breaking news
-
కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చారు..: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చాడంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు పథఖం బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండు అంటూ సెటైర్లు వేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయిలు రాహుల్ గాంధీకి పంపించడమే రాహుల్ బంధు పథకం అంటూ విమర్శించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సిరిసిల్లలో కేటీఆర్ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే టైమ్లోన రైతుబంధు పడుతూ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకూ ఎవరికైనా రైతుబంధు పడిందా? అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రశ్నించారు. సంవత్సరానికి వేయి కోట్లు కట్టి పదవి కాపాడుకుంటుండు. ఖమ్మం వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లు కూల్చిండు.మహబూబ్నగర్లో దివ్యాంగుల ఇళ్ళు కూల్చారు. సీఎం సొంత ఇల్లు కొడంగల్ కోస్గిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంది. 6 గారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.. వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదు. అనాడు మూడో పంటకు రైతుబంధు వేయాలన్నారు.. ఇవాళ మూడో నెల వచ్చినా రైతుబంధు వేయడంలేదు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తా అన్నారు. పంట పంటకు బోనస్ ఇస్తా అన్నారు. అత్తలకు 4 వేలు కోడలు 2,500 ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా..?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. -
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. -
‘మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’
సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు. -
హరీష్ రావుపైనే మా అమ్మ పోటీ.. కవిత కుమారుడు ఆదిత్య
ప్రశాంత్నగర్ (సిద్దిపేట): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ (కల్వకుంట్ల కవిత) సిద్దిపేట నుంచే పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు. మే నెలలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆదిత్య తెలిపారు. -
చిట్టక్క ఎంట్రీతో పరకాల పాలిటిక్స్కి కొత్త ట్విస్ట్..!
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. -
వీడిన ఉత్కంఠ.. తెలంగాణలో రాజ్యసభకు ఇద్దరు ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో, అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది.అలాగే, తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ తిలక్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, హర్యానా నుంచి కరమ్ వీర్ సింగ్, చత్తీస్గఢ్ నుంచి ఫులోదేవి నేతంను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం జాబితాను విడుదల చేసింది. కాగా, నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేయకుంటే.. ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.Abhishek Manu Singhvi and Vem Narender Reddy from Telangana.Phulo Devi Netam from Chhattisgarh.Karamvir Singh Boudh from Haryana.Anurag Sharma from Himachal Pradesh.M. Christopher Tilak from Tamil… pic.twitter.com/o2JwrC5Ax2— ANI (@ANI) March 5, 2026 -
పెద్దలు 'వేం' చేశారు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో మల్లగుల్లాలు, సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి బరిలో నిలిచే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీతోపాటు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వేం నరేందర్రెడ్డికి అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కిరాగానే, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు స్వయంగా వేం నరేందర్రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు అభినందనలు తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేస్తారు. ఆ మూడు పేర్ల చుట్టే తిరిగిన చర్చ అభ్యర్థుల ఖరారుకు ముందు ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థి ఎంపికకు సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఢిల్లీకి చేరుకున్నా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర కీలక నేతలు అందుబాటులో లేరు. దీంతో సీఎం వారితో జూమ్ యాప్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వర్చువల్ మీటింగ్లో ప్రధానంగా మూడు పేర్ల చుట్టే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వేం నరేందర్రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, వినయ్కుమార్ పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించింది. నెగ్గిన రేవంత్ పట్టు ! ఈ జూమ్ మీటింగ్లో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వినయ్కుమార్కు అవకాశం ఇస్తే బాగుంటుందనే వైఖరితో ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి ఈసారి ఎలాగైనా అవకాశం ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఆయన సీనియారిటీని ఈ సందర్భంగా సీఎం వివరించినట్టు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం సీఎం పట్టుదలకే అధిష్టానం గౌరవం ఇచ్చింది. వేం నరేందర్రెడ్డి వైపే మొగ్గుచూపి, జాతీయ కోటాలో అభిషేక్ మను సింఘ్వీతో కలిపి ఆయన పేరును ఖరారు చేసింది. అభ్యర్థుల బయోడేటా: వేం నరేందర్రెడ్డి జననం: 1960 తల్లిదండ్రులు: వేం వెంకటమ్మ– చెన్న కృష్ణారెడ్డి విద్యార్హతలు: బీఏ కుటుంబ నేపథ్యం: భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్) రాజకీయ ప్రస్థానం: ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు మహబూబూబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ, పార్టీలో ట్రబుల్ షూటర్గా, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. అభిషేక్ మను సింఘ్వీ జననం: 24 ఫిబ్రవరి 1959 స్వస్థలం: జోధ్పూర్ (రాజస్తాన్) తల్లిదండ్రులు: లక్ష్మీమాల్ సింఘ్వీ, కమల్ సింఘ్వీ కుటుంబ నేపథ్యం: ఇద్దరు పిల్లలు విద్యార్హతలు: ఢిల్లీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఏ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు. రాజకీయ ప్రస్థానం: గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవం ఉంది. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానం నుంచి 2024 ఆగస్టు 28న రాజ్యసభకు వెళ్లారు. -
పట్టు పట్టి.. సన్నిహితుడికి ‘పట్టం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన సారే అనుకున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్కుమార్యాదవ్కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు. తమిళనాడు తికమక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది. ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్రెడ్డికి కేటాయించారు. నేడు నామినేషన్లు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. -
‘రాజ్యసభ’కు బీఆర్ఎస్ దూరం ?
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. కొండా సుస్మిత సంచలన ప్రకటన
సాక్షి, వరంగల్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు సుష్మిత క్లారిటీ ఇచ్చారు. దీంతో, పరకాల రాజకీయంపై ఆసక్తి నెలకొంది.మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. బుధవారం వరంగల్ జిల్లాలోని కొమ్మాల జాతరకు వచ్చారు. జాతర వేదికగా కొండా సుస్మితా మాట్లాడుతూ..‘నా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైంది. నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొండా మురళీ ఇప్పటికే ముగ్గురు నలుగురు గుండెల్లో నిద్ర పోతున్నాడు. నేను పరకాలకు వస్తా మీ బాధలు తీరుస్తాను. మీరంతా బాధల్లో ఉన్నారని నాకు అర్థం అవుతోంది. పరకాలలో ప్రతీ కార్యక్రమానికి వెళ్తాను.తెలంగాణ రాజకీయాల్లోకి నేను వస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తాను. పరకాల నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. పరకాల నుంచి ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తాను. మా నాన్న కొంచెం ప్రశాంతంగా మాట్లాడమన్నారు. అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నా.. లేకపోతే మరోలా ఉండేది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
సీఎం రేవంత్కు కేందమంత్రి కిషన్రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బడ్జెట్ సమావేశాల కంటే ముందే పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించిన కిషన్రెడ్డి.. రాష్ట్రంలో జీతాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలు.. ఇలా ఏ పని చేయాలన్నా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు.సాస్కి (SASCI) పథకం కింద తెలంగాణకు రూ.10,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను కేంద్రం అందించిందని కిషన్రెడ్డి వివరించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ఖజానా ఖాళీ అని నెపం నెట్టడంపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో ఆయన స్పష్టీకరించారు.‘‘2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు, ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు...రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే, ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరును చూస్తుంటే, రాష్ట్ర ఖజానా నిల్ - కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోంది...2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తూ వస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది...అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36,000 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50,000 కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40,000 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50,000 కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40,000 కోట్లకు పైగా నిధులు, రూ.12,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14,000 కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80,000 కోట్లకు పైగా నిధులు, విద్య & క్రీడలకు రూ.21,000 కోట్లకు పైగా నిధులు, దాదాపు రూ.9,000 కోట్ల ఆరోగ్య సంరక్షణ నిధులు మొదలైనవి ఉన్నాయి...అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించింది. మరో రూ.60,000 కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి పత్తిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ. 10 లక్షల కోట్ల ఋణాలను కూడా తెలంగాణ రాష్ట్రానికి అందించింది.వీటికి అదనంగా రాష్ట్రాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మూలధన పెట్టుబడి నిధుల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల కాలపరిమితితో కూడిన వడ్డీ రహిత ఋణాలను అందించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అదనపు సహకారాన్ని అందించాలనే ప్రధానమంత్రి మోదీ గారి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం “స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్(SASCI)” పేరిట ఒక నూతన పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది...కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించిన ఈ సౌలభ్యాన్ని సానుకూలంగా అందిపుచ్చుకున్న రాష్ట్రాలు 2020-21 నుండి నేటి వరకూ మూలధన పెట్టుబడితో కూడిన అనేక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఈ ఋణాల ద్వారా సమకూర్చుకున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. SASCI పథకం కింద 2020-21 నుంచి 2025-26 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 10,000 కోట్లకు పైగా వడ్డీ రహిత ఋణాలను అందించడం జరిగింది. ఈ ఋణాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూలధన పెట్టుబడితో కూడిన కొన్ని వందల ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయి...మురుగునీటి నాళాలు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఆసుపత్రులు, మెడికల్ & నర్సింగ్ కాలేజీలు, సంక్షేమ, మైనారిటీ పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి-మూసీ నది అనుసంధానం, మూసీ నది సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్ లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వలన పాడైపోయిన నిర్మాణాల పునరుద్ధరణ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారు. ..ముఖ్యంగా MMTS ఫేజ్ - II కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ. 114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ. 315 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజన కోసం రూ. 674 కోట్లు, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ. 110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది. ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు ఋణాలు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉంది. ..2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది...ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి, మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
గులాంగిరీ చేయొద్దు: రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా అయ్యే అవకాశం కూడా వస్తుందని అన్నారు. డీసీసీల అధ్యక్షులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికీ గులాంగిరీ చేయొద్దని, పార్టీకి కళ్లు, చెవులు మీరేనని స్పష్టం చేశారు. సాధారణంగా (సింపుల్గా) ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల్లో పార్టీని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. దేహీ అంటే పదవులు రావని, డీసీసీ అధ్యక్షుల కార్యాచరణ పదవులే పరమావధిగా ఉండకూడదని, ప్రజల కోణంలో ఉండాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగించేలా పని చేయాలని, పార్టీకి ప్రజల్లో మంచి పేరు తేవాలని కోరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరితా రిసార్ట్స్లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ 4 గంటల పాటు వారితో సమావేశమై పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. బీజేపీ ప్రజల గురించి ఆలోచించదు.. ‘పార్టీకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే సుప్రీం. మీరంతా నా టీమ్. భవిష్యత్తు అంతా మనదే. పార్టీ ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకునే బాధ్యత మీది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీకు సర్వాధికారాలు ఇచ్చాం. మీరు పదవిని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రజలతో మమేకం కండి. ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది మనమే. మన వల్లనే ప్రజలకు ఎక్కువ లబ్ది కలిగింది. ఈ విషయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు. కానీ మనం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాం. అప్పుడే రాజకీయాలు చేస్తున్నాం. ప్రత్యర్థి పార్టీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎలా నష్టం కలిగించాలన్నదే బీజేపీ, మోదీ ఉద్దేశం. ఎలాగైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. వాళ్లు ఓట్ల కోసం స్వార్థంతో ఆలోచిస్తారే తప్ప ప్రజల గురించి ఆలోచించరు. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లేలా మనం పనిచేయాలి. మీరు నిలబడండి. పార్టీని నిలబెట్టండి..’ అని రాహుల్ విజ్ఞప్తి చేశారు. ఉన్నోడి వైపు బీజేపీ..లేనోడి వైపు కాంగ్రెస్ ‘సామాజిక న్యాయం మన పార్టీ సిద్ధాంతంలోనే ఉంది. జనాభా దామాషా ప్రకారం వనరుల పంపిణీ గురించి చర్చ చేసింది, దేశంలో కులగణన చర్చను ప్రారంభించింది మనమే. ఆ వర్గాల పట్ల మనకు చిత్తశుద్ధి ఉంది. అందుకే తెలంగాణలో బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, మైనార్టీల పక్షం వహిస్తున్నాం. దేశంలో రెండే వర్గాలున్నాయి. ఉన్నోడు.. లేనోడు. ఉన్నోడి వైపు బీజేపీ ఉంటే లేనోడి వైపు కాంగ్రెస్ ఉంది. బీజేపీది విభజన సిద్ధాంతం అయితే, మనది ఐక్యతా దృక్పథం. మనది అహింసా వాదం, వారిది మతం కోసం రాజకీయ వాదం. మనది గాంధేయవాదం, వారిది హింసా వాదం. మనం అన్ని మతాలు, కులాల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ బీజేపీ అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేయదు. శివుడిలా మనం సామాన్యంగా ఉండాలి హిందువులు ఆరాధించే శివుడు సామాన్యుడిలా కనిపిస్తాడు. ఆయన లాగానే మనమూ సామాన్యంగానే ఉండాలి. ఆయన అందరికీ తానున్నానని అభయహస్తం ఇస్తాడు. మన పార్టీ గుర్తు కూడా హస్తమే. మనం అందరినీ కలుపుకొని వెళ్లి ప్రజలకు తామున్నామనే అభయం ఇవ్వాలి. ప్రజలను మెప్పించి, వారి సమ్మతితోనే అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ఆలోచన. అదే మన సిద్ధాంతం. పార్టీలో మహిళలను గౌరవించాలి. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్ళాలి. బీజేపీ ద్వేషం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ ఆగడాలను అడ్డుకుని దేశాన్ని రక్షించాలి..’ అని రాహుల్ చెప్పారు. ట్రేడ్ డీల్ పెద్ద కుట్ర ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ భయపడుతున్నారు. మోదీ అమెరికాకు లొంగిపోయేందుకు ప్రధాన కారణం ట్రేడ్ డీల్. ఇదో పెద్ద కుట్ర. ఈ కుట్రలో మోదీ అనేక తప్పులు చేశారు. అందుకే దేశాన్ని దారాధత్తం చేసి అమెరికా ముందు మోకరిల్లే పరిస్థితి ఏర్పడింది. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కొందరి ప్రయోజనాల కోసమే పనిచేయడం వెనుక కూడా కుట్ర ఉంది. మోదీ విధానాలతో రూ. 9 లక్షల కోట్ల విలువైన నష్టం దేశ రైతులకు జరుగుతోంది. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు వివరించండి. రేవంత్రెడ్డి పవర్ ఫుల్ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పవర్ ఫుల్ లీడర్. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ముందుకు తీసుకెళుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ముఖ్యం. పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అందరూ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించండి..’ అంటూ రాహుల్ దిశానిర్దేశం చేశారు. శుభాకాంక్షలు..ఫొటోసెషన్ డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి ముందు వికారాబాద్లోని డిగ్రీ కళాశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. అందరూ బాగున్నారా అంటూ నేతలను పలకరించారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలీ ఈ సమావేశంలో మాట్లాడారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి వెళ్లిన రాహుల్గాంధీ అక్కడ వారి కుటుంబసభ్యులను కూడా ఆత్మీయంగా పలకరించారు. వారితో ఫొటోలు దిగారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆత్రం సుగుణ (ఆసిఫాబాద్), ఇ.వెంకట్రామిరెడ్డి (హనుమకొండ), సంజీవ్ ముదిరాజ్ (మహబూబ్నగర్).. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, డీసీసీ అధ్యక్షుల సమస్యలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇరు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు బి. మహేశ్కుమార్గౌడ్, వైఎస్ షరి్మల, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సంగతన్ సృజన్ అభియాన్ ఇన్చార్జి చల్లా వంశీచందర్రెడ్డి, టీపీసీసీ శిక్షణ విభాగం చైర్మన్ టి.రామ్మోహన్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం బ్యారేజీలు.. రూల్స్కు పాతరేసి ఇసుక మాఫియా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు.నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్’ అంటూ హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం.బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్… pic.twitter.com/TvCYPMcn2M— KTR (@KTRBRS) March 2, 2026 -
సింఘ్వీ రెన్యువల్.. రెండో బెర్తు నేడు ఫైనల్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు సోమవారం ఖరారయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి ఈసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఇద్దరికి అవకాశముండగా, అందులో ఒక స్థానం సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ కానుందని సమాచారం. రెండో బెర్తు కోసం తీవ్రమైన పోటీ ఉండగా, సీఎం రేవంత్రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్రెడ్డిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక సమీకరణల నేపథ్యంలో వేం లేదా వంశీలలో ఒకరికి ఈ సీటు దక్కుతుందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. నలుగురిలో ఎవరో? రెండు రాజ్యసభ సీట్లల్లో ఒకటి సింఘ్వీకి ఖరాయిందనే చర్చ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే జరుగుతోంది. ఆయన నామినేషన్కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా రెండో స్థానం ఎవరికి ఇవ్వాలన్న దానిపై సీఎంతో పాటు ఏఐసీసీ, పీసీసీ కసరత్తు చేశాయి. రెడ్డి సామాజిక వర్గానికి లేదంటే బీసీలకు ఇచ్చే కోణంలో పేర్లను పరిశీలించారు. మంత్రివర్గంలో స్థానం లేని లంబాడా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే పీసీసీ నేతలతో చర్చ సందర్భంగా ఈసారి రాజ్యసభకు కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్. పి.వినయ్కుమార్ పేరును అధిష్టానం ప్రతిపాదించినట్టు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలని అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హన్మంతరావు కోరిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడింది. మరోవైపు ఈసారి ఓసీలకు అవకాశం ఇవ్వాలని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరిని రాజ్యసభకు పంపాలనే చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే వంశీచందర్రెడ్డి పేరును అధిష్టానం తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. అయితే వంశీ.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని సీనియర్లను ఈసారి రాజ్యసభకు పంపాలని కోరినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం మరికొంత కాలం ఆయన సేవలు అవసరమనే కోణంలో కూడా చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిచ్చే పక్షంలో వేం నరేందర్రెడ్డిని ఎంపిక చేయాలని రేవంత్రెడ్డి కోరుతున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి పేరును సీఎం ప్రతిపాదించారు. కానీ సుదర్శన్రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో నరేందర్రెడ్డిని ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేస్తారా? అనూహ్యంగా ఇంకెవరికైనా అవకాశమిస్తారా? అనేది సోమవారం తేలుతుందని అంటున్నారు. డిప్యూటీ సీఎం వద్ద బ్రేక్ఫాస్ట్ భేటీ రాజ్యసభ రెండో బెర్తు ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం ప్రజాభవన్లో జరిగిన ఈ బ్రేక్ఫాస్ట్ భేటీకి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్, కొండా సురేఖ, అజహరుద్దీన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా హాజరయ్యారు. అలాగైతే రెండు సీట్లూ రాష్ట్ర నేతలకే..! రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుందనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అభిషేక్ మను సింఘ్వీని తమిళనాడు నుంచి ఎంపిక చేసే అంశం కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రెండు స్థానాలూ రాష్ట్రానికి చెందిన నాయకులకే దక్కే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. తమిళనాడులో డీఎంకే మద్దతుతో ఒక రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన పేరుపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సుముఖంగా లేరని, సింఘ్వీ విషయంలో సానుకూలంగా స్పందించారని అంటున్నారు. సింఘ్వీ తమిళనాడుకు వెళితే సమీకరణలు ఆసక్తికరంగా మారతాయని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. -
కలెక్టర్.. ఆ 30 ఎకరాల లెక్క చెప్పగలడా?: ఈటల ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పంచడం చేత కాదు.. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా? అని ప్రశ్నించారు.బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం ఖమ్మంలోని భూదాన్ భూములను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ ఇదే పద్ధతి కొనసాగించారు. జిల్లాలో సీపీఐ మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీవే కదా?. కీలక మంత్రి పదవులు ఇక్కడే కదా. తమకు న్యాయం జరుగుతుందని జనం సంబురపడ్డారు. కానీ, ఇలా తన ఇళ్లనే కూల్చివేస్తారని అనుకోలేదు.భూదాన్ భూమి అంటే దానం చేసిన భూమి అని తెలియదా?. వినోబా భావే అనే వ్యక్తి వేల ఎకరాలు దానం చేశారు. 147,148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఆనాడు ఈ భూములను ఎవరు దేకలేదు. ఇపుడు ధర పెరగడంతో వాళ్ల కన్ను ఇటు పడింది. రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వం. భూములు పంచడం చేత కాదు. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు. 2019లో చల్లా కోదండరాం అనే జడ్జి ఈ పేదలకు కరెంట్, నీళ్లు ఇవ్వండి అంటే ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది లాక్కున్నారు. ఏ కోర్టు ఆర్డర్ మీకు ఇల్లు కూల్చమని ఇచ్చింది?. వీళ్లే బలవంతంగా లాక్కున్నారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా?. పెద్దల జోలికి పోయే దమ్ము మీకు ఉందా?. 62 ఎకరాల్లో 32 ఎకరాలు సరే.. మిగతా 30 ఎకరాలు ఏమయ్యాయి?. కలెక్టర్ ఆ 30 ఎకరాల లెక్కచెప్పగలడా?.పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం బయటకు తీయాలి. తప్పు జరిగిందని సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పేదలే నీకు ఓట్లు వేసింది. పేరుకు మాత్రమే పేదల పార్టీ, చేతల పార్టీ కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి సత్వర న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
నా హత్యకు ప్రయత్నాలు.. మంత్రి వాకిటి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నారాయణపేట : తెలంగాణలో మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు తన మీద వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి వాకిటి శ్రీహరి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘దేవుడు మనకు మరణం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే చనిపోతాం. నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. చావుకు నేను భయపడను. అవమానాలు పడినందుకే రాజకీయాల్లో వచ్చాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పని చేసుకుంటూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాడుపడుతున్నాను. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు నా మీద వేశారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మక్తల్ మున్సిపల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.72 సంవత్సరాల్లు 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్ నియోజకవర్గానికి తెచ్చింది రూ.296 కోట్లు మాత్రమే. రెండేళ్లలో మాత్రం రూ. 1035 కోట్లు తెచ్చాను. ప్రశ్నించడం మంచిదే కానీ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను అవమానించవద్దు. అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారు, అయినా ముందుకు పోతున్నాం. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఎన్ని అవమానాలు చేసినా నేను భయపడను, బెదరను, అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఈ ప్రాంతం అనేక రంగాల్లో ఆర్ధికంగా ఎదగలేని పరిస్థితి నుంచి అభివృద్ధి వైపు ఈ ప్రాంతాన్ని నడిపిస్తాను. ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాను’ అని అన్నారు. -
శారదా పీఠాన్ని కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్ర: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయింది.. దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్కు ఇష్టం లేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఆలయ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయింపు జరిగింది. ఇప్పుడు దేవాలయ స్తలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ప్రయోగించింది. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడం సరికాదు. శారద పీఠం ఆధ్వర్యంలో 16 దేవాలయాలు ఉన్నాయి. వేదం, గోశాల, నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దేవాలయాలు కూల్చడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా?. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్కు ఇష్టం లేదా?.గుళ్లు, ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. సర్వే నెంబర్ 239, 240లలో పది ఎకరాలు భాగ్యలక్ష్మి మైన్స్ మినరల్స్ కంపెనీలు ఉన్నాయి. పక్కన 17 ఎకరాల స్థలం కబ్జా చేశారు. రేవంత్ అల్లుడికి ఇవ్వడానికి భూములు ఉన్నాయి. రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎమ్మార్వో వచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని చూస్తున్నారు. మేము రాగానే పోలీసులు, అధికారులు పారిపోయారు. చట్టపరంగా పద్ధతులు పాటించరా?. దేవాలయాల భూమి కూల్చడానికి శ్రీధర్ బాబు ఎలా ఒప్పుకున్నారు?. స్థలం లేక కాదు.. కక్షతో చేస్తున్నారు. గుడిని, మఠాన్ని కూడా వదలరా?. బ్రహ్మణులు పూజలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయాల్లో పూజలు ఆపే మూర్ఖత్వమా?. ఇదేం సంస్కృతి?. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని కూల్చేస్తారా?. దేవాలయ భూమి కాపాడడానికి మేం పోరాటం చేస్తాం. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. -
లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయింది
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ‘అయితే మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఈ కేసు మూలంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సైతం రాజకీయంగా నష్టపోయింది..’ అని కేటీ ఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొ న్నారు.‘మద్యం పాలసీ కేసు తరహాలోనే మా నాయ కులపై నమోదైన ప్రతి కేసు అబద్ధం, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని త్వరలో తేలిపోతుంది. అసత్యాలతో కూడిన, కుట్రపూ రిత కేసులను, ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజ లను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధా న్య తనిస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ’నవ భారతం’లో బాగా పెరిగిపోయింది. కానీ చివరకు న్యాయమే గెలుస్తుంది..’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయి: కేటీఆర్
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో చివరికి న్యాయమే గెలిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,. ఢిల్లీ లిక్కర్ కేసు సాకుతో కేజ్రీవాల్ సర్కారు కూల్చారని, ఆ కేసు వల్ల బీఆర్ఎస్ నష్టపోయిందన్నారు కేటీఆర్. ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయమన్నారు. రాజకీయ కుట్రలో భాగమే ఈ కేసు అని తేలిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫామ్హౌజ్కు కేటీఆర్ బయల్దేరి వెళ్లనున్నారు. ఎర్రవల్లి ఫామ్హౌజ్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో..కేటీఆర్ భేటీ కానున్నారు.తాజా పరిణామాలపై కేసీఆర్తో చర్చించనున్నారు కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు క్లీన్చిట్తో పాటు కవితకు క్లీన్చిట్ అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇవి కూడా చదవండి:లిక్కర్ కేసులో క్లీన్చిట్.. కవిత స్పందన ఇదేలిక్కర్ కేసులో కేజ్రీవాల్కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగం -
కాంగ్రెస్ అంటేనే కూల్చివేతలు.. బీజేపీ ఉద్యమమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలకు రైతుభరోసా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘రైతులకు రైతు భరోసా ఇస్తానన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారు. ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చే మాటలు శాసనంలా ఉండాలి. బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు, గూడు పుటానీలు చేసారో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారు. రైతు భరోసా మొదటి విడత డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందా?. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులే వాతలు పెడుతారు. కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలేదు. మూడు విడతలు కలిపి 27000 కోట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశాను. రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.అలాగే, ఖమ్మంలో కూల్చివేతల ఘటనపై స్పందిస్తూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు. కూల్చడానికి గల కారణాలు ఏంటి?. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి అ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చుస్తున్నారు. హైడ్రా.. కూల్చివేతలతో ఆగమాగం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే.. ఈ ప్రభుత్వం కూల్చివేయడానికి పోటీ పడుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు 80% ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాక దోస్తీగా ఉన్నా కాంగ్రెస్, ఎంఐఎంలకు ఎక్కడ చెడిందో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కవిత వ్యవహారంపై ప్రశ్నించగా.. తెలుసుకుని మాట్లాడతాను అని వ్యాఖ్యలు చేశారు. -
కుంటి సాకులు చెప్పి పారిపోకండి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒళ్ళంతా విషంతో విమర్శలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికకు కాంగ్రెస్కు మైలేజ్ పెరుగుతుందన్నారు. బావ బామ్మర్థులు ఒంటి నిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆనాడు వైఎస్సార్ రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రాజెక్ట్లను తీసుకొచ్చారని పొంగులేటి గుర్తు చేశారు.‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాచరికంతో, జేబులు నింపుకొవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. 38 వేల కోట్ల పాలమూరు ప్రాజెక్టును.. 1లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మాణం జరిపారు. 8వ అద్భుతం అంటూ ఆర్భాటం చేసి ప్రారంభించిన కొద్ది రోజులకే మేడిగడ్డ కూలింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి ఇచ్చినా ముందుకు వెళ్లడం లేదు. కమిషన్లు ఎక్కడ ఎక్కువ వస్తాయో అలాంటి ప్రాజెక్టులను గత ప్రభుత్వ పెద్దలు టేకప్ చేశారు.‘‘రాష్ట్ర ప్రయోజనాల ఒక్క నీటి చుక్కను వదులుకోమంటూ సీఎం, ఉత్తమ్ చెప్తూనే ఉన్నారు. శవాల మీద చిల్లర వేరుకునే ఆలోచనతో బావ బామ్మర్థి ప్రవర్తన ఉంది. వారు పేడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ లో చర్చ పెడదాం.. కుంటి సాకులు చెప్పి పారిపోకండి. విషం చిమ్మడం మానేయండి.. ప్రజల కోసం ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి’’ అంటూ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. -
ఇళ్ల కూల్చివేతల పాపం ఆ ముగ్గురు మంత్రులదే: కేటీఆర్
ఖమ్మం: ఖమ్మం శివారు వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో మంత్రుల కన్నుపడిన కారణంగానే కూల్చివేతలు చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 26వ తేదీ) బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్.. ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇళ్ల కూల్చివేతలపాపం ఆ ముగ్గురు మంత్రులదే. భూదాన్ భూములపై ముగ్గురు మంత్రుల కన్నుపడింది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. కేసీఆర్ ఆదేశాలతోనే నేను ఇక్కడికి వచ్చాను. అసెంబ్లీలో భూదాన్ అంశాన్ని లేవనెత్తుతాం. కూలగొట్టిన చోటే గృహప్రవేశాలు చేయిస్తా’ అని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ‘2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి అంటే దాదాపు 1900 మందికి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు.రెండూన్నర ఏళ్ల కిందట ఏ మాటలైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?, పేదవాడి హక్కులు ఉన్న పేదవాడికి వాడి దగ్గర మరి పట్టాలు ఉన్నా...నోటికాడి ముద్ద లాక్కొని వాళ్లను మెడలు పట్టి గెంటేస్తున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.కాగా, మంగళవారం ఉద్రిక్తత నడుమ వందల సంఖ్యలో ఇళ్లను కూల్చివేశారు. తెల్లవారుజాము నుండే అధికారులు భారీ పోలీసు బందోబస్త్ నడుమ జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకుని సుమారు 400 ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్ సమీపాన పదేళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సామగ్రితో పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పట్నుంచో ఉండే ఇళ్లను కూల్చివేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దేశ యువత, ప్రజలకు దేశ యువత, ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన యాదృచ్ఛి కంగా చేసింది కాదని,అది పూర్తిగా రాహుల్గాంధీ చేయించిన సిగ్గుమా లిన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎన్.రాంచందర్రావు మండిపడ్డారు. ‘రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ దేశ గౌర వాన్ని దెబ్బతీసేలా, అంతర్జాతీయ వేదికలపై భారత్ను అవమానించేలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.ఇప్పటికైనా రాహుల్ దేశ యువత, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో బీఆర్ఎస్కు చెందిన లంకల రమేశ్రెడ్డి, విజేశ్వర్రెడ్డి, ప్రదీప్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు శివశంకర్, వేణుగోపాల్రెడ్డి, శివప్రసాద్, నరేశ్కుమార్, న్యాయవాది శివకుమార్ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూడా మావోయిస్టు ముక్త్గా చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. చేరికల కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్రెడ్డి, మాధవరం కాంతారావు, గణేశ్కుందే, నిరంజన్ యాదవ్, శ్రీధర్, కిశోర్, తాడూరి శ్రీనివాస్, రవినాయక్ పాల్గొన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోంది రాష్ట్రంలో వరుస హింసాత్మక ఘటనలతో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డిటౌన్, నిజామాబాద్ జిల్లా రుద్రూర్లలో జరిగిన ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. బుధవారం డీజీపీకి ఎమ్మెల్యే హరీశ్బాబు, ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్య తదితరులతో కలిసి రాంచందర్రావు వినతిపత్రం సమర్పించారు. -
రేవంత్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు
ఆదిలాబాద్ టౌన్: సీఎం రేవంత్రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్పై ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలను మానుకోవాలని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు కలుగులో దాక్కున్నా రేవంత్ను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్టాలను, ప్రజా తీర్పులను గౌరవించాలని, మున్సిపల్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి పెండింగ్లో ఉన్నచోట పారదర్శకంగా నిర్వహణ చేపట్టాలన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు గెలిచారని, ఏడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అధికార దాహంతో ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వివేక్లు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. బాల్క సుమన్ జైలుకు వెళ్లడం కొత్తేమీ కాదని, తెలంగాణ కోసం పదుల సార్లు జైలుకు వెళ్లినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. డీజీపీ శివధర్రెడ్డి సినిమా డైలాగ్లు చెప్పారని, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు పోలీసులను తిట్టినప్పటికీ వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఏం తప్పు చేశారని కేసు పెట్టారన్నారని ప్రశ్నించారు. రాహుల్ కుటుంబానికి ఇచ్చే వెయ్యి కోట్లు ఎవరి సొత్తు అని, ఈ విషయంలో ఈడీ ఏం చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చే తెలివి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పూర్తిగా గాలికి వదిలేసి దోపిడే లక్ష్యంగా పనిచేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో ఢిల్లీకి చేరవేసేందుకు ముఖ్యమంత్రి వద్ద వెయ్యి కోట్లు సిద్ధంగా ఉన్నాయంటే ఆయన రాష్ట్ర ప్రజల సొత్తు ఇంకా ఎన్ని వేలకోట్లు మింగే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ములాఖత్ అయిన వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలా కర్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, కోనేరు కోనప్ప, జీవన్రెడ్డి, జాన్సన్ నాయక్ ఉన్నారు. కాగా కేటీఆర్ వచి్చన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు.


