breaking news
-
అసలు విషయంపై మాట్లాడని చంద్రబాబు
ఏలూరు, సాక్షి: నీళ్లపై రాజకీయాలు వద్దంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు.. అసలు విషయంపై స్పందించలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించినట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ సీఎం పెదవి మాత్రం విప్పలేదు. పోలవరం సమీక్ష పనుల తర్వాత నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. నీటి రాజకీయాలంటూ ఏవేవో అంశాలపై మాట్లాడారు. అయితే.. కీలకమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. క్లోజ్ రూమ్లో తమ మధ్య భేటీ జరిగిందని రేవంత్ చెప్పగా.. ఆ గదిలో ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో చంద్రబాబు చెప్పలేకపోయారు. అలాగే తెలంగాణ ఒత్తిడికి ఎందుకు తలొగ్గారో అనే అంశంపై కూడా నోరు తెరవలేకపోయారు. అయితే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాత్రం తప్పుడు ప్రచారం చేశారు. సీమ రైతుల ఆందోళనను లెక్క చేయని చంద్రబాబు.. అసలు రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్న ధోరణిలో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్టీఎస్లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్నగర్కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తి నేనే ప్రారంభించా. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు?. ఈ మధ్య కొందరి మాటలు చూస్తే.. రాజకీయాలు నాకే అర్థం కాలేదు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉంది. దేవాదుల నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. కిందకు వచ్చే నీళ్లకు మీరు అభ్యంతరం చెబితే ఏమైనా అర్థం ఉందా? ఆరోజు మంజీరాకు నీళ్లు తీసుకెళ్లారు.. అప్పుడు స్వాగతించాం. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. పూర్తి చేసుకోండి. దేవాదులకు మేం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుంది. మిగిలిన నీరు సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టం. కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. రాయలసీమ ఎత్తిపోతలపై చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని భావిస్తున్నారు.సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకుంటే లాభాలు ఉంటాయి..నష్టాలు ఉంటాయి’’ అని చంద్రబాబు చెప్పారు. -
క్వార్టర్స్లో నెగ్గాం.. సెమీస్, ఫైనల్లోనూ మనదే గెలుపు
సాక్షి, ఖమ్మం: ఎగవేతలు, కూల్చివేతలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని.. అందుకే ఆ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచ్ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. క్వార్టర్ ఫైనల్లో(సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి..) మంచి ఫలితాలు వచ్చాయి. సెమీ ఫైనల్ లో మంచి ఫలితాలు వస్తాయి. చివరికి ఫైనల్ లో విజయం మనదే. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. యూరియా బస్తాలు దొరకడం లేదని రైతన్నలు చెబుతున్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని.. తన్నే దున్నపోతు ను గెలిపించారని నేను వారితో చెప్పా. అయిపోయింది ఏదో అయిపోయింది.. వచ్చేది బీఆర్ఎస్ అని రైతులు నాతో చెప్పారు. రైతులు ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమైంది.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాల్లేవ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్ల్లో ఎలా వస్తుంది?.. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైంది?. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా?. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా?. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?.. కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం.. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ మగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకొండనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారం లో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయిన గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు?..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం పదవులు గెలుచుకున్నాం. ఇక్కడే రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోంది. త్వరలో జగరబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఖమ్మం నుంచి 7 నుంచి 8 స్థానాలు గెలుస్తాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
ఏ విచారణకైనా రెడీ
హైదరాబాద్లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. నిర్దేశిత ప్రమాణాలను మించిపోయింది. ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 263 నమోదైంది. వాహనాలతో 27% వాయుకాలుష్యం ఏర్పడుతుంటే, పరిశ్రమలతో 51% ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడానికి 2012 నుంచే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. మేం ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తాం. వాటికి ప్రత్యామ్నాయ పారిశ్రామికవాడలను సిద్ధంగా ఉంచాం.. – డిప్యూటీ సీఎం భట్టిసాక్షి, హైదరాబాద్: 2014 నుంచి, ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్పీ తో పాటు ఇప్పటివరకు జరిగిన పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై ఏ విచారణను ఆదేశించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. ఆ మేరకు లేఖ రాసిన మరుక్షణం ఏ విచారణ సంస్థతో కావాలంటే ఆ సంస్థతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంగళవారం శాసనసభలో హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి (హిల్ట్) విధానం (పీ), తెలంగాణ రైజింగ్–2047పై లఘు చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు భట్టి జవాబిచ్చారు. హిల్ట్ పీతో రూ.10,776 కోట్ల ఆదాయం: ‘ప్రతిపక్షం కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పట్టించుకోకుండా తమ రాజకీయం కోసం రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం లీజు భూములను ఫ్రీహోల్డ్ చేసింది. తమకు కావాల్సిన వాళ్లకు పారిశ్రామిక భూములను వినియోగ మార్పిడి చేసింది. సిరీస్, గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలకు భూ వినియోగ మార్పిడి చేసిన అంశాన్ని హిల్ట్ పాలసీతో పోల్చినప్పుడు రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.4,076 కోట్ల నష్టం వాటిల్లింది. హిల్ట్ పీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం.. 80 అడుగుల లోపు రహదారి ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్వో) ధరలో 30 శాతం, 80 అడుగుల కంటే ఎక్కువ వెడల్పుతో రహదారి ఉన్నచోట ఎస్ఆర్వో ధరలో 50 శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. కేవలం భూ వినియోగ మార్పిడి చేస్తున్నందుకు ఈ ఫీజులు వసూలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న భూ వినియోగ మార్పిడి ధరల ప్రకారం అయితే కేవలం రూ.574 కోట్ల ఆదాయం మాత్రమే రాష్ట్రానికి లభిస్తుంది. అదే హిల్ట్ పీ కింద దాదాపు 4,780 ఎకరాల భూములకు భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా దాదాపు రూ.10,776 కోట్ల ఆదాయం లభిస్తుంది..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. హిల్ట్ పీ అత్యుత్తమం, పారదర్శకమైనది.. ‘హిల్ట్ పాలసీ రాగానే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఓ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి రాష్ట్రంలోని భూములన్నింటినీ అమ్మేస్తూ రూ.5 లక్షల కోట్ల స్కామ్కు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి, బట్ట కాల్చి మీద వేసి తుడుచుకోమంటున్నారు. వారు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాల కోసం ఎక్కువగా పాకులాడుతున్నారు. హిల్ట్ పీ వల్ల రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంటే.. గతంలో వారు చేసిన నిర్ణయాలతో భారీ నష్టం జరిగింది. గత ప్రభుత్వం అనుసరించి విధానాలతో పోలిస్తే హిల్ట్ పీ అత్యుత్తమమైనది. పారదర్శకమైనది. ఆదాయం సమకూరుతుంది. వారు ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూములు లీజులో ఉంటే...వాటిని వేలానికి పెట్టకుండా ఇష్టానుసారం ఇచ్చేశారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. వనరుల సమీకరణకు 2019లో అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీకి సంబంధం లేకుండా కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా జీవో ఇచ్చి పారిశ్రామిక భూములను ఐటీ పరిశ్రమలకు మార్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. వారికి అనుకూలమైన వారికి భూ మార్పిడి చేశారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. మేము తెచ్చిన పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు..’ అని భట్టి చెప్పారు. రాష్ట్రానికి ఉత్పాదక షాక్ అవసరం ‘ప్రస్తుతం రాష్ట్రం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. వృద్ధి ఇలానే కొనసాగితే 2047 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగానే ఎదుగుతాం. ఇది సరిపోదని..3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047 తీసుకొచ్చాం. కేవలం ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఈ లక్ష్యానికి చేరుకోలేం. మనకు ఒక ‘ఉత్పాదకత షాక్’ అవసరం. పెట్టుబడి రేటును జీఎస్డీపీలో 52 శాతానికి పెంచాలనే కఠిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం..’ అని భట్టి తెలిపారు.తర్వలో హిల్ట్ పీ మార్గదర్శకాలు: శ్రీధర్బాబు పదేళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో చాలాచోట్ల అడ్డగోలు భూకేటాయింపులు జరిపిన విషయం వాస్తవమని.. తొలుత మాట్లాడిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పరిశ్రమల పేరిట జరిగిన ఈ భూకేటాయింపులపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పారు. ‘హిల్ట్ పాలసీ ఏకపక్ష నిర్ణయం కాదు. నిపుణులు, మేధావులతో చర్చించిన తర్వాతే రూపొందించాం. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయి. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులను పబ్లిక్ డొమైన్ (అందరికీ అందుబాటు)లో పెట్టం. అవి కేవలం ఇన్ కెమెరా (అంతర్గత) సూచనలు. వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పాజిటివ్గా చూడాలి. అప్పుడే నిర్ణయాల అమలు వేగవంతంగా, విజయవంతంగా పూర్తవుతుంది. పరిశ్రమల తరలింపుతో కార్మికులకు ఉపాధి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన అవసరం లేదు. కారి్మక చట్టాలు తప్పకుండా అమల్లో ఉంటాయి..’ అని శ్రీధర్బాబు చెప్పారు. పూర్తి పారదర్శక పాలసీ: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పారిశ్రామిక భూమి బదలాయింపు విధానం రాష్ట్ర సుస్థిర పురోగతితో పాటు పారిశ్రామిక కాలుష్య రహిత హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. పూర్తి పారదర్శకంగా ఉండేలా గొప్ప పాలసీకి రూపకల్పన చేశామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. లీజు హక్కులతో ఉన్న పారిశ్రామిక భూములకు ఈ కొత్త విధానం వర్తించదని, పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో భూములు కలిగిఉన్న పారిశ్రామిక భూములకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆ జీవోలో చీకటి కోణాలు: ఏలేటి ‘కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు పంపడం సరైన నిర్ణయమే. కానీ ఎలాంటి పర్యావరణ అధ్యయనాలు, కమిటీల నివేదికలు లేకుండా బయటకు తరలే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించకుండా హడావుడిగా హిల్ట్ పాలసీని తేవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం జారీ చేసిన జీఓ 27లో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. 22 పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఎక్కడికి తరలిస్తారు? అత్యంత కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడీఏ బొల్లారంను హిల్ట్ పాలసీలో చేర్చకపోవడం విడ్డూరం..’ అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమల భూములతో రియల్ ఎస్టేట్ దందా చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పచ్చదనం పెంచాలి..’ అని సూచించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన హిల్ట్ పాలసీని అందరూ స్వాగతించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోందని, ఇదే తరహాలో కాలుష్యం పెరిగితే పదేళ్లలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు: పాల్వాయి హరీశ్బాబు ‘మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్–2047 విడుదల చేశారు. ఇప్పుడు అక్కడ టెంట్లు కూడా లేవు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు..’ అని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని మరో బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. హిల్ట్ పాలసీకి చట్టబద్ధత లేదు: అక్బరుద్దీన్ ‘వనరుల సమీకరణకు ఈ ప్రభుత్వం భూముల వెనుక పరిగెడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన హిల్ట్ పాలసీ జీఓకు ఎలాంటి చట్టబద్ధత లేదు. పాలసీ రూపకల్పనలో పారదర్శకత కనిపించడం లేదు. పాలసీలో పేర్కొన్న భూములు ప్రైవేటువా లేక ప్రభుత్వ భూములా అనే అంశంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలి..’ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుదీన్ ఒవైసీ అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. నగర కాలుష్యాన్ని నివారించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చెప్పారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. -
అబద్ధపు హామీలతో మోసం
జనగామ: ‘వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతానన్నారు. కౌలుదారులకు కూడా ఇస్తానన్నారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తానన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇవన్నీ అబద్ధాలు. అలాంటి హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్గాందీనే నడిబజారులో ఉరితీయాలి..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ లీడర్ కాదని, దేశంలో ఏకైక స్క్రిప్టు చదివే రీడర్ అని విమర్శించారు. స్క్రిప్టులో ఏమున్నా చదివేసే అవగాహన లేని నేత అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎంకు కూడా మూటలు మోసిన అనుభవం తప్ప మరేమీ లేదని, ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లాలో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రేవంత్కు పిచ్చి ముదిరి పాకానపడింది ‘రాష్ట్రంలో చెక్డ్యాంలు పటాకులు పేలినట్లు పేలుతున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. రాష్ట్రంలో పాలిచ్చే బర్రెను కాదనుకుని, వెనకనుంచి తన్నే గేదెను తెచ్చుకున్నామని ప్రజలు మథనపడుతున్నారు. గోదావరి ఎక్కడుందో కూడా రేవంత్కు తెలియదు. భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్న రేవంత్రెడ్డి..రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోంది.. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఎంతవరకూ నెరవేర్చారో ఒక్కసారి ఆలోచించాలి. ఎనకటి రోజులు తెస్తానన్న రేవంత్, రాబందు కాలం తీసుకువచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడిని (కేసీఆర్)ఉరి తీయాలంటారా?. ఇంటింటికీ నీళ్లు ఇచ్చి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్ను ఉరి వేయాలని రేవంత్రెడ్డి అనడం చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరి పాకాన పడిందని అర్థమవుతోంది. ఆ మాటకొస్తే హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్గాం«దీనే ఉరి తీయాలి. తన సొంత సెక్యూరిటీని కూడా ప్రజల ముందే కొట్టే ముఖ్యమంత్రి ఎక్కడా దొరకడు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ చెప్పు దూళికీ రేవంత్ సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కే ఆయన ఆగమాగం అవుతున్నాడు. ఇక అసెంబ్లీలో మాట్లాడితే అక్కడే గుండె ఆగిపోయి సచ్చిపోతారు..’అని కేటీఆర్ విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. తాజాగా కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా.. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021లో నిజామాబాద్ స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా విజయం సాధించారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అంతేకాకుండా సోమవారం తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి శాసనమండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి ఛైర్మన్ తాజాగా కవితి రాజీనామాను ఆమోదించారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, జనగాం: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. మంగళవారం జనగాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదు. రాహుల్, రేవంత్ను ఉరి తీయాలి. చదువురాని దద్దమ్మ రేవంత్రెడ్డి. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కే రేవంత్ లాగు తడిసింది’’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2019 మున్సిపల్ చట్టంలో కీలక మార్పు చేస్తూ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్న నిబంధన తొలగించారు.దీంతో భారత ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం అవసరం ఇక లేదు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. చట్ట సవరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు వచ్చింది.కాగా, మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత కచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. -
హిల్ట్ పాలసీపై చర్చ .. ‘అవి ప్రభుత్వ భూములు కావు’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని.. అవి ప్రభుత్వ భూములు కావు.. పరిశ్రమలకు అమ్మిన భూములు అంటూ మంత్రి శ్రీధర్బాబు స్పష్టత నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని.. పర్యావరణం బాగుచేయాలనే ఆలోచనతోనే హిల్ట్ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు.‘‘హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తాం. పాలసీ గురించి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్ధాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. రాజకీయాల పక్కనపెట్టి ఆలోచించాలి’’ అని శ్రీధర్బాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థ నాగరికతే.. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని శ్రీధర్బాబు హెచ్చరించారు.‘‘డెవలప్మెంట్ అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు. పిల్లలకు ఆస్తులు కాదు.. క్లీన్ ఎన్విరాన్మెంట్ నిజమైన వారసత్వం. బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితి. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదు. మనమంతా భూమి యజమానులు కాదు. కేవలం ట్రస్టీలమే. ఫ్యూచర్ జనరేషన్లకు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం మన బాధ్యత. ఇది కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదు. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం...ఓఆర్ఆర్ లోపల పరిశ్రమలు.. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్యాక్టరీ గోడ పక్కనే ఇళ్లు.. ఇది సైంటిఫిక్ డిజాస్టర్. 1970లలో నగరం బయట పరిశ్రమలు.. నేడు నడిబొడ్డు ప్రాంతాలు బాలానగర్, సనత్నగర్, ఉప్పల్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడమే లక్ష్యం. పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పం. హిల్ట్పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. మతలబు ఉందంటూ విమర్శలు బాధాకరం. తెలంగాణ నుంచే పర్యావరణ రక్షణకు చారిత్రక అడుగు.. మార్పు ఎప్పుడో కాదు.. ఇప్పుడే’’ అంటూ శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
మహబూబ్నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం మహబూబ్నగర్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
కవిత పార్టీతో నష్టం ఏమీ లేదు: రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కవిత పార్టీ పెట్టుకుంటే మారేది ఏమీ లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేయాలి. ఆరోపణలు చేసిన కవిత.. తన వద్ద ఉన్న ఆధారాలను ఆ కమిషన్కు ఇవ్వాలి. ఇన్నాళ్లు అవినీతిలో అంటకాగి పంపకాల్లో తేడాలతోనే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. లిక్కర్ వ్యాపారం చేసి కవిత జైలుకు వెళ్లారు. లిక్కర్ కేసులో డబ్బులు సంపాదించారు.కవిత జైలుకు వెళ్లితే బీజేపీకి ఎం సంబంధం?. తప్పుచేసిన వారిని పార్టీలు జైలులో వేయవు. దర్యాప్తు సంస్థలు వేస్తాయి. కవితకు మాత్రమే ఆత్మగౌరవం ఉందా? తెలంగాణ ప్రజలకు లేదా?. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో అనేది వాళ్ల కుటుంబ అంశం మాత్రమే. ఇన్నాళ్లు వాళ్లతో ఉన్నప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు. ఉద్యమ ద్రోహులు బీఆర్ఎస్లో చేరారని మేము మొదటి నుంచి చెప్పాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
శాసన మండలిలో కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. ఇదే తన ఆఖరి హాజరు అంటూ ప్రకటించిన ఆమె.. సోమవారం మండలికి హాజరై పలు అంశాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష కొనసాగింది. కేసీఆర్పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదు. పార్టీ మౌత్పీస్గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేసీఆర్కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా. అలాంటిది నా సస్పెన్షన్కు ముందు నా వివరణ కోరలేదు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా అంటూ కంటతడి పెట్టారామె. ఇకనైనా తన రాజీనామా ఆమోదించండి అని మండలి చైర్మన్కు కవిత విజ్ఞప్తి చేశారు. అయితే.. పరిణామాలను తాను అర్థం చేసుకోగలనని, భావోద్వేగాలతో రాజీనామా చేస్తే ఆమోదించరన్న చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. రాజీనామాపై పునరాలోచన చేయాలని కవితకు సూచించారు. -
డే-4.. కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో.. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు–2026ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చతో పాటు ఆమోదం తెలపనుంది సభ. పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్.. డీఆర్డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారుఅధికారుల అవినీతి పై నేను ఎక్కని గడుప లేదుఅన్ని స్థాయిల్లో అధికారులకు అవినీతి పై ఫిర్యాదు చేసాంప్రభుత్వం డీఆర్డీఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే.. తెలంగాణ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను రిలీజ్ చేయనుంది. 2015-16 నుంచి 2018-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. దీంతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్టన్) పాలసీపై షార్ట్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. -
కేటీఆర్పై కాంగ్రెస్ ‘ఫైర్’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డిలను ఉరి తీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. రాహుల్ గాంధీ, రేవంత్లను ఏకంగా ఉరితీయాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమని, ఆయన అహంకారం పీక్స్కు చేరిందని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు.భస్మాసురుడి కజిన్ బ్రదర్ కేటీఆర్: మహేశ్గౌడ్కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్ కుమార్గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్లో అహంకారం పరాకాష్టకు చేరిందని, ఆయన భస్మాసురుడి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతితో ప్రజల ఛీత్కారానికి గురైన నేపథ్యంలో ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులో తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. ఈ అంశాన్ని పక్క దోవ పట్టించేందుకు చౌకబారు మాటలు మాట్లాడుతు న్నారని విమర్శించారు. ముందు తన చెల్లెలు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి కేటీఆర్ తమ గురించి మాట్లాడాలని మహేశ్గౌడ్ హితవు పలికారు. అవినీతిని బయటపెట్టడంతో ఆగమాగం: విప్ శ్రీనివాస్అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఉపన్యాసంతో కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతోందని, పదేళ్ల పాటు వా రు చేసిన తప్పులను రేవంత్ తూర్పారపట్టడంతో కేటీఆర్, హరీశ్రావులు తల్లడిల్లిపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు తామే చాంపియన్లమంటూ చెలామణి అయిన కేసీఆర్ కుటుంబం అవినీతి చరిత్రను అసెంబ్లీలో బయటపెట్టేసరికి ఇప్పుడు ఆగమాగమవుతు న్నారని ఎద్దేవా చేశారు.కళ్లకు కట్టినట్టు వివరించారు: ఎంపీ చామలరాష్ట్ర సాధన నినాదాలైన నీళ్లు, నిధు లు, నియా మకాలను బీ ఆర్ఎస్ తుంగలో తొక్కిందని రుజు వైందని, పదేళ్ల కాలంలో కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజె క్టులను సీఎం రేవంత్రెడ్డి కళ్లకు కట్టిన ట్టు వివరించారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమా ర్రెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా కేసీఆర్ చావు కోరుకునేది కేటీఆర్, హరీశ్ రావులేనని, సీఎం పదవి కోసం కేటీఆర్, పార్టీ కోసం హరీశ్రావులు మాత్రమే కేసీఆర్ చావును కోరుకుంటారని, అలాంటి ఆలోచన ఎవరికీ ఉండదన్నారు. -
వారిని ఎన్నిసార్లు ఉరితీయాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలి? రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్ గాందీని అశోక్ నగర్ అడ్డా మీద, రైతు రుణమాఫీ అమలు చేయనందుకు వరంగల్లో ఉరి తీయాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ తప్పించినందుకు కామారెడ్డి చౌరస్తాలో రేవంత్ను, కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలి. 420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్ను ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచి్చంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.‘రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరో భాష రాదు. కానీ మాకు మూడు నాలుగు భాషల్లో సమాధానం చెప్పగల శక్తి ఉంది. ఐఐటీకీ, ట్రిపుల్ ఐటీకీ, బచావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియని అజ్ఞాని తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్పదం. కృష్ణా, గోదావరి బేసిన్ల గురించి బేసిక్స్ గురించి తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని పాలన ఇది’ అని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ స్థాయిని తగ్గించలేడు.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై తుపాకీ ఎత్తిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేడు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు ఎండగడతాం. శాసనసభలో జరుగుతున్న చర్చల తీరును, ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత పెద్దలు చెప్పిన మాట ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అనే సామెత గుర్తుకొస్తోందన్నారు. పదేపదే చావు, ఉరిశిక్షలు అంటూ మాట్లాడే వ్యక్తి.. రైతుబంధు వంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్పై అనరాని మాటలు అనడం దుర్మార్గం’’ అని కేటీఆర్ అన్నారు. -
కాంగ్రెస్కు తలనొప్పిగా క్షేత్రస్థాయి పదవుల పందేరం
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పార్టీ పదవుల పందేరం అధికార కాంగ్రెస్కు తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే పంచాయతీలకు ఎన్నికలు ముగిసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కమిటీల కూర్పు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలన్న పీసీసీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లతోపాటు మండల పార్టీ అధ్యక్ష హోదాల్లో ఎవరిని నియమిస్తే ఏం జరుగుతుందోనని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు గుబులు చెందుతున్నారు. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుల నియామకం మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి తంటా తెచ్చిపెడుతుందోననే ఆలోచనతో డీసీసీ అధ్యక్షులకు పేర్లు ఇచ్చేందుకూ వారు వెనుకాడుతుండటం గమనార్హం. పేరుకే డీసీసీలు..డీసీసీ అధ్యక్షుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కొత్తగా నియమితులైన తమకు పార్టీ పదవుల నియామకాల్లో ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వడం లేదని వాపోతున్నారు. పార్టీ పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లు ఇచ్చి వాటినే చేర్చాలని ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. పీసీసీ మార్గదర్శకాలను కూడా పాటించలేని పరిస్థితుల్లో తామున్నామని చెబుతుండటం గమనార్హం. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిపిస్తోంది. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని వారు డీసీసీ అధ్యక్షులుగా నియామకం కావడంతో అలాంటి జిల్లాల్లో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో తామిచ్చిన పేర్లను డీసీసీ కమిటీల్లో ఉంచాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నారని, వారి సూచనల మేరకు కార్యవర్గం ఏర్పాటు చేసి భవిష్యత్తులో జిల్లాలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలని డీసీసీలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కూడా తమ మాటకు విలువ ఇస్తామని పీసీసీ, ఏఐసీసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని అంటున్నారు. కనీసం పార్టీ కార్యవర్గంలో పదవులు ఇచ్చే అధికారం కూడా తమకు లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకుండా జాప్యం చేసిన పీసీసీ.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని డీసీసీ అధ్యక్షులు చెబుతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం వేరేలా ఉందని, మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక జిల్లా కమిటీలను ప్రకటించాలని కోరుతున్నారని, ఈ అంశాన్ని పీసీసీ పరిగణనలోకి తీసుకోవాలని, జిల్లా కార్యవర్గం కూర్పులో డీసీసీలకూ కోటా పెట్టాలని వారు కోరుతుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయమై జిల్లా మంత్రికి ఇష్టం లేకుండా నియమితుడైన దక్షిణ తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో కూడా మా ఫొటోలు పెట్టని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లతో జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి మేము ఏం చేయాలి? రేపు మా మాట ఎవరు వింటారు? పార్టీని నడిపేదెట్టా? ఆరునెలల పనితీరును చూసి అవసరమైతే డీసీసీ అధ్యక్ష పదవులు తీసేస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. మరి ఈ సిఫారసులు, ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలో.. మున్ముందు ఎలా పనిఏయాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. కార్యవర్గం కూర్పు ఇలా..! జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పునకు పీసీసీ మార్గదర్శకాలను రూపొందించింది. పీసీసీ సూచించిన ప్రకారం ప్రతి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా డీసీసీ కార్యవర్గం సంఖ్య ఖరారు కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు బ్లాకులు ఏర్పాటు చేసి, ప్రతి బ్లాక్ నుంచి ఒక డీసీసీ ఉపాధ్యక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించనున్నారు. అదేవిధంగా ప్రతి డీసీసీకి ఒక కోశాధికారిని నియమిస్తారు. దీంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీసీసీ అధికార ప్రతినిధి, ప్రతి మండలం నుంచి డీసీసీ కార్యదర్శిని ఎంపిక చేస్తారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీలు, ఇతర సీనియర్ నేతల సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటారు. డీసీసీ కార్యవర్గాల కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీనియర్లకు ఆఫీస్ బేరర్లలో అవకాశం కలి్పంచాలని పీసీసీ నిర్ణయించింది. బీఆర్ఎస్ లేదా ఇతర పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన వారికీ స్థానిక పరిస్థితుల ఆధారంగా 20–30 శాతం పదవులు ఇవ్వాలని చెప్పింది. డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ జిల్లా కార్యవర్గంతోపాటు మండల పార్టీ అధ్యక్ష నియామకాలు, ఏఐసీసీ పిలుపుల అమలు ఎజెండాగా ఆదివారం జూమ్ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డీసీసీ కార్యవర్గాలను పూర్తి చేసి ఈనెల 8కల్లా పూర్తిస్థాయి నివేదికలను పీసీసీకి పంపాలని, 15వ తేదీలోపు మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 8న గాం«దీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి సీఎం రేవంత్తోపాటు మీనాక్షి కూడా హాజరవుతారని మహేశ్ గౌడ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలన్న ఏఐసీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేశ్గౌడ్ ఆదేశించారు. -
రేవంత్ది కట్టుకథ.. కుట్రతో ప్రాజెక్ట్ల నిర్లక్ష్యం: హరీష్రావు
సాక్షి, తెలంగాణ భవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుకథలు చెప్పారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు. తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.తెలంగాణ భవన్లో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. విభజనలో సెక్షన్-84 పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు. 11వ షెడ్యూల్లో మన ప్రాజెక్ట్లను ఎందుకు పెట్టలేదు?. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్లను 11వ షెడ్యూల్లో పెట్టకపోగా విభజన చట్టంలో రక్షణ కల్పించామని సీఎం చెబుతున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్కు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.కుట్రపూరితంగా ప్రాజెక్ట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీఎం రేవంత్ కక్ష గట్టారు.. పాలమూరుపై పగబట్టారు. కాంగ్రెస్ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటోంది. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోంది. కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్ట్లను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే కేసీఆర్ చెప్పారు..టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్ ఎప్పుడో ఒప్పించారు. 2016లోనే టెలీమెట్రీ ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతానికే రేవంత్ అన్యాయం చేస్తున్నారు. శాసన సభను రేవంత్ తప్పుదోవ పట్టించారు. తనకు అనుకూలంగా ఉన్న పేజీలను చదివారు. సభలో అసలైన పేజీలను రేవంత్ చదవకుండా వదిలేశారు. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే నీటి హక్కులపై కేంద్రాన్ని నిలదీశాం. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం. పొతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని ఆనాడే కేసీఆర్ చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే బల్లగుద్దినట్టు కేసీఆర్ మాట్లాడారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్. రేవంత్ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెబుదామంటారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్, చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదిరింది అని విమర్శించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు..అసెంబ్లీలో అబద్ధాలు ఆడినందుకు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ మాత్రం ఒక్క ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా కేంద్రానికి పంపించలేదు. మీ పాలనలో మూడు డీపీఆర్లు వెనక్కి వచ్చాయి. అరెంజ్మెంట్, అగ్రిమెంట్కు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి 11 ప్రాజెక్ట్ల డీపీఆర్లను పంపించాం. ఏడు ప్రాజెక్ట్లకు అనుమతి తీసుకొచ్చాం. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా?. రేవంత్ అబద్దాలను చేసి నిజమే ఉరేసుకుంటుందేమో. బీఆర్ఎస్ హయంలోనే అత్యధికంగా కృష్ణా నీళ్ల వినియోగం జరిగింది. ప్రాజెక్ట్ల నిర్మాణాన్ని కేసీఆర్ పరుగులు పెట్టించారు. తెలంగాణకు బీఆర్ఎస్ మరణశాసనం రాసిందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. గత పదేళ్లు నీటి హక్కుల కోసం కేంద్రంపై కేసీఆర్ పోరాడారు. 2023లోనే 66:34 లేకుండానే అగ్రిమెంట్ చేశాం. కృష్ణా జలాల్లో 50:50 నీటి వాటాల కోసం కేంద్రానికి 28 లేఖలు రాశాం. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. రేవంత్వి బలుపు మాటలు: కేటీఆర్అంతకముందు కేటీఆర్ మాట్లాడుతూ..‘నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ద్రోహానికి పాల్పడుతోంది. అధికార మదంతో విర్రవీగుతూ, బలుపు మాటలతో రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరితీయాలి. రేవంత్కి ఒక్క భాషలో తిట్లు వస్తే మాకు నాలుగైదు భాషల్లో తిట్టడానికి వచ్చు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప తెలంగాణకు ఏం కావాలో.. రేవంత్కు తెలియదు. రేవంత్ మాటలతో కేసీఆర్ స్థాయి తగ్గదు. కేసీఆర్ గురించి ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఊరి వేయాలి?. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు.. బేసిన్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే రేవంత్ రెడ్డి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. -
‘సీమ’ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా..
రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి దాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా (క్లోజ్డ్ రూమ్) సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్షా.. రాయలసీమ ఎత్తిపోతలు పనులు ఆగినాయా? లేదా? తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వరరెడ్డి, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపండి. ఒకవేళ శ్రీశైలంలో మేం కట్టే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే.. మేం తక్షణమే పాత ప్రతిపాదన అయిన జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపడతామని చంద్రబాబుకు చెప్పాను. ఆ చర్చల ద్వారా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నాం. – తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలకు, ఆ దుర్భిక్ష ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశానని, తన మీద గౌరవంతో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే ఆ ఎత్తిపోతల పనులు ఆగాయో లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా ఆగిపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నది స్పష్టమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించక పోవడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులకు సమాధి కట్టడాన్ని బట్టిచూస్తే ఇది వాస్తవమేనని తేటతెల్లమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో 2015లో తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని.. ఇప్పుడు తన శిష్యుడు రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అదే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను వదిలేసుకుని రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు మరణ శాసనం రాశారని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల ⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూ భాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్ష్యతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. తాగునీటి పనులకూ బ్రేక్రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ సర్కార్ నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని ఈఏసీ ఆదేశించింది.నిర్విఘ్నంగా పాలమూరు–రంగారెడ్డి⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో గరిష్టంగా 120 టీఎంసీలు తరలించేలా 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (1.5 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (0.5 టీఎంసీలు) చేపట్టింది. తద్వారా మన రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అటు రైతులు.. ఇటు నీటి పారుదల రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ⇒ ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం.. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నాటి సీఎం చంద్రబాబు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై నోరు మెదపలేదు. దాంతో 2019 నాటికి ఆ ప్రాజెక్టు పనులను సింహ భాగం తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది.⇒ కృష్ణా జలాల్లో చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు ఉందని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తమకే దక్కుతాయని తనకు తానే తెలంగాణ సర్కార్ తీర్మానించుకుంది. ఆ రెండూ కలిపి 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపగా.. దాన్ని సీడబ్ల్యూసీ అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పంపి అభిప్రాయాన్ని కోరింది. ⇒ చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు లేదని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది ట్రిబ్యునల్ తేల్చాలని సీడబ్ల్యూసీకి 2022 సెప్టెంబరు 19న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదించింది. నీటి లభ్యతే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, తద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ను తెలంగాణ ప్రభుత్వానికి వెనక్కు పంపింది. ⇒ దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. చిన్న నీటి పారుదల విభాగం కింద తమకు కేటాయించిన నీటిలో 45.6 టీఎంసీలు మిగులు ఉందని.. ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశ ద్వారా తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించింది. ఆ మేరకు నిర్విఘ్నంగా పనులు చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపకపోవడం పట్ల సాగు నీటి రంగం నిపుణులు, రైతులు విస్తుపోతున్నారు. -
రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణశాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి మరణశాసనం లిఖించారని.. ‘సీమ’ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం బట్టబయలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు బలిపెట్టారని శనివారం ‘ఎక్స్’లో ఆ పార్టీ మండిపడింది. ‘నేను కోరినందువల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారు. చంద్రబాబుతో జరిగిన ఏకాంత సమావేశంలో నేను కోరగానే ఆయన ఒప్పుకున్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. కావాలంటే నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చు’.. అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక విషయాలు వెల్లడించారని వైఎస్సార్సీపీ ఆ పోస్టులో పేర్కొంది. సీమ అంటే గిట్టని చంద్రబాబురాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు తొలి నుంచీ చిత్తశుద్ధి లేదు. ఆ విషయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన బృహత్తర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి నుంచి చంద్రబాబు మోకాలడ్డుతూనే ఉన్నాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజల గొంతు కోయడం సరికాదు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. రాయలసీమ ప్రజలు ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక, కర్షక సమితిఇది ఏపీ ప్రజల హక్కులపై దాడితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలపై ఏపీ సీఎం చంద్రబాబు తక్షణం స్పందించాలి. చంద్రబాబు ఏపీ ప్రజల హక్కులపైన దాడి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమకు ఎత్తిపోతల పథకం చాలా అవసరం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు రూ.7వేల కోట్లతో తీసుకొచ్చారు. ఇందులో పైపులైన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తానే నిలిపేయించానని చెప్పడమే కాకుండా కమిటీ వేస్తానంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి రేవంత్ రెడ్డి ప్రకటనను ఖండించాలి. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యే స్పందించాలి. లేదంటే రాయలసీమ చరిత్రలో ఒక మాయని మచ్చగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతుంది. – మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరంసీమకు అన్యాయం చేసేందుకే కుట్రరాయలసీమకు నీరు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పడం చూస్తుంటే ఆ కుట్ర బహిర్గతమైంది. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బలోపేతానికి కృషి చేశారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు. – ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుసీమకు చంద్రబాబు అన్యాయం నిత్యం కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమకు సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇదే విషయం శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టడంతో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఇద్దరు సీఎంలు చర్చించుకున్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని చెప్పడంతో పనులు ఆగిపోయిన విషయం రేవంత్ రెడ్డే చెప్పారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు అన్యాయం చేస్తే వారికి భవిష్యత్లో రైతులే గుణపాఠం చెబుతారు. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీమ ద్రోహి చంద్రబాబురాయలసీమ ప్రాజెక్టులకు తాగునీరు అందించే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని రుజువు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాము ఏపీ చంద్రబాబు నాయుడికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించానని సాక్షాత్తు తెలంగాణ సాక్షిగా కుండ బద్దలుకొట్టారు. సీఎం చంద్రబాబు తక్షణం నోరు విప్పాలి. చంద్రబాబుకు రాయలసీమ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడురాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఏపీకి దక్కాల్సిన కృష్ణా జలాలను తెలంగాణకు తరలించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని తాను అడిగానని, చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించానని రేవంత్ రెడ్డి పేర్కొనడం ద్వారా రాయలసీమ రైతులకు చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారన్నది రుజువైంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. రాజకీయంగా పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. – అనంత వెంకట్రామి రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురంసీమ అంటే చులకన భావంరాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కోరగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం ఇక్కడి రైతులను దగా చేయడమే. సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికంగా కృష్ణా జలాలు ఆంధ్రాకు తీసుకెళ్లారని రేవంత్ రెడ్డే చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్వార్థం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేతప్రతిసారి రాయలసీమకు ద్రోహమేచంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే చేశాడు. సీమపై బాబు వైఖరి మరోసారి బట్టబయలైంది. తన శిష్యుడైన రేవంత్రెడ్డి ఏకంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించానని.. కావాలంటే అసెంబ్లీ వేదికగా నిజనిర్ధారణ కమిటీ వేసి చంద్రబాబును అడగండి అన్నారంటే సీమకు గురుశిష్యులు కలిసి ఏ స్థాయిలో ద్రోహం చేస్తున్నారో అర్థమవుతోంది. వెంటనే రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి. లేదంటే ఆయన్ను రాయలసీమ ద్రోహిగా భావించాల్సి వస్తుంది. రాయలసీమలో పుట్టి, ఈ ప్రాంతంలోని రాయలసీమ లిఫ్ట్ను ఒకరు చెబితే నువ్వు నిలిపేశావంటే ఇంతకంటే ద్రోహం సీమకు మరొకటి ఉండదు. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడుసీమ ద్రోహి చంద్రబాబుతెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబుచరిత్రలో రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను సీమ ప్రాంతానికి రాకుండా తాను చంద్రబాబుతో కలిసి అడ్డుకున్నానని తెలంగాణ సీఎం చెప్పడం గమనార్హం. ఏనాడూ చంద్రబాబు సీమ ప్రాంతం గురించి ఆలోచించలేదు. అమరావతి తప్ప సీమ ప్రాంతానికి నిధులు, ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన నిజాయితీని నిరూపించుకోవాలి. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడైనా నిధులు రాబట్టాలి.– ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుఇద్దరు సీఎంలూ మోసం చేశారు.. రాయలసీమకు సాగునీటిని అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే ఇదే టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి నిలుపుదల చేయించారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రాజకీయ స్వలాభం కోసం రాయలసీమ ప్రజల జీవనాడిగా చెప్పుకునే కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నారు. – ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, హిందూపురం పార్లమెంటరీ వైఎస్సార్సీపీ పరిశీలకుడుతన ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రాయలసీమకు మరణ శాసనం రాశారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, రాష్ట జల వనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తన స్వార్థం కోసం తెలంగాణ సీఎంతో లాలూచీపడి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ను చంద్రబాబు ఆపేశారు. ఈ విషయాన్ని రేవంత్రెడ్డే తెలంగాణ అసెంబ్లీలో వెల్లడించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాలను ఈ రకంగా తన స్వార్థంకోసం అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడాచూసి ఉండం. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కమీషన్ల కోసమే ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ఇలా దెబ్బతీసూ్తనే ఉన్నాడు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి శిష్యుడికి గురువు దక్షిణ ఇచ్చినట్లుగా ఉంది..రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబుతో మాట్లాడి తాను నిలిపివేయించినట్లు తెలంగాణ సీఎం చేసిన ప్రకటన తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని ఇంతకాలం చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని ఆపేయడానికి చంద్రబాబు అంగీకరించారన్నది నిర్ధారణైంది. గురువుకు శిష్యుడు దక్షిణ ఇవ్వడం చూశాంగానీ.. ఇప్పుడు గురువు శిష్యుడికి దక్షిణ ఇచ్చినట్లు ఉంది. – రాంభూపాల్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడురాయలసీమకు మరణశాసనం రాసిన చంద్రబాబుచంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ద్రోహి అనేది ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. దీనిబట్టి చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాసినట్లు రుజువైంది. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తే చంద్రబాబు ఆలోచన అందుకు విరుద్ధంగా ఉంది. – కేవీ రమణ, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుచంద్రబాబు, రేవంత్ ఇద్దరూ తోడుదొంగలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి ఇద్దరూ తోడుదొంగలు. ఓటుకు కోట్లు కేసులో ఇద్దరూ ఉన్నారు. చంద్రబాబుకు నీటి ప్రాజెక్టులు ఏమాత్రం పట్టవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు చంద్రబాబు పూర్తి వ్యతిరేకం. కాబట్టే ఆపేశాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం చెబుతున్నాడు. రాయలసీమకు ఇంతకంటే ద్రోహం చేసేవారు మరొకరు ఉండరు. – ఇమాం, కదలిక ఎడిటర్ -
‘ప్రభుత్వం మారినా కాంట్రాక్టర్లు మారట్లేదు.. సీబీఐ విచారణ జరగాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్టర్లపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాంట్రాక్టర్లు మారడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ..‘ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అయినా సేమ్ కాంట్రాక్టర్లు కొనసాగుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయినప్పుడు కాంట్రాక్టర్లపై బాధ్యత ఉంటుంది. కాంట్రాక్టర్లకు సైతం నిబంధనలు వర్తించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వాలు మారిన కాంట్రాక్టర్లు మాత్రం వాళ్లే ఉంటున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలల్లో పెయింటింగ్, బెంచీల కాంట్రాక్టర్లు ఇప్పుడు సైతం కొనసాగుతున్నారు. కాంట్రాక్టర్లపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లపై సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇదే సమయంలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. సభకు రాని కేసీఆర్ అజెండా డిసైడ్ చేస్తున్నారు. ఆయనే సభకు వస్తున్నాను.. ఇరిగేషన్ మీద చర్చ చేస్తా అంటారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు అని వ్యాఖ్యలు చేశారు. -
ఇదే బీఆర్ఎస్ రాసిన మొదటి మరణ శాసనం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సభకు వచ్చి కేసీఆర్ తన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని.. సూచనలు ఇస్తే తీసుకుందామనుకున్నమన్నారు. కృష్ణా నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒక రోజు చర్చ పెడదామనుకున్నామంటూ చెప్పుకొచ్చారు.‘‘రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు. సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్ను కోరుతున్నా.. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు. బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దాం. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని మేము అడగలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అడిగారు. అందుకే అసెంబ్లీ పెట్టి చర్చింస్తున్నాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదు. హరీష్ రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారు. అయినా మేము సభకు రామని వెళ్లిపోయారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు ,తొలు తీస్తామని ఒకరు మాట్లాడారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలు తేల్చుకునేవారు.’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2130 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 811 టీఎంసీలు.. కేటాయించారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేది. నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది...బచావత్ ట్రిబ్యునల్ పంపిణీచేసిన 2130 టీఎంసీల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే, అదనపు నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీచేసింది. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీల నీటి వాటాలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇదే బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్కు (KWDT2) అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉంది...ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసింది. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసింది. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. 2015 జూన్లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు...21.09.2016 న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 06.10.2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ ను ఆహ్వానించాం. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారు.’’ రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణకు పటేల్ వరం.. నెహ్రూ శాపం: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. సభను భజన మండలిగా మార్చారు అంటూ మండిపడ్డారు.కృష్ణ జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం, బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు పటేల్ వరం అయితే.. నెహ్రూ శాపం. పటేల్ రజాకర్ల నుంచి విముక్తి చేస్తే.. నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేశారు. జల దోపిడికి నెహ్రూ చేసిన పనితోనే శ్రీకారం పడింది. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని దురాశతో ఏపీకి సాగు నీళ్ళను దారాదత్తం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన గుత్తదారుల జేబులు నింపడానికి అదే పని చేస్తుంది. నాగార్జున సాగర్ తెలంగాణకు వచ్చే ఎడమ కాల్వను పైకి కట్టి, కుడి కాల్వను కిందకు కట్టి దోపిడిని ఆరోజే ప్రారంభించారు. తెలంగాణ కోసం చేపట్టిన ఎస్ఎల్బీసీ అంతా గందరగోళం.. ఇంకా పూర్తి కాలేదు.సభలో కాంగ్రెస్ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుండి ఒక్కరికీ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నుండి మరొకరికి అవకాశం అడిగితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎలాగో సభలో లేనే లేదు.. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా?. ఎంఐఎం, సీపీఐతో డబ్బా కొట్టించుకున్నారు. సభను భజన మండలిగా మార్చారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
తప్పుడు చరిత్ర రాసే ప్రయత్నంలో కేంద్రం: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తప్పుడు చరిత్రను రాసే ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మహాత్మాగాంధీ మన దేశంలోనే కాదు.. ప్రపంచం గర్వించదగిన త్యాగశీలి. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్రం.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, దేశ స్వాతంత్రం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూలను మరిపించే ప్రయత్నం చేస్తుంది. దేశంలో వలసల నివారణ కోసం సోనియా గాంధీ తీసుకువచ్చిన గొప్ప చట్టం ఇది. పేదలకు ఉపాధి హక్కును కల్పించి జీవనోపాధిని కల్పించింది. 20 ఏళ్లుగా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం ఇది.ఉపాధి హామీ పనుల్లో 90 శాతం మంది లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. 62 శాతం మంది మహిళలు లబ్ది పొందారు. పేదలకు ఆపన్న హస్తంలా నిలిచిన ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ఒక తెలంగాణలోనే గత ఏడాది 6 కోట్ల విలువైన పని దినాలు తగ్గించారు. పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం. పెట్రోల్, డీజిల్ రేటు మూడింతలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేటు పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాల ఆదాయ వనరులు తగ్గాయి. ఇది చాలదు అన్నట్లు ఉపాధి హామీ నిధుల్లో 40 శాతం భారం వేయడం అన్యాయం. కేంద్రం చర్యల వల్ల ఒక్క తెలంగాణ మీదే 1800 కోట్ల అదనపు భారం పడుతుంది’ అని కామెంట్స్ చేశారు. -
‘బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం’
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమకుమార్రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి.. పాలమూరులో బీఆర్ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదని మండిపడ్డారు. వచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ఉత్తమ్.. పాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదన్నారు.‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారు.. పాలమూరు కు కేవలం 27వేల కోట్లు మాత్రమే. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయి. పాలమూరకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదు. పాలమూరు ప్రాజెక్టును కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు. కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.‘‘కృష్ణా నీటిలో చుక్క నీరు వదులుకోం. తెలంగాణ హక్కులను కాపాడటంతో రాజీపడం. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంతకాలు చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలు అని కేసీఆర్, హరీష్రావు సంతకాలు చేశారు. కేసీఆర్ తను ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పారు. కూర్చువేసుకొని దేవరకద్ర ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్ల బడ్జెట్ల ఇరిగేషన్కు కేటాయిస్తే అందులో 16 వేల కోట్లు ఇంట్రెస్ట్కే వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ను 2నుంచి 3టీఎంసీ లకు పెంచారు... పాలమూరు ప్రాజెక్టును 1.5 నుంచి 1టీఎంసీకి పంపారు’’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్
👉తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదాఎల్లుండి ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీఅసెంబ్లీలో కీలక తీర్మానాలు చేసిన ప్రభుత్వంపాలమూరుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తీర్మానం👉తెలంగాణ శాసన సభ నుంచి బీజేపీ వాకౌట్కృష్ణా జలాలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీజేపీపాలమూరుపై ఉత్తమ్ సభలో వాస్తవాలు చెప్పారు: సీఎం రేవంత్ఇరిగేషన్ విషయంలో సభ్యులంతా తమ ఆలోచనలు, అభిప్రాయాలను చెప్పారుకేసీఆర్ 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్నారు..ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇస్తారని అనుకున్నాంమంత్రి ఉత్తమ్ చాలా విషయాల వాస్తవాలను సభకు వివరించారుకృష్ణా జలాలపై ఒక రోజు.. గోదావరి జలాలపై మరో రోజు చర్చిందామని అనుకున్నాంశాసనసభ:ప్రభుత్వ తీరుపై చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తిఅర్ధరాత్రి వరకు ఎజెండా స్టేటమెంట్ సభ్యులకు అందడం లేదుఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన మీరు స్పందించడం లేదుప్రభుత్వం ఎప్పుడు మాట్లాడిన కృష్ణ గోదావరి తప్పితే ఇతర అంశాలు మాట్లాడడం లేదుసభ నిబంధనలు సరిగ్గా పాటించకపోతే సభ్యులు ఇబ్బంది పడతారుసభ్యులకు ఎజెండా స్టేట్మెంట్ కరెక్టు టైంకు ఇవ్వకపోతే ఎలా ప్రిపేర్ అవుతారు?స్పీకర్ సభ్యుల హక్కులను కాపాడాలిసభ్యులకు ఎజెండా, స్టేట్మెంట్ సరైన సమయంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా.ఉత్తమ్ కుమార్ రెడ్డి@అసెంబ్లీకృష్ణా బేసిన్పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిపాలమూరులో బీఆర్ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదువచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాంపాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదుకాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారుపాలమూరుకు కేవలం 27 వేల కోట్లు మాత్రమేకాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయిపాలమూరుకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదుపాలమూరు ప్రాజెక్ట్ను కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది👉కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు: ఉత్తమ్కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారుబీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది: ఉత్తమ్బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం👉బ్రేక్ తర్వాత ప్రారంభమైన శాసనసభకృష్ణ నది నీటి కేటాయింపులపై మొదలైన చర్చ..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సభలో ప్రతిపక్షం లేకున్నా ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ పని చేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా.. కనీస స్పందన ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన సభలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలకు దిగారు. తమ నియోజకవర్గంలో బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, టెక్నీకల్ సమస్యలతో ఇబ్బందులు పెట్టొద్దని సభలో కొందరు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఇండ్లతో పాటు అదనపు ఇండ్లు మంజూరు చేయాలని మరికొందరు ఎమ్మెల్యేలు కోరారు. అయితే.. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ‘‘గతంలో 200 కోట్లు డబుల్ బెడ్ ఇండ్లకు బిల్లులు బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం పింక్ కలర్ వాళ్ళకే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు దత్తత తీసుకున్న వాసల మర్రిలో హామీ నెరవేర్చలేదు.రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేస్తాం. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న అంశంపై ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఇండ్ల స్థలం లేని పేదలకు స్థలంతో పాటు ఇళ్లను ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రవ్యాప్తంగా 52,000 ఇండ్లు ఇప్పటికే గృహప్రవేశాలు అయ్యాయి. అర్బన్ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వబోతున్నాం. గ్రేటర్ సిటీని మూడు కార్పొరేషన్లుగా పెద్దగా చేసుకోబోతున్నాం’’ అని అన్నారాయన. అసెంబ్లీలో ఇవాళ కృష్ణా జలాల అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న సమయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సభలోని స్పెషల్ హాల్లో ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
సాక్షి, హైదరాబాద్: కృష్ఝా జలాలపై తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ జరుపుతుండగా.. దానికి కౌంటర్గా మరో పవర్ పాయింట్ ప్రజంటేషన్కు బీఆర్ఎస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధం కావడంతో బీఆర్ఎస్ అధికార కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు సిద్ధమయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో కేటీఆర్, హరీష్రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగనుంది. హరీష్రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారని ప్రచారం నడుస్తోంది. కృష్ఝా జలాల పంపిణీ అంశంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ(షార్ట్ డిస్కషన్) ఇవాళ నిర్వహిస్తోంది. మధ్యాహ్నాం 12 గంటల సమయంలో సభలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్పెషల్ స్క్రీన్ను ఇప్పటికే ఏర్పాటు చేశారు.సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని.. తమకూ పవర్పాయింట్ ప్రజంటేషన్కు అవకాశం ఇవ్వాలని, అలాగే యూరియా సహా ఇతర అంశాలపై చర్చించాలన్న డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ ఈ సెషన్ను బహిష్కరించింది. అయితే బీఆర్ఎస్లోనే అన్యాయం జరిగిందని.. తప్పులు బయటపడతాయనే సమావేశాలను బహిష్కరించిందని.. దమ్ముంటే సభకు రావాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మంత్రి ఉత్తమ్ పవర్పాయింట్ ప్రజంటేషన్పై హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. సంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు తుంగలో తొక్కారు. మార్పు పేరుతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు’’ అని అన్నారు.


