Tirupati
-
బీఆర్ నాయుడు దూరంగా ఉండటం చంద్రబాబు నటనే: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ నాయుడును అటెండర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్ నాయుడుకు అటెండర్ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.కీలక సమావేశంలోనే బీఆర్ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.బీఆర్ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్ ఐదో తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
ఇక పల్లె పాలన ‘ప్రత్యేక’ం
స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పది రోజుల్లో ముగియనున్నది. అయితే బాబు సర్కారు స్థానిక స్థంస్థల ఎన్నికలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. బాబు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి.. దాన్ని అమలు చేయలేక నిస్సహాయంగా మిగిలింది. దీనికితోడు పలు న్యాయపరమైన సమస్యలున్నాయి. ఈ క్రమంలో పల్లె పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. తిరుపతి అర్బన్: పల్లె పగ్గాలు ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఏప్రిల్ 2తో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తోంది. సాధారణంగా గడువు లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే బీసీ రిజర్వేషన్తోపాటు పలు సాంకేతిక న్యాయపరమైన అంశాలను పరిష్కారంచాల్సి ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జాప్యం అయ్యేలా ఉంది. దీంతో ఏప్రిల్ 2 తర్వాత పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించడానికి జిల్లాధికారులు జోరుగా కసరత్తు చేస్తున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పలువురు ఆశావహులు అలోచనలో పడ్డారు. జిల్లాలో 811 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలకు ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయ, ఉద్యానశాఖ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ఇరిగేషన్ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆరోగ్యశాఖ అధికారులు తదితర విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. అధికారుల కొరత కారణంగా పలు మండలాల్లో రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించనున్నారు. ఎన్నికల జాప్యానికి ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం కొలిక్కిరావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. ఈ చిక్కుముడులు వీడిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని చర్చసాగుతోంది. జూన్ తర్వాత ఎన్నికలుంటాయని రాజకీయ నేతలు అంచన వేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు నిర్వహిస్తే కార్యకర్తలకు వందశాతం సంతృప్తి పరచలేమని, ఏడాదిపాటు ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడుంటుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా సమాచారం... జిల్లా జనాభా : 25.50 లక్షలు మండలాలు: 36 రెవెన్యూ డివిజన్లు: 3మున్సిపాలిటీలు: 5కార్పొరేషన్: 1పంచాయతీలు: 811కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు: 25 నుంచి 30 వరకు -
సీఎం చంద్రబాబుకు సాదర వీడ్కోలు
రేణిగుంట: రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన అనంతరం శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమైన సీఎం చంద్రబాబు నాయుడికి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈఓ ముద్దాడ రవీంద్ర, డీఐజీ షిమోజి బాయ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, భాను ప్రకాష్, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. ముందుగా విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చంద్రగిరిలో చిరుత కలకలం? చంద్రగిరి: మండలంలో చిరుత పులి కనిపించడంతో కలకలం రేగింది. మండలంలోని ఎం.కొంగరవారిపల్లి, నడింపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత గాండ్రింపులు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. శనివారం ఎం.కొంగరవారిపల్లి జగనన్న కాలనీ సమీపంలో ఉపాధి కూలీలు పనులు నిమిత్తం వెళ్లారు. పని పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి సిబ్బంది పనులను ఫొటోలు తీస్తున్న క్రమంలో చిరుత పులి గాండ్రించిన శబ్ధం వారికి వినిపించింది. అలాగే పనులు చేస్తున్న సమీపంలో చిరుతపులి పాద ముద్రలను సైతం సిబ్బంది గుర్తించారు. బోలిగుండు నారవ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తరచూ చిరుత గాండ్రింపులు వినిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారంపై అటవీ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. టీటీడీకి రూ.10 లక్షలు విరాళం తిరుమల: జేఎంసీ ట్రస్టు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులును ముఖ్యమంత్రి అభినందించారు. -
ఈద్ ముబారక్
ఈద్గా మైదానంలో నమాజ్ చేస్తున్న ముస్లింలు నెల‘రోజా’లు భక్తిశ్రద్ధలతో సాగిన దీక్షలు శుక్రవారం నెలవంక తొంగి చూడడంతో జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఈద్గాలకు ర్యాలీగా వెళ్లి సామూహికంగా నమాజ్ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పండుగపూట బంధుమిత్రులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు తోచిన ధాన ధర్మాలు చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి ఎస్వీయూనివర్శిటీ సమీపంలోనున్న ఈద్గా మైదానంలో రంజాన్ వేడులను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకున్నారు. – తిరుపతి కల్చరల్ -
అగ్రిగోల్డ్ యజమానుల ఆస్తులు జప్తు చేయాలి
తిరుపతి కల్చరల్: కస్టమర్లను నట్టే ముంచిన అగ్రిగోల్డ్ యజమానుల బినామీ ఆస్తులు జప్తు చేసి, బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గంధమనేని శివయ్యభవన్లో శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్పేర్ అసోసియేషన్ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం విజయవాడ కేంద్రంగా త్వరలో ప్రత్యేకకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో మేరకు ప్రభుత్వం సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షుడు టి.జనార్దన్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల విలువల నేడు రూ.30 వేల కోట్లకుపైగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, అసోసియేషన జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఉమాశంకర్, జయచంద్ర, జయరామయ్య, ఉమాదేవి, ఉమారాణి, సుశీల, రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలో యథేచ్ఛగా మట్టి తరలింపు
ఏర్పేడు: మండలంలోని చిందేపల్లిలో తెలుగు తమ్ముళ్లు కాసులవేటలో ఉన్నారు. బరితెగించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా రవాణా చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వారి అక్రమాలను అరికట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏర్పేడు మండలం చిందేపల్లిలో గత ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరవాసులకు ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇళ్లను నిర్మించారు. అయితే శనివారం చిందేపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఏకంగా జగనన్న కాలనీలో జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో గుంతలు తవ్వి ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించారు. ఈ తంతు పట్టపగలే జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూసిన అధికారి లేరు. జగనన్న కాలనీలో వీధులకు మట్టి తోలుకోమని హౌసింగ్ అధికారులు తమకు అనుమతులిచ్చారని చెప్పుకుంటూ యథేచ్ఛగా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తవ్వి తరలిస్తున్నారు. 10 అడుగుల లోతుకు పైగా మట్టిని తవ్వేయడంతో సమీపంలో నిర్మించిన ఇళ్లు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అయితే మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మండలంలోని నచ్చనేరి అటవీ ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా రేయింబవళ్లు మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నా అధికారగణం మిన్నకుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పల్లెల్లో భయం.. భయం
కలువాయి(సైదాపురం): గ్రామాల్లో చెత్త సేకరించుకుంటున్న నెపంతో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలని టార్గెట్ చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల కిందట కలువాయి మండలం పెన్న బద్వేలులో చెత్త ఏరుకుంటూ సంచరిస్తున్న నగురులు మహిళలు పెన్న బద్వేల్ పాత ఊరు ఎస్సీ కాలనీలో తుమ్మల రమేష్ కుమార్తెకు చాక్లెట్లు ఇస్తూ చూట్టూముట్టడంతో ఆ బాలిక కేకలు వేయడంతో కాలనీ వాసులు అక్కడకు చేరుకుని గుర్తు తెలియని మహిళలను అడ్డగించారు. అయితే వారు సమీపంలో ఉన్న ఆటో ఏక్కి పరాయ్యారని కాలనీ వాసులు తెలిపారు. -
భారత ప్రభుత్వ హిందీ సలహా కమిటీ సభ్యుడిగా పీసీ రాయులు
తిరుపతి కల్చరల్: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందీ సలహా కమిటీ సభ్యుడిగా తిరుపతికి చెందిన డాక్టర్ పీసీ రాయులను నామినేట్ చేస్తూ శనివారం భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈయన గతంలో ఎఫ్సీఐ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, బొగ్గు, ఉక్కు పరిశ్రమలు వంటి చట్టబద్ధమైన సంస్థల్లో సభ్యునిగా పని చేశారు. ఆయన మూడేళ్ల కాల వ్యవధి గల ఈ హిందీ సలహా కమిటీ సభ్యుడుగా కొనసాగనున్నారు. -
వైభవంగా మత్స్య జయంతి
నాగలాపురం: మండలంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగు, దొరై, దేవరాజ్ భట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, మూలవర్లకు నిత్య కై ంకర్యాలు పూర్తి చేసి, దీప దూప నైవేద్యాలు సమర్పించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులను తిరిచ్చి వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. మత్స్య జయంతి సందర్భంగా మత్స్య కారులు మాల ధరించి, ఇరుముడులతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. తరువాత రాములవారి మండపంలో మహా శాంతి హోమం నిర్వహించి, స్వామి వారికి స్నప తిరుమంజనం చేసి, అభిషేక జలాన్ని భక్తులపై చల్లారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు గరుడవాహనంలో స్వామివారి ఉత్సమూర్తులు కొలువదీరి తిరువీధుల్లో ఊరేగారు. సూపరింటెండెంట్ శంకరయ్య, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్ కుమార్, ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గరుడ వాహనంపై లోకాభిరాముడు
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి లోకాభిరాముడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. ఉదయం 8 స్వామివారి పల్లకీ సేవ వేడుకగా సాగింది. ఈ సందర్భంగా మోహినీ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి పల్లకీలో కొలువై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 9.30 గంటలకు గరుడ పాదుకల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం 10 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. శ్రీకోదండరామునికి గొడుగులు శ్రీభాష్యకార కై ంకర్య ట్రస్ట్ వారు శ్రీకోదండరామస్వామివారికి శనివారం నాలుగు గొడుగులు కానుగా అందజేశారు. తమిళనాడుకు చెందిన శ్రీభాష్యకార కై ంకర్య ట్రస్ట్ అధ్యక్షుడు మాధవ నాయుడు, ఫౌండర్ ట్రస్టీ దినేష్కుమార్ ఆధ్వర్యంలో ఈ గొడుగులు తీసుకొచ్చి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నకు అందజేశారు. -
● వియ్యాల వారి విందు
నాయుడుపేట పట్టణానికి చెందిన కొత్త అల్లుడు పఠాన్ ఆరాఫత్కు ఆయన అత్తమామలు గౌస్బాషా, షాహినా దంపతులు షడ్రుచులతో కూడిన 60 రకాల వంటలతో విందు పెట్టారు. గౌస్బాషా, షాహినా దంపతుల కుమార్తె షామిదకు ఇటీవల పఠాన్ అరాఫత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో రంజాన్ పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి మటన్, చికెన్, రొయ్యల బిర్యానీతోపాటు మటన్, చికెన్ హలీమ్లు, వివిధ రకాల వంటలు, స్వీట్లు తదితరాలను ప్రత్యేకంగా తయారు చేసి విందు భోజనం పెట్టారు. అల్లుడు, కూతురిపై తమకున్న అభిమానన్ని చాటుకున్నారు. – నాయుడుపేట టౌన్ -
క్యాంపస్ డ్రైవ్లో 20మందికి ఉద్యోగాలు
తిరుపతి సిటీ: స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తమిళనాడులోని చైన్నెకి చెందిన వీల్స్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శనివారం పాలిటెక్నిక్ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటర్వ్యూలకు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలోని పలు పాలిటెక్నిక్ల నుంచి ట్రిపుల్ఈ, ఈసీఈ, మెకానికల్, ఆటోమొబైల్స్ విభాగల నుంచి రాత పరీక్షలో అర్హత సాధించిన 58 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కంపెనీ హెచ్ఆర్, టెక్నికల్ బృందాలు రెండు రౌండ్లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించి 20మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వై ధ్వారకనాథ్రెడ్డి మాట్లాడుతూ విద్యాభ్యాసానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య వారధిగా నిలుస్తూ, విద్యార్థులకు నాణ్యమైన ప్లేస్మెంట్ అవకాశాలను అందించడంలో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందుంటుందని తెలపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ రాధ, ఆర్ జయచంద్ర, బాలాజీ, కంపెనీ ప్రతినిధులు మణికందన్, విజయ్, ఆకాష్ పాల్గొన్నారు గుర్తు తెలియని వ్యక్తి మృతి తిరుపతి క్రైం : నగరంలోని రవీంద్ర నగర్లో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. రవీంద్ర నగర్లోని విద్యుత్ సబ్స్టేషన్ పక్కన శనివారం ఉదయం సుమారు 35 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందజేశారు. వారు వచ్చి సంఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఎడమ చేతిపై ‘సుబ్బు‘ అనే పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. అలాగే అతను నలుపు రంగు టీషర్ట్, తెలుపు రంగు 3/4 ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన బంధువులెవరైనా ఉంటే వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసింహరావును సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం కోసం 9440796752, 9154141869 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. తెలుగుగంగ కాలువలో యువకుడి గల్లంతు వెంకటగిరి రూరల్: పట్టణంలోని బంగారుపేట సమీపంలో ఉన్న తెలుగంగ కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. బంగారుపేటకు చెందిన చెంజి రమేష్ (39) వెంకటగిరి పట్టణంలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం బహిర్భూమి కోసం తెలుగంగ వంతెన వద్దకు వెళ్లి కాలువలో కాళ్లు కడుగుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొపోయి గల్లంతయ్యారు. ఈ మేరకు రాపూరు అగ్నిమాపక అధికారి కుప్పయ్య నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలసి తెలుగంగ కాలువలో రమేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. రమేష్కు భార్య, తండ్రి ఉన్నారు. -
ఇసుక దోపిడీపై ఫిర్యాదు
పెళ్లకూరు: నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణముఖినదిలో ఇసుక దోపిడీని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిది చిందేపల్లి మధుసూదన్రెడ్డి శనివారం అడ్డుకుని రెవెన్యూ, మైనింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రదేశానికి ఆయన చేరుకుని, అక్కడ ఇసుక దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్వర్ణముఖినదిలో ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో ఇచ్చిన డీసిల్టింగ్ అనుమతులు మాటున యంత్రాలతో 20 అడుగులు పైగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో తాగు, సాగునీటికి కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణముఖినదిలోని పైపొరను రోజు వారీ కూలీలతో తవ్వకాలు జరిపి అవసరాల నిమిత్తం తీసుకెళ్లేందుకు జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారన్నారు. ఆ అనుమతులు ఇక్కడ కాంట్రాక్టర్ భేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలతో కలిసి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. కూటమి నేతల చేస్తున్న ఇసుక దోపిడిని అడ్డకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిలతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు ప్రిస్కిల్లా, ఎంపీపీ శేఖర్రెడ్డిలతో పాటు 26మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం మంచిదికాదన్నారు. ఇసుక తవ్వకాల విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్న యంత్రాలను రెవెన్యూ సిబ్బందికి అప్పగించి, స్థానిక తహసీల్ధార్ హరికృష్ణకు, వీఆర్వో వంశీకృష్ణకి ఫిర్యాదు చేసినప్పటికి స్పందించకపోవడంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆనంద్, కౌషిక్రెడ్డి, కార్తిక్రెడ్డి, సునీల్, మహేష్లు ఉన్నారు. -
బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారా?
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో మరో వివాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గైర్హాజరయ్యారు. కనీసం సీఎం చంద్రబాబు స్వాగత కార్యక్రమంలో కూడా బీఆర్ నాయుడు కనిపించలేదు. టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం చంద్రబాబుకు ఎందుకు స్వాగతం చెప్పలేదు.. సమీక్షా సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారనేది అనేక సందేహాలకు తావిచ్చింది.బీఆర్ నాయుడిని సీఎం చంద్రబాబు కావాలనే దూరం పెట్టారా? అనే అనుమానం వస్తుంది. ఇటీవల బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం కావచ్చొనది పలువురి అభిప్రాయంగా ఉంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు.. టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. మరి అటువంటి సమావేశానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు హాజరు కాలేదనేది ఇక్కడ ప్రశ్న. టీటీడీలో అంతర్గత విభేదాలా.. లేక ప్రోటోకాల్ వివాదమా? అనేది అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
ఎవరికీ వంటబట్టలే!
తిరుపతి అర్బన్: మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో ఒకరిద్దదు కాదు.. 28 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పస్తులు ఉండాల్సిన దుస్థితి తిరుపతి జిల్లాలో నెలకొంది. వంట నిర్వాహకులు చేతులెత్తేయడంతో శుక్రవారం తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలు, అలాగే వడమాలపేట, రామచంద్రాపురంలోని 40 శాతం పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించకపోవడంతో వారంతా పస్తులతో ఇంటికి వెళ్లారు. ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న క్రమంలో ఉదయం 7.45 గంటలకు పాఠశాలకు చేరుకున్న పిల్లలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలో ఉంటారు. అనంతరం పాఠశాలలో పెట్టే భోజనం తీసుకున్న తర్వాత ఇంటికి వెళతారు. అయితే శుక్రవారం భోజనం లేదని చెప్పడంతో నిరుత్సాహంతో నీరసంగా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. విద్యార్థులకు అందని ఇస్కాన్ భోజనం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారి ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు, అలాగే రామచంద్రాపురం, వడమాల పేట మండలాల్లోని 40 శాతం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మధ్యాహ్న భోజనం రోజు అందిస్తుంటారు. మొత్తంగా 494 పాఠశాలల్లోనే 38 వేల మందికి ఇస్కాన్ భోజనం సరఫరా చేస్తుంటారు. అందులో తిరుపతి అర్బన్ మండలాన్ని మినహాయిస్తే 28 వేల మంది పిల్లలకు శుక్రవారం మధ్యాహ్న భోజనం అందలేదు. విద్యాశాఖ సమన్వయ లోపం రంజాన్ పండుగ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి 10 గంటలపైన రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించి, శుక్రవారం పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ విషయం గురువారం రాత్రి 10 గంటలపైన ఇస్కాన్ యాజమాన్యానికి సమాచారం అందించాల్సి ఉంది. అయితే వారికి సకాలంలో సమాచారం అందలేదని శుక్రవారం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేపట్టలేదు. ఆ తర్వాత తిరుపతి సమాచారం వచ్చినప్పటికి వంట మాస్టర్లతోపాటు నిర్వాహకులు, సిబ్బంది అందుబాటులో లేరని భోజనం తయారు చేయని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ఒకరిద్దరు వంట మాస్టర్లతో తిరుపతి అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అన్నం ,ఆకుకూరలు, పప్పుతో కూడిన భోజనం అందించారు. తిరుపతి రూరల్, రేణిగుంట, వడమాలపేట , రామచంద్రాపురం మండలాల్లోని పాఠశాలల్లోని పిల్లలకు భోజనం అందలేదు. దీంతో వారంతా పస్తులతో బాధతో ఇంటికి వెళ్లారు. ఆకలి విద్యకు ఆటంకం కాకూడదు.. పిల్లలు కడుపు నిండా తినాలి.. కళకళ లాడుతూ ఇళ్లకు వెళ్లాలన్నది ప్రభుత్వం సంకల్పం.. ఇదే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే వంట నిర్వాహకులు.. విద్యాశాఖాధికారుల మధ్య సమన్వయ లోపం.. సమాచార అంతరాయం.. అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం వెరసి పేదపిల్లలు శుక్రవారం మధ్యాహ్నభోజనం మిథ్యగా మారింది. ఫలితంగా చిన్నారులు ఆకలితో నకనకలాడుతూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది.సమాచారం అందిన వెంటనే తెలియజేశాం రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిన వెంటనే శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మద్యాహ్నం భోజనం సిద్ధం చేయాలనే సమాచారాన్ని ఇస్కాన్కు ఇచ్చాం. అయితే గురువారం రాత్రి సమాచారం ఆలస్యంగా వచ్చింది. ముందుగా శుక్రవారం సెలవుగా నిర్ణయించి, ఆ తర్వాత శుక్రవారం పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని శనివారం రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించాలని సమాచారం ఇచ్చారు. వంట మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో అందరికీ భోజనం అందించలేకపోయామని వారు వెల్లడించారు. ఇకపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. –కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
సెమీ–ఆటోమెటిక్ పరికరాల అభివృద్ధే లక్ష్యం
ఏర్పేడు: రైతులకు ఉపయోగపడే రీతిలో సెమీ ఆటోమెటిక్ వ్యవసాయ పరికరాల అభివృద్ధే లక్ష్యమని తిరుపతి ఐఐటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ తమిదా సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి ఐఐటీలోని రీసెర్చ్ పార్క్లో వడమాలపేట మండలానికి చెందిన రైతులకు సెమీ–ఆటోమెటిక్ వ్యవసాయ పరికరాల అభివృద్ధి ప్రాజెక్ట్లో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన సీడ్ (సైనన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్) విభాగం స్పాన్సరింగ్ ఏజెన్సీగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ పరిశోధకులు రూపొందించిన యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ వంటి ల్యాబ్ పరికరాలు, వేరుశనగ పొట్టు తీసే యంత్రాలపై ప్రజెంటేషన్లు జరిగాయి. ఈ ల్యాబ్ ద్వారా వ్యవసాయ పరికరాల రంగంలో భవిష్యత్లో మరిన్ని నూతన ఆవిష్కరణలకు ఒక కేంద్రంగా నిలిచేందుకు కృషి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ అజయ్కుమార్, వ్యవసాయ అధికారి విజయకుమార్, వడమాలపేట గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ షాపుల టెండర్కు దరఖాస్తుల ఆహ్వానం
కాలువలో లారీ బోల్తా ఏర్పేడు మండలం నాగంపల్లి సమీపంలోని కాలువలో ధాన్యం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు.తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లాలోని ఆర్టీసీ డిపోల పరిధిలో ఉన్న బస్స్టాండ్లలో షాపుల నిర్వహణకు టెండర్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ ఎం.జగదీష్ తెలిపారు. టెండర్ దరఖాస్తులు ఆయా డిపో మేనేజర్ కార్యాలయాల పనివేళల్లో పొందవచ్చన్నారు. కాగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు గడువు నిర్ణయించినట్లు తెలిపారు. అదే రోజు పూర్తి చేసిన దరఖాస్తులను మధ్యాహ్నం 2 గంటల లోపు తిరుపతి జిల్లా ప్రజా రవాణ శాఖ వారి కార్యాలయంలోని టెండర్ బాక్సులో దాఖలు చేయాలన్నారు, అదే రోజు మధ్యా హ్నం 3 గంటలకు టెండరు దారుల సమక్షంలో టెండర్లు తెరువనున్నట్లు తెలిపారు. స్టాళ్లు, షాపులు ఖాళీ స్థలాల సంఖ్య109 చేపట్టనున్న టెండర్ ప్రక్రియలో ఆసక్తిగలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. తిరుపతి డిపోలోని శ్రీహరి, అన్నమయ్య, శ్రీనివాస, ఏడుకొండలు, రేణిగుంట బస్స్టాండ్, రంగంపేట కమర్షియల్ కాంప్లెక్స్, చంద్రగిరి పల్లెవెలుగు బస్టాండ్, పాకాల, నేండ్రగుంట, భాకరాపేట, పుత్తూరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరు, సత్యవేడు, కేవీబీ పురం, ఏర్పేడు, నాగలాపురం, వరదయ్యపాళెం, వాకాడు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, బాలాయపల్లి బస్టాండ్లలోని షాపులకు టెండర్ల ప్రక్రియ ఉంటుందన్నారు. వివరాలకు ఆయా పరిధిలోని ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించాలని కోరారు. ఆదిలక్ష్మీదేవికి వజ్రాల మంగళసూత్రం రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి హైదరాబాద్కు చెందిన వసంతపు శ్రీనివాస్, మాధవి దంపతులు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు శుక్రవారం బహూకరించినట్లు ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు మంగళసూత్రం, వెండికాలి పట్టీలు, వెండి మెట్లు అందించినట్లు ఆయన తెలిపారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేకపూజలు, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించినట్లు ఆయన తెలిపారు. -
బాబుపై వ్యతిరేకత
రెండేళ్లలోనే వైఎస్సార్ సీపీ బూత్కమిటీ రాష్ట స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా ‘బాబు సర్కారు గద్దెనెక్కి రెండేళ్లు.. అప్పటి నుంచి ఆడంబరపు మాటలు.. అభివృద్ధి పేరిట ఆకాశయానాలు.. అప్పుల కుప్పలు.. వెరసి పడకేసిన అభివృద్ధి.. అమలుకు నోచుకోని హామీలు.. అందని సంక్షేమం.. ఫలితంగా బాబు పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.’ అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బూత్ కమిటీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. జాబితాలో డబ్లింగ్ ఓట్లను తొలగించాలి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ బూత్ లెవల్, ఎలక్షన్ ఏజెంట్లకు ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు, చైన్నెలో స్థిరపడివారి ఓట్లు 15వేల నుంచి 20 వేలు ఉన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మనకంటే ముందుగా ఎన్నికలు జరగడంతో అక్కడ ఓట్లు వేసి, మళ్లీ ఇక్కడ ఓట్లు వేస్తున్నారన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు నుంచి వచ్చి పంచాయతీకి రూ.కోటి వరకు ఖర్చు చేసినవారు ఉన్నారన్నారు. ఇలాంటి డబుల్ ఓటింగ్ వేసే వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నారు. భూమన కరుణాకరరెడ్డి మా ట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చి న హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎంతసేపు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం, దుర్భాషలాడడం తప్ప మరొకటి లేదన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించి, అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను చేర్చకుండా చూడాలన్నారు. పార్టీ నేతలమైన తాము ఎంత కష్టపడినా బూత్కమిటీలు, బీఎల్వోలు సక్రమంగా పనిచేస్తేనే వైఎస్సార్ సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఎలక్షన్ కమిషన్ పెట్టే ప్రతి సమావేశానికి బూత్ కమిటీలు, బీఎల్వోలు హాజరుకావాలన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మనపార్టీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి గ్రహణం పట్టుకుందన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి పడకేసి, రాష్ట్ర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తెచ్చే రూ.లక్షల కోట్ల అప్పులు దేనికి ఖర్చుపెడుతున్నారో ఆ దేవుడికే ఎరుకన్నారు. ఏదైనా మాట్లాడితే అమరావతి అభివృద్ధి తప్ప చంద్రబాబు నోట మరొకటి రాదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. రాబోయే ఎన్నికల్లో అలా కాకుండా పట్టిష్టంగా బూత్కమిటీలు పని చేసి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ బూత్కమిటీలు సమర్థవంతంగా పనిచేసినప్పుడే వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ఆ బాధ్యత మనందిరిపై ఉందన్న విషయాన్ని బూత్కమిటీలన్నీ గుర్తు పెట్టుకుని పనిచేయాలని కోరారు. వైఎస్సార్సీపీ గెలుపునకు బూత్ కమిటీలే కీలకమన్నారు. జగనన్న మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, మాజీ మేయర్ శిరీష, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, బూత్కమిటీ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం దొంగ ఓట్లతో జాగ్రత్త -
పెంచలకోన ఆలయానికి రూ.20.78 లక్షల ఆదాయం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఏప్రిల్ మాసంలో జరిగే లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు శుక్రవారం జరిగిన వేలం పాటల్లో దేవస్థానానికి రూ.20.78 లక్షల ఆదాయం వచ్చిందని ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 26 నుంచి జూన్ 7వ తేదీ వరకు 49 తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు వేలం పాటలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వేలం పాటల్లో రూ.20.78 లక్షల రాబడి వచ్చిందన్నారు. కాలువలో లారీ బోల్తా ఏర్పేడు: వెంకటగిరి మార్గంలోని నచ్చనేరి సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా శుక్రవారం సాయంత్రం ధాన్యం లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో లారీ క్లీనర్ దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి కథనం మేరకు.. వరదయ్యపాళెంలోని కుమారస్వామికి చెందిన లారీ శుక్రవారం ఏర్పేడు మండలం నాగంపల్లికి చేరుకుని, మహానందరెడ్డి అనే రైతు పొలంలో ఉన్న ధాన్యం 300 బస్తాలు లోడ్ చేసుకుని బయలుదేరింది. ఏర్పేడు– వెంకటగిరి రహదారిలోకి వస్తున్న క్రమంలో డేవిడ్ లూయిస్ లెప్రసీ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఎస్ఎస్ కెనాల్లో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గోపికి స్వల్ప గాయాలు కాగా, క్లీనర్ రూపేష్ చౌదరి(32) క్యాబిన్లో ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. బిహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్కు చెందిన రూపేష్ చౌదరి రెండేళ్లుగా కుమారస్వామి వద్ద లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఏర్పేడు పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న క్లీనర్ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల: హైదరాబాద్కు చెందిన ముత్తా గౌతమ్ దంపతులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు. -
కొలువొక స్వప్నం.. పండుగ పూట ప్రగల్భం
ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు.. గద్దెనెక్కి రెండేళ్లు.. అయినా అమలుకు నోచుకోని హామీలు.. జాబ్ క్యాలెండర్ పేరిట ఉగాది వేళ బాబు ప్రగల్భం.. తీరా చూస్తే తూతూ మంత్రంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ తేదీలు.. అరకొర ఉద్యోగాల భర్తీకి జారీ చేయనున్న నోటిఫికేషన్లకు లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ.. వెరసి కొలువొక స్వప్నంగా మిగిలింది.. ఫలితం నిరుద్యోగ యువత ఆగ్రహం వెలిబుచ్చుతోంది. తిరుపతి సిటీ: ఉగాది రోజున ప్రభుత్వం జాబ్ క్యాలెండ్ విడుదల చేస్తోందని ప్రకటించడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు సర్కార్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. 10 వేల ఉద్యోగాలు ఈ ఏడాది పొడువునా భర్తీ చేస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం జాబ్ క్యాలెండర్ పేరుతో పదివేల పోస్టులు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసే ప్రకటనలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2 లక్షల మందికి దాటుతున్న వయోపరిమితి చంద్రబాబు సర్కార్ పాలన రెండేళ్లు గడిచింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో వయోపరిమితి మించిపోవడంతో తిరుపతి జిల్లాలో ఏటా సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ఎదురు చూసిన ఎంతో మంది నిరుద్యోగులు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లి చిన్న చిన్న కంపెనీల్లో చిరుద్యోగంతో జీవనం సాగిస్తున్నారు. -
జగనన్నను సీఎం చేసేవరకు నిద్రపోం
తిరుపతి సిటీ: ‘జగనన్నను ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రపోం.. అభినయ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. భూమన కుటుంబం ఆప్యాయత, ఆదరణ మరువలేం’ అని తాజా మాజీ కార్పొరేటర్లు ప్రతినబూనారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ సన్మాన సభకు మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన్ అభినయ్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తాజా మాజీ మేయర్ డాక్టర్ శిరీషతోపాటు మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తాజా మాజీ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతిని పాలించిన ఎంతో మంది మహానీయులకు సాధ్యం కానీ అభివృద్ధిని భూమన అభినయ్రెడ్డి అనతి కాలంలోనే చేసి చూపించారన్నారు. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. తరువాత భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తన 53 ఏళ్ల రాజకీయ జీవితంలో సన్మానాలకు దూరంగా ఉన్నానని, ఇది తనకు తొలి సన్మానమని చెప్పారు. ప్రతి కార్యకర్త, సభకు విచ్చేసిన ప్రతి కార్పొరేటర్ను తన కుటుంబ సభ్యులు, బంధువులుగా భావించి అండగా ఉండడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ సన్మానం చివరిది కావచ్చని సభలో వెల్లడించారు. చారిత్రక అభివృద్ధికి చిహ్నంగా అభినయ్ తిరుపతి నగర రూపురేఖలు మార్చిన యువనేత అభినయ్ నగర చారిత్రిక అభివృద్ధికి చిహ్నంగా మారారని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కొనియాడారు. డిప్యూటీ మేయర్ హోదాలో ఆయన చేసిన మాస్టర్ ప్లాన్రోడ్లతో తిరుపతి రూపం మారిందన్నారు. గాడ్ ఫాదర్లా భూమన కుటుంబం ఎంతో మంది సామాన్యులను రాజకీయ నేతలుగా తీర్చిద్దిందని చెప్పారు. పులికడుపులో పులి పుడుతుందన్న చందంగా భూమన అభినయ్ తిరుపతి ప్రజలకు వరమని కొనియాడారు. వచ్చే ఎన్నికలల్లో అభినయ్ని ఎమ్మెల్యేగా, జగనన్నను సీఎంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని సూచించారు. సమష్టికృషితో అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నగర మేయర్ డాక్టర్ శిరీష సహకారంతో కార్పొరేటర్లతో కలసి సమష్టిగా నగరాభివృద్ధికి కృషి చేశామని మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి అన్నారు. ఎప్పుడూలేనంత అభివృద్ధిని తిరుపతి ప్రజలు కళ్లారా చూశారన్నారు. తిరుపతి ఉన్నంత కాలం నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్ను ప్రజలు మరచిపోరన్నారు. 2022 జులై 15వ తేదీ నగరంలోని ప్రతిపాదించిన 14 మాస్టర్ ప్లాన్ రోడ్లకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. అనుకున్న 14 మాస్టర్ ప్లాన్ రోడ్లుతో పాటు మొత్తం 21 రోడ్లును నిర్మించి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వం ఎదుట మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రతిపాదన పెట్టామని, కానీ ఇప్పటివరకు ఆ ఊసేలేదన్నారు. భూమన ఆదర్శనీయులు నగర మేయర్గా తాను భూమన కుటుంబం సభ్యుల నుంచి ఎంతో నేర్చుకున్నానని భూమనకరుణాకరరెడ్డి ఆదర్శనీయులని తాజా మాజీ మేయర్ శిరీష అన్నారు. కరుణాకరరెడ్డి ఉద్యమనేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన యోధుడన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఏదో చేయాలని తపన పడే వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి ఆయన అని కొనియాడారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఆయన పడే తపన వర్ణించలేదని చెప్పారు. సమయ పాలన, వాక్ చాతుర్యం, క్రమశిక్షణ వంటి విషయాలను ఆయన వద్ద నేర్చుకున్నానని తెలిపారు. అలాగే డిప్యూటీ మేయర్గా పనిచేసిన భూమన అభినయ్ తిరుపతికి దేవుడిచ్చిన వరమన్నారు. అతి చిన్న వయస్సులో చారిత్రక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మించడాన్ని యావత్ నగర ప్రజలు గర్వించారన్నారు. సాధారణ వ్యక్తులమైన మనందరికీ రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆ కుటుంబానికి రుణపడి ఉంటామన్నారు. -
బాబు ఉద్యోగాలిస్తానంటే నమ్ముతారా?
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని, ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ డ్రామాలు ఆడితే ప్రజలు, నిరుద్యోగులు, యువత నమ్మే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దమ్ముధైర్యం ఉంటే చెప్పిన తేదీలోపు డ్రామాలు ఆడకుండా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత తమ ప్రభుత్వంలో యువతకు ఇచ్చిన ఉద్యోగాలు తమపై కోపంతో పీకేశారని చెప్పారు. ప్రతిపక్షనాయకులను ఎదుర్కోలేక సుమారు 30 వేల మంది ఉద్యోగుల కడుపు కొట్టారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో యువకులకు తమ హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే తమపై కోపంతో వారికి ఉద్యోగాలు పీకేసి, వారి కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగులుతుందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అలివికానీ హామీలిచ్చి అధికారం చేపట్టాక వాటిని తుంగలో తొక్కడం, నక్కజిత్తుల మాటలు చేప్పడం మామూలేనన్నారు. రెండేళ్లుగా ప్రతి నెలా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెట్పీటీసీ సభ్యురాలు రత్నమ్మ, నాయకులు చెవు శ్రీనివాసులురెడ్డి, మందల నాగేంద్ర, నందబాల, సుబ్బరామరాజు, డీవీరమణ, మలిశెట్టి వెంకటరమణ, బండారు మల్లికార్జున, కస్తూరి రామకృష్ణ, పర్వతం విజయ్కుమార్రెడ్డి, శ్రీరాంవినోద్, గని, దామర్ల సిద్ధయ్య పాల్గొన్నారు. -
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై విజిలెన్స్ దాడి
శ్రీకాళహస్తి: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అందిన విశ్వసనీయ సమాచారంతో శ్రీకాళహస్తిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న ఒక ప్రొవిజన్ షాపు వెనుక భాగంలో గ్యాస్ను అక్రమంగా నింపి, విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో అధికారులు రెవెన్యూ సిబ్బంది సహకారంతో తనిఖీలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ‘శివ గణేష్’ పేరిట నడుపుతున్న దుకాణం వెనుక అక్రమంగా నాగరాణి అనే మహిళ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటిలోని గ్యాస్ను కమర్షియల్ సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో మొత్తం 88 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్కు ఉపయోగించే పరికరాలు, త్రాసులు, రాడ్లు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్పీ గ్యాస్కు చెందిన డొమెస్టిక్ సిలిండర్లతోపాటు అనధికారిక కంపెనీలకు చెందిన సిలిండర్లు కూడా లభించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 57, 272 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’
తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్ సిక్స్తో సూపర్ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గులేని బీఆర్ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్.. బీఆర్ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్కే రోజా విమర్శించారు. -
ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండడాన్ని గురువారం ఆర్టీసీ కంట్రోలర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ రామమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉండవచ్చని, చొక్క లేకుండా గళ్ల లూంగీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాం పక్కనే ఖాళీ మద్యం బాటిల్ పడి ఉండడంతో మద్యం సేవించి నీళ్ల దాహంతో గొంతు తడారిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్టు తిరుమల : టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన యోగేష్ అనే వ్యక్తి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని, దర్శన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం యోగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత పాపులారిటీ కోసం యోగేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని, టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తిరుమలకు రానీయకుండా కూడా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాముడు హెచ్చరించారు. ముక్కంటి సేవలో కేంద్రమంత్రి శ్రీకాళహస్తి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి శ్రీకాళహస్తి: పట్టణలలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చూరీకి తరలించారు. ఇతని గురించి తెలిసిన వారు శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులను సంప్రదించాలని వారు కోరారు. -
● నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు ● గద్దెనెక్కి రెండేళ్లైనా ఆచరణకు నోచని హామీలు
వరదయ్యపాళెం: ఎన్నికల సమయంలో చంద్రబాబుతోపాటు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడుకు పలు హామీలిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తకావస్తోంది. అయినా ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదు. అభివృద్ధి పరంగా వెనుకబడిన సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ ఎన్నికల సమయంలో సత్యవేడుకు వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఆయన మోసపూరిత హామీలను నమ్మిన నియోజకవర్గ ప్రజలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదిమూలాన్ని గెలిపించారు. ఎమ్మెల్యే సైతం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పలు హామీలు ఇచ్చినప్పటికీ ఒకటి కూడా ఆచరణ కాలేదు. హామీలిచ్చి పరిష్కారం కాని సమస్యలివే.. -
అకాల వర్షం..అపార నష్టం
చంద్రగిరి: అకాల వర్షం కారణంగా రైతులు పంటలను కోల్పోయి అపారంగా నష్టపోయారు. బుధవారం రాత్రి మండలంలో సుమారు రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని బందార్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కారణంగా వరి, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. పంటలను నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. గోనుపల్లిలో వడగళ్లు వాన రాపూరు: మండలంలోని గోనుపల్లిలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్లు వర్షానికి వరి, మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. గ్రామంలో సుమారు 300 ఎకరాల వరి పంట కోతకు వచ్చిందని, కొందరు వరి కోతలు కోయగా మరికొందరు వరి కోత కోయాల్సి ఉందని చెప్పారు. వర్షంతో ధాన్యం మొత్తం రాలిపోగా పంట నెలకొరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. అలాగే మామిడి పూత, కాయలు రాలిపోయాయన్నారు. మంచి ధర ఉన్న సమయంలో గాలికి నిమ్మకాయలు రాలిపోయి, తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు బోరుమంటున్నారు. పంట నష్టాన్ని వ్యవసాయాధికారి సోమ సుందర్ అంచనా వేశారు. శుక్రవారం ఉద్యానవన శాఖ అధికారులు పంటను పరిశీలిస్తారని ,పంట నష్టంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. -
పరాభవ నామ సంవత్సరమంతా శుభాలే
శ్రీకాళహస్తి: పరాభవ నామ సంవత్సరమంతా శుభాలేనని శ్రీకాళహస్తీశ్వరాలయ ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణశర్మ అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం శ్రీకాళహస్తీశ్వరాలయంలోని స్వామివారి సన్నిధి వద్ద పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పంచాంగ పఠనం చేస్తూ ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రతి రాశివారు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు బాగా కురుస్తాయన్నారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ఊంజల్సేవ మండపం వద్ద గురువారం రాత్రి జరిగిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ అవధాని మేడసాని మోహన్ మాట్లాడుతూ ఈ ఏడాది రాశులపై అంత దుష్ప్రభావం ఏమీ చూపడంలేదన్నారు. శ్రీకాళహస్తిలో పుట్టినవారికి దక్షిణామూర్తి, జ్ఞానాంబ, శివయ్య అనుగ్రహంతో ఎంతటి కష్టానైనా ఎదుర్కోగలుగుతారన్నారు. అనంతరం వారిని ఆలయాఽధికారులు వారిని ఘనంగా సన్మానించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల పురవిహారం ఉగాది సందర్భంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి పురవిహారం చేశారు. ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లు పురవిహారం చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
విధులకు వెళుతూ అనంతలోకాలకు..!
ఏర్పేడు: ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో నాగంపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు ఎస్ఐ రవిప్రకాష్ కథనం మేరకు.. ఏర్పేడు మండలం ఆమందూరు బీసీ కాలనీకి చెందిన గురుస్వామి, ప్రమీల దంపతుల కుమారుడు చెంచు గురుచంద్ర(28) రాక్మెన్ కంపెనీలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పాగాలి సమీపంలోని రాక్మెన్ కంపెనీకి వెళ్లేందుకు బైక్పై ఇంటి నుంచి బయలుదేరాడు. నాగంపల్లి సమీపంలోని ఓ ఆస్పత్రి ఎదురుగా ముందు వెళుతున్న కట్టెల లోడ్ ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న చెంచు గురుచంద్ర తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
గరుడ వారధిపై ఆర్టీసీ బస్సుల ఢీ.. పది మందికి గాయాలు
తిరుపతి క్రైం:నగరంలోని గరుడ వారధిపై గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేర కు.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన ఆర్టీసీ బస్సు శ్రీనివాసం సమీపంలోని ఫ్లైఓవర్పై ప్రయాణికులను దింపుతుండగా వెనకనుంచి వచ్చి మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఈస్ట్ సీఐ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్ వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఘనంగా ఉగాది సంబరాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో, వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సతమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చందన, పంచామృతం, క్షీర, నారికేళ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. భక్తకన్నప్పకు సారె సమర్పణ శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా గురువారం తేరువీధిలోని భక్తకన్నప్పకు ఆలయం తరఫున సారె సమర్పించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తకన్నప్ప ఆలయంలో సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆటో, కారు ఢీ – నలుగురికి తీవ్ర గాయాలు చంద్రగిరి: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చంద్రగిరి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద ఎదురెదురగా ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా రుయాస్పత్రికి తరలించారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలో షెడ్లు దగ్ధం బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని గాజులపెళ్లూరు సమీపంలోని రసా జ్యూస్ ఫ్యాక్టరీలో గు రువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 4 షెడ్లు ద గ్ధమయ్యాయి. దీంతో భారీ నష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపింది. ఉగాది పండుగ కావడంతో ఫ్యాక్టరీలోని షెడ్లలో కార్మికులు లేరని, దీంతో ఎలాంటి ప్రాణహాని కలగలేదని పేర్కొంంది. శ్రీకాళహస్తి నుంచి ఫైర్ ఇంజిన్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి, పక్కనే ఉన్న షెడ్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. -
అదృశ్యమైన విద్యార్థి మృతి
సైదాపురం: రెండు రోజుల కిందట అదృశ్యమైన విద్యార్థి గంగ కాలువలో శవమై కన్పించాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ గూడూరులోని ఓప్రైవేట్ కళాశాల్లో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. మంగళవారం రాత్రి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఎస్ఐ క్రాంతికుమార్ దర్యాప్తు చేపట్టారు. మర్లపూడి సమీపంలోనే ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద బైక్ మాత్రమే ఉండడంతో గంగ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం డక్కిలి సమీపంలో కండలేరు ప్రధాన కాలువ వద్ద శవమై కన్పించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మణికంఠ మృతదేహాన్ని గంగ కాలువ నుంచి బయటకు తీసి, పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తుమ్మలగుంటలో కల్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు
తిరుపతి రూరల్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనులకు విశేష సమర్పణ చేశారు. ఆ తరువాత ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు సమర్పించిన పట్టు వస్త్రాలతో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఉగాది రోజున నిర్వహించే పంచాంగ శ్రవణం సర్వకార్య శుభఫల ప్రదాయకమని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు అన్ని కార్యాల్లో శుభాలు కలగాలని చెవిరెడ్డి దంపతులు మొక్కుకున్నారు. చెవిరెడ్డితోపాటు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మాట్లాడారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. -
యల్లంపల్లిలో ఏనుగుల సంచారం
చంద్రగిరి: మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో వారం రోజుల నుంచి అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన ఏనుగుల రాత్రుల్లో పంట పొలాలపై దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా గురువారం రాత్రి మండలంలోని యల్లంపల్లి సమీపంలో ఏనుగలు వరి, అరటి తదితర పంటలను ధ్వంస చేశాయి. పంటకు నీరు పెట్టేందుకు వెళ్తిన రైతు ముత్తరామయ్య ఏనుగులను చూసి ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఈ క్రమంలో రైతు స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏనుగుల మందను అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. పండుగ పూటా పస్తులే – స్విమ్స్ యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటున్న వేళ స్విమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న 800 మంది కార్మికులు చేపట్టిన ఆకలి పోరాటం 22వ రోజుకు చేరుకుంది. పండుగ రోజున కూడా తమ దీక్షా శిబిరం వద్దే తమ పూజలు నిర్వహించుకున్నారు. సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే వేణుగో పాల్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం రోజున ప్రజలు ఇళ్లలో సంతోషం నిండిపోతుంటే, స్విమ్స్ కార్మికుల ఇళ్లలో మాత్రం ఆకలి, ఆందోళన మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా, చర్చలకు పిలవకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యూనియన్ నాయకులు రవి, గోపి, సూరి, వెంకటేష్, బాలకృష్ణ, రాజా పాల్గొన్నారు. -
ఉగాది వేళ.. ఆధ్యాత్మిక శోభ
పుష్పాలంకరణలో మహద్వారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉగాది విశిష్టతను ప్రతిబింబించేలా శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో హయగ్రీవుడిని సంహరించి, నాలుగు వేదాలను రక్షించి, బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న దృశ్యాన్ని టీటీడీ శిలారూపంలో ఆవిష్కరించింది. అలాగే శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద చేసిన పుష్పాలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి ఆలయం ముందు శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాన్ని ఉద్యానవన విభాగం కార్మికులు కళాత్మకంగా రూపొందించారు. మరోవైపు, శ్రీరాముడు, చిన్నికృష్ణుడు, వేణుగాన కృష్ణుడి నమూనాలు ఉగాది ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మికతను జోడించాయి. – తిరుమల -
నేడు వైఎస్సార్సీపీ బూత్కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం
తిరుపతి మంగళం : పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్ర వారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ కమిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు నాగూరి యోగాంజనేయరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, బూత్కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. టీటీడీ ట్రస్టులకు రూ.37.55 లక్షల విరాళాలు తిరుమల:టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు గురు వారం పలువురు దాతలు రూ.37.55 లక్షలు విరా ళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన సుజన్ జ్యువెలరీ అధినేత రవికుమార్ రూ.20 లక్షల వి రాళం ఇచ్చారు. గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టు కు రూ.10 లక్షలు, శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు చొప్పున విరాళాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. అలాగే హైదరాబాద్కు చెందిన మధుశేషు అనే భక్తుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్కు చెందిన మరో దాత ఆలపాటి సత్యదేవ్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. -
సొంతూరికి వచ్చేదెలా!?
రాజంపేట: పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల్లోని తెలుగువారి పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా కువైట్లోని ‘ఖసీమా’ విమానాశ్రయం మూసివేయడంతో ఉమ్మడి కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన వేలాది మంది ప్రవాసాంధ్రులు అక్కడ చిక్కుకుపోయారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దుకావడంతో, ప్రత్యామ్నాయ మార్గాల్లో స్వదేశానికి రావాలంటే సామాన్యులకు టికెట్ ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. గతంలో రూ.10 వేలకు లభించే టికెట్ ప్రస్తుతం రూ.1.30 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలుకుతుండడంతో పేద కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీసాల వెతలు.. కువైట్ నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో సౌదీ అరేబియా మీదుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి అక్కడి రాయబార కార్యాలయం చేతులెత్తేసింది. విజిట్ వీసా హోల్డర్లు, అత్యవసర ప్రయాణికులు సొంత ఖర్చులతోనే టికెట్లు బుక్ చేసుకోవాలని, వీసా జారీపై ఎలాంటి హామీలేదని తేల్చిచెప్పింది. వీసా జారీ అనేది సౌదీ ప్రభుత్వ ప్రత్యేక హక్కు అని తెలపడంతో ప్రవాసాంధ్రులు అద్దె గదులకు పరిమితమై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గుండె కోత మిగిల్చిన యుద్ధం.. యుద్ధ వాతావరణం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజంపేటకు చెందిన మర్రి కళ్యాణ్ తన తల్లి మరణిస్తే కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. ఇప్పుడు రావాలన్నా శ్రీలంక మీదుగా లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అలాగే, భార్య ప్రసవానికి వెళ్లాలనుకున్న రాజంపేట రమణ, ఏటా రంజాన్కు ఊరికి వచ్చే నందలూరు మస్తాన్ వంటి వేలాది మంది ఈసారి పండుగలకు దూరమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం..రాష్ట్రానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, గల్ఫ్లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేశారని.. ఇప్పుడు యుద్ధ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రవాసాంధ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. నేను చాలా కాలంగా కువైట్లో ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితిని చూడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎలాంటి ఆంక్షలు, ఆర్థిక భారం లేకుండా ప్రవాసాంధ్రులను భారత్కు తీసుకురావాలి. ప్రత్యేక విమాన సర్వీసులను వెంటనే ప్రారంభించాలి. – మేడా మనోహర్రెడ్డి, గుండ్లూరు, రాజంపేట మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు.. మా తమ్ముడు తన తల్లి అంత్యక్రియలకు కూడా రాలేకపోవడం బాధాకరం. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రాయితీ ధరకు విమాన ప్రయాణం కల్పించాలి. – మర్రి రవికుమార్, వైస్చైర్మన్, రాజంపేట మున్సిపాలిటీ -
గాలివాన బీభత్సం
రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో అరటి, బొప్పాయి, తమలపాకు తోటలు నేలకొరిగాయి. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు అప్పులు చేసి పండించిన పంటలు కాపు దశలో పూర్తిగా నేలకొరిగాయి. మామిడి పూత, పిందె రాలిపోయాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. ఓబులవారిపల్లె/ఒంగోలు సబర్బన్/చింతపల్లి: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో అరటి, తమలపాకు తోటలు నేలకొరిగాయి. ఓబులవారిపల్లి మండలంలో దాదాపు 700 ఎకరాల్లో అరటి తోట పూర్తిగా ధ్వంసమైంది. బాలిరెడ్డిపల్లి, వైకోట, సున్నపురాళ్లపల్లి, చెన్నరాజుపోడు, జీవీ పురం, చిన్నఓరంపాడు, ఓబులవారిపల్లె గ్రామాల్లో దాదాపు 500 మంది రైతులకు చెందిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగాయి.జీవీ పురం సమీపంలోని పంజం వెంకటరెడ్డికి చెందిన ఐదుఎకరాల అరటికాపు దశలో ఉండగా పూర్తిగా నేలకొరిగింది. బాలిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డికి చెందిన దాదాపు 20 ఎకరాల అరటి తోటకాయలతో ఉండగా నేలమట్టమైంది. 50 మంది రైతులకు చెందిన తమలపాకు తోటలు కూడా నేలకొరిగాయి. రైల్వేకోడూరు మండలంలో 62 మంది రైతులకు చెందిన 92 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. రెండు మండలాల్లో కలిపి దాదాపు మూడు కోట్లకుపైగా పంట నష్టం వాటిల్లింది. వర్షానికి మామిడి పూత, పిందె రాలిపోయింది.ఉమ్మడి ప్రకాశంలో అకాల వర్షం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ బుధవారం రాత్రి నుంచి అకాల వర్షాలు కురిశాయి. త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో భారీ వర్షాలకు 8 ఎకరాల్లో అరటి తోట దెబ్బతింది. పొదిలి మండలంలో వడగండ్ల వాన కురిసింది. జువ్వలేరులో బొప్పాయి పంట దెబ్బతింది. సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి, చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. చింతపల్లిలో భారీ వడగళ్ల వాన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. చింతపల్లిలో కురిసిన వడగళ్ల వర్షంతో ప్రతి గడపలో వడగళ్లు రాసులు పోసినట్టు పేరుకుపోయాయి.అకాల వర్షం.. అన్నదాతకు నష్టం7 జిల్లాల్లోని 16 మండలాల్లో పంటలపై ప్రభావం 4 వేల ఎకరాల్లో నçష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా గుర్తింపునేలకొరిగిన అరటి, బొప్పాయి.. నేలరాలిన మామిడి, బత్తాయి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలుల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లుతోంది. తిరుపతి, కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 16 మండలాల పరిధిలోని 89 గ్రామాల్లో పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం మధ్యాహా్ననికి 2,350 మంది రైతులకు చెందిన దాదాపు 4 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు లెక్కతేల్చారు. వెయ్యి ఎకరాల్లో వరి, 1,600 ఎకరాల్లో మొక్కజొన్న, 600 ఎకరాల్లో మినుము పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. ఈదురు గాలుల ప్రభావానికి 800 ఎకరాలకుపైగా అరటి, బొప్పాయి, చీని తోటలు పూర్తిగా నేలకొరగ్గా.. వేలాది ఎకరాల్లో మామిడి నేలరాలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. కాగా.. ఇలాంటి విపత్తు సమయంలో నష్టాలు అంచనా వేయడమే తప్ప.. పరిహారం ఇచ్చిన పాపాన పోవడం లేదని రైతులు వాపోతున్నారు. మరో మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి రానున్న మూడు, నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలని అధికారులు సూచించారు. -
భూమికి ఎసరు..
●అది కాలువ పోరంబోకు స్థలం..రూ.కోట్ల విలువ చేస్తుంది.. అది కూటమి నేతల చెరలో చిక్కుకుంది.. ఖరీదైన భూమిపై కన్నేసి, నిర్మాణం చేపట్టారు.. ఆ విషయం సాక్షి వెలుగులోకి తెచ్చింది.. మండల రెవెన్యూ ఉన్నతాధికారి ఆక్రమణను అడ్డుకున్నారు. కొన్నాళ్లు నిర్మాణం ఆపేసిన వారికి మీరేం కంగారుపడొద్దు.. నేనున్నాగా.. ఏదో ఒకటి చేస్తా.. కాలువ పోరంబోకు భూమే కదా.. కట్టేసుకోమని రెవెన్యూ అధికారి సలహా ఇచ్చారు. ఇంకేముంది మళ్లీ నిర్మాణం మొదలు పెట్టేశారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి: రూ.కోట్ల విలువ చేసే కాలువ పోరంబోకు భూమిపై కన్నేసిన కూటమి నేతలు ‘నిన్నొదల.. బొమ్మాళీ’ అన్న చందంగా మరోసారి అక్రమ నిర్మాణానికి తెరలేపారు. గతంలో ఇదే స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయని సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చాక రెవెన్యూ అధికారులు స్పందించి, ఆక్రమణను అడ్డుకున్నారు. రెండు నెలల పాటు మౌనంగా ఉన్న కూటమి నేతలు మరోసారి బరితెగింపునకు దిగారు. రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడంతో మరోసారి దర్జాగా పక్కా కట్టడాన్ని చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ సమీపం.. రామానుజకూడలి పక్కన, గరుడ వారధి కింద సర్వే నంబర్ 43/1లో 2.40 ఎకరాలు కాలువ పోరంబోకు భూమి ఉంది. వర్షం వస్తే ఆ కాలువలో వరదనీరు ప్రవహిస్తుందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ భూమిని 22ఏ కింద చేర్చింది. 43/1లోని ఆ భూమి మొత్తం ముళ్లచెట్లతో నిండిపోయి ఉండేది. మూడేళ్ల కిందట అదే భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా గత ప్రభుత్వంలోని అధికారులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అందులోకి ఎవరూ ప్రవేశించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.కోట్ల విలువచేసే కాలువ పోరంబోకు భూమిపై పడింది. రెవెన్యూశాఖలోని ఓ అధికారి సహకారంతో జనసేన, టీడీపీ నేతలు అక్రమ నిర్మాణానికి తెగబడ్డారని తెలిసింది. నిత్యం రాకపోకలు సాగించే రోడ్డు పక్కనే ఉన్న కాలువ పోరంబోకు స్థలం ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం అంకణం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. విలువైన కాలువ పోరంబోకు భూమిలో దర్జాగా పక్కా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ అధికారి సహకారంతోనే గతంలో నిర్మాణాన్ని అడ్డుకున్నా మరోసారి బరితెగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మొదలెట్టేశారు! ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అది కాలువ పోరంబోకు భూమే. అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. మా సిబ్బందిని పంపి, ఆక్రమణలను తొలగిస్తాం. – సురేష్ బాబు, అర్బన్ తహసీల్దార్, తిరుపతి -
ప్రతి రోజూ పండుగ రోజు కావాలని..
– ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్రెడ్డి తిరుపతి మంగళం : జిల్లా ప్రజలకు ప్రతి రోజూ పండుగ రోజు కావాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్ది ల గురుమూర్తి, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజవర్గ సమన్వయకర్త భూమన అభిన య్ రెడ్డి ఆకాంక్షించారు. తిరుపతి నగర ప్రజల కు శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ అంటే తీపి, చేదు, పులుపు కలగలిపిన ఉగాది పచ్చడి లాగే ప్రతి మనిషి జీవితంలో కష్టం, సుఖం, నష్టం అనేవి ఉంటాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం లేక అన్నీ కష్టాలే మిగిలాయని తెలిపారు. రాబోయే జగనన్న పాలనలో ప్రజలకు ప్రతి రోజూ పండుగ ఉంటుందన్నారు. ఏప్రిల్ 13న బీటెక్ ఫైనల్ సెమ్ పరీక్షలు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో బీటెక్ అన్ని బ్రాంచ్ల్లో చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 8వ సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల 13వ తేదీన జరగనున్నాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటన లో తెలిపారు. సంబంధిత విద్యార్థులు ఈనెల 18వ తేదీలోపు ఫీజు చెల్లించి పరీక్షలకు దర ఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు వచ్చేనెల 10వ తేదీన జారీ చేయనున్నట్లు తెలిపారు. డీడీఈ డిగ్రీ రీవాల్యూషన్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ విభాగం గత ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రథమ, ద్వితీ య సంవత్సరాల డిగ్రీ రీవాల్యూషన్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం ఎస్వీయూ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. గృహ వినియోగ గ్యాస్కు ఇబ్బందులు లేవు తిరుపతి క్రైం: జిల్లాలో గృహాలకు వినియోగించే వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లా ఎస్పీ సుబ్బరాయు డు స్పష్టం చేశారు. ప్రజల్లో కృత్రిమ కొరత సృష్టించి అపోహలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, సివిల్ సఫ్లయ్ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్ప డే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, అవసరమైతే సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అలాగే గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించే వారి గురించి ఎవరైనా సమాచారం అందించాలన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ సుబ్బరాయుడు భరోసా ఇచ్చారు. ఉపకరణాల పంపిణీకి శిబిరాలు పూర్తి తిరుపతి అర్బన్: దివ్యాంగులు, వయోవృద్ధులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాల పంపిణీ కోసం 15 రోజులు నిర్వహించిన శిబిరాలు పూర్తి చేసినట్లు వికలాంగుల సంక్షేమశాఖ అధికారి వినోద్ వెల్లడించారు. 2,308 మంది దివ్యాంగులకు పరిశీలన అనంతరం 3,939 సహాయక పరికరాలు ఇవ్వడానికి ఎంపిక చేశామని చెప్పారు. అలాగే 1,129 మంది వయోవృద్ధులను పరిశీలించి 5,591 సహాయక పరికరాల పంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం పరికరాలకు రూ.4.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. జూన్లో పరికరాలను పంపిణీ చేస్తామన్నారు. -
ఏమీ..పాలుపోవడం లేదు..!
పాడిని నమ్ముకుని బతుకుతున్న మహిళా పాడి రైతులు వారు.. పదిహేను రోజులకోసారి డబ్బులు వస్తే కొంత అవసరాలకు వినియోగించుకుని, మిగిలిన మొత్తం పాడి పశువులకు గడ్డి, దాణా కొనుగోలు చేసుకుంటారు..పాల శీతలీకరణ కేంద్రం మూసి వేత దిశగా బాబు సర్కారు అడుగులు.. రైతుల నుంచి సేకరించిన పాలను మరో శీతలీకరణ కేంద్రానికి తరలింపు.. సుదూర ప్రయాణంతో చెడిపోతున్న క్షీరం.. వెరసి పాల సొమ్ము చేతికి రాక.. ఏమి చేయాలో పాలుపోక, వారు విలవిల్లాడుతున్నారు. ఇదీ నేడు వరదయ్యపాళెం పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని మహిళా పాడి రైతుల దుస్థితి. వరదయ్యపాళెం: గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు ఆర్థికాభివృద్ధి, పాడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వరదయ్యపాళెంలో ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రం మూసి వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దిశగా తెర వెనుక కార్యాచరణ సిద్ధం చేసింది. ఓవైపు అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు డెయిరీలతో కుమ్మకై రోజువారీ పాల సేకరణను రోజురోజుకు తగ్గించేశారు. దీంతో ఇప్పుడు పాల సేకరణ తగ్గిపోయిందన్న సాకు చూపుతూ మరోవైపు పాల శీతలీకరణ కేంద్రం నిర్వహణ భారం అధికమవుతుందని భూతద్దంలో చూపుతూ మూసి వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ద్వారా నడుపుతున్న పాల శీతలీకరణ కేంద్రాన్ని నమ్ముకున్న 400 మంది మహిళా పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పాలకు సంబంధించి తమకు ప్రైవేటు డెయిరీల కంటే ఎక్కువ గిట్టుబాటు ధర కల్పిస్తున్న పాల కేంద్రాన్ని మూసి వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పాల శీతలీకరణ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రైవేటు డెయిరీలతో కుమ్మకై పేద వారి జీవనోపాధిపై పొట్టకొట్టడమేనని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2008లో ఏర్పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జనవరి 30, 2008వ సంవత్సరంలో అప్పటి జిల్లా మంత్రి చెంగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి చేతుల మీదుగా వరదయ్యపాళెంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆ కేంద్రం అభివృద్ధి పథంలో నడుస్తూ మండలంలో పాడి రైతులకు అండగా నిలిచింది. రోజువారీ గతంలో 3 వేల లీటర్ల వరకు పాల సేకరణ జరిగేది. అయితే ప్రస్తుతం సీజన్కు అనుగుణంగా 1500 లీటర్ల నుంచి 2వేల లీటర్ల వరకు సేకరణ జరుగుతుంది. మండలంలోని 29 పంచాయతీల నుంచి దాదాపుగా 400 మంది మహిళా పాడి రైతులు ఉత్పత్తిదారులుగా ఉన్నారు. ప్రైవేటు డెయిరీల కంటే ప్రభుత్వ పాలశీతలీకరణ కేంద్రం నుంచి ఆవు పాలు లీటరుకు రూ.35 నుంచి రూ.40, గేదె పాలు లీటరు రూ. 50 నుంచి రూ.75 వరకు గిట్టుబాటు ధర లభిస్తున్నట్లు పాడి రైతులు చెబుతున్నారు. పేదల జీవనోపాధికి ఎంతో అవసరమైన కేంద్రాన్ని మూసి వేయడంపై పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మూసివేత దిశగా ప్రభుత్వం నిర్ణయం 20 రోజులుగా బీఎన్కండ్రిగ కేంద్రానికి పాలు తరలింపు ఆందోళన చెందుతున్న 400 మంది పాడి రైతులుమరమ్మతు సాకు వరదయ్యపాళెంలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని దాదాపుగా మూసి వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా కూలింగ్ మిషన్లు పాడైపోయాయని, వాటిని మరమ్మతు చేయాలంటే రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చు భరించలేక పాలశీతలీకరణ కేంద్రాన్ని మూసి వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 20 రోజులుగా వరదయ్యపాళెం మండలంలో సేకరించిన పాలను బీఎన్ కండ్రిగ పాలకేంద్రానికి తరలిస్తున్నారు. అయితే బీఎన్కండ్రిగకు పాల తరలింపులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా పాలు చెడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ ముస్లిం నేత మృతి
తడ: జాతీయ రహదారిపై శ్రీసిటీ విజిటర్ సెంటర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తడకండ్రిగకు చెందిన వైఎస్సార్ సీపీ ముస్లిం మైనారిటీ తడ మండల అధ్యక్షుడు సర్దార్(40) మృతి చెందగా అతనితోపాటు ప్రయాణిస్తున్న ప్రదీప్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి రోడ్డులో సర్దార్ కేఫ్ నిర్వహిస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ కొరతతో మూడు రోజులుగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో మరో గ్రామంలో సిలిండర్ ఉందని తెలుసుకుని అక్కడికి బైక్పై వెళ్లి సిలిండర్తో తిరుగు పయనం అయ్యాడు. శ్రీసిటీ జీరో పాయింట్ దాటి విజిటర్ సెంటర్ వద్దకు వచ్చే సరికి శ్రీసిటీలో కార్మికులను వదిలి సూళ్లూరుపేట వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు, సర్వీసు రోడ్డు నుంచి వేగంగా జాతీయ రహదారిపైకి వచ్చి సర్దార్ బైక్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ రోడ్డుపై పడిపోగా సర్దార్ తల డివైడర్కి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థాఽనికులు గాయపడిన ఇద్దరినీ సమీపంలోని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే సర్దార్ మృతి చెందగా వరదయ్యపాళెం మండలం, విఠలాయపాళెం గ్రామానికి చెందిన ప్రదీప్కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రదీప్కి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు తరలించారు. సర్దార్ మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండపనాయుడు తెలిపారు. -
చెరువులో జారిపడి మహిళ మృతి
దొరవారిసత్రం: చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన నెలబల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కథనం మేరకు.. నెలబల్లి గ్రామానికి చెందిన వాంకిళ లక్ష్మయ్య భార్య లతమ్మ(55) ఎప్పటిలాగానే గ్రామ సమీపంలోని రెడ్డిచెరువులోకి దుస్తులు ఉతికేందుకు బుధవారం ఉయదం 11 గంటల ప్రాంతంలో వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో గతంలో అక్రమంగా గ్రావెల్ తీసిన గోతుల్లోకి జారిపడిపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందింది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త, స్థానికులు చెరువు వద్దకు వెళ్లి గాలించడంతో అప్పటికే నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సహపంక్తి భోజనం తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగశక్తి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా డీఆర్వో నరసింహులు, డీపీటీఓ జగదీష్, వికలాంగుల సంక్షేమశాఖ అధికారి వినోద్ తదితరులు దివ్యాంగులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అలిపిరి డిపోలో కలెక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో దివ్యాంగశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్లో భోజనం పెట్టించారు. నిందితుడికి రిమాండ్ భాకరాపేట: ఏనుగు దంతాలు కలిగి ఉన్న కేసులో నిందితుడిని అటవీశాఖాధికారులు కోర్టులో హాజరుపరచగా అతడికి రిమాండ్ విధించారు. చంద్రగిరి మండలం చిన్నరామాపురం హరిజనవాడకు చెందిన ఓతులూరి శివకుమార్ అలియాస్ శివకుమార్ ఇంటిపై మంగళవారం దాడి చేసి, ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. -
చోరీ కేసులో దొంగల ముఠా అరెస్టు
తిరుపతి క్రైం : వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని రాగి వైర్లు చోరీ చేస్తున్న దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రాగి కోసం ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా రెండు జిల్లాల్లో విస్తృతంగా నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 55 కేసుల్లో 195 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు ఈ ముఠా బాధ్యులని పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది గూడూరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామానికి, మరొకరు మనుబోలు మండలం యాచవరం గ్రామానికి చెందినవారని చెప్పారు. తిరుపతిలో 45.. నెల్లూరులో 10 కేసులు పోలీసుల విచారణలో నిందితుల నేరచరిత్ర వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లాలో 45 కేసులు, నెల్లూరు జిల్లాలో 10 కేసులు నమోదు కాగా, మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 55 కేసుల్లో 195 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించినట్లు నిర్ధారణ అయిందని ఎస్పీ తెలిపారు. నిందితులు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని రాగి వైర్లను తీయడం, అనంతరం వాటిని కిలో రూ.700 చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రూ.4 లక్షల విలువైన రాగి సహా వాహనాలు స్వాధీనం నిందితుల అరెస్టు సమయంలో వారి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షలు విలువ చేసే 400 కిలోల రాగి, రెండు ఆటోలు, రెండు మోటార్సైకిళ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన వెంకటగిరి సీఐ ఏవీ రమణ, బాలాయపల్లి ఎస్ఐ కే గోపి, హెడ్ కానిస్టేబుల్ ఎస్. మురళీకృష్ణ, కానిస్టేబుళ్లు ఎస్కే ఖాదర్ మస్తాన్, ఎన్. తిరుపాలు, టీ. శ్రీనివాసులు, హోమ్గార్డు కె. శ్రీహరిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
విద్యార్థి అదృశ్యం
సైదాపురం: మండలంలోని చాగణం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి మంగళవారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో బుధవారం అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు.. సైదాపురం మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ గూడూరులోని ఓప్రైవేట్ కళాశాల్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి బైక్ను తీసుకుని సమీపంలోనే అంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్లి వస్తానని చెప్పాడు. రాత్రి గడుస్తున్నా మణికంఠ రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ విషయమై ఎస్ఐ క్రాంతికుమార్ మర్లపూడి సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద బైక్ మాత్రమే ఉండడంతో గంగ కాలువలో అన్వేషణ చేశారు. కానీ కనిపించలేదు. గంగ కాలువ వద్ద ఉన్న సీసీ కెమెరాలు ఆ సమయంలోనే పనిచేయకపోవడంతో మరింత అనుమానాలకు తావ్విస్తోంది. -
గర్భిణి విద్యార్థినిపై దాడి అమానుషం
తిరుపతి తుడా: స్థానిక ఎమ్మార్ పల్లి సమీపంలోని ఓ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ గర్భిణిగా ఉన్న విద్యార్థిపై చేయిచేసుకోవడం దారుణమని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు బుధవారం ఎస్వీయూ పోలీస్టేషన్లో బాధితులురాలితో కలసి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్ పల్లిలోని నర్సింగ్ కళాశాల ఆగడాలు శృతి మించుతున్నాయని, గతంలో పలుసార్లు వైద్యారోగ్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గర్భిణిగా ఉన్న విద్యార్థినిని బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపల్ దాడి చేయడం అమానుషమన్నారు. వెంటనే సంబంధిత కళాశాల గుర్తింపును రద్దు చేసి ప్రిన్సిపల్ను అరెస్టు చేయాలని, కళాశాలలో జరుగుతున్న ఆక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఎన్ఎల్ఎస్ఏ, జీఎన్ఎస్, ఓబీసీ, బీడీవీఎస్, ఎన్ఎన్ఎస్ఎఫ్, ఎంవీఎస్, ఏఐఎస్ఎస్ఎస్యూ నాయకులు పాల్గొన్నారు. -
స్కూల్ వ్యాన్ను ఢీకొన్న ట్రాక్టర్
– డ్రైవర్కు స్వల్ప గాయాలు తిరుపతి రూరల్: మండలంలోని కేసీపేట పంచాయతీ భాగ్యనగరం వద్ద బుధవారం రాత్రి ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్ను ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వచ్చే స్కూల్ వ్యాన్పైకి దూసుకు వెళ్లగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కదలలేని స్థితిలో వున్న స్కూల్ వ్యాన్ను నెమ్మదిగా పక్కకు తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ఎవరికీ పెద్ద గాయాలు లేనందున అందరు ఊపిరిపీల్చుకున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం వద్ద ఉన్న వెరిటాస్ సైనిక్ స్కూల్ వ్యాన్ పిల్లలను వదిలేసి తిరిగి పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినందున పెను ప్రమాదం తప్పింది. -
పది పరీక్షల పరిశీలన
తిరుపతి అర్బన్: టెన్త్ పరీక్షల్లో భాగంగా రెండో రోజు బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖాధికారులు పెద్ద ఎత్తున పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ రాష్ట్రస్థాయి పర్యవేక్షకులు రవీంద్రనాఽథ్రెడ్డి ఐదు పరీక్ష కేంద్రాలు, కడప ఆర్జేడీ శామ్యూల్ ఐదు కేంద్రాలు, డీఈఓ కేవీఎన్ కుమార్ ఆరు కేంద్రాలను పరిశీలించారు. ఇన్విజిలేటర్లతోపాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఛీప్ సూపరింటెండెండ్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. మాస్కాఫీయింగ్ చోటుచేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెగ్యులర్ విద్యార్థులు 26,683 మందికి 26,470 మంది హాజరయ్యారు. 213 మంది గైర్హాజరు అయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ పరీక్షలకు 892 మందికి 786 మంది హాజరయ్యారు.106 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ వెల్లడించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి పాకాల: మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాకాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్షలు సజీవుగా సాగుతున్నట్లు తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇది వరకే వార్షిక పరీక్షలు పూర్తి అయ్యాయని, బ్రిడ్జ్ కోర్స్ను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాబ్జి, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు తిరుపతికి చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొండూరు మోహన్ కుమార్ రాజు కుమార్తె డాక్టర్ శ్రావ్య రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి దాత తల్లిదండ్రులు సుధా, మోహన్ కుమార్ రాజు, భర్త యుగంధర్ చేతుల మీదుగా డీడీని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో విరాళం ఇచ్చానని చెప్పారు. తన వ్యక్తిగత, కుటుంబ ఉన్నతితో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
తిరుపతి సిటీ: జిల్లాలో గత నెల 23వ తేదీ నుంచి జరిగిన ఇంటర్ పరీక్షలు బుధవారంతో ముగిశా యి. చివరిరోజున ఇంటర్ సెకండ్ ఇయర్ కెమెస్ట్రీ పేపర్–2 పరీక్షకు 24,332 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 23,999 మంది హాజరయ్యారని, 333 మంది గైర్హాజరైట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. మంగళవారంతో ఫస్ట్ ఇయ ర్ పరీక్షలు పూర్తి కాగా, బుధవారంతో సెకండ్ ఇయర్ పరీక్షలు సైతం పూర్తి అయినట్లు తెలిపా రు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, పరీక్షలు సజావుగా జరిగేందుకు సహకరించిన జిల్లా అన్ని శాఖల అధికారులు, ఇంటర్మీడియట్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వచ్చేనెల రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దివ్యాంగశక్తి పథకం ప్రారంభం తిరుపతి అన్నమయ్యసర్కిల్:జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని అలిపిరి ఆర్టీసీ డిపోలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ముందుగా నిర్వహించిన సమావేశంలో దివ్యాంగు లను ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు. అ నంతరం రెండు బస్సులో దివ్యాంగులతో క లసి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డీపీటీఓ జగదీష్, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, బాలాజీ, అలిపిరి డిపో మేనేజర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో ఎస్వీయూ కీలక ప్రాత పోషించాలి తిరుపతి సిటీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ టెక్నాలజీకి దోహదపడేలా ఎస్వీయూ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్వీయూ వీసీ చాంబర్లో ఆయన క్వాంటమ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అధికారులతో పలు అంశాలపై చర్చించా రు. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యవస్థకు దోహదపడేలా విద్యార్థులను, పరిశోధకులను, అధ్యాపకులను సిద్ధం చేయడంలో ఎస్వీయూ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు పాల్గొన్నారు. గుర్తు తెలియని యువకుడి మృతి సత్యవేడు: మండలంలోని పెద్ద ఈటిపాకం గ్రామానికి సమీపంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెంది ఉన్నట్లు బుధవారం స్థానికులు గుర్తించారు. యువకుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల లోపు ఉంటుంది. పెద్ద ఈటిపాకం వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న చింత చెట్టుకు ద్విచక్రవాహనం ఢీ కొని యువకుడు అక్కడే ఉన్న గుంతలో కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్ధానికులు చెబుతున్నారు. ఎరచ్రందనం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరికిన కేసులో ఇద్దరికీ ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్, ఎరగ్రుట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లా ఇస్లాంనగర్కు చెందిన సాదిక్ బాషా, గణేషన్ మురుగన్ ఎరచ్రందనం చెట్లను నరికి తొమ్మిది దుంగలుగా మార్చి తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 326 కిలోల తొమ్మిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరిపై నేరం రు జువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,002 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,738 మంది భ క్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. -
తిరుపతి చంద్రగిరిలో దారుణం..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు కళ్ల ఎదుటే మహిళపై టీడీపీ కార్యకర్త దాడి చేస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేస్తూ టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు రెచ్చిపోయాడు. భూ వివాదంలో విశ్వేశ్వరి అనే మహిళపై నాగరాజ నాయుడు దాడికి పాల్పడ్డాడు. సర్వే నెంబర్ 445/1A లోని 38 సెంట్ల స్థలం విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా బేఖాతరు చేస్తూ నాగరాజ నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే బాధితురాలిపై విచక్షణా రహితంగా నాగరాజు నాయుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు.అనంతరం, బాధితురాలు మాట్లాడుతూ..‘టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, హేమ కుమార్, వంశీ ఒత్తిళ్లు వల్లే మాపై దాడి చేస్తున్నారు. మా భూమిని కబ్జా చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి నన్ను రాజీ చేసుకోమని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు ఈ విషయమై 12 సార్లు ఫిర్యాదు చేశాను. అయినా నాకు న్యాయం జరగలేదు. నన్ను చంపేస్తారని భయంగా ఉంది. నాకు న్యాయం చేయండి’ అని వేడుకుంది. -
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: గుంటూరుకు చెందిన శ్రీవేంకటేశ్వర పౌల్ట్రీస్ సంస్థ అధినేత వేంకటేశ్వరరావు మంగళవారం టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. ఒంటరి ఏనుగు సంచారం చంద్రగిరి: మండలంలోని యల్లంపల్లి, కూచివారిపల్లి, భీమవరం గ్రామాల సమీపంలో మంగళవారం ఒంటరి ఏనుగు సంచరిస్తోంది. ఫలితంగా ఎక్కడ ఒంటరి ఏనుగు దాడులకు పాల్పడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఏనుగుల మంద పంట పొలాలపై దాడులు చేసి, ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఒంటరి ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేటి నుంచి దివ్యాంగశక్తి పథకంతిరుపతి అర్బన్: ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడానికి దివ్యాంగశక్తి పథకాన్ని బుధవారం నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులతోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీ్త్రశక్తి పథకానికి మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సాధారణ ఎక్స్ప్రెస్లోనే దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, 100 శాతం కంటి చూపు, మూగ, చెవుడు, మానసిక వైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు. అలాగే వారికి సహాయకులకు 50 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాస్లు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీపీటీఓ జగదీష్, వికలాంగుల సంక్షేమశాఖ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు. మ్యుటేషన్ వేగవంతం చేయండి తిరుపతి అర్బన్:మ్యుటేషన్ దరఖాస్తుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన డీఆర్వో నరసింహులుతోకలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యుటేషన్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే రీసర్వేలోను తప్పులు లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని వెల్లడించారు. మరోవైపు సివిల్ సప్లయి కోర్టు కేసులు, క్యాస్ట్ వెరిఫికేషన్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అలాగే పాస్పుస్తకాల జారీలోని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
మద్యం మత్తులో గొడవ.. గాయపడిన వ్యక్తి మృతి
పెనగలూరు: మద్యం మత్తులో జరిగిన గొడవలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రఘురాం కథనం మేరకు.. పెనగలూరులోని బ్రాందీషాపు వద్ద ఈ నెల 11వ తేదీన సింగనమల గ్రామానికి చెందిన సామినేని నరసింహులు (36), కుంబాలకుంట గ్రామానికి చెందిన గుండ్లూరు వెంకటేశులు మద్యం మత్తులో గొడవపడ్డారు. దీంతో వెంటనే వెంకటేశు తన కుమారుడైన గణేష్కు ఫోన్ చేసి గొడవ పడిన ప్రాంతానికి పిలిపించుకుని మద్యం మత్తుతోపాటు అనారోగ్యంగా ఉన్న నరసింహులను వెంకటేష్, గణేష్ కొట్టి, కిందపడేసి తన్నారు. చుట్టు పక్కల వారు రావడంతో ఇద్దరు పారిపోయారు. దీంతో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసింహులకు రాజంపేటలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ మృతి చెందాడు. ఈ విషయమై 12వ తేదీ మృతుని భార్య సింధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెద్దశేషుడిపై కోదండరాముని వైభవం
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామివారి వార్షిక బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల్లో తొలి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషు వాహనంపై ఆలయ మాడ వీ ధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. మంగళవారం ఉదయం కోదండరామస్వామివారి ఆలయంలో కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణభట్టర్ భరత్కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘటాన్ని శాస్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ధ్వజపటం, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆస్థానం జరిపారు. ఉదయం 11 నుంచి 12.45 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న స్కూటీ.. ఇద్దరి మృతి
తిరుపతి క్రైం: నగరంలోని గరుడ వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన ఉమేష్ కుమార్ (35), తరుణ్ కుమార్ (36) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా తిరుపతిలోనే నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ రాత్రి ఇద్దరూ తమకు పరిచయమైన వ్యక్తి వద్ద నుంచి తీసుకున్న ఏపీ 39 ఏకే 2909 నంబర్ హోండా యాక్టివా స్కూటీపై వ్యక్తిగత పని నిమిత్తం బయలుదేరారు. అదే రోజు రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో తిరుపతిలోని గరుడ వారధిపై బ్లిస్ హోటల్ సమీపంలోని రామానుజ సర్కిల్ వద్దకు చేరుకోగానే స్కూటీ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న తరుణ్ కుమార్, ఉమేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108 అంబులెనన్స్లో వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే ఉమేష్ కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ తరుణ్ కుమార్ కూడా సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రేపు అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు
చంద్రగిరి: సిరులతల్లి తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీకష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పుష్పపల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ: ఎస్వీయూలో వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు అర్హులైన యూజీసీ జేఆర్ఎఫ్, నెట్, సీఎస్ఐఆర్–జెఆర్ఎఫ్, సీఎస్ఆర్ అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో పరిశోధన చేయాలనుకున్న విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు ఎస్వీయూలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషనన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఎస్వీయూ అధికారిక వెబ్సైట్, లేదా 0877– 2248589 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తిరుపతి సిటీ: జిల్లాలో గత నెల 23వ తేదీ నుంచి నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. మంగళవారం జిల్లాలోని 84 పరీక్ష కేంద్రాల్లో జరిగిన కెమిస్ట్రీ పేపర్–1 పరీక్షకు 24,772 మందికిగాను 24,335మంది హాజరయ్యారని, 437 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ ఇయర్ ప్రధాన పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయన్నారు. అలాగే బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ కెమెస్ట్రీ పేపర్–2 పరీక్ష జరగనుంది. అక్రమ కేసులో మరో ఐదుగురికి రిమాండ్ పెళ్లకూరు: మండలంలోని కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు ఐదుగురిని మంగళవారం రిమాండ్కు తరలించారు. పెళ్లకూరు మండల పరిషత్ అధ్యక్షుడు పోలంరెడ్డి శేఖర్రెడ్డి, చింతంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సంగీతం సుభాష్, తెల్లగూటి ప్రభాకర్, ముచ్చేలి నాధమునిని పోలీసులు అరెస్టు చేసి, నాయుడుపేట సివిల్కోర్టులో హాజరు పరచి, రిమాండ్కు తరలించారు. మనేక్షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో ఎంఓయూ ఏర్పేడు: దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో నూతన ఆవిష్కరణల కోసం తిరుపతి ఐఐటీ, ద మనేక్షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ రీసెర్చ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీలో మంగళవారం ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, మానేక్షా సెంటర్ ముఖ్య పోషకుడు, గౌహటి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవేంద్ర జలిహాల్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా భద్రతా సంస్థలు, ప్రముఖ భాగస్వాముల సహకారంతో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష రంగంపై అధునాతన పరిశోధనలు చేయనున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మనేక్షా సెంటర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డా. సుబ్రతా సాహా, మానేక్షా సెంటర్ సీవోవో శంఖ సువ్ర భౌమిక్, తిరుపతి ఐఐటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
నిరసన తెలిపితే నిర్బంధిస్తారా?
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో కార్మికులు చేపట్టిన న్యాయపోరాటం 19వ రోజుకు చేరుకుంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికులు మంగళవారం కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని, చేతులకు దారాలను బేడీల్లా చుట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే వేణుగోపాల్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి రవి, గోపి మాట్లాడుతూ 19 రోజులుగా కార్మికులు రోడ్లపై కూర్చుని దీక్షలు చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు అందిస్తున్న కార్మికులపై కనికరం లేకుండా వ్యవహరించడం తగద ని విమర్శించారు. శాంతియుతంగా పోరాడుతు న్న కార్మికులను నిర్బంధాలతో అణచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని హితువు పలికా రు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సూరి, మారిముత్తు, జనార్ధన్, రాజా, వెంకటేష్, నాగభూషణమ్మ, బాలకృష్ణ, నిషా మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
కారు బోల్తా.. ఒకరి మృతి
చంద్రగిరి: ప్రమాదవశాత్తు కారు బోల్తాపడడంతో ఒక రు మృతి చెందగా మరొకరు గాయాలపాలైన ఘటన మంగళవారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి చెందిన నరేంద్రనాయుడు (51), తన అక్క కొ డుకు సురేంద్ర నాయుడితో కలసి వ్యక్తిగత పనులపై కారులో తిరుపతికి బయలుదేరారు. పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారి, కోట సమీపంలో వస్తుండగా కారు బోల్తా పడింది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ నరేంద్ర నాయుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సురేంద్ర నాయుడు చేతికి గాయం అయ్యిందని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గ్యాస్..టెన్షన్
తిరుపతి అర్బన్: ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం నెలకొంది. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లో చిరు వ్యాపారుల జీవనోపాధికి ఆటంకాలు తప్పడం లేదు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుపతికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివచ్చి, వెళుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని హోటళ్లలో బస చేస్తుంటారు. అయితే గ్యాస్ కొరతతో హోటళ్ల నిర్వహణ భారంగా మారడంతో పలువురు మూత వేస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో వంట గ్యాస్ రూ.900 నుంచి రూ.వెయ్యిలోపు ఉండాల్సిన సిలిండర్ను, అక్రమార్కులు రూ.2,500 వరకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ ధర మరింత ప్రియం అయ్యింది. దీంతో తిరుపతిలో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. కొందరు హోటళ్ల యజమానులు గ్యాస్ సమకూర్చుని, గ్యాస్ ధరలు పెరగడంతో ఆహార పదార్థాల ధరలు పెంచుతున్నట్లు తమ హోటళ్లలో బోర్డులు పెట్టేశారు. మరోవైపు కాఫీ, టీ ధరలు సైతం పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. కట్టెల పొయ్యిల ఏర్పాటు దిశగా అడుగులు గ్యాస్ సిలిండర్ల కొరత చోటుచేసుకుంటున్న క్రమంలో పలువురు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొంత మేరకు కట్టెల పొయ్యిలకు అవకాశాలున్నా..పట్టణ, నగర ప్రాంతాల్లో సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కల్యాణ మండపాల్లోను గ్యాస్ సిలెండర్ల కొరతతో ఆ దిశగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని కొర్లగుంటలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద గ్యాస్ కొరత నేపథ్యంలో కట్టెల పొయ్యిలతోనే వంటకాలు పూర్తి చేసుకున్నారు. గ్యాస్ సంక్షోభం? గ్యాస్ నిల్వలున్నాయి..ఆందోళన వద్దు గ్యాస్ నిల్వలు జిల్లాలో అవసరం అయిన మేరకు ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ గోవిందరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో రూరల్ ప్రాంతంలో 45 రోజుల తర్వాత, అలాగే అర్బన్ ప్రాంతాల్లో అయితే సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత, డబులు సిలెండర్ ఉన్నవారు 32 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ సరఫరా సమస్యలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 0877–2236007కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
దోపిడీ కేసులో దొంగల అరెస్టు
రేణిగుంట: అమ్మవారి దర్శనం చేయిస్తానని నమ్మించి, నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి వ్యక్తిని బెదిరించి బైకు, వెండి గొలుసు, మొబైల్ ఫోన్ను దోపిడీ చేసిన కేసులో దొంగలను అరెస్టు చేశారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రాజంపేటకు చెందిన నరసింహ నాయక్ ఈ నెల 12వ తేదీ కరకంబాడిలోని కట్ట పుట్టాలమ్మ ఆలయంలో మద్యం మానేయడానికి దారం కట్టుకునేందుకు వచ్చారు. చివరగా మద్యం తాగుదామని దగ్గరలోని మద్యం దుఖాణానికి వెళ్లి మద్యం సేవిస్తుండగా జయచంద్ర, సాంబ రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. దేవాలయంలో పూజారి తమకు పరిచయం ఉందని నీకు ప్రత్యేక పూజలు చేయిస్తానని నమ్మబలికి నరసింహనాయక్ డబ్బులతోనే ముగ్గురు మద్యం సేవించారు. అనంతరం దేవాలయానికి తీసుకు వెళతానని పక్కన ఉన్న అంకమ్మ నాయుడు మిట్ట గ్రామం సమీపంలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి నరసింహ నాయక్ ను బెదిరించి అతని వద్ద నుంచి స్పెండర్ ప్లస్ మోటార్ సైకిల్, సుమారు 11 గ్రాముల వెండి గొలుసు, రియల్ మీ మొబైల్ ఫోను లాక్కొని పరారయ్యారు. స్నేహితుల సూచనలతో నరసింహనాయక్ 15వ తేదీ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి నిందితులను 48 గంటల్లో అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సొత్తును రికవరీ చేశారు. సమావేశంలో సీఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి పాల్గొన్నారు. -
టాస్క్ ఫోర్స్లో ఏడుగురికి ఉగాది సేవా పతకాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ఫోర్స్ విభాగానికి ఏడు ఉగాది సేవా పతకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు, ఎస్పీ శ్రీనివాస్లు అధికారుల, సిబ్బంది పనితీరును గుర్తించి పతకాలను సిఫారసు చేశారు. టాస్క్ఫోర్స్ రిజర్వు ఇన్స్పెక్టర్ బి.సత్యసాయి గిరిధర్కు సేవా పతకం, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ సి.వినోద్ కుమార్కు కఠిన సేవా పతకం, కానిస్టేబుల్ ఎం.మణికంఠ, హెడ్ కానిస్టేబుళ్లు కే రాజేష్ రాజుకు కఠిన సేవా పతకం, ఎం. వెంకటరమణకు సేవా పతకం, కానిస్టేబుళ్లు ఎం.రాజేష్కు ఉత్తమ సేవా పతకం, డి.కిరణ్కు సేవాపతకం లభించాయి. ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవా పతకాలను ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ఇదే తరహాలో కర్తవ్య నిబద్ధతతో పని చేసి, మరెన్నో పతకాలను పొందాలని టాస్క్ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ సూచించారు. పతకాలను పొందిన వారికి అభినందనలు తెలిపారు. మతి స్థిమితం లేని వ్యక్తిని రక్షించిన ఎస్టీఎఫ్ – కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎస్టీఎఫ్ డ్రైవర్ గిరి చంద్రగిరి: శ్రీవారి దర్శనార్థం వచ్చి మతిస్థిమితం లేని వ్యక్తిని రక్షించి, తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన మంగళవారం తిరుపతి బస్టాండ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా దిండిగల్కు చెందిన వినోద్ ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చాడు. ఆపై తిరుపతికి వచ్చిన వినోద్ వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగదు దోచుకెళ్లారు. దీంతో మతిస్థిమితం కోల్పోయిన వినోద్, తిరుపతి బస్టాండ్ వద్ద తిరుగుతుండగా విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ డ్రైవర్ గిరి గుర్తించాడు. ఆపైన వినోద్ కుమార్ను చేరదీసి, వివరాలు సేకరించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం వినోద్ కుమార్ను ఎస్టీఎఫ్ సిబ్బందితో కలసి అప్పగించాడు. ఎస్టీఎఫ్ సిబ్బంది, డ్రైవర్ గిరి చేసిన సాయం తమ కుటుంబం విషాదంలోకి వెళ్లకుండా కాపాడారంటూ పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రేపు మహతిలో ఉగాది సంబరాలు తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం మహతి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని అనంతరం ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ పండితులు వేదపారాయణం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం,భగవద్గీత అనుష్టానం, భగవద్గీత అష్టావధానం, టీటీడీ ఉద్యోగుల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించనున్నట్టు తెలియజేసింది. స్విమ్స్ ఓపీ, ఓటీలకు రేపు సెలవు తిరుపతి తుడా: ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, పేషెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆస్పత్రిలో అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఆటోనగర్లో అగ్నిప్రమాదం – రూ.3 లక్షల ఆస్తి నష్టం తిరుపతి క్రైం: ఆటోనగర్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నారాయణ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కుదిరి దుకాణం ముందు నిల్వ ఉంచిన గుదరి (గోజారి) సామాన్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో గుదరి సామన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
రెడ్బుక్ రాజ్యాంగం..
అప్రజాస్వామిక పాలన●అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తున్న నేతలుతిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులుభయపడం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లన్నీ వారితో నింపినా భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన గూండాలు దాడులు చేస్తే వారిని వదిలిపెట్టి, దాడిలో గాయపడిన మా పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడం దుర్మార్గం. ఇసుక అక్రమ రవాణా విషయమై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై అక్రమ కేసు నమోదు చేయడం, నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, మరికొంత మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు, రెడ్బుక్ పాలనకు నిదర్శనం. – డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి బాధితులపై కేసులు పెడతారా? వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి బాధితులపైనే కేసులు పెడతారా..? చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలంటే చులకనగా చూస్తున్నారు. మగువ, మత్తుపదార్థాలతో కూటమి నేతలు జోగుతున్నారు. అధికార అహంకారంతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాసలీలల బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత లేదు. శ్రీవారి భక్తుల మనోబావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు నిజంగా శ్రీవారిపై భక్తి ఉంటే వెంటనే బీఆర్ నాయుడుని తొలగించాలి. – నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం భ్రష్టు పట్టించారు టీటీడీ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా టీటీడీ ప్రతిష్టను బీఆర్ నాయుడు భ్రష్టుపట్టించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నీ అపరాచాలే. ఇలాంటి చైర్మన్ ఎప్పుడూ లేడు. ఇక రారు కూడా. ఆయనను ఇంకా చైర్మన్గా కొనసాగిస్తే అంత కంటే మహాపాపం మరొకటి ఉండదు. ఇప్పటికై నా చేసిన తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడు తప్పుకోవాలి. – సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ నిరసన తెలిపే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా? దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతోనే కూటమి పాలన సాగిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఎస్సీలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. కామ కలాపాలు సాగించే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా కొనసాగించడం దారుణం. – నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తసాక్షి ప్రతినిధి, తిరుపతి/మంగళం: రెడ్బుక్ రాజ్యాంగంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం ఈ మేరకు తిరుపతి, చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద చేపట్టిన మెరుపు ధర్నాలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచడంపై మండిపడ్డారు. తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యాలు నశించాలంటూ నినదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మాధవిరెడ్డి పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రా జ్యాంగం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో ఎన్నడూ దాడులు జరిగి న దాఖలాలే లేవు. నైతిక విలువలు లేని బీఆర్ నా యు డిని టీటీడీ చైర్మన్గా కొనసాగించడం కంటే మహా పా పం మరొకటి ఉండదు. ఆయన్ని ఉపేక్షించడంలో ఆంతర్యమేంటో చెప్పాలి. – భూమన అభినయ్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తబీఆర్ నాయుడుని తొలగించాలి తిరుమల శ్రీవారి పరమభక్తుడిని, ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏడు కొండలనే చూస్తానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికై నా స్పందించాలి. బీఆర్ నాయుడు అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలే తప్ప ప్రజాపాలన లేదు. అక్రమ కేసులు పెడితే భయపడి ఇంట్లో ఉంటామనుకుంటే పొరబాటే. – చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్న్యాయమే గెలిచింది.. అధర్మం ఓటమి పాలైంది.. ఇందుకు నిదర్శనం అక్రమ కేసులో అరెస్టయిన అందరినీ విడుదల చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పడమే.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి రాసలీలలను వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టారు. వీరిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. అధికార పార్టీ సూచనల మేరకు పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్సార్సీపీ నాయకులు పసుపులేటి సురేష్ బాబు అలియాస్ సురేష్, ఏ అజయ్కుమార్, ఈ.అనిల్కుమార్ రెడ్డి, బి అరుణ్ కుమార్ యాదవ్ అలియాస్ అరుణ్ యాదవ్, బృంగి నవీన్, ఎల్ .దినేష్, ఎన్. బాబు, ఏ. కోటి ,బి గీతా యాదవ్ అలియాస్ గీతాదేవి, ఎం. సాయికుమారి, కె లక్ష్మి ,జి విజయలక్ష్మి, కె.వి పద్మజ తదితరులను అరెస్టు చేశారు. దీనిపై న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు అందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. చిత్తూరు కార్పొరేషన్ : టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టడంపై మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ మహిళలను టీడీపీ నేతలు అసభ్యంగా దూషించడం హేయమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పాలనను ఇప్పటి వరకు చూడలేదని విమర్శించారు. బీఆర్నాయుడు రాసలీలలు బయటపడినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం ఫోన్లోనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినందుకు అప్పటి ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీని వెంటనే తొలగించారని గుర్తుచేశారు. బీఆర్ నాయుడు వీడియోలు వెలుగు చూసినా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నిరసనకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ సంఖ్యలో మొహరించారు. కార్యక్రమంలో నేతలు గాయత్రీదేవి, విజయసింహారెడ్డి, కేపీ శ్రీధర్, సరళమేరీ, అంజలిరెడ్డి, హరిషారెడ్డి, సూర్యప్రతాప్రెడ్డి, సుగుణశేఖర్, అప్పొజీ, రజనీకాంత్, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, మనోజ్రెడ్డి, వెంకటేష్, ప్రతిమారెడ్డి, అల్తాఫ్, నారాయణ, దేవరాజులు, మనోహర్, డేవిడ్ పాల్గొన్నారు. చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రం ఇస్తున్న విజయానందరెడ్డి ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు ‘‘ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు ప్రభుత్వం పాతరేసింది.. పేదల సంక్షేమానికి తిలోదకాలిచ్చింది.. రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసింది.. కుటిల రాజకీయాలకు తెరతీసింది.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడమే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోంది. ప్రశ్నించిన వారిని జైలుపాలు చేస్తోంది.. నిలదీస్తే నిలువునా దాడులు చేయిస్తోంది.. నైతికత లేని వారిని అందలం ఎక్కిస్తోంది.. అన్యాయాలే అజెండాగా అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది‘‘ అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలను దారుణంగా కొట్టిన టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలకు అండగా నిలిచి బాధితులపై ఆక్రమ కేసులు నమోదు చేసిన పోలీసుల వైఖరిని ఖండించారు. సర్కారు తీరును ఎండగడుతూ మంగళవారం చిత్తూరు..తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహాల వద్ధ మహాధర్నా చేపట్టారు.చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తిన ఆగ్రహం -
తిరుమలలో తీవ్రంగా గ్యాస్ కొరత
తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో కూడా గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గ్యాస్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, టీ స్టాళ్లు గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే అనేక హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో సుమారు 40 ఫాస్ట్ ఫుడ్హోటళ్లు, 30 టీస్టాళ్లు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేశాయి. మిగతా హోటల్ యజమానులు కూడా గ్యాస్ లేక వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు యజమానులు ఉదయం సేవలను నిలిపివేసి, కేవలం సాయంత్రం సమయంలో మాత్రమే టిఫిన్లు అందిస్తున్నారు. దీంతో భక్తులకు తగినంత ఆహారం దొరక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నాయి. హోటళ్లు మూతపడడంతో అందుబాటులో ఉన్న కొద్ది హోటళ్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రంలో ఈ పరిస్థితి కొనసాగితే భక్తుల సేవలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతల నిరసన..
వైఎస్సార్సీపీ నేతల నిరసనలు అప్డేట్స్..అనంతపురం..అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసనటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టడంపై ఆగ్రహంచంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులునంద్యాల జిల్లా...నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతల నిరసనలు.కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన.టీటీడీ పవిత్రతను బీఆర్ నాయుడు, చంద్రబాబు అభాసు పాలు చేస్తున్నారని ఆగ్రహంబీఆర్ నాయుడుని పదవి నుండి తొలగించి డిమాండ్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులకు నిరసనగా తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.తిరుపతితో పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న తప్పుడు కేసులకు నిరసనగా పార్టీ నేతలు నిరసనలకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు, తప్పుడు కేసులు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, సుధాకర్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు 13 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారు.. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారు. అట్రాసిటీ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలి అంటే బీఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలి అని కామెంట్స్ చేశారు. -
రేపు తిరుమల జూన్ నెల దర్శన కోటా విడుదల
తిరుమల: తిరుమలలో జూన్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాల, గదుల కోటాను 18న టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్లే టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జి సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా, 23న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. .శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,606 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.39 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శం
తిరుపతి క్రైం : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శప్రాయమని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన ఎస్పీ, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. యువత ఆయన సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, శ్రీనివాసులు, డీఎస్పీ చంద్రశేఖర్, ఏవో సురేష్ కుమార్, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. అడవిలో కార్చిచ్చు రేణిగుంట:మండలంలోని వెంకటాపురం ఎదురుగా ఉన్న శేషాచల అడవుల్లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఆదివారం ఇదే ప్రాంతానికి సమీపంలో మంటలు వ్యాప్తి చెందడంతో అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.కాలుతున్న శేషాచలం అడవి -
ప్రమాణం చేయగలరా?
‘‘సూళ్లూరుపేటనియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మట్టి దందాలకు తమకు సంబంధం లేదని వేంకటేశ్వరస్వామివారిపై ప్రమాణం చేసి చెప్పగలరా? నియోజకవర్గంలో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతారా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య. అక్రమాలను ప్రశ్నించేవారి గొంతు నొక్కేలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తండ్రికి దేవుడంటే భయం లేదు. భక్తి కూడా లేదు. ఆయన ఏకంగా వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపులకు తమకు సంబంధం లేదని చెప్పడంతోనే అర్ధమవుతుంది.– కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే -
గడ్డివామి దగ్ధం
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని నెలవాయి గ్రామానికి చెందిన మురళికి సంబంధించిన గడ్డివామిని ఇదే గ్రామానికి చెందిన మణి ఆదివారం అర్ధరాత్రి నిప్పుపెట్టి దగ్ధం చేశాడని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. మురళి సంబంధించిన 1200 మోపుల గడ్డి వామిని పాత గొడవలుండడంతో మణి నిప్పుపెట్టాడని, దీంతో మురళికి సుమారు రూ.1.20 లక్షల నష్టం వట్టిలిందన్నారు. శ్రీకాళహస్తి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసిన గడ్డి కాలి బుడిద అయ్యింది. మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
అక్రమార్కులను పట్టించినందుకు అరెస్టు
పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతల దౌర్జన్యాలను ప్రశ్నించిన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారు. పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో కాంట్రాక్టర్, కూటమి నాయకులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా భారీ హిటాచీలతో నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు, సాగునీరు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపై సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి స్థానిక రైతులతో కలిసి ఇసుక దోపిడీని అడ్డుకుని, పలు యంత్రాలు, లారీలను పోలీసులకు అప్పగించారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకపోగా, ఇసుక దోపిడీని అడ్డుకున్న రైతులు, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని తిరుపతి విమానాశ్రయం వద్ద, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, రైతులు అట్ల గోపాలయ్య, శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సురేష్రెడ్డిను వారివారి నివాసాల వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, దొరవారిసత్రం పోలీస్స్టేషన్కు తరలించారు. నాయుడుపేటలో వైద్య పరీక్షలు అనంతరం నాయుడుపేట కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి నెల్లూరు జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి అరెస్టుకు రెక్కీ సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఎలాగైనా అరెస్టు చేయాలని డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో రెక్కీ నిర్వహించారు. పెళ్లకూరు మండలం కలవకూరులో స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవడంతో పాటు సోమవారం నాయుడుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రమణ్యం చేస్తున్న అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ పోలీస్ బలాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే సంజీవయ్యను అరెస్టు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంజీవయ్య నివాసం వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా మొహరించడంతో పోలీసులు ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. అందుకే 144 సెక్షన్ విధించారు. సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు. -
ఇసుక రీచ్ అడ్డుకున్నందుకే అక్రమంగా కేసు
పెళ్లకూరు మండలంలో అక్రమ ఇసుక రీచ్ అడ్డుకున్నందుకే నాపై అక్రమంగా కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నాకు కనీసం ముందుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఆ తరువాత నాయుడుపేట రూరల్ పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారు. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడంతో సాగునీరు అడుగంటి పోతుండడంతో కలవకూరు వద్ద నదిలో శాంతి యుతంగా నిరసన తెలిపాను. ఆ కక్షతోనే నాపై అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేశారు. – కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి -
తిరుపతి జిల్లా పోలీసులకు రాష్ట్ర అవార్డులు
– 10 మందికి సేవా పతకాలు.. ఒకరికి ఉత్తమ సేవా పతకం తిరుపతి క్రైం : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే సేవాపతకాలు, ఉత్తమ సేవాపతకాలు ఈ ఏడాది తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు లభించాయి. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ గుర్తింపు రావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు, ఒకరికి ఉత్తమ సేవా పతకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులు అందుకోవడం జిల్లా పోలీస్ శాఖకు గౌరవకారణమని ఎస్పీ తెలిపారు. పతకాలు పొందిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందించారు. శేఖర్కు ఉత్తమ సేవాపతకం ఎన్. శేఖర్ (ఏఎస్ఐ 598–డీఎస్బీ, తిరుపతి)కు ఉత్తమ సేవా పతకం లభించింది. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,057 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,990 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. కలెక్టరేట్లో అమరజీవి జయంతి తిరుపతి అర్బన్: అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను కలెక్టర్ వెంకటేశ్వర్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో అమరజీవి జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు. ఆ తరువాతే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేటితో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా గత నెల 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. మంగళవారం సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్–1 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 84 పరీక్ష కేంద్రాలలో సుమారు 24 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంస్థ అధికారులు, సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 54 వినతులు వచ్చాయన్నారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా సంస్థ పరిధిలోని 9 జిల్లాల వినియోగదారులు విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్, ఎం.కృష్ణారెడ్డి, సీహెచ్ రామచంద్రరావు, జనరల్ మేనేజర్లు చక్రపాణి, భాస్కర్ రెడ్డి, జగదీష్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
ఐదు రోజులుగా బిడ్డ ఆచూకీ లేదు!
తిరుపతి రూరల్: ఐదు రోజులుగా తన బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో ఓ తల్లి ఆవేదనను వ్యక్తం చేస్తోంది. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టు ఇయర్ చదువుతున్న జశ్వంత్రెడ్డి ఐదు రోజులు కిందట కాలేజీ ప్ర హరీ గోడ దూకి పరారయ్యాడు. ఆ విషయం గుర్తించి న కాలేజీ యాజమాన్యం ఆ యువకుని తల్లిదండ్రుల కు సమాచారం అందించగా వారు కాలేజీకి వచ్చి మూ డు రోజులుగా తన బిడ్డ ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆ అబ్బాయి తల్లి లక్ష్మీదేవి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతి రూరల్, తిరుచానూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా రు. కాగా కాలేజీలో అందరితో సరదాగా గడిపే జశ్వంత్రెడ్డి ఇప్పటి వరకు జరిగిన ఇంటర్మీడియట్ అన్ని పరీక్షలు బాగానే రాసినట్టుగా చెప్పుకున్నా ఎందుకు పరా రైనట్టు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలేజీ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు ఐదు రోజులుగా ఓ అబ్బాయి కనిపించకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆ కాలేజీ వద్దకు చేరుకోవడంతో పోలీసులు మోహరించారు. విద్యార్థి సంఘం నేతలను వెంట బెట్టుకుని కాలేజీ లోపలకు వెళ్లి అసలు ఏం జరిగిందన్న విషయం కాలేజీ యా జమాన్యం ద్వారా చెప్పించారు. కాగా మంగళవా రం జరిగే ఆఖరి పరీక్షకు అతను హాజరుకాకుంటే ఆ తరువాత గాలింపు చర్యలను వేగవంతం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వారిలో వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘం నేతలు ఓబుల్రెడ్డి, యశ్వంత్రెడ్డి, వినోద్కుమార్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జల్లా అధ్యక్షులు శ్రీధర్, జ్యోతిప్రకాష్లు ఉన్నారు. -
మత్తు, మగువలతో జోగుతున్న కూటమి నేతలు
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి మత్తు పదార్థాలు, మగువలతో కూటమి నేతలు జోగుతున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరు పతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో ఏలూరు టీడీ పీ ఎంపీ పుట్టా మహేష్యాదవ్ డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడ్డారన్నారు. అయితే ఆ కేసును నీరుగార్చేందుకు తన ఆత్మీయ సన్నిహితుడు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపారన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా సాగుతోందంటూ చంద్రబాబు దుష్పచారాలు చేశారన్నారు. అయితే తాము అధికారంలోకి రాగానే మత్తు పదార్థాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఈరోజు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబుకు మించినవారులేరన్నారు. రాసలీలలు ప్రేరేపిస్తున్నారా బాబూ?మత్తుపదార్థాలు సేవించి తూలుతూ, మహిళలపై వేధింపులు, మగువలతో రాసలీలలు సాగిస్తూ ప్రత్యక్షంగా దొరికిన కూటమి నేతలపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని భూమన అభినయ్ ప్రశ్నించారు. మత్తు, మగువలతో రాసలీలలను చంద్రబాబు ప్రేరేపిస్తున్నారా? లేక తమ కూటమి నేతలని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు హయాంలో తిరుమలలోని క్యూలో భక్తులు నిరసనలు చేపట్టిన చరిత్ర ఎప్పుడూ లేదన్నారు. బీఆర్ నాయుడు తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నామన్న కక్షతో తమపై టీవీ5 చానల్లో గ్యాస్ నిల్వలు ఉంచామంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని, అయితే మా కుటుంబసభ్యులెవరికీ గ్యాస్ ఏజెన్సీలు లేవన్న విషయాన్ని తెలుసుకో బీఆర్ నాయుడు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు టీడీపీ ఎంపీ మహేష్యాదవ్, టీటీడీ చైర్మెన్ బిఆర్. నాయుడులను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
పది పరీక్ష ప్రశాంతం
తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 165 పరీక్ష కేంద్రాల్లో 655 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు సోమవారం తమ సమీప ప్రాంతాల్లోని ఆలయాల్లో దేవుడికి మొక్కుకుని, తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. 4 శాతం మంది విద్యార్థులు మినహా మిగిలిన వారంతా పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోగా, 20 శాతం మంది విద్యార్థులు సోమవారం కావడంతో రాహుకాలం ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో రెండు గంటలకు పైగా సెంటర్ వద్ద వేచి ఉన్నారు. అక్కడే చదువుకుంటూ ఉండిపోయారు. ప్రతి విద్యార్థితోపాటు తల్లిదండ్రులు లేదా బంధువు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి విచ్చేశారు. తమ బిడ్డలకు ధైర్యం చెప్పి, పరీక్ష బాగా రాయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిబంధనలు కచ్చితంగా పాటించారు. జెరాక్స్ సెంటర్లు సైతం కేంద్రాల సమీప ప్రాంతాల్లో మూయించారు. ఆకస్మిక తనిఖీలు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతిలోని పండిట్ జవహర్లాల్ నెహ్రు మున్సిపల్ హైస్కూల్, శశి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ తిరుపతితోపాటు రేణిగుంటలో పలు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లా స్థాయి పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ తొలిరోజు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే తొలిరోజు జిల్లాలోని 8 సమస్యాత్మక కేంద్రాల్లో మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో పరీక్షలు సజావుగా సాగాయి. పలువురు విద్యార్థులు గైర్హాజరు జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు 27,243 మందికి 26,691 మంది హాజరయ్యారు. 552 మంది విద్యార్థులు తెలుగు పరీక్షకు గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్కు సంబంధించి 885 మంది విద్యార్థులకు 785 మంది హాజరయ్యారు. వంద మంది గైర్హాజరయ్యారు. -
నిరసన తెలిపితే నిర్బంధం
తిరుపతిలో వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేస్తూ..సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు అధికార జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా గాయపడిన వారినే అరెస్టు చేసి, అక్రమ కేసులు నమోదు చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం ఉంటే ఏదైనా చెయవచ్చు అన్నదానికి నిదర్శనమే తిరుపతి శిల్పారామం వద్ద సోమవారం జరిగిన ఘటన. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు ఓ మహిళతో వంటగదిలో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. నాడు ప్రెస్మీట్ అనంతరం దూరంగా ఉన్న బీఆర్ నాయుడు సోమవారం తిరుపతికి చేరుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకమండలి అయిన బీఆర్ నాయుడు వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లకార్డులతో హోటల్ ముందు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను టీడీపీ నేతలు జేబీ శ్రీనివాసులు, పులిగోరు మురళితో పాటు వారి అనుచరులు అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నా.. నిరసనను అడ్డుకునే అధికారమే లేని టీడీపీ నేతల బరితెగింపును న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. అంతటితో ఆగని టీడీపీ గూండాలు ‘కామాందులు ఎలా ఉంటారో రండి చూపిస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ మహిళ నాయకులను అసభ్య పదజాలాలతో దూషించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతటితో ఆగని అధికారపార్టీ నేతలు.. పోలీసులతో గాయపడిన వారిని, నిరసన తెలియజేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్టేషన్కు తరలించారు. సంబంధమే లేని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి 13 మంది వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్టేషన్లో కూర్చోబెట్టడానికి న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. ఆ 13 మందిలో మహిళలు కూడా ఉండడం గమనార్హం. -
పింఛన్లు ఇప్పించండి మహాప్రభో!
తిరుపతి అర్బన్: పింఛన్ ఇప్పించండి మహాప్రభో అంటూ పలువురు పేదలు సోమవారం కలెక్టరేట్కు విచ్చేశారు. అయితే అనుమతులు రావాలంటూ అధికారులు బదులిచ్చారు. ఎప్పుడు అనుమతులు వస్తాయంటూ పలువురు దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 352 అర్జీలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, రోజ్మాండ్ అర్జీలను అందుకున్నారు. గ్రీవెన్స్కు 352 అర్జీలు వచ్చాయి. అందులో ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై 232 అర్జీలు, పంచాయతీరాజ్ 16, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 11, డీఆర్డీఏకు 19 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. పాలకేంద్రాన్ని మా మండలంలోనే ఉంచండి వరదయ్యపాళెం మండలంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలకేంద్రానికి ప్రతి రోజు సుమారుగా 2 వేల మంది పాడి రైతులు 1500 లీటర్లు పాలుపోస్తున్నామని పాడి రైతులు తెలిపారు. వరదయ్యపాళెం పాల కేంద్రాన్ని బుచ్చినాయుడుకండ్రిగకు మార్పు చేస్తామని చెబుతున్నారని, ఆ కేంద్రాన్ని మా మండల కేంద్రంలోనే ఉంచాలని వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న తమకు ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదని పారిశుద్ధ్య కాార్మికులు వాపోయారు. అధికారులకు చెప్పినా ఏజెన్సీ వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.లీలావతి, వ్యాధిగ్రస్తురాలు, నాగలాపురం పాలకేంద్రాన్ని తరలించవద్దు అంటున్న పాడిరైతులు పింఛన్ ఇప్పించండి నా ఆరోగ్యం సరిలేదు. మంచానికే పరిమితం అయ్యాను. మేము నాగాలాపురం మండల కేంద్రంలో కాపురం ఉంటున్నాం. బతకడం కష్టంగా మారుతుంది. పింఛన్ ఇప్పిస్తే ఆ డబ్బులతోనే నా జీవనం సాగిస్తాం. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ లీలావతి అనే మహిళ సోమవారం కలెక్టరేట్లో అధికారులుకు వినతిపత్రం అందజేశారు. వంద శాతం వైకల్యం ఉంది తన కుమారుడు ఆవుల చంటికి వందశాతం వైకల్యం ఉందని తల్లి సునీత వెల్లడించారు. మంచానికే పరిమితం అయ్యారని చెప్పారు. పేద కుటుంబానికి చెందిన తమకు ఇచ్చే రూ.6వేలు పింఛన్ వైద్య ఖర్చులు, మందులకే సరిపోవడం లేదన్నారు. రూ.15వేలు పింఛన్ ఇప్పిచాలని వేడుకున్నారు. న్యాయం చేయాలని కోరారు. -
దాడులూ మాపైనే.. కేసులూ మాపైనేనా?
శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు విచక్షణరహితంగా దాడులకు పాల్పడడం హేయం. దాడులు మాపైనే, కేసులు మాపైనే. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దాడులు చేసే సంస్కృతి ఇంతవరకు లేదు. ఆ ఘనత కూడా టీడీపీకే దక్కుతుంది. మహిళలు, నాయకులపై విచక్షణరహితంగా దాడులుచేసి గాయపరిచారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రచించిన రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. – భూమన అభినయ్రెడ్డి, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తగాయపడిన భృంగి నవీన్నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేస్తున్న పోలీసులు -
రేపు తిరుమల జూన్ దర్శన కోటా విడుదల
తిరుమల: తిరుమలలో జూన్కు సంబంధించి శ్రీవారి వివిధ దర్శనాల, గదుల కోటాను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.21న ఆర్జిత సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా, 23న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. -
తిరుపతిలో ఉద్రిక్తత.. బీఆర్ నాయుడు రాజీనామాకు డిమాండ్..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఉన్నారు. ఈ సందర్బంగా బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహంతో వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసనలకు దిగారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు గీత యాదవ్, సాయి కుమారి, పద్మజ, విజయ లక్ష్మీలను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు.అంతకుముందు హోటల్ ఎదుట నిరసనల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేత జేబీ అనుచరులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్బంగా తిరుపతి వైఎస్సార్సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్పై దాడి చేయడంతో అతను గాయపడినట్టు సమాచారం. -
భూ రాబందులు
●సాక్షి టాస్క్ఫోర్స్: రామచంద్రాపురం మండలం తిరుపతి నగరానికి సమీపంలోనే ఉంది. ఎక్కువ మంది ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. దీంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకుల కన్ను ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండలపై పడింది. ఈ క్రమంలో కొందరు నాయకులు నకిలీ పట్టాలు సృష్టించుకుని గుండోడు కనంపై పాగా వేశారు. గుట్టను చీల్చి లేయర్లు, లేయర్లుగా చదును చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మండలానికి చెందిన ఒక టీడీపీ నేత కనంలో మరోవైపు దారి పేరుతో నిలువు దోపిడీ చేసేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆనుకుని ఉన్న అటవీ భూమిని ఆక్రమించుకున్నాడు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అడవులను ఆక్రమించుకునేందుకు కూటమి నాయకులకు ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. యంత్రాలతో విధ్వంసం ప్రస్తుతం గుండోడు కనం ప్రాంతంలో భారీ యంత్రాలతో గుట్టలను చీలుస్తున్నారు. పచ్చని చెట్లు, బోధ పొదలతో కళకళలాడే ఈ ప్రాంతం ఇప్పుడు మట్టి దిబ్బలుగా మారింది. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోదని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండతోనే అక్రమాలు..? రామచంద్రాపురం మండలం తిరుపతికి అత్యంత సమీపంలో ఉండడంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇదే అదునుగా భావించిన కొందరు కూటమి నేతలు అటవీ భూములను అంచెలంచెలుగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అడవులను చిన్నాభిన్నం చేసి గ్రావెల్, మట్టి తరలింపుతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫామ్ హౌస్ల నిర్మాణం చేపడుతున్నా అధికారులు మౌనంగా ఉండడంపై మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల అండతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీబీలతో యథేచ్ఛగా విధ్వంసం అది అటవీ భూమిగా ఉంది రెవెన్యూ విలేజ్ మ్యాప్లో సదరు భూమి అటవీ ప్రాంతంగా చూపిస్తున్నప్పటికీ, అధికారికంగా తమ శాఖకు సంబంధించి ఎలాంటి క్షేత్రస్థాయి హద్దులు లేవు. గతంలోనూ, ప్రస్తుతం అన్యక్రాంతమైనట్లు చెబుతున్న ఈ ప్రాంతంలో గాలేరు– నగరి ప్రాజెక్టు కాలువ పనులు జరిగాయి. అవి పూర్తిగా రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తా యి. ఆక్రమణదారులు ఏ రకమైన పట్టాలతో ఈ భూముల్లోకి ప్రవేశిస్తున్నారో మాకు తెలియదు. – ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలిశెట్టి తులసయ్య అధికారుల మౌనం అక్రమార్కులకు వరం గుండోడు కనం దగ్గర ఇంత బహిరంగంగా విధ్వంసం జరుగుతున్నా, స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. మండలంలో అనుప్పల్లి, సి రామాపురం, రాయలచెరువు, గణేష్ పురం ప్రాంతాల్లో ఇప్పటికే ఎకరాల అటవీ భూమి అక్రమార్కుల చెరలోకి చేరిపోయిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. తరతరాలుగా ఇక్కడ ఉన్న గుట్టలను కళ్ల ముందే తవ్వేస్తుంటే బాధగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నకిలీ పట్టాల గుట్టును రట్టు చేసి, కబ్జాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో గుట్టలు కనిపించవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సిలిండర్ల దుర్వినియోగంపై కేసులు
తిరుపతి క్రైం : గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న హోటళ్లపై తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లయీస్ అధికారులతో కలిసి దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్గుప్తా ఆదేశాల మేరకు, తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాల్లో మొత్తం 15 హోటళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న 4 హోటల్ యజమానులను గుర్తించారు. వారిపై 6(ఏ) ఈసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, మొత్తం 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
ఆల్ ది బెస్ట్
జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయించాం. పరీక్ష అంటే భయం లేకుండా, ఒత్తిడికి లోను కాకుండా పిల్లలు చక్కగా రాయాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ చిల్ట్రన్స్. – వెంకటేశ్వర్, కలెక్టర్, తిరుపతి సర్వం సిద్ధం జిల్లాలోని పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గంట ముందుగానే కేంద్రాలకు తీసుకువచ్చేందుకు యత్నించాలి. ఆయా సెంటర్లలో ఎవరికై నా సమస్యలు ఎదురైతే తక్షణం కంట్రోల్ రూమ్ నంబర్కు ఫిర్యాదు చేయాలి. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. – కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి -
ఆర్బీకేలను సమర్థంగా నిర్వహించాలి
రైతు భరోసా కేంద్రాల పేరు మార్చిన ప్రభుత్వం సమర్థంగా నిర్వహించ లేకపోతోంది. పురుగు మందు, ఎరువులను ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరిపడా విధంగా సరఫరా చేయాలి. కొన్ని చోట్ల చాలీచా లని ఎరువులు అందించడం వల్ల ప్రైవేటు దుకాణాల్లో ధరలకు రెక్క లొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంది. ఇటీవల ధాన్యం కొనుగోల్లో నిర్లక్ష్యం వల్ల రైతులు నరకయాతన పడ్డారు. – పురుషోత్తంరాజు, రైతు, రాజుల కండ్రిగ, కార్వేటినగరం -
వైభవం.. విరుల యాగం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం వైభవంగా పుష్పయాగ మహో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు స్నపన తిరుమంజనం జరిపించారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో కనులపండువగా పుష్పయాగం చేపట్టారు. యాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్ధన్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజ్కుమార్, అర్చకుడు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల తనిఖీ
తిరుపతి మంగళం : జిల్లాలో మోటారు వాహనాల చట్టం అమలు, రహదారి భద్రత పరిరక్షణ, పన్నుల వసూలుకు జిల్లా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపడుతోది. ఇందులో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు ఆదివారం రవాణా శాఖ అధికారులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కాంట్రాక్ట్ క్యారేజ్, టూరిస్ట్ బస్సులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తిరుపతి నుంచి హైదరాబాదు వైపు వెళ్తున్న నాగాలాండ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు పత్రాలు పరిశీలించారు. ఆల్ ఇండియా పర్మిట్ పన్ను చెల్లించకుండా ప్రయాణికులను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.3.60 లక్షల జరిమానా విధించారు. అదేవిధంగా హైదరాబాదు నుంచి తిరుపతికి వస్తున్న మరో టూరిస్ట్ బస్సుకు కూడా పన్నులు చెల్లించకుండా నడుపుతున్నట్లు గుర్తించారు. దానికి రూ.70 వేలు జరిమానా విధించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ పన్నులు చెల్లించకుండా నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రహదారి భద్రతను మరింత బలోపేతం చేయడానికి తనిఖీలను ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. పట్టుబడిన రెండు వాహనాలకు రూ.4,30 లక్షల జరిమానా విధించినట్టు చెప్పారు. ఈ తనిఖీల్లో మోటారు వాహనాల తనిఖీ అధికారులు అతికా నాజ్, ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎస్వీ పాలిటెక్నిక్లో క్యాంపస్ డ్రైవ్
తిరుపతి సిటీ : తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్లో ఆదివారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపికలో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని 22 పాలిటెక్నిక్లకు చెందిన ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం డిప్లొమో విద్యార్థులు 300 మంది పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ రైల్యే ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామి సంస్థ మేధా సర్వే వారు క్యాంపస్ డ్రైవ్ చేపట్టి విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కల్పించండం అభినందనీయమన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహించారని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులు రెండో దశ పర్సనల్ ఇంటర్వ్యూకు సెలక్ట్ అయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల తుది జాబితాను వచ్చే వారం అధికారికంగా ప్రకటిస్తా మని వెల్లడించారు. ఈఈఈ విభాగాధిపతి జీఎస్ రాధ, ఫార్మసీ హెడ్ హరీష్ బాబు పాల్గొన్నారు. -
పారిశ్రామిక మండళ్ల జాతీయ మండలి చైర్మన్గా శ్రీసిటీ ఎండీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): భారత వాణిజ్య పరిశ్రమల సంఘం (అసోచామ్)2026–27కు ఏర్పాటైన అనుబంధ సెజ్– పారిశ్రామిక మండళ్ల జాతీయ మండలి చైర్మన్గా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి నియమితులయ్యారు. సహ చైర్మన్లుగా ఎల్.బి.సింఘాల్ (మాజీ నోయిడా సెజ్ కమిషనర్), హితేందర్ మెహతా (సెంట్రం లీగల్ మేనేజింగ్ పార్టనర్, సెజ్లపై పుస్తక రచయిత) నియమితులయ్యారు. అసోచామ్ అధ్యక్షుడు నిర్మల్ కె.మిందా ఈ నూతన మండలి ఏర్పాటును ప్రకటించారు. ఈ సందర్భంగా డా.సన్నారెడ్డి మాట్లాడుతూ, సెజ్లను పెట్టుబడులు, ఎగుమతులు, పారిశ్రామిక వృద్ధికి చోదక శక్తులుగా నిలబెట్టే దిశగా, ప్రభుత్వం, పరిశ్రమలతో కలిసి మండలి పనిచేస్తుందన్నారు. సెజ్ పథకం రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి అనుగుణంగా కొత్త సమన్వయం అవసర మని డా. సింఘాల్ అన్నారు. సెజ్ 2.0 విధాన రూపకల్పనలో ఈ మండలి కీలక పాత్ర పోషిస్తుందని మెహతా పేర్కొన్నారు. నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ తిరుపతి అర్బన్:ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. నేటి నుంచి ఒంటిపూట బడి తిరుపతి అర్బన్:వేసవి నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 7.45 నుంచి మఽ ద్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే పదోతరగతి పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఒంటి పూట బడులు ఏప్పిల్ 24 వరకు కొనసాగుతాయ ని వివరించారు. రెండు సెషన్లలో తరగుతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రమాదంలో యువకుడి మృతి
నాయుడుపేట టౌన్ : పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాళెం గ్రామానికి చెందిన వేపగుంట సాయి(25) తడ సమీపంలోని అపాచీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను ఆదివారం బైక్లో నాయుడుపేటలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామం బయలుదేరాడు. పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొని డివైడర్ను కూడా ఢీకొని కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతికి వచ్చే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి–పూరి ఎక్స్ప్రెస్ (నంబర్లు 17480–17479) సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో నడుస్తాయి. తిరుపతి – బిలాస్పూర్ (నంబర్లు 17482–17481) గురు, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయి. ఈ నాలుగు నూతన రైళ్లు 18 బోగీలతో సోమవారం తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున పూరి నుంచి మరొకటి బయలుదేరుతాయి. 19న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున బిలాస్పూర్ నుంచి మరొకటి బయల్దేరుతాయి. అదే విధంగా తిరుపతి – అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (నంబర్లు 12765–12766) మొత్తం 15 బోగీలతో ఈ నెల 21న తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. తిరుపతి – కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ (నంబర్లు 17249–17250) మొత్తం 22 బోగీలతో ఈ నెల 22న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున కాకినాడ నుంచి మరొకటి బయలుదేరుతాయి. దీంతో పాటు తిరుపతి – రామేశ్వరం ఎక్స్ప్రెస్ (నంబర్లు 16780 –16779) మొత్తం 17 బోగీలతో ఈనెల 26న రామేశ్వరంలో బయలుదేరి 27న తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల నూతన కార్యవర్గం తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతి జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక ఎన్జీవో హోమ్లో నిర్వహించిన ఎన్నికలకు రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కోశాధికారి సుఖాని అధికారులుగా వ్యవహరించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా గోపీకృష్ణ, కార్యదర్శిగా పీవీ ప్రవీణ్, కోశాధికారిగా మహేష్, అసోసియేట్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా టి.భరత్, కె,భరత్, భాగ్యలక్ష్మి, భారతి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా లోకేష్, సంయుక్త కార్యదర్శులుగా మధు, కవిత, సత్యవేణి, సభ్యలుగా కళ్యాణి, వినీల్ ఎన్నికయ్యారు. అన్నమయ్య విగ్రహానికి విశేష అభిషేకాలు తిరుమల: తిరుమల లేపాక్షి కూడలిలో గల శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహం వద్ద అన్నమయ్య 523వ వర్ధంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అభిషేక కార్యక్రమంలో అన్నమయ్య వంశ పరంపరలో 12వ తరానికి చెందిన తాళ్లపాక పవన్ భరద్వాజ్, తాళ్లపాక హైగ్రీవ నారాయణచార్యులు, కంచి రాజేష్ ప్రేమ్కుమార్, బెంగళూరుకు చెందిన విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభిషేకం జరిగినంతసేపు సిద్ధిపేటకు చెందిన పవన్ బృందం, వైజాగ్కు చెందిన భక్త బృందం, సింగపూర్కు చెందిన భక్తుల బృందం కలిసి సంకీర్తన సేవ నిర్వహించారు. ముక్కంటి భక్తులకు ఉచిత బస్సు శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తు ల కోసం అధికారులు ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. ఒక బస్సు ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 వరకు కైలాస సదనం, గంగా సదనం నుంచి ఆలయ నాలుగో గేటు, రైల్వేస్టేషన్, వరదరాజస్వామి అతిథి గృహం, ఆర్టీసీ బస్టాండు, భక్త కన్నప్ప సదన్, 1వ గేటు, 4వ గేటు నుంచి మళ్లీ కై లాస సదన్, గంగా సదన్కు నడుస్తుంది. మరో బస్సు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు కై లాస్ సదన్, గంగా సదన్ నుంచి 4వ గేటు, 1వ గేటు, ఆర్టీసీ బస్టాండు లోపలకు, వీఎంసీ సర్కిల్, భక్తకన్నప్ప సదన్, 1వ గేటు, 4వ గేటు కై లాససదన్, గంగా సదన్కు నడపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
పథకాలన్నీ గడప వద్దకే వచ్చేవి..
మా కుటుంబానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల వల్ల సుమారు 5 లక్షల వరకు లబ్ధి చేకూరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతిదీవెన, సున్నావడ్డీ వంటి పథకాలు అందాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి పథకాలు అందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మినహా ఏ ఒక్క పథకం అందలేదు. – పట్నం జ్యోతి, కొల్లాగుంట, కార్వేటినగరం -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తిరుపతి క్రైం : తిరుపతి టౌన్ పరిధిలోని గిరిధర దాస్ లైన్ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సమాచారం మేరకు.. గిరిధర్ దాస్ లైన్లోని ఓ ఇంట్లో మహిళ మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని రవీంద్రబాబు గుర్తించి.. వీఆర్వో మురళికి సమాచారం అందించారు. అనంతరం వీఆర్వో ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలు మర్రిబోయిన చైతన్య (26)గా గుర్తించారు. ఆమె భర్త పేరు మర్రిబోయిన మోహనరంగ. ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందినదిగా తెలిసింది. భర్తతో విడిపోయిన ఆమె, గత నెల ఫిబ్రవరి 24 నుంచి తిరుపతిలో సుబ్బయ్య అనే వ్యక్తితో కలిసి ఉంటోంది,. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. -
కమనీయం..దేవదేవుడి కల్యాణం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం కమనీయంగా సాగింది. శ్రీవారి జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం పద్మావతీ, ఆండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. ఆలయ పండిత బృందం ముందుగా గణపతి హోమం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ మాంగల్య ధారణ కమనీయంగా నిర్వహించారు. ఆలయ అధికారి వేణుగోపాల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఇంటి వద్దకే రేషన్
గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే అందేలా చేసింది. ప్రజలకు అవసరమైన ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని జగనన్న సురక్ష పేరుతో నేరుగా ఇంటి వద్దకే అందించింది. రేషన్ కూడా ఎండీయూ వాహనాలతో ఇంటి వద్దే పంపిణీ చేసింది. ప్రస్తుతం సేవలు అందక నరకయాతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ను నిలిపివేయడంతో పింఛన్ లబ్ధిదారులు నరకయాతన పడుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం, రెవెన్యూ సమస్యలు, ఇతర ప్రభు త్వ సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
నాడు
నేడుసచివాలయ సేవలు గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి 500కి పైగా సేవలను ప్రజలకు అందించింది. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా, ఈ– క్రాప్ ధాన్యం కొనుగోలు వంటి సేవలు 100కి పైగా అందించేవారు. నేడు రైతు సేవా కేంద్రాలు అలంకారప్రాయం కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చి ఎరువులు, పురుగు మందుల సరఫరాను నిలిపి వేశారు. దీంతో ప్రైవేటు ఎరువులు, పురుగు మందుల షాపులకు రెక్కలొచ్చాయి. -
బైక్ బోల్తాపడి వ్యక్తి మృతి
సైదాపురం : మండల కేంద్రమైన సైదాపురంలో ఆదివారం బైక్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సముద్రాలవారి కండ్రిగ గ్రామానికి చెందిన అద్వానపు వెంకటేశ్వర్లు(37) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం బైక్లో సైదాపురం వెళ్లి తిరిగి బయలుదేరాడు. సైదాపురం–తిప్పిరెడ్డిపల్లి రోడ్డులో బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును స్థానికులు 108 వాహనంలో గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్ట నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం శవపరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. గుట్టకు నిప్పు అంటించిన ఆకతాయిలు చంద్రగిరి: చంద్రగిరి పట్టణం సమీపంలోని బీడీ కాలనీ వద్దనున్న గుట్టకు ఆదివారం గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. వేడి ఎక్కువగా వస్తుండడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. చంద్రగిరి రాయలవారి కోట, దుర్గం కొండకు ఆనుకుని ఉన్న గుట్టలో మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలులు ఎక్కువగా వీస్తుండడంతో మంటలు దుర్గం కొండకు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు. నంది కొండలకు కార్చిచ్చు ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని నంది కొండల్లోని అడవులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అడవంతా మంటలు వ్యాపించాయి. రెండు రోజులుగా అడవి కాలుతూనే ఉంది. అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోతోంది. -
నాడు: విలేజ్ హెల్త్ క్లినిక్లు.. ఫ్యామిలీ డాక్టర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గడప వద్దకే వైద్యాన్ని అందించారు. ఈ కాన్సెప్ట్లో గ్రామాల్లో 14 రకాల వైద్య పరీక్షలు జరిపి 105 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం సేవలు దూరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సేవలు రోగులకు దూరమయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థలు నిర్వీర్యం చేసి అధికారులను సర్వేల పేరుతో గ్రామాల్లో తిప్పడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ కుర్చీలతో దర్శన మిస్తోంది. -
‘చంద్రబాబు.. ఇదేనా మీరు చెప్పుకునే క్రమశిక్షణ?’
తిరుపతి: డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోందన్నారు అభినయ్రెడ్డి. టీడీపీ అంటే క్రమ శిక్షణకు మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా? అని నిలదీశారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని రంగంలోకి దించారని విమర్శించారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏవిధంగా పక్కదారి పడుతున్నారో చూడండి. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ,పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉంది. పుట్టా మహేష్ యాదవ్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, ఏపీలో రెండున్నరేళ్ల లో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, జరుగుతున్నాయిటిటిడి చైర్మన్గా త్యంత చెత్త చైర్మన్ గా బీఆర్ నాయుడు ఉన్నారు. తిరుమల క్యూ లైన్ లో భక్తులు నిరసన చేపట్టారు , గతంలో ఎన్నడు క్యూ లైన్ లో నిరసన తెలిపింది లేదు’ అని స్పష్టం చేశారు. ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడటం హేయమైన చర్యవిజయవాడ: ఓ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్తో పట్టుబడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీ స్థానంలో ఉండి ఈ తరహా పనులు చేయడమేంటి?, భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడానికి పుట్టా మహేష్ ఒక నిదర్శనం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయటికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల పై అరాచకాలు, దుర్మార్గాలు , రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎంపీ డ్రగ్స్ తో దొరకడమంటే మాటలు కాదు. తమ ఎంపీ డ్రగ్స్ తో దొరికడం పై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఎంపీ మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఏపీలో ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని అరికట్టాలంటున్నారు. ఏపీలో ప్రస్తుతం స్కూల్స్ లో కూడా గంజాయి దొరుకుతుంది. టీడీపీ ఎంపీలు డ్రగ్స్ కల్చర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి. టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఆటవిడుపుగా మారింది. శుక్రవారం సాయంత్రం అవ్వగానే హైదరాబాద్కు వెళ్లిపోతున్నారు. టిడిపి నేతలు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు’ అని విమర్శించారు. -
ఇసుక అక్రమ తవ్వకాలపై వైఎస్సార్సీపీ కన్నెర్ర
పెళ్లకూరు: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమతవ్వకాలపై వైఎస్సార్సీపీ నాయకులు కన్నెర్ర చేశారు. మాజీ శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పరిసర ప్రాంతాల రైతులు, పార్టీ శ్రేణులు కలిసి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించే యంత్రాలను, ఇసుక రవాణా చేస్తున్న లారీలను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.నియోజకవర్గంలో 20 నెలలుగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీ జరుగుతోందని సంజీవయ్య ఆరోపించారు.టీడీపీ నాయకుల చర్యలతో స్వర్ణముఖినది పరివాహక గ్రామాలైన పుల్లూరు, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, రావులపాడు, పిడికిటిమాల, యడపూడి తదితర గ్రామాలకు తాగు, సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
బీడీ కాలనీలో కార్డన్ సెర్చ్
చంద్రగిరి: పట్టణంలోని బీడీ కాలనీలో పోలీసుల బూట్ల శబ్ధంతో ప్రజలు గందరగోళంలో పడ్డారు. అసలు ఏమి జరుగుతోందో అర్థం కాక అయోమయానికి లోనయ్యారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలను చేస్తుతున్నట్లు పోలీసులు తెలపడంతో ప్రజలు ఊపరిపీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 52 సిబ్బందితో కలసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో పాటు వారి వివరాలను సేకరించారు. కాలనీలో రికార్డులు సక్రమంగా లేని 24 వాహనాలను సీజ్ చేసినట్లు చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపారు. పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వకుండా, శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ఈ కార్డన్ సెర్చ్ను చేపట్టినట్లు చెప్పారు. కొత్త వ్యక్తుల కదలికలు, గంజాయి, బెల్టు దుకాణాలు, అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించేందుకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి పాకాల: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని దామలచెరువు సమీపంలో చోటు చేసుకుంది. శనివారం స్థానిక రైల్వే పోలీసుల కథనం మేరకు.. దామలచెరువు సమీపంలో పట్టాలపై ఓ గురుతెలియని వ్యక్తి రైలు కింద పడి, మృతి చెందాడు. మృతుడు సుమారు 60 ఏళ్ల వ్యక్తి తెల్లచొక్కా, బ్లూ కలర్ లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్ట్ం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9133109537, 9440729533 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. జ్యువెలరీ షాపులో పట్టపగలే దోపిడీ సూళ్లూరుపేట: పట్టణంలోని కచేరివీధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర జ్యువెలరీ షాపులో శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నగలు కొనుగోలు చేయడానికి వచ్చినట్టు నటించి, షాపు యజమాని కళ్లల్లో కారంకొట్టి రూ.30 లక్షలు విలువ చేసే 916 కేడీఎం బంగార నగలను దోపిడీ చేసిన సంఘటన సంచలనంగా మారింది. మధ్యాహ్నం పూట బజారులో, షాపులో జనాలు తక్కువగా ఉన్న సమయాన్ని ఎంచుకున్న ఓ వ్యక్తి నగలు కొనుగోలు చేయడానికి వచ్చి, అన్ని నగలు చూశారు. మరికొన్ని మోడల్స్ చూపించమని అడిగి దుకాణం యజమాని తిరిగే సమయంలో జేబులో నుంచి డబ్బులు తీస్తున్నట్టుగా నటించి కారంపొడి ఆయన కళ్లలో కొట్టారు. చేతిలో ఉన్న నగలు తీసుకుని హడావుడిగా వెళ్లిపోయారు. షాపు యజమాని తేరుకుని బయటకు వచ్చేలోపే అగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల పుటేజీలు చూసి అగంతకుడు కారం చల్లి నగలు దోచుకెళ్లిన విషయం నిర్థారించుకున్నారు. సీసీ కెమెరాల్లో స్పష్టంగా దోపిడీ జరిగినట్టుగా ఉన్నందున అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
తిరుపతి అర్బన్: పది పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లోని తమ చాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పా రు. ఈ ఏడాది 31,334 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 9గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య, ఇతర సమస్యలతో పరీక్ష కేంద్రానికి 9.50 గంటలకు చేరుకున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉదయం 9.50 గంటల వరకు అనుమతి ఇస్తామన్నారు. అయితే పరీక్ష మాత్రం 12.45 గంటలకు మించి ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేమని స్పష్టం చేశారు. 165 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష డ్యూటీలు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఒక వేళ డ్యూటీలకు రాలేకపోతే జూన్ 12 వరకు మెడికల్ లీవ్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని చెప్పారు. ఆ కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 సిటింగ్ స్క్వాడ్లతో నిత్యం నిఘా ఉంటుందని చెప్పారు. మాస్ కాపీయింగ్కు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 7842641323 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
జాతీయస్థాయి పోటీల్లో మహిళావర్సిటీ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి రూరల్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూ నివర్సిటీ వారి ఆధ్వర్యంలో చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయస్థాయి నృత్య కళల పోటీల్లో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు ప్రతిభ చాటారు. మైమ్ విభాగంలో తెలుగు విభాగానికి చెందిన ప్రత్యూష, ప్రనూష, ఎల్ఎల్బీకి చెందిన మీనా, భానుశ్రీ, బీటెక్ విద్యార్థినులు త్రివేణి, తేజశ్రీ, కావ్యలకు రెండో బహుమతి లభించగా, రంగోలీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కె.యామిని నాలుగో బహుమతి కై వసం చేసుకున్నా రు. ఆ మేరకు యూనివర్సిటీ కల్చరల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరీతో పాటు విద్యార్థినులను వైస్ చాన్సలర్ వి ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఉషా అభినందించారు. -
తిరుమలలో ఆపరేషన్ వజ్రపహార్
తిరుమల: తిరుమలలో భక్తుల భద్రత, పవిత్రత పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా శనివారం ఉద యం పాపవినాశనం ప్రాంతంలో విస్తృత స్థాయిలో నాకాబందీ తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ ఆదేశాల మేర కు, తిరుమల అదనపు ఎస్పీ సూచనలతో, తిరు మల డీఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఫైర్, టీటీడీ రెవెన్యూ, రెవెన్యూ బృందాలు, ఎకై ్సజ్, ఆరోగ్య శాఖకు చెందిన సుమారు 62 మంది సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో పాపవినాశనం ప్రాంతంలోని షాపులను తనిఖీలు చేశారు. పలు ఉల్లంఘనలు వెలుగులోకి.. ఈ తనిఖీల్లో మొత్తం 120 షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన గుర్తింపు కార్డులు లేని 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గు ర్తింపు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న 22 షాపులను గుర్తించారు. 34 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. గంజాయి, మద్యం, పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక షాపులు, హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు ఉ త్పత్తులు వంటి నిషేధిత వస్తువులు వినియోగించకూడదని, తిరుమలకు తీసుకురావద్దని అధి కారులు కఠినంగా హెచ్చరించారు. అలాగే, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, వారిలో భక్తిభావం పెంపొందేలా ప్రవర్తించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ స్థానిక యువత, కార్మికులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ నాకాబందీ కార్యక్రమానికి స్థానికులు పూర్తిస్థాయిలో సహకరించినట్లు అధికారులు తెలిపారు. పాపవినాశనం వద్ద 20 షాపుల తనిఖీ స్థానికులకు అవగాహన.. అపరిచితులకు షాపులు ఇవ్వొద్దు ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమైన అధికారులు, అపరిచిత వ్యక్తులకు షాపులు అద్దెకు ఇవ్వకూడదని, సరైన గుర్తింపు లేకుండా ఎవరినీ పనిలో పెట్టుకోవద్దని సూచించారు. అలాగే, ఫారెస్ట్ శాఖ నిబంధనలు పాటించి వన్యప్రాణులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ వజ్రపహార్’ సదుద్దేశాన్ని ప్రజలకు వివరించిన అధికారులు, అవసరమైనప్పుడు వినియోగించాల్సిన అత్యవసర నంబర్లు 1972, 112పై అవగాహన కల్పించారు. కేటాయించిన వారే షాపులు నిర్వహిస్తున్నారా? టీటీడీ, ఫారెస్ట్ శాఖలు కేటాయించిన వారే షాపులు నిర్వహిస్తున్నారా..? లేక కొత్త వ్యక్తులు అక్రమంగా కొనసాగిస్తున్నారా..? అనే కోణంలో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. షాపులు నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా..? లైసెన్సులు చెల్లుబాటు అవుతున్నాయా..? అక్కడ పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు సరిచూశారు. ప్రతి శాఖ తమ పరిధిలోని అంశాలపై విడివిడిగా క్షుణ్ణంగా పరిశీలన చేపట్టింది. -
ఆగిన కాలువ పనులు
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయ తీలోని అడుసుపాళెం జగనన్న కాలనీలో తవ్వుతు న్న పంట కాలువ పనులను తాత్కాలికంగా ఆపివేశారు. కాలనీలో రెండురోజులుగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్లాట్లలో పంట కాలు వ తవ్వకాలు చేపట్టారు. శనివారం ఉదయం ఇంటి పట్టాలు ఉన్న మహిళలు హిటాచికి అడ్డుగా కూర్చొని, నిరసన తెలిపి, పనులను అడ్డుకున్నారు. అదే సమయంలో కాంట్రాక్టర్ అనుచరులు అక్కడికి వచ్చి మహిళలను బెదిరించే ధోరణితో మాట్లాడడంతో ఇరువురు మధ్య వాగ్యవాదం చోటుచేసుకుంది. వివాదం పెద్దదయ్యే తరుణంలో వీఆర్వో రామ్మూర్తి సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్కు విషయం అందజేశారు. దీంతో ఆయన తాత్కాలికంగా కాలువ తవ్వకాలను నిలిపివేయమన్నట్లు తెలిపి, పనులను ఆపివేశారు. తహసీల్దార్ అందుబాటులో లేరని సోమవారం తహసీల్దార్ వచ్చి సమస్య పరిష్కరిస్తారని అప్పటివరకు తవ్వకాలు నిర్వహించకూడదని వీఆర్వో తెలిపారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ప్లాట్లలో కాలువ తవ్వారని, తమ ప్లాట్లు యథావిధిగా ఇచ్చేంత వరకు హిటాచి పంపబోమని బాధితులు వీఆర్వోకు తెలిపారు. వీఆర్వో అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానిక టీడీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కాలనీ వద్దకు చేరుకుని పనులను ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, బెదిరించారని బాధితులు వాపోయారు. ప్రభుత్వ పనికే అడ్డు చెబుతారా? మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రానీయమని, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇంటి పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు తెలిపారు. తాము ప్రభుత్వ పనులకు ఎప్పుడు అడ్డు చెప్పమని, కానీ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ప్లాట్లలో అన్యాయంగా తవ్వకాలు జరుపుతుంటే అడ్డుకున్నామని, తమ బాధను చెబుతుంటే టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడం అన్యాయంగా ఉందని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు తమ ప్లాట్ల ను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి
తిరుపతి అర్బన్: పదో తరగతి విద్యార్థులు ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. విశ్వనాథరెడ్డి వెల్లడించారు. శనివారం వరదరాజనగర్లోని విశ్వం పోటీపరీక్షల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో 2026 సీబీఎస్ ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థు లు వారి తల్లిదండ్రుల కోసం ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది తర్వాత పాలిసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరి సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని తెలిపారు. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్లో లేటరల్ ఎంట్రీ ద్వారా బిటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశముంటుందని వెల్లడించారు. ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్ 4 వరకు గడువు ఉందని, పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ ఉంటుందని చెప్పారు. అలాగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు ఉందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24వ తేదీన ఉంటుందన్నారు. ఏపీఆర్జేసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యను ఉచితంగా చదివే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 36 ఏళ్లుగా పాలిటెక్నిక్ కోచింగ్లో విశ్వం ఇన్స్టిట్యూట్ అద్భుత ఫలితాలు సాధించిందని, ముఖ్యంగా 2025 పాలీసెట్ ప్రవేశ పరీక్షలో జిల్లా ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. అలాగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 సంప్రదించవచ్చని తెలిపారు. -
ఎస్వీయూలో రేపు జాబ్మేళా
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్ కార్యాలయంలో సోమవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు హాజరై సుమారు 700 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిక్స్ పేపర్–1పరీక్షకు 345 మంది గైర్హాజరుతిరుపతి సిటీ: జిల్లాలోని 84 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ సివిక్స్ పేపర్–1 ప్రశాంతంగా జరిగిందని ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సివిక్స్ పరీక్షకు జిల్లాలో 4,885 మందికి గాను 4,540 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 345 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే సోమవారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మోడరన్ లాంగ్వేజ్ పేపర్–2తోపాటు జాగ్రపీ పేపర్ పేపర్–2 పరీక్ష జరగనుందని తెలిపారు. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయండి నాయుడుపేట టౌన్: పట్టణంలోని బిరదవాడ సమీపంలో నూతనంగా నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కె వెంకటేశ్వర్ సూచించారు. స్థానిక మున్సి పల్ కార్యాలయంలో కమిషనర్ షేక్ ఫజులుల్లాతోపాటు మెప్మా, టిడ్కో పలువురు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టిడ్కో గృహాలు ప్రారంభం కావాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 430 చదరపు అడుగులు సంబంధించి 288 గృహాలు, 365 చదరపు అడుగులకు సంబంధించి 624, 360 చదరపు అడుగులకు సంబంధించి 1,152, మొత్తం 2,064 గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉందని కమిషనర్ జిల్లా కలెక్టర్కు వివరించారు. దీంతో ఇప్పటి వరకు 1100 గృహాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, మిగిలిన గృహాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి అభివృద్ధి పనులు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, వీలైతే ఈ నెల 24, 25 తేదీల్లో సీఎం పర్యటన ఉండవచ్చని కలెక్టర్ వెల్లడించారు. -
విజయీభవ..
ఏడాదంతా ఆటపాటలకు స్వస్తి పలికారు.. టీవీలను అటకెక్కించారు..కాలంతో పోటీ పడ్డారు.. క్షణం వృథా కాకుండా కష్టపడి చదివారు.. పుస్తకాలతో కుస్తీ పట్టారు.. నేర్చుకున్న జ్ఞానాన్ని పేపరుపై జాలువార్చే సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. మదిలో నిక్షిప్తమైన అక్షర గనిని వెలికితీసే ఘడియరానే వచ్చింది. ఈ క్రమంలో కంగారు పడకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉత్తమ మార్కుల సాధనకు అడుగేయాల్సిన శుభ తరుణమిదే.. బంగరు భవితకు బాటలు వేసుకునే బంగారు క్షణమిదే.. నీ కలం నుంచి జాలువారే అక్షరాల కలబోత నీ జీవితాశయం వైపు తీసుకెళ్లే నుదుటిరాత..మేలుకో గమ్యం వైపు సాగిపో ఓ విద్యార్థీ.. విజయీభవ.. తిరుపతి అర్బన్: విద్యార్థి జీవితంలో కీలకమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే శుభ ఘడియ రానే వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. జిల్లాలో మొత్తం 165 పరీక్ష కేంద్రాల్లో 31,334 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులుంటే హెల్ప్లైన్ నంబర్ 78426 41323కు తెలియజేయాల్సి ఉంటుంది. గత ఏడాది 26,679 మంది పది పరీక్షలు రాయగా ఈ ఏడాది 31,334 మంది పరీక్షకు హాజరుకానున్నారు. జిల్లాలో మండలాలు పెరగడంతో 4,655 మంది విద్యార్థులు పెరిగారు. ఆ మేరకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల సమీప ప్రాంతాల్లో జెరాక్స్ సెంటర్లు మూత వేయాల్సి ఉంది. విద్యుత్ పరికరాలను తీసుకుపోవడానికి విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లకు లేదు. పరీక్ష రోజుల్లో ఉచిత ప్రయాణం టెన్త్ విద్యార్థులు పరీక్ష రోజుల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఉచిత సౌకర్యం కల్పించారు. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ బస్సులో మాత్రమే అవకాశం ఉంటుంది. తమ నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రం వరకు మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చ. విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.ఉత్తీర్ణత శాతం ఇలా... సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత రాష్ట్రంలో సంఖ్య శాతం జిల్లా స్థానం 2022–23 26,388 75.70 8వ స్థానం 2023–24 26,625 90.71 10వ స్థానం 2024–25లో 26,679 79.83 19వ స్థానంపరీక్షలకు సర్వం సిద్ధం జిల్లా సమాచారం.. పది విద్యార్థులు 31,334 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 14,027 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో బాలికలు 12,631 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో మొత్తం 29,165 మంది సప్లిమెంటరీ విద్యార్థులు 1178 మంది ఏపీఓఎస్ఎస్ విద్యార్థులు 991 మంది పరీక్ష కేంద్రాలు 165 చీఫ్ సూపరింటెండెంట్లు 179 మంది డిపార్ట్మెంట్ అధికారులు 179 మంది ఇన్విజిలేటర్లు 1,435 మంది ప్లయింగ్ స్క్వాడ్లు 10 సిట్టింగ్ స్క్వాడ్లు 30ఉత్తీర్ణత శాతం ఇలా... తేదీ పరీక్ష 16 ఫస్ట్ లాంగ్వేజ్ 18 సెకండ్ లాంగ్వేజ్ 21న ఇంగ్లిష్ 23 మ్యాథ్స్ 25 ఫిజకల్ సైన్స్ 28 బయలాజికల్ సైన్స్ 30 సోషియల్ స్టడీస్ జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు జిల్లాలో ఎనిమిది పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో బాలాయపల్లి మండలంలోని జయంపు జెడ్పీ హైస్కూల్, చిట్టమూరు మండల కేంద్రంలోని టీఎంఆర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఓజిలి మండలంలోని చిలమానుచేను జెడ్పీ హైస్కూల్, నాగలాపురం మండలంలోని బీరకుప్పం జెడ్పీ హైస్కూల్, కోట మండలంలోని చిట్టేడులో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలుర సెంటర్, పుత్తూరు మండలంలోని గోపాలకృష్ణాపురం ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ సెంటర్, పుత్తూరు మండలంలోని గేట్పుత్తూరు జెడ్పీ హైస్కూల్, వరదయ్యపాళెం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. -
అధికారుల అండ
ఇసుకింకరులకుస్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వుతున్న హిటాచీపెళ్లకూరు: స్వర్ణముఖి నదిని రేయింబవళ్లు యంత్రాలతో కుళ్లబొడుస్తూ ఇసుక దోపిడీ చేస్తుంటే ఇక్కడ అధికారులు కన్నెత్తి చూడడం లేదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మండిపడ్డారు. స్వర్ణముఖి నదిలో కలవకూరు గ్రామం వద్ద భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి లారీలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండడాన్ని శనివారం కిలివేటి సంజీవయ్య, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల రైతులు, పార్టీ శ్రేణులు కలిసి అడ్డుకున్నారు. యంత్రాలను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలవల కుటుంబం కొనసాగిస్తున్న దందాలు, అక్రమ దోపిడీ వ్యవహారం అంతా టీడీపీ నాయకులందరికీ తెలుసన్నా రు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన నెలవల కుటుంబ సభ్యులంతా దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. పెళ్లకూరు మండలంలోని స్వర్ణముఖినది పరిహాక గ్రామాలైన పుల్లూరు, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, రావులపాడు, పిడికిటిమాల, యడపూడి తదితర గ్రామాలకు తాగు, సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో దోపిడీ కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో డీసిల్టింగ్కు ప్రభుత్వం అనుమతులిచ్చిందని కిలివేటి సంజీవయ్య తెలిపారు. పుల్లూరు సమీపంలో పాలచ్చూరు సఫ్లై చానల్ వద్ద 1.92 హెక్టార్లు, దిగువ కలవకూరు వద్ద 1.821 హెక్టార్లు విస్తీర్ణంలో స్వర్ణముఖినదిలోని పైపొరను రోజు వారి కూలీలతో తవ్వకాలు జరిపి, అవసరాల నిమిత్తం తీసుకెళ్లేందుకు డీఎల్ఎస్సీ జిల్లా అధికారులు అనుమతులు మంజూరు చేశారన్నారు. అయితే ఇక్కడి టీడీపీ నాయకుల అండతో సంబంధిత కాంట్రాక్టర్ ఇసుక దోపిడీకి పాల్పడి 1.50 లక్షల టన్నులు ఇసుక దోపిడీ చేసినట్లు ఆరోపించారు. అడ్డూ అదుపూ లేకుండా ఇసుక అక్రమ రవాణా హైకోర్టును ఆశ్రయిస్తాం నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడీ గురించి, వివిధ శాఖల అధికారులు అవినీతి వ్యవహర శైలిపై గ్రీన్ట్రిబ్యునల్ను, హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి చెప్పారు. నదిలో తెగుగుగంగ జలాలు ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా లారీలు రాకపోకలకు అనుకూలంగా స్వర్ణముఖిలోకి రోడ్డు ఏర్పాటు చేసుకుని యంత్రాలను నదిలోకి దింపి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం అన్యాయమన్నారు. అక్రమ దోపిడీని అడ్డుకున్న రైతులను, నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసు యంత్రాంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. స్వర్ణముఖినదిలోకి లారీలు, టిప్పర్లు రాకపోకల కోసం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు ఏర్పాటు చేసుకుని, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి లారీలతో చైన్నె, తిరుపతి పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకోవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, రైతులు సురేష్రెడ్డి, సురేంద్రరెడ్డి, రమణారెడ్డి, కోటి, గురవయ్య, జితేంద్ర, బాలు, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
● మెడికల్ షాపుల పేరిట క్లినిక్లు ● జిల్లాలో పుట్టగొడుగుల్లా మెడికల్ షాపుల్లో ఆస్పత్రులు ● నకిలీ అవతారమెత్తిన కొందరు కేటుగాళ్లు ● ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణశాఖ అధికారులు ● మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు సిబ్బంద
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026 నకిలీ డాక్టర్ల హడావుడి కాణిపాకం/తిరుపతి తుడా : జిల్లాలో మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న అక్రమ వైద్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. మందులు విక్రయించాల్సిన మెడికల్ షాపులు అనుమతి లేకుండానే క్లినిక్లుగా మారిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిన మెడికల్ షాపుల్లో కొన్నిచోట్ల చిన్న ఆస్పత్రుల్లా వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు దూరంగా ఉండ టం, చిన్నపాటి సమస్యలకే గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రజలు దగ్గరలో ఉన్న మెడికల్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని మెడికల్ షాపులనే క్లినిక్లు గా మార్చేశారు. సరైన అర్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు డాక్టర్లుగా మారి రోగులకు చికి త్స అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల సంఖ్యలో మెడికల్ షాపులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొన్నేళ్లలో మెడికల్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధికారిక అంచనాల ప్రకారం రెండు జిల్లా ల్లో కలిపి 2500 పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 మెడికల్ షాపుల్లో క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మెడికల్ షాపులు డాక్టర్లు సూచించిన మందులను మాత్రమే విక్రయించాలి. అయితే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అనేక షాపులు చిన్న వైద్య కేంద్రాల్లా మారిపోయాయి. ప్రజారోగ్యంపై ముప్పు. అర్హతలేని వ్యక్తులు వైద్యం చేయడం వల్ల రోగుల ఆరో గ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పరీక్షలు లేకుండా మందులు ఇవ్వడం, అవసరం లేని ఇంజెక్షన్లు వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో దగ్గరలోనే చికిత్స లభిస్తుందని భావించి ప్రజలు ఈ మెడికల్ షాపులపై ఆధారపడుతున్నారు. ఫార్మసీ లైసెన్స్ను కేవలం మందులు విక్రయించడానికి మాత్రమే పొందినా, అదే పేరుతో కొందరు క్లినిక్లు నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, కడుపు నొప్పి వంటి సాధారణ వ్యాధుల కు అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఇంజెక్షన్లు వేయడం, సైలెన్ లు పెట్టడం వంటి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆర్ఎంపీలతో చేతులు కలిపి రోగులకు నాడీ పట్టించి మందులు ఇవ్వడం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు నిజమైన వైద్య సేవల నుంచి దూరమై నకిలీ వైద్యులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఔషధ నియంత్రణ శాఖపై విమర్శలు అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ శాఖపై ఉన్నప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోవ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల మత్తుల్లో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ క్లినిక్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమది కాదని, అది వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వస్తుందని చెబుతూ బాధ్యతను ఒక శాఖ నుంచి మరో శాఖపైకి నెట్టేస్తున్నారని స్థానికులు అంటున్నారు. జిల్లాలో మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమ వైద్యంపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ క్లినిక్లు నిర్వహిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
సహకార సంఘ చైర్మన్, సీఈఓ మధ్య వివాదం
సూళ్లూరుపేట: స్థానిక రైతు సేవా సహకారం సంఘం చైర్మన్గా వ్యవహరిస్తున్న ఏజీ కిషోర్, అదే సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న సుల్తాన్బాషా మధ్య శనివారం వివాదం చోటు చేసుకుంది. సబ్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి రవికుమార్ సమక్షంలో వీరిద్దరు ఒకరినొకరు దూషించుకున్నారు. ఇందులో చైర్మన్ అనుచరులు కొంతమంది సీఈఓపై దాడి చేసే ప్రయత్నం చేశారని బాధితుడు సుల్తాన్బాషా తెలిపారు. అయితే గతంలో ఇక్కడ పనిచేసి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్కుమార్పై కేసు పెట్టాలనే విషయంలో వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అధికారి రవికుమార్ సమక్షంలో చైర్మన్ కిషోర్ బూతులు తిట్టినా ఆ అధికారి వీరిని మందలించకుండా మిన్నకుండి పోవడం పలు విమర్శలకు దారి తీసింది. వెంటనే అతనికి నోటీస్ కూడా ఇచ్చారు. దీంతో సీఈఓ సుల్దాన్బాషా బయటకొచ్చి ఓ వీడియో విడుదల చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ఈ సొసైటీలో రూ.కోట్లు అవినీతికి పాల్పడిన విజయ్కుమార్పై 2025 డిసెంబర్లో, మళ్లీ ఈ ఏడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇదే కిషోర్ కేసులు నమోదు కానీకుండా చేశారన్నారు. ఆ సమయంలో పైరవీలు చేసి, కేసులు నమోదు కాకుండా కొంతమంది నాయకులు కాపాడారన్నారు. తీరా ఇప్పుడు హైకోర్టు నుంచి విజయ్కుమార్పై కేసు నమోదు చేయమని ఆర్డర్ వచ్చిందని, అధికారి సమక్షంలో చెబితే తనను దుర్భాషలాడడంతోపాటు అనుచరులతో దాడి చేయించే ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఇది చాలదన్నట్టుగా నోటీస్ జారీ చేశారని తెలిపారు. చైర్మన్గా ఆయన బాధ్యతలు ఆయన నిర్వహించలేదని, సొసైటీలో కేవలం యూరియా మాత్రమే ఇవ్వడంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయన్నారు. అందుకే సౌసైటీ కార్యాలయానికి వెనుకవైపు ఉన్న గోడౌన్ నెలకు రూ.30 వేలు అద్దెకు ఇచ్చామన్నారు. కార్యాలయంపైన ఎల్ఐసీ కార్యాలయానికి ఒక భవనం, ఆర్డీఓ కార్యాలయానికి మరోభవనం అద్దెకు ఇచ్చామని, వాటి అద్దె డైరెక్ట్గా అక్కౌంట్లో వేస్తారన్నారు. ఇలా ఆదాయం లేకుండా జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రూ.14 వేల జీతానికి మరో వ్యక్తిని నియమించుకున్నారని చెప్పారు. అతనికి 2025 సెప్టెంబర్ నుంచి జీతం ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఇదే కాకుండా ఈ కిషోర్ చైర్మన్ కాకముందే సొసైటీలో డిఫాల్టర్గా ఉన్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక డబ్బులు కట్టకుండానే అందుకు సంబంధించిన పాసుపుస్తకాలు ఇమ్మని అడిగితే ఇవ్వలేదని తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వివాదం చేసి కావాలనే నోటీస్ ఇచ్చారని తెలిపారు. దీనిపై టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దీనిపై సొసైటీ చైర్మన్ కిషోర్ను వివరణ కోరగా అతనిపై తనకేమీ కక్షలేదని, గతంలో రూ.2 లక్షలు చెల్లించినా పాసుపుస్తకాలు ఇవ్వలేదన్నారు. తాను చైర్మన్ అయిన తరువాత మూడు నెలలుగా సొసైటీకి సంబంధించిన లెక్కలు ఇవ్వమని అడిగితే కాలయాపన చేస్తున్నారని చెప్పారు. అందుకని అధికారి సమక్షంలోనే మందలించి నోటీస్ జారీ చేశానని వివరణ ఇచ్చారు. -
‘కూల్ సిటీ’ గా మెరిసిన శ్రీసిటీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ముంబైలో ఈ నెల 12వ తేదీ నుంచి జరుగుతున్న ‘ఏసీఆర్ఈఎక్స్ ఇండియా 2026’ ఎగ్జిబిషన్లో ‘కూల్ సిటీ’గా శ్రీసిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. శ్రీసిటీలోని పలు ప్రముఖ ఏసీ కంపెనీలు, ఇతర అనుబంధ పరిశ్రమలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. హెచ్వీఏసీ అండ్ఆర్ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్) తయారీ కేంద్రంగా శ్రీసిటీ ప్రాధాన్యతను చాటింది. దక్షిణ ఆసియాలో హెచ్వీఏసీ అండ్ ఆర్ రంగానికి సంబంధించిన ప్రముఖ ఎగ్జిబిషన్గా గుర్తింపు పొందిన ‘ఏసీఆర్ఈఎక్స్ ఇండియా 2026’ని ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజినీర్స్ (ఐఎస్హెచ్ఆర్ఏఈ) అనే సంస్థ నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్త తయారీ సంస్థలు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమ ప్రముఖులు తమ అత్యాధునిక సాంకేతికతలు, పర్యావరణహిత పరిష్కారాలు, భవిష్యత్తు వ్యవస్థ మార్పులను పరిచయం చేయడానికి ఇదొక మంచి వేదికగా నిలుస్తోంది. దీనిపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి స్పందిస్తూ, శ్రీసిటీలోని హెచ్వీఏసీ పారిశ్రామిక అనుకూల వాతావరణ ప్రదర్శనతో పాటు పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో తయారయ్యే ఎయిర్కండిషనర్లలో దాదాపు 40 శాతం శ్రీసిటీలోనే తయారవుతున్నాయని తెలిపారు. -
బాణసంచా తయారీ కేంద్రంపై దాడులు
సూళ్లూరుపేట: తడమండలం అక్కంపేట సమీపంలోని పొలాల్లో లైసెన్స్ లేకుండా నడుపుతున్న బాణసంచా కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాణసంచా కేంద్రం యజమానిని అదుపులోకి తీసుకున్నారు. బాణసంచా ముడిసరకులు, టపాసులు స్వాధీనం చేసుకున్నామని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని అరెస్టు చూపి, వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం.. తడమండలం అక్కంపేట వద్ద పొలాల్లో మూడు షెడ్లు నిర్మించి అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నట్లు తడ పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ, తడ ఎస్ఐ కొండపనాయుడు గురువారం బాణసంచా కేంద్రంపై దాడులు చేశారు. ఈ సందర్భంగా వరదయ్యపాళెం మండలం కారిపాకం గ్రామానికి చెందిన రాచగొల్ల హేమంత్సాయి (28)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాణాసంచా కేంద్రం నిర్వహించేందుకు లైసెన్స్ ఉందా? అని యజమానిని అడగ్గా తెల్లమొఖం వేయడంతో ఎలాంటి అనుముతులు, లైసెన్స్ తీసుకోకుండా బాణాసంచా తయారు చేయడం చట్ట విరుద్ధమని, బాణసంచా తయారీకి అవసరమైన ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అతన్ని అరెస్ట్ చూపించి సూళ్లూరుపేట కోర్డులో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారని తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే పురిటి బిడ్డ మృతి
తిరుపతి తుడా: వైద్యాధికారుల నిర్లక్ష్యంతో ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు వైద్యు ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. బుధవారం ఉదయం ప్రసవ నొప్పులతో బాధపడుతున్న తిరుపతి మారుతీనగర్కు చెందిన ఓ గర్భిణిని కుటుంబ సభ్యులు తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు మధ్యా హ్నం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అనంతరం మహిళకు రక్తపోటు పెరగడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. గురువారం సాయంత్రం శిశువుకు వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆ ఇంజెక్షన్ వికటించడంతో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో శిశువు మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు. బిడ్డ మృతి చెందడంపై వైద్యాధికారులు సరైన వివరణ ఇవ్వకుండా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శిశువు మృతదేహంతో నిరసన శిశువు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కుటుంబ స భ్యులు నిరసన చేపట్టారు. నిర్లక్ష్యం వహించిన వై ద్యాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డి మాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎరచ్రందనం కేసులో ముగ్గురికి జైలు
తిరుపతి లీగల్: ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు జైలుశిక్ష, రూ.20వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్న్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ రవి కథనం మేరకు.. 2014 నవంబర్ మూడో తేదీ రొంపిచర్ల పోలీసులు ఆడినవారిపల్లి– రొంపిచర్ల మండలం మార్గంలో తనిఖీలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా, కలకడ మండలం, గుట్టపల్లి, బండ్లవంకకు చెందిన కంభం తేజ ప్రకాష్ రెడ్డి, పీలేరు, బండ్ల వంక గంగమ్మ గుడివీధికి చెందిన కలవపల్లి గురునాథ్, పీలేరు, తిరుపతి రోడ్డు, శ్రీనగర్ కాలనీకి చెందిన చిట్టమూరి శివకుమార్తోపాటు మరో ఏడుగురు శేషాచలం అటవీ ప్రాంతంలోకి మారణాయుధాలతో అక్రమంగా ప్రవేశించి పది ఎరచ్రందనం చెట్లను నరికి ఎరచ్రందనం దుంగలుగా మార్చి వంకిరెడ్డివారిపల్లి సమీపంలోని పొదల్లో ఆరు ఎరచ్రందనం దుంగలను దాచిపెట్టారు. నాలుగు ఎరచ్రందనం దుంగలను కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు పదిమందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ముగ్గురికి మాత్రం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఏడుగురిపై కేసును కొట్టివేస్తూ తీర్పులో పేర్కొన్నారు. గ్యాస్ నిల్వలున్నాయి తిరుపతి అర్బన్: రూరల్ మండలంలోని వేదాంతపురం పంచాయతీలోని శ్రీబాలాజీ టీటీడీ కోఆపరేటివ్ భారత్ గ్యాస్ గోడౌన్లో జిల్లా సివిల్ సప్లయి అధికారి శేషాచలం రాజు శుక్రవారం మద్యాహ్నం తనిఖీలు నిర్వహించారని జాయింట్ కలెక్టర్ గోవిందరావు శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే భారత్ గ్యాస్కు సంబంధం లేకుండా గో–గ్యాస్ అను ప్రైవేటు సంస్థకు చెందిన వాణిజ్య సిలిండర్లు గుర్తించినట్లు చెప్పారు. అయితే వాటిలో వాణిజ్య పుల్ సిలెండర్లు 595, వాణిజ్య ఖాళీ సిలెండర్లు 149 ఉన్నాయని తెలిపారు. అయితే గోడౌన్ యజమాని లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న గోపి అనే వ్యక్తిని విచారించినప్పటికి సరైన సమాధానం చెప్పలేదని స్పష్టం చేశారు. దీంతో గో–గ్యాస్ సిలెండర్లుతోపాటు భారత్ గ్యాస్ సిలెండర్లు ఫుల్ 230, ఖాళీ సిలెండర్లు 82 నిత్యవసర చట్టం 1955లోని సెక్షన్ 6ఏ ప్రకారం పంచాయతీ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్ చేసినట్లు చెప్పారు. వాటి విలువ సూమారు రూ.19,75,670 ఉంటుందని తెలిపారు. అలాగే వారిపై నిత్యావసర సరుకుల చట్టం 1955 సెక్షన్ 7–1 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎల్పీజీకి చెందిన ఏ సమస్య ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 0877 2236007కు తెలియజేయాని సూచించారు. రోడ్డుకు అడ్డంగా దేవాలయ పందిళ్లు ఇబ్బందులు పడుతున్న స్థానికులు సాక్షి టాస్క్ ఫోర్స్: రేణిగుంట మండలం, జీ పాళెం పంచాయతీలోని పద్మానగర్, జగనన్న కాలనీ మధ్యలో ఉన్న రోడ్డులో అమ్మవారి ఆలయ పూజల పేరుతో రోడ్డుకి అడ్డంగా పందిళ్లు వేయడం వివాదంగా మారింది. ఒక వీధికి అడ్డంగా పందిళ్లు వేయడంతో ఆ వీధిలోని వారు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాహకులకు ఇదే విషయాన్ని చెప్పిన అధికార పార్టీ నాయకుల అండ దండలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆలయ పూజలకు ఎవరు అడ్డు చెప్పారని, కానీ ఇలా వీధులకు అడ్డంగా పందిళ్లు వేసి అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నాయకుల మాటలు విని ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. స్థానికంగా కార్తికేయ సొసైటీ అనే పేరుతో కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కార్తికేయ సొసైటీ చేస్తున్న పనులు పై అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఇద్దరు తమిళ స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట: ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. చిన్నగొట్టిగల్లు మండలంంలో ఎర్రచందనం అక్రమ రవాణా యత్నాన్ని అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు. అటవీక్షేత్రాధికారి ఎన్. వెంకటరమణం ఆధ్వర్యంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆర్.ఎస్. చైతన్య, ప్ర త్యేక బృందం సభ్యులు భాకరాపేట రేంజ్ పరిధిలోని బోడేవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో గు రువారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లని అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి 238 కిలోలు బరువు ఉన్న 16 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఉపయోగించిన వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషనన్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆర్ఎస్ చైతన్య, ఎఫ్బీఓలు వై.రాజేష్ కుమార్, జి. ప్రదీప్ చంద్ర, జేబీ నిఖిల్, ఎం. సదాశివయ్య, సి.రవి, డ్రైవర్ తేజా తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు వేయాలని సెల్ టవర్ ఎక్కిన యువకుడు పాకాల: మండలంలోని చిన్నగోర్పాడు గ్రామాని కి చెందిన సురేష్నాయుడు అనే యువకుడు తమ గ్రామంలో సీసీ రోడ్డు వేయాలని సెల్ టవర్ ఎక్కి న ఘటన శుక్రవా రం చోటు చేసుకుంది. స్థానికు లు కథనం మేరకు.. చిన్నగోర్పాడులో చాలాకాలంగా సీసీ రోడ్డు లేదు. స్థానికులు తీవ్రంగా ఇబ్బదులు పడుతున్నారు. విరక్తి చెందిన యువకుడు సురేష్నాయుడు సెల్ టవర్ ఎక్కి తన నిరసనను తెలి పాడు. మండల పర్యటనలో ఉన్న స్థానిక ఎమ్మె ల్యే పులివర్తి నాని విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడంతో సురేష్నాయుడు సెల్ టవర్ దిగి వచ్చాడు. చంద్రగిరి: మండలంలోని రెడ్డివారిపల్లి సమీపంలో ఉన్న క్వారీలో గురువారం జరిపిన భారీ పేలుళ్ల (బ్లాస్టింగ్) కారణంగా పెను ప్రమాదం సంభవించింది. బ్లాస్టింగ్ ధాటికి కొండపై నుంచి ఒక భారీ బండరాయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి చంద్రగిరి – నాగయ్యగారిపల్లి ప్రధాన రహదారిపై పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొండ పైనుంచి పడిన భారీ బండరాయి రోడ్డుపై పడగానే మూడు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో రాయి రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, బాటసారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తృటిలో ప్రాణా పాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్వారీలపై అధికారులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. -
గూడు.. గోడు
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీ, అడుసుపాళెం జగనన్న లేఅవుట్పై స్థానిక అధికార పార్టీ నాయకులు కక్ష కట్టారో ఏమో తెలియదు గానీ, గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ప్లాట్లలో పంట కాలువ తవ్వుతూ క్షణికానందం పొందుతున్నారు. కాలువ తవ్వకంతో దాదాపు 43 ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది మ్యాప్లో కాలువ ఉందని చెబుతుండడం తో ఏమి చేయాలో తెలియక లబ్ధిదారులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ పనులతో కాలనీలోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పుడు ఉన్న రెవెన్యూ అధికారులు అడుసుపాళెం సమీపంలో సర్వే చేసి 3500 ప్లాట్లు వేసి, పేదలకు పంపిణీ చేశారు. అలాంటి లేఅవుట్పై స్థానిక అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మ్యాప్లో కాలువ ఉందని చెబుతూ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఇలాంటి చర్యలు తీసుకోవడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల ప్రేక్షక పాత్ర జగనన్న లేఅవుట్లోని ప్లాట్లో కాలువ తవ్వడం కనీసం తహసీల్దార్కు ముందుగా తెలియక పోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు అంటున్నారు. బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ గోడును చెప్పుకున్న, నామ మంత్రంగా లేఅవుట్ వద్దకు వచ్చి, పరిశీలించి వెళ్లిపోయారు. మా ప్లాట్లలో కాలువ తవ్వకుండా ఆపండని బాధితులు ప్రాథేయపడినా అధికారులు ఏమి చేయకుండా వెన్ను తిరగడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించరా? ఒకవేళ గతంలో కాలువలోనే అప్పటి రెవెన్యూ అధికారులు పేద ప్రజలకు జగనన్న పట్టాలు ఇచ్చి ఉంటే, ముందుగా సర్వే చేసి ఎంతమంది కాలువతో ప్లాట్లు కోల్పోతారో తెలుసుకుని, వారికి నోటీసులు ఇవ్వడం గానీ, ప్రత్యామ్నాయంగా మరో చోట ప్లాట్లు ఇచ్చే ప్రయత్నాలు చేయడం కానీ చేసి ఉండాలి. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అసలు ప్లాట్లు కలిగిన యజమానులకు కనీస సమాచారం ఇవ్వకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు దగ్గర ఉండి కాలువ తవ్వడంపై స్థానికంగా చర్చనీయంగా మారింది. అధికార పార్టీ నాయకుడు డబ్బులు డిమాండ్ కాలువ పేరుతో జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకున్న వారిని స్థానిక టీడీపీ నాయకుడు వారి అనుచరుల ద్వారా డబ్బులు డిమాండ్ చేసి, డబ్బులిచ్చిన వారి ఇళ్లు వదిలేసి, తాము ఇవ్వలేమని చెప్పిన వారి ప్లాట్లలో కాలువ తవ్వకాలు జరిపినట్లు స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ నాయకుడికి భయపడే అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.దయగల దేవుడు జగనన్న మాకు ఇళ్లు ఇచ్చాడు.. నేడు కాలువ పేరుతో మా గూడు చెరిపేస్తున్నారు.. మాపై కూటమి నేతలు కాలకూట విషం చిమ్ముతున్నారు. నాడు కొలతలు తీసిన అధికారులు నేడు నోరు మెదపడం లేదు.. మాకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు.. పంట కాలువలో మీ ప్లాట్లు ఉన్నాయని కాలువ తవ్వేస్తున్నారు.. మా సొంతింటి కల చెరిపేస్తున్నారు. ఇదేమి న్యాయం మహాప్రభో అని జగనన్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా వారి గూడు..గోడు వినే నాథుడే కరువయ్యారు. -
● కార్పొరేషన్ మొదటి మహిళా మేయర్గా శిరీష ● ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం వెల్లడి
తిరుపతి మంగళం : నగర రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ సీపీ పాలనలో తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అప్పటి డిప్యూటి మేయర్ భూమన అభినయ్రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం స్పష్టం చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని సెనేట్హాలులో శుక్రవారం కార్పొరేషన్ చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్పొరేషన్ మొదటి మహిళా మేయర్గా డాక్టర్ శిరీష చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఐదేళ్లపాటు ఎంతో సౌమ్యంగా కార్పొరేటర్లు, అధికారులను సమన్వయం చేసుకుని నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అలాగే తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా కౌన్సిల్లో ఆమోదించి చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయారన్నారు. తిరుపతి రాజకీయ నాయకులెవరికీ సాధ్యం కాని విధంగా తిరుపతి నగరంలో 21 మాస్టర్ప్లాన్ రోడ్లు, స్లిప్వే రోడ్లు, ప్రధాన కూడళ్ల సుందరీకరణ, వినాయకసాగర్ అభివృద్ధి, శ్రీనివాససేతు ప్లైఓవర్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తిరుపతి రూపురేఖలే మార్చేసిన నాయకులు భూమన కరుణాకరరెడ్డి, అభినయ్రెడ్టి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
అన్నదాత.. దుఃఖీభవ
గూడు.. గోడు పంటకాలువ పేరుతో జగనన్న కాలనీలో ఇళ్ల ప్లాట్లలో లబ్ధిదారులకు ముందస్తు సమాచారం లేకుండా కాలువ తవ్వారు.శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026తిరుపతి అర్బన్: జిల్లాలో రైతుల సంఖ్య పెద్ద స్థాయిలో పెరిగినప్పటికీ..అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల సంఖ్య మాత్రమే తగ్గిపోవడంతో పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులకు అర్హత ఉన్నప్పటికీ చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపి, అన్నదాత సుఖీభవ పథకాన్ని దూరం చేయడాన్ని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పాత లెక్కలే చూపుతున్నారు. కొత్త రైతులకు పెండింగ్లో ఉన్న రైతులకు సుఖీభవ అందించడంలో సర్కార్ విఫలమైందనే విమర్శలు తప్పడం లేదు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది పథకాన్ని వర్తింప చేయలేదు. రెండో ఏడాదిలో తొలి విడతలో 1,54,908 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మరో 57,098 మంది రైతులు ఈకేవైసీ, బయోమెట్రిక్ పెండింగ్ ఉండడంతో ఎంపిక చేయలేదని వ్యవసాయశాఖ అధికారులు సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ 57,098 మందిని రెండో విడతలో ఎంపిక చేయాలని సూచించారు. అయినా వారికి రెండో విడతలో ఛాన్స్ రాలేదు. తాజాగా ఇచ్చిన 3వ విడతలోనూ అవకాశం దక్కలేదు. పాత లెక్కలో ఉన్న రైతులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఒకటి రెండు విడతల్లో 1,54,908 మందికి ఇచ్చారు. 3వ విడతలోనూ అదే సంఖ్యను ఎంపిక చేశారు. అయితే ఇటీవల జిల్లాల పునర్విభజన నేపథ్యంలో గూడురు నియోజకవర్గం నుంచి చిల్లకూరు, గూడూరు, కోట మండలాలు నెల్లూరు జిల్లాకు వెళ్లాయి. అలాగే అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో చేరింది. ఈ క్రమంతో గతంలో 34 మండలాలు ఉంటే ప్రస్తుతం 36 మండలాలు అయ్యాయి. దీంతో 3వ విడత సంఖ్య 1,66,006 మందికి చేరింది. రెండేళ్ల క్రితమే 1,80,654 మందికి పథకం రెండేళ్ల క్రితమే తిరుపతి జిల్లాలో 1,80,654 మందికి రైతు భరోసా ఇచ్చారు. ప్రతి నెలా అన్నదమ్ములు కొత్త కాపురాలు పెట్టుకుంటూ విడిపోతున్న క్రమంలో భూములు సైతం విభజన జరిగి కొత్త పాస్ పుస్తకాలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాంటి వారు జిల్లాలో రెండేళ్ల వ్యవథిలో 30 వేల మందికి పైగా ఉన్నారు. మరోవైపు కౌలు రైతులు జిల్లాలో 22 వేల మంది ఉన్నారు. ప్రధానంగా ఇంకో వైపు ఈకేవైసీ, బయోమెట్రిక్ పేరుతో పెండింగ్లో ఉన్నవారు జిల్లాలో 57,098 మంది ఉన్నారు. మొత్తంగా జిల్లాలో వంద శాతం న్యాయం చేస్తే..మరో లక్ష మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని జిల్లాలో జోరుగా చర్చసాగుతుంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పాత లెక్కల ప్రకారం 24,622 మందిని ఎంపిక చేశారు. కొత్త రైతులకు అవకాశం కల్పించలేదు.పాత లెక్కలే పరిగణ నలోకివైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 1,80654 మంది అర్హులుకూటమి ప్రభుత్వంలో 1,54,908 మంది అర్హులునిఘా సంస్థల పాత్ర కీలకంచరిత్రలో నిలిచిపోయేలా తిరుపతి నగర అభివృద్ధికష్టాల సేద్యం నుంచి కర్షకులను గట్టెక్కిస్తామని..ఆపదలో ఉన్న అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు అండ్కో హామీల వర్షం కురిపించింది. గద్దెనెక్కింది. ఇకేంముంది.. హామీలు కొండెక్కించింది. పుడమి పుత్రులను అన్ని విధాలా వంచించింది.. అన్నదాత సుఖీభవ అంటూ మొదటి ఏడాది మోసం చేసింది.. రెండో ఏడాది కొందరిని ఏమార్చింది.. మూడో ఏడాది కూడా మళ్లీ కోతలు పెట్టింది..పాతలెక్కలే పరిగణలోకి తీసుకుని లబ్ధిదారుల జాబితాను కుదించింది. ఫలితంగా అర్హులైన హలధారులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యారు. నిరాశ మిగిల్చిన సుఖీభవ అన్నదాతల్లో సుఖీభవ పథకం నిరాశ మిగిల్చింది.ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న రూ.6 వేలతో కలిపి, రాష్ట్రం 14వేలు ఇస్తే మొత్తం రూ.20 వేలు అంటూ మాట మార్చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయలేదు. రెండో ఏడాది ఈకేవైసీ, బయోమెట్రిక్ సాకుతో కొందరికి ఇవ్వలేదు. అలాగే భూముల విభజన నేపథ్యంలో కొత్త రైతులకు ఇవ్వలేదు. ఇంకోవైపు కౌలు రైతులకు ఎగనామం పెట్టడంతో అన్నదాతలు సుభీభవపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గం 2023–24 2025–26 తగ్గిన అర్హులు అర్హులు రైతుల సంఖ్య సత్యవేడు 33,944 29,653 4,291 శ్రీకాళహస్తి 31,838 27,847 3,991 చంద్రగిరి 30,347 26,062 4,285 గూడూరు 25,965 22,217 3,748 సూళ్లూరుపేట 32,685 26,563 6,122 వెంకటగిరి 16,767 14,975 1792 (3 మండలాలు మాత్రమే) నగరి 9,105 7591 1514 (2 మండలాలు మాత్రమే)నాకు సుఖీభవ ఇవ్వండి సార్ మాది వాకాడు మండలంలోని కల్లూరు పల్లిపాళెం గ్రామం, పేద కుటుంబానికి చెందిన వాళ్లం. 3.5 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయశాఖ ఉద్యోగులకు నా బాధను చెప్పుకున్నాను. అయినా నాకు మూడో విడతలోనూ అన్నదాత సుఖీభవ అందలేదు. పాత లెక్కల ప్రకారమే ఇచ్చారంటూ చెబుతున్నారు. కొత్త రైతులకు ఎప్పుడు ఇస్తారు సార్.. పెట్టుబడి సాయం మాకు ఇప్పించాలని కోరుతున్నాం. –పాకం చెంగయ్య, రైతు, కల్లూరుపల్లిపాళెం అందరికీ న్యాయం చేయండి రైతుల పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎప్పు డు ఏం జరుగుతుందో తెలియదు. దీంతోనే గత ప్రభుత్వం రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ రైతు భరోసా ప థకాన్ని పెట్టారు. ఆ తర్వాత కూటమి ప్ర భుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త పథకాన్ని పెట్టారు. అ యితే మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయలేదు. రెండో ఏడాది కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. కనీసం మూడో ఏడాది అ యినా అర్హులైన ప్రతి రైతును అన్నదాత సుఖీభవ పథకానికి ఎంపిక చేయాలని కోరుతున్నాం. –నరేంద్రయాదవ్, రైతు, శ్రీకాళహస్తి కౌలు రైతులకు న్యాయం చేయండి పేద కుటుంబానికి చెందిన వాళ్లం. మాకు భూములు లేవు. దాంతో పెద్ద భూస్వాముల నుంచి భూములు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా చేస్తున్నాం. అయితే మాకు ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవ పథకం వర్తించడం లేదు. ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని రెండేళ్లుగా చూస్తున్నాం. ఓ వైపు కౌలు చెల్లించి మరోవైపు పెట్టుబడికి అప్పులు చేస్తే.. మాకు కూలీ డబ్బులు కూడా మిగిలేలా లేదు. మమ్మల్ని గుర్తించండి సార్. – చేను వెంకటయ్య, కౌలు రైతు, వాకాడు -
కల చెదిరింది.. కన్నీరే మిగిలింది!
శ్రీకాళహస్తి: ‘అది డాక్టర్ల ఫ్యామిలీ అనొచ్చునేమో. ఎందుకంటే ఆ ఉమ్మడి కుటుంబంలోని పిల్లలందరూ డాక్టర్లే. ఐదుగురు పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు. వారి చదువులు చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. పదుగురికి సేవ చేసి కుటుంబ ప్రతిష్ట కాపాడుతారని కలలుగనేవారు. కానీ ఇందులో ఓ యువకుడిపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదరూపంలో కబళించింది. ఆ కుటుంబ ఆశలు వమ్ము చేసింది. కుటుంబ సభ్యులను తీరని దుఃఖసాగరంలో ముంచేసింది. వివరాలు.. శ్రీకాళహస్తి మండలం, రామాపురం గ్రామానికి చెందిన చిర్రి మస్తాన్ది ఉమ్మడి కుటుంబం. వారు వ్యవసాయంతోపాటు.. వివిధ వ్యాపారాలతో మంచి గుర్తింపు పొందారు. పిల్లల చదువుల కోసం శ్రీకాళహస్తికి వచ్చి స్థిరపడ్డారు. ఆ కుటుంబానికి చెందిన చిర్రి లిఖిత్సాయి (19) చిన్నప్పటి నుంచి చదువులో దిట్ట. గత ఏడాది లిఖిత్సాయి విజయవాడలోని ఓ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేరాడు. గురు వారం విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత్ సాయి తీవ్రంగా గాయపడి మృతి చెందా డు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం మృతదేహం శ్రీకాళహస్తిలోని వారి నివాసానికి చేరింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. నియోజకవర్గ వ్యాప్తంగా కుటుంబానికి ఉన్న పరిచయాల కారణంగా బంధువులు, స్నేహితులు, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని కన్నీటి నివాళి అర్పించారు. పిల్లలందరూ డాక్టర్లే మస్తాన్కు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ముగ్గురికీ ఆరుగురు పిల్లలు ఉండగా.. అందులో ఐదుగురు పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మస్తాన్ అక్క కొడుకు, కూతురు సైతం ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ ఘటనతో వారి కుటుంబానికి దిష్టి తగిలిందేమో అని స్థానికులు కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. -
పది పబ్లిక్ పరీక్షల విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షల సమయంలో విద్యార్థులు తమ నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి కల్పించారు. పరీక్షల తేదీల్లో సెలవు దినాలు ఉన్నప్పటికీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. విద్యార్థులు బస్సులో ప్రయాణించే సమయంలో హాల్ టికెట్ చూపించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అలాగే పరీక్షల రోజుల్లో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా తగినన్ని ట్రిప్పులు తిప్పాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. జగదీష్ అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. కోడింగ్ సిస్టమ్ కీలకం తిరుపతి అర్బన్: పది పరీక్షల మూల్యాంకనం పారదర్శకంగా చేపట్టడానికి కోటింగ్ సిస్టమ్ కీలకమని కడప రీజినల్(జోన్–4) జాయింట్ డైరెక్టర్ శ్యామూల్ పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా డీఈఓ కేవీఎన్ కుమార్ నేతృత్వంలో ఎనిమిది జిల్లాలకు చెందిన సీసీఓలు, ఏసీజీఈకి ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టారు. సత్యసాయి జిల్లా డీఈఓ కృష్ణప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కోడింగ్ సిస్టమ్పై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏ మాత్రం చిన్నపాటి పొరబాట్లు చోటుచేసుకున్న పెద్ద తప్పిదంగా మారుతుందని హెచ్చరించారు డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ కోడింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి, నిర్దేశిత విధానాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. తిరుపతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (పబ్లిక్ ఎగ్జామ్స్) సుధ, డీవైఈఓలు, సమగ్ర శిక్ష సీఎంఓ సురేష్, వేణుగోపాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి పలు అంశాలను సూచించారు. ముగిసిన శిక్షణ తిరుపతి రూరల్: శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్, జర్నలిజం విభాగం విద్యార్థినుల కోసం ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు డిజిటల్ మార్కెటింగ్పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి చైన్నెకి చెందిన ఈజ్ నార్ స్టూడియోస్ నిపుణులు రంజిత్ భువనేశ్వరన్, మాధ్యురాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్యం, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆన్లైన్ బ్రాండింగ్, డిజిటల్ కాంపెయిన్ల రూపకల్పన వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆధునిక డిజిటల్ మీడియా రంగంలో ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని కల్పించేందుకు ఐదు రోజుల శిక్షణ ఉపయోగపడిందని సోషల్సైన్సెస్ డీన్ ఆచార్య సి.వాణి తెలిపారు. అనంతరం విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు. సోషల్సైన్సెస్ విభాగపు అధిపతి టి. త్రిపుర సుందరి పాల్గొన్నారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల: వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శుక్రవారం హైదరాబాద్కు చెందిన రాధిక రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు. క్యూలో నినాదాలు చేయడం తప్పే తిరుమల: శ్రీవారి దర్శన క్యూలైన్లో నినాదాలు చేయడం తప్పేనని ఓ భక్తుడు ఒప్పుకున్నట్టు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు టీటీడీ పీఆర్ఓ విభాగం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్లో గురువారం రాత్రి రాజమహేంద్రవరానికి చెందిన అనుపోజు వీరనవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో నినాదాలు చేశాడు. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడింది. దర్శన క్యూలైన్లో నినాదాలు చేయడం తప్పేనని ఒప్పుకున్నట్టు టీటీడీ పేర్కొంది. -
పాపం.. ఉచ్చూరు
ఉచ్చూరు..దొరవారిసత్రం మండలం మూరుమూల గ్రామం.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ గ్రామానికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఏటా సీజనల్ వ్యాధులతో సతమతమయ్యే గ్రామస్తులకు ఇప్పుడు మూత్ర పిండాల వ్యాధి మహమ్మారిలా పడగ విప్పి గ్రామస్తులను మృత్యు అంచునకు తీసుకెళుతోంది. ఊహించని ఉప్పెనలా ఉచ్చూరు వాసులను కబళిస్తున్న ఈ వ్యాధి నుంచి ఎలా బయట పడాలో తెలియక వ్యాధిగ్రస్తులు కుంగిపోతున్నారు. దొరవారిసత్రం : పంచాయతీ కేంద్రమైన ఉచ్చూరులో 540 కుటుంబాలకుగాను 1,450 మంది జనాభా నివాసం ఉంటున్నారు. రెండేళ్ల నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 30కి చేరింది. వీరిలో ఆరుగురు డయాలసిస్ చేసుకుంటూ అగచాట్లు పడుతున్న విషయం ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఏమి జరుగుతుందనే విషయం తెలియకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురై, పది రోజుల కిందట గ్రామానికి చెందిన కొందరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన డీఎంహెచ్ఓకు సమాచారం ఇచ్చారు. దొరవారిసత్రం పీహెచ్సీ వైద్యాధికారి చైతన్య, వైద్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి 410 మంది రక్త నమూనాలు సేకరించడమే కాకుండా కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలపై ఆరా తీశారు. వారం రోజులుగా గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సైతం గ్రామంలోని మంచి నీటి పథకాలు, చేతి బోర్లులోని నీళ్లను పరీక్షలు నిమిత్తం ల్యాబ్కు పంపారు. రెండు రోజుల కిందట డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాసులరెడ్డి, పలువురు వైద్యులు గ్రామంలో పర్యటించి ప్రజలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు పూర్తిస్థాయి అధికారులు నేటి వరకు తెలుసుకోలేకపోవడం గమనార్హం. ప్రాథమిక విచారణలో.. ఉచ్చూరులో వైద్యుల ప్రాథమిక విచారణలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల రిపోర్ట్ల ఆధారంగా వైద్యులు సలహాలు లేకుండా ఇష్టానుసారంగా పెయిన్ కిల్లర్స్ వాడడంతోపాటు మద్యం సేవించడంతో కిడ్నీలు ఫెయిల్ అయి కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటివరకు కిడ్నీ వ్యాధి వచ్చిన వారందరూ 50 ఏళ్లు పైబడిన వారే. మరో వైపు తాగునీటిలో ఖనిజాలు అధికంగా ఉన్నా కిడ్నీలు ఫెయిల్ అవుతాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉచ్చూరులోని అన్ని నీటి పథకాలు, చేతి బోర్లతోపాటు ప్రైవేటు ఆర్వో ప్లాంట్లోని నీటి సైతం పరీక్షలు చేసి, ఖనిజాలను గుర్తించేందుకు తిరుపతిలోని ఐఐటీ ల్యాబ్కు శ్యాంపిళ్లను పంపారు.పెయిన్ కిల్లర్స్, మద్యం కారణం కావచ్చు ఉచ్చూరులో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారంటే అధికంగా పెయిన్ కిల్లర్స్ వాడడంతోపాటు మద్యం సేవిచండం కారణం కావచ్చు. అంతేకాకుండా తాగునీటిలో ఖనిజాలు అధిక మొతాదులో ఉన్నా.. కిడ్నీ ఫెయిలై డయాలసిస్ బారిన పడవచ్చు. తాగునీటిలో ఖనిజాల శాతం తెలుసుకునేందుకే తాగునీటి శ్యాంపిళ్లను తిరుపతి ల్యాబ్కు పంపాం. ఎప్పటికప్పుడు గ్రామంలో తమ వైద్య సిబ్బంది పర్యటిస్తూ వైద్య సేవలందిస్తున్నారు. – చైతన్య, వైద్యాధికారి, డీవీ సత్రం పీహెచ్సీ -
తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమల: దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్నా.. ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించలేదంటూ తిరుమలలో భక్తులు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి నారాయణగిరి షెడ్లలో గంటల తరబడి వేచి ఉన్న తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదంటూ నిరసన తెలిపారు. కొందరు భక్తులు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెడ్లలో రద్దీ పెరిగిపోయినా తాగునీరు, విశ్రాంతి, పరిశుభ్రత, గాలి ప్రసరణ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా తగినంతగా కల్పించలేదని చెప్పారు.వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో పలువురు భక్తులు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. దర్శన నిర్వహణలో లోపాలు, షెడ్లలో అవ్యవస్థ పరిస్థితులపై నినదించారు. భక్తుల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్: భక్తులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై భక్తులు, నెటిజన్లు స్పందిస్తూ.. తిరుమలలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఏదైనా ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాలని సూచించింది. -
పన్ను సకాలంలో చెల్లించకపోతే 200 శాతం జరిమానా
బుచ్చినాయుడుకండ్రిగ: వాహనాలకు సకాలంలో పన్ను చెల్లించకుండా పట్టుబడితే 200 శాతం జరిమానా విధిస్తున్నట్టు శ్రీకాళహస్తి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్నాయుడు తెలిపారు. ఆయన గురువారం బుచ్చినాయుడుకండ్రిగలోని స్థానిక పోలీసుస్టేషన్ వద్ద వాహనాల రికార్డులను పరిశీలించి, డ్రైవర్ల లైసెన్సులను తనిఖీ చేశారు. తనిఖీ చేస్తుండగా ట్యాక్స్ చెల్లించని మినీబస్సుకు 200 శాతం జరిమానాతో రూ.3,27,900, రెండు లారీలకు రూ. 82,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెల కావడంతో విసృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. వాహనాలకు సకాలంలో పన్ను చెల్లించాలని, తనిఖీలు చేసేటప్పుడు దొరికితే 200 శాతం జరిమానా వేస్తున్నామన్నారు. వాహనాలను నడిపే వారికి తప్పనిసరిగా లైసెన్సు ఉండాలని, రికార్డులు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి సీజ్ చేస్తామని తెలిపారు. -
బర్డ్ ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి తుడా: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రిలో రెండేళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన పలు డాక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఆర్థో ప్రొఫెనర్ పోస్టు ఒకటి, అనస్తీషియా ప్రొఫెసర్ 2, ఆర్థో అసోసియేట్ ప్రొఫెసర్ 3, అనస్తీషియా అసోసియేట్ ప్రొఫెసర్ 1, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్తీషియా 7, ఒక మెడికల్ ఆఫీసర్, ఆర్థో, అనస్తీషియా జూనియర్ రెసిడెంట్ 4, సీనియర్ రెసిడెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తులు బర్డ్ డైరెక్టర్ కార్యాలయంలో అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులకు, మరిన్ని వివరాలకు టీటీడీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. మూడు ధాన్యం లారీల సీజ్ దొరవారిసత్రం: విజిలెన్స్ అధికారుల తనిఖీలో నెల్లూరు నుంచి చైన్నెకు ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా వెళుతున్న మూడు ధాన్యం లారీలను దొరవారిసత్రం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి పట్టుకుని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ మూడు ధాన్యం లారీల యజమానులకు విజలెన్స్ అధికారులు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతదేహం అప్పగింత నాయుడుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థి మృతదేహాన్ని గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని జాతీయ రహదారి కూడలి వద్ద కంటైనర్, టీవీఎస్ స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి షేక్ షమీవుల్లా (16) మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాల్సిన షమీవుల్లా రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లడంతో విద్యార్థి తల్లిదండ్రులు షేక్ షామీర్, పర్వీన్ రోదనలకు అంతులేకుండా పోయింది. స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద షమీవుల్లా మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి గురువారం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంజాయి కేసులో ముగ్గురి అరెస్టు – రెండు కిలోలు స్వాధీనం శ్రీకాళహస్తి: గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. గురువారం రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐకి గురువారం ఉద యం గంజాయి విక్రయిస్తున్నట్లు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన సీఐ తన సిబ్బందితో కలిసి శ్రీకాళహస్తి–బుచ్చినాయుడుకండ్రిగ మార్గంలోని ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో దాడులు చేసి ముగ్గురి అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొటంబేడు రాజా అరకు నుంచి తెచ్చిన గంజాయిని దుర్గాప్రసాద్, వర్షిత్కు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తిరుమలలో ఆకస్మిక తనిఖీలు తిరుమల : భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని హోటళ్లలో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. ఐస్క్రీమ్లు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలోని అన్ని హోటళ్లలోనూ నమూనాలను సేకరించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. -
మట్టినీ బొక్కెస్తున్నారు!
● రోజుకు 2వేల టిప్పర్లకు పైగా తమిళనాడుకు తరలింపు ● కొన్నాళ్లకు సత్యవేడులో సహజ సంపద మటుమాయం బయోమెట్రిక్ నవీకరణపై ప్రత్యేకశ్రద్ధ తిరుపతి అర్బన్: నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ కేంద్రాల్లో విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరణ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్వర్ణ గ్రామ, వార్డు జిల్లా అధికారి జీవీ నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన తిరుపతి నగరంలోని ఎల్బీనగర్లోని స్వర్ణ వార్డులో ఆధార్ శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 71,238 మంది విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్తోపాటు నవీకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో జేఈఈ, నీట్ పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సైతం ఆధార్ నవీకరణ ప్రాధాన్యత ఉందన్నారు. వందశాతం విద్యార్థులకు నవీకరణ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు, అలాగే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, వార్డుల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. వీఆర్వో చెంగల్రాయలు ఉన్నారు. రోజువారీ రూ.20 లక్షలకు పైగా మామూళ్లునియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీ అధికార పార్టీ కీలక నేతల కనుసన్నల్లో కొనసాగుతోంది. రోజువారీ ఎంత ఎక్కువ సంఖ్యలో టిప్పర్లు సరిహద్దులు దాటితే అంత ఎక్కువగా అధికార పార్టీ నేతలకు కమీషన్లు అందుతాయి. ఆ దిశగా ప్రస్తుతం 2వేల టిప్పర్లకు సంబంధించి రూ.20 లక్షల మేరకు రోజువారీ కమీషన్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఆ మొత్తాన్ని అధికార పార్టీ నేతలు తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా వాటాలు పంచుకు తింటున్నారు.అక్రమం ఇష్టారాజ్యంగా మారింది..సత్యవేడు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమార్కులకు గ్రావెల్ తరలింపు సులువుగా మారింది. నేడు ఎర్రచందనం అక్రమ రవాణా కంటే గ్రావెల్ రవాణానే వరమైంది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పచ్చనేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వరదయ్యపాళెం:ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని సత్యవేడు నియోజకవర్గం లోని పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో గ్రావెల్ దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. రోజుకు 2వేల టిప్పర్లకు పైగా సరిహద్దులోని తమిళనాడుకు దర్జాగా తరలిస్తున్నప్పటికీ నియంత్రించాల్సిన అధికారులు తమకేమీపట్టనట్లు వ్యవహరించ డం విమర్శలకు దారి తీస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో 20కి పైగా గ్రావెల్ క్వారీల్లో దోపిడీ జరుగుతోంది. పిచ్చాటూరు మండలంలోని పలు గ్రామాల నుంచి గ్రావెల్ క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్వారీల నుంచి రోజువారీ 2వేల టిప్పర్లకు పైగా గ్రావెల్ తమిళనాడుకు తరలిపోతోంది. వెయ్యి టిప్పర్లకు పైగా తమిళనాడుకు తరలింపు పిచ్చాటూరు మండలంలో ఐదు గ్రావెల్ క్వారీలు ఉండగా ఆ క్వారీల నుంచి వెయ్యికి పైగా టిప్పర్లు రోజూ తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ క్వారీలకు ఆనుకుని ఇటీవల ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు నుంచి కచ్చూరు కూట్రోడ్ వరకు విశాలమైన రోడ్డు మార్గం ఏర్పడడంతో గ్రావెల్ దోపిడీకి మార్గం సులువైంది. తమిళనాడులో ఆంధ్ర మట్టికి భలే గిరాకీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఆంధ్ర నుంచి తరలిస్తు న్న గ్రావెల్ మట్టికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ఒక్కొక్క టిప్పర్ రూ.30 వేల నుంచి రూ. 50వేల వరకు రేటు పలకడంతో మాఫియా చేస్తున్న అధికార పార్టీకి చెందిన బడా నేతలు రూ.కోట్లు దండుకుంటున్నారు. రోజువారీ తమిళనాడుకు వెళుతున్న 2వేల టిప్పర్ల గ్రావెల్ ఖరీదు రూ.6 కోట్లకు పైమాటే. ఇలా రూ.వందల కోట్లు వెనకేసుకునే పనిలో అధికార పార్టీ బడా నేతలు ఉన్నారు. అధికారపార్టీకి తలొగ్గిన అధికారులు సత్యవేడు నియోజకవర్గంలో ఇంత దోపిడీ జరుగుతున్నప్పటికీ మైనింగ్ శాఖ అధికారులు మొదలు పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పదుల సంఖ్యలో స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెళుతున్నప్పటికీ వారికి అనుమతులు ఉన్నట్లు స్వయాన అధికారులే ప్రకటిస్తుండడంతో గ్రావెల్ మాఫియాకు అడ్డూఅదుపు లేని పరిస్థితి. ఈ విషయమై ఇటీవల నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు సైతం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. సత్యవేడు మండలంలో తెలుగుగంగ కాలువ గట్లను తవ్వేస్తున్న గ్రావెల్ మాఫియానాగలాపురం మండలంలో గ్రావెల్ను టిప్పర్కు లోడ్ చేస్తున్న జేసీబీ అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత తమిళనాడులో జరుగుతున్న జాతీయ రహదారి పనుల పేరి ట ఆంధ్రప్రదేశ్లో అనుమతులు తీసుకోవడం, అది కూడా సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం స్థానికంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రభుత్వ భూములను ఎంపిక చేసుకుని దోపిడీని కొనసాగిస్తున్నారు. దీనిపై స్థానికులు పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమకు అనుమతులు ఉన్నాయంటూ బుక్కా యిస్తూ గ్రామస్తులపైనే తిరగబడుతున్నారు. అడ్డొస్తే ఏకంగా తొక్కించుకు పోతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. -
ఎస్వీ వెటర్నరీలో ప్రాంతీయ సదస్సు
చంద్రగిరి: ఎస్వీ వెటర్నరీలో గురువారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో మొదటి రోజు శాస్త్రవేత్తలు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 60 మందికి పైగా శాస్త్రవేత్తలు, పశువైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీ వెటర్నరీ వీసీ డాక్టర్ జేవీ రమణ హాజరై, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పరిశోధన ఫలితాలను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పంజాబ్కు చెందిన డాక్టర్ ఉదయబీర్ సింగ్ చహాల్, హిమాచల్ ప్రదేశ నుంచి డాక్టర్ శివాని కటోచ్లు భారతీయ పశుపోషణ సంఘం ప్రతినిధిలుగా పాల్గొని ప్రసంగించారు. సదస్సుకు సంబంధించిన పలు పుస్తకాలను వారు ఆవిష్కరించారు. డాక్టర్ వెంకటేశ్వర్లు, రాజమ్మ, రాణి, త్రివేణి పాల్గొన్నారు. ఆందోళన వద్దు.. గ్యాస్ నిల్వలున్నాయ్ తిరుపతి అర్బన్: లబ్ధిదారులకు ఆందోళన అవసరం లేదని, గ్యాస్ నిల్వలు అవసరం మేరకు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుకింగ్ చేసిన వెంటనే వంట గ్యాస్ సిలిండర్లు అందించేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంతో జిల్లాలో గ్యాస్ నిల్వలకు ఢోకా లేదని వెల్లడించారు. గ్యాస్ కొరత ఉందని పెద్ద ఎత్తున వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. అలాగే వంట గ్యాస్తోపాటు వసతి గృహాల్లోని పిల్లలకు అవసరం అయిన మేరకు గ్యాస్ సిలిండర్లు అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. జిల్లాలో గ్యాస్ డీలర్లను పర్యవేక్షించాలని పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజును ఆదేశించారు. 28 నుంచి డీడీఈ డిప్లొమా పరీక్షలు తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ ఆధ్వర్యంలో డిప్లొమో ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ కోర్సుకు సంబంధించి థియరీ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును ఈనెల 15వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
బొక్కిసంపాళెంలో కేంద్ర ప్రత్యేక బృందం
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని బొక్కిసంపాళెం కేంద్ర మహిళ స్నేహపూర్వక పంచాయతీగా ఎంపిక అయ్యింది. అందులో భాగంగా గురువారం కేంద్రం నుంచి ప్రత్యేక బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీని సందర్శించి మహిళలు చేస్తున్న అభివృద్ధిని పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ స్టాళ్లు, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయల స్టాళ్ల ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు సర్పంచ్ రేఖ శాలువ కప్పి, సన్మానించారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ పంచాయతీని మహిళలు చాలా అభివృద్ధి చేస్తున్నారని, త్వరలోనే పంచాయతీ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె. సుబ్రహ్మణ్యం, మునిరెడ్డి, మహిళా సంఘాలు, పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తలమంచి ధనుంజయ రెడ్డి
పెనగలూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం ఉపాధ్యక్షుడిగా పెనగలూరు పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన తలమంచి ధనుంజయరెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ధనుంజయరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి పదవి వచ్చేందుకు సహకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినందుకు పార్టీ కోసం అహర్నిశలు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
● మందుల దుకాణాలపై మామూళ్ల ముఠా! ● లైసెన్సులు.. రెన్యువల్ పేరుతో ఔషధ శాఖలో దందా ● ఇన్స్పెక్టర్ నుంచి ఏడీ వరకు కమీషన్ల కక్కుర్తి ● మధ్యవర్తులుగా అసోసియేషన్ నేతలు
తిరుపతి తుడా: పట్టణంలోని ఔషధ నియంత్రణ శాఖలో అవినీతి బహిరంగ రహస్యంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడికల్ షాపుల లైసెన్సుల మంజూరు, రెన్యువల్ పేరుతో అధికారుల మామూళ్ల దందా నడుస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. కొత్తగా మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలన్నా, ఇప్పటికే ఉన్న దుకాణానికి లైసెన్సు రెన్యువల్ చేయించుకోవాలన్నా అధికారుల చుట్టూ తిరగాల్సిందేనని చెబుతున్నారు. నిబంధనల పేరుతో అడుగడుగునా అభ్యంతరాలు చెప్పడం, ఫైళ్లను పెండింగ్లో పెట్టడం, చివరికి లావాదేవీలు జరిగితేనే అనుమతులు ఇవ్వడం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెన్యువల్కు మామూలే మార్గం? మెడికల్ షాప్ నిర్వహించాలంటే ఔషధ నియంత్రణ శాఖ నుంచి లైసెన్సు తప్పనిసరి. లైసెన్సుకు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. అయితే రెన్యువల్ ప్రక్రియ వ్యాపారులకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. దరఖాస్తు చేసిన తర్వాత ఫైళ్లు నెలల తరబడి కదలవని చెబుతున్నారు. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా వెళ్లి లావాదేవీలు జరిపితే మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బ్రోకర్లుగా అసోసియేషన్ నేతలు ప్రైవేట్ మెడికల్ షాపుల అసోసియేషనన్కు చెందిన కొందరు నేతలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులతో లావాదేవీలు జరిపించి కొత్త లైసెన్సులు, రెన్యువల్ ఫైళ్లను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. మెడికల్ షాప్ల నుంచి నెలవారీగా మామూళ్లు వసూలు చేసి, వాటిని అధికారులకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడీ చాంబర్ చేరడం అంత ఈజీ కాదు ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ను కలవడం కూడా సులభం కాదని వ్యాపారులు చెబుతున్నారు. కార్యాలయ ప్రధాన గేటు ఎక్కువసేపు మూసే ఉంటుందని, లోపలికి వెళ్లిన తర్వాత అటెండర్ అనేక ప్రశ్నలు అడిగి వేధిస్తారని అంటున్నారు. చెప్పులు బయట వదిలేయాలని, మొబైల్ ఫోన్లు కూడా బయట పెట్టి వెళ్లాలని చెప్పి, తర్వాతే అధికారిని కలవనిస్తారని సమాచారం. కార్యాలయం మొత్తం గోప్యతతో, కట్టుదిట్టమైన భద్రతతో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అధికారుల షి‘కారు’ అధికారులు పర్యటనలు, పరిశీలనకు కూడా తామే కారు ఏర్పాటు చేయాల్సి వస్తోందని మదనపడుతున్నారు. కారుతో పాటు డీజిల్ పట్టి పంపించాల్సిన దు స్థితి ఏర్పడిందని ఆగ్రహానికి గురవుతున్నారు. లేకుంటే చిన్న చిన్న తప్పిదాలను చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, ఇందుకు కొందరు అసోసియేషన్ సభ్యు లు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ఇస్తేనే అనుమతి నిబంధనల ప్రకారం మెడికల్ షాప్ ఏర్పాటుకు కనీసం 120 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. అయితే కొద్దిగా విస్తీర్ణం తక్కువగా ఉన్నా అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో అడిగినంత మామూలు ఇస్తే ఆ లోటును ఎలా సరిచేయాలో అధికారులే మార్గం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనలు కేవలం వ్యాపారులను భయపెట్టేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకుంటారా? ఔషధ నియంత్రణ శాఖలో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరపాలని వ్యాపారులు కోరుతున్నారు. లైసెన్సులు, రెన్యువల్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని, మధ్యవర్తుల దందాను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఆవిర్భావం..
ఊరూరా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇంత దరిద్రపు ప్రభుత్వం లేదు, రాదు.. తిరుపతి మంగళం : ప్రపంచ రాజకీయ చరిత్రలోనే కూటమి ప్రభుత్వం లాంటి దరిద్రపు ప్రభుత్వం ఇంతవరకు లేదు, ఇకపై రాదు. అధికార దాహంతో నోటికి వచ్చిన అబద్దపు హామీల తో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూటమి సర్కారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ని పక్కన పెట్టి, ప్రజలకిచ్చిన హామీలను తుంగ లో తొక్కాడు చంద్రబాబు. ఎంతసేపు అమరావ తి అభివృద్ధి అంటున్నాడే తప్ప పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీని స్థాపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్న ఏకై క నాయకుడు వైఎస్. జగన్. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే 2029లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయం చంద్రబాబు చెప్పిన అబద్దాలు, చేసిన మోసాలతో ప్రజలంతా విసిగిపోయి, 2029లోవె వైఎస్సార్సీపీకి తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయం. చంద్రబాబు మోసాలను ఇప్పటికే ప్రజలంతా గ్రహించారని, రాబోయే రోజుల్లో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పాలన సాగించిన మగాడు వైఎస్.జగన్మోహన్రెడ్డి. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగించిన గొప్ప నాయకుడు జగనన్న. తండ్రి ఆశయసాధన కోసం, ప్రజాసంక్షేమం కోసం 2011లో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీని స్థాపించారు. అప్పటి నుంచి ఆయన అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు తిరుపతి అర్బన్:వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలను ఊరూరా ఘనంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతా ల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తరువాత కేక్లు కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. పేదోడి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటూ నినాదాలు చేశారు. పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గత జగనన్న పాలనను గుర్తు చేసుకున్నారు. జై జగన్..జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ జెండా జెండాలు ఎగురవేశారు. మహానేత ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ నగరి: వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఇచ్చిన వాగ్దానాలను 99 శాతం నెరవేర్చిన పార్టీ. మాటిస్తే దానిపై నిలబడి పనిచేసిన మహామనిషి జగన్మోహన్రెడ్డి మాత్రమే. పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఆ ఘనత దమ్మున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి, ఆయనకు అండగా ఉన్న వైఎస్సార్ కుటుంబ సభ్యులకే చెందుతుంది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెట్టి అధికారంలోకి వచ్చాక రెండళ్లవుతున్నా ఏదీ నెరవేర్చలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతితప్పింది. నగరిలో ప్రకృతి వనరులన్నీ దోచేస్తున్నారన్నారు. దోచుకో ... దాచుకో అన్నదే నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తీరుగా మారింది. – మాజీ మంత్రి ఆర్కేరోజా -
పరకామణి చోరీపై భాను పొంతన లేని మాటలు
తిరుపతి కల్చరల్: తిరుమల పరకామణిలో పెంచలయ్య రూ.కోటి ఆభరణాల చోరీ విషయంపై తాము ప్రశ్నిస్తే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి పొంతన లేని డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడమేకాక అనవసర ఆరోపణలు చేయడం విడ్డూరమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్, నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్ తెలిపారు. గురువారం ప్రెస్క్లబ్లో వారు మాట్లాడారు. పరకామణి చోరీ విషయంలో తాము ఆయన్ని ప్రశ్నిస్తే సమాధానాలు విస్మరించి, ఏదో అభాండాలు భూమన కరుణాకరరెడ్డిపై మోపడం ఈ కూటమి నేతలకు పరిపాటిగా మారిపోయిందన్నారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసులు వేసిన భానుప్రకాష్రెడ్డి తర్వాత ఆ కేసు ఎందుకు వాపసు తీసుకున్నారో? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు అరుణ్ యాదవ్, తాళ్లపాక మహేష్ యాదవ్ పాల్గొన్నారు. జీతమో రామ ‘చంద్రా’...! తిరుపతి సిటీ: ఎస్వీయూలో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు. 13వ తేదీ వస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత బోధన, బోధనేతర సిబ్బంది వర్సిటీ అధికారులను వేతనాలపై ఆరా తీయగా అడిషనల్ గ్రాంట్ కోసం ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, వచ్చిన వెంటనే జీతాలు చెల్లిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. పెన్షనర్ల అవస్థలు వర్ణనాతీతం. పెన్షన్ సక్రమంగా అందక, రిటైర్డ్ బెనిఫిట్స్ సైతం ఒక రూపాయి వర్సిటీ చెల్లించకపోవడంతో మందులు, మాత్రలు, కుటుంబం పోషణకు అప్పులు చేస్తున్నామని వాపోతున్నారు. ఈనెల వేతనాలు చెల్లిస్తారా? లేదా అనే అనుమానంతో వర్సిటీలో ఉద్యోగులు ఆవేదన వక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఎన్నికల సమయంలో ప్రభుత్వాల ఉద్యోగులకు నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని మభ్యపెట్టి అధికారం చేపట్టిన తర్వాత ఒక నెల కూడా ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్ బౌన్స్ కేసులో మహిళకు జైలు తిరుపతి లీగల్: చెక్ బౌన్స్ కేసులో తిరుపతి, శివజ్యోతినగర్కు చెందిన ఎం.పద్మావతికి ఆరు నెలలు జైలు శిక్ష , రూ.10 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ గురువారం తీర్పు చెప్పారు. తిరుపతి, జీవకోన, రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన పి.ముని రాజా వద్ద పద్మావతి 2021 ఫిబ్రవరి 26వ తేదీ రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో ఆమె 2022 మార్చి మూడో తేదీ రూ.9 లక్షల విలువ చేసే చెక్కును ముని రాజాకు ఇచ్చారు. అతను ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో అతను పద్మావతిపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఆమెకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
పంచగవ్య ఉత్పత్తుల సామర్థ్యం పెంచుతాం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: పంచగవ్య ఉత్పత్తుల సామర్థ్యం మరింతగా పెంచి, భక్తులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈఓ (వైద్యం, విద్య) డాక్టర్ ఎ. శరత్ స్పష్టం చేశారు. అలిపిరి సమీపంలోని నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో సుమారు 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నామని చెప్పారు. సహజమైన విధానంలో, భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా మరింత నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీతో పాటు, ఇండెంట్ ప్రకారం సరఫరా చేయడం, ఉత్పత్తి విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. టీటీడీ సమాచార కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పద్ధతిగా నిర్వహించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, పాల్గొన్నారు. -
టీటీడీ చైర్మన్ కనిపించడం లేదు!
సాక్షి టాస్క్ఫోర్స్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం (ఏడీ బిల్డింగ్) వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో భక్తులు నిలదీస్తారనే భయంతో బయటకు కనిపించకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ నాయుడు బయటకు వచ్చి హిందువులకు క్షమాపన చెప్పడంతో పాటు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ నల్లాని బాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ పసుపులేటి సురేష్, పార్టీ బీసీ విభాగం జోనల్ అధ్యక్షుడు వాసుయాదవ్, నాయకులు అరుణ్యాదవ్, అనిల్రెడ్డి, మోహనరాజ్, రమణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
వేసవిలోనూ నిరంతరాయ విద్యుత్
తిరుపతి రూరల్: వేసవిలోనూ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్లోతేటి సూచించారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సంస్థ పరిధిలో చీఫ్ ఇంజినీర్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ స్థాయి వరకు హాజరైన అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు మెరుగైన, సత్వర సేవలను అందించేందుకు సంసిద్ధులు కావాలన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరుపై ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయని, సిబ్బంది పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం–సూర్యఘర్ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. స్కాలర్ షిప్లు విడుదల చేయాలి తిరుపతి కల్చరల్: నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్ర భుత్వం స్కాలర్షిప్ను మంజూరుతోపాటు క్లినికల్ ఆఫిలియేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఇనిస్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు పాల్గొని, నర్సింగ్ కళాశాలలు, పాఠశాలలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్రావు, జిల్లా అధ్యక్షుడు వై.ప్రవీణ్, కార్యదర్శి రాకేష్ కిరణ్, కోశాధికారి విజయభాస్కర్, చీఫ్ పాట్రన్ శివరామరాజు, రమణారెడ్డి ,ఎంసెట్ మల్లిఖార్జున పాల్గొన్నారు. -
ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి..
పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం ఇప్పటికీ అట్టడుగు వర్గాల్లోనూ చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. రైతుల ఆక్రందనలపై గళమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం చేసిన కుట్రలను దీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలను విని, విజయానికి చేరువయ్యారు. -
తప్పెవరిది?
పౌష్టికాహారం.. అంతంతమాత్రం మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? నాయుడుపేట టౌన్: మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే వండి పెడతారా? అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి వంట నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. నాయుడుపేటలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలో పప్పు నీళ్లు నీళ్లుగా ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాయుడుపేట ఐసీడీఎస్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సూపర్వైజర్, సీడీపీఓకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీడీ వసంతభాయిని ఆదేశించారు. తిరుపతి అర్బన్:కూటమి ప్రభుత్వం వచ్చాక పౌష్టికాహారానికి గండిపడుతోంది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తోంది. పాలకులు, సంబంధిత ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి క్రింది స్థాయి సిబ్బంది బలిపశువులు కావాల్సి వస్తోంది. ఇలాంటిదే ఏపీ ఫుడ్ కమిటీ సభ్యుల తనిఖీలో వెలుగుజూసింది. కానీ తప్పుచేసిన వారిని వదిలేసి.. క్రింది స్థాయి సిబ్బంది, అధికారులను శిక్షించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే? ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. మంగళవారం వడమాలపేట యానాది సెంటర్–2, బట్టికండ్రిగ అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో పది రోజులుగా చిన్న పిల్ల లు, బాలింతలు, గర్భిణులకు పాల సరఫరా కాలేదని గుర్తించారు. అంగన్వాడీ వర్కర్, సూపర్వైజర్కు, సీడీపీఓకు షోకా జ్ నోటీసులు జారీచేయాలని ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)ని ఆదేశించారు. వడమాలపేట జెడ్పీ బాలుర హైస్కూల్లో ఫేజ్–1కి సంబంధించి 324 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడం, ఫేజ్–2 గుడ్లు ఒక్కసారిగా సరఫరా చేయడంపై మండిపడ్డారు. అలాగే పాఠశాల హెచ్ఎం, జూనియర్ అసిస్టెంట్, ఎగ్వెండర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. బుధవారం రేణిగుంట మండలంలోని ఆర్.మల్లవరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఫేజ్–1లో 145 బ్లూకలర్ గుడ్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అంగన్వాడీ వర్కర్కు, సూపర్వైజర్కు షోకాజ్ నోటీసులు జారీచేశారు. నాయుడుపేట మండలంలోని తాలయాపాళెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఫేజ్–1లో 42 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడంతోపాటు 1,500 గ్రాములు ఉండాల్సిన ఎగ్ట్రే బరువు 1,352 గ్రాములు ఉండడంతో మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్తోపాటు ఎగ్ వెండర్కు నోటీసులు జారీ చేయాలని ఆయన వెంట సివిల్ సప్లై జిల్లా అధికారి శేషాచలం రాజు, జిల్లా మేనేజర్ బాలకృష్ణ వారితోపాటు ఉన్నారు. వీళ్లకేంటి సంబంధం సాధారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల కాంట్రాక్ట్ జిల్లాస్థాయిలో జరుగుతుంది. అ క్కడ టెండర్లు దక్కించుకున్న వారి కాంట్రాక్ట్ను కలెక్టర్ ఓకే చేస్తారు. ఆ తర్వాత పీడీ సంతకం చేయడం పరిపాటి. ఆపై సీడీపీఓకు హైరింగ్ వెహికల్ ఇచ్చి, పర్యవేక్షణ కోసం నెలకు రూ.30 వేల అద్దె కూడా మంజూరు చేస్తుంటారు. స దరు అధికారి ఆ ప్రాజెక్టు మొత్తం పర్యటించి గుడ్లు సైజు, పాలు సరఫరా తదితర వాటిని ఎప్పకటిప్పుడు నివేదించాలి. సెక్టార్ స్థాయిలో సూపర్ వైజర్లు పర్యవేక్షించాలి. అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఎంఈఓ పర్యటించాలి. ఏదైనా లోపాలు జరిగితే ముందుగా వారికే నోటీసులు జారీ చేయాలి. కానీ ఫుడ్ కమిషన్ సభ్యుడు హెచ్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. -
జోరుగా ఏసీబీ తనిఖీలు
తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నిర్వహించాయి. రెండవ రోజు బుధవారం తిరుపతిలో ఏసీబీ అధికారులు ఐదు బృందాలుగా క్షేత్రస్థాయికి వెళ్లి టౌన్ ప్లానింగ్ రికార్డుల ఆధారంగా పలు భవనాలను తనిఖీ చేశారు. బైరాగి పట్టెడ, ఉపాధ్యాయ నగర్, రెడ్డి గుంట, రాక్ స్టాక్ హోటల్, లక్ష్మీపురం సర్కిల్లోని పలు భవనాలను తనిఖీ చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ, పలు భవనాలకు సెట్ బ్యాక్ వదల్లేదని, ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అదనపు అంతస్తులను గుర్తించామని చెప్పారు. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఇదలా ఉంచితే, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోమని ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసినప్పుడు తమ భవనాలపై ఏసీబీ అధికారులు దాడులు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని పలువురు నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది భవన నిర్మాణదారులను ఉసిగొల్పి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
శబ్ద కాలుష్యంపై ఉక్కుపాదం
తిరుపతి క్రైం: తిరుమల ఘాట్ రోడ్డుకు ప్రవేశ ద్వారం అయిన అలి పిరి టోల్ గేట్ వద్ద శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు రవాణాశాఖ అధికారులు, తిరుమల ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అధిక శబ్దం చేసేలా మార్పులు చేసిన సైలెన్సర్లు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాలు, జీపులు, ఇతర రవాణా వాహనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కొరప్రాటి మురళీమోహన్ మాట్లాడుతూ మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం వాహనాల్లో అనుమతించిన డెసిబెల్స్ పరిమితిని మించిపోయేలా శబ్దం చేసే సైలెన్సర్లు ఉపయోగించడం నేరమని తెలిపారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 190(2) ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘించిన వాహనచోదకులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. తిరుమల వంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో అధిక శబ్దం భక్తులు, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడంతోపాటు పర్యావరణానికి కూడా హానికరవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. తనిఖీల సమయంలో అనుమతించిన ప్రమాణాలకు విరుద్ధంగా మార్పులు చేసిన సైలెన్సర్లు ఉన్న వాహనాలను గుర్తించి వాహనచోదకులకు అవగాహన కల్పించారు. అవసరమైన చోట్ల జరిమానాలు విధించారు. వాహనచోదకులు తమ వాహనాలను మోటారు వాహన చట్టం ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సౌకర్యం దృష్ట్యా వాహనచోదకులు అనుమతించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని, అనధికార సైరన్లు వినియోగించకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలు స్వచ్ఛందంగా వాహన నియమాలను పాటించి సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో మొత్తం 25 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 1.50 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్, మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, రమణ నాయక్, అతికానాజ్, స్వర్ణలత, ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై పీడీ ఆగ్రహం
వెంకటగిరి రూరల్: మహాత్మగాంధీ ఉపాధిహామీ పథకం పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై పీడీ శ్రీనివాసపస్రాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని వల్లివేడు 9వ బెటాలియన్ వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను మంగళవారం తనిఖీ చేశారు. పని వద్ద కూలీల హాజరు, పనులు నాణ్యత గురించి ఆరా తీశారు. వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాల విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కృష్ణయ్య, ఈసీ మునిశేఖర్, పీడీ సీసీ చంద్రశేఖర్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ బుజ్జయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. నిమ్మ రైతుల్లో ఆనందం సైదాపురం: నిమ్మ ధరలు రోజురోజుకు ఊపందుకున్నాయి. ప్రస్తుతం గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ.110 నుంచి రూ.120 ధర పలుకుతున్నాయి. అయితే నాణ్యత కలిగిన కాయలు ధర రూ.120 వస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. సైదాపురం మండలంలో అధిక శాతం మంది రైతులు నిమ్మ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈక్రమంలో నిమ్మకాయల ధరలు క్రమీపీ పెరుగుతున్నాయి. దీంతో రెండు రోజులుగా గూడూరు నిమ్మమార్కెట్లో లూజు (50 కిలో బస్తా) రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తిరుపతి తుడా: స్విమ్స్ రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం గర్భిణులకు అల్ట్రాసౌండ్ (అబ్స్ట్రెటిక్) పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం 15వ తేదీన షెడ్యూల్ ప్రకారం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 22వ తేదీ ఆదివారం గర్భిణులకు ఉచిత స్కాన్ పరీక్షలను నిర్వహిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ స్కూటర్ దగ్ధం వెంకటగిరి రూరల్: పట్టణంలోని క్రాస్రోడ్డు సమీపంలోని ఓ హార్డ్వేర్ షాపులో పార్కింగ్ చేసిన విద్యుత్ స్కూటర్ నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు నీరు పోసి మంటలు అదుపు చేశారు. వేసవి తాపానికి విద్యుత్ స్కూటర్ నుంచి మంటలు వ్యాపించి, పొగలు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. -
● అధికారుల చొరవతోనే ఆక్రమణల పర్వం ● నాడు ప్రభుత్వ భూమి.. నేడు పట్టా భూమి
ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అది ఎలాంటిదైనా తమ ఖాతాలో వేసుకోవడానికి కొందరు బరితెగిస్తారు.. పొరంబోకు స్థలాలు.. కాలువలు.. వాగులు పోయే.. చివరకు చెరువు భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. పట్టణానికి సమీపంలోని చెరువు స్థల ఆక్రమణకు తెరలేపారు. తప్పుడు రికార్డులు సృష్టించి తమ ఖాతాలో కలుపుకున్నారు. ఇందుకు పలు శాఖల అధికారుల పాత్ర కూడా ఉందని స్థానికులు అంటున్నారు. బోర్డు తొలగించి అక్రమార్కులు నాటిన పసుపురాళ్లు సూళ్లూరుపేట: పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఎరబాళెం చెరువుకు సంబంఽధించిన సుమారు రూ.కోటి 58 అంకణాల భూమిని కొంతమంది అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి పరోక్షంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సహకారం కూడా ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సర్వే నంబర్ 21–1లో ఎరబాళెం చెరువుకి సంబంధించి సుమారు 58 అంకణాలు భూమి ఉంది. దీన్ని గతంలో కొంతమంది ఆక్రమించే ప్రయత్నాలు చేసినపుడు అప్పటి రెవెన్యూ అధికారులు స్పందించి, అడ్డుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఆ బోర్డు పీకిసి, సర్వే నంబర్లను 21–1ని 20–1గా మార్చేసి 58 అంకణాల్లో 32 అంకణాల భూమిని 2025 నవంబర్ 28న రిజిస్టర్ చేయించుకున్నారు. 2011లో అప్పటి తహసీల్దార్ జాలిరెడ్డి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. లింక్ డాక్యుమెంట్ లేకుండా నకిలీ డాక్యుమెంట్లతో 2025 నవంబర్ 14న మున్సిపల్ కార్యాలయంలో ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు ఖాళీ ఆస్తిపన్ను కూడా కట్టించుకుని, మున్సిపల్ అధికారులు అన్ని విధాలా సహకరించారు. వీటిని పొందుపరిచి ఈ స్థలాన్ని రిజిస్టర్ చేశారు. అయితే సబ్ రిజిస్ట్రార్ ఈ స్థలానికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా అక్రమార్కులు ఇచ్చిన నకిలీ రికార్డులతో రిజిస్టర్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో భారీ ఎత్తును ముడుపులు అధికారులకు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయమై తహసీల్దార్ గోపీనాథ్రెడ్డిని వివరణ కోరగా ఈ సమస్య తన దృష్టిలో ఉందని, సాయినగర్కు చెందని వారు దీనిపై తనకు ఫిర్యాదు చేశారన్నారు. ఇందులో తప్పులు దొర్లాయని, గతంలో పనిచేసిన తహసీల్దార్ చేసిన పొరపాటు కనిపిస్తోంది. పట్టా భూమికి పొజిషన్ ఎందుకు ఇచ్చారో! మా వీఆర్వో సర్టిఫికెట్ ఎలా ఇచ్చిందో తెలుసుకుని దీనిపై పూర్తిస్థాయిలో సర్వే చేయించి తొందరలోనే తేలుస్తామని అన్నారు. -
బంగారు డాలర్ ఎస్ఐకు అప్పగింత
నాయుడుపేట టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం సాయంత్రం దొరికిన బంగారు డాలర్ ఉన్న సరుడును ఆర్టీసీ కంట్రోలర్ ఎం సుబ్రమణ్యంతోపాటు సూపర్వైజర్ సురేష్ కలిసి ఎస్ఐ భానుప్రసన్నకు అప్పగించారు. బస్టాండ్లో కిందపడి ఉన్న సరుడును ఆర్టీసీ కంట్రోలర్ గుర్తించారు. అయితే ఈ సరుడులో డాలర్ బంగారుదై ఉండడంతో దానిని నేరుగా పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి ఎస్ఐకు అప్పగించినట్లు కంట్రోలర్ తెలిపారు. దీనికి సంబంధించిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లి వారి వివరాలను పోలీసులకు తెలిపి పోగొట్టుకున్న బంగారు డాలర్తోపాటు సరుడును తెచ్చుకోవచ్చన్నారు. డాలర్ను ఎస్కు అప్పగించిన ఆర్టీసీ కంట్రోలర్తో పాటు సూపర్వైజర్ను ఎస్ఐ అభినందించారు. వరికోత యంత్రం బోల్తా నాయుడుపేట టౌన్: మండలంలోని నరసారెడ్డికండ్రిగ జాతీయ రహదారి కూడలి వద్ద మంగళవారం సాయంత్రం ట్రాక్టర్పై తీసుకువెళుతున్న వరికోత మిషన్ అదుపుతప్పి బోల్తా పడింది. వరికోత మిషన్ను ట్రాక్టర్లో తరలిస్తుండగా జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు దాటుతూ అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కడంతో ట్రాక్టర్తో పాటు వరికోత యంత్రం రోడ్డుపై బోల్తా పడింది. దీంతో అటువైపు రాకపోకలు ఆగిపోయి, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని రోడ్డు మధ్యలో పడి ఉన్న వరికోత యంత్రాన్ని పక్కకు తొలిగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో విషాదం శ్రీకాళహస్తి: పట్టణంలోని ఎంజీ స్ట్రీట్లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఆకస్మికంగా స్పృహ తప్పి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంజీ స్ట్రీట్లో నివాసముంటున్న శ్రీనాథ్ పెయింటర్గా జీవనం గడుపుతున్నాడు. ఆయనకు సుజన, దీక్షిత అనే ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె సుజనకు అదే ప్రాంతానికి చెందిన శ్యామ్ప్రసాద్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే నాలుగేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతుండడంతో సుజన పుట్టింటికే చేరింది. ఈ సమస్యపై పెద్దల సమక్షంలో రెండు, మూడు సార్లు పంచాయితీ కూడా జరిగినట్లు తెలిసింది. తాజాగా శ్యామ్ ప్రసాద్ మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండగా, శ్రీనాథ్ అడ్డం వెళ్లి వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనాథ్ తన అల్లుడిపై ఫిర్యాదు చేయడానికి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే అక్కడ అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ఽధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులకు శ్రీనాథ్ మృతిపై ఎటువంటి పిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
శ్రీసిటీలో ‘సోలుం’ చైర్మన్
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో తుది దశ నిర్మాణంలో ఉన్న సోలుం ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పురోగతి సమీక్షలో భాగంగా సోలుం కంపెనీ లిమిటెట్ చైర్యన్, సీఈఓ సంఘోజున్ మంగళవారం తొలిసారిగా శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్ వద్ద శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సుంఘోజున్కు సాదర స్వాగతం పలికి శ్రీసిటీ ప్రగతి, ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా ఎలా అభివృద్ధి చెందిందన్న విషయం గురించి వివరించారు. శ్రీసిటీ, సోలుం సంస్థ భాగస్వామ్యం భారతదేశంలో ఎలక్ట్రానిక్ తయారీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి ఊతం ఇస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీసిటీ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, సమర్థ నిర్వహణను సుంఘోజున్ ప్రశంసించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం, శ్రీసిటీ అందిస్తున్న సౌకర్యాలను ఆయన అభినందించారు. శ్రీసిటీలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 268 కోట్లు పెట్టుబడితో సోలుం ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో తన రెండో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి దోహ దం కానుంది. ఈ ప్లాంట్లో త్రీఇన్ వన్ టీవీ బోర్డు లు, సర్వర్ పవర్ సప్లైలు, ఈవీ చార్జర్ భాగాలు, కంట్రోల్ యూనిట్లు, ఎలక్ట్రానిక్ షెల్స్ లేబుల్స్, (ఈఎస్ఎల్ఎస్) వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేయనున్నారు. దీంతో పవర్ మాడ్యూల్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ తయారీలో సోలుం సంస్థ గ్లోబల్ మార్కెట్లో మరింత బలపడనుంది. -
తిరుపతి కార్పొరేషన్లో ఏసీబీ తనిఖీలు
తిరుపతి తుడా: మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఏసీబీ ఏఎస్పీ విమల కుమా రి నేతృత్వంలో మంగళవారం సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఈ మేరకు ఏసీబీ అధికారులు మూ కుమ్మడి దాడులు నిర్వహించారు. బీపీఎస్కు సంబంధించి కొంతమంది టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదు లు చేశారు. వాటి ఆధారంగా ఏసీబీ సోదాలు చేపట్టా రు. అధికారుల వద్ద రూ.30 వేలు నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలానే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ప్రకటనలకు సంబంధించిన పలు కీలక దస్త్రాలను సీజ్ చేశారు. ఫైళ్ల తనిఖీలను రాత్రి వరకు కొనసాగించారు. మరో రెండు రోజులపాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోని పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, స్వాధీనం చేసుకోనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రూ. 30వేలు నగదు స్వాధీనం ఏసీబీ సోదాల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు, సిబ్బంది నుంచి రూ.30 వేల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగతంగా టేబుల్ డ్రాల్లో తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద నుంచి కొంత మేర నగదు ఉండడాన్ని గుర్తించారు. అందరి దగ్గర నుంచి మొత్తంగా రూ. 30వేలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. సుమారు 30కి పైగా ఫైళ్లను సీజ్ చేసి, ప్రధాన హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ కోసం దరఖాస్తులు చేసి ఇప్పటి వరకు అనుమతులు రాని సుమారు 12 మందికిపైగా బాధితులను విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. మరో రెండు రోజుల పాటు సోదాలు ఏసీబీ ఏఎస్పీ విమల కుమారి మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థలో టౌన్ప్లానింగ్లో బీపీ ఎస్, ఎల్ఆర్ఎస్ అనుమతుల విషయంలో పలు ఫి ర్యాదులు అందాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు చేసి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మ రో రెండు రోజులు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. -
17న నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన
నాయుడుపేట టౌన్: సీఎం చంద్రబాబు ఈ నెల 17వ తేదీన నాయుడుపేటలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అధికారులతో కలిసి సీఎం పర్యటించే ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. సీఎం చంద్రబాబు 17వ తేదీన మండలంలోని బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాలను ఉగాదిని పురస్కరించుకుని ముందస్తుగా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పక్కాగృహ నిర్మాణాలు చేసుకుని ఉన్న లబ్ధిదారులకు సంబంధించి పక్కాగృహ నిర్మాణాల గృహ ప్రవేశాలు చంద్రబాబు చేతుల మీదుగా చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని సీఎస్ తేజ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచారి, డీఎస్పీ చెంచుబాబు, ఆర్డీఓ దేవేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన బాలికకు ఆర్థిక సాయం
తిరుపతి అన్నమయ్యసర్కిల్:గిరిజన బాలికకు భరోసా కల్పిస్తూ ఆమె భవిష్యత్తుకు అండగా నిలుస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మానవతా దృక్పథంతో సహాయం అందించారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి చెందిన పూజ(10) గిరిజన బాలిక ఈ నెల 3వ తేదీన అదృశ్యమైన ఘటనను జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ఆచారి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ కనుగొని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న జిల్లా యంత్రాంగం మానవీయతతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గిరిజన బాలిక, ఆమె సోదరుడి కోసం రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్, పోలీస్ శాఖ తరఫున రూ.10 వేల నగదు సహాయం, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. -
చోరీ కేసులో మహిళ అరెస్టు
తిరుపతి రూరల్: బతుకుదెరువు కోసం తిరుపతి వచ్చి అద్దెకు దిగిన ఇంటి యజమాని ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన మహిళను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం సాయినగర్లో నివాసముంటున్న వెంకటరెడ్డికి బయటకు వెళ్లే సమయంలో ఇంటి తాళం బయట పూలకుండీ వద్ద పెట్టి వెళుతుండడం అలవాటు. ఆ విషయం గమనించిన ఆ ఇంటి కింది అంతస్తులో అద్దెకు నివాసముంటున్న వి.సంధ్య సంజు ఆ తాళం తీసుకుని ఇంటిలోకి వెళ్లి బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేసి గుట్టుగా ఆ తాళం చెవిని మళ్లీ అక్కడే పెట్టింది. ఆ తరువాత కొంత ఆలస్యంగా గుర్తించిన ఇంటి యజమాని వెంకటరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఇంట్లో అద్దెకు ఉన్న నిందితురాలు సంధ్య సంజుపై నిఘా పెట్టారు. పోలీసుల అనుమానం నిజం కావడంతో మంగళవారం ఆమె ఇంటిని తనిఖీ చేయగా పలు ఆభరణాలు బయటపడడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగలించిన ఆభరణాలలో కొన్నింటిని కర్ణాటక రాష్ట్రంలోని బంగారు పేటలో గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి రూ.1.40 లక్షలు నగదు పొందగా, మరో రెండు బంగారం ఉంగరాలను తన భర్త సురేష్ ద్వారా వి.కోటలోని ఓ కుదువ వ్యాపారి వద్ద కుదువ పెట్టినట్టు పోలీసులు తమ విచారణలో తేలింది. అనంతరం ఆమె నుంచి 50 గ్రాముల లాంగ్ చైన్, 44 గ్రాముల గుండ్లు లాంగ్ చైన్, 24 గ్రాములు నెక్లెస్, 11 గ్రాముల మూడు ఉంగరాలు, 2 గ్రాముల కమ్మలు మొత్తంగా 130 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.1.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. -
ఉపకరణాల పంపిణీకి నేటి నుంచి శిబిరాలు
తిరుపతి అర్బన్: దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ కోసం బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.వినోద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చే శారు. ఈ నెల 11వ తేదీన సూళ్లూరుపేట, దొర వారిసత్రం, తడ మండలాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. అలాగే చివరిగా ఈ నెల 16న తిరుపతి అర్బన్ మండలంలో దివ్యాంగులకు తుడా గ్రౌండ్, అదే రోజు తిరుపతి రూరల్ మండలంలోని వారికి తిరుపతిలోని గిరిజన భవనంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ పరిధిలో గత ఏడాది ఏప్రిల్లో జరిగిన తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పీజీ రెగ్యులర్ కోర్సులకు సంబంధించిన సెకండ్ సెమిస్టర్ ఫలితాలను సైతం విడుదల చేశామన్నారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 72,526 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,664 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శ న టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. ఫిజిక్స్ పర్లేదనిపించింది! తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నూతన సిలబస్తో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజక్స్ పేపర్–1 ప్రశ్నపత్రం క్లిష్టతరంగా లేదని, పేపర్ పర్లేదనిపించిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 1, 2మార్కుల ప్రశ్నలు బేసిక్పై ఎక్కువగా అడిగారని, 4, 8 మార్కుల ప్రశ్నలు చాలా వరకు తికమక పెట్టకుండా నేరుగా సంధించారని, సాధారణ విద్యార్థి సైతం మంచి మార్కులు స్కోర్ చేసేందుకు అవకాశం ఉందని అధ్యాపకులు విశ్లేషించారు. ప్రశ్నలు ఎక్కువగా సమస్యాత్మకంగా ఇవ్వకుండా విద్యార్థులు జవాబు రాయగలగేలా ఇచ్చారని వెల్లడించారు. జిల్లాలో 84 పరీక్ష కేంద్రాల్లో 24,736 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 24,307 మంది హాజరయ్యారని, 429 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ తెలిపారు. బుధవారం సెంకడ్ ఇయర్ విద్యార్థులకు కామర్స్ పేపర్–2 పరీక్ష జరగనుంది. బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026..చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మచ్చుకు ఈ రెండు మెడికల్ షాపులు మాత్రమే కాదు.. ఇలాంటివి కోకొల్లలు. మెడికల్ సంఘం పేరుతో కొందరు దందాకు తెరలేపుతున్నారు. వారి అనుమతి ఉంటే చాలు.. మెడికల్ షాపులకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆ నేతలకు మామూళ్లు ఇస్తే చాలు ఎన్నాళ్లయినా షాపులు నడుపుకోవచ్చు. ఏ మందులైనా విక్రయించుకోవచ్చు. అయితే వారు సూచించిన ఏజెంట్ల వద్దే మందులు, మాత్రలు కొనుగోలు చేయాలి. వారు అడిగినప్పుడు మామూళ్లు ఇచ్చుకోవాలి. లేదంటే దాడులు చేయించడం.. షాపులు సీజ్ చేయించడం.. షరామామూలే. మెడికల్ మాఫియా దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి ప్రాంతంలో ఓ మెడికల్ షాపునకు అనుమతి లేదు. విచ్చలవిడిగా మందులు, మాత్రలు విక్రయిస్తున్నారు. ఈ షాపులో రోజుకు రూ.లక్ష వరకు వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. ఆ షాపుపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మౌనముద్రలో మునిగిపోయారు. ఓ సంఘ నేత అండదండలతో ఈ షాపు నడుస్తోందని డ్రగ్స్ అసోసియేషన్లో మరో నేత విమర్శిస్తున్నారు. తిరుపతి ఎంఆర్పల్లిలో రెండు మెడికల్షాపులకు రిజిస్ట్రేషన్ లేదు. ఏళ్లతరబడి రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ షాపును నడిపిస్తున్నారు. ఓ సంఘ పెద్ద పేరు చెప్పుకుంటూ ఈ షాపును నడిపిస్తున్నారు. అబార్షన్ కిట్లు అడిగిన వాళ్లకు అధిక రేట్లకు విక్రయించేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి కేవలం మూడు నెలలే ఉంది.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, షూలు, అభ్యసన సామగ్రి అందించాల్సి ఉంది. అందుకు విద్యార్థులు వివరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఆ విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు వచ్చే ఏడాది ప్రభుత్వం నుంచి అందాల్సిన వన్నీ అందకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యాభ్యసన సామగ్రిని మనం కొనుగోలు చేయాల్సిందేనా? అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు మదన పడుతున్నారు.కలెక్టరేట్లోని సమగ్రశిక్ష జిల్లా కార్యాలయం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విచ్చలవిడిగా మెడికల్ షాపులు గరుడ వారధిపై ద్విచక్ర, భారీ వాహనాలు నిషేధంతిరుపతి క్రైం : నగరంలోని గరుడవారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ రవాణావాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి స్మార్ట్ సిటీ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం జూమ్ మీటింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి అంశాలతో పాటు గరుడ వారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. గరుడ వారధి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అందులో ఎక్కువ శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల కారణంగా జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ ట్రాన్న్స్పోర్ట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


