Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Umpire Bhi Paise Le Rahe Hai: Sehwag Big Take On Ishan Kishan Brain Fade Moment1
‘అంపైర్‌ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు.. నీకెందుకంత తొందర?!’

గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కమిన్స్‌ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. తద్వారా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇక సన్‌రైజర్స్‌ శుక్రవారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs SRH)తో తలపడనుంది. చెపాక్‌ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌ నుంచి వరుసగా విజయాలు సాధిస్తేనే కమిన్స్‌ బృందానికి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సొంత మైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ ముంబై చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రైజర్స్‌.. ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ముంబై బౌలర్ల ధాటికి టాపార్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది.ఇషాన్‌ కిషన్‌ స్వీయ తప్పిదంఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (0), అభిషేక్‌ శర్మ (8) పూర్తిగా విఫలం కాగా.. ఇషాన్‌ కిషన్‌ స్వీయ తప్పిదంతో వికెట్‌ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ను దీపక్‌ చహర్‌ వేయగా.. బంతిని డౌన్‌ ది లెగ్‌ ఆడేందుకు ఇషాన్‌ ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి వికెట్‌ కీపర్‌ రియాన్‌ రికెల్టన్‌ చేతిలో పడింది. అయితే, బాల్‌ ఇషాన్‌ బ్యాట్‌ లేదంటే గ్లౌవ్స్‌ను తాకిందా లేదా అన్న సందేహంతో ముంబై బౌలర్‌గానీ, వికెట్‌ కీపర్‌గానీ అప్పీలు చేయలేదు.అంపైర్‌ కూడా వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదు. కానీ ఇంతలోనే తాను అవుటయ్యాయని ఫిక్స్‌ అయి ఇషాన్‌ క్రీజును వీడాడు. ఏం జరిగిందో అర్థం కాని అంపైర్‌.. అవుట్‌ ఇచ్చేందుకు వేలు పైకెత్తాలా అన్న సందిగ్దంలో ఆఖరికి అవుట్‌ ఇచ్చాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇషాన్‌ కిషన్‌ నాటౌట్‌ అని తేలింది. దీంతో ఇషాన్‌ అమ్ముడుపోయాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇక ఈ ఘటనపై భారత మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఘాటుగా స్పందించాడు.అంపైర్‌ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు‘‘చాలాసార్లు ఇలాగే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. నిజంగా ఇదొక మతిలేని చర్య. కాసేపు ఆగితే ఏమయ్యేది?.. అంపైర్‌ కూడా తాను చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నాడు కదా!అతడు తన నిర్ణయం ప్రకటించేదాకానైనా ఎదురుచూడాలి. తన పనిని తనను చేసుకోనివ్వాలి. ఇదేం రకమైన నిజాయితీయో నాకైతే అర్థం కావడం లేదు. క్రీడాస్ఫూర్తిని పాటిస్తున్నానని అతడు ఇలా చేసి ఉండవచ్చు, కానీ అవుట్‌ కాకుండానే వెళ్లిపోవడం.. అది కూడా అంపైర్‌ను తికమకపెట్టేలా వ్యవహరించడం సరికాదు. హఠాత్తుగా అతడు అలా ఎందుకు వెళ్లిపోయాడో తెలియడం లేదు’’అంటూ సెహ్వాగ్‌ ఇషాన్‌కు చురకలు అంటించాడు.ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (71), అభినవ్‌ మనోహర్‌ (43) వల్ల ఈమాత్రం పరువునిలుపుకోగలిగింది. సన్‌రైజర్స్‌ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్‌ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు! Fairplay or facepalm? 🤯 Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025

Neeraj Chopra Breaks Silence On Inviting Arshad Nadeem Faced Hate2
పాక్‌ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్‌ చోప్రాపై ట్రోలింగ్‌!.. మా అమ్మ ఏం చేసింది?

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, ఒలింపిక్‌ పసిడి పతక విజేత నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్‌ను తన పేరిట జరిగే ఈవెంట్‌కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.నో చెప్పిన అర్షద్‌అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ జావెలిన్‌ ఈవెంట్‌’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు, ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అర్షద్‌ నదీమ్‌ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్‌ చోప్రా ఆహ్వానించాడు.అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని అర్షద్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్‌లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.‘‘జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్‌ చేశారు. ముఖ్యంగా పాక్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్‌ను నిందించారు. విద్వేష విషం చిమ్ముతున్నారుఈ నేపథ్యంలో నీరజ్‌ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.అర్షద్‌ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్‌ అయిన అర్షద్‌కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్‌ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.మా అమ్మ తప్పేముంది?బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.నన్ను, నా కుటుంబానికి టార్గెట్‌ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్‌ ’’ అంటూ సుదీర్ఘ నోట్‌ షేర్‌ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు.కాగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్‌లో అర్షద్‌ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్‌- అర్షద్‌ టోక్యో, ప్యారిస్‌ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.ఇక ప్యారిస్‌లో నీరజ్‌ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్‌ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్‌ తల్లి పేర్కొన్నారు. అర్షద్‌ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్‌తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్‌ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్‌

Maybe Wont See Him Next Year: Sehwag Stunning Statement Advises RR youngster3
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్‌ ఆచితూచి అడుగేస్తూ కెరీర్‌ ప్లాన్‌ చేసుకోవాలని సూచించాడు.రూ. 1.10 కోట్లకుదేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడుకెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్‌ వచ్చాడు. టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌తో కలిపి రాజస్తాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కిన ఈ బిహార్‌ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు.అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్‌ చేరిపోయాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ వైభవ్‌ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్‌ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడుఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్‌ల ద్వారా ఫేమస్‌ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్‌ ప్లేయర్‌ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్‌ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్‌ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్‌ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్‌ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: క్రెడిట్‌ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్‌𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025

Ex Pakistan Star Slams Deputy PM For His Comments On Pahalgam Incident4
పాకిస్తాన్‌ ఉప ప్రధాని వ్యాఖ్యలు.. మండిపడ్డ పాక్‌ మాజీ క్రికెటర్‌

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా (Danish Kaneria) స్పందించాడు. ఇషాక్‌ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్‌ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బైసరన్‌ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపిన తీవ్రవాదులు.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్‌ కూడా పహల్గామ్‌ దాడిని ఖండించింది.స్వాతంత్ర్య సమరయోధులా?అయితే, పాక్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ (Ishaq Dar) మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో దాడులు చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. దీంతో ఇషాక్‌ దార్‌ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు.నేరుగా ఒప్పుకోవడమేఈ క్రమంలో పాక్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా కూడా ఇషాక్‌ దార్‌ తీరుపై ఘాటుగా స్పందించాడు. ఎక్స్‌ వేదికగా అతడి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘పాకిస్తాన్‌ ఉప ప్రధానే స్వయంగా ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తుంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.ఇది కేవలం సిగ్గుచేటు మాత్రమే కాదు.. తమ దేశం ఉగ్రవాదానికి దన్నుగా ఉందని నేరుగా ఒప్పుకోవడమే అవుతుంది’’ అని కనేరియా ట్వీట్‌ చేశాడు. కాగా పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన కనేరియా.. జట్టులో ఉన్నపుడు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు వెల్లడించాడు.అవమానాలు ఎదుర్కొన్నాహిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. పాకిస్తాన్‌ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా కనేరియా జట్టులో ఉండటం చాలామందికి నచ్చేదికాదని పేర్కొనడం గమనార్హం.ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన 44 ఏళ్ల కనేరియా.. ఆయా ఫార్మాట్లలో 261, 15 వికెట్లు తీశాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం యూకేలో అతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగగానే కనేరియా స్పందించాడు. పాకిస్తాన్‌ హస్తం గనుక లేకపోతే.. పాక్‌ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు. పాక్‌ ప్రభుత్వమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోందని ఆరోపించాడు.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025

Yashasvi Jaiswal Creates History Becomes First Batter In IPL To Achieve This5
చరిత్ర సృష్టించిన జైస్వాల్‌.. ఐపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా..

రాజస్తాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఇంత వరకు సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే మూడుసార్లు సిక్సర్‌ బాదిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.రాయాల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌ సందర్భంగా జైస్వాల్‌ గురువారం ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా ఆర్సీబీ- రాజస్తాన్‌ (RCB vs RR) గురువారం తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.205 పరుగులుఓపెనర్లలో ఫిల్‌ సాల్ట్‌ (26) ఫర్వాలేదనిపించగా.. విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 70) దంచికొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50), టిమ్‌ డేవిడ్‌ (15 బంతుల్లో 23), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జైస్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసేందుకు ఆర్సీబీ సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రంగంలోకి దిగగా.. తొలి బంతినే జైసూ సిక్సర్‌గా మలిచాడు.తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్‌ కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఉన్న జైసూ.. మూడుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ మొత్తంగా 19 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 49 పరుగులు రాబట్టాడు. అయితే, జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రొమారియో షెఫర్డ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.అంతేకాదు.. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా పతనమైంది. నితీశ్‌ రాణా (28), రియాన్‌ పరాగ్‌ (22), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినా.. 20 ఓవర్లలో రాజస్తాన్‌ 194 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్‌లో తొలి బంతికే సిక్సర్లు బాదిన క్రికెటర్లు1.యశస్వి జైస్వాల్‌- 32. నమన్‌ ఓజా-13. మయాంక్‌ అగర్వాల్‌- 14. సునిల్‌ నరైన్‌- 15. విరాట్‌ కోహ్లి- 16. రాబిన్‌ ఊతప్ప- 17. ఫిల్‌ సాల్ట్‌- 18. ప్రియాన్ష్‌ ఆర్య- 1.చదవండి: ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా విరాట్‌ కోహ్లి ఘనత Woke up and said Pehla ball, JaisBall 🔥 pic.twitter.com/pg4w29Jl2G— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2025

IPL 2025: Patidar Lauds RCB Bowlers Strong Comeback vs RR Credit To Them6
క్రెడిట్‌ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం సాధించింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. తద్వారా ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో తొలి గెలుపు నమోదు చేసి విమర్శలకు చెక్‌ పెట్టింది.క్రెడిట్‌ మొత్తం వారికేఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) హర్షం వ్యక్తం చేశాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేము సత్ఫలితం రాబట్టాము. ఈరోజు వికెట్‌ కాస్త భిన్నంగా ఉంది. అయినా మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.ఈ గెలుపులో క్రెడిట్‌ మొత్తం వారికే దక్కుతుంది. పదో ఓవర్‌ తర్వాత వారు చూపిన తెగువ అద్భుతం. ఇక ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కూడా ఎంతో చక్కగా బ్యాటింగ్‌ చేశారు. వాళ్లకు కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే.గొప్ప నాయకులు ఉన్నారు.. కానీమేము వికెట్ల వేటలో ఉన్న వేళ మా మనసు చెప్పినట్లు విన్నాను. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినపుడే వికెట్లు కూడా తీయగలుగుతాం. జట్టులో ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వారిచ్చే సలహాలు, సూచనలు కూడా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు దోహదం చేస్తాయి. అయితే, నా ప్రణాళికలకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను’’ అని రజత్‌ పాటిదార్‌ చెప్పుకొచ్చాడు.కోహ్లి, పడిక్కల్‌ ధనాధన్‌కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 70), దేవదత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50), టిమ్‌ డేవిడ్‌ (15 బంతుల్లో 23), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్‌) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌కు శుభారంభం లభించింది.జైసూ విధ్వంసంఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, జైసూ అవుటైన తర్వాత సీన్‌ మారిపోయింది. అంతకుముందు.. మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 16 పరుగులకే నిష్క్రమించగా.. నితీశ్‌ రాణా(28), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (22) నిరాశపరిచారు.చెలరేగిన హాజిల్‌వుడ్‌ఆఖర్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (34 బంతుల్లో 47) విజయంపై ఆశలు పెంచాడు. అయితే, 20 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టపోయిన రాజస్తాన్‌ 194 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 11 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌ నాలుగు వికెట్ల(4/33) చెలరేగగా.. కృనాల్‌ పాండ్యా రెండు, భువనేశ్వర్‌కుమార్‌, యశ్‌ దయాళ్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఇది ఆరో విజయం. ఈ నేపథ్యంలో పన్నెండు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు.. తొమ్మిదింట ఏడు ఓడిన రాజస్తాన్‌ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 that speak louder than words 🥳#TATAIPL | #RCBvRR | @imVkohli | @RCBTweets pic.twitter.com/Q4B09fkllE— IndianPremierLeague (@IPL) April 24, 2025

Next 78000 Years: Gavaskar Lambast Perpetrators Behind Pahalgam Incident7
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్‌ ఫైర్‌

పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్‌ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.బైసరన్‌ లోయలోఉ‍గ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్‌ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్‌‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లో ‘మినీ స్విట్జర్లాండ్‌’గా పేరుగాంచిన బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు. బాధితులకు అండగాఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, విరాట్‌ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, మహ్మద్‌ సిరాజ్, సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్, పార్థివ్‌ పటేల్, శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, అనీల్‌ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్, స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాక్సర్‌ నిఖత్‌ జరీన్, పీఆర్‌ శ్రీజేశ్‌ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అంతేకాదు.. పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్‌ గావస్కర్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితిదుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్‌ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..

Big Blow To PCB: PSL Live Streaming Suspended In India after Pahalgam Incident8
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) ప్రసారాలు భారత్‌లో బంద్‌ అయిపోయాయి. పాక్‌ బోర్డుకు చెందిన పీఎస్‌ఎల్‌ టోర్నీని భారత్‌లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్‌ కోడ్‌’ మొబైల్‌ స్ట్రీమింగ్‌ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్‌ ఘటన నేపథ్యంలో భారత్‌లో ఇకపై పీఎస్‌ఎల్‌ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్‌ కోడ్‌’ వెల్లడించింది. మరోవైపు పీఎస్‌ఎల్‌ టోర్నీ కోసం పాకిస్తాన్‌లో ఉండి మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్‌కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్‌ఎల్‌లో ఇంజినీర్లు, ప్రొడక్షన్‌ మేనేజర్లు, కెమెరామెన్‌లు, ప్లేయర్‌ ట్రాకింగ్‌ ఎక్స్‌పర్ట్‌లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్‌ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్‌ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్‌ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్‌ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్‌ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్‌ మ్యాచ్‌లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్‌తో క్రికెట్‌ సిరీస్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్‌ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడింది. పాక్‌ను లీగ్‌ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Sunrisers Hyderabad vs Chennai Super Kings important match today9
CSK vs SRH: గెలిచి నిలిచేనా!

చెన్నై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పరాజయలతో సతమతమవుతోన్న గత ఏడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)... ఐదుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మధ్య నేడు కీలక మ్యాచ్‌ జరగనుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడి... 2 విజయాలు, 6 పరాజయాలతో నాలుగేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. పట్టికలో సన్‌రైజర్స్‌ తొమ్మిదో స్థానంలో ఉండగా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ విజయం తప్పనిసరి అయిన నేపథ్యంలో... ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. చెన్నై జట్టు ఈ ఏడాది కనీస ప్రదర్శన కనబర్చలేక ఇబ్బంది పడుతుంటే... బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్‌ మూల్యం చెల్లించుకుంటోంది. ఇరు జట్లకు మరో ఆరేసి మ్యాచ్‌లు మిగిలి ఉండగా... అన్నీ మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తేనే సులువుగా ప్లే ఆఫ్స్‌కు చేరే చాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో... స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉన్న పిచ్‌పై హైదరాబాద్‌ను పడగొట్టి ముందంజ వేయాలని ధోనీ సారథ్యంలోని చెన్నై భావిస్తోంది.మరోవైపు బ్యాటింగ్‌ లోపాలను సరిచేసుకొని తిరిగి భారీ స్కోర్లతో విజృంభించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ చూస్తోంది. బుధవారమే హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో ముంబై చేతిలో ఓటమి మూటగట్టుకున్న రైజర్స్‌... 48 గంటలు తిరిగేసరికి చెన్నైతో మ్యాచ్‌కు రెడీ అయింది. మరి ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పరాజయాలతో సహవాసం చేస్తున్న ఇరు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! తీవ్ర ఒత్తిడిలో ధోనీ సేన... సాధారణంగా చెపాక్‌లో మ్యాచ్‌ అంటే... చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగడం పరిపాటి. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ధోని సేన స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుంటంతో ఆ జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. కోల్‌కతాతో మ్యాచ్‌లో అయితే చెన్నై మరీ నాసిరకం ఆటతీరు కనబర్చింది. క్రీజులో నిలవడమే తెలియదన్నట్లు బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయంతో జట్టుకు దూరమవడంతో... జట్టు పగ్గాలు అందుకున్న ధోని కూడా సీఎస్‌కే రాత మార్చలేకపోతున్నాడు. టాపార్డర్‌లో ధాటిగా ఆడే బ్యాటర్‌ లేకపోవడం... మిడిలార్డర్‌లో మునుపటి మెరుపులు లోపించడం... ధోని స్వేచ్ఛగా భారీ షాట్‌లు ఆడలేకపోవడం... ప్రత్యర్థి స్పిన్నర్లు విజృంభిస్తున్న చోట చెన్నై బౌలర్లు నామమాత్ర ప్రదర్శన కనబర్చడం... వెరసి చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఆశ ఏదైనా ఉంది అంటే... అది యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రే మెరుపులే. గత మ్యాచ్‌ ద్వారానే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 17 ఏళ్ల మాత్రే... ముంబై పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 15 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని భావిస్తుండగా... రచిన్‌ రవీంద్రలో నిలకడ కొరవడింది. మిడిలార్డర్‌లో జడేజా, దూబే, విజయ్‌ శంకర్‌ కీలకం కానున్నారు. ఓవర్టన్, పతిరణ, ఖలీల్‌ అహ్మద్, నూర్‌ అహ్మద్, అశ్విన్, జడేజాతో బౌలింగ్‌ మెరుగ్గా ఉంది. ఏవీ ఆ మెరుపులు! సీజన్‌ ఆరంభ పోరులోనే దాదాపు మూడొందల పరుగులతో బీభత్సం సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆ తర్వాత లయ కోల్పోయింది. పంజాబ్‌ కింగ్స్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి తిరిగి గాడిన పడింది అనుకుంటే... పాత పాటే పునరావృతం చేస్తోంది. గత రెండు మ్యాచ్‌లను ముంబైతోనే ఆడిన సన్‌రైజర్స్‌ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. రైజర్స్‌ ఓటముల సంఖ్య కన్నా... ఆరెంజ్‌ ఆర్మీ ఆడుతున్న తీరే అభిమానులను కలవరపెడుతోంది. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరగడం... జట్టు ఆలోచన విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్, అభిõÙక్‌ శర్మ నిలకడ కొనసాగించలేకపోతుండగా... ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌ పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో క్లాసెన్‌పై అధిక భారం పడుతోంది. అభినవ్‌ మనోహర్, అనికేత్‌ వర్మ నుంచి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరింత ఆశిస్తోంది. దూకుడుకు మారుపేరుగా నిలిచిన రైజర్స్‌... ఇప్పుడు అదే తొందరపాటులో వికెట్లు కోల్పోయి చతికిలబడుతోంది. ఇక చెన్నైలో రైజర్స్‌కు మంచి రికార్డు లేదు. చెపాక్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఆరెంజ్‌ ఆర్మీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. కమిన్స్, షమీ, హర్షల్‌ పటేల్, జీషన్‌ అన్సారీ ఇషాన్‌ మలింగతో కూడిన బౌలింగ్‌ బృందం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోతోంది. ‘అభిషేక్, హెడ్‌ విఫలమవుతున్నప్పుడు ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్‌లో అదే కొరవడింది. భాగస్వామ్యాలు నమోదు చేయడంలో మా ఆటగాళ్లు విఫలమవుతున్నారు’ అని సన్‌రైజర్స్‌ కోచ్‌ వెటోరీ అన్నాడు. 400టి20ల్లో ధోనికి ఇది 400వ మ్యాచ్‌. ఈ మార్క్‌ చేరుకున్న నాలుగో భారత ప్లేయర్‌గా అతడు నిలవనున్నాడు. రోహిత్‌ శర్మ (456), దినేశ్‌ కార్తీక్‌ (412), విరాట్‌ కోహ్లి (407) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తుది జట్లు (అంచనా)సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్, ఇషాన్‌ కిషన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్, అనికేత్‌ వర్మ, అభినవ్‌ మనోహర్, హర్షల్‌ పటేల్, జైదేవ్‌ ఉనాద్కట్, జీషన్‌ అన్సారీ, ఇషాన్‌ మలింగ. చెన్నై సూపర్‌ కింగ్స్‌: ధోని (కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, షేక్‌ రషీద్, ఆయుశ్‌ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, విజయ్‌ శంకర్, జేమీ ఓవర్టన్, అశ్విన్, నూర్‌ అహ్మద్, ఖలీల్‌ అహ్మద్, పతిరణ.

Koneru Hampi is happy to perform well in the classical format10
‘మళ్లీ నా సమయం వచ్చింది’

పుణే: క్లాసికల్‌ ఫార్మాట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని... భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పేర్కొంది. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ ఐదో అంచె టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి హంపి విజేతగా నిలిచింది. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు జినెర్‌తో కలిసి హంపి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే నల్లపావులతో ఎక్కువ గేమ్‌లు ఆడినందుకు హంపికి టైటిల్‌ దక్కింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ స్పందిస్తూ... ‘క్లాసికల్‌లో మెరుగైన ప్రదర్శన చేయక చాలా రోజులైంది. గతేడాది మొత్తం ఈ ఫార్మాట్‌లో నా తడబాటు సాగింది. దీంతో ఎన్నో పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చిoది. అందుకే ఇందులో టైటిల్‌ గెలవడం ఆనందాన్ని పెంచింది. ర్యాపిడ్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలిచినప్పటి నుంచి నా ఆటతీరు మెరుగైంది. తిరిగి నా టైమ్‌ వచ్చినట్లు అనిపిస్తోంది. రెండోసారి ర్యాపిడ్‌ టైటిల్‌ సాధించిన అనంతరం నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. చిన్నప్పుడు ఆడిన ఆటకు ఇప్పుడు ఆడుతున్న ఆటకు చాలా తేడా ఉంది. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్లు మనం కూడా మారాలి. నాకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ప్రత్యర్థితో పోటీపడి గెలవడం బాగుంది’ అని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని 38 ఏళ్ల హంపి... క్యాండిడేట్స్‌ టోర్నీకి ఎంపిక గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పింది. ప్రస్తుతానికి అమెరికా, నార్వేలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. సాధారణంగా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను పడగొట్టే హంపి... తాజా టోర్నీలో మాత్రం ఆచితూచి ఆడింది. వివాదాలకు దూరంగా ఉండే... హంపికి సరైన సపోర్టింగ్‌ వ్యవస్థ ఉంటే మరిన్ని ఫలితాలు సాధిస్తుందని పుణే గ్రాండ్‌మాస్టర్‌ అభిజీత్‌ కుంటే అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లో లెక్కకు మిక్కిలి టైటిల్స్‌ గెలిచిన హంపి క్యాండిడేట్స్‌ ప్రపంచ టైటిల్‌ మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అభిజీత్‌ మాట్లాడుతూ.. ‘హంపీ చాలా చక్కగా ఆడుతోంది. ఆమె ఆటలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ప్రపంచ టైటిల్‌ సాధించేందుకు ఇదొక్కటే సరిపోదు. నిష్ణాతులైన బృందం ఆమెకు తోడ్పాటు అందించాలి. ఇప్పుడు ఆమె ఆటతీరు బాగలేదని కాదు కానీ... బలమైన మెంటారింగ్‌ అవసరం’ అని అన్నాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement