 మెగాపిక్సెల్ ఫుల్–ఫ్రేవ్ సీఎంఓఎస్ సెన్సార్తో అద్భుతమైన ఫొటోలు వీడియోలను తీయడానకిఇ అవకాశం కల్పించారు. వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్, రీజినల్ సినిమా , డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఈ కెమెరా ఒక ’గేమ్ ఛేంజర్’ అవుతుందని కానన్ ఎండీ టైగర్ ఇషీ, కానన్ ఇండియా ఈసీఈఓ తోషియాకి నోమురాలు వివరించారు. ఫిట్స్ రావడంతో బావిలో పడ్డ కార్మికుడి మృతి తిరువళ్లూరు: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ఫిట్స్ రావడంతో బావిలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని కారణి గ్రామానికి చెందిన సూర్య(24). ఇతను అత్తిపేడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా ఇతడికి పదేపదే పిట్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం మద్యాహ్నం స్నేహితులతో కలిసి సరదాగా ఈత కోసం బావి వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. దాదాపు పది మంది స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. అనంతరం అందరూ బావిలో నుంచి పైకి రాగా సూర్య మాత్రం మరి కొంతసేపు ఈత కొట్టి వస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సమయంలోనే సూర్యకు పిట్స్ వచ్చి భావిలో ముగినిపోయాడు. సమయం దాటుతున్నా బయటకు రాకపోవడంతో స్నేహితులు బావిలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది బావిలో గాలించి సూర్య మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు బావిలో మునిగి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.14.65 లక్షలు మాయం ముగ్గురు తెలంగాణకు చెందిన ముగ్గురి అరెస్టు తిరువళ్లూరు: విశ్రాంతి పొందిన ఉద్యోగి ఖాతా నుంచి రూ. 14.65 లక్షల కాజేసిన ముగ్గురు తెలంగాణకు చెందిన యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి ప్రాంతానికి చెందిన నటరాజన్(67). ఇతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి విశ్రాంతి పొందాడు. ఈ క్రమంలో ఇతడి ఖాతా నుంచి గత కొద్ది రోజుల క్రితం రూ. 14.65 లక్షలు మాయమైనట్టు గుర్తించి షాక్కు గురయ్యాడు. ఈ సంఘటనపై భాదితుడు ఆవడి పోలీసు కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. పోలీసుల విచారణలో విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ. 14.65 లక్షలు తెలంగాణాకు చెందిన జంగం నవీన్కుమార్, కోటా భానుప్రకాష్, గట్టం రాఘవేంద్ర తదితర ముగ్గురు కలిసి ఆన్లైన్ ద్వారా కాజేసినట్టు గుర్తించి వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ తిరువొత్తియూరు: మహిళ వద్ద రూ.300 లంచం తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సస్పెండయ్యాడు. రాణిపేట జిల్లా ఆర్కాట్ టౌన్ పోలీస్స్టేషన్న్లో హెడ్ కానిస్టేబుల్ కల్పన. ఈమె వాలాజా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రమాదాలు, వివిధ సమస్యలకు సంబంధించి నమోదయ్యే కేసుల సమాచారాన్ని పోలీసు విభాగానికి అందించే విధుల్లో వున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం, ఒక గొడవలో గాయపడిన మహిళ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీస్స్టేషన్న్కు తెలియజేయడానికి, కల్పన తన బంధువుకు చెందిన గూగుల్ పే నంబర్కు రూ.300 పంపాలని లంచం డిమాండ్ చేశారు. మహిళ నగదుపంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై విచారణ జరిపిన ఎస్పీ సిబిన్, హెడ్ కానిస్టేబుల్ కల్పనను బుధవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఆర్థిక పరిస్థితులపై సీఎం విజయ్ అధ్యయనం
సాక్షి, చైన్నె : సీఎం విజయ్ ప్రభుత్వానికి మొదటి సవాల్గా ఆర్థిక పరిస్థితులు మారున్నాయి. గురువారం జరిగిన అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలు తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై కలవరాన్ని రేపినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఐదు దశాబ్దాల ద్రవిడ కోటను బద్దలు కొట్టిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి ఆర్థిక పరీక్ష అన్నది మున్ముందు ఎదురు కానున్నట్టు చర్చ ఊపందుకుంది. కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వం తాజాగా వాగ్దానాల అమలు విషయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కొత్త పరిపాలన యంత్రాంగం సజావుగా సాగాలంటే, ప్రస్తుతం తమిళనాడు ఎదుర్కొంటున్న తీవరౖమైన ఆర్థిక వాస్తవాలను, సవాళ్లను అధిగమించాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం పటిష్టమైన విధానపరమైన నిర్ణయాలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ ఎంతో అవసరమని చెబుతున్నారు. గురువారం సీఎం విజయ్ ఆర్థిక శాఖ వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరపడం గమానార్హం. ఇందులో ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలు,రాష్ట్ర అప్పుల నిర్వహణ అంశాలు సవాల్గా మారి ఉన్నట్టుగా అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వానినికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టాస్మాక్ మద్యం దుకాణాల దశలవారీగా మూతపనులు వేగవంతం చేశారు. 717 దుకాణాల మూతకు తాజాగా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గతరెండు రోజులలో వందకు పైగా దుకాణాలను ఇందులో మూసి వేశారు. అలాగే, 21 సంవత్సరాలలోపు వారికి మద్యం విక్రయించ కూడదంటూ టాస్మాక్ దుకాణాలసిబ్బందికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హెచ్చరికలు వెళ్లారు. ఎవరైనా విక్రయించిన పక్షంలో వారిపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. -
కోలాహలం.. గంగమ్మ రథోత్సవం
వేలూరు: వేలూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగమ్మ ఆలయ జాతర రథోత్సవం గురువారం ఉదయం కోలాహలంగా జరిగింది. ప్రతి ఏడాది తమిళ వైకాశి మాసం మొదటి వారంలో జాతర నిర్వహించడం ఆనవాయితీ. జాతరలో భాగంగా శుక్రవారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనున్న నేపథ్యంలో గురువారం ఉదయం అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. ఆలయం ముందున్న రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి అమ్మవారిని అందులో ఆశీనులు చేసి పట్టణ వీధుల్లో భక్తులు రథాన్ని లాగారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు వివిధ వేషధారణలు ధరించి అమ్మవారికి అంబలి పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రథం సాయంత్రం అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శివరామన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనుంది. సాయంత్రం అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సును విడదీసే కార్యక్రమం, బాన వేడుకలు జరగనున్నాయి. -
విలక్షణ నటనతో పబ్లిక్ స్టార్గా..!
తమిళసినిమా: ఏ తరహా పాత్రలు అయినా పోషించే వారే నటులు. అందుకే చాలా మంది హీరోలుగా కాకుండా మంచి నటులు అనిపించుకోవాలని కోరుకుంటారు. అలాంటి కోవకు చెందిన నటుడు దురై సుధాకర్. అందుకే ఈయన్ని అభిమానులు పబ్లిక్ స్టార్ సుధాకర్ అని పిలుస్తుంటారు. ఏ తరహా పాత్రలో నైనా తనదైన ముద్ర వేసుకునే దురై సుధాకర్ తప్పాట్టం చిత్రంలో గుబురు గడ్డంతో శోకమైన పాత్రలో నటించి ఆ పాత్రకు జీవం పోశారు. పలువురి ప్రశంసలు అందుకున్న పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ ఎక్స్ ప్లొట్ ఫామ్ అధినేత ఎలన్ మస్క్ నుంచి అభినందనలు అందుకున్నారు. అదేవిధంగా సర్గుణం దర్శకత్వంలో విమల్, ఓవియ జంటగా నటించిన కళవాణి – 2 చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపును పొందారు. నటి వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన డేనీ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి తన సత్తా చాటుకున్నారు. ఇలా పలు రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్న ఈయన తాజాగా మరోసారి ఎగ్జామ్ అనే వెబ్ సిరీస్లో నిజాయితీ పరుడైన పోలీస్గా కీలక పాత్రను నటించారు. పుష్కర్ –గాయత్రిలో ద్వయం తమ వాల్ వాచ్చర్ పతాకంపై సర్గుణం దర్శకత్వంలో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రైమ్ టైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తన పాత్రకు మంచి పేరు వస్తుందనే నమ్మకాన్ని పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ వ్యక్తం చేస్తున్నారు. -
కొలత్తూరులో రామ్రాజ్ కాటన్ పుట్ప్రింట్ విస్తరణ
సాక్షి, చైన్నె : సాంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన రామ్రాజ్ కాటన్ చైన్నెలో తన రిటైల్ ఉనికి మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొలత్తూరులో రిటైల్ పుట్ప్రింట్ను విస్తరించింది. దీనిని ఆర్ఆర్ గ్రూప్ చైర్మన్ డి దురై మురుగన్, బాలాజీ డెక్కర్స్కు చెందిన మురళీ, సునీత దంపతులు దీనిని గురువారం ప్రీమియం కాటన్ ఫ్యాబ్రిక్తో రూపొందించిన రామ్రాజ్ విస్తృత శ్రేణి సంప్రదాయ వస్త్రాలను ఇక్కడ కొలువు దీర్చారు. కార్యక్రమంలో తమిళనాడు ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి రవి, కొలత్తూరు సాండ్ ట్రక్ ఓనర్స్అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీ రమణన్ తదితరులు పాల్గొన్నారు. రామ్రాజ్ వ్యవస్థాపకుడు కేఆర్ నాగరాజన్ మాట్లాడుతూ, చైన్నెలోని కొలత్తూరులో తమ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు అత్మీయంగా ఆహ్వానించారని, సాంప్రదాయ దుస్తులు కుటుంబ వేడుకలు సంస్కృతికి దగ్గరగా ఎల్లప్పుడు విశ్వసిస్తామన్నారు. -
అడ్వకేట్ జనరల్గా విజయ్ నారాయణ్
● బాధ్యతల స్వీకరణ సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వ నూతన అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది విజయ్ నారాయణ్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కీలక నియామకం జరిగింది. వివరా లు.. శాసనసభ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పి.ఎస్. రామన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ పదవిలో విజయ్ నారాయణ్ను నియమిస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మద్రాస్ హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు. విజయ్ నారాయణ్ ప్రస్థానం.. విజయ్ నారాయణ్ ప్రముఖ న్యాయవాద కుటుంబం నుంచి వచ్చారు. రాజ్యాంగ నిపుణుడు ఎం.కె. నంబియార్ మనవడు, ప్రస్తుత భారత అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్కు ఆయన సమీప బంధువు. ప్రసిద్ధ చరిత్రకారుడు సర్దార్ కె.ఎం. పణిక్కర్ ఆయకు మామయ్య అవతారు. బిహార్లో పాఠశాల విద్య, చైన్నె లయోలా కళాశాలలో డిగ్రీ, మద్రాస్ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 2004లో మద్రాస్ హైకోర్టు ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. లేబర్ లా, రాజ్యాంగ చట్టం, వాణిజ్య చట్టాలలో ఆయనకు విశేష అనుభవం ఉంది. గతంలో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వ హయాంలో (2017 – 2021) కూడా తమిళనాడు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. మద్రాస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు అందించడంలో, కోర్టుల్లో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించడంలో విజయ్ నారాయణ్ కీలక పాత్ర పోషించనున్నారు. -
గులాబీల బొమ్మ.. కనులకు విందమ్మా..!
సేలం: ఊటీ రోజ్ గార్డెన్లో 21వ గులాబీల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఇందులో 70,000 గులాబీలతో తయారు చేసిన హంసల జంట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నీలగిరి జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కావడం, పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, వార్షిక వేసవి ఉత్సవంలో మొదటి కార్యక్రమమైన 21వ గులాబీల ప్రదర్శన ఈరోజు ఊటీ రోజ్ గార్డెన్లో ఆరంభమైంది. నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య ఈ ప్రదర్శనను ప్రారంభించి, పార్కులో ఏర్పాటు చేసిన పూల అలంకరణలను పరిశీలించారు. ఈ ఏడాది ప్రదర్శన ప్రధాన ఆకర్షణ ’పక్షుల స్వర్గం’ అనే ఇతివృత్తం. ఇందులో 2 లక్షల గులాబీలను వివిధ పక్షి జాతుల ఆకారంలో అమర్చారు. 70 వేల గులాబీలతో చేసిన హంసల జంట పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా, గద్ద, రెండు కాలి ఫాల్కన్, బుల్ఫించ్, ప్యారడైజ్ ఫ్లైక్యాచర్, టుకానన్ పిచ్చుక, హనీఈటర్, మలబార్ రెండు కాలి ఫాల్కన్, నీలగిరి లాఫింగ్ త్రష్ వంటి మొత్తం 14 పక్షి జాతులు ప్రదర్శనలో ఉన్నాయి. అదనంగా, ఈ ప్రదర్శనలో ’యాంగ్రీ బర్డ్స్’ వంటి కార్టూన్లు కూడా ఉన్నాయి. పార్క్ అంతటా, 4,310 రకాలకు చెందిన 33,000 గులాబీ మొక్కలు వేలాది రంగులలో వికసించి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రదర్శన ప్రారంభమైన మొదటి రోజు నుంచే పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శించి ఆనందిస్తున్నారు. గతేడాది 3 రోజుల పాటు జరిగిన గులాబీల ప్రదర్శన, ఈ ఏడాది 5 రోజుల పాటు సాగనుంది. ఈనేపథ్యంలో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
రూ.2 వేల కోట్ల ఆదాయం దిశగా సీఐఈఎల్ పయనం
సాక్షి, చైన్నె: ప్రముఖ హెచ్ఆర్, వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ 2026 ఆర్థిక సంవత్సరంలో అద్భుత ఫలితాలను నమోదు చేసింది. 32 శాతం వృద్ధి నమోదుతో రూ. 2 వేల కోట్ల ఆదాయానికి చేరువైంది. గురువారం సీఐఈల్ హెచ్ఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కె పాండియరాజన్ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా కంపెనీ తన ప్రతిష్టాత్మక లక్ష్యంగా సీఐఈఎల్ 3.ఓ విజన్ 2030 రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. దీనిద్వారా 2030 నాటికి రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. ఏఐ–ఆధారిత వర్క్ఫోర్స్ పరివర్తనలో తన భవిష్యత్తు వృద్ధిని కేంద్రీకరించనున్నట్టు ఇందులో భాగంగా పీపుల్ఓఎస్ ఫ్రేమ్వర్క్ , జోంబాయ్.ఏఐ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా ఉద్యోగుల ఎంపిక నుండి అభివృద్ధి వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నట్టు వివరించారు. కేవలం 9 సంవత్సరాలలో రూ.1000 కోట్లను అందుకున్న తాము తాజాగా 2 వేల కోట్లకు చేరువయ్యామని పేర్కొన్నారు. -
మొన్నే సీఎంగా ప్రమాణం.. అప్పుడే విజయ్ బిగ్ బొనాంజ ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బిగ్ బొనాంజా ప్రకటించారు. గురువారం డియర్నెస్ అలవెన్స్ (డీఏ)లో 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2026, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.సమాచార, ప్రజాసంబంధాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సవరించిన డీఏ వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తమిళనాడు సీఎంవో ఎక్స్ ఖాతాలో వివరించారు.డీఏ పెంపు ఇలా..తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 2 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 60 శాతానికి చేరింది. దీనితో పోల్చితే బ్యాంకు ఉద్యోగులకు సుమారు 0.70 పాయింట్ల స్వల్ప పెంపు మాత్రమే లభించింది. దీంతో వారికి వచ్చే నగదు ప్రయోజనం తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణానికి వేర్వేరు రంగాలు ఎలా స్పందిస్తున్నాయో ఈ తేడా చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సుల్లో ఎక్కువ సవరణ లభించింది. ఈ నిర్ణయం వల్ల ఏటా అదనంగా సుమారు రూ. 1,230 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం, పెన్షన్ బాధ్యతలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.அரசு அலுவலர்கள் மற்றும் ஆசிரியர்களுக்கு 58சதவீதமாக உள்ள அகவிலைப்படி 01.01.2026 முதல் 60 சதவீதமாக உயர்த்தி வழங்கப்படும் என மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் அறிவிப்பு#CMJosephVijay pic.twitter.com/jspnkFOKLS— CMOTamilNadu (@CMOTamilnadu) May 14, 2026 -
ఆదిమూలపు సురేష్ సతీమణి విజయలక్ష్మికి భారీ పదోన్నతి
సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి ఇన్కంట్యాక్స్ చీఫ్ కమిషనర్గా 1992 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారిణి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సతీమణి టీహెచ్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈనెల 11వ తేదీ ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 33 సంవత్సరాలుగా ఇన్కంట్యాక్స్ అధికారిణిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఆయా స్థానాలకు వన్నెతెచ్చిన ఉత్తమ అధికారిణిగా గుర్తింపు పొందారు. తన విధి నిర్వహణలో జాయింట్ కమిషనర్గా బెంగళూరు, రాయచూర్లలో, అడిషనల్ కమిషనర్గా కర్నూలులో, కమిషనర్గా చెన్నైలో, ప్రిన్సిపల్ కమిషనర్గా హైదరాబాద్లో విధులు నిర్వహించారు. విజయలక్ష్మి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈసీఈ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎం బెంగళూరులో ఎంబీఏ కోర్సు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ప్రజా విధానాలపై సింగపూర్ యూనివర్సిటీ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక డిగ్రీ సాధించారు. -
ఎంజీఆర్.. జయ.. పళని.. అది షరా మామూలే!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో చీలిక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 24 మంది మద్దతు ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ఈ తరుణంలో వాళ్లను కీలక పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఆ పార్టీలో ‘చీలిక’ కొత్తేమీకాదు. కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడేందుకు అన్నాదురై నేతృత్వంలో డీఎంకే పేరిట తమళనాట తొలి ప్రాంతీయ ద్రావిడ పార్టీ ఆవిర్భవించిన కాలం నుంచి చీలిక పర్వం సాగుతున్నది. డీఎంకే దివంగత అధ్యక్షుడు కరుణానిధితో పొడసూపిన విభేదాల కారణంగా సినీ నటుడు ఎంజీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పార్టీ అన్నాడీఎంకే. ఎంజీఆర్ జీవించి ఉన్నంత కాలం సైన్యం తరహాలో కదిలిన ఈ పార్టీ ఆయన మరణానంతరం తదుపరి చీలికను ఎదుర్కొంది. 1972లో పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి వరకు అనేకసార్లు వర్గ పోరును ఎదుర్కొంది. ఈ సమయంలో రెండుసార్లు అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ స్తంభింపచేసింది. ఆ చీలిక పర్వం సాగిందిలా.. ∙1972 అక్టోబర్ 18న డీఎంకే నుంచి బహిష్కరణకు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) పార్టీని స్థాపించారు. ∙1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణంతో ఆయన సతీమణి జానకీ రామచంద్రన్, పార్టీ ప్రచార కార్యదర్శి జయలలిత మధ్య తలెత్తిన విభేదాలు అన్నాడీఎంకే చీలికకు దారి తీసింది. 1988లో నాటి ఎంజీఆర్ విశ్వాసపాత్రుడు ఆర్ఎం వీరప్పన్ 98 మంది ఎమ్మెల్యేలతో జానకి వర్గానికి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు జరగడంతో అప్పట్లో రాష్ట్రపతి పాలన విధించారు. ∙1989 ఎన్నికలలో జయలలిత వర్గం 27 సీట్లు గెలవగా.. జానకి వర్గం 1 సీటుకే పరిమితమైంది. ఆ సమయంలో అన్నాడీఎంకే రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా స్తంభింపచేసింది. దీంతో జానకి రాజకీయాల నుంచి తప్పుకోగా పార్టీ జయలలిత నాయకత్వం గుప్పెట్లోకి చేరింది. ∙1990లో పార్టీ సీనియర్ నేత తిరునావుక్కరసు తిరుగుబాటుతో జయలలిత ఆయనను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. తన రాజకీయ గురువు పేరిట ఆయన ‘ఎంజీఆర్ ఏడీఎంకే’ను స్థాపించారు. ∙1995లో జయలలితతో విభేదాల నేపథ్యంలో ఆర్ఎం వీరప్పన్ పార్టీ నుంచి విడిపోయి ‘ఎంజీఆర్ కళగం’ఏర్పాటు చేశారు. ఆ తరువాత అన్నాడీఎంకే పూర్తిగా జయలలిత వశమైంది. ∙2011 ఎన్నికలలో గెలుపొందిన అన్నాడీఎంకే 2016 ఎన్నికలలో మరోసారి గెలిచి చరిత్ర సృష్టించిన జయలలిత నిష్క్రమణతో అన్నాడీఎంకేలో మళ్లీ చీలిక మొదలైంది. ∙2016 డిసెంబర్ 5న జయలలిత మరణం పార్టీలో చీకటి రోజుగా మిగిలింది. జయలలిత జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన సమయంలో ఆమె నమ్మిన బంటు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఆమె మరణంతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ∙జయలలిత మరణానంతర పరిణామాలతో 2017 ఫిబ్రవరిలో ఆమె నెచ్చెలి శశికళ సీఎం కావాలనుకోవడంతో పన్నీరు సెల్వం ధర్మయుద్ధం చేశారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. అనంతరం అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా.. కూవత్తూరులో జరిగిన రాజకీయ క్యాంప్తో పళణిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం నేపథ్యంలో చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మరోమారు స్తంభింపబడింది. ∙2017 ఆగస్టులో సీఎం పళణిస్వామి , పన్నీరు సెల్వం ఏకమయ్యారు. వీరి కలయికతో అదే ఏడాది మరోసారి పారీ్టలో చీలిక తప్పలేదు. శశికళ ప్రతినిధి దినకరన్ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఈ చీలిక నెలకొంది. ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి ఆవిర్భవించినదే అమ్మమక్కల్ మున్నేట్ర కళగం. ∙2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత మరోసారి అన్నాడీఎంకేలో చీలిక తప్పలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య ఏకనాయకత్వం విషయంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణం. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కోసం ఇయక్కం పేరిట శిబిరంతో రాజకీయాన్ని సాగించారు. ∙2022–23 మధ్యకాలంలో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత పళణి స్వామి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుని లోక్సభ ఎన్నికలను ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇదే వరుసలో తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు, ఉప ఎన్నికలలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. ∙ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో.. 2026లో పళనిస్వామి నాయకత్వం బలహీనపడింది. ఇదే సమయంలో పార్టీలో కీలక నేతగా ఉన్న ఎస్పీ షణ్ముగం నాయకత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు విడిపోవడంతో పార్టీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బుధవారం అసెంబ్లీ వేదికగా పళణిస్వామి ఆజ్ఞను ఆ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ధిక్కరించారు. టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంతే కాదు, పార్టీని సైతం కైవశం చేసుకునే దిశగా సర్వసభ్య సమావేశానికి ఈ ఎమ్మెల్యేల శిబిరం పిలుపునివ్వడం కొసమెరుపు. -
చిత్ర పౌర్ణమి హుండీ ఆదాయం రూ. 4.33 కోట్లు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీలో రూ. 4 కోట్ల 33 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి అనంతరం హుండీలో భక్తులు చెల్లించిన ఆదాయాన్ని లెక్కించడం ఆనవాయితీ. అందులో భాగంగా గత నెల 31న చిత్ర పౌర్ణమి ప్రారంభమై నెల ఒకటివ తేదీ ముగిసింది. దీంతో హుండీ ఆదాయాన్ని ఆలయ జెసి భరణీధరన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు లెక్కించారు. వీటిలో రూ: 4 కోట్ల 33 లక్షల 72,935 నగదు, 165 గ్రాముల బంగారం, 1,240 గ్రాముల వెండి, ఇతర దేశాలకు చెందిన కరెన్సీ నోట్లుతో పాటు ఆదాయం వచ్చినట్లు ఆలయ జేసీ తెలిపారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలో జమచేసిన నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో ప్రత్యేక నిఘా కెమెరాలు ఉంచి లెక్కింపు చేశారు. అదే విధంగా గత నెల చిత్ర పౌర్ణమి కావడంతో భక్తులు అధికసంఖ్యలో ఆలయ సమీపంలోని 14 కిలోమీటరు దూరంలో గల గిరివలయం రోడ్డును తిరిగి వచ్చారు. దీంతో ఆలయ అధికారులచే గిరివలయం రోడ్డు, ఆలయ ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనపు హుండీలను ఏర్పాటు చేయడంతో ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.ఇంటెలిజెన్స్ ఐజీగా అష్రాకార్గ్ నియామకంసాక్షి. చైన్నె:తమిళనా డు పోలీస్ శాఖలో కీలకమైన ఇంటెలిజెనన్స్ ఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అష్రా గా ర్గ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉత్తర మండల ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను, ఈ కీల క పదవికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో ఐజీగా ఉన్న సెంథిల్ వేలన్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేసి, ఆయన స్థానంలో అవినాష్ కుమార్ను నియమించింది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త సారథిగా అష్రాకార్గ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ పాల్గొన్న కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన దురదృష్టకర సంఘటన అందరికీ తెలిసిందే. ఆ కేసు విచారణాధికారిగా అప్పట్లో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభు త్వం అష్రాకార్గ్ను నియమించింది. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వమే ఆయనను అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.జూన్ 19, 21 తేదీల్లో చైన్నె – తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దుకొరుక్కుపేట: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు సదరన్ రైల్వే ఓ ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. అరక్కోణంలో ట్రాక్ పనులు జరుగుతున్న దష్ట్యా చైన్నె – తిరుపతి మధ్య నడిచే అన్ని ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లను జూన్ 19 , 21 తేదీలలో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ చర్యకు కారణం, స్టేషన్ వర్క్షాప్లో ట్రాక్లపై చేపట్టనున్న సాంకేతిక నిర్వహణ పనులే కారణమని స్పష్టం చేసింది. ఈ పనులు అరక్కోణంలో ఈనెల 26వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నిరంతరాయంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా, జూన్ 19, 21 తేదీల్లో తిరుపతి– చైన్నె మధ్య నడిచే ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
నిన్న ఓఎస్డీ.. నేడు తొలగింపు
సాక్షి,చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన రాజకీయ వ్యవహారాల ప్రత్యేక అధికారిగా వ్యక్తిగత జ్యోతిష్కుడు రిక్కీ రతన్ పండిట్ వెట్రివేల్ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన విడుదలైంది. వివరాలు.. ముఖ్యమంత్రి విజయ్కు అత్యంత సన్నిహితుడైన రిక్కీ రతన్ పండిట్ను ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ మంగలశారం జీవో జారీ అయింది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ నియామకం అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఒక జ్యోతిష్కుడిని ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక పదవిలో నియమించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో పాటు, ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అసెంబ్లీలోడీఎండీకే తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. సామాజిక మాధ్యమాలలో సైతం విజయ్కు వ్యతిరేకంగా సైటెర్లు వేసే వారు పెరిగారు. తగ్గిన ప్రభుత్వం ప్రతి పక్షాలు, అసెంబ్లీలో మిత్రుల నుంచి సైతం వ్యతిరేకత రావడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, రతన్ పండిట్ నియామక ఉత్తర్వులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. నీట్ రద్దుకు పట్టు నీట్ రద్దు చేయా లని తమిళనా డులోని పలు రాజకీయ పార్టీల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే నీట్ రద్దు చేయాలని, ప్లస్–2 మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం విజయ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ’నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శిస్తూ, నీట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ఈ పరీక్షను రద్దు చేయడం లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కూడా ఇలాగే ప్రశ్నపత్రం లీకై సీబీఐ విచారణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. నీట్ పరీక్ష వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు, తమిళ మీడియం విద్యార్థులు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని నీట్ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించకుండా రద్దు నిర్ణయం తీసుకోవాలన్నారు. -
విశ్వాస పరీక్షలో అధికార, ప్రతిపక్షాల కౌంటర్లు
విజయ్కే గెలుపు.. విపక్షాలు, ప్రతి పక్షాల చర్చ, ప్రసంగ అనంతరం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆరు డివిజన్లుగా ఓటింగ్కు చర్యలు తీసుకున్నారు. డీఎంకేతో పాటూ ఆ పార్టీ చిహ్నంలో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు, డీఎండీకే వాకౌట్ చేశారు. ఈ కూటమిలోని ఎండీఎంకే సభ్యుడు సభకు రాలేదు. దీంతో సభలో సంఖ్యా బలం 171కి చేరింది. ఈ ఆరు డివిజన్ల ఓటింగ్లో విజయ్ విశ్వాస పరీక్షకు మద్దతుగా 144 ఓట్లు పడ్డాయి. 22 మంది వ్యతిరేకంచగా, బీజేపీ, పీఎంకేలు తటస్థంగా వ్యవహరించాయి. విజయ్కు మద్దతుగా నిలిచిన వారిలో 25 మంది అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం– ఎస్పీవేలుమణి శిబిరానికి చెందిన వారు కావడం గమనార్హం. సాక్షి, చైన్నె: గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విధించిన నిబంధన మేరకు.. సీఎం సీ జోసెఫ్ విజయ్ బుధవారం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్నారు. ఉదయం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ నేతృత్వంలో సభ ప్రారంభం కాగానే, సీఎం జోసెఫ్ విజయ్ తన విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించి అన్ని పార్టీల మద్దతు కోరారు. అదే సమయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆయా పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సమయంలో వ్యాఖ్యల తూటాలు హోరెత్తాయి. స్థిరమైన పాలన లక్ష్యంగా.. రాష్ట్రంలో స్థిరమైన లౌకిక పాలన అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, కిళ్లీయూరు ఎమ్మెల్యే రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంగా నిలిచిందన్నారు. ఈ తరుణంలో సీఎం విజయ్ కేవలం లౌకిక పార్టీల మద్దతును మాత్రమే కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే , ఐయూఎంఎల్ వంటి లౌకిక పార్టీలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం మేరకు, తమిళనాడులో లౌకిక విలువల పరిరక్షణ కోసం, విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రసంగించిన వీసీకే శాసన సభా పక్ష నేత వన్నియరసు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇందులో ప్రధానంగా డీఎంకే ప్రభుత్వ బృహత్తర పథకాలన్నీ కొనసాగాలని కోరారు. సీపీఎం చెల్లకుమార్, సీపీఐ తలి ఆర్ రామచంద్రన్, ఐయూఎంఎల్ ఏఎం షాజహాన్లు సైతం తమప్రసంగంలో గత ప్రభుత్వ బృహత్తర పథకాల అమలుకు విన్నవిస్తూ బయటి నుంచి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఇక, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే కామరాజ్ తన మద్దతును టీవీకేకు ప్రకటించారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదానికి దారి తీసినా ఆ తదుపరి స్పీకర్ సూచనతో ఆయన తగ్గారు. పళణికి షాక్ : మద్దతు..వ్యతిరేకత అసెంబ్లీలో అన్నాడీఎంకే తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి ప్రసంగిస్తూ, టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా వచ్చినప్పటికీ, రాష్ట్రంలోని 65 శాతం ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయలేదనే విషయాన్ని వివరించారు. తమ హయాంలో తీసుకొచ్చిన పథకాలను గుర్తు చేస్తూ, ప్రజలు తమ పార్టీకి చెందిన 47 మందిని గెలిపించారని గుర్తుచేశారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామన్న ఆశ చూపించి తన వైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. ‘మిమ్మల్ని మీరు ’పరిశుద్ధ శక్తి’గా చెప్పుకుంటున్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే చర్యలను ప్రోత్సహించకూడదని హితవు పలికారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, వీసీకే పార్టీలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవగా, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే మాత్రం విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నట్టు ప్రకటించారు.అదే సమయంలో పళణి స్వామి తదుపరి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణికి ప్రసంగించే అవకాశం స్పీకర్ కల్పించడం వివాదానికి దారి తీసింది. కాసేపు అన్నాడీఎంకేలోని పళణి శిబిరం, సీవీ షణ్ముగం– ఎస్పీ వేలుమణి శిబిరం ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం ముదరడంతో స్పీకర్ తన కుర్చీ నుంచి లేని నిలబడి మరీ అందరూ కూర్చోవాల్సిందేనని హెచ్చరించారు. దీంతో ఇరు పక్షాల ఎమ్మెల్యేలు శాంతించారు. అనంతరం ఎస్పీ వేలుమణి మాట్లాడుతూ, తనను ఐదవసారి గెలిపించిన తొండముత్తూరు ప్రజలకు కృతజ్ఞతలు. తాము పదవుల కోసం ఆశపడటం లేదని స్పష్టం చేశారు. 54 సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నట్టు వివరించారు. తమ మా పోరాటం ఎప్పుడూ డీఎంకేతోనే అని పేర్కొంటూ, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతకుముందే ఎడప్పాడి పళనిస్వామి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించగా, దానికి భిన్నంగా వేలుమణి మాట్లాడటం అన్నాడీఎంకేలో చీలికను స్పష్టం చేసింది. కాగా తన ఆజ్ఞలను ధిక్కరించి సభలో విజయ్కు మద్దతుగా వ్యవహరించిన 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలకు పళణిస్వామి శిబిరం అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఇన్స్టా కాదు..రియల్ పాలన కావాలి: ఉదయ నిధి తమిళనాడు శాసనసభలో జరిగిన విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత, డీఎంకే యువజననేత ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వం ప్రజల పూర్తి మద్దతుతో ఏర్పడింది కాదని, కేవలం రాజకీయ సమీకరణాల వలన మనుగడలో ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో 4.93 కోట్ల మంది ఓట్లు వేయ గా, టీవీకేకు కేవలం 1.72 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. అంటే దాదాపు 3.21 కోట్ల మంది (65 శాతం ప్రజలు) తమరిని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఓటు వేసిన వారికి కూడా ప్రస్తుతం తమరిపై నమ్మకం సన్నగిళ్లుతున్నట్టు పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వం తన కాళ్ల మీద తాను నిలబడలేదని, డీఎంకే కూటమిలోని పార్టీల బయటి మద్దతుతోనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పాలన రాకూడదనే ఉద్దేశంతోనే వారు మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఉదయనిధి ఆరోపించారు. మార్పు తెస్తామని చెప్పారని, ఇప్పుడు అది కేవలం మార్పిడి వలే కనిపిస్తున్నదన్నారు. కూవత్తూరు రాజకీయాలను మించి తమరు చేస్తున్న డ్రామాలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో హడావుడి చేయడంపై మండిపడుతూ.. పాలన అనేది ఇన్స్ట్రాగామ్ రీల్స్ లాగా ఉండకూడదు, నిజమైన పాలనలా ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. డీఎంకే హయాంలో అమలు చేసిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, ఈ విశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా తాము వాకౌట్ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రత్యేక అధికారి నియమాకంపై వివాదం తన పార్టీకి చెందిన అధికార ప్రతినిధి, జ్యోతిష్కుడైన రిక్కి రతన్ పండిట్ వెట్రి వేల్కు ప్రభుత్వ ఓఎస్డీ పదవి కేటాయించడాన్ని అసెంబ్లీలో డీఎండీకే సభ్యురాలైన ప్రేమలత విజయకాంత్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మద్దతు కోసం గుర్రపు పందెం తరహాలో పదువులు అంటూ బేరసారాలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొంటూ, పలు ప్రశ్నలను సంధించారు. మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్ అన్సారీ, మనిదనేయ మక్కల్ కట్చి ఎమ్మెల్యే జవహిరుల్లా సైతం ప్రత్యేక అధికారి నియామకంపై విమర్శల తూటాలను పేల్చారు. ఇక, పీఎంకే సభ్యురాలు సౌమ్య అన్బుమణి ప్రసంగిస్తూ టాస్మాక్ మద్యం దుకాణాల మూతను ఆహ్వానిస్తూ సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలని కోరుతూ కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. విమర్శలకు ధీటుగా విజయ్ సమాధానం విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రసంగిస్తూ, విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ’మైనారిటీ ప్రభుత్వం’ అని పిలిస్తే తాము దానికి సంతోషిస్తామని, ఎందుకంటే ఇది మైనారిటీ ప్రజల హక్కులను కాపాడే ప్రభుత్వమని ఆయన ఉద్ఘాటించారు. ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లిన తమ ఓటు బ్యాంకు 34.92 శాతానికి చేరడం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ఈ ఒంటరి విప్లవం నేడు విజిల్ విప్లవంగా మారిందని, ఈ మూడు సంవత్సరాలలో తమకు 1.72 కోట్ల మంది మద్దతుగా నిలిచారని, ఈ ప్రజల ఆశయాలను నెరవేరుస్తాం అని హామీ ఇచ్చారు. పెరియార్, కామరాజర్, అంబేడ్కర్, వేలునాచియార్, అంజలై అమ్మాళ్ వంటి మహానుభావుల ఆదర్శాలతో ’మనఃసాక్షి ఉన్న ప్రజాస్వామ్యాన్ని అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం, మతాతీత విధానాలే తమ ప్రభుత్వానికి పునాదులని చెప్పారు. ఆవేశంగా సమాధానాలు చెప్పే కంటే, ధైర్యంగా పనులు చేసి ఫలితాల ద్వారా తమ సమాధానం చెబుతామని, తమది అధికారం చూపించి బెదిరించే ప్రభుత్వం కాదన్నారు. అందరినీ ప్రేమతో కలుపుకుపోయే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. -
సదరన్ రైల్వేకు.. కొత్త చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
కొరుక్కుపేట: సదరన్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా ఎస్.ఎన్. నారాయణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకానికి ముందు, ఎస్.ఎన్. నారాయణ్ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు , పర్యాటక శాఖ సహాయ మంత్రి గారికి డిప్యుటేషన్పై ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2010 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐ ఆర్ టి ఎస్) అధికారి అయిన ఎస్.ఎన్. నారాయణ్, ఇండియన్ రైల్వేస్లో ప్రయాణికుల సౌకర్యాలు, కార్యాచరణ సామర్థ్యం, డిజిటల్ కమ్యూనికేషన్ , పబ్లిక్ ఇంటర్ఫేస్కు సంబంధించిన అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. ఎస్.ఎన్. నారాయణ్ దక్షిణ రైల్వేలోని వివిధ డివిజన్లలోని ఆపరేషన్స్ అండ్ కమర్షియల్ విభాగాలలో పలు హోదాలలో పనిచేశారు. ఆ తర్వాత, ఆయన న్యూఢిల్లీకి డిప్యూటేషన్పై వెళ్లి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని బయోటెక్నాలజీ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా, గౌరవనీయ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు అండ్ పర్యాటక శాఖ సహాయ మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. దక్షిణ రైల్వేలో తన పదవీకాలంలో, ఆయన తిరుచ్చి డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, దక్షిణ రైల్వే డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (ట్రాఫిక్ సేఫ్టీ), చైన్నె , పాలక్కాడ్ డివిజన్లలో డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సేలం డివిజన్లో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ వంటి పలు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించిన ఆయన భారతీయ రైల్వేకు చెందిన అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు విధానపరమైన కార్యక్రమాల అమలులో కూడా పాలుపంచుకున్నారు. ఎస్.ఎన్. నారాయణ్ కోయంబత్తూరులోని పి.ఎస్.జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీని పొందారు. ఆయన స్థానంలో ఇంతకుముందు పనిచేసిన ఎం. సెంథమిల్ సెల్వన్, ఇప్పుడు రాయపురం లోకో షెడ్లో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నియమితులయ్యారని బుధవారం ఒక ప్రకటనలో సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓం ప్రకాష్ వెల్లడించారు. -
అథ్లెటిక్స్ నేపథ్యంలో ‘అంగీకారం’
తమిళ సినిమా: అథ్లెటిక్స్ క్రీడల నేపథ్యంలో చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది. కాగా తాజాగా ఆ క్రీడ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం అంగీకారం. ఈ చిత్రం ద్వారా ఇంతకు ముందు పలు చిత్రాలకు నిర్మించిన కేజేఆర్ హీరోగా అవతారమెత్తారు. స్వస్తిక్ విజువల్స్ పతాకంపై ఈయన నిర్మించి కథానాయకుడుగా నటించిన ఈ చిత్రం ద్వారా తెన్ పాదియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు పా.రంజిత్ శిష్యుడు అన్నది గమనార్హం. నటి విజీ వెంకటేష్, అజిత్ ఘోషీ,సిందూరి విశ్వనాథ్ హీరోయిన్ నటించగా, ఆంటోని, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీఖాన్ , మోహన్ రామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన కార్యక్రమంలో దర్శకుడు తెలుపుతూ పలు యదార్థ ఘటనల ఆధారంగా అథ్లెటిక్స్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అంగీకారం అని తెలిపారు. చిత్రంలో అథ్లెటిక్స్ క్రీడాకారులు ఎదుర్కొనే ఆటంకాలు, ఈక్రీడా రంగంలో జరిగే అవకతవకలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రం గా ఇది ఉంటుందన్నారు. ఒక క్రీడాకారుడు తనకు జరిగిన అన్యాయానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే చిత్ర ప్రధాన అంశమని తెలిపారు. ఈ చిత్రం కోసం రూ. 75 లక్షల వ్యయంతో భారీ కోర్టు సెట్ వేసి ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా చిత్ర ట్రైలర్ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అంగీకారం చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని, ఎ. విశ్వనాథ్ ఛాయాగ్రహణం అందించారు. అంగీకారం చిత్రంలో కేజేఆర్ -
కాన్స్ చిత్రోత్సవాల్లో డీసీ చిత్ర ట్రైలర్
తమిళసినిమా: మానగరం చిత్రంతో దర్శకుడిగా మారిన బ్యాంకు ఉద్యోగి లోకేష్ కనకరాజ్ అన్ని విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో లోకేష్ కనకరాజ్ జీవితమే మారిపోయింది. ఆ తరువాత కార్తీ హీరోగా ఖైదీ, విజయ్ కథానాయకుడిగా మాస్టర్, కమలహాసన్ హీరోగా విక్రమ్, వంటి భారీ చిత్రాలు చేసి స్టార్ డైరెక్టర్గా ఎదిగిపోయారు. అలాంటిది ఇటీవల రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు బాగా దెబ్బతింది. దీంతో షారూఖ్ ఖాన్ హీరోగా చేయాల్సిన హిందీ చిత్రం ఆగిపోయింది. రజినీకాంత్, కమలహాసన్ కలిసి నిర్మించనున్న చిత్రం వేరే దర్శకుడి చేతిలోకి వెళ్లి పోయింది. అలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేసే అవకాశం రావడం లోకేష్ కనకరాజ్ కాస్త ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం ప్రారంభం కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ కనకరాజ్ హీరోగా అవతారమెత్తి డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి వామికా కబి నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ మాదేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఇందులో నటి వామిక వేశ్య పాత్రలో నటిస్తున్న సమాచారం. కాగా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇకపోతే చిత్ర ట్రైలర్ను ఈనెల 15వ తేదీన కాన్స్ చిత్రోత్సవాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. చిత్రం త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
క్లుప్తంగా
మిన్నంటిన జాతర సంబరం పళ్ళిపట్టు: పొదటూరుపేటలో గంగమ్మ జాతర వేడుకలు సందర్భంగా మహిళలు అమ్మవారికి పొంగళ్లు పెట్టి దర్శించుకున్నారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేటలో చైత్ర మాసంలో గంగమ్మ జాతర వేడుకలు నిర్వహించడం పరిపాటి. శుక్రవారం ధ్వజారోహణంతో ప్రారంభమైన జాతర వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారికి విశేష అలంకరణ చేపట్టి మహాదీపారాదనణ పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి అంబలి సమర్పించి ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయం వద్ద ఆధ్మాత్మిక కచ్చేరి నిర్వహించారు. బుధవారం సాయంత్రం అమ్మవారికి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. గంగమ్మ జాతర వేడుకలు సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ప్రసాదాలు అన్నదానం పంపిణీ చేశారు. రైల్వేలో ఉద్యోగం పేరిట రూ.10.80 లక్షలు మోసం తిరువళ్లూరు: రైల్వేలో నర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 10.80 లక్షలు మోసం చేసిన వ్యవహరంలో యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు గ్రామానికి చెందిన జయశీలన్ కుమార్తే జయప్రియ(24). ఈమె వద్ద చైన్నె తాంబరం ప్రాంతానికి చెందిన జగన్నాథన్ కుమారుడు రోహిత్ తనకు రైల్వేలో ఉన్నత అధికారి వద్ద పరిచయం వుందని తద్వారా రైల్వేలో నర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.10.80 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనంతరం జయప్రియకు నకిలీ ఉత్తర్వులను సైతం ఇచ్చాడు. అయితే ఆలస్యంగా మోసపోయామని భావించి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్(29)ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మద్యం మత్తులో భర్త దారుణం.. తిరువొత్తియూరు: కుటుంబ కలహాల కారణంగా ఏర్పడిన గొడవలో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా ఆత్తూరుకు చెందిన మణికంఠన్ (37), అతని భార్య కృష్ణవేణి (23) కేరళలోని ఒత్తపాలయంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. మణికంఠన్ తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈనెల 10వ తేదీ రాత్రి కూడా మణికంఠన్ మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో మణికంఠన్ కృష్ణవేణి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. మరుసటి రోజు ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు లోపలికి వెళ్లి చూడగా, కృష్ణవేణి మృతి చెంది ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం పరీక్షలో ఆమె గొంతు నులిమి హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మణికంఠన్ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. దేవాలయం మరుగుదొడ్డిలో.. తిరువొత్తియూరు: వండలూర్ సమీపంలోని ఎం.జి.ఆర్ నగర్కు చెందిన ప్రభాకరన్ (47) మధురాంతకంలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య మేనక, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభాకరన్ రోజూ తన మోటార్ సైకిల్పై గుడువాంచేరి వరకు వెళ్లి, అక్కడ నుండి బస్సులో మధురాంతకం వెళ్లేవారు. బుధవారం ఉదయం కూడా ఎప్పటిలాగే బయలుదేరిన ఆయన, మార్గమధ్యంలో ఓ దేవాలయ ప్రాంగణంలో మరుగుదొడ్డిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుపయోగంగా.. రైతుబజార్లు
తిరువళ్లూరు: రైతులకు వినియోగదారులకు మధ్య దళారులను తొలగించి కూరగాయలు, పండ్లును నేరుగా విక్రయించుకోవడానికి అనుగుణంగా 1999వ సంవత్సరం నవంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వం అప్పటి సీఎం కరుణానిధి రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా రైతుబజారులను ప్రారంభించారు. కలెక్టర్ పర్యవేక్షణలో నడిచే రైతుబజార్లో రైతులు తాము పండించిన పంటలను నేరుగా విక్రయించుకోవచ్చు. తద్వారా రైతులకు 20 నుంచి 30 శాతం మేరకు అదనపు లాభాలు రావడంతో పాటు గిట్టుబాటు ధర లబించే అవకాశం ఉంది. దీంతో పాటూ మధ్యవర్తులతో సంబంధం లేకుండా రైతులు విక్రయించుకోవచ్చు. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో రైతుబజారును ఏర్పాటు చేశారు. మొదట్లో రైతు బజారుకు రావడానికి రైతులు పెద్దగా ఆసక్తి ప్రదర్శించారు. తాము పండించిన పంటలను నేరుగా రైతుబజారుకు తీసుకొచ్చి విక్రియంచడం ప్రారంభించారు. అయితే రైతులకు కొనుగోలుదారుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో లాభాలు రాకపోగా నష్టాలు రావడం ప్రారంబించింది. రైతు బజారుకు కొనుగోలుదారులను రప్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో తిరువళ్లూరులోని రైతుబజారు నిర్మానుష్యంగా మారింది. రైతుల కోసం ఏర్పాటు చేసి షెడ్లు శిధిలావస్థకు చేరాయి. 2021వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎంకే ప్రభుత్వం రైతు బజార్లును అభివృద్ధి చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో జిల్లా కేంఽద్రమైన తిరువళ్లూరులో రైతు బజారు నిరుపయోగంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి విక్రయాలపై రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు రైతు బజార్లకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని పలువురు కోరుతున్నారు. -
విద్యార్థుల ప్రతిభకు దర్పణంగా హెల్త్ యాప్
సాక్షి, చైన్నె : శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు ఆరోగ్య రంగంలో ఒక కీలక ముందడుగు వేశారు. శ్రీ రామచంద్ర ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన మెడ్యూరా అనే సరికొత్త డిజిటల్ హెల్త్ అప్లికేషన్ను బుధవారం ఆవిష్కరించారు. ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ట్రస్ట్ ట్రస్టీ సంయుక్త్తా వెంకటాచలం ఈ యాప్ను ఆవిష్కరించి విద్యార్థులను అభినందించారు. యాప్ ప్రత్యేకతలు.. ఈ యాప్ రోగులను నేరుగా వైద్యులు, ఫార్మసీలు ,డయాగ్నస్టిక్ లాబొరేటరీలతో అనుసంధానిస్తుంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి , తృతీయ శ్రేణి నగరాల్లోని ఆసుపత్రులలో వైద్య సేవలను మరింత సులభతరం చేయడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యంగా ప్రకటించారు. రోగులు తమకు కావాల్సిన వైద్య సేవలను ఒకే వేదిక ద్వారా సులభంగా పొందేందుకు ఇది దోహదపడుతుందన్నారు. దీనిని స్టూడెంట్ వెంచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా రూపొందించారు. ఎంపికై న ప్రతిభావంతులైన విద్యార్థి బృందాలకు తమ వినూత్న ఆలోచనలను ఆచరణాత్మక స్టార్టప్లుగా మార్చుకునేలా సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర వైస్ చాన్స్లర్ డాక్టర్ ఉమా శేఖర్, మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ కె. బాలాజీ సింగ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోలాహలం.. పొర్కోడియమ్మన్ జాతర
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని వేలంగాడు పొర్కోడియమ్మన్ ఆలయ చెరువు జాతర బుధవారం కోలాహలంగా జరిగింది. ప్రతి సంవత్సరం చిత్ర మాసంలో చెరువులో 10 గ్రామ పంచాయతీలు కలిసి పొర్కోడిఅమ్మన్ జాతర నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం రాత్రి అమ్మన్ను అలంకరించిన రథంలో ఆశీనులు చేసి వెల్లండ్రం గ్రామం నుంచి ఊరేగింపుగా చెరువులోకి తీసుకొచ్చి ఆలయంలో ఉంచారు. అనంతరం ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి రథాన్ని భక్తిశ్రద్ధలతో చెరువులోకి తీసుకొచ్చారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పొంగుళ్లు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు భక్తులకు అన్నదానం చేసి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ విజయ, అసిస్టెంట్ కమిషనర్ జీవానందం, ఎగ్జిక్యూటివ్ అఽధికారి అన్నామలై, దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ అశోకన్, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ నగరి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కొనియాడుతూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. సింగిల్గా పోటీ చేసి సత్తా చాటుకున్నారని, అభిమానులు.. నమ్మకున్న కేడర్కు భరోసా కల్పిస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు రోజా ట్వీట్కు సీఎం విజయ్ స్పందించారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. నాగలాపురం: మండలంలోని వేదవల్లి సమేత వేద నారాయణస్వామి ఆలయంలో బుధవారం ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు బారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులను అలంకరించి తిరుచ్చి వాహనంపై తిరు వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతు పనులు పూర్తి అయ్యాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను రేణిగుంట తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీఓ రవిచంద్ర, రైల్వే అధికారులు, పట్టణ సీఐ జయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్ర మాట్లాడుతూ సకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేసినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అండర్ బ్రిడ్జ్ అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసినందుకు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్చార్జి పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు. తిరువొత్తియూరు: తమిళనాడులోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసే పనిని విద్యాశాఖ ప్రారంభించింది. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి అవసరమైన పుస్తకాల్లో 99 శాతం ఇప్పటికే ముద్రించబడ్డాయి. ఈ ఏడాది రూ. 4.19 కోట్ల పుస్తకాలు అవసరమని గుర్తించగా, అందులో 4.16 కోట్ల పుస్తకాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 1 శాతం పుస్తకాలు కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి పంపిణీ చేస్తారు. తమిళనాడు పాఠ్యపుస్తక, విద్యా సేవల సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం రాయితీ ధరలకు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. మే నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 1, 2, 3వ తరగతులకు అవసరమైన లక్షలాది పుస్తకాలు గోడౌన్లకు చేరుకున్నాయి. జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తంలోని గంగమ్మ శిరస్సు జాతర ఈనెల 15న శుక్రవారం జరగనుంది. గురువారం ఉదయం అమ్మవారి రథోత్సవం, శుక్రవారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనుంది. ఇందుకుగాను వేలూరు, ఆంబూరు, తిరుపత్తూరు, చిత్తూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్న నేపత్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇందుకోసం మూడు తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు కారు పార్కింగ్లు నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. బందోబస్తుపై ఎస్పీ శివరామన్ నేరుగా వెళ్లి పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే జాతరలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఇందుకు భక్తులు సహకరించాలన్నారు. జాతర పురస్కరించుకొని ఈనెల 15న వేలూరు జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. -
ఇదేనా పవిత్ర శక్తి
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్ పేజీ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన ‘మురికి రాజకీయం’గా అభివర్ణించారు. నిరసనగా వాకౌట్ టీవీకే ప్రభుత్వం ఏర్పడటానికో లేదా కొనసాగడానికో డీఎంకే అడ్డుపడదు అనే నిర్ణయానికి అనుగుణంగానే తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మా నిర్ణయానికి మద్దతుగా నిలిచిన మిత్రపక్షాల నేతలకు (ప్రేమలత విజయకాంత్, జవాహిరుల్లా తదితరులు) కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రపక్షాల మద్దతుపై స్పష్టత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకూడదనే ఉద్దేశంతోనే కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని, వారి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిశుద్ధమైన రాజకీయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు తాజాగా మురికి రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. చీలిన అన్నాడీఎంకే అనే మడుగులో చేపలు పట్టాలని చూస్తూ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని స్టాలిన్ ఆరోపించారు. టీవీకేకు ఓటు వేసిన ప్రజలే ఇప్పుడు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం.. మీ పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అని వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి తమరికి మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఇచ్చే ‘రిటర్న్ గిఫ్ట్’ ఏమిటో కూడా ప్రజలు చూస్తార అని ధ్వజమెత్తారు. డీఎంకే తన సిద్ధాంతాలకు కట్టుబడి ఒక బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని స్టాలిన్ స్పష్టం చేశారు. -
విరుదంబట్టులో ఆధార్ కేంద్రం
వేలూరు: ఆధార్ కార్డు సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని విరుదంబట్టులో కొత్తగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు ఇప్పటివరకు నూతన ఆధార్ కార్డు, పేర్లు, చిరునామా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వేలూరు కలెక్టరేట్, తాలుకా కార్యాలయాల్లోని ఆధార్ సేవా కేంద్రాలతోపాటు ప్రధాన తపాలా కార్యాలయం, జాతీయ బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ తరచూ రద్దీగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నూతనంగా విరుదంబట్టులో ప్రారంభించామన్నారు. ఇక్కడ రోజుకు 500 మంది వరకు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. ఇక్కడ ఆధార్ బయో మెట్రిక్ చేసేందుకు రూ.125 రుసుము వసూలు చేస్తారన్నారు. 5 నుంచి 17 సంవత్సరాలలోపు ఉన్న వారికి సప్టెంబర్ 30వ తేదీ వరకు ఉచితంగా అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆధార్ కార్డు కోసం వచ్చే వారికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారా లేదా అని నేరుగా వెళ్లి ఆమె పరిశీలించారు. -
చట్టసభలో సనాతనం గురించి ప్రస్తావన
సత్యరాజ్ అభినందనలు తమిళసినిమా: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందు, ఆ తరువాత పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకోవడం, చర్చనీయాంశంగా మారడం చూస్తూనే ఉన్నాం. కాగా ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం శాసనసభా నేతను ఎంపిక చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభలో విశ్వాస ప్రతిపాదన సందర్భంగా జరిగిన చర్చలో ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ప్రజలను విభజించే సనాతనాన్ని అంతం చేయాలని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ప్రముఖ నటుడు సత్యరాజ్ ప్రతి పక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ, ఆయన్ని అభినందించారు. దీని గురించి ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. అందులో.. ప్రియమైన మిత్రుడు ప్రతి పక్షనేత ఉదయనిధి స్టాలిన్ శాసన సభలో చేసిన ప్రసంగాన్ని విన్నాను. బాధ్యతను విస్మరించకుండా, గౌరవం తగ్గకుండా, క్రమశిక్షణ కలిగినట్లుగా ఆ ప్రసంగం ఉంది. అదే సమయంలో ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ప్రజలను విడదీసే సనాతనం అంతం కావాలని చెప్పిన ఆయన గట్స్ను మెచ్చుకుంటున్నాను. అలా చెబితేనే ఈ 2కే జెన్సీ కిడ్స్కు అర్థం అవుతుంది. సనాతనం అంతం కావాలన్న పదంలోనే సమాజం రక్షించబడాలి అనే అర్థం దాగి ఉంది నటుడు సత్యరాజ్ పేర్కొన్నారు. -
విశ్వరూపం.. పులకించిన భక్త గణం
తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూపం.. భక్త కోటికి అపురూపం.. ఈ ఘట్టం అద్భుత కావ్యం.. అది వీక్షించడానికి తరలివచ్చిన లక్షలాది మంది జనం.. వారిలో తొణికిసలాడిన భక్తి భావం.. ఎదురు చూసిన క్షణం ఆసన్నం.. అమ్మా..గంగమ్మా.. కోరిన కోర్కెలు తీర్చే కల్పివల్లీ.. మాయమ్మ.. కరుణించి కాపాడవమ్మా తల్లీ గంగమ్మ అంటూ ప్రణమిల్లిన భక్త గణం.. అనంతరం పేరంటాలు విశ్వరూప ప్రతిమ చెంప నరకడంతో జాతర పరిసమాప్తం.. మట్టి కోసం ఎగబడిన జనం.. ఇదీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవం. తిరుపతి కల్చరల్: తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి విశ్వరూప దర్శనంతో భక్తులు పులకించిపోయారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా సాగింది. ఏడు రోజుల గంగమ్మ జాతరతో లక్షలాది మంది భక్తజనం అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రోజువారీ వేషధారణలతో భక్తులు సందడితో నగర వీధులు హోరెత్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..గంగమ్మతల్లికి పొంగళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించి, కుటుంబ సమేతంగా ప్రణమిల్లి, మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు రోజుల పాటు గంగమ్మ నామస్మరణలు, జాతర వేషాల సందడి, డప్పుల ధరవుల మోతతో తిరుపతి హోరెత్తింది. గంగజాతర చివరి రోజైన మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేకంగా కొలువుతీరిన గంగమ్మ విశ్వరూప ప్రతిమ దర్శనంతో భక్తులు పులకించారు. భక్తులు భక్తి పారవశ్యంతో గంగమ్మ తల్లీ.. కరుణించి కాపాడు తల్లీ అంటూ అమ్మవారి విశ్వరూపానికి చేతులెత్తి మొక్కి, వేడుకున్నారు. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి చాటింపుతో ఆరంభమైన తిరుపతి గంగజాతర భక్తకోటి మొక్కులతో ప్రతి రోజూ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల సహకారంతో భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో పోలీసుల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీల్లో భక్తులు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం ఎదురు చూశారు. అర్ధరాత్రి తర్వాత సంపూర్ణంగా అమ్మవారి విశ్వరూపం కొలువు కాగా అమ్మా... గంగమ్మా... చల్లంగా చూసి కాపాడవమ్మా అంటూ భక్తులు చేతులు జోడించి అమ్మవారిని వేడుకున్నారు. జాతర చివరి రోజు రాత్రి పేరంటాల వేషధారుడు కై కాల కులస్తుడు నగర వీధులు విహరిస్తూ భక్తుల పూజలందుకున్నారు. బుధవారం వేకువ జామున తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న పేరంటాలు గంగమ్మతల్లి విశ్వరూప ప్రతిమ చెంప నరకడంతో జాతర సమాప్తమైంది. దీంతో అత్యంత పవిత్రంగా భావించే గంగమ్మ విశ్వరూప ప్రతిమ బంకమట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం పేరంటాలు తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ కొలువైన పెద్ద గంగమ్మ విశ్వరూప ప్రతిమ చెంపనరకడంతో జాతర ఘట్టం ముగిసింది. -
కేంద్రానికి సీఎం విజయ్ రిక్వెస్ట్.. ఎందుకంటే?
చెన్నై: నీట్ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజ్ఞప్తి చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 రద్దు, పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షా విధానంలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు.12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పేపర్ లీక్ జాతీయ స్థాయి పరీక్షా విధానంలోని లోపాలను బయటపెట్టిందని.. ఇది లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి, తమిళ మీడియం విద్యార్థులకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ (CBI) విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పరీక్షల పారదర్శకతను పునరుద్ధరించడానికి ఎన్టీఏ స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రకారం.. సిక్కర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ద్వారా ఈ పేపర్ లీక్ మూలాలు కేరళ వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ సుమారు 22 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి. -
టీవీకే పార్టీకి గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి ఊరట లభించింది. ఆయన్ని బలపరీక్షలో ఓటు వేయొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.ఎన్నికల ఫలితంపై వివాదం ఉంటే ఎన్నికల పిటిషన్ (Election Petition) దాఖలు చేయడం సరైన మార్గమని హైకోర్టు చెప్పింది. అలాంటిది ఒక రిట్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్లో ఓటు వేయకుండా ఆపింది. ఇది దారుణం. అలాంటి ఆదేశాలివ్వడం ముమ్మాటికీ తప్పే అని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.#BREAKING #SupremeCourt stays the Madras High Court's order which stopped TVK MLA Sreenivasa Sethupathi from voting in TN Assembly floor test.#TamilNadu pic.twitter.com/ljOHA56050— Live Law (@LiveLawIndia) May 13, 2026అసలేం జరిగింది..తిరప్పత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి శ్రీనివాస సేతుపతి సమీప డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పర్ మీద ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. అయితే అదే పేరుతో ఉన్న మరో నియోజకవర్గం(ఒకటి తిరప్పత్తూరు జిల్లాలో ఉంది, మరొక నియోజకవర్గం శివగంగ జిల్లాలో ఉంది) నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సు మారిపోయిందని.. ఓట్ల లెక్కింపు గందరగోళంతో శ్రీనివాస సేతుపతి నెగ్గారని.. ఆయన ఎన్నిక చెల్లదని పెరియాకరుప్పర్ హైకోర్టును ఆశ్రయించారు.శ్రీనివాస సేతుపతి(ఎడమ), పెరియా కరుప్పర్ (కుడి)శనివారం ఆయన పిటిషన్ వేస్తే.. ఆదివారం దానిని అత్యవసరంగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈసీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కోర్టులో వాదనలు వినిపించారాయన. అయితే శ్రీనివాస సేతుపతి ఎన్నికనే ఈ పిటిషన్ సవాల్ చేస్తుండడం.. ఆయన ఓటింగ్లో పాల్గొంటే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్షలో ఓటేయొద్దని శ్రీనివాస సేతుపతికి మంగళవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర విచారణ లిస్టింగ్కు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు. సుప్రీంలో ఇవాళ.. బుధవారం విచారణ జరిపిన కోర్టు.. శ్రీనివాస సేతుపతి తరఫున అభిషేక్ మను సింఘ్వీ, పెరియాకరుప్పర్ తరఫున మకుల్ రోహత్గీ వాదనలు వినింది. చివరకు సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. శ్రీనివాస సేతుపతికి ఊరట ఇస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో డీఎంకే అభ్యర్తి వేసిన పిటిషన్ను మద్రాస్ బెంచ్ అత్యవసర విచారణ చేపట్టడాన్ని కూడా తప్పుబట్టింది. ఓటేయకుండా ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో పాటు పెరియాకరుప్పన్ వేసిన రిట్ పిటిషన్ విచారణపైన కూడా స్టే విధించింది సుప్రీం కోర్టు .సుప్రీం కోర్టు నిర్ణయంతో శ్రీనివాస సేతుపతి ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే బలపరీక్ష జరగడం.. అందులో విజయ్ టీవీకే సర్కార్ గెలవడంతో ఆ ఓటు అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో.. డీఎంకే అభ్యర్థి పెరియాకరుప్పర్ వేసిన ఎన్నికల పిటిషన్పై మాత్రం విచారణ కొనసాగనుంది. కాబట్టి.. తుది తీర్పు వచ్చే వరకు శ్రీనివాస సేతుపతి టీవీకే ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. -
విజయ్ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సొంత పార్టీ సహా మద్దతు ఇస్తున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ నియామకాన్ని పునరాలోచిస్తానని విజయ్ సంకేతం ఇచ్చారు. అనంతరం, ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తమిళనాడు సీఎం విజయ్ తన కార్యాలయంలో జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్ను ప్రత్యేక అధికారి (OSD)గా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాధన్ నియామకంపై VCK, DMDK, BJP, DMK వంటి పార్టీలు విజయ్ను ప్రశ్నించాయి. ఈ క్రమంలో శాస్త్రీయ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి, జ్యోతిష్యానికి కాదు అని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో విజయ్.. వెట్రివేల్ నియామకాన్ని పునరాలోచిస్తానని సంకేతం ఇచ్చారు.ఇక, ఈరోజు అసెంబ్లీలో కూడా వెట్రివేల్ నియామకంపై విజయ్ను ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) ప్రశ్నించారు. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’ అంటూ చురకలు అంటించారు. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. -
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది. -
విజయ్కు షాక్.. ఉదయనిధి సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రసవత్తరంగా మారింది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం విజయ్, టీవీకేపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని విమర్శలు గుప్పించారు.తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వం బల పరీక్షకు ముందు సీఎం విజయ్ టార్గెట్గా ఉదయనిధి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైంది. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు.టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందు సోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు.#WATCH | DMK MLAs walk out of the Tamil Nadu Assembly before the Floor test of the TVK government(video source: TN Assembly) pic.twitter.com/0oXlxMe4LM— ANI (@ANI) May 13, 2026పళని కౌంటర్.. అంతకుముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా టీవీకేను టార్గెట్ చేశారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. "We are not an enemy party; we wish to function as a responsible Opposition,” says AIADMK MLA Edappadi K. Palaniswami, adding that AIADMK MLAs would vote against the government in the Assembly. pic.twitter.com/elXR9fWGBR— ANI (@ANI) May 13, 2026కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. ఇక.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. -
విజయ్పై ప్రేమలతా విజయ్కాంత్ ఎదురుదాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi— Way2News Tamil (@way2news_) May 13, 2026Video Source: Way2News Tamil మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్కు హితవు పలికింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్కాంత్కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. -
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ నేరుగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 144 మంది విజయ్ టీవీకే సర్కార్కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి 61 మంది వాకౌట్(డీఎంకే సభ్యులతో పాటు) చేయగా.. 22 మంది విజయ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు గైర్హాజరు అయ్యారు. బలపరీక్ష విషయంలో తటస్థంగా ఉన్నట్లు బీజేపీ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది. విజయ్ ధన్యవాదాలుతమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ వేళ.. ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు. అంతకు ముందు.. చర్చ సందర్బంగా ఒక్కో పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే అన్నాడీఎంకే వంతు వచ్చేసరికి హైడ్రామా మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే ఒక రెబల్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఏంటని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. చివరకు చేసేది లేక పళనిస్వామి వర్గం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఉదయనిధి సంచలన ఆరోపణలుప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఓటింగ్..విజయ్ సర్కార్ బలనిరూపణ కోసం ఓటింగ్ జరిగింది. టీవీకేకు బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 118. బలనిరూపణ ఓటింగ్ సందర్భంగా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించగా.. ఒక్కొక్కరు లేచి తమ హాజరును ప్రదర్శించారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంల్, వీసీకే, ఏఎంఎంకే రెబల్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు(షణ్ముగం వర్గం 25 మంది) విజయ్కు సపోర్ట్గా లేచి నిలబడ్డారు.కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. Tamil Nadu Legislative Assembly: Confidence motion moved in support of the Council of Ministers led by Chief Minister Vijay. pic.twitter.com/uxT0BMzNoY— Vijay Fans Trends (@VijayFansTrends) May 13, 2026 -
నేడు విజయ్ సర్కార్కు బలపరీక్ష
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకుగానూ విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ రెండు చోట్లా పోటీ చేయడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుప్పత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్లో తేడా జరిగిందని.. శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియాకరుప్పర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే.. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కి పడిపోయింది. అయితే ఏఎంఎంకే పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ తన అధిష్టానాన్ని ఎదురించి మరీ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ (Vijay) సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. ఇవాళ్టి బలనిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
అపోలోలో సెంటర్ ఫర్ వీనస్ డిజార్డర్స్
కొరుక్కుపేట: నాణ్యమైన, అధునాతన వాస్కులర్ సంరక్షణను అందించడంలో ఓ కీలక ముందడుగుగా, చైన్నెగ్రీమ్స్ రోడ్లోని అపోలో ఆసుపత్రిలో ‘సెంటర్ ఫర్ వీనస్ డిజార్డర్స్ను ప్రారంభించినట్లు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ కేంద్రం రోగి–కేంద్రీకృత విధానం ద్వారా అన్ని రకాల రుగ్మతలకు సమగ్ర చికిత్సను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ప్రారంభించబడిన ఈ కేంద్రం, రోగులకు రోగ నిర్ధారణ, చికిత్స తదుపరి పర్యవేక్షణను సజావుగా అందించడానికి, వాస్కులర్ సర్జరీ, రేడియాలజీ, డెర్మటాలజీ, గాయాల సంరక్షణ వంటి అన్ని ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చిందని అపోలో హాస్పిటల్స్ చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమారన్ తెలిపారు.ఆయన మాట్లాడుతూ, వీనస్ డిజార్డర్స్ కేంద్రాన్ని ప్రారంభించడంతో, తరచుగా నిర్ధారణ కాకుండా, సరిగా చికిత్స పొందకుండా ఉండిపోయే రుగ్మతల సమూహాన్ని ఎదుర్కోవడంలో తాము గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. తమ బహుళ–విభాగాల విధానం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, మా రోగులకు సకాలంలో, సమర్థవంతంగా, అతి తక్కువ కోతతో కూడిన చికిత్సను అందించడం, తద్వారా వారి జీవన నాణ్యతను దీర్ఘకాలిక ఫలితాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని తెలిపారు. చైన్నె, గ్రీమ్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్స్కు చెందిన సీనియర్ కన్సల్టెంట్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ బాలాజీ, అపోలో హాస్పిటల్స్, గ్రీమ్స్ రోడ్ సీఈఓ నవీన్, డాక్టర్ అనిల్తో పాటు సీనియర్ వైద్య నిపుణులు హాజరయ్యారు. -
ప్రశాంత్ పాండిరాజ్కు అది ఇష్టమే..!
తమిళసినిమా: బ్రూస్లీ చిత్రంతో దర్శకుడిగా పరిచయం ఆ తరువాత విళంగు అనే వెబ్ సిరీస్ తో సక్సెస్ పుల్ దర్శకుడి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ పాండిరాజ్ ఇటీవల మామన్ చిత్రంతో మరో హిట్ కొట్టారు. కాగా తాజాగా హీరోగా అవతారమెత్తి వారెంట్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈయన దర్శకుడు పాండిరాజ్ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్గా రూపొందిన వారెంట్ వెబ్ సిరీస్ ను శివన్ పిక్చర్స్, ఎస్.స్టూడియోస్ సంస్థల అధినేతలు ప్రశాంత్ పాండిరాజ్,నీ.విశాల్, పీఎం.ఆధీశ్వర్ కలిసి నటించారు. విఘ్నేష్ నటరాజన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 22వ తేదీ నుంచి జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ తాను ప్రశాంత్ పాండిరాజ్ ను ఎంతగా ఆట పట్టించినా, ఎగతాళి చేసినా ఎంజాయ్ చేస్తాడన్నారు. తాను తిట్టినా అతనికి ఇష్టమేనన్నారు. ఏ పనినైనా శ్రమించే వ్యక్తి అని చెప్పారు. మామన్ చిత్రం తరువాత వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు చెప్పడంతో సంతోషంగా..ఆశీర్వదించానని చెప్పారు. తాను ఒక యాక్షన్ కథను రెడీ చేశానని, అందులో తాను నటిస్తానని ప్రశాంత్ పాండిరాజ్ అన్నాడరని చెప్పారు. అంత ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో నటుడు కెవిన్, దర్శకుడు సుశీంద్రన్, రామ్ కుమార్ బాలకృష్ణన్, తమిళరసన్ పచ్థముత్తు, నిర్మాత మదన్, కేఎస్. వినీష్, నటుడు వైయాపురి,అరుళ్ దాస్, నటి కౌశల్య, మీనా, అరుళ్ జ్యోతి, చాయాదేవి, పూర్ణిమ రవి తదితరులు పాల్గొన్నారు. -
తిరుప్పత్తూర్ టీవీకే ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్
సాక్షి, చైన్నె: శివగంగ జిల్లా తిరుప్పత్తూర్ నియోజకవర్గం నుండి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టు కీలక ఆంక్షలు విధించింది. అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంతో పాటు ఇతర కీలక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆయనకు నిషేధం విధించింది. ఈ నియోజకవర్గంలో స్వల్ప తేడా ఒక్క ఓటుతో ఓడిపోయిన డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి కె.ఆర్. పెరియకరుప్పన్ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ పోస్టల్ బ్యాలెట్ ఓటును అధికారులు పొరపాటున వేలూరు సమీపంలోని తిరుప్పత్తూరు నియోజకవర్గానికి పంపారని, దీనివల్ల ఫలితం మారిపోయిందని పెరియకరుప్పన్ కోర్టులో వాదించారు. సక్రమంగా రీ–కౌంటింగ్ జరగలేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పోస్టల్ ఓటు నియోజక వర్గం మారిందనే వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత పోస్టల్ ఓట్లను తిరిగి వెనక్కి తెప్పించి రీ–కౌంటింగ్ చేసే అధికారం అధికారులకు ఉండదని తెలిపారు. కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారానే దీనిపై విచారణ జరగాలని, రిట్ పిటిషన్ ద్వారా కాదని వాదించారు. హైకోర్టు ఆదేశాలు.. మంగళవారం జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరీ, జస్టిస్ ఎన్. సెంథిల్ కుమార్ ధర్మాసనం ఈ కేసును విచారించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని ఆదేశించారు. సదరు నియోజకవర్గానికి చెందిన పోస్టల్ ఓట్లు, ఈవీఎం ఓట్ల వివరాలు, కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ పరిణామాలతో బుధవారం జరిగే సీఎం విజయ్ బల నిరూపణలో పాల్గొనే అవకాశం శ్రీనివాస సేతుపతికి లేకుండా పోయింది. -
అర్ధగిరి క్షేత్రంలో హనుమజ్జయంతి
చెల్లించిన భక్తులు తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఇక, జిల్లా ఎస్పీ తుషార్డూడి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ట్రస్టుబోర్డు చైర్మన్ మణినాయుడు, కాణిపాకం ఈఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరికి అర్ధగిరి చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్, ట్రస్టుబోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో, కేరళడ్రమ్ముల వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ తుషార్డూడి, ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ఆలయ అధికారులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఎస్పీ, ఎమ్మెల్యేను ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు, సంజీవరాయ పుష్కరిణి తీర్థాలను అందజేశారు. భక్తిశ్రద్ధలతో సహస్రనామ హోమం ఆలయ అర్చకులు సహస్రనామ హోమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. హోమంలో ట్రస్టుబోర్డు చైర్మన్ కుటుంబ సభ్యులు, ట్రస్టు సభ్యులు, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఆంజనేయస్వామి భక్తులు ప్రదక్షిణగా వచ్చి ఇరుముడులు చెల్లించారు. అలాగే పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి స్వామివారికి ప్రాకారోత్సవం నిర్వహించారు. పల్లకిలో కొలువుదీరి భక్తులను కనువిందు చేశారు. అనంతరం అష్టావధాని మురళి, ఆస్థాన కవి దయానందరెడ్డి, తెలుగు పండితులు భాస్కర్ రెడ్డి కీర్తనలు ఆలపించారు. -
రవి మోహన్కు దేవి రత్న అవార్డు
తమిళసినిమా: ప్రముఖ నటుడు రవి మోహన్ను ఉత్సవం 2026 సంస్థ నిర్వాహకులు దేవి రత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో గాయని కెనిషా సంగీత కచేరీ ప్రత్యేకతను సంతరించుకుంది. పాలకాడుకు చెందిన పళయకావు శ్రీ మీనాకుమారి భగవతి ఆలయం నేతృత్వంలో కొన్ని ఏళ్లుగా భక్తి, సంస్కృతి, సినిమా, సంగీత రంగాల్లో విశేష కృషిచేసిన వారిని సత్కరించి అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాదికి గాను ఉత్సవం 2026 అవార్డుల కార్యక్రమాన్ని ఇటీవల పాలకాడులో ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై తమిళ ప్రముఖ నటుడు రవి మోహన్ దేవి రత్న పేరుతో అవార్డును ప్రధానం చేయడంతో పాటు ఘనంగా సత్కారించి రూ. 1000001 (పది లక్షల ఒక్కరూపాయి) నగదు బహుమతి అందించారు. ఇది పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో, రవి మోహన్ నటనా చాతుర్యానికి, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న విశేష సేవలకు, అత్యంత అభిమానులను కలిగినందుకు గానూ ఈ అవార్డు ప్రధానం అని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా నటుడు రవి మోహన్ స్నేహితురాలు, గాయని కెనీషా బందం సంగీత కచేరీ కార్యక్రమం ఆహుతులను ఎంతగా అలరించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. వారికి నటుడు రవి మోహన్, గాయని కెనీషా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు. -
717 మద్యం దుకాణాల మూసివేత
సాక్షి, చైన్నె: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తన ఎన్నికల హామీలను అమలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని మంగళవారం ఆదేశించారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిమితులు ఇవే.. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు (ఆలయాలు, చర్చిలు, మసీదులు). బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను గుర్తించి మూసివేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ 717 దుకాణాలను రాబోయే రెండు వారాల్లోపు పూర్తిగా మూసివేయాలని అధికారులకు గడువు విధించారు. ప్రార్థనా స్థలాల సమీపంలో 276, విద్యాసంస్థల (స్కూళ్లు, కాలేజీలు) సమీపంలో 186, బస్టాండ్ల సమీపంలో 255 దుకాణాలు అంటూ మొత్తం 717గా నిర్ణయించారు. తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 4,765 ప్రభుత్వ మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం , సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నిషేధం అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వాగ్దానంగా తాను ఇచ్చిన మేరకు దశల వారీ అమలులో భాగంగా 717 దుకాణాలను మూసి వేయడానికి ఉత్తర్వులు ఇవ్వడాన్నిసర్వత్రా ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉండగా గతం డీఎంకే ప్రభుత్వంలో ఇదే తరహాలో 2023లో కూడా సుమారు 500 దుకాణాలను ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. -
నేడు 5వ సారి సీఎంగా రంగన్న ప్రమాణం
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. బుధవారం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి 5వ సారిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటుగా ఐదుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో బుధవారం ఉదయం 9.45 గంటలకు పుదుచ్చేరిలోని స్వర్ణ మందిరంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నర్ కై లాసనాథన్, రంగస్వామితో పాటుగా ఐదుగురు మంత్రులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త మంత్రివర్గం : ముఖ్యమంత్రి రంగస్వామి సీఎంగా, నమశ్శివాయం (బీజేపీ), మల్లాడి కృష్ణారావు(ఎన్ఆర్కాంగ్రెస్), రాజవేలు (ఎన్ఆర్ కాంగ్రెస్) , జి.ఎన్.ఎస్. రాజశేఖరన్ (బీజేపీ – కారైకాల్), డాక్టర్ నారాయణస్వామి (ఎన్ఆర్ కాంగ్రెస్)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది 5వ సారి కావడం గమనార్హం. గతంలో 2001, 2006, 2011, 2021లలో సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ శివకొళుందు స్పీకర్గా ఎన్నికయ్యే అవకాశం ఉండగా, డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీకి కేటాయించనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అన్నాడీఎంకే అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తదితరులు హాజరు కానున్నారు. -
శ్రమజీవి.. బాబు విజయ్
తమిళసినిమా: దర్శకుడు ఏఆర్.మురుగదాస్ శిష్యుడు బాబు విజయ్ దర్శక నిర్మాతగా పరిచయం అయ్యి బీవీ.ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం సట్రెంన్రు మారుదు వానిలై. ఈయన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ శిష్యుడు కావడం గమనార్హం. అదే విధంగా బోఫ్టా ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి కూడా. కాగా నటుడు జయ్, మీనాక్షీ గోవింద రాజన్ జంటగా నటించిన ఈ చిత్రంలో యోగిబాబు, గరుడా రామ్, శ్రీమాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రిచ ర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం, గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమ వారం సాయంత్రం స్థానిక టీ.నగర్లోని కృష్ణవేణి థియేటర్లో నిర్వ హించారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, శశి, నిర్మాత ధనుంజయ న్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శక నిర్మాత బాబు విజయ్ తనకు చాలా సన్నిహితుడు అన్నారు. అంతేకాదు చాలా క్లిష్టమైన సమయంలో తన పక్కన నిలబడ్డాడని పేర్కొన్నారు. ఇకపోతే తన వద్ద పనిచేసిన వారు ఇప్పటికీ 12 మంది దర్శకులు అయ్యాయన్నా రు. వారిలో ఒకరైన బాబు విజయ్ దర్శక నిర్మాతగా రూ పొందించిన తన తొలి చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. తన వద్ద పనిచేసినప్పుడు రోజు ఏడు,ఏడున్నరకు వచ్చి కింద కారు వద్ద నిలబడే వాడిని, షూటింగ్ స్పాట్ లో రిహార్సల్స్ నుంచి అని నిర్వహించి సిద్ధంగా ఉండేవాడన్నారు. అంత శ్రమజీవి అనీ..ఇంకా చెప్పాలంటే తనను సోంబేరిగా మార్చిన సహాయ దర్శకుల్లో ముఖ్యమైన వ్యక్తి బాబు విజయ్ అని అన్నారు. తన దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకోనని, దేవుడిని ప్రార్థిస్తానని ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు. -
క్లుప్తంగా
ఘనంగా నర్సుల దినోత్సవం కొరుక్కుపేట: తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు . ప్రతీ సంవత్సరం నర్సులను గౌరవించే విధంగా చైన్నె అనకాపుత్తూరు మాజీ పేరెంట్ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ కుమార్ నర్సుల దినోత్సవంను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చెంగల్ పట్టు ఆసుపత్రి నర్సులు హెడ్ అయిన ప్రియదర్శినిని శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఇందులో నర్సులు వి. భారతీ , శాంతి పాల్గొన్నారు. ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారం అన్నానగర్: నైల్లె సమీపంలో తల్లిదండ్రులు లేకపోవడంతో, 26 ఏళ్ల మానసిక వికలాంగురాలైన యువతి తన సోదరుడి సంరక్షణలో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, పేట్టై తిరుప్పణి కరశల్కుళంకు చెందిన ఇసక్కిదురై (34) అనే వ్యక్తి మంగళవారం ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశాడు. సాయంత్రం సోదరుడు పని నుంచి తిరిగి వచ్చినప్పుడు, ఘటన గురించి చెప్పింది. అనంతరం నైల్లె టౌన్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇన్స్పెక్టర్ రాజకుమారి కేసు నమోదు చేసి, ఇసక్కిదురైని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఏడీఎంకే కార్యకర్త ఆత్మహత్య అన్నానగర్: విల్లుపురం జిల్లాలోని పూత్తురుకి చెందిన అంబేత్ కుమార్ (46). ఇతను ఏడీఎంకే జిల్లా ప్రతినిధి. ఇతనికి లోకనాయకి అనే భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతను ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తుండేవా డు. సోమవారం రాత్రి, అంబేత్ కుమార్ తిరు చిట్రంబళంలోని జంక్షన్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్లి అక్కడే నిద్రపోయాడు. మంగళవారం ఉదయం, అంబేత్ కుమార్ తన సెల్ ఫోన్లో ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, అక్కడే ఉన్న షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల విచారణలో అప్పులే ఇందుకు కారణ మని తేలింది. ఫ్రిజ్ పడి బాలుడి మృతి అన్నానగర్: ధర్మపురి జిల్లాలోని వేగలన్ కోట్టై గ్రామానికి చెందిన పూల వ్యాపారి చిన్నస్వామికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం అతని కుమారుడు శ్రీధర్ (5) ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఇంట్లోని రిఫ్రిజిరేటర్ అనుకోకుండా అతనిపై పడింది. ఈ ఘటనతో శ్రీధర్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని రక్షించి, చికిత్స కోసం కరిమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు అతడిని పరీక్షించగా, అతను అప్పటికే మరణించినట్లు ప్రక టించారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కొత్త హై స్పీడ్ ఏ3 ఎంఎఫ్డీ స్కానర్ల ఆవిష్కరణ సాక్షి, చైన్నె : కొత్త హై స్పీడ్ ఏ3 కలర్ ఎఫ్ఎఫ్డీ , డాక్యుమెంట్ స్కానర్లను కానన్ ఇండియా ఆవిష్కరించింది.స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీటిని కానన్ ఇండి యా అధ్యక్షుడు తొషియాకి నోమురా, ఉపాధక్షుడు సి. సుకుమారన్లు ఆవిష్కరించారు. వీటి లోని అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించారు. ఇందులో సాంప్రదాయ లేజర్కు బదులుగా ఓఎల్ఈడీ ఎక్స్పోజర్ సిస్టమ్ను ఉప యోగించినట్టు తెలిపారు. హై స్పీడ్ ఏ 3 ఎంఎఫ్డీ స్కానర్లు అత్యంత స్పష్టమైన టెక్స్ట్, కలర్ అవుట్పుట్ను అందిస్తాయని తెలిపారు.నిమిషానికి గరిష్ఠంగా 50 పేజీల కలర్ అవుట్పుట్ను అందిస్తుందన్నారు. మారుతున్న వ్యా పార అవసరాలకు అనుగుణంగా ఉత్పాదకత ను పెంచే పరిష్కారాలను అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కలర్ నాణ్యత, వేగం, స్థిరత్వం విషయంలో రాజీ పడకుండా ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. టెక్నాలజీతో కూడిన అనుభవం లక్ష్యం సాక్షి, చైన్నె : టెక్నాలజీతో కూడిన సరికొత్త అనుభవాన్ని వినియోగ దారులకు అందించడం లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధులు స్థానికంగా ప్రకటించారు.గ్రేట్ సమ్మర్ 2026 వేడుక ఆన్లైన్ వేదికగా ప్రారంభమైందన్నారు. స్మార్ట్ షాపింగ్, భారీ డిస్కౌంట్లు , వేగవంతమైన డెలివరీలతో వినియోగ దారులను ఆకట్టుకుంటున్నామని వివరించారు. స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు, ఏసీలు, ఫ్యాష న్ , నిత్యావసర వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా రుఫూస్ ఏఐ షాపింగ్ అసిస్టెంట్ వినియోగ దారులకు మరింత తోడ్పాటుగా నిలుస్తున్నట్టు వివరించారు. అమెజాన్ బజార్, ఫ్రెష్ ద్వారా ప్రత్యేక రాయితీలు, అమెజాన్ పే ద్వారా ట్రావెల్ బుకింగ్స్పై కూడా డిస్కౌంట్లు సైతం కల్పిస్తున్నమని వివరించారు. -
వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
– ఆంధ్ర కళా స్రవంతిలో ప్రత్యేక పూజలు కొరుక్కుపేట: ఆధ్యాత్మిక,సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్న శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె కొరట్టూరు అగ్రహారంలో శ్రీ కోదండ రామాలయంలోని హాలు వేదికై ంది. శ్రీ ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షులు జె.ఎం.నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా 108 రకాల పండ్లుతో శ్రీ ఆంజనేయ స్వామిని నేత్రపర్వంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ది హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన మండలి (చైన్నె) సంయుక్తంగా 14 మంది భక్తుల బృందం చే 108 సార్లు హనుమాన్ చాలీసాను సంగీత పఠనం చేసి భక్తులను మంత్రముగ్దులను చేశారు. ఆంధ్ర కళాస్రవంతి ప్రధాన కార్యదర్శి జే.శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్,పి.సరస్వతి, జాయింట్ సెక్రటరీ చింతా సాంబశివరావు , ఇంకా అన్నపూర్ణ, బాలాజీ ,ఎం. కాశీ విశ్వనాథం పాల్గొన్నారు. -
శాసనసభ స్పీకర్గా జేసీడీ ప్రభాకర్
రాజకీయాల్లో డీఎంకేనే సీనియర్ : ఉదయనిధి సాక్షి,చైన్నె: కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే , ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే చీఫ్ సీ జోసెఫ్ విజయ్ సీఎం అయ్యారు. పరిపాలనా వ్యవహారాలపై దృష్టి పెడుతూనే సోమవారం అసెంబ్లీని సమావేశ పరిచారు. సభ్యులందరితో ప్రమాణ స్వీకారం ఈ సందర్భంగా ఆరోగ్యకర వాతావరణంలో జరిగింది. అనంతరం రాజకీయ నాగరికతను చాటుకునే దిశగా మాజీ సీఎం ఎంకే స్టాలిన్తో పాటూ పలువురు నేతలను కలిసి ఆశీస్సులను సీఎం విజయ్ అందుకోవడం ప్రశంసలకు దారి తీశాయి. ఈ పరిస్థితులలో సభలో రెండవ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. ఏకగ్రీవ ఎన్నిక.. శాసనసభ స్పీకర్ పదవికి టీవీకే తరపున థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల తరపున నుండి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. స్పీకర్గా ఎన్నికై న ప్రభాకర్ను సంప్రదాయం ప్రకారం మంత్రి సెంగోట్టయన్ , ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కలిసి సభాపతి కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్, మంత్రులు సెంగోట్టయన్, ఆనంద్, అరుణ్రాజ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీడీ ప్రభాకర్ తురైయూర్ ఎమ్మెల్యే రవిశంకర్ను డిప్యూటీ స్పీకర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అందర్నీ సమంగా చూడండి.. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత రాజేష్కుమార్, సీపీఎం ఆర్ చెల్ల స్వామి, సీపీఐ తలి రామచంద్రన్, వీసీకే వన్నియరసు, ఐయూఎంఎల్ సయ్యద్ ఫరూక్ భాషాలు స్పీకర్ ఎన్నికకు శుభాకాంక్షలు తెలుపుతూ తొలుత ప్రసంగించారు. వీరంతా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో వీరు అధికార పక్షం వరుసలో అసెంబ్లీలో కూర్చోవడం విశేషం. అనంతరం ప్రతి పక్షం వరుసలో కూర్చున్న డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో గెలిచిన ఎండీఎంకే టీఎం రాజేంద్రన్, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి కె నిత్యానందన్, మనిదనేయ జననాయగ కట్చి తమీమున్ అన్సారీ, మనిదనేయమక్కల్ కట్చి జవహిరుల్లాలు ప్రసంగించారు. అలాగే డీఎండీకే ప్రేమలత విజయకాంత్, పీఎంకే సౌమ్య అన్బుమణి ప్రసంగించారు. స్పీకర్కు తమ తరపున విన్నపం చేశారు. చిన్న పార్టీలకు మాట్లాడే సమయం అధికంగా కేటాయించాలని కోరారు. అనంతరం అన్నాడీఎంకే తరపున తొలుత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రసంగిస్తూ స్పీకర్ గతంలో అన్నాడీఎంకేలో ఉన్న సమయంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో అన్నాడీఎంకేలో మరో శిబిరంగా ఉన్న ఎస్పీ వేలుమణి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరడంతో స్పీకర్ అనుమతి ఇవ్వడం విశేషం. ఇక అమ్మమక్కల్ మున్నేట్ర కళగం మన్నార్ కుడి ఎమ్మెల్యే కామరాజ్ తన ప్రసంగంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం విశేషం. కొత్త స్పీకర్గా జేసీడీ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉదయనిధి స్టాలిన్ తొలి ప్రసంగం చేశారు. అందరూ పేపర్లో రాసుకొస్తే, ఉదయనిధి ట్యాబ్ను ఉపయోగించి, అందులో ముందుగా ఫీడ్ చేసిన మేరకు ప్రసంగాన్ని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. అలాగే, విజయ్తో తనకున్న సాన్నిహిత్యా న్ని గుర్తు చేసుకుంటూనే, రాజకీయ అనుభవంపై చమత్కరించారు. సీఎం విజయ్ తాను ఒకే కాలేజీలో (లయోలా కాలేజీ) చదువుకున్నామని, అయితే ప్రభుత్వం నడపడంలో డీఎంకే సీనియర్ బ్యాచ్ అని వ్యాఖ్యలు చేశారు. 1967లోనే అధికారంలోకి వచ్చిన చరిత్ర తమది అని తమకు ఉన్న రాజకీయ అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచించారు. దీనిని స్వీకరించడానికి తమరు కూడా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. డీఎంకే ఈ సభలో కేవలం విమర్శించే పార్టీగా కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో జరిగిన కొన్ని పొరపాట్లను ప్రస్తావిస్తూ.. తమిళనాడులో ఏ కార్యక్రమం జరిగినా ’తమిళ్ తాయ్ వాల్త్తు’కు మొదటి ప్రాధాన్యత ఉండాలని, దానిని రెండో స్థానానికి పంపే ప్రయత్నాలను తాము సహించబోమన్నారు. సీఎం విజయ్ ప్రతిపక్ష నేతలను కలిసి శుభాకాంక్షలు తెలపడాన్ని స్వాగతిస్తూ, ఇదే రాజకీయ నాగరికత సభలోనూ కొనసాగాలని కోరారు. ఈ సభలో అధికార పక్షం, ప్రతిపక్షం అని వేర్వేరు వరుసల్లో కూర్చున్నా.. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో అందరం ముందు వరుసలో నిలబడి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని కచ్చితంగా నిర్మూలించాలని కోరారు. తమ మిత్రపక్షాల మద్దతుతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సభలో మహిళా ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికై న యువ సభ్యులు అధిక సంఖ్యలో ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు 17వ శాసన సభ స్పీకర్గా జేసీడీ ప్రభాకర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్గా రవి శంకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సాగిన వివిధ పార్టీల శాసన సభా పక్ష నేతల ప్రసంగాలన్నీ ఆసక్తికరంగా, స్నేహ పూర్వక పలకరింపుతో సాగాయి. అందరికీ సమాన అవకాశం కల్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా, సభా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని కొత్త స్పీకర్ వాగ్దానం చేశారు. ఆసక్తికర కథతో విజయ్ ప్రసంగం స్పీకర్ను కుర్చీ వద్దకు చేయి పట్టుకుని తీసుకెళ్లే సంప్రదాయం ఎందుకు? అన్న విషయంగా సీఎం సీ జోసెఫ్ విజయ్ ఆసక్తికర కథతో తన ప్రసంగం మొదలెట్టారు. భారత పార్లమెంటరీ విధానం బ్రిటన్ నుండి వచ్చిందని గుర్తు చేస్తూ, పూర్వం ఇంగ్లాండ్లో రాజుల పాలన ఉండేదన్నారు. రాజు ఏదైనా పని చేయాలని కోరినప్పుడు, పార్లమెంట్ దాన్ని వ్యతిరేకిస్తే.. ఆ వ్యతిరేకతను రాజుకు స్వయంగా చెప్పే ధైర్యం ఎవరికీ ఉండేది కాదన్నారు. పార్లమెంట్ అభిప్రాయాన్ని రాజుకు వినిపించే వ్యక్తిని ’స్పీకర్’ అనేవారు అని గుర్తు చేస్తూ, రాజుకు నచ్చని విషయాన్ని చెప్పినందుకు, కోపంతో రాజు ఆ స్పీకర్కు మరణశిక్ష విధించేవాడని పేర్కొంటూ అలా గతంలో చాలా మంది స్పీకర్లు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ భయం కారణంగా, ఆ రోజుల్లో స్పీకర్ పదవికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదన్నారు. ఒకవేళ ఎవరినైనా ఎంపిక చేస్తే, తమ ప్రాణం పోతుందనే భయంతో వారు సభ నుండి పారిపోవడానికి యత్నించేవారని తెలిపారు. అలా పారిపోతున్న వ్యక్తిని సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కలిసి పట్టుకుని, బలవంతంగా లాక్కొచ్చి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేవారని, కాలక్రమేణా అది ఒక గౌరవప్రదమైన సంప్రదాయంగా మారిందని విజయ్ వివరించారు. ప్రజల కోసం, ప్రజల చేత నడపబడేదే ప్రజాస్వామ్యం అన్న అబ్రహం లింకన్ మాటలను విజయ్ గుర్తుచేశారు. సభలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ అయినా, మెజారిటీ ఉన్న తమిళగ వెట్రి కళగం పార్టీ అయినా.. అందరి అభిప్రాయాలకు సమాన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. సభాపతి జేసీడీ ప్రభాకర్కు, డిప్యూటీ స్పీకర్ రవిశంకర్కు తమ పార్టీ తరపున పూర్తి సహకారం ఉంటుందని విజయ్ హామీ ఇచ్చారు. ముందుగా తమను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ ధన్యవాదులు తెలియజేశారు. చివరగా స్పీకర్ ప్రభాకర్ మాట్లాడుతూ, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితతో తనకు ఉన్న అనుబంధం, టీఎంసీ నేతమూపనార్తో ఉన్న సాన్నిహిత్యంతో పాటూ అన్నాడీఎంకేలో తనకు లభించిన గుర్తింపు గౌరవాన్ని ప్రస్తావించారు. అందరికీ సమాన అవకాశం కల్పిస్తానని, సభా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. తర్వాత సభ వాయిదా పడింది. బుధవారం విజయ్ తన బలాన్ని చాటుకునే దిశగా విశ్వసపరీక్షకు సిద్ధమయ్యారు. కాగా, స్పీకర్కు శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతుక జ్వలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
శరవేగంగా రోడ్డు నిర్మాణ పనులు
తిరువళ్లూరు: పొరుగు రాష్ట్రాల నుంచి చైన్నెలోని ఎన్నూర్ కామరాజర్ పోర్టు, కాట్టుపళ్లిలోని ప్రైవేటు పోర్టులకు సరుకు రవాణా రాకపోకలను సులభతరం చేయడానికి నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశ పనులు(చిత్తూరు నుంచి ఊత్తుకోట వరకు) పూర్తయిన క్రమంలో రెండవ దశ పనులను(ఊత్తుకోట పోందవాక్కం నుంచి తచ్చూరు వరకు) పనులను సైతం వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించి పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, బెంగళూరు తదితర రాష్ట్రాల నుంచి చైన్నెలోని పోర్టులకు సరుకు రవాణాను సులభతరం చేయాలన్న ఉద్దేశంతో తిరువళ్లూరు జిల్లా తచ్చూరు నుంచి చిత్తూరు వరకు సుమారు 133 కిమీ సిక్స్లేన్ల రహదారి నిర్మాణపు పనులను భారత జాతీయ రహదారుల అఽథారిటీ (ఎన్హెచ్ఎఐ) ద్వారా 5486 కోట్లు రూపాయల వ్యయంతో చేపట్టారు. మొదటి దశలో చిత్తూరు నుంచి పోందవాక్కం వరకు సుమారు 92 కిమీ మేరకు పనులను పూర్తి చేశారు. రోడ్డులో 24 గంటలూ పనిచేసే 120 నిఘా కెమెరాలు, 86 ప్రాంతాల్లో అత్యవసర సేవల కోసం రోడ్సైడ్ టెలిఫోన్లను సైతం ఏర్పాటు చేశారు. స్పీడ్ పరిమితులను గుర్తించే హైటెక్ కెమెరాలు, భద్రతకు సంబంధించిన ఎల్ఈడీ స్క్రీన్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు రోడ్డుకు మద్యలో సెంటర్ మీడియన్తో పాటు 80 చెట్లను నాటి వాటిని పెంచడానికి సోలార్తో పని చేసే మోటార్లును అమర్చి బిందుసేద్యం సదుపాయంతో నీటిని సైతం అందించడానికి చర్యలు చేపట్టారు. ఈ రహదారిలో 24 పెద్ద బ్రిడ్జిలు, 17 చిన్నపాటి బ్రిడ్జిలు, 16 ప్రాంతాల్లో రహదారికి దిగువన వాహన ప్రవేశం, 39 చిన్నపాటి లెవల్ క్రాసింగ్లు, 7 ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు సదుపాయం, 4 ప్రాంతాల్లో రైల్వే లెవల్ క్రాసింగ్లతో సహా మొత్తం 112 రోడ్డు క్రాసింగ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రతి 25 కిమీ దూరంలో తాగునీటి సదుపాయం, పెట్రోల్బంక్లు, టీదుకాణాలు, రెస్టారెంట్లు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను సైతం ఏర్పాటు చేసినట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు వివరించారు. టోల్ రేట్లు వివరాలు మొదటి దశలో పనులు పూర్తయిన క్రమంలో టోల్గేట్ ఫీజుల వివరాలను సైతం ఏర్పాటు చేశారు. చిత్తూరు నుంచి తచ్చూర్ వరకు 116 కిమీ దూరంలో ఒకసారి ప్రయాణం సాగించడానికి కారుకు 285 రూపాయలు, ఊత్తుకోట వరకు 210 రూపాయలు, బస్సులు, చిన్నపాటి సరుకు వాహనాలకు 350 రూపాయలు, ట్రాక్టర్, ట్రావెల్స్ వాహనాలకు 735 రూపాయలు, 3 యాక్సిల్ వాహనాలకు 800 రూపాయలు, నాలుగు నుంచి ఆరు యాక్సిల్ వాహనాలకు 1155 రూపాయలు, ఏడు అంతకంటే ఎక్కువ వున్న యాక్సిల్ వాహనాలకు 1405 రూపాయలుగా నిర్ధారించారు. రెండవ దశ పనులను సైతం డిసంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి హెచ్ఎన్ఏఐ అఽధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పాటు ఊత్తుకోట–తిరువళ్లూరు(ఎస్హెచ్–50) రోడ్డును సైతం అనుసంధానం చేయనున్నారు. -
నిరంతర తాగునీటి సరఫరాకు చర్యలు
సాక్షి, చైన్నె: సీఎం జోసెఫ్ విజయ్ అధ్యక్షతన సచివాలయంలో పురపాలక పరిపాలన, తాగునీటి సరఫరా , గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చైన్నె కార్పొరేషన్ సహా అన్ని జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సూచించారు. అవసరమైన చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, కొత్తగా బోరు బావులు తవ్వడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రతి సోమవారం తాగునీటి సరఫరాపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, చైన్నె నగరం ఇతర ప్రాంతాలలో కాలువల పూడికతీత పనులను, వరద నివారణ పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎం. సాయి కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి గగన్దీప్ సింగ్ బేడీ, పురపాలక శాఖ కార్యదర్శి డా. టి. కార్తికేయన్, చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమరగురుబరన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లను బంఽధీగా పట్టుకెళ్లడంతో వారిని విడుదల చేయించాలని కోరుతూ తొలి లేఖను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్కు సీఎం హోదాలో విజయ్ రాశారు. సమీక్ష తదుపరి వివిధ పార్టీల నేతలను కలిసేందుకు విజయ్ వెళ్లారు. ముందుగా ఐయూఎంఎల్ నేత ఖాదర్ మొహిద్దీన్తో పాటుగా ఆ పార్టీ వర్గాలను,అనంతరం సత్యమూర్తి భవన్లో టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతో పాటుగా ఆ పార్టీ నేతలను కలిశారు. అలా గే, వీసీకే నేత తిరుమావళవన్ను సైతం కలిశారు. ఆప్తుడికి పదవి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తన ఆప్తుడైన పార్టీ అధికారి ప్రతినిధి రిక్కి రతన్ పండిట్ వెట్రి వేల్కు ప్రభుత్వ పదవి అప్పగించారు. ఆయన్ని సీఎం ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ రతన్ పండిట్ గత కొన్నేళ్లుగా విజయ్తోనే ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగానే కాదు, ఆయన మంచి జ్యోతిష్కుడు కావడం గమనార్హం. ఇక పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
పొల్లాచ్చి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చైన్నె: కోవై జిల్లా పొల్లాచ్చి సమీపంలోని నెగమం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సేలం జిల్లా కాడయాంబట్టికి చెందిన ధనపాల్(37), ఆయన భార్య మేనక(35), కుమార్తె కనిష్క(17), కుమారుడు సుర్జిత్(12) బంధువు స్నేహ(23)తో కలిసి వాల్పారైకి విహారయాత్రకు వెళ్లారు. తిరిగి సొంత ఊరికి కారులో సోమవారం సాయంత్రం బయలుదేరారు. పొల్లాచ్చి నుండి పల్లడం వైపు వెళ్తుండగా, నెగమం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ నియంత్రణ కోల్పోయి వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధనపాల్, మేనక, స్నేహ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన కనిష్క, సుర్జిత్లను పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కనిష్క ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం సుర్జిత్ (12) కోవై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పొల్లాచ్చి డీఎస్పీ నవీన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కృష్ణగిరికి చెందిన లారీ డ్రైవర్ శరవణన్ను అరెస్ట్ చేశారు. మృదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఎం విజయ్ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. మృతులకు తలా రూ.3 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు సుర్జిత్ కు రూ.లక్ష సహాయాన్ని ప్రకటించారు. గాయపడిన బాలుడికి మెరుగైన, ప్రత్యేక చికిత్స అందించాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. -
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతుక వినిపించాలి
సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ స్పీకర్గా ఎన్నికై న జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్గా ఎన్నికై న రవిశంకర్లకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభాపతి వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులు అలంకరించిన ఈ ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వారు అసెంబ్లీ సంప్రదాయాలను, గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు భిన్నంగా ఉందని ఆయన గుర్తు చేశారు. అధికార పక్షం ఎమ్మెల్యేల సంఖ్య కంటే, సభలో ఉన్న ఇతర పార్టీల (ప్రతిపక్షాలు) మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యే ఎక్కువగా ఉందని, ఇదే ప్రజల తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతుక సభలో అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకు వాదనలు, ప్రజల సమస్యలు ఎక్కువగా వినిపించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువల ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ సభను నిష్పక్షపాతంగా నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తన సందేశంలో తెలిపారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశానికి స్టాలిన్ నిర్ణయించారు. అన్నా అరివాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు స్టాలిన్ సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అనర్హత వేటు వేయండి ● సేలం వెస్ట్ ఎమ్మెల్యే లక్ష్మణన్పై గవర్నర్కు ఫిర్యాదు సాక్షి,చైన్నె: సేలం వెస్ట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తమిళగ వెట్రి కళగం అభ్యర్థి ఎస్. లక్ష్మణన్ తన నామినేషన్ పత్రాల్లో కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, అందుకే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ స్వతంత్ర అభ్యర్థి సి. మనో గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. లక్ష్మణన్ తన ఎన్నికల అఫిడవిట్లో తనపై పెండింగ్లో ఉన్న అవి నీతి , కట్ట పంచాయటీ (అక్రమ సెటిల్మెంట్లు) సంబంధిత శాఖాపరమైన విచారణల వివరా లను పూర్తిగా వెల్లడించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. తనపై జరిగిన దర్యాప్తులో ఆరోపణలు నిరూపించబడలేదు అని పేర్కొంటూ వచ్చిన ఒక ప్రభుత్వ నివేదికను ఆయన అక్రమంగా ఉపయోగించుకున్నారని, తద్వారా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ,ుు భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, వాస్తవాలను దాచిపెట్టిన అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని మనో తన పిటిషన్లో కోరారు. ఈ వ్య వహారంపై సమగ్ర విచారణ జరిపి, లక్ష్మణన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు అవసరమై న చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరుణంలో, వరుసగా ఎమ్మెల్యేల గెలుపుపై కోర్టు కేసులు ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక్క ఓటుతో గెలిచిన తిరుపత్తూర్ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి వ్యతిరేకంగా హైకోర్టులో విచారణ జరుగుతుండటం గమనార్హం. ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులు ● సీనియర్ ఐఏఎస్లు బదిలీ సాక్షి, చైన్నె: తమిళనాడులో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పలువురు కీలక ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ కొత్త ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాత్రి జారీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శిగా గత ప్రభుత్వంలో కొనసాగి, ఎన్నికల కమిషన్ పక్కన పెట్టడంతో సెలవుపై వెళ్లిన ఎన్. మురుగానందంకు స్థాన చలనం కల్పించారు. సెలవు ముగించుకుని తిరి గి వచ్చిన మురుగానందంను ’రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ కమిషనర్గా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్న అముదా స్థానంలో ఆయన నియమితులయ్యారు. చైన్నె మెట్రో రైల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సిద్ధికీని అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న టి. ఉదయచంద్రన్ స్థానంలో సిద్ధికీ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రీయ శిక్షా అభియాన్ , స్టేట్ ప్లానింగ్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ ఎస్. స్వర్ణను పర్యాటక, సాంస్క్కతిక , దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. సహకార సంఘాల రిజి స్ట్రార్గా ఉన్న కె. నందకుమార్, ఇకపై తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయంలో కొత్త నియామ కాలు జరిగాయి. పాలనను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా ఒక తాత్కాలిక పోస్టును సృష్టించింది. తమిళనాడు సివిల్సప్ల య్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గాఉన్న అన్నాదురై నియమించారు. ప్రత్యేక పథకాల అమలు శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న వి. విష్ణును ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
నర్సులు సేవాభావం కలిగి ఉండాలి
వేలూరు: నర్సింగ్ సిబ్బంది సేవాభావాన్ని కలిగి ఉండాలని సంధ్య ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బత్తల సూరిబాబు అన్నారు. వేలూరు సత్వచ్చారిలోని సంధ్యా ఆసుపత్రిలో అంతర్జాతీయ తల్లుల దినోత్సవం, నర్సుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ సేవలు అందజేసిన నర్సులను అబినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ముందుగా నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంధ్యాబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బత్తల సూరిబాబు మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సులు చేసే సేవ మరువరాదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని డాక్టర్ల కన్నా ముందుగా నర్సులే చూస్తారని వారితో ప్రేమతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందజేయాలన్నారు. నర్సులు ఈ వృత్తిని ఉద్యోగంగా చూడకుండా సేవాభావంతో చూడాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడడంతోనే వారికి సగం రోగం నయమవుతుందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో ప్రతి ఒక్కరూ స్నేహ పూర్వకంగా కుటుంబ సభ్యుల తరహాలో చూడాలన్నారు. రోగుల సంక్షేమంపై నర్సులు కనబరిచే అంకితభావం, నిబద్దతను ఆయన కొనియాడారు. డాక్టర్ సంధ్యాబాబు మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సంరక్షణను అందజేయడానికి నర్సులు తమ వృత్తి పరమైన జ్ఞానాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందజేసిన నర్సులకు సర్టిఫికెట్లును అందజేశారు. ఈ కార్యక్రమంలో షణ్మగ ప్రియ, సుధ, చిత్ర, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
10వేల కిలోల వ్యర్థాల తొలిగింపు
కొరుక్కుపేట: ఒక రోజులో దాదాపు 10 వేల కిలోల వ్యర్థాలను తొలగించి అమీత్ విశ్వవిద్యాలయం ప్రత్యేకతను చాటుకుంది. అమీత్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2025–26 వార్షిక మెగా కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుస్థిరతీరంకోసం 10 వేల చేతులు అనే నినాదంతో తిరువాన్మియూర్ నుంచి కోవలం వరకు ఉన్న తూర్పు తీర రహదారి(ఈసీఆర్) పొడవునా 10వేల కిలోల వ్యర్థాల తొలిగింపే లక్ష్యంగా వివిధ విద్యా విభాగాలకు చెందిన విద్యార్థులు, క్యాడెట్లు, ఎన్ ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రిన్సిపల్స్, డీన్లు, డైరెక్టర్లు విభాధిపతులు , అధ్యాపక బృందాలు , బోధన, బోధనేతర సిబ్బంది సహా సుమారు 5 వేల మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కరోజులోనే దాదాపు 10 వేల కిలోల వ్యర్థాలను తొలగించడానికి తోడ్పాడ్డారు . ఈ సందర్భంగా వర్సిటీ చాన్స్లర్ డాక్టర్ జె. రామచంద్రన్ , అధ్యక్షులు డాక్టర్ ఆర్ రాజీవ్ రామచంద్రన్ , మేనేజింగ్ ట్రస్టీ సుశీల రామచంద్ర తదితరులు పాల్గొని మాట్లాడుతూ సముద్ర జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడం, బీచ్లను పరిశుభ్రంగా ఉంచడం, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఈ అవుట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. -
ఐఐటీ మద్రాసులో..
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసులోని పూర్వవిద్యార్థుల నేతృత్వంలోని డీప్ టెక్ స్టార్టప్ త్వస్తా ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ–రెడీ 3డి కాంక్రీట్ ప్రింటర్ను విడుదల చేసింది. ప్రపంచ నిర్మాణ సాంకేతిక సంస్థ అయిన 14ట్రీస్ సహకారంతో అభివృద్ధి చేయబడిన సీడర్ భారతదేశంలోనే రూపకల్పన చేయబడి, తయారు చేయబడింది. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల నేతృత్వంలోని స్టార్టప్, నిర్మాణ ఆటోమేషన్ను విస్తరించడానికి రూపొందించిన మొట్టమొదటి ఏఐతో సిద్ధమైన 3డి కాంక్రీట్ ప్రింటర్ అయిన ’సీడర్’ను అభివృద్ధి చేసి, ప్రారంభించడానికి ప్రపంచ నిర్మాణ సాంకేతిక సంస్థ అయిన ’14ట్రీస్’తో భాగస్వామ్యం కుదుర్చుకుందని త్వస్తా సీఈఓ అయిన శ్రీ ఆదిత్య వి.ఎస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 2016లో ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులచే స్థాపించిన త్వస్తా, సాంప్రదాయ సాంకేతికతలతో పోలిస్తే వేగవంతమైన, సుస్థిరమైన నిర్మాణ పద్ధతుల కోసం 3డి ప్రింటింగ్ ప్లాట్ఫారమ్లలో ఆటోమేషన్, రోబోటిక్స్ను ఉపయోగించడంపై దృష్టి సారించి ’మేడ్ ఇన్ ఇండియా’ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం చైన్నె కేంద్రంగా పనిచేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ 3డి ప్రింటింగ్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి రూపొందించబడిన సీడర్, నిర్మాణ 3డి ప్రింటింగ్ సాంకేతికతలో ఒక ప్రధాన పరిణామాన్ని సూచిస్తుందన్నారు. నిర్మాణ పరిశ్రమకు అవసరమైన స్థాయిలో ’సీడర్’ వ్యయ పోటీతత్వాన్ని ఎలా అందిస్తుందనే దానిపై వివరిస్తూ, 14 ట్రీస్ సీఈఓ ఫ్రాంకోయిస్ పెర్రోట్ మాట్లాడుతూ నిర్మాణ 3డి ప్రింటింగ్ ఇప్పటికే దాని సాంకేతిక సాధ్యాసాధ్యాలను నిరూపించుకుందన్నారు. ఈ సాంకేతికత ప్రపంచ నిర్మాణ పరిశ్రమ అంతటా విస్తరించాలంటే, ఇది డెవలపర్లు, కాంట్రాక్టర్లకు బలమైన ఆర్థిక ప్రయోజనాన్ని కూడా అందించాలన్నారు. ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచడానికి, వ్యయ అవరోధాన్ని తగ్గించడానికి, నిర్మాణ సంస్థలు 3డి ప్రింటింగ్ను పెద్దఎత్తున అమలు చేయడానికి వీలు కల్పించేలా సీడర్ను రూపొందించారన్నారు. -
ఐఐటీ మద్రాస్లో బీఎస్ డిగ్రీ.. జేఈఈ స్కోరుతో పనిలేదు
సాక్షి, చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ తమ బీఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ల కోసం 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి (ఇంటర్మీడియెట్) పూర్తి చేసిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి వయోపరిమితి లేదని ప్రకటించింది.సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లా కాకుండా, దీనికి జేఈఈ స్కోరుతో సంబంధం లేదని వివరించింది. అభ్యర్థులు ‘క్వాలిఫైయర్ ప్రాసెస్’ ద్వారా నేరుగా అడ్మిషన్ పొందవచ్చని, ప్రస్తుతం నాలుగు విభాగాల్లో ఈ బీఎస్ డిగ్రీలను అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బీఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, బీఎస్ ఇన్ ఎల్రక్టానిక్ సిస్టమ్స్, బీఎస్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డేటా సైన్స్, బీఎస్ ఇన్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్టు తెలిపారు.ఈ కోర్సులను రెగ్యులర్ కాలేజీ డిగ్రీ చదువుతూనే సమాంతరంగా పూర్తి చేయవచ్చని వివరించారు. తరగతులు ప్రధానంగా ఆన్లైన్ ద్వారా జరుగుతాయని, పరీక్షలు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో నేరుగా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అవసరాన్ని బట్టి సర్టిఫికెట్, డిప్లొమా, లేదా పూర్తి డిగ్రీ పొంది ఏ దశలోనైనా కోర్సు నుంచి వైదొలగవచ్చునని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఫీజులో 75 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో, మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిపార్ట్మెంటల్ టెస్ట్కు దరఖాస్తులు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు మే 2026 సెషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 13 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. అలాగే ఇంటర్ విద్యశాఖలో లైబ్రరీ సైన్స్ జూనియర్ లెక్చరర్ (లిమిటెడ్ రిక్రూట్మెంట్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలకు https://psc.ap.gov.in/లో చూడవచ్చు.చదవండి: గుడులు, లాకర్లలో బోలెడంత బంగారం..ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల పునరుద్ధరణ సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 740 మంది కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు 11 నెలల వ్యవధికి రెన్యూవల్ చేశారు. 2026–27కి ఒక నెల విరామంతో అవకాశం ఇస్తున్నామని, పనిచేయకపోతే జీతం లేదనే షరతుతో పునరుద్ధరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం -
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా జేసీడీ ప్రభాకర్
చెన్నై: తమిళనాడు 17వ శాసనసభ సభాపతి (స్పీకర్)గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా.. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.కాగా, జేసీడీ. ప్రభాకర్కు శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలపై అపారమైన అనుభవం ఉంది. 2011లో విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా ఇది వరకు ఉన్న జేసీడీ ప్రభాకర్ ప్రస్తుతం టీవీకే తరపున థౌజండ్ లైట్స్ నుంచి గెలిచారు. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం తరపున సీనియర్ నాయకుడు, థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన ఈ నామినేషన్ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇవాళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
బల పరీక్షకు ముందు టీవీకేకు షాక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో బల నిరూపణకు ముందు తమిళగ వెట్రి కగళం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ సేతుపతి ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున తిరుప్పత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పన్పై ఒక్క ఓటుతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో ఆ టైంలో హైడ్రామా నడిచింది. అయితే.. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపత్తూరు నియోజకవర్గం నం.185లో నమోదు కావలసిన ఓటు, పొరపాటున వెల్లూరు జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నం.50కి బదిలీ చేయబడిందని.. ఈ విషయంపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కరుప్పన్ కోర్టులో వాదించారు. ఈసీ మాత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్య అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఒక్క పోస్టల్ ఓటు కూడా ఇతర నియోజకవర్గానికి బదిలీ కాలేదని స్పష్టం చేసింది. అయితే.. కోర్టు పెరియా కరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు ఉన్నాయని గమనించింది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఓటు వేయడానికి వీల్లేదని శ్రీనివాస్కు తేల్చి చెప్పింది. అదే సమయంలో.. అన్ని పోస్టల్ బ్యాలెట్లను సురక్షితంగా భద్రపరచాలని, సంబంధిత వీడియో ఫుటేజ్ను కూడా కాపాడాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఓటింగ్కు శ్రీనివాస్ సేతుపతి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు మ్యాజిక్ ఫిగర్ 118. గవర్నర్కు విజయ్ సమర్పించిన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య 118. ఇందులో టీవీకే 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 ఉన్నాయి. బల నిరూపణకు ఒక్క ఎమ్మెల్యే దూరం అయితే ఆ ఫిగర్ 117కి పడిపోనుంది. అయితే ఏఎంఎంకే, అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు ప్రకటనతో గండం నుంచి విజయ్ గట్టెక్కే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. -
ఎన్డీయేకు ఝలక్.. విజయ్కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
విజయ్ ప్రమాణస్వీకారోత్సవం చూస్తూ..
తిరువొత్తియూరు: తిరుచ్చి నవ్లూర్ కుట్టపట్టు, వన్నంకోవై ప్రాంతానికి చెందిన జార్జ్ విలియం సేతురాజ్ (33) పెట్రోల్ బంక్ ఉద్యోగి. ఇతను నటుడు విజయ్కు వీరాభిమాని. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళగ వెట్రి కళగం లో తీవ్రంగా పనిచేశాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగం నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో అతను ఎంతో సంతోషించాడు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జరిగిన ఆలస్యం అతడిని కొంత ఆందోళనకు గురిచేసింది. దీంతో ఫలితాల కోసం 24 గంటలూ టీవీ చూస్తూనే ఉన్నాడు. ఆదివారం అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దశ్యాలను టీవీలో చూస్తుండగా, జార్జ్ విలియమ్కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే తన బైక్ మీద భార్యను కూర్చోబెట్టుకుని 3 కి.మీ దూరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో నొప్పి ఎక్కువవడంతో, అక్కడి నుంచి కారులో మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే జార్జ్ విలియం ప్రాణాలు విడిచాడు. అతిగా కలిగిన ఆనందంతో వచ్చిన గుండెపోటు మరణానికి కారణమని చెబుతు న్నారు. మరణించిన జార్జ్ విలియం కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అతనికి 4 ఏళ్ల కవల పిల్ల లు ఉన్నారు. అందులో జోస్వ అనే బాబు మూగవాడు (దివ్యాంగుడు). జార్జ్ తల్లిదండ్రులు కూడా వద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి విజయ్ అండగా నిలవాలని బంధువులు, స్థానికులు కన్నీళ్లతో కోరుతున్నారు. -
గేమ్ఛేంజర్.. కీర్తన
సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్. కీర్తన గురించిన చర్చ తమిళనాట ప్రధాన అంశంగా మారింది. 29 ఏళ్ల ఈ ’యువ తుపాన్’.. 5 భాషల్లో ప్రావీణ్యం..సాధించి ఉండడంతో ఆమె గురించిన ఆసక్తికర అంశాలను తెలుసుకునే వారు పెరిగారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాన్ని మరచి పోవడంతో ఆమెపై చర్చ మరింత ఊపందుకుంది. రాజకీయ వ్యూహకర్త నుండి మంత్రి వరకు.. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గం నుండి విజయం సాధించిన కీర్తన, కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సమర్థవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ (రాజకీయ వ్యూహకర్త). ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రఖ్యాత రాజకీయ సలహా సంస్థలైన ఐప్యాక్, షోటైమ్ కన్సల్టింగ్లో డిజిటల్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. కీర్తన తన వృత్తిపరమైన ప్రయాణంలో దేశంలోని హేమాహేమీలైన రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు. చదువు ..భాషా నైపుణ్యం విరుదునగర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన కీర్తన, మదురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్, పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఈమెకు తమిళం, తెలుగు, ఇంగ్లీష్ హిందీ, మలయాళం వంటి 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా విజయ్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె హిందీ నేర్చుకోవడం విశేషం.శివకాశిలో సరికొత్త రికార్డు 2026 ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ను 11,670 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గత 70 ఏళ్లలో శివకాశి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయ నేపథ్యం గానీ, ధన బలం గానీ లేకపోయినా.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే విజయ్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ∙నిదర్శనం అని కీర్తన వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి, రాజకీయ వ్యూహకర్తగా అనుభవం గడించి, నేడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన కీర్తన ప్రయాణం తమిళనాడులోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మారినట్లయ్యింది. -
లిక్కర్ షాపులపై విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కీలక హామీల ఫైల్స్పై ఆయన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మహిళల భద్రతకు సంబంధించిన టీం పర్యవేక్షణ తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆయన నిర్ణయించారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది విజయ్ సర్కార్.టాస్మాక్(Tamil Nadu State Marketing Corporation Limited) పరిధిలోని 717 మద్యం దుకాణాలు మూసేయాలని టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగానూ రెండు వారాల గడువు విధించింది. ఇవి ఆలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉండడమే కారణమని తెలుస్తోంది. మూసివేయబడే దుకాణాలు: 717276 – ఆధ్యాత్మిక స్థలాల దగ్గర186 – విద్యాసంస్థల దగ్గర255 – బస్స్టాండ్ల దగ్గరకాలపరిమితి: రెండు వారాల్లో ఈ దుకాణాలను మూసివేయాలని ఆదేశం.Tamil Nadu Chief Minister C. Joseph Vijay has ordered the closure of 717 government-run TASMAC liquor retail outlets located within a 500-meter radius of places of worship, educational institutions, and bus stations, within two weeks. pic.twitter.com/1eSSG18V2k— ANI (@ANI) May 12, 2026టాస్మాక్ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వహణను ఇదే చూసుకుంటోంది. అంటే అక్కడ ప్రైవేట్ షాపులు ఉండవన్నమాట. ప్రస్తుతం దీని పరిధిలో 4,765 దుకాణాలు (-717) ఉన్నాయి. విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయంపై మహిళలు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావొచ్చంటున్నారు. అయితే, TASMAC ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది.తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారాయన. -
విజయ్ ఎఫెక్ట్తో పళని విలవిల
ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. తప్పు చేయను, తప్పు చేయనివ్వను అంటూ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు విజయ్ ప్రకటించారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని డీఎంకే ఎంకే స్టాలిన్ హుందాగా ప్రకటించుకున్నారు. ఇంకోవైపు.. విజయ్ దెబ్బకు మరో విపక్షం అన్నాడీఎంకే మాత్రం వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టీవీకేకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు నాలుగు రోజుల హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్లో విజయ్ను దెబ్బ తీయాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కేవలం 47 మంది స్థానాలు నెగ్గిన అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం బద్ధశత్రువు డీఎంకే మద్దతు తీసుకోనుందనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. చివరకు ఆ ఎపిసోడ్ తుస్సుమంది. గ్రూపు రాజకీయాలతో.. అదీ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలోనే మొదలైన సంక్షోభంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకేలో వర్గపోరు మునుపెన్నడూ లేనంత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా పళనిస్వామి నాయకత్వంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఆయన డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారని.. మరో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం దీనిని వ్యతిరేకించిందని.. అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చర్చలు జరిపిందని జోరుగా ప్రచారం నడిచింది. పళనిస్వామి ఎమ్మెల్యేల మద్దతు కోసం వారిని పుదుచ్చేరి రిసార్ట్కి తరలించినా ఈ విభేదాలు చల్లారలేదు. చివరకు తన నివాసంలో కూర్చోబెట్టి బుజ్జగించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి..’’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అటుపై మే 10 రాత్రి జరిగిన మరో సమావేశం తీవ్ర వాగ్వాదాలతో ముగియడంతో.. షణ్ముగం వర్గం విడిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.తాజాగా.. సోమవారం తమిళనాడు కొత్త అసెంబ్లీ సమావేశమైంది. దీనికి పళనిస్వామి నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు, అలాగే షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా శాసనసభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్లిపోయారు. పళని స్వామిని శాసనసభా పక్ష నేతగా గుర్తించాలని ఆయన మద్దతుదారులు.. లేదు ఎస్పీ వేలుమణిని గుర్తించాలని షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి విడిగా లేఖలు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుతో అన్నాడీఎంకేలో మొదలైన విభేదాలు.. మరింత ముదిరి ఇంకో మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇవాళ జరగబోయే స్పీకర్ ఎన్నికలో షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగితే, పళనిస్వామికి సొంత పార్టీలోనే షాక్ తప్పదు.విజయ్ ప్రభావం అన్నాడీఎంకేలోని అంతర్గత సమీకరణాలను గణనీయంగా మార్చేస్తోంది. పళనిస్వామి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం ఆయనను విలవిలాడే స్థితిలోకి నెట్టింది. మొత్తం మీద, అన్నాడీఎంకేలోని ఈ చీలిక పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే.. ఈ పరిణామాలతో సైలెంట్గా లాభపడేది టీవీకే, బీజేపీ అనే విశ్లేషణ నడుస్తోంది. అసెంబ్లీలో విజయ్ టీవీకే బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఆ సమయంలో టీవీకేకు మద్దతు ప్రకటిస్తే పెనుసంచలనమే కానుంది. అయితే.. బయట మద్దతు తీసుకోవచ్చని.. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ విబేధాలను అన్నాడీఎంకే కూటమి పార్టీ బీజేపీ తమ వ్యూహంలో భాగంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బలహీనమైన అన్నాడీఎంకే ద్వారా టీవీకేపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.షణ్ముగం వర్గం బలపడితే, పళనిస్వామి నాయకత్వం కూలిపోవడం ఖాయం. ఇక స్పీకర్ ఎన్నికలో టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు పొందితే, ఆ ప్రభావం తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. -
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి భావననే దర్శకుడు విఘ్నేశ్ శివన్ వ్యక్తం చేశాడు. నయనతార భర్త అయిన ఇతడు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించారు. ఎస్జే.సూర్య విలన్. నయనతార రౌడీ పిక్చర్స్, సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించాడు. కాగా గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ప్రదీప్ రంగనాథన్ చేసిన గత చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎల్ఐకే ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఈ క్రమంలోనే చిత్ర ఫలితంపై విఘ్నేశ్ తాజాగా స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)నేను ఓ డ్రీమ్తో వచ్చాను. అది చిన్నది కాదు. ఈ మూవీ స్టోరీ కోట్ల థియేటర్లలో అదిరిపోతుందని నమ్మాను. ప్రేక్షకుల చప్పట్ల ధ్వని మారుమోగుతుందని భావించాను. ఎంటర్టైన్ చేసినప్పటికీ రూ.100 కోట్ల క్లబ్లోకి చేరలేదు. నిజం చెప్పాలంటే అంతకంటే రెండు రెట్లు వసుళ్లూ సాధిస్తుందని భావించాను. అయితే ఏదో సరిగా సెట్ అవ్వలేదు. ఫలితం బాధ కలిగించినా, నేను సంతోషంగా, సంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఇది విడుదలవ్వడమే పెద్ద బ్లాక్బ్టస్టర్. ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చినా, నేను ఇంకా నిలబడే ఉన్నాను. ఈ చిత్రం వెనుక ఎవరూ చూడని పలు ఇబ్బందులున్నాయి. అయినా నిజాయితీని, శ్రమను సంపాదించి పెట్టిందీ మూవీ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా)


