Tirupati
-
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
చిల్లకూరు: టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన చిల్లకూరు మండలం తిక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిక్కవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడు మధుబాబు కొంత కాలంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడ్ని చితక బాదారు. దీంతో పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడ్ని స్టేషన్కు తరలించి, విచారణ చేపడుతున్నారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పాఠశాలకు చేరుకుని విద్యార్థిని తల్లిదండ్రులతోపాటు, ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ జరిపి, నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి అందజేశారు. ఈ విషయమై ఉప విద్యాశాఖాధికారి సనత్కుమార్ మాట్లాడుతూ బయాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని నిర్ధారణ అయ్యిందని, దీంతో అతనిపై జిల్లా అధికారులు వేటు వేసే అవకాశం ఉందన్నారు. నెల కిందట మండలంలోని ఉడతావారిపాళెంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా ఇలాగే ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని గుర్తుచేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు చిల్లకూరు ఎస్సై సురేష్బాబు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్ తిరుపతి ఎడ్యుకేషన్ : చిల్లకూరు మండలం, తిక్కవరం జెడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పాఠశాలలో బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు బీ.మధుబాబు తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గూడూరు డీవైఈఓ విచారణ చేపట్టారని, ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. నిర్లక్ష్యం... అవగాహన లోపం.. తిరుపతి తుడా: రుయా ఆసుపత్రి న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న చిన్న రంగయ్యను కుటుంబ సభ్యులు అవగాహన లోపంతో వైద్యులు రమ్మన్నారని భావించి వార్డు నుంచి ఓబీకి తీసుకువచ్చారు. మంగళవారం ఓపీ ఉండడంతో వార్డులో లేవలేని స్థితిలో చికిత్స పొందుతున్న చిన్న రంగయ్యను వార్డు నుంచి స్ట్రక్చర్ పై తీసుకురావడం ఆస్పత్రిలో నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. వార్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రోగిని వార్డు నుంచి తరలించిన నర్సింగ్ స్టాఫ్ వారిని ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్ట్రక్చర్ను రోగి సహాయకులే తోసుకుంటూ ఓపీ వద్దకు రాగా వైద్యులు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు.. ఎందుకు వచ్చారని వైద్యులు గట్టిగా చెప్పడంతో తిరిగి రోగిని న్యూరాలజీ వార్డుకు తరలించారు. రోగిని తీసుకువచ్చే క్రమంలో ఎంఎన్ఓ సిబ్బంది లేకపోవడం గమనార్హం. -
ఎంపీపీలపై ధిక్కారం
సమస్యలు ఆ ఇద్దరి ఎంపీపీలవే కాదు.. దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో అదే పరిస్థితి నెలకొంది. న్యాయం చేయాల్సిన మండల అధికారులు కూటమి నేతలతో కుమ్మకై ్క ఎంపీపీ, ఎంపీటీసీలకు కనీస విలువలు ఇవ్వడం లేదు. వీటిపై నిలదీస్తే కూటమి ఎమ్మెల్యేలు చెప్పిందే చేస్తున్నట్లు ఎంపీడీఓలు వెల్లడిస్తున్నారని ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ /చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జల్లాల వ్యాప్తంగా ఎంపీపీలకు పది నెలలుగా తగిన గౌరవం దక్కడం లేదు. స్థానిక సంస్థల్లో కీలకంగా వ్యవహరించే ఎంపీపీల నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇదేమిటని అడిగితే అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు...బెదిరిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎంపీపీల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులను జరగనివ్వకుండా అడ్డుకుంటున్నా రు. ఏ అభివృద్ధి పనుల వివరాలు అడిగినా ఎంపీడీఓలు కూటమి ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవాలని, ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటంకాలు సృష్టిస్తున్న ‘కూటమి’ ఎంపీపీల హక్కులు, గౌరవానికి, అధికారాలను కూట మి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఎంపీపీల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ హనుమంతరావు ఆరోపించారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పతో కలిసి ఎంపీపీ, వైస్ ఎంపీపీలు మంగళవారం జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడుకు వినతిపత్రం అందజే శారు. పది నెలలుగా ఎంపీపీలకు జరుగుతున్న అన్యాయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు మోహన్, అమరావతి, సురేష్, భార్గవి, సురేంద్రరెడ్డి, యశ్వంత్, జయరాం, శివారెడ్డి, డి.సురేష్, త్యాగ, సంపత్, రాజశేఖర్, మునిలక్ష్మి, గుణశేఖర్రెడ్డి, తులసి పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో కక్ష సాధింపులు కూటమి పాలనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం దక్కడం లేదని ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక సమావేశాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు. ప్రతి పనికి ఎమ్మెల్యే అనుమతులు.. గ్రామాల్లో ఏ చిన్న పని చేయాలన్నా కూటమి టీడీపీ ఎమ్మెల్యే అనుమతి కావాలని ఎంపీడీఓలు చెబుతున్నారన్నారు. ఇలాంటి ధోరణి గతంలో ఎన్నడూ లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో హక్కులు నిర్వీర్యం ఎటువంటి సమాచారం ఇవ్వని వైనం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ దృష్టికి ఎంపీపీల సమస్యలు ప్రధాన డిమాండ్లు ఇవే.. ప్రభుత్వ అధికారులు ఎంపీపీల విషయంలో ప్రొటోకాల్ పాటించాలి ఎంపీపీల నిధుల విషయంలో పాలకవర్గం అనుమతి లేకుండా ఎంపీడీఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారి పోకడలను నియంత్రించాలి ఎంపీపీ, పాలకవర్గం తీర్మానించిన అభివృద్ధి పనులు అమలు చేయకుండా , ప్రొసీడింగ్స్, వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా దురుద్దేశంతో కాలయాపన చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఎంపీపీ నిధుల్లో చేపట్టే పనులకు పంచాయతీ తీర్మానం కావాలని అధికారులు చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఎంపీపీలకు వాహన అలవెన్సు, గౌరవ వేతనం ఇవ్వడం లేదు.న్యాయపరంగా పోరాడతాం ఎంపీడీఓలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు తీర్మానించిన పనులు చేయకుండా కూ టమి నేతలు చెప్పినవి చే యడం తప్పు. న్యాయ పోరాటం చేస్తాం. – హనుమంతరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీపీల సంక్షేమ సంఘం సగం–సగం అంటున్నారు మండలంలో మా నిధులతో జరిగే పనులను కూటమి నాయకులకు స గం కేటాయించాలని అధికారులు చెప్పడం బాధాకరం. అభివృద్ధి పనులను నా అమనుతి లేకుండా చేపట్టారు. వీటిని ప్రశ్ని స్తే ప్రస్తుతానికి ఆపారు. – భార్గవి, ఎంపీపీ నగరిఅధికారులు వేధిస్తున్నారు మండలంలో తీర్మానించిన పనులను చేసుకోవాలంటే జిల్లాలో కష్టంగా మారింది. అధికారు లు నియంతలా వ్యవహరిస్తున్నారు. వీటిపై అన్ని సమావేశాల్లో తెలియజేసినా మార్పు రావడం లేదు. – రెడ్డెప్ప, జిల్లా అధ్యక్షుడు ఎంపీపీల సంఘం -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
– సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈనెల 27వ తేదీన నిర్వహించే మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీ అయిన స్థానాలకు ఈనెల 27వ తేదీన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని రామకుప్పం (మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు), తవణంపల్లి (మండల పరిషత్ అధ్యక్షుడు), విజయపురం (ఉపాధ్యక్షుడు), సదుం (మండల పరిషత్ అధ్యక్షుడు), తిరుపతి (మండల పరిషత్ అధ్యక్షుడు), పెనుమూరు, పీలేరు ( కో ఆప్షన్ సభ్యుల ) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలకు ఎంపీడీఓలు పీవో లుగా వ్యవహరిస్తారన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. సభ్యులు తగినంత మంది హాజరుకాకపోతే ఈనెల 28వ తేదీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. డీఆర్ఓ మోహన్కుమార్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, తదితర అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి తడ: పెరియవట్టు గ్రామం వద్ద ఈ నెల 23వ తేదీ కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో గాయపడి చైన్నె స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాదేష్(21) విద్యార్థి సోమవారం రాత్రి మృతి చెందాడు. విహర యాత్ర కోసం తమిళనాడులోని తాంబరం నుంచి చైన్నెలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇతర మిత్రులతో కలసి ఆదివారం వరదయ్యపాళెంలోని ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి కారులో వస్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని ఓ యువతితో సహా ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. మిగిలిన ఆరుగురు చైన్నెలో చికిత్స పొందుతున్నారు. వారిలో మాదేష్ మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని ఎస్ఐ కొండపనాయుడు తెలిపారు. -
విద్య..ఉపాధిలో ఏఐ పాత్ర కీలకం
తిరుపతి సిటీ: ఆధునిక ప్రపంచంలో విద్య, ఉపాధి రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ప్రభావం కీలకంగా మారుతోందని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి భవానీ శంకర్ పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి మండలి, మై క్రోసాఫ్ట్ సంయుక్త సహకారంతో పద్మావతి మహిళా వర్సిటీ డీఎస్టీ క్యూరీ ఏఐ సెంటర్ ఆధ్వర్యంలో వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మూ డు రోజుల పాటు మైక్రోసాఫ్ట్ ఏఐ, నైపుణ్యాభివృద్ధి అనే అంశంపై జరగనున్న వర్క్షాప్ను ఆయన వర్సి టీ అధికారులు, అతిథులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంప్రదాయ, ఆన్ లైన్ ద్వారా విద్యనభ్యసించడానికి రిమోట్ లెర్నింగ్కు తేడా ఉందన్నారు. సాంకేతిక విద్యతో విద్యార్థులను సాధికారపరచడం కోసం ఉమెన్ రాక్ ఇన్ ఐటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం సాంప్రాసాఫ్ట్ సంస్థ సీఈఓ మల్లిక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా 50 వేల మంది విద్యార్థులకు ఏఐ పై శిక్షణ ఇవ్వాలన్న అంశంపై మైక్రోసాఫ్ట్ సంస్థ దృష్టి సారించిందన్నారు. ప్రపంచ ఉద్యోగ వీసీ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే విద్యతో పాటు ఏఐపై విద్యార్థినులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ టి సుధ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డైరెక్టర్ మల్లికార్జున, ప్రొఫెసర్ వెంకటకృష్ణ పాల్గొన్నారు. -
ఎవరి కోసం రోడ్డు నిర్మాణం?
మెటల్ రోలింగ్ చేస్తున్న రోలర్ చిట్టమూరు: రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువ లేదన్న నానుడిని పాటిస్తున్నారు కూటమి నేతలు. తమ అధికార బలంతో అధికారులను పక్కదారి పట్టించి, తమకు అనుకూలంగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి సమీపంలో నాలుగు నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్న కూటమికి చెందిన పెద్దాయన గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఎస్సీ, ఎస్టీల పొలాలతోపాటు ప్రభుత్వ భూములు సుమారు 500 ఎకరాలను తమ అధీనంలోకి తెచ్చుకుని, ఫామ్హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడకు వెళ్లేందుకు పూర్తి స్థాయి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి సర్కారు ఇటీవల పల్లె పండుగ పేరు తో రహదారులు నిర్మిస్తుంది. ఇదే మంచి తరుణం అనుకున్న ఆ పెద్దాయన తమ ఫామ్హౌస్కు రూ.15 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. ఇందుకు అధికారులు కూడా జీ హు జూర్ అంటూ తలలు ఊపారు. నిబంధనలు పక్క పెట్టి కూటమి ప్రభుత్వానికి చెందిన పెద్దాయన తోటకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తున్నారు. అయితే ఇదే మండలంలోని బురదగాలి కొత్త పాళేనికి ఇలాంటి రహదారి ఉన్నా, దానినికి మాత్రం అటవీ ఆంక్షలు ఉన్నాయని, కనీసం తట్టడు మట్టి కూడా వేయకుండా ఆ ప్రాంత వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటవీ, చెరువు భూముల్లో రోడ్డు నిర్మాణం చిట్టమూరు మండలంలోని మల్లాం– నాయుడుపేట రహదారికి మధ్యలో ఎల్లసిరి గ్రామానికి రోడ్డు ఉంది. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ఎగువగిరిజనకాలనీ నుంచి అటవీ, చెరువుకు సంబంధించిన భూములున్నాయి. గతంలో రోడ్డు నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆంక్షలున్నందున రోడ్డు నిర్మాణం జరగలేదు. అయితే ఇటీవల అటవీ అధికారులు రాక పోకలు సాగించడానికి వీలుగా కాలి బాటలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అటవీ భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఉండేలా ట్రెంచ్ కొట్టారు. దీనిని ఆసరా చేసుకున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, జిల్లాధికారుల ద్వారా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారు. అంతే చక చకా పనులు పూర్తిచేసేలా కింద స్థాయి అధికారులు పనులు చక్క బెడుతున్నారు. రోడ్డు పనులు ఇంత త్వరగా పూర్తి చేయడంపై మండల ప్రజలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. పెద్దలతోటకు రూ.15 లక్షలతో రహదారి అటవీ, చెరువు ప్రాంతాల్లో రోడ్డు ఉపాధి నిధులు మంజూరు పెద్దల తోటకు వేసే రోడ్డుకు ఇటీవల ప్రభుత్వం పల్లె పండుగ పేరుతో ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మళ్లించిన విషయం తెలిసిందే. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని, జిల్లాధికారుల ద్వారా తోటకు రోడ్డు వేసుకునేందుకు ఎల్లసిరి ఎగువ గిరిజన కాలనీని చూపించి, నిధులు మంజూరు చేయించుకున్నారు. ప్రస్తుతం వేస్తున్న రోడ్డు పెద్దలతోట వద్దకు తప్ప ఆ తరువాత కనీసం కాలిబాట కూడా లేకపోవడం విశేషం. ట్రెంచ్ కొట్టారు రోడ్డు నిర్మాణం చేసే ప్రాంతం అటవీ ప్రాంతం కాదు. అటవీశాఖాధికారులు ఇప్పటికే ట్రెంచ్ కొట్టి ఉన్నందున అక్కడ వరకే వారి హద్దు మిగిలింది. ప్రభుత్వ భూమి అయినందున రోడ్డు నిర్మాణం చేపట్టాం. – జగదీష్, ఇన్చార్జి ఏఈ, పీఆర్, చిట్టమూరు కలెక్టర్ ఆదేశాల మేరకు నిధులు మంజూరు ఎల్లసిరి ఎగువ గిరిజన కాలని నుంచి వేస్తున్న మెటల్ రోడ్డుకు నిధులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె పండుగలో భాగంగా ఉపాధి పథకం నిధులు రూ.15 లక్షలు మంజూరు చేశాం. దీంతో పనులు చేపట్టి పూర్తి చేస్తున్నాం. ఇక్కడ అటవీ భూమి ఉందన్న విషయం తనకు తెలియదు. విచారణ చేస్తాం. – శ్రీనివాసరావు, డీఈ, పంచాయతీరాజ్ -
దైవభాష అభ్యసనం మహాదృష్టం
తిరుపతి సిటీ: సంస్కృత భాషకు నిలయమైన ఎన్ఎస్యూలో దైవభాషను అభ్యసిస్తున్న, అధ్యయనం చేస్తున్న విద్యార్థులు అదృష్టవంతులని బెంగళూరు డీఆర్డీఓ ప్రముఖ శాస్త్రవేత్త ఎల్ఎన్ రాఘవేంద్ర కొనియాడారు. జాతీయ సంస్కృత వర్సిటీలో మంగళవారం వర్సిటీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రసంగించారు. సంస్కృతంలో నిక్షిప్తమైన భారతీయ సంస్కృతి ఆధునిక సమాజానికి మార్గదర్శిగా ఉందన్నారు. సంస్కృత భాష ఔన్నత్యం విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత విద్యార్థులు, అధ్యాపకులపై ఉందన్నారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత అధ్యయన, అధ్యాపన విషయంలో ఉత్తమ జ్ఞానాన్ని విద్యార్థులకు, ప్రజలకు అందిస్తూ భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషను సంరక్షిస్తూ ప్రాచీన భాషతో పాటు ఆధునిక సాంకేతిక విషయాలను వర్సిటీ విద్యార్థులకు నే ర్పిస్తూ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. అనంతరం పలు క్రీడా, సాంస్కృతిక పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, కే వెంకటనారాయణరావు, డీన్లు సి దక్షిణమూర్తి శర్మ, సి రంగనాథన్, రజనీకాంత్ శుక్లా, అధ్యాపకులు నాగరాజు, ఉదయనా హెగ్డే, లీనాచంద్ర, సేతు రాం, వైష్ణవి, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూ ఏటిజిహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 58,358 మంది స్వామివారిని దర్శించుకోగా 27,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది. మహిళావర్సిటీలో యూఎస్ కౌన్సిలేట్ జనరల్ తిరుపతి సిటీ: యూఎస్ కౌన్సిలేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ ఎమిలియా బి స్మిత్, పబ్లిక్ ఎంగేజ్మెంట్ స్పెషలిస్ట్ సెంథిల్ కుమార్ మంగళవారం మహిళా వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ ర జిని, డీన్లు విజయలక్ష్మి, భారతి, శారద, అధ్యాపకులతో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణపై చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వ నిధులతో త్వరలో రానున్న ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫెలో ప్రొగ్రామ్పై చర్చించారు. విద్యార్థులకు, రీసెర్చ్స్కాలర్స్కు, యువ అధ్యాపకులు ఉపాధి నైపుణ్యం, కమ్యూ నికేషన్ స్కిల్స్, అకడమిక్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ భాషపై శిక్షణ ఇవ్వడానికి ఉన్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. -
● పర్యాటక కేంద్రం చేస్తున్నారంటూ భక్తుల ఆగ్రహం
తిరుమల: పర్యాటకాభివృద్ధిలో భాగంగా తిరుమలలోని పాపవినాశనం డ్యామ్లో తిరుపతి అటవీశాఖ అధికారులు మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార నీరు పాపవినాశనం డ్యామ్కు చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి వస్తుంటారు. అయితే, అటవీశాఖ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అకస్మాత్తుగా అధికారులు బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల కోసమే బోట్లు వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం బయోస్పేర్ రిజర్వ్లోని పాపవినాశనం డ్యామ్ చుట్టూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. తనిఖీల కోసం బోట్లు వినియోగించాం. అనంతరం వాటిని వెనుక్కు తీసుకొచ్చాం. – పి.వివేక్, జిల్లా అటవీశాఖ అధికారి -
జాతర.. జగమంత వైభవం
తూర్పుకనుమూరు తీరప్రాంతం గ్రామం.. మంగళవారం.. అక్కాచెల్లెళ్ల జాతర ప్రారంభం.. జగమంత వైభవంగా సాగింది. చెల్లెలు పోలేరమ్మ గంగమిట్టపై కొలువుదీరింది. అక్క ముత్యాలమ్మ బంగారు చీరలో దర్శనం ఇచ్చింది. ఈ వైభవం తిలకించడానికి జగమంత జనం తరలివచ్చింది.చిల్లకూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ముత్యాలమ్మ దేవస్థానంలో మంగళవారం అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. చిల్లకూరు మండల తీరప్రాంతంలోని తూర్పుకనుపూరులో గంగమిట్టపై ఉన్న పోలేరమ్మ ఆలయంలో తాత్కాలికంగా వేసిన తాటి ఆకుల గుడిసెలో పోలేరమ్మ ప్రతిమను మంగళవారం రాత్రి నిలుపుదల చేశారు. ఆదివారం ప్రారంభమైన ఘటోత్సవం కొమరావారిపాళెం, ఈదలవారిపాళెం, రావులవారిపాళెం మీదుగా తూర్పుకనుపూరునకు మంగళవారం రాత్రికి చేరుకుంది. కుమ్మరింట్లో అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేసిన అనంతరం చాకలి ఇంటికి తరలించారు. అక్కడ అమ్మవారికి దిష్టి చుక్కపెట్టి గణాచారి అనుమతితో అమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి గంగ మిట్టపై ప్రతిష్టించారు. పక్కాగా ఏర్పాట్లు జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో హాజరుకానుండడంతో దేవాదాయ, రెవెన్యూ, పోలీసుశాఖతో పాటు గా పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సాధారణ దర్శనంతోపాటు, ప్రత్యేక దర్శనం కోసం క్యూలు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులకు దాతల సహకారంతో వా టర్ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలరించిన నాదస్వర కచేరి తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ ఆలయంలోని జాతర సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నాదస్వర కచేరి భక్తులను అలరించింది. సుమారు 50 మందితో కూడిన ఈ బృందం కంచి కామకోఠి పీఠం, టీటీడీ ఆస్థాన విద్వాంసుల ఆధ్వర్యంలో నాదస్వర వాయిద్య కళాకారులు కచేరి చేశారు.అప్రమత్తంగా వ్యహరించాలి భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధి కారులు అప్రమత్తంగా వ్యవహరించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన సూచించారు. ఆయన జాతర నిర్వహణకు సబంధించి గతంలో సూచించిన అన్ని ఏర్పాట్లను చేశారా? లేదా అని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీస్ అవుట్ పోస్టు, వైద్యశిబిరాలు, తాగునీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ ఉండేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ గీతాకుమారి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ గోపి, ఆలయ ఈఓ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. భారీ బందోబస్తు జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. గూడూరు డీఎస్పీ గీతాకుమారి నేతృత్వంలో గూడూరు రూరల్ సీఐ కిశోర్బాబు, ఎస్ఐ సురేష్బాబు పర్యవేక్షణలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగారు చీరలో దర్శనమిచ్చిన ముత్యాలమ్మ దేవతల్లో అక్కచెల్లెలుగా కొలిచే ముత్యాలమ్మ సన్నిధిలో తన చెల్లి పోలేరమ్మకు జరిగే జాతరలో తొలిరోజు ముత్యాలమ్మకు బంగారు చీర ను అలంకరించారు. అమ్మవారి మూల విరాట్ కు అర్చకులు ఉదయం పంచామృతాభిషేకం చే సి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిష్టి తీర్పు తీర్చి, బంగారు చీరతో అలంకరించారు. గంగమిట్టపై కొలువు దీరిన పోలేరమ్మ బంగారు చీరలో దర్శనమిచ్చిన ముత్యాలమ్మ -
ఘరానా నేరస్తుడి అరెస్టు
తిరుమల : తిరుమలలోని పార్కింగ్ చేసిన ఉన్న కార్ల అద్దాలు పగులకొట్టి చోరీలకు పాల్పడే ఘరానా నేరస్తుడిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీరాముడు తెలిపారు. తిరుమల టూటౌన్ సీఐ కథనం మేరకు.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కే. హేమచంద్రారెడ్డి(35) పాతనేరస్తుడు. ఇతను తిరుమలకు వచ్చి పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు పగులకొట్టి కార్ల ఉన్న లగేజీతోపాటు విలువైన నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసేవాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.60 వేలు నగదు, ఒక జత బంగారు కమ్మలు, కారు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాముడు తెలిపారు. -
మెట్లోత్సవంలో పాల్గొనడం పుణ్యఫలం
● అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు రాజగోపాలరావు తిరుపతి కల్చరల్: పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రలయ్యారని, అలాంటి మోట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు రాజగోపాలరావు ఉద్ఘాటించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి మహోత్సవంలో భాగంగా మంగళవారం తొలిరోజు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వేడుకగా నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థచార్యులు, అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 700 మందికిపైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో నాగ వంశీ
తిరుమల: శ్రీవారిని మంగళవారం సిని మా డైరెక్టర్ నాగవంశీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శ నం ఏర్పాట్లు చేశా రు. శ్రీవారి దర్శనా నంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. 140 టన్నుల క్వార్జ్ సీజ్ సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురానికి కూత వేటు దూరంలోని పలు ప్రాంతాల్లో శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా మైనింగ్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా అనుమతి లేకుండా ఉన్న 140 టన్నుల క్వార్జ్ సీజ్ చేసి, వీఆర్వోకు అప్పగించారు. మార్గ వివాదం.. ప్రయాణికుడికి కష్టం తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి కాణిపాకం ఆలయానికి రోజుకు 24 ట్రిప్పులు తిరగాల్సిన హైర్ బస్సులు(ఆర్టీసీ అద్దె బస్సులు)మంగళవారం కేవలం 6 ట్రిప్పులు మాత్రమే తిరిగాయి. 18 ట్రిప్పులు రూట్ వివాదంతో నిలుపుదల చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కాణిపాకం గ్రామానికి బస్సులు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్లో పడిగాపులు కా యాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధుఽలు, మహిళలు ఇక్కట్లు పడ్డారు. ఆ త ర్వాత బస్సు వచ్చినా సీట్లు లేక నిలబడి ప్ర యాణించాల్సి వచ్చింది. కాణిపాకం జర్నీ భలే కష్టం గురూ అంటూ అంతా ఆవేదన వ్యక్తం చేశారు. హైర్ బస్సుల రూట్ వివాదం తిరుపతి నుంచి కాణిపాకం గ్రామానికి 14 సర్వీసులు నడుస్తున్నాయి. అందులో 8 సర్వీసులు హైర్ బస్సులు(ఆర్టీసీ అద్దెబస్సులు) ఉన్నా యి. టజట బస్టాండ్ నుంచి గరుడవారధి కింది మార్గంలోనే కపిలతీర్థం, అలిపిరి మీదుగా కాణిపాకం పోవాలని తిరుపతి డీఎం బాలాజీ స్పష్టం చేశారు. అందుకు అద్దె బస్సుల డ్రైవర్లు బస్టాండ్ నుంచి వారధిపైన అయితేనే వెళతామని, లేదంటే వెళ్లమని భీష్మించారు. ఉదయం 10.30 నుంచి పూర్తిగా అద్దె బస్సులను కాణిపాకం వెళ్లకుండా నిలుపుదల చేశారు. -
‘పాపవినాశనం’లో బోటింగ్ ట్రయల్ రన్
నవోదయ ఫలితాల్లో విశ్వం విద్యార్థుల విజయకేతనంతిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఆ మేరకు ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు విక్రమ్, గోపిక, జీవన్సాయిరెడ్డి, శరత్చంద్ర, నవదీప్ యాదవ్, జాహ్నవి, జస్వంత్, మిథున్ మిహాల్, నితీష్సాయి, సోహిని, అభ్యుదయతోపాటు మొత్తం 37 మంది నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. 35 ఏళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్ తదితర ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడం తమకు గర్వకారణమని తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథ్ అభినందించారు. -
ఘనంగా ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ ర్యాలీ
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల ప్రాంగణం పల్మనాలజీ హెచ్ఓడీ డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ర్యాలీ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్వీ వైద్య కళా శాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీహరిరావు, జిల్లా టీబీ ప్రో గ్రామ్ అధికారి డాక్టర్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏడాది కాలంగా టీబీ వ్యాధి నివారణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందికి, టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో ఎంపికై పంచాయతీలకు అతిథుల చేతుల మీదుగా అవార్డులు, బహుమతులు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిరాజు, డాక్టర్ ప్రేమనంద, డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, డాక్టర్ అజయ్, వైద్యులు భరత్, అనుపమ, ఉదయ్ పాల్గొన్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 58,358 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.45 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంవార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదిన మేషలగ్నంలో ఉదయం 9.15 గంటల నుండి 9.30 గం.ల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 03వ తేదీన ఉదయం 9.15 గం.లకు రథోత్సవం, ఏప్రిల్ 07వ తేదీన రాత్రి 07 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ ఇస్పెక్టర్ శ్రీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
రూ.5,258.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల సంరక్షణ, సది్వనియోగం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడతామన్నారు. స్వామివారి ఆస్తులపై కోర్టు కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి సద్వినియోగంలోకి తెచ్చేందుకు చూస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, భూ కేటాయింపులను అనుసరించి కార్యాచరణ వేగిరం చేస్తామని వివరించారు.సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఈవో జె.శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024–25లో 5,179.85 కోట్ల బడ్జెట్ అంచనా కాగా.. ఈసారి రూ.78.83 కోట్లు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ద్వారా రూ.1,253 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. వచ్చే ఏడాది మరో రూ.57 కోట్లు పెరిగి రూ.1,310 కోట్లు వస్తాయని పేర్కొంది.శ్రీవారి హుండీ ద్వారా రూ.1,729 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.1,671 కోట్లుగా ఉంది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పంద సేవ సిబ్బంది జీతాలకు రూ.1,773.75 కోట్లు వెచ్చిచనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.768 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.350 కోట్లుగా అంచనా వేశారు. కార్పస్, ఇతర పెట్టుబడులకు రూ.800 కోట్లు వ్యయం చేయనున్నారు. ముఖ్యాంశాలు ఇలా.. ⇒ హిందూ ధర్మప్రచారానికి రూ.121.50 కోట్లు. ⇒ తెల్లవారుజామున 5.30కు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పునకు పరిశీలన. ⇒ ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్కు భూ కేటాయింపుల రద్దు. కొత్త ఆగమ సలహామండలి ఏర్పాటుకు ఆమోదం.⇒ సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపింది.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
గ్రీవెన్స్ డేనా..అయితే మాకేంటి?
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): గ్రీవెన్స్డే రోజు కలెక్టర్తోపాటు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారిచ్చే అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. అయితే రేణిగుంటలోని అధికారులు మాత్రం గ్రీవెన్స్డేనా.. అయితే మాకేంటి?.. అన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం 11.30 గంటలైనా రేణిగుంట మండల పరిషత్ కార్యాలయాని కి అధికారులు ఎవ్వరూ హాజరు కాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చారు. సోమవారం పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసు కోవచ్చని పలువురు చర్చించుకోవడం కనిపించింది. -
వాణిజ్య పన్నుల శాఖాధికారికి అస్వస్థత!
చిల్లకూరు: గూడూరు రెండో పట్టణ పరిధిలోని వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో పనిచేసే అధికారి ఏసురత్నం అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆయన గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లి విచారించే ప్రయత్నం చేయగా ఆయన పొంతన లేని విషయాలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయానికి వచ్చిన ఆయన ఒక గంట తర్వాత అపస్మారక స్థితికి చేరినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆయనకు నిద్ర మాత్రలు మింగే అలవాటు ఉందని, అందువల్ల పడిపోయి ఉంటాడని అంటున్నారు. కానీ పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని క్రింది స్థాయి సిబ్బంది చెబుతుండడం గమనార్హం. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. కార్యదర్శులకు కౌన్సెలింగ్ చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు బదిలీలపై సోమవారం కౌన్సెల్సింగ్ నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ రవికుమార్నాయుడు, డీపీఓ సుధాకర్రావు ప్రక్రియను నిర్వహించారు. గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కు పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులు ఆప్షన్ పెట్టుకున్నారు. మొత్తం 83 మంది బదిలీలకు అర్హత సాధించగా అందులో 77 మంది వారు కోరుకున్న స్థానాలను తెలియజేశారు. సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ నివేదికను ఆమోదం కోసం కలెక్టర్కు పంపుతామన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి ఉద్యోగుల ఉద్యోగోన్నతి, బదిలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల భర్తీలను ప్రభుత్వ ఆమోదంతో ఉద్యోగోన్నతి ద్వారా చేపడతామన్నారు. -
దౌర్జన్యం చేసినవారిపై ఫిర్యాదు
● ఫిర్యాదు తీసుకోని పోలీసులు తిరుపతి రూరల్: మండలంలోని తిరుచానూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన వేలంలో దౌర్జన్యం చేసి ప్రత్యర్థుల టెండరు ఫారాలు, డీడీలు లాక్కున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుచానూరుకు చెందిన దేవేందర్ రెడ్డి, దూర్వాసులు రెడ్డి పంచాయతీ ప్రయివేటు టూరిస్టు బస్టాండు టెండరు వేసేందుకు వెళ్లగా పంచాయతీ కార్యాలయం ముందున్న కూటమి నేతలు అడ్డగించి టెండరు ఫారాలు, డీడీలు, జీఎస్టీ కాపీలను తీసుకుని వెళ్లినట్టు తెలిపారు. తమను టెండరు వేయనీయకుండా అడ్డగించి బలవంతంగా తమ వద్ద నుంచి రూ.40లక్షలకు సంబంధించిన బ్యాంకు డీడీలను లాక్కుని వెళ్లిన సాయి రాయల్, కిషోర్ రెడ్డి, శ్రీధర్నాయుడు మరో ముగ్గురు వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తమ డీడీలను ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు స్వీకరించడానికి మొగ్గు చూపని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆ డీడీలు ఎవ్వరు చింపలేదని, వాటిని తెప్పించి అందజేస్తామని చెప్పి బాధితులకు నచ్చజెప్పినట్టు సమాచారం. వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులే కీలకం తిరుపతి సిటీ: విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే కీలక పాత్ర ఉంటుందని ఎస్వీయూ వీసీ అప్పారావు పేర్కొన్నారు. ఎస్వీయూ కల్చరల్ అఫైర్స్ స్టూడెంట్ వెల్ఫేర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, సెట్విన్ డైరెక్టర్ మోహన్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పద్మావతి మహిళా కళాశాల, ఎస్వీయూ రెండు వేదికల్లో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సైకాలజిస్ట్ శ్రీనివాస్ వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్యాప్ చైర్మన్ రవినాయుడు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పద్మావతి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నారాయణమ్మ, ఎస్వీయూ ప్రిన్సిపల్స్ నరసయ్య, సుబ్బారావు, కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్ ఆచార్య మురళీధర్, ఊతని శరత్ బాబు, చంద్ర ప్రకాష్, రంజిత్ కుమార్, ఎస్వీయూ ఫార్మసీ కళాశాల, పద్మావతీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
దేహదారుఢ్యానికి ఫిజిక్ పోటీలు
తిరుపతి కల్చరల్: దేహదారుఢ్యానికి ఫిజిక్ పోటీలు ఉపయోగపడుతాయని గోల్డెన్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల బాడీ బిల్డింగ్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏడవ పురుషులు, మహిళల బాడీ బిల్డింగ్తో పాటు మోడలింగ్ పోటీలు సోమవారం యూత్ హాస్టల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మెన్ ఫిజిక్, ఉమెన్ ఫిజిక్ విభాల్ని బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో చేర్చడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలలో ఎస్.మణి, ప్రసన్నకుమార్రెడ్డి, ఆదినారాయణ, నవీన్ రోహిత్, విగ్నేష్లు విజేతలుగా నిలిచారు. అలాగే మెన్ మోడలింగ్లో ఆదిత్య, ఉమెన్ మోడలింగ్లో నికిత, గాయత్రి, భావన, సిమ్రాన్ విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈశ్వర్ ప్రకాష్, శివప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ కె.రామచంద్ర, యోధ గ్రూప్ చైర్మన్ బీఎన్ఆర్.యోగేష్, ఒలింపిక్ స్టేషన్ మిస్ యూనివర్స్ ఉమెన్ ఫిజిక్ సాయక్హజ్ రూమ్(బాంబే), కార్యదర్శి ఆర్.శ్రీధర్, సభ్యులు పాల్గొన్నారు. నిమ్మతోట ఆక్రమణకు యత్నం కలువాయి(సైదాపురం): నిమ్మ తోట ఆక్రమణకు యత్నించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన ఘటన కలువాయి మండలం, చీపినాపి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు పసల కృష్ణయ్య, గ్రామస్తుల కథనం.. గ్రామ పరిధిలోని సర్వే నం.379లో 8.16 ఎకరాల భూమిలో కృష్ణయ్యకు 1.16 ఎకరాల వరకు ఉంది. ఇందులో గత 14 ఏళ్లుగా నిమ్మ చెట్లు సాగుచేసుకుంటున్నాడు. కూటమి నేతలు కొందరు నిమ్మచెట్లను ధ్వంసం చేసి పొలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. దీనిపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. పొలం వైపు వెళ్తే క్రిమినల్ కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరిస్తున్నట్టు వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. నిరసన తెలుపుతున్న బల్లవోలు గ్రామస్తులు -
ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి
కోట: గూడూరు వైపు వెళ్తున్న ఆటో నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చిట్టేడు వద్ద ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. దుగ్గరాజపట్నంకు చెందిన ఎంబేటి వెంకటయ్య(55) అనారోగ్యంతో ఆటోలో గూడూరు హాస్పిటల్కు వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు చిట్టేడు వద్ద ఆటో నుంచి జారి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుండె పోటుకు గురై ఆటో నుంచి కింద పడి ఉంటాడని 108 సిబ్బంది అనుమానిస్తున్నారు. కళకళలాడిన వెటర్నరీ కళాశాల తిరుపతి సిటీ:వెటర్నరీ జూడాలు ఎట్టకేలకు సమ్మె ను విరమించారు. సోమవారం నుంచి ఎస్వీ వెట ర్నరీ కళాశాల తరగతి గదులు 52 రోజుల తర్వాత తాళాలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులతో తరగతి గదులు కళకళలాడాయి. సీ.గొల్లపల్లి సచివాలయంలో చోరీ తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లి గ్రామ సచివాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఉదయం కార్యాలయానికి చేరుకోగానే అప్పటికే తలుపులు తెరిచి ఉండడంతో లోనికి వెళ్లి పరిశీలించారు. సచివాలయంలోని ఓ ప్రింటర్ను అపహరించుకువెళ్లినట్టు గుర్తించారు. దీనిపై తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి కనుపూరు జాతర
చిల్లకూరు : మండలంలోని తీర ప్రాంత గ్రామామైన తూర్పుకనుపూరు ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి నుంచి అట్టహాసంగా జాతర నిర్వహించనున్నారు. ఉగాది పండుగకు ముందుగా వచ్చే మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు మూడు రాష్ట్రాల నుంచి భక్తులు సుమారు ఐదు లక్షల మంది వరకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పేరుకు ముత్యాలమ్మ జాతర అయినప్పటికీ ఇక్కడ ముత్యాలమ్మ సోదరిగా భావించే పోలేరమ్మకు కూడా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఘటోత్సవంతో జాతర ఆరంభం జాతరలో భాగంగా తొలిరోజు ఆదివారం అర్చకులు చాకిరి రమణయ్య ఇంటి నుంచి ఘటోత్సవాన్ని ఆరంభించారు. అక్కడ పనిబాపల వారు ఘటం కుండను నెత్తిన పెట్టుకుని పంచాయతీలోని కొమవారిపాళెం, పోసిన వారిపాళెం, ఈదుల వారిపాళెం గ్రామాలలో ఎంపిక చేసిన వారి ఇళ్లకు వెళ్లి సద్ది పోసుకునే తంతు ముగించుకుని తిరిగి కనుపూరుకు వేంచేశారు. ఆ తరువాత చాకలి ఇంటి వద్ద ఘటం కుండలు దించి పోలేరమ్మ ప్రతిమను కుమ్మరి ఇంట్లో తయారు చేయించే ప్రక్రియను మొదలు పెడతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత పొలి కార్యక్రమం ఉంటుంది. అమ్మ వారి ప్రతిమ గంగ మిట్టమీద కొలువుదీరే సరికే మంగళవారం అర్ధరాత్రి అవుతుంది. అప్పటి నుంచి జాతర ఆరంభమైనట్లు గణాచారి ప్రకటిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నవీన్కుమార్ తెలిపారు. ఈ ఏర్పాట్లను గూడూరు సబ్కలెక్టర్ రాఘవేంద్ర మీన, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్, సేవా కమిటీ సభ్యులు చిల్లకూరు దశరథరామిరెడ్డి, మారాని సుబ్రహ్మణ్యం, సారంగం రమేష్ పర్యవేక్షిస్తారని తెలిపారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో ముత్యాలమ్మ ఆలయం (ఇన్సెట్) ప్రత్యేక అలంకరణలో ముత్యాలమ్మ పటిష్ట బందో బస్తు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 500 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు డీఎస్సీ గీతాకుమారి తెలిపారు. రూరల్సీఐ కిశోర్బాబు, చిల్లకూరు ఎస్ఐ సురేష్బాబులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేసేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతి రోజూ యారా గురనాథస్వామి గ్రామోత్సవంతో పాటుగా గొల్లల వేడుకలు ఉండనున్నాయి. -
నేటి నుంచి పరీక్షలు
తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్–ఐఐ పోస్ట్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్లకు సంబంధంచిన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్షలు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో రెండు సెంటర్లలో 2,080 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పద్మలలిత, శివప్రసాద్ పాల్గొన్నారు. విభిన్న ఆలోచనే ఆవిష్కరణకు నాంది ఏర్పేడు(రేణిగుంట) : విభిన్న ఆలోచనే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని తిరుపతి ఐజర్ డైరెక్టర్ సంతాను భట్టాచార్య తెలిపారు. సోమవారం ఏర్పేడు మండలం జంగాలపల్లె సమీపంలోని ఐజర్లో ఐదు రోజులపాటు జరగనున్న ఫ్యాకల్టీ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను ఆయ న ప్రారంభించారు. డైరెక్టర్ మాట్లాడుతూ దేశ జనాభా ప్రయోజనాలను ఆవిష్కరణలుగా మా ర్చాలని సూచించారు. ప్రొఫెసర్ విజయమోహనన్ కె.పిళ్లై, ఎస్ఎస్ఐఐఈ సీఈఓ డాక్టర్ జె.సూర్య కుమార్, జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విశ్వనాథం దుప్పట్ల పాల్గొన్నారు. -
సాగరమాల రోడ్డు పనుల అడ్డగింత
నాయుడుపేట టౌన్ : పొలాల్లోకి వెళ్లేందుకు వీలు గా సాగరమాల జాతీయ రహదారిలో అండర్ పాస్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు వేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. వారు సోమవారం చిలమత్తూరు సమీపంలో సాగరమాల రోడ్డు పనులను అడ్డుకుని ధర్నా చేశారు. రైతు సంఘం నాయకులు వాకాటి సుధాకర్ రెడ్డి, సన్నారెడ్డి హరినాథ్రెడ్డి, జలదంకి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు. భూసేకరణ సమయంలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీ సు రోడ్లు వేస్తామని కలెక్టర్, సూళ్లూరుపేట ఆర్డీవో, తహసీల్దార్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు పొలాల మధ్య సుమారు 13 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. రెండు వైపులా పొలాలున్న రైతులు పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొందని వివరించారు. నాయుడుపేట మండలంలోనే సుమారు 4 వేల ఎకరాల భూముల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతోపాటు సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులకు రిజిస్టర్ పోస్టులో వినతి పత్రాలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జలదంకి ధనుంజయ రెడ్డి, కాపులూరు చంద్రమోహన్, చమతా రాజేష్, చిలమత్తూరు రత్నయ్య, ఎం వెంకయ్య, వెంకట రమణయ్య, శ్యామ్కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు : తమ గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా సాగరమాల రోడ్డు నుంచి సర్వీసు రోడ్లు వేయాలని పారిచర్లవారిపాళెం, తిప్పగుంటపాళెం, చేడిమాల, ఉడతావారిపార్లపల్లి, అంకులపాటూరు, బల్లవో లు, కాకువారిపాళెం ప్రజలు డిమాండ్ చేశారు. వా రు సోమవారం తమ గ్రామాల వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మండలంలో వరగలి క్రాస్ రోడ్డు నుంచి తూర్పుకనుపూరు వరకు సాగరమాల రోడ్డు వేస్తున్నట్టు తెలిపారు. పలు గ్రామాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు వేయడం లేదన్నారు. మూడు కిలోమీటర్లు తిరిగి తమ గ్రామాలకు చేరు కోవాల్సి వస్తోందని వాపోయారు. సమస్యను కాంట్రాక్టు సంస్థకు తెలిపితే తమకు సబంధం లేదని తెగేసి చెప్పారని విమర్శించారు. ఈ విషయాన్ని తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లామని తె లిపారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం చొరవ తీ సుకుని సర్వీసు రోడ్లు వేయాలని కోరారు. ఈ వి షయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రి గడ్కరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోన్లో తెలిపారు. -
చైన్నెకి కండలేరు జలాలు
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం నుంచి సోమవారం చైన్నెకి నీటిని విడుదల చేసినట్టు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీచ్ ఆన్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీటి అవసరాల నిమిత్తం 830 క్యూసెక్కులు అందిస్తామన్నారు. అలాగే చైన్నె నగర వాసులకు సోమవారం మొదటగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 49.623 టీఎంసీల నీరు ఉందన్నారు. డీఈ విజయరామిరెడ్డి, ఏఈ తిరుమలయ్య, అనిల్కుమార్ పాల్గొన్నారు. పని ఒత్తిడి తగ్గించండి తిరుపతి అర్బన్: పని ఒత్తిడి తగ్గించాలంటూ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సోమవారం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి రామ్మోహన్కు వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవికి కూడా విన్నవించారు. ఉపాధి పనుల్లో.. సౌకర్యాలు కల్పించండి తిరుపతి అర్బన్: ఉపాధి హామీ పనుల్లో కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవా రం ఆయన మాట్లాడుతూ ఉప్ణోగ్రతలు ఎక్కువ గా ఉన్న నేపథ్యంలో ఉదయమే పనులు ప్రారంభించి 11 గంటలకల్లా పూర్తి చేయాలని సూచించారు. నీడ కోసం, తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడం లాంటివి చేయాలని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం 12 గంటలపైన ఇంటికే పరిమితం కావడం ఉత్తమమన్నారు. -
కార్మికులు జాగ్రత్తలు పాటించాలి
చిత్తూరు కార్పొరేషన్: ఎండ తీవ్రతకు గురి కాకుండా కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల ఉపకార్మిక కమిషనర్ ఓంకార్రావు కోరారు. కార్మికుల రక్షణ కోసం పారిశ్రామిక యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తలపై టోపీ పెట్టుకోవడం, తెలుపు రంగు గల పలుచటి కాటన్ వస్త్రం ధరించడం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవడం, మంచి నీళ్లు ఎక్కువ సార్లు తాగడంపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కార్మికులను బ్యాంకు, ఇతర పనుల మీద బయటకు పంపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పని ప్రదేశంలో నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. స్థానిక గ్రామ వార్డు సచివాలయం వైద్య సిబ్బందిని సమన్వ యం చేసుకుని ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలన్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,198 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.98 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులుఉగాది సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయంలోని క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలోని భక్తులకు ఆలయ సిబ్బంది అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. శ్రీశైలం వీధులు... భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్ణాటక నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దోర్నాల, తెలంగాణ నుంచి వందల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రావడంతో... ట్రాఫిక్ పెరిగింది. -
లారీని ఢీకొన్న బస్సు
– 15 మంది గాయాలు వెంకటగిరి రూరల్ : రేణిగుంట సెజ్లోని కార్బన్ లియోలింక్ కంపెనీకి చెందిన బస్సు వెంకటగిరి పరిసర ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులతో వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆదివారం వేకువజామున శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నట్లు . శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు వెల్లడించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మునేంద్రతోపాటు, రాపూరుకి చెందిన యశోద, వెంకటగిరికి చెందిన కుషల్, గొట్లగుంటకు చెందిన ప్రసాద్, లింగసముద్రానికి చెందిన శివాజీతోపాటు మొత్తం 15 మంది గాయపడ్డారు. రాయచోటికి చెందిన లారీ క్లీనర్ రాజు సైతం తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రులను 108 వాహనంలో వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మెరుగైన చిక్సి కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ వివరించారు. -
చంద్రగిరి ‘కూటమి’లో విభేదాలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో విభేదాలు మొదలయ్యాయి. ఆదివారం చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నేతల నడము పొరపొచ్చాలు బహిర్గతమయ్యాయి. చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కూటమి ప్రజాప్రతినిధులు, నేతలను ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణంలో కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 8 గంటలకు అని చెప్పినా..! పార్టీ కార్యాలయాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నట్లు జనసేన నేతలు తొలుత ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా టీడీపీ, బీజేపీ నాయకులు కనిపించకపోవడంతో జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్తో కలిసి కొత్తపేటలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యాలయం ప్రారంభించారు. ఇంటికెళ్లి పిలిచినా..! జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లి జనసేన నేతలు ఆహ్వానించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ముఖం చాటేయడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. -
నేడు సూళ్లూరుపేటకు చేరుకోనున్న సైక్లోథాన్ యాత్ర
సూళ్లూరుపేట : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) చేపట్టిన సైక్లోథాన్ యాత్ర సోమవారం ఉదయం సూళ్లూరుపేటకు చేరుకోనుంది. అక్కడి నుంచి 9 గంటలకు తడ మండలం అండగుండాల, కారిపాకం వెళ్లే రోడ్డులో ఉన్న జైన్ మందిరం వద్దకు చేరుకుంటుంది. శ్రీజాతీయ తీర ప్రాంతాల భద్రత, సమాజ నిబద్ధతశ్రీ అనే అంశంపై జనానికి అవగాహన కల్పించేందుకు సుమారు వంద మంది సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది 9 రాష్ట్రాల మీదుగా 6,553 కి.మీ సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రను ఈనెల 7న కోలకత్తాలో కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్షా ప్రారంభించారు. ఈ యాత్ర ఏప్రిల్ 1 నాటికి కన్యాకుమారిలో ముగియనుంది. సోమవారం సూళ్లూరుపేట ఈ యాత్రకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని సీఐఎస్ఎఫ్ ఽభద్రతా సిబ్బంది స్వాగతం పలకనున్నారు. కార్యక్రమానికి షార్ డైరెక్టర్, కంట్రోలర్, సీఐఎస్ఎఫ్ ఐజీ సౌత్ సెక్టార్, డీఐజీ, స్థానిక పోలీస్ అధికారులు, ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు హాజరుకానున్నారు. నాయుడుపేటకు చేరుకున్న సైక్లోథాన్ ర్యాలీనాయుడుపేట టౌన్: కోల్కత్తా నుంచి ప్రారంభమైన సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ ఆదివారం సాయంత్రం నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ గ్రామ సమీపంలోని శ్రీనివాసపురం వద్దకు చేరింది. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుతో పాటు సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి, పాఠశాల విద్యార్థులు, మహిళలు సీఐఎస్ఎఫ్ జవాన్లపై ఘన స్వాగతం పలికారు. -
లారీని ఢీకొన్న బస్సు
– 15 మంది గాయాలు వెంకటగిరి రూరల్ : రేణిగుంట సెజ్లోని కార్బన్ లియోలింక్ కంపెనీకి చెందిన బస్సు వెంకటగిరి పరిసర ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులతో వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆదివారం వేకువజామున శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నట్లు . శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు వెల్లడించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మునేంద్రతోపాటు, రాపూరుకి చెందిన యశోద, వెంకటగిరికి చెందిన కుషల్, గొట్లగుంటకు చెందిన ప్రసాద్, లింగసముద్రానికి చెందిన శివాజీతోపాటు మొత్తం 15 మంది గాయపడ్డారు. రాయచోటికి చెందిన లారీ క్లీనర్ రాజు సైతం తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రులను 108 వాహనంలో వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మెరుగైన చిక్సి కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ వివరించారు. -
వైఎస్సార్సీపీ పాలనలోనే వెంకటగిరి
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి మున్సిపాల్టీలో వైఎస్సార్సీపీ పాలనే ఉంటుందని, పురపాలక సంఘం చైర్మన్గా నక్కా భానుప్రియ కొనసాగుతారని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత మున్సిపల్ ఎన్నికల్లో జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థులు వైఎస్సార్సీపీ బీఫామ్తో మొత్తం 25వార్డుల్లోనూ విజయబావుటా ఎగురవేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు మాయమాటలు చెప్పి కొందరు కౌన్సిలర్లును లోబర్చుకునేందుకు యత్నించినట్లు ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరని, అయినప్పటికీ అసత్య ప్రచారంతో 16 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో సంతాకాలు చేయించుకుని అవిశ్వాస తీర్మానానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9వ తేదీన వెంకటగిరి మున్సిపాల్టీలో అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. దీనిపై 18 మంది కౌన్సిలర్లతో ప్రత్యేకంగా మాట్లాడామని, వారిలో ఏ ఒక్కరూ పార్టీని వీడేందుకు సుముఖంగా లేరని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు దుర్మార్గపు ఆలోచనలతో తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంలో నక్కా భానుప్రియ అఖండ విజయం సాధించి మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతారని వెల్లడించారు. -
బైక్ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి
రామచంద్రాపురం (తిరుపతి రూరల్): రామచంద్రాపురం మండలంలోని చిట్టతూరు సమీపంలో శనివారం రాత్రి బైక్ బోల్తాపడి ఉపాధ్యాయుడు శివకేశవులు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. శివకేశవులు కమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన శనివారం రాత్రి బైక్లో పచ్చికాపలం నుంచి స్వగ్రామమైన చిట్టతూరు గ్రామానికి బయలుదేరారు. చిట్టత్తూరు సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. శివకేశవులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హిందీ టీచర్ మృతి విషయం తెలుసుకున్న కమ్మపల్లి జెడ్పీ హైస్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో చిట్టత్తూరు చేరుకున్నారు. ఆయన భౌతిక దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొందా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చిట్టి చేతుల..‘స్వచ్ఛాంధ్ర’నారాయణవనం:‘‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రతో గ్రామాలు, మురుగుకాల్వలు శుభ్రంగా ఉండాలి.. ముందస్తు సమాచారం లేకుండా నేనే స్వయంగా గ్రామానికి వస్తాను.. పరిశుభ్రత లేకుంటే చర్యలు తప్పదు..’’ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలను అధికార యంత్రాంగం పట్టించుకోవడమూ లేదు. సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా స్పందించిన పాపానపోవడం లేదు. చివరకు విసిగి వేసారిన బాలలే నడుం బిగించి కదిలారు. పలకా బలపం, పుస్తకాలకు బదులు పారలు చేత బట్టారు. మురుగు కాలువలో దిగి, దుర్గంధం నడుమ వ్యర్థాలను తొలగించారు. ఆ పనుల మూలాన ఆ చిట్టి చేతులు, ఒంటికి, దుస్తులకు అంటిన కాలువ మురుగు కంపుతోనే ఇళ్లకు వెళ్లి స్నానం చేశారు. వివరాలు.. మండలంలోని గోవిందప్పనాయుడు కండ్రిగ దళితవాడ పాఠశాల సమీపంలో మురుగు కాలువ పారకుండా వ్యర్థాలతో నిండిపోయింది. అధికారులకు ఈ సమస్యపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో చివరకు బడి పిల్లలే ముందుకు కదిలారు. ఆదివారం ఆ ప్రాంతాలను శుభ్రం చేసి అధికారుల అలసత్వానికి చెంపపెట్టులా చేతల్లో చూపారు. ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకుని పంచాయతీ కార్యదర్శి విధులకు డుమ్మా కొడుతూ దురుసుగా పెత్తనం చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు మురుగు శుభ్రం చేయడంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి! విహారయాత్రలో విషాదం ● చెట్టును ఢీకొన్న కారు ● ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు తడ : చైన్నె– నెల్లూరు జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ కొండపనాయుడు కథనం మేరకు.. చైన్నె ఇంజినీరింగ్ కళాశాలలో బీసీఏ మూడో సంవత్సరం విద్యార్థులు ఆదివారం వరదయ్యపాళెం సమీపంలోని ఉబ్బల మడుగు విహారయాత్రకు బయలుదేరారు. ఇందుకోసం ఓ కారుని అద్దెకు తీసుకుని డ్రైవర్తోపాటు 8 మంది తాంబరం నుంచి బయలు దేరారు. పెరియవట్టు గ్రామం వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు దిగేసి చెట్టును ఢీకొంది. ప్రమాద సమయంలో కారు ముందు సీటులో ఉన్న సంబ్రిన్ ఫాతిమా(21) ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలు కావడంతో తమిళనాడుకు చెందిన 108 అంబులెన్స్లో తొలుత ఎళాఊరు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చైన్నె స్టాన్లీ ఆస్పత్రికి తీసుకెళుతుండగా దిన(34) అనే మరో వ్యక్తి మృతి చెందాడు. కారు నడుపుతున్న మహమ్మద్ ఆవాజ్(26)తోపాటు యోగేశ్వరన్(20), బెంజమిన్(26), అలియా బేగమ్(23), శ్రీమాన్(20), మాదేష్(21) గాయపడ్డారు. ఫాతిమా మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దిన మృతదేహాన్ని స్టాన్లీ ఆస్పత్రిలోనే ఉంచారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
చంద్రగిరి ‘కూటమి’లో విభేదాలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో విభేదాలు మొదలయ్యాయి. ఆదివారం చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నేతల నడము పొరపొచ్చాలు బహిర్గతమయ్యాయి. చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కూటమి ప్రజాప్రతినిధులు, నేతలను ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణంలో కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 8 గంటలకు అని చెప్పినా..! పార్టీ కార్యాలయాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నట్లు జనసేన నేతలు తొలుత ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా టీడీపీ, బీజేపీ నాయకులు కనిపించకపోవడంతో జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్తో కలిసి కొత్తపేటలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యాలయం ప్రారంభించారు. ఇంటికెళ్లి పిలిచినా..! జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లి జనసేన నేతలు ఆహ్వానించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ముఖం చాటేయడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. -
‘స్కావెంజర్స్’ జోలికి వస్తే యుద్ధమే!
● వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి తిరుపతి మంగళం : తిరుపతి నగర ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నివసిస్తున్న స్కావెంజర్స్ కాలనీ జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యమం కాదని, యుద్ధమే చేస్తామని స్పష్టం చేశారు. నగర నడిబొడ్డులోని 4.61ఎకరాల విస్తీర్ణంలో స్కావెంజర్స్ కోసం కాలనీ ఏర్పాటు చేశారన్నారు. సుమారు 70 ఏళ్లుగా ఈ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు నివసిస్తున్నారని వెల్లడించారు. వీరికి అక్కడే శాశ్వతంగా ఇల్లు నిర్మించాలని గతంలో అనేక ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. అయితే 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి నారాయణ కుట్రపూరితంగా స్కావెంజర్స్కాలనీని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు చర్యలు చేపట్టారని ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే భూమన కరుణాకరరెడ్డితో పాటు వామపక్ష నాయకులు ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం 4.61ఎకరాల స్కావెంజర్స్కాలనీ విలువ సుమారు రూ. 120కోట్లకు చేరిందని తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం దురాలోచనతో పారిశుద్ధ్య కార్మికులను తరిమేసి, స్కావెంజర్స్కాలనీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అందులో భాగంగానే ఆ ప్రాంతంలో సర్వేలు చేపడుతోందన్నారు. తిరుపతిలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ సహకారంతో 1,700 మంది కార్మికులను ఆదనంగా తీసుకోవాలని నిర్ణయించామని, అప్పట్లో బీజేపీనేత భాను ప్రకాష్రెడ్డి కోర్టుకెళ్లి అడ్డుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం జరుగుతుంటే భానుప్రకాష్రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్లలేదని ప్రశ్నించారు. స్కావెంజర్స్ కాలనీ నుంచి కార్మికులను తరిమేయాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. -
అనధికార హాకర్ల తరలింపు
తిరుమల : తిరుమలలోని అనధికార హాకర్లను తిరుపతికి పోలీసులు, విజిలెన్స్ అధికారులు తరలిస్తున్నారు. సాక్షి పత్రికలో ఈ నెల 21వ తేదీన శ్రీఇల వైకుంఠపురం.. ఇదేం అపచారంశ్రీ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎస్పీ హర్షవర్ధన్రాజు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి తిరుమలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 71 మంది అనధికార హాకర్లు, కూలీలు, ఇతర అనుమానితులను గుర్తించి తిరుపతికి పంపేశారు. ప్రతి ఒక్కరి గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరిలో ఎవరైనా పాత నేరస్తులు ఉన్నారా అని తనిఖీ చేశారు. ఆదివారం ఈ మేరకు తిరుమలలోని పాచికాల్వ గంగమ్మ ఆలయం వద్ద తాత్కాలిక షెడ్లను తొలగించారు. ఎమ్మెల్యేకు స్వాగతం.. విద్యార్థుల వాయిద్యం చిల్లకూరు: మండలంలోని బల్లవోలులో కూటమి నేతలు ఏర్పాటు చేసిన చలివేంద్రం పార్రంభించేందుకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆదివారం గ్రామానికి విచ్చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు స్థానిక పాఠశాల విద్యార్థులను నియమించారు. పిల్లలతో బ్యాండు వాయించేలా కూటమి నేతలు చర్యలు చేపట్టడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. రెండు లారీలు ఢీ రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట రమణ విలాస్ సర్కిల్లో ఆదివారం రెండు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. చైన్నె వైపు నుంచి కడప దిశగా వెళుతున్న హెవీ లారీలు ఒకదానికొకటి ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేణిగుంట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. ఎర్రావారిపాళెం ఎస్ఐ బదిలీ సాక్షి టాస్క్పోర్స్ : చంద్రగిరి నియోజక వర్గం ఎర్రావారిపాళెం ఎస్ఐ ఎర్రిస్వామి బదిలీపై కర్నూలుకు వెళ్లారు. కూటమి నేతల ఒత్తిడిని భరించలేకే ఆయన బదిలీ చేయించుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటుండడం గమనార్హం. -
దృఢ సంకల్పమే విజయానికి ఆయుధం
తిరుపతి సిటీ : దృఢ సంకల్పం ఉంటే జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవచ్చని, దృఢ సంకల్పమే ఆయుధంగా ముందుకు సాగాలని ఎస్వీయూ పూర్వ విద్యార్థి, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి తెలిపారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సిగ్మండ్–2025 ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఎస్వీయూలో ఈసీఈ విభాగంలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశానని తెలిపారు. సివిల్స్ లక్ష్యంగా శ్రమించానని, పలు ప్రయత్నాల్లో విఫలమైనా ఆత్మ విశ్వాసాన్ని వదలలేదన్నారు. తర్వాత తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ విద్యార్థి దశ కీలకమన్నారు. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో నిపుణులైన అధ్యాపకులకు కొదవలేదన్నారు. వారి సూచనల మేరకు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ అధికారి మాటలతో స్ఫూర్తి పొందిన విద్యార్థులు తమ కళాశాలలో చదివి ఐఏఎస్గా ఎంపికై న రాహుల్ కుమార్రెడ్డి మాటలతో ఈసీఈ విభాగం విద్యార్థులు స్ఫూర్తి పొందారు. ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేశారు. విఫలం చెందామని నిరుత్సాహ పడకుండా ముందుకు సాగితే లక్ష్యం కాళ్ల వద్దకు చేరుతుందన్నారు. సివిల్స్ కష్టసాధ్యమైన పరీక్ష అంటూ సమాజంలో ఎంతో మంది వెనుకడుగు వేస్తారని, అది సత్యదూరమన్నారు. ఎస్వీయూ విద్యార్థి ఐఏఎస్ సాధించడం గర్వకారణం వీసీ అప్పారావు మాట్లాడుతూ ఎస్వీయూ ఈసీఈ విభాగం పూర్వ విద్యార్థి రాహుల్ కుమార్రెడ్డి ఐఏఎస్ సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో శ్రమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుబ్బారావు, ఈసీఈ విభా గం హెడ్ స్వర్ణలత, కన్వీనర్ ప్రొఫెసర్ వరదరాజన్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ రామ్ హర్షన్, వర్షిత, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీయూ పూర్వ విద్యార్థి, ఈస్ట్ గోదావరి జేసీ రాహుల్ కుమార్రెడ్డి ఎస్వీయూలో ఘనంగా సిగ్మాండ్–2025 ఫెస్ట్ -
నేడు సూళ్లూరుపేటకు చేరుకోనున్న సైక్లోథాన్ యాత్ర
సూళ్లూరుపేట : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) చేపట్టిన సైక్లోథాన్ యాత్ర సోమవారం ఉదయం సూళ్లూరుపేటకు చేరుకోనుంది. అక్కడి నుంచి 9 గంటలకు తడ మండలం అండగుండాల, కారిపాకం వెళ్లే రోడ్డులో ఉన్న జైన్ మందిరం వద్దకు చేరుకుంటుంది. శ్రీజాతీయ తీర ప్రాంతాల భద్రత, సమాజ నిబద్ధతశ్రీ అనే అంశంపై జనానికి అవగాహన కల్పించేందుకు సుమారు వంద మంది సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది 9 రాష్ట్రాల మీదుగా 6,553 కి.మీ సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రను ఈనెల 7న కోలకత్తాలో కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్షా ప్రారంభించారు. ఈ యాత్ర ఏప్రిల్ 1 నాటికి కన్యాకుమారిలో ముగియనుంది. సోమవారం సూళ్లూరుపేట ఈ యాత్రకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని సీఐఎస్ఎఫ్ ఽభద్రతా సిబ్బంది స్వాగతం పలకనున్నారు. కార్యక్రమానికి షార్ డైరెక్టర్, కంట్రోలర్, సీఐఎస్ఎఫ్ ఐజీ సౌత్ సెక్టార్, డీఐజీ, స్థానిక పోలీస్ అధికారులు, ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు హాజరుకానున్నారు. నాయుడుపేటకు చేరుకున్న సైక్లోథాన్ ర్యాలీనాయుడుపేట టౌన్: కోల్కత్తా నుంచి ప్రారంభమైన సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ ఆదివారం సాయంత్రం నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ గ్రామ సమీపంలోని శ్రీనివాసపురం వద్దకు చేరింది. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుతో పాటు సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి, పాఠశాల విద్యార్థులు, మహిళలు సీఐఎస్ఎఫ్ జవాన్లపై ఘన స్వాగతం పలికారు. -
స్వచ్ఛమైన గాలి.. పరిశుభ్రమైన నీరు.. పచ్చటి అడవి.. శ్రవణానందంగా పక్షుల కిలకిలరావాల.. ఎత్తైన కొండలు.. సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం.. నిరంతరం ప్రవహించే సెలయేరుతో పర్యాటక స్వర్గధామంగా ఉబ్బల మడుగు విలసిల్లుతోంది. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. సందర్
దిగువ శీతాలంలో జలపాతంతంతి పందిల్ వద్ద ఫారెస్ట్ చెక్పోస్ట్ వరదయ్యపాళెం: కాంబాకం రిజర్వు ఫారెస్టులో ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. వరదయ్యపాళానికి 10 కిలో మీటర్లు దూరంలో ఒకరోజు విహారయాత్రకు ఇది చక్కటి ప్రదేశం. చూడాల్సిన ప్రాంతాలు వరదయ్యపాళెం నుంచి 7కి.మీ ప్రయాణిస్తే అవంతి ఫ్యాక్టరీ వస్తుంది. దీన్ని దాటితే రిజర్వు ఫారెస్టు మొదలవుతుంది. అడవి మొదట్లో తెలుగుగంగ కాలువ, టోల్ గేట్ ఉంది. ఈ ప్రాంతం నుంచి సూమారు 12 కి.మీలలో సెలయేరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పక్కనే వరసగా తంతి పందిరి, దొరమడుగు, సీతలమడుగు, తంగశాల, పెద్దక్కమడుగు, ఉబ్బలమడుగు, సిద్ధేశ్వరగుడి, సద్ధికూటిమడుగు, అంజూరుగంగ, దోగుడుబండ జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సీతాళం అని పిలుస్తారు. సిద్ధేశ్వరగుడి నుంచి 3కిలోమీటర్లు కొండపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో పర్యాటకులు ఉబ్బలమడుగుకే పరిమితవువుతుంటారు. ఈ ప్రాంతాలను సందర్శించడానికి అటవీశాఖ నామవూత్రపు రుసుముతో సహాయకులను ఏర్పాటు చేసింది. తంతిపందిరి (తన్నీర్ పందల్) : బ్రిటిష్ హయాంలో చేపల పెంపకం కోసం ఎంపిక చేసిన ప్రాంతమే ఈ తన్నీర్ పందిల్, ఇప్పుడు తంతిపందిరిగా మారింది. వరదయ్యపాళెం నుంచి ఇక్కడ వరకు వెళ్లేందదుకు తారు రోడ్డు ఉంది. ఉబ్బలమడుగు వరకు వెళ్లలేనివారు ఇక్కడి మడుగులోనే సేద తీరుతుంటారు. ఎన్నో మడుగులు : తంతి పందిరి నుంచి 3కిలో మీటర్లు దూరంలో ఉబ్బలమడుగు ఉంది. వాహనల్లో వెళ్లుందుకు గ్రావెల్ మార్గం నిర్మించారు. ఇక్కడే దొరమడుగు, మామిడి చెట్ల మడుగు, తంగశాల మడుగు, వుూలమడుగు, చద్దికూటి మడుగులున్నాయి. శివరాత్రి పర్వదినం రోజున ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. మిగిలిన రోజుల్లో ఆటోలు నడుస్తుంటాయి. ఎగువ శీతాలం : సువూరు 300అడుగుల నుంచి పడుతున్న జలపాతం. పక్కనే లోతైన నీటి వుడుగు. గొడుగులా ఇరువైపులా వ్యాప్తించి వుండే కొండవంపు. ఇది చాలా అందమైన ప్రాంతం. తెలుగు చిత్రసీవుకు వుద్రాసు కేంద్రంగా వున్నప్పుడు ఎక్కువగా ఉబ్బలవుడుగులో షూటింగులు జరిగేవి. సిద్ధులకోన : పూర్వం మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసేవారు. అందుకే దీనికి సిద్ధులకోన అనే పేరు వచ్చింది. ఇక్కడకు వెళ్లాలంటే ట్రాక్టరు వంటి వాహనాలు లేదా, కాలినడకన 2కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు పక్కనే ఉన్న సిద్ధుల మడుగులో స్నానాలు ఆచరించి సిద్ధేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దిగువశీతాలం : లోతైన మడుగులు, నిలువెత్తు జలపాతాలకు నెలవు ఈ దిగువశీతాలం. రెండు కొండ చరియల నడుమ ఉండే ఈ ప్రాంతాల్లో ఎటుచూసినా తేనెతుట్టెలు కనిపిస్తుంటాయి. సిద్ధులకోన నుంచి కొండబండల నడుమ 2కి.మీ దూరం కాలినడకన దిగువశీతాలం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న నీటి మడుగులు రెండు తాటిచెట్లకు పైగా లోతున్నా నీరు స్వచ్ఛంగా ఉండడంతో లోపలి రాళ్లు సైతం కనిపిస్తూ పర్యాటకులను తికమకకు గురిచేస్తాయి. మడుగులోకి దిగితే ఎంత వేసవిలోనైనా నీరు చల్లగా ఉంటూ వణికిస్తాయి.. సందర్శకులను ఆకర్షిస్తున్న ఉబ్బల మడుగు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి ఆహ్లాదం.. విజ్ఞానం పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు విజ్ఞానం అందించే దిశగా అటవీశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉబ్బల మడుగును ఎకో టూరిజంగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే చెట్లు, వాటి శాసీ్త్రయ నామాలు తదితర విశేషాలతో దారి పొడవునా సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. రాజులు వాడిన ఫిరంగి, టన్ను బరువుండే తిరగలి, పూసలదిబ్బ, ఎలిజబెత్ రాణి బంగ్లా, పాలేగాళ్లు, వారి తోటలు ఇలాంటి విశేషాలన్నీ పర్యాటకులు తెలుసుకోవాల్సినవే. మరిన్ని వసతులు ఉబ్బలమడుగు వచ్చే సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా జలపాతాల వద్ద బోటింగ్ పార్క్లు, మరో వ్యూ పాయింట్, విశ్రాంత గదులు నిర్మాణానికి ఏపీ టూరిజంతో కలసి ప్రతిపాదనలు పంపించాం. – త్రినాథ్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ, సత్యవేడు -
కార్యదర్శుల
సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సర్వేలతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. విధుల భారం తగ్గించండి సార్ అంటూ కనిపించిన అధికారులందరికీ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో అప్పగించిన సర్వేలతో సతమతమవుతున్నారు. సెలవు రోజుల్లో సైతం సేదతీరే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. ● 39 రకాల పనుల భారం ● సర్వేలతో సతమతం ● ఒత్తిడికి చిత్తవుతున్న ఉద్యోగులు సర్వేలకు సిద్ధం అవుతున్న పంచాయతీ కార్యదర్శులు (ఫైల్) తీవ్రంగా ఒత్తిడి పంచాయతీ కార్యదర్శులకు తీవ్రంగా పని ఒత్తిడి ఉంది. దీంతో పలువురు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి గుండెపోటుతో మృతి చెందారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు సీరియస్గా తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయక తప్పదని భావిస్తున్నాం. – వెంకట్రావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, సచివాలయ ఉద్యోగుల సంఘం మనుషులం కాదా..? పంచాయితీ కార్యదర్శులు మనుషులు కాదా...? యంత్రం వలే పనిచేయాలని బాధ్యతలు కట్టబెట్టేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 40కి పైగా పను లు చేపట్టాల్సి ఉంది. ఇది ఎలా సాధ్యం అవుతుంది. ముందే ఉద్యోగుల కొరత ఉంది. దీంతో మరింత భారంగా మారుతోంది. మా పరిస్థితులను ఉన్నతాధికారులకు చెిబితే స్టేట్ పాలసీ అంటున్నారు. మా కష్టాలను గుర్తించి పని భారం తగ్గించాలని కోరుతున్నాం. – హరిబాబు, పంచాయతీ సెక్రటరీ తిరుపతి అర్బన్ : సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు కాస్తా.. సర్వే ఉద్యోగులుగా మారిపోయారు. గతంలో సచివాలయంలో ఉంటూ 200లకు పైగా సేవలు అందించేవారు. అయితే కూటమి సర్కార్లో వారు కేవలం సర్వేలకే పరిమితం అయ్యారు. నిత్యం ఇంటింటికి వెళ్లి ఏదో ఒక్క సర్వే చేయాల్సి వస్తుంది. దీంతో పనిభారం పెరిగిపోతోందని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. స్టేట్ పాలసీ కాబట్టి సర్వే చేయాల్సిందేని అధికారులు చేతులెత్తేస్తున్నారు. రోజుకు 30 నుంచి 80 ఇళ్లు సర్వే చేయాల్సిన వస్తోందని వాపోతున్నారు. ఉదయం 6 గంటలకు యాప్స్ తెరిచి హాజరు నమోదు చేయడంతో మొదలై నిర్ణీత లక్ష్యం చేరుకునే వరకు సమయంతో పని లేకుండా సర్వేల్లోనే నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే రోజు వారీ విధులు, సోమవారం గ్రీవెన్స్, మరోవైపు ఉన్నతాధికారుల జూమ్ మీటింగ్లు, ఫోన్ కాన్ఫరెన్సులతో క్షణం తీరిక లేకుండా పోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లాలి పంచాయతీ కార్యదర్శులకు సర్వేల భారం తప్పడం లేదు. కార్యాలయంలో ఉండాల్సిన పనిలేకుండా ప్రతి రోజు ఇంటింటికి వెళ్లాల్సి ఉంది. కొన్ని సర్వేలకు ప్రజల నుంచి ఓటీపీలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ఓటీపీ చెప్పడానికి ఇష్టపడడం లేదు. అయితే ఉన్నతాధికారులు మాత్రం తప్పకుండా ఓటీపీలు నమోదు చేయాలంటున్నారు. దీంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాం. మా బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదు. – వెంకట కిషోర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, సచివాలయ ఉద్యోగుల సంఘం తప్పు జరిగితే షోకాజ్ పనులు చెప్పడం..ఆ తర్వాత చిన్నపాటి తప్పుడు జరిగినా షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. నిత్యం చెత్త తొలగింపుపై నిఘా పెడుతున్నాం. చెత్త విషయం అందరికీ తెలిసిందే ఏ క్షణం ఎవరురూ చెత్త ఎక్కడ వేస్తారోనని మాకు ఆందోళనగా ఉంటుంది. చెత్త కనపడితే మీకు నోటీస్ తప్పదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయడమే కష్టంగా ఉంటోంది. ఉన్నతాధికారులు మా సమస్యలపై స్పందించి న్యాయం చేయాలి. – అనిల్కుమార్, పంచాయతీ సెక్రటరీ -
‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు
తిరుపతిలోని పెట్రోల్ బంక్లిట్మస్ పరీక్షా...ఎక్కడ..? సాధారణంగా పెట్రోలు నాణ్యతపై వినియోగదారులకు ఏమైనా సందేహాలు ఉంటే లిట్మస్ పేపర్తో పరీక్ష చేసి చూపాలి. ఈ పరీక్షలో నలుసులు, దుమ్ము సైతం కనిపించకుడదు. అయితే ఆ పరీక్షను చేసేవారు లేరు. చాలమందికి ఆ పరీక్షపై సరైన అవగాహన లేకపోవడం గమనార్హం. తిరుపతి అర్బన్/తిరుపతి సిటీ:జిల్లావ్యాప్తంగా మోటా రు వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యులు సైతం బైక్ లేనిదే ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఈ–బైక్లు అందుబాటులో కి వచ్చినా ప్రజలు ఇప్పటికీ పెట్రోల్తో నడిచే ద్విచక్రవాహనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వినియోగదారుల అవసరాలను పెట్రోల్ బంకుల నిర్వాహకులు అవకాశంగా మార్చుకుంటున్నారు. జంప్ ట్రిక్! జిల్లాలో 90 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని బంకుల్లో ‘జంప్ ట్రిక్’ మోసానికి పాల్పడుతున్నారు. పెట్రోల్ పట్టేప్పుడు అక్కడి సిబ్బంది డిజిటల్ మీటర్లో జీరో చూసుకోండి అని చెబుతుంటారు. పెట్రోల్ పోయడం మొదలుపెట్టగానే మీటరు నెమ్మదిగా పెరగకుండా ఒక్కసారిగా 10–20 పాయింట్లకు వెళ్లిపోతుంది. దీంతో మనకు తక్కువ పెట్రోల్ పోసినా, మీటరులో కరెక్ట్గా ఉన్నట్టే చూపిస్తుంది. సాధారణంగా మీటరు 4–5 పాయింట్లు మాత్రమే జంప్ అవ్వాలి. జిల్లాలోని అనేక బంకుల్లో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇది గమనించి అడిగినా.. పెట్రోల్ బంకు సిబ్బంది నుంచి స్పందన లేదని వాహనచోదకులు మండిపడుతున్నారు. వసతులు కరువు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులకు కనీస వసతులు కల్పిండం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి బంకు వద్ద మరుగుదొడ్లు, ఉచితంగా గాలి పట్టే పంపులు, తాగునీటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 20 శాతం బంకుల్లో మినహా మిగిలిన చోట్ల అస్సలు సౌకర్యాలే ఉండడం లేదు. కనీసం జాతీయ రహదారి వెంబడి ఉన్న బంకుల్లోనూ తూతూమంత్రంగా వసతులు ఉన్నాయని వాహనాదారులు విమర్శిస్తున్నారు. కనీస వసతులు లేని మల్లవరం పెట్రోల్ బంక్పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా చీటింగ్ దోపిడీ గన్తో రీడింగ్ మాయ కల్తీ ఇంధనంతో వాహనదారులకు ఝలక్ లిట్మస్ పరీక్ష అడిగితే ససేమిరా అంటున్న సిబ్బంది తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతున్న అధికారులు జిల్లావ్యాప్తంగా కొరవడిన పర్యవేక్షణ కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కేవలం రెండే కేసులు డిజిటల్ మీటర్ నుంచి ఆయిల్ నాణ్యత వరకు అవకతవకలే తిరుచానూరు రోడ్డులోను ఓ పెట్రోల్ బంకులో తక్కువ ఇంధనం పడుతున్నట్లు నాగలక్ష్మి అనే వాహనదారు తెలిపారు. తిరుపతి అలిపిరి రోడ్డులోని ఓ బంక్లో పెట్రోల్ పడితే 10–15 కిలోమీటర్లకు ముందే రిజర్వ్ పడిందని దామోదర్ అనే ద్విచక్రవాహనదారుడు వాపోయారు. తిరుపతి లీలామహల్ రోడ్డులోని ఓ బంక్కు వెళ్లి వాటర్ బాటిల్లో లీటర్ పెట్రోల్ పడితే 950 మిల్లీలీటర్లే ఉందని మరో బాధితుడు రమేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ ప్రాంతంలోని హైవేపై బంకుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. శ్రీకాళహస్తిలో వాటర్ బాటిల్లో పట్టుకుంటే లీటర్కు 50 మిల్లీలీటర్లు తక్కువ ఉంటోందని, అదే వాహనానికి అయితే లీటర్కు 100 మిల్లీలీటర్ల తగ్గించి పడుతున్నారని బాలాజీ అనే మోటారుసైకిలిస్టు ఆరోపించారు. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట,సత్యవేడు నియోజకవర్గాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇదే విధంగా మోసాలకు పాల్పడుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. వెంటనే చర్యలు పెట్రోల్ బంకుల్లో మోసాలు, వసతులకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు చేపడుతున్నాం. ఆయా పెట్రోల్ బంకులను తనిఖీలు చేస్తున్నాం. మండలస్థాయి సివిల్ సప్లయి అధికారులను నిత్యం పెట్రోల్ బంకులపై నిఘా పెట్టమని చెప్పాం. తరచూ తనిఖీలు చేపడుతున్నాం. వినియోగదారులకు సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావాలి. తప్పు చేసిన పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకుంటాం. – శేషాచలం రాజు, జిల్లా సివిల్ సప్లయి అధికారి తనిఖీలు చేస్తున్నాం పెట్రోల్ బంకులపై ఫిర్యాదులు వచ్చినా రాకున్నా తరచూ తనిఖీలు చేస్తున్నాం. తొమ్మిది నెలల్లో 200 సార్లు తనిఖీలు చేపట్టాం. రెండు కేసులు నమోదు చేశాం. వారికి రూ.1.5లక్షల జరిమానా విధించాం. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆ పెట్రోల్ బంకులపై ప్రత్యేక నిఘా పెడతాం. కొందరు వాటర్ బాటిల్లో పట్టుకుంటే తేడా లేదని..వాహనానికి పట్టుకుంటే తేడా ఉన్నట్లు చెబుతున్నారు. ఏదైనా ఒకేలా ఉంటుంది...అలాంటి తేడాలు ఉండవు. – సి.స్వామి, కొలతలు, తూనికల శాఖ జిల్లా సహాయ కమిషనర్ సార్.. జీరో చూసుకోండి! సాధారణంగా వాహనదారులు పెట్రోల్ బంకుకు వెళ్లి.. ఇంధనం పోయాలని అక్కడికి సిబ్బందికి ఆడిగిన వెంటనే... వారు సార్ ‘జీరో చూసుకోండి’ అని ఎంతో నమ్మకంగా చెబుతారు. మన దృష్టి కూడా ఆ ‘సున్నా’పైనే ఉంటుంది. జీరో ఉన్నంత మాత్రాన మనం మోసపోమనుకుంటే అది పొరపాటే. బంకుల్లో ఎప్పటికప్పుడు నయా మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వినియోగదారులు నష్టపోతూనే ఉన్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. వినియోగదారులు సైతం దీనిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో జిల్లాలో పెట్రోల్ బంకుల నిర్వాహకులు యథేచ్చగా దోపిడీకి తెరతీస్తున్నారు. ఫిర్యాదు ఇలా.. పెట్రోల్ బంకుల్లో మోసాలు గమనిస్తే నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయవచ్చు. సదరు మండలంలోని సివిల్ సప్లయ్ అధికారి లేదా, జిల్లా సివిల్ సప్లయి అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే తూనికలు,కొలతల అధికారులకు సమాచారం అందించవచ్చు. అయినప్పటికి న్యాయం జరగకపోతే జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. పెట్రోల్ బంకుల్లో సదుపాయాలు లేకపోయినా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన చమురు సంస్థలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. -
పోరాట స్ఫూర్తి భగత్సింగ్
తిరుపతి మంగళం : భరతజాతి మరువలేని పోరాట స్ఫూర్తి భగత్సింగ్ అని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద భగత్సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమన మాట్లాడుతూ 1931 మార్చి 23వ తేదీన దేశం కోసం భగత్సింగ్ సగర్వంగా ఉరికంబం ఎక్కారన్నారు. భగత్సింగ్తోపాటు రాజ్గురు, సుఖ్దేవ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, నేతలు లవ్లీ వెంకటేష్, మద్దాలి శేఖర్, పసుపులేటి సురేష్, సుబ్బు, రుద్రగోపి, పుణీత పాల్గొన్నారు. ఏప్రిల్ 10న మిక్స్డ్ బియ్యానికి టెండర్ కమ్ వేలం తిరుపతి కల్చరల్ : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలాన్ని ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించనున్నట్లు టీటీడీ సీపీఆర్ఓ రవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో ఈ మేరకు వేలానికి మొత్తం 12,320 కిలోల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు రూ.590 డీడీ తీసి టెండర్ షెడ్యూల్ పొందవచ్చని సూచించారు. వేలంలో పాల్గొనేందుకు రూ.25వేలను ఈఎండీగా చెల్లించాలనన్నారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, లేదా, 0877–2254429 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం భాకరాపేట : ఎర్రావారిపాళెం మండలం నెరబైలు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల విధ్వంసం కొనసాగుతోంది. రెండు రోజులుగా ఏనుగులు పంటలన నాశనం చేస్తున్నాయి. శనివారం రాత్రి ఈ మేరకు వరి, మామిడి పంటలన తొక్కి ధ్వంసం చేశాయి. అటవీ అధికారులు స్పందించి గజరాజులను అటవీప్రాంతంలోకి మళ్లించాలని రైతులు కోరుతున్నారు. -
వెంకన్నా మమ్మల్ని ఆదుకో స్వామి
● శ్రీవారి మెట్టు వద్ద చిరు వ్యాపారుల వేడుకోలుతిరుపతి కల్చరల్ : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 216 రోజులుగా దీక్ష చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని చిరు వ్యాపారులు వాపోయారు. వారు ఆదివారం ‘మా సమస్యలు నీవైనా పరిష్కరించు స్వామీ’ అని ఏడు కొండల వాడిని మొక్కుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర వ్యాపారులతో కలిసి శ్రీవారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకొని అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేశారు. కొబ్బరి కాయలు సమర్పించారు. జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేస్తున్నా టీటీడీ యాజమాన్యం, కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వారికి ఏడు నెలల నుంచి ఉపాధి లేదని, కుటుంబాల పోషణ కష్టంగా మారిందని తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్పందించి చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మధు, యుగంధర్, చిరంజీవి, రాంబాబు, ప్రకాష్, గోపి, మల్లి, రామమూర్తి, పెంచలయ్య పాల్గొన్నారు. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.40 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,170 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.98 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమలలో కొత్తగా మరో ట్రస్టు
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరుతో ఇప్పటికే ఒక ట్రస్టు ఉన్నప్పటికీ శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు పేరుతో నూతన ట్రస్టును ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు కూడా కొనసాగుతుందన్నారు. తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజుకు సరిపడా రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందించారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఆలయాల నిర్మాణాల కోసం నూతన ట్రస్టు..అనంతరం.. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లేవు. అలాంటిచోట్ల ఈ ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు నూతన ట్రస్టు ఏర్పాటుచేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. మూడో కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాన్ని తలపెడుతున్నాం. మాధవసేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేస్తాం. స్వామివారి ఆస్తులు ఎవరు కబ్జాచేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం’.. అని అన్నారు.టీటీడీలో హిందువులే పనిచేయాలి..‘టీటీడీలో పనిచేసేవారు హిందువులై ఉండాలి. ఇతర ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని సంకల్పించాం. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. అలాగే, ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మిస్తాం’.. అని చంద్రబాబు చెప్పారు.ఆ హోటళ్లకు భూకేటాయింపులు రద్దు..తిరుమల కొండకు ఆనుకుని ముంతాజ్, ఎమర్, దేవలోక్ హోటళ్లకు అనుమతులిచ్చి 35.32 ఎకరాలు కేటాయించారు. ఆ భూముల కేటాయింపులను రద్దుచేస్తున్నామని చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకుని ఎవరూ వ్యాపారం చేయడంగాని, అపవిత్రంగాని చేయకూడదన్నారు. రాజకీయాల కోసమే శ్రీవాణి ట్రస్ట్పై ఆరోపణలుగతంలో శ్రీవాణి ట్రస్టులో అనేక అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ పెద్దఎత్తున విమర్శలు చేశారు. కానీ, నేడు శ్రీవాణి ట్రస్టు కొనసాగుతుందని చెబుతూ మరో కొత్త ట్రస్టు ఏర్పాటు అంటున్నారు. అంటే.. శ్రీవాణి ట్రస్టులో గతంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని సీఎం చెప్పకనే చెప్పేశారని.. అందుకే శ్రీవాణి ట్రçస్టు కొనసాగుతుందంటున్నారని భక్తులు చెబుతున్నారు. రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకుంటారనేది చంద్రబాబు మరోసారి నిరూపించారని వారంటున్నారు. -
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 44 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై తిరుపతి రాస్ భవనంలో నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా న్యా య సేవా సంస్థలు, తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ సంయుక్తంగా మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. శిక్షణ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అనుజ సక్సేన, మధ్య ప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ఎంఎస్ నినాకరేలను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. మధ్యవర్తిత్వంతో నష్టం లేదు మధ్యవర్తిత్వం నిర్వహించి కేసులను పరిష్కరించడం వల్ల న్యాయవాదులకు ఎటువంటి నష్టం ఉండదని సీనియర్ ట్రైనీ, ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అనుజ సక్సేన తెలిపారు. శుక్ర వారం తిరుపతి న్యాయవాదుల అసోసియేషన్ హాల్లో తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ భారతి, తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గోపీచంద్, ప్రధాన కార్యదర్శి మార్టిన్, న్యాయవాదులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని శ్రీకాళహస్తిలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులపై స్పందించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం చైర్మన్ వీ.రామసుబ్రమణియన్ను కలిసి దాడులకు సంబంధించిన వివరాలు, ఫిర్యాదు అందజేశారు. నేటికీ ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రాణభయంతో షికారీ కుటుంబాలు గ్రామాల్ని వదిలేస్తున్నారని తెలిపారు. అక్కడ అన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై స్పందించి, ఆ దాడులకు పాల్పడుతున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని, శిక్షించాలని డిమాండ్ చేశారు. -
జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు
తిరుపతి క్రైమ్: తిరుపతి జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏఎస్పీ జే. వెంకట్రావు, ఆర్.వినోద్కుమార్(సైబర్ క్రైమ్ సీఐ), ఎల్.మునిరత్నంరెడ్డి(ఏఎస్ఐ వెస్ట్ పోలీస్ స్టేషన్), పీ.శివకుమార్రెడ్డి(ఏఎస్ఐ తడ పీఎస్), భక్తవత్సలంరాజు(ఏఎస్ఐ పిచ్చాటూరు పీఎస్), డీ.ఏడుకొండలు(ఏఆర్హెచ్సీ 3754), ఐ.బ్రహ్మనాయక్(ఏఆర్హెచ్ 3872), జీ.రమేష్బాబు(ఏఆర్హెచ్సీ 1263), జీ.ప్రసన్నాంజనేయలు(ఏఆర్హెచ్సీ 1338), డీ.మల్లికార్జునరావు(వీఆర్హెచ్సీ 3386), ఈ.నిర్మల(వెస్ట్ పీఎస్ హెచ్సీ 616)కు సేవా పథకాలు వచ్చాయి. అదేవిధంగా ఏఎస్ఐ 453 అలిపిరి పీఎస్ భాస్కర్కు ఉత్తమ సేవ పతకం లభించింది. -
లోకేష్ వద్దకు చేరిన ఓటేరు పంచాయితీ
శ్రీకాళహస్తి: తిరుపతి రూరల్ పరిధిలో ఆక్రమణకు గురవుతున్న ఓటేరు చెరువు పంచాయితీ మంత్రి లోకేష్ వద్దకు చేరింది. శుక్రవారం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మంత్రి లోకేష్ను కలిసి ఓటేరు చెరువు గురించి ప్రస్తావించినట్లు సమాచారం. గత వారంలో ఎస్సీవీ నాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మధ్య ఓటేరు చెరువు విషయమై వివాదం నెలకొంది. అది చెరువు భూమి కాదని ఎస్సీవీ నాయుడు, చెరువులను రక్షించాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి బాహాబాహికి దిగారు. దీంతో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
శ్రీసిటీలో ‘ఓజేఐ ఇండియా’ ప్రారంభం
శ్రీసిటీ(సత్యవేడు): ఓజేఐ గ్రూపు అనుబంధ సంస్థ ఓజేఐ ఇండియా ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ శుక్రవారం శ్రీసిటీలో ప్రారంభించింది. కంపెనీ కస్టమర్లు, సరఫరాదారులు, ఇతర ప్రతినిధుల సమక్షంలో చైన్నెలోని జపాన్ కాన్సుల్ జనరల్ మునియో తకాహషి, ఓజీ హోల్డింగ్ కార్పొరేషన్ ప్రెసిడెండ్ అండ్గ్రూప్ సీఈఓ హిరోయుకి ఇసోనే, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఓటీ ఇండియా ప్యాకేజింగ్ సీఈఓ యోషియుకి కురహషి లాంచనంగా రిబ్బన్ కత్తిరించి కంపెనీని ప్రారంభించారు. దేశంలో ఇది ఐదో ప్లాంట్ కాగా, దక్షిణ భారత దేశంలో అతి పెద్దది. ఈ సందర్భంగా హిరోయుకి ఇసోనో మాట్లాడుతూ సుస్థిరత, ఆవిష్కరణల ద్వారా నిర్మించిన ఈ శ్రీసిటీ ప్లాంట్, దక్షిణ భారత దేశ ప్యాకేజింగ్ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. యోషియుకి కురహషి మాట్లాడుతూ భారత్లో ఓటీ ప్రమాణాన్ని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. జౌజీ గ్రూప్ విస్తరణ జపాన్– భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మునియో తకాహషి వ్యాఖ్యానించారు. -
కేజీబీవీల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలోని ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న సీట్లకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష ఎక్స్ అఫిషియో కో–ఆర్డినేటర్, డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. కేజీబీవీల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 6, 11 తరగతుల్లో కొత్తగా ప్రవేశం పొందేందుకు, అలాగే 7, 9, 10 తరగతులు, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు), పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్రరేఖకు దిగువ ఉన్న విద్యార్థులే అర్హులని, ఆన్లైన్ దరఖాస్తులనే అడ్మిషన్లకు పరిగణించబడతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11వ తేదీలోపు ‘ఏపీకేజీబీవీ.ఏపిసీఎఫ్ఎస్ఎస్.ఇన్’’ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులకు వారి ఫోన్ నంబరుకు సమాచారం అందుతుందని తెలిపారు. వివరాలకు 70751 59996, 70750 39990 నంబర్లలో సంప్రదించాలని డీఈఓ కోరారు. ఇంగ్లిష్ పరీక్షకు 413 మంది గైర్హాజరు తిరుపతి అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 26,840 మంది రెగ్యులర్ విద్యార్థులు, 57 మంది ప్రైవేటు విద్యార్థులు, ఓపెన్ స్కూల్స్కు సంబంధించి 966 మంది హాజరవ్వాల్సి ఉందన్నారు. అయితే ఇందులో 413 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు వెల్లడించారు. ఒక విద్యార్థి డిబార్ సత్యవేడు మండలంలోని ఏపీఎస్డబ్ల్యూ బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఓ విద్యార్థి కొన్ని కాగితాలతో ఉన్నట్టు ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో గుర్తించారని డీఈఓ తెలిపారు. దీంతో ఆ విద్యార్థిని డిబార్ చేయడంతోపాటు ఆ గదిలోని ఇన్విజిలేటర్ ఎస్.వెంకటేశ్వరరావు(ఎంపీపీఎస్ యన్టీ స్కూల్ ఎస్జీటీ ఉపాధ్యాయుడు, సత్యవేడు మండలం)ను సస్పెండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. డీఎస్పీ సుకుమారికి ఉత్తమ సేవా పతకం చంద్రగిరి: కల్యాణీ డ్యాం సమీపంలోని పీటీసీలో పనిచేస్తున్న డీఎస్పీ సుకుమారికి ఉత్తమ సేవా పతకం, ఆర్ఎస్ఐ ఆనంద నాయుడు సేవా పతకానికి ఎంపికై నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చేతుల మీదుగా పతకాలు అందించి సత్కరించనుంది. ఈ మేరకు శుక్రవారం పీటీసీలోని పలువురు సిబ్బంది వారిని అభినందించి, సత్కరించారు. గతంలోనూ డీఎస్పీ సుకుమారి అనేక అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 24న డీసీ కార్యాలయాల వద్ద ఆందోళన తిరుపతి అర్బన్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 24న తిరుపతి, చిత్తూరు జిల్లాల సమన్వకర్తల కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయనునట్టు ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షరాలు లత, కార్యదర్శి ఉషారాణి వెల్లడించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఈనెల 27న చలో మంగళగిరి వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బంది సర్వీస్ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 27న స్థానిక సంస్థల ఉప ఎన్నిక తిరుపతి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి ఖాళీ అయిన చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి రూరల్ ఎంపీపీతోపాటు రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి, చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లి, కోట మండలంలోని ఎన్పీ కొత్తపాళెం, ఎర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీల ఉప సర్పంచ్లకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
గని కార్మికులపై కూటమి కన్నెర్ర
● మూత పడిన క్వార్ట్జ్ గనులు ● తొమ్మిది నెలలుగా ఇదే తంతు ● పనుల్లేక డొక్కలు మాడ్చుకుంటున్న పేదలు ● బోణీల్లేవంటున్న అంగడి యజమానులు రెక్కాడితే గానీ డొక్కాడని గని కార్మికులపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టింది. మైకా, క్వార్ట్జ్, క్వారీ పరిశ్రమలకు అనుమతులివ్వకుండా వేధిస్తోంది. తొమ్మిది నెలలుగా చేతినిండా పనిలేక పేదలు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. గనుల్లో వాచ్మన్ దగ్గర నుంచి జేసీబీ, ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు, టిప్పర్లు, కార్మికులు ఇలా ఎందరో అర్ధాకలితో అలమటించాలి వస్తోంది. వీరిపై ఆధారపడిన పలు దుకాణాలు సైతం బోసిపోవడం సైదాపురంలో నిత్యకృత్యంగా మారుతోంది. కార్మికులు లేక బోసిపోయిన మైకా గని ప్లాంట్ సాక్షి, టాస్క్ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం మండలంలో కోట్లాది రూపాయాల గనులు, మైకా గనులు ఉన్నాయి. ఇక్కడ అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇవ్వన్నీ మూతపడ్డాయి. నూతన పాలసీ పేరిట వీటిని మూసివేశారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి మైకా పరిశ్రమలన్నీ సిండికేట్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కొన్ని గనుల్లో పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. మిగిలినవి పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా వీటిపై ఆధారపడ్డ ఐదు వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయాయి. కార్మికులకు ఉపాధి లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నా అధికారులు కనికరం చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందరిపైనా ప్రభావం గడిచిన తొమ్మిది నెలల్లో పల్స్పర్, మైకాకే పర్మిట్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం వాటిల్లోనూ తూతూమంత్రంగానే పనులు జరుగుతున్నాయి. ఈ సంక్షోభం కార్మికులపైనే కాకాకుండా యాజమాన్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో మైకా పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఆశలు.. అడియాశలు సైదాపురం, పొదలకూరు, గూడూరు మండలాల్లోని కార్మికులు అధికం మైకా గనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తొమ్మది నెలలుగా పనుల్లేక ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. మరో వైపు గని కార్మికుల్లో అధిక శాతం కూటమి ప్రభుత్వానికే ఓటు వేశారు. గతానికి భిన్నంగా గత ఎన్నికల్లో సైదాపురం మండలంలో కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ వచ్చింది. తమకు మంచి జరుగుతుందనే వీరి ఆశలు అడియాశలయ్యాయి. మైకా పరిశ్రమలకు వెళ్లే కూలీలతో కళకళలాడే సైదాపురం నేడు బోసిపోయింది. రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహన యజమానులతో పాటు లోడింగ్చేసే కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పలువురు కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతున్నారు. వాటికి అనుమతి ఎప్పుడో? మైకా పరిశ్రమ పూర్తిగా ఓ ముఖ్యనేత కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం సదరు వ్యక్తికి అప్పజెప్పడంతో ఈ రంగం కుదేలైంది. ప్రధానంగా గిద్దలూరు, కలిచేడు గ్రామాల్లో ఉన్న రెండు ప్రధాన గనులకు నేటికీ అనుమతులు లభించలేదు. వీటిపై ఆధారపడిన వేలాది మంది కూలీలు వీధిన పడ్డారు. 143 నుంచి 80కి మండలంలో గతంలో 143 గనులు పనిచేస్తుండగా ప్రస్తుత వీటి సంఖ్య 80కి పడిపోయింది. అందుబాటులో ఉన్న గనులు, క్వారీలకు అనుసంధానంగా పది ఫ్యాక్టరీలున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీటిలో 90 శాతం మంది జిల్లా వాసులే. -
ఆగిపోయిన మెమో రైలు
దొరవారిసత్రం: చైన్నె నుంచి నెల్లూరుకు వెళ్లే మెమో రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో శుక్రవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో దొరవారిసత్రం రైల్వే స్టేషన్కు సమీపంలో డౌన్లైన్ పట్టాలపై 99 కి.మీ వద్ద అవుటర్లో ఆగిపోయింది. అదే సమయంలో వెనుకనే బెంగళూరు నుంచి వయా చైన్నె మీదుగా వచ్చిన ధనాపూర్ ఎస్స్ప్రెస్ దొరవారిసత్రం రైల్వే స్టేషన్లో 4.40 గంటలకు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎండ తీవ్రతకు అల్లాడిపోయారు. మెమో రైల్లోని ప్రయాణికులు మాత్రం జాతీయ రహదారి బాట పట్టి ఎవరి పాటికి వారు ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. రాత్రి 7.10 గంటలకు గూడూరు నుంచి ఇంజిన్ రావడంతో మెమో రైలు కదిలింది. వెనుకనే దనాపూర్ ఎస్స్ప్రెస్ కూడా కదిలింది. -
చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ
తిరుపతి సిటీ : ఆరోగ్య రక్షణలో చిరుధాన్యాలు కీలకపాత్రం పోషిస్తాయని ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కలీముల్లా తెలిపారు. శుక్రవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శ్రీచిరుధాన్యాలపై అవగాహన, ప్రాసెసింగ్ యంత్రాల సందర్శన్ఙ అనే అంశంపై 25 మంది ఎస్సీ మహిళలకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలు తీసుకుంటే శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయని చెప్పారు. అనంతరం చిరుధాన్యాలను శుద్ధి చేయడం, పొట్టు తీయడం, తినుబండారాల తయారీపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఏడీఆర్ డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే రక్తపోటు, చక్కెర వ్యాధి, అధిక కొవ్వును అరికట్టవచ్చని వెల్లడించారు. అనంతరం మహిళలకు కిట్, సర్టిఫికెట్లతో పాటు తినుబండారాలను పంపిణీ చేశారు. -
● ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు ● క్షేత్ర స్థాయి అధికారికి భారీగా ముడుపులు ● రాత్రికి రాత్రే తెల్లరాయి తరలించేస్తున్న కూటమి నాయకులు
ప్రభుత్వ భూముల్లో తెల్లరాయి తవ్వకాలతో ఏర్పడ్డ గుంతలు సాక్షి, టాస్క్ఫోర్స్: గూడూరు నియోజకవర్గంలో కూటమి నేతలు ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. వారికి అండగా ‘నేను ఉన్నా’ అని స్థానిక ప్రజాప్రతినిధి భరోసా ఇస్తుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో తెల్లరాయిని తవ్వి రాత్రికి రాత్రే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటిదే గూడూరు రూరల్ మండలంలో చోటు చేసుకుంది. ఆక్రమించి..అక్రమంగా తరలించి మండల పరిధిలోని చెన్నూరు రెవెన్యూ బిట్–2 తుంగపాళెం గ్రామ సమీపంలో మూత పడిన మైనింగ్ ఫ్యాక్టరీకి ఎదురుగా 70 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో విస్తారంగా తెల్లరాయి, వర్మిక్యులేట్లు దొరుకుతున్నాయి. స్థానిక రెవెన్యూ పరిధిలోని ఇద్దరు నాయకులు వాటిపై కన్నేశారు. తమ అనుచరులతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఆపై తెల్లరాయిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిపూట బ్లాస్టింగ్..పగలు తరలింపు సదరు భూముల్లో గత నెల రోజులుగా రాత్రి పూట బ్లాస్టింగ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాస్టింగ్ అనంతరం తవ్వకాలు చేసి పట్టపగలు లోడింగ్ చేసుకుంటున్నారు. ఇలా తవ్వి తీసిన తెల్లరాయిని మూత వేసి ఉన్న మైనింగ్ కంపెనీలోకి తరలించి అక్కడ గ్రేడింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఇదేగాక విద్యుత్ టవర్లకు పక్కన కూడా తవ్వేస్తుస్తున్నారు. దీంతో సమీప గ్రామాల రైతులు భయాందోళనకు లోనవుతున్నారు. రోజూ టిప్పర్లలో తరలింపు రాత్రి సమయంలో ప్రభుత్వ భూముల్లో బ్లాసింగ్ చేసి గ్రేడింగ్ చేసిన తెల్లరాయిని టిప్పర్లలో నింపి తరలిస్తున్నారు. బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెల్లరాయి తరలింపునకు ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకుల అండతో యథేచ్ఛగా తరలించేస్తునఆనరు. ఎవరైనా అడిగితే స్థానిక ప్రజాప్రతినిధికి చెందిందని చెప్పడంతో అధికారులు కూడా అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. -
సీఎంకు సాదర వీడ్కోలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): సీఎం చంద్రబాబునాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. తిరుమల పర్యటన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో టీటీడీ ఈఓ శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సల్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు ఎమ్మెల్యేలు, రేణిగుంట తహసీల్దార్ సురేష్బాబు తదితరులు సాదర వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్లారు. గాయపడిన వ్యక్తి మృతి పాకాల: రెండు రోజుల క్రితం కారు, స్కూటరు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో గాయపడిన స్కూటరిస్ట్ స్విమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 19వ తేదీన నేండ్రగుంట బ్రిడ్జ్ వద్ద జరిగిన ప్రమాదంలో పెనుమూరు మండలం, కత్తిరెడ్డిపల్లి పంచాయతీ, గాగమ్మవారిపల్లి గ్రామానికి చెందిన బీ.భాస్కర్నాయుడు(48) గాయపడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతూ భాస్కర్నాయుడు మృతి చెందారు. ఏఎస్ఐ వెంకట్రామానాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,872 మంది స్వామివారిని దర్శించుకోగా 23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
ఎస్పీడబ్ల్యూలో బయోటెక్ ఫెస్ట్
తిరుపతి సిటీ :పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల బయోటెక్నాలజీ విభాగం, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ నారాయణమ్మ అధ్యక్షతన శుక్రవారం బయోటెక్ రెవల్యూషన్ ది నెక్ట్స్ ఫ్రాంటియర్– ట్రాన్స్ఫార్మింగ్ సైనన్స్ టు సొల్యూషన్ అనే అంశంపై బయోటెక్ ఫెస్ట్ నిర్వహించించారు.ఐజర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో బయోటెక్నాలజీ పాత్ర, ప్రాముఖ్యత, అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం బయోటెక్నాలజీ సైన్స్ ఎక్సోపో ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ బుడోల్లాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ బి.విశ్వనాథ్, విభాగాధిపతి డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ భద్రమణి, అధ్యాపకులు హేమలత, కుసుమ పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదు
తిరుపతి అర్బన్ : వేసవి నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు ఒంటి పూట తరగతులు నిర్వహించాలని జారీ చేసిన ఆదేశాలను ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు బేఖాతర్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు డీఈఓ కేవీఎన్ కుమార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి డీఈఓ మాట్లాడుతూ పకడ్బందీగా తనిఖీలు చేపడతామని, ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు హేమాద్రి యాదవ్, ప్రేమ్ కుమార్, లోకేష్, యుగంధర్, ముని , సుకుమార్, వెంకటేష్ పాల్గొన్నారు. -
సిద్ధార్థను సందర్శించిన జపాన్ బృందం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలను జపాన్కు చెందిన జేఎస్ ఒబెర్లిన్ యూనివర్సిటీ బృందం శుక్రవారం సందర్శించింది. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర ఎక్సేంజ్, ఉద్యోగ కల్పన విషయంలో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ అశోకరాజు తెలిపారు. జేఎఫ్ ఒబెర్లిన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఫుమిటీక్నకముర, టాకేరు తెరసావా, న్యూఢిల్లీకి చెందిన నీరూధావ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం జపాన్ యూనివర్సిటీ బృందంతో అశోకరాజుతో పాటు కళాశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్రెడ్డి, జనార్దనరాజు, వివిధ విభాగాల హెచ్వోడీలు సమావేశమయ్యారు. అశోకరాజు మీడియాతో మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల, ఒబెర్లిన్ యూనివర్సిటీలు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, పరిశోధన, ఇండస్ట్రీ టయప్తో పాటు ఆఫర్ చేస్తున్న కోర్సులను మ్యాపింగ్ చేస్తూ కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రెండు విద్యా సంస్థలు పరస్పరం అధ్యాపకులను, విద్యార్థులను ఎక్సేంజ్ చేసుకుంటూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్త కోర్సులతో మంచి భవిష్యత్ను అందించనున్నట్టు అశోకరాజు తెలిపారు. -
‘కళైకావేరి’తో ఎస్వీయూ ఒప్పందం
తిరుపతి సిటీ : తమిళనాడులోని తిరుచిరాపల్లెకు చెందిన కళై కావేరి లలిత కళల కళాశాలలో పలు అంశాలపై ఎస్వీయూ కళలప్రదర్శన అధ్యయన విభాగం శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అధ్యాపకులు, విద్యార్థులు పరస్పర అభ్యసన, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించునే వెసులుబాటు ఉంటుంది. కార్యక్రమలో ఆచార్య శంకర్ గణేష్, ఆచార్య ఉమామహేశ్వరి, డాక్టర్ పత్తిపాటి వివేక్, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. రుయాలో ప్రపంచ డౌన్స్ సిండ్రోమ్ దినోత్సవం తిరుపతి తుడా: రుయా పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో డీఈఐసీ భవనంలో శుక్రవారం ప్రపంచ డౌన్స్ సిండ్రోమ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్, రుయా ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్, పీడియాట్రిక్స్ హెచ్ఓడీ డాక్టర్ మనోహర్ కార్యక్రమంలో పాల్గొని డౌన్స్ సిండ్రోమ్ లక్షణాలు, కారణాలు, నిర్వహణ అనే అంశాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్, డాక్టర్ గుణశేఖర్, ఝాన్సీరాణి, డాక్టర్ సుప్రజ దేవి, దీప్తి, సరస్వతి, చైతన్య పాల్గొన్నారు. పుత్తూరు రైటర్ వీఆర్కు! – రాజకీయ లొత్తిళ్లే కారణమా? పుత్తూరు : స్థానిక పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి.రవి తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్ (వేకన్సీ రిజర్వుడు)కు బదిలీ అయ్యారు. గురువారం జరిగిన ఈ బదిలీ కేవలం స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ స్టేషన్కు వివిధ కేసుల్లో పట్టుకొస్తున్న నిందితులను స్థానిక టీడీపీ నాయకులు వారు మావారే వదిలి పెట్టాలంటూ పోలీసులపై అధికార జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలపైనే ఇలా అయితే మా ఉద్యోగాలు ఎలా చేయాలంటూ రైటర్ రవి ప్రశ్నించడంతో అతనిని టార్గెట్ చేసి వీఆర్కు పంపించినట్లు తెలుస్తోంది. చూశారా మేము చెప్పింది చేయకపోతే ఇలానే ఉంటుందంటూ స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు టీడీపీ నాయకులు హెచ్చరికలు పంపుతున్నారు. రాజకీయంగా తమ పలుకుబడిని చూపేందుకే చిరుద్యోగిపై ప్రతాపం చూపారంటూ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేటి నుంచి అంతర్జాతీయ వర్క్షాపు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రామరంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో శాబ్దబోధ మీమాంశ అనే అంశంపై వారం రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ వర్క్షాప్లో పద్మభూషణ నవలపాకం శతకోప రామానుజతాచార్య రచనలో వివరించిన శాబ్దబోధంపై తత్వశాస్త్ర, భాషా విశ్లేషణ జరగనుంది. దర్శన, వ్యాకరణ విభాగాలలో పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుని, స్పోటవాదం, అభిహితాన్వయ, అన్వితాభిధానవాదం వంటి ముఖ్యమైన అంశాలపై మహాపండితులు చర్చించనున్నారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్తో పాటు మరిన్ని వివరాలకోసం ప్రొఫెసర్ సి రంగనాథన్ 94409 19106, డాక్టర్ ఓజీపీ కళ్యాణ శాస్త్రి 88856 73667లను సంప్రదించాలని వర్సిటీ అధికారులు ఒక ప్రకటలో తెలిపారు. -
కలెక్టరేట్కు బాంబు బెదిరింపు
తిరుపతి అర్బన్: కలెక్టర్ కార్యాలయంలోనే బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు శుక్రవారం ఈ మెయిల్ పంపించారు. వెంటనే స్పందించిన ఏఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో తిరుచానూరు సీఐ సునీల్కుమార్, ఎస్ఐలు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్లో వంద మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో వారంతా ఆందోళన చెందకుండా సాదారణ తనిఖీల్లో భాగంగానే వచ్చామంటూ ఏబ్లాక్, బీ బ్లాక్తోపాటు అన్ని గదులను, టాయిలెట్స్ను, దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడా ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు వచ్చిన ఈ మెయిల్ ఫేక్గా భావించారు. శుక్రవారం సాయంత్రం 4.30– 4.45 గంటల మధ్య పోలీసులకు ఈ మెయిల్ రావడంతో 5.15 గంటలకే కలెక్టరేట్కు చేరుకున్న పోలీసులు సాయంత్రం 6.45 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఈ మెయిల్... అప్రమత్తమైన ఏఎస్పీ తిరుచానూరు పోలీసులతో గాలింపు హోటల్స్ నుంచి కలెక్టరేట్కు పాకిన బాంబు బెదిరింపులు సాయంత్రం 4.30 – 4.45 గంటల మధ్యలో పోలీసులకు మెయిల్ 5.15 గంటల నుంచి6.45 గంటల వరకు తనిఖీలు -
పది ఎకరాల అటవీ భూమి కబ్జాకు యత్నం
సాక్షి టాస్క్ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గం, కలువాయి మండలం, తోపుగుంట సమీపంలోని పది ఎకరాల అటవీ భూమిని ఓ వ్యక్తి అక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ భూమి సాక్షాత్తు సోమశిల అనుసంధానమైన చైన్నె కాలువ సమీపంలో ఉండడం గమనార్హం. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కలువాయికి చెందిన ఓ వ్యక్తి చదును చేసి సాగు చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాడు. అలాగే ఆ భూమి సమీపంలోనే మరో 4.88 సెంట్లు ఓ వ్యక్తికి అసైన్మెంట్ పట్టా ఇవ్వగా.. ఆ భూమిని కూడా ఆ వ్యక్తి కొనుగోలు చేసి మొత్తంగా సాగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం అంతా సంబంధిత అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. రుయా పెస్ట్ ఏజెన్సీపై చీటింగ్ కేసు తిరుపతి తుడా: రుయా ఆస్పత్రిలో పెస్ట్ కంట్రోల్ నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన సాయి సెక్యూరిటీ ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ స్వామిరెడ్డి పై చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. ఎస్వీ మెడికల్ కళాశాల తోపాటు రుయా, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ సర్వీసెస్ నిర్వహించేందుకు సాయి సెక్యూరిటీ ఏజెన్సీ 2021 ఆగస్టు ఒకటిన ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందింది. ఆ సంస్థ తిరుపతికి చెందిన ఎన్.రేణుకకు సబ్కాంట్రాక్టు ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి 39 నెలలకు గాను బ్యాంక్ గ్యారంటీని రేణుక తన ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా మొత్తాన్ని చెల్లించింది. 13 నెలల తర్వాత సబ్ కాంట్రాక్టర్ నుంచి ఆమెను తప్పించారు. అయితే నాలుగేళ్లు కావస్తున్నా సబ్ కాంట్రాక్టర్గా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన ఎన్.రేణుకాకు వాటిని సకాలంలో తిరిగి చెల్లించలేదు. అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని ఇవ్వకుండా మోసగించారు. ఆమె బ్యాంక్ గ్యారంటీ పైనే ఇన్ని రోజులు సాయి సెక్యూరిటీ ఏజెన్సీస్ పెస్ట్ కంట్రోల్ నిర్వహిస్తూ వస్తోంది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. సబ్ కాంట్రాక్టర్ అనేకమార్లు ఈ వ్యవహారంపై రుయా, మెడికల్ కళాశాల, ప్రసూతి ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉందని, బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లించనందున ఏజెన్సీకి బిల్లులు చెల్లించవద్దని ఫిర్యాదులో పేర్కొంది. బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇవ్వాలని అనేక మార్లు సాయి ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ స్వామి రెడ్డికి కోరినా స్పందించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసిన విచారిస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎంపిక వరదయ్యపాళెం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు తెలిపారు. శ్రీకాళహస్తిలోని సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో తిరుపతి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులుగా తలారి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా దాసరి జనార్దన్, జిల్లా ఉపాధ్యక్షులుగా గురవమ్మ, ఎన్.రమణయ్య, వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శులుగా ముత్యాలయ్య, రాజగోపాల్, రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సుబ్బమ్మ, నారాయణ, శంకరయ్య, కత్తి గురవయ్య, బాలగురవయ్య, వెంకటకృష్ణయ్య, అముద, శ్రీనివాసులు, హరిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు. -
పశువులకు వడదెబ్బ ముప్పు
జిల్లా సమాచారం సైదాపురం: వేసవిలో పశువులను నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. దీనికారణంగా పాల దిగుబడి తగ్గుముఖం పడుతుంది. మరికొన్ని మృత్యువాత పడుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పాడిపశువులను కాపాడుకోవచ్చు అని సైదాపురం మండల పశువైద్యాధికారి బొడ్డు ప్రసాద్ సూచించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. వడ దెబ్బకు శరీర ప్రక్రియ మందగిస్తుంది వేసవిలో పశువుల శరీర ఉష్ణోగ్రతకంటే బయటి ఉష్ణోగ్రత అధికమైనప్పుడు మెదడులోని హైపోదలామస్ స్వేద గ్రంధుల నిర్వాహణపై పర్యవేక్షణ కోల్పోతాయి. చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి శరీర ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతుంది. మూత్ర పిండాలు సరిగా పనిచేయవు. దీంతో పశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి శ్వాస ఆడక మరణించే ప్రమాదం ఉంది. నివారణ చర్యలు వేసవిలో పశువులను మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్ర చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పశువులను బయటకు తోలాలి. పశువులను రోజుకు మూడునాలుగు సార్లు చల్లటి నీటితో కడగాలి. నాటు జాతి పశువుల కంటే సంకరజాతి ఆవులు, గేదెలు త్వరగా వడదె దెబ్బకు గురవుతాయి. రేకుల కప్పులు ఉన్న పశువుల షెడ్లుపై గడ్డిని కప్పి మధ్యాహ్న వేళ్లలో నీళ్లను చల్లుతుండాలి. వడ గాలుల ప్రభావం పడకుండా గోనె సంచి పరదాలను ఏర్పాటు చేసుకోవాలి. చికిత్స విధానం వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశానికి మార్చాలి. పశువుల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకోవడానికి పలుమార్లు చల్లటి నీటితో కడగాలి. ఆ తర్వాత పశువైద్యాధికారులను సంప్రందించాలి. వేడిని తగ్గించే ఇంజెక్షన్ వేయాలి. రక్తంలో డెక్ట్రోజ్సైలెన్ ఎక్కించడం వల్ల శరీరానికి సరిపడా గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ అంది పశువులు నీరసం నుంచి బయటపడుతాయి. డివిజన్ ఆవులు గేదెలు గూడూరు 30517 1.27.462 శ్రీకాళహస్తి 83433 46.205 తిరుపతి 1.04.319 11.334 సూళ్లూరుపేట 41.479 1.08.740 మొత్తం 2,59,748 2,93,741 పాలదిగుబడిపై ప్రభావం చూపే అవకాశం అప్రమత్తంగా ఉండాలంటున్న పశువైద్యాధికారులు వడదెబ్బ లక్షణాలు వడదెబ్బ తగిలిన పశువులు శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మం గట్టిపడుతుంది. నోటి వెంట సొంగ కారుతుంది. నీడ కోసం చెట్టుకింద చేరి కూలబడుతాయి. శ్వాస పీల్చడం కష్టమవుతుంది. పశువులు క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 109 డిగ్రీల దాటితే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ ప్రభావంతో చూడి పశువుల్లో గర్భస్రావం సంభవిస్తుంది. దూడలు అతిసార వ్యాధితో మృత్యువాత పడుతాయి. -
తిరుపతిలో కలకలం.. కలెక్టరేట్కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. దీంతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం పోలీసులకు మెయిల్ రాగా, తిరుపతి కలెక్టరేట్ను బాంబ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్లో అన్ని విభాగాల సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో బాంబు లేదని తేల్చడంతో కార్యాలయంమ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.కాగా, తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా కార్పొరేట్ హోటళ్లతో పాటు పలు ఆలయాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల(ఫిబ్రవరి)లో ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో హ్యూమన్ ఐఈడీ బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి కళాశాల అధికారులకు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు, అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు.వెంటనే కళాశాల అధికారులు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పలు మార్లు కళాశాలకు బాంబు బెదురింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఫేక్ సమాచారంగా తేల్చారు. -
సూపర్ సిక్స్పై ప్రశ్నిస్తే కేసులు.. అడుగేస్తే నిర్భంధం
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్బుడ్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ట్ అరెస్ట్, అరెస్ట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని గురువారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా చంద్రబాబు ఉచిత బస్సు హామీ గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.బడ్జెట్లో సూపర్ సిక్స్కు ఏ మాత్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైఎస్సార్సీపీ శాంతియుతంగా వినతిపత్రం అందచేయాలని అనుకున్నాం. దానికి ఎందుకు హౌస్ అరెస్టు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రజా గొంతుకను నులిమేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు?. వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తారా? అని ప్రశ్నించారు. -
ఇలవైకుంఠం.. ఇదేం అపచారం
తిరుమలలో యథేచ్ఛగా అక్రమ మద్యం, గంజాయి తిరుమలలో చిన్న గంజాయి ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు యథేచ్ఛగా దొరుకుతున్నాయి. భారీ స్థాయిలో మత్తు పదార్థాలను నిఘా కళ్లు గప్పి తిరుమలకు తరలిస్తున్నారు. రోడ్డు మార్గం మీదుగా కొంతమేర అక్రమార్కులు తనిఖీ సిబ్బంది కళ్లు గప్పి తరలిస్తుంటే.. మరి కొంతమంది మామండూరు, అన్నమయ్య నడక మార్గాల మీదుగా తిరుమలకు అక్రమ మద్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో సరైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయక పోవడంతోనే మద్యం సరఫరా అవుతున్నట్లు భక్తులు అభిప్రాయపడుతున్నారు. -
పీఎంఎఫ్ఎంఈ అభివృద్ధికి చర్యలేంటి?
తిరుపతి మంగళం: పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల పథకం (పీఎంఎఫ్ఎంఈ) అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని గురువారం తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ పథకం అమలు స్థితి, లబ్ధిదారుల వివరాలు, మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన సూక్ష్మ ఆహార పరిశ్రమలకు తీసుకున్న చర్యలు ఏమిటి, అమలులో ఎదురైన సవాళ్లు, పరిష్కార చర్యలు, లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, శిక్షణ, మౌలిక సదుపాయాల వివరాలు, ఆహార ప్రాసెసింగ్ రంగవృద్ధికి రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలు వివరాలు తెలపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల పోటీ శక్తిని పెంచడం, అసంఘటిత రంగాన్ని పటిష్టంగా మార్చి సంస్థీకృత రంగంగా అభివృద్ధి చేయడం, మహిళలు, ప్రాంతీయ వర్గాలు, ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ తెలిపారు. ఈ పథకం తిరుపతి నియోజకవర్గంలో అమలును వి వరిస్తూ మొత్తం 248 మంది లబ్ధిదారులున్నారని, అందుకుగాను రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేశారని తెలిపారు. అలాగే 1,959 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 7.53 కోట్లు మూలధన సహాయం, ఐఐటీ తిరుపతిలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్కు రూ.2.60 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో భాగంగా 190 మంది లబ్ధిదారులకు ప్రత్యేకశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వా మివారిని దర్శించుకోగా 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టో కెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూ లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది. -
ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా?
నాయకులను అడ్డుకున్న పోలీసులుతిరుపతి మంగళం : ‘చంద్రబాబు అబద్ధపు హామీలపై ప్రజాగొంతుకై ప్రశ్నించే హక్కు వైఎస్సార్సీపీ నేతలకు లేదా..?’ అంటూ ఆ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూ పర్సిక్స్ హామీల అమలుపైన గురువారం తిరుపతికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించేందుకు బయలుదేరిన భూమన అభినయ్రెడ్డితోపాటు ఆ పార్టీ శ్రేణులను పద్మావతిపు రంలోని పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసు లు నిర్బంధించారు. సీఎంను కలవడానికి వీల్లేదంటూ గేట్లు మూసేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా రోప్లతో అడ్డుకున్నా రు. దాంతో పార్టీ కార్యాలయం వద్దే బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం అభినయ్రెడ్డి మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి తొమ్మిది నెలలవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మాటలు తప్ప చేతల్లో ఏదీ చేయడం లేదన్నారు. నిర్బంధించిన వారిలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, కార్పొరేటర్ తమ్ముడు గణేష్, టౌన్బ్యాంక్ వైస్చైర్మన్ వాసుయాదవ్, పార్టీ నాయకులు నల్లాని బాబు, కడపగుంట అమరనాఽథ్, దినేష్రాయల్, అనీల్రెడ్డి, పసుపులేటి సురేష్, మద్దాలి శేఖర్, మల్లం రవి, సుధాకర్, కోటి, రమణమ్మ, సాయికుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సక్రమ విధి నిర్వహణకు ఆరోగ్యం ముఖ్యం
తిరుపతి మంగళం : ఎర్రచందనం పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే ఆరోగ్యం ముఖ్యమని టాస్క్ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బరాయుడు అన్నారు. తిరుపతి కపిలితీర్థం సమీపంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో గురువారం ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న సిబ్బందికి టాస్క్ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు, ఎస్పీ పి.శ్రీనివాస్ మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అడవుల్లో కూంబింగ్కు వెళ్లే సిబ్బంది పలు కారణాలతో గాయపడుతుంటారన్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఫస్ట్ ఎయిడ్తోపాటు మెడికల్ కిట్లను తెప్పించి పంపిణీ చేశారన్నారు. మెడికల్ కిట్లో టాబ్లెట్లు,ఓఆర్ఎస్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, మోకాలి కేప్లు, బెల్టులు, పెయిన్ జెల్లు, సర్జికల్ డ్రెస్సింగ్ బ్యాండేజీలతోపాటు 15 రకాల మందులను అందజేశామన్నారు. టాస్క్ఫోర్స్ డిఎస్పీలు జె.బాలిరెడ్డి, వీ.శ్రీనివాసులురెడ్డి, ఎండీ షరీఫ్, ఆర్ఐ సాయి గిరిధర్, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఏసీఎఫ్ జె.శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు
తిరుమల: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గు రువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మా వతి అతిథిగృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఈఓ శ్యామలరావ్, అదనపు వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. తర్వాత మన వుడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్న సత్రంలో ఒక్కరోజు అన్నదానంలో పాల్గొననున్నారు. జిల్లాకు ఏడు కొత్త సర్వీసులు తిరుపతి అర్బన్: జిల్లాకు ఏడు కొత్త సూపర్ ల గ్జరీ సర్వీసులు వచ్చాయి. గురువారం ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ కోసం మంగళం డిపోలో ఉంచారు. పాత కక్షలతో వ్యక్తిపై దాడి తిరుపతి క్రైమ్: పాత కక్షలతో ఓ వ్యక్తిపై దాడి చే శారు. ఈస్ట్ ఎస్ఐ బాలకృష్ణ కథనం.. తిరుపతి 16వ వార్డులో కల్లూరు తులసీరామ్ శానిటరీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతడిపై డీఆర్ మహల్కి చెందిన గౌరీశంకర్ మరో ఇద్దరితో వచ్చి గు రువారం కత్తులతో దాడి చేసి, పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గౌరీశంకర్ తండ్రి నాగరాజు ఆరేళ్ల క్రితం చోరీ కేసులో స్టేషన్కు పిలవడంతో ఆత్మహత్య చేసుకు న్నాడు. అప్పట్లో తులసీరామ్ తన కోడిని చోరీ చేశాడంటూ నాగరాజుపై పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేయడంతోనే తన తండ్రి మరణించాడని పగబట్టి దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. గౌరీశంకర్ ఇప్పటికే దొంగతనంతోపాటు హత్యాయత్నం కేసుల్లో మైనర్గా ఉన్నప్పుడే జైలు కెళ్లాడని ఎస్ఐ తెలిపారు. -
పీఎంఎఫ్ఎంఈ అభివృద్ధికి చర్యలేంటి?
తిరుపతి మంగళం: పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల పథకం (పీఎంఎఫ్ఎంఈ) అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని గురువారం తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ పథకం అమలు స్థితి, లబ్ధిదారుల వివరాలు, మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన సూక్ష్మ ఆహార పరిశ్రమలకు తీసుకున్న చర్యలు ఏమిటి, అమలులో ఎదురైన సవాళ్లు, పరిష్కార చర్యలు, లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, శిక్షణ, మౌలిక సదుపాయాల వివరాలు, ఆహార ప్రాసెసింగ్ రంగవృద్ధికి రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలు వివరాలు తెలపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల పోటీ శక్తిని పెంచడం, అసంఘటిత రంగాన్ని పటిష్టంగా మార్చి సంస్థీకృత రంగంగా అభివృద్ధి చేయడం, మహిళలు, ప్రాంతీయ వర్గాలు, ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ తెలిపారు. ఈ పథకం తిరుపతి నియోజకవర్గంలో అమలును వి వరిస్తూ మొత్తం 248 మంది లబ్ధిదారులున్నారని, అందుకుగాను రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేశారని తెలిపారు. అలాగే 1,959 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 7.53 కోట్లు మూలధన సహాయం, ఐఐటీ తిరుపతిలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్కు రూ.2.60 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో భాగంగా 190 మంది లబ్ధిదారులకు ప్రత్యేకశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వా మివారిని దర్శించుకోగా 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టో కెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూ లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది. -
ఎట్టకేలకు వెటర్నరీ జూడాల సమ్మె విరమణ
● 46 రోజుల నిరవధిక నిరసనకు తెర ● తాత్కాలికంగా సమ్మె విరమించినట్లు ప్రకటించిన జూడాలు తిరుపతి సిటీ:ఎస్వీ వెటర్నరీ వర్సిటీ జూడాలు ఎట్టకేలకు నిరవధిక సమ్మెను విరమించారు. అన్ని వైద్య విభాగాల్లో జూడాలకు ఇస్తున్న స్టయిఫండ్కు సమానంగా తమకూ గౌరవేతనం ఇవ్వాలని 46 రోజులుగా తరగతులు బహిష్కరించి, సమ్మె బాట పట్టి పశువైద్య విద్యార్థులు గురువారం సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.10500కు పెంచుతూ జీఓ జారీ చేయడంతో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు వీసీ రమణకు, వర్సిటీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దీంతో వర్సిటీ డీన్ వీరబ్రహ్మయ్య, కళాశాల అసోసియేట్ డీన్ జగపతి రామయ్య సమ్మె చేస్తున్న విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి, నిరసనను విరమింప జేశారు.అనంతరం జూడాలు మాట్లాడుతూ ప్రభుత్వం యూజీ విద్యార్థులకు రూ.25 వేలు, పీజీకి రూ.50 వేలు, పీహెచ్డీ విద్యార్థులకు రూ.75 వేలు పెంచితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెంచిన వేతనంతో తాము సంతోషంగా లేమని, ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తున్నామని, తమ న్యాయపరమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరారు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం 46 రోజలుగా వెటర్నరీ కళాశాల తరగతి గదులు మూతపడి నిర్మానుష్యంగా మారాయి. విద్యార్థులు సమ్మె విరమణతో సోమవారం నుంచి యథావిథి గా తరగతులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ సంవత్సరం ముగింపు దశలో ఉండడంతో సిలబస్, పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణపై అధికారులు మరింత దృష్టి సారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికే సదస్సులు
వడమాలపేట(విజయపురం): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికే సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ఎస్పీడీసీఎల్ తిరుపతి జిల్లా ఎస్ఈ సురేంద్రనాయుడు అన్నారు. వడమాలపేట మండలం పాదిరేడు రచ్చబండ ఆవరణలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాంతాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు సదస్సులు జరుగుతాయన్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం 241 సబ్స్టేషన్లు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో ఉన్న డీఈ, ఏఈ తన పరిధిలోని సబ్స్టేషన్ ఆవరణలో సదస్సు ఏర్పాటు చేసి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఈఈ దేవఆశ్వీరాదం, డీఈఈ శంకయ్య, ఏఈ భాస్కర్రాజు, ధనంజేయులునాయుడు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడి సేవలో ఎస్పీ శైలజ రాపూరు: మండలంలోని పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామివారిని ప్రముఖ గాయని ఎస్పీ శైలజ గురువారం దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థానం సిబ్బంది సాదర స్వాగతం పలికి, మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. వేదపండితులు ఆశ్వీరవచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
కక్ష సాధింపు చర్యలు
చిట్టమూరు:చిట్టమూరు దళితవాడకు చెందిన వైఎ స్సార్సీపీ మద్దతుదారుడు నెల్లిపూడి అన్వేష్ (సో షల్ యాక్టివిస్టు) ఎన్నికలకు ముందు పెట్టిన పోస్టింగ్లను దృష్టిలో ఉంచుకుని రెండు నెలల క్రితం పోలీసులు పిలిపించి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన అన్ని గ్రూపుల నుంచి లెఫ్ట్ కావడంతోపాటు ఇకపై ఇలాంటి పోస్టులు పెట్టనని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాడు. అయినప్పటికీ కూటమి నాయకులు అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయ త్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీసీ రోడ్ల ని ర్మాణం పేరుతో ఆయన ఇంటిని కూల్చడానికి పూనుకున్నారు. దీంతో మండల తహసీల్దార్ కాయల సతీష్కుమార్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్ పోలీసులు శాఖ అధికారులు బందోబస్తుతో గురువారం నెల్లిపూడి అన్వేష్కు చెందిన ప్రహరీ గోడ, బాత్రూమును పూర్తిగా జేసీబీతో ధ్వంసం చేశారు. ఇదే వీధిలో ప్రహరీ గోడలున్నప్పటికీ కక్ష గట్టి అన్వేష్ ఇంటిని ధ్వంసం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రహరిగోడను కూల్చేందుకు వచ్చిన అధికారులతో ఇంట్లో ఈ నెల 24 తేదీ సోమవారం ఓ శుభకార్యం ఉందని దీనికి పలు గ్రామాల నుంచి బంధువులు, స్నేహితులు వస్తారని ఆ కార్యక్రమం అయిన తర్వాత తానే స్వచ్ఛందంగా తొలగిస్తామన్నప్పటికీ కనికరం కూడా చూపలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
సమారోహం..
సంస్కృత భాష పరిరక్షణ.. సంస్కృతి మనుగడే లక్ష్యంగా బోధన చేస్తున్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన నాలుగో దీక్షాంత సమారోహం సంస్కృతికి ఛత్రం పట్టింది. పతకాలు.. పట్టాలు.. పీహెచ్డీలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందం అవధులు దాటి, ఉప్పొంగింది. ఘనంగా జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం ● 22 మందికి బంగారు పతకాలు ప్రదానం ● 564 మందికి డిగ్రీ, పీజీ..75 మందికి పీహెచ్డీ పట్టాల అందజేత ● సంస్కృత భాషాభివృద్ధే లక్ష్యంగా వర్సిటీ అడుగులు ఐదు మహాగ్రంథాల ఆవిష్కరణ రామానుజ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సురపురం శ్రీనివాసాచార్య రచించిన సిద్ధాంత చింతామణి, రీసె ర్చ్ అండ్ పబ్లికేషన్స్ విభాగం ద్వారా శివరామభట్ సంపాదకీయంలోని మహస్వినీ పత్రికను, అనంతరం జ్యోతిష్య విభాగం డీన్ కృష్ణేశ్వర్ ఝా ఆధ్వర్యంలో వేదవేదాంగం, డాక్టర్ సోమనాథ దా స్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో వర్సిటీ న్యూస్ లెటర్ శేముషీ గ్రంథాలను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, డీన్లు దక్షణమూర్తి శర్మ, రజనీకాంత శుక్లా, పరీక్షల నియంత్రణాధికారి కే సాంబశివమూర్తి పాల్గొన్నారు. 564 మందికి డిగ్రీ, పీజీ పట్టాలు.. 75 మందికి పీహెచ్డీలు వర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో భాగంగా 2023–24 అకడమిక్ విద్యాసంవత్సరానికి సంబంధించి 75 మంది విద్యార్థులకు విద్యావారిధి(పీహెచ్డీ) పట్టాలను అందజేశారు. అలాగే 564 మంది విద్యార్థులకు ఆచార్య, ఎంఏ, ఎమ్మెస్సీ, బీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ యోగాథెరఫీ, సర్టిఫికెట్, డిప్లొమో పట్టాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. స్నాతకోత్సవంలో గ్రంథాలను ఆవిష్కరిస్తున్న అతిథులు, వర్సిటీ అధికారులుతిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నాలుగో దీక్షాంత సమారోహం అట్టహాసంగా జరిగింది. తిరుపతి మహతి ఆడిటోరియం వేదికగా గురు వారం జరిగిన వర్సిటీ నాలుగో స్నాతకోత్సవానికి అధ్యక్ష హోదాలో హాజరైన వర్సిటీ చాన్సలర్ పద్మభూషణ్ ఎన్ గోపాలస్వామికి వేదపండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్రీ సంస్కృత విద్యాపీఠం మాజీ వీసీ పద్మశ్రీ డాక్టర్ వీఆర్ పంచముఖి ఆన్లైన్ విధానంలో హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృతభాష పరిరక్షణకు మూలకేంద్రమని కొనియాడారు. ప్రాచీన సంస్కృత భాషను సంరక్షిస్తూ, ఆధునిక వైజ్ఞానిక తత్త్వాలను అనుసంధానిస్తూ, భారతీయ జ్ఞాన పరంపరను భావిభారతావనికి అందిస్తున్న ఉత్తమ క్షేత్రంగా వర్సిటీ విరాజిల్లుతుందన్నారు. త్వరలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను సంస్కృత భాషతో అనుసంధానం చేసేందుకు విశేష పరిశోధనలు చేస్తామని తెలిపారు. నూతన పరిశోధనల వేదిక ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి వర్సిటీ ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరిశోధనలకు వర్సిటీ వేదికవుతోందన్నారు. సంస్కృత భాషాభివృద్ధే వర్సిటీ లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. దేశంలో పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లో సంస్కృత భాష బోధిస్తు న్న ఏకై క వర్సిటీ జాతీయ సంస్కృత వర్సిటీ అని కొనియాడారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి వర్సిటీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాకోర్సులను సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు. హృదయాన్ని స్పృశించిన సన్నివేశాలు ఎన్ఎస్యూ నాలుగో స్నాతకోత్సవంలో పట్టాలు, బంగారు పతకాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రు లు కలిసిన సన్నివేశాలు వీక్షకులు హృదయాన్ని కట్టిపడేశాయి. పీజీ ఓవరాల్ టాపర్గా నిలిచి 4 పతకాలతో పాటు, ఒక బంగారు పతకం సాధించిన అమిత్ విక్ర మ్ కుమారుడు, కుమార్తె తండ్రి సాధించిన పతకా లను పట్టుకుని ముద్దాడిన సంఘటన పలువురిని క లచి వేసింది. అలాగే పీజీ జ్యోతిష్యశాస్త్రంలో టాపర్గా నిలిచిన కేరళకు చెందిన ఎంపీ అన్గే విద్యార్థి తల్లి షీజా కేరళ నుంచి వచ్చి, కుమార్తెను ముద్దాడి అక్కున చే ర్చుకుని ఆనందబాష్పాలు రాల్చింది. అలాగే పీహెచ్ డీ పట్టా అందుకున్న దివ్యాంగుడు కే హరిబాబుకు అధికారులు మోకాళ్లపై నిలుచుని పట్టా అందజేశారు. అనంతరం భార్య, ఆయన కుమారుడు డాక్టరేట్ ప ట్టాను చూస్తూ ఆనందోత్సహాంలో మునిగితేలారు.బంగారు పతకాలను సాధించిన ఆనందంలో తలపాగాలను గాలిలోకి విసిరేస్తున్న విద్యార్థులు మెరిసిన 22 మంది బంగారు కొండలువిశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రతిభ చూ పి ప్రథమస్థానం సాధించిన 22 మంది విద్యార్థులు బంగారు పతకాలను కై వసం చేసుకున్నారు. గోల్డ్మెడల్స్ సాధించిన వారిలో శాసీ్త్ర విభాగంలో వై జా నకి, బీఏలో జి సంధ్య, బీఎస్సీలో వి త్రిపురసుందరి, బీఎస్సీ యోగాలో టి అభినయ పసిడి పతకాలు అందుకున్నారు. ఆచార్య విభాగంలో సునీతాప్రుష్టి, వైష్ణవి, అన్గా, అనురిధ్ భరద్వాజ్, మహదేవన్, దే వప్రసాద్ భట్, అజిత్ సింగ్, విక్రమ్, తునుశ్రీ, హే మసుందర్రావు, శుభశ్రీ, అస్రఫ్ అలమ్ఖాన్, కి షోర్ పాండే, సాగరిక సర్కార్, ఎంఎలో సంధ్యబాయ్, ఎమ్మెస్సీలో అభినయ్శ్రీ, ఎమ్మెస్సీ యోగాలో ఎం దేవీప్రసన్న బంగారు పతకాలు సాధించారు. వీరితో పాటు బీఈడీలో మోనికా బొహిదర్, ఎంఈడీలో జయక్రిష్ణరాయ్ ఉన్నారు. ఓవరాల్ టాపర్గా అమిత్ విక్రమ్, జానకి వర్సిటీలో ఆచార్య (పీజీ) స్థాయిలో విద్యార్థి కేఎస్ అమిత్ విక్రమ్ ఓవరాల్ టాపర్గా నిలిచి సుమారు ఐదు పతకాలను సాఽధించారు. అలాగే శాస్త్రి (డిగ్రీ) కోర్సులో ఓవరాల్ టాపర్గా నిలిచిన వై జానకి నాలుగు బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ప్రాక్–శాస్త్రిలో (ఇంటర్) ప్రథమస్థానంలో నిలిచిన లక్ష్మీ ప్రసన్న బంగారు పతకం అందుకున్నారు. -
ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా?
నాయకులను అడ్డుకున్న పోలీసులుతిరుపతి మంగళం : ‘చంద్రబాబు అబద్ధపు హామీలపై ప్రజాగొంతుకై ప్రశ్నించే హక్కు వైఎస్సార్సీపీ నేతలకు లేదా..?’ అంటూ ఆ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూ పర్సిక్స్ హామీల అమలుపైన గురువారం తిరుపతికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించేందుకు బయలుదేరిన భూమన అభినయ్రెడ్డితోపాటు ఆ పార్టీ శ్రేణులను పద్మావతిపు రంలోని పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసు లు నిర్బంధించారు. సీఎంను కలవడానికి వీల్లేదంటూ గేట్లు మూసేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా రోప్లతో అడ్డుకున్నా రు. దాంతో పార్టీ కార్యాలయం వద్దే బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం అభినయ్రెడ్డి మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి తొమ్మిది నెలలవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మాటలు తప్ప చేతల్లో ఏదీ చేయడం లేదన్నారు. నిర్బంధించిన వారిలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, కార్పొరేటర్ తమ్ముడు గణేష్, టౌన్బ్యాంక్ వైస్చైర్మన్ వాసుయాదవ్, పార్టీ నాయకులు నల్లాని బాబు, కడపగుంట అమరనాఽథ్, దినేష్రాయల్, అనీల్రెడ్డి, పసుపులేటి సురేష్, మద్దాలి శేఖర్, మల్లం రవి, సుధాకర్, కోటి, రమణమ్మ, సాయికుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఊరికి దూరంగా..
● తొమ్మిది నెలలుగా 25 షికారీ కుటుంబాలు గ్రామ బహిష్కరణ ● వైఎస్సార్ సీపీకి ఓటేశారన్న అక్కసుతో దౌర్జన్యం ● శ్రీకాళహస్తి మండలం ఈశ్వరయ్య కాలనీలో ప్రజాస్వామ్యం ఖూనీ ● మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు శ్రీకాళహస్తి మండలం ఈశ్వరయ్య కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇల్లుఒడిశాలో తలదాచుకుని తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్న బాధితులు(ఫైల్) చంటి బిడ్డలు.. చదువుకునే పిల్లలు.. వయో వృద్ధులు.. గ్రామ ప్రథమ పౌరులు వారా వీరా అనేమీ.. ఆ కాలనీలోని గిరిజనమంతా ఊరు విడిచింది.. భాషకానీ భాష.. రాష్ట్రం కానీ రాష్ట్రానికి పొట్ట చేతపట్టుకుని వెళ్లింది. బిక్కుబిక్కుమంటూ 9 నెలలుగా కాలం గడుపుతోంది.. మళ్లీ మా స్వస్థలం చేరుతామో లేదోనన్న బెంగతో బతుకుతోంది. దీనంతటికీ కారణమేమిటంటే.. ఆ గిరిజనులు వైఎస్సార్ సీపీకి ఓటు వేయడమే. ఓటేసిన పాపానికి పచ్చనేతలు ఆ గిరిజనాన్ని బెదిరించి.. గ్రామ బహిష్కరణ చేయించారు. అయినా ఏ ఒక్కరూ నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఆ గిరిజనం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. రేణిగుంట: వైఎస్సార్ సీపీకి ఓట్లేశారన్న అక్కసుతో ఆ గ్రామానికి చెందిన పచ్చనేతలు 25 గిరిజన కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లగొట్టారు. ఇక్కడే ఉంటే చంపేస్తామని బెదిరించారు. దౌర్జన్యం చేశారు. చేసేది లేక, గత ఏడాది జూన్ 7వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపేడు పంచాయతీ ఈశ్వరయ్య కాలనీకి చెందిన 25 గిరిజన కుటుంబాలు గ్రామాన్నే కాదు.. రాష్ట్రాన్నే వీడారు. ఒడిశా రాష్ట్రానికి వెళ్లి తలదాచుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దుబ్బాక, మరి కొన్ని ప్రాంతాల్లో పరాయిపంచన బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గ్రామ ప్రథమపౌరురాలినే తరిమేశారు గత ప్రభుత్వ హయాంలో ఈశ్వరయ్య కాలనీకి చెందిన షికారీ మహిళ సుమతి గ్రామసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడమే కాలనీలోని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన 25 గిరిజన కుటుంబాలను గ్రామానికి చెందిన టీడీపీ బడానేత చంపేస్తామని బెదిరించి, గ్రామం నుంచి తరిమేశారు. ఊరొదిలి వెళ్లిపోయిన వారిలో గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు సైతం సర్పంచ్ ప్రమేయం లేకుండానే టీడీపీ నేతలే అన్నీ తామై పంచాయతీ పాలనను కొనసాగిస్తూ.. స్థానిక సంస్థల హక్కులను అపహాస్యం చేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ఎస్టీ కులానికి చెందిన 25 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తే ప్రజా సంఘాలు కానీ, దళిత, గిరిజన సంఘాలు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. గొంతెత్తి ప్రశ్నించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి విన్నవించినా పట్టించుకోలేదు. మాజీ సీఎం వైఎస్జగన్ను కలసిన బాధితులు పచ్చనేతలకు భయపడి ఊరొదిలి వెళ్లిన 25 గిరిజన కుటుంబాలు గురువారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమ గోడును ఆయనతో పంచుకున్నారు. అండగా నిలుస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. కమిషన్ కలుగజేసుకోవాలి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక, ప్రతిపక్ష పార్టీలతోపాటు, సామాన్యులైన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, బడుగు, బలహీన వ ర్గాలకు చెందిన పేద, సామాన్య ప్రజలే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎంపేడు ఈశ్వరయ్య కాలనీలో 25 కుటుంబాలు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోయేలా చేశారు. 9 నెలలు గా వారంతా బయటి రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని మగ్గుతున్నారు. కాలనీలో వాళ్ల ఇళ్లన్నీ తాళాలు వేసి బోసిపోయి ఉన్నాయి. మానవహక్కుల కమిషన్ బాధితులకు న్యాయం చేయాలి. – డాక్టర్ మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి చాలా దుర్మార్గం ఈశ్వరయ్య కాలనీకి చెందిన షికారీలను ఊళ్లో నుంచి వెళ్ల గొట్టడం చాలా దుర్మార్గం. అధికార యంత్రాంగం ఏక పక్షంగా వ్యవహరిస్తూ చిగురుటాకులపై ప్రతాపం చూపి నిమ్నజాతులను హింసించడం తగదు. మానవహక్కుల కమిషన్ ఈ ఘటనపై కలుగజేసుకుని బాధితులకు న్యాయం చేయాలి. – కె.హరినాఽథ్, గిరిజన సంఘ నేత, తిరుపతి జిల్లా చిగురుటాకులపై ప్రతాపం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చాలా దారుణంగా ప్రతీకార దాడులకు తెగబడుతున్నారు. 9 నెలలుగా ఎంతోమందిపై భౌతిక దాడులు చేశారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, తిరిగి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపైనే అక్రమ కేసులు బనాయించి హింసిస్తున్నారు. ఎంపేడు ఈశ్వరయ్య కాలనీలోని 25 షికారీ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తే.. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. బాధితులను మళ్లీ వాళ్ల ఇళ్లకు చేర్చి భరోసా కల్పించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి -
శ్రీసిటీ కంపెనీలకు ప్రతిష్టాత్మక సీఐఐ అవార్డులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించిన శ్రీసిటీలోని మూడు పరిశ్రమలకు ‘2024 సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్స్’ దక్కాయి. విశాఖపట్నం నోవోటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ మాదిరెడ్డి ప్రతాప్ ఈ అవార్డులను అందజేశారు. శ్రీసిటీకి చెందిన మొండెలెజ్ ఇండియా, కెలాగ్స్, డానియెలి కంపెనీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి. ఇందులో మొండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇండస్ట్రియల్ సేఫ్టీ లీడర్షిప్ అవార్డ్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ విభాగంలో బంగారు పతకం దక్కింది. 2024 సంవత్సరానికి బెస్ట్ సేఫ్టీ పర్ఫార్మర్గా ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో గోల్డ్ అవార్డును కెల్లాగ్స్ అందుకుంది. ఇక డానియెలి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఇండస్ట్రియల్ సేఫ్టీ లీడర్షిప్ అవార్డ్ కింద ఇంజినీరింగ్ విభాగంలో గోల్డ్ పురస్కారం సొంతమైంది. విజేతలకు అభినందనలు తెలిపిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఈ అవార్డులు భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఆ పరిశ్రమల అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ డా.మురళీకృష్ణ హాజరయ్యారు. -
తొక్కిసలాటపై కొనసాగుతున్న జ్యుడీషియల్ విచారణ
తిరుపతి అర్బన్:వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో నెలకొన్న తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఎదుట విచారణకు దశలవారీగా అంతా హాజరవుతున్నారు. గురువారం అప్పటి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అప్పటి టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్ను కలెక్టరేట్లో జ్యుడీషియల్ కమిషన్కు కేటాయించిన చాంబర్లో చైర్మన్ విచారించారు. ఆ మేరకు వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బుధవారం విచారణకు అప్పటి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్ఓ శ్రీధర్, అప్పటి టీటీడీ జేఈఓ గౌతమి హాజరైనప్పటికీ గౌతమిని మాత్రమే ఎక్కువ సమయం విచారించారు. ఈ క్రమంలో రెండోరోజు సుబ్బరాయుడు, శ్రీధర్ను విచారణ చేపట్టారు. శుక్రవారం మూడో రోజు వీరిద్దరిని విచారణ చేయనున్నారు. ఈ నెల 17న కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, 18న టీడీపీ ఈఓ శ్యామలారావును విచారించిన సంగతి తెలిసిందే. నెల రోజులుగా జ్యుడీషియల్ చైర్మన్ నేతృత్వంలో జోరుగా విచారణ సాగుతుంది. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా 44 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజులుగా రాష్ట్రంలో గాయపడిన వారితోపాటు వివిధ రాష్ట్రాల నుంచి తొక్కిసలాటలో గాయపడిన వారిని ఇప్పటికే విచారించారు. మరో రెండు రోజుల తర్వాత జనవరి 8న డ్యూటీలో ఉన్న ఉద్యోగులను విచారణ చేపట్టనున్నారు. అలాగే బైరాగిపట్టెడలోని శ్రీపద్మావతి పార్క్ సమీప ప్రాంతంలో దుకాణాలు నిర్వహిస్తున్న వారిని విచారించనున్నారు. తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య తిరుపతి రూరల్: నగర శివార్లలో గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం పంచాయతీలో ఉన్న ఓ హోటల్ సమీపంలోని ఖాళీ స్థలంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హత్యకు గురైన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్యకు గురైన వ్యక్తి ఆనవాళ్లు కనిపించకుండా చేయడానికి దుండగులు ముఖం, కాళ్లు, చేతులు, పొట్ట భాగంలో యాసిడ్ పోయడంతో అంతా కాలిపోయింది. దీంతో డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు చేసింది. అలాగే వేలి ముద్రల నిపుణులు సైతం అక్కడకు చేరుకుని మృతదేహం వేలి ముద్రలు సేకరించారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఏఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ఫ్రీ బస్సు ‘బాబూ’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్కు గుర్తుచేశారు. ప్రయాణికులకు టికెట్లు కొట్టుకుంటూ వచ్చిన కండక్టర్.. మహిళలను కూడా టికెట్ అడిగారు. ఈ సందర్భంగా వారు.. ‘చంద్రబాబు చెప్పారు. బస్సులో ప్రయాణం ఉచితమని. టికెట్ అడిగితే చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పమన్నారు’ అని సమాధానమిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. అదేవిధంగా చంద్రబాబు వేషధారణలో ఓ వ్యక్తి కండక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ‘‘నేను చెబుతున్నాను.. నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చెయ్యవచ్చు’’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్.. బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేశారు. దీంతో కండక్టర్, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కండక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు డ్రైవర్ బస్సును నేరుగా ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్కు తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేశారు. వీరికి వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ నగర, మహిళా విభాగం అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, గీతాయాదవ్ సంఘీభావం తెలిపారు. -
నేడు సంస్కృత వర్సిటీ స్నాతకోత్సవం
తిరుపతి సిటీ : తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గురువారం జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. సంస్కృత భాషను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా జాతీయ సంస్కృత వర్సిటీ పనిచేస్తోందన్నారు. స్నాతకోత్సవంలో ఆచార్య ఎంఏ, ఎమ్మెస్సీ, బీఏ, బీఎస్సీ, యోగాథెరపిలో 546 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే 75 మందికి పీహెచ్డీ, 42 మందికి బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్టు వివరించారు. సంస్కృత భాషను నేర్పించేందుకు బాల వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2,242 మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను అందించనున్నట్టు తెలిపారు. స్నాతకోత్సవానికి మాజీ చాన్సలర్, ఆర్థిక వేత్త, పద్మశ్రీ డాక్టర్ వీఆర్ పంచముఖి, ఎన్ఎస్యూ చాన్సలర్ పద్మభూషణ్ గోపాలస్వామి హాజరవుతారని తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సాంబశివమూర్తి, ఓఎస్డీ రఘునందన్, పీఆర్ఓ ప్రొఫెసర్ రమేష్, ఏపీఆర్ఓలు డాక్టర్ కే కుమార్, బల్టీదాస్, డాక్టర్ నందనరావు పాల్గొన్నారు. -
ముగిసిన వేద సమ్మేళనం
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విజ్ఞాన ప్రతిష్ఠాన్ ఉజ్జయినీ సంయుక్తంగా మూడు రోజులుగా వర్సిటీలో నిర్వహిస్తున్న వేద సమ్మేళనం బుధవారం ముగిసింది. వేద సమ్మేళనానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వేద పండితులు 100 మందికి పైగా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా కంచి శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి మహా విశ్వవిద్యాలయం కులపతులు జీ. శ్రీనివాస శర్మ, సాందీపని వేద విజ్ఞాన పీఠం సచివులు డాక్టర్ విరూపాక్ష జెడ్డిపాల్ ప్రసంగించారు. వేదాలు భారతీయ సంస్కృతికి మూలాలని, వాటిని కాపాడుకోవడానికి సాంకేతిక విద్యను అభ్యసించాలన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,000 విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని, ఈ సంఖ్యను 1,11,000 పెంచి వేద పండితులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వర్సిటీ అధికారులు అతిథులను సత్కరించారు. సమ్మేళనంలో వీసీ రాణి సదాశివమూర్తి, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి, రిజిస్ట్రార్ పి భాస్కరుడు, సంచాలకులు డాక్టర్ తారకరామశర్మ, డీన్ సుబ్రమణ్యశర్మ, గణేష్ భట్, పురుషోత్తమాచార్యులు, ఆచార్య రాఘవన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సాఫ్ట్ స్కిల్స్పై అవగాహన
తిరుపతి సిటీ : ఎస్వీయూ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో కామర్స్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు బుధవారం సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత, పరిశోధన కోసం ఫెలోషిప్స్ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ పీవీ నరసయ్య మాట్లాడుతూ స్కిల్స్ డెవలప్మెంట్, పరిశోధనలో మెళకువలను వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళీధర్, డాక్టర్ కళ్యాణ్ కుమార్, డాక్టర్ వివేక్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముగిసిన అంతర్జాతీయ వర్క్షాపు తిరుపతి సిటీ:తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో శ్రీహర్ష ఖండన ఖండ ఖాద్య గ్రంథ అధ్యయనంపై 10 రోజుల అంతర్జాతీయ వర్క్షాప్ బుధవారం ముగిసింది. ఈ వర్క్షాప్లో పాత గురుకుల శైలిలో బోధన, చింతనం, అనువాదం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముగింపు కార్యక్రమంలో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ప్రత్యేక అతిథి ఆచార్య మణి ద్రావిడ శాస్త్రి, అధ్యాపకులు మాట్లాడారు. ఇంటర్న్షిప్ కోసం అవగాహన ఒప్పందం తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో బుధవారం విద్యార్థుల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం జగతి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జగతి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జె.వాసుదేవ నాయుడు, బి.సులోచనరాణి, పి.చంద్రయ్య, సృజన పాల్గొని ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ప్రొపర్టీ రైట్స్పై అవగాహన తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఎం.ఉషారాణి, కె.చందనశ్రీ ఆధ్వర్యంలో బుధవారం ప్రొటెక్టింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఐపీ మేనేజ్మెంట్ ఫర్ స్టార్టప్స్పై సెమినార్ నిర్వహించారు. ఇందులో రిసోర్స్పర్సన్గా విక్రమ సింహపురి వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కోటా నీలమణికంఠ పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రాపర్టీ రైట్స్, ట్రెడ్ మార్క్స్, పేటెంట్స్ అండ్ పబ్లికేషన్స్ అనే అంశాలపై అవగాహన కల్పించారు. -
తవ్వేస్తూ.. తరలిస్తూ!
తిరుపతి రూరల్: మండలంలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. తవ్వుకున్నోళ్లకు.. తవ్వుకున్నంత అన్నట్టు యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా స్వర్ణముఖి నది నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ..తరలిస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లతో చైన్నె, బెంగుళూరుకు రవాణా చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. టీడీపీ నేతల అండతోనే ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని స్థానికులు, తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నిత్యం వందల టన్నులు ప్రధానంగా దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లి, చిగురు వాడ, కేసీపేట, తణపల్లి, కుంట్రపాకం, తిరుచానూరు ప్రాంతాల్లో స్వర్ణముఖి నదిని యధేచ్చగా తవ్వేస్తున్నారు. నిత్యం వందల టన్నుల ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు. అక్రమార్కుల ఆగడాలతో రాత్రివేళ పొలం వద్దకు వెళ్లేందుకు సైతం రైతుల వణికిపోతున్నారు. నదిలో యంత్రాల సాయంతో లోతుగా తవ్వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని వాపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా టీడీపీ నేతల అండతో అక్రమార్కుల దందాపట్టించుకోని అధికారులు స్వర్ణముఖిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో జోరుతూ అక్రమార్కులకు సహకారం అందిస్తున్నారని విమర్శిస్తున్నారు. సాక్షాత్తు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేసినా బేఖాతర్ చేస్తున్నారని మండిపడుతున్నారు. -
మహిళలకు డిజిటల్ భద్రతపై వర్క్షాపు
తిరుపతి సిటీ : ఎస్వీయూ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు సాంకేతికత, డిజిటల్ భద్రతలో రక్షణ, నివారణ చర్యలు అనే అంశంపై ఒక్కరోజు వర్క్షాపు నిర్వహించారు. వర్సిటీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షురాలు ఆచార్య సుధారాణి మాట్లాడుతూ సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మహిళలు యాప్ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కెమెరాలున్న సాంకేతిక వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విభాగాధిపతి ఆచార్య సాయి సుజాత, విద్యార్థినులు, మహిళా పరిశోధకులు పాల్గొన్నారు. -
వేట మొదలైంది!
● డిప్యూటీ మేయర్ ఎన్నికలో హింసపై విచారణ ● 14 మంది కూటమి నేతలకు నోటీసులు ● నిందితులను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం? తిరుపతి తుడా : తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో జరిగిన హింస, కిడ్నాప్ వ్యవహారంలో విచారణ మొదలైంది. ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈమేరకు నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని డీజీపీకి స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో బుధవారం విచారణ ప్రారంభించారు. ముందుగా అల్లర్లలో పాల్గొన్న 14 మంది టీడీపీ, జనసేన నేతలకు నోటీసులు జారీ చేశారు. దీంతో నాడు అల్లర్లకు పాల్పడిన కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. అల్లరిమూకలపై చర్యలు! డిప్యూటీ మేయర్ ఎన్నికను కూటమి నేతలు అపహస్యం చేశారు. అధికారం అండతో అరాచకం సృష్టించారు. మహిళా కార్పొరేటర్లను కూడా బండ బూతులు తిట్టి పైశాచికానందం పొందారు. దళిత ఎంపీ గురుమూర్తితో దురుసుగా ప్రవర్తించారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకోకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. దీనిపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. మానవ హక్కుల ఉల్లంఘన, దళిత ప్రజా ప్రతినిధుల హక్కులకు భంగం కలిగించడం వంటి అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని పక్కల నుంచి కూటమి నేతల హింసాత్మక ధోరణి విచారణ మొదలైంది. దాడులు, కిడ్నాప్లకు పాల్పడిన వారిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే అల్లరి మూకలను స్పష్టంగా గుర్తించేలా వైఎస్సార్సీపీ సైతం ఆధారాలను సేకరించింది. దీంతో నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విచారణ అనంతరం అల్లరి మూకలను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లకు బెదిరింపులు విచారణ ప్రక్రియ మొదలవడంతో కొంతమంది టీడీపీ, జనసేన నేతలు కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. తమపై దాడి చేయలేదని, తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని విచారణలో చెప్పాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఓ కార్పొరేటర్ మీడియాకు తెలిపారు. మీ భవనాలను కూల్చేస్తాం, భవిష్యత్తులో కేసులు పెడతామంటూ హెచ్చరించడాన్ని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింస, కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎంపీ గురుమూర్తి తెలిపారు. నాడు విధుల్లో ఉన్న పోలీసు అధికారుల జాబితాతో పాటు అల్లరిముకల హింస ఘటనలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు, పేపర్ క్లిప్పింగులను ఇప్పటికే కేంద్ర హోంశాఖ, మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించినటర్ల వెల్లడించారు. ఎఈ విచారణలో పోలీసులు నిష్పక్షపాతంగాా వ్యవహరించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను గుర్తించాలన్నారు. ఆ ప్రకారం సమగ్ర నివేదికను అందించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని తెలిపారు. విచారణలో పక్షపాతం చూపితే చట్టపరంగా మరింత ముందుకు వెళతామని హెచ్చరించారు. అవసరమైతే సీబీఐ ఎంకై ్వరీ కోరేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మహిళా కమిషన్కు ఫిర్యాదు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతలు వ్యవహరించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్కు మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులను సంప్రదించారు. ఓటు వేసేందుకు వస్తున్న క్రమంలో తమతో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని వెల్లడిస్తున్నారు. నగర మేయర్తో కూడా దురుసుగా ప్రవర్తించారని వివరిస్తున్నారు. ‘‘ఏయ్ మేయర్నే ఎత్తుకెళ్లిపోతే సరిపోదా’’ అంటూ కేకలు వేశారని ప్రస్తావిస్తున్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన అంగన్వాడీ కార్యకర్త
● ఈనెల 10న విజయవాడలో శ్రీవాణికి బ్రెయిన్ స్ట్రోక్ ● చికిత్స పొందుతూ బుధవారం మృతి నాగలాపురం: పిచ్చాటూరుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త శ్రీవాణి మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఆమె కన్నుమూశారు. వివరాలు.. ఈ నెల 10 వ తేదీ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ధర్నా నిమిత్తం పిచ్చాటూరుకు చెందిన శ్రీవాణి విజయవాడకు వెళ్లారు. అక్కడ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళుతుండగా ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆస్పత్రి పాలయ్యారు. కొన్నాళ్లు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత తిరుపతి స్విమ్స్కు తరలించి వెంటిలేటర్పై చికిత్స పదిరోజులుగా శ్రీవాణి శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఆమె మరణించినట్లు బుధవారం మధ్యాహ్నం డాక్టర్లు ప్రకటించారు. ఆమె మృతికి సహచర అంగన్వాడీ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గేట్లో ఎస్వీయూ విద్యార్థినికి 78వ ర్యాంకు తిరుపతి సిటీ : దేశ వ్యాప్తంగా బుధవారం విడుదల చేసిన గేట్ ఫలితాల్లో ఎస్వీయూ ఫిజిక్స్ విభాగానికి చెందిన పీజీ విద్యార్థిని బి.కీర్తి జాతీయ స్థాయిలో 78వ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె వర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్లో పొటానిక్స్ ప్రత్యేక అంశంగా అధ్యయనం చేశారు. ప్రొఫెసర్ బి.దేవప్రసాద్ రాజు ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. గేట్ పరీక్షల్లో ర్యాంకు పొందడం ద్వారా జాతీయ స్థాయి యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం దక్కింది. ఆమె అధ్యాపకులు, అధికారులు అభినందించారు. స్థూల ఆర్థిక విశ్లేషణపై అవగాహన సదస్సు తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం, న్యాయశాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో బుధవారం నిత్య జీవితంలో స్థూల ఆర్థిక విశ్లేషణ సూచికలు, ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హరిసింగ్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట మునిరెడ్డి ( మధ్యప్రదేశ్) ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో స్థూల ఆర్థిక సూచికలైన స్థూల జాతీయోత్పత్తి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, వడ్డీ రేటు, గత ఐదేళ్లలో చోటుచేసుకున్న మార్పులను విశ్లేషించారు. అలాగే వినియోగదారుల విశ్వాస సూచిక, మాన్యుఫ్యాక్చరింగ్ సూచికను ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ మాధురి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎంబీయూ వార్షికోత్సవం
చంద్రగిరి : శ్రీసాయినాథనగర్లోని మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) 33వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సినీనటులు శరత్కుమార్, ప్రభుదేవా హాజరయ్యారు. నాగఫణిశర్మ మాట్లాడుతూ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం నెలకొల్పడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రాయలసీమలో ఇంత గొప్ప విద్యాలయం నిర్వహిస్తున్న మోహన్బాబు ఆదర్శనీయులని కొనియాడారు. కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ మోహన్బాబు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత యువతకు ఉందని పిలుపునిచ్చారు. శరత్కుమార్ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా ఎంబీయూ నిలుస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను మోహన్బాబు చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. అందరి వాడిని : మోహన్బాబు కులపతి అంటే ఏ కులానికి అధిపతి అని అనుకునే పరిస్థితి నేడు ఉందని మోహన్ బాబు తెలిపారు. తాను ఏ కులానికి చెందిన వాడిన కానని, అందరి వాడినంటూ వెల్లడించారు. అన్ని పార్టీలు నాకు కావాల్సినవే అని వివరించారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వారు ఎవరూ ఉన్నతస్థాయికి వెళ్లలేరని తెలిపారు. మైఖేల్ జాక్సన్ తర్వాత ప్రపంచంలోనే ఉత్తమ డ్యాన్సర్ ప్రభుదేవా అని ప్రశంసించారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన ప్రభుదేవాతో కలసి డ్యాన్స్ చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. -
కండలేరుకు చైన్నె బృందం
రాపూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయాన్ని చైన్నె మెట్రో వాటర్ బృందం బుధవారం సందర్శించింది. ఈ మేరకు అధికారులతో సమావేశం నిర్వహించింది. చైన్నె నగరవాసుల దాహార్తి తీర్చేందుకు కండలేరు జలాలను ఏప్రిల్ నుంచి విడుదల చేయాలని కోరింది. సమావేశంలో ఎస్ఈ రాధాకృష్ణారెడ్డి, చైన్నె మెట్రో వాటర్ సీఈ జానకి, ఎస్సీ మహేష్ నాగార్జున్, ఈఈ తిలైకరాసి, ఏఈలు రాజా, భరత్, తెలుగుగంగ ఈఈ విజయకుమార్రెడ్డి, డీఈ విజయరామిరెడ్డి, ఏఈ తిరుమలయ్య, అనిల్, శ్రీనివాసరావు, అనిల్బాబు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధికి కృషి
తిరుపతి అర్బన్ : పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో టూరిజం, ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతి జూపార్క్, కల్యాణి డ్యామ్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రధానంగా పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులను ఆకట్టుకునేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆ దిశగా హస్త కళాకారులు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలని చెప్పారు. ఎకో టూరిజం ప్రమోషన్ కోసం హబ్ అండ్ స్పోక్స్ మోడల్ పద్ధతిలో హ్యాండీక్రాఫ్ట్స్ మెన్ తదితరులకు జీవనోపాధి కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలని స్పష్టం చేశారు. సూచించారు. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. సమావేశంలో పర్యాటక శాఖ ఆర్డీఎఫ్ రమణ ప్రసాద్ పాల్గొన్నారు. అంగన్వాడీ.. ఒంటిపూట బడి తిరుపతి అర్బన్ : అంగన్వాడీ స్కూళ్లను ఒంటిపూట నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ వసంతాబాయి ఆదేశించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మే 31 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వేసవి నేపథ్యంలో టీచర్లు, హెల్పర్లు అందుబాటులో ఉంటూ పిల్లలకు తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. 25న ప్రసన్నుడి కల్యాణోత్సవం తిరుపతి కల్చరల్ : అప్పలాయిగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 25వ తేదీన స్వామివారి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెలా శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఉదంపతులు రూ.300లు చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. -
రొయ్యల సాగు కష్టం
నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వాడిని. గత ఏడాది ఉద్యోగం వదిలి సొంతంగా నా భూమితోపాటు కొంత కౌలుకు తీసుకుని రొయ్యలు సాగు చేపట్టా. తీరా పట్టుబడి వచ్చే సమయానికి రోజూ కౌంటు మీద రూ.10 తగ్గించేస్తున్నారు. దీని వల్ల రూ.లక్షల్లో నష్టం వచ్చింది. రొయ్యల సాగుకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న ధరలను కూడా అదుపు చేయలేకపోయింది. ఒక్క నెలలోనే కౌంటుకు రూ.50 వరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో రొయ్యల సాగు కష్టంగా మారింది. – సన్నారెడ్డి విజయులురెడ్డి, ఆక్వా రైతు, శింగనలత్తూరు, చిట్టమూరు మండలం ఖర్చులు పెరిగిపోయాయి నాకు ఏడు గేదెలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పాలను ప్రైవేట్ డెయిరీకి విక్రయించి కుటుంబానికి అండగా ఉంటున్నా. గత ఏడాది వేసవిలో లీటరు పాలకు రూ.70 వరకు వచ్చేది. ఈ ఏడాది సరాసరి రూ.60లకు తగ్గించేశారు. వెన్నశాతం తగ్గిపోయిందని సాకులు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గేదెలకు పచ్చి మేత, ఎండుగడ్డి, దాణాల ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి, వీటిని భరించడం కష్టంగా ఉంది. దీంతో చాలామంది పాడి రైతులు చేసేదిలేక గేదెలను అమ్మేస్తున్నారు. – మస్తానమ్మ, పాడి రైతు, చిట్టమూరు ఫలితం లేదు నాకు రెండు ఎకరాల పొలం ఉంది. అందులో ఏటా పుచ్చ సాగు చేపడుతుంటా. ఈ ఏడాది కూడా ధరలు బాగా ఉంటాయని పుచ్చ సాగు చేశా. ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి కింద ఖర్చు పెట్టా. దిగుబడి బాగానే వచ్చింది. కష్టాలు తీరిపోతాయిలే అనుకుంటే కాయలకు రేటు తగ్గిపోయింది. మార్కెట్లో కేజీ రూ.10లకు అడుగుతున్నారు. గత ఏడాది రూ.15 పలకడంతో ఆదాయం వచ్చింది. ఇప్పుడు కష్టమే మిగిలింది. ఫలితం లేకుండా పోయింది. – పోలిచెర్ల రమణమ్మ, పుచ్చరైతు, ఏరూరు, చిల్లకూరు మండలం -
సూపర్సిక్స్ మోసంపై వైఎస్సార్సీపీ వినూత్న నిరసన
● ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మహిళల యత్నం ● నిర్ధాక్షిణ్యంగా లాగి పడేసిన పోలీసులు ● కేసులు నమోదు చేసి వేధింపులునినాదాలు చేస్తున్న అభినయ్, నేతలుతిరుపతి మంగళం : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వైఎస్సార్సీపీ మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి వెంటనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బస్సులో ఎక్కి గతంలో చంద్రబాబు ఉపన్యాసాల వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మేయర్ శిరీష మాట్లాడుతూ కేవలం అధికార దాహంతో నోటికి వచ్చిన అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన లేదా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణమని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మహిళలు బస్సులో ఎక్కితే పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, నిర్ధాక్షిణ్యంగా కిందకు లాగేశారని మండిపడ్డారు. ఆడబిడ్డలను దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి వందనం. ఉచిత బస్సు ప్రయాణమంటూ సీ్త్రలను వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ మహిళలపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వాసుయాదవ్, డైరెక్టర్ కడపగుంట అమరనాథరెడ్డి, కార్పొరేటర్లు తమ్ముడు గణేష్, పునీతమ్మ, నేతలు ఉదయ్వంశీ, దినేష్రాయల్, మద్దాలి శేఖర్, అనిల్రెడ్డి, వెంకటేష్రాయల్, ఇమ్రాన్బాషా, సోమశేఖర్రెడ్డి, పసుపులేటి సురేష్, మల్లం రవి, అరుణ్యాదవ్, గీతాయాదవ్, మధుబాల, పద్మజ, విజయలక్ష్మి, సాయికుమారి, దుర్గ, లక్ష్మి పాల్గొన్నారు.ఇదే చంద్రబాబు నైజంవైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబు నైజమన్నారు. బస్సులో ఉచిత ప్రయాణం అనగానే ఎంతో ఆశతో ఓట్లు వేసి గెలిపించిన మహిళలను ఇప్పుడు అదే బస్సు నుంచి కిందికి లాగి పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వాలని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడమేనా పాలన అంటే అని ప్రశ్నించారు. జగనన్న ఐదేళ్ల పాలనలో కులమతాలు, పార్టీలకు అతీతంగా ఇచ్చిన హామీల కంటే ఎక్కువే అమలు చేశారని కొనియాడారు. సంక్షేమ పథకాల రూపంలో రూ. 3లక్షల కోట్లను పేదలకు అందించారని వెల్లడించారు. -
ఆత్మ‘గౌరవ’ం కోసమే సమ్మె
తిరుపతి సిటీ : న్యాయమైన డిమాండ్లతో 45 రోజులుగా సమ్మె చేస్తుంటే అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు మండిపడ్డారు. బుధవారం వారు మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసమే సమ్మెకు దిగినట్టు వెల్లడించారు. యూజీ విద్యార్థులకు రూ.10,500, పీజీ విద్యార్థులకు రూ.13,500, పీహెచ్డీ వారికి రూ.15వేలకు స్టయిఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం తమకు సమ్మతం కాదన్నారు. వైద్యరంగంలోని అన్ని విభాగాల్లో విద్యార్థులతో సమానంగా గౌరవ వేతనం అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓను వెనక్కుతీసుకోవాలని కోరారు. లక్ష్యం నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. -
యువత.. ఇదిగో భవిత!
తిరుపతి సిటీ : చంద్రబాబు సర్కార్ యువతను నట్టేట ముంచింది. నిరుద్యోగ భృతి లేదు.. జాబ్ క్యాలెండర్ మాటే మరిచింది.. ఏడాదిగా ఉద్యోగాల ఊసేలేదు. దీంతో ఏ చిన్న అవకాశం వచ్చినా యువత ఉపయోగించుకునేందుకు ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా యూజీ పట్టభద్రులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అందులో భాగంగా శ్రీపీఎం ఇంటర్న్షిప్–2025శ్రీ ప్రవేశ పెట్టింది. సాంప్రదాయ కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన నిరుపేద అభ్యర్థులకు ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ కింద శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు ఈ నెల 31వ తేదీలోపు pminternrhip.mca.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి దాదాపు లక్ష మందికి అర్హత ఉన్నట్లు గుర్తించింది. పకడ్బందీ శిక్షణ పీఎం ఇంటర్న్షిప్ పథకంలో విద్యార్థులకు ఏడాది పాటు పరిశ్రమలలో పకడ్బందీ శిక్షణ అందించనున్నారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.5వేల స్టయిఫండ్ను నేరుగా అభ్యర్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందిస్తారు. ఉపాధి, ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూల సమయంలో ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఉపయోకరంగా ఉంటుంది. విద్యార్థులకు వరం.. పీఎం ఇంటర్న్షిప్ నెలకు రూ.5వేల స్టయిఫండ్తో ఏడాదిపాటు శిక్షణ దరఖాస్తుకు ఈనెల 31 తుది గడువు జిల్లాలో లక్ష మందికి అవకాశం పథకానికి అర్హతలు ఇవీ.. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తి చేయడం బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత గుర్తింపు పొందిన వర్సిటీలు, విద్యాసంస్థల నుంచి రెగ్యులర్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి 21 ఏళ్ల నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలి. -
భూముల రీసర్వే తనిఖీ
తిరుపతి రూరల్:మండలంలోని సి.గొల్లపల్లె వద్ద నిర్వహిస్తున్న భూముల రీ సర్వేను ఏపీ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.గోవిందరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల సహకారం, కొత్తగా తయారు చేసిన సర్వే రికార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సి.గొల్లపల్లి రెవెన్యూ లెక్క దాఖలాలో ఎంత మేరకు భూముల రీసర్వే పూర్తి చేశారు, రైతులు నుంచి వస్తున్న సలహాలను ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్తో పాటు తహసీల్దార్ రామాంజులు నాయక్ పాల్గొన్నారు. -
● పంటలకు దక్కని గిట్టుబాటు ● పెట్టుబడి కూడా ప్రశ్నార్థకం ● పట్టించుకోని ప్రభుత్వం ● ఆందోళనలో రైతాంగం
●ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం నేను ఎకరా పొలంలో మిర్చి సాగు చేశా. మొదట్లో ధరలు బాగా ఉండడంతో ఆదాయం బాగా వస్తుందని అనుకున్నా. దీంతో ఎకరాకు రూ.2లక్షల వరకు ఖర్చు చేశా. దిగుబడి వచ్చే సమయానికి మిర్చి ధరలు పతానావస్థకు చేరుకున్నాయి. గత ఏడాది టన్ను మిర్చి రూ.30వేల వరకు పలికింది.ప్రస్తుతం టన్ను రూ.15వేలు మాత్రమే ఉంది. ధరలు సగానికి పైగా పడిపోవడంతో ఎకరాకు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. మార్కెట్లో మాత్రం మిర్చి ధర ఆకాశాన్నంటుతోంది. మాకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం. – రమణయ్య, మిర్చి రైతు, తిన్నెలపూడి, కోట మండలం -
ప్చ్.. చంద్రబాబు పేరు చెప్పినా వినలేదు!
తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చంద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది. బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్ మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో.. ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు. అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండిదీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్ డాక్టర్ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం. -
జూడాల వినూత్న నిరసన
తిరుపతి సిటీ: ఎస్వీ వెటర్నరీ కళాశాలలో గౌరవ వేతనం పెంచాలంటూ గత 44 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యార్థులు మంగళవారం వినూత్న నిరసనలతో హోరెత్తించారు. వెటర్నరీ రంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో కూడిన గణాంకాలను ప్రదరిస్తూ ముఖాలకు మాస్కులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పశువైద్య విభాగం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్లు ఆదాయం సమకూరుతున్నా, వైద్య విద్యార్థుల న్యాయపరమైన డిమాండును పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు వర్సిటీ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా తమ సమస్యను పరిష్కరించ డం లేదని వాపోయారు. సమస్య పరిష్కారమ య్యే వరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు. -
చౌక..
పేదల ఆకలి తీర్చాల్సిన ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది. రూపుమార్చుకుని బహిరంగ మార్కెట్ల్లోకి అడుగుపెడుతోంది. ఇందుకు తొలుత గోడౌన్లలోనే బీజం పడుతోంది. ఆ తరువాత చౌక దుకాణాలూ అడ్డాగా మారుతున్నాయి. కార్డుదారులు సైతం ఉచిత దొడ్డు బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కిలోల్లో కొనుగోళ్లు చేసి.. టన్నుల కొద్దీ పొరుగు రాష్ట్రాలకు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరి కొందరు స్థానికంగా మిల్లులో పాలిష్ పట్టి నాణ్యమైన బియ్యం పేరుతో విక్రయించి, వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఇలా చౌక బియ్యంతో చక్కనైన వ్యాపారం సాగిస్తూ.. జేబులు నింపుకుంటోంది రేషన్ మాఫియా. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాత్రం రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడం లేదు. తూకాల్లో నొక్కుడు ● రాష్ట్రాలు దాటుతున్న రేషన్ ● ఇటు తమిళనాడుకు..అటు కర్ణాటకకు ● బస్తాకు కిలో బియ్యం తగ్గింపు ● 3,340 బస్తాలు నెలకు మిగులు జిల్లా పౌరసరఫరాల సమాచారం రేషన్దుకాణాల సంఖ్య 1,457 కార్డుదారుల సంఖ్య 6.03 లక్షలు ప్రతినెలా పంపిణీ చేసే బియ్యం 8350 మెట్రిక్ టన్నులు ఎండీయూ వాహనాలు సంఖ్య 369 అందుబాటులో ఉండే ఎండీయూ వాహనాలు 190 అఽధికారులు మాత్రం 70 మినహా మిగిలిన వాహనాలు వాడుకలో ఉన్నాయని చెబుతున్నారు.గోడౌన్ల నుంచి తగ్గింపు లేదు గోడౌన్ల నుంచి డీలర్లు బియ్యం తగ్గించడం లేదు. వారికి ఎంత మోతాదులో బియ్యం ఇవ్వాలో అ లెక్క ప్రకారమే పంపుతున్నాం. కొందరు డీలర్లు అనుమానం ఉంటే సమీపంలోని ఏ మెంట్ వద్ద తూకాలు వేసుకుంటున్నారు. ఏమైనా బియ్యం తక్కువ వస్తే వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు రైస్ మిల్లర్లకు కచ్చితంగా ఆదేశాలు ఇచ్చాం. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదా పాలిష్ పట్టడం చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాం. – వై.సుమతి, జిల్లా సివిల్ సప్లయి మేనేజర్ డీలర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం రేషన్ డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. తూకాల్లో 100 గ్రామాలు తక్కువ ఉన్నా చర్యలు తీసుకుంటామని చెప్పాం. మరోవైపు కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటాం. అలాగే అవసరం లేకుంటే కార్డుదారులు బియ్యం కొనుగోలు చేయకుండా ఉండాలి. అంతే తప్ప తమ బియ్యాన్ని డీలర్కు లేదా ఇతరులకు విక్రయించడం సరికాదు. అంతేకాకుండా బియ్యం వ్యాపారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఏదైనా సమాచారం వస్తే వెంటనే బియ్యం స్టాక్ చేసిన ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాం. ఉచితంగా రేషన్ దుకాణాల నుంచి ఇస్తున్న బియ్యాన్ని దుర్వినియోగం చేయరాదని అవగాహన కల్పిస్తున్నాం. – శేషాచలం రాజు, జిల్లా సివిల్ సప్లయి అధికారి తిరుపతి అర్బన్: చౌకదుకాణాల రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు చైన్నెపోర్టుకు తరలిస్తున్నారు. మరి కొందరు కర్ణాటకకు, ఇంకొందరు స్థానికంగా రైస్మిల్లర్లకు తరలిస్తున్నట్లు చర్చసాగుతుంది. రేషన్ దుకాణాల్లో బియ్యం కార్డుదారులకు ఉచితంగా ఇస్తున్నారు. పలువురు డీలర్లు కిలో బియ్యానికి రూ.15 కార్డుదారుడికి చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులకు కిలో రూ.25 నుంచి 27 వరకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని చైన్నెలోని రెడ్హిల్స్ ప్రాంతానికి చెందిన వ్యాపారులకు కిలో రూ. 33 నుంచి రూ.35కు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత శ్రీలంక, ఇండోనేషియా తదితర దేశాలకు రేషన్ బియ్యాన్ని ఎంచెక్కా తరలిస్తున్నారు. కొందరు ఇలా వ్యాపారం చేయడమే వృత్తిగా మార్చుకున్నారు. దీంతో ఉచిత రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. ప్రతి నెల 25 శాతం బియ్యం వ్యాపారం వైపు వెళుతున్నట్లు అధికారులు లెక్కలు కడుతున్నారు. రేషన్ బియ్యం రాయితీతో ఇలా.. కిలో బియ్యం రూ.30 నుంచి రూ.35 సర్కార్ కొనుగోలు చేస్తోంది. అయితే పేదోళ్లు మూడు పూటల భోజనం చేయడానికి కేంద్ర సర్కార్ 2023 నుంచి 2028 వరకు ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు మనిషికి 5 కిలోల చొప్పున రేషన్కార్డులో ఎంత మంది సభ్యులుంటే అన్ని 5 కిలోల వంతున అందిస్తోంది. అలాగే అంత్యోదయ కార్డులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణకార్డులకు 10 కేజీల బియ్యం చొప్పున ప్రతి నెలా అందిస్తోంది. అయితే ఆ రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు రాష్ట్రాలను దాటిస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు బియ్యాన్ని తరలిస్తూ పేదోళ్ల పొట్టకొడుతున్నారు. చిలక్కొట్టుడిలా.. బస్తాకు కేజీ బియ్యం తగ్గింపు నెలకు 8,350 మెట్రిక్ టన్నులు బియ్యం నెలకు 1.67 లక్షల 50 కిలోల బస్తాలు 3,340 బస్తాలు మిగులు దందా ఎలాగంటే.. రేషన్ దందా ఎలా సాగుతుందంటే.. గోడౌన్ల నుంచి 50 కిలోల బస్తాలను డీలర్లకు పంపుతారు. ఒక్క బస్తా నుంచి ఒక కేజీని తగ్గించి ఇచ్చేస్తున్నారని చర్చ సాగుతుంది. జిల్లాలోని 17 గోడౌన్ల నుంచి ప్రతి నెలా సుమారుగా 8,350 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,457 మంది డీలర్లు పంపిణీ చేస్తున్నారు. 8,350 మెట్రిక్ టన్నులు అంటే 50 కిలోల బస్తాలు 1.67 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. బస్తాకు కిలో చొప్పున కొట్టేస్తే నెలకు 3,340 బస్తాలు మిగులు ఉంటుంది. ఈ బియ్యంతోనే వ్యాపారం సాగుతుందని చర్చ సాగుతుంది. మరోవైపు డీలర్లు కార్డుదారులకు ఇచ్చే బియ్యంలోనూ తగ్గింపు ఉంది. ఆ బియ్యంతో వ్యాపారం సాగుతోంది. ఇంకోవైపు 20 శాతం మంది కార్డుదారులు డీలర్ వద్ద బయోమెట్రిక్ వేసిన తర్వాత కిలో రూపాయి వంతున రూ.15 చొప్పున డీలర్కు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ బియ్యంతోనే వ్యాపారం సాగుతుంది. గోడౌన్లో కొంత.. డీలర్లు మరికొంత నొక్కేస్తున్నారు పారదర్శకంగా బియ్యం తూకాలు జరగడం లేదని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. గోడౌన్ల నుంచి తమకు వచ్చే సమయంలో బస్తాకు కిలో నుంచి రెండు కిలోల బియ్యం తగ్గిపోతున్నాయని పలువురు డీలర్లు వాపోతున్నారు. అయితే అదే పద్ధతిని వారూ పాటిస్తున్నారు. కార్డుదారులకు ఇచ్చే సమయంలో తూకాల్లో మోసాలు చేస్తున్నారు. ఉదాహరణకు 30 కిలోలు ఇవ్వాల్సిన కార్డుదారునికి 29 కేజీలనే ఇస్తున్నారు. దీనిపై కార్డుదారులు గట్టిగా డీలర్ను ప్రశ్నిస్తే, తమకు గోడౌన్ల నుంచి తూకాల్లో తక్కువగా ఇస్తున్నారంటూ వారిపై నెట్టేస్తున్నారు. పట్టుబడిన బియ్యం వేలం ద్వారా విక్రయాలు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన బియ్యాన్ని ఆయా గోడౌన్లలో నిల్వ చేసి, తర్వాత ఏడాదికి ఒక్కసారి ఆ బియ్యాన్ని వేలం వేస్తున్నారు. పట్టుబడి స్టాక్ ఉన్న రెండు లక్షల టన్నుల బియ్యాన్ని గత ఏడాది వేలం పాట ద్వారా విక్రయించారు. అధికారులు అక్రమంగా తరలిపోతున్న బియ్యంపై పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలా ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగుతుందని అంతా చర్చించుకుంటున్నారు. -
మైక్రో ఇరిగేషన్ పురోగతిపై చర్యలేంటి?
తిరుపతి మంగళం : ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ అమలు, ఆ జిల్లాలో సాధించిన పురోగతి, లబ్ధిదారులు వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. ఈ విషయంపై మంగళవారం ఢిల్లీ పార్లమెంట్లో ఎంపీ ప్రశ్నించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015–16 నుంచి దేశవ్యాప్తంగా అమలులో ఉందని, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో–ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు. తిరుపతి జిల్లాలో 20,819 హెక్టార్లు మైక్రో–ఇరిగేషన్ కింద కవర్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు, వారికి అందిస్తున్న ఆర్థిక సహాయం వివరాలు వెల్లడిస్తూ సన్న, చిన్నకారు రైతులకు 55శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 45 శాతం సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంటులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి -
వడదెబ్బపై అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి తుడా: ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరో గ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాఇ మ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతకుమారి, డి ప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ రూప్కుమా ర్, జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ మధుబాబు, లావణ్య, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలోని క్యూకాంప్లెక్స్లో 25 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 70,824 మంది స్వామివారిని దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
భూసేకరణ వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆయన జేసీ శుభం బన్సల్తో కలసి వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పెండింగ్ పనులు పూర్తి చేయించే దిశగా ఆర్డీఓలు పర్యవేక్షించాలని చెప్పారు. సాగరమాల కింద చేపట్టనున్న 2, 3, 4 ప్యాకేజీ జా తీయ రహదారి పనులు జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, తిరుపతి, నెల్లూరు, చైన్నె నేషనల్ హైవ్ పీడీలు వెంకటేష్, ఎంకే చౌదరి, రవీంద్రరావు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, పలువురు తహశీల్దార్లు పాల్గొన్నారు. ఇక ఉదయం 9 నుంచే గ్రీవెన్స్ – మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ అమలు తిరుపతి అర్బన్: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9 కే ప్రారంభించి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 9 కే మొదలు పెట్టి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే సోమవారం నుంచి ఈ పద్ధతిలో ఉంటుందన్నా రు. జిల్లా కలెక్టరేట్లోనే కాకుండా డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద యం 9 గంటల నుంచే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. శతపథికి అవార్డు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ మా జీ వీసీ, ప్రస్తుతం ఐఐటీ భువనేశ్వర్లో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ హరేకృష్ణ శతపథికి శ్రీభాష్యం పార్ధసారథి రాష్ట్రీయ అవా ర్డు ప్రదానం చేశారు. మంగళవారం హైదరాబాద్ వేదికగా ఉస్మానియా వర్సిటీ సంస్కృత అకాడ మీ, సర్వ వైదిక సంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవా ర్డు అందుకున్నారు. సంస్కృత సాహిత్యం, భారతీయ సంస్కృతి, అకడమిక్ పరిపాలనలో విశేష సేవలు అందించినందుకు పురస్కారాన్ని అందజేశారు. -
భూ ఆక్రమణలపై ముమ్మర దర్యాప్తు
● రెవెన్యూ, అటవీశాఖ భూ రికార్డుల తనిఖీ ● రెవెన్యూ, అటవీశాఖ అధికారులను ఆదేశాలు ● బసవాయిగుంట, పూలరంగడుపల్లెలో పర్యటించిన సబ్కలెక్టర్ ● సాక్షి దినపత్రికలోని కథనాన్ని తహసీల్దార్తో చదివించిన సబ్కలెక్టర్ వెంకటగిరి రూరల్: అటవీ భూముల ఆక్రమణపై సబ్కలెక్టర్ సీరియస్ అయ్యారు. భూ ఆక్రమణలపై దర్యాప్తు చేపట్టారు. గ్రామసభలు నిర్వహించి నివేదికను సమర్పించాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలంలోని పూలరంగడుపల్లి, బసవాయిగుంట ప్రాంతాల్లో ఉన్న అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయని సాక్షి దినపత్రికలో శ్రీఆటవిక రాజ్యంశ్రీ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన మంగళవారం వెంకటగిరికి చేరుకుని తహసీల్దార్ రాంబాబు, అటవీశాఖ అధికారులతో కలిసి భూ ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించారు. సాక్షి దినపత్రికలో వచ్చిన ఫొటోలు ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. సాక్షి దినపత్రిలో ప్రచురితమైన కథనాన్ని చదివి వినిపించాలని తహసీల్దార్ రాంబాబుని ఆదేశించారు. ఆ కథనాన్ని తహసీల్దార్ చదివారు. ఈ మేరకు భూ ఆక్రమణలు ఎంత మేర జరిగాయి.. రెవెన్యూ, అటవీశాఖలకు సంబంధించిన భూమి ఎంత ఉండాలన్న అంశంపై అధికారులను అడిగి రికార్డులు పరిశీలించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కలిసి ఆయా గ్రామాల్లో పర్యటించి రికార్డుల ఆధారంగా తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. అలాగే గ్రామసభల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని తహసీల్దార్ రాంబాబు, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ విజయ్కుమార్ను ఆదేశించారు. సర్వేయర్ సుప్రజ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి పేట, చిన్నగొట్లగుంట, పెద్ద గొట్టగుంట ప్రాంతాల్లో రాఘవేంద్ర మీన పర్యటించి, భూవివాదాలపై చర్చించారు. రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం బసవాయిగుంట సర్వే నంబర్ 74లో ఆక్రమణలు జరిగాయని సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులు వద్ద టెన్వన్ అడంగల్, ఢీ పట్టాలు పరిశీలించి అధికారులకు ఆదేశించాం. ఈ ప్రాంతంలో కొంత మేర సీజేఎఫ్ఎస్ భూములు కూడా ఉన్నాయి. రికార్డులను పరిశీలించిన తరువాత తగు చర్యలు తీసుకుంటాం. –రాఘవేంద్రమీన, సబ్ కలెక్టర్ గూడూరు -
వీఆర్వోకు డబ్బులివ్వలేదనే కక్ష
గత ప్రభుత్వంలో దళారుల మాట నమ్మి వారికి కొంత డబ్బు ఇచ్చి ప్లాట్లు తీసుకున్నాం. వాటిలో ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పట్లో వీఆర్వో శంకర్ వచ్చి మా వద్ద డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అదే వీఆర్వో వచ్చి ఒక ప్లాట్కు రూ.20 వేలు ఇవ్వాలని, లేదంటే మీ ఇళ్లు నేలమట్టం చేస్తామని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేకుండా వీఆర్వోకు ఇవ్వలేకపోయాం. అది మనసులో పెట్టుకుని మాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా ఇళ్లను నేలమట్టం చేశారు. ఉన్నతాధికారులు మాపై దయవుంచి మాకు న్యాయం చేయాలి. – బాధితుడు శివయ్య లారీ డ్రైవర్ల కాలనీ ఎల్లమండ్యం పంచాయితీ -
టీడీఆర్.. ఒకరికే వందనం
తిరుపతి తుడా: నగరంలో మెరుగైన రవాణా వ్యవస్థను తీసుకురావడం, నగరాన్ని మరింతగా విస్తరించాలన్న సంకల్పం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం తిరుపతి నగరంలో 21 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శ్రీకారం చుట్టింది. కౌన్సిల్ ఆమోదంతో యుద్ధ ప్రాతిపదికన మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 17 మాస్టర్ ప్లాన్ రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి, విస్తరణకు ప్రజలు ఆయా ప్రాంతాల్లో భూములను గిఫ్ట్ డీడ్గా మున్సిపల్ కార్పొరేషన్కు రాసిచ్చారు. ఈ క్రమంలో భూములిచ్చిన రైతులు, యజమానులకు టీడీఆర్ ( ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమందికి టీడీఆర్ బాండ్లు సకాలంలో అందించగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ఆంక్షలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీఆర్ బాండ్ల జారీపై ఇప్పటికే రెండు కమిటీలను వేసింది. అయితే టీడీఆర్ బాండ్ల జారీలో మామూళ్లకు కక్కుర్తి పడి ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంఓ ఒత్తిడితో.. తిలక్ రోడ్డు జబ్బర్ వీధి విస్తరణలో ఇంటి స్థలం కోల్పోయిన ఇనయతుల్లా తనకున్న పలుకుబడితో టీడీఆర్ బాండ్ కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. రూ 2.5 కోట్ల విలువ గల టీడీఆర్ బాండ్ కోసం ఆయన సీఎంఓలో పావులు కదిపారు. సీఎంఓతో పాటు ఓ మంత్రి నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఒత్తిడి పెరిగింది. తప్పని పరిస్థితుల్లో తిరుపతి జబ్బార్ లే అవుట్కు చెందిన ఇనయతుల్లా కు టీడీఆర్ బాండును ఒక్కరోజు వ్యవధిలోనే జారీ చేసిన ఘనత కార్పొరేషన్ ఉన్నతాధికారులకే దక్కింది. టీడీఆర్ బాండ్ల కమిటీ నేరుగా సమావేశం కాకుండానే శనివారం రాత్రికి రాత్రే టీడీఆర్ బాండ్ను మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ మౌర్యకు భూములు కోల్పోయిన యజమానులు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని వేడుకుంటున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదు. వందల మందికి మొండిచెయ్యి సీఎంఓ నుంచి ఒత్తిడి తేవడంతో ఆగమేఘాలపై జారీ కమిటీ నేరుగా హాజరుకాకుండానే ఆమోదం అధికారుల తీరుపై విమర్శల వెల్లువ నాలుగు జిల్లాల అవతల ఉన్నతాధికారి.. ఆఘమేఘాలపై జూమ్ మీటింగ్.. వాట్సాప్లో సంతకం చేసిన దస్త్రం.. రాత్రికి రాత్రే ఆమోదం.. జారీ.. ఇందంతా ఒక్కరికే వందనం.. మిగిలిన వారికి శూన్యహస్తం. ఇదీ తిరుపతి నగరాభివృద్ధిలో రోడ్ల విస్తరణకు జారీ చేసిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) బాండు కథ. టీడీఆర్ బాండ్ల వివరాలు మొత్తం టీడీఆర్ బాండ్లు 1149 ఇప్పటి వరకు జారీ చేసినవి 442 ఇవ్వాల్సినవి 707ఒక్కరి కోసం కదిలిన యంత్రాంగం తిరుపతిలో టీడీఆర్ బాండ్ల వ్యవహారం వాడి వేడిగా ఉంది. రోడ్ల అభివృద్ధి కోసం భూములు వదులుకున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం కింద టీడీఆర్ బాండ్లను ఇవ్వాల్సి ఉంది. వీటి జారీ కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, డిప్యూటీ సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్, అనంతపురం రీజినల్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ టీడీఆర్ బాండ్ల జారీపై పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విచారణ అనంతరం అన్ని సక్రమంగా ఉంటే యజమానులకు టీడీఆర్ బాండ్లను జారీ చేయాల్సి ఉంది. వందల మంది టీడీఆర్ బాండ్ల కోసం ఎదురు చూస్తుంటే కేవలం ఒకరి కోసం ఆగమేఘాలపై జూమ్ మీటింగ్ నిర్వహించి రాత్రికి రాత్రి మంజూరు చేశారు. కమిటీ కూర్చుని రికార్డులను పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు లేని పక్షంలో బాండ్ను జారీ చేయాలి. అలా కాకుండా ఇన్చార్జి రీజినల్ డైరెక్టర్ కర్నూలులో ఉండగానే వాట్సప్ ద్వారా సంతకం చేసిన దస్త్రాన్ని తెప్పించుకుని టీడీఆర్ బాండ్కు ఆమోదం చేయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చరిత్రకు సజీవ సాక్ష్యం చిత్రలేఖనం
● శ్రీవిద్యానికేతన్లో ప్రారంభమైన విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ ● ముఖ్య అతిథులుగా పాల్గొన్న మోహన్ బాబు, మంచు విష్ణు చంద్రగిరి: చరిత్రకు చిత్రలేఖనం సజీవ సాక్ష్యమని, పురాతన కాలం నుంచి చిత్రాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుంటున్నామని ఎంబీయు ప్రో చాన్సలర్, మంచు విష్ణుఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచు విష్ణు అన్నారు. మన ప్రాంతంతో పాటు దేశ, విదేశాల్లోని కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2013లో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం విద్యాసంస్థల్లో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ మంచు మోహన్బాబు, సీఈఓ విష్ణు లు పాల్గొన్నారు. తొలుత కుటుంబ సమేతంగా మోహ న్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం కళాకారులను మోహన్బాబు, మంచు విష్ణు ఘనంగా సత్కరించారు. -
చింతగుంట సచివాలయంపై దాడి
చిన్నగొట్టిగల్లు (ఎర్రావారిపాళెం) : ఎర్రావారిపాళెం మండలం చింతగుంట పంచాయతీలో గ్రామ సచివాలయం అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రామ సచివాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట రాళ్లతో దాడి చేసి, సచివాలయం అద్దాలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఉదయం యథావిధిగా సచివాలయానికి చేరుకున్న సిబ్బంది పగిలిన అద్దాలు చూసి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమలత ఎర్రావారిపాళెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరంపై పోలీసుల విచారణ కోట:విద్యానగర్లో చోటుచేసుకున్న సైబర్ నేరంపై పోలీసులు మంగళవారం విచారణ జరిపారు. ఎస్ఐ పవన్కుమార్ కథనం మేరకు.. విద్యానగర్ లో ఎస్బీఐ సేవా కేంద్రం నడుపుతున్న మోహన్ వద్దకు గత శనివారం ఓ వ్యక్తి వచ్చి తన అకౌంట్ నుంచి రూ.40 వేల డబ్బులు కావాలన్నాడు. ప్రా థేయపడడంతో సరే అన్నాడు. వచ్చిన వ్యక్తి మరో మహిళతో ఫోన్ కలిపి తన అక్క లైన్లో ఉందని మీ ఫోన్పే నంబర్ చెబితే దానికి డబ్బులు వేస్తుందని చెప్పాడు. ఆమెతో ఫోన్లో మాట్లాడిన మోహ న్ ఫోన్పే నంబర్ చెప్పాడు. ఆమె ఆ అకౌంట్కు రూ.40 వేలు వేసింది. వెంటనే మోహన్ అతనికి నగదు ఇచ్చేశాడు. 10 నిమిషాల తరువాత విజయవాడకు చెందిన రమ్య అనే మహిళ మోహన్కు ఫోన్ చేసి తను వేసిన రూ.40 వేలు వెనక్కి ఇచ్చేయాలని కోరింది. తన తమ్ముడు అనుకుని డబ్బు లు వేశానని, ఫోన్ చేసింది తన తమ్ముడు కాదని చెప్పింది. దీనిపై రమ్య తన భర్తతో కలసి విజయవాడ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కోట ఎస్ఐకు ఫోన్ చేసి దీనిపై విచారణ జరపాలన్నారు. కోట పోలీసులు మోహన్ దగ్గర డబ్బులు తీసుకువెళ్లిన వ్యక్తి ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రమ్యతో తన తమ్ము డు గొంతుతో మాట్లాడిన ఫోన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి చైన్నె అడ్రస్తో ఉన్నట్లు గుర్తించారు. విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. సారా నిర్మూలనకు సమష్టి కృషి తిరుపతి అర్బన్: సారా నిర్మూలనకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్థన్రాజు, జేసీ శుభం బన్సల్ పేర్కొన్నారు. కలె క్టరేట్లో మంగళవారం సారా నిర్మూలనకు ఎకై ్స జ్తోపాటు పలు విభాగాలకు చెందిన అధికారు లతో కలెక్టర్, ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సారా నివారణకు సంబంధించి న వోదయ 2.0 పోస్టర్ను ఆవిష్కరించారు. అనంత రం వారు మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించి, అవగాహన కల్పించాలని ఆదేశించారు. సారా నేరస్తులపై బైండ్ ఓవర్ కేసులు నమోదుతోపాటు రూ.లక్ష జరిమానా విధించాలన్నారు. 3 నెలల్లో తిరుపతిని సారారహిత జిల్లాగా ప్రకటించేలా మా ర్పులు తీసుకురావాలన్నారు. జిల్లా ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్ విజయశేఖర్,ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి, తిరుపతి జిల్లా ఎకై ్సజ్ సూ పరింటెండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచ్చారి, డీపీఓ సుశీలాదేవి, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, సీపీఓ మునిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
పేదల ఇల్లు కూల్చివేత
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఇళ్లకు ప్రస్తుతం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఐదు ఇళ్లను రెవెన్యూ అధికారులు మంగళవారం నేలమట్టం చేశారు. రేణిగుంట మండలం కొత్తపాళెం రెవెన్యూ పరిధిలోని లారీ డ్రైవర్ల కాలనీలో గత ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకుని ఉన్నారు. సర్వే నంబర్ 100/1 లోని భూమి, వాగు పోరంబోకు స్థలమని, అందులో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని మంగళవారం ఉదయం వీఆర్వో శంకర్ జేసీబీతో ఐదు ఇళ్లను నేలమట్టం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చడంపై బాధితులు బోరున విలపించారు. దీనిపై తహసీల్దార్కు వివరణ కోరగా అక్రమ కట్టాలను కూల్చివేస్తామని చెప్పారు. ● లంచం ఇవ్వలేని కూల్చి వేశారనంటున్న బాధితులు -
శ్రీసిటీలో నేషనల్ డిఫెన్స్ కళాశాల అధికారులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): భారతదేశ పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధిపై అధ్యయనంలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (ఎన్డీసీ)కి చెందిన 17 మంది సభ్యుల ప్రతినిధి బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. మేజర్ జనరల్ సీపీ సంగ్రా, ఏవీఎస్ఎం వైఎస్ఎం(రిటైర్డ్) నేతృత్వంలో భారత సాయుధ దళాల ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులతో సహా విచ్చేసిన బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ ఏకీకృత వ్యాపారానుకూల వాతావరణం, ప్రపంచ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానం, భారతదేశ తయారీ, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, డిఫెన్న్స్ రంగాల్లో భాగస్వామ్యం గురించి ఆయన వారికి వివరించారు. పర్యటన కోఆర్డినేటర్లుగా ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్ఆర్డీఐ) డైరెక్టర్ జి.శ్రీనివాసులు, కొంతమంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో మార్పు మొదలైంది
– టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిక శ్రీకాళహస్తి: నియోజకవర్గంలో మార్పు మొదలైందని మాజీ ఎమ్మెల్యే బియ్యం మధుసూదనరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ యూత్ ఏర్పేడు మండల అధ్యక్షుడు వినోద్రెడ్డి, ఆయన అనుచరులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వినోద్రెడ్డి, ఢిల్లీబాబు, దినేష్ , ఉపేంద్రకుమార్, కుబేరుడు, వెంకటేష్, ప్రశాంత్,భాస్కర్ తదితరులలు ఉన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ప్రెసిడెంట్ కునాటి రమణయ్య యాదవ్, బత్తి శెట్టి, శివయ్య, రామ్మూర్తి, అయోధ్య, కేశవ, రాజశేఖర్, రామాచారి, రవి యాదవ్, గాలి రవి, చల్లా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కార్ల దొంగ అరెస్ట్ తిరుపతి క్రైమ్ : కార్లు అద్దెకు తీసుకుని ఉడాయించే దొంగను మంగళవారం అలిపిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ రామకిషోర్ తెలిపారు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చిన్నమీరానికి చెందిన గుద్దేటి మహేష్ నూతన కుమార్ ఫిబ్రవరి 11వ తేదీన నకిలీ ఆధార్ కార్డు వినియోగించి తిరుపతిలో ఓ వ్యక్తి వద్ద బ్రిజా కారును అద్దెకు తీసుకెళ్లాడు. ఐదురోజులపాటు వాడుకుని తెలంగాణ సరిహద్దుల వద్ద కారు జీపీఎస్ పనిచేయకుండా చేశాడు. తన సెల్ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో కారు ఎక్కడ ఉందో గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుపతి జూపార్క్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. కారును అపహరించిన కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడిపై కోల్కత్తా, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, భువనేశ్వర్, బెంగళూరు, చైన్నె, బీమవరం, ముంబయిలో ఇదే తరహా కేసులకు సంబంధించి మొత్తం 24 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఐదు సార్లు అరెస్టు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి నుంచి రూ.30లక్షల విలువైన మూడు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసును ఛేదించిన ఎస్ఐ లోకేష్, సిబ్బందికి సీఐ అభినందనలు తెలిపారు. -
నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూన్ కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. కాగా, ఆర్జిత సేవా టికెట్లు, జూన్ 9 నుంచి 11వరకూ జరిగే శ్రీవారి జ్యేష్టాభిషేకం టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ మార్చి 21న ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునే టోకెన్ల కోటాను 22న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మార్చి 24న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ప్రవేశాలను పెంచడం చేతగాకే...
ప్రవేశాలను పెంచుకోవడం చేతగాకనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, తమిళ్, ఉమెన్ స్టడీస్ వంటి కోర్సులకు చరమగీతం పాడుతూ మరిన్ని కోర్సులను మెడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏడీ బిల్డింగ్ను ముట్టడిస్తాం. – ఎస్.చిన్న, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి, తిరుపతి స్వతహాగా పీజీసెట్ బెటర్ వర్సిటీ అభివృద్ధి పథంలో నడవాలంటే కోర్సులను తొలగించడం కాదు. ప్రవేశాలను ప్రొత్సహించి, స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వాలి. ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచే ప్రయత్నం జరగాలి. కామన్ పీజీసెట్ను రద్దు చేసి, వర్సిటీ స్వతహాగా పీజీసెట్ నిర్వహిస్తే అడ్మిషన్లు పెరుగుతాయి. – భగవత్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి -
ప్రత్యేక నైపుణ్యమే లక్ష్యం
తిరుపతి అర్బన్: ప్రత్యేక నైపుణ్యం సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యంతో సుపరిపాలన పెంపొందించే దిశగా కోర్సులు ఉంటాయని చెప్పారు. ఐ గాట్ కర్మయోగి పోర్టల్ యాప్ ద్వారా రాష్ట ప్రభుత్వం మూడు రకాల కోర్సులను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. జిల్లాలో డీడీఓలు అందరూ ఈ యాప్ గురించి అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఈ కోర్సులను మార్చి 20వ తేదీ లోపు పూర్తి చేయాలని సూచించారు. లాగిన్ కు సంబంధించిన సమస్యలు తలెత్తితే 9652171785, 9063494729 నంబనర్లలో సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ట్రైనింగ్ అధికారి వెంకటేష్ , సీపీఓ ప్రేమ్చంద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 92 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 92 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇటీవల ఏఆర్పీసీ(3786) అనిల్కుమార్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ మేరకు ఎస్పీ చేతుల మీదుగా మృతుడి తల్లి సుశీలమ్మకు రూ.50 వేలను అందజేశారు. మహిళలకు భరోసా శక్తి మహిళలకు మేమున్నామని భరోసా కల్పించే విధంగా ఉండడమే శక్తి టీం ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు 125 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్మెటిక్స్(బైపీసీ) సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్ 41 మంది, ఒకేషనల్లో 1,070 మంది, జనరల్ బ్రిడ్జి కోర్సులో 47 మంది, మొత్తం 1,158మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 125 మంది గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్మెటిక్స్(బైపీసీ) సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,721 మంది స్వామివారిని దర్శించుకోగా 27,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
పింఛన్ కోసం తిరుగుతున్నా
వృద్ధాప్య పింఛన్ కోసం కొన్ని వారాలుగా తిరుగుతూనే ఉన్నా. నాకు న్యాయం చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజం లేదు. కలెక్టరేట్లోనైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడి వచ్చా. – యు.రమణయ్య అచ్చారి, పెద్దపాలేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలం శ్మశాన వాటికకు దారిలేదు మా కాలనీకి చెందిన శ్మశానికి వెళ్లడానికి దారి లేదు. నానా ఇక్కట్లు పడుతున్నాం. గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయి వరకు అధికారులుకు మొరపెట్టుకున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్లో అర్జీ ఇచ్చాం. –మునికృష్ణయ్య, పెనుమల్లం, ఏర్పేడు మండలం నా భర్తకు పక్షవాతం వచ్చింది నా భర్తకు పక్షవాతం వచ్చింది. మంచానికే పరిమితమయ్యాడు. పింఛన్ కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాం. కనీసం ఆయన మందులకు కూడా డబ్బుల్లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – భర్త కోటయ్యతో రమణమ్మ, జాండ్రపేట, వాకాడు మండలం నా భూములు ఆక్రమించారు నా భూమిని ఆక్రమించారు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు. విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – కోదండరామయ్య, పీఎస్ పాళెం, చిన్నగొట్టిగల్లు మండలం -
ప్రజాసమస్యల పరిష్కారవేదికకు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు
● కూమిట ప్రభుత్వంలో ఇంతవరకు అందని కొత్త పింఛన్లు ● అర్జీల స్వీకరణకే పరిమితమవుతున్న అధికారులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అభాగ్యులు ● కలెక్టరేట్కొచ్చినా కనికరం లేదంటూ నిట్టూర్పులు భర్త చనిపోయాడు! ● వాకాడు మండలానికి చెందిన బత్తెల కమలమ్మ భర్త తొమ్మిది నెలల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్ కోసం అర్జీ పట్టుకుని తిరగని కార్యాలయం లేదు. కలవని అధికారి లేడు. తీరా సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. భర్త చనిపోయి ఆర్థికంగా చితికిపోయినట్టు వెల్లడించారు. ‘ఓకే మేము పరిశీలిస్తాం.. సంబంధిత అధికారికి పంపుతాం..’ అంటూ అధికారులు సమాధానం ఇచ్చి పంపారు. ఎక్కడికెళ్లినా పరిష్కారమార్గం చూపడం లేదని ఆమె ఆవేదనతో వెనుదిరిగారు. ● శ్రీకాళహస్తికి చెందిన పి.నరసింహారెడ్డి స్వర్ణముఖి పరిసర ప్రాంతాల్లోని శ్మశానాన్ని కొందరు ఇసుకాసురులు తవ్వేస్తున్నారని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. గతంలో పలుమార్లు శ్రీకాళహస్తి ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాల్లో తెలియజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్వర్ణముఖి నదీతీర ప్రాంతంలో మకాం వేసి శ్మశానాన్ని సైతం వదలడం లేదని పేర్కొన్నారు. శ్మశానాన్ని పరిరక్షించాలని వినతి పత్రం సమర్పించారు. ‘సరే..అధికారులకు పంపుతాం’ అంటూ ఫిర్యాదుదారునికి రిసిప్ట్ ఇచ్చి పంపారు. శ్మశానానికి దారేది?షరామామూలే సోమవారం జరిగిన గ్రీవెన్స్ కూడా తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక అంధులు, వికలాంగులు, పండుటాకులు, చంటిబిడ్డ తల్లులు విలవిల్లాడడం కనిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 36,606 అర్జీలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో 74 శాతం సమస్యలు పరిష్కారమైనట్టు లెక్కలు చెప్పారు. వాస్తవంగా ఇందులో 30 శాతానికి మించి సమస్యలు పరిష్కారం కాలేదని అర్జీదారులు చర్చించుకోవడం కనిపించింది. పరిష్కారమేదీ? వచ్చిన వినతులపై సంతకం చేయడం .. రిసిప్ట్ అందించడం మాత్రమే చేస్తున్నారు. సోమవారం వచ్చిన సుమారు 250 అర్జీలలో 165 వినతులు రెవెన్యూకు సంబంధించినవి ఉన్నట్టు తేల్చారు. వాటికి పరిష్కారం చూపలేదు. మీ మొబైల్కు ఫోన్ వస్తుందని మాత్రమే సమాధానం చెప్పి పంపించేశారు. -
వేదాల పరిరక్షణకు కృషి
తిరుపతి సిటీ: గ్రామ స్థాయి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలలో వేదాల పరిరక్షణకు కృషి చేయాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపునిచ్చారు. ఎస్వీ వేదిక్ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీలో మూడు రోజుల వేద సమ్మేళనం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.వర్సిటీలో వేదపండితులు, అతిథులు, విద్యార్థులు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. వేదాల రక్షణే లోకరక్షణగా భావించాలన్నారు. వేదాలతో జ్యోతిష్యం, పురాణాలు, ఇతిహాసాలు, నీతి శాస్త్రం, యోగ శాస్త్రం అనుసంధానం చేసి వాటి సారాన్ని సమాజానికి అందించాలన్నారు. విశిష్ట అతిథులు, ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, వేదిక్ వర్సిటీ వీసీ రాణిసదాశివమూర్తి, సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టానం సచివులు ఆచార్య విరూపాక్ష జడ్డీపాల్ ప్రసంగించారు. వేదాలు మానవ జీవన విధానాన్ని తెలియజేస్తాయని, వేద పరిరక్షణతోనే దేశ పరిరక్షణ సాధ్యమన్నారు. ధార్మిక చైతన్యం పెరగాలని, వేదం అభ్యసించిన వారు సైనికుల్లా దేశ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భాస్కరుడు, గణేష్భట్, పీఆర్ఓ టి.బ్రహ్మాచారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వేద పండితులు పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపు -
ప్రశాంతంగా పది పరీక్షలు
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా 162 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదోతరగతి పరీక్షలు కావడంతో విద్యార్థులు పలు దేవాలయాల వద్ద కిటకిటలాడారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లాలోని 26,670మంది విద్యార్థులు హాజరవ్వాలి ఉండగా వారిలో 269 మంది గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ విద్యార్థులు 133 మందికి గాను 30మంది గైర్హాజరయ్యారు. వివిధ కారణాలతో పరీక్ష రాయలేని విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్కు అనుమతి ఇచ్చారు. పటిష్ట బందోబస్తు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. బయటి వ్యక్తులు లోనికి వెళ్లకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్ష నిర్వహణాధికారుల సెల్ఫోన్లను కేంద్రాల్లోకి నిషేధించారు. ఆకస్మిక తనిఖీలు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రెండు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈఓ కేవీఎన్.కుమార్ మూడు పరీక్షా కేంద్రాలను, జిల్లా స్థాయి పరిశీలకులు 10 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మరో 10 మంది పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే సమస్యాత్మక 30పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ విధులు నిర్వహించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. -
అష్టబంధన మహా సంప్రోక్షణ
తిరుపతి కల్చరల్:అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం శాస్త్రోక్తంగా అష్ట బంధన మహా సంప్రోక్షణ నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్దనున్న స్వామి వారి ఆలయం, శ్రీలక్ష్మీ నారాయణస్వామి వారి ఆల యానికి అనుబంధంగా ఉన్న శ్రీగోదా అమ్మవారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కుంభ ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, రుత్వికులు పాల్గొన్నారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి తిరుపతి అర్బన్: వినియోగదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్తోపాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిసోర్స్ పర్సన్ జనార్థన్తో కలిసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బ్రోచర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధర్వంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రిసోర్స్ పర్సన్ డా.యాసుఫ్, చెంచయ్య పాల్గొన్నారు.‘క్షయ’పై అవగాహన తప్పనిసరి తిరుపతి అర్బన్: క్షయవ్యాధి నిర్ధారణతోపాటు నివారణపై అవగాహన ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం నిర్మూలనకు చెందిన ఓ బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్ధారణ, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు. జిల్లాలో 24 పంచాయతీలను టీబీ ముక్త్ పంచాయతీలుగా గుర్తించినట్టు వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్, వైద్యులు శ్రీనివాసులురెడ్డి, సుబ్బారావ్, రవిరాజు, రాజా పాల్గొన్నారు. -
రైల్లో నుంచి పడి యువకుడి మృతి
చిల్లకూరు: చిల్లకూరు మండలం, తీపనూరు సమీపంలో 33 ఏళ్లు ఉన్న గుర్తుతెలియని యువకుడు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చైన్నె వైపు వెళ్లే రైలులో నుంచి తీపనూరు సమీపంలో ఓ యువకుడు కింద పడిపోయాడు. ప్రయాణికులు గుర్తించి 100కు సమాచారం అందించారు. దీంతో వారు చిల్లకూరు పోలీసులను అప్రమత్తం చేశారు. తర్వాత 108 వాహనంలో యువకుడ్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చిల్లకూరు పోలీసులు గూడూరు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు విచారణ చేస్తున్నారు. మృతునిది గుంటూరు ప్రాంతం అని రైల్వే పోలీసులు గుర్తించినా పూర్తి వివరాలు తెలియలేదు. -
వెదురు పెంపకంపై అవగాహన
తిరుపతి అర్బన్: వెదురు పంట సాగుకు రాయితీలున్నాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి తెలిపారు. తిరుపతిలోని అటవీశాఖ బయోట్రిమ్ కార్యాలయంలో రైతులకు వెదురు సాగుపై అవగాహన కల్పించారు. తిరుపతితోపాటు చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన రైతులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా ఒక హెక్టార్లు సాగుకు రూ.50 వేల రాయితీ ఉందని చెప్పారు. అలాగే నర్సరీ సాగుచేస్తే హెక్టార్కు రూ.20 లక్షలు గరిష్టంగా అందిస్తారని వివరించారు. ఉదయగి అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి వెదురుపై రైతులకు అంశాల వారీగా వివరించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఒరవడి – తిరుపతి ఐఐటీ ఇన్నోవేషన్ హబ్ను సందర్శించిన డీఎస్టీ సెక్రటరీ ఏర్పేడు(రేణిగుంట): ఆపరేషన్ ద్రోణగిరితో భౌగోళిక స్థాన సంబంధిత విధానం అమలుతో దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఒరవడి చోటుచేసుకోనుందని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ కరండేకర్ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లో జరుగుతున్న డెమోడే షోకస్ ఈవెంట్లో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎం– ఐసీపీఎస్ మిషన్ డైరెక్టర్ ఏక్తా కపూర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, జీడీపీడీసీ చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పురోభివృద్ధికి అలవంభించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రోషన్ శ్రీవాస్తవ్ కొత్త ప్రాజెక్టుల గురించి వివరించారు. జియోస్పేషియల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావటానికి 25 అగ్ర స్టార్టప్లను గుర్తించినట్లు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి పెళ్లకూరు: మండలంలోని ముమ్మారెడ్డిగుంట గ్రామానికి చెందిన చింతపూడి హరీష్(18) సోమవారం అక్కగారిపేట గ్రామ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. చిన్నతనంలోనే హరీష్ తల్లిదండ్రులను కోల్పోయాడు. ముమ్మారెడ్డిగుంట గ్రామంలోని మేనమామ ఆనంద్ వద్ద ఉంటున్నాడు. అయితే గత కొంత కాలంగా మద్యానికి బానిసై అక్కగారిపేట గ్రామ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ చేరుకుని 108 సహాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హరీష్ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అర్జీలు..నిరసనల హోరు
తిరుపతి అర్బన్: సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు కలెక్టరేట్కు పోటెత్తారు. సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 250 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అందులో 165 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆరోగ్య మిత్రల నిరసన కలెక్టరేట్ వద్ద ఆరోగ్య మిత్రలు నిరసన వ్యక్తం చేశారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా క్యాడర్ అమలు చేయలేదన్నారు. ఎంటీఎస్ లేక.. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు లేక ఇక్కట్లు పడుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు సీసీ కెమెరాల కింద కుర్చూని పనిచేయడం మహిళలకు ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. పెన్షనర్ల సమస్యలను పట్టించుకోండి ‘మూడు దశాబద్దాలకు పైగానే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశాం.. కానీ రావాల్సిన బెనిఫిట్స్ను తీసుకోకుండానే పలువురు మృతి చెందుతున్నారు’ అంటూ పలువురు పెన్షనర్లు వాపోయారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీకి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులకు డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఐసీ, జీఎన్ఎస్, నల్సా విభాగాలకు చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. -
పోలీసుల్లో ‘ఫైర్’ ఉండాలి
చంద్రగిరి: వార్షిక ఫైరింగ్ శిక్షణలో ప్రతి ఒక్కరూ ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు. కల్యాణీ డ్యామ్లో నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను సోమవారం ఆయన పరిశీలించారు. అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి ఆయన సిబ్బందిలో ఉత్సాహం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, ఫైరింగ్ రేంజ్లో అధికారుల పర్యవేక్షణలో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ఆ తర్వాత ఏఆర్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఫైరింగ్ శిక్షణపై మాట్లాడారు. ప్రతి బుల్లెట్ టార్గెట్ (లక్ష్యం) వైపే బుల్ పడేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జిల్లా పోలీసు శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలన్నారు. తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అని, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉండడంతో వీవీఐపీలు, వీఐపీలు సరైన భద్రత, మరో వైపు ప్రజా రక్షణను దృష్టిలో ఉంచుకుని ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. సివిల్ పోలీసులు 1500మంది, ఆర్మ్డ్ సిబ్బంది 640మంది, సీఐలు 36, డీఎస్పీలు 11, ఎస్ఐలు 67మంది, అడిషనల్ ఎస్పీలు 4 ఫైరింగ్లో శిక్షణ పొందినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి హేమంత్, అదనపు ఎస్పీలు రామకృష్ణ, నాగభూషణం, శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. ● ఫైరింగ్ శిక్షణలో ఎస్పీ దిశానిర్దేశం -
పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్ధి
తిరుమల : తిరుమల శ్రీవారి అభిషేకంలో ఉపయోగించే పునుగు తైలం కోసం తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో పెంచుతున్న పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జూపార్కులో ఇప్పటికే నిర్మించిన నిశాచర జీవుల నివాస స్థావరం (నాక్టనల్ హౌస్)లో పునుగు పిల్లుల సంరక్షణకు ప్రత్యేకంగా నిర్మించిన గదులు ఇంటీరియర్ అభివృద్ధి కోసం జూ అధికారుల ప్రతిపాదనలను అనుమతిస్తూ 2024 డిసెంబర్ 24 తేదీన బోర్డు సమావేశంలో టీటీడీ అంగీకారం తెలిపింది. రూ.1,97,31,200లతో రూపొందించిన సదరు ప్రతిపాదనలను టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. టీటీడీ ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉరి వేసుకొని యువకుడి మృతి సత్యవేడు: శ్రీసిటీ పరిధిలోని చిగురుపాళెం చెరువు కట్టపై రాజస్థాన్కు చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని తనువుచాలించాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. రాజస్థాన్కు చెందిన సిబ్ ముంజి(45) శ్రీసిటీలోని హెమల్టన్ కంపెనీలో కార్మికుడిగా ఉంటూ చిగురుపాళెం గ్రామ పరిసరాల్లో నివసిస్తున్నాడు. తనకున్న అనారోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మద్యం తాగి గ్రామ సమీపంలోని చెరువుపై ఉన్న వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకొని మృతిచెందినట్టు ఎస్ఐ హరిప్రసాద్, సీఐ శ్రీనివాసులు తెలిపారు. సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రాయలవారి కోట సందర్శన చంద్రగిరి: చంద్రగిరి కోటను న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన బృందం సోమవారం సందర్శించింది. స్టడీ టూర్లో భాగంగా చంద్రగిరి కోటను సందర్శించారు. ఏపీ మానవ వనరుల శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు నేతృత్వంలో నేషనల్ డిఫెన్స్ మేజర్ జనరల్ సీపీ సంఘ్రా, సివిల్ సర్వీసెస్ అధికారి బాలాజీ ఆధ్వర్యంలో ఇండియన్ నేవి, ఇండియన్ ఎయిర్ఫోర్స్, సివిల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ అధికారులు భారతదేశానికి చెందిన 12 మంది, రష్యా, శ్రీలంక, ఇండోనేషియా, సౌతాఫ్రికా, నేపాల్ దేశాలకు చెందిన ఐదుగురు కోటను సందర్శించారు. ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, కోట ఆర్కియాలజీ కన్జర్వేటర్ బాలకృష్ణారెడ్డి, చంద్రగిరి తహసీల్దార్ శివరామసుబ్బయ్య, ఎంపీడీఓ వెంకటరత్నం, బృందం కో–ఆర్డినేటర్ కార్తీక్ పాల్గొన్నారు. -
తిరుపతికి నీటి సరఫరా, మురుగునీటి ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి నగరానికి నీటి సరఫరా, మురుగునీరు సెప్టేజ్, తుపాను నీటి పారుదల, పార్క్ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకాన్ సాహు తెలిపారు. సోమవారం ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. సెల్ఫోన్ రిపేర్, సర్వీసింగ్లపై ఉచిత శిక్షణ చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 25 నుంచి 30 రోజుల పాటు పురుషులకు సెల్ఫోన్ రిపేరు, సర్వీసింగ్లపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న పురుషులు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి అని, శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని, రానూ పోనూ ఒక్కసారి చార్జీలు ఇస్తామన్నారు. అలాగే శిక్షణానంతరం ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు జెరాక్స్లు, 4 పాస్పోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని, తొలుత పేర్లు నమోదు చేసుకున్న ప్రాధాన్యత ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 94949 51289, 63017 17672 సంప్రదించాలని సూచించారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ తిరుపతి లీగల్: రాష్ట్ర, జిల్లా న్యాయసేవా సంస్థల ఆదేశాల మేరకు తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 44 మంది న్యాయవాదులకు సోమవారం నుంచి మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక రాస్ భవనంలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమానికి తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం.గురునాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణ తరగతులు ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అనుజ సక్సేన, మధ్యప్రదేశ్కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త నీనాకరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి ఎమ్ఎస్ భారతి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..
తిరుపతి, సాక్షి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ (TTD) అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన మేరకు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించే విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్,రూ.300 దర్శనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోమవారం,మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనం, బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు మాత్రమే అనుమతి కల్పిస్తుండగా.. సిఫార్సు లేఖపై టీటీడీ ఆరుగురికి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. -
శ్రీవారిమెట్టులో కొనసాగుతున్న టోకెన్ల దందా!
చంద్రగిరి: శ్రీవారిమెట్టు మార్గంలో టోకెన్ల దందా కొనసాగుతోంది. విజిలెన్స్ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎంతో దూరం నుంచి ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వచి్చన సామాన్య భక్తులు టోకెన్లు లభించక తీవ్ర అగచాట్లు పడ్డారు. ఆటో డ్రైవర్లతో కలిసి పలువురు సిబ్బంది అడ్డదారిలో టోకెన్లు విక్రయిస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యంత్రాంగం కొన్ని నెలలుగా రోజుకు కేవలం 3 వేల టోకెన్లే జారీ చేస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాల్లోనూ అదే రీతిలో టోకెన్లు ఇస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 10 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిమెట్టు వద్దకు పోటెత్తారు. ఉదయం 6 గంటలకే భక్తులు భారీగా తరలిరావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీవారిమెట్టు మార్గంలోని పంపు హౌస్ వద్ద బారికేడ్లతో భక్తుల వాహనాలను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. కానీ ఆటోలను మాత్రం ముందుకు అనుమతించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. తిరుపతి నుంచే వసూలు మొదలు.. తిరుపతిలో తమ వాహనాలు ఎక్కితే.. శ్రీవారి దర్శన టోకెన్లు ఇస్తామంటూ ఆటో డ్రైవర్లు జనాన్ని తీసుకువస్తున్నారని భక్తులు ఆరోపించారు. గ్రూపులుగా వచ్చే వారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. సుమారు ఏడుగురు ఉండే గ్రూప్ నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. బెంగళూరుకు చెందిన కృష్ణమూర్తి అనే భక్తుడు మాట్లాడుతూ.. “బెంగళూరు నుంచి కుటుంబసభ్యులతో శ్రీవారిమెట్టు సమీపానికి శనివారం అర్ధరాత్రికే వచ్చా. అప్పటి నుంచి సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని అనుమతించలేదు. కానీ ఆటోలను మాత్రం పంపించారు. దీనిపై ప్రశ్నిస్తే జవాబు చెప్పట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఇలా ఇబ్బందులు పెట్టడం దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తగినన్ని టోకెన్లు జారీ చేయాలని టీటీడీని కోరారు. టోకెన్లను బ్లాక్లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
● వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్ ● 9 గంటల సరఫరా హామీ బుట్టదాఖలు ● అంతరాయాల నడుమ 7 గంటలకే పరిమితం ● ఆఖరు తడికి అగచాట్లు పడుతున్న రైతులు ● ఎండుముఖం పడుతున్న పంటలు
సక్రమంగా ఇవ్వడం లేదు వ్యవసాయానికి విద్యుత్ను ఏడు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అనేకసార్లు లైన్లు ట్రిప్ అవుతూ కరెంటు పోతోంది. మళ్లీ సిబ్బంది వచ్చి రిపేర్లు చేసే వరకు ఎదురు చూడాలి. నేను రెండెకరాల్లో వేసిన వేరుశనగ పంటకు సాగునీరు చాలడం లేదు. గతంలోనూ చంద్రబాబు కక్ష గట్టి మరీ రైతులపైనే కేసులు పెట్టించారు. కోతలు లేకుండా ఏడు గంటలైనా నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్ అందించాలి. – మంగారెడ్డి, కె.వెంకటాపురం, శ్రీకాళహస్తి మండలం రేణిగుంట: జిల్లాలోని రైతులు ఎక్కువగా వ్యవసాయ బోర్లపైనే ఆధారపడి పంటల సాగు చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తుగా నాటిన చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆఖరి తడి అందించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు ప్రతి బోరు వద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టడంతో తరచూ లైన్లు ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే ట్రాన్స్కో సిబ్బంది చేయి తడపాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు సతమతమవుతున్నారు. దగా చేస్తోంది కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. రైతులకు 9గంటలు నాణ్యమైన విద్యుత్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. అయితే ఇప్పుడు ఏడు గంటలకు తగ్గించేశారు. దీంతో ఆఖరి తడులకు సాగునీరు అందక పంటలు ఎండబెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా నాణ్యమైన విద్యుత్ అందించాలి. – శంకర్రెడ్డి, రైతు సంఘం నేత, రేణిగుంట -
పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనది
తిరుపతి అర్బన్: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనదిగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అమరజీవి జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆదివారం బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జ్యోత్స్న నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడని కొనియాడారు. ఆయన 1901 మార్చి 16న జన్మించి 1952 డిసెంబరు 15న అమరులయ్యారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవియై మహాపురుషుడిగా నిలిచారన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిందని వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దేవేంద్ర రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు. -
అవినీతి అంతస్తులు
తిరుపతి తుడా: తిరుమల బైపాస్ రోడ్డులోని ఎస్బీఐ ఎటీఎం ఎదురుగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కూటమి నేతల అండతో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆరు అంతస్తుల భారీ భవనం నిర్మిస్తున్నా అటువైపు ఎవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి సుమారు రూ.2 కోట్ల మేర గండి పడుతోంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తులతో టౌన్ప్లానింగ్ అనుమతి లేకుండా భవనం కడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యా రు. కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులు కాసుల కక్కుర్తితో అక్రమ నిర్మాణానాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 20న ఎన్ఎస్యూ స్నాతకోత్సవం తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఈనెల 20వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మహతి ఆడిటోరియంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ సంస్కృత వర్సిటీగా విద్యాపీఠం రూపాంతరం చెందిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు స్నాతకోత్సవాలు నిర్వహించారు. అదే స్ఫూర్తితో నాలుగో స్నాతకోత్సవాన్ని వైభవోపేతంగా జరింపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం తిరుపతి ఎడ్యుకేషన్:తిరుపతిలోని ఎస్వీ జూనియ ర్ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్ మూ ల్యాంకనం చేపట్టనున్నట్లు ఆర్ఐఓ జీవీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17నుంచి ఇంగ్లిష్, మ్యాథ్స్, తెలుగు, సివిక్స్, తమిళ మీడియం, ఒకేషనల్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఉంటుందన్నారు. 22 నుంచి ఫిజిక్స్, బోటనీ, హిస్టరీ, తమిళ మీడియం, ఒకేషనల్ సబ్జెక్టులు, 24నుంచి కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, 26వ తేదీ నుంచి జువాలజీ మూల్యాంకనం జరుగుతుందని వివరించారు. 42వ రోజుకు చేరిన జూడాల సమ్మె తిరుపతి సిటీ:గౌరవవేతనం పెంచాలంటూ ఎస్వీ వెటర్నరీ వర్సిటీ జూడాలు చేస్తున్న సమ్మె ఆదివారానికి 42వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకోకపోవడం దారుణమన్నారు. గౌరవేతనం పెంచేవరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు.● ఈమె పేరు మునెమ్మ. ఏర్పేడు మండలం బండారుపల్లె. 18 గుంటల పొలంలో వేరుశనగ, మరో 16 గుంటల్లో వరి సాగు చేపట్టారు. వేరుశనగ ఒబ్బిడి దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో పంట చేతికందే పరిస్థితుల్లో విద్యుత్ కోతల కారణంగా మొక్కలు ఎండుముఖం పట్టాయి. కేవలం 7 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేస్తుండడంతో ఆఖరి తడికి నీరు అందడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక మునెమ్మ కొట్టుమిట్టాడుతోంది. ఈ దుస్థితి ఒక్క మునెమ్మకు మాత్రమే కాదు. జిల్లాలోని వేలాదిమంది అన్నదాత లకు దాపురించింది. 9 గంటల విద్యుత్ సంగతి దేముడెరుగు.. వచ్చే 7 గంటలు కూడా సక్రమంగా సరఫరా కాకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే పంట ఎండిపోతుంటే కన్నీరు పెడుతున్నారు. -
పచ్చమూక ఆక్రమణలో అటవీ భూములు
● వెంకటగిరి పరిధిలో కబ్జాల పర్వం ● 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో వందల ఎకరాలు అన్యాక్రాంతం ● గత వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో 100 ఎకరాల స్వాధీనం ● మిగిలిన భూములను దర్జాగా సాగు చేసుకుంటున్న టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : వెంకటగిరి రూరల్ మండలంలోని విలువైన అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. అక్కడక్కడా మిగిలిన భూములను సైతం గత కొంత కాలంగా దర్జాగా కబ్జా చేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. చేసేది లేక కొందరు అధికారులు సైతం టీడీపీ నాయకులతో కుమ్ముకై ్కపోతున్నారు. ఆక్రమిత భూముల్లో కొన్నింటిని ఆన్లైన్లో రెవెన్యూ భూములుగా మార్చుకుంటున్నారు. అధికారమే అండగా.. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. అలా ఆక్రమించుకున్న వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటగిరి రూరల్ మండలం మన్నేగుంట, పూలరంగడుపల్లి, బసవాయిగుంట పరిధిలో సుమారు 1200 ఎకరాల అటవీ, మరో 65 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. 2014–19 మధ్య కాలంలో ఈ భూములను టీడీపీ నేతలు కొందరు ఒక్కొక్కరు 20 నుంచి 100 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. అందులో అటవీ యాక్ట్ని తుంగలో తొక్కి ఉన్న చెట్లను జేసీబీలతో తొలగించి చదునుచేసి పంటల సాగు ప్రారంభించారు. అటవీ భూముల్లో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరు. అయినా కొందరు విద్యుత్ కనెక్షన్లు తీసుకుని బోర్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. మరి కొందరు బోర్లు వేసుకుని సోలార్ విద్యుత్ ద్వారా పంటలు పండించుకుంటున్నారు. ఈ ఆక్రమణలను అప్పట్లోనే సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నంబర్ 74లోని 175 ఎకరాల్లో సుమారు వంద ఎకరాల వరకు అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూముల్లో జోలికి వెళ్లలేదు. అప్పట్లో టీడీపీ నేతలు అడ్డుకున్నారని నాటి అటవీ అధికారులు చెప్పుకొచ్చారు. మరోసారి రెచ్చిపోతున్న కబ్జాదారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కులు రంగంలోకి దిగారు. మిగిలి ఉన్న అటవీ భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో చదునుచేసి సాగు చేసుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణలకు కొందరు అటవీ, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నోటీసులు ఇస్తున్నాం వెంకటగిరి రేంజ్ పరిధిలో భారీగా అటవీ భూములు ఉన్న మాట వాస్తవమే. వాటిని కొందరు ఆక్రమించుకున్నదీ నిజమే. కబ్జాకు గురైన భూముల్లో సుమారు వంద ఎకరాల వరకు స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్ చేశాం. మిగిలిన భూమిని స్వాదీనం చేసుకోవాల్సి ఉంది. ఆక్రమణ దారులకు నోటీసులు ఇస్తున్నాం. అటవీ భూముల ఆక్రమణ చట్టరీత్యానేరం. ఎప్పటికై నా స్వాధీనం చేసుకుంటాం. – లోకేష్, ఫారెస్ట్ రేంజర్, వెంకటగిరి -
జీజేఎల్ఏ జిల్లా అధ్యక్షుడిగా రవి
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం(జీజేఎల్ఏ) తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వి.రవి (చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల) ఎన్నికయ్యారు. తిరుపతిలో ఆదివారం జీజేఎల్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా పి.రాజనాల, కార్యదర్శిగా సి.వంశీకృష్ణ (చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), సంయుక్త కార్యదర్శిగా టీఆర్.చక్రాధర్ (పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), కోశాధికారిగా బి.అనిల్కుమార్ (సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల), లేడీ సెక్రటరీగా డాక్టర్ పి.అమ్ముదేవి (పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల), రాష్ట్ర కౌన్సిలర్లుగా డాక్టర్ కె.రవీంద్రబాబు (వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల), వీఎన్ రవి (వరదయ్యపాళెం ప్రభుత్వ జూనియర్ కళాశాల) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు జీసీజీటీఏ జిల్లా కార్యదర్శి ఎస్.శ్రీకాంత్రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. -
గుంతలెప్పుడు పూడ్చుతారో?
పెళ్లకూరు: కొణతనేరి–కోనేటిరాజుపాళెం ఆర్అండ్బీ రహదారి మార్గం, ముమ్మాడ్డిగుంట గ్రామ సమీపాన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడాయి. ఆదివారం ఓ కారు గుంతలో పడి ఇరుక్కుపోయింది. గత కొన్ని రోజులుగా ఈ గుంతల వల్ల స్కూల్ బస్సులు, ఆర్టీసీ సర్వీసులు కూడా నడవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆర్అండ్బీ అధికారులు స్పందించాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చంద్రగిరి: మండలంలోని తొండవాడ వద్ద ఈ నెల 9న బైక్ ఢీకొని గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ గాంధీపురానికి చెందిన నారాయణ(45) 9న బైక్లో చంద్రగిరి నుంచి తిరుపతి వెళుతున్నాడు. తొండవాడ వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నారాయణను స్థానికులు 108లో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు కార్ల ఢీ చంద్రగిరి : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కాశిపెంట్ల వద్ద ఆదివారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరుపతికి చెందిన భువానదిత్య, వరప్రసాద్, సాయికుమార్ వ్యక్తిగత పనులపై కారులో చిత్తూరు వైపునకు బయలుదేరారు. ఈ క్రమంలో కడప నుంచి కుప్పానికి వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో కడప నుంచి వస్తున్న కారులోని శ్రీనివాసన్, మంజునాథ, గీత, భాగ్యలక్ష్మి, సువార్త, అరవింద్ కుమార్తో పాటు తిరుపతికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. క్షగాత్రులను చంద్రగిరి ఏరియా ఆస్పత్రి, తిరుపతి రుయాకు తరలించారు. -
తూతూమంత్రంగా ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో అధికారులు పెద్దసంఖ్యలో జనం నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అయితే వాటి పరిష్కారంలో మాత్రం శీతకన్ను వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వారాలు మినహా ఇప్పటి వరకు మొత్తం 34 వారాలు గ్రీవెన్స్ నిర్వహించారు. అందులో దాదాపు 8వేలకు పైగా అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ సమస్యలపైనే 6వేల వరకు వినతులు ఉన్నాయి. మిగిలిన 2వేల అర్జీల్లో ఇప్పటి వరకు 50శాతం కూడా పరిష్కరించకపోవడం గమనార్హం. సచివాయాల్లో సిబ్బంది సర్వేల్లో తలమునకలు కావడం, మండ కార్యాలయాల అధికారులు గ్రీవెన్స్ను పట్టించుకోకపోవడంతో చిన్నాచితక సమస్యలపై కూడా ప్రజలు కలెక్టరేట్కు రావాల్సి వస్తోంది. వీధిలైట్లు, దారి, తాగునీటి సమస్యలకు కూడా కలెక్టరేట్లో అర్జీ పెట్టుకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఒక్కోసారి.. ఒక్కోలా.. కలెక్టరేట్ గ్రీవెన్స్లో అధికారులు ఒక్కోవారం ఒక్కో విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక వారం క్యూ విధానం పాటిస్తారు. మరోసారి అర్జీదారులను గుంపులు గుంపులుగా వదిలేస్తున్నారు. ఈ క్రమంలోనే వినతులు రాసేందుకు సైతం ఏర్పాట్లు చేయడంలేదు. ప్రజలు కుర్చునేందుకు సైతం అవకాశం కల్పించడం లేదు. ఈ క్రమంలోనే మరుగుదొడ్ల పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారు. దీంతో కలెక్టరేట్లోని పలు విభాగాల వద్ద దుర్వాసనే ప్రజలకు స్వాగతం పలుకుతోంది. వినతులు సరే.. పరిష్కారమేదీ? పట్టించుకోని అధికారులుఅందరూ రారు..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. కలెక్టరేట్లోని మొత్తం 80 విభాగాలకు చెందిన జిల్లా అధికారులు హజరయ్యేలా చర్యలు చేపట్టేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 50 విభాగాల అధికారులు హాజరైతే గొప్పగా మారిపోయింది. మిగిలిన విభాగాల వారు తమ సిబ్బందిని పంపించి చేతులుదులిపేసుకుంటున్నారు. గ్రీవెన్స్లో కలెక్టరే ఉంటే ఓ విధంగా, జేసీ ఉంటే ఇంకోలా.. డీఆర్ఓ హాజరైతే మరోలా అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. -
వృక్ష సంపదపై అధ్యయనం
తిరుపతి సిటీ : ఎస్వీయూ వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులు మూడు రోజుల పశ్చిమ కనుమల వృక్ష సంపద, జీవ వైవిధ్యం అధ్యయన యాత్రకు శ్రీకారం చుట్టారు. అధ్యాపకులు నాగలక్ష్మి, దేవమ్మ, కామాక్షమ్మ, వేణు, అంకన్న పర్యవేక్షణలో, విద్యార్థులు రూపేష్, శివాని నేతృత్వంలో యాత్ర చేపట్టారు. ప్రధానంగా కేరళలోని హొగెనెకల్ జలపాతం, టీ ఫ్యాక్టరీ, థ్రెడ్ గార్డెన్, రోజ్ గార్డెన్, నేషనల్ బొటానికల్ గార్డెన్, ఊటీ కొండలు, అతిరేపల్లి వాటర్ఫాల్స్ వంటి ప్రదేశాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని వృక్షసంపదను అధ్యయనం చేశారు. అధ్యాపకులు మాట్లాడుతూ వైవిధ్యమైన మొక్క భాగాలను విద్యార్థులు సేకరించారని, వాటిని హెర్బెరియం షీట్ల ద్వారా నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం యాత్ర ముగించుకుని వర్సిటీకి చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుచ్చిపై సూర్యనారాయణుడు తిరుపతి రూరల్ : తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీసూర్యనారాయణస్వామివారు ఆదివారం బంగారు తిరుచ్చిపై విహరించారు. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. సాయంత్రం సూర్య నారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువు దీర్చారు. అనంతరం తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి సూపరింటెండెంట్ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు పాల్గొన్నారు. -
రేపటి నుంచి అన్నమయ్య సంకీర్తనోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీత్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు త్యాగరాజ మండపంలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురాం తెలిపారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 80 ఏళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలను చేపడుతూ ప్రతిభావంతులైన ప్రముఖ విద్యాంసులచే త్యాగరాజ సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్యకు క్రోధి నామ సంవత్సరం స్వామివారు సాక్షాక్తరించి ఆశీస్సులు అందించారన్నారు. ఆ పవిత్రమైన ఏడాదిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అంటే ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 9.30 గంటల వరకు ప్రముఖ విద్యాంసులచే అన్నమయ్య సంకీర్తన కచేరీలు ఉంటాయని తెలిపారు. -
మహిళపై కర్రలతో దాడి
● కేసు నమోదు చేయని పోలీసులు ● ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన చిన్నగొట్టిగల్లు (ఎర్రావారిపాళెం): పాత కక్షలతో ఓ మహిళను నడిరోడ్డుపై పట్టపగలు ఈడ్చుకుని వెళ్లి కర్రలతో కొట్టినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన జీవిత అనే మహిళ తలకోనకు వెళ్లే మార్గంలో హోటల్ నడుపుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, అతడి కుమారుడు హరికి ఆమెతో భూవివాదముంది. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన జీవిత తన హోటల్ వద్ద ఉండగా ఈశ్వరయ్య, హరి అటువైపుగా వచ్చి తమ గొర్రెలను వదిలేశారు. హోటల్ వద్ద ఉన్న ఓ వ్యక్తి వాటిని తరిమేందుకు యత్నించగా ఆగ్రహించారు. జీవితపై దాడికి దిగారు. బాధితురాలు వెంటనే పోలీస్స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. ముందు ఆస్పత్రికి వెళ్లాలని పంపేశారు. ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లినా స్పందించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి నేతల ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదుకు వెనుకాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నారు. దీనిపై ఎస్ఐ ఎర్రిస్వామిని వివరణ కోరగా దాడిచేసిన వారు బాధితురాలికి సమీప బంధువులని, ఈ మేరకు తాము మాట్లాడతామని గ్రామపెద్దలు కోరడంతో కేసు నమోదుకు సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో వేరే ఉద్దేశం లేదని తెలిపారు. కారు బోల్తా : వృద్ధురాలి మృతి చిల్లకూరు : చైన్నె– కోల్కత్తా జాతీయ రహదారిపై రైటార్సత్రం వద్ద ఆదివారం వేకువజామున ఓ కారు బోల్తా పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన జాలా పెంచలమ్మ(76) శ్రీకాళహస్తిలో ఉన్న తన కుమార్తె సునీత దగ్గరకు రెండు రోజుల క్రితం వెళ్లింది. కారులో కుమార్తె సునీత, మనుమరాళ్లు లహరి, పెన్నిధితో తిరుగు ప్రయాణం కాగా మార్గం మధ్యలో అదుపు తప్పి కల్వర్టు ఢీకొని బోల్తా పడింది. దీంతో పెంచలమ్మ అక్కడిక్కడే మరణించింది. మిగిలినవారు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్ఆర్సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. -
కేంద్ర నిధులు గడువులోపు ఖర్చు చేయండి
తిరుపతి అర్బన్: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను గడువులోపు ఖర్చు చేయాలని మినిస్ట్రీ అఫ్ ట్రైబల్ అఫైర్స్ కార్యదర్శి విభునాయర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్తోపాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ జాతీ య ఉన్నత్ గ్రామ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన మూడు ఎస్టీకాలనీల్లో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని మేలచ్చూరు ఎస్టీకాలనీ, డక్కిలి మండలంలోని కందులవారిపల్లి, వడమాలపేట మండలంలోని కదిరికుప్పంలో సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాంటివి మ రిన్ని ఎస్టీకాలనీలున్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా విభునాయర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన 500 మంది ఎస్టీలున్న కాలనీలను ఎంపిక చేయాలని చెప్పారు. లేదంటే 50 శాతానికి మించి ఎస్టీలున్న గ్రామాలు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకంలోకి వస్తాయన్నారు. అలాంటి గ్రామాలు జిల్లాలో మరో 25 ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఆ 25 గిరిజన గ్రామాల వివరాలను పంపాలని విభునాయర్ చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ సదా భార్గవి, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి మల్లికార్జున నాయక్, అడిషనల్ డైరెక్టర్లు సరస్వతి, మల్లికార్జున్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ ప్రతిభాభారతి, డీడీ చంద్రిక, నెల్లూరు జిల్లా ఈడీ శ్రీనివాసరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తా
తిరుపతి అర్బన్: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి అధికారి, పాఠశాల, ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ(ఐఏఎస్)కోన శశిధర్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి అధికారిగా కోన శశిధర్, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలసి అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఉపాధి కల్పనలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ చురుగ్గా పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు స్థానిక అవసరాలకు, రాష్ట్ర అవసరాలకు వీలుగా ఉండే పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, డీపీఓ సుశీలాదేవి, డీఈఓ కేవీఎస్ కుమార్, ఎకై ్సజ్ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీఏఓ ప్రసాద్రావు, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, మత్స్యశాఖ జిల్లా అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి జిల్లా ఇన్చార్జి అధికారి కోన శశిధర్ తిరుపతి తుడా: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జి అధికారి కోన శశిధర్ పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లు, మహిళ వర్సిటీ విద్యార్థినులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ టూరిజం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్వీయూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి టౌన్క్లబ్ సర్కిల్ వరకు విద్యార్థులు, అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజంగా మార్చేందుకు విద్యార్థులు ప్లాస్టిక్ రహిత ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ‘రెడ్యూస్ – రీ యూస్ – రీ సైకిల్’ అనే ట్రిపుల్ ఆర్ విధానాన్ని సమాజం అవలంబించాలని కోరారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతికి ప్రథమ స్థానం వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. మహిళా వర్సిటీ వీసీ ఉమా మాట్లాడుతూ ప్లాస్టిక్ సమాజంలో విధ్వంసం సృష్టిస్తుందని, ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నిషేధించేందుకు ప్రతిన పూనాలన్నారు. ఎస్వీయూ వీసీ అప్పారావు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాన రుగ్మత అయిన క్యాన్సర్ కారకంగా ప్లాస్టిక్ వాడకమేనని, సమాజం వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం న్యూబాలాజీ కాలనీలో త్రిపుల్ ఆర్ సెంటర్ను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, మున్సిపల్, జిల్లా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ పాకనాటి హరికృష్ణ, డాక్టర్ మునిలక్ష్మి, మునీంద్ర పాల్గొన్నారు. -
టర్మ్ ఫీజు చెల్లించకుంటే.. పరీక్ష ఫీజు కట్టించుకోం!
● ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదంటే.. మాకేటి సంబంధం ● ఫీజు బకాయిలు చెల్లించి తీరాల్సిందే ● ఎస్వీయూలో విద్యార్థులకు అధికారుల హుకుం ● రంగంలోకి విద్యార్థి సంఘాలు.. అధికారుల తీరుపై ఆగ్రహం ●మంత్రి మాట.. ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని కళాశాలలు విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, ఫీజు కట్టాలని ఒత్తిడి చేసినా ఆ కళాశాలల భరతం పడతాం.. ఇదీ సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరిక. ఎస్వీయూ తీరు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న టర్మ్ ఫీజు లు చెల్లిస్తేకాని పరీక్ష ఫీజు కట్టించుకోం. ఫీజురీయింబర్స్మెంట్ రాలేదంటే..మా కే టి సంబంధం. ఇదీ ఎస్వీయూ అధికారులు మంత్రి మాటలకు ఇచ్చిన విలువ. ఇబ్బంది పెడితే ఊరుకోం విద్యార్థులను ఇబ్బంది పెడితే ఊరుకోం. ఈ విషయమై ఇప్పటికే పలుసార్లు అధికారులను సంప్రదిం చాం. అధికారులు మొండివైఖరి మార్చుకుని పరీక్ష ఫీజును క ట్టించుకోవాలి. టర్మ్ ఫీజుకు ముడిపెడితే వి ద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వ ర్సిటీ అధికారులు వైఖరి మార్చుకోకపోతే విద్యార్థి సంఘాలతో కలసి ఉద్యమిస్తాం. –చిన్న, ఏఐఎస్ఏ, జిల్లా కార్యదర్శి, తిరుపతి జీవితాలతో ఆటలు దారుణం టర్మ్ ఫీజు పేరుతో పరీక్ష ఫీజు కట్టించు కోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవ డం దారుణం. ఎస్వీ యూ అధికారులకిది తగదు. పేద విద్యార్థులే 90 శాతం మంది వర్సిటీలో చదువుతున్నారు. వారు రూ.వేలు కట్టే పరిస్థితి లేదు. విద్యార్థులను టార్ఛర్ చేయడం దారుణం. –రంజిత్ కుమార్, బీపీఈడీ విద్యార్థి, ఎస్వీయూ ఫీజు కట్టలేని పరిస్థితి పేద విద్యార్థులు ఒక్కసారిగా అంత ఫీజు కట్టే పరిస్థితిలేదు. అధి కారులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలే తప్ప, మాలాంటి పేద విద్యా ర్థులను ఇబ్బంది పెట్టడం సమంజంకాదు. స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు స్తంభించిపోయాయి. దీంతో ఒక్క రూపాయి సైతం చెల్లించలేనిస్థితి. –వేణు, బీఈడీ విద్యార్థి, ఎస్వీయూ తిరుపతి సిటీ: కళాశాల విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు గత ఏడాది నుంచి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో ఎస్వీయూలో ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో పీజీ, బీపీఈడీ, బీఈడీ చదువుతున్న పేద విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పెండింగ్లో ఉన్న ఫీజులు చెల్లించాలని కళాశాల అధికారులు ఒత్తిడి చే యడంతో పలుమార్లు అధికారులను బతిమ లాడినా కనికరించలేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తాం టర్మ్ ఫీజులు చెల్లించకుంటే సెమిస్టర్ పరీక్ష ఫీజును కట్టించుకోమని అధికారులు మొండి వైఖరి ప్రదర్శించడం దారుణమని ఏఐఎస్ఏ, పీడీఎస్యూ నాయకులు చిన్న, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్లు ఇవ్వకపోతే టర్మ్ ఫీజులు ఎలా కడతామని ఆవేదన వ్యక్తం చేశారు. టర్మ్ ఫీజులతో సంబంధం లేకుండా వెంటనే పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలసి పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆగ్రహానికి గురికాక తప్పదు పేద కుటుంబాల నుంచి వచ్చాం. రూ.వేల ల్లో టర్మ్ ఫీజులు చెల్లించాలంటే మాటలా..అ ప్పులు చేసే అవకాశం లేదు. అధికారు లు వెంటనే పరీక్ష ఫీజు కట్టించుకోవాలి.లేదంటే వి ద్యార్థుల ఆగ్రహానికి గురికాకతప్పదు. –వంశీ, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి, ఎస్వీయూ మొండి వైఖరి మార్చుకోవాలి పెండింగ్లో ఉన్న ఫీ జురీయింబర్స్ మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ వాటితో సంబంధం లేకుండా టర్మ్ ఫీజు చెల్లించాల్సిందే నంటూ అధికారులు చెబుతున్నారు. పేద విద్యార్థులమైన మేము ఇప్పటికిప్పుడు రూ.వేలు ఎలా చెల్లించాలి. అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలి. –ఈష, బీపీఈడీ విద్యార్థిని, ఎస్వీయూ ఆంక్షలు విధిస్తే ఏం చేయాలి వర్సిటీలో చదువుతోంది మా లాంటి పేదలే. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబ ర్స్, స్కాలర్షిప్లు రా లేదు.. వ స్తే కడతాం. టర్మ్ ఫీజు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టాలంటూ ఆంక్షలు విధిస్తే ఏం చేయాలి. –భవిత, బీపీఈడీ విద్యార్థి, ఎస్వీయూ అందని ఫీజు రీయింబర్స్మెంట్.. టర్మ్ ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలని విద్యార్థులపై కళాశాలల అధికారులు ఒత్తిడి..వెరసి.. పేద విద్యార్థికి ఉన్నత విద్య భారమైంది. తీరా పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయానికి ఎస్వీయూ అధికారులేమో పైసా వసూలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పలు కోర్సుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్ష ఫీజు కట్టించుకోం! ఎస్వీయూలో త్వరలో ప్రారంభం కానున్న పీజీ రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు దగ్గరపడుతోంది. దీంతో పీజీలోని అన్ని కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టేందు అధికారులను సంప్రదించగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న టర్మ్ ఫీజులు చెల్లిస్తేకాని పరీక్ష ఫీజు కట్టించుకోమంటూ హుకుం జారీ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్షిపులు అందలేదని బతిమలాడినా వాటితో తమకు సంబంధం లేదని తెగేసి చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తడ: జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రామాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తమిళనాడు, గుమ్మిడిపూండి తాలూకా, ఆరంబాకం గ్రామానికి చెందిన కే రవి (57) లారీ క్లీనర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను తన సొంత పని పని నిమిత్తం తడ మండలం, రామాపురం గ్రామం వద్ద ఉన్న సిమెంటు షాపు వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లాడు. చైన్నె వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న రవిని అదే మార్గంలో వెళుతున్న ఐషర్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో రవి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు రవిని తమిళనాడులోని ఎళ్లావూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుని కుమారుడు శనివారం ఈ మేరకు తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొడపనాయుడు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించారు. -
భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం
తిరుపతి క్రైమ్: భవనం పైనుంచి పడి ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి ఎస్ఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. గుంటూరుకు చెందిన అబ్రహం కుమారుడు దావీదు(56) శుక్రవారం సాయంత్రం ఆటోనగర్లో ఓ భవనం వద్ద పెయింట్ పనులు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కాలుజారి కింద పడ్డాడు. అయితే దీనిని గమనించిన కార్మికులు వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దావీదు మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వారి బంధువులకు సమాచారం అందించారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
తిరుపతి అర్బన్: స్థానిక బస్టాండ్లోని దుకాణదారులు ప్రయాణికులకు వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆయన శనివారం తిరుపతి బస్టాండ్లోని పలు దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్లాస్టిక్ను వినియోగించకూడదని స్పష్టం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిషేధిత వస్తువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, ఏటీఎం రామచంద్రనాయుడు పాల్గొన్నారు. -
వంటతో పెద్ద తంట
● పని ఒత్తిడితో వంటగదికి మహిళలు దూరం ● ఆన్లైన్ ఆర్డర్లు వైపు మొగ్గు ● సెలవురోజుల్లో హోటళ్లకు వెళ్లడం ఫ్యాషన్గా భావిస్తున్న కుటుంబాలు ● తిరుపతిలో పెరిగిన జొమోటో, స్విగ్గి కల్చర్ ● వంటగదిపై ఆసక్తి చూపని 40 శాతం మంది మహిళలు ● సమయపాలన, ఒత్తిడే కారణం ● రుచికర ఆహారానికి ఆకర్షితులవుతున్న పిల్లలు ఆన్లైన్ ఆహారం వివరాలివీ.. మహిళా ఉద్యోగులు 12,875 నూతన జంటలు 2,140 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల సంఖ్య 7,396 బ్యాచులర్లు 10,250 విశ్రాంత ఉద్యోగులు 3,256 ఒంటరి మహిళలు, పురుషులు 895 వ్యాపారవేత్తలు 1,276 సందర్భం ఆధారంగా ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నవారు 2,564భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం.. ఆన్లైన్ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం. ఇంటి వంటతోనే ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. –డాక్టర్ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి కొత్తగా పెళ్లి అయ్యింది.. వంట సరిగ్గా రాదు మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్లైన్ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. –సరళ, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్లైన్ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. –పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గు కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గ డపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గి సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్లైన్ రేటింగ్ ఆధారంగా హోటల్ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్లైన్ ఆహారంతో గడిపేస్తున్నారు. తిరుపతి తుడా: నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్లైన్ ఫుడ్పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీ లు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గి వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్లైన్ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పైళెన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్లైన్ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నారు. హోటల్కు వెళ్లడం ఫ్యాషన్ సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాచిల ర్లు రూమ్ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రో జూ హోటల్ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్ చే స్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి
తిరుపతి తుడా:జిల్లాలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు నివేధించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మట్లాడుతూ తడి,పొడి చెత్త వేరు చేయడం, డ్రైనేజ్లో చెత్త వేయడంతో దోమల ఉత్పత్తికి ఆవాసాలుగా మారుతా యని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛదివస్పై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శాంతకుమారి, అదన పు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ శ్రీనివాసరావ్, మలేరియా నివారణాధికారి డాక్ట ర్ రూప్కుమార్, వరలక్ష్మి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ తమ వంతుగా ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు పేర్కొన్నారు. ఆస్పత్రిలో శనివారం ఆయన డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఈఎస్ఐ లబ్ధిదారులతో కలసి ‘స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. -
తిరుమలలో అపచారం..
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్చల్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ మహిళతో గొడవకు దిగాడు. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి తిరుమలలో హల్చల్ చేశాడు. నేను లోకల్ అంటూ.. తిరుమల మాడ వీధుల్లో తిరుగుతూ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తాను మద్యం తాగుతాను.. కావాలంటే అక్కడ మద్యం కూడా అమ్ముతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక, విజిలెన్స్ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,987 మంది స్వామివారిని దర్శించుకోగా 26,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: అలిపిరి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 32వ బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్, అలిపిరి డిపో మేనేజర్ సింగంహరిబాబు తెలిపారు. అలిపిరి డ్రైవింగ్ స్కూల్లో హెవీ లైసెన్స్ కోసం శిక్షణ పూర్తి చేసుకున్న 31వ బ్యాచ్కి సర్టిఫికేట్స్ అందించి వీడ్కోలు పలికారు. వారికి శిక్షణ పూర్తి చేసిన సర్టిఫికేట్స్ను అందించారు. అలాగే 32వ బ్యాచ్కి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్తోపాటు మెకానిజంలోనూ పట్టుసాధించేలా శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 496 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. 32వ బ్యాచ్ను శుక్రవారం ప్రారంభించామని చెప్పారు. ఈ నెల 20 నుంచి 33 బ్యాచ్కి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. -
గ్యాసు..మోసమే బాసు
గ్యాస్ సిలీండర్లపై ముద్రితమైన బరువు తప్ప వాస్తవంగా ఎంత ఉందో చాలా మందికి అంచనా ఉండదు. వినియోగదారుని ఎదుట బరువు తూచాకే గ్యాస్ సిలిండర్ను అందించాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్లాంట్ స్థాయి నుంచే మోసాలు జరుగుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ నింపడానికి ముందు మీటర్ రీడింగ్ జీరో.. ఉందో లేదో గమనించాలి. బంకు సిబ్బంది మాటల్లో దింపి దృష్టి మరల్చి రీడింగ్ జంప్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అనుమానం వస్తే పెట్రోల్ బంకులోని ముద్రతో ఉన్న ఐదు లీటర్ల పరిమాణం గల కొలత పాత్ర ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధనం నాణ్యతమీద అనుమానం ఉంటే బంకు దగ్గర ఉన్న ఫిల్టర్ పేపర్ తీసుకుని పరిశీలించాలి.