breaking news
Tirupati
-
● 19న మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద నిరసన ● పార్టీ శ్రేణులు తరలిరావాలని భూమన అభినయ్రెడ్డి పిలుపు
తిరుపతి మంగళం : పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య విద్యను అందించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు అందిస్తానన్న సంక్షేమ పథకాలు అందించకపోగా, పేద విద్యార్థుల కోసం నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. పేదలకు ద్రోహం చేస్తూ సంపన్నులకు దోచిపెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా వైఎస్సార్సీపీ శ్రేణులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు మదనపల్లి వద్ద జగనన్న నిర్మించిన మెడికల్ కళాశాల ప్రైవేటు పరం కాకుండా ఈనెల 19న మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అద్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఆచూకీ పట్టించిన మందుల చీటీ
పాకాల:అడవిలో బయటపడ్డ మృతదేహాల ఆచూకీ మెడికల్ ప్రిస్కిప్షన్తో బహిర్గతమైంది. నాలుగు మృతదేహాలు ఎవ్వరివి అన్న మిస్టరీ వీడింది. మృతులు తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా పి.కొంతగై గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించి మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. వివరాలు ఇలా.. నాయుడుపేట– పూతలపుట్టు జాతీయ రహదారిపై గాదంకి టోల్ ప్లాజాకు ఆనుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలవంక అటవీ ప్రాంతంలో ఈనెల 14వ తేదీన బయటపడ్డ నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అడవిలో మృతి చెందిన మహిళ భర్త వెంకటేష్ మంగళవారం పాకాల పోలీస్ స్టేషన్ చేరుకుని తన భార్య బిడ్డలు కనిపించడం లేదని వారి ఫొటోలతో పాటు వివరాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం వెంకటేష్ను వెంట బెట్టుకుని అడవిలోకి వెళ్లిన పోలీసులు అక్కడ పాతిపెట్టిన గోతులను తవ్వించి అందులో ఉన్న పిల్లల మృతదేహాలను చూపించారు. తన కుమార్తెలు దర్శిని (9), వర్షిణి(3)గా నిర్ధారించుకున్న వెంకటేష్ కన్నీటి పర్యంతమై అక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఓదార్చి ధైర్యం చెప్పి ఆ తరువాత పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలను పాతిపెట్టిన గోతుల్లో మృతదేహాలతో పాటు ఒక సెల్ఫోన్, ఆధార్, పాన్ కార్డులు, చాక్లెట్లు బయటపడగా వాటి ఆధారంగా తన భార్య జయమాల, ఆమె సోదరుడు కలై సెల్వంగా వెంకటేష్ గుర్తించాడు. ఇక్కడకి ఎలా వచ్చారు? ఎక్కడో నాగపట్ల జిల్లా నుంచి పనపాకం సమీపంలోని అడవుల్లోకి ఎలా వచ్చారు.. ఎలా చనిపోయారు అనే విషయంలో నెలకొన్న అనుమానాలు మాత్రం తీరడం లేదు. తమ వెంట తీసుకొచ్చిన పిల్లలను చంపి పాతిపెట్టిన తరువాత వారు ఆత్మహత్య చేసుకున్నారా..? లేదా ఫైనాన్స్ గొడవల్లో ఎవ్వరైనా ఆ నలుగురుని కిడ్నాప్ చేసి చంపి అడవిలో ఆత్మహత్యలా చిత్రీకరణ చేశారా..? జయమాల, కలై సెల్వన్ల మృత దేహాల మూతులకు గుడ్డలు కట్టి ప్లాస్టర్ వేసి ఉన్నందున హత్య చేశారన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నందున త్వరలో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మృతదేహాలకు అక్కడే శవపరీక్ష, ఖననం అడవిలో నుంచి మృత దేహాలను కదిలించలేని దుస్థితిలో ఉన్నందున పోలీసులు తహసీల్దారు సమక్షంలో వైద్యులను తీసుకువెళ్లి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఖననం చేశారు. అసలు ఆ కుటుంబంలో జయమాల, కలై సెల్వంల మధ్యన సంబంధాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. చీటీ ఆధారంగా చిరునామా గుర్తింపునాలుగు మృతదేహాల మిస్టరీ ఛేదించడంలో మెడికల్ ప్రిస్కిప్షన్ కీలకమైంది. అడవిలోని మృత దేహాల వద్ద లభించిన హాస్పిటల్ ప్రిస్కిప్షన్ ఆధారంగా పోలీసులు హాస్పిటల్ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలిపారు. తంజావూరులోని ఆసుపత్రి వారు అక్కడి మెడికల్ రికార్డుల్లోని చిరునామా ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. ఆ విషయం తెలుసుకున్న వెంకటేష్ పాకాల పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన భార్య, పిల్లల ఫొటోలను చూపించగా అతడిని ఘటనా స్థలికి తీసుకువెళ్లి నిర్ధారణ చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..? జయమాల భర్త వెంకటేష్ కువైట్లో పనిచేస్తుండగా జయమాల తన ఇద్దరు పిల్లలు దర్శిని (9), వర్షిణి (3)లతో పి.కొంతగై గ్రామంలోనే ఉండేవారు. కువైట్ నుంచి అప్పుడప్పుడూ రూ.50 వేలు, రూ.60 వేలు తన భార్య జయమాలకు పంపించేవారు. ఆ డబ్బును జయమాల తన పెద్దమ్మ కుమారుడైన కలై సెల్వంతో కలిసి ఫైనాన్స్ చేస్తుండేది. ఆ ఫైనాన్స్ వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకుని పూర్తిగా నష్టపోయారు. ఈ క్రమంలో వెంకటేష్ 2024 జూన్ నెలలో కువైట్ నుంచి ఇంటికి వచ్చాడు. అదే రోజున తన భార్య జయమాలను తాను పంపించిన డబ్బులు ఏం చేశావని అడిగ్గా జయమాల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాక పోవడంతో గొడవపడి అతడు తిరిగీ కువైట్కు వెళ్లిపోయాడు. 2025 జూలై నెలలో తన భార్య పిల్లలు కనిపించడం లేదని విషయం తెలుసుకున్న వెంకటేష్ కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చి బంధువులు, స్నేహితులను విచారించాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని నాగపట్నం జిల్లా తిక్కచేరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
ప్రశ్నించే గొంతుకపై కక్ష
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం అన్యాయం. ఒక నాయకుడు ప్రెస్మీట్లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే మీడియాపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇలా కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై గౌరవభావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు, వాక్స్వాతంత్య్రపు హక్కుకు సంకెళ్లు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నా?. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ధోరణిని మానుకోవాలి. అన్యాయంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – చైతన్య, విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
మహిళా వర్సిటీని సందర్శించిన థాయిలాండ్ బృందం
తిరుపతి రూరల్ : శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీని థాయిలాండ్లోని ప్రిన్స్ ఆఫ్ సాంగ్క్లా యూనివర్సిటీ పట్టాని క్యాంపస్ ప్రతినిధి బృందం మంగళవారం సందర్శించింది. యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ వి.ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రజని, అంతర్జాతీయ సంబంధాల విభాగం డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆర్.ఉష విదేశీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం రెండు విశ్వ విద్యాలయాల అధ్యాపకుల మధ్య సమగ్ర చర్చలు జరిగాయి. ఇందులో సంయుక్త పరిశోధన, సామూహిక ప్రచురణలు (జాయింట్ పబ్లికేషన్), విద్యార్థుల , అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై చర్చించారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరిశీలన, పరస్పర సహకారం కోసం ప్రత్యేక సమావేశాన్ని యూనివర్సిటీ అధికారులు నిర్వహించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా, పరిశోధన సహకారాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఆ సమావేశం సాగింది. మహిళల సాధికారత కోసం చేస్తున్న సేవలను ప్రశంసించడంతో పాటు ఈ తరహా కార్యక్రమాలను థాయిలాండ్లోనూ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చివరగా రెండు యూనివర్శిటీల మధ్యన ఒప్పందాలకు అంగీకారం కుదుర్చుకున్నట్టు వీసీ వి.ఉమ స్పష్టం చేశారు. -
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
రేణిగుంట : కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాకు చెందిన మహబూబ్(30) అనే లారీ డ్రైవర్ రేణిగుంట మండలంలోని కేఎల్ఎం హాస్పిటల్ సర్కిల్ సమీపంలోని అశోక్ లైలాండ్ సర్వీస్ పాయింట్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గాజుల మండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాయుడుపేటలో నిలిచిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లు – తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు నాయుడుపేటటౌన్ : నాయుడుపేట రైల్వే స్టేషన్లో మంగళవారం పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచి పోయి ఆలస్యంగా నడిచాయి. విజయవాడ నుంచి చైన్నెకు వెళుతున్న పినాకిని ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం మధ్మాహ్నం గంట పాటు నాయుడుపేట రైల్వే స్టేషన్లో నిలిపి వేశారు. తడ సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండడంతో పలు రైళ్లను గూడూరు, నాయుడుపేట, దొరవారిసత్రం రైల్వే స్టేషన్లలో నిలిపేశారు. బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి చేసి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత రైళ్లు ఒకే ట్రాక్పై రాకపోకలు జరిపాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వచ్చే ఏడాది జాతీయ స్థాయి ఖో–ఖో పోటీలు తిరుపతి సిటీ: వచ్చే ఏడాది ఏప్రిల్లో జాతీయ స్థాయి ఖో–ఖో పోటీలకు ఎస్వీయూ ఆతిథ్యమిస్తున్నట్టు వీసీ అప్పారావు తెలిపారు. మంగళవారం వీసీతోపాటు పలు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పీడీ ప్రొఫెసర్ శివశంకర్రెడ్డి ఖో–ఖో పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. -
బైక్ దొంగలు అరెస్టు
తడ: మండలంలో తరచూ జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి పోలీసులు మంగళవారం ఐదుగురు నిందితులను అరెస్టు చెయ్యడంతో పాటు 11 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ మంగళవారం తడ పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇటీవల తడలో పట్టుబడిన కొన్ని ద్విచక్ర వాహనాలకు సంబంధించి విచారణలో భాగంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభించింది. ఆ మేరకు తడ ఎస్ఐ కొండపనాయుడు ఆధ్వర్యంలో వలపన్నిన పోలీసులు ఇప్పటికే రౌడీ షీటర్గా ఉన్న సాయి విగ్నేష్తో పాటు తడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రాకేష్, గోపాల్, మునిశేఖర్, సూర్యనారాయణ అనే నిందితులను అరెస్టు చేసి వారివద్ద నుంచి విక్రయానికి సిద్ధంగా ఉన్న, ఇప్పటికే విక్రయించిన మరికొన్ని బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన వంశీతో పాటు మరో వ్యక్తి ఇప్పటికే మరో కేసులో నెల్లూరు జైలులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఐదు మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ కొండపనాయుడు, ఏఎస్ఐ శ్రీకుమార్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ మృతి చంద్రగిరి : తిరుపతి, చిత్తూరు జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పల్లినేని సుబ్రమణ్యం నాయుడు (51) అనారోగ్యంతో చైన్నెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని చైన్నెకు చేరుకుని, మృతదేహాన్ని స్వగ్రామం పనపాకం పంచాయతీ గడ్డంవారిపల్లికు మంగళవారం మధ్యాహ్నం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో బోల్తా : ఆరుగురికి గాయాలు శ్రీకాళహస్తి : పట్టణంలోని భరద్వాజ తీర్థం వద్ద ఆటో బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెల్లూరుకు చెందిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తిలో బంధువుల ఇంటికి జన్మదిన వేడుకలు కోసం వచ్చారు. వేడుకల అనంతరం లోబావి (భరద్వాజతీర్థం) సందర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలో కన్నప్ప కొండ వద్ద ఆటో అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెహనా (50), కరిష్మా (22), భాను (23), జాకీర్ (23), ఆశా బేగం (65), మహమ్మద్ అలీ (8) గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. -
టీచర్లకు బోధనేతర పనులు వద్దు
తిరుపతి సిటీ: స్కూళ్లలో టీచర్లకు విపరీతంగా పెరిగిపోయిన బోధనేతర పనులను రద్దు చేసి వారి సమయాన్ని బోధనకే పరిమితం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఓ హోటల్లో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన రణభేరి–ప్రచార బైక్ జాతా నిర్వహించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయని, ఒక ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధన చేయడమే ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో, పలు రకాల బోధనేతర పనులను అప్పగించడం దారుణమని, ఆ పనులను వివరించారు. వీటి నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛాయుత వాతావరణంలో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ నాయుడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, మణిగంఠన్, దేవరాల నిర్మల, జిల్లా గౌరవాధ్యక్షులు దండు రామచంద్రయ్య, వయ్యాల మధు, బండి మధుసూదన్ రెడ్డి, అవనిగడ్డ పద్మజ, మోహన్, చీళ్ల సురేష్, హేమాద్రిబాబు,వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. -
గుట్టుగా రైతుల భూములు టీడీపీ నేతల పరం!
కేవీబీపురం: తమకు అధికారులు అన్యాయం చేసారని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన బాధిత రైతులను సాక్షాత్తు తహసీల్దారే పోలీసులకు అప్పగించి వేధింపు చర్యలకు పాల్పడడం చర్చనీయాంశమైంది. వివరాలు..మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతులు రమణయ్య నాయుడు, చెంచు కృష్ణారెడ్డి, వెంకటముని స్థానికంగా పట్టా భూమి కలిగి ఉన్నారు. ఆ భూమిలో దాదాపు 3 దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే గత నెల వరకూ రైతుల పేరిటే ఉన్న ఆ భూములు ఈ నెల 2వ తేది తరువాత స్థానిక టీడీపీ నేతల పేరిట మారిపోయాయి! ఇది తెలుసుకున్న బాధిత రైతులు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించారు. మీడియా వారి సమస్యను గత శనివారం వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం బాధితులు తహసీల్దార్ రోశయ్య, వీఆర్ఓ మనోహర్ను నిలదీశారు. దీంతో వారు రైతులపై చిందులేశారు. ఏమైనా ఉంటే ఆర్డీఓ దగ్గర తేల్చుకోవాలని, మీడియాను ఎవరు కలవమన్నారంటూ ఎదురుదాడికి దిగారు. అంతటితో ఆగకుండా జరుగుతున్న తతంగాన్ని సెల్ఫోన్లో రికార్డు చేస్తున్నారనే నెపంతో రైతు వెంకటముని కుమారుడైన మునిరత్నం ఫోన్ను తహసీల్దార్ బలప్రయోగంతో లాక్కున్నారు. అంతటితో ఆగకుండా వారిని తహసీల్దార్ పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. తహసీల్దార్ తమ భూములను భూములను టీడీపీ నేతలకు అప్పగించడమే కాకుండా, తమను బెదిరించడం శోచనీయమని, దీనిపై ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. సీఎం చెప్పేదొకటి..ఆచరణలో మరొకటి ఇదలా ఉంచితే, రైతుల ప్రమేయం లేకుండా వారి భూములను రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీ నేతలకు అప్పగించడం వెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్టు స్పష్టంగా తేలుతున్నా , పుండు మీద కారం చల్లినట్లు బాధితులనే వేధించడం విమర్శలకు తావిచ్చింది. రైతులను రారాజు చేయడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆర్భాటంగా ప్రకటించినా, రైతుల కడుపు కొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం, నాయకుల తీరు ఉంటోందని పలువురు రైతు నాయకులు విమర్శించారు. -
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రికలపైన, పత్రికా విలేకరులపై ఈ మధ్య కాలంలో అనేక కేసులు బనాయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పత్రికల ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్న జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపి దాడులు చేయడం అన్యాయం. అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాయడం కరెక్టు కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పెట్టిన కేసులను ఎత్తివేయాలి. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి -
భూమన కరుణాకరరెడ్డిపై అక్రమ కేసు
తిరుపతి క్రైమ్,తిరుపతి మంగళం: టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. హిందూ మత మనోభావాలు దెబ్బతీయడానికి, టీటీడీని కించపరచడానికి, ప్రజల్లో అల్లర్లు రేపడానికి దు్రష్పచార వీడియోలు పోస్ట్ చేశారంటూ ఆయనపై టీటీడీ డిప్యూటీ ఇంజనీర్ గోవిందరాజులు అలిపిరి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 196(1)(ఎ), 197(1), 299, 352, 353(3), 356(2), రెడ్ విత్ 356(1) బిఎంఎస్ చట్టం కింద భూమనపై కేసు నమోదు చేశారు. తిరుపతి అలిపిరి బస్టాండు సమీపంలో చెత్త, మద్యం సీసాలు, మూత్ర విసర్జన జరిగే ప్రదేశాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వదిలిపెట్టినట్లుగా భూమన కరుణాకరరెడ్డి చూపించారని గోవిందరాజులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయన్నారు. రాయల్ చెరువుకు చెందిన దివంగత పట్టా కన్నాచారి సుమారు 20 ఏళ్ల క్రితం ఈ శిల్పాన్ని పూర్తిచేయకుండా వదిలేశారని తెలిపారు. ఆ సమయంలో చాలా రాళ్లతో పాటు శనీశ్వర విగ్రహాన్ని భూదేవి కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పడేశారన్నారు. ఈ విగ్రహానికి, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచి రాజకీయ లబ్ధి కోసమే భూమన ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. శనీశ్వరుడికి శంఖు, చక్రాలు ఉంటాయా? భూమన మండిపాటు రాజకీయాల కంటే హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతానని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అలిపిరి పాదాలచెంత మహావిష్ణువు విగ్రహాన్ని మద్యం బాటిళ్ల మధ్య పడేశారని చూపించి ప్రశ్నిస్తే టీటీడీ అధికారులు తనపై కేసులు పెట్టడం వారి నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. టీటీడీలో జరుగుతున్న తప్పిదాలు, అపచారాలు, ఘోరాలను సరిదిద్దుకోవాల్సిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనపై కేసులు పెట్టించడం దుర్మార్గమన్నారు. మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని చూపితే అసలు ఆ విగ్రహం మహావిష్ణువుదే కాదు.. శనీశ్వర స్వామిదని చెప్పడం ఏంటని మండిపడ్డారు. శనీశ్వరస్వామి విగ్రహానికి శంఖు, చక్రాలు ఉంటాయా అని నిలదీశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
శ్రీ మహావిష్ణు విగ్రహామే.. బెదిరిస్తే భయపడేటోన్ని కాదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని.. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి చెబుతున్నారు. అలిపిరి వద్ద స్వామివారి విగ్రహానికి అపచారం జరిగిన పరిణామంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగింది. అది చెబితే నాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఆది శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని నిరక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుంది?. శని విగ్రహానికి విల్లు, బాణం ఉంటుంది. కాబట్టి.. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంగా మీరు ఏమి చేస్తున్నారు?. వైఖానస ఆగమ సత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే దైవానుగ్రహంతో బోర్డు సభ్యులయ్యాం అని మీరు చెప్పుకుంటున్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో రెండుసార్లు చైర్మన్, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యాను నేను. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా వాస్తవాలే చెబుతుంటాను నేను. హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని. కాబట్టి నాపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరు నమ్మరు. రాజకీయాలు కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం. నేను నాయకుడ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని భూమన ఉద్ఘాటించారు. -
తిరుపతి: అలిపిరిలో ఘోర అపచారం
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహా విష్ష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసింది. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. ‘హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. హిందూ దేవుళ్ల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారు. తక్షణమే టిటిడి చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి. హిందుత్వ సంఘాలు , మఠాధిపతులు మేల్కొవాలి’ అని భూమన డిమాండ్ చేశారు. -
స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ కల్పించాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు మీడియా సమావేశాల్లో తెలియజేసిన విషయాలను కూడా పత్రికల్లో వస్తే నేరమనడం హాస్యాస్పదం. లోటు పాట్లను గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యం పై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. సాక్షి పై కేసు నమోదు చేయడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. విమర్శలు చేస్తే కేసులు పెట్టడం, ప్రభుత్వ పరిపాలన లోపాలను ఎత్తిచూపితే మీడియా సంస్థలను నియంత్రించాలనుకోవడం అన్యాయం. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. – ప్రకాష్, విద్యావేత్త -
మెగా డీఎస్సీ తుది జాబితాలో పలువురు అభ్యర్థులకు అన్యాయం
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, కుప్పం, చిత్తూరు, పుత్తూరు పలు ప్రాంతాల నుంచి మెగా డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు డీఈవో కార్యాలయానికి విచ్చేశారు. ర్యాంకు, మార్కుల పరంగా అర్హత ఉన్న తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. పీఈటీ, ఇతర కేటగిరిలతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఎంపికై న వారి సర్టిఫికెట్లు సమగ్రంగా విచారించలేదని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీల్లో అనర్హులకు అందలం ఎక్కించారన్నారు.తుది జాబితాలో 1,408 మంది ఎంపికరాష్ట్ర విద్యాశాఖ అధికారులు సోమవారం ప్రచురించిన మెగా డీఎస్సీ తుది జాబితాలో 1,408 మంది ఎంపికై నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లలో 1,478 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ తుది జాబితా ప్రచురణ నాటికి పలు కేడర్లలో 1,408 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. తుది ఎంపిక జాబితాలను కలెక్టరేట్, డీఈవో కార్యాలయ నోటీసు బోర్డులలో ప్రచురించారు. తుది జాబితాలో అభ్యర్థులకు ఎవరైనా అభ్యంతరాలున్నట్లైతే కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ 8498991250 నెంబర్లో తెలియజేయాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా డీఎస్సీ తుది ఎంపికమేనేజ్మెంట్ నోటిఫైడ్ ఎంపికై న అర్హత లేకపోస్టులు పోస్టులు భర్తీ కాని పోస్టులుప్రభుత్వ, లోకల్బాడీస్ 1,312 1,254 58మున్సిపాలిటీ 64 57 07మున్సిపల్ కార్పొరేషన్ 97 92 05ట్రైబల్ఆశ్రమ పాఠశాలలు 05 05 00మొత్తం పోస్టులు 1,478 1, 408 70 -
ఎస్వీయూ అధికారుల తీరుపై ఆగ్రహం
తిరుపతి సిటీ : ఎస్వీయూ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, వర్సిటీలోని సమస్యలపై సోమవారం అన్నమయ్య భనవంలో ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశానికి వర్సిటీ అధికారులు అడ్డకట్ట వేశారు. దీంతో మండిపడిన విద్యార్థి సంఘాల నేతలు యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఐసా, పీడీఎస్ఓ, ఎన్ఎస్యూఐ, జీఎన్ఎస్, జై భారత్ నేషనల్ పార్టీ విద్యార్థి విభాగం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కో–కన్వీనర్ అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ 70 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి సంఘాలను అణగదొక్కేందుకు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు యత్నిస్తున్నారని ఆరోపించారు. నేపాల్ పరిస్థితులను తలపించేలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వర్సిటీ అధికారుల అవినీతిని బయటపెడుతున్నందుకే సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశానికి అనుమతి మంజూరు చేయకుండా ఉత్వర్వులు జారీ చేశారని ఆరోపించారు. అధ్యాపకుల లెటర్ ప్యాడ్పై మాత్రమే సెమినార్ హాల్ ఇస్తామని చెప్పి, ఎవరైనా అధ్యాపకులు లెటర్ ఇస్తే జీతాలు నిలిపివేస్తామని రిజిసా్ట్రర్ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు మారకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వీసీకి వినతి పత్రం సమర్పించారు. నేతలు అక్బర్, రవి, ఉదయ్, ప్రవీణ్, మల్లికార్జున, చిన్నా, శివశంకర్నాయక్, లోకేష్, భార్గవ్ పాల్గొన్నారు. -
ముక్కంటి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్ సేవించుకున్నారు. సోమవారం ఆయనకు దక్షిణ గోపురం వద్ద ఈఓ బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాదాల పోటును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులతో మాట్లాడి ఆలయంలో వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, సుదర్శన్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో ఎంపీలు రవిచంద్ర, డీకే అరుణ, రాఘవేంద్ర, లక్ష్మీకాంత్ వాజపేయి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే రివాబా జడేజా ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. మారిషన్ ప్రధానికి సాదర స్వాగతం.. వీడ్కోలు రేణిగుంట : తిరుపతి– తిరుమల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి మారిషన్ ప్రధాని నవీన్చంద్ర రాంగూళం చేరుకున్నారు. ఎయిర్పోర్టులో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, అనంతపురం డీఐఈ షిమోసి బాజ్పేయి, జేసీ శుభం బన్సల్ సాదర స్వాగతం పలికారు. పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్పోర్టు చేరుకున్న మారిషస్ ప్రధానికి మంత్రితోపాటు అధికారులు వీడ్కోలు పలికారు. -
● వీఐపీలకే మా సేవ!
సామాన్య భక్తులకే ప్రాధాన్యమంటారు.. సులభతరంగా ముక్కంటి దర్శనం కల్పిస్తామంటారు.. చిన్నపాటి ఇబ్బంది కూడా తలెత్తకుండా సకల వసతులు కల్పిస్తామంటారు. అయితే ఆచరణలో మాత్రం తూతూమంత్రంగా అమలు చేస్తుంటారు. అదే వీఐపీలు వస్తున్నారంటే రెడ్కార్పెట్ పరిచేస్తారు. తోరణాలతో స్వాగతం పలుకుతారు. ప్రముఖుల సేవకు వైద్యసిబ్బందిని సిద్ధం చేస్తారు. వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఆదాయం ఆర్జించేందుకు అధికార పార్టీ కార్యకర్తలకు అనుమతులు మంజూరు చేస్తారు. దూరాభారం నుంచి వచ్చిన భక్తులను పక్కకునెట్టి వీఐపీ దర్శనాలకు దారులు తీస్తారు. సోమవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు ముక్కంటి ఆలయంలో రెడ్కార్పెట్ మర్యాద లభించింది. – సాక్షి టాస్క్ఫోర్స్ -
అటవీ పరిరక్షణ అందరి బాధ్యత
తిరుపతి మంగళం : అడవులు అంతరించిపోతున్నాయని, వాటి పరిరక్షణను అటవీ అధికారులతో పాటు ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని అటవీశాఖ అభివృద్ధి కార్యక్రమాల ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు సూచించారు. తిరుపతి పరిధిలోని ఎస్వీ జూపార్కు, నగర వనాన్ని సోమవారం ఆయన సందర్శించారు. జూలో ఇటీవల వరుసగా పులులు, సింహాల మరణాలపై అక్కడి అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సందర్శకులకు అందిస్తున్న వసతులు, జంతువులకు అందిస్తున్న ఆహారంపై ఆరా తీశారు. జూను మరింత అభివృద్ధి చేయడంపై జూ క్యూటరేటర్, సీసీఎఫ్ సెల్వంతో చర్చించారు. జూలోని జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జనావాల్లోకి ఏనుగులు, చిరుతలు, వన్యప్రాణులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం సీపీఎఫ్ సెల్వం, తిరుపతి జిల్లా అటవీ శాఖాధికారి వివేక్, డీఎఫ్వో శ్రీనివాసులు, సబ్ డీఎఫ్వో నాగభూషణం, ఎఫ్ఆర్వోలు సుబ్బరాయుడు, సుదర్శన్రెడ్డితో కలిసి నగర వనంలో పర్యటించారు. నగరవనంలో ఏర్పాట్లపై వాకర్లతో మల్లికార్జునరావు మాట్లాడారు. ఎస్వీ జూపార్క్, నగరవనంలో సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని అందించేలా తగు చర్యలు చేపట్టాలని అటవీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. -
మహిళా వర్సిటీలో ‘క్వాంటమ్ వ్యాలీ’
తిరుపతి రూరల్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్ పరిధిలో క్వాంటమ్ వ్యాలీని సోమవారం ప్రారంభించారు. సాంకేతిక విద్యలో తాజా పరిణామాలు, సాధించాల్సిన అభివృద్ధిపై వారం రోజుల పాటు చర్చించనున్నారు. వీసీ ఉమ మాట్లాడుతూ ప్రభుత్వం అమరావతిని క్వాంటమ్ వ్యాలీతో పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చేయబోతోందన్నారు. డాక్టర్ వై.భవాని కుమార్ మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీస్లో ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్ అంశాలను వివరించారు. రిజిస్ట్రార్ రజని, ప్రొఫెసర్ మల్లికార్జున, ప్రొఫెసర్ పి. వెంకట కృష్ణ, కో–ఆర్డినేటర్ వి.సరిత పాల్గొన్నారు. -
పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
చిల్లకూరు: వెంకటగిరి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు సోమవారం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్సు వెంకటగిరి బయలుదేరింది. బస్సు కొమ్మనేటూరు సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ కునుకుతీశాడు. బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ తేరుకునే సరికే బస్సు రోడ్డు పక్కనే ఉన్న బస్సు షెల్టర్ను, తరువాత ఓ దుకాణాన్ని ఢీకొని ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి నిలిచిపోయింది.ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు మరో రెండు మీటర్లు వెళ్లి ఉంటే హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాపు ్తచేస్తున్నారు. -
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
ప్రభుత్వానికి మధ్య వారధిగా, ప్రభుత్వాల దుర్నీతి పాలనను ఎత్తి చూపుతూ రాసే కథనాలపై పత్రిక ఎడిటర్, విలేకరులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అనుసరిస్తోంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు పెట్టడం సరికాదు. వైఫల్యాలను, వాస్తవాలను రాస్తున్న సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధతి కాదు. సాక్షి పత్రిక, సిబ్బందిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. – వి.రెడ్డిశేఖర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు. -
ఆదుకోవాలని ఆటోకార్మికులు
వాహనమిత్రను కోతలు లేకుండా అందరికీ వర్తింపజేసి ఆదుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ఆటోలతో చేరుకుని ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 13.25లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే కేవలం 2.90 లక్షల మందికి వాహన మిత్ర అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఆటోకార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఉచిత బస్సు నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసినా కూలి డబ్బులు కూడా రావడం లేదని వాపోయారు. 90శాతం ఆటోలను కార్మికులు అద్దెకు తీసుకుని నడుపుతున్నారని, వారికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నేతలు మురళి, బాలసుబ్రమణ్యం, కేతారి రాధాకృష్ణ, జయచంద్ర, ఐఎప్టీయు నగర కార్యదర్శి లోకేష్, లక్ష్మయ్య, శివ, చంద్రశేఖర్ రెడ్డి, ఎన్డీ రవి మద్దతు తెలిపారు. -
వైద్యవిద్యపై బాబు విద్వేషం
తిరుపతి మంగళం : పేద విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేసేలా చంద్రబాబు విద్వేషపూరితంగా పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. సోమవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల జగనన్న పాలనలో విద్య, వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేశారని వెల్లడించారు. పేద బిడ్డలు సైతం వైద్యవిద్యను అభ్యసించాలనే మహోన్నత ఆశయంతో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించారని కొనియాడారు. అయితే రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం వైద్య కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు తెగబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల ఆశలను అడియాసలు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు జగనన్న చేసిన కృషి ఫలించకుండా చంద్రబాబు రాహువులా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో రూ.3లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు చేసిన మేలు ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కీలుబొమ్మ హోంమంత్రి అనితకు దమ్ముంటే ఆమె పక్క జిల్లాలోని పాడేరు మెడికల్ కళాశాల, ఇన్చార్జి మంత్రిగా ఉన్న విజయనగరం జిల్లాలోని మెడికల్ కళాశాల వద్దకు రావాలని సవాల్ విసిరారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు వరం కాకుండా జగనన్న సారథ్యంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ జగనన్న నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టాలని చూడడం దారుణమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,600 మెడికల్ సీట్లు ఉన్నాయని, ఈ 17 మెడికల్ కళాశాలలు పూర్తయితే..4వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. -
కనికరం లేని కూటమి
తిరుపతి తుడా : చిన్నపిల్లలనే కనికరం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా పాలన సాగిస్తోందని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. సోమవారం అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించారు. భూమన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికగా రూ.302 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు కుట్రపూరితంగా ఆస్పత్రి పనులను నిలిపివేసిందని ఆరోపించారు. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించడంతో తూతూమంత్రంగా మళ్లీ పనులు చేపట్టిందని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేని లోటును నాటి సీఎం వైఎస్ జగన్ గుర్తించి, టీటీడీ సహకారంలో అత్యున్నత వైద్యప్రమాణాలతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారన్నారు. ఖరీదైన వైద్యం అందక ఏ తల్లీ తన బిడ్డను పోగొట్టుకోకూడదనే సదుద్దేశంతో ఆలోచించారని కొనియాడారు. 2022లో ఆస్పత్రి పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల ముందు నాటికి 75శాతం నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. అయితే జగన్మోహన్రెడ్డికి క్రెడిట్ వస్తుందనే దురుద్దేశంతో తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆస్పత్రి పనులను నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రిపై ప్రభుత్వానికి, టీటీడీ పాలకమండలికి ఎందుకంత ద్వేషమని ప్రశ్నించారు. కేవలం పేరు కోసం పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. మరో మూడు నెలల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం స్విమ్స్ ప్రాంగణంలోని కార్డియాక్ న్యూరో సైన్సెస్ బ్లాక్ను సందర్శించారు. ఈ బ్లాక్ నిర్మాణానికి రూ.97 కోట్లు మంజూరు చేశామని, తమ హయాంలోనే 40శాతం పనులు పూర్తి చేశామని, అయితే కూటమి ప్రభుత్వం ఇది కూడా నిలిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించిన చిన్నపిల్లల కార్డియాక్ కేర్ సెంటర్ దేశవ్యాప్తంగా పేరుప్రతిష్టలు సాధించిందని తెలిపారు. గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా స్విమ్స్ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించామని వివరించారు. పేద ప్రజలకు ఉపయోగపడే అంశాలను రాజకీయాలతో ముడిపెట్టడం దారుణమని, ఇప్పటికై నా ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి కళ్లు తెరవాలని సూచించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని తిరుపతి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. సోమవారం ఈ మేరకు వైజాగ్–తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభమైంది. నవంబర్ 25వ తేదీ వరకు ఈ రైలు ప్రతి మంగళవారం తిరుపతిలో విశాఖపట్నం వెళ్లేందుకు అందుబాటులో ఉండనుంది. అలాగే అక్టోబర్ 5 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి– అనకాపల్లి మధ్య 8 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక రైళ్లను దసరా, దీపావళి సెలవులు పూర్తయ్యే వరకు కొనసాగించనున్నారు. నడికుడి– శ్రీకాళహస్తి నుంచి తిరుపతి నడిచే రైళ్లను సైతం కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లను ప్రకటించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. స్విమ్మింగ్, తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక రేపు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి జిల్లా అండర్–14, 17, 19 బాలబాలికలకు స్విమ్మింగ్, తైక్వాండో జట్ల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నారు. సోమవారం ఈ మేరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శి పి.కిషోర్ కుమార్, మహిళా కార్యదర్శి ఎల్.భార్గవి తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్క్స్ లిస్టు తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు స్విమ్మింగ్–81217 77077, తైక్వాండో– 90329 56111నంబర్లలో సంప్రదించాలని కోరారు. ‘యువ తరంగ్’ పోస్టర్ ఆవిష్కరణ తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టూడెంట్ వెల్ఫేర్–కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న యువ తరంగ్–2025 కార్యక్రమ పోస్టర్ను వీసీ అప్పారావు సోమవారం ఆవిష్కరించారు. వీసీ మాట్లాడుతూ వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు ఉంటాయని వెల్లడించారు. వక్తృత్వ, సంగీతం, నృత్య, థియేటర్ ఆర్ట్స్ వంటి 10 విభాగాలలో పోటీలను నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తామని వివరించారు. రిజిస్ట్రార్ భూపతి నాయుడు, శాప్ చైర్మన్ రవినాయుడు, కల్చరల్ విభాగం డైరెక్టర్ మురళీధర్, డాక్టర్ పత్తిపాటి వివేక్, పీసీ వెంకటేశర్లు, ప్రిన్సిపల్ పద్మావతి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సుబ్బారావు, వరదరాజన్ విజయసారథిరెడ్డి, డాక్టర్ పాకనాటి హరికృష్ణ పాల్గొన్నారు. 22 నుంచి ‘కోన’లో శరన్నవరాత్రి రాపూరు : మండలంలోని పెంచలకోనలో ఆదిలక్ష్మీదేవికి ఈ నెల 22 నుంచి అక్టోబర్2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 22న సౌభాగ్యలక్ష్మీదేవి, 23న ఆదిలక్ష్మీదేవి ,24న ధాన్యలక్ష్మి, 25న ధైర్యలక్ష్మి ,26న గజలక్ష్మి, 27న సంతానలక్ష్మి, 28న విజయలక్ష్మి, 29న విద్యాలక్ష్మి, 30న రాజ్యలక్ష్మి, అక్టోబర్ 1న ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు వివరించారు. 2న విజయదశమి సందర్బంగా లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం, పూలంగిసేవ, ఉదయం8.30కు అశ్వవాహనంపై శ్రీవారి పారువేట, 9గంటలకు శమీపత్రపూజ, 11గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ఉదయం నవ కలశ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, క్షేత్రోత్సవం ఉంటుందని తెలిపారు. -
వీఐపీలకే మా సేవ!
ముక్కంటి ఆలయంలో అధికారులు వీఐపీల సేవలోనే తరిస్తున్నారు. పోటీ పడి మరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.పింఛన్ కోసం ప్రదక్షిణలు నా భర్త పి.జేమ్స్ అనారోగ్యంతో మృతి చెందారు. పేద కుటుంబానికి చెందిన నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలి పనులకు వెళ్లాలన్నా ఆరోగ్యం సరిలేదు. వితంతువు పింఛన్ కోసం రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నా. 70 కిలోమీటర్ల నుంచి కలెక్టరేట్కు వచ్చా. అయితే ఈ రోజు గ్రీవెన్స్ లేదని చెబుతున్నారు. –పి.వనజ, కళత్తూరు, కేవీబీపురం మండలం -
డిజిటల్ యుగంలో మహిళలు కీలకం
తిరుపతి అర్బన్ : డిజిటల్ యుగంలో మహిళలు కీలకమని, కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని లోకసభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. జాతీయ మహిళా సాధికారత సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ క్రమంలో ముందుగా తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో రెండో రోజు సదస్సును జాతీయ, రాష్ట్ర గీతాలాపనలతో ప్రారంభించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ను సత్కరించి, శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటం బహుకరించారు. లోకసభ స్పీకర్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరాలంటే మహిళలు వందశాతం విద్యావకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత తొలి సమావేశం నిర్వహించడం ఎంతో సంతృప్తిగా ఉందని వెల్లడించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ సింగ్ మాట్లాడుతూ ఒక మహిళను విద్యావంతురాలిని చేస్తే, ఒక తరం విద్యావంతమవుతుందని సావిత్రిబాయి ఫూలే చెప్పిన మాటలు అక్షర సత్యమన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా హక్కుల కోసం పోరాడి, పురుషుల కంటే మంచి నిర్వాహకులుగా నిరూపించారని గుర్తుచేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ మహిళలు రాజకీయ,విజ్ఞానం,సాంకేతికత, వైద్యం,న్యాయరంగాల్లో సాధించిన విజయాలను వివరించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళల సమాన హక్కులు,రాజకీయాలలో మరింత ప్రాతినిధ్యం,విద్య, ఉపాధి, ఆర్థిక రంగాలలో అవకాశాలు,సురక్షిత సమాజ నిర్మాణం ఇవన్నీ లక్ష్యాలుగా వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ లింగ సమానత్వం సాధనలో పురోగతి అవసరమని గుర్తుచేశారు. పలువురు మహిళా సభ్యులు మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు పార్లమెంటరీ కమిటీ, సెక్రటేరియట్ టీమ్స్, అధికారుల సహకారం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ ఎమ్. జకియా కానం, మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. -
పోయింది భక్తుల ప్రాణాలే కదా..! సుబ్బారాయుడి విధేయతకు సత్కారం
సాక్షి, అమరావతి: చనిపోయింది ఆరుగురు సామాన్య భక్తులే కదా..! తీవ్రంగా గాయపడింది 40 మంది భక్తులే కదా..! అయినా సరే అందుకు బాధ్యుడైన వీర విధేయ అధికారికి మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇద్దాం..! ఇదీ ప్రజలకు భద్రత, రక్షణపై చంద్రబాబు సర్కారు తీరు!! అందుకే ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును తాజాగా మరోసారి తిరుపతి ఎస్పీగా నియమించింది. తిరుమల తిరుపతి పవిత్రత, భక్తుల మనోభావాలు అంటే తమకు ఏమాత్రం లెక్కలేదని మరోసారి నిరూపించింది. రెడ్ బుక్ కుట్ర కేసుల్లో కీలక పాత్రధారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కుటుంబానికి చెందిన ఎల్.సుబ్బారాయుడు ఆ పార్టీకి వీర విధేయుడు! తెలంగాణ కేడర్కు చెందిన ఆయన్ను టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఏరికోరి డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమించారు. రాయలసీమలో రెడ్బుక్ కుట్రను అమలు చేసేందుకే ఆయనకు కీలక పోస్టింగు ఇప్పించినట్టు పోలీసువర్గాలే వ్యాఖ్యానించాయి. అయితే ఎస్పీగా విధి నిర్వహణలో సుబ్బారాయుడు విఫలమయ్యారు. ఈ ఏడాది జనవరి 9న వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో ప్రభుత్వ వైఫల్యం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.తిరుమల–తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారి తొక్కిసలాట జరిగి ఆరు మంది భక్తులు దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్యూలైన్ల నిర్వహణలో వైఫల్యం... గేట్లు మూసివేసి లక్షలాదిమంది భక్తులను రోడ్లపై గంటలతరబడి వేచి ఉండేలా చేయడం... ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను బేఖాతరు చేస్తూ తమ అస్మదీయ అధికారి సుబ్బారాయుడుకు చంద్రబాబు అండగా నిలిచారు. ఆయన్ను సస్పెండ్ చేయకుండా బదిలీతోనే సరిపెట్టారు. అది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్్కఫోర్స్ ఎస్పీగా నియమించారు. సిట్ సభ్యుడిగా నియామకం..అంచనాలను అందుకోవడంతో క్లీన్చిట్ అనంతరం వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధించేందుకు నమోదు చేసిన అక్రమ కేసులో సుబ్బారాయుడును అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తుపై నియమించిన సిట్లో సభ్యుడిగా ఆయన్ను నియమించారు. ఈ అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతోపాటు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.రెడ్బుక్ కుట్రలను పక్కాగా అమలు చేయడంలో చంద్రబాబు అంచనాలను సుబ్బారాయుడు అందుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాటపై నియమించిన విచారణ కమిటీ సుబ్బారాయుడుకు క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. దీంతో ఆయన్ను మరోసారి జిల్లా ఎస్పీగా నియమించేందుకు మార్గం సుగమమైంది. తొలుత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావించగా తనకు తిరుపతి జిల్లానే కేటాయించాలని సుబ్బారాయుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దాంతో టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును ప్రభుత్వం తిరిగి తిరుపతి ఎస్పీగానే నియమించింది.నిక్కచి్చగా పని చేస్తారని పేరున్న హర్షవర్థన్ రాజును అక్కడి నుంచి బదిలీ చేసి ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించింది. గతంలో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు హర్షవర్థన్ రాజు రెడ్బుక్ కుట్రలకు సహకరించలేదని ఆకస్మికంగా బదిలీ చేసింది. తాజాగా ఏడు నెలల్లోనే ఆయన్ను తిరుపతి నుంచి తప్పించి ఆయన స్థానంలో సుబ్బారాయుడును నియమించింది. -
వైద్య రంగంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం: భూమన
సాక్షి, తిరుపతి: విద్య, వైద్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మేలు చేసేందుకే వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నారు. వాటిని ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.‘‘తిరుపతిలో నిలోఫర్ ఆసుపత్రికి మిన్నగా టీటీడీ శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను తీసుకువచ్చారు. 2021లో చిన్నపిల్లల హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి గుండె మార్పిడి పరికరాలు అందుబాటులోకి తెచ్చాం. 2021 అక్టోబర్ 3 నుంచి ఇప్పటికీ వరకు మూడువేలకు పైగా ఓపెన్ హార్ట్స్ సర్జరీలు, 15 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలో 15 గుండె మార్పిడులు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఏడాదిన్నర కాలంలో వెయ్యి ఆపరేషన్లు పూర్తి చేయలేదు’’ అని భూమన మండిపడ్డారు.‘‘80 శాతం పైగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు తిరుపతిలో పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 20 శాతం పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయలేకపోయారు. 15 విభాగాలలతో శ్రీపద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణం, రాయలసీమకి తలమానికమైన స్విమ్స్ ఆసుపత్రికి రూ.200 కోట్లతో మూడు దశల్లో పనులు చేపట్టాం. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం, పీజీ హాస్టల్ భవనం, రుయాలో డయాగ్నోసిస్ బ్లాక్కు నూతన భవనాలు నిర్మించాము..న్యూరాలజీ, కార్డియాలజీ బ్లాక్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్విమ్స్ ఆధునీకరణ అవసరం లేదన్నారు. 18 పద్మావతి కాలేజీల హాస్టల్ బ్లాక్ కూడా పనులు నిలిపి వేసింది. వైఎస్ జగన్ పాలనలో మూడువేల మందికి చిన్నారులకు శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా పునర్జన్మ ఇచ్చారు.’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ
● కేజీ వెండి, 50 సవర్ల బంగారం, రూ.5లక్షల నగదు అపహరణ చంద్రగిరి : స్థానిక ప్రశాంతినగర్లోని సీఆర్పీఎఫ్ విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ నజీర్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. నజీర్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం పాకాల మండలం రమణయ్యగారిపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలోని కిలో వెండి, 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును దుండగులు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టాలపై అవగాహన అవసరం తిరుపతి కల్చరల్ : బంగారు వ్యాపారులకు చట్టాలపై అవగాహన అవసరమని ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయ్కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బంగారు వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. అయితే ఇకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై అవగాహన లేక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. వ్యాపారులందరికీ చట్టాలపై అవగాహ కల్పించాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవంబర్ 21, 11, 23వ తేదీల్లో విజయవాడలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు, కోశాధికారి అనిల్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ.సత్యనారాయణ, ఎస్.జితేంద్ర కుమార్, కార్యదర్శి బాబు, పీఆర్ఓ శివ, భాస్కర్, రమణ, వంశీ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో కృష్ణ తేజ అతిథిగృహం వరకు భక్తులు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 82,149 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,149 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.85 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
చిల్లకూరు : గూడూరులోని గాంధీనగర్ ప్రాంతం సమాధుల తోట వద్ద జరిగిన రహీద్ హత్య కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్స్టేషన్ వద్ద విలేకర్లకు వివరాలను వెల్లడించారు. సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ క్షణికావేశంలోనే హత్య జరిగినట్లు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఎస్కే రహీద్ బాషా అనే యువకుడి హత్య కేసులో విచారణ చేపట్టామన్నారు. మృతుడి స్నేహితులు పాలకుర్తి వెంకటేశ్వర్లు, ఎస్కే షఫీర్ నిందితులుగా గుర్తించామని తెలిపారు. మద్యం తాగిన తర్వాత సిగరెట్ విషయంలో వివాదమేర్పడి హత్యకు దారితీసినట్లు వివరించారు. రహీద్ను కత్తితో పొడిచి విషయం వందన అనే మహిళకు తెలియజేయగా, ఆమె వాళ్లకు ఆశ్రయం కల్పించిందని చెప్పారు. హత్యాయుధాన్ని సైతం భద్రపరిచినట్లు తెలిపారు. తర్వాత ముగ్గురూ తూర్పు కనుపూరుకు వెళ్లి వస్తుండగా వరగలి క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. -
డేటా సైన్స్ సెంటర్లో ముగిసిన సదస్సు
తిరుపతి రూరల్ : మండలంలోని తుమ్మలగుంట పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన డేటా సైన్స్ సెంటర్లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు ఆదివారంతో ముగిసింది. ‘‘స్టాటిస్టికల్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ – ఫౌండేషన్స్ అండ్ అప్లికేషన్స్’’ పేరిట చేపట్టిన సదస్సును మహిళా వర్సిటీ, ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ (ఐఎస్పీఎస్), ఎస్వీయూ సంయుక్తంగా నిర్వహించాయి. ముందుగా ఎస్వీయూ ప్రొఫెసర్ ఎంపీశాస్త్రి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం.శివ పార్వతి మాట్లాడుతూ వివరణాత్మక నివేదికను సమర్పించారు. స్టాటిస్టికల్ సైన్స్ మౌలికాలు, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎన్ట్రోపీ, యాక్చూరియల్ సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్, ఏఐ అంతరశాఖ అనువర్తనాలు వంటి విస్తృత అంశాలను చర్చించినట్టు వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కస్టమ్స్ అండ్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ సి.విజయభాస్కర్, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్, స్టాటిస్టిక్స్ ఎవాల్యుయేషన్ మాజీ జాయింట్ డైరెక్టర్ వై. దుర్గా ప్రసాద్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ కల్లూరి నాగేశ్వరరావు, పాండిచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ఆర్. విష్ణువర్ధన్ , హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గణేష్ తలారి పాల్గొన్నారు. -
తిరుచానూరు స్టేషన్కు తొలి రైలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి–రేణిగుంట మధ్యలో నూతనంగా నిర్మించిన తిరుచానూరు రైల్వేస్టేషన్కు తొలి రైలు రానుంది. మంగళవారం సాయంత్రం 4.50 గంటలకు నాందేడ్లో బయలుదేరి బుధవారం ఉదయం 11.30 గంటలకు తిరుచానూరు స్టేషన్కు చేరుకోనుంది. అదే రోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుగుప్రయాణం కానుంది. ఈ క్రమంలోనే నాందేడ్ నుంచి ఈ నెల 23, 30వ తేదీల్లో సైతం ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు తిరుచానూరుకు రాకపోకలు సాగించనుంది. టెర్మినల్గా మారుస్తూ .. తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో తిరుచానూరు రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2021లో పనులు ప్రారంభించారు. అనంతరం స్టేషన్ స్థాయిని పెంచి టెర్మినల్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేబడ్జెట్లో సైతం ఈ స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. -
● రుయా.. కటిక నేలే దిక్కయా!
రాయలసీమకే తలమానికమని చెప్పుకునే రుయా ఆస్పత్రిలో రోగులతోపాటు సహాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాసేపు విశ్రమించేందుకు కటిక నేలే శరణ్యంగా మారుతోంది. చికిత్సపొందుతున్న తమ వారిని కనిపెట్టుకుని చూసుకునేందుకు వరండాలే దిక్కవుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతిశాంతిభద్రతల రక్షణే లక్ష్యం తిరుపతి క్రైమ్ : శాంతిభద్రతల రక్షణే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. అలాగే మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. షీటీమ్లను బలోపేతం చేస్తామని వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పకడ్బందీ బందోబస్తు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు కల్పించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ లాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పాయింట్ ఆఫ్ వ్యూలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కింగ్పై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. -
ముక్కంటీ.. కనవేంటి!
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదిదంపతుల దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు. నడవలేని వారిని ఆలయ ముఖ ద్వారం వరకు చేర్చేందుకు నాలుగు గోపురాల వద్ద ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వీల్చైర్లో స్వామి, అమ్మవార్ల దర్శనానికి తీసుకువెళుతుంటారు. అయితే ఈ బ్యాటరీ వాహనాలను మాత్రం వీఐపీల సేవలకే వినియోగిస్తున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు ఆలయంలోకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని ఆర్భాటంగా ప్రకటించే అధికారులు.. ఆచరణలో పూర్తి విరుద్ధంగా నడుచుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. – తొట్టంబేడు -
క్రేజ్ తగ్గిన పీజీ
తిరుపతి సిటీ : రాష్ట్రంలో ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. పీజీ సెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియకు వచ్చిన దరఖాస్తులను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో అడ్మిషన్లు కనీసం 50శాతం మించలేదు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై నిర్లక్ష్యం వహించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఏడాది వర్సిటీలలో కనీసం 20శాతం అడ్మిషన్లు దాటడమే గగనంగా మారింది. ఉన్నత విద్యామండలి నిర్ణయాల ఫలితంగా విద్యార్థులు పీజీపై అనాసక్తి చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలలో సైన్స్, ఆర్ట్స్, కంప్యూటర్ విభాగాలలోని పీజీ కోర్సులల్లో సుమారు 32వేలకు పైగా సీట్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 9,765 మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ఎస్వీయూ పరిధిలో వెయ్యిలోపే..! పీజీ సెట్ కౌన్సెలింగ్ కోసం ఉన్నత విద్యామండలి సోమవారం వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గడువు విధించింది. ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సుమారు 4వేల సీట్లు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 955 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. ఇలాంటి దుస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని విద్యార్థి సంఘాలు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ కోర్సులను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగానే ఉన్నత విద్యామండలి ఇలాంటి వాతావరణ కల్పించిందని ఆరోపిస్తున్నారు. గడువు పెంచే ఆలోచనలో అధికారులు పీజీసెట్–2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈ నెల 8 నుంచి 15 తేదీ వరకు ఉన్నత విద్యామండలి అనుమతించింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో మారు గడువు పెంచనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీలో కేవలం 15శాతం మాత్రమే దరఖాస్తులు రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు. కనీసం 50శాతం ప్రవేశాలను తీసుకురావాలని పీజీ సెట్ కన్వీనర్ను అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పీజీ అడ్మిషన్లు చేపట్టలేమని ఎస్వీయూ మాత్రం చాకచక్యంగా చేతులెత్తేసింది. దీంతో ఉన్నత విద్యామండలి ఆ ప్రక్రియను నాగార్జున యూనివర్సిటీకి అప్పగించింది.వర్సిటీల పరిస్థితి అగమ్య గోచరమే..! గ్రామీణ, పేద, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే గత ఏడాది నుంచి అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోతున్నాయి, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ వంటి కోర్సులకు క్రేజ్ తగ్గుతోంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లు, పరిశోధకలుకు ప్రొత్సాహాకాలు కల్పించకపోవడంతో విద్యార్థులు సాధారణ పీజీ కోర్సులపై మొగ్గు చూపడం లేదని స్పష్టమవుతోంది. దీంతో రాబోయే రోజులలో యూనివర్సిటీల మనుగడ పశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దోచుకోవడం.. దాచుకోవడం
చిల్లకూరు : రాష్ట్రాభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కూటమి నేతలు ప్రకృతి వనరులను దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. సర్కారు అక్రమంగా పెట్టిన కేసుల్లో చిక్కుకుని విడుదలైన వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, వారి తల్లి శారదమ్మను ఆయన పరామర్శించారు. ఆదివారం ఈ మేరకు చిల్లకూరు మండలం మోమిడి గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట హత్యలు, దాడులు, గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గతంలో సిలికాలో దోపిడీ జరుగుతోందని గగ్గోలు పెట్టారని, ఇప్పుడు ఆయనే కోట మండలం కర్లపూడిలో సిలికా మైన్లు తీసుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. దీన్ని అడ్డుపెట్టుకుని సమీపంలోని ఏపీఐఐసీ భూముల్లో సైతం సిలికాను తవ్వేసి అమ్మేసుకునేందుకు పథకం వేశారని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో తిరుపతి, నెల్లూరు జిల్లాలు గ్రావెల్, మట్టి, సిలికా, ఇసుక దోపిడీకి కేంద్రాలుగా మారినట్టు వెల్లడించారు. నేరుగా ప్రజా ప్రతినిధులే రంగంలోకిదిగి, ఇసుకను తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరిపై అన్యాయంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారన్నారు. అక్రమంగా రౌడీ షీట్ నమోదైన వారు తన వద్దకు గానీ, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల దృష్టికి గానీ తీసుకురావాలని కోరారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీ సుబ్బారాయుడు పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టి, అక్రమ కేసులు బనాయించకుండా చూడాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వైస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేతలు నల్లపరెడ్డి రజిత్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
శ్రీకాళహస్తి : ప్రజలకు వాస్తవాలను తెలిపే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, దాడులు చేయడం, వేధించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు, ప్రసంగాలను సాక్షి దిన పత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చేర్చడం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారి లోపాలను ఎత్తిచూపే పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. అధికారబలం ఉన్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై నా ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ,శ్రీకాళహస్తి -
గవర్నర్కు సాదర స్వాగతం
రేణిగుంట : తిరుపతి పర్యటనలో భాగంగా జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ రద్దు తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ను సోమవారం రద్దు చేసినట్లు డీఆర్ఓ నరసింహులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జాతీయ మహిళా సాధికార సదస్సు నేపథ్యంలో అధికారులందరూ వివిధ విధుల్లో ఉన్న కారణంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉండదని వివరించారు. అర్జీదారులు కలెక్టరేట్, మండల కార్యాలయాలకు వెళ్లవద్దని సూచించారు. అయితే దీనిపై ముందస్తుగానే ప్రజలకు సమాచారం అందించి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏయూఎన్టీఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక తిరుపతి సిటీ : ఏపీ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం ఎంపికై ంది. ఆదివారం అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో కార్యవర్గ ఎన్నిక చేపట్టినట్లు ఎన్నికల అధికారి గుర్రంకొండ శ్రీధర్ తెలిపారు. అధ్యక్షుడిగా ఎస్కే వర్సిటీకి చెందిన తిమ్మప్ప, జనరల్ సెక్రటరీగా ఎస్వీయూకు చెందిన ఎన్.సుబ్రమణ్యం, మీడియా కో–ఆర్డిరేటర్గా ఎస్వీయూకు చెందిన మనోజ్కుమార్ ఎన్నికై నట్లు వెల్లడించారు. తిరుమలలో భద్రతపై స్పెషల్ డ్రైవ్ తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్, హెల్త్, శానిటేషన్, పోలీసులు సంయుక్తంగా ఆదివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కల్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి తిరుపతికి పంపించారు. స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు తమ వద్ద పనిచేసే వారికి తిరుపతిలోనే వసతి కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈఓ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. చైర్మన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠనాథుని ఉత్సవాల్లో భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వాహన సేవలను ప్రతి ఒక్కరూ తిలకించేలా 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సీవీఎస్ఓ మురళీకృష్ణ, సీఈ సత్య నారాయణ, ఈఈ సుబ్రమణ్యం, డిప్యూటీ ఈఓలు లోకనాథం, రాజేంద్ర కుమార్, సోమన్నారాయణ పాల్గొన్నారు. డిగ్రీ సీట్ల కేటాయింపు రేపు తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో పలు కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యామండలి వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను పలు మార్లు వాయిదా వేశారు. ఈ క్రమంలో సోమవారం అధికారికంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపుపై మేసేజ్లు పంపనున్నట్లు తెలిపారు. దీంతో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో మంగళవారం రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కొత్త కార్యవర్గం -
సమానత్వం దిశగా అడుగులు
తిరుపతి అర్బన్ : తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సును తిరుపతిలో నిర్వహించడం శుభసూచికమని, ఇదే స్ఫూర్తితో ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం దిశగా అడుగులు వేద్దామని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. ఆదివారం తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో జాతీయ సదస్సు నిర్వహించారు. మూడురోజులపాటు నిర్వహించనున్న సదస్సులో ముందుగా జాతీయ, రాష్ట్ర గీతం ఆలపించి ప్రారంభించారు. పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షులు పురందేశ్వరి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ మద్దిల గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకసభ స్వీకర్ మాట్లాడుతూ భక్తి, త్యాగం, మహిళా కృషికి తిరుపతి ప్రతీకని తెలిపారు. అందుకే తొలి సమావేశానికి తిరునగరాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వికసిత్ భారత్–2047కి స్వాతంత్రం వచ్చి వందేళ్ల గడుస్తోందన్నారు. భారత్ అభివృద్ధిలో మహిళాశక్తి ప్రాధాన్యతను వివరించారు. అనంతరం రాజసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ తిరుపతి వేదికగా మహిళా సదస్సును నిర్వహించడం విజయానికి నాందిగా భావిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూతిరుపతిలో మహిళా సాధికారత తొలి సదస్సును జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సులో తీసుకోనున్న తీర్మానాల అమలుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరారు. పురంధేశ్వరి మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మహిళలకు సురక్షితత, విద్య, నైపుణ్యాలు, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా చట్టసభ్యులందరినీ ఈ సదస్సు ఏకం చేస్తుందని తెలిపారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం సమాన అవకాశాలు, సురక్షిత సమాజం, గౌరవమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. సాధికారత కమిటీ చైర్పర్సన్ గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా మహిళా సాధికారత విధానాలు తెలుసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి, సవాళ్లపై చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు మాట్లాడుతూ. తిరుపతిలో ఈ సమావేశం నిర్వహించడం చారిత్రాత్మకమైన ఘట్టమని తెలిపారు. చంద్రగిరి కోటలో.. చంద్రగిరి కోట వద్ద ఆదివారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం సదస్సుకు హజరుకానున్నారు. రెండవ రోజు రాహుల్ కన్వన్షెన్లోనే ముగింపు సభ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
పాత్రికేయులను భయపెడుతున్నారు
కాణిపాకం : ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను పత్రికల్లో రాసినందుకే విలేకరులపై ప్రతాపం చూపుతున్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలకంగా పనిచేస్తాయి. ప్రజాపక్షాన నిలబడే పత్రికలపై జులుం ప్రదర్శిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. పాత్రికేయులను భయపెడుతున్నారు. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. నిజాలను వెలుగులోకి తీసుకురావడం ప్రతికల హక్కు. ఆ హక్కును హరించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికలపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో విషసంస్కృతిని తీసుకువస్తున్నారు. విలేకరులకు స్వేచ్ఛ ఇవ్వాలి. లేకుంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. – లలితా థామస్, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు -
17 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు
తిరుపతి తుడా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారీ స్వశక్త్ అభియాన్ కింద మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య రక్షణతోపాటు కుటుంబాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అందులో భాగంగా జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. -
● అడవి మధ్యలో నాలుగు మృతదేహాలు ● ఒకే కుటుంబంగా అనుమానం ● తమిళనాడు వాసులేనా?
పాకాల: ఘటనా స్థలంలో మృతదేహాలు ఉన్న తీరు, పక్కనే రెండు గుంతల్లో మరో రెండు మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు ఉన్న గుంతలు.. వాటిపై గుర్తుగా పెట్టిన రాళ్లు.. వీళ్లు ఒకే కుటుంబమా..? అనే అనుమానం కలుగుతోంది. వీరు నట్టడివిలోకి ఎలా వచ్చారు.. ఎలా మృతిచెందారు అనేదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. లేక ఏదైనా కష్టమొచ్చి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందో తెలియడం లేదు. పాకాల మండలంలో బయటపడిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం.. పాకాల మండల పరిధిలోని పవిత్ర హోటల్ వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పవిత్ర హోటల్ నుంచి సుమారు 3కిలో మీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలానికి సీఐ సుదర్శన్ప్రసాద్ తన సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. అక్కడ ఒక పురుషుడి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. సమీపంలోనే మహిళ మృతదేహం కింద పడి ఉంది. అక్కడే మరో ఇద్దరిని పూడ్చి పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ గుంతలపై గుర్తుగా బండరాళ్లు పెట్టి ఉన్నారు. గుంతలను తవ్వేందుకు ఉపయోగించిన పారను చెట్ల పొదల్లో పడేసి ఉన్నారు. అడవిలో ఏం జరిగింది? పాకాల మండలం శివారు ప్రాంతం అడవిలోని నామాల బండ సమీపం, మూలకుంట వద్ద ఇద్దరి మృతదేహాలతోపాటు చిన్న పిల్లలను గుంతలో పూడ్చి పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో పిల్లల దుస్తులు కనిపించాయి.తమిళనాడు వాసులేనా? మృతదేహాల వద్ద ఓ నోకియో ఫోన్ లభించింది. అలాగే కళై సెల్వన్ పేరు మీదున్న తంజావూరు క్రిస్ ఆస్పత్రి ప్రిస్క్రిప్షన్ లభ్యమైంది. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నయం కాని జబ్బు ఏదైనా బయటపడిందా..? పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలావుండగా మృతదేహాలు దొరికిన ప్రాంతం పాకాల మండల పరిధిలో లేకపోవడంతో కేసును చంద్రగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. -
అడవి మధ్యలో నాలుగు మృతదేహాలు.?
వీళ్లేవరు?..నట్టడివిలోకి ఎలా వచ్చారు..?. ప్రధాన రహదారి నుంచి అరణ్యంలోకి ఎలా చేరుకున్నారు..? పురుషుడికి చెట్టుకు ఉరివేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది...? ఆ పక్కనే ఉన్న మహిళ మృతదేహం ఎవరిది..?. వారికి సమీపంలోనే రెండు మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థితిలో ఉన్న గుంతలేంటి..? వీళ్లంతా ఒకే కుటుంబం వారా..?. ఎవరైనా వీళ్లను ఇక్కడకు తీసుకొచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..?. లేక ఏదైనా కష్టమొచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారా..? పాకాల మండల శివారు.. జాతీయ ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోని చిట్టడవిలో బయటపడిన మృతదేహాలు ఆదివారం కలకలం రేపాయి..తిరుపతి జిల్లా: ఘటనా స్థలంలో మృతదేహాలు ఉన్న తీరు, పక్కనే రెండు గుంతల్లో మరో రెండు మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు ఉన్న గుంతలు.. వాటిపై గుర్తుగా పెట్టిన రాళ్లు.. వీళ్లు ఒకే కుటుంబమా..? అనే అనుమానం కలుగుతోంది. వీరు నట్టడివిలోకి ఎలా వచ్చారు.. ఎలా మృతిచెందారు అనేదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. లేక ఏదైనా కష్టమొచ్చి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందో తెలియడం లేదు. పాకాల మండలంలో బయటపడిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం.. పాకాల మండల పరిధిలోని పవిత్ర హోటల్ వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పవిత్ర హోటల్ నుంచి సుమారు 3కిలో మీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలానికి సీఐ సుదర్శన్ప్రసాద్ తన సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. అక్కడ ఒక పురుషుడి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. సమీపంలోనే మహిళ మృతదేహం కింద పడి ఉంది. అక్కడే మరో ఇద్దరిని పూడ్చి పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ గుంతలపై గుర్తుగా బండరాళ్లు పెట్టి ఉన్నారు. గుంతలను తవ్వేందుకు ఉపయోగించిన పారను చెట్ల పొదల్లో పడేసి ఉన్నారు. అడవిలో ఏం జరిగింది? పాకాల మండలం శివారు ప్రాంతం అడవిలోని నామాల బండ సమీపం, మూలకుంట వద్ద ఇద్దరి మృతదేహాలతోపాటు చిన్న పిల్లలను గుంతలో పూడ్చి పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో పిల్లల దుస్తులు కనిపించాయి.తమిళనాడు వాసులేనా? మృతదేహాల వద్ద ఓ నోకియో ఫోన్ లభించింది. అలాగే కళై సెల్వన్ పేరు మీదున్న తంజావూరు క్రిస్ ఆస్పత్రి ప్రి్రస్కిప్షన్ లభ్యమైంది. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నయం కాని జబ్బు ఏదైనా బయటపడిందా..? పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలావుండగా మృతదేహాలు దొరికిన ప్రాంతం పాకాల మండల పరిధిలో లేకపోవడంతో కేసును చంద్రగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. -
అడవిలో మృత్యు ఘోష
పాకాల: ఆ అడవిలో ఏం జరిగింది..? పదిహేను రోజుల క్రితం చనిపోయినట్టుగా కనిపిస్తున్న ఆ మృతదేహాలు ఎవరివి..? ఆ అడవిలోకి ఎందుకెళ్లారు.? ఆత్మహత్య చేసుకునేందుకా ? లేక ఎవరైనా వారిని కిడ్నాప్ చేసి అక్కడకు తీసుకొచ్చి చంపేశారా..? అసలు ఏం జరిగింది..? గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్న ఆ మృత దేహాలు ఎవరివి..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. తిరుపతిజిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని గాదంకి టోల్ ప్లాజా వద్ద ఉన్న స్టార్ హోటల్ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో నాలుగు మృత దేహాలను ఆదివారం స్థానికులు గుర్తించారు. ఒక ఆడ, ఒక మగ మృత దేహాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. మరో రెండు గుంతలు తీసి ఏదో పూడ్చినట్టుగా దానిపై రాళ్లు పెట్టడాన్ని గుర్తించారు. బహుశా ఇద్దరు పిల్లలనూ చంపి ఆ గుంతల్లో పూడ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ కుటుంబం ఎక్కడిది..? ఎందుకు అక్కడకు వచ్చింది ? ఆత్మహత్య చేసుకున్నారా ? హత్యకు గురయ్యారా..? అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. చీకటిపడటంతో పోలీసులు పూడ్చిన మృతదేహాలను వెలికితీయలేకపోయారు. జాతీయ రహదారికి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో మృతదేహాలు బయటపడడం పోలీసుల్లో కలవరం రేపింది. మృత దేహాలు కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ముందుగా మృతి చెందిన వారు ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉలిక్కిపడిన పరిసర గ్రామాల ప్రజలు అడవిలో ఒక చెట్టుకు మగ వ్యక్తి మృత దేహం వేలాడుతుండగా, ఆ చెట్టు కిందనే మహిళ మృత దేహం పడుంది. ఆ మృత దేహాలకు సమీపంలోనే రెండు గొయ్యిలు కనిపిస్తుండడం, ఆ గొయ్యిలపై రాళ్లు పెట్టి ఉండటంతో అందులో కూడా మృతదేహాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో మృత దేహాలు బయటపడడంతో ఉలిక్కిపడ్డ పరిసర గ్రామాల ప్రజలు ఘటనా స్థలికి చేరుకుని అయ్యోపాపం..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణ సాగుతోంది ఇలా.. అడవిలో మృత దేహాలు ఎవరివన్న కోణంలో పోలీసులు ముందుగా దర్యాప్తు ప్రారంభించారు. గాదంకి టోల్ప్లాజా వద్ద అనుమానంగా తిరుగుతున్న వారి చిత్రాలు, అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారులకు ఆనుకుని ఉన్న హోటళ్ల వద్దనున్న సీసీ పుటేజీలు, అడవిలో దొరికిన మృత దేహాల వద్ద కనిపించే దుస్తుల రంగులను ఆధారంగా చేసుకుని పరిశీలన చేస్తున్నారు. ముందుగా మృత దేహాలను గుర్తిస్తే ఆ తరువాత మరణానికి గల కారణాలను తెలుసుకోవచ్చన్న కోణంలో పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు తమిళనాడువాసులు!ఘటనా స్థలంలో పోలీసులకు ఒక నోకియా ఫోన్, కళై సెల్వన్ పేరుమీద ఉన్న తంజావూరు క్రిస్ ఆసుపత్రి ప్రి్రస్కిప్షన్ లభించింది. దీంతో మరణించినవారు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. -
తిరుపతిలో నాలుగు మృతదేహాల కలకలం
సాక్షి,చిత్తూరు: తిరుపతిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలోని పాకాల మండలం పాకాలవారిపల్లిలోని నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ జంటతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను అటవీప్రాంతంలో పశువుల కాపరులు గుర్తించారు. భయాందోళనకు గురైన పశువుల కాపరులు మృతదేహాలపై పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి పంపించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు సమీపంలో మద్యం బాటిళ్లు, మాత్రలు,దస్తులు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భారత యువత ప్రపంచాన్ని శాసిస్తోంది
తిరుపతి సిటీ : భారత దేశంలో యువత ఆధునిక సాంకేతి విజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటూ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదుగుతోందని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సతీష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఇన్స్పైరింగ్ మైండ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల నుద్ధేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగడం గర్వకారణమన్నారు. దేశంలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, దీంతో ప్రతి ఏడు 15 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వివిధ కళాశాల నుంచి పట్టాలు పొంది ఉన్నత స్థాయిలో 90శాతం మంది ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. అతిపెద్ద ఆర్థిక దేశంగా రాబోయే రోజుల్లో ప్రపంచం ముందు భారతదేశం ఆవిష్కృతం కానుందని చెప్పారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆలోచన శక్తి పెంచుకోవాలన్నారు. సమయం చాలా విలువైనదని, ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకుని ఆ దిశగా విద్యార్థులు శ్రమించాలన్నారు. అనంతరం డాక్టర్ సతీష్ రెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతే కీలకమని పార్టీ అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం అన్నమయ్య, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను యువత ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇంత వరకు ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజా సంక్షేమం, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమ, పోరాటాలు చేపట్టాలని యువతకు భూమన అభినయ్రెడ్డి సూచించారు. యువతకు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తానని కూటమి ప్రభుత్వం యువతను దారుణంగా మోసగించిందన్నారు. యువతను మోసగించిన కూటమి ప్రభుత్వానికి యువతే బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, శివ (అన్నమయ్య జిల్లా), నాగార్జున (నెల్లూరు జిల్లా), పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు దినేష్రాయల్, మైనార్టీ విభాగం నాయకులు షేక్ ఇమ్రాన్బాషా పాల్గొన్నారు. -
వైఫల్యాల ‘జాతర’
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరలో ఆది నుంచి అన్నీ తప్పిదాలతో ముగిసింది. అమ్మవారి జాతర ప్రధాన ఘట్టాలైన జాతర అనుమతి (తాంబులం స్వీకరణ) నుంచి జాతర ముగిసే వరకు అడుగడుగునా వైఫల్యాలతో జన జాతర రాజకీయ జాతరగా ముగిసింది. 2023వ సంవత్సరంలో రాష్ట్ర పండుగగా ప్రకటించిన జాతరను అప్పటి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పర్యవేక్షణలో జాతరను ఐదు రోజుల పండుగలా హంగులు, ఆర్భాటాలతో నిర్వహించారు. రెండేళ్లుగా జరుగుతున్న పోలేరమ్మతల్లి జాతరలో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం గగనమైంది. ఈ ఏడాది ప్రత్యేకంగా కూటమి నేతల కనుసన్నల్లో జాతర నిర్వహణ జరగడంతో రాజకీయ జాతరగా మిగిలిపోయింది. -
నేడు, రేపు మహిళా సాధికారిత సదస్సు
తిరుపతి అర్బన్ : మహిళల సాధికారత అంశాన్ని అజెండాగా చేసుకుని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని వేదికగా తీసుకుని దేశస్థాయి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లోకసభ స్పీకర్ ఓంబిర్లా ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సమావేశాన్ని ఆది, సోమవారం జరుపుకోనున్నారు. సదస్సు ముఖ్య ఉద్దేశ్యం వికసిత్ భారత్లో భాగంగా మహిళలు సైతం డిజిటల్ దిశగా అడుగులు వేయడానికి, క్వాంటమ్ కంప్యూటరింగ్, బయో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ, వ్యాపార రంగాల్లో మహిళల పాత్ర తదితర సెక్టార్లకు సంబంధించి చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం సదస్సును విజయవంతం చేయడానికి రెండు రోజులుగా శ్రమిస్తోంది. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు, జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు తదితరులు లైజన్, నోడల్ అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ సదస్సును జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. నేడు ముఖ్య అతిథులు రాక ఆదివారం ఉదయం 10 గంటలకు తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్కు పలువురు వీఐపీలు రానున్నారు. సదస్సుకు సంబంధించి రెండు రోజుల పాటు రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రగిరి కోటను సందర్శించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో పాటు లోకసభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాష్ట్ర శాసనసభ స్వీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణంరాజు, లోకసభ కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి, రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ చరితారెడ్డి, పలువురు ఐఏఎస్ సీనియర్ అధికారులు ఆదివారం హాజరు కానున్నారు. అలాగే సోమవారం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు.సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీలకు పాస్లు నిలుపుదల జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ మహిళా సదస్సు కార్యక్రమానికి మీడియాకు సమాచారశాఖ వారు ఆహ్వానం పలికారు. అయితే దేశ స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో సమాచారశాఖ నుంచి పాస్లు జారీ చేసిన వారు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీలకు చెందిన రిపోర్టర్లకు పాస్లను ఇవ్వడం లేదని సమాచారశాఖ జిల్లా అధికారి గురుస్వామి శెట్టి స్పష్టం చేశారు. -
లోకసభ స్పీకర్కు ఘన స్వాగతం
ఏర్పేడు : తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు ఘనస్వాగతం లభించింది. ఆయనకు విమానాశ్రయంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గురజాల జగన్మోహన్, వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా!
కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. పత్రికల్లో నిజాలు రాస్తే ఉలిక్కి పడుతోంది. రాసిన వార్తల్లో నిజాలున్నపుడు దాన్ని సవరించుకుని పాలన సాగించాల్సింది పోయి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా! ఇదేనా ప్రజాస్వామ్యం.. ఇదేనా ప్రతికలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే స్వేచ్ఛ..భారత రాజ్యాంగంలో నాలుగో స్థంభంగా ఉన్న పత్రికా వ్యవస్థ కూడా మీ స్వాధీనంలో పని చేయాలా! రాజ్యాంగ వ్యవస్థను కాలరాసే విధంగా ప్రవర్తించడం చూస్తుంటే రాజ్యాంగం మీద వీళ్లకు గౌరవం లేకుండా పోయింది. వీళ్లు రచించుకున్న రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్నారు. ప్రకృతి సంపదలైన ఇసుక, మట్టి, గ్రావెల్ దందాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లను ప్రశ్నిస్తే దొంగ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వార్తలను రాసిన విలేఖరులపై అక్రమంగా కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. – కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే, సూళ్లూరుపేట -
తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమల : తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో తప్పిపోయిన వారిని గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామరా్థ్య్న్ని పెంచాలని సూచించారు. రియల్ టైమ్లో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. అనంతరం ఈవో లగేజీ కౌంటర్ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ –2 కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేపు బ్రహ్మర్షి ఆశ్రమానికి మారిషష్ ప్రధాని రామచంద్రాపురం : మండలంలోని శ్రీ సిద్ధేశ్వర బ్రహ్మర్షి ఆశ్రమాన్ని మారిష్ ప్రధాని సందర్శించనున్నారు. సోమవారం సిద్ధగురువర్ శ్రీ సిద్ధేశ్వర బ్రహ్మర్షి గురుదేవుల దివ్య ఆశీస్సులు పొందునున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. విదేశీ ప్రధాని రాకతో శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రత్యేక పోలీస్ నిఘా వర్గాలతో కలిసి ఆశ్రమంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. -
అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్తో పాటు ఇతర అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజ స్థంభం వద్ద మొక్కుకుని, అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపుల కేంద్ర మంత్రికి, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవేరుల చిత్రపటాన్ని అందజేసి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డితో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రశ్నించే గళంపై ప్రతీకారం
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోంది. చంద్రబాబుకు వ్యవస్థలను తన చేతుల్లోకి తీసుకుని ప్రశ్నించే గళంపై ప్రతీకారం తీర్చుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ సమస్యలను ఎత్తిచూపుతూ వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న మీడియాపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. ప్రజలు హర్షించరు. ప్రభుత్వ వైఫల్యాలను సాక్షి పత్రిక ఎత్తిచూపుతోందని ఎడిటర్పై, విలేకరులపై అక్రమ కేసులు నమోదు చేసి కక్ష సాధింపు చర్యలకు దిగజారడం నీచ సంస్కృతికి నిదర్శనం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు దేశచరిత్రలో గతంలో చూడలేదు. సాక్షి పత్రికపై పక్షపాత ధోరణితో కేసులు బనాయించి, పోలీసులతో దాడులు చేయించి భయబ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదు. – భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు -
తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడు
సాక్షి, విజయవాడ: తాజా బదిలీల్లో తిరుపతి ఎస్పీగా మళ్ళీ సుబ్బారాయుడిని చంద్రబాబు సర్కార్ నియమించింది. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతిలో భక్తుల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుడిని చేసిన ప్రభుత్వం.. గతంలో బదిలీ చేసింది.జనవరి 9న వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట సమయంలో ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడికి మళ్లీ అదే పోస్టింగ్ను సీఎం చంద్రబాబు ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడి పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తిరుపతి కోసం సుబ్బారాయుడిని మళ్లీ ఏపీకి తెచ్చిన చంద్రబాబు.. హిందు భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా రీపోస్టింగ్ ఇచ్చారు.కాగా, తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు.భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్కు చెందిన ఆయన్ని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే గతంలో డిప్యుటేషన్పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి తెర తీశారనే విమర్శలూ ఉన్నాయి. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. మళ్లీ ఆయనకు తిరుపతి ఎస్పీగా రీ పోస్టింగ్ ఇచ్చారు. -
గరుడ ఫ్లైఓవర్పై ప్రమాదం.. మోహన్ బాబు వర్సిటీ విద్యార్థి మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని గరుడ వారధి ఫ్లైఓవర్పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న చక్రధర్, వేదాంత్ ఇద్దరూ బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి.. డివైడర్ను ఢీకొట్టింది. దీంతో, విద్యార్థి చక్రధర్(19) అక్కడికక్కడే మృతి చెందగా.. వేదాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న తిరుమల ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరినీ రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు. -
శ్రీవారి హుండీ నుంచి రూ.4వేలు చోరీ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న స్టీల్ హుండీలో బుధవారం రాత్రి రూ.4వేలు దొంగతనం జరిగింది. దీన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ విభాగం సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు. నేరస్తుడు తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలికి చెందిన వేణుగా గుర్తించారు. నిందితుడు గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ చోరీపై తిరుమల వన్టౌన్ పీఎస్లో కేసు నమోదు చేశారు. -
పట్టాభూమినే కొట్టేశారు!
కేవీబీపురం : కేవీబీపురం రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలైంది. వేరొకరి నుంచి కొనుగోలు చేసి, సుమారు 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పట్టా భూమిని రెవెన్యూ అధికారులు ఆ రైతుకు తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేతకు ఆన్లైన్లో హక్కు కల్పించారు. అది కూడా కేవలం 42 రోజుల వ్యవధిలోనే ఇవ్వడం గమనార్హం. ఇది మొత్తం వీఆర్ఓ , తహసీల్దార్ చేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రమణయ్య నాయుడు అదే గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 15లో సుమారు 1.2 ఎకరాల వ్యవసాయ భూమిలో కొంత కొనుగోలు, కొంత వారసత్వం ద్వారా పొందాడు. ఇదే భూమిలో సుమారు 35 ఏళ్లుగా సాగులో ఉన్నాడు. అయితే ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఓ టీడీపీ నేత ఆ భూమిని కాజేసేందుకు పావులు కదిపాడు. స్థానిక వీఆర్ఓ అందుకు సహకరించడంతో పాసు పుస్తకం కలిగి ఉన్న లబ్ధిదారుడికి తెలియకుండానే వీఆర్ఓ ఆయా సర్వే నంబర్లకు తహసీల్దార్ కార్యాలయం నుంచే మ్యుటేషన్ కట్టించి, మండల ఆర్ఐల ప్రమేయం లేకుండానే తహసీల్దార్కు ఫైల్ అందించారు. దీంతో కేవలం రోజుల వ్యవధిలోనే రమణయ్యనాయుడు భూమిని శ్రీనివాసుల నాయుడు పేరుపైకి మార్చేశారు. ఇదే భూమిపై రమణయ్య క్రాప్ లోన్ కలిగి ఉండడంతో బ్యాంకుకు వెళ్లడంతో ఈ బాగోతం బయటపడింది. దీనిపై మండల అధికారులను కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరించారు. అయినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తుండడంతో బాధిత రైతు మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. -
ఇసుక దోపిడీ ?
హెరిటేజ్ పేరుతో సాక్షి, టాస్క్ఫోర్స్ : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని, అనధికారికంగా ఇసుక తరలింపును అరికట్టామంటూ ఉదరకొట్టే సీఎం చంద్రబాబు..హెరిటేజ్ ఫ్యాక్టరీకి అక్రమంగా ఇసుకను తరలించడం చంద్రగిరి మండలంలో చర్చనీయాంశంగా మారింది. వారం రోజులుగా నిరంతరాయంగా భారీ యంత్రాలతో స్వర్ణముఖినదిని తోడేస్తూ వందల ట్రిప్పుల ఇసుకను తరలించేస్తు న్నారు. స్థానికంగా ఉండే ఓ టీడీపీ నేత అక్రమ రవాణా చేస్తుండడపై రైతులు మండిపడుతున్నారు. స్థానిక రైతుల వివరాల మేరకు ఇలా... చంద్రగిరి మండల పరిధిలోని కాశిపెంట్ల పంచాయతీ మొరవపల్లి స్వర్ణముఖినది పరివాహక ప్రాంతం ఉంది. వారం రోజులుగా సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫ్యాక్టరీ పేరుతో పలు సివిల్ పనులు జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. సివిల్ పనులకు అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు స్థానికంగా ఉండే ఓ టీడీపీ నేత ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా రైతులు చెబుతున్నారు. తొలుత బోడంబాయి సమీపంలోని స్వర్ణముఖినది నుంచి భారీగా ఇసుకను తరలించేశారు. అనంతరం అక్కడ నుంచి వారం రోజులుగా మొరవపల్లి వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలోని ఇసుకను హిటాచీ సాయంతో ఇసుకను తోడేసి, తన పొలంలో అక్రమంగా డంపింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం స్థానిక రైతులకు చెందిన పంట పొలాలకు ఆనుకుని ఇసుకను తోడేయడంతో అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. తమ పంట పొలాలు దెబ్బతింటాయని, ఇసుక అక్రమ రవాణాను ఆపాలని లేకుంటే తమ పొలాలు వరదల సమయంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్జాగా డంపు చేసి.. సీఎం చంద్రబాబు సొంత మండలంలో భారీగా ఇసుక దోపిడీ జరుగుతుండడంపై రైతులు మండిపడుతున్నారు. పొలంలో ఇసుకను డంపు చేసి అక్కడ నుంచి టిప్పర్ల ద్వారా హెరిటేజ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని, ఇందు కోసం ఒక్కో టిప్పర్ ఇసుకను రూ.25 వేలకు విక్రయిస్తున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపామంటూనే, ఇలా హెరిటేజ్ ఫ్యాక్టరీ పేరుతో తెల్లబంగారాన్ని దోచేయడం ఏమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వందల టిప్పర్ల ఇసుకను తరలించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.కోటి రూపాయల విలువైన ఇసుకను డంపు చేశారని, హెరిటేజ్ ఫ్యాక్టరీ పేరుతో ఇతర ప్రాంతాలకు సైతం ఇసుకను రవాణా చేస్తూ రూ.కోట్లు వెనుకేసుకుంటున్నట్లుగా ఆరోపిస్తున్నారు.చోద్యం చూస్తున్న అధికారులుహెరిటేజ్ ఫ్యాక్టరీ పేరుతో అక్రమంగా కోట్ల రూపాయల విలువైన తెల్ల బంగారాన్ని దోచుకెళ్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూడటంపై ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలతో వరదలు వస్తే తమ పొలాలకు ముంపు తప్పదని ఆందోళన చెందుతున్నారు. – ఇసుక దోపిడీపై తహసీల్దార్ శివరామ సుబ్బయ్యను వివరణ కోరగా..టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా తమ దృష్టికి రాలేదని, వెంటనే సిబ్బందిని పంపించి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
శ్రీవారి సేవకుల సేవలు అమోఘం
●తిరుమల : తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో శుక్రవారం ఆమె అన్న ప్రసాదం స్వీకరించారు. ముందుగా అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర యల్లా, భానుప్రకాష్ రెడ్డి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆమె భోజనశాల వద్దకు చేరుకుని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం ఆమె టీటీడీ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇతర భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించడం హృదయానికి హత్తుకుందని పేర్కొన్నారు. అనంతరం ఆమె భక్తులతో ముచ్చటించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రూ.1500 ధర తగ్గిన 1010 వరి ధాన్యం
చిట్టమూరు : వర్షం కారణంగా మిల్లర్లు సిండికేట్ కావడంతో ఎండగారులో వరి ధాన్యం రెండు రోజుల్లో పుట్టి (1260 కేజీలు) రూ.1500 ధర తగ్గించి దళారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వరకు పుట్టి రూ15,500 ఉండగా శుక్రవారం రూ.14 వేలకు రైతుల వద్ద నుంచి ధాన్యం కొంటున్నారని వాపోయారు. ధాన్యం నిల్వ ఉంచుకోలేక దళారులు చెప్పిన రేటుకు అమ్ముకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. గంగ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి డక్కిలి : కండలేరు–పూండి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి చెందిన సంఘటన డక్కి లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. గూడూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామానికి చెందిన తిరుపతి మస్తాన్ (40), సమీప బంధువు బాలాజీ ఇద్దరు కలిసి గురువారం వెంకటగిరిలో జరిగిన పోలేరమ్మ జాతరకు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి డక్కిలి మండలం డీ వడ్డిపల్లి గ్రామంలో బంధువులు వద్దకు వెళ్లేందుకు వచ్చారు. డక్కిలిలోని మద్యం తీసుకుని తెలుగు గంగ కాలువ వద్దకు చేరుకుని ఇద్దరు మద్యం తాగారు. అయితే గంగ కాలువలో సరదాగా ఈత కోసం కాలువలోకి దిగారు. మస్తాన్కు ఈత రాకపోవడంతో గట్టు మీద కూర్చోగా బాలాజీ కాలువలోకి ఈత కొట్టేందుకు దూకాడు. వెంటనే మస్తాన్ కూడా కాలువలోకి ఒక్కసారిగా దూకేయడంతో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ డక్కిలి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు, స్థానికులు గల్లంతైన మస్తాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం ఆల్తూరుపాడు గ్రామం వైపు వెళ్లే దగ్గర గంగ కాలువలో మృతదేహం లభ్యం అయింది. ఈ మేరకు డక్కిలి ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
సదస్సు విజయవంతం చేద్దాం
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జిల్లాలో మహిళా సాధికారిత జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం..జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాల్సి ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శుభం బన్స ల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సదస్సు డ్యూటీలకు వచ్చే ఉద్యోగులు సంప్రదాయబద్ధమైన దుస్తులను దరించిన రావాలని స్పష్టం చేశారు. ఆది, సోమవారాలు(14,15 తేదీల్లో) రెండు రోజుల పాటు సదస్సు ఉంటుందని వెల్లడించారు. తిరుచానూరు రాహుల్ కన్వెన్షన్ హాల్ నుంచి సీటింగ్, స్టేజ్ తదితర ఏర్పాట్లు ఓ క్రమ పద్ధతిలో ఉండేలా లోకసభ సెక్రటరీ బృందం తనిఖీ చేస్తుందని చెప్పారు. అలాగే చంద్రగిరికోట వద్ద అతిథులకు ఆతిథ్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్, లోకసభ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, పలువురు ప్రముఖులు రానున్నారని స్పష్టం చేశారు. మరోవైపు పోలీసు శాఖ నుంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చూసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, లైజన్ అధికారులు పాల్గొన్నారు. ఎస్పీతో కలిసి కలెక్టర్ సమీక్ష కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలిసి కలెక్టర్ పోలీసులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి వీఐపీలు బస చేస్తున్న హోటల్స్ వరకే కాకుండా సమావేశం కానున్న తిరుచానూరు రాహు ల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద, అలాగే చంద్రగిరి కోట వద్ద చేపట్టాల్సిన భద్రాతా అంశాలపై చర్చించారు. -
మస్టర్ల మాయాజాలంపై విచారణ
డక్కిలి : స్థానిక పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి పథకం పనుల్లో గోల్మాల్ వ్యవహారంపై శుక్రవారం స్థానిక సచివాలయంలో క్లస్టర్ ఏపీడీ వరప్రసాద్ విచారణ చేపట్టారు. ఈనెల 9వ తేదీన శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో శ్రీమస్టర్లలో మాయాజాలంశ్రీ అనే శీర్షికతో ప్రచురితమైంది. దీంతో డ్వామా పీడీ ఆదేశాలు మేరకు శుక్రవారం ఏపీడీ ఉపాధిహామీ పథకం సిబ్బందితో విచారణ చేపట్టారు. అంతే గాక స్థానికంగా అందుబాటులో ఉన్న మస్టర్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ విలేకర్లతో మాట్లాడుతూ.. డక్కిలిలో ఈనెల 4వ తేదీన 8 మంది కూలీలకు తప్పుడు మస్టర్లుగా వేసినట్లు గుర్తించామన్నారు. ఆ కూలీలు పనులకు హాజరు కాకపోయినా వారి ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు వెల్లడైందన్నారు. ఈ విచారణ నివేదికను కలెక్టర్, డ్వామా పీడీకి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ అనురాధ, ఏపీఓ కుమారస్వామి, టీఏ గిరి ఉన్నారు. డక్కిలి ఉపాధి మేట్ అవినీతి అక్రమాల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డక్కిలి గ్రామ వైఎస్సార్సీపీ నేత మాదిరెడ్డి మునిరామ్రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డక్కిలి గ్రామానికి ఉపాధి హామీ మేట్ రూ. 2లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. అయితే శుక్రవారం ఏపీడీ విచారణ జరిపి 8 మంది మాత్రమే కూలీ పనులకు రాని వారని మస్టర్లులో ఎక్కించినట్లు తెలిపారన్నారు. వాస్తవానికి 20 మందికి పైగా కూలీలు ఎన్నో రోజులు నుంచి మస్టర్లు ఎక్కించుకుని ఉపాధి నిధులను బొక్కేశారని తెలిపారు. -
ఎర్ర చందనం కేసులో ఇద్దరికి జైలు
తిరుపతి లీగల్ : అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి, ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్ర చందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజిన్ ఆఫీసర్ రాజేష్ , కడప ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. 2019 ఆగస్టు 29వ తేదీ పోరుమామిళ్ల రేంజ్ , మల్లేపల్లి సెక్షన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, సిబ్బంది నిచ్చనిండ్ల అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలం లింగాల దీన్నేపల్లికి చెందిన కప్పల రమేష్ , మల్లేపల్లికు చెందిన కోనేటి గురు ప్రసాద్ అలియాస్ దుబ్బోడు తదితరులు అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్ర చందనం చెట్లను నరికి దుంగలుగా మార్చి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొంతమంది అక్కడినుంచి పరారయ్యారు. ఆ ఇద్దరిని ఫారెస్ట్ సిబ్బంది విచారించగా ముదిరెడ్డిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలను దాచిపెట్టినట్టు అంగీకరించారన్నారు. ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా 997 కిలోల 18 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను ఫారెస్ట్ సిబ్బంది అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం ఇద్దరిపై రుజువు కావడంతో ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
పోలేరమ్మ తల్లి హుండీ ఆదాయం రూ. 22,21,350
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్ధానం హుండీ రాబడి రూ. 22,21,350 రాబడి వచ్చినట్లు ఈఓ వెంకట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ.. గతనెల 19వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు సంబంధించి 25 రోజులకు సంబంఽధించి అమ్మవారి హుండీ శుక్రవారం నిర్వహించామన్నారు. ఇందులో రూ.22,21,350 నగదు, యూఎస్ డాలర్లు 5, బంగారం 1,852 గ్రాములు, వెండి 37 గ్రాములు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సుధీర్, జాతర సేవా కమిటీ సభ్యులు , బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. డీఎఫ్ఓల బదిలీ తిరుపతి మంగళం: తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్వో జీ.శ్రీనివాసులు సత్యసాయి జిల్లా డీఎఫ్ఓగా బదిలీ అయ్యారు. అలాగే తిరుపతిలో ఖాళీగా ఉన్న డీఎఫ్ఓ స్థానంలోకి జిన్.పవన్కుమార్ రావును నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
లోక్సభ స్పీకర్ ఆలోచనతో శ్రీకారం
చంద్రగిరి : లోక్సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఏపీ శాసన సభ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ తెలిపారు. తిరుపతిలో ఈనెల 14,15 న మహిళా సాధికారతపై పార్లమెంటు, శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహణపై చంద్రగిరి సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఆయన పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాల్లోని సమస్యలపై చర్చించకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఒకే వేదికపై చర్చించుకునేలా లోక్సభ స్పీకర్ ఈ ఏడాది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. లోక్సభ మార్గదర్శకత్వంలో రెండు రోజుల పాటు సభలు నిర్వహించడం జరుగుతుందని, లోక్ సభ స్పీకర్ స్వయంగా ప్రారంభ సమావేశానికి, ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. మొదటి రోజు హాజరుకానున్న లోక్సభ స్పీకర్ మొదటి రోజు 14వ తేదీన ఉదయం 10:30 గంటలకు రాహుల్ కన్వెన్షన్ హాల్లో సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు , రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, రాష్ట్ర మంత్రులు, లోక సభ కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి, రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి వేదిక పైనుంచి ప్రారంభ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేస్తారన్నారు. 15న ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరుకానున్నట్లు తెలిపారు. -
అనుమతి ఎక్కడో?
కాలేజీ ఇక్కడ.. జిల్లాలోని జూనియర్ కళాశాలల వివరాలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 109 ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 5,475 అనుమతులు ఉన్న కళాశాలలు 77 అనుమతి లేకుండా బ్రాంచీల పేరుతో నడుస్తున్న కళాశాలలు 32 అనుమతుల లేని కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 21 వేలు నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కలిగిన కళాశాలలు 35 ల్యాబ్లు, క్రీడా మైదానాలు లేని కళాశాలలు 97 జిల్లాలో అనుమతి లేని ప్రైవేటు కళాశాలలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. అనుమతి ఒకచోట తీసుకొని..చదువు ఒక చోట ..నిర్వహణ మరోచోట చేస్తూ కొన్ని ప్రైవేటు కళాశాలలు దందా సాగిస్తున్నాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లతో ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులను బురిడీ కొట్టించి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ఇంటర్ మీడియట్ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. నిబంధనలు లేకున్నా అనుమతులు ఇచ్చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుండడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ ప్రలోభాలతో అధికారులను లొంగదీసుకుని వారికి అవసరమైన అనుమతులను పొందుతున్నారు. ఇందులో ప్రధానంగా తిరుపతి నగరంలో ప్రైవేటు యాజమాన్యాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి వారు ఆదేశించిన ప్రకారం అధికారులు తలవంచేలా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కొన్ని కళాశాలకు అనుమతులు ఒక చోట పొంది మరొక చోట తరగతులు చెబుతున్నారు. అలాగే అనుమతి ఒక కళాశాల పొంది రెండు, మూడు బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ తతంగం సాగుతున్న విషయం ఇంటర్మీడియట్ అధికారులకు తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనుమతి లేని ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. మంత్రి కళాశాలలు నిబంధనలకు చెల్లుచీటీ జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటర్ కళాశాలలను అనుమతి లేకుండా నడుపుతున్నారని విద్యార్థి సంఘాలు, మేథావులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారపార్టీకి చెందిన ఓ మంత్రికి చెందిన కళాశాలలు తిరుపతి జిల్లాలో అనుమతి పొందినవి కేవలం 4 మాత్రమే. కానీ బ్రాంచీల పేరుతో నడుపుతున్న కళాశాలలు సుమారు 11 వరకు ఉన్నాయని విద్యార్థి సంఘాలు అధికారులకు విన్నవించాయి. కానీ ఇంటర్ విద్యాశాఖాధికారులు మంత్రి కళాశాలలపై కన్నెత్తి చూడకపోవడం దారుణం. కళాశాల బ్రాండ్ పేరుతో ఒక చోట అనుమతి పొంది అదే అనుమతులతో సుమారు 3 నుంచి 4 బ్రాంచ్లను నడుపుతూ వ్యాపారం చేసుకుంటున్నా అధికారులు అటు వైపు చూసిన దాఖలాలు లేవు ఇరుకై న అపార్ట్మెంట్లలో తరగతులు జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కళాశాలకు సైతం పూర్తి స్థాయి మౌలిక వసతులు లేకపోవడం దారుణం. ఇంటర్ విద్యామండలి నింబధనల ప్రకారం విశాలంగా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా తరగతి గదులు ఉండాలి. కానీ జనవాసాల మధ్య ఇరుకై న అపార్ట్మెంట్లనే తరగతి గదులుగా చూపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు అపార్ట్మెంట్లలో నిర్వహించే కళాశాలలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జూనియర్ కళాశాల అనుమతులు పొందాలంటే 8 వేల చదరపు అడుగులు స్లాబ్ ఏరియా కచ్చితంగా ఉండాలి. అలాంటి నిర్మాణానికి అనుమతులు ఉండాలంటే స్థానిక పాలన నియమాల ప్రకారం సెట్ బ్యాక్ కింద కాంపౌండ్ వాల్, ఫ్రంట్ స్పేస్, వెంటిలేషన్ కింద స్థలం వదలాల్సి ఉంటుంది. విద్యార్థులకు, అధ్యాపకులకు పార్కింగ్ స్థలం చూపాలి. వీటన్నింటికి మించి ఫైర్ ఇంజిన్ ఏర్పాట్లు, ప్రమాదాన్ని నివారించే వెసులుబాటు ముఖ్యంగా ఉండాలి. ఇలాంటి నిబంధనలు కేవలం తూతూమంత్రంగా చూపిస్తూ మామూళ్లు ముట్టజెప్పి అనుమతులు పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 5 శాతం కళాశాలలు సైతం గ్రౌండ్ (క్రీడామైదానం) లేని దుస్థితి నెలకొంది. అయినప్పటికీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు పురపాలక పరిధిలో రెండెకరాలు, కార్పొరేషన్ పరిధిలో ఒక ఎకరా కనీస ప్లే గ్రౌండ్ చూపించాలి. ఆ స్థాయి స్థలం విలువ లక్ష లు, కోట్లల్లో ఉండేటప్పటికీ స్థలం ఉన్న భూ యజమానిని తమ సొసైటీలో సభ్యుడిగా చూపించి, సదరు వ్యక్తి స్థలాన్ని ప్లే గ్రౌండ్ గా చూపిస్తుండటం ప్రైవేట్ కళాశాలల తెలివి తేటలకు నిదర్శనం.ఇవ న్నీ అధికారులకు తెలిసినా అనుమతులు ఇచ్చేస్తున్నారు. -
మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి వైఎస్సార్ కడపకు బదిలీ
తిరుపతి అర్బన్ : మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్ వైఎస్సార్ కడప జిలా ఉద్యానశాఖ డిప్యూ టీ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఆయన మూడేళ్లుగా మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారిగా పనిచేశారు. అలాగే విజయనగరంలో పనిచేస్తున్న చిన్నరెడ్డెప్పను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారంలో సతీష్ జిల్లా నుంచి రిలీవ్ కానున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్ మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వర కు 66,312 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,728 మంది తలనీలా లు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమ ర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తుల కు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శ నం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. డిగ్రీ అడ్మిషన్ల గందరగోళానికి తెర తిరుపతి సిటీ : డిగ్రీ అడ్మిషన్ల విషయంలో ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు, అధ్యాపకులను గందరగోళానికి గురి చేసిన ఉన్నత విద్యామండలి అధికారులు ఎట్టకేలకు సందిగ్ధానికి తెర దించారు. శనివారం సాయంత్రం వరకు ఇప్పటికే ఓఏఎమ్డీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ధ్రువీకరణ పత్రాల సమర్పణలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. ఆదివారం విద్యార్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించి విద్యార్థుల మొబైల్స్కు మెసేజ్లు పంపించనున్నట్లు కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందించారు. సీట్లు సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలలో సోమవారం రిపోర్టు చేసి అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 17న తడలో జాబ్మేళా తిరుపతి అర్బన్ : ఈనెల 17న తడలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీసిటితో పాటు తిరుపతి, చైన్నె ప్రాంతాల్లో ఉద్యోగాల ఎంపికకు ఈమేళా జరుగుతోందని చెప్పారు. పదో తరగతితో పాటు ఆ పైన చదువుకున్న విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు నైపుణ్యం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 91216 46661, 99888 53335 నంబర్లను సంప్రదించాలని కోరారు. 16 నుంచి అప్పలాయగుంట పవిత్రోత్సవాలు వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీవాణి తెలిపారు. దోషాల నివృత్తితో ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. 16న అంకురార్పణ, 17న పవిత్ర ప్రతిష్ట, 18న పవిత్ర సమర్పణ, 19న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. పవిత్సోవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో.. 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు చంద్రగిరి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 2వ తేదీ విజయ దశమి సందర్భంగా అమ్మవారు గజ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు అధికారులు చెప్పారు. -
మొక్కుబడిగా పెట్టుబడిదారుల సదస్సు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి తాజ్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు (రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్) మొక్కుబడిగా సాగింది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి హాజరయ్యారు. కాగా వేదికపై ప్రత్యేకంగా ఆహ్వానించిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రసంగాలకే అధిక సమయం కేటాయించారు. మధ్యాహ్న భోజన సమయంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగంలో పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించే ప్రయత్నం కాస్త పక్కదారి పట్టింది. ఇన్వెస్టర్స్తో, హోమ్ స్టే ఆపరేటర్స్తో ప్రత్యేకంగా మాట్లాడుతామంటూ కార్యక్రమాన్ని మమ అనిపించారు. అనంతరం కూటమి నాయకులు మంత్రిని సన్మానించేందుకు అత్యుత్సాహం చూపారు. అనంతరం మీడియా ముందుకు మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఏపీలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కూటమి పాలనలో పర్యాటక రంగానికి ఏమి చేస్తామనే అంశాలను దాటవేస్తూ గత పాలనపై విమర్శలు గుప్పించారు. ఆహ్వానం లేదంటూ సీఆర్ రాజన్ మండిపాటు టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్కు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు హాజరయ్యారు. అయితే రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్ను పిలువలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ప్రొటోకాల్ మేరకు పిలవాలనే జ్ఞానం లేదా అంటూ జిల్లా పర్యాటకశాఖ అధికారిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎంతో పాటు ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ మండిపడ్డారు. సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి దుర్గేష్ ఇన్వెస్టర్లలో ఒక్కరిగా మూలన ఆసీనులైన సీఆర్ రాజన్ -
ఎస్పీడబ్ల్యూలో గుజరాత్ అధ్యాపకులు
తిరుపతి సిటీ : శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను గుజరాత్ రాష్ట్రంలోని వడాలి ప్రభుత్వ కామర్స్ కళాశాల అధ్యాపకుల బృందం శుక్రవారం సందర్శించింది. పద్మావతి కళాశాల అటానమస్ సాఽధించిన తీరు, మౌలిక వసతుల కల్పనపై వారు కళాశాల అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ గుజరాత్ అధ్యాపక బృందానికి కళాశాలలో నడుస్తున్న కోర్సులు, మౌలిక వసతులపై సమాచారాన్ని అందించారు. అధ్యాపకులు డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ ఉమాదేవి, గుజరాత్ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ డాక్టర్ కేసరిసింగ్ ఎస్ పర్మార్ పాల్గొన్నారు. -
పోలేరమ్మ తల్లికి బంగారు ఆభరణం బహూకరణ
వెంకటగిరి (సైదాపురం) : శక్తిస్వరూపిణి వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లికి వెంకటగిరి రాజా వారసులు, ఏపీ క్రికెట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత వీవీకే సర్వజ్ఞకుమార కృష్ణయాచేంద్ర బంగారు ఆభరణాన్ని పోలేరమ్మ తల్లికి బహూకరించారు. జన జాతరను పురస్కరించుకుని స్వయంగా అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఇంటి ఇలవేల్పతో పాటు మీ ఇంటి ఆడపడుచుకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. తరతరాలుగా వెంకటగిరి ప్రజలను నిత్యం పోలేరమ్మ కాపాడుతోందన్నారు. -
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ రిజిస్ట్రార్గా ఎంవీ రమణ
చంద్రగిరి : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్గా ఎంవీ రమ ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై వర్సిటీ రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. వ్యవసాయ వర్సిటీలో వివిధ హోదాలలో 34 ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాలలో సుదీర్ఘ సేవలు అందించారు. 2013లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుతో పాటు 2015లో యూనివర్సిటీ స్థాయిలో ఏవీ కృష్ణయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. రిజిస్ట్రార్ పదవికి మరింత వన్నె తెచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు తెలియజేసిన విషయాలను కూడా పేపర్లలో రాయడం నేరమనడం హాస్యాస్పదం. అలాగే పొలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ‘సాక్షి’పై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. –జ్ఞానేంద్రరెడ్డి, మాజీ ఎంపీ, చిత్తూరు -
ప్రజాస్వామ్యానికి ముప్పు
వాస్తవాలను వెలికితీసే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, వేధించడం ప్రజాస్వామ్యానికి ముప్పు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్మెట్లు, ప్రసంగాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం, పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. బలమున్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై న ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – రెడ్డెప్ప, మాజీ ఎంపీ -
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా, మట్టి, ఇసుక, గ్రానైట్ వంటి ప్రకృతి సంపదను దోచుకుంటున్న పచ్చనేతలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాస్వామ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతోంది. నిజాలను వెలికితీసే పత్రికలపైనా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదు. కేవలం రెడ్బుక్ రాజ్యాంగమే అమలవుతోంది. పత్రికల గొంతునొక్కి, జర్నలిస్టులను మానసికంగా ఇబ్బంది పెట్టి , భయపెట్టేందుకే ఇలాంటి చేతగాని రాజకీయాలు చేస్తున్నారు. నిజాలను ప్రచురించే పత్రికలపై కేసులు పెట్టడం దుర్మార్గం. – కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి -
జాతీయ మహిళా సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: జాతీయ మహిళా సాధికారిత సదస్సు నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం లైజన్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి శాసనమండలి సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో జరగనున్న మహిళా జాతీయ సాధికారి సదస్సుకు విచ్చేస్తున్న వీఐపీలకు అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. తిరుపతి రాహుల్ కన్వెనన్ సెంటర్లో సదస్సు ఉంటుందని, 300 మంది సచివాలయ ఉద్యోగులతో పాటు పలువురు జిల్లా, డివిజన్, మండల అధికారులకు డ్యూటీలు వేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఒక రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఉంటుందన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఆర్డీఓ రామ్మోహన్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుమలకు చేరుకున్న ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు దర్శనం ఏర్పాట్లు చేశారు. -
రైతులను క్షోభ పెట్టడం మంచిది కాదు
పాకాల : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారని.. సీఎంగా చంద్రబాబునాయుడు ఎక్కిన రోజు నుంచి వ్యవసాయానికి గ్రహణం పట్టిందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఇంత క్షోభ పెట్టడం మంచి కాదని రైతులు ఆరోపించారు. పాకాల మండలం దామలచెరువు మన గ్రోమోర్ సెంటర్ వద్ద మండుటెండలోనే రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం సాగు చేసే పంటలకు యూరియా అవసరమని.. గంటల తరబడి క్యూలో నిలుచుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం ఏఓ హరితకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం 230 బ్యాగులు (12.2 టన్నుల) యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు ఒక బ్యాగు (40కేజీలు) చొప్పున అందించామని తెలిపారు. క్యూలైన్లో ఉన్న రైతులకు టోకెన్లు జారీ చేసి సాయంత్రం వరకు యూరియా సరఫరా చేశామని వివరించారు. -
భక్తులకు నాణ్యమైన సేవలు అందించండి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ పరిపాలనా భవనంలోని పలు విభాగాలను గురువారం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం సందర్శించారు. మొదట అకౌంట్లు, అన్నదానం, బోర్డు సెల్, ఐటీ, సోషల్ మీడియా, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ తదితర కార్యాలయాలను పరిశీలించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పని తీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు. ముందుగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ పరిపాలనా భవనానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం నుంచి వచ్చిన వేద పండితులు చాంబర్లో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్కు వేదాశీర్వచనం చేశారు. ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, అదనపు ఎఫ్ఏసీఏఓ రవిప్రసాద్, చీఫ్ ఇంజినీర్ టీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
దళిత ద్రోహి చంద్రబాబు
తిరుపతి మంగళం: దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని దళితులను హేళనగా మాట్లాడిన దళిత ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర ఆధ్వర్యంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీజేఆర్ సుధాకర్బాబు, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావుతో పాటు ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమార్, లలితా థామస్, నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నూకతోటి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దళిత మహిళలపై ఆత్యాచారాలు అధికమయ్యాయన్నారు. ఎన్నికల ముందు మహిళలకు అండగా ఉంటా మహిళల జోలికి వస్తే తాటతీస్తానంటూ ప్రగల్భాలు పలికిన పవన్కల్యాణ్కు దళిత మహిళ ఆత్యాచారాలు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి దళితులంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సైనికుల్లా పని చేద్దామన్నారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడు తూ ఎనభై ఏళ్ల క్రితమే దళిత కుటుంబంతో వివాహ బంధం ఏర్పరుచుకుని దళితులతో బాంధవ్యాన్ని కలుపుకున్న కుటుంబం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని గుర్తు చేశారు. అనంతరం భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు రూ.2.80 లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో అందించిన గొప్ప నాయకుడు జగనన్న అన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు సునీల్కుమార్, నూకతోటి రాజేష్ మాట్లాడుతూ జగనన్న అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ఉంటాయన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్కుమార్, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ నల్లానిబాబు, కార్పొరేటర్లు కోటూరు ఆంజినేయులు, బోకం అనీల్కుమర్, పుణీతమ్మ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షులు చేజర్ల మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
వేదపారాయణదారుల ఇంటర్వ్యూల రద్దు సరికాదు
● టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఆపారు ● మీడియా సమావేశంలో భూమన కరుణాకర్రెడ్డి తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీలో వేదపారాయణదారుల నియామకానికి సంబంధించి జరగాల్సిన ఇంటర్వ్యూలను ఉన్నఫలంగా రద్దు చేయడం సమంజసం కాదని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గురువారం తిరుపతిలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం వేదపారాయణదారుల అవసరం ఎంతో ఉందనే విషయాన్ని గుర్తించి గతంలో తాను పాలకమండలి చైర్మన్గా ఉన్నపుడు 700 పోస్టులను క్రియేట్ చేశామన్నారు. నియామకాలకు సంబంధించి గురువారం నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఆపినట్టుగా బయట చర్చ జరుగుతోందన్నారు. ఈ వేదపారాయణ ఇంటర్వ్యూలకు సంబంధించి ఉన్నతమైన సంస్కారం కలిగిన వ్యక్తి అన్ని విషయాల పట్ల కూలంకుషంగా చర్చ చేసి నిజ నిర్ధారణ వచ్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారి డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేదం విభాగం అధ్యాపకుడైన ఫణియజ్ఞేశ్వరయాజులు నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందేదారులను టీటీడీ తీసుకుంటే ఎంతో మేలు జరిగేదన్నారు. కాగా చెర్మన్ ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైన గోవిందరాజన్ను పక్కన పెట్టాలనే ఈ ఇంటర్వ్యూలను ఆపడం అభ్యంతకర విషయంగా భావించాల్సి ఉందన్నారు. తనకు కావలసిన వాళ్లను వేదపారాయణదారులుగా తీసుకోవాలనే కుట్ర తప్ప మరొక్కటి లేదన్నారు. గోవిందరాజన్ను తప్పించడం చాలా పెద్ద తప్పిదమన్నారు. -
పార్థసారథి భట్టాచార్యుల జీవితం ఆదర్శనీయం
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ వైఖానస ఆగమ విభాగంలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ప్రముఖ వైఖానస ఆగమ పండితులు టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీమాన్ రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అకడమిక్ డీన్ ఆచార్య గోలి సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరికి చెందిన ప్రముఖ వైఖానస ఆగమ పండితులు దీవి శ్రీనివాసాచార్యులు, పార్థసారథి భట్టాచార్యులు కుమారులు శత్రుఘ్నాచార్యులు, తిరుమల వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పార్థసారథి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ప్రాంతాల్లోని గ్రంథాలను సంకలనం చేయడం, అనేక గ్రంథాలను పరిశీలించి వాటిని తెలుగులో ప్రచురించారని కొనియాడారు. అనంతరం శత్రుఘ్నాచార్యులు మాట్లాడుతూ తన తండ్రి సేవలు కేవలం దక్షిణ భారతదేశంలో కాదు గయాలో కూడా వారి ఫొటో పెట్టి పూజిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాఘవ దీక్షితులు, దివి శ్రీనివాస దీక్షితులు, డాక్టర్ రాజేష్, ప్రవ్వా రామకృష్ణ , సూర్యనారాయణ మూర్తి, పురుషోత్తమాచార్యులు, పరాశరం భావనారాయణాచార్యులు, పీఆర్ఓ డాక్టర్ బ్రహ్మాచార్యులు, పాల్గొన్నారు. -
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
చంద్రగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్– 257 జిల్లా గౌరవ సలహాదారు వెంకటముని డిమాండ్ చేశారు. పాఠశాల సమయానంతరం ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గురువారం తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని, ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం మండల కేంద్రాల్లో నిరసన, 13, 14న ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 17న సీఎం, సీఎస్లకు మెయిల్, వాట్సాప్లలో వినతులు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పోలేరమ్మా
వేవేల దండాలు తల్లీ..అమ్మా.. పోలేరూ తల్లీ.. కరుణించమ్మా.. కాపాడరావమ్మ పోలేరమ్మా అంటూ భక్తుల జయజయధ్వానాల నడుమ జాతర ముగిసింది. అయితే ఈ ఏడాది జాతర సంప్రదాయాలకు కూటమి నేతలు స్వస్తి పలికారు. అంతటా వారి పెత్తనమే ఎక్కువగా కనిపించింది. జాతర వేళ రెండు రోజుల పాటు పూర్తిగా మద్యం అమ్మకాలను నిలిపివేయడం మొద టి నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే 48 గంటల పాటు కాకుండా కేవలం 24 గంటలు మాత్రమే నిషేధించారు. ఆపై మద్యం ఏరులై పారింది. రాజాలకు కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా కూటమి నేతలు అడుగడుగునా అడ్డు తగిలారు. మరోవైపు తాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సైదాపురం/వెంకటగిరి రూరల్ : కోరిన కోర్కెలు తీర్చే తల్లీ..పోలేరమ్మా.. కాపాడగరావమ్మా.. అంటూ భక్తజనం పోలేరమ్మ ఎదుట ప్రణమిల్లారు. జాతర సందర్భంగా వెంకటగిరి పురవీధులన్నీ స్వర్ణకాంతులతో దేదీప్య మానంగా కాంతులీనాయి. అమ్మవారి ప్రతి రూపాన్ని తనివితీరా దర్శించుకున్న భక్తులు పులకించారు. జిల్లా నలుమూలలే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా పోలేరమ్మ జాతరకు విచ్చేయడంతో దారులన్నీ వెంకటగిరివైపే మళ్లాయి. సారె సమర్పణ.. వెంకటగిరి రాజా కుటుంబీకుల సర్వజ్ఞకుమార కృష్ణ యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలతో కూడిన సారెను అందించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్సీపీ నేత బి.మస్తాన్యాదవ్, నాయకులు దర్శించుకున్నారు. జాతరకు భద్రత.. జాతర రాష్ట్ర పండుగ కావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆనందోత్సాహాల నడుమ నగరోత్సవం.. భక్తజన సందోహం నడుమ నగరోత్సవం ప్రారంభం కాగా భక్తులు పెద్దఎత్తున వీక్షించారు. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి మెట్టునిల్లు అయిన జీనుగులవారి వీధి నుంచి వేకువజామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో అధిష్టించారు. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. అయితే భక్తులకు నామమాత్రంగా ఓ గంట పాటు వాటర్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. దున్నపోతు బలితో ముగింపు జాతర సంప్రదాయ ప్రకారం అమ్మవారికి దున్నపోతు బలి కార్యక్రమం జరిగింది. బలి పూర్తి కాగానే గ్రామ పొలిమేరల్లో నాలుగుదిక్కులా పొలి చల్లారు. పట్టువస్త్రాల సమర్పణ జాతర సందర్భంగా దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మేళతాళలతో పట్టువస్త్రాలను సమర్పించారు. దేవదాయ కమిషనర్ రామచంద్రయ్య, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోవూరు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, చైర్మన్ నక్కా భానుప్రియ హాజరయ్యారు. జాతరలో ప్రత్యేకతలు -
ప్రభుత్వం కక్ష సాధింపు
జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి భారతదేశం బలమైన రాజ్యాంగ రక్షణ కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాసే ప్రయత్నం చేస్తోంది. పత్రికలు, జర్నలిస్టులపైన కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. స్టేట్మెంట్లు ఇచ్చినా కేసులు పెడతారా? ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. వాస్తవాలు భయటపెట్టే పత్రికలపై కేసులు పెట్టడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. – ఆర్ కే రోజా, మాజీ మంత్రి -
రేణిగుంట చేరుకున్న నేపాలీ బాధితులు
రేణిగుంట: నేపాల్లో చిక్కుకున్న రాయలసీమకు చెందిన 40 మంది ప్రత్యేక విమానంలో సురక్షితంగా గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరారు. వీరిలో తిరుపతి జిల్లాకు చెందిన 9 మంది, వైఎస్సార్ కడపకు చెందిన 19, నెల్లూరు 5, నంద్యాల 2, అన్నమయ్య జిల్లా 3, అనంతపురం 2 మొత్తం 40 మంది పర్యాటకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు స్వాగతం పలికి ప్రభుత్వ వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు. శానిటరీ టెండర్తో ముక్కంటి హుండీకి ఎసరు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టును అర్ధంతరంగా రద్దుచేసి, కొత్త కాంట్రాక్టరుకు అధిక మొత్తానికి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముక్కంటి ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్ను రద్దుచేసి కొత్త ఏజెన్సీకి టెండర్ను అధిక మొత్తానికి అప్పగించడం ంఏంటన్నారు. శానిటరీ టెండర్ విభాగంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే గతంలో శానిటరీ టెండర్ను యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ నెలకు రూ.36.99 లక్షలకు టెండర్ దక్కించుకొని పనులు చేశారని, వీరికి వచ్చే ఆగస్టు 26 వరకు గడువు ఉందని గుర్తుచేశారు. అయితే ఈఓ బాపిరెడ్డి శానిటరీ టెండరును పద్మావతి ఎంటర్ప్రైజెస్కు రూ.76.66 లక్షలకు ఖరారు చేయడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. దీనికి 18 శాతం జీఎస్టీ కలుపుకుంటే ఒక నెలకు రూ.94.51 లక్షలు శానిటరీ టెండర్లోనే దేవస్థానం నిధులు వెచ్చించాల్సి వస్తుందన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆదాయాలను గండి కొట్టే విధానాలను అందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. -
పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు
వార్తలు రాస్తే కేసులు పెడతారా? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ? తప్పుడు కేసులు నమోదుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సాక్షి పత్రికలో ప్రెస్మీట్లు, స్టేట్మెంట్లు ప్రచురించినందుకు పత్రికపైన , ఎడిటర్పైన , సంబంధిత రిపోర్టర్లపైన కూటమి ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించడం, కార్యాలయాలు, ఇళ్లు సోదాలు చేయడం దుర్మార్గం. పత్రికల గొంతునొక్కేందుకు తప్పుడు కేసులు నమోదు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం వికృతచేష్టలకు నిదర్శనం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా , ఆ తప్పులను ఎత్తి చూపుతున్న సాక్షిపై ప్రభుత్వం క్షక్ష సాధిస్తోంది. – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక అలంకరణలో పోలేరమ్మ అమ్మవారు -
15మంది స్మగ్లర్ల అరెస్ట్
తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 15 మంది స్మగ్లర్లతో పాటు 15 ఎర్రచందనం దుంగలను గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి స్మగ్లింగ్కు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. అన్నమయ్య జిల్లా సానిపాయ, వీరబల్లి ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధ వారం కూంబింగ్ చేపట్టారు. అప్పయ్యగారిపల్లి అటవీ ప్రాంతంలో వద్ద రెండు కార్లు కనిపించాయి. వాటిని సమీపించడంతో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను కార్లలోకి లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టగా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి 15 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేయగా 15 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో సహా పట్టుబడిన వారిని తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించగా డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 22 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 70,086 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమల పవిత్రతను కాపాడేది ఇలాగేనా!
సాక్షి టాస్క్ఫోర్స్: టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రీవారి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం గ్రిల్ గేట్వద్ద టీవీ–5 ఉద్యోగి శ్యామ్నాయుడు చిల్లర వేషాలు వేశారు. ‘అంతా విష్ణుమాయ’ అంటూ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయానికి తాను తాళాలు వేస్తున్న ఫొటో, వీడియో శ్యామ్నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.కాగా, తానేదో టీటీడీ ఉద్యోగస్తుడైనట్టు.. టీటీడీకి బీఆర్ నాయుడే రాజుగా వ్యవహరిస్తున్నట్టున్న వారి ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఇదేం పనులు అంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమేమిటని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం గ్రిల్ గేట్ తాళాలు టీవీ–5 రిపోర్టర్ చేతికి ఎలా వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.టీవీ–5 చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమల కొండపై టీవీ–5 సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల కొండపై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేస్తున్న టీటీడీ అధికారులు తాజా ఘటనపై నోరెత్తకపోవడం కూడా చర్చనీయాంశమైంది. కేవలం టీవీ–5 ఉద్యోగి కావడం వల్లే శ్యామ్నాయుడుపై కేసు నమోదు చేయలేదని, ఇంత పెద్ద తప్పు చేసినా బీఆర్ నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు.తిరుమల ఆలయం మీ సొంత ఇల్లు అనుకుంటున్నారా?#AndhraPradesh #viral #trending pic.twitter.com/jtnwFwJvX3— Andhra Insights (@AndhraInsights) September 10, 2025 -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇలాంటి విధానాల వల్ల సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, భద్రత లాంటివి రేపటి సమ సమాజ స్థాపనకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఉండాలే కానీ, గొంతు నొక్కేలా వ్యవహరించకూడదు. అలా నిజాల్ని మరుగునపరిచే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరం పాలకవర్గాలను క్షమించదన్న విషయం గమనించుకోవాలి. పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని గతంలోకి లక్నోకి చెందిన కేసులో సుప్రీం కోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నాలు చేయరు. -
భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థ తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నమయ్యభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కేవలం 2వారాలే ఉన్నాయని, నిర్దేశిత గడువులోపు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించాలని కోరారు. ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు మరింతగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యుల ఫీడ్ బ్యాక్తోపాటు డయల్యువర్ ఈఓ, ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా భక్తుల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తక్షణం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. విధానపరమైన నిర్ణయాలలో టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమష్టిగా భాగస్వాములు కావాలన్నారు. అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధానపరమైన వ్యవస్థలను తీసుకువచ్చామని తెలిపారు. ఇతర శాఖల్లోనూ ఇదే విధానం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జేఈఓ వి.వీరబ్రహ్మం మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ, అలిపిరి టోల్ గేట్ ఆధునికీకరణ చేపట్టినట్లు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 19 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,828 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.07 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేనివారికి 19 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం శ్రీకాళహస్తి: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం 69వ ఉమ్మడి చిత్తూరు జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్కుమార్ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. జిల్లాస్థాయి క్రీడాకారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు తీగల వెంకటయ్య, ఎంఈఓలు బాలయ్య, భువనేశ్వరమ్మ, కిషోర్ పాల్గొన్నారు. ఐసీడీఎస్లో ఉద్యోగాలు తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ పరిధిలోని మిషన్ వాత్సల్య స్కీమ్కు సంబందించి డీసీపీయూ,ఎస్ఏఏ యూనిట్ పరిధిలో ఖాళీ పోస్టులకు దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీడీ వసంతబాయి బుధవారం తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తులను పోస్టల్ ద్వారా లేదా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు. ఎంపికై న వారికి రూ.7,944 నుంచి రూ.10వేల వరకు నెలవారీ వేతనం ఉంటుందని వివరించారు. ఓసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలని తెలిపారు. తిరుపతి.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం తిరుపతి మంగళం : ౖవెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన కేతం జయచంద్రారెడ్డి(తిరుపతి), ఆరె. అజయ్కుమార్(తిరుపతి), కేవీ భాస్కర్నాయుడు(సత్యవేడు), టి. హరిచంద్రన్ (సత్యవేడు), కేవీ నిరంజన్రెడ్డి(సత్యవేడు)ని నియమిస్తున్నట్లు పేర్కొంది. రేపటి నుంచి జాతీయ స్థాయి నృత్య పోటీలు తిరుపతి కల్చరల్ : రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవాల్లో భాగంగా నేటి నుంచి మహతి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్రెడ్డి, గౌరవ సలహాదారు కీర్తి వెంకయ్య తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శాసీ్త్రయ, జానపద నృత్య పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే నాట్య గురువులు, నృత్య కళాపోషకులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రంగస్థలి కార్యదర్శి కేఎన్.రాజా, కళాకారులు జేజీరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, మస్తాన్, రవిప్రసాద్, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
మహిమాన్వితం.. మహారూపం
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తల్లి దీవెనల కోసం పట్టణం భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. జిల్లా నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వెంకటగిరీయులు స్వగృహాలకు చేరుకున్నారు.వైభవంగా రథోత్సవంకుమ్మరివీధిలోని అమ్మవారి పుట్టింటిలో పోలేరమ్మ ప్రతిమను తయారు చేశారు. విగ్రహానికి నేత్రాలను అమర్చకుండా బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో కొలువుదీర్చారు. అమ్మవారి ప్రతిమను తయారు చేసిన వెంటనే దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పోలేరమ్మను సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని రథంపై కొలువుదీర్చి జీనిగలవారి వీధికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అశేష భక్తజనం నడుమ రథోత్సవం వైభవంగా సాగింది. అక్కడ పోలేరమ్మ ప్రతిమను ప్రతిష్టించి సంపరదాయబద్ధంగా గాలి గంగులకు పూజలు నిర్వహించారు. అనంతరం బలి కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మవారికి కళ్లు అమర్చారు. బుగ్గ చుక్కను తీర్చిదిద్దారు. దివ్యతేజస్సుతో అలరారుతున్న పోలేరమ్మ దివ్యరూపాన్ని రథంపై ఊరేగిస్తూ.. పాతకోట మీదుగా అమ్మవారి ఆలయానికి చేర్చారు. అక్కడ వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో మహిమాన్విత ప్రతిమను ప్రతిష్టించారు. గురువారం వేకువజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనానికి పోటెత్తారు.నేడు నిష్క్రమణంజాతరలో భాగంగా గురువారం అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలవుతుంది. పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక మండపంలో అమ్మవారు కొలువుదీరుతారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వైభవంగా పోలేరమ్మ నగరోత్సవం నిర్వహిస్తారు. విరూపమండపం వద్ద అమ్మవారి నిష్క్రమణ కార్యక్రమం పూర్తి చేస్తారు. దీంతో జాతర ఘట్టం పరిపూర్ణమవుతుంది. -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగ సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ విభాగం నేత లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని వివరించారు. -
పడిగాపుల ప్రయాణ ం
తిరుపతి అర్బన్ : ప్రజల అవస్థలను కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేస్తూ లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తోంది. అక్కడితో ఆగకుండా తమ సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ అంటూ డబ్బా కొట్టుకుంటోంది. పోనీలే అనుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రజలను వివిధ రూపాల్లో ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం అనంతపురంలో నిర్వహిస్తున్న చంద్రబాబు సభకు జిల్లాను 364 బస్సులను తరలించేసింది. దీంతో రెండు రోజులుగా జిల్లావాసులు నానా ఇక్కట్టు ఎదుర్కొంటున్నారు. బాబుగారి సేవకు ఆర్టీసీ బస్సులు వెళ్లిపోవడంతో రాకపోకలకు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు తిరుపతి సెంట్రల్ బస్టాండ్లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. గంటకో.. రెండు గంటలకో ఓ బస్సు రావడంతో ఎక్కేందుకు పోటీపడుతున్నారు. సీటు సంగతి దేముడెరుగు, నిలబడేందుకు చోటు దొరికితే చాలు అనుకుంటూ బస్సు పైకి ఎగబడుతున్నారు. ముఖ్యమంత్రి సభకు ఇక్కడ నుంచి బస్సులను తరలించడమేంటని మండిపడుతున్నారు. దీనిపై ముందస్తుగా ప్రకటన విడుదల చేసుంటే, తమ ప్రయాణం వాయిదా అయినా వేసుకునే వాళ్లమని వాపోతున్నారు. అయితే గురువారం ఆర్టీసీ బస్సులు తిరిగి వస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. -
ఉపాధి పనులు.. అవకతవక వేతనాలు
వరదయ్యపాళెం : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పనులు ల్పించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యం. అయితే కొందరు అవినీతి పరుల కారణంగా పథకం నీరుగారిపోతోంది. అనర్హులు సైతం ఉపాధి కూలీలుగా నమోదు చేసుకుని వేతనాలు స్వాహా చేస్తున్న ఘటన బుధవారం వరదయ్యపాళెం ఎండీపీఓ కార్యాలయం వద్ద చేపట్టిన సామాజిక తనిఖీలో వెల్లడైంది. డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో పలువురు వీఆర్ఏలు, అంగన్వాడీలు, దివ్యాంగ పింఛన్ పొందుతున్నవారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, చివరకు మంచానికే పరిమితమయ్యామని రూ.15వేల పింఛన్ అందుకుంటున్నవారు సైతం ఉపాధి కూలీల అవతారమెత్తి వేతనాలు పొందిన వైనం వెలుగు చూసింది. దీనిపై డ్వామా పీడీ విచారణ ఆదేశించారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీఎం గణేష్ తీరుపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించి కొలతల్లో తేడాలు రావడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. ఈ అవకతవకలపై ఉపాధి సిబ్బంది నుంచి రూ. 1.30లక్షలను రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే రూ. 25వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, ఏపీడీ సరిత, ఎస్టీఎం కోనయ్య, ఎస్ఆర్పీ లోకేష్ పాల్గొన్నారు. -
సులభతరంగా ‘అమ్మ’ దర్శనం
పోలేరమ్మతల్లిని భక్తులు సులభతరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో జాతర బందోబస్తుపై అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పోలేరమ్మ జాతరకు పకడ్బందీ బందోబస్తు కల్పించినట్లు వెల్లడించారు. సుమారు వెయ్యిమంది పోలీసులతో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తుల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని, నిమజ్జనం, ఊరేగింపులో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పండుగ పోలేరమ్మతల్లి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే వెంకటగిరి పోలీసు స్టేషన్లో ప్రత్యేక కమాండ్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ గీతాకుమారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ ఏవీ రమణ పాల్గొన్నారు. -
13న బాక్సింగ్, లాన్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుచానూరు జెడ్పీ హైస్కూల్, తిరుపతి బైరాగిపట్టెడలోని ప్రోయేస్ టెన్నిస్ అకాడమీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో బాక్సింగ్, లాన్ టెన్నిస్ ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్కుమార్, మహిళా కార్యదర్శి ఎల్.భార్గవి తెలిపారు. అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. పోటీలకు హాజరయ్యే వారు సొంత క్రీడా సామగ్రిని వెంట తెచ్చుకోవాలని, అలాగే వయసు ధ్రువీకరణపత్రం, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్కులు జాబితా తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు బాక్సింగ్కు సంబంధించి 98491 59147, 94418 91874, అలాగే లాన్ టెన్నిస్కు సంబంధించి 97007 78867నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మిలటరీ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు తిరుపతి సిటీ : రాష్ట్రీయ మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు అక్టోబర్ 9వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్రెడ్డి బుధవారం తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ స్కూల్, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఐటీలో విప్లవాత్మక మార్పులు తిరుపతి రూరల్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రవేశపెట్టారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం పద్మావతి మహిళా వర్సిటీలోని ధృతి ఆడిటోరియంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్–2025 సెమీఫైనల్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మహిళా వర్సిటీలో హ్యాకథాన్ సెమీస్ చేపట్టడం శుభపరిణామమన్నారు. ఐటీ నిపుణులుగా ఇతర దేశాల్లో స్థిరపడిన మన వాళ్లు తమ మేధస్సును స్వదేశంలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని వెల్లడించారు. వీసీ వి.ఉమ, రిజిస్ట్రార్ రజని, ఎస్ఎస్ఐఐఈ సీఈఓ సూర్యకుమార్ పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
గూడూరురూరల్ : పట్టణంలోని గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక టిడ్కో ఇళ్లలో నివాసముండే షేక్ రహీద్(35) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన రహీద్ బుధవారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కత్తిపోట్ల కారణంగా రహీద్ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్బాషా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబీకులు, బంధువులు రెండో పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
డేటా సైన్స్ సెంటర్ ప్రారంభం
తిరుపతి రూరల్ : మండలంలోని తుమ్మలగుంట పంచాయతీ నలందానగర్లో ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ (ఐఎస్పీఎస్) డేటా సైన్స్ సెంటర్ను కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ గణాంక వేత్త డాక్టర్ సీఆర్రావు 105వ జయంతి సందర్భంగా డేటా సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆధునిక ప్రయోగశాల, డిజిటల్ క్లాస్ రూములు, లైబ్రరీ అందుబాటులో ఉంటాయి. గణాంక శాస్త్రం, మెషీన్ లెర్నింగ్, కృత్తిమ మేధస్సు (ఏఐ) రంగాలలో పరిశోధన, శిక్షణ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా డేటా సెంటర్ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. అనంతరం ఐఎస్ఐ మాజీ డైరెక్టర్ బీఎల్ఎస్ ప్రకాశరావు, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణలతో కలిసి సీఆర్రావు సెమినార్ హాల్ను కలెక్టర్ ప్రారంభించారు. సెల్ప్ స్టడీ లైబ్రరీ, రూఫ్ గార్డెన్ను సందర్శించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డేటా సైన్స్ సెంటర్ విద్యార్థులకు, ప్రభుత్వ ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ సీఆర్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఐఎస్పీఎస్ గౌరవ అధ్యక్షుడు పి.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్ సెంటర్ భవన నిర్మాణం, వసతులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారాలను వివరించారు. ఐఎస్పీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీజీ శంకరన్, ప్రొఫెసర్ ఆర్ఎల్ షిండే, ప్రొఫెసర్ సోమేష్కుమార్ పాల్గొన్నారు. -
వైన్షాప్ పెడితే సహించం!
తిరుపతి రూరల్ : మండలంలోని గాంధీపురం గ్రామానికి చెందిన మహిళలతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ కాలనీ వాసులు బుధవారం రోడ్డెక్కారు. తమ ప్రాంతంలో వైన్షాపును ఏర్పాటు చేయవద్దని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో బార్ పెట్టొద్దని గతంలో పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. కాపురాలున్న చోట మందుబాబులను అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి తాగించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు సైతం నానా అవస్థలు పడేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బార్ మూసేశారని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, ఇంతలోనే అదే చోట వైన్షాపు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాలేజీలు, పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే ఈ మద్యం దుకాణం ముందు నిలబడి విద్యాసంస్థల బస్సులు ఎక్కించాల్సి వస్తుందని వాపోయారు. ప్రభుత్వానికి డబ్బులే కావాలనుకుంటే మరోచోట మద్యం దుకాణం పెట్టించుకోవాలని, ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకుంటే ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అడ్డుకుంటాం గతంలో బార్ పెట్టినపుడు నిరసనను వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎన్ని పోరాటాలు చేసినా బార్ను మూసివేయించలేకపోయాం. ఇప్పుడు గత నాలుగు రోజులుగా బార్ మూత వేశారు. బార్ లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది. రెండు రోజుల్లో మద్యం దుకాణం పెడతామని చెబుతున్నారు. వైన్షాప్ పెడితే కచ్చితంగా అడ్డుకుంటాం. ఎకై ్సజ్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. – యశోద, గాంధీపురం -
చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు
తిరుపతి అర్బన్ : జిల్లాలోని చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 181 చెరువుల పరిధిలో 30,081 హెక్టర్లు సాగు భూమి ఉందన్నారు. ఈ చెరువుల అభివృద్ధికి రూ.515 కోట్ల మేర ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చెరువులను బలోపేతం చేయాలని కోరారు. ఇరిగేషన్ తిరుపతి ఎస్ఈ రాధాకృష్ణ, చిత్తూరు ఎస్ఈ వెంకటేశ్వరరాజు, నెల్లూరు ఎస్ఈ దేశినాయక్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, భూగర్భజలవనరులశాఖ డీడీ శోభనబాబు పాల్గొన్నారు. ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి జాతీయ ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యబృందంతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేస్తేనే గ్రామీణులకు వైద్యులపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో పకడ్బందీగా వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, వైద్యాధికారులు శైలజ, మురళీకృష్ణ, శ్రీనివాసరావు, శాంతకుమారి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
కక్ష సాధింపులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
రాష్ట్రంలో పరిస్థితులు దారణంగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు వస్తే తమకు మింగుడుపడని పక్షంలో ఖండించాలి తప్ప కక్ష సాఽధింపు చర్యలకు దిగడంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు బనాయించి నోటీసులు జారీచేయడం మేధావి వర్గాలు, జర్నలిస్టులు ఆలోచించాల్సిన విషయం. వ్యవస్థలను తమ చేతులోకి తీసుకుని ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తే అందుకు తగిన మూల్యం భారీ స్థాయిలో చెల్లించుకోక తప్పదు. ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనబడలేదు. ఇకనైనా పత్రికల యాజమాన్యాలపైన, జర్నలిస్టులపైనా కేసులు పెట్టే సంస్కృతి మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ దృష్టి సారించాలి -
అది శ్రీవారి ఆలయమా?.. టీవీ5 కార్యాలయమా?: భూమన
సాక్షి,తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అన్నీ వివాదాలే నెలకొంటున్నాయని.. తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనునిత్యం ఏదో ఒకటి అపచారం జరుగుతున్నాయి. ప్రశ్నించి మాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చంద్ర గ్రహణం రోజున మహాద్వారం మూసి వేసిన తర్వాత ఇత్తడి గ్రిల్ గేటు తాళాలు వేస్తున్నారు. టీవీ5 శ్రీవారి ఆలయమా..టీవీ5 కార్యాలయమా?.బీఆర్ నాయుడు సైన్యంలో ఒకరు తాళం వేస్తున్నారు. ఇది దేనికి సంకేతం.ఇది చాలా తప్పిదం. బోర్డు సభ్యుడు మహాద్వారం వద్ద పెద్ద గొడవ జరిగింది.మీ సైన్యంలో ముఖ్యుడు శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వద్ద ఆలయ డిప్యూటి ఈవో పని చేస్తున్నాడనే ఫిర్యాదులందాయి. టీడీపీ కార్యకర్తగా టివీ5 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బీఆర్ నాయుడు ఉన్నారనే ధైర్యంతో ఈ బరితెగింపు బయటపడింది. ఆలయం లోపల మరోముఖ్యుడు చేస్తున్నవి బయటకు రాలేదు.శ్రీవారి కల్యాణాలు జరపాలని తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు తరపున రవి కుమార్ వేమూరి కోరారు. సెప్టెంబర్ ఆరు నుంచి 16 చోట్ల శ్రీవారి కల్యాణాలు జరపాలని కోరారు. బీఆర్ నాయుడు తన బలంతో ఒకే చేశారు..ప్రొసీడింగ్స్ ఇచ్చారు. శ్రీవారి కల్యాణాలు మొట్ట మొదటిగా మా హయంలో సూళ్లూరుపేట దళితవాడలో ప్రారంభించాం. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు హాంబర్గ్లో కళ్యాణోత్సవాలుకు టికెట్ ధర 116 యూరోలు , జంటగా కల్యాణోత్సవం 81 యూరోలు, విశేష కళ్యాణానికి 515 యూరోలు పేరుతో టికెట్లు పెట్టడం జరిగింది. టీడీపీ ఎన్నికల ఫండ్స్ ఇచ్చిన వారికి సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారా..? టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అనుమతితో జరుగుతోంది. ధనవంతులు ఇళ్లలో లక్ష్మి పూజలు మీ అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. మీరు చేసిన బ్లాక్ మెయిల్ చేసినవి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాం. మీరు చేస్తున్న అవినీతిపై మా పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. -
నేడే పోలేరమ్మ జాతర
విద్యుద్దీప కాంతులతో ఆర్చివిద్యుత్ కాంతులతో అమ్మవారి ఆలయం వెంకటగిరి (సైదాపురం): వెంకటగిరి పట్టణం జాతరకు సిద్ధమైంది. పోలేరమ్మ ఆలయం వేడుకలకు ముస్తాబైంది. అమ్మవారి సేవకు భక్తజనం తరలివస్తోంది. బుధవారం రాత్రి నగరోత్సవానికి ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ప్రత్యేక రథంపై కొలువుదీరనున్న అమ్మలగన్న అమ్మను కనులారా వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు. బుధ, గురువారాల్లో అత్యంత వైభవంగా జరిగే జాతరకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. వెంకటగిరి పట్టణమంతా విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుత్తోంది. పోలేరమ్మ తల్లి బుధవారం రాత్రి జీనుగుల వారి వీధి నుంచి ప్రత్యేక రథంపై నగరోత్సవంగా అమ్మవారి ఆలయం వద్ద చేరుకొని కొలువుదీరనున్నారు. అనంతరం భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర పండుగ హోదాలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన, డీఎస్పీ గీతాకుమారి అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లనున్న పోలేరమ్మ తల్లి జాతర సంప్రదాయాలకు అనుగుణంగా కుమ్మరింట పోలేరమ్మ తల్లిని ఆడపడుచుగా భావిస్తారు. బుధవారం రాత్రి కుమ్మరులు పుట్ట మట్టిని తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమను తయారు చేసి మొదటి పూజ అక్కడే చేస్తారు. ఆ రోజు రాత్రి భక్తుల దర్శనార్థం రాత్రి 10.30 గంటల వరకు ఉంచుతారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతారు. అనంతరం కాంపాళెంలోని గాలిగంగుల వద్ద తొలుత పూజలు చేసి అమ్మవారిని కుమ్మరింట నుంచి మెట్టినిల్లు అయిన జీనుగుల వారి వీధికి తీసుకెళ్తారు. అక్కడ రజకులు పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మెట్టినింటికి ఆహ్వానం పలుకుతారు. అమ్మవారి ప్రతిమకు కళ్లు, దిష్టి చుక్క పెట్టి బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. అనంతరం రథంపై అమ్మవారిని ఆలయం వద్దకు చేర్చి కొలువు దీరుస్తారు. (నిలుపు) ఈ తంతు మొత్తం బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కొనసాగుతుంది. అనంతరం అమ్మవారిని భక్తులకు దర్శనం కల్పిస్తారు. ప్రతి ఇంటా పూజలు వెంకటగిరి రూరల్: బుధవారం ఉదయం నుంచే ప్రతి వీధిలో ‘‘పోలేరమ్మకు మడి బిక్షం పెట్టండి. పోతురాజుకు టెంకాయ కొట్టండి’’ అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తనుంది. ప్రతి ఇంట్లో పసుపు ప్రతిమను తయారుచేసి పూజలు చేస్తారు. అంబలిని నైవేద్యం సమర్పిస్తారు. పోలేరమ్మతల్లి దర్శనార్థం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉచితంతోపాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలను ఏర్పాటు చేశారు. వెంకటగిరి జన జాతరకు బుధ, గురువారాల్లో లక్షలాది మంది తరలిరానున్నారు. -
సూళ్లూరుపేటలో ఫ్లెక్సీలు చించివేసిన పోలీసులు
తిరుపతిలో నిరసన ర్యాలీగా వస్తున్న భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, మేయర్ శిరీష, చంద్రమౌళిరెడ్డి పాటు రైతులు, పార్టీ శ్రేణులు (ఇన్సెట్) వరి పైరు, యూరియా మూటలతో ర్యాలీగా వస్తున్న పార్టీ శ్రేణులు, రైతులు సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి కదం తొక్కారు. ఎరువుల బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా నియంత్రించాలని డిమాండ్ చేశారు. వేరుశనగ విత్తనాలు, వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, పంటలకు ఉచిత బీమా అమలు చేయాలంటూ మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాలు సమర్పించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాళ్లు పట్టుకుంటాం.. సమస్యలు పరిష్కరించండయ్యా తిరుపతి నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద వినూత్న తరహాలో నిరసన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు వరి కంకులు, యూరియా బస్తాల ఫ్లెక్సీలు చేతపట్టి అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో రైతు భరోసా కేంద్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఖాళీగా కూర్చుంటే ఎరువు, విత్తనాల కోసం రైతులు వారి కాళ్లుపట్టుకుని వేడుకుంటారు. అయితే ఎరువులు, విత్తనాలు, పథకాలు లేవంటూ అధికారుల వేషధారణలో ఉన్న వారు సమాధానం ఇస్తే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విన్నవించారు. కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యలు పరిష్కరించండి శ్రీకాళహస్తిలో తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాళహస్తి, సత్యవేడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల, రైతులు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న అధికారిణికి వినతి పత్రం సమర్పించారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యల గురించి భూమన కరుణాకరరెడ్డి ఆమెకు వివరించారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సత్యవేడుకు చెందిన బీరేంద్రవర్మ, మాధవి పాల్గొన్నారు. అడుగడుగునా అడ్డంకులు గూడూరు, వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు మెరుగ మురళీధర్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరుకు రైతులు భారీగా తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు గూడూరు టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతుండటంతో అంతాకలిసి నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవటంతో కార్యాలయ ఏవోకు వినతి పత్రం ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎవరికి వారు హోలీ క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేశారు. ఆ సమయంలో కొంత సేపు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. రైతు సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు : కలెక్టర్
తిరుపతి అర్బన్ : జిల్లాలో ఏదైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే తప్పుడు నివేదికలు కాకుండా వాస్తవ సమాచారంతో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో పీజీఆర్ఎస్తోపాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. జేసీ శుభం బన్సల్తోపాటు తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ మౌర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అలాగే సంఘటనలకు సంబంధించి నిర్లక్ష్యంగా తప్పుడు నివేదికలు ఇస్తే తక్షణమే చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రేణిగుంట మండలంలో డయేరియాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో రేణిగుంట ఈవోపీఆర్డీని సస్పెండ్ చేయాలని డీపీవో సుశీలాదేవిని ఆదేశించారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఈఈ నరేంద్రను ఆదేశించారు. స్థానిక వీఆర్వోపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో భానుప్రకాష్రెడ్డిని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్ఎంలతోపాటు వైద్య బృందం నుంచి శుక్రవారం లోపు నివేదిక పంపాలని ఆదేశించారు, అలాగే ఈ– క్రాప్ వేగవంతం చేయాలని, యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని డీఏవో ప్రసాద్రావును ఆదేశించారు. -
తీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత కల్పించండి
తిరుపతి అర్బన్ : సముద్రతీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుగ్గిరాజుపట్నం కోస్టల్ పోలీస్స్టేషన్ మరమ్మత్తులు, కాంపౌండ్ వాల్ తదితర చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ అధికారి వెంకటరమణ, డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ బాలిరెడ్డి, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ తిరుపతి అసిస్టెంట్ కమీషనర్ విజయ కుమార్, కోస్ట్ గార్డ్ అధికారి సురేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, మైరెన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రెండిళ్లలో చోరీ పాకాల : తాళాలు వేసిన ఇంటిని పసిగట్టి రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దరామాపురం పంచాయతీ యనమలవారిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి, నాగేంద్రబాబు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగుల గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. నాగలక్ష్మి ఇంటిలో వెండి 60 గ్రాములు, 1 గ్రాము బంగారం, నాగేంద్ర ఇంటిలో 4 గ్రాముల బంగారం, 140 గ్రాముల వెండి నగలు అపహరించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుదర్శన ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై దాడులు నాగలాపురం : రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. మండలంలోని మలిమేలు కండ్రిగ వద్ద అరణియార్ నదిలో సోమవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ సునీల్ సిబ్బందితో ఇసుక అక్రమ రవాణాదారులపై మెరుపు దాడి నిర్వహించి, ట్రాక్టర్లను పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై రాత్రి వేళలో ఇసుక తరలించిన ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. -
గ్రావెల్ లారీ అడ్డగింత
పెళ్లకూరు : మండలంలోని శిరసనంబేడులో మంగళవారం గ్రావెల్ తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని సర్వే నంబరు 287–2పీలో వేలూరు శ్రీనివాసులురెడ్డి, వేలూరు రాధాకృష్ణారెడ్డి, వేలూరు ప్రభాకర్రెడ్డికి 8 ఎకరాల పట్టా భూములున్నాయి. అయితే ఇక్కడి భూములను మెగా కంపెనీకి రోడ్డు అభివృద్ధి పనుల కోసం లీజుకు కేటాయించారు. పనులు పూర్తి కావడంతో లీజు సమయం ముగించుకొని కంపెనీ యంత్రాలు తీసుకెళ్లిపోయారు. అయితే గ్రామానికి చెందిన ఓ నాయకుడు అక్కడ మిగిలిపోయిన స్క్రాప్తో పాటు సంబంధిత భూముల్లో గ్రావెల్ తవ్వకాలు చేపట్టి లారీలతో తరలిస్తున్నారు. దాంతో భూయజమానులు, గ్రామస్తులు కలిసి గ్రావెల్ లారీలను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకొని స్వల్ప దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళలు రేణిగుంట : మండలంలోని పిల్లపాల్యం సమీపంలో రెండు మూడు నెలలుగా రాత్రీ, పగలు తేడా లేకుండా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై విసుగెత్తిపోన పిల్లపాల్యం మహిళలు మంగళవారం ఉదయం రోడ్డెక్కారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఆపాలని ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇంతలో కూటమి నాయకులు ఉలిక్కిపడి ఎక్కడ పెద్ద ఇష్యూ అవుతుందేమోనని గ్రామంలోని పెద్ద మనుషులతో చర్చించి హుటాహుటిన మహిళలను వెనక్కి పిలిపించారు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మహిళలను పంపించి వేశారు. విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. బార్ వద్దు..భద్రత కావాలని మహిళల నిరసన తొట్టంబేడు : శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ ఆర్చీ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని (బార్) వద్దు అంటూ స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వద్దు.. మహిళలకు రక్షణ కావాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో మద్యం దుకాణం (బార్) ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ కరువుతుందని, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.. ఈ దుకాణం రద్దు చేసే వరకు ప్రతిరోజు నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. -
శ్రీకాళహస్తిలో పోలీసుల ఆంక్షలు
శ్రీకాళహస్తి: వైఎస్సార్సీపీ రైతు పోరుబాట సందర్భంగా మంగళవారం ఉదయమే వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లకూడదని 30 యాక్టు అమల్లో ఉందని పోలీసులు హడావుడి చేశారు. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు పోలీసుల అనుమతి కోరారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి అందరినీ పిలిచిన తరువాత రాత్రి 9 గంటలకు పోలీసులు తీరిగ్గా ర్యాలీ నిర్వహించకూడదని నేరుగా ఆర్డీవో కార్యాలయానికి రావాలని అనేక ఆంక్షలు పెట్టారు. రెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన జనం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి లేదని ఆటంకాలు కల్పించారు. అత్యధిక సంఖ్యలో వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు, రైతులు కిలోమీటరు దూరం కూడా లేని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లడానికి అడ్డువపడ్డారు. అడుగడుగునా పోలీసులు డ్రోన్లు, కెమెరాలు, ఫోన్లలో వైఎస్సార్పీ నాయకులను ఫొటోలు, వీడియోలో తీస్తూ ఇబ్బందులకు గురిచేశారు. స్థానిక టీడీపీ నాయకులకు వాటిని చేరవేశారు. -
ప్రయాణికుల కష్టాలు
తిరుపతి అర్బన్ : సూపర్సిక్స్ విజయోత్సవ సభ బుధవారం అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు జిల్లా నుంచి 364 బస్సులను మంగళవారం తెల్లవారు జామున తరలించారు. జిల్లాలో 762 ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో 50 శాతం సర్వీసులను అనంతపురంలో నిర్వహిస్తున్న సీఎం సభకు తరలించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. జిల్లాలోని 11 డిపోల నుంచి బస్సులను అనంతపురానికి పంపించారు. ఒక్కో డిపో నుంచి 30 నుంచి 70 సర్వీసులను సభకు తరలించారు. సాధారణంగా తిరుమల బస్సులను ఏ సమావేశానికి ఎప్పుడూ పంపించిన సందర్భాలు లేవు. అయితే అనంతపురం సభకు తిరుమలకు వెళుతున్న 70 బస్సులను తరలించారు. తిరిగీ ఈ సర్వీసులు జిల్లాకు గురువారం వస్తాయని అధికారులు చెబుతున్నారు. సీఎం మీటింగ్ నేపథ్యంలో ప్రయాణికులకు మూడు రోజుల పాటు కష్టాలు తప్పడంలేదు. . తిరుపతి బస్టాండ్లో మంగళవారం బస్సుల కోసం గంటల కొద్ది ప్రయాణికులు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ అధికారులు ఇలా అడ్డదిడ్డంగా మీటింగుల పేరుతో బస్సులను పక్క జిల్లాకు తరలించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయ సదస్సు విజయవంతానికి కృషి
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సును విజయవంతం చేయడానికి సకల వసతులు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం 300 మంది సచివాలయ ఉద్యోగులకు సదస్సులో చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి లైజన్ అధికారులకు సదస్సు నిర్వహణకు చెందిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు లైజన్ అధికారులకు వ్యవహరించాల్సి ఉంటుందని...14,15 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు చైర్మన్గా దగ్గుపాటి పురంధేశ్వరి వ్యవహరిస్తారని చెప్పారు. హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్ అప్పగించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ప్రోటోకాల్) శివశంకర్ నాయక్, సచివాలయ ఉద్యోగులు (లైజన్) పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలపై కన్నెర్ర
తిరుపతి సిటీ : కూటమి ప్రభుత్వంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ కన్నెర్ర చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక భరించలేం.. తాడో పేడో తేల్చుకుంటామంటూ అల్టిమేటం జారీ చేసింది. రెండేళ్లుగా జిల్లాలోని సుమారు 108 ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఇప్పటి వరకు ఫీజురీయింబర్స్మెంట్ ఒక్క రూపాయి అందకపోవడంతో యాజమాన్యాలు ప్రభుత్వంపై తుది పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో తుది పోరుకు సిద్ధమవుతూ మంగళవారం అన్ని కళాశాల యాజమాన్యాలను అప్రమత్తం చేశాయి. కళాశాలలను మూత వేయమంటారా...! జిల్లాలోని ప్రైవేటు కళాశాలలకు ఇప్పటి వరకు సుమారు రూ.650 కోట్లు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాల్సి ఉందని యాజమాన్యాలు వాపోతున్నాయి. అంటే ఒక్కో కళాశాలకు సుమారు రూ. 3కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ డిమాండ్లు ఇవే.... 2023 నుంచి 2025 ఏడాది వరకు పెండింగ్ ఆర్టీఎఫ్ నిధులు వెంటనే విడుదల చేయాలి డిగ్రీ ఫీజులను సవరించి, కొత్త ఫీజుల విధానాన్ని వర్సిటీలకు అప్పగించాలి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలి కళాశాలలకు అఫ్లియేషన్ 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాలి ప్రతి ఏడాది అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసి అమలు చేయాలి రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో కామన్ అఫిలియేషన్ అమలు చేయాలి కళాశాల మనుగడ ప్రశ్నార్థకమే జిల్లాలో ప్రైవేటు కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కోట్లలో బకాయిలు ఉండటంతో కళాశాల నిర్వహణ భారమవుతోంది. అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో జిల్లాలోని వందల కళాశాల యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. అడ్మిషన్ల విషయంలో ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం వహించడంతో ప్రవేశాలు 50శాతం సైతం దాటడం లేదు. సాధారణ కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. తక్షణం ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలి. లేదంటే రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధర్వంలో తుది పోరుకు సిద్ధమవుతాం. – పట్నం సురేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ -
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తాం
రాపూరు : రాష్ట్రంలోని ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు అన్నారు. రాపూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉత్తమ ఉద్యోగుల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీ లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కార్గో సర్వీసులో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్ధానంలో ఉందన్నారు. కార్గో సర్వీసును ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. బస్సుల్లో 100 మంది కంటే ఎక్కువ మందిని ఎక్కించవద్దని ఆదేశించారు. రాష్ట్రానికి కొత్తగా ఎలక్టికల్ బస్సులు రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1050 బస్సులు ఉన్నాయని మరో 300 బస్సులు వస్తాయని, అవికాక మరో 1500 బస్సులు అవసరమని ఆయన చెప్పారు. బస్సులు ఎక్కడా ఆగకుండా కొత్త టైర్లు, అవసరమైన సామాగ్రిని అందించాలని మెకానిక్లు బస్సును కండీషన్లో పంపాలని సూచించారు, అనంతరం రాపూరు ఆర్టీసీ డిపోలో అత్యధికంగా మైలేజ్ తీసుకొచ్చిన డ్రైవరు నరసింహులు, కరిముల్లాను , కండక్లర్లు వెంకటేశ్వర్లు, సంపూర్ణను అభినందించి నగదు , ప్రశంసా పత్రాలను అందించారు. అలాగే మెకానిక్ సుధాకర్, చాన్భాషా, ఆర్టీసీ ఆఫీస్ సిబ్బంది రహీం, హరిబాబుకు ప్రసంసాపత్రాలు , నగదును అందించారు.అనంతరం ఆర్టీసీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సురేష్రెడ్డి, ఈడీ నాగేంద్రప్రసాద్, ఆర్ఎం షమీం, డీఎం అనిల్కుమార్, ఆర్టీసీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
104 వాహన డ్రైవర్ సస్పెన్షన్
డక్కిలి : డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తిరుపతి జిల్లా ఎయిడ్స్, లెప్రసీ అండ్ టీబీ అధికారి , జిల్లా అదనపు డీఎం అండ్ హెచ్ఓ అధికారిణి డాక్టర్ శైలజ మంగళవారం విచారణ చేపట్టారు. ఈనెల 9న మంగళవారం అర్ధరాత్రి మందులు మాయం అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. దీనిపై జిల్లా డీఎంహెచ్ఓ ఆదేశాలు మేరకు అదనపు డీఎంహెచ్ఓ పీహెచ్సీలో వైద్యాధికారులతో విచారణ చేపట్టారు. పీహెచ్సీ ఆవరణలోని గోడౌన్లో ఉన్న మందులు కేవలం 104కి మాత్రమే చెందినవని, డక్కిలి పీహెచ్సీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.104 వాహన డ్రైవర్ కాలం చెల్లిన మందులను ట్రాక్టర్లో తీసుకెళ్లడం ఆదివారం జరిగిందన్నారు. ఈ మందులను ఆదివారం 6–30 గంటల సమయంలో తీసుకెళ్లడంతో సిబ్బందికి ఎవ్వరికీ తెలియదన్నారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా వైద్యాధికారులు , సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. విచారణ పూర్తయ్యే వరకు 104 వాహన డ్రైవర్ను సస్పెండ్ చేసినట్లుగా 104 జిల్లా మేనేజర్ రాజేష్ వివరించారు. జరిగిన ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి , విచారణ నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం మందుల తరలింపుపై వైధ్యాధికారులతో వివరించగా విచారణ జరిపారు. విచారణ నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యఖాధికారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విచారణలో వైద్యాధికారులు శ్రీహరి, బిందు ప్రియాంక, వైద్య సిబ్బంది ఉన్నారు. -
అమ్మకానికి 'ఎర్రబంగారం'
ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన దుంగలను కేంద్రీయ ఎర్రచందనం డిపోలో భద్రపరుస్తారు. వాటికి వేలం పాట నిర్వహించనున్నారు. రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అటవీశాఖ ఎర్రచందనం నిల్వలపై దృష్టి సారించింది. కేంద్రీయ డిపో(తిరుపతి)లో ఉన్న ఎర్రచందనం అమ్మేందుకు అన్ని చర్యలను తీసుకుంది. శేషాచలం అటవీ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం లభ్యమైనా సెంట్రల్డిపోకు తరలిస్తున్నారు. రాజంపేట, కపిలతీర్ధంలో కూడా ఎర్రచందనం డిపోలు ఉన్నాయి. వీటి నిల్వల విషయంలో సీఆర్ఎస్ ప్రధానంగా వ్యవహారిస్తోంది. ప్రస్తుతానికి 135 టన్నులు వేలానికి సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సీఆర్ఎస్ సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో శేషాచలం, వెలుగొండలో మాత్రమే అధికంగా ఎర్రచందనం పెరుగుతోంది. ఈ కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాపైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తులో ఉన్నాయి. రాజంపేట ఎర్రబంగారానికే డిమాండ్జీవవైవి«ధ్యఅటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తింపు పొందిన శేషాచలం ఎర్రచందనం చెట్లతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయమార్కెట్లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి ఎక్కువ డిమాండ్ ఉంది. వైఎస్సార్జిల్లాలో 3.2 మిలియన్లు హెక్టార్లలో, అన్నమయ్య జిల్లాలో 2.8 మిలియన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఎర్రచందనం అనే పేరు ఎలా.. ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. టెరోకార్పస్సాంటలైనస్ అనేది దీని శాస్త్రీయనామం. టెరో అనే గ్రీకు మాటకు ఉడ్(కర్ర) అని అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలాగట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే ఏడాది పడుతుంది. దీనినే ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం. ఎర్రబంగారం అని కూడా అంటారు. రాజంపేట, రైల్వేకోడూరు పరిధిలో.. రాజంపేట, రైల్వేకోడూరు రేంజ్ పరిధిలో 50 వేల హెక్టారలో శేషాచల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో అధికంగా ఎర్రచందనం ఉంది. ఈ అడువులను జీవావరణ రిజర్వుగా కేంద్రం ప్రకటించింది. ఐదువేల వృక్షజాతులు మొక్కలు కలిగిన శేషాచల అడవులకు బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించారు. ఈ అడవులో 1700పైగా పుష్పించే జాతి మొక్కలు ఉన్నాయి. దుంగలన్నీ ఒకచోటికి.. స్మగ్లర్ల అక్రమరవాణా నేపథ్యంలో ఎల్లలు దాటిన ఎర్రచందనాన్ని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్మగ్లర్లు అక్రమంగా నిల్వ చేసిన ఎర్రదుంగలను , అటవీ, పోలీసు,కస్టమ్స్శాఖల వద్ద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఒకేచోటికి రప్పించి భద్రపరిచే పనులకు నాలుగేళ్ల క్రితం అటవీశాఖ శ్రీకారం చుట్టింది. టెండర్ల ద్వారా విక్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసింది. తిరుపతి కేంద్రీయ ఎర్రచందనం డిపోకు జిల్లాలోని డిపోలో నిల్వ ఉంచిన వాటిని తరిలిస్తారు. అక్కడే వేలంపాట నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. డిమాండ్ ఎందుకు.. చైనా, జపాన్లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలుకూడా ఎర్రచందనంతో తయారు చేసినవి వాడుతుంటారు. సంగీతవాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. రష్యా వాళ్లు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తుంటారు. అందులో ఔషధగుణాలు ఉన్నాయి. వయగ్రా, కాస్మెటిక్, ఫేస్ క్రీమ్ లాంటి వాటిలో వీటిని వాడతారు. అల్సర్ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. » విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్స్ టాస్్కఫోర్స్ను ఏర్పాటుచేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ చెట్లను నరకకుండా అడ్డుకుంటోంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్ఫోర్స్లో పోలీసు, ఫారెస్టు, ఏపీఎస్పీ, సివిల్ పోలీసు డిపార్టుమెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్క్వార్టర్గా పనిచేస్తోంది. గత 15 సంవత్సరాల్లో 15 లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది. » సీఆర్ఎస్ డిపోలోని నిల్వ ఉన్న మూడు రకాల ఎర్రబంగారం వేలంపాటకు సిద్ధమైంది. ఈ–సేల్ ద్వారా అమ్మకాలు సాగించనున్నారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 6 వరకు ఎర్రబంగారు కొనుగోలు దారులు డిపో సందర్శించే అవకాశం కల్పించారు. చిప్స్, బటన్స్, రూట్స్ రకాలను వేలంపాటలో అమ్మకానికి సిద్ధం చేశారు. రేట్ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయనుంది.అటవీప్రాంతం: శేషాచలం(బయోస్పెయిర్) అన్నమయ్య జిల్లా: 2.8 మిలియన్ల హెక్టార్లు వైఎస్సార్ జిల్లా: 3.2 మిలియన్ల హెక్టార్లు -
నగల దుకాణంలో చోరీ యత్నం
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని దర్గా వీధిలోని ఓ నగల దుకాణంలో ఇద్దరు మహిళలు చోరీకి యత్నించారు. షాపు యజమాని కనిపెట్టడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. స్థానికులు వెంబడించి ఓ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చోరీకి యత్నించిన మహిళలకు తిరుపతికి చెందిన వారుగా గుర్తించారు. పాము కాటుకు మహిళ మృతి కేవీబీపురం : మండలంలోని మిద్దికండ్రిగలో సోమవారం పాముకాటుకు ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన మంగమ్మ (44) సజ్జ కోతకు వెళ్లింది. పంట కోస్తున్న సమయంలో గుడ్డి పింజరి పాము కరిచింది. తోటి కూలీలు వెంటనే ఆమెను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మంగమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అర్ధరాత్రి మందులు మాయం!
డక్కిలి : ప్రజారోగ్య రక్షణకు వినియోగించాల్సిన మందులను ఆదివారం అర్ధరాత్రి మాయం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 104 డ్రైవర్ అక్రమంగా మందులను ట్రాక్టర్ తరలించిన వ్యవహారం సోమవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలకు 104 వాహనం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ మేరకు పీహెచ్సీ గోడౌన్లో మందులను నిల్వ చేస్తుంటారు. అయితే 104 డ్రైవర్ వెంకటరమణ ఎవరికీ చెప్పకుండా, వైద్యాధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా మందులను ట్రాక్టర్ ట్రాలీలో లోడ్ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన స్థానిక యువకులు ట్రాక్టర్ను వెంబడించారు. మందులను ఎక్కడకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. అవి కాలం చెల్లిన మందులని, నిమ్మ చెట్లకు చల్లేందుకు తీసుకెళుతున్నానని డ్రైవర్ సమాధానమివ్వడంతో కంగుతిన్నారు. పక్కదారి పట్టిన సేవలు? మందుల అక్రమ రవాణాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లగా 104 సిబ్బంది అవసరం లేకపోయినా రూ.లక్షలు విలువైన మందులను ఓ కంపెనీ నుంచి ఆర్డర్ ద్వారా తెప్పిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి పీహెచ్సీకి కావాల్సిన మందులను ఇండెంట్ పెట్టుకుని వైద్యాధికారి అనుమతులతో తీసుకురావాల్సి ఉంటుంది. కానీ, ఈ పీహెచ్సీ సిబ్బంది మాత్రం నిబంధనలకు గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాలకు మించి మందులు తెప్పిస్తున్నట్లు తెలిసింది. దీంతో వచ్చిన మందుల్లో ఎక్కువ శాతం ప్రజలకు చేరకుండానే కాలం చెల్లుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 104 డ్రైవర్ తరలించిన మందుల్లో అయితే కొన్ని బాక్సులు కనీసం సీల్ కూడా తీయలేదని వెల్లడిస్తున్నారు. మొత్తం వ్యవహారం గమనిస్తే.. వైద్యాధికారి పర్యవేక్షణలో సాగాల్సిన 104 సేవలు పూర్తిగా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది.ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న మందులు ఇవే.. -
ఎర్రమట్టి..కొల్లగొట్టి!
పాలసముద్రం: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు కొల్లగొడుతోంది. అందినకాడికి ఎర్ర గావెల్ను తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. దీనిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి అండతో మరింత రెచ్చిపోతోంది. మండలంలోని వనదుర్గాపురం రెవెన్యూ లేక్కదాఖాల జగనన్న కాలనీ సమీపంలోని గుట్టపై కన్నేసింది. తలసిందే తడువుగా హిటాచీలు దించేసింది. పదుల సంఖ్యలో ఎర్రగ్రావెల్ను నింపి లారీలను సరిహద్దు దాటించింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే! మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీకి ఆనుకుని గుట్టలున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ గుట్టల్లోని మట్టిని తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ గ్రావెల్ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. వాహనాలు సీజ్ వనదుర్గాపురం గుట్టలో ఎర్రమట్టి తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తవ్వకాలు, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేశారు. తమిళనాడు టిప్పర్లకు అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు. -
కలెక్టరేట్కు వెల్లువెత్తిన వినతులు
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు వినతులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై 238 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు హాజరై వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినతులను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం విభిన్నప్రతిభావంతులు శ్రీదేవి, రాజమ్మ, మునికృష్ణారెడ్డికి మూడు చక్రాల సైకిళ్లు, టి.సుచీంద్రకు ట్రైసైకిల్, మురళికి కర్రలను పంపిణీ చేశారు. గౌరవ వేతనం కోసం నిరసన వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం జోనల్ అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇమామ్కు రూ.10వేలు,మౌజన్కు రూ.5వేలు ప్రతినెల క్రమం తప్పకుండా ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వంలో 12 నెలలుగా మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు అధికారులకు వినతిపత్రం అందించారు. మైనారిటీ విభాగం నేతలు షేక్ కాసిమ్, షేక్ ఖాదర్ బాషా, పఠాన్ ఫరీద్, చాంద్ బాషా, ఇమ్రాన్ బాషా,, షేక్ గపూర్, మస్తాన్, వహీద్, షర్మిల షేక్, సనాల్లాహ్ షేక్, అమీర్ భాయ్, షేర్ ఖాన్,సలీం పాల్గొన్నారు. పింఛన్ పెంచండి ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో మృత్యువుతో పోరాటం చేస్తున్నామని...తమకు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్ నగదు పెంచాలని పలువురు దివ్యాంగులు కోరారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. -
అడుగడుగునా జల్లెడ
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకండా తిరుమలలోని వివిధ శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా సోమవారం స్టెరిలైజేషన్, ఎకై ్సజ్, జాయింట్ టీమ్ ఇన్స్పెక్షన్కు శ్రీకారం చుట్టారు. పోలీసులు, విజిలెన్స్, బాంబ్స్క్వాడ్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్, ఎలక్ట్రికల్, హెల్త్ అధికారులు రంగంలోకి దిగారు. సుమారు 38 మంది రెండు బృందాలు విడిపోయి ఉదయం 7.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. జీఎంసీ టోల్గేట్ నుంచి అలిపిరి వైపుగా 9 కిలోమీటర్ల మేర అడుగడుగునా జల్లెడ పట్టారు. ఆయా మార్గాల్లో మొత్తం 150 షాపులను తనిఖీ చేశారు. దుకాణాల్లో సీసీ కెమెరాలను, తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. షాపుల్లో పనిచేసే సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో తెలపాలన్నారు. అనధికార హాకర్లను తిరుపతికి తరలించారు. అలాగే నడకమార్గంలోని మరుగుదొడ్లు, డస్ట్బిన్లు, కల్వర్టులను బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు స్టెరిలైజేషన్ బృందాలు అప్రమత్తంగా పనిచేస్తుంటాయని అధికారులు వెల్లడించారు. కొండపై క్యూల పరిశీలన తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎస్పీ హర్షవర్ధన్రాజు తనిఖీలు నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్లోని ఆక్టోపస్ సర్కిల్ నుంచి ఈఎస్ఐ వన్ గేట్ వరకు క్యూలను పరిశీలించారు. గరుడ సేవ రోజున భక్తులకు ఇబ్బందులు లేకుండా పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా సాగేలా ప్రతి విభాగం పని చేయాలని ఆదేశించారు. తిరుపతికి మూడు జాగిలాలు నూతనంగా మూడు జాగిలాలు పది నెలలపాటు ట్రైనింగ్ తీసుకుని జిల్లాకు చేరుకున్నాయి. వీటిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం పరిశీలించారు. జోన, వేగ, సిరి పేర్లు ఈ జాగిలాలు డ్యూయల్ ట్రైనింగ్, సబ్జెక్ట్, నార్కోటెక్స్, గంజాయి ట్రాకింగ్లో పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జనంద కుమార్, ఏఆర్పీసీలు తిమ్మయ్య, రావణ్ వర్మ, రెడ్డి ప్రకాష్, శ్రీనివాసులు హ్యాండ్లరుగా ఉన్నారని వివరించారు. ఈ జాగిలాల సేవలను శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తులో భాగంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్పై శిక్షణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ , సీపీఆర్ చేసే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించారు. -
పీజీ అడ్మిషన్లకు ఆన్లైన్ అవస్థలు
తిరుపతి సిటీ : పీజీసెట్–2025 కౌన్సిలింగ్ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. దీంతో జిల్లాలోని అన్ని నెట్ సెంటర్ల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసినా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి అధికారుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. జిల్లాలో పీజీ అడ్మిషన్లకు సంబంధించి సోమవారం కనీసం 120 మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ కూడా కాకపోవడం గమనార్హం.గుండెపోటుతో భక్తుడి మృతిశ్రీకాళహస్తి : ముక్కంటి ఆలయంలో సోమవారం ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. హైదరాబాద్ కు చెందిన మధుబాబు(52) ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఉపవాసం ఆచరించి సోమవారం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయం నుంచి బయటకు వస్తూ ప్రసాదాల కౌంటర్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.అధికారులు వెంటనే స్పందించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుబాబు మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ గోపి వెల్లడించారు.శ్రీవారి సేవలో ఆర్మీ అధికారితిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం ఆర్మీ లెఫ్టినెంట్ కమాండర్ ధీరజ్సేథ్ సేవించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
తుస్సుమన్న పంట బీమా
కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. దేశానికి వెన్నెముకను నిర్దాక్షిణ్యంగా విరిచేస్తోంది. ఆరుగాలం కష్టించే అన్నదాతను నిలువునా దగా చేస్తోంది. వ్యవసాయం దండగ అనుకునే దుస్థితిలోకి రైతులను నెట్టేస్తోంది. కనీసం మాత్రం కనికరం లేకుండా అడుగడుగునా అవస్థల పాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సకాలంలో పెట్టుబడి సాయం అందించకుండా కాలయాపన చేసింది. వేరుశనగ విత్తనాలను అప్పనంగా పచ్చమూకకు పంచిపెట్టింది. అరకొరగా యూరియాను సరఫరా చేసి కర్షకులను ఇబ్బందులకు గురిచేసింది. ఎరువుల కోసం బారులు తీరే దయనీయ పరిస్థితి తీసుకువచ్చింది. చివరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో సైతం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ మేరకు కూటమి సర్కార్ వైఖరిపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. వ్యవసాయానికి బాసటగా నిలిచేందుకు రంగంలోకి దూకింది. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ కింద మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అర్బన్ : ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. అధికారుల లెక్కలు ప్రకారం జిల్లావ్యాప్తంగా 5.5లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. ఈ సీజన్లో వరి 80వేల ఎకరాలు, మరో 20వేల ఎకరాల్లో వేరుశనగ, సజ్జ, రాగి, మినుములు, జొన్నలు ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యానశాఖ పరిధిలో మామిడి, నిమ్మ, మిరప, కూరగాయల తోటలు ఉన్నాయి. ప్రస్తుతం మామిడికి యూరియా అవసరం ఉండదు. మిగిలిన పంటలకు యూరియా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరి పంటకు మాత్రమే 50వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 35వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం సరఫరా చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఈ యూరియా పంపిణీలో సైతం భారీగా గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పాస్పుస్తకాలు చూపిన వారికే యూరియా ఇవ్వాల్సి ఉంది. అయితే కూటమి నేతలు ఆధార్ కార్డులు చూపించి అవసరానికి మించి యూరియాను పట్టుకెళ్లినట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అలా తీసుకెళ్లిన యూరియాను బ్లాక్లో విక్రయించి సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. సకాలంలో అదునుకు యూరియా వేయకపోవడంతో వరి దిగుబడి కూడా తగ్గినట్లు రైతులు వాపోతున్నారు. పాడి రైతులు పశుగ్రాసం కోసం యూరియా కావాలని ప్రాధేయపడినా కూటమి నేతలు కనికరించలేదని మండిపడుతున్నారు. కూటమి నేతలకే ‘రాయితీ’ ప్రభుత్వం ప్రతి సీజన్లో రాయితీపై విత్తనాలు అందిస్తుంది. ప్రధానంగా వేరుశనగతోపాటు పచ్చిరొట్ట విత్తనాల్లో ప్రధానంగా జీలగలు, జనుములు, పిల్లిపెసర అందించేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లోను సక్రమంగా పంపిణీ చేశారు. రైతుల అవసరాల మేరకు స్టాక్ను అందుబాటులో ఉంచేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఖరీప్ సీజన్కు సంబందించి కేవలం చంద్రగిరి నియోజక వర్గానికి మాత్రం 3,270 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు ఇచ్చారు. అవి కూడా కూటమి నేతలకు మాత్రమే. ఆ నేతలు విత్తనాలను తీసుకుని చమురు ఆడించుకునేందుకు వినియోగించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 36 డ్రోన్లు సైతం తమ వారికే.. అగ్రికల్చర్ చదువుకున్న వారికి 2023లో డ్రోన్ల వాడకంపై గుంటూరులో శిక్షణ ఇచ్చారు. వారికే 90శాతం రాయితీలో డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో శిక్షణ పొందిన వారికి కాకుండా, చదువుతో సంబంధం లేకుండా 36 డ్రోన్లు 80శాతం సబ్సిడీతో అధికార పార్టీ అనుయాయులకే కట్టబెట్టినట్లు సమాచారం. గతంలో శిక్షణ పొందిన వారికి మొండిచేయి చూపించారు. శిక్షణ పొందా.. డ్రోన్ ఇవ్వలేదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023 మే 16వ తేదీన డ్రోన్ ఫైలెట్గా పనిచేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఆ మేరకు సర్టిఫికెట్ అందించారు. డ్రోన్లు నడపడానికి పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందా. 90శాతం రాయితీతో నాకు డ్రోన్ వస్తుందని ఆశపడ్డా. 10 శాతం నగదును కూడా సిద్ధం చేసుకున్నా. అయితే కూటమి ప్రభుత్వం వేరే వాళ్లకు ఇచ్చింది. నాతోపాటు శిక్షణ పొందిన వారికి కూడా మొండిచేయి చూపింది. – నక్కా శోభనబాబు, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం సేవలు దూరం గతంలో రైతు భరోసా కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. విత్తనాలు, ఎరువులతోపాటు పంటల సాగుపై సలహాలు సైతం అందించేవారు. కూటమి సర్కార్లో రైతు సేవాకేంద్రాలు మార్చారు. మళ్లీ రేషన్లైజేషన్ పేరుతో 50శాతం కేంద్రాలను తగ్గించారు.వాటిలో కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్లను మరో 50శాతం తగ్గించారు. రెండు రైతు సేవా కేంద్రాలను ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్కు అప్పగించారు. దీంతో సేవలు దూరం అవుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు భూములు సైతం బీడు భూములుగా మారుతున్నాయి. – మధురెడ్డి, రైతు, చిల్లకూరు మండలం ఆదుకోవడం లేదు యూరియా కొరత అంశం ఒక్కటే కాదు. రైతులకు అవసరం అయిన మేరకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో అధిక ధరలు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అవి నాణ్యత లేకపోవడంతో మొలకలు రావడం లేదు. వేరుశనగ కాయలను మాకు చూపించడం కూడా లేదు. కూటమి నేతలు సిఫార్సు చేసిన వారికే పంపిణీ చేస్తున్నారు. కనీసం పచ్చిరొట్ట విత్తనాలను రాయితీల్లో ఇవ్వకపోవడం బాధాకరం. వేల సంఖ్యలో రైతులు ఉంటే నామమాత్రంగా కొందికే ఇచ్చి పంపించేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదు. – వెంకటయ్య, రైతు, వెంకటగిరి నియోజకవర్గం పనిముట్లతో సరిపెట్టి.. కూటమి సర్కార్ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఒక్క ట్రాక్టర్, వరికోత యంత్రాన్ని కూడా రాయితీతో ఇవ్వలేకపోయింది. అక్కడక్కడ అదీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రం కేవలం 8 రకాల చిన్న చిన్న పనిముట్లు పంపిణీ చేసి సరిపెట్టేసింది. దీంతో వేలాది మంది రైతులు రాయితీ పనిముట్లపై ఆశలు వదులుకున్నారు. రైతులను ముంచేసిన ప్రభుత్వం రామచంద్రాపురం : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం కుదేలైందని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్సీపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతులను కలుసుకున్నారు. ఎరువుల కొరత, గిట్టుబాటు ధర లేకపోవడం, సాగు ఖర్చులు భరించలేక పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని, బస్తాను రూ.400 నుంచి రూ.600 విక్రయిస్తున్నారని రైతులు వాపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులే మిగులుతున్నాయని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన భూమన మాట్లాడుతూ రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నదాత సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యతని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టే అన్నదాత పోరులో ఈ సమస్యలను బలంగా వినిపిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. అనంతరం రైతులతో కలసి బస్తాల్లో ధాన్యం నింపారు. అన్నదాత ఆర్థికాభివృద్ధే జగనన్న లక్ష్యమని, ఆ మేరకు వైఎస్సార్సీపీ సైనికులుగా చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. కూటమి సర్కార్ ఉచిత పంట బీమాను రద్దు చేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు, ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల మేరకు బీమా చెల్లించాలంటే రైతులే ముందుగా పంటను బట్టి నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఖరీప్ సీజన్లో వరి, సజ్జ, నిమ్మ, వేరుశనగ పంటలకు, రబీ సీజన్లో వరి, వేరుశనగ, మామిడి పంటలు సాగుచేసిన రైతులు వాళ్లే బీమా చేసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది. -
పకడ్బందీగా ‘మిషన్ శక్తి’
తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మిషన్ శక్తి పథకంపై ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నిశాఖల సమన్వయంతో పటిష్టంగా మిషన్ శక్తిని అమలు చేయాలని కోరారు. సమాజంలో ఆడబిడ్డలపై సాగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలు, బాలికల సాధికారతే లక్ష్యంగా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా 12వ తేదీ వరకు మిషన్ శక్తి చేపట్టాలని స్పష్టం చేశారు. డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ కృష్ణ మంజరి, నోడల్ ఆఫీసర్ వాసంతి పాల్గొన్నారు. -
పటిష్టంగా 20సూత్రాల అమలు
తిరుపతి అర్బన్ : స్వర్ణాంధ్ర–2047లో భాగంగా 20 సూత్రాలను పటిష్టంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్ఓ నరసింహులుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్, అమృత 1.0, విద్యా, వైద్య, ఉపాధిహామీ శాఖలకు సంబంధించి చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి లక్ష్యం వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష స్వర్ణాంధ్ర–2047 నెరవేర్చే దిశగా పనిచేయాలని సూచించారు. అమృత పథకంలో భాగంగా పట్టణాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం మంజూరైన నగదును సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు. -
డప్పు కళాకారుల సంక్షేమమే లక్ష్యం
తిరుపతి కల్చరల్ : డప్పు కళాకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దళిత డప్పు కళాకారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కుమార్రెడ్డి, మారెళ్ల శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఏపీ ఫౌండేషన్ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల డప్పు కళాకారలు సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం డప్పు కళాకారులను ప్రత్యేకంగా గుర్తించి 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసిందని, ఇప్పుడు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం అవి చెల్లవంటూ ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని డప్పు, డ్రమ్స్, పంబ, జముకులు, తీన్మార్ వంటి 18 నుంచి 70 ఏళ్ల వరకు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డప్పు కళాకారులకు కూడా పింఛన్ను రూ.5 వేలకు పెంచాలని కోరారు. డిసెంబర్లో రాష్ట్ర స్థాయి మహాసభ ఏర్పాటు చేసి డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి పరసారత్నం, నేతలు మురగారెడ్డి, పి.రెడ్డెప్ప, అంజయ్య, మురళి, సహదేవయ్య, వెంకటేష్, రామయ్య పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారిపై విచారణకు ఆదేశం
తిరుపతి తుడా : తిరుపతి కార్పొరేషన్లో సుమారు 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్న సేతుమాధవ్పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సేతుమాధవ్కు ఉద్యోగోన్నతి వచ్చినా రెవెన్యూ ఆఫీసర్ పోస్టును వదలకుండా ఉండడంపై ఇప్పటికే పలు పత్రికల్లో ఆరోపణలతో కథనాలు ప్రచురితమైనట్లు పేర్కొన్నారు. అలాగే తిరుపతి మున్సిపల్ అధికారి కేఎల్ వర్మ సైతం సేతుమాధవ్పై ఫిర్యాదు చేసిన విషయాన్ని కమిషనర్ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ పూర్తి చేసి నివేదికను త్వరితగతిన పంపించాలని కమిషనర్ను ఆదేశించారు. అడుగడుగునా అలసత్వం తిరుపతి సిటీ : ఉన్నత విద్యామండలి అధికారులు అడుగడుగునా అలసత్వం వహిస్తున్నారు. డిగ్రీ అడ్మిషన్ల విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశారు. ఎట్టకేలకు ప్రకియ పూర్తి చేసి విద్యార్థులకు ఆదివారం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సోమవారం ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫోన్లకు ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని పడిగాపులు కాశారు. విద్యామండలి అధికారులు మాత్రం నింపాదిగా సోమవారం రాత్రి సీట్లు కేటాయిస్తూ సమాచారం అందించారు. దీంతో సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారం కళాశాలల్లో అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. అయితే రెండు రోజులుగా సెల్ఫోన్లను చేతపట్టుకుని మెసేజ్ కోసం ఎదురుచూస్తూ మానసిక ఒత్తిడికి గురయ్యామని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్కు సంబంధించిన అంశాల్లో అయినా అధికారులు అలసత్వం వీడాలని సూచిస్తున్నారు. ‘అన్నదాత’కు బాసటగా.. ‘పోరు’బాట చంద్రగిరి : కూటమి ప్రభుత్వ నిర్వాకంతో అవస్థలు పడుతున్న అన్నదాతలకు బాసటగా వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందని పార్టీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. టమాట, ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో నష్టాలపాలవుతున్నారని వెల్లడించారు. కర్షకులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు అభినయ్రెడ్డి, మోహిత్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హర్షిత్రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 27,410 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 9,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈక్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక రేపు తిరుపతి ఎడ్యుకేషన్ : శ్రీకాళహస్తిలోని ఎస్వీ ఎస్వీ డిగ్రీ బాలుర కళాశాల ఆవరణలో బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్చరీ అండర్–11, 14, 17, 19 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. మంగళవారం ఈ మేరకు శ్రీకాళహస్తి జెడ్పీ హైస్కూల్ పీడీ వెంకటరమణ తెలిపారు. పోటీలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన వయసు నిర్ధారణ పత్రాలను తీసుకురావాలని, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్కుల లిస్ట్ తీసుకురావాలని కోరారు. వివరాలకు 92905 02041, 70135 82801 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఘటోత్సవ వైభవం
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ జన జాతర అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైంది. ఘటోత్సవంతో అమ్మవారి సంబరం అంబరాన్నంటింది. ఘటోత్సవం చూసేందుకు తరలివచ్చిన అశేష భక్త జనంతో వెంకటగిరి పట్టణ పుర వీధులు కిక్కిరిశాయి. పోలేరమ్మ తల్లీ చల్లగా చూడాలమ్మా అంటూ వేడుకున్నారు. ఘటం కుండలకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించి ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఘటం కుండలతో ఇంట్లో పూజలు చేస్తే సాక్షాత్తు పోలేరమ్మ తల్లే ఇంట్లో కొలువై ఉంటుందన్న విశ్వాసం. దీంతో అమ్మవారి ఘటోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు. ఘటోత్సవంలో అత్యుత్సాహం వెంకటగిరి (సైదాపురం) : రాష్ట్ర పండుగ వెంకటగిరి పోలేరమ్మతల్లి జాతర సందర్భంగా ఆదివారం ఘటోత్సవంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త విధానాలకు తెరలేపడంతో భక్తుల ఆగ్రహంతో పాత పద్ధతిలోనే కొనసాగించారు. వివరాలు ఇలా.. ఆదివారం నిర్వహించిన ఘటోత్సవంలో సంప్రదాయాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. వాస్తవానికి ఘటోత్సవం జీనుగుల వారి వీధిలోని మెట్టినింటి మండపం వద్ద నుంచి రాజా ప్యాలెస్కు నడక మార్గంలో ఘటం కుండలను ఊరేగించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాలను ఈ ఏడాది పక్కన పెట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘటం కుండలను ఊరేగించేందుకు ప్రత్యేక వాహనంలో జీనుగుల వారి వీధిలోని అమ్మ మెట్టి నింటి మండపం వద్ద ఎక్కించేశారు. ఘటం కుండలు నడకమార్గం గుండా రాకపోవడంతో స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు ఆగ్రహించారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య యథావిధిగా కాలి నడక ద్వారా సాగించారు. -
అటవీ భూములపై రాబందులు
సెంటు భూమి ఆన్లైన్ చేసుకునేందుకు రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. నిలువ నీడలేని పేదలు ఇంటి స్థలాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాలలో గుట్టలుగా పడి ఉన్నాయి. దేశసేవ చేసిన జవాన్లకు భూమి ఇవ్వాలంటే అధికారులకు చేతులు రావట్లేదు. అలాంటిది కూటమి ప్రభుత్వంలో కూటమి నేతలు వందల ఎకరాల ప్రభుత్వ అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్ : తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలానికి విశాలసమైన అటవీ ప్రాంతం ఉంది. తుడా పరిధిలో ఈ మండలం కలిసి ఉండటంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్ ఉంది. దీని దృష్ట్యా కూటమి రాబందులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఖాళీగా కనిపించే అటవీ భూములను తన్నుకుపోతున్నారు. మార్కెట్లో భూమి ధరలు విపరీతంగా ఉండటంతో కొందరు కూటమి నాయకులు పక్కా ప్రణాళికతో అదును చూసుకుని అటవీ భూములను చదును చేయడం, హద్దులు గీసుకొని ఇనుప కంచెలు వేసుకొని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఆపై భూములకు హద్దురాళ్లు పెట్టుకొని ఉపాధి హామీ నిధులతో యథేచ్ఛగా మామిడి తోటలను పెంచుకోవడం కొసమెరుపు. అక్రమణదారులకు అండగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తొత్తులుగా మారిపోవడంతో ఇష్జారాజ్యంగా సర్వే నంబర్లు సృష్టించడం, దొంగ పట్టాలను రూపొందించడం, అధికార బలంతో ఆన్లైన్ ప్రక్రియలు చేస్తున్నారంటూ ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీనిపై కొంత మంది రెవెన్యూ అధికారులు హస్తం ఉందని మండలంలో జోరుగా చర్చ సాగుతోంది. ఆక్రమణలు ఎక్కడంటే.. మండంలోని అనుప్పల్లి సర్వే నంబరు 411 నుంచి 480 వరకు సర్వే నంబర్లను సృష్టించుకుని సుమారు 100 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించేశారు. పుల్లమనాయుడు కండ్రిగకు చెందిన ఓ ఎస్టీ మహిళకు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2 ఎకరాల భూమికి సంబంధించి పట్టాను అందజేశారు. అయితే అదే పట్టాతో సమీప గ్రామంలో అగ్రకులానికి చెందిన ఓ నేత 10 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించేశాడు. ఆపై ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పనులు సైతం చేయించుకుని, ప్రస్తుతం వాటి ఆనవాళ్లు లేకుండా చెరిపేశారు. రాయలచెరువు సర్వే నంబరు 410/1, 410/6, 409/1ఎలో నాలుగు ఎకరాలు ఉన్నట్లు పత్రాలు సృష్టించుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో 20 ఎకరాలకు పైగా ఆక్రమించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. బోగస్ సర్వే నంబర్లతో ఆక్రమణలు.. అనుప్పల్లి, రాయలచెరువు, పుల్లమనాయుడు కండ్రిగలో వందల ఎకరాల ఆక్రమణలోని పత్రాల్లో నమోదు చేసిన సర్వే నంబర్లు పూర్తిగా బోగస్ నంబర్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో 2019లో అటవీ భూముల ఆక్రమణలపై అధికారులు అడ్డుకున్నారు. ఇక్కడ ఎలాంటి పనులు చేయకూడదంటూ స్పష్టం చేశారు. దీంతో గత ప్రభుత్వంలో ఆక్రమణలకు చెక్ పడింది. అటవీ భూముల వెనుక ఆ నేత అభయం రామచంద్రాపురం మండలంలో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన వందల ఎకరాలు అన్యాక్రాంతం వెనుక నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సంపూర్ణ సహకారం ఉందన్న చర్చ మండలంలో జోరుగా సాగుతోంది. గత వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన స్థానిక నేత ఒకరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులతో డీల్ చేసినట్లుగా ఆ పార్టీ నేతలో బహిరంగంగా విమర్శిస్తున్నారు. వందల ఎకరాలను కూటమి నేతలు వశం చేసుకోవడానికి, సుమారు రూ.40 లక్షలకు పైగా ముడుపులు అందించినట్లు విశ్వసనీయ సమాచారం.ప్రేక్షకపాత్ర వహిస్తున్న రెవెన్యూ అధికారులు రామచంద్రాపురం మండలంలో కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని రక్షించాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు మౌనంగా ఉండడంపై ప్రజలు మండిపడుతున్నారు. 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అటవీ భూముల దోపిడీపై జిల్లా అధికారులు సైతం చర్యలు చేపట్టారు. వారి వద్ద ఉన్న పత్రాలు, సర్వే నంబర్లు బోగస్ అని అధికారులు అప్పట్లోనే తేల్చేశారు. అయితే ప్రస్తుతం మరోసారి కూటమి అధికారంలోకి రావడంతో రెక్కలు విప్పుకుని అటవీ భూములపై వాలిపోతున్నారు. విలువైన భూములను పరిరక్షించాల్సింది పోయి, రెవెన్యూ అధికారులు వారితో చేతులు కలపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అటవీ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు. -
ఎస్వీయూ నిరాకరణ!
తిరుపతి సిటీ : పీజీ సెట్–25 అడ్మిషన్ల ప్రక్రియపై ఉన్నత విద్యామండలి వ్యవహారశైలిపై ఎస్వీయూ అసహనం వ్యక్తం చేసి నిరాకరించింది. దీంతో ఆ బాధ్యతలను నాగార్జున వర్సిటీకి అప్పగించారు. ఆ యూనివర్సిటీ సైతం తాము చేపట్టలేమని తెగేసి చెప్పినా కాళ్లవేళ్లా పడటంతో ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాగార్జున వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రవికుమార్కు కౌన్సెలింగ్ కన్వీనర్గా నియమించారు. పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన విధంగా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఉమ్మడి పద్ధతిలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. ఎట్టకేలకు పీజీ ప్రవేశాల ప్రక్రియకు సన్నద్ధమయ్యారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసి పదిరోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది నోటిఫికేషన్ విడుదల వివరాలు పీజీసెట్–2025 అడ్మిషన్ల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు పీజీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉండనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 22 నుంచి 24వ తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. -
ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు
తిరుపతి అర్బన్ : ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఆదివారం తిరుపతిలోని ఆరు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో నిర్వహించామని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్, బీట్, సెక్షన్ ఆఫీసర్లకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు చేపట్టామని వెల్లడించారు. ఉదయం పరీక్షల్లో 10,493 మంది అభ్యర్థులకు 8,670 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. 1823 మంది హాజరు కాలేదని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం పరీక్షల్లో 1690 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1335 మంది మాత్రమే వచ్చారని చెప్పారు. 358 మంది హాజరు కాలేదని వివరించారు. చంటి బిడ్డలతో హాజరైన మహిళలు తిరుపతి అర్బన్ : తిరుపతి నగరంలో ఆదివారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో పరీక్షలను రాయడానికి పలువురు మహిళా అభ్యర్థులు తమ చంటి బిడ్డలతో పరీక్షలకు హాజరయ్యారు. -
ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ఫో
తిరుపతి కల్చరల్ : క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈనెల 5,6,7 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రదర్శించిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ప్రదర్శన ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు, వివిధ గృహ సుందరీకరణ వస్తువులు, ప్లాట్లు, అపార్ట్మెంట్, రుణ సదుపాయాలు, అధునాతన కార్లు వంటి వాటిని ఒకే వేదికపైకి తెచ్చి సుమారు 60 స్టాల్స్తో ప్రజల కలలు సాకారం చేసే దిశగా కృషి చేసిన క్రెడాయ్ ప్రతినిధులను వారు అభినందించారు. అనంతరం క్రెడాయ్ చైర్మన్ గోపినాథ్, అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు తాము ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆదరించి విజయవంతం చేసిన ప్రజలకు, సహకరించిన కంపెనీల ప్రతినిధులకు కృతజ్ఞతులు తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షుడు రాజేష్బాబు, కోశాధికారి హరికృష్ణ, సహాయ కార్యదర్శి శ్రీధర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
● ఆలయ ‘గ్రహణం’
కాణిపాకం, పెంచలకోన ఆలయాల తలుపులు మూసివేస్తున్న అధికారులుసంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలు మూతపడ్డాయి. రాత్రి 9.57 నుంచి గ్రహణ సమయం మొదలవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచే ఆలయాలను మూసివేశారు. ఈ క్రమంలోనే తిరుమల, తిరుపతి, కాణిపాకం, పెంచలకోన, బోయకొండ, మొగిలిలో సంప్రదాయబద్ధంగా మహద్వారాలు మూతపడ్డాయి. అయితే రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదిదంపతులకు శాంతి అభిషేకం నిర్వహించారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. సంప్రోక్షణ, పుణ్యాహవచనం తర్వాత భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతించారు. – తిరుమల/శ్రీకాళహస్తి/కాణిపాకం -
బస్సును ఢీకొన్న ట్రాక్టర్ ఇద్దరికి గాయాలు
దొరవారిసత్రం: జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ప్రైవేటు బస్సును ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, టపాయిండ్లు గ్రామానికి చెందిన రమేష్, కల్లూరుకు చెందిన సురేంద్ర ట్రాక్టర్ను సర్వీస్ చేసుకునేందుకు సూళ్లూరుపేటకు బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపు తప్పిన ట్రాక్టర్ ముందు వెళుతున్న ప్రైవేట బస్సును ఢీకొని బోల్తా పడింది. దీంతో డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న ప్లాజా అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ అజయ్కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరిపంట కొనుగోలే లేదు
పుంగనూరు : పుంగనూరులో వరిపంట కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖరీఫ్ పంట పండించిన రైతులు వరి ధాన్యాన్ని తమకు నచ్చిన రీతిలో క్వింటా రూ.2,200తో విక్రయాలు చేసుకున్నారు. కాగా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల , సదుం, రొంపిచెర్లం, పులిచెర్ల మండలాలతో పాటు పంజాణి, గంగవరం మండలాల్లో సుమారు 5,200 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం రబీ సాగు 2.50 హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. ఈ సారైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి
తిరుపతి క్రైం : తిరుమలలో ఈనెల 24వ తేదీ నుంచి జరగబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని ఈసారి కూడా అదే తరహాలో జరగాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించాలన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలన్నారు. తిరుమలలోని బాలాజీ నగర్తో పాటు పాప వినాశనం ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్లు భక్తులతో ఏ విధంగా వ్యవహరించాలో అవగాహన కల్పించాలన్నారు. తిరుమలలో పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ నిర్వహించాలని ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. 400 మంది సిబ్బందితో క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దానిపైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆర్మ్డ్ అడిషనల్ ఎస్పీకి సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు తిరుమలలో ఏ రూట్లో వెళ్లాలి.. అనే విషయం ఇప్పటికే నిర్ధారించుకోవాలన్నారు. ఇంటిగ్రేట్ చెక్ పోస్టులు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి, తిరుమలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి , శ్రీవారి మెట్టు మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సెక్టార్లో సీసీ కెమెరాలతో పాటు సోలార్తో పనిచేసే కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల దర్శనం అనంతరం ఎలా వెళ్లాలి అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహర్ ఆచారీ, శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటనారాయణ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. మూల విరాట్కు పవిత్ర మాలధారణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్రమాలలు విశేష పూజా ద్రవ్యాలను శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడికి పవిత్రమాల సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలల సమర్పణ వేడుకగా చేపట్టారు. యాగశాలలో శాంతి హోమ పూజలు, చండికేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయన్నారు. మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేపట్టారు. అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్ను పల్లకీపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. దీంతో పవిత్రోత్సవాలను పరిసమాప్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజు, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పెంచలకోన క్షేత్రంలో... రాపూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిలు శేష వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై కొలువుతీర్చి క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శాంతి హోమం, పూర్ణాహుతి , నివేదన, మహాకుంభప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి మాట్లాడుతూ.. మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయన్నారు. -
జాతరకూ గుంతలే రోడ్లే
వెంకటగిరి (సైదాపురం) : రాష్ట్ర పండుగగా జరుగుతున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరకు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు మీదుగా వెంకటగిరికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్న విషయాన్ని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆ శాఖ ఆఽధికారులను రోడ్డు బాగు చేయాలని ఆదేశించారు. జాతర ఆదివారం ఘటోత్సవంతో ప్రారంభమై మరో మూడు రోజుల్లో ముగియనుంది. కాని రోడ్డు మరమ్మతులు మాత్రం మొక్కుబడిగా సాగుతున్నాయి. జాతర సమయంలో వేల మంది ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగిస్తారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
శోత్రియ భూముల్లో ఆక్రమణలు చేపడితే జైలే
వరదయ్యపాళెం : మండలంలోని చిన్న పాండూరు పంచాయతీ పాదిరికుప్పం రెవెన్యూలోని శోత్రియ భూముల్లో ఆక్రమణలు చేపట్టడం, దుక్కి దున్నకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మండల తహసీల్దార్ సుధీర్రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కొందరు అక్రమార్కులు కొద్ది రోజులుగా ట్రాక్టర్ల ద్వారా దుక్కి దున్నకాలు చేపడుతున్నారు. దీనిపై శనివారం శోత్రియ భూముల్లో దొంగలు పడ్డారు అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దార్ సుధీర్ రెడ్డి శోత్రియ భూములు సందర్శించి అక్రమంగా చేపట్టిన దుక్కి దున్నకాలను పరిశీలించారు. తక్షణమే శోత్రియ భూముల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై ఎవరైనా దుక్కి దున్నకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అక్రమార్కులను హెచ్చరించారు. స్థానిక వీఆర్వో, వీఆర్ఏలను ఈ విషయమై గట్టిగా మందలించి చిన్నపాటి ఆక్రమణలు జరిగినా తన దృష్టికి తక్షణమే తీసుకురావాలని ఆదేశించారు. శోత్రియ భూములపై నిఘా ఉంచాలని సూచించారు. ఆయన వెంట వీఆర్వో చలపతి, విలేజ్ సర్వేయర్ రాఘవ ఉన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
రేణిగుంట : గత పదేళ్లుగా వంద ఇళ్లలలో తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న తమిళనాడుకు తుత్తుకూడి జిల్లాకు చెందిన తంగ ముత్తు అనే అంతర్రాష్ట్ర దొంగను గాజులమండ్యం పోలీసులు అరెస్టు చేసి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు. గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో శనివారం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. రేణిగుంట మండలంలో రాత్రిపూట తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసే వ్యక్తిని పట్టుకునే ఉద్దేశంతో నిఘా పెట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిపై ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. తమిళనాడు ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో వెళ్లి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టివేతలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించి నగదు రివార్డును అందించారు. సమావేశంలో సిబ్బంది గోపి, వేణుగోపాల్ , మణి వాసు, రాజేష్, సుబ్రమణ్యం, మురళీ పాల్గొన్నారు. -
డిగ్రీ డీలా!
●తిరుపతి సిటీ : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో 2025–26కు సంబంధించి ప్రవేశాలు నాలుగు నెలలు జాప్యం కావడంతో అడ్మిషన్ల దరఖాస్తులు కనీసం 40 శాతం కూడా దాటకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యామండలి దరఖాస్తుల గడువును మూడుసార్లు పొడిగించినా దరఖాస్తులు పెరగకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది 50 శాతానికి పైగా ప్రవేశాలు తగ్గుముఖం పట్టనున్నట్లు స్పష్టమైన సంకేతాలు రావడంతో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల పరిస్థితి దారుణంగా తయారైంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో పాటు ఈ ఏడాది డిగ్రీలో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కళాశాలలను ఎలా నడపాలో అర్థం కావడం లేదంటూ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ కళాశాలలపై తగ్గని ఆదరణ డిగ్రీ ప్రవేశాల కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వైపు మొగ్గు చూపడం లేదు. జిల్లాలోని సుమారు 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీసం 30 శాతం దరఖాస్తులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్పీడబ్లూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలల్లో 90 శాతానికి మించి దరఖాస్తులు రావడం గమనార్హం. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓరియెంటల్, సికింద్రాబాద్ కళాశాలలో 25 శాతం కూడా దరఖాస్తులు రాకపోవడంతో ఆయా కళాశాలల యాజమాన్యాల పరిస్థితి అయోమయానికి గురిచేస్తోంది. నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నత విద్యామండలి నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అంటూ విద్యార్థులను తికమక పెట్టించి నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా విధానాన్ని నిర్వీర్యం చేసిందని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయాన్ని మేధావులు విద్యావంతులు తప్పుపడుతున్నారు. రూ.కోట్లలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు ప్రైవేటు డిగ్రీ యాజమాన్యాలు కళాశాలలను నడపలేని పరిస్థితికి చేరుకున్నాయి. రెండేళ్లుగా జిల్లాలో సుమారు రూ.650 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఒక్కో కళాశాలకు సుమారు రూ.కోటి నుంచి 2 కోట్ల వరకు చెల్లించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో కళాశాలలను నడపలేని స్థితిలో యాజమాన్యాలు నరకయాతన పడుతున్నాయి. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పడనుంది. కనీసం 25శాతం సైతం అడ్మిషన్లు జరిగే పరిస్థితి లేదంటూ యాజమాన్యాలు వాపోతున్నాయి. డిగ్రీ ప్రైవేటు కళాశాల పరిస్థితి అయోమయంలో పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేడు సీట్ల కేటాయింపు సంక్షిప్త సందేశాలు ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆదివారం విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ మేరకు ఓఏఎమ్డీసీ పోర్టల్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల, మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం అందించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో సోమవారం రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల టీటీడీ విద్యాసంస్థల వివరాలు కళాశాల అందుబాటులో వచ్చిన ఉన్న సీట్లు దరఖాస్తులు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల 1550 1697 ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల 1068 1457 ఎస్వీ ఆర్ట్స్ కళాశాల 1417 1679 ఎస్వీ ఓరియెంటల్ కళాశాల 300 189 సికింద్రాబాద్ ఎస్వీవీవీఎస్ 60 57ఎప్పుడూ చూడలేదు.. గ్రామీణ పేద విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురు చూసిన డిగ్రీ అడ్మిషన్లు కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఇంటర్ ఫలితాలు విడుదల చేసి నాలుగు నుంచి 5 నెలలు గడిచినా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కళాశాలలో కనీసం 20శాతం సైతం ప్రవేశాలు జరిగే పరిస్థితి లేదు. తిరుపతి నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో మాత్రమే కాస్త మెరుగ్గా దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఏపీ చరిత్రలో డిగ్రీ అడ్మిషన్లపై ఇలాంటి పరిస్థితి చూడలేదు. – ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ రిటైర్డ్ అధ్యాపకుడు, తిరుపతి -
శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుంచి పవిత్ర సమర్పణ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో ఆరాధన, హోమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్టి తదితర వైదిక కార్యక్రమాలను చేపట్టారు. ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మఖ మండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపట్టనున్నారు. అటు తర్వాత పలు వైదిక కార్యక్రమాల తర్వాత ఆదివారం చంద్రగ్రహణంలో భాగంగా మధ్యాహ్నం 02.15 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజు, ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్ రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. -
గుజరాత్ యాత్రకు ప్రత్యేక రైలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీకి తొలిసారిగా పర్యాటక ప్రదేశాల సందర్శనార్థం 10 ప్రత్యేక రైళ్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్రను నిర్వహించనున్నట్లు తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నదీ తీరం, యునెస్కో వారసత్వ స్థలం, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన యాత్రికులు సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట జంక్షన్కు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులకు భోజనవసతి కల్పిస్తారన్నారు. స్లీపర్ ధర రూ. 18,400 కాగా 3 టైర్ ఏసీ ధర రూ. 30,200 కాగా 2టైర్ ఏసీ ధర రూ. 39,900గా నిర్ణయించినట్లు తెలిపారు. యాత్రికులు 92814 95853 , 82879 32313 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం
తిరుమల: అనంత పద్మనాభవ్రతం సందర్భంగా తిరుమలలో శనివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకాలు చేశారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఉక్కుపాదం మోపుతాం
ఆర్ఎంపీలు, పీఎంపీలే యాంటీబయోటిక్ మందులు, మాత్రలు, సరఫరా చేస్తున్నారు. వీళ్లే చికిత్సలు చేస్తున్నారు. జాయింట్లకు కూడా సూదులు వేస్తున్నారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అనధికారిక క్లినిక్లపై తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు వందకు పైగా క్లినిక్లను తనిఖీ చేస్తే 43 దాకా సీజ్ చేశాం. వాటి వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతున్నాం. వారి ఆదేశాలతో తదుపరి చర్యలు ఉంటాయి. నకిలీ వైద్యంపై ఉక్కుపాదం మోపుతాం. వదలిపెట్టే ప్రసక్తే లేదు. – డాక్టర్ సుధారాణి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు -
మెడికల్ కళాశాలలపై కూటమి నిర్లక్ష్యం
తిరుపతి రూరల్ : మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడేందుకు శనివారం విద్యార్థి సంఘం నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హర్షిత్రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో మొత్తం 17 మెడికల్ కళాశాలల్లో 5 ప్రారంభం కాగా మరో 7 కాలేజీలు ఎన్నికలు జరిగే సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ తరువాత మరో 5 కాలేజీలను ప్రారంభించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టిపెట్టక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొత్తం 12 మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని బయటకు కనబడకుండా చేయడానికి పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2360 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జగనన్న ప్రభుత్వంలో తెచ్చిన 12 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 2550 సీట్లు పెరిగేవన్నారు. వైద్య విద్యలో ప్రభుత్వం పేద విద్యార్థులకు చేసిన మోసాన్ని బయట పెట్టడానికి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్టు వివరించారు. సమావేశంలో విద్యార్థి విభాగం నేతలు ఓబుల్ రెడ్డి, చెంగల్ రెడ్డి, గూడూరు రఫీ, యశ్వంత్ రెడ్డి, వినోద్ కుమార్, నక్క హరినాథ్, హరీష్, భానుప్రకాష్రెడ్డి, నరేశ్, వెంకట రమణ నాయక్, శేషారెడ్డి, రెడ్డి నాయక్ , కరుణాకర్ పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
తిరుపతి సిటీ : శారీరక , మానసిక ఉల్లాసానికి క్రీడలు అత్యవసరమని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ ఆధ్వర్యంలో ఎస్వీయూ స్టేడియంలో శనివారం జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడుతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగులలో స్నేహ భావం కల్పించడంతో పాటు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి క్రీడలు అవసరమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జట్టుతో పాటు టీటీడీ ఉద్యోగులు జట్టు, ఎస్వీయూ ఉద్యోగుల జట్టు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎన్ఎస్యూ, అమరరాజ జట్లు క్రికెట్ పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మురళి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ ముత్తు, టీటీడీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ నారాయణ, ఆర్గనైజర్ యుగంధర్, చంద్రు, 12 జట్ల కెప్టెన్లు , క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ మ్యాచ్ కలెక్టర్ జట్టుకు, ఎస్వీయూ జట్ల మధ్య జరిగిందని నిర్వాహకులు తెలిపారు. పోలేరమ్మ జాతర కమిటీ ఏర్పాటు వెంకటగిరిరూరల్ : ఈనెల 10,11వ తేదీల్లో జరగనున్న శ్రీ పోలేరమ్మతల్లి జాతరకు సంబంఽధించి జాతర కమిటీని పట్టణంలోని వీరయ్య కల్యాణ మండపంలో శనివారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి పాలవర్గం వర్గం పేర్లను చదివి వినిపించారు. మురళీకృష్ణ, చంద్రశేఖర్, శివప్రసాద్, టీవీ కృష్ణ, యామిని, జగదీశ్వరి, కలపాటి నాగమణి, రామారావు అనీల్, తిరుపతిరావు, మదనపల్లి సావిత్రమ్మ, సత్య కిరణ్మయి, ప్రసాద్తో కమిటీని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సమావేశం తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 6న (సోమవారం) సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ విభాగానికి చెందిన తిరుపతి జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రతీత్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కమిటీ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని వివరించారు. గ్రహణం రోజున ముక్కంటికి ప్రత్యేక అభిషేకాలు శ్రీకాళహస్తి : చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేకమైన గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఈనెలలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఆదివారం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం, 21న సూర్య గ్రహణం. ఈ రెండు భారత దేశంలో దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆదివారం చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై 8వ తేదీ వేకువజామున 1.26 గంటలకు ముగుస్తుందని శ్రీకాళహస్తీశ్వరాలయంలోని పండితులు వివరించారు. 7వ తేదీ రాత్రి 11.42 గంటలకు చంద్రుడు పూర్తిగా కనబడడని తెలిపారు. ముల్లోకాలను ఏలే ముక్కంటీశుడు తనకు అలంకరించే కవచంలో తొమ్మిది గ్రహాలను 27 నక్షత్రాలను పొందు పరుచుకున్నారు కాబట్టి ఆ స్వామికి శాంతి అభిషేకాలు నిర్వహిస్తారని తెలిపారు. పలువురికి పదవులు చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురికి పదవులు వరించాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంటు) నియమించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వీరికి పదవులు కేటాయించినట్లు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన దయాసాగర్రెడ్డికి నగరి, చంద్రగిరి, ఎం.కృష్ణమూర్తికి కుప్పం, పూతలపట్టు, వెంకట్రెడ్డియాదవ్కు పలమనేరు, చిత్తూరు, అనీషారెడ్డికి పుంగనూరు, మదనపల్లె, రాకేష్రెడ్డికి జీడీనెల్లూరు, తంబళ్లపల్లెను కేటాయించారు. తిరుపతి జిల్లాకు చెందిన బీరేంద్రవర్మకు గుడూరు, సూళ్లూరుపేట, ఓ.గిరిధర్రెడ్డికి శ్రీకాళహస్తి, తిరుపతి, కే.కల్పలతరెడ్డికి వెంకటగిరి, సత్యవేడును కేటాయించారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ, సంబంధిత రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించనున్నారు. -
మహిళా సాధికారతపై జాతీయ సదస్సు
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా మహిళా సాధికారత జాతీయ సదస్సును చేపట్టనున్న నేపథ్యంలో సమష్టిగా విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో సదస్సు ఉంటుందని వెల్లడించారు. ఆ మేరకు ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్తో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలన చేపట్టారు. ముందుగా సదస్సు చేపట్టనున్న రాహుల్ కన్వెన్షన్ హాల్తో పాటు చంద్రగిరి కోటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి జాతీయ మహిళా సాధికారిత కమిటీ సభ్యులు రానున్నారని చెప్పారు. ప్రధానంగా లోకసభ, శాసన సభ స్పీకర్లు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు , ఇతర ప్రముఖులు రానున్నారని స్పష్టం చేశారు. చంద్రగిరి కోటను అన్ని హంగులతో సిద్ధం చేయాలని ఆదేశించారు. కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ లైట్ అండ్ సౌండ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే చంద్రగిరి కోటకు చేరుకునే మార్గంలో అప్రోచ్ రోడ్లు, తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, ప్రొటోకాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్, అడిషినల్ ఎస్పీ రవిమనోహరాచారి, డీపీఓ సుశీలాదేవి, తిరుపతి, చంద్రగిరి డీఎస్పీలు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్ నాయుడు, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్, గురుస్వామి శెట్టి తదితరులు పాల్గొన్నారు.