breaking news
Tirupati
-
కక్ష సాధింపులతోనే చంపేశారు
తిరుపతి క్రైం : శ్రీకాళహస్తిలో సంచలనం రేపిన శివకుమార్ హత్య కేసు మిస్టరీని తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. కక్ష సాధింపులతోనే అతన్ని హత్య చేసినట్టు తేలింది. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు, తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన ఒకరు ఉన్నారు. వీరంతా చైన్నె నగరానికి చెందిన థొప్పై గణేషన్న్ముఠాకు సంబంధించిన వ్యక్తులుగా దర్యాప్తులో తేలింది. స్వర్ణముఖి నది కట్టపై హత్య ఆగస్టు 2న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పీఆర్ అతిథి గృహం సమీపంలోని స్వర్ణముఖి నది కట్టపై శ్రీకాళహస్తికి చెందిన మగలంపాటి శివకుమార్ అలియాస్ శివపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్న్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి పర్యవేక్షణలో, శ్రీకాళహస్తి డీఎస్పీ కె.నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మొదటి పట్టణ, రెండో పట్టణ, గ్రామీణ, బీఎన్. కండ్రిగ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో చిక్కిన నిందితులు ప్రత్యేక దర్యాప్తు బృందాలు వివిధ సాంకేతిక ఆధారాలను సేకరించి విశ్లేషించాయి. ఈ క్రమంలో వెంకటేషన్కార్తీక్, వేలు గోపీనాథ్ అలియాస్ గుండు గోపి, బి.శ్రీధర్ అలియాస్ రెడ్డి శ్రీకాళహస్తికి వచ్చి శివకుమార్పై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా మునస్వామి సూర్య, తమిళనాడుకు చెందిన మరో నిందితుడు హత్యకు అవసరమైన ద్విచక్ర వాహనం, కత్తులను సమకూర్చడంలో సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గణేషన్ మరణంతో కక్ష? కక్ష సాధింపులతోనే శివకుమార్ను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడు పోలీసులకు కావాల్సిన నేరస్తుడు, థొప్పై గణేషన్కు శివకుమార్ శ్రీకాళహస్తిలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గణేషన్ మార్చి 16, 2026న చైన్నెలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. శివకుమార్ చైన్నె పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే గణేషన్ మృతి చెందాడని నిందితులు అనుమానించారు. దీంతో శివకుమార్పై కక్ష పెంచుకున్న నిందితులు ప్రతీకార చర్యగా హత్య చేసినట్టు సమాచారం. నలుగురి అరెస్ట్ దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో తమిళనాడుకు చెందిన వెంకటేషన్న్ కార్తీక్ (32), వేలు గోపీనాథ్ (అలియాస్) గుండు గోపి (27), బి.శ్రీధర్ (అలియాస్) రెడ్డి (26), తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన చెందిన మునస్వామి అలియాస్ సూర్య (19) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నిందితులపై పీడీ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి డీఎస్పీ కె.నరసింహమూర్తితో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
ఔరా.. ఔషధి!
కాణిపాకం: తిరుపతి జిల్లాలో దాదాపు 2,600 మెడికల్ షాపులు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 14 మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన జనరిక్ దుకాణాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా పరిధిలో సుమారు 900 మెడికల్ షాపులు నడుస్తుండగా, వీటిలో కేవలం 9 జనరిక్ షాపులు మాత్రమే ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. లాభాలన్నీ వారి ఖాతాలోకే... సాధారణంగా బ్రాండెడ్ మందులన్నీ కంపెనీ ప్రతినిధులు, సీ అండ్ ఎఫ్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆ తర్వాత రిటైలర్ల ద్వారా సుదీర్ఘమైన సరఫరా వ్యవస్థ దాటుకుని వినియోగదారుడికి చేరుతాయి. కానీ, జనరిక్ మందులు నేరుగా డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్ల చేతికే అందుతాయి. ఈ ప్రక్రియలో లభించే భారీ లాభాల మార్జిన్ను వినియోగదారుడికి డిస్కౌంట్ రూపంలో ఇవ్వాల్సి ఉండగా.. ఆ ప్రయోజనాలను మెడికల్ షాపుల యజమానులే నొక్కేస్తున్నారు. జేబుకు చిల్లు! ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలలో మాత్రమే అసలైన జనరిక్ మందులు, అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయనేది అధికారుల వాదన. అయితే అలాంటి పలు షాపుల్లో కూడా ప్రజలకు నిర్ణీత ధరలకు మందులు దొరకడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక సాధారణ ప్రైవేట్ షాపుల్లో మాత్రం జనరిక్ పేరుతో నాణ్యత లేని మందులను అంటగడుతూ సామాన్యుల జేబుకు చిల్లులు పొడుస్తున్నారు. ఇక అనుమతులు లేని షాపులు కూడా విచ్చలవిడిగా వ్యాపారం సాగిస్తుండడం గమనార్హం. కొందరు ఈ గోల్మాల్ను పసిగడుతున్నప్పటికీ ప్రశ్నించే నాథుడు కరువయ్యాడు. ఇదిగో సాక్ష్యం తిరుపతి నగరానికి చెందిన రెహమాన్ అనే ఓ వ్యక్తి ఎదుర్కొన్న అనుభవమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన క్రమం తప్పకుండా వాడే రాబేసిక్ డీఎస్ఆర్ అనే మాత్రల షీట్ను ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో కేవలం రూ.35లకే కొనుగోలు చేసేవాడు. అయితే, ఇటీవల తిరుపతిలోని ఒక ప్రైవేట్ జనరిక్ షాపునకు వెళ్లగా.. అదే మాత్రల షీట్కు ఏకంగా రూ.175 వసూలు చేశారు. ఇతర ప్రాంతాల్లో రూ.35లకే లభించే మందులకు ఇక్కడంత రేటు ఏంటని నిలదీయగా.. కవర్ మీద రూ.177.15 ఉంది.. ధర అంతే ఉంటుంది అని షాపు నిర్వాహకుడు దురుసుగా సమాధానమిచ్చాడు. బాధితుడు గొడవకు దిగడంతో నీ వల్ల అయింది చేసుకోపో అంటూ సదరు వ్యాపారి బెదిరింపులకు తెగబడ్డాడు. కేవలం రెహమాన్ ఒక్కడే కాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా రోజువారీగా ఇలాంటి దగాకు గురవుతున్న బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల్లోనూ అంతే రాబేసిక్ డీఎస్ఆర్ అనే మాత్రల షీట్ను కొత్తగా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో అడిగితే ఒక షాపులో రూ.88 చెప్పారు. మరో దుకాణంలో రూ.85 చెబుతున్నారు. అధికారులు స్పందించేనా? జిల్లా వ్యాప్తంగా వందలాది మెడికల్ షాపుల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి, షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీనిపై సంబంధిత శాఖ ఏడీ హరిప్రసాద్ను వివరణ కోరగా.. ఫిర్యాదులు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోగానికి మందు వేసుకుంటే నయమవుతుందని వచ్చే సామాన్యుడికి మెడికల్ షాపుల నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. మందుల బిల్లులతో చెమటలు పట్టిస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల ప్రాణభయాన్ని ఆసరాగా చేసుకుని చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రైవేట్ మందుల షాపుల యజమానులు దోపిడీకి తెరతీస్తున్నారు. నిబంధనలను నడిరోడ్డుపై పాతిపెడుతూ, వ్యాపారమే పరమావధిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘జనరిక్’ ఆశయానికి యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. బ్రాండెడ్ పేరుతో దోపిడీ.... చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు జనరిక్ మెడికల్ షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నట్లు రోగులు, వారి సహాయకులు మండిపడుతున్నారు. ఇక రిటైల్ మెడికల్ షాపుల్లో జనరిక్ మందులను కూడా బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తూ అమాయక ప్రజలను నిలువునా దగా చేస్తున్నారు. ప్రైవేట్ షాపుల్లో అమ్మే జనరిక్ మందులపై స్పష్టమైన డిస్కౌంట్ నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ నిబంధనల ప్రకారం గరిష్ట ధర కంటే ఎక్కువకు అమ్మకూడదనే కనీస సూత్రాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– నలుగురి అరెస్ట్ చిట్వేలి: చిట్వేలి రేంజ్ వెంకటరాజుపల్లి బీటు, నల్గొంట ప్రాంతంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఎస్ఓ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అన్నమయ్య జిల్లా డీఎఫ్ఓ నుంచి అందిన సమాచారం, రేంజర్ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం సిబ్బందితో అడవిలో తనిఖీలు నిర్వహిస్తుండగా దుంగలతో ఉన్న వ్యక్తులను గుర్తించి దాడిచేసి అదుపులోకి తీసుకున్నట్టు ఎఫ్ఎస్ఓ తెలిపారు. తొమ్మిది దంగల బరువు 169 కిలోలు కాగా వాటి విలువ రూ.51,766 ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చరేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఎఫ్బీఓలు చెంగమ్మ, సుధాకర్, కరిముల్లా, డ్రైవర్ యశ్వంత్, బేస్ క్యాంప్ వాచర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు బస్సు ఢీకొని వ్యక్తి మృతి చంద్రగిరి: వెనుక నుంచి ప్రైవేటు బస్సు ఢీకొనడంతో స్కూటరిస్టు మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పాకాలవారిపల్లి టోల్ప్లాజా వద్ద మంగళవారం తెలవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పాకాల మండలం, గాదంకి గ్రామానికి చెందిన చిన్న చెన్నయ్య(50) టోల్ప్లాజా సమీపంలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై విధులకు వస్తున్న క్రమంలో కోయంబత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్న చెన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. అనుమానంతో భార్యపై చాకుతో దాడి చంద్రగిరి: అనుమానంతో భార్యపై భర్త చాకుతో దాడికి పాల్పడిన ఘటన మండలంలోని దానమూర్తివారిపల్లి సమీపంలోని కొత్త ఇండ్లు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. కొత్తఇండ్లు గ్రామానికి చెందిన చెంగళ్రాయులు భార్య మున్నెమ్మ కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లింది. రెండు నెలల క్రితం మున్నెమ్మ తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇంటి వద్దే ఉంటోంది. అయితే మున్నెమ్మలో కొన్ని మార్పులు రావడంతో ఆమె భర్త చెంగళ్రాయులు ఆమెను అనుమానిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మున్నెమ్మ సెల్ఫోన్లో కువైట్లో మరో వ్యక్తితో కలసి ఫొటోలు తీసుకోవడాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన చెంగళ్రాయులు ఇంట్లో ఉన్న చాకుతో ఆమైపె దాడికి పాల్పడ్డాడు. గాయపడిన మున్నెమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3.5 కిలోల గంజాయి స్వాధీనం– ఇద్దరి అరెస్ట్ రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలి మండలం చెర్లోపల్లి బ్రిడ్జి సమీపంలో గంజాయి తరలిస్తున్న వారిపై దాడులు చేసి మంగళవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. స్థానిక కార్యాలయంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా, విక్రయం చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించి కొడూరు పట్టణం ఎన్టీఆర్ నగర్కు చెందిన మొపూరి నవీన్కుమార్, ఒంగోలుకు చెందిన వాకారా మ్మోహన్రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్నవారిని బయటకు తీస్తామన్నారు. ఆయన వెంట సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు లక్ష్మీప్రసాద్రెడ్డి, వినోద్కుమా, సిబ్బంది ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 81,064 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,136 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.36 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. -
చంద్రగిరిలో పోలీసుల అత్యుత్సాహం
చంద్రగిరి: డీఎస్సీ అక్రమాలపై చంద్రగిరిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి వేలాది మంది తరలిరావడంతో అధికార పక్షం జీర్ణించుకోలేక పోతోంది. పోలీసులను ముందు పెట్టి ర్యాలీని సజావుగా నడిపించిన ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిపై కేసుల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఇలాంటి అనైతిక చర్యలకు పోలీసులు దిగజారడం సిగ్గు చేటు.. అంటూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత ధర్నా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుత ధర్నా చేపట్టారు. గత రెండు రోజుల క్రితం చంద్రగిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరిద్దరు తమ విధుల్లో భాగంగా ఖాకీ యూనిఫాం ధరించి విధులు నిర్వహించారు. ఖాకీ యూనిఫాం ధరించడం చట్ట రీత్యా నేరమైనట్టుగా ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీ వారిపై కేసు నమోదు చేయడం, అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడంతో వివాదం ముదిరింది. సెక్యూరిటీ సిబ్బంది విడుదల పోలీస్ స్టేషన్ ముందు కొంత సేపు ఉద్రిక్తత కొనసాగిన అనంతరం అదుపులో ఉన్న ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అధికార పార్టీ నేతల సూచనలతో కక్ష తీర్చుకునేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హర్షిత్రెడ్డి హెచ్చరించారు. ప్రయివేటు సెక్యూరిటీపై కేసుల వెనుక రాజకీయ ఒత్తిళ్లు కార్మికుడి కోసం ఎందాకైనా..! కార్మికుడి కోసం ఎందాకైనా అంటూ.. చెవిరెడ్డి హర్షిత్రెడ్డి దూసుకుపోయారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోలీసుల తీరును తప్పుబట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ విజయ వంతమైందనే అక్కసుతోనే పోలీసులను పావులుగా మార్చి ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిపై కేసులు పెట్టించారన్నారు. ఖాకీ డ్రస్ వేసుకోవడమే నేరమే అయితే పంచా యతీ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఆటో డ్రైవ ర్లు, ఆర్టీసీ సిబ్బంది సైతం ఖాకీ డ్రస్ ధరిస్తారని, వారిని కూడా అరెస్టు చేస్తారా..? అంటూ హర్షిత్రెడ్డి ప్రశ్నించారు. అక్రమ కేసుతో తీసుకువచ్చిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్టేషన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. -
అధనం కోసం ఆరాటం!
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు ఉంటుంది శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి తీరు. భక్తులు, స్థానికులకు అనుగుణంగా శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి అర్ధనారీశ్వరాలయం వరకు గత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు దీనిపై అప్పటి ప్రత్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి విష ప్రచారం చేశారు. తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ నిధులతోనే శివం టు శివం రోడ్డు పనులు పూర్తి చేస్తానని నమ్మబలికాడు. అంతేగాకుండా అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తంతోనే పనులు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అ‘ధన’పు నిధుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నారు. దీనిపై దేవదాయ శాఖ సైతం విస్తుపోతోంది.శివం టు శివం రోడ్డు ఇదేసాక్షి టాస్క్ఫోర్స్: శ్రీకాళహస్తిలో వైఎస్సారీసీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శివం టు శివం రోడ్డు పనులపై బొజ్జల సుధీర్రెడ్డి ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికల తరువాత మరో మాట మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కేటాయించిన నిధులతోనే పనులు పూర్తి చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి.. నేడు అధనపు నిధుల కోసం దేవస్థానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు శ్రీకాళహస్తిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. భక్తులకు అనుగుణంగా ఉంటుందనీ.. భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి అర్థనారీశ్వరాలయానికి వెళ్లి వచ్చేందుకు వీలుగా వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శివం టు శివం రోడ్డు ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి.. శివం టు శివం రోడ్డు పనులకు అనుమతులు తెచ్చారు. అందులో భాగంగా దేవస్థానం నుంచి రూ.19.6 కోట్లతో పనులు ప్రారంభించారు. అదే సమయంలో తుడా నిధులతో స్వర్ణముఖి ఫ్లడ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. టెక్నికల్ శ్యాంక్షన్ లేకనే పనులు దీనిపై నాడు టీడీపీ నేత బొజ్జల సుధీర్రెడ్డి ఆరోపణలు చేశారు. దేవస్థానం నిధులు స్వాహా చేసేందుకు ఈ రోడ్డు పనులు చేపడుతున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే శివం టు శివం రోడ్డు పనులను ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేస్తానని ప్రకటించారు. దేవస్థానం నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనని ప్రగల్భాలు పలికారు. ఎన్నికల అనంతరం బొజ్జల సుధీర్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక 2024 జూన్ 5న శివం టు శివం రోడ్డు పనులు పరిశీలించారు. పనులు రద్దు చేయమని ఆదేశించారు. టెక్నికల్ శ్యాంక్షన్ లేకనే పనులు ప్రారంభించారు. మళ్లీ మళ్లీ ప్రతిపాదనలు ప్రభుత్వ నిధులతోనే శివం టు శివం రోడ్డు పనులు పూర్తి చేస్తానని ప్రకటించి ఎమ్మెల్యే బొజ్జల సుఽధీర్రెడ్డి దేవస్థానం నిధులతోనే పనులు చేపట్టారు. అంతటితో ఆగకుండా బ్యూటిఫికేషన్ పేరుతో అధనంగా రూ.5 కోట్లు ఓ సారి, రూ.4 కోట్లు మరోసారి, తాజాగా రూ.3.7 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయడానికి దేవదాయశాఖ ఒప్పుకోలేదు. దీంతో డీఈ మురళీధర్రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక గుండె పోటుతో మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాడు అనుకున్న ప్రకారం అయితే రూ.19.6 కోట్లు అవసరమయ్యేదని, నేడు అంత కూడా అవసరం లేదని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బొజ్జలా..మాట మార్చేదెలా? కలిసొచ్చిన జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇటీవల జాతీయ రహదారి నిర్మించడంతో శివం టు శివం రోడ్డులో కొంత భాగాన్ని నేషనల్ హైవే అథారిటీ వారే నిర్మించారని తెలిసింది. ఆ నిర్మాణంతో శివం టు శివం రోడ్డు పనులకు కొంత కలిసొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. శివం టు శివం రోడ్డు పనుల పేరుతో అంచనాలు పెంచుకుంటూ పోతుండడంతో దేవదాయశాఖ అధికారులకు అనుమానం వచ్చింది. అందుకే టెక్నికల్ శాంక్షన్ ఇవ్వలేదని సమాచారం. శివం టు శివం రోడ్డు పనుల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు నేడు అమరావతి నుంచి దేవదాయశాఖ అధికారలు శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రోడ్డు పనులు, స్థానికులు, భక్తులు, దేవస్థానం అధికారుల అభిప్రాయాలు తీసుకుని నివేదిక ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై శ్రద్ధ చూపండి
తిరుపతి అర్బన్ : వడమాలపేట మండలంలోని పాదిరేడు, ఏర్పేడు మండలంలోని పల్లం గ్రామాల వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ అంశంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూ సేకరణలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వివరించారు. అలాగే వైజాగ్–చైన్నె కారిడార్ పైప్ లైన్ పనులు, ఏపీఐఐసీకి సంబంధించి దుగ్గరాజుపట్నం పోర్ట్ పనులు, శ్రీసిటీకి చెందిన పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించారు. సమావేశంలో తిరుపతి, నెల్లూరు, చైన్నె పీడీలు వెంకటేశ్వర్లు, రమేష్, రవీంద్ర, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, విద్యుత్శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో సునీల్కి చికిత్స
అక్రమ కేసులో అరెస్టయిన యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సునీల్ మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. సునీల్కి శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఛాతిలో తీవ్ర నొప్పిగా ఉండడంతో జైలు అధికారులు ఆదివారం సాయంత్రం రుయా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, స్కాన్కి పంపగా ఫ్రాక్చర్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించి, అడ్మిట్ చేయాల్సిందేనని చెప్పారని సమాచారం. పై అధికారులకు చెప్పేంత వరకు వేచి చూడాల్సిందేనని ఆస్పత్రి వర్గాలు సుమారు 7–8 గంటలు చికిత్సకు తీసుకెళ్లకుండా వేచి ఉండమని చెప్పారు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్నా ఆస్పత్రి వర్గాలకు మానవత్వం కూడా లేకుండా వ్యవహరించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ చానల్ రిపోర్టర్కి తీవ్రంగా ఛాతీ నొప్పి రావడానికి జేబీ శ్రీనివాసులు అనుచరులు తీవ్రంగా దాడి చేయడమేననే సునీల్ బంధువులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పరిణామాలు జేబీ వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దాయాలన్నా నిజం దాగేట్టు లేదని ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
వెండి కొండలు
కొంప ముంచిన వర్షం వర్షం కొంప ముంచింది. దారి కనిపించకపోవడంతో రెండు బస్సులు ఢీకొట్టిన ఘటన ఓజిలిలో చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో వెండి మబ్బులు కనువిందు చేస్తున్నాయి. కొండలపై పరుచుకున్న మేఘాలు, పచ్చని ప్రకృతి అందాలు భక్తులను మైమరపిస్తున్నాయి. మేఘాల మధ్య నుంచి సాగుతున్న ఘాట్ రోడ్డు ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తోంది. ఆహ్లాదకరమైన ఈ దృశ్యాలను పలువురు తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. మరికొందరు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. – తిరుమల జిల్లా స్థాయి క్రీడా పోటీలు జిల్లా స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మూడో రోజు నువ్వా..నేనా అని తలపడ్డారు. బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఘాట్ రోడ్లో కనులు విందు చేస్తున్న మబ్బులు -
గురుకుల పాఠశాల మూసివేతను ఉపసంహరించుకోవాలి
తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధి, నెల్లూరు జిల్లా కోటలోని డా.బిఆర్.అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఆ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రికి మంగళవారం ఎంపీ లేఖ రాశారు. గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని ఐఐటీ–జేఈఈ, నీట్ కోచింగ్ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ ఎంతోకాలంగా సేవలందిస్తున్న గురుకుల పాఠశాలను ఉన్నట్టుండి మూసివేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తూ, అవసరమైతే అదే ప్రాంతంలో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
కొంప ముంచిన వర్షం
ఓజిలి: వర్షం కొంప ముంచింది. జాతీయ రహదారి రాజుపాళెం సమీపంలోని సన్సిటీ వద్ద రెండు బస్సులు ఢీకొని రోడ్డుపై నిలిచిపోయాయి. అదే సమయంలో తిరుమల నుంచి రంగారెడ్డి వెళ్తున్న కారును గుమ్మిడిపూండి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమదంలో కారులోని 9 మందికి, బస్సుల్లోని పలువురుకి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. ఇంటర్సిటీ ఎస్మార్ట్ బస్సు చైన్నె నుంచి విజయవాడకు 34 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి చైన్నెలో బయలుదేరింది. అలాగే షాయామొలీ సూపర్ లగ్జరీ బస్సు కూడా చైన్నె నుంచి రాజమండ్రికి బయలుదేరింది. ఈ క్రమంలో ఓజిలి మండలం జాతీయ రహదారి సన్సిటీ వద్దకు వచ్చే సరికి జోరువాన కురుస్తోంది. ఈ వర్షంలో సన్సిటీ వద్ద రహదారి పక్కన బ్యాటరీ బస్సు ఒక్కటి చీకటిలో నిలిచి ఉంది. గమనించిన షాయామొలీ బస్సు డ్రైవర్ వేగం తగ్గించాడు. వెనుకనే వస్తున్న ఇంటర్సిటీ ఎస్మార్ట్ బస్సు డ్రైవర్ బాలకందస్వామి బస్సును అదుపు చేయలేక షాయామొలి బస్సును ఢీకొట్టాడు. రెండు బస్సులు రోడ్డుపై నిలిచిపోయాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బోడిఉప్పల్ ప్రాంతానికి చెందిన 11 మంది కారులో తిరుమల నుంచి తిరుగుప్రయాణమయ్యాము. రాజుపాళెం సమీపంలో నిలిపి ఉంచారు. ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గును తీసుకుని గుమ్ముడిపూండికి వెళ్లి అన్లోడ్డు చేసి తిరిగి వస్తున్న లారీ జోరువానలో కారు కనబడకపోవడంతో వెనుక నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ముందున్న లారీ కిందకు కారు దూసుకెళ్లింది. కారులోని విఘ్నేష్, యాదగిరి, మచ్చగిరి, పద్మ, స్వాతి, వెంకటరమణకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సుల్లోని పలువురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీ -
ముగిసిన డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు
తిరుపతి సిటీ: ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో పలు యూజీ కోర్సులలో ప్రవేశాలకు ఓఏఎమ్డీసీలో ఆన్లైన రిజిస్ట్రేషన్ గడువు మంగళవారంతో ముగిసింది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది. 26వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కాగా మరో మారు రిజిస్ట్రేషన్ గడువు పొడిగిస్తారా లేదా అనే విషయం బుధవారం తెలుస్తుందని కళాశాలల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. కోళ్ల వ్యాను బోల్తా చంద్రగిరి: ప్రమాదవశాత్తు కోళ్ల వ్యాను బోల్తా పడిన ఘటన సోమవారం అర్థరాత్రి తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. భాకరాపేట నుంచి తిరుపతికి వెళ్తున్న కోళ్ల వ్యాను కనుమలోని పెద్ద మలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోళ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. స్థానిక ప్రజలు, వాహనాదారులు రోడ్డుపై పడిన కోళ్లను తీసుకెళ్లడానికి పోటీపడ్డారు. పెద్ద పెద్ద సంచులు తీసుకుని, అందినకాడికి కోళ్లను ఎత్తుకెళ్లారు. అయితే స్థానికుల సహాయంతో లారీ డ్రైవరు వాహనాన్ని తరలించేశాడు. -
కరెంట్ బకాయి కట్టకపోతే..!
తిరుపతి రూరల్: విద్యుత్ బకాయిల వసూళ్లలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. బకాయిలు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందులో భాగంగా గాజులమండ్యం ప్రాంతంలోని పయనీర్ అల్లాయ్ కాస్టింగ్ ప్రవేట్ లిమిటెడ్పై ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు చేపట్టారు. ఆ సంస్థ విద్యుత్ శాఖకు రూ.26,42,460 బకాయి పడింది. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్–1864 కింద ఆస్తి రికవరీ నోటీసు జారీ చేశారు. సంబంధిత సంస్థ ప్రాంగణంలో ఆర్ఆర్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు తెలిపే బ్యానర్ను మంగళవారం ఏర్పాటు చేశారు. నిర్ణీత గడువులో బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం తదుపరి రెవెన్యూ రికవరీ చర్యలు చేపడతామని తిరుపతి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి. గంగాధర్రెడ్డి తెలిపారు. -
రేపు నెల 15 వరకు ఓపెన్ స్కూల్ దరఖాస్తుకు గడువు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా ఈ ఏడాది పది, ఇంటర్మిడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మధ్యలో ఆపేసిన విద్యను ఓపెన్ స్కూల్ ద్వారా కొనసాగించుకోవాలని డీఈఓ పిలుపునిచ్చారు. 14న స్పాట్ కౌన్సెలింగ్ చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్లో నమోదు చేసిన, చేయని అభ్యర్థులు స్పాట్ కౌన్సెలింగ్కు ఈనెల 14వ తేదీన గుంటూరులో హాజరు కావాలని ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రిక మంగళవారం తెలిపారు. 14వ తేదీన ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, కృష్ణ ఆడిటోరియంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆమె సూచించారు. ఎస్వీయూలో జాబ్మేళా రేపు తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో గురువారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని సుమా రు 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, ఎంబీఏ, డీ, బీ, ఎంఫార్మ సీ పూర్తి చేసిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం వర్సిటీ ఎంప్లాయ్మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. తల్లీబిడ్డ వాహనాల ప్రారంభం తిరుపతి అర్బన్: తల్లీబిడ్డ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో కొత్తగా జిల్లాకు మంజూరైన 16 తల్లీబిడ్డ 102 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు సంబంధిత వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా 102కి కాల్ చేస్తే సరిపోతుందని చెప్పారు. ప్రధానంగా గర్భిణులు, బాలింతల కోసం మాత్రమే 102 వాహనాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 16 వాహనాల్లో 15 వాహనాలు తిరుపతి ప్రాంతానికి మాత్రమే వినియోగిస్తారని, మిగిలిన ఒక వాహనం శ్రీకాళహస్తి ప్రాంతంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. తిరుపతి ఎమెల్యే ఆరణి శ్రీనివాసులు, డీఎంఅండ్హెచ్వో బాలకృష్ణనాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి, డీటీసీ మురళీమోహన్, పార్టీ నేతలు నరసింహయాదవ్, పనబాకలక్ష్మి పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీలో తగ్గిన సానుకూలత తిరుపతి అర్బన్: పింఛన్ల పంపిణీ విషయంలో గతంలో 91శాతం సానుకూలత ఉండేదని, అయితే ప్రస్తుతం అది 86శాతానికి తగ్గిందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో ఆయన సమీక్షించారు. పింఛన్ల పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పెద్ద ఎత్తున జెండా పండుగపై ప్రచారం చేపట్టాలని సూచించారు. 13 నుంచి 15వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండాను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీపీవో సుశీలాదేవి, డ్వామా పీడీ మద్దిలేటి, ఆర్అండ్బీ ఎస్ఈ రాజా నాయక్, జీఎస్డబ్ల్యూ కో ఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు. నేడు జూడాల మెరుపు సమ్మె తిరుపతి తుడా: ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం పిలుపు మేరకు స్టయిఫండ్ పెంపుకోసం రాష్ట్ర సమ్మెకు మద్దతుగా బుధవారం సమ్మెకు దిగుతున్నట్లు ఎస్వీ జూనియర్ డాక్టర్ల నేతలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఎస్వీ మెడికల్ కళాశాలలో అకడమిక్ తరగతులు, రుయాలో అత్యవసర సేవలు మినహా ఓపీడీ సేవలు నిలిపివేస్తునట్లు ప్రకటించారు. ఉదయం 9నుంచి జూనియర్ డాక్టర్లు ర్యాలీలో పాల్గొని పీజీ వైద్యులకు శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని నినదించనున్నట్టు పేర్కొన్నారు. -
రసవత్తరంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వేదికగా నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలు మూడవ రోజు రసవత్తరంగా సాగాయి. ఇందులో భాగంగా మంగళవారం అండర్–17, అండర్–23 బాలబాలికల విభాగాల్లో బాక్సింగ్, చెస్, హాకీ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఎస్వీయూ మైదానంలో ఖోఖో, కబడ్డీ, యోగా పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్చరీ పోటీలను ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లో నిర్వహించనున్నారు. ఆర్థోపెడిక్ వైద్యంలో అపోలో మైలురాయి తిరుపతి తుడా: ఆర్థోపెడిక్ వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగుతున్న చైన్నె అపోలో హాస్పిటల్స్ విజయవంతంగా 2వేల రోబోటిక్ సహాయక జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకుందని అపోలో మెయిన్ ఆస్పత్రి క్లినికల్ లీడ్ హెడ్ డాక్టర్ విజయ్కిషోర్ కొండ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రి బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా వ్యక్తిగత శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించి స్వల్పకాలంలో 2 వేల రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమని తెలిపారు. రోగులు తిరుపతి తుడా రోడ్డులోని తమ అపోలో సమాచార కేంద్రాన్ని సంపద్రించి మెరుగైన కచ్చితమైన వైద్య చికిత్స పొందాలని ఆయన సూచించారు. నేటి నుంచి మెరిట్ విద్యార్థుల జాబితా తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలో జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్)లో మెరిట్ ప్రాతిపదికన ఎంపికై న విద్యార్థుల జాబిత ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో తమ పేర్లను పరిశీలించుకోవాలని సూచించారు. ఉపకార వేతనం పొందేందుకు విద్యార్థి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా వివరాలను ఆధారుతో అనుసంధానం చేసి, డీబీటీ ద్వారా నగదు బదిలీ అయ్యేలా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎన్ఎంఎంఎస్కు ఎంపికై న విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్ఓఎల్ఏఆర్ఎస్హెచ్ఐపీఎస్.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని, విద్యార్థుల వివరాల్లో సవరణలు అవసరమైన సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లో ఎన్ఎంఎంఎస్కు ఎంపికై న విద్యార్థుల వివరాలను పరిశీలించి, వారికి బ్యాంకు ఖాతా, ఆధార్ సీడింగ్, డీబీటీ తదితర అంశాలపై అవగాహన కల్పించి, ఉపకార వేతనం పొందే ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయించాలని డీఈఓ సూచించారు. -
మెగాగ్రహం!
మెగా డీఎస్సీ అవినీతి, అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ అన్ని నియోజకవర్గాల్లో దగా డీఎస్సీపై భారీ ర్యాలీలు తిరుపతి సిటీ: మెగా డీఎస్సీ పేరుతో బాబు సర్కార్ చేసిన అవినీతి అక్రమాలపై తిరుపతి జిల్లాలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. మూడు రోజు పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగిన జెన్జెడ్ వార్ రిలే దీక్షలు సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో సోమవారం జరిగిన జెన్జెడ్ వార్ ర్యాలీలో వేల సంఖ్యలో పాల్గొన్నారు. దగా డీఎస్సీపై కదం తొక్కారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీకి తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం సొంత మండలం, చంద్రగిరిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న జనసందోహాన్ని చూసి కూటమి నేతల్లో గుబులు పట్టుకుంది. తిరుపతిలో కదంతొక్కిన వేలాది మంది వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో కొర్లగుంట సర్కిల్ నుంచి అక్కారం పల్లి రోడ్డు వరకు దగా డీఎస్సీపై నల్ల దుస్తులు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు, మాజీ కార్పొరేటర్లు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. నినదించిన శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జన్జెడ్ వార్ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ర్యాలీతో శ్రీకాళహస్తి దద్దరిల్లింది. పార్టీ జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, గ్రామ స్థాయి నేతలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు పాల్గొన్నారు. దగాపై ధ్వజమెత్తిన వెంకటగిరి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని యువత నినదించారు. సుమారు రెండు గంటల పాటు ర్యాలీ సాగింది. పార్టీ నేతలు , పలు మండలాల కన్వీనర్లు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. కదం తొక్కిన రైల్వేకోడూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం నుంచి కోడూరు పట్టణం వరకు దగా డీఎస్సీపై భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఆ పార్టీ కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసంద్రమైన సూళ్లూరుపేట సూళ్లూరుపేట జనసంద్రమైంది. నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్య నగర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత కదం తొక్కారు. ర్యాలీతో ప్రధాన రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. ఆరు మండలాలకు చెందిన ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కలువాయిలో హోరెత్తిన ర్యాలీలో సమన్వయకర్త రామ్కుమార్రెడ్డి డీఎస్సీ అక్రమాలపై కూటమి నిర్లక్ష్య వైఖరితిరుపతి మంగళం : మెగా డీఎస్సీ నియామకాల్లో అవినీతి అక్రమాలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో సోమవారం డీఎస్సీ అక్రమాలపై తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతం జయచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీ, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు వేలాదిమంది యువత, పార్టీ శ్రేణులతో కలిసి నల్ల దుస్తులు ధరించి, ప్లకార్డులు చేతబట్టుకుని భూమన భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా డీఎస్సీ నియామకాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడడం సిగ్గుగా లేదా? చంద్రబాబు అని ప్రశ్నించారు. 2025 మెగా డీఎస్సీలో అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా భయటపెట్టినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తన తన యుడు లోకేష్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. నీట్ లీకేజీతో ఢిల్లీలో యువత ఉద్యమించిన పరిస్థితి మన రాష్ట్రంలో కూడా వస్తుందని హెచ్చరించారు. లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సత్యవేడులో భారీ ర్యాలీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో దగా డీఎస్సీపై కేవీబీపురం మండల కేంద్రంలో సాయిబాబా ఆలయం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా స్థాయి నాయకులు, ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. -
టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
కేవీబీపురం: మండలంలోని టీడీపీ, జనసేన నుంచి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయలక్ష్మీపురం గ్రామం నుంచి జనసేన పార్టీ నేత పి.హరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా వేమలపూడి గ్రామం నుంచి 20 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వేములపూడి వైఎస్సార్సీపీ నేత మధు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు సుబ్రమణ్యం, రామయ్య, వెంకటరామయ్య, శ్రీనివాసులు, హరికృష్ణ, సుబ్రహ్మణ్యం తదితరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. మండల పార్టీ కన్వీనర్ గవర్ల కృష్ణయ్య, నందకుమార్, ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, లీగల్ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
దారి దోపిడీ ముఠా అరెస్ట్
సూళ్లూరుపేట: దారి దోపిడీలతో సంబంధాలున్న ముగ్గురు నిందితులను సూళ్లూరుపేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 అంగుళాల పొడవు కలిగిన పెద్ద కత్తి, వీవో ఆండ్రాయిడ్ సెల్పోన్, రూ.200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఎం మురళీకృష్ణ తెలిపారు. చెంగాళమ్మ పరమేశ్వరి ఆమ్మవారి దక్షిణం వైపు ఆర్చి వద్ద జాతీయ రహదారిపై ఎస్ఐ అజయ్కుమార్ తనిఖీలు నిర్వహిస్తుండగా సదరు ముగ్గురు ముద్దాయిలు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన వారు మండలంలోని కోటపోలూరుకు చెందిన కిలివేటి జగదీష్, వట్రపాళెంకు చెందిన ముటుకు దీలీప్, కొల్ల చెరువు లోకేష్ అని తేలింది. ఈ ముగ్గురు నిందితులకు గంజాయి, మద్యం సేవించే అలవాటు ఉందని, కూలి పపనులు చేసుకుని సంపాదించే డబ్బు సరిపోక సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి వట్రపాళెంలోని మొదటి వీధిలో నడిచి వెళుతున్న ఓ వ్యక్తిని ఈ ముగ్గురితో పాటు పరారీలో ఉన్న అఫ్రిద్ కలిసి కత్తితో బెదిరించి వెయ్యి రూపాయలు నగదు దోచుకున్నారని తెలిపారు. ఆ డబ్బుతో మద్యం తాగి మిగిలిన 200 నగదును లోకేష్ వద్ద, సెల్ఫోన్ను దిలీప్ వద్ద దాచారన్నారు. సోమవారం ఉదయం కూడా మరో నేరానికి పాల్పడేందుకు ఆర్చి వద్దకు రాగా దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కోర్డులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారని తెలిపారు. -
గంగ కాలువలో మహిళ మృతదేహం
వరదయ్యపాళెం: మండలంలోని నాగానందపురం వద్ద తెలుగు గంగ కాలువలో సోమవారం ఉదయం ఓ మహిళ మృతదేహం లభించింది. ఉపాధి కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు కేవీబీపురం మండలం సూరమలకు చెందిన భువనేశ్వరి(55)గా గుర్తించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని సత్యవే డు ఆస్పత్రికి తరలించి, కుమారుడు మునయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. గుర్తుతెలియని వృద్ధురాలి మృతి తిరుపతి క్రైం: తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు సోమవారం మృతి చెందింది. రుయా ఆస్పత్రిలోని మహిళా మెడికల్ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలిని ఈ నెల 4న చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. వృద్ధురాలి మృతదేహాన్ని రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆమెకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
టీటీడీకి ట్రక్ విరాళం
తిరుమల: తిరుపతికి చెందిన వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ లోకనాథరెడ్డి సోమవారం రూ.15.24 లక్షల వైలువైన ఎస్ఎంఎల్ మహీంద్ర ట్రక్ను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు వాహన తాళాలను అందజేశారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్యరేణిగుంట: మండలంలోని వెంకటాపురం సమీపంలోని ఇటుకుల తయారీ కేంద్రంలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తున్న కె.చిరంజీవి (24) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... తవణంపల్లి మండలం, ముత్తరపల్లికు చెందిన చిరంజీవి వివాహ సమయంలో చేసిన రూ.4 లక్షల అప్పును తీర్చేందుకు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 9వ తేదీ రాత్రి తన సోదరి చందనకు ఫోన్ చేసి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు పక్కనే నివాసం ఉంటున్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా, చిరంజీవి నివాసముంటున్న రేకుల షెడ్డు పైకప్పులోని ఐరన్ రాడ్కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రేనిగుంట పోలీసులు తెలిపారు. ఔషధ మొక్కలు వరం తిరుపతి సిటీ: ఔషధ మొక్కలు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. మానవ నాగరికత ఆరంభం నుంచి రోగాల నివారణకు, ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఏపీఎంఏపీ బోర్డు సహకారంతో సోమవారం ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఆయుర్వేద, సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధ మొక్కల పాత్ర చాలా కీలకమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వేణుగోపాల్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మల్లికార్జునరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి తడ: జాతీయ రహదారిపై కొండూరు గ్రామం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాంబట్టు పరిధిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేసే గంటి క్రాంతికుమార్(32) మృతి చెందాడు. ఎస్ఐ కొండపనాయుడు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, ఎరుకలపూడి గ్రామానికి చెందిన క్రాంతి తన బంధువైన దుగ్గిరాల మండలం, మంచికలపూడి గ్రామానికి చెందిన నరశింహారావుతో కలసి మాంబట్టు పరిశ్రమలో హమాలీలుగా పనిచేస్తూ కాదలూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకున్న ఇద్దరూ ఒకే బైకుపై ఇంటికి బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో తమ నివాసాలకు చేరుకుంటారనగా చైన్నె నుంచి సూళ్లూరుపేట వైపు వెళుతున్న లారీ బైక్ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక భాగంలో కూర్చుని ఉన్న క్రాంతి కింద పడడంతో అతని తలపై నుంచి లారీ వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న నరశింహారావు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఎస్ఐ కొండపనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పటుకుని కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్నారులైన కుమార్తెలు ఉన్నారు. -
అర్జీలకు పరిష్కారం చూపండి
ఇళ్లు మంజూరు చేయండి మాకు చిన్నపాటి ఇంటి స్థలాలు ఉన్నాయి.ఇళ్లు మంజూరు చేయడంతోపాటు వాటిని నిర్మించి ఇవ్వాలి. ఇప్పటికే అధికారులకు చాలా అర్జీలు ఇచ్చాము. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. – చిట్టిమూరు మండలంలోని గుణపాడు ఎస్టీ కాలనీవాసులు తిరుపతి అర్బన్: ీపజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను నిశితంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 333 అర్జీలు వచ్చాయి. వీటిని జాయింట్ కలెక్టర్ గోవిందరావుతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్నాయక్, నాగార్జున, రామాంజమమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి స్వీకరించారు. తల్లికి వందనంకు వచ్చే అర్జీలను పరిశీలించి అర్హత ఉన్నవారికి జాప్యం లేకుండా న్యాయం చేయాలని జేసీ ఆదేశించారు. -
తల్లికి వందనం ఇప్పించండి సార్
అర్హత ఉన్నా తల్లికి వందనం పథకానికి ఎంపిక చేయలేదు. తిరుపతి రూరల్లోని దుర్గసముద్రంలో 6వ తరగతి చదువుకుంటున్న ఎన్.గీతశ్రీ తన తాతయ్యతో కలసి కలెక్టరేట్లో అర్జీని ఇచ్చింది. తమ తల్లిదండ్రులు ఎన్.మురళీకృష్ణ, రాజ్యలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని, పేదలైన తమకు తల్లికి వందనం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. అలాగే మంగళం క్వార్ట్స్లో నివాసం ఉంటున్న ఎన్. హేమంత్రెడ్డి 1వ తరగతి చదువుకున్న క్రమంలో తమకు తల్లికి వందనం ఇప్పించాలని కోరారు. తల్లిదండ్రులు ఎన్.హరికృష్ణ, ఎన్.కౌసల్యతో కలిసి అర్జీ సమర్పించారు. ఇదేమి చోద్యం సారూ కలెక్టరేట్లో ప్రతి వారం వందలాది మంది అర్జీదారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అర్జీలు సమర్పిస్తుంటారు. అయితే ఒక్కరైన తాము ఇచ్చిన అర్జీకి పరిష్కారం చూపించినట్లు చెప్పడం లేదు. అయితే కలెక్టరేట్లో ప్రతి సోమవారం వ్యాపారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కూరగాయలంటూ ఒక చిన్నపాటి కూరగాయల దుకాణం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ అనేక దుకాణాలు ఏర్పాటు చేశారు. సోమవారం వస్తే సంత లాగా కూరగాయలు, పండ్లు, వివిధ రకాల తినుబండారాలు ప్రత్యక్షం అవుతున్నాయి. వీటిని చూసి అర్జీదారులు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
సమస్యల వలయంలో రేణిగుంట పీహెచ్సీ
వాచ్మన్ లేక ఇక్కట్లు రేణిగుంట: రేణిగుంట పీహెచ్సీ సమస్యల వలయంలో కూరుకుపోయింది. రాత్రి వేళ వాచ్మన్ లేక మహిళా సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. పీహెచ్సీ పట్టణానికి చివరన ఉండడం.. రాత్రి విదులు నిర్వహించే సిబ్బందికి సరైన రక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి చుట్టుపక్కల మందుబాబుల ఆగడాలు సైతం శ్రుతిమంచుతున్నాయి. రాత్రి పూట హాస్పిటల్ ప్రాంగణంలో లైట్లు కూడా లేకపోవడంతో చిమ్మచీకట్లో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురికావాల్సి వస్తోంది. అన్నస్వామిపల్లి దారి నుంచి హాస్పిటల్ లోపలికి వెళ్లే దారిలో చీకటి అలముకుంటోంది. రేణిగుంట రైల్వే జంక్షన్ కావడం వల్ల ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. రాత్రి సమయాల్లో అధికంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఇక్కడ వైద్యం పొందుతుంటారు. వాచ్మన్ లేకపోవడంతో గేటు అవతలి నుంచే రోగిని విచారించి లోనికి అనుమతించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీనికితోడు ఏఎన్ఎంలకు నైట్ షిఫ్ట్లు వేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సమాచారం. రాత్రి వేళ కూడా స్థానికంగా డాక్టర్ ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
దద్దరిల్లిన సీఎం సొంత ఇలాకా చంద్రగిరి
చంద్రగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ సమన్వయ కర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వేల మంది దగా డీఎస్సీపై కదంతొక్కారు. చంద్రగిరి బైపాస్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ సాగింది. ఊహించని స్థాయిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సొంత మండలంలో ర్యాలీ కొనసాగింది. ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కన్వీనర్లు, నేతలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రగిరిలో నిరసన ర్యాలీకి తరలివచ్చిన అశేష జనం (ఇన్సెట్) మాట్లాడుతున్న సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి -
అయ్యో.. కొత్తగుంట చిన్న చెరువు!
తిరుపతి శివారులో రూ.200 కోట్ల భూమి హాంఫట్! సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ భూమే కదా.. ఎవరు అడుగుతారులే అన్న ధీమానో.. అధికార టీడీపీ నేతల అండ ఉందన్న నమ్మకమో.. రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై భూ మాఫియా కన్నేసింది. తిరుచానూరు పరిధిలోని కొత్తగుంట చిన్నచెరువును చెరబట్టింది. ఏకంగా 3.98 ఎకరాల భూమిని కొట్టేసేందుకు సిద్ధమయ్యింది. ఆ భూమిలోకి అక్రమంగా చొరబడి యంత్రాలతో చదును చేయడం మొదలు పెట్టింది. ఈ వ్యవహారంలో తిరుపతి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు దుబాయిలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఈ భూమి తనదేనంటూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఆ భూమి ఎవరిది?.. ప్రభుత్వ భూమిలోకి ఎవరు చొరబడ్డారు?.. కబ్జా వెనుక ఉన్నది ఎవరు?.. అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావాల్సి ఉంది. రికార్డులున్నాయని బుకాయింపు తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నం.254/4లోని 3.98 ఎకరాల భూమి కొత్తగుంట చిన్న చెరువుగా ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. అయినా భూ కబ్జాదారులు జేసీబీలు పెట్టి చదును చేస్తున్నారు. కబ్జాదారులు ఆ భూమికి సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు సివిల్ మ్యాటర్ తమకు ఎందుకని వదిలేయడం గమనార్హం. ‘అధికార బలం’తోనేనా? ఆ భూమిలో ఇప్పటికే ప్రహరీ నిర్మాణం చేసిన వ్యక్తి విదేశాల్లో ఉండడాన్ని ఆసరాగా చేసుకుని భూమా ఫియా ఆ స్థలంలోకి ప్రవేశించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూ మాఫియా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. భూమి పత్రాలున్నా.. చొరబడ్డారు దుబాయిలో నివాసముంటున్న పాండురంగన్ మొదలియార్ ఆనే వ్యక్తి ఆ భూమి తమదేనని పోలీసులను ఆశ్రయించారు. భూ ఆక్రమణదారుల నుంచి తన భూమిని కాపాడాలని ఫిర్యాదు చేశారు. తనకు సంబంధించిన పత్రాలను ఫిర్యాదుతోపాటు పోలీసులకు అందించినట్లు సమాచారం. ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఉక్కుపాదం ఎప్పుడు? తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. భూ మాఫియాకు అధికార పార్టీ నేతలు అండగా నిలబడడంపై విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు తమ భూములకు రక్షణ లేకుండాపోతోందన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో భూములను కబ్జా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగంపై ఉన్నప్పటికీ తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో అలాంటి చర్యలు ఏవీ తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కోట్ల విలువైన భూముల్లో అక్రమ చొరబాట్ల వెనుక ఉన్న వ్యక్తులు, వారికి సహకరిస్తున్న శక్తులు, రాజకీయ సంబంధాలపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. -
డయల్ యువర్ సీఎండీకి 58 వినతులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి 9 జిల్లాల నుంచి 58 వినతులు అందినట్లు సంస్థ సంస్థ డైరెక్టర్ పి.అయూబ్ఖాన్ తెలిపారు. విద్యుత్ వ్యవసాయ సర్వీసుల మంజూరు, విద్యుత్ స్తంభాల మార్పు, వోల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలను వినియోగదారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, 1912, 1800 425 155333 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయవచ్చని, 91333 31912 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు తెలియజేయ వచ్చని సూచించారు. డైరెక్టర్లు కె.గురవయ్య, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్.పద్మ, ఎం.మురళీకుమార్, సీహెచ్.రామచంద్రరావు, కె.సంపత్కుమార్, ఎస్.రమణ పాల్గొన్నారు. -
సాంస్కృతిక వైవిధ్యంపై బ్రిడ్జ్ కోర్స్
తిరుపతి రూరల్: అంతర్జాతీయ విద్యార్థులతో సాంస్కృతిక విద్యా పరస్పర మార్పిడికి వేదికగా శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిలుస్తోంది. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో పీఎం–ఉషా కార్యక్రమం కింద భారతీయ వారసత్వం, సంస్కృతిపై వారం రోజుల బ్రిడ్జ్ కోర్స్ను నిర్వహిస్తున్నారు. మలేషియా, తైవాన్, బంగ్లాదేశ్, బోట్స్వానాకు చెందిన విద్యార్థులతో పాటు మహిళా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ఏడు అకడమిక్, అంతర్ సాంస్కృతిక సెషన్లతో పాటు మూడు ప్రాయోగిక, ప్రదర్శన ఆధారిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీసీ ఉమ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ టిజి.అమృతవల్లి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్ఎన్ఎస్.శైలేశ్వరి పాల్గొన్నారు. -
13న సూళ్లూరుపేటలో జాబ్మేళా
తిరుపతి అర్బన్: సూళ్లూరుపేటలోని ఎస్వీఎస్ఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన జాబ్మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్, సీడాప్ సంయుక్తంగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శ్రీసిటీతోపాటు చైన్నెలోని పలు బహుళజాతి కంపెనీలు ఇంటర్వ్యూలకు హాజరవుతాయని చెప్పారు. 18–35 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని, పదోవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ చదువుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు నైపుణ్యం.ఏపీ.జీవోవీ,ఇన్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 9121646661, 9700561225,9988853335 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఆర్వో నరసింహులు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్, ఎన్టీఓయూ సురేష్బాబు, స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి సిటీ: నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు. తమ కుమార్తెను డాక్టర్గా చూడాలనే ఆకాంక్షతో వారు ఆమెను కష్టపడి చదివించారు. దానికి ప్రతిఫలంగా సాయిమేఘన ఇంటర్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించి తిరుపతిలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో నీట్ లాంగ్టర్మ్ శిక్షణ తీసుకుంది. ఈ ఏడాది మే లో జరిగిన నీట్ పరీక్ష రాసింది. అందులో 499 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పేపర్ లీక్ కావడంతో ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో ఆమెకు 390 మార్కులే వచ్చాయి. దీంతో డాక్టర్ కావాలనుకున్న ఆమె ఆశ నిర్వీర్యమైందనే మనోవేదనతో 10 రోజుల క్రితం సాయిమేఘన ఆత్మహత్య చేసుకుంది. కానీ కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మదనపడుతూ ఆదివారం కర్మక్రియలు నిర్వహించారు. అక్కడికి పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు వచ్చి నివాళులర్పించిన సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో సాయిమేఘన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. -
వాయల్టీ అధ్యక్షుడిగా ప్రసాద్రెడ్డి
తిరుపతి కల్చరల్: వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ (వాయల్టీ) రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన మట్లి ప్రసాద్రెడ్డి ఎన్నికయ్యారు. ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజినీర్స్(టేప్) ఆధ్వర్యంలో ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షుడితో పాటు చైర్మన్గా కె.హరికప్రసాద్ (శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా పీవీఎన్.మాణిక్యాలరావు(ఏలూరు), కోశాధికారిగా ఎస్కే.హిదయతుల్లా(నెల్లూరు) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం టేప్ ఎక్స్పో–2026 బ్రోచర్ను విడుదల చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, యాద సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వన్నెకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, క్రెడాయ్ అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
‘డిజిటల్’ సందేహాలు!
తిరుపతి రూరల్ : డిజిటల్ ఇండియా పేరుతో సామాన్యుడి విద్యుత్ బిల్లుపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా ? స్మార్ట్ఫోన్ లేని వారు.. యూపీఐ వినియోగం తెలియని వారు.. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన లేని నిరక్షరాస్యులు ఇక కరెంట్ బిల్లు ఎలా కట్టాలి అనే ప్రశ్నలు పలువురిని వేధిస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు చూపకుండా ‘డిజిటల్’ పేమెంట్ మాత్రమే చేయాలనడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిజిటల్ గురించి తెలియని వినియోగదారుల పరిస్థితిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ మాత్రమే చేయాలని వినియోగ దారులపై ఒత్తిడి తీసుకురావడంలో ఆంతర్యమేమిటి..? ఇందులో ప్రభుత్వ పెద్దలకు, డిస్కం అధికారులకు ఏదైనా వాటాలు వున్నాయా..? అందుకే ఇంతలా ఒత్తిడి తెస్తున్నారా..? అనే అనుమానాలు వినియోగదారులు నుంచి వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ పేమెంట్కు పల్లెల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బిల్లు చెల్లింపులు మాత్రం నగదు రూపంలో చేసుకునేది లేదని కలెక్షన్ సిబ్బంది చెబుతుండటం గమనార్హం. అందులో భాగంగానే ఆదివారం చంద్రగిరి మండలం శానంబట్ల పంచాయతీలో రం విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలని సిబ్బంది స్పష్టం చేయడంతో గ్రామస్తులు మండిపడ్డారు. కేంద్రాల మూసివేత! ఒకవైపు 49.5 శాతం మంది మాత్రమే ఆన్లైన్లో బిల్లులు చెల్లిస్తున్నారు. మరోవైపు భౌతికంగా బిల్లులు చెల్లించే పల్లె వాసులకు కష్టాలు తప్పడం లేదు. స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి రాకముందే బిల్లు చెల్లింపు మార్గాలను మూసివేయడం ఎంతవరకు సమంజసమని పల్లె వాసులు ప్రశ్నిస్తున్నారు. ఒక నెలకు రూ.520 కోట్ల బిల్లింగ్లో సుమారు రూ.257.4 కోట్లు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు. మిగిలిన సుమారు రూ.262.6 కోట్ల చెల్లింపులు ఆఫ్లైన్ మార్గాల్లో బిల్లు కలెక్షన్ సిబ్బంది ద్వారా జరుగుతున్నాయి. ఆ లెక్కన డిజిటల్ వ్యవస్థకు ఇంకా భారీ సంఖ్యలో విద్యుత్ వినియోగదారులు దూరంగానే ఉన్నారన్నది మాత్రం నిజమని స్పష్టమవుతోంది. -
బుద్ధి చెప్పాలి
విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాటాలు ప్రారంభించాలి. లేకుంటేలో పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు మరింత దిగజారే పరిస్థితికి చేరుతాయి. బాబు సర్కార్ విద్యార్థి సంఘాలపై విధించిన ఆంక్షలను ఉపసంహరించుకునే వరకు పోరాటాలు ప్రారంభించాలి. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. – షేక్ మన్సూర్, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి నియంతృత్వ పాలన విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధించడం బాబు సర్కార్ నియంతృత్వ పాలనకు నిదర్శనం. కార్పొరేట్ శక్తుల ఇష్టారాజ్యానికి ఇదో ఆయుధం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై చంద్రబాబు ప్రభుత్వ దాడులకు దిగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోంది. విద్యార్థుల ఆగ్రహానికి మంత్రి లోకేష్ గురికాక తప్పదు. – టి.స్వరూప్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడువిద్యాసంస్థల్లోకి అనుమతి నిరాకరణ సరికాదు -
అక్షీరా మామ్ అండ్ మీ హాస్పిటల్ ప్రారంభం
తిరుపతి కల్చరల్: రాయలసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో కరకంబాడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షీరా మామ్ అండ్ మీ హాస్పిటల్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఇందులో ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తుడా చైర్మన్ సి.దివాకర్రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, అన్నా అనిత ముఖ్య అతిథులుగా పాల్గొని హాస్పిటల్ అధినేతలను అభినందించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ రేష్మారెడ్డి మాట్లాడుతూ తమ ఆస్పత్రి రాయలసీమలో మాతా శిశువైద్య సేవల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆధునిక వైద్య పరికరాలతో వైద్యం అందజేస్తామన్నారు. మహిళలు, నవజాత శిశువులు, చిన్నారులకు సమగ్ర వైద్య సేవలు అందించే ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆధునాతన లెవల్–111 ఎన్ఐసీయూ సదుపాయం, అత్యవసర పరిస్థితుల్లో చిన్నారుల కోసం ఆధునాతన పీఐసీయూ, 24/7 క్రిటికల్ కేర్ సేవలు, 24 గంటల పాటు అనుభవజ్ఞులైన వైద్యులతో అందిస్తామని వెల్లడించారు. నియ్నోటాలజీ సేవలు, ప్రసూతి, గైనకాలజీ వైద్య సేవలు, పెయిన్ లెస్ డెలివరీ సదుపాయం ఉందని తెలిపారు. -
జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలో ఆదివారం అమరావతి చాంపియన్షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ స్కూల్ ఆవరణలో తొలిరోజు వాలీబాల్, ఎస్వీయూ క్రీడా మైదానంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ బోర్డు సభ్యులు రజని, డీఎస్డీఓ శశిధర్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒకరు క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. తిరుపతి, చంద్రగిరి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఇదివరకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన 1,538 క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. 10వ తేదీన బ్యాడ్మింటన్, వెయిట్లిఫ్టింగ్ క్రీడలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, బాస్కెట్ బాల్ను ఎస్వీయూ మైదానంలో, 11న బాక్సింగ్, చెస్ పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో, హాకీ క్రీడను ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో, 12న ఖోఖో, కబడ్డీ పోటీలను ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో, యోగా పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, ఆర్చరీ పోటీలను ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులందరూ తమ ప్రతిభను చాటుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి విజేతలు ఈ నెల 19నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, శాప్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యేతో కలిసి వాలీబాల్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా స్థాయి విజేతలు వీరే.. -
చదరంగం జీవితానికి ప్రతిబింబం
నగరి: చదరంగం క్రీడ మాత్రమే కాదని, అది మనిషి జీవితాన్ని ప్రతిబింబించే మేధో క్రీడ అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, రిటైర్డ్ డిప్యూటీ డీఈవో ప్రభాకర్రాజు తెలిపారు. నగరి మండలంలోని వీకేఆర్పురం గ్రాండ్ వరల్డ్లో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో నగరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల చెస్ పోటీల ఫైనల్స్, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో మొత్తం 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో టి.హేమాద్రి, (నగరి), డి.శ్యామ్కుమార్ (శ్రీకాళహస్తి), ఎన్.సహస్ర (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. జూనియర్స్ విభా గంలో టీ.చైతన్య (నగరి), సాయిచరణ్ (తిరుపతి), ఆషిక్ ఇల్లాహి (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. అండర్ 9 విభాగంలో పి.పవన్కిరీటిరెడ్డి (తిరుపతి), తేజ సూర్యనారాయణ (నగరి), పీవీఎం.సాత్విక్ (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. సీనియర్స్ విభాగంలో ముగ్గురికి, జూనియర్స్ విభాగంలో 22 మందికి, అండర్–9 విభాగంలో 10 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న మహిళలు, దివ్యాంగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాకర్రాజు మాట్లాడుతూ చదరంగంలో ప్రత్యర్థి వేసే ఎత్తును ముందుగానే ఊహించి తదుపరి అడు గు వేయాలన్నారు. మరో అతిథిగా పాల్గొన్న పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ చదరంగం చిన్నారుల్లో చదువుపై ఏకాగ్రతను పెంచడంతో పాటు, గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రతి ఎత్తు ఒక పాఠాన్ని నేర్పుతుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు గజేంద్ర, డైరెక్టర్లు రవిబాబు, ఆర్ఎన్ దేవన్, చదరంగ నిపుణులు నవీన్కుమార్, జీవన్, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్ క్లబ్ కార్యదర్శి కిషోర్కుమార్, కోశాధికారి శక్తివేలు పాల్గొన్నారు. -
ముక్కంటి సేవకు పోటెత్తిన భక్తులు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తు లు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆదిదంపతులను సుమారు 33వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు అలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 547, రూ.200 శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 3,153 మంది, రూ.50 ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 2,351 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టికెట్ల ద్వారా 3,051మంది, రూ.750 టికెట్ల ద్వారా 1,220, రూ.1,500 టికెట్ల ద్వారా 433 మంది. రూ.2,500 టికెట్ల ద్వారా 308 మంది, రూ.5 వేల టికెట్ల ద్వారా 107మంది భక్తులు పూజలు చేయించుకు న్నారు. ఐదురకాల ప్రసాదాలు కలిపి మొత్తం 26,531 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు వివరించారు. -
4.01లక్షల ఓట్లు భద్రమేనా..?
తిరుపతి అర్బన్ : ఓటు విలువ తెలిసిందే. అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో జూన్ 15 నుంచి జూలై 24 వరకు 40 రోజుల పాటు ఇంటింటా సర్వే కింద బీఎల్వోలు పరిశీలన చేపట్టారు. అయితే సర్ ప్రక్రియ జూలై 24తో ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. జిల్లాలో 14,81,603 మంది ఓటర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉన్నారు. అయితే సర్ ప్రక్రియకు ముందు జిల్లాలో 17,69,429 మంది ఓటర్లు ఉండేవారు. అయితే సర్ ప్రక్రియ అనంతరం జిల్లా వ్యాప్తంగా 2,87,826 మంది ఓటర్లు తగ్గిపోయారు. మరోవైపు 1,62,230 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నప్పటికీ వీరు ఓట్లు మ్యాపింగ్ కాలేదు. అలాగే వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు 2,38,980 మంది ఉన్నారు. మొత్తంగా 4,01,210 ఓటర్లకు నోటీసులు రేపు మాపో పంపనున్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ సూచించిన మేరకు 11 రకాల గుర్తింపుల్లో ఏదో ఒక్కటి వారు బీఎల్వోలకు చూపించాలి. సరైన గుర్తింపుకార్డును అందించి...బీఎల్వోలు ఓకే చెబితేనే ఆయా ఓట్లకు భద్రత ఉంటుంది. జర్నలిస్ట్ సునీల్కి చికిత్స తిరుపతి తుడా : టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసు కారణంగా రిమాండ్లో ఉన్న జర్నలిస్టు సంజీవ్ సునీల్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు ఆదివారం తిరుపతి సబ్ జైలు నుంచి సునీల్ని రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాల కారణంగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నానని ఆయన జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. వైద్య అవసరాన్ని గుర్తించిన అధికారులు హుటాహుటిన రుయా కు తీసుకువచ్చారు. ప్రస్తుతం సునీల్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. 12 నుంచి ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ తిరుపతి సిటీ : ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ద్వారా అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ యూజీ కోర్సులలో ప్రవేశాల కోసం తొలి దశ అడ్మిషన్లలో భాగంగా కౌన్సిలింగ్ ప్రక్రియను ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషనరేట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా 12వ తేదీ నుంచి 17వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఇస్తూ, 14 నుంచి 19వరకు వెబ్ఆప్షన్లు, 20న వెబ్ఆప్షన్ల మార్పుకు గడువు ఉంటుందని వెల్లడించింది. 23వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల, 24వ తేదీ నుంచి 27వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. డివైడర్ను ఢీకొన్న లారీ తిరుపతి రూరల్ : చిత్తూరు– పీలేరు జాతీయ రహదారిపై పాకాల మండలం పదిపుట్లబైలు వద్ద అదుపుతప్పిన లారీ డివైడర్ను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. పోలీసుల సమాచారం మేరకు.. వరి పొట్టు, ఇసుక లోడుతో లారీకి బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పింది. రహదారి మధ్యలోని డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో లారీ ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారు లు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్పై దాడి తిరుపతి క్రైం : అపార్ట్మెంట్లో కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం డ్రైవర్పై దాడికి దారి తీసిన సంఘటన ఆదివారం రాత్రి తిరుపతిలోని కోరమేనుగుంటలో ఉన్న జీపీఆర్ రెసిడెన్సీలో చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అమిత్కుమార్ శర్మ వద్ద డేరంగుల తేజ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పల్లవి, దిలీప్ దంపతులు కారు పార్కింగ్ విషయమై తేజతో గొడవకు దిగినట్లు సమాచారం. మాటమాట పెరగడంతో ఇద్దరూ కలిసి తేజపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అలరించిన పౌరాణిక, సాంఘిక నాటికలు తిరుపతి కల్చరల్: మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటక పోటీలు ఆదివారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్యనాటకాలు, సాంఘిక నాటికలు ఆకట్టుకున్నాయి. ఉదయం విజయవాడ డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారు ప్రదర్శించిన కృష్ణవేణి మాత, ఖడ్గతిక్కన పద్యనాటకాలు, కాట్రపాడు ఉషోదయ కళా నికేతన్ వారి మంచి మనసులు సాంఘిక నాటిక అలరించాయి. ఆంధ్ర మహావిష్ణువు బాలల పద్యనాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులను ఎస్వీ నాట్య కళా పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు మర్దం గజేంద్ర, కొత్తపల్లి మునిరత్నం పారితోషకం, జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. -
భూ మాయగాళ్లు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి.. చిత్తూరు జిల్లాల్లో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. నకిలీ పత్రాలతో కొత్త గుర్తింపును సృష్టించడం ద్వారా రిజిస్ట్రేషన్్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఆధార్లో పేరు, చిరునామా, ఫొన్ నంబర్ వంటి వివరాల్లో మార్పులు చేసి.. అసలు యజమానులను పక్కనపెట్టి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించిన ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గుర్తింపు ధ్రువీకరణకు ఉపయోగించాల్సిన ఆధార్ కార్డే.. భూ మోసగాళ్ల చేతిలో అక్రమ లావాదేవీలకు ఆయుధంగా మారిపోతోది. తిరుచానూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కేటుగాళ్ల ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఆధార్ కార్డులో చిన్న మార్పు.. ఆస్తి రిజిస్ట్రేషన్లో పెద్ద మోసం. పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను మార్చి అసలు యజమానులకు తెలియకుండానే భూములు, ఇళ్లు బదలాయించేస్తున్నారు. ఆధార్ ఆధారంగా వ్యక్తి గుర్తింపును నిర్ధారించాల్సిన వ్యవస్థలోని లోపాలను కొందరు దళారులు, మధ్యవర్తులు, అక్రమ రిజిస్ట్రేషన్ ముఠాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనేందుకు పై రెండు ఘటనలే సాక్ష్యం. కొందరు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో భూ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. దందా జరుగుతోంది ఇలా.. భూ యజమానుల ఆధార్, పాన్న్, మొబైల్ వివరాలను సేకరిస్తారు. ఆధార్లో చిరునామా లేదా మొబైల్ నంబర్ మార్పు చేస్తారు. నకిలీ వారసత్వ, కుటుంబ, చిరునామా పత్రాలను సిద్ధం చేస్తారు. యజమాని తరఫున మాట్లాడే వ్యక్తిని ఏర్పాటు చేస్తారు. బయోమెట్రిక్, ఓటీపీ లేదా గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్న్ పూర్తిచేసి ఆస్తిని మరొకరి పేరుకు బదలాయిస్తారు. ఈ ప్రక్రియలో పలు దశల్లో జరిగే ధ్రువీకరణను సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించకపోవడమే మోసగాళ్లకు అవకాశంగా మారుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధితులకు తెలియకుండానే.. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న భూ యజమానులు, వృద్ధులు, ఒంటరిగా ఉండే మహిళలు, కుటుంబ వివాదాల్లో ఉన్న ఆస్తి యజమానులు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్న్ పూర్తయిన తర్వాతే తమ ఆస్తి మరొకరి పేరు పైకి వెళ్లిందని బాధితులు గుర్తిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో పాత మొబైల్ నంబర్ పనిచేయకపోవడం, చిరునామా మార్పు, కుటుంబ సభ్యులపై నమ్మకం వంటి అంశాలను ఉపయోగించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, అడంగల్ సర్టిఫికెట్ వంటి రికార్డులను సమయానుకూలంగా పరిశీలించకపోవడంతో మోసం ఆలస్యంగా బయటపడుతోంది. పత్రాలు మార్చి.. రిజిస్ట్రేషన్లు జాగ్రత్తలు ఇలా.. మీ ఆధార్లో నమోదైన మొబైల్ నంబర్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఆధార్ బయోమెట్రిక్ను అవసరం లేనప్పుడు లాక్ చేసి ఉంచాలి. పోర్టల్లో ఆధార్ వినియోగ చరిత్రను పరిశీలించాలి. ఆస్తులకు సంబంధించిన సర్టిఫికెట్ను తరచూ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్న్ పత్రాలు, అడంగల్, పన్ను రికార్డులను సరిపోల్చాలి. అనుమానం ఉంటే వెంటనే పోలీసులు, సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేయాలి. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం ఆధార్ సమాచారం మార్పులు, ఆస్తి రిజిస్ట్రేషన్లు రెండు వేర్వేరు ప్రక్రియలైనా.. రెండింటిలోనూ వ్యక్తి గుర్తింపు కీలకంగా ఉంటుంది. కాబట్టి అనుమానాస్పద మార్పులు, తరచూ జరిగే చిరునామా మార్పులు, కొత్త మొబైల్ నంబర్ల జోడింపు, వెంటనే జరిగే ఆస్తి బదలాయింపులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. రిజిస్ట్రేషన్న్ సమయంలో పత్రాల పరిశీలనతోపాటు యజమాని ప్రత్యక్ష హాజరు, వీడియో రికార్డింగ్, బయోమెట్రిక్ ధ్రువీకరణ, నోటీసు వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆధార్ వివరాల్లో అనధికార మార్పులు, ఆస్తి రిజిస్ట్రేషనన్్ అక్రమాలపై పోలీసులకు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. -
కళ్లెం వేస్తే కలబడతాం!
●‘‘విద్యార్థుల హక్కుల పరిరక్షణకే సంఘాలు ఏర్పడ్డాయి. విద్యాసంస్థల అవకతవకలపై ఏళ్ల తరబడి పోరాటం సాగిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు.. పిల్లలకు మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు నిత్యం శ్రమిస్తున్నాయి. అయితే విద్యార్థి సంఘాల చిత్తశుద్ధిని చంద్రబాబు సర్కారు అవమానిస్తోంది. కార్పొరేట్లకు అండగా నిలుస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. విద్యాసంస్థలు, వసతిగృహాల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకూడదంటూ హుంకరిస్తోంది. ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. మా ఆశయాలకు కళ్లెం వేయాలని యత్నిస్తే కలబడతాం. ఆంక్షలు విధిస్తే ఉద్యమిస్తాం. మంత్రి లోకేష్ విపరీత వైఖరిని అడుగడుగునా ఎండగడతాం’’ అంటూ విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. – తిరుపతి సిటీ -
విద్యతోనే ఉన్నత స్థానం
తిరుపతి అన్నమయ్యసర్కిల్:ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతోనే ఉన్నత స్థానం అందుకోగలరని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం ప్రెస్క్లబ్ కమిటీ ఆద్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల పిల్లల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ లక్ష్యం నిర్దేశించుకుని ఆదిశగా విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులకు పేరు, ప్రతిష్టలు తీసుకువచ్చేలా సత్ప్రవర్తనతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మురళి, బాలచంద్ర మాట్లాడుతూ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ప్రతిభా పురస్కారాలు అందజేసినట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లు, టెలివిజన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని కోరారు. ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీలు జగదీష్, విజయ్ యాదవ్, ఈసీ మెంబర్లు నాగార్జున, కోటి, బాలయ్య పాల్గొన్నారు. -
హక్కులను హరిస్తే సహించం
విద్యార్థుల హక్కులను హరించాలని యత్నిస్తే సహించం. విద్యార్థుల ఆగ్రహానికి గురైన ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనుగడ సాగించిన దాఖలాలు లేవు. విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధించడం ద్వారా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు మరింత రెచ్చిపోతాయి. పేద విద్యార్థులు, తల్లిదండ్రులను వేధించి రూ.కోట్లు వసూలు చేసి వ్యాపార సామ్రాజాన్ని విస్తరించి విద్యను వ్యాపారంగా మార్చేస్తాయి. – అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశ్నించే గొంతుకలపై ఆంక్షలా.. పేద విద్యార్థులను పీక్కుతింటున్న కార్పొరేట్ సంస్థల ఆగడాలపై ప్రశ్నించడం తప్పా. ప్రభుత్వ పాఠశాలలో, సంక్షేమ వసతిగృహాలలో నాణ్యమైన ఆహారం, మౌఇక వసతులపై ప్రశ్నించే గొంతుకలపై ఆంక్షలు విధిస్తారా. ప్రభుత్వ విద్యా సంస్థలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ పట్టించుకోకపోవడంతో పేదలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే బెదిరింపులు, కేసులు పెడతారా. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – సుందర్రాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు ఉపసంహరించుకోవాలి లోకేష్ అన్నా అధికారం చేపట్టి మంత్రి పదవితో గతం మరిచిపోయారా.. యువగళం పాదయాత్రలో యువతకు మీరు ఇచ్చిన హామీ గుర్తు లేదా.. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, విద్యార్థి సంఘాలు సమస్యలపై గళం విప్పాలని ఊదరగొట్టిన ఉపన్యాసాలు ఏమయ్యాయి. విద్యా సంస్థలలోని విద్యార్థి నేతలకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించడం విద్యార్థి హక్కులపై దాడి కాదా..ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – శివశంకర్ నాయక్, జీఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాలను గతంలో ఎన్నడూ చూడలేదు. విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన విద్యార్థి సంఘాలను విద్యాసంస్థలలోకి అనుమతించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు. తక్షణం ఉపసంహరించుకోకుంటే విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది. – ఆర్.ఆశ, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి సమయం ఆసన్నమైంది చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న రెడ్బుక్ రాజ్యాంగానికి చెక్ పెట్టాలంటే మరో జెన్జెడ్ ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో అంబేడ్కర్ అందించిన రాజ్యాంగానికి చరమగీతం పాడే దుర్మార్గపు పరిస్థితి తలెత్తడం దారుణం, విద్యార్థి సంఘాలు తక్షణం స్పందించాలి. రెడ్బుక్ రాజ్యాంగానికి అడ్డుకట్ట వేయకపోతే పేద విద్యార్థుల మనుగడ అసాధ్యం. – ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి -
యథేచ్ఛగా చెరువుల విధ్వంసం
● ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకం ● వందలాది ట్రాక్టర్లతో తరలించి విక్రయం ● ప్రకృతి సంపద.. టీడీపీ నేతల పరం తొట్టంబేడు (శ్రీకాళహస్తిరూరల్): శ్రీకాళహస్తి పట్టణ పరిసరాల్లోని చెరువులపై మట్టి మాఫియా కన్ను పడింది. టీడీపీ నేతల కన్నుసన్నల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో మట్టిని తవ్వుతూ ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణానికి కూతవేటు దూరంలోని కమ్మకొత్తూరు చెరువు, ఉరుందూరు చెరువు తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు జేసీబీలు.. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు? కమ్మకొత్తూరు చెరువులో రెండు జేసీబీలతో మట్టిని తవ్వి, పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి తరలింపు సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడంతో చెరువు స్వరూపమే మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అవసరాల పేరిట.. చెరువుల్లోని మట్టిని వ్యవసాయ భూముల చదును కోసం వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను అడ్డుపెట్టుకుని మట్టిని ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాళహస్తి సమీపంలోని ఆరులేన్ల జాతీయ రహదారి పరిసరాల్లో భూములకు భారీగా డిమాండ్ పెరగడంతో వెంచర్ల కోసం మట్టి అవసరం ఏర్పడింది. ఇదే అదునుగా అక్రమ మట్టి తరలింపు సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలకే ప్రమాదం చెరువుల్లో ఏర్పడిన లోతైన గోతులు ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. చేపల వేటకు వెళ్లే వారు, చెరువు పరిసరాల్లో సంచరించే చిన్నారులు, పశువులు గోతుల్లో పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసి గోతులు నీటితో నిండితే వాటి లోతు తెలియక పలువురు ప్రాణాలు పోగొట్టుకునే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. రహదారులకు ముప్పు భారీ సంఖ్యలో ట్రాక్టర్లు తిరగడంతో రహదారులకు ముప్పు వాటిల్లుతోంది. మట్టి రవాణా చేసే వాహనాల కారణంగా దుమ్ము, రోడ్లపై మట్టి పేరుకుపోవడంతో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనిపై స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వివరాలు వెల్లడించాలి చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులుంటే వాటి పరిమితి ఎంత? ఎంత మట్టి తరలించారు? ఎక్కడికి తరలించారు? ప్రభుత్వానికి ఎంత రుసుము చెల్లించారు? అన్న అంశాలపై అధికారులు బహిరంగంగా వివరాలు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల అలసత్వంతోనే.. చెరువులు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండగా, భూములు– అనుమతుల వ్యవహారాలను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. అక్రమ రవాణా, రహదారి భద్రత అంశాల్లో పోలీసు శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ మూడు శాఖల సమన్వయ లోపంతో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులను కాపాడాల్సిన అధికారులే అక్రమ తవ్వకాలను అడ్డుకోకపోతే భవిష్యత్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి కమ్మకొత్తూరు, ఉరుందూరు చెరువులతోపాటు శ్రీకాళహస్తి పరిసరాల్లోని అన్ని చెరువుల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిగితే జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికై నా మేల్కొని మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే చెరువుల స్థితిగతులే మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉపాధికి ఉచిత శిక్షణ
చంద్రగిరి : గ్రామీణ ప్రాంతాల పురుషులకు చంద్రగిరిలో ఈ నెల 13వ తేదీ నుంచి 14 రోజుల పాటు సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారమ్, స్మోక్ డిటెక్టర్పై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పురుషులు శిక్షణకు అర్హులని వెల్లడించారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్కి ఉచిత భోజనంతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు, ఎడ్యుకేషన్ ధ్రువీకరణపత్రం జిరాక్స్లతోపాటు 4 పాస్దృవీకరణ పత్రం జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లతో సంప్రదించాలని పేర్కొన్నారు. అర్ధరాత్రి లారీ బీభత్సం చంద్రగిరి: అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. చిత్తూరు నుంచి తిరుపతికి కట్టెల లోడుతో వస్తున్న లారీ అర్ధరాత్రి సమయంలో ఎం.కొంగరవారిపల్లి వద్ద వస్తున్న క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. అపై పక్కన ఆపి ఉన్న కారును ఢీకొని, చిల్లర దుకాణంపైకి వెళ్లింది. పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, దుకాణం పాక్షికంగా దెబ్బతింది. అర్ధరాత్రి సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవరు, క్లీనర్లను పట్టుకున్న స్థానికులు వారికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు లారీ డ్రైవరు, క్లీనర్లను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఐఐటీలో ఎన్పీటీఈఎల్ స్టార్ ఇంట్రాక్షన్–2026 ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శనివారం మద్రాస్ ఐఐటీలో కలసి సంయుక్తంగా ‘ఎన్పీటీఈఎల్ స్టార్ ఇంట్రాక్షన్ –2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్.సత్యనారాయణ, కాంపిటెన్సీ డెవలప్మెంట్ – అవుట్రీచ్’ విభాగం డీన్ ప్రొఫెసర్ అరుణ్కుమార్ తంగిరాల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మద్రాస్ ఐఐటీ కోడ్ విభాగం చైర్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ డిజిటల్ అభ్యాసం, ఆన్న్లైన్ విద్య గురించి వివరించారు. విద్యా రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా అభ్యాసకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువ నాయకుడి మృతి
ఏర్పేడు: ఏర్పేడు మండల వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు సంపతి నవీన్కుమార్యాదవ్(33) రైలు కింద పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికుల కథనం.. ఏర్పేడు మండలం, సీతారాంపేటకు చెందిన సంపతి మణి కుమారుడు నవీన్కుమార్యాదవ్ శుక్రవారం రాత్రి నుంచి కనబడలేదు. గ్రామ శివారున ఉన్న రైలు పట్టాలపై శనివారం ఉదయం నవీన్ మృతదేహం పడి ఉండడానిన స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు నవీన్కు ఇంకా వివాహం కాలేదు. జీవితంపై విరక్తితో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? బహిర్భూమికి వెళుతూ ప్రమాదవశాత్తు రైలు పట్టాలు దాటుతూ మృతి చెందాడా..? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే పరామర్శ సంతపి నవీన్కుమార్యాదవ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతదేహం వద్ద ఘన నివాళి అర్పించారు. నవీన్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్యయాదవ్, మండల ఇన్చార్జి గున్నేరి కిషోర్రెడ్డి, పార్టీ శ్రేణులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
గన్మెన్ల కోసం జేబీ నాటకం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బీజేపీకి చెందిన ఒక్కరు తనకు ప్రాణహాని ఉందని, గన్మెన్లకు అనుమతి తీసుకున్న విధానాన్ని అనుసరిస్తూ టీటీడీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ సరికొత్త నాటకాన్ని ప్రదర్శించి గన్మెన్లను పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిశాయని వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన ప్రెస్క్లబ్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరె అజయ్కుమార్తో కలసి మాట్లాడారు. టీటీడీ అధిష్టానం వలస వచ్చిన జేబీ శ్రీనివాస్ ఆనే ఆకు రౌడీకి ఇన్చార్జి పదవి ఇచ్చి తప్పు చేసిందన్నారు. ఆ పార్టీలో సీనియర్లు ఉన్నా జేబీకి పదవిని కట్టబెట్టడంతో వారికే టార్గెట్గా మారారని తెలిపారు. పదవి అడ్డుపెట్టకుని అహంకారంతో రెచ్చిపోతున్న జేబీ శ్రీనివాస్ తీరుకు బాధితులు వారి ఇంటి వద్ద నిరసన చేస్తుండగా మీడీయా కవరేజీకి వెళిన సంజీవ్ సునీల్, సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్కృష్ణపై దాడి చేయడం బాధాకరమన్నారు. పైపెచ్చు దాడి చేసిన జేబీ శ్రీనివాస్ అనుచరులే చేతులకు గాయాలు చేసుకుని తమ నేత జేబీపై హత్యాయత్నానికి వచ్చారంటూ పోలీసు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ఆ సమయంలో దగ్గరుండి దర్జాగా విలేకరి సంజీవ్సునీల్ను పోలీసులకు అప్పగించిన ఆయన మరుసటి రోజున చేతికి పెద్దగా కట్టుకట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బలిజ కులం అడ్డుపెట్టకుని ఆ కోటాలో ఇన్చార్జి పదవి పొందిన జేబీ శ్రీనివాస్ అనుచరుల చేతిలో దాడికి గురైన వారు బలిజ సోదరులే కదా కనీసం కమ్యూనిటీ ఫీలింగ్ కూడా లేకుండా దాడి చేయడాన్ని ఖండించారు. దొంగ నాటకాలు ప్రదర్శించినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని భావించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శమన్నారు. ఈ వ్యవహారం తెలిసి పరామర్శించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆరణి, మురళీమోహన్లు పరుగెత్తారన్నారు. వీరికి ఏ మాత్రం గౌరవం అనేది లేకుండా ఆరోగ్యకరంగా ఉన్న జేబీ శ్రీనివాస్ దర్జాగా కూర్చోని మాట్లాడుతున్న తీరు మీడియాలో చూస్తున్న అందరికీ అర్ధమైందన్నారు. చౌకబారు వ్యవహారాలను పక్కన పెట్టి నగరాభివృద్ధితో పాటు ప్రజాసేవకు దోహదపడాలన్నారు. అలా కుదరదని నా రూటులోనే వెళ్లతామంటే ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రశ్నించడంతో పాటు మీ రౌడీయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం కార్యదర్శి మహేష్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు. -
18 ఏళ్లు..ఎన్నో మేళ్లు!
శ్రీసిటీ (వరదయ్యపాళెం): దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన శ్రీసిటీ 18 వసంతాలను పూర్తి చేసుకుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయంగా ఎదిగి, రాష్ట్రానికి, దేశానికి తలమానికంగా నిలిచింది. 8 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించిన ఈ పారిశ్రామిక నగరంలో ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 260కుపైగా దేశీయ, విదేశీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు రూ.53 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, రూ.57,500 కోట్లకు పైగా ఎగుమతులు జరిగాయి. దీని ద్వారా 75 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించింది. కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా శ్రీసిటీ ఎయిర్ కండిషనర్ల తయారీలో శ్రీసిటీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. డైకిన్, ఎల్జీ, బ్లూ స్టార్, క్యారియర్, హావెల్స్, లాయిడ్, అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్ సహా పది ప్రధాన ఏసీ తయారీ సంస్థలు, 30కి పైగా విడి భాగాల కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. తాజాగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, సోలమ్ సంస్థలు కొత్త పెట్టుబడులు, విస్తరణలకు ముందుకు రావడంతో శ్రీసిటీకి ‘కూల్ క్యాపిటల్‘ హోదా మరింత బలపడింది. 2027 నాటికి దేశంలో ఉత్పత్తయ్యే ఎయిర్ కండిషనర్లలో దాదాపు 60 శాతం శ్రీసిటీ నుంచే రానున్నట్లు అంచనా. ఇసుజు, ఆల్స్టమ్, మోండెలీజ్, కోల్గేట్, కెలాగ్స్, కింబర్లీ–క్లార్క్ వంటి బహుళజాతి సంస్థలు కూడా ఇక్కడి నుంచి దేశీయ, విదేశీ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. సముద్ర తీర పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఎస్ఈజెడ్, ఎఫ్టీడబ్ల్యూజెడ్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ వంటి సౌకర్యాలు శ్రీసిటీ వృద్ధికి కీలకంగా నిలిచాయి. విద్యా హబ్గా కొత్త అడుగు పారిశ్రామిక ప్రగతితో పాటు విద్యారంగంలోనూ శ్రీసిటీ ముందడుగు వేస్తోంది. క్రియా, ట్రిపుల్ ఐటీ, ఐఎఫ్ఎంఆర్ బిజినెస్ స్కూల్, చిన్మయ, అకార్డ్ సీబీఎస్ఈ పాఠశాలలతో పాటు ఈ ఏడాది ప్రారంభమైన శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇందుకు నిదర్శనం. ‘వర్క్–స్టడీ‘ డ్యూయల్ మోడల్ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత విద్యను అందించడం విశేషం. సీఎస్ఆర్తో సమగ్ర అభివృద్ధి 2009లో ఏర్పాటైన శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు రూ.61 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేశారు. 40కి పైగా పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ఐదు వేల మందికి పైగా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వగా, మహిళా సాధికారత, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరగడం వంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ నెల 6న మన్నూరు పోలూరులో రూ.42 లక్షలతో విద్యా వసతులు, గత ఏడాది నవంబర్లో సత్యవేడులో రూ.46 లక్షలతో బీసీ కళాశాల బాలుర వసతి గృహం నిర్మించడం వంటి కార్యక్రమాలు దీనికి ఉదాహరణలు. పారిశ్రామిక ప్రగతికి మార్గదర్శిగా శ్రీసిటీ ఓ మహానేత నాటిన చిన్న మొక్క నేడు మహావృక్షంగా మారింది. వెనుకబడిన ప్రాంతమైన సత్యవేడు నియోజకవర్గానికి ఆశాకిరణంగా నిలిచింది. శ్రీసిటీ పారిశ్రామికవాడ దేశంలోనే ఆదర్శ సెజ్గా రూపుదిద్దుకుంది. 2008 ఆగస్టు 8న అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా శ్రీసిటీ పురుడు పోసుకుంది. నిన్నటితో 18 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఆ మహాప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన శ్రీసిటీ విజయగాథ గురించి తెలుసుకుందాం. పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కృషి 18 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శ్రీసిటీకి శ్రీకారం చుట్టాం. నేడు అది ప్రపంచ గుర్తింపు పొందిన తయారీ కేంద్రంగా ఎదిగింది. పెట్టుబడిదారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం, ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైంది. మున్ముందు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో శ్రీసిటీ కీలక పాత్ర పోషిస్తుంది. – డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీసిటీ -
అర్ధరాత్రి లారీ బీభత్సం
చంద్రగిరి కొంగారెడ్డి పల్లె వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ దుకాణంపైకి దూసుకెళ్లింది. ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026అక్రమాలకు అడ్డాగా మెగా డీఎస్సీ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జెన్జెడ్ వార్ రిలే నిరాహారదీక్షకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పాల్గొని ప్రసంగించారు. డీఎస్సీని అక్రమాలకు అడ్డాగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. మాజీ మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి సంఘాల నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘చిన బాబు..పెద బాబు నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. మెగా డీఎస్సీ పేరుతో నయ వంచనకు పాల్పడ్డారు. ర్యాంకులు సాధించిన వారిని పక్కన బెట్టేశారు. స్పోర్ట్స్’ కోటా పేరుతో తమ అనుయాయులకు పోస్టులు కట్టబెట్టేశారు. అంగట్లో పప్పూబెల్లాల్లా డీఎస్సీ పోస్టులను అమ్మేసుకున్నారు. నిజంగా అవినీతి జరగలేదని భావిస్తే కూటమి నాయకులు సీబీఐ విచారణకు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం చాలా బాధాకరం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి’.. అంటూ నేతలు, యువకులు, నిరుద్యోగులు డిమాండ్ చేశా రు. శనివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన జెన్జెడ్ రిలేనిరాహా దీక్షలకు విశేష స్పందన లభించింది. తిరుపతి : రిలే నిరాహార దీక్షలో జిల్లా అధ్యక్షుడు భూమన, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం -
వైభవంగా కోదండరాముని పవిత్రోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్య కై ంకర్యాలు, అర్చనలు, ఉత్సవాలలో తెలియక జరిగే దోషాల నివృత్తికి ఆలయ పవిత్రతను పరిరక్షణ కోసం ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం తొలి రోజు శ్రీసీతారామ సమేత లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం శ్రీసీతారామలక్ష్మణులు సర్వాంగ సుందర అలంకరణలో బంగారు తిరుచ్చిపై కొలువై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో బి.నాగరత్న, సూపరింటెండెంట్ కే.శ్రీనివాసులురెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్బాబు పాల్గొన్నారు. -
యువ నాయకుడి మృతి
ఏర్పేడుకు చెందిన వైఎస్సార్సీపీ యువనాయకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. హామీలే గానీ అమలెప్పుడు బాబు? తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను వంచించి మోసగించిన ద్రోహి, దుర్మార్గుడు చంద్రబాబు. తండ్రి అబద్ధపు హామీలతో ప్రజలను, యువతను మోసం చేస్తే.. డీఎస్సీ పేరుతో అర్హులకు పంగనామం పెట్టి ఒడ్కీ ఉద్యోగాన్ని రూ.30 లక్షల చొప్పున అనర్హులకు కట్టబెట్టిన ఘనుడు చంద్రబాబు తనయుడు లోకేష్. పారదర్శకంగా ఒకరికి ఒక్క ఉద్యోగమైన ఇచ్చానని చెప్పుకోగలవా?. ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా రాతపరీక్షలు నిర్వహించి 1.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్.జగన్ది. డీఎస్సీ అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్పై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామ చేయాలి. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు కూటమికి తోలుమందమెక్కువ కూటమి ప్రభుత్వ తోలుమందాన్ని తగ్గించేలా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ తరఫున పోరాటం ఉధృతం చేస్తున్నాం. నిజాలు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు గుండాల మాదిరిగా పోలీసులను అడ్డుపెట్టుకుని శిబిరాల వద్ద దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి రావాలి. – కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి న్యాయం జరిగే వరకు పోరాటం డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేటతెల్లం అవుతున్నా ప్రభుత్వం స్పందించకుండా పోవడం సిగ్గుచేటు. చంద్రబాబు, లోకేష్ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. యువతను మోసం చేసిన లోకేష్ మీద సీబీఐ విచారణకు వేయాలి. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చినా ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు. –మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన తిరుపతిలోని తమ బంగ్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఇన్చార్జి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, డీఆర్వో నరసింహులుతోపాటు పలువురు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అధికారులు సమష్టిగా పని చేయాలని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు తిరుపతిలో జరుపుకోవడానికి అంతా సహకరించాలని కోరారు. నేడు ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తిరుపతి సిటీ: ఈఏపీసెట్–2026 తొలి విడత కౌన్సెలింగ్లో భాగంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్తో పాటు వెబ్ఆప్షన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ను సాంకేతిక విద్యాశాఖ ఆదివారం విడుదల చేయనుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన మొబైల్ నంబర్లకు ఈ మేరకు సమాచారం పంపనున్నారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు 15వ తేదీలోపు రిపోర్ట్ చేసి ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. రేపటి వరకు స్పాట్కు అవకాశం తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ల గడువును సోమవారం వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు. -
తిరుమలలో నకిలీ ఆధార్లతో గదుల దందా.. ఆరుగురి అరెస్ట్
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ.. అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచారు.ఈ క్రమంలో ఇవాళ(శనివారం) ఉదయం తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ సీఆర్వోలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది.అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదే విధంగా, తిరుమలలోని పీఏసీ-5 వద్ద భక్తులు ఛార్జింగ్కు ఉంచిన సెల్ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. నిందితులు బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల దగ్గర నుంచి గది బుకింగ్లు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో భాగంగా ఈ నెల 6న తెల్లవారుజామున తిరుమల పీఏసీ-5 దగ్గర దొంగతనం చేసిన రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాల ద్వారా గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. రూమ్ దళారీల కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు.. భక్తులను మోసం చేసే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే పోలీసు అత్యవసర సేవ 112, సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. -
రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయం..
తిరుపతి సిటీ: ‘రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయంగా మారిందని, నిత్యం దాడులు, బెదిరింపులు, లాకప్డెత్లతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. అయినా కేంద్రం పట్టించుకోవడంలేదని అన్నారు. దళితులపై దాడులను సోదాహరణంగా వివరిస్తూ పలుమార్లు ఢిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్కు వినతిపత్రాలు ఇచ్చిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత ప్రజాప్రతినిధులు మేరుగు నాగార్జున, నందిగం సురేష్, కె. నారాయణ స్వామి, ఆదిమూలం సురేష్, సుధాకర్బాబుతో పాటు పార్టీ నేత అంబటి మురళీకృష్ణ తదితరులు శుక్రవారం తిరుపతి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలను విన్నవించారు. నల్ల బ్యాడ్జిలు దర్శించి నిరసన తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణం స్పందించాలి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, లాకప్ డెత్లు, అక్రమ కేసులపై తక్షణం స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ను కోరినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. దళితుల సమస్యలపై ప్రజా ప్రతినిధుల వినతులను కనీసం 5 నిమిషాల పాటు వినే పరిస్థితిలో చైర్మన్ లేకపోవడం బాధ కలిగించిందన్నారు. పేదల ఇళ్ల కూల్చివేతలు, దాడులు, లాకప్ డెత్ల వంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరగడంలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి, ప్రశ్నించే దళితులపై దాడులు చేయడం, హింసించడం, పోలీస్ స్టేషన్లలో హత్యలు చేయడం వంటి అరాచక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జాతీయ ఎస్సీ కమిషన్ అధికార పార్టీకి వంతపాడుతోంది తప్ప పేద దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్నారు. దళితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడాన్ని చంద్రబాబు జీరి్ణంచుకోలేక పోతున్నారని చెప్పారు. బాబు సర్కారు పోలీసు వ్యవస్థను అ«దీనంలోకి తీసుకుని ఎంతోమంది దళితులను పొట్టన పెట్టుకుంటోందన్నారు. సీఐ నాగరాజు చేతిలో గతంలో పల్నాడు జిల్లాలో దళిత సాయి, మంద సాల్మాన్ హత్యకు గురయ్యారని చెప్పారు. -
నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు
విశ్వంలో నేడు ఉచిత శిక్షణ తిరుపతి అర్బన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027– 28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారని తిరుపతి విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్ర అధినేత విశ్వనాఽథ్రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే విశ్వం విద్యా సంస్థల ఆధ్వర్యంలో నవోదయ 2027 ప్రవేశ పరీక్షకు శనివారం ఉచిత నమూనా టెస్ట్తోపాటు అవగాహన సదస్సును వరదరాజనగర్లోని విశ్వం స్కూల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు అర్హత, దరఖాస్తు విధానం, పరీక్ష పద్ధతి, సిలబస్, ప్రశ్నల సరళి, ముఖ్యమైన తేదీలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. గత ఏడాది విశ్వంలో శిక్షణ తీసుకున్న 72 మంది విద్యార్థులు నవోదయలో సీట్లు పొందారని చెప్పారు. ఇతర వివరాలకు 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 10న హెచ్సీఎల్ డ్రైవ్ తిరుపతి అర్బన్ : ఇంటర్మీడియట్ 2025–26లో ఉత్తీర్ణులై 75శాతం మార్కులు వచ్చిన నాన్–మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు ఈ నెల 10వ తేదీన హెచ్సీఎల్–టెక్లో అసోషియేట్ హోదాలో అవకాశం కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, ఆర్ఐఓ గోపాల్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఈసీ, హెచ్ఈసీ, బైపీసీతోపాటు ఓకేషన్ విద్యార్థులు ఈ ఏడాది 75శాతం మార్కులు సాధించిన ఉంటే అర్హులని పేర్కొన్నారు. కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజినీరింగ్లో హెచ్సీఎల్ టెక్ వారు నిర్వహించే ఇంటర్వ్యూలకు హజరుకావాలని కోరారు. ఆసక్తిగలవారు హెస్సీఎల్టీఈసీహెచ్బీఈఈ కమ్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 8019913422 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. పట్టపగలే చోరీ దొరవారిసత్రం : మండలంలోని కొత్తపల్లెలో పారిచెర్ల రాజేంద్ర అనే వ్యక్తి ఇంట్లో గురువారం పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రాజేంద్ర దంపతులు బేల్దారి పని నిమిత్తం ఇంటికి తాళం వేసుకుని వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చే సరికి చోరీ జరిగింది. దుండగులు బీరువాను పగులగొట్టి రూ.15వేల నగదు, బంగారు కమ్మలు, వెండి పట్టీలు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి రేణిగుంట : మండలంలోని మామండూరు సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి (సుమారు 50ఏళ్లు) మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు. మృతుడి ముఖం నుజ్జు కావడంతో గుర్తుపట్టలేని విధంగా తయారైందని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పరారీలోని నిందితుడి అరెస్ట్ రేణిగుంట : డ్రగ్స్ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ఏ–4 నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. వివరాలు.. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నిందితురైన పూతలపట్టు మండలానికి చెందిన గొడుగు చింత వినోద్ కుమార్ శుక్రవారం ఉదయం రమణ విలాస్ సర్కిల్లో పట్టుబడ్డాడు. నైజీరియాకు చెందిన వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
తిరుపతిలో టీడీపీ అరాచకం
సాక్షి టాస్క్ఫోర్స్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో టీడీపీ అరాచకాలు అంతే లేకుండా పోయింది. హత్య కేసులో నిందితులను కాపాడేందుకు టీడీపీ నేత సాక్షులను కిడ్నాప్ చేసి.. అనుచరులకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకున్నారు. దీనిపై బాధిత మహిళలు నిరసన తెలుపుతుంటే కవరేజ్కు వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్, యూట్యూబ్ చానెల్ రిపోర్టర్, బాధితులకు అండగా నిలబడిన వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేశారు. ఆపై వారిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయించిన ఘనత టీడీపీ నేత, పోలీసులకే చెల్లిందని ఆధ్యాత్మిక నగరం కోడై కూస్తోంది. తిరుపతిలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న హై డ్రామాపై సాక్షి ఫోకస్. తిరుపతి కొర్లగుంటలో 2019 డిసెంబర్ 21న పసుపులేటి మురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ–1గా నరసింహులు, ఏ–2గా మల్లి సహా మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. తమిళనాడుకు చెందిన ఆరుగురు సుపారీ హంతకులను రంగంలోకి దించి హత్యకు పాల్పడ్డారని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తిరుపతి నాలుగో అదనపు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసుకు సంబంధించిన సాక్షులను టీడీపీ నేత జేబీ శ్రీనివాసులు కిడ్నాప్ చేసి నిందితులకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించారని మృతుడి భార్య సత్య బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. జేబీ నివాసం ముందు మహిళల నిరసన హత్య కేసులో నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్న టీడీపీ తిరుపతి ఇన్చార్జి జేబీ శ్రీనివాసులు నివాసం ఎదుట హతుడి భార్య సత్య, , బంధువులతో కలిసి గురువారం విషయం తెలుసుకున్న సాక్షి కెమెరామన్ మోహన్ కృష్ణ, స్థానిక యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్, మరి కొందరు జేబీ నివాసం వద్దకు చేరుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీస్తుండడం గమనించిన జేబీ అనుచరులు దాడులకు పాల్పడ్డారు. హైడ్రామాకు పదును కవరేజ్ కోసం వెళ్లిన విలేకరి సునీల్ను పోలీసులకు అప్పగించి ఎమ్మార్పల్లె పోలీస్టేషన్కు తరలించారు. అనంతరం మొత్తం ఘటనను వైఎస్సార్సీపీపైకి మళ్లించేందుకు ప్రణాళికలు రచించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, సాక్షి ఫొటో గ్రాఫర్, యూట్యూబ్ చానల్ రిపోర్టర్ కత్తులు, రాడ్లతో చొరబడి టీడీపీ నేత జేబీ శ్రీనివాసులుని హత్య చేసేందుకు యత్నించారని, అడ్డుకున్న వారిపై దాడి చేశారని నమ్మించేందుకు హై డ్రామాకు తెరతీశారు. టీడీపీ కట్టు కథని నమ్మించేందుకు జేబీ శ్రీనివాసులు అనుచరులు రాఘవేంద్ర, లోకేష్, ప్రభు రంగంలోకి దిగారు. వారే కత్తితో చేయి కోసుకుని, మరొకరు చేయి విరుచుకుని గాయాలతో చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రిలో చేరారు. అయితే సునీల్ని పోలీసులు తీసుకెళ్లే సమయంలో పక్కనే జేబీ శ్రీనివాసులు, అనుచరులు ఉన్నారు. ఆ సమయంలో ఎవరికీ తగలని గాయాలు.. ఆ తర్వాత ఎలా తగిలాయాయో తిరుమల శ్రీవారికే తెలియాలి. ఈ క్రమంలో రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు.. వైఎస్సార్సీపీ నేత వాసుయాదవ్, యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్, సుకుమార్, ప్రేమ్కుమార్, సాక్షి ఫొటో గ్రాఫర్ మోహన్కృష్ణపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పక్కాగా రికార్డులు తయారుచేసుకుని గురువారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. సునీల్, సుకుమార్, ప్రేమ్కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వాసుయాదవ్, మోహన్కృష్ణని అరెస్టు చేసి రహస్యంగా ఉంచారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. అక్రమ కేసులో ముగ్గురికి రిమాండ్ సాక్షి టాస్క్ఫోర్స్ : టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్, ఆయన అనుచరుల అక్రమ ఫిర్యాదుతో సంజీవి సునీల్, మరో ముగ్గురు వ్యక్తులపై తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దామినేడుకు చెందిన బి.రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నంబరు 290/2026 కింది ఎస్ఐ జ్యోతి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ కేసులో ఏ2గా ఉన్న సంజీవిసునీల్, ఏ3 సుకుమార్, ఏ4 ప్రేమ్కుమార్ను పోలీసులు శుక్రవారం రాత్రి న్యాయ స్థానంలో హాజరుపరచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అక్రమ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని, నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద వారికి రిమాండ్ విధించేలా ఎఫ్ఐఆర్ రాసినట్టుగా వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కట్టుకథని నమ్మించేందుకు.. -
మట్టి దోపిడీకి ‘హైవే’
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా ప్రకృతి వనరులను దోచుకుంటూనే ఉన్నారు. చివరకు జాతీయ రహదారిని సైతం వదలకుండా దందా సాగిస్తున్నారు. పచ్చమూక అక్రమార్జనకు ఎన్హెచ్ అధికారులు సైతం వంతపాడుతున్నారు. మామూళ్ల మత్తులో అక్రమార్కులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైవే గోడలను కూల్చేసినా స్పందన కరువైందని మండిపడుతున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్ : చెరువులు, గుట్టలను కొల్లగొట్టిన అక్రమార్కులు ప్రస్తుతం జాతీయ రహదారుల పక్కన నేషనల్ హైవే అథారిటీ సేకరించిన భూములను సైతం తవ్వేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చెట్టేవారిపాళెం రెవెన్యూ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1454లో భారీగా గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయి. ఈ తవ్వకాల కారణంగా జాతీయ రహదారి దెబ్బతినడమే కాకుండా, సమీపంలోని చర్చికి వెళ్లే ప్రధాన దారిని సైతం మూసివేశారు. మట్టి తవ్వకాల కోసం హైవేని ధ్వంసం చేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ దందాను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. స్పందన కరువు నిత్యం వందలాది టన్నుల గ్రావెల్ తరలిపోతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే బాటలో నేషనల్ హైవే అధికారుల సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రయాణానికి ముప్పు వాటిల్లే అవకాశమున్నప్పటికీ స్పందించపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
మట్టి దోపిడీకి ‘హైవే’
చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చెట్టేవారిపాళెం వద్ద జాతీయ రహదారి పక్కన మట్టి దోపిడీ సాగుతోంది.ఎస్వీయూలో కారు బోల్తా ఎస్వీయూలోని ఇంజినీరింగ్ హాస్టల్కు వెళ్లే మార్గం వద్ద గురువారం అర్ధరాత్రి స్విఫ్ట్ డిజైర్ కారు బోల్తా పడింది. రౌడీయిజానికి భయపడం ● వెంకటగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్తలు హాజరై డీఎస్సీలో అవినీతిపై గళమెత్తారు. ● రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ● సత్యవేడులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026‘‘వంచనకు మారు పేరు చంద్రబాబు.. అదే బాటలో నయా మోసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు నారా లోకేష్. ఎన్నికల సమయంలో నోటికొచ్చినట్లు హామీలు గుప్పించారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తమ సహజ నైజం ప్రదర్శిస్తున్నారు. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ పేరిట టోపీ పెట్టారు. ఉద్యోగాలను రూ.లక్షలకు అమ్ముకున్నారు. అనర్హులకు పోస్టులు కట్టబెట్టారు. భావి పౌరుల జీవితాలను దెబ్బతీసేందుకు సైతం తెగబడ్డారు. సీబీఐ విచారణ జరిపించమంటే చేతులెత్తేస్తున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలంటూ యువతను దగా చేశారు. భృతి పేరుతో మరో అన్యాయం చేసేశారు. విద్యావ్యవస్థను నాశనం చేసిన మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు సైతం నైతిక బాధ్యత వహించాలి’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి మంగళం/ తిరుపతి సిటీ : ఎన్నికల సమయంలో ఓట్ల కోసం యువతను నమ్మించి, మోసం చేసిన ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహారదీక్షకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ 16వేల డీఎస్సీ ఉద్యోగాలను టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టి, పేద బిడ్డల జీవితాలను బలిపెడుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంటే చంద్రబాబు, లోకేష్ మాత్రం సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్పై ప్రతిపక్షాలు అభియోగాలు మోపితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. ప్రస్తుత మెగా డీఎస్సీలో అవినీతికి పాల్పడకుండా ఉంటే లోకేష్పై సీబీఐ విచారణ జరిపించేందుకు చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. భూమన మాట్లాడుతూ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు, అరాచకాలు, దాడులు, అక్రమ కేసుల తప్ప యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. మెగా డీఎస్సీలో అర్హులను కాదని, ఒక్కో పోస్టును రూ.30లక్షల చొప్పున అనర్హులకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతి వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యాశాఖకు లోకేష్ మాయని మచ్చ తెచ్చారని మండిపడ్డారు. టీచర్ ఉద్యోగాలలో అవకతవకలకు పాల్పడి, విద్యార్థుల భవితతో చెలగాటమాడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో సైతం చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా బేఖాతర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో చేపట్టిన దీక్షలో పెద్దిరెడ్డి, భూమన, అభినయ్రెడ్డి, శిరీష తదితరులురేషన్ కందిపప్పు కట్ తిరుపతి అర్బన్ : చౌకదుకాణాల్లో కంది పప్పు పంపిణీని ప్రభుత్వం దాదాపు కట్ చేసింది. అదిగో ఇదిగో అంటూ అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ ఈ నెలలోనూ కార్డుదారులకు కందిపప్పును పంపిణీ చేయలేదు. ఈ క్రమంలోనే ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకుకార్డు దారులకు బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే డీలర్లు 10వ తేదీకే బియ్యం పంపిణీ నిలిపేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 15వ తేదీ వరకు బియ్యం పంపిణి చేసేలా సివిల్ సప్లయి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారని మండిపడుతున్నారు. 26 నెలలుగా బియ్యం, అరకొరగా చక్కెర మాత్రమే ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఐఐటీలో ‘ఇన్స్పైర్ వర్క్స్’’ ఏర్పేడు : కియా ఇండియా, తిరుపతి ఐఐటీ ‘ఇన్స్పైర్ వర్క్స్’ ల్యాబ్ను శుక్రవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ప్రారంభించారు. ఏడాది తమ రెండు సంస్థల భాగస్వామ్య ఒప్పందం ఒక మైలురాయికి చేరుకుందని కియా ఇండియా సీఈఓ తాయ్హ్యూన్ కిమ్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల అభ్యాసానికి, వాస్తవ ప్రపంచ అనువర్తనాలకు మధ్య వారధిగా నిలుస్తూ, తమ ఆలోచనలను రూపొందించుకోవటానికి ఈ ల్యాబ్ దోహదం చేస్తుందని వెల్లడించారు. ఐదేళ్ల కాలపరిమితిలో రూ.25కోట్లు భాగస్వామ్య ఒప్పందంతో ఆటోమొబైల్స్ రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ ల్యాబ్ ద్వారా యువ ఇంజినీర్లు తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మలచుకోగలిగే ఒక వ్యవస్థను సృష్టిస్తున్నట్లు స్పష్టం చేశారు. కియా ఇండియా కార్పొరేట్ అఫైర్స్ హెడ్ జుంగ్హో ఆన్, హాంగ్సుంగ్ పార్క్, గ్యున్బమ్ కిమ్, తిరుపతి ఐఐటీ డీన్ ప్రొఫెసర్ సురేష్ జైన్, మేకర్స్ ల్యాబ్ ఇన్న్చార్జి డాక్టర్ డీవీ కిరణ్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 66,842 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,670 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది.ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో బజారు రౌడీకి టీడీపీ ఇన్చార్జి పదవు కట్టబెట్టి అరాచకాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపక్షంలో ఉండేవారు రాజకీయాల్లోకి వస్తే మంచి ప్రవర్తన ఉంటుందన్నారు. గూండాలకు పదవులిస్తే వారు రౌడీయిజానికే దిగుతారని విమర్శించారు. టీడీపీ గూండాల అరాచకాలను వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ అరాచకశక్తులను టీడీపీ పెంచిపోషిస్తోంన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ గూండాలు లోకేష్ ఆదేశాలతో స్వైరవిహారం చేస్తున్నారని మండిపడ్డారు. నేరాలకు పాల్పడుతూ తిరుపతి ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఈ క్రమంలోనే హత్యకు పాల్పడిన నిందితులను టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ కాపాడుతున్నారని ఆరోపిస్తూ హతుడి భార్య నిరసన చేపడితే, కవరేజ్కు వెళ్లి రిపోర్టర్ సునీల్ను చితకబాదారని మండిపడ్డారు. అతడితోపాటు వెళ్లిన సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్కృష్ణపై హత్యాయత్నం నేరం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రంతా పోలీసులు సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్కృష్ణ ఇంటి వద్ద హల్చల్ చేశారని తెలిపారు. అలాగే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలేనిరాహారదీక్షలో ఉన్న పార్టీ నాయకుడు ఇరగం అనీల్రెడ్డి, బీసీ నాయకుడు వాసుయాదవ్లపై కూడా హత్యాయత్నం నేరాలు మోపారని, ఇదే వారి దుర్మార్గాలకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రేమ్కుమార్ అనే దళిత యువకుడిపైనా హత్యాయత్నం నేరం కేసు పెట్టారన్నారు. టీడీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాయడం దారుణమని మండిపడ్డారు. బెదిరంపులతో వైఎస్సార్సీపీని బలహీనం చేయాలనుకుంటే అది టీడీపీ నేతల తరం కాదని స్పష్టం చేశారు. పోలీసులు సైతం బాధితుల ఫిర్యాదు తీసుకోకుండా దాడి చేసినవాళ్ల ఫిర్యాదు తీసుకుని అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో రెండో రిలే నిరాహార దీక్షను కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలకు ఏఐఎస్ఎఫ్ నేతలు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. నాయుడుపేటలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. మెగా డీఎస్సీని రద్దు చేసి తిరిగి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
తిరుమలలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్కు అవమానం
తిరుపతి సిటీ: రాష్ట్రంలో దళితులపై దాడులతో చెలరేగిపోతున్న చంద్రబాబు సర్కారు చివరికి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా పట్ల కూడా వివక్ష చూపించి, అవమానించిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వంటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తికి కూడా టీటీడీ అధికారులు కనీస గౌరవం ఇవ్వలేదని, ప్రొటోకాల్ పాటించలేదని చెప్పారు. చైర్మన్ను ఎక్కడో చివరకు నెట్టేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీల పట్ల వివక్షకు ఇంతకంటే నిదర్శనం ఉండదన్నారు. టీటీడీలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తీవ్ర విక్షకు గురవుతున్నారని మండిపడ్డారు. వారికి పదోన్నతులు సక్రమంగా ఇవ్వడంలేదని, చిన్న వ్యాపార అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల పదోన్నతుల జాబితాను పరిశీలిస్తే వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పది వేలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ఉద్యోగులపై అదనపు పని భారం మోపుతున్నారని తెలిపారు. టీటీడీలో జరిగే సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులను ఆహ్వానించడంలేదన్నారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాపూరు: రాపూరు – చిట్వేలి మార్గంలోని ఘాట్రోడ్డులో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. రాపూరు మండలం గరిమెనపెంటకు ప్రసాద్(36), వెంగయ్య చిట్వేలి మండలం రాజరెడ్డిపాడు నుంచి మోటారు సైకిల్పై టీవీ తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. క్షతగాత్రుడిని 108లో రాపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి జైలు భాకరాపేట: వరకట్న వేధింపుల కేసులో నిందితుడు రంబే రాము అలియాస్ రామ్కుమార్కు చిత్తూరు ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం రంగన్న గారి గడ్డకు చెందిన ముద్దాయిని ఈ మేరకు పోలీసులు జైలుకు తరలించారు. -
ఉసురు తీస్తున్న ఊపిరి!
పారిశ్రామికాభివృద్ధి అవసరమే.. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే.. రాష్ట్రానికి ఆదాయం వచ్చేందుకు పరిశ్రమలను తీసుకురావాల్సిందే. అయితే ఆయా ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై కూడా పాలకులు దృష్టి సారించాలి. వాతావరణం కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలి. ప్రధానంగా కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. కానీ, పెళ్లకూరు మండలం పెన్నేపల్లె, శిరసనంబేడులోని స్టీల్ పరిశ్రమల కారణంగా స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఉద్యోగాల సంగతి దేముడెరుగు.. శ్వాసకోస వ్యాధులతో అల్లాడిపోతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే విషవాయువులతో ఊపిరి పీల్చుకునేందుకు సైతం అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు మృత్యువాత పడుతున్నారు. పెళ్లకూరు : మండలంలోని పెన్నేపల్లె, శిరసనంబేడు వద్ద నెలకొల్పిన స్టీల్ పరిశ్రమల నుంచి విష వాయువులు విడుదలవుతున్నాయి. దీంతో స్థానికులు అనేక వ్యాధులు బారిన పడుతున్నారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి దొరుకుతుందనే ఆశ ఉన్నప్పటికీ దట్టమైన పొగ కారణంగా కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పచ్చని పాలాలు, కళకళలాడే చిట్టడవితో పాటు చుట్టు పక్కల గ్రామాలను సైతం ఈ పరిశ్రమల నుంచి వెలువడే దట్టమైన పొగ కమ్మేస్తోంది. పెన్నేపల్లి, శిరసనంబేడు సమీపంలో స్టీల్ పరిశ్రమల నుంచి నిరంతరంగా వెలువడుతున్న పొగ, వ్యర్ధాలతో సుమారు 6 నుంచి 8కిలోమీటర్లు మేర కాలుష్యం కమ్మేస్తుంది. పదిహేనేళ్లు కిందట ఏర్పాటు చేసిన ఇక్కడ స్టీల్ పరిశ్రమల యజమానులు గతంలో గొట్టాల ద్వారా పొగ విడుదల చేసేవారు. తర్వాత అదనపు ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పొగ నేరుగా గాలిలోకి వదిలేస్తున్నారు. అలాగే పరిశ్రమల వ్యర్ధాలు సైతం బయటకు విడిచిపెట్టేస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోలేక కష్టాలు పడుతున్నారు. కాలుష్యం కారణంగా పంటల దిగుబడి సైతం తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా పెన్నేపల్లి, కానూరు, తాళ్వాయిపాడు, శిరసనంబేడు, రాజుపాళెం, చెన్నప్పనాయుడుపేట, జీలపాటూరు తదితర గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయాయి. వ్యర్ధాలను చెరువులోకి, గ్రామ సమీపాల్లోనూ, వ్యవసాయ పొలాల్లోకి వదిలేయడంతో సాగు, తాగునీరు కలుషితమవుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం ద్వారా పలువురు రోగాల బారిన పడి మరణించినట్లు వెల్లడిస్తున్నారు. భూసేకరణకు దరఖాస్తు పెన్నేపల్లెలోని పరిశ్రమ యాజమాన్యం మరో 148.98ఎకరాలు భూములను సేకరించుకునేందుకు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో 74.61పట్టా భూములు, 62.97ఎకరాలు అసైన్మెంట్ భూములు, 7.53ఎకరాలు అసైన్మెంట్ ఫ్రీహోల్డ్ భూములు, 3.87ఎకరాలు ప్రభుత్వ భూములు మొత్తం 148.98ఎకరాలు భూసేకరణ కోసం పరిశ్రమ యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. కార్మికులకు రక్షణ కరువు శిరసనంబేడు, పెన్నేపల్లెలోని స్టీల్ పరిశ్రమలలో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులకు రక్షణ లేదు. ప్రమాదకరమైన యంత్రాల వద్ద పని చేస్తున్న కార్మికులకు రక్షణ కవచాలు అందుబాటులో లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ప్రమాదాల బారిన పడి అనేక మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అయితే కార్మికుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా మండే కొలిమిలో పడేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు పరిశ్రమల కారణంగా తలెత్తిన కాలుష్యంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ పంట కాలువను పరిశ్రమ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇరిగేషన్ శాఖకు నివేదించారు. అయినప్పటికి నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోకుండా తాయిలాలతో సరిపెట్టుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుబాటులో లేరు స్టీల్ పరిశ్రమల కారణంగా వాతావరణ కాలుష్యంపై వివరణ కోరేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా వారు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
● ఆడికృత్తిక వైభవం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ దేవసేన సమేత కుమారస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కావళ్లు ధరించిన భక్తులు హరోంహరా అంటూ షణ్ముఖుని సేవించుకున్నారు. నారద పుష్కరణిలో తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. – శ్రీకాళహస్తి నారదపుష్కరణి వద్ద భక్తులు -
తలనొప్పిగా మారిన లీప్ యాప్..
●తిరుపతి ఎడ్యుకేషన్ : తాము అధికారంలోకి వస్తే విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల ప్రచార వేదికల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వీరి పరిపాలనా తీరుతో విద్యాప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు డేటా నమోదు చేస్తూ, బిల్లులు తయారు చేస్తూ, స్ప్రెడ్ షీట్లు నింపుతూ తరగతి గదులను వదలిపెట్టి బోధనేతర పనులు నిర్వర్తిస్తున్నారు. బోధనకు సమయమేదీ..? ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం. విలువలను నేర్పించి సమాజానికి చక్కటి పౌరులను అందించడం. అయితే అదే ఉపాధ్యాయుడు నేడు తన అసలు బాద్యతకు సమయం దొరకని దుస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వాలు ప్రతి సమస్యకు ఉపాధ్యాయుడినే పరిష్కారంగా భావించడమే ఇందుకు ప్రధాన కారణం. ఉదయం పాఠశాల ప్రారంభమైన క్షణం నుంచి ప్రార్థన, విద్యార్థుల ఆన్లైన్ హాజరు నమోదు, పాఠశాలకు రాని విద్యార్థుల వివరాలు సేకరించడం, రాగి జావ పంపిణీ, మధ్యాహ్న బోధన ఏర్పాట్లు పర్యవేక్షణ, ఈ భోజన వివరాల ఆన్లైన్ అప్లోడ్, పరిశుభ్రత తనిఖీలు, దీంతోనే సగం సమయం గడుస్తోంది. దీనికితోడు ఎండీఎం ఫీడ్ బ్యాక్ అంటూ ఆయా పాఠశాలల్లోని ఒక టీచర్కు మెసేజ్ వస్తుంది. ఆ టీచరు వెళ్లి మధ్యాహ్న భోజనం రుచి, శుచిలను పరిశీలించి లీప్ యాప్లో నమోదు చేయాలి. అలాగే ప్రతి రోజు పాఠశాలకు గైర్హాజరయ్యే ప్రతి విద్యార్థి ఏ కారణంతో హాజరుకాలేదనే వివరాలను సైతం అప్లోడ్ చేయాలి. ఈ పనులన్నింటి మధ్యలో అవకాశం లభిస్తే ఒక తరగతికి పాఠం చెప్పడమే ఉపాధ్యాయుడికి గగనమవుతోంది. బోధనేతర పనుల కారణంగా తరగతి గదికి వచ్చే వెసులుబాటే ఉండడం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.భారం.. బోధనేతరంలీప్ యాప్ పేరుతో టీచర్లకు కొత్త ఇబ్బందులు మెమో భయం ఓ వైపు పాఠశాలకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. మరో వైపు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంది. ఆన్లైన్లో వివరాలకే సమయం సరిపోతుంటే నాణ్యమైన విద్యాబోధన ఎలా సాధ్యమని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటు వివరాలను నమోదు చేయలేకపోయినా, అటు విద్యాప్రమాణాలు తగ్గినా రెండింటికీ తమనే బాధ్యులను చేస్తూ మెమోలు ఇస్తున్నారని చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అత్యధిక నష్టం విద్యార్థులకేనని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సక్రమంగా ఆలోచించి ఆన్లైన్ వివరాల నమోదుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.సరస్వతీ నిలయాలను ప్రభుత్వం సాంకేతిక చట్రంలో ఇరికించింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మార్చేసింది. సంస్కరణ పేరుతో లీప్ యాప్ను తీసుకువచ్చి వివరాల నమోదు పేరుతో వేధిస్తోంది. ఈ క్రమంలో టీచర్లు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. బోధనేతర బాధ్యతలే భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ పూర్తి చేయాల్సిన సమయంలో సెల్ఫోన్ పట్టుకుని తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. పేద బిడ్డల భవితను చంద్రబాబు సర్కారు చేజేతులా నాశనం చేస్తోందని మండిపడుతున్నారు. పైగా ఏమాత్రం విద్యా ప్రమాణాలు తగ్గినా మెమోలు జారీ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇది వరకు ఒక్కో పని వివరాలను ఒక్కో యాప్లో నమోదు చేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం లీప్ యాప్ను తీసుకొచ్చింది. అన్ని పనులకు సంబంధించిన వివరాలను ఈ ఒక్క యాప్లోనే వివిధ పోర్టళ్లలో నమోదు చేయాలని ఆదేశించింది. ఒకే వివరాలను రెండు మూడు పోర్టళ్లల్లో అప్లోడ్ చేయాల్సి రావడంతో ఉపాధ్యాయులకు ఈ యాప్ పెద్ద తలనొప్పిగా మారింది. మానసిక ఒత్తిడి ఉపాధ్యాయుడు పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి యాప్లతో సమయం సరిపోతోంది. ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల నుంచి ప్రతి చిన్న పనిని లీప్ యాప్లో నమోదు చేయాలంటూ ఒత్తిడి. సమయానికి నమోదు చేయకుంటే మెమో ఇస్తారనే భయంతో మానసికంగా కుంగిపోతున్నాం. – ఎస్.వెంకటముని, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ నాణ్యమైన విద్య అసాధ్యం బోధన సమయమంతా యాప్లో వివరాల నమోదుకే సమయం సరిపోతుంటే నాణ్యమైన విద్య అసాధ్యం. క్షేత్ర స్థాయిలో విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే టీచర్లను బోధనకే పరిమితం చేయాలి. బోధనేతర పనులకు పరిపాలనా సహాయకులను అన్ని పాఠశాలలకు ప్రభుత్వం నియమించాలి. – ఎస్.బాలాజీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంఇదేనా సంస్కరణ ఇప్పుడు అన్నింటిని ఒకే యాప్లోకి తీసుకొచ్చి సంస్కరణ చేశామని, పనిభారం తగ్గించామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఒకే యాప్లోనే ఒకే వివరాలను వివిధ పోర్టళ్లలో నమోదు చేయాల్సి రావడంతో మరింత పనిభారం పెరిగింది. ఇదేనా సంస్కరణ. – చల్లా శ్రీనివాస్యాదవ్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ -
బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆదేశించారు. గురువారం తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవ సన్నాహాలపై సమీక్షించారు. టీటీడీ జేఈఓ శరత్, సీవీఎస్ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు ఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్లను పంపిణీ చేయాలని కోరారు. విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధానంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్రంగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కూడా కళా బృందాలు వస్తున్నాయని వెల్లడించారు. టీటీడీ ఇన్చార్జి సీఈ మనోహరం, డిప్యూటీ ఈఓలు రాజేంద్ర, భాస్కర్, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, డీఎఫ్ఓ ఫణి కుమార్ నాయుడు, ఏఎస్పీ రామకృష్ణ, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక క్షేత్రంలో అరాచకం
టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆగడం ఆధ్యాత్మిక నగరిని అరాచకాలకు అడ్డాగా మార్చేశారు. ప్రధానంగా టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ప్రతిష్టాత్మక తిరునగరంలో గూండా రాజ్యం నడిపిస్తున్నారు. రౌడీమూకలను పెంచి పోషిస్తూ దాదాగిరీ చెలాయిస్తున్నారు. చివరకు తన అకృత్యాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలపై సైతం కేసుల్లో ఇరికించేందుకు తెగబడుతున్నారు. తన దౌర్జన్యాలను కవరేజ్ చేసేందుకు యత్నించిన జర్నలిస్ట్పై దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా పోలీసులను ఉసిగొల్పి బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ప్రశాంత తిరుపతిలో రౌడీరాజకీయాలు సాగించి అశాంతిని రాజ్యమేలిస్తున్నారు.పరామర్శ పేరుతో నాటకాలు! తన ఇంటి ముందు నిరసన తెలిపిన మహిళలు, కవరేజ్ వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయించిన జేబీ శ్రీనివాస్ను పరామర్శించేందుకు కూటమి నేతలు రావడం చర్చనీయాంశమైంది. జేబీపై జరగని దాడి జరిగినట్లు.. ఆయనను ఒకరి తర్వాత ఒకరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పరామర్శిస్తూ డ్రామాలు మొదలు పెట్టడం గమనార్హం. సాక్షి టాస్క్ఫోర్స్ : ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఈ క్రమంలోనే తన భర్త హత్య కేసులో నిందితులను జేబీ కాపాడుతున్నారని నిరసనకు దిగిన మహిళలను, కవరేజ్కు వచ్చిన కెమెరా మెన్లపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగని టీడీపీ మూకలు తమ పలుకుబడిని ఉపయోగించి.. శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వెళ్లిన మహిళలు, కవరేజ్కు వెళ్లిన యూట్యూబ్ రిపోర్టర్పై హత్యాయత్నం కేసు నమోదుకు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాధితుల కథనం మేరకు .. 2019 డిసెంబర్ 21న రాత్రి సుమారు 8 గంటల సమయంలో తిరుపతి కొర్లగుంటలోని ఎస్కే ఫాస్ట్ఫుడ్స్ వద్ద పసుపులేటి మురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో ఏ1గా నరసింహులు, ఏ2గా మల్లి సహా మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. తమిళనాడుకు చెందిన ఆరుగురు సుపారీ హంతకులను రంగంలోకి దించి హత్యకు పాల్పడ్డారని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 548/2019గా నమోదు చేసిన ఈ కేసు ప్రస్తుతం తిరుపతి నాలుగో అదనపు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసుకు సంబంధించిన సాక్షులను టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ కిడ్నాప్ చేశారని మృతుడి భార్య సత్య ఆరోపించారు. సాక్షుల్లో ఒకరైన చిన్నా అనే వ్యక్తిని పోలీసులు పాత కేసులో విచారణ పేరుతో తీసుకెళ్లి జేబీకి అప్పగించారని ప్రచారం జరుగుతోంది. అయితే చిన్నాను మృతుడి బంధువులు తీసుకువచ్చి బుధవారం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిసింది. కేసు గురువారానికి వాయిదా వేయడంతో చిన్నా తిరిగి నివాసానికి వెళ్లే సమయంలో మరోసారి కిడ్నాప్ చేసి, బెదిరించినట్లు సమాచారం. చివరకు వైఎస్సార్సీపీ శ్రేణులే తనను కిడ్నాప్ చేశారని చిన్నాతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. న్యాయం కోసం మహిళ పోరాటం కేసును నీరు గార్చేందుకు టీడీపీ నేత జేబీ ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న బాధిత మహిళ సత్య ఆవేదనకు గురైంది. బంధువులతో కలిసి గురువారం జేబీ శ్రీనివాసులు నివాసం వద్ద నిరసన చేపట్టింది. శాంతియుతంగా సత్య, బంధువులు జేబీ నివాసం ముందు నిల్చొని నిరసన తెలిపారు. సాక్షి కెమెరామెన్ కృష్ణ, స్థానిక యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్ అక్కడకు వెళ్లారు. వీడియోలు, ఫొటోలు తీస్తుండడం గమనించిన జేబీ అనుచరులు.. కెమెరాలను లాక్కునే ప్రయత్నం చేశారు. తాము జర్నలిస్ట్లమని చెబుతున్నా వినకుండా వారిపై దాడికి యత్నించారు. స్థానిక యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్ని బలవంతంగా జేబీ నివాసంలోకి తీసుకెళ్లి నిర్భందించారు. అక్కడ సునీల్ని తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. జేబీ అనుచరుల వీరంగం చూసి బాధిత మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు. అక్రమ కేసు నమోదుకు ఒత్తిడి బాధితులు, టీడీపీ గూండాల చేతిలో దెబ్బలు తిన్న సునీల్పై అక్రమ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బలమైన కేసులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికారం చేతిలో ఉంటే.. ఏమైనా చెయ్యొచ్చు అనేందుకు ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు చర్చించుకుంటున్నారు. పరాకాష్టకు రౌడీ రాజకీయం తిరుపతి రూరల్ : ‘‘తిరుపతిలో రౌడీ రాజకీయం పరాకాష్టకు చేరుకుంది.. శాంతియుతంగా నిరసన తెలిపిన బాధిత మహిళతో పాటు కవరేజీ చేస్తూ విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతి నిధులపై భౌతిక దాడులు చేయడం, వారిపైనే కేసులు పెట్టించడం అత్యంత దుర్మార్గం.. మీడియా ప్రతినిధులు మర్డర్లు చేయడానికి వెళతారా..? ప్రశ్నించే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏమిటి..? ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? రాక్షసరాజ్యంలో ఉన్నామా..?’’ అంటూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ నివాసం వద్ద బాధిత మహిళ నిరసన చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడకి వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రేమ్, సుకుమార్ను తిరుపతి రూరల్ పోలీసుల అక్రమంగా అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఈ మేరకు వారిని భూమన అభినయ్ రెడ్డి పరామర్శించారు. ముందుగా చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ను కలసి మీడి యా ప్రతినిధిపై కేసు పెట్టడం ఏమిటి..? ఆయన కవరేజీకి వెళితే చచ్చేలా కొట్టడమే కాకుండా, హత్యా యత్నం కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. జేబీ శ్రీనివాస్, అతడి అనుచరులు రౌడీయిజానికి పాల్పడుతుంటే అడ్డుకోలేక బాధితులపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతకు ముందు చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ఇరువురిపైనా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పడంతో అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అభినయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను, అధికార పార్టీ నేతల అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేసి, వారిపైనే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. వారిపై కేసులను ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు భూమన అభినయ్రెడ్డి చేరుకోవడం, ఆ వెంటనే జేబీ శ్రీనివాస్ ముఖ్య అనుచరులు అక్కడకు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ీఅయితే దాడికి పాల్పడిన వారే కట్లు కట్టుకుని ఫిర్యాదు చేయడానికి రావడం విశేషం. నగరంలో నిరసన ర్యాలీ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన జేబీ శ్రీనివాస్, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అభినయ్రెడ్డి ర్యాలీ చేపట్టారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు ర్యాలీని కొనసాగించారు. -
బియ్యం.. భయ్యం!
సామాన్యుడికి కష్టకాలం నడుస్తోంది. నెలవారీ బడ్జెట్ మోయలేని భారంగా మారింది. ఇటీవల వరకు ఇంధన ధరలు మోతెక్కిపోయాయి. తర్వాత గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరో వైపు వంట నూనె ధరలు ప్రతి వారం అధికమవుతున్నాయి. ఇంకోవైప్పు పప్పు ధాన్యాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఈ క్రమంలోనే బియ్యం కొనాలంటే వినియోగదారులు భయపడాల్సిన దుస్థితి దాపురించింది. నియంత్రణలో అధికారులు వైఫల్యం చెందడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. టీడీపీ నేతలు మాత్రం ఎల్నినో సాకును చూపించి చేతులెత్తేస్తున్నారు. అలాగే యుద్ధం కారణంగానే వాణిజ్య పన్నులు పెరిగాయని, ఆ ప్రభావం మార్కెట్పై పడుతోందని కంటి తుడుపు కబుర్లు వల్లిస్తున్నారు.తిరుపతి అర్బన్ : నిన్నటి మొన్నటి వరకు డీజల్, పెట్రోల్ ధరలను వరుసగా పెంచేశారు. అనంతరం గ్యాస్ ఇక్కట్లతో ప్రజలు సతమతమయ్యారు. అలాగే నూనె, పప్పుల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. చౌకదుకాణాల్లో కందిపప్పు ఇవ్వడమే మానేశారు. ఇక కూరగాయల ధరలు తెలిసిందే. వాటిని ముట్టుకోవాలంటేనే సామాన్య ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీచాలవంటూ బియ్యం రేట్లను సైతం ఇష్టారాజ్యంగా పెంచడంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. అధికారపార్టీకి చెందిన నేతలు మాత్రం ఎల్నినో వాతావరణం మార్పులతోనే బియ్యం ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికా– ఇరాన్ యుద్ధంతోనే రేట్లు పెరిగాయంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం వారి మాటలను నమ్మడం లేదు. ఎన్నికల ముందు ధరలను అదుపులో ఉంచుతామంటూ హామీలు గుప్పించి, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కడంపై మండిపడుతున్నారు. కొత్త బియ్యమే దిక్కు సాధారణంగా వినియోగదారులు పాత బియ్యం కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పుడు పాత బియ్యానికి..కొత్త రకానికి కేవలం ఐదు నుంచి పది రూపాయిలు మాత్రమే తేడా ఉండేది. అయితే జిల్లాలో ప్రస్తుతం పాత బియ్యం లేవంటూ వ్యాపారులు చెప్పకొస్తున్నారు. తర్వాత పాత బియ్యం కావాలంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ తెగేసి చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త బియ్యం రేట్లను సైతం ఇష్టారాజ్యంగా పెంచేశారు. దీంతో జిల్లా వాసులు బియ్యం కంటే రాగులు, సజ్జలు కొనుగోలు చేయడం ఉత్తమంగా భావిస్తుండడం గమనార్హం. తనిఖీలకు దూరం బియ్యం ధర పెరుగుతున్నప్పటికీ అదుపులోకి తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, సివిల్ సప్లయిస్, విజిలెన్స్ శాఖలకు చెందిన అధికారులు తనిఖీలకు దూరంగా ఉంటున్నారని వినియోగదారుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై కఠినచర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని డిమాండ్ చేస్తున్నారు. 25 కిలోల బియ్యం బస్తా ధరలు రకం నెల క్రితం రేటు(రూ.లో) ప్రస్తుతం బీపీటీ కొత్తవి 1,010 1,510 బీపీటీ పాతవి 1,275 1,625 స్టీమ్డ్ రైస్ 1,320 1,610 సోనామసూరి 1,210 1,540 హెచ్ఎంటీ 1,270 1,620 దంపుడు బియ్యం 1,210 1,500 మసర్లు 930 1,230 నూకలు 320 800 దడ పుట్టిస్తున్న ధర రైతులకు మాత్రం పాత ధరలే.. జిల్లాలో బియ్యం ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నాయి. మూడు నెలలుగా బహిరంగ మార్కెట్లో అన్నిరకాల బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో బియ్యం రేట్లు పెంచడంతో గగ్గోలు పెడుతున్నారు. అయితే రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో గత రెండేళ్లుగా చూస్తే ఏ గ్రేడ్ వరి రకం క్వింటా రూ.2389కి, బీ గ్రేడ్ వరి రకం క్వింటా రూ.2369 లెక్కన కొనుగోలు చేసింది. ఏటా క్వింటాపై రూ.200 పెంచాల్సి ఉండగా, పాత ధరలే చెల్లించింది. ఈ మేరకు జిల్లాలో 1.70లక్షల క్వింటాళ్లు వరిధాన్యం కొనుగోలు చేసింది. అయితే తిరిగి బియ్యం అమ్మే క్రమంలో మాత్రం ధరలను విపరీతంగా పెంచేస్తున్నప్పటికీ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందింది. 25 కేజీల బియ్యం బస్తా రూ.300 నుంచి రూ.400 పెంచేసినా పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
ఇసుక తరలిస్తున్న కంటైనర్లు సీజ్
రేణిగుంట కేంద్రంగా ఓ టీడీపీ నేత సాగిస్తున్న ఇసుక దందాకు పోలీసులు గురువారం చెక్ పెట్టారు. వాహనాలన సీజ్ చేశారు.మెగా డీఎస్సీలో అక్రమాలను నిలదీసిన వైఎస్సార్సీపీ శ్రేణులు అవినీతి వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026నిరసన తెలుపుతున్న భూమన తదితరులుతిరుపతిలోని దీక్ష శిబిరంలో భూమన, అభినయ్రెడ్డి, మాజీ మేయర్ శిరీష తదితరులునాయుడుపేటలో సోలార్ సెల్ ప్లాంట్ తిరుపతి అర్బన్ : నాయుడుపేట సెజ్లో ప్రీమియర్ ఎనర్జీస్ 7 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ప్రారంభంకానుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ప్రతినిధులు రేవతి రోహిణి, సుధీర్రెడ్డి, రమేష్ నాయుడుతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.3వేల కోట్లతో నిర్మిస్తున్న ప్లాంట్ ద్వారా 4,500 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ప్లాంట్కు విద్యుత్తోపాటు అన్ని వసతులు కల్పిస్తూ పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయభరత్రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రశేఖర్రావు, ఆర్అండ్బీ ఎస్ఐ రాజా నాయక్ పాల్గొన్నారు. సిరులతల్లి సేవలో వ్యాసరాజ పీఠాధిపతి చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని మైసూరు వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీవిద్యా మనోహర తీర్థ స్వామీజీ గురువారం సేవించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. 17న లా పరీక్షల నిర్వహణ తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో బుధవారం బంద్ కారణంగా వాయిదా పడిన 3, 5 సంవత్సరాల ఎల్ఎల్బీ పరీక్షలను ఈనెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అన్ని కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.ఎన్నడూ లేని విధంగా దాడులు తిరుపతి కల్చరల్: తిరుపతిలో టీడీపీ ఇన్చార్జ్గా జేబీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చోటుచేసుకున్న సంఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న వారిపై దాడులకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం దుర్మార్గని తెలిపారు. సంఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. టీడీపీ తిరుపతి ఇన్చార్జ్ జేబీ వెంటనే బాధితులు, మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. నిరసన గళం..‘‘యువతను చంద్రబాబు నిలువునా వంచించారు. మెగా డీఎస్సీ పేరుతో దారుణంగా దగా చేసేశారు. కష్టపడి చదివి అర్హత సాధించిన వారికి తీరని అన్యాయం చేశారు. అనర్హులను అందలం ఎక్కించి విద్యార్థుల భవితను బలిపెట్టేందుకు తెగబడ్డారు. మొత్తం అవినీతి వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలకపాత్రం పోషించారు. వేలాది మంది జీవితాలతో ఆటలాడినందుకు నైతిక బాధ్యత వహించకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ప్రజా కంటక పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా నిరుపేద తల్లిదండ్రులను అప్పుల పాలు చేసేస్తున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మండిపడ్డారు. బాబు సర్కారు వైఖరికి నిరసనగా గళమెత్తారు. గురువారం ఈ మేరకు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. తిరుపతి సిటీ : బాబు సర్కార్పై ఇక సమరమే అంటూ వైఎస్సాఆర్సీపీ శ్రేణులు గళం విప్పాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో గురువారం జెన్జీ వార్ పేరుతో రిలే నిరాహారదీక్షలకు శ్రీకారం చుట్టారు. గ్రామ, మండల స్థాయి నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై డీఎస్సీ అక్రమాలపై సర్కారును నిలదీశారు. తక్షణం మెగా డీఎస్సీలో అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని, నిజాలు నిగ్గుతేల్చాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నినదించారు. బాధ్యత వహించాల్సిందే.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అదే విధంగా డీఎస్సీలో అవినీతికి పూర్తి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందేనని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగిరి నియోజకవర్గాలలో వైఎస్సాఆర్సీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలలో ఆయన పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ నీట్ కంటే అతిపెద్ద కుంభకోణం మెగా డీఎస్సీలో జరిగిందని, టీడీపీ తొత్తులకే ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. అర్హతలేని వారు గురువులుగా వస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమేనని విమర్శించారు. ఏడాదికి నాలుగు లక్షల చొప్పున 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిన బాబు సర్కార్కు పాలించేఅర్హత లేదన్నారు. నిరుద్యోగ భృతి, ఫీజురీయింబర్స్ మెంట్, వసతిదీవెన బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఆరోగ్య జీవనానికి తొలి అడుగు
తిరుపతి అర్బన్ : మనిషి ఆరోగ్యకర జీవనానికి తొలి అడుగు తల్లిపాలే అని, శిశువు సుస్థిర జీవితానికి ఉపయోగకరమని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ శిశువు జన్మించిన వెంటనే అమ్మపాలు పట్టించడం ద్వారా తల్లీబిడ్డల మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. వైద్యులతోపాటు ఏఎన్ఎంలు, అశావర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తల్లిపాల ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ వసంతబాయి మాట్లాడుతూ అంగన్వాడీ పరిధిలో బాలింతలకు స్పష్టంగా తల్లిపాల విశిష్టతను వివరిస్తున్నామని వెల్లడించారు. తల్లిపాల ద్వారా శిశువులకు కలిగే ప్రయోజనాలను బాలింతలకు వివరిస్తున్నారని తెలిపారు. మెరుగైన ‘వసతి’కి ప్రాధాన్యం సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. హాస్టళ్ల భవనాల పైకప్పులు, గోడలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లు, వంటశాలలు, డ్రైనేజీ, ప్రహరీగోడ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమశాఖ అధికారులు హరీష్, భరత్కుమార్రెడ్డి, రాజా సోము, గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు. -
విరాజిల్లిన ‘విజ్ఞానగిరి’
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఆడికృత్తికను పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కావళ్లు ధరించి విజ్ఞానగిరికి చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట జరగకుండా పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు విజ్ఞానగిరిలోని క్యూల వద్ద భక్తులకు సేవలందించారు. ఈ క్రమంలోనే శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారు ఇంద్ర విమానంపై విహరించారు. పెద్దసంఖ్యలో భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉచితంగా ప్రసాదాల పంపిణీ ఆడికృత్తిక ఉత్సవాలను సందర్భంగా కార్తికేయ మిత్రబృందం ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేసింది. ముక్కంటి ఆలయ కమిటీ చైర్మన్ సాయిప్రసాద్, ఈఓ వెంకటేశులు ప్రారంభించారు. -
వ్యాసాశ్రమ పూర్వ వైభవమే లక్ష్యం
తిరుపతి అర్బన్ : ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం రాత్రి కలెక్టరేట్లో వ్యాసాశ్రమం అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేద్దామన్నారు.విశిష్ట చరిత్ర గల వ్యాసాశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పీఠాధిపతుల నేతృత్వంలోనే ఆశ్రమం కొనసాగుతుందని చెప్పారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ఈ క్రమంలోనే ఆశ్రమ శతాబ్ది ఉత్సవాలను కొంతకాలం వాయిదా వేయాలని సూచించారు. ఎస్పీ సుబ్బరాయుడు, డీఆర్ఓ నరసింహులు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, బీజేపీ నేత కోలా ఆనంద్ పాల్గొన్నారు. ‘భూ’చోళ్ల అరెస్ట్ – నకిలీ పత్రాలతో దందా సాక్షి టాస్క్ఫోర్స్ : నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్ల భూములను విక్రయించే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. తిరుపతి మంగళం సమీపంలోని తుడా క్వార్టర్స్లోని విలువైన భూములను టార్గెట్ చేసుకుని సాగుతున్న ఈ దందాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి, మరకొందరితో కలిసి నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులను సైతం సృష్టించినట్లు తెలుస్తోంది. అనంతరం మధ్యవర్తి ద్వారా రిజిస్ట్రేషన్ పేరుతో కొనుగోలుదారుల నుంచి సుమారు రూ.కోటికి పైగా ఆన్లైన్ ద్వారా నగదును కాజేసినట్లు సమాచారం. అయితే పత్రాలపై అనుమానం వచ్చిన బాధితులు, రేణిగుంట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీ చేయగా అవి నకిలీవిగా తేలాయి.. దీంతో బాధితులు వెంటనే తిరుచానూరు పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం వేకుజామున వడమాలపేట టోల్ప్లాజా సమీపంలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రహస్య ప్రదేశానికి తరలించి గోప్యంగా విచారణ చేపడుతున్నట్లుగా తెలిసింది. నిందితుల్లో టీడీపీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిందితులను కాపాడేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇసుక తరలిస్తున్న కంటైనర్లు సీజ్
సాక్షి టాస్క్ఫోర్స్:టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ముఖ్య నేత అనుచరుడు, ఊరందూరు గ్రామానికి చెందిన తెలుగు తమ్ముడు సాగిస్తున్న ఇసుక దందా బట్టబయలైంది. రేణిగుంట కేంద్రంగా ఆయన రూ.కోట్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. రాజంపేట నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను రేణిగుంటకు చేర్చి కంటైనర్ల ద్వారా తమిళనాడుకు తీసుకెళ్లి విక్రయిస్తున్న విషయం పోలీసుల దాడిలో తేటతెల్లమైంది. వివరాలు.. గురువారం ఈ మేరకు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి మాట్లాడుతూ మండలంలోని కొట్రమంగళం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు కంటైనర్లు, లోడ్ చేస్తున్న మరో రెండు జేసీబీలు, ఓ ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇసుక దందాపై బుధవారం సాయంత్రం సమాచారం అందడంతో దాడి చేసినట్లు వెల్లడించారు. శివకుమారి అనే రియల్టర్ వెంచర్లో డంప్ చేసిన ఇసుకను కంటైనర్ల ద్వారా తరలించేందుకు సిద్ధమవుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అలాగే ఇసుక వాహనాలకు పైలట్ గా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కారుని సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో శ్రీకాళహస్తి మండలం ఊరందూరుకు చెందిన బి.బాలాజీ, (34), పూడి గ్రామానికి చెందిన అజిత్ (28), మరో ఇద్దరు దందా నడిపిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. నిందితులు టిప్పర్లలో రాజంపేట నుంచి ఇసుకను తీసుకు వచ్చి పెనుబాల కాలేజీ వెనుక వైపు ఉన్న ఒక వెంచర్ లో డంప్ చేసి రాత్రివేళల్లో కంటైనర్ల ద్వారా చైన్నెకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బాలాజీ, అజిత్తోపాటు డ్రైవర్లు చిత్రై సెల్వన్, రాజన్ యాదవ్, అనిష్ కుమార్ సింగ్పై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. గాజులమండ్యం ఎస్ఐ హరీష్ పాల్గొన్నారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఘన స్వాగతం
రేణిగుంట : జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ఎంపీ గురుమూర్తి ఘనంగ స్వాగతం పలికారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి ఆహ్వానం పలికారు. అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమశివన్, గాలి రవి, పీఎం చంద్ర, మాజీ సర్పంచులు మునిశేఖర్, నగేశం, శరవణ, శ్రీహరి, సురేష్ పాల్గొన్నారు. జ్యువెలరీ వ్యాపారులూ అప్రమత్తం తిరుపతి క్రైమ్ : బంగారం ధరలు ఆకాశన్నంటిని నేపథ్యంలో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాల యజమానులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీనివాసులు సూచించారు. గురువారం తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్న్లో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా షాపుల వద్ద భద్రతా చర్యలు, పోలీసు–వ్యాపారుల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రతి జ్యువెలరీ, పాన్బ్రోకర్ దుకాణంలో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని కోరారు. ప్రతి లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయడంతో పాటు, బంగారం విక్రయించే లేదా తాకట్టు పెట్టే ప్రతి వ్యక్తి గుర్తింపు పత్రాలను (కేవైసీ) తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, లావాదేవీలు లేదా చోరీ సొత్తు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. చోరీ నగలను కొనుగోలు చేయడం, తాకట్టు పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాల యజమానులు మాట్లాడుతూ నేరాల నివారణలో పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేస్తూ అన్ని భద్రతా నిబంధనలను పాటించి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రాణదానానికి 417మంది ఎంపిక తిరుపతి తుడా : టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్ ఆస్పత్రిలో పేద రోగులకు ఉచితంగా నిర్వహించే శస్త్ర చికిత్సలకు 417మంది ఎంపికై నట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్తో పాటు పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, బర్డ్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రామ్మూర్తి, రుయా, మెటర్నటీ హాస్పిటల్ అధికారులు సుబ్బలక్ష్మి, శ్రీనివాసులు పాల్గొని అర్హులైన రోగులను ఉచిత శస్త్ర చికత్సలకు ఎంపిక చేశారు. ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్ తడ : అప్పు వసూలు విషయంలో ఎస్కే మస్తాన్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే దుస్థితి కల్పించిన కేసులో బీవీపాళెం గ్రామానికి చెందిన గఫూర్, అతడి కుమారుడు ఇక్బాల్ను తడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ నెల 3వ తేదీన మృతుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని నిందితులు పరారయ్యారు. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఎస్ఐ కొండపనాయుడు ఆధ్వర్యంలోని పోలీసుల పట్టుబడ్డారు. సూళ్లూరుపేట మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టడంతో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన అశోక్ కుమార్కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి గురువారం తీర్పు చెప్పారు. -
అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్
తిరుపతి క్రైమ్ : అంతర్రాష్ట్ర గజదొంగను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.14.87 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు చెందిన కరక రాజాబాబు (47) వ్యసనాలకు బానిసై రైళ్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లి, తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడన్నారు. గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిందితుడిపై 80కి పైగా చోరీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇటీవల వెంకటగిరి, డక్కిలి ప్రాంతాల్లో జరిగిన వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల 400 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ కేసులను ఛేదించిన ఏఎస్పీ శ్రీనివాసులు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, వెంకటగిరి సీఐ రోశయ్య, ఎస్ఐ టి.స్వరూప్, బాలాయపల్లె ఎస్ఐ డి.సురేష్బాబు, డక్కిలి ఎస్ఐ బ్రహ్మనాయుడు, సిబ్బంది గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్ను ఎస్పీ అభినందించారు. -
క్రీడలతో ఒత్తిడి దూరం
తిరుపతి రూరల్ : క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యుత్ ఉద్యోగులకు ఒత్తిడి దూరమవుతుందని, మరింత సమర్థవంతంగా సేవలందించగలరని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించిన 48వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అథ్లెటిక్స్, చెస్, బ్యాడ్మింటన్, క్యారమ్స్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది. అథ్లెటిక్స్ విభాగంలో తమిళనాడు ఓవరాల్ చాంపియన్గా నిలవగా, కర్ణాటక రెండు, ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానాల్లో నిలిచాయి. బ్యాడ్మింటన్లో తమిళనాడు, చెస్లో తెలంగాణ, క్యారమ్స్లో తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు సీఏండీ శివశంకర్ , డైరెక్టర్ గురవయ్య ట్రోఫీలు అందజేశారు. స్పోర్ట్స్ కౌన్సిల్కు విశిష్ట సేవలు అందించిన ఎం. కృష్ణారెడ్డి, పురుషోత్తానికి జ్ఞాపిక అందించారు. డైరెక్టర్ కె. రామమోహన్రావు, చీఫ్ జీఎంలు మురళీకుమార్, సీహెచ్ రామచంద్ర రావు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు వి. చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి జి. గంగాధర్రెడ్డి పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్ వెంకటగిరి రూరల్ : పట్టణంలోని సున్నపు వీధికి చెందిన శాంతి ఆత్మహత్య కేసులో ఆమె భర్త కుటుంబీకులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ స్వరూప్ కథనం మేరకు.. శాంతికి 2024లో భీమలింగతో వివాహమైంది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భీమలింగ కుటుంబీకులు కూడా శాంతిని వేధించేవారు. వారి ఒత్తిడిని భరించలేక ఆమె మహిళా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసింది. తర్వాత ఐర్లండ్కు వెళ్లిన భీమలింగ తనతోపాటు పాటు శాంతిని తీసుకెళ్లకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. శాంతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భీమలింగ కుటుంబీకులు చాకలి కృష్ణమూర్తి, చిరంజీవి, రామాంజనేయులును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. -
మహిళా టీచర్పై సహోద్యోగి వేధింపులు..!
తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మహీళ టీచర్గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సహోద్యోగి కావడంతో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలను తీసుకున్నాడు. ఆ ఫోటోలను ఆమె భర్తకు పంపిస్తానంటూ, కాపురాన్ని కూలుస్తానని బెదిరిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.నిఖిల్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో, తాళలేకపోయిన సదరు ఉపాధ్యాయురాలు నిఖిల్ ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించింది. నిఖిల్ దయచేసి ఫోటోలు డిలీట్ చేయి, ఇకపై వేధించవద్దని కోరింది. అయితే అతడు బాధితురాలిపై తీవ్ర పదజాలంతో బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు.ఈ దాడి, వేధింపుల నుంచి కోలుకున్న అనంతరం బాధితురాలు అలిపిరి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, నిందితుడు నిఖిల్పై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసుకుని, నిందితుడిపై చట్టరీత్యా చర్యలు చేపట్టడానికి దర్యాప్తు వేగవంతం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తడ: జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సూళ్లూరుపేట మండలం, ఇలుపూరు గ్రామానికి చెందిన చింతగింజ సుందరయ్య(39) మృతి చెందాడు. మృతుని భార్య మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అపాచీ పరిశ్రమలో పని చేసే సుందరయ్య అనారోగ్యంతో సెలవు పెట్టి ఇంటి వద్దే ఉన్నాడు. పరిశ్రమకు సమీపంలో ఉండే మాక్స్కింగ్ పరిశ్రమలో పని చేస్తున్న భార్యను తీసుకు రావడానికి ద్విచక్ర వాహనంపై సుందరయ్య మంగళవారం సాయంత్రం బయలు దేరాడు. రహదారి నుంచి పారిశ్రామిక వాడకు వెళ్లే మార్గంలో బైక్ మలుపు తిరిగిన సమయంలో నెల్లూరు వైపు వెళుతున్న లారీ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సుందరయ్యను 108 సిబ్బంది సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. పిర్యాదు స్వీకరించిన ఎస్ఐ కొండపనాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం మృత దేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరించండి
– కేంద్ర మంత్రిని కలిసిన తిరుపతి ఎంపీ నాయుడుపేట టౌన్: తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలో నెలకొన్న గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువాల్ ఓ రామ్ను ఢీల్లిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీతో పాటు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అర్గనైజింగ్ సెక్రటరి కామిరెడ్డి రాజారెడ్డి మరికొంత మంది నాయకులతో వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ట్రైబల్కు సంబంధించి అనేక సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు రాజారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఎంపీ పలు శాఖల కేంద్ర మంత్రులను కలిసి స్థానిక 71వ నంబరు జాతీయ రహదారి నిర్మాణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు సర్వీసు రోడ్డుతో అనుసంధానం చేయాలని సూచించినట్టు తెలిపారు. ఎంపీ చర్యలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మాతృమరణాలపై సమగ్ర విచారణ తిరుపతి అర్బన్: మాతృ మరణాలపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మాతృ మరణాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పెళ్లకూరు, తిరుపతిలోని ఎంఆర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రెండు మాతృ మరణాలు జరిగిన విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీరో ఐఎంఆర్–జీరో ఎంఎంఆర్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రోగ్రామ్లో భాగంగా వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎంపిక చేసినట్లు చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని చెప్పారు. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంఅండ్హెచ్వో బాలకృష్ణనాయక్, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి, డీఐఓ డాక్టర్ శాంచకుమారి పాల్గొన్నారు. తొలి రోజు.. తడబడి! –డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు పరుగులు తిరుపతి సిటీ: జిల్లాలో డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు బుధవారం ఓఏఎమ్డీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల కోసం నెట్ సెంటర్లకు పోటెత్తారు. కాగా తొలి రోజు సర్వర్ సమస్య కొంత సేపు మొరాయించినా తర్వాత సహకరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తడబడాల్సి వచ్చింది. కొన్ని కాలమ్స్ అర్థంగాకపోవడం అవసరమైన ధృవపత్రాలను అందబాటులో ఉంచుకోకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీటీడీ కళాశాలల్లో హెల్ప్ సెంటర్లు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, ఎస్జీఎస్, పద్మావతి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం పెద్ద సంఖ్యలో కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డస్క్లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తిరుపతి నగరంలో బుధవారం సుమారు 700 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. -
సీఎంఏ ఇంటర్లో సాత్వికకు 22వ ర్యాంకు
బుచ్చినాయుడుకండ్రిగ: బుచ్చినాయుడుకండ్రిగ గ్రామానికి చెందిన విద్యార్థిని సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో 22వ ర్యాంకు సాధించింది. బుచ్చినాయుడుకండ్రిగకు చెందిన సముద్రాల సుధాకర్నాయుడు, సునీతమ్మ దంపతుల కుమార్తె సాత్విక సీఎంఏ ఇంటర్లో 22వ ర్యాంకు సాధించింది. గతంలో సీఎంఏ పౌండేషన్లో 336 మార్కులతో 10వ ర్యాంకు సాధించగా, సీఏ పౌండేషన్లో 316 మార్కులు, సీఏ ఇంటర్లో 410 మార్కులతో ప్రతిభ కనపరిచింది. దీంతో సాత్వికను గ్రామస్తులు అభినందించారు. సివిల్స్లో సత్తా చాటుతా సివిల్స్లో సత్తా చాటి, ఐ ౌఎస్ కావడమే నా లక్ష్యం,. ఐ ౌఎస్ సాధించి ప్రజాసేవ చేయడం కోసమే అడుగులు వేస్తున్నాను. ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కరించగలితే అప్పుడు వచ్చే గుర్తింపు, ఆత్మ సంతృప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. చుట్టూ ఉన్న వారికి సేవ చేయాలంటే ఐఏఎస్ ఉత్తమమైన ఎంపిక అని నాన్న చెప్పడంతో అప్పుడే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. అ లక్ష్యం చేరేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నా. ఐఏఎస్ సాధించి ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తా. – తల్లిదండ్రులు, అక్కతో సాత్విక -
ఆఖరు మజిలీ..అవస్థలే మరి
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాణించాలి రామచంద్రాపురం: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువులో రాణించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కట్టకింద వెంకటాపురాన్ని సందర్శించిన ఆయన పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ప్రతి రోజూ పాఠశాలలో బోధించిన పాఠాలను అదే రోజు పునఃశ్చరణ చేయాలని, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలను అడిగి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. శ్మశానానికి దారి లేకపోవడంతో పంట పొలాల మీదుగా శవయాత్ర జరిగిన ఘటన ఏర్పేడు మండలం, మాధవమాలలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బమ్మ(65) అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం ఆమె పార్ధివ దేహానికి అంతిమ క్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లారు. అయితే గ్రామ శ్మశానానికి దారి లేకపోవడంతో పంట పొలాల గుండా ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులు స్పందించి శ్మశానానికి దారి చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. – ఏర్పేడు -
రైల్వేస్టేషన్ను పరిశీలించిన డీఆర్ఎం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) చంద్రశేఖర్గుప్త పరిశీలించారు. దాదాపు పూర్తయిన దక్షిణం వైపు భవన సముదాయంతో పాటు రన్నింగ్ రూం, టీటీల విశ్రాంతి గదులు, సీడీవో ఆఫీసు, ఉత్తరం వైపు నిర్మాణ భవనాలను పరిశీలించారు. సంబంధిత ఇంజినీరింగ్ విభా గం అధికారులు, రైల్వే అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. డీఆర్ఎంతో కలసి నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పలు అంశాలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ కళాశాల ఎదురుగా రైల్వే అండర్ పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి రైల్వేష్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయ ణ, మేనేజర్ చిన్నపరెడ్డి, డీప్యూటీ ఈఈ వామణమూర్తి, సీనియర్ డీవోఎం దినేష్కుమార్ పాల్గొన్నారు. -
ఇన్–సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి
● 2028, ఆగస్టు 31 వరకు గడువు ● అన్ని కేటగిరీలకు 60 మార్కులు అర్హత ● వారు బోధించే సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలి ● ఆఫ్లైన్లోనూ టెట్ను నిర్వహించాలి ● ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ తిరుపతి ఎడ్యుకేషన్ : ఇన్–సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు తీర్పు పరిధిలో ఉండడంతో రిటైర్మెంట్కు ఐదేళ్లకు పైగా సర్వీస్లో ఉన్న ఇన్–సర్వీస్ టీచర్లు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే రివ్యూ తీర్పులో టెట్ అర్హత గడువును 2028 ఆగస్టు 31 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. దీని ప్రకారం ఆ తేదీలోపు ప్రతి ఇన్–సర్వీసు టీచరు టెట్లో అర్హత సాధించాల్సిందే. ప్రత్యేక టెట్కు సానుకూలం రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వినతులు, సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ప్రత్యేక టెట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఆ లోపే సాధారణ టెట్ పరీక్షకు సంబంధించి నోటిషికేషన్ జారీ కావడంతో ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులు ప్రస్తుతం నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు హాజరవుతున్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లు ఇవే టెట్ పరీక్షలో సాధారణంగా 150 మార్కులకు గాను ఓసీలకు 90, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరిలకు 60 మార్కులను అర్హతగా నిర్ణయించారు. అయితే ఇన్–సర్వీసు ఉపాధ్యా యులకు టెట్లో అందరికీ సమానంగా అర్హత మార్కులను 60గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్జెక్టు టీచర్లకు వారు బోధించే సబ్జెక్టులోని అంశాలతోనే పరీక్ష నిర్వహించాలని, సాంకేతికత అనుభవం లేని సీనియారిటీ టీచర్లకు ఆఫ్లైన్లో టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టెట్ రాసే ఇన్–సర్వీస్ టీచర్లకు ఓడీ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. -
అరుదైన తాళపత్రాలను సంరక్షించాలి
తిరుపతి సిటీ: దేశంలో ప్రచారంలో లేని, వెలుగుచూడని తాళపత్రాలు అనేకం ఉన్నాయని, వాటిని సేకరించి సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వేదిక్ వీసీ రాణి సదాశివమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాల సంరక్షణ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ తాళపత్ర గ్రంథాల సంరక్షణలో వేదిక్ వర్సిటీ విశేష కృషి చేస్తోందన్నారు. అనంతరం వీసీ రచించిన భారత దేశంలో లిపిశాస్త్రం, తాళపత్ర గ్రంథ శాస్త్ర పరిచయం అనే నూతన గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ తిరుపతి రీజనల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాఘవన్, కన్జర్వేషన్ విభాగాధిపతి అచల్ పాండ్యా, వేదిక్ వర్సిటీ రీసెర్చ్ అండ్ పబ్లిషింగ్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాథేశ్యాం, రిజిస్ట్రార్ బలభద్ర ఉపాధ్యాయ, డీన్లు పాల్గొన్నారు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026 అందజేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎంఈఓలు, డీవైఈఓలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఈ నెల 20వ తేదీలోపు ఆయా డీవైఈఓ కార్యాలయాల్లో దరఖాస్తును అందజేయాలని, ఆ తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ వైరాలజీ విభాగం, రూసా ఫేజ్–2, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైరస్–లైక్ పార్టికల్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో బేసిక్స్ ఆఫ్ పీసీఆర్ అండీ ఎన్ఏజెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే అంశంపై విద్యార్థులకు రెండు రోజుల పాటు జరిగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం వర్సిటీలో బుధవారం ప్రారంభమైంది. ఆధునిక ప్రయోగశాల సదుపాయాలు, పరికరాలు పరిమితంగా ఉన్న డిగ్రీ కళాశాలలకు చెందిన జీవశాస్త్ర విద్యార్థులకు మాలిక్యులర్ బయాలజీ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ప్రిన్సిపల్ ఆచార్య వీ.పద్మావతి, రూసా ఫేజ్ 2 కో–ఆర్డినేటర్ ఆచార్య కేవీ.సుచరిత, వైరాలజీ విభాగాధిపతి ఆచార్య జీ.నరసింహ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిశోధనలకు శాశ్వత గుర్తింపు తిరుపతి సిటీ: విలువలతో కూడిన పరిశోధనలకు శాశ్వత గుర్తింపు ఉంటుందని. అటువంటి పరిశోధనల వైపు అడుగులు పడాలని వీసీ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూ గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో రీసెర్చ్ ఎథిక్స్ అండ్ ప్లాగరిజం టూల్స్ అనే అంశంపై సెనేట్ హాల్లో మూడు రోజల వర్క్ షాపు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి అతిథులు, అధికారులతో కలసి వర్క్ షాపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో పాటు మానవీయ మేధస్సును పరిశోధనలో పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు. వర్క్షాపు నిర్వాహకులు ప్రొఫెసర్ కే.సురేంద్రబాబు మాట్లాడుతూ పరిశోధనలకు ఉపయోగపడే 12 రకాల అంశాలపై సమగ్ర సమాచారాన్ని కార్యశాల అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ డాక్టర్ కె.మనోజ్కుమార్, తమిళనాడుకు చెందిన ఆచార్య రవి, శ్రీనివాస రాఘవన్, డాక్టర్ ఆర్ముగం, పాండిచ్చేరికి చెందిన ఆచార్య సేవుకన్ పాల్గొన్నారు. -
అంబాఅని అరిచినా!
గోవు సకల దేవతలకు ప్రతీక అంటారు పెద్దలు. అందుకే హిందూ సంప్రదాయంలో గోవుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఆపార భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. అలాంటి గోవు కష్టాల్లో ఉందంటే ఎవరైనా చలించిపోతుంటారు. కానీ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఓ కామధేనువు చావుబతుకుల మధ్య ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అన్నారావ్ సర్కిల్ వద్ద ఓ గోవును గుర్తు తెలియని వాహనం మూడు రోజుల క్రితం ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆవుకు తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. కనీసం లేచి నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. మూడు రోజులుగా అక్కడే తిండీతిప్పలు లేకుండా ఉండిపోయింది. పాదచారులు, వాహనచోదకులు దీన్ని మూడు రోజులుగా చూస్తూ వెళ్లారే తప్ప ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఎండకు.. వానకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూసి స్థానికులు కొందరు ఆ గోవుపై తార్పారు పట్టలు కప్పి నీళ్లు చల్లి చల్లదనం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆవు ప్రమాద స్థితిలో ఉందని గమనించి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీతో ఆవును తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ దృశ్యాలను బుధవారం సాక్షి క్లిక్ మనిపించింది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, తిరుపతి -
వ్యక్తి ఆత్యహత్య
పుల్లంపేట: మండల పరిధిలోని సీతారాంపేట గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన గుత్తికొండ కుమార్రాజా(40) బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మహిళను వేధించిన వ్యక్తిపై కేసు తిరుపతి : మహిళను వేధించి, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై అలిపిరి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కడప జిల్లాకు చెందిన జి.నిఖిల్ అనే వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితురాలు తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తుండగా, అదే పాఠశాలకు నృత్య శిక్షణ ఇచ్చేందుకు వచ్చే నిఖిల్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు ఆమెతో ఫొటోలు దిగిన అనంతరం పదేపదే ఫోన్ చేసి మాట్లాడాలని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, ఆ ఫొటోలను ఆమె భర్తకు చూపించి పరువు తీస్తానంటూ బెదిరించినట్లు ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన నిందితుడిని అతని ఇంటి వద్ద నిలదీయగా, ఆమె జుట్టు పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లి చేతులతో దాడి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించి, ప్రాణహాని కలిగిస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకుని బాధితురాలిని రక్షించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అలిపిరి పోలీస్ స్టేషన్న్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
జీవితం కోసం ఎదురు చూపులు!
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. రెగ్యులరైజ్ కానిపక్షంలో మినిమమ్ టైం స్కేలును వర్తింపజేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మబలికారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ హామీలిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామంటూ ఊదరగొట్టి ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా అవుతున్నా ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. దీనిపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. హామీలు దేవుడెరుగు.. కనీసం నెలవారి జీతాలైనా సక్రమంగా ఇవ్వాలంటూ నిట్టూరుస్తున్నారు. సిబ్బందితో వెట్టిచాకిరీ తిరుపతి జిల్లా సమగ్ర శిక్షలో దాదాపు 600 మంది వరకు సీఆర్ఎంటీ, ఆఫీస్ సబ్బార్డినేట్, ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రత్యేకావసరాలు ఉన్న పిల్లలకు సేవలందించడం, విద్యా సర్వేలు, డేటా నిర్వహణతో పాటు విద్యార్థులకు విద్యాకానుక కిట్లను సకాలంలో పాఠశాలలకు చేరవేయడం వంటి అన్ని రకాల పనులను వీరితో చేయించుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరితో పనులు చేయించుకుంటున్నా వీరికిచ్చే జీతం చాలా తక్కువ అంటూ వాపోతున్నారు. అప్పుల ఊబిలో.. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.17 వేల నుంచి రూ.27 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అయితే జూన్, జూలై నెలలకు సంబంధించిన వేతనాలు రాకపోయే సరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికై నా రెగ్యులర్ కాకపోతామన్న ఆశతో చాలీచాలని జీతమైనప్పటికీ తమ విధులను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఎస్ఎస్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అందని జీతాలు శాపమైన సాంకేతిక లోపం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు ఇస్తున్నారు. అయితే ఇటీవల వీరికి సీఎఫ్ఎంఎస్ ఐడీని రూపొందించి తద్వారా జీతాలు చెల్లించేందుకు కూటమి సర్కారు చర్యలు తీసుకుంది. అయితే ఈ ఐడీ రూపకల్పనలో ఏర్పడ్డ సాంకేతిక లోపాన్ని ఇంతవరకు అధిగమించకపోవడంతో జీతాలు అందక ఖాళీ జేబులతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. త్వరగా జీతాలు అందించి తమను అప్పుల ఊబి నుంచి రక్షించాలంటూ వేడుకుంటున్నారు. -
దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ వీడియో వైరల్
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ వెంట వచ్చిన వ్యక్తి చికిత్స చేయడం లేదని డ్యూటీ డాక్టర్ని ప్రశ్నించగా సదురు డాక్టర్ వాగ్వాదానికి దిగిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్పత్రి వర్గాల వివరాల ప్రకారం.. రొంపిచర్ల క్రాస్కు చెందిన లోకమ్మ (40) మంగళవారం సాయంత్రం చిన్నగొట్టిగల్లు ఆస్పత్రికి వెళ్లింది. ఆమెతోపాటు బంధువు నాగరాజు వచ్చాడు. మందుల వివరాలు డాక్టర్ అడుగుతున్న సమయంలో అతను ఆగ్రహానికి లోనయ్యాడు. డాక్టర్తో దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. ఘటనపై మెడికల్ ఆఫీసర్ స్పందిస్తూ, ప్రాథమిక విచారణలో రోగి వెంట వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసిందన్నారు. బుధవారం డీసీహెచ్ఎస్ సమక్షంలో పూర్తి స్థాయి విచారణ నిర్వహించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
26 కాదు పదే!
తిరుపతి అర్బన్: ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో తక్కువ ధరకే బియ్యం అందిస్తామని ఈ నెల 3వ తేదీ(సోమవారం) తిరుపతి అన్నమయ్య సర్కిల్ రైతు బజారు వద్ద అధికారులు, పాలకులు హంగామా చేశారు. ఒక్కో రేషన్ కార్డుదారుడికి 26 కేజీల బియ్యాన్ని ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజులు గడవకముందే 26 కిలోల బియ్యం కాదు.. ఒక్కో కార్డుకు కేవలం పది కేజీల బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తామంటూ అధికారులు మాట మార్చారు. దీంతో కార్డుదారులు అవాక్కయ్యారు. మొన్న ఏమన్నారంటే? గత సోమవారం తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలోని రైతు బజారులో తక్కువ ధరలకే బియ్యాన్ని ఇస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. సమాచారశాఖ ఆధర్యంలో విడుదల చేసిన ప్రెస్ నోట్లో జిల్లాలో 28 కేంద్రాల్లో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నేతృత్వంలో మార్కెట్లో రూ.65 నుంచి రూ.70 వరకు ఉన్న స్టీమ్డ్ బీపీటీ కేజీ బియ్యాన్ని రూ.52కి ఇస్తామని, అలాగే మార్కెట్లో రా బీపీటీ బియ్యం కేజీ రూ.58 నుంచి రూ.62 ఉండగా..ఆ బియ్యాన్ని రూ.50కి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో రైస్ కార్డుదారుడికి 26 కేజీల చొప్పున పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడేమంటున్నారంటే? బుధవారం కలెక్టరేట్లో రైస్ మిలర్లతో అధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాత సమాచారశాఖ ద్వారా విడుదల చేసిన ప్రెస్నోట్ విడుదల చేశారు. ఇందులో ఒక్కోకార్డు ఉన్నవారికి 10 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇస్తామని చెప్పారు. అలాగే తిరుపతి అన్నమయ్యసర్కిల్ రైతు బజారు ఒక్కటే కేంద్రంగా పేర్కొన్నారు. మిగిలిన 27 రైస్ మిల్లర్ల వద్దకు వెళితే వారు పది కేజీల చొప్పున బియ్యాన్ని ఇస్తారని అందులో వెల్లడించారు. స్టీమ్డ్ బీపీటీ కేజీ బియ్యాన్ని రూ.52కి, బీపీటీ రా బియ్యాన్ని రూ.50 ఇస్తామని అందులో వివరించారు. కంది పప్పు కేంద్రాల వలే మార్చేస్తారా! చౌకదుకాణాల్లో దశాబద్దాలుగా రాయితీతో కందిపప్పును రైస్ కార్డుదారులకు ఇచ్చేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా...చౌకదుకాణాల్లో కందిపప్పు ఊసేలేకుండా పోయింది. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కందిపప్పు కౌంటర్లు పెడుతున్నట్లు హంగామా చేశారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలోని రైతు బజారులో ఓ కౌంటర్ పెట్టారు. ఆ తర్వాత జిల్లాలోనే కాదు తిరుపతిలోని కౌంటర్ సైతం మాయం కావడంతో పలువురు పెద్ద ఎత్తున ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. బియ్యం పరిస్థితులు అలానే ఉంటాయనే ఆందోళన చెందుతున్నారు. పొరబాటున 26 కేజీలు అని చెప్పాం ఈ నెల 3వ తేదీన అన్నమయ్య సర్కిల్లోని రైతు బజారు వద్ద ఒక్కో కార్డుకు 26 కేజీల బియ్యాన్ని ఇస్తామని చెప్పాం. అయితే కమిషనర్ కార్యాలయం నుంచి 26 కేజీలు కాదు...10 కేజీలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. రైస్ కార్డుతోపాటు ఆధార్ కార్డును తీసుకురావాలి. – శేషాచలంరాజు, జిల్లా సివిల్సప్లై అధికారి -
ఉద్యోగం వదల్లేక.. భర్త ఒత్తిడి భరించలేక
వెంకటగిరి రూరల్: కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగం వదులుకోలేక.. కట్టుకున్న భర్త మాటలను కాదనలేక ఓ మహిళా పోలీసు తీవ్ర క్షోభకు గురైంది. దిక్కుతోచని స్థితిలో ఉరితాడునే ఉంచుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన వెంకటగిరి సున్నపు వీధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. వెంకటగిరి సున్నపు వీధికి చెందిన శాంతి(31) అదే ప్రాంతానికి చెందిన భీమలింగాన్ని 2024లో వివాహం చేసుకుంది. శాంతికి గత 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మహిళా పోలీసుగా ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం వెంకటగిరి మండలం, పారవోలు సచివాలయంలో శాంతి మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. శాంతి భర్త భీమలింగం ఉపాధి నిమిత్తం ఐర్లండ్కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అప్పడప్పుడూ స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించేవాడు. ఈ క్రమంలో తన భార్య శాంతిని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తనతోపాటు ఐర్లండ్కు తీసుకెళ్లాలని ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో ఆమెకు పలు మార్లు ఫోన్లు చేసి ఒత్తిడి పెంచాడు. కానీ కష్టపడి సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదల్లేక శాంతి భర్తకు చాలా సార్లు సర్దిచెప్పింది. అయినప్పటికీ అతను గట్టిగా పట్టుబట్టడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని తనువు చాలించింది. శాంతి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వెంకటగిరి పోలీసులు తెలిపారు. -
సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలి
ఇన్–సర్వీస్ సబ్జెక్టు టీచర్లకు వారు బోధిస్తున్న సబ్జెక్టుల్లోనే టెట్ పరీక్షను నిర్వహించాలి. వారు బోధించే సబ్జెక్టుతో పాటు ఇతర సబ్జెక్టుల్లోను టెట్ పరీక్షల్లో ప్రశ్నలుండడం వారికి నష్టం వాటిల్లుతుంది. సబ్జెక్టు టీచర్లకు ఆ సబ్జెక్టులోనే పరీక్షను నిర్వహించాలి. –బుక్కే నాగరాజునాయక్, తెలుగు ఉపాధ్యాయులు, మునగలపాళెం, ఏర్పేడు మండలం ఆఫ్లైన్లోనూ నిర్వహించాలి చాలా మంది సీనియర్ టీచర్లకు సాంకేతిక పరిజ్ఞా నం తక్కువ. టెట్ పరీక్షకు సాధారణ అభ్యర్థులతో పాటు ఇన్–సర్వీసు టీచ ర్లు రాస్తున్నారు. అయితే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం ఆన్లైన్తో పాటు అవసరమైన వారికి ఆఫ్లైన్లో నిర్వహించాలి. –సీహెచ్.శ్రీనివాస్యాదవ్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ రెండు సార్లు ఓడీకి ఉత్తర్వులివ్వాలి ఇన్–సర్వీసు టీచర్లందరూ టెట్లో అర్హత సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉపా ధ్యాయులు టెట్ పరీక్షకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ టెస్టులు రాసేందుకు సర్వీసులో రెండుమార్లు సౌకర్యం కల్పించినట్లుగానే టెట్ రాసే ఇన్–సర్వీస్ టీచర్లకు రెండు మార్లు ఓడి సౌకర్యం కల్పించాలి. – దళవాయి సురేష్, హెచ్ఎం, మోడల్ ప్రైమరీ స్కూల్, అప్పలాయగుంట, వడమాలపేట మండలం చట్ట సవరణ చేయాలి టెట్ పరీక్ష రాకముందే ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇప్పుడు టెట్ అర్హత కావాలి అంటున్నారు. ఇన్–సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి చట్ట సవరణ చేసేలా కృషి చేయాలి. – బి.మహేష్కుమార్, ఎస్జీటీ, తిరుచానూరు ఈస్ట్ ఎంపీపీఎస్ స్కూల్ -
అవినీతి డీఎస్సీ!
తిరుపతి మంగళం : డీఎస్సీ నియామకాలలో అన్నీ అవినీతి అక్రమాలేనని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం డీఎస్సీలో అవినీతి అక్రమాలపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. డీఎస్సీలో కేటాయించిన 382 స్పోర్ట్స్ కోటా పోస్టులలో అన్నీ అవకతవకలేనన్నారు. అనర్హులకు ఉద్యోగాలు కల్పించిన మంత్రి లోకేష్, శ్యాప్ చైర్మన్ రవినాయుడు బండారాన్ని బట్టబయలు చేశారు. రుజువులు కావాలా రాజా! కూటమి ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటా కింద నచ్చిన వాళ్లకు, తమకు కావాల్సిన వాళ్లకు, రూ.లక్షలు ముడుపులు ఇచ్చిన వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టేశారని అభినయ్ ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..! 382 పోస్టులలో 46 పోస్టులు పీఈటీలుగా నియమితులయ్యారు. మిగిలిన 336 మందిని సోషల్, ఇంగ్లిష్, తెలుగు, సైన్స్ టీచర్లుగా నియమించారు. వీరందరికీ ఎక్కడా రిటర్న్ ఎగ్జామ్ పెట్టలేదు. వీళ్ల వద్ద రూ.20 లక్షలు, రూ.30 లక్షలు తీసుకుని ఉద్యోగాలిచ్చేశారు. ఈ స్పోర్ట్స్ కోటాలో జ్యూడోకు సంబంధించి నియమితులైన 30 మంది అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే సుధారాణి, చంద్రనాయక్, విజయాజుల్లా నల్బందీ, డకోజీ పాండు వీళ్లంతా 2013 అక్టోబర్ 19 నుంచి 21వరకు ఖమ్మం జిల్లాలో జ్యూడో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జ్యూడో చాంపియన్షిప్లో పాల్గొన్నట్లుగా సర్టిఫికెట్లు జారీచేశారు. కానీ అవన్నీ ఫేక్. అలాగే 2019 డిసెంబర్ 1న విజయవాడలో ఇంటర్ జ్యూడో స్పోర్ట్స్లో క్రిష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులకు చెందిన రెండు సర్టిఫికెట్లను పొందుపరిచారు. వీరిద్దరికీ అదే స్పోర్ట్స్లో రెండవ స్థానం వచ్చిందని పేర్కొనడం విడ్డూరం. అలాగే తిరుపతికి చెందిన ఇ.గోపి గత నాలుగేళ్లుగా శాప్లో పనిచేస్తున్నాడు. ఫస్ట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ మెన్ జ్యూడో చాంపియన్ షిప్ విజయవాడలో 2014 నవంబర్ 28, 29 తేదీలలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి చాంపియన్ షిప్. అందులో సర్టిఫికెట్ జారీ అయ్యింది. అయితే డీఎస్సీలో ఉద్యోగాలు తెచ్చుకున్న ఐదుగురు అభ్యర్థులు కొన్ని సర్టిఫికెట్లు పెట్టారు. 2014 నవంబర్ 11, 13 తేదీలలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జ్యూడో చాంపియన్ షిప్ జరిగినట్లుగా వాళ్లు సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారు. అదే నెలలో పదిహేను రోజులకు ముందు ఇంకో చాంపియన్షిప్ జరిగినట్లుగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేశారు. 2014 నవంబర్ 11, 13 తేదీల్లో చాంపియన్ షిప్లో పాల్గొన్నట్లుగా సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది. 2022లో రాష్ట్ర చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో మహిళలు సులోచన, నిఖితకు రెండవ స్థానానికి సంబంధించి సర్టిపికెట్లు జారీఅయ్యాయి. ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. 2022లో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జ్యూడో చాంపియన్ షిప్ రిజల్డ్ షీటు చూస్తే సులోచన 48 కేజీల కేటగిరి కంటే తక్కువ ఉన్న వాటిలో రెండవ స్థానం వచ్చింది. కానీ ఇక్కడెక్కడా 48 కేజీల కేటగిరి లిస్ట్లో సులోచన పేరు లేదు. అలాగే 70 కేజీల కేటగిరికి సంబంధించిన జాబితాలో కసాయి నిఖిత పేరు ఎక్కడా లేదు. 48 కేజీల కేటగిరిలో నాగప్రియాంక రెండవ స్థానంలో ఉంది. 70 కేజీల కేటగిరిలో శేషారాణి పేరు ఉంది. అంటే చాంపియన్షిప్ లిస్ట్లో ఉన్న పేర్లుకు, సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు ఎలాంటి సంబందమే లేదు. ఆ ఇద్దరు అమ్మాయిలకు నకిలీ సర్టిఫిక్లెతో ఉద్యోగాలు ఇచ్చారు. జ్యూడో అసోసియేషన్లో ఎప్పుడు ఈవెంట్స్ చేసినా వాటిని చాంపియన్షిప్ అంటారు. అయితే 20 మందికి జారీ చేసిన సర్టిఫికెట్లలో టోర్నమెంట్ అని ప్రింట్ చేశారు. దీనిపైన జ్యూడో అసోసియేషన్, శ్యాప్ సమాధానం చెప్పాలి. ఇలా 39 సర్టిఫికెట్లను పరిశీలిస్తే 30 సర్టిఫికెట్లు నకిలీవని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో శ్యాప్ చైర్మన్ రవినాయుడు హస్తం లేదంటే పొరబాటే. డీఎస్సీలో అవినీతి అక్రమాలకు ముఖ్య సూత్రదారుడు మంత్రి లోకేష్. మిగిలిన వాటికి వస్తే... ఎస్ఈఆర్డీ అనేటువంటి దానిలో డీఎస్సీ పేపర్ను సెట్ చేస్తారు. ఆ పేపర్ను సెట్ చేసే దానిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే రవీంద్రనాయుడు అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఇంకెంతమందికి ఆ పేపర్ను లీక్ చేశారో తెలియని పరిస్థితి.’ అని చెప్పారు. అవినీతి డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్యమపోరాటాలు చేస్తోంది..’ అని అభినయ్ అన్నారు. ఆధారాలతో సహా బయట పెట్టిన భూమన అభినయ్ -
ఒత్తిడిని అధిగమిద్దాం
తిరుపతి అర్బన్: ఉద్యోగులు రోజువారి పరిపాలన బాధ్యతల నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం అంతర్గత చైతన్యం–సార్థక నాయకత్వం కోసం గాఢమైన భావోద్వేగ సామరస్యాన్ని సృష్టించడం అనే అంశంపై ప్రత్యేక మోటివేషనల్ వర్క్షాపును ప్రముఖ లీడర్షిప్ కోచ్, రచయిత, ట్రావెల్ ఎక్స్ప్లోరర్ కార్తీక్ పూవనం నేతృత్వంలో చేపట్టారు. జిల్లా స్థాయికి చెందిన వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ ప్రధానంగా ఇతరులతో పోల్చుకోవడం కంటే వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించడం, కృతజ్ఞాత భావాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమ లక్షణాలుగా విశిదీకరించారు. అనంతరం డీఆర్వో నరసింహులు మాట్లాడుతూ భావోద్వేగ సామరస్యం, మానసిక ప్రశాంతతతో చక్కటి పాలనకు పునాదులు వేయవచ్చని వివరించారు. అనంతరం లీడర్షిప్ కోచ్ కార్తీక్ పూవనం మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు భరత్నాయక్, శివశంకర్నాయక్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయభరత్రెడ్డి, డీపీవో సుశీలాదేవి, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, అగ్రికల్చర్ జేసీ ప్రసాద్రావు, ఆర్అండ్బీ ఈఈ రాజా నాయక్, అగ్రిమాపక అధికారి రమణయ్య, డ్వామా పీడీ మద్దిలేటి, సీపీవో రాజశేఖర్, డీఎంఅండ్హెచ్వో బాలకృష్ణనాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి భరత్కుమార్ పాల్గొన్నారు. -
చంద్రగిరి పంచాయతీ ఈఓ ఆస్తుల జప్తునకు గ్రీన్ సిగ్నల్
చంద్రగిరి: ఓ కాంట్రాక్టర్కు చెందిన బిల్లులను మంజూరు చేయడం కోసం లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన అప్పటి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025 ఫిబ్రవరి 28వ తేదీన ఆయన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న తర్వాత ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన అక్రమాస్తులు, కుటుంబ సభ్యులపై కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇల్లు, ఫాం హౌస్లపై విచారణ చేపట్టారు. బంగారు ఆభరణాలు, ఫిక్సిడ్ డిపాజిట్లను వివరాలను సేకరించారు. ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు వాటిని కోర్టుకు సమర్పించారు. దీంతో అక్రమాస్తుల జప్తుకు ఆదేశాలు ఇస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. 2008 నుంచి 2025వ సంవత్సరం వరకు సుమారు రూ.3.41 కోట్లు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. వాహనాలు, పరికరాలను జప్తునకు ఉత్తర్వులు జారీ చేసింది. -
స్వగ్రామానికి వెళుతూ.. తిరిగిరాని లోకాలకు..
వి.కోట : స్వగ్రామానికి వెళుతుండగా మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో అక్కాచెల్లెలు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జగవాండ్లపల్లె పంచాయితీ బోడిరెడ్డి గారిపల్లెకు చెందిన అనిల్ కుమార్ బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య మానస(35) మరదలు గౌతమి(32)తో కలిసి కారులో స్వగ్రామం బయలుదేరారు. బెంగళూరు కార్నర్లోని బట్టరహళ్లి వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో వి.కోట మండలం రామాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అనిల్ కుమార్ మరదలు గౌతమి(32) కారులో నుంచి బయట పడి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. లిప్ట్ అడిగి ప్రయాణిస్తున్న పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి క్షేమంగా బయటపడినట్టు సీఐ సోమశేఖర్రెడ్డి, ఎస్ఐ షేక్షావలీ తెలిపారు. అక్కాచెల్లెలు మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
నోటిఫికేషన్ వచ్చిందోచ్!
తిరుపతి సిటీ: డిగ్రీ ప్రవేశాల కోసం జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్లో విడుదలైనా నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు స్పందించిన ఉన్నత విద్యామండలి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ మేజర్ సబ్జెక్ట్నే యూజీలో కొనసాగిస్తూ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా పీజీ సెట్, లాసెట్, ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. అడ్మిషన్లు ఎప్పుడు జరుగుతయో తెలియని పరిస్థితి. 11 వరకు రిజిస్ట్రేషన్కు గడువు డిగ్రీ ప్రవేశాలకు బుధవారం నుంచి ఈనెల 11వ తేదీలోపు విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్స్ మోడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎమ్డీసీ) వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో తమకు అనుకూలమైన కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన ఉన్నత విద్యామండలి 20వ తేదీన వెబ్ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 26న మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయనున్నారు. 27 నుంచి 29వ తేదీలోపు ఆయా కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. 126 కళాశాలల్లో అడ్మిషన్లు షురూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సుమారు 126 డిగ్రీ కళాశాలల్లో 21 విభాగాలలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్తో దాదాపు 26,755 సీట్లు భర్తీ చేయనున్నారు. అటానమస్ హోదాలో మూడో ఏడాది ప్రవేశాలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్జీఎస్, ఎస్వీ ఆర్ట్స్, ఓరియంటల్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభం కానుంది.. దీంతో పాటు సికింద్రబాద్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీవీవీఎస్ డిగ్రీ కళాశాలలో సైతం అడ్మిషన్లుకు రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరంలో తొలి ఏడాది అటానమస్ హోదాలో అడ్మిషన్లు జరగగా మూడో ఏడాది 2026–27 విద్యాసంవత్సరానికి ప్రస్తుతం అడ్మిషన్లు జరగనున్నాయి. టీటీడీ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉచిత భోజన, వసతి కల్పించనున్నారు. ఎట్టకేలకు విడుదలైన డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల సమాచారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 17 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104 టీటీడీ డిగ్రీ కళాశాలు 5 విభాగాలు 21 అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 26,755హెల్ప్డెస్క్లు ఏర్పాటు డిగ్రీలో ప్రవేశాల కోసం ఇప్పటికే ఆప్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అప్లికేషన్లను ప్రత్యేక హెల్ప్లైన్ డెస్క్లను ఏర్పాటు చేసి ఆయా కళాశాలల అధ్యాపకులు ఆన్లైన్ చేయనున్నట్లు తెలిసింది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో సమస్యలు ఎదురైనా, తెలియకపోయినా సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్డెస్క్ను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. టీటీడీ పరిధిలోని డిగ్రీ కళాశాలల వివరాలు కళాశాల కళాశాల కోడ్ విభాగాలు మొత్తం సీట్లు పద్మావతి డిగ్రీ కళాశాల 18195 21 1,550 ఎస్వీ ఆర్ట్స్ కళాశాల 20132 20 1,417 ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల 17656 19 1,068 ఎస్వీ ఓరియెంటల్ కళాశాల 20185 6 300 సికింద్రాబాద్ ఎస్వీవీవీఎస్ 25519 3 60 -
రెవెన్యూ సమస్యలపై దృష్టి
రెవెన్యూ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జేసీ గోవిందరావు సూచించారు. ఈ మేరకు వారితో సమీక్షించారు. మెగా డీఎస్సీ అక్రమాలపై నిగ్గదీసి అడిగేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు.. ఈనెల పదో తేదీన నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆందోళనలకు సమాయత్తమయ్యారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ సమావేశాలు బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి ప్రతినిధి, తిరుపతి: డీఎస్సీ అవినీతి అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. సీబీఐ విచారణ చేపట్టడంతో పాటు.. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో మంగళవారం టౌన్ హాలు సమావేశాలు నిర్వహించారు. తిరుపతిలో నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరంలోని 50 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రగిరిలో సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆదేశాల మేరకు తుమ్మలగుంటలో సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యవేడు నియోజక వర్గం నారామయణవనంలో సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రాంకుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అన్ని మండలాల నుంచి కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రైల్వే కోడూరులో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గురువారం నుంచి ఆదివారం వరకు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. అదే విధంగా సోమవారం అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. అయితే వైఎస్సార్సీపీ చేపట్టే నిరసన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం గమనార్హం. -
పోలీసులమంటూ వచ్చి..!
● యువకుడిని తీసుకెళ్లే యత్నం? ● తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ● జీరో ఎఫ్ఐఆర్ నమోదు తిరుపతి క్రైం : తిరుపతి సమీపంలోని గాజులమండ్యం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ వద్ద పోలీసులమంటూ వచ్చిన కొందరు వ్యక్తులు ఉద్యోగిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారంటూ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు.. గాజులమండ్యం వద్ద నిర్మాణంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి, ‘రామచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడు? అతడిని తీసుకెళ్లాలి’ అంటూ అక్కడ ఉన్న మల్లికార్జున్రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై అతను ‘మీరు నిజంగా పోలీసులైతే యూనిఫాం ఎక్కడ?’ అని ప్రశ్నించగా, రామచంద్రారెడ్డి లేకపోతే ‘నువ్వే రా’ అంటూ తనను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం వాహనం అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో ఒక వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, తమపై కేసులు పెడితే బయట తిరగనివ్వమని, కంపెనీ నిర్మాణం కూడా కొనసాగనివ్వమని బెదిరించారు. ఈ ఘటనపై మల్లికార్జున్రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేసే ప్రక్రియతో పాటు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రెవెన్యూ సమస్యలపై దృష్టి తిరుపతి అర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆదేశించారు. మంగళవారం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వీడియా కాన్ఫరెన్స్ అనంతరం జేసీ అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. ప్రధానంగా 22ఏ, భూపరిపాలన అంశాలు, రీసర్వే, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పారెస్ట్ ల్యాండ్ సమస్యలు తదితర వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. ఒక్కొక్కటిగా రెవెన్యూకి చెందిన సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. ఎవరి పరిధిలోని అంశాలను వారు బాధ్యతగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని వివరించారు. తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్, దేవేంద్రరెడ్డి, భానుప్రకాష్రెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే అధికారి రాంప్రసాద్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. వ్యభిచార గృహంపై పోలీసుల దాడి తిరుపతి క్రైం : తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించి, నిర్వాహకురాలితో పాటు ముగ్గురు విటులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలను రెస్క్యూ హోంకు తరలించినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. పోలీసుల కథనం.. అక్కారంపల్లి సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో అలిపిరి పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళతోపాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే రూ.1,500 నగదు, 10 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తున్నట్లు అలిపిరి సీఐ తెలిపారు. రాజన్న ఫౌండేషన్కు జాతీయ అవార్డు రేణిగుంట: రేణిగుంట మండలంలోని రాజన్న ఫౌండేషన్ జాతీయ అవార్డు అందుకుంది. సీఎస్ఆర్ టైమ్స్ ఆధ్వర్యంలో మంగళవారం న్యూఢిల్లీలో 13వ జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ, సామాజిక, సుపరిపాలన సదస్సు, అవార్డులు–2026 బహుకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డు అందుకున్నట్టు రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి తెలిపారు. మద్యం మత్తులో కత్తితో దాడి తడ: మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మండలంలోని వెండ్లూరుపాడులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ కొండపనాయుడు కథనం.. మండలంలోని వెండ్లూరుపాడు గ్రామానికి చెందిన పాలా నవీన్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన బూరగ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. నవీన్కు తీవ్ర గాయమైంది. నవీన్ను మొదట సూళ్లూరుపేటకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చైన్నెకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అంత గోప్యత ఎందుకో?
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో అకౌంటబిలిటీని మెరుగుపరిచే ఉద్దేశంతో ఏఐ (ఆ ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను వినియోగించే అవకాశాలపై ఒక ప్రైవేటు సంస్థ బృందం ఇటీవల ఆలయంలో పర్యటించినట్లు తెలిసింది. బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించి వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే ఆ బృందం ఏ అంశాలపై అధ్యయనం చేసింది, ఏ వ్యవస్థలను ఏఐతో అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తోంది, ఏ వివరాలు సేకరించింది అనే విషయాలను ఆలయ అధికారులు వెల్లడించడం లేదు. కొత్త ప్రణాళికలు చేపట్టినప్పుడు వాటి వివరాలను మీడియాకు తెలియజేసే ఆనవాయితీ ఉన్నప్పటికీ, ఈ విషయంలో మాత్రం పూర్తి సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, ఆ బృందంలోని కొందరికి హుండీ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే హుండీ కౌంటింగ్లో ఏ అంశాలను పరిశీలించారు, వాటిని ఏఐతో ఎలా అనుసంధానం చేయాలనుకుంటున్నారు అనే విషయాలపై స్పష్టత లేదు. ఈ విషయమై ఆలయ ఈవో వెంకటేశ్వర్లును వివరణ కోరగా, ఆలయంలో అకౌంటబిలిటీని మరింత మెరుగుపరచే ఉద్దేశంతోనే ఏఐ సాంకేతికతను వినియోగించే అవకాశాలను పరిశీలించేందుకు ఆ ప్రైవేటు సంస్థ బృందాన్ని తామే ఆహ్వానించామని తెలిపారు. అయితే వారు ఏ అంశాలపై అధ్యయనం చేశారనే వివరాలను వెల్లడించ లేదు. ఈ బృందం పర్యటన తమకు సంతృప్తికరంగా ఉంటే అప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ పరిణామంపై స్థానికంగా చర్చ సాగుతోంది. -
సర్వీస్ రోడ్లు నిర్మించండి
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా పరిధిలోని నాయుడుపేట, తూర్పు కనుపూరు తదితర ప్రాంతాల పరిధిలో ఉన్న 71వ జాతీయ రహదారిపై పలు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వీస్ రోడ్డు నిర్మించలేని, వెంటనే ఆయా గ్రామాలకు సర్వీసు రోడ్డు నిర్మించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ సంతోష్కుమార్ యాదవ్ను కోరారు. ఈ సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని చైర్మన్ కార్యాలయంలో ఎంపీతో పాటు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, త్రిలోక్ చంద్రారెడ్డితో కలిసి చైర్మన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ చైర్మన్తో పలు విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. నాయుడుపేట మున్సిపాలిటీ భివృద్ధి చెందుతూ ముఖ్యకూడలి పట్టణంగా మారుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో యాక్సెస్ కంట్రోల్ విధానంతో నిర్మించిన ఎన్హెచ్ 71నకు పూర్తి స్థాయిలో సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర సేవల రాకపోకలపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతోందన్నారు. నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు జంక్షన్ నుంచి అన్నమేడు వరకు, గోమతి సెంటర్ నుంచి నాయుడుపేట పట్టణం వరకు చాలాచోట్ల రహదారికి సర్వీస్రోడ్లు పూర్తి స్థాయిలో లేవన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత శాఖల అధికారులకు సైతం ప్రత్యక్షంగా రహదారుల వద్దకు తీసుకువెళ్లి చూపించినట్లు చైర్మన్కు వివరించినట్లు తెలిపారు. అనంతరం చైర్మన్కు ఓ వినతిపత్రాన్ని అందించారు. -
చెరుకు సాగు క్షీణత ఆందోళనకరం
తిరుపతి మంగళం : తిరుపతి జిల్లాలో చెరుకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కారణాలు, రైతులకు అందిస్తున్న సహాయం, చెరుకు పరిశ్రమ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన మంగళవారం లోక్సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారీగా చెరుకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి వివరాలను కేంద్రం సభకు సమర్పించిందని, తిరుపతి జిల్లాలో చెరుకు సాగు, ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ఠాకూర్ పేర్కొన్నారు. సహకార చక్కెర కర్మాగారాల ఆధునికీకరణ, పునరుద్ధరణ కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా 2023–24, 2024–25 సంవత్సరాల్లో రూ.10,005 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో చెరుకు సాగు క్షీణత ఆందోళన కలిగించే అంశమని, కేంద్రం వెల్లడించిన పథకాల ప్రయోజనాలు జిల్లా రైతులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. -
భవనం పైనుంచి దూకిన మహిళ
నెల్లూరు(క్రైమ్): ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరులోని కొత్తహాల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తిరుపతి రాజేంద్రనగర్ సత్యనారాయణపురంలో టి.పుష్పలత, శివయ్య దంపతులు నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. దంపతులు స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు ముత్తుకూరు రోడ్డులోని ఓ ల్యాండ్ మీడియేటింగ్ పనుల నిమిత్తం వారు సుమారు పది రోజుల క్రితం నెల్లూరుకు వచ్చి ఓ లాడ్జీలో ఉంటున్నారు. మంగళవారం దంపతులు రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లారు. శివయ్యకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి తిరిగొచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెదికాడు. పుష్పలత కొత్తహాల్ ఎదురుగా ఉన్న నాలుగంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగి తీవ్ర రక్తసావ్రమైంది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్సై ఉమమహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. 108 రాకపోవడంతో.. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చినప్పటికి సకాలంలో రాకపోవడంతో బాధితురాలిని ప్రైవేట్ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. సంతపేట ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రురాలి బ్యాగ్లో లభ్యమైన ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న శివయ్య భార్యను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. టీటీడీ చరిత్రలో తొలి సారిగా జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూలై వరకు స్వామివారికి హుండీ ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.861 కోట్లకు చేరుకుంది. సాధారణంగా రోజుకు రూ.3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుండగా, రద్దీ రోజుల్లో అది రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైగా నమోదవుతోంది. రూ.120 కోట్లకు పైగా.. ఈ ఏడాది జనవరి నుంచి హుండీ ఆదాయం స్థిరంగా అధిక స్థాయిలో నమోదవుతోంది. జనవరిలో రూ.124 కోట్లు, ఫిబ్రవరిలో రూ.106 కోట్లు, మార్చిలో రూ.125 కోట్లు, ఏప్రిల్లో రూ.115 కోట్లు, మేలో రూ.120 కోట్లు, జూన్లో రూ.128 కోట్లు, జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్లు హుండీ ద్వారా లభించింది. గత ఏడు నెలల్లో ఐదు నెలలు రూ.120 కోట్ల మార్కును దాటడం విశేషంగా నిలిచింది.పెరిగిన ఆదాయం ప్రస్తుత ఏడాది తొలి ఏడు నెలల్లో సుమారు 1.62 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా జూలైలో రెండు రోజులు హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్కును దాటగా, అనేక రోజుల్లో రూ.4 కోట్లకు పైగా నమోదైంది. ఈ కారణంగానే నెలవారీ హుండీ ఆదాయం తొలిసారిగా రూ.140 కోట్ల మార్కును అధిగమించింది.ఈ ఏడాది కొత్త రికార్డుకు అవకాశం రానున్న బ్రహ్మోత్సవాలు, సెలవు దినాలు, పండుగల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో హుండీ సమర్పణలు కొనసాగితే, 2026లో శ్రీవారికి హుండీ ద్వారా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అధిక ఆదాయం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. -
విషాదం నింపిన స్నేహితుల దినోత్సవం
వరదయ్యపాళెం: స్నేహితులతో కలిసి ఒక రోజు సరదాగా గడపాలన్న ఆలోచన... కానీ ఆ సరదా కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా, బైరిసింగివనం గ్రామానికి చెందిన యువకుడు ఈగల సురేష్ (20) స్నేహితుల దినోత్సవం రోజు ప్రమాదవశాత్తు బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. రెండేళ్లుగా సూళ్లూరుపేటలో.. రెండేళ్లుగా సురేష్ సూళ్లూరుపేటలోని పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అమెజాన్న్లో డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఇటీవల ఊరి నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం పనిలో లేడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని అనుకున్నాడు. వరదయ్యపాళెం మండలం, చిన్నపాండూరు సమీపంలోని అపోలో టైర్స్ పరిశ్రమ వెనుక వ్యవసాయ భూముల్లో ఉన్న ఒక బావి వద్దకు ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అందరూ బావిలోకి దిగి నీటిలో సరదాగా ఈతాడారు. సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది. కానీ సురేష్ నీటిలోకి మునిగిన తర్వాత చాలాసేపటికి కూడా పైకి రాలేదు. స్నేహితులు ఎంత వెదికినా ఆచూకీ కనిపించ లేదు. ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే శ్రీసిటీ పోలీస్ స్టేషన్్ లో ఫిర్యాదు చేశారు. అయితే చీకటి అవ్వడంతో ఆ రాత్రి ఏమీ చేయలేకపోయారు. సోమవారం తెల్లవారుజామున అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు బావిలోకి దిగి గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి సురేష్ మృతదేహం బావిలో లభించింది. శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని అప్పగించినట్లు శ్రీసీటీ ఎస్ఐ ప్రియాంక తెలిపారు. విషాదంలో కుటుంబం ఇంటికి ఆధారంగా ఉండాల్సిన కొడుకు ఇలా విగతజీవిగా తిరిగి రావడంతో బైరిసింగివనంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ‘స్నేహితుల దినోత్సవం రోజు సరదాగా వెళ్తానని చెప్పి వెళ్లాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదు‘ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇది ప్రమాదవశాత్తు మునిగిపోవడమేనా.. లేక మరేదైనా కారణముందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రియాంక వెల్లడించారు. -
నా పేరుపై 20 విద్యుత్ మీటర్లా?
నేను కరకంబాడి సమీపంలోని తారకరామానగర్లో నివాసం ఉంటున్నాం. ఇటీవల నా కుమార్తె కవిత హౌసింగ్కు దరఖాస్తు చేసుకుంది. అధికారులు మీ అమ్మ తంగరాజు రత్నమ్మ పేరుపై 20 విద్యుత్ మీటర్లు ఉన్నాయి.. ధనవంతులకు హౌసింగ్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. 20 మీటర్లు ఏలా వచ్చాయో తెలియడం లేదు. నాకున్నది ఒకే విద్యుత్ మీటర్. మిగిలిన 19 ఎలా వచ్చాయో తెలియదు. –తంగరాజు, రత్నమ్మ, తారకరామానగర్, రేణిగుంట మండలం వంద శాతం వికలత్వం ఉంది సార్ మేము చంద్రగిరి మండలం, అరుణాతండాలో నివాసం ఉంటున్నాం. మా బాబు హర్షవర్దన్కు 100 శాతం వికలత్వం ఉంది సార్. సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది.అయితే పింఛన్ కోసం సచివాలయం నుంచి కలెక్టరేట్ వరకు తిరుగుతున్నాం. అధికారులు సదరన్ సర్టిఫికెట్ తాత్కలికంగా ఇచ్చారు. శాశ్వత సదరన్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెబుతున్నారు. మరోవైపు పింఛన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. –హర్షవర్దన్తో తల్లి గీత, తండ్రి శివ -
దాహం..దాహం
కాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ కార్యకర్తలు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి తాగునీరు అందించే బోరు బావి నుంచి పొలాలకు మళ్లించి వేడుక చూస్తున్నారు. ఇలాంటి ఘటనే మండలంలోని ఇనగలూరు పంచాయతీలో చోటు చేసుకుంది. ఇనగలూరు గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తాగునీటి కోసం మూడు బోర్లు వేసి, వాటికి మోటార్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి గ్రామంలోని రెండు ట్యాంకులకు తాగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల కొందరు టీడీపీ కార్యకర్తలు ఎండలకు తమ పంటలు ఎండిపోతున్నాయన్న సాకుతో ఏకంగా పంచాయతీకి చెందిన తాగునీటి బోర్ల నుంచి పొలాలకు నీటిని మళ్లించారు. దీంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగడానికి నీరులేక అల్లాడుతుంటే.. ఇదేం పని..? అంటూ పలువురు నిట్టూర్చుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. -
ప‘రేషన్’!
రేషన్ రాక ఇబ్బంది పడుతున్న 90 కుటుంబాలు వరదయ్యపాళెం: మండలంలోని కువ్వాకొల్లి పంచాయతీ, ఎల్లకట్టవ గ్రామంలో రేషన్ వివాదం ముదిరింది. రేషన్ డీలర్ తీరుపై ఆగ్రహించిన గ్రామస్తులు సోమవారం వరదయ్యపాళెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కువ్వాకొల్లి గ్రామంలోని రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తున్న ఉమామహేశ్వరి అనధికారికంగా దుకాణం నడుపుతోందని గ్రామస్తులు ఆరోపించారు. గత కొంత కాలంగా ఎల్లకట్టవ గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, 20 కేజీల బియ్యానికి 3 కేజీలు తక్కువగా వేస్తున్నారని, చక్కెర తూకంలోనూ తేడాలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. నెల క్రితం ఎల్లకట్టవ, కువ్వాకొల్లి గ్రామాల మధ్య జరిగిన చిన్న వివాదాన్ని డీలర్ రాజకీయ కుట్రలో భాగంగా పెద్దది చేసి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారని ఆరోపించారు. గ్రామాల మధ్య ఘర్షణలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం కారణంగా ఎల్లకట్టవ గ్రామంలోని 90 కుటుంబాలు గత జులై నుంచి ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు తీసుకోలేకపోతున్నట్టు వాపోయారు. పేదలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ వరదయ్యపాళెం తహసీల్దార్ శివరామ సుబ్బయ్యకు వినతిపత్రం సమర్పించామని గ్రామస్తులు తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సమస్య పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
అఽథ్లెటిక్స్లో నిత్యహాసిని ప్రతిభ
శ్రీకాళహస్తి: తిరుపతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్–డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026లో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన నిత్య ఫిట్నెస్ సెంటర్ అధినేతలు జ్యోతిరావు, రూపాదేవి దంపతుల కుమార్తె నిత్య హాసిని అద్భుత ప్రతిభ కనబరిచి రెండు విభాగాలలో ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. అండర్–18 బాలికల విభాగంలో జరిగిన పోటీల్లో నిత్య హాసిని షాట్పుట్ విభాగంలో 11.38 మీటర్లు విసిరి ప్రథమ స్థానం సాధించగా, డిస్కస్ త్రోలో 29.43 మీటర్లు విసిరి మరోసారి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయాలతో నిత్యహాసిని రెండు విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించింది. నిత్యహాసిని సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, శిక్షకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శాప్ అధ్యక్షులు కిషోర్ తమకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. -
సీబీఎస్ఈ క్లస్టర్–7 అథ్లెటిక్స్ విజేత ఎడిఫై బాలికల జట్టు
తిరుపతి గాంధీరోడు/ చంద్రగిరి: సీబీఎస్ఈ క్లస్టర్–7 అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026–27 పోటీల్లో తిరుపతికి చెందిన ఎడిఫై పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్ మండలం, నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్లో జూలై 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో పాఠశాల విద్యార్థులు 38 పతకాలు సాధించారు. బాలుర విభాగంలో ఆరు వెండి, ఒక కాంస్య పతకం సాధించగా, బాలికల విభాగంలో 17 బంగారు, నాలుగు వెండి, 10 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. ఎడిఫై బాలికల జట్టు వరుసగా నాలుగో ఏడాది కూడా ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ను కై వసం చేసుకుంది. అలాగే పది మంది బాలికలు, ఇద్దరు బాలురు సీబీఎస్ఈ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు అర్హత సాధించారు. జాతీయ స్థాయి పోటీలు అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలోని ఎస్డీ పబ్లిక్ స్కూల్లో జరగనున్నాయి. విద్యార్థులను పాఠశాల చైర్పర్సన్ పి.సులోచన, డైరెక్టర్ పి.ప్రణీత్, అకాడమిక్ డీన్ పి.జాహ్నవి, ప్రిన్సిపల్ టి.దేవరాజులు, కోచ్లు పి.రమేష్, బిష్ణు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
అయ్యా పింఛన్లు ఎప్పుడిస్తారు?
కలెక్టరేట్కు క్యూ కట్టిన బాధితులు తిరుపతి అర్బన్: ‘అయ్యా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారా..?’ అంటూ కనిపించిన ప్రతి అధికారిని అడగడం కలెక్టరేట్ వద్ద సోమవారం కనిపించింది. రాష్ట్ర చరిత్రలోనే రెండేళ్లుగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించకపోవడం ఇదే ప్రథమం అంటూ పలువురు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు అర్జీదారులు పోటెత్తారు. అర్జీలను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్తోపాటు జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్నాయక్, నాగార్జున అర్జీలను స్వీకరించారు. మొత్తం 317 అర్జీలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఫీజులు అధికం ఓబూలవారిపల్లి మండలంలోని మంగంపేట సమీపంలోని ఓ స్కూల్లో అత్యధికంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం పేరుతో డబ్బులు గుంజేస్తున్నారని, దీంతో పేద కుటుంబాలకు చెందిన వారు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. – భరత్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
రేణిగుంట: రేణిగుంట–పూడి రైల్వే స్టేషన్ల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రైలు కిందపడి మృతి చెందినట్లు రేణిగుంట జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్రావు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. అతని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. గుర్తుతెలియని యువకుడి మృతి తిరుపతి రూరల్: పాకాల మండలం, దామలచెరువు అక్కగార్లగుడి సమీపంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. రహదారిపై యువకుడు విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు తెలియకపోవడంతో మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. -
కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు డంపింగ్ యార్డుకు డబుల్ డెక్కర్ బస్సు
● మూలన పడేసిన కూటమి ప్రభుత్వం ● రూ.2 కోట్లకుపైగా వృథా తిరుపతి తుడా: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో విశాలవంతమైన రోడ్లను అభివృద్ధి చేశారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనెక్టివిటీ పెంచారు. ఆపై స్థానికులతో పాటు యాత్రికులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు నగరంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సును ప్రవేశపెట్టారు. ఆధ్యాత్మిక నగర అందాలను తిలకించేందుకు నగర ప్రజలు సైతం ఉత్సాహం చూపారు. నగరపాలక సంస్థ ఈ డబుల్ డెక్కర్ ఈవీ వెహికల్ నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ బస్సును రెండు కోట్లు వేచించి కొనుగోలు చేశారు. కొన్నాళ్ల పాటు సాఫీగా తిప్పారు. ఇంతలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా లక్ష్యాన్ని నీరుగార్చేశారు. ఆ బస్సును మూలన పడేశారు. డబుల్ డెక్కర్ బస్సు వినాయక సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ పాయింట్లో తుప్పు పడుతోంది. రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వ ఏర్పడిన మరుసటి రోజు నుంచి కూటమి నాయకుల కన్ను డబుల్ డెక్కర్ బస్సుపై పడింది. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు దూరం చేయాలనే కుట్రతో బస్సును ఆపేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. నగర వాసుల నుంచి ప్రజాల సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా రాజకీయ కుట్రతో గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసి ప్రజా ఆస్తిని నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం డబుల్ డెక్కర్ బస్సును వినాయక సాగర్లోని చెత్త డంపింగ్ పాయింట్ వద్ద ఉంచడంతో తుప్పు పడుతోంది. ఆకట్టుకున్న డబుల్ డెక్కర్ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అనుసరిస్తూ ఉత్పత్తయ్యే చెత్త నిర్వహణ మొదలు.. ప్లాస్టిక్ నిషేధం, ఉద్యోగులకు వంద ఈ స్కూటర్లు, పచ్చదనం పెంపు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వంటి వాటిని విజయవం తంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రికల్ బ్యాటరీ బస్సును నడపాలని నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడం, నగర వాసులకు కొత్త అనుభూతిని తీసుకురావడమే లక్ష్యంగా మోడ్రన్ బ్యాటరీ బస్సును ఏర్పాటు చేశారు. కరకంబాడి రోడ్డు అన్నమయ్య ఇంజినీరింగ్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, మంగళం, లీలామహల్ కూడలి, పూర్ణకుంభం సర్కిల్, రామానుజకూడలి, లక్ష్మీపురం, అన్న మయ్యసర్కిల్, ఎమ్మార్పల్లి కూడలి నుంచి నూతనంగా నిర్మించిన సీతమ్మ రోడ్డు మీదుగా నగరంలోని ప్రధాన కూడళ్లలో కొన్ని రోజుల పాటు నగర వాసులను, పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులను ఆకట్టుకుంది. ప్రతి రోజూ విద్యార్థులు, ఉద్యోగులు, భక్తులు వందల సంఖ్యలో ప్రయాణించి సంతోషం వ్యక్తం చేశారు. -
అదుపు తప్పిన ద్విచక్రవాహనం
● వ్యక్తికి తీవ్ర గాయాలు తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, వకుళామాత ఆలయ సమీపంలోని ఒమేగా ఆస్పత్రి మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చంద్రగిరి మండలం, పిచ్చినాయుడుపల్లికి చెందిన గిరి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని తొలుత తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై తిరుపతి రూరల్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతి యువకుడిపై తెలంగాణలో కేసు మేడిపల్లి (తెలంగాణా): తిరుపతికి చెందిన యువకుడు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమైన వివాహితను వేధింపులకు గురిచేయడంతో ఆ యువకుడిపై తెలంగాణ రాష్ట్రం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరారెడ్డినగర్ కాలనీకి చెందిన మహిళకు 2025 డిసెంబర్లో తిరుపతికి చెందిన చరణ్ అనే వ్యక్తి ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమయ్యాడు. మేకప్ ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పి ఆమె మొబైల్ నంబర్ తీసుకుని తరుచూ ఫొన్లో మాట్లాడేవాడు. ఈ ఏడాది ఎప్రిల్లో చరణ్ హైదరాబాద్కు వచ్చి చెంగిచెర్లలోని ఓ రెస్టారెంట్లో ఆమెను కలిశాడు. అనంతరం ఆమెకు తరచూ ఫోన్చేసి సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. ఆమె నిరాకరించడంతో తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్లు బంధువులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించేవాడు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి ఫోన్చేసి ఇబ్బందులకు గురిచేసేవాడు. అదేవిధంగా ఆమె వద్ద నుంచి రూ.50వేల చొప్పున రెండుసార్లు నగదు తీసుకున్నాడు. ఒకసారి తిరిగి ఇచ్చేశాడు. మరోసారి 50వేలు చెల్లించకుండా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదచేశారు. ఆమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
కంది, జొన్న పంటలే మేలు
శ్రీకాళహస్తి రూరల్: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అధిక నీరు అవసరమున్న పంటలకు బదులు కంది, జొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, ప్రాంతాయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థుల బృందం సూచించింది. ఈ మేరకు సోమవారం శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించారు. రైతులతో కలిసి వరి పంట పొలాలను పరిశీలించారు. రాయలసీమ జోన్ పరిధిలోని ఐదు జిల్లాల్లో మే, జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదు కాలేదన్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి నెలకొందన్నారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటలకు ప్రాధాన్యతనిచ్చి సరైన నీటి తడులు అందించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేవని భారత వాతావరణ శాఖ పేకర్కొన్న నేపథ్యంలో తక్కువ నీరు అవసరమయ్యే కంది, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. రాబోయే రబీ సీజన్లోనూ వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కలీముల్లా, మురళీకృష్ణ, ప్రతిమ ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి హేమలత, సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు పి.రమేష్రెడ్డి పాల్గొన్నారు. -
డయల్ యువర్ సీఎండీకి 57 వినతులు
తిరుపతి రూరల్: ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి 57 సమస్యలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులో సూళ్లురుపేటలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. సంస్థ డైరెక్టర్లు పి. అయూబాఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్. పద్మ, యం.మురళీకుమార్, ఎన్.శోభావా లెంటీనా, సిహెచ్ రామచంద్రరావు, కె.సంపత్కుమార్, ఎస్.రమణ, జనరల్ మేనేజర్లు శ్రీకాంత్, చక్రపాణి, జగదీష్, భాస్కర్రెడ్డి, లత పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ రేపు ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. -
ఆరుతడి పంటలు సాగు చేయండి
ఏర్పేడు: ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగు చేయాలని తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మండలంలోని అంజిమేడు, నచ్చనేరి గ్రామాల్లో వరి సాగును వారు విద్యార్థులతో కలిసి పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గినందున వరి పంటకు ఆరుతడులుగా నీరు పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.మురళీకృష్ణ, ఏర్పేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కందాటి మహేష్రెడ్డి, అసోసియేట్ డీన్ హేమలత, శాస్త్రవేత్తలు డా.ప్రతిమ, డా.కరీముల్లా, డా.సుబ్రమణ్యం, డా.వేమన, డా.చలం, డా.శ్రీవల్లీ, డా. రమ్యశ్రీ,, శ్రీకాళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు సాగరిక, సూర్యప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. -
వితంతువు పింఛన్ ఇప్పించండి
మా భర్త క్యాన్సర్తో మృతి చెందారు. రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం తిరిగి అలసిపోయాము. చివరికి నా భర్త మృతి చెందారు. కనీసం నాకై నా వితంతువు పింఛన్ ఇప్పించండి. –బీ.కోమల, హరిపురం కాలనీ, తిరుపతి నీరు లేక విద్యార్థినుల ఇబ్బందులు పుత్తూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బోరు ఎండిపోయింది. తాగునీటి కోసం వి ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజు లుగా నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్ల వాడకం ఆగిపోయింది. ట్యాంకర్ ద్వారా అందించే నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. కొత్తగా బోరు బావిని ఏర్పాటు చేయండి. –ఆర్.పద్మావతి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, పుత్తూరు -
దోసెల పెనంతో కొట్టి చంపేశాడు
– అనుమానంతోనే భార్యపై దాడి తిరుపతి రూరల్: అనుమానమే.. పెనుభూతమై.. భార్యను కడతేర్చిన ఘటన తిరుపతి రూరల్ మండలం, వెంకటపతి నగర్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. గురవమ్మ అలియాస్ కస్తూరి (21) అనే యువతిని ఆమె భర్త సురేష్ దారుణంగా హత్యచేశాడు. టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. భార్య చేతిలో ఫోన్ పట్టుకుంటే ఎవరితోనో వివాహేతర సంబంధం నడుపుతున్నట్టుగా భావించి తరచూ వేధించేవాడు. దీంతో ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎప్పటిలాగానే సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వచ్చిన సురేష్ తన భార్య కస్తూరి ఫోన్ ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేష్ దోసెల పెనంతో కస్తూరి తలపై మోదాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు కస్తూరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కస్తూరి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు కస్తూరి, సురేష్కు హర్షిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. తల్లి మృతితో ఆ చిన్నారి తల్లిలేని బిడ్డగా మిగిలింది. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త సురేష్ను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు చేపట్టారు. -
దేవదాయ శాఖ భూమిలో ట్రెంచ్ ఏర్పాటు
రేణిగుంట: మండలంలోని తూకివాకం రెవెన్యూ సర్వే నం.6 మర్రిగుంట చెరువు వద్ద ఉన్న దేవదాయ శాఖ భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా సోమవారం ఎండోమెంట్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ట్రెంచ్ను తవ్వారు. ఇటీవల స్థానిక అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఇదే సర్వే నంబర్లో పది ఎకరాలు తమవని చెబుతూ ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన విషయం విధితమే. అందులో భాగంగా దేవదాయ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రామకృష్ణా మాట్లాడుతూ అనుమతులు లేకుండా దేవదాయ శాఖ భూముల లోకి ఎవరైనా ప్రవేశిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడి అరెస్ట్ రేణిగుంట: సహజీవనం చేసిన మహిళ తనతో మాట్లాడడం లేదన్న కారణంగా కత్తితో పొడిచిన ఘటనలో నిందితుడు పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన గాజులమండ్యం పోలీసులు సోమవారం అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని రామకృష్ణాపురంలో నివాసముంటున్న ఆర్.కుమార్ తనతో గతంలో సహజీవనం చేసిన మహిళ ఫోన్ నంబర్ను బ్లాక్ చేయడంతో ఆమైపె ద్వేషం పెంచుకున్నాడు. ఈనెల 1వ తేదీ రేణిగుంట సంత సమీపంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు సీఐ తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు సత్యవేడు: దాసుకుప్పం, సురుటుపల్లి గ్రామా ల్లో పలువురి ఇళ్లల్లో చోరీకి సంబంధించిన కేసుల్లో దాసుకుప్పంకు చెందిన గోవర్దన్ (‘26) అనే పాత నేరస్తుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సాయినాథ్చౌదరి తెలిపారు. నిదితుడిపై పదికిపైగా కేసులు ఉండగా పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. నిందితుడికి ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించినట్టు చెప్పారు. భాకరాపేటలో మళ్లీ ఏనుగుల దండు భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేట పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పలు పంటలను తొక్కి నాశనం చేశాయి. గ్రామ శివారులోని రైతులకు చెందిన వరి పంటని పూర్తిగా తొక్కేశాయి. వీటితోపాటు ఇతర పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు ఫెన్సింగ్, కంచెలు, కూసాలను విరగ్గొట్టాయి. రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరం మురుకంబట్టులోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అపోలో క్లినిక్లో ఉన్న స్కానింగ్ సెంటర్ను సోమవారం జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి జి.వెంకటప్రసాద్ తనిఖీ చేశారు. చేంజ్ ఆఫ్ అడ్రస్, స్కానింగ్ సెంటర్లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. -
లోకేష్ అవినీతి వల్లే డీఎస్సీలో అక్రమాలు
● నేడు తిరుపతిలో డీఎస్సీ అక్రమాలపై సమావేశం ● తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి తిరుపతి మంగళం : మంత్రి నారా లోకేష్ అవినీతి వల్లే డీఎస్సీ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, కారకుడైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో మంగళవారం ఉదయం 9గంటలకు పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తిరుపతి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పాల్గొంటారన్నారు. తిరుపతి నగరంలోని పార్టీ శ్రేణులంతా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు బజారులో తక్కువ ధరకే బియ్యం తిరుపతి అర్బన్: రైతు బజారులో తెల్ల రేషన్కార్డు ఉన్న వారికి తక్కువ ధరలకే బియ్యాన్ని పంపిణీ చేయడానికి సివిల్ సప్లై విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వెల్లడించారు. సోమవారం తిరుపతి అన్నమయ్యసర్కిల్ సమీపంలోని రైతు బజారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్ దివాకర్రెడ్డి, సివిల్ సప్లై జిల్లా అధికారి శేషాచలం రాజు, ఆర్డీవో రామ్మోహన్, మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్రబాబు, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్బాబుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా 28 చోట్ల బియ్యాన్ని తక్కువ ధరకు అందించనున్నట్టు తెలిపారు. కిలో బియ్యం పై రూ.10 నుంచి రూ.14 వరకు తగ్గుతుందని, స్టీమ్ బియ్యం(బీపీటీ) బహిరంగ మార్కెట్ ధర కేజీ రూ.62 ఉండగా అదేబియ్యం రైతు బజారులో రూ.52 చొప్పున, అలాగే రా బియ్యం రూ.50 చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రికగ్నిషన్ ఫీజు 31లోపు చెల్లించాలి తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు పొందిన జనరల్, ఒకేషన్లతో సహా ప్రతి విద్యార్థి రూ. 210 ఈనెల 31వ తేదీలోపు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ చెల్లించాల్సి ఉంటుందని ఆర్ఐఓ గోపాల్రెడ్డి తెలిపారు. ఆయా కళాశాలలు ఆన్లైన్లో తమ లాగిన్ ద్వారా బోర్డుకు చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించామని తెలియజేశారు. టెట్కు ఏర్పాట్లు పూర్తి తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలో ఈనెల 5 నుంచి 21వ తేదీ వరకు ఏపీ టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్)–2026 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,991 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం తిరుపతి జిల్లాలో 2, చైన్నెలో మూడు మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో జూపార్కు వద్ద ఉన్న అయాన్ డిజిటల్ జోన్లో 10,422 మంది, పుత్తూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో 1,105 మంది, చైన్నె మనిమంగళంలోని అయాన్ డిజిటల్ జోన్లో 117 మంది, చైన్నెలోని శ్రీజయరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో 45 మంది, చైన్నె పీఎస్బీ పాలిటెక్నిక్ కళాశాలలో 302 మంది, మొత్తం 11,991 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే ప్రత్యేకావసరాల అభ్యర్థులు 49 మంది స్క్రైబ్లను వివిధ సెక్షన్లకు అనుగుణంగా కేటాయించినట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు. -
రుణాల పంపిణీని వేగవంతం చేయండి
చంద్రగిరి: కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎంఎస్ఎంఈ, ప్రభుత్వ పథకాలు, రిటైల్ రంగాల్లో రుణాల పంపిణీని వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(ఏపీజీబీ) చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం తిరుచానూరులోని ఆ బ్యాంకు శాఖలో రీజియన్ బ్యాంక్ మేనేజర్ల సమావేశం నిర్వహించారు. బ్యాంకు బలమైన ఆర్థిక స్థితిని ఆయన గుర్తుచేస్తూ రాష్ట్రంలోనే డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అందిస్తోందన్నారు. జులై 31 నాటికి బ్యాంకు మొత్తం రూ.1.42 లక్షల కోట్ల వ్యాపారం జరిపిందని వివరించారు. ఈ సందర్భంగా డిజిటిల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం, ఖాతాదారుల సౌకర్యార్థం తిరుచానూరు శాఖలో ఫేస్ పే కియోస్కోను ఆయన ప్రారంభించారు. అదే విధంగా బాకు అందిస్తున్న వివిధ రకాల ఉత్పత్తులు, సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. -
కట్టెల లారీని ఢీకొన్న స్కూటీ
– యువకుడి మృతి తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓటేరు గ్రామ సమీపంలోని పూతలపుట్టు – నాయుడుపేట జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. తాజ్ హోటల్ జంక్షన్ వద్ద వంతెన నిర్మాణ పనుల కారణంగా సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేశారు. అదే రోడ్డులో సెవెన్ హిల్స్ హోటల్ వద్ద కట్టెల లోడ్డు లారీని రోడ్డుపై నిలిపివేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 11.50 గంటల సమయంలో సదరన్ స్పైస్ హోటల్ వైపు నుంచి రేణిగుంట రోడ్డు వైపు వేదాంతపురం పంచాయతీకి చెందిన టి.సురేష్ (26) ఎన్.వంశీ ఆచారి స్కూటీపై వెళుతూ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని గుర్తించక వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో టి.సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వంశీ ఆచారిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సిరివారు!
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. టీటీడీ చరిత్రలో తొలి సారిగా జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూలై వరకు స్వామివారికి హుండీ ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.861 కోట్లకు చేరుకుంది. సాధారణంగా రోజుకు రూ.3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుండగా, రద్దీ రోజుల్లో అది రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైగా నమోదవుతోంది. రూ.120 కోట్లకు పైగా.. ఈ ఏడాది జనవరి నుంచి హుండీ ఆదాయం స్థిరంగా అధిక స్థాయిలో నమోదవుతోంది. జనవరిలో రూ.124 కోట్లు, ఫిబ్రవరిలో రూ.106 కోట్లు, మార్చిలో రూ.125 కోట్లు, ఏప్రిల్లో రూ.115 కోట్లు, మేలో రూ.120 కోట్లు, జూన్లో రూ.128 కోట్లు, జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్లు హుండీ ద్వారా లభించింది. గత ఏడు నెలల్లో ఐదు నెలలు రూ.120 కోట్ల మార్కును దాటడం విశేషంగా నిలిచింది. ఈ ఏడాది కొత్త రికార్డుకు అవకాశం రానున్న బ్రహ్మోత్సవాలు, సెలవు దినాలు, పండుగల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో హుండీ సమర్పణలు కొనసాగితే, 2026లో శ్రీవారికి హుండీ ద్వారా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అధిక ఆదాయం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. జూలైలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో కానుకలు పెరిగిన ఆదాయం ప్రస్తుత ఏడాది తొలి ఏడు నెలల్లో సుమారు 1.62 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా జూలైలో రెండు రోజులు హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్కును దాటగా, అనేక రోజుల్లో రూ.4 కోట్లకు పైగా నమోదైంది. ఈ కారణంగానే నెలవారీ హుండీ ఆదాయం తొలిసారిగా రూ.140 కోట్ల మార్కును అధిగమించింది. -
తిరుపతిలో చోరీ కలకలం..
ఆంధ్రప్రదేశ్: తిరుపతి పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్లో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.బాధితురాలు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, బీరువాలో భద్రపరిచిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఉదయం లేచి చూసిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధారాలను సేకరించి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. అయితే, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
దళితుల ప్రాణాలకు భద్రత లేదు
చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. ఆయన కు దళితుల పట్ల చులకన భావం ఎక్కువ. అప్పుడప్పు డు ఆయన పార్టీ వారితో దళి తులపై దాడులు చేయించి శునకానందం పొందు తుంటారు. దళితులు తిరిగబడితే ప్రభుత్వం కూలిపోతుందన్న నగ్న సత్యాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – నల్లాని బాబు, వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళితుల జోలికి వస్తే తాట తీస్తాం టీడీపీ గూండాల ఆగడా లు శృతి మించుతున్నాయి. దళితులు ఏం పాపం చేశార ని దాడులు చేస్తున్నారు. పదిమందికి మంచి చేయడానికి వచ్చిన దళితులపై బరితెగించి దాడి చేస్తారా..? మీ పతనం ఆరంభమైంది. దళితుల జోలికి వస్తే ఎవ్వరినైనా తాట తీస్తాం. చంద్రబాబు ప్రభుత్వం దళిత వ్యతిరేకి ప్రభుత్వం. – కోటూరు ఆంజనేయులు, వైఎస్ఆర్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దళితులకు బతికే హక్కు లేదా? కూటమి ప్రభుత్వంలో దళితులకు అందరితో సమానంగా బతికే హక్కు లేదా? అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? చంద్రబాబు ప్రభుత్వం వస్తే దళిత జాతి భయపడే పరిస్థితి. దళితులు కన్నెర్రజేస్తే నీ కుర్చీ కూలడం ఖాయం. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయకుంటే పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తాం. – జయకర్, ఎంపీటీసీ, గాంధీపురం, తిరుపతి రూరల్ దళితులంటే చంద్రబాబుకు గిట్టదు చంద్రబాబు అధికారం కోసం మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. తర్వాత దళితులను దూరం పెడతా రు. దళిత బిడ్డలను అంతం చేస్తారు. దళితులకు చదువులను దూరం చేస్తారు. అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు లేకుండా తన పార్టీ గూండాలతో దాడులు చేయిస్తారు. ఆయనకు దళితులంటే గిట్టదు. – ప్రేమ్కుమార్, ఎస్వీయూ వైఎస్ఆర్ సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు -
తిరుపతి ఐఐటీ త్రైపాక్షిక ఒప్పందం
ఏర్పేడు: రాష్ట్రంలో సౌర ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తిరుపతి ఐఐటీ, ఆస్ట్రేలియా సిడ్నీ యూఎన్ఎస్ డబ్ల్యూ, కోఈఈటీలతో అమరావతిలో జరిగిన ఓ సదస్సులో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో తిరుపతి ఐఐటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్ఎస్డబ్ల్యూ), విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కోఈఈటీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సౌర ఫోటోవోల్టాయిక్ ఉత్పాదక రంగం, రీసైక్లింగ్, విద్య, కార్మిక శక్తి అభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడు సంస్థలు సమష్టిగా కలసి పని చేస్తాయని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల సహకారంతో సోలార్ సెల్ తయారీ, విశ్వసనీయత ఇంజనీరింగ్లో తన పరిశోధనా నైపుణ్యాన్ని అందిస్తుందన్నారు. తిరుపతి ఐఐటీ ఈ కేంద్రాన్ని స్థాపించడానికి విద్యా మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పరిశోధన సహకారాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్పీ డీసీఎల్ ఈఈటీ చీఫ్ జీఎం డీ.సుమన్ కళ్యాణి, సిడ్నీ యూనివర్శిటీ ప్రో వైస్–చాన్స్లర్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ లిజా జాంబర్లాన్, ఐఐటీ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కె.తంగిరాల పాల్గొన్నారు. యువకుడిపై కత్తులతో దాడి – చికిత్స పొందుతూ మృతి శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తిలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది. వివరాలు.. పట్టణంలోని స్వర్ణముఖి కరకట్ట మీద కొండమిట్ట ప్రాంతానికి చెందిన శివ(34) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన శివను స్థానిక ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు స్పందిస్తూ, హత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనకు గల కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. -
టీడీపీ నేతల దోపిడీ రాజ్యం
పెళ్లకూరు: అధికార అండతో టీడీపీ నాయకులు ‘మాఫియా డాన్ల’ అవతారమెత్తుతున్నారు. కొండలు, గుట్టలు, చెరువులు, కాలువలు, అటవీ భూములను భారీ యంత్రాలతో కొల్లగొడుతున్నారు. నాయుడుపేట, దొరవారిసత్రం, మేనకూరు ప్రాంతాల్లో ఇటుక బట్టీలు, వెంచర్లు, పరిశ్రమలకు లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు ద్వారా యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీ నాయకుల అనుమతుల మాటున చెంబేడు, రోసనూరు చెరువుల్లో యంత్రాలతో మట్టి, గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నాయుడుపేట, మేనకూరు ప్రాంతాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలు చేపట్టరాదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడి టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ హరికృష్ణను వివరణ కోరగా ఇరిగేషన్, మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు పొందినట్లు తెలిపారు. అయితే ఇక్కడ జరుగుతున్న అధికార పార్టీ నేతల దోపిడీని కలెక్టర్ నేరుగా పర్యవేక్షించి అవినీతి నేతలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
గాయపడిన వారిపైనే కేసులా?
●‘మాకు రెడ్బుక్ రాజ్యాంగం వద్దు.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే ముద్దు.. తిరుపతి పోలీసులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరిచిపోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అందుకే దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా గాయపడిన దళితులపైనే కౌంటర్ కేసు పెట్టారు.. దళితులపై దాడి చేసిన వారిని శిక్షించకుండా బాధితులపై కౌంటర్ కేసు పెట్టాలని భారత రాజ్యాంగంలో రాసి ఉందా..? ఇంక దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది?’ అని దళిత సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ : దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ బాధితులు, దళిత సంఘాల నేతలు ఆదివారం ఉదయం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారికి వైఎస్ఆర్ సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మద్దుతు తెలిపి పోలీస్ స్టేషన్ ముందు నడిరోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పోలీసులు ఏ చట్టాన్ని అమలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే తాగునీటి బోరును టీడీపీ గూండాలు కబ్జా చేసి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే అంబేడ్కర్ బొమ్మతో నిరసన తెలిపినందుకు మూకుమ్మడిగా దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోసించడం ఏమిటని నిలదీశారు. పోలీసుల ముందే దళితులపై దాడి చేసినా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పటిష్ట భద్రత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దళిత సంఘాల నాయకులు, భూమన కరుణాకరరెడ్డి వస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించి స్టేషన్ లోపలికి ఎవ్వరినీ రానీయకుండా అడ్డుకున్నారు. నిరసన కారులు రోడ్డుపై కూర్చోగానే ట్రాఫిక్ను దారి మళ్లించారు. కొంతసేపటి తర్వాత భూమనతో చర్చించి దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లో నిందితులు అరెస్టు కాకుంటే మరోసారి ఉద్యమిస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. ఆ తర్వాత ఆందోళనను విరమించారు. దళితులపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? -
ఇన్స్పైర్ అవుదాం!
తిరుపతి ఎడ్యుకేషన్ : పోటీ ప్రపంచంతో పోటీ పడేందుకు కొత్త ఇన్నోవేషన్లతోనే సాధ్యం. దీనికోసం శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసి ఎక్కువ మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్తకొత్త ఆవిష్కరణలకు అడుగులు పడేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగానే పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనల వైపుకు నడిపిస్తోంది. వారి చిట్టి మేధస్సుకు పదునుపెట్టించి వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిస్తోంది. విద్యార్థులు రూపొందించే ఆవిష్కరణలు మెరుగుపడాలన్నదే ఇన్స్పైర్ మనక్ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే కేంద్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇన్స్పైర్ మనక్ పేరిట సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది. 2026–27వ సంవత్సరానికి సంబంధించి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఇన్స్పైర్కు అర్హులు. వీరు తమ గైడ్ టీచర్ల సహాయంతో కొత్త ఐడియాలతో వినూత్న ప్రయోగాలు చేపట్టవచ్చు. పోటీ విధానం ఇలా.. ప్రతి జిల్లా నుంచి పంపిన నామినేషన్లను పరిశీలించి ఎంపిక చేసిన ఉత్తమ ప్రదర్శనలను జిల్లా స్థాయిలో ప్రదర్శనకు అనుమతి ఉంటుంది. ఎంపికై న ప్రాజెక్టును రూపొందించడానికి వీలుగా ప్రభుత్వమే విద్యార్థి ఖాతాలో రూ.10 వేలు జమచేస్తుంది. జిల్లా స్థాయి ప్రదర్శనలో ఎంపికయ్యే ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు, అక్కడ ఎంపికయ్యేవి జాతీయ స్థాయి ప్రదర్శనకు అనుమతిస్తారు. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్రవేత్తకు రూ.25వేల వరకు తమ ప్రాజెక్ట్ మెరుగు పరుచుకునేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర పతి భవన్, జపాన్ సందర్శనలతో పాటు ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులకు పేటెంట్ లభించే అవకాశం కూడా ఉంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఇన్స్పైర్ మనక్లో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎన్ఎస్పీఐఆర్ఈఏబ్ల్యూఏఆర్డీఎస్ అండ్ డీఎస్టీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేసి స్కూల్ అథారిటీ ఆప్షన్ను ఎంపిక చేయాలి. అందులో న్యూరిజిస్ట్రేషన్ ఆప్షన్లోకి వెళ్లి పాఠశాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి సేవ్ చేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులన్నింటినీ జిల్లా అథారిటీ పరిశీలించి ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింకు వస్తుంది. ఆ ఐడీతో పాస్వర్డ్ క్రియోట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదు చేయాలి (లేదా) ఇన్స్పైర్ మనక్ యాప్లో విద్యార్థి ఆధారు నెంబరు, బ్యాంకు వివరాలు, పాస్పోర్ట్ సైజు ఫొటో ద్వారా స్కూల్ లాగిన్లో ఓపెన్ చేసి 100 పదాలలోపు ఉండేలా సంక్షిప్తంగా ప్రాజెక్టు వివరాలను నమోదు చేయాలి. సెప్టెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. వినూత్న ఆలోచనతో అందలం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచిస్తే అందలం ఎక్కగలమని రేణిగుంట మండలం, గుత్తివారిపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని గొల్లపల్లి రేష్మ నిరూపించింది. 2024–25వ సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఇన్స్పైర్ మనక్లో గైడ్ టీచర్ పి.మునిరెడ్డి పర్యవేక్షణలో బాయిల్డ్ ఎగ్ షెల్ పీలెర్ ప్రాజెక్టును ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. ఈ ఏడాది జూన్ 28నుంచి జూలై 4వ తేదీ వరకు జపాన్కు వెళ్లడంతోపాటు, సకూర పట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులో పాల్గొనింది. కొత్త ఇన్నోవేషన్కు శ్రీకారం చుడుదాం రండి బాల శాస్త్రవేత్తలుగా అడుగులు పడాలి సరికొత్త ఆవిష్కరణలకు బీజం పడాలని కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో దాగున్న ప్రతిభ, సృజనాత్మకతను గుర్తించి వారిని బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఈ ఏడాది ఇన్స్పైర్ మనక్కు జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు వచ్చేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా కలెక్టర్, తిరుపతి ఆవిష్కరణలకు వేదిక ఇన్స్పైర్ మనక్ సరికొత్త ఆలోచనలకు ఇన్స్పైర్ మనక్ చక్కని వేదిక. జిల్లాలోని అన్ని యాజమా న్య ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు. సెప్టెంబర్ 15వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా సైన్సు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు 100శాతం నమోదయ్యేలా కృషి చేయాలి. – కేవీఎన్.కుమార్, డీఈఓ, తిరుపతి వినూత్న ఆలోచతోనే విజయం అందరిలా కాకుండా వినూత్నంగా అలోచించినప్పుడే విజయాన్ని అందుకోగలం. అందుకు మా విద్యార్థిని రేష్మ చక్కని ఉదాహరణ. సైన్స్ ప్రయోగాలపై ఆసక్తి ఉన్న తను మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెంకులను తీయడానికి పడుతున్న శ్రమని గుర్తించింది. దీనికి సులువైన మార్గాన్ని కనిపెట్టాలన్న ఆలోచనతో నన్ను సంప్రదించింది. కొత్త ఐడియాతో బాయిల్డ్ ఎగ్ షెల్ పీలెర్ ప్రాజెక్టును రూపకల్పన చేసి విజయం సాధించడంతో పాటు జపాన్కు వెళ్లే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. – పి.మునిరెడ్డి, సైన్స్ టీచర్, జెడ్పీ హైస్కూల్ ప్లస్, పద్మావతీపురం, తిరుపతి జపాన్లో చదివే అవకాశం గత ఏడాది నేను రూపొందించిన బాయిల్డ్ ఎగ్ షెల్ పీలెర్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వడంతో పాటు జపాన్ దేశాన్ని సందర్శించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వైజానిక ప్రదర్శనలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. జపనీయుల సంస్కృతి, వారి ఆచార వ్యవహరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పై చదువులకు జపాన్లో చదివేందుకు ఆ దేశం నాకు అనుమతివ్వడం సంతోషంగా ఉంది. నాకు సహకారం అందించిన గైడ్ టీచర్ మునిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్రెడ్డి, డీఈఓ కేవీఎన్.కుమార్, సైన్స్ అధికారి భానుప్రసాద్, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. – గొల్లపల్లి రేష్మ, ఇన్స్పైర్ మనక్–2024–25 విజేత, గుత్తివారిపల్లి నిబంధనలు ఇవే.. అన్ని యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత పాఠశాలలు 3 ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాలలు 5 ప్రాజెక్టులు, హైస్కూల్ ప్లస్లు 7 ప్రాజెక్టులను రూపొందించాలి. సమాజంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, నిత్య జీవిత సమస్యలు, రైతు కూలీల సమస్యలు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై సృజనాత్మక నవీన పద్ధతిలో పరిష్కారం చూపించేందుకు వీలుంటుంది. ఈ ఏడాది డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, సమాజాభివృద్ధి, క్లీన్ ఇండియా అంశాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించాలి. నమోదు ప్రక్రియ ఇలా.. విద్యార్థులు తమ గైడ్ టీచర్ మార్గదర్శకత్వంలో ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి, విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ కార్డు నంబరుతో నమోదు చేసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా పొందుపర్చి సంబంధిత రైటప్ను ఇన్స్పైర్ మనక్ యాప్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర, సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 86,231 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,017 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. -
5న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమో కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం 5వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేస్తున్నట్టు సాంకేతిక విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో నిర్వహించిన పాలిసెట్ రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూసే విద్యార్థులు ఈ నెల 4వ తేదీలోపు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుని 5న స్పాట్ అడ్మిషన్లకు ఓరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించింది. మరిన్ని వివరాలకు ఆయా పాలిటెక్నిక్ కళాశాలల కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొంది. కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్ తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అలాగే మీ మండల, డివిజన్ పరిధిలోని సోమవారం పీజీఆర్ఎస్ ఉంటుందని వెల్లడించారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగ దారులు మొబైల్ నం.8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఇనుము పైపు పడి కార్మికుడి మృతి శ్రీకాళహస్తి రూరల్: ఇనుము పైపు పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని రాచగున్నేరి సమీపంలోని ల్యాంకో కర్మాగారంలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ ఇబ్రహీం కథనం.. జార్ఖండ్కు చెందిన అల్తాబ్ బన్సారి (20) శనివారం క్రేన్కు పైపును కడుతుండగా అదుపుతప్పి పైపు అతనిపై పడింది. తీవ్రంగా గాయపడిన అల్తాబ్ను శ్రీకాళహస్తి ఏరియా ఆసస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బన్సారి మృతిచెందాడు. కేసు విచారణలో ఉంది. కంటైనర్ లారీ ఢీ – డ్రైవర్ మృతి పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గం, చిల్లకూరు గ్రామం వద్ద ఆదివారం ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొనడంతో డ్రైవర్ అరూల్(30) తీవ్ర గాయాలై మృతి చెందాడు. పోలీసుల సమాచారం.. కడపలో స్పేర్ పార్ట్స్ అన్లోడ్ చేసిన కంటైనర్ డ్రైవర్ అరూల్ తిరిగి చైన్నెకి వెళుతున్నాడు. మార్గ మధ్యంలో చిల్లకూరు గ్రామం వద్ద ఉన్న ఫ్లైఓవర్పై ముందు వెళుతున్న వాహాన్ని అదిగమించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు దాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కంటైనర్ లారీ డ్రైవర్ అరూల్ను చికిత్సలు నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
తిరుమలలో వరుస చోరీలు
తిరుమల: తిరుమలలో వరుస చోరీలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత వారం ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురికాగా, శుక్రవారం ఒక్కరోజే చైన్న్స్నాచింగ్, భక్తుల బ్యాగ్ చోరీ ఘటనలు వెలుగుచూశాయి. అయితే ప్రతి ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు వేగంగా స్పందించి గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేయడం విశేషంగా నిలిచింది. కట్టుదిట్టమైన భద్రత.. అయినా.. తిరుమలలో భక్తుల భద్రత కోసం అలిపిరి నుంచే వాహనాలు, భక్తుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమల వ్యాప్తంగా సుమారు మూడు వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేశారు. పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఆక్టోపస్ బలగాలు భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ ఇటీవల వరుస చోరీలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 14 గంటల్లో విగ్రహం చోరీ కేసు ఛేదన మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటనా స్థలికి సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ప్రత్యేక బందాలతో దర్యాప్తు చేపట్టి, కేవలం 14 గంటల్లోనే నిందితుడిని ఒంగోలు రైల్వే స్టేషన్న్లో అదుపులోకి తీసుకున్నారు. అతిథి గృహంలో భక్తుల బ్యాగ్ మాయం రాంభగీచ అతిథి గృహం–3లో బస చేసిన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన భక్తులు వేకువజామున మేల్కొని చూడగా కిటికీ వద్ద ఉంచిన బ్యాగ్ కనిపించలేదు. బ్యాగులో సుమారు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆపిల్ వాచ్లు, ఇయర్పాడ్స్, రూ.40 వేల నగదు ఉన్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీటీవీతో వేగంగా దర్యాప్తు వరుస చోరీ ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ సీసీటీవీ నిఘా వ్యవస్థ పోలీసుల దర్యాప్తుకు కీలకంగా మారింది. ప్రతి కేసులో నిందితుల కదలికలను గుర్తించి స్వల్ప వ్యవధిలోనే అరెస్టు చేయడంతో కేసులు త్వరితగతిన ఛేదించగలిగారు. రెండు గంటల్లోనే చైన్స్నాచర్ అరెస్ట్ పోలీసు క్వార్టర్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ యువకుడు లాక్కెళ్లాడు. వెంటనే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి అలిపిరి వద్ద రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన గొలుసును స్వాధీనం చేసుకున్నారు. -
పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై కేసులు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతి జిల్లా, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడమే కాకుండా ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ తమ సెల్ ఫోన్తో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన నెల్సన్ మండేలా అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఘటనా సమయంలో అప్రమత్తంగా లేకుండా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నటువంటి టీటీడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ తిరుపతి ఎడ్యుకేషన్ : నారాయణవనం జెడ్పీ ఉన్నత పాఠశాల తమిళ (సోషియల్) ఉపాధ్యాయుడు కె.మునివేలును సస్పెండ్ చేసినట్లు ఆదివారం డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పాఠశాల పూర్వ విద్యార్థినికి మొబైల్ ఫోను ద్వారా అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో సదరు విద్యార్థిని వేధింపులు తాళలేక మరణించించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మౌఖిక నివేదిక మేరకు శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నారాయణవనం మండల విద్యాశాఖాధికారి విచారించి తమకు అందజేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు.శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం సుప్రభాత సేవలో భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
వెండి అంబారిపై చంగల్రాయ స్వామి
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయ చంగల్రాయ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఆదివారం ఉదయం వైభవంగా కొనసాగుతున్నాయి. చంగల్రాయ స్వామి వారిని సుందరంగా అలంకరించి వెండి అంబారి వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ధ్వజారోహణ పూజలు ఆలయంలో చంగల్రాయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం అరటి ఆకు మీద ధ్వజపటం ఏర్పాటు చెసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఆటో బోల్తా
– ఉప్పు వ్యాపారి మృతి శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని ముచ్చివోలు సమీపంలో శనివారం ఉప్పు బస్తాలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. నెల్లూరు జిల్లా, సంగం మండలం, జానగొండ దిబ్బకు చెందిన మురళి (29) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో వెంకటగిరి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ముచ్చివోలు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ ఇబ్రహీం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కేవీబీపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం కేవీబీపురం మండలంలో చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం, పెనుమల్లం గ్రామానికి చెందిన పెమ్ముగారి సెల్వ కుమార్ (50) కేవీబీపురం మండలం, ఆదవరం గ్రామంలోని అక్క పార్వతమ్మ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి ద్విచక్ర వాహనంలో హాజరై తిరుగు ప్రయాణమయ్యాడు. ద్విచక్ర వాహనంలో వెళుతుండగా శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు గుంటమెట్టు వద్ద ఢీకొట్టింది. సెల్వకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108లో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కొత్తకండ్రిగ వద్ద మృతిచెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు భరత్కుమార్ ఉన్నారు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సెల్వకుమార్ అకాల మరణంతో కుటుంబం వీధిన పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబయ్య తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చెస్ పోటీలు ప్రారంభం నగరి : స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు నగరి చెస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వీకేఆర్ పురం గ్రాండ్ వరల్డ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ ప్రారంభించారు. జూనియర్ విభాగంలో 140 మంది, సీనియర్ విభాగంలో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ రీజినల్ చైర్పర్సన్ ప్రభాకర్ రాజు, పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు ఓ.బాలసుబ్రమణ్యం చెస్ ఆడి పోటీలను ప్రారంభించారు. ప్రభాకర్రాజు మాట్లాడుతూ పూర్వం రాజులు యుద్ధంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు అనుసరించిన విధానాలతో పుట్టుకొచ్చిందే చదరంగమన్నారు. అది క్రీడగా మారి విశ్వవ్యాప్తమైందన్నారు. ఈ క్రీడతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు. ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ 29 యేళ్ల క్రితం స్నేహితుల దినోత్సవం రోజు ఈ పోటీలను నగరిలో ప్రారంభించినట్టు తెలిపారు. నేడు అదే స్నేహితుల దినోత్సవం రోజున పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గజేంద్ర మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ ఫైనల్స్ జరుగుతాయని, విజేతలకు బహమతులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చదరంగ నిపుణులు నవీన్కుమార్, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్ క్లబ్ కార్యదర్శి కిషోర్కుమార్, కోశాధికారి శక్తివేలు తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. దళితులపై దాడులుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పీఎస్ ఎదుట భూమన కరుణాకర్రెడ్డి, పార్టీ నేతలు బైఠాయించారు. అవిలాల మాజీ సర్పంచ్పై దాడి చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీకి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి.తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూములను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేందుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణతో పాటు దళితవాడ వాసులు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు.అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్ ఫొటోతో కూడిన బ్యానర్ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరుకుని దళితులపై రెచ్చిపోయారు. బూతు పంచాంగం లంకించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణ భయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు.టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ, కౌసల్య, విజయ నిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. -
టీడీపీ మూకల దాష్టీకం
తిరుపతి రూరల్: తిరుపతిలో అంబేడ్కరిస్టులు, దళితులపై టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వారి చేతుల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్ చూడగానే చెలరేగిపోయారు. ‘‘మీరు ఏమైనా అంబేద్కర్కు పుట్టినోళ్లా..? బొమ్మ పట్టుకుని వస్తే వదిలేస్తామా..? అంటూ తిట్లదండకం అందుకున్నారు. బ్యానర్ను చించివేసి ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ అందరి అంతు చూస్తాం’’ అంటూ హూంకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటాడి దొరికిన వారిని దొరికినట్టు పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదారు. కొందరిని గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. మహిళలపైనా దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన దళితులను స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూములను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేందుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణతోపాటు దళితవాడ వాసులు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్ ఫొటోతో కూడిన బ్యానర్ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరుకుని దళితులపై రెచ్చిపోయారు. బూతుపంచాంగం లంకించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణభయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు. గాయపడిన వారికి రుయాలో చికిత్స టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ, కౌసల్య, విజయనిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. టీడీపీ గూండాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్చేశారు. దాడికి పాల్పడిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులుగా చెప్పుకునే నవీన్ నాయుడు, సునీల్, శంకర్ యాదవ్, బాలసుబ్రమణ్యం నాయుడు, పృధ్వీ ఉన్నారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం
తిరుపతి మంగళం : తిరుపతి అర్బన్ మండలం, మంగళం పరిధి, తిరుమలనగర్ పంచాయతీలోని ప్రభు త్వ అనాధీన భూమికే తప్పుడు రికార్డులు సృష్టించి ఏకంగా శాశ్వత భవన నిర్మాణం చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం భవన అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులకు టీడీపీ నాయ కుల నుంచి సిఫార్సులు రావడంతో కూల్చివేత పను లు మధ్యలోనే ఆపేశారు. వివరాలు.. మంగళం పరి ధిలోని చెన్నాయగుంట లెక్క దాఖలా సర్వే నం.228 లో సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ప్రభుత్వ అనాధీన భూమి ఉంది. దీన్ని స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించుకుని అందులో ఏకంగా శాశ్వత భవన నిర్మాణం చేపట్టారు. ఇటీవల ఆ భూమిని ప్రభుత్వం తమకు కేటాయించిదంటూ నకిలీ పత్రాలు సృష్టించి ఎవ్వరూ అడ్డు చెప్పకుండా చేశారు. అందులో ఏకంగా పిల్లర్లు వేసి భవన నిర్మాణం చేపట్టారు. దాంతో పాటు మరో రెండు ఇళ్ల నిర్మాణానికి పునాదులు కూడా తవ్వారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో శనివారం రెవె న్యూ అధికారులు భవన నిర్మాణాన్ని కూల్చివేసేందుకు పూనుకున్నారు. ఇంతలో రెవెన్యూ అధికారులకు టీడీపీ బడా నాయకుల నుంచి ఫోన్లు రావడంతో మధ్యలోనే పనులు నిలిపేసి వెళ్లిపోయారు. -
శ్రీవారి సేవలో పీవీ సింధు
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తమిళనాడు మంత్రి వినోద్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. యూపీఎస్సీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు తిరుపతి అర్బన్: యూపీఎస్సీకి చెందిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్స్ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై ఆయన శనివారం కలెక్టరేట్లో ఉద్యోగులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం 1,093 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. బాలాజీ కాలనీలోని టీటీడీకి చెందిన శ్రీపద్మావతి బాలికోన్నత పాఠశాల వెస్ట్ చర్చ వద్ద, శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్–ఏ)తోపాటు వింగ్–బీలో పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో యూపీఎస్సీ అబ్జర్వర్ ఎన్.వసంత, స్టేట్ అబ్జర్వర్ బీ.ఆనంద్ పాల్గొన్నారు. స్విమ్స్లో నిరంతర వైద్యవిద్య కార్యక్రమం తిరుపతి తుడా: స్విమ్స్ మెడిసిన్, పిడియాట్రిక్స్, టీబీ, ఆర్డీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పద్మావతి ఆడిటోరియం ఓపీడీ బ్లాక్లో నిరంతర వైద్య విద్య కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సంక్లిష్ట వ్యాధులపై సమగ్ర అవగాహన, సకాలంలో నిర్ధారణ, ఆధునిక చికిత్స విధానాలు వైద్య విద్యార్థులకు అత్యంత అవసరమని తెలిపారు. శ్వాసక్రియ శరీరధర్మ శాస్త్రం నుంచి పిల్లలు, పెద్దల్లో వ్యాధి నిర్వహణ, జీవన నాణ్యత మెరుగుదల వరకు ప్రతి అంశంపై నిర్వహిస్తున్న అకడమిక్ కార్యక్రమాలు క్లినికల్ నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్రి పోషిస్తాయని పేర్కొన్నారు. మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, ఫిజియాలజీ విభాగం డాక్టర్ పీవీ అరుంధతి పాల్గొన్నారు. అక్షర పురుషోత్తమ దర్శనం ప్రారంభం తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో అక్షర పురుషోత్తమ దర్శనాన్ని శనివారం బాప్స్ శ్రీ స్వామి నారాయణ సంప్రదాయ అధ్యక్షుడు శ్రీ సాధు భద్రేశ దాసస్వామి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అక్షర పురుషోత్తమనే నూతన దర్శనాన్ని ప్రారంభించడం హర్షణీయమన్నారు. విశ్వవిద్యాలయం వివిధ దర్శనాలకు నిలయమని, అన్ని దర్శనాల సమావేశం అక్షర పురుషోత్తమ దర్శనంలో చూడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అకడమిక్ డీన్ రజనీకాంత్ శుక్లా, దర్శన విభాగ డీన్ గణపతిభట్, పలు విభాగాల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. -
తిరుపతి శివార్లలో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు పంచాయతీ బోరు కబ్జాను అడ్డుకున్నందుకు మెరుపు దాడి
● కళ్లెదుటే దళితులను కొడుతున్నా మౌనం దాల్చిన పోలీసులు ● తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఘటన ● కాలనీ వాసులతో కలసి బోరు వద్ద నిరసన తెలిపిన మాజీ సర్పంచ్ ● కబ్జాదారులకు అండగా నిలిచిన తిరుపతి రూరల్ పోలీసులు ●బోరుని వదిలేయండి పంచాయతీ బోరును ఆక్రమించడంపై పలు మార్లు అధికారులకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతులు సమర్పించారు. పంచాయతీ అధికారులు కబ్జాదారులకు నోటీసులిచ్చి పంచాయతీ బోరు వద్ద ఎలాంటి ఆక్రమణలు చేయరాదని చెప్పినా వారు వినిపించుకోలేదని, అందుకే బోరును కాపాడుకునేందుకు నిరసన తెలిపినట్టుగా బాధితుడు మాజీ సర్పంచ్ వెంకటరమణ స్పష్టం చేశారు. అందుకే తనపై దాడిచేశారని, అంబేడ్కర్ బొమ్మను సైతం చించివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి రూరల్ మండలం, అవిలాల గ్రామ పంచాయతీ, శానప్పకాలనీ సమీపంలోని సర్వే నం.145లో హథీరాంజీ మఠం భూములను కొందరు తెలుగు తమ్ముళ్లు కబ్జా చేసి దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్కు ఆనుకుని పంచాయతీ బోరు ఉండగా దానిని కూడా ఆక్రమించేశారు. దీంతో వివాదం చోటు చేసుకుంది. ఆక్రమిత స్థలం నుంచి పంచాయతీ బోరును వదిలేయాలని కబ్జాదారులకు పలు మార్లు పంచాయతీ అధికారులు నోటీసులిచ్చినా లెక్క చేయలేదు. పంచాయతీ బోరు నుంచి నీరు రాకుండా చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇది మంచిది కాదంటూ మాజీ సర్పంచ్ వెంకటరమణ కాలనీ వాసులతో కలసి శనివారం శాంతి యుత నిరసన చేపట్టారు. పంచాయతీ బోరును కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. దళితులపై ముప్పేట దాడి పంచాయతీ బోరు వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న భూ కబ్జాదారులు రెండు కార్లల్లో వచ్చి ముందుగా అంబేడ్కర్ బొమ్మతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేశారు. ఆపై దళిత మహిళలపై బూతుల వర్షం కురిపించారు. విచక్షణా రహితంగా కొట్టి అడ్డొచ్చిన వాళ్లను కాళ్లతో తన్నుకుంటూ పిడిగుద్దులు కురిపించారు. మాజీ సర్పంచ్ వెంకటరమణ గొంతు పట్టుకుని నులుముతూ చంపేస్తానని హెచ్చరికలు చేశారు. ప్రాణభయంతో పరుగులు తీసినా వెంటాడి కొట్టారని, ఇదంతా పోలీసులు చూస్తుండగానే జరిగిందని గాయపడ్డ మహిళలు చెబుతున్నారు. తమ్ముళ్లకు అండగా పోలీసులు కబ్జాకు పాల్పడిన తెలుగు తమ్ముళ్లకు పోలీసులు అండగా నిలబడ్డారని, అందుకే తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నా ఆపడానికి రాలేదని, అక్కడ ఉన్న ఓ మహిళా ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రోడ్డులోకి వెళ్లి నిలుచున్నారే తప్ప అడ్డుచెప్పలేదని దాడిలో గాయపడిన మహిళలు చెబుతున్నారు. పోలీసులకు తెలిసే తమపై దాడి జరిగిందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు. దళితులపై దాడిచేసిన వారందరినీ తక్షణం అరెస్టు చేసి పంచాయతీ బోరు నుంచి నీరందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ టీడీపీ గూండాల దాడిలో గాయపడి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణను అమెరికా పర్యటనలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే చెవిరెడ్డి రఘునాథరెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు ఉపేంద్రరెడ్డి, అవిలాల లోకనాథరెడ్డి, భానుకుమార్రెడ్డి, మొగరాల హరిప్రసాద్రెడ్డి, తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి, దామినేటి కేశవులు, చిన్నియాదవ్, శశిదర్రెడ్డి, సాయిరాయల్, మల్లారపు శ్రీరాములు, మల్లారపు వాసు, తులసీరెడ్డి, పవన్ కుమార్రెడ్డి, చెంజి రాజేష్, యశ్వంత్రెడ్డి, వినోద్కుమార్తో పాటు పలువురు దళిత పంఘాల నేతలు పరామర్శించిన వారిలో ఉన్నారు. దాడి అమానుషంఅవిలాల పంచాయతీ దళిత మాజీ సర్పంచ్ వెంకటరమణపై ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుల దాడి దుర్మార్గం. చంద్రగిరి నియోజకవర్గంలో దళితులపై వరుసగా జరిగే దాడులు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు ఎదురుగానే మఠం భూములను కబ్జా చేసి కొట్టుకుంటుంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ దాహానికి దళితులు రక్తం చిందించే పరిస్థితులు తలెత్తడం దారుణం. పోలీసు వ్యవస్థ దిగజారుడు తనానికి ఇదొక నిదర్శనం. పోలీసులు టీడీపీ గూండాలకు అండగా నిలబడడం వల్లనే పట్టపగలు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పంచాయతీ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన బోరును ఆక్రమణదారుల నుంచి కాపాడాలని నిరసన తెలిపితే తప్పా. దీనికే దాడి చేయాలా..? – చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త -
సిబ్బంది లేరు స్వామీ!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రమవుతోంది. ఒకవైపు వరుసగా ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండగా, మరోవైపు కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో కీలక విభాగాల్లో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అనేక శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోనే పనులు నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పరిపాలనాపరమైన ఇబ్బందులు మరింత పెరిగే అవకాశముందని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘శాశ్వతంగా’తగ్గిపోతోంది! టీటీడీ వ్యవస్థ 1933లో ఏర్పడగా, 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం స్వయం ప్రతిపత్తి కల్పించారు. అనంతరం పాలకమండలి ఆధ్వర్యంలో 64 శాఖల్లో అవసరానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించారు. 1996 నాటికి టీటీడీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 16 వేలకు చేరుకుంది. అనంతరం భక్తుల రద్దీ, టీటీడీ పరిధిలోని ఆలయాల సంఖ్య గణనీయంగా పెరిగినా, అవసరమైన స్థాయిలో నియామకాలు చేపట్టలేదు. 2009లో చివరిసారిగా నియామకాలు జరగగా, ఆ తర్వాత పెద్ద ఎత్తున భర్తీలు చేపట్టలేదు. ప్రస్తుతం శాశ్వత ఉద్యోగులు సుమారు 5 వేల మందికి పరిమితం కాగా, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 14 వేల మందికి చేరినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా విస్తరించిన టీటీడీ సేవలు గతంలో తిరుమల–తిరుపతికే పరిమితమైన టీటీడీ కార్యకలాపాలు ప్రస్తుతం కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు విస్తరించాయి. ఆలయాల సంఖ్య, భక్తుల సేవలు పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా శాశ్వత సిబ్బందిని నియమించకపోవడం వల్ల పరిపాలనపై ప్రభావం పడుతోంది. భద్రతా వ్యవస్థకు కీలకమైన విభాగం 2006లో వెలుగుచూసిన బంగారు డాలర్ల చోరీ ఘటన, అనంతరం శ్రీవారి ఆభరణాల భద్రతపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని 63 ఆలయాల్లో ఆభరణాల తనిఖీలు నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది. ఉన్నతాధికారుల సమక్షంలో అప్రైజర్లు నిర్వహించే పరిశీలన నివేదికల ఆధారంగానే అధికారిక రికార్డులు సిద్ధమవుతాయి. ఏడాది పొడవునా రోటేషన్ పద్ధతిలో ఈ తనిఖీలు జరుగుతున్నప్పటికీ, అప్రైజర్ల పదవీ విరమణను ముందుగానే అంచనా వేసి కొత్త నియామకాలు చేపట్టడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్వెంటరీ విభాగంలో అప్రైజర్ల కొరత టీటీడీలో అత్యంత కీలకమైన ఇన్వెంటరీ విభాగంలో అప్రైజర్ల కొరత తీవ్రంగా మారింది. శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే బంగారం, వెండి, విలువైన కానుకలతో పాటు ఆలయ ఆభరణాల విలువ నిర్ధారణ, తనిఖీ బాధ్యతలను అప్రైజర్లు నిర్వహిస్తారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల ఆభరణాల వార్షిక తనిఖీల్లో వీరి పాత్ర అత్యంత కీలకం. గతంలో 11 మంది అప్రైజర్లు విధులు నిర్వహించగా, ప్రస్తుతం ఒక్కరూ సేవలో లేకుండా పోయారు. దీంతో ఇటీవల పదవీ విరమణ చేసిన అప్రైజర్ సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. టీటీడీలో ఉద్యోగుల కొరత తీవ్రం నియామకాలపై నిర్ణయం ఎప్పుడు? రిటైర్మెంట్లతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండగా, ఔట్సోర్సింగ్ సిబ్బందిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలక విభాగాల్లో అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగులను నియమించకపోతే భవిష్యత్లో పరిపాలన, భద్రత, సేవల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి ప్రత్యేక దృష్టి సారించి ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. -
లక్ష్మీదేవమ్మకు ఘన నివాళి
తిరుపతి సిటీ: ఎస్డీహెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి మాతృమూర్తి దేవపట్ల లక్ష్మీదేవమ్మ శనివారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలోని డీవీఎస్ చక్రవర్తిరెడ్డి స్వగృహానికి చేరుకుని లక్ష్మీదేవమ్మ మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లక్ష్మీదేవమ్మ అంత్యక్రియలు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం, ముడుంపాడు గ్రామంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. వీధి దీపాల నిర్వహణలో అలసత్యం వద్దు తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వీధి దీపాల నిర్వహణలో అలసత్వాన్ని విడనాడాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. తొమ్మిది జిల్లాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో వీధి దీపాల విద్యుత్ సర్వీసులు 13,568, పంచాయతీల పరిధిలో 41,918 సర్వీసులు ఉన్నాయని, వీటి నిర్వహణకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో నిర్వహణా లోపం కారణంగా పగటిపూట వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్ వృథా అవుతోందని తెలిపారు. రూ. కోటి ప్రమాద బీమా చెక్కు పంపిణీ ఏపీఎస్సీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు రూరల్ డివిజన్, రెడ్డిగుంట సబ్–డివిజన్ పరిధిలో విధుల నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన అసిస్టెంట్ లైన్ మ్యాన్ ఎన్.జ్ఞానశేఖర్ కుటుంబానికి కోటి పది లక్షల రూపాలయ ప్రమాద బీమా చెక్కును అందించారు. కార్పొరేట్ కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల తరఫున శనివా రం సీఎండీ శివశంకర్ చేతులు మీదుగా చెక్కును జ్ఞానశేఖర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అలిపిరిలో రోడ్డు ప్రమాదం – వృద్ధురాలి మృతి తిరుపతి క్రైం : అలిపిరి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓరియన్ హోటల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్ప కాలనీకి చెందిన లక్ష్మీకాంతమ్మ (70), భర్త మునిచంద్రారెడ్డి శనివారం రాత్రి సుమారు 7.05 గంటల సమయంలో ఓరియన్ హోటల్ వైపు నుంచి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. తమిళనాడులోని సేలం జిల్లా రాసిపురానికి చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు. ఆ సమయంలో కారును విఘ్నేష్ నడుపుతున్నాడు. వేగంగా వచ్చిన కారు లక్ష్మీకాంతమ్మను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
మా అమ్మాయిని చంపేశారు!
నారాయణవనం: ‘సోషల్ టీచర్ మునివేలు నమ్మించాడు. నా కూతురుకి మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పుకొచ్చాడు. పేరున్న ఇంజినీరింగ్ కాలేజీలో సీటు తీసిస్తానని తిప్పించాడు. తీరా ఎక్కడా సీటు లేకుండా చేశాడు. అప్పటి నుంచి నా కుమార్తే కుంగిపోయింది. చివరకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది...’ అంటూ బాలిక తల్లి బోరున విలపించడం గుండెల్ని పిండేసింది. పోలీసుల కథనం.. నారాయణవనం బీసీ కాలనీకి చెందిన మరమగ్గ కార్మికులు గోపి, హంస దంపతులకు జీవ(17) కుమార్తె ఉంది. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో తమిళ మీడియంలో జీవ 10వ తరగతి చదువుతున్నపుడు సోషల్ మునివేలు బదిలీపై వచ్చాడు. పదిలో జీవ మంచి మార్కులతో పాసయ్యింది. ఆ తర్వాత పుత్తూరులోని ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. ఇటీవలే ఎంసెట్ రాసి ఇంజినీరింగ్కు అర్హత సాధించింది. బీటెక్లో మంచి పేరున్న కళాశాలలో చేర్పిస్తానని సోషల్ టీచర్ నమ్మించాడు. ఇంజినీరింగ్ తానే చదివిస్తానని ఆశ పెట్టాడు. ఆ తర్వాత తిరుపతి, చిత్తూరుకు జీవను తీసుకువెళ్లేవాడు. డైట్లో సీటు తీసిస్తానని.. కార్వేటినగరం డైట్ కళాశాలలో సీటు కోసం మాట్లాడానని మునివేలు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో జీవ జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం కార్వేటినగరానికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చింది. అక్కడ ఏం జరిగిందో ఏమో.. అప్పటి నుంచి అన్నం తినడం మానేసింది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనం వహిచింది. చివరకు గురువారం సాయంత్రం మిద్దైపె ఫ్యానుకు ఉరివేసుకుని తనువు చాలించినట్టు మృతురాలి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. కాగా బాలికకు శుక్రవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. వ్యవహారాన్ని బయటపెట్టిన స్మార్ట్ ఫోన్ శనివారం జీవ ఫోన్ను కుటుంబ సభ్యులు పరిశీలించారు. మునివేలు చాటింగ్, వీడియోకాల్స్ బయటపడ్డాయి. కొన్ని అసభ్యకర మెసేజ్లూ కనిపించాయి. దీంతో సోషల్ టీచర్పై అనుమానాలు పెంచుకున్నారు. గురువే తమ కుమార్తె మృతికి కారణమన్న వాస్తవాన్ని బాలిక కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఇదిలావుండగా మునివేలు స్థానిక సౌత్ తమిళ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుండగా.. శనివారం పాఠశాలకు హాజరు కాలేదు. అనారోగ్య కారణంతో సెలవు పెట్టారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. తల్లి హంస ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గిరిబాబు తెలిపారు. -
ఫలితం లేదు!
తిరుపతి సిటీ: ఎస్వీయూలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా పరీక్షల విభాగం మొద్దు నిద్రను వీడనంటోంది. ఇది అవినీతికి అడ్డాగా మారింది. ఈ క్రమంలో విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. అవినీతికి కేంద్రంగా మారిన ఎగ్జామినేషన్ సెక్షన్ను ప్రక్షాళన చేశామని చెబుతున్న అధికారులకు ఇటీవల పరీక్షా విభాగంలో జరిగిన చలానాల కుంభకోణం సవాల్ విసిరింది. విద్యార్థులకు సకాలంలో ధ్రువపత్రాలు అందించడంలో, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల్లోనూ నిర్లక్ష్యం నెలకొంటోంది. దీనిపై పలు మార్లు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఎస్వీయూ పరిధిలో గత రెండేళ్లుగా పరీక్షల ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడిపోతోంది. యూజీ, పీజీ పరీక్షల ఫలితాలు సక్రమంగా విడుదల కాకపోవడంతో పోటీ పరీక్షలకు, ఉన్నత విద్యకు దరఖాస్తులు చేసుకునే విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొటోంది. పరీక్షలు జరిగి ఆరు నెలలు పైబడినా ఫలితాలు విడుదల కాకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా త్వరలో విడుదల చేస్తామని నిర్లక్ష్య సమాధానం వస్తోందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. పరీక్షల నిర్వహణలోనూ అలసత్వమే పరీక్షల నిర్వహణలోనూ ఎస్వీయూ ఎగ్జామినేషన్ సెక్షన్ అలసత్వం ప్రదర్శిస్తోంది. వర్సిటీ పరిధిలో గత విద్యా సంవత్సరంలో జరగాల్సిన పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఇప్పటివరకు నిర్వహించలేదు. అలాగే యూజీ కోర్సులకు సంబంధించి పరీక్షల నిర్వహణలో రాష్ట్రంలోని 17 ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీసం డిగ్రీ పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించిన దాఖలాలు లేవని, పరీక్షల నిర్వహించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. యూజీ, పీజీ కోర్సుల పరీక్షలకు సంబంధించి హాల్టికెట్ల జారీలోనూ సాంకేతిక లోపం చూపిస్తూ ప్రతిసారీ జాప్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితాలు విడుదల కావల్సిన కోర్సుల వివరాలు కోర్సులు సెమిస్టర్ పరీక్షలు జరిగిన తేదీ ఎల్ఎల్బీ 1వ, 3వ, 5వ, 7వ, 9వ ఏఫ్రిల్ నెలలో ఎల్ఎల్ఎమ్ 2వసెమ్, 3వ సెమిస్టర్ ఫిబ్రవరి 17, ఏప్రిల్ 16 పీజీ అన్ని కోర్సులు 1వ, 3వ, 4వ సెమిస్టర్ ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలో ఎంబీఏ 1వ, 4వ సెమిస్టర్ జనవరి 23, ఏప్రిల్ నెలలో బీఈడీ 4వ సెమిస్టర్ ఏప్రిల్లో యూజీ 2వ, 3వ, 4వసెమిస్టర్ డిసెంబర్–జనవరి నెలలో యూజీ, పీజీ రీవాల్యుయేషన్ సుమారు 7 నుంచి 8 నెలలు యూజీ సప్లమెంటరీ పరీక్షలు సుమారు 6 నెలలు త్వరలో ఫలితాలు విడుదల చేస్తాం ఎస్వీయూలో పలు యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి ఫలితాలు త్వరలో విడుదల చేస్తాం. ఆన్లైన్ ప్రక్రియతో కాస్త ఆలస్యమైంది. పరీక్షా విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశాం. వేసవి సెలవుల కారణంగా మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమైంది తప్ప ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం లేదు. – కే సురేంద్రబాబు, ఎగ్జామినేషన్ డీన్, ఎస్వీయూ -
ఆలయంలో టీడీపీ నేత పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, టాస్క్ఫోర్స్: నాగలాపురంలోని టీటీడీ ఆధీనంలో ఉన్న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఓ టీడీపీ నేత తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కలకలం రేగింది. వివరాలు.. సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి దేవాలయ బోర్డు సభ్యుడు, టీడీపీ నేత నెల్సన్ మండేలా గురువారం తన పుట్టినరోజు వేడుకలను వేదనారాయణ స్వామి ఆలయ ప్రాంగణలో నిర్వహించాడు. నెల్సన్ మండేలా అనుచరులు, స్నేహితులు అతనికి శాలువ కప్పడం, బొకేలు ఇవ్వడం, పరస్పరం ప్రమాణాలు చేసుకోవడం, ఇది కాకుండా ఆలయ నియమాలకు విరుద్ధంగా, భంగం కలిగించేలా రూ.100 నోట్లను గాల్లో చల్లుకోవడం వంటి దృశ్యాలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యా యి. టీటీడీ ఆధీనంలోని ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన భక్తులు మనోభావాలు దెబ్బతీసిందని, దీనిపై టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘించిన సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానిక డిమాండ్ చేశారు. -
అపోలో ఆస్పత్రిలో సరికొత్త కార్డియాక్ సర్జరీ
తిరుపతి తుడా: చైన్నె అపోలో ఆస్పత్రిలో శరీరంపై ఎటువంటి కోత లేకుండా సరికొత్త కార్డియాక్ సర్జరీ చేస్తున్నట్లు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ధీరజ్రెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక తుడా రోడ్డులోని అపోలో ఇన్ఫర్మేషన్ క్లినిక్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె శాస్త్ర చికిత్సలో అందరికీ కలిగే భయం ఛాతి మధ్య భాగంలో కోత వేయడం వల్ల భారీ మచ్చ ఏర్పడి యద భాగంలో అసహ్యంగా ఉంటుందనే అపోహ ఉంటుందన్నారు. అయితే ఛాతి మధ్య భాగంలో కోత వేయకుండా శస్త్ర చికిత్స చేయడం అనే నూతన వైద్య విధానం అపోలో ఆస్పత్రిలో అందుబాటులో ఉందన్నారు. దీనికోసం రోబోటిక్ సహాయంతో లేదా తోరాకోస్కోప్ కెమెరాను ఉపయోగించి ఛాతికి ఎడమ లేదా కుడి వైపున రెండు నుంచి మూడు అంగుళాల చిన్న సర్జరీ చేయనున్నట్టు చెప్పారు. రోగులు సర్జరీ జరిగిన రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. కార్డియాక్ సమస్యలు ఉన్న ప్రజలు అపోలో సమాచార కేంద్రాన్ని సంప్రదించి ఈ సదుపాయాన్ని పొందాలని కోరారు. -
భృతి ఎప్పుడిస్తారు బాబూ?
తిరుపతి అర్బన్: ‘డీఎస్సీలో పెద్ద ఎత్తున అవినీతిఅక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..’ అని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, తిరుపతి కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ శిరీషా, పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి రఘనాథ్రెడ్డి, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డితో కలసి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పోర్ట్స్ కోటా టీడీపీ కార్యకర్తలకా? స్పోర్ట్స్ కోటాలో పతకాలు సాధించకపోయినా చాంపియన్స్ పేరుతో టీడీపీ కార్యకర్తలకు అడ్డదిడ్డంగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేశారని భూమన వెల్లడించారు. దాంతోనే తాము సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీబీఐతో విచారణ చేపట్టాలి ఫీజు బకాయిలు రూ.9,500 కోట్లా? ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలకు సంబంధించి రూ.9,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని భూమన డిమాండ్ చేశారు. ఏటా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసేలేదన్నారు.మరోవైపు నిరుద్యోగ భృతిగా ప్రతి నెలా రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, అయితే రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని భూమన తెలిపారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదని మండిపడ్డారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కలెక్టర్ను కోరారు. డీఎస్సీలో చోటుచేసుకున్న అవినీతిపై ఈ నెల 4వ తేదీ నుంచి దశల వారీగా దీక్షలు, నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
నవోదయ ప్రవేశాలకు 7 వరకు గడువు
తిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 7వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆ మేరకు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచితంగా సీబీఎస్ఈ సిలబస్ విద్య, వసతిని అందిస్తారని, సిలబస్తో పాటు నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారని తెలిపారు. నవంబర్ 28వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఈ ఏడాది 5వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 86888 88802 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. సీబీఎస్ఈ క్లస్టర్–7లో మళ్లీ అకార్డ్ స్కూల్దే ఆధిపత్యం తిరుపతి రూరల్: సీబీఎస్ఈ క్లస్టర్–7 అథ్లెటిక్స్ మీట్–2026లో తిరుపతికి చెందిన అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా రెండో ఏడాది ఓవరాల్ చాపియన్గా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ ఆవరణలో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్–7 అథ్లెటిక్స్ మీట్ – 2026లో అకార్డ్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచగా ఆ పాఠశాల రెండోసారి ఓవరాల్ చాపియన్షిప్ను కై వసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 280 పాఠశాలల నుంచి 6,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో అకార్డ్ స్కూల్ విద్యార్థులు మొత్తం 39 పతకాలు సాధించారు. వీటిలో 33 స్వర్ణ, మూడు రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయని పాఠశాల ప్రిన్సిపల్ నీరజారెడ్డి తెలిపారు. అలాగే 168 చాపియన్షిప్ పాయింట్లు సాధించి, గత పదేళ్లలో ఏ పాఠశాల నమోదు చేయని అత్యధిక స్కోరును నమోదు చేస్తూ కొత్త రికార్డు సృష్టించినట్టు ఆమె తెలిపారు. ఈ విజయంపై అకార్డ్ స్కూల్ డైరెక్టర్లు ప్రశాంత్ రెడ్డి, వివేక్ రెడ్డి, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థులు, కోచ్లు, ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు. యూజీ సెకండ్ సెమ్ తొలి పరీక్ష వాయిదా తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శనివారం నుంచి జరగనున్న యూజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కాగా తొలి రోజు శనివారం జరగవలసిన లాంగ్వేజ్ పరీక్షను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. మిగిలిన పరీక్షలు యథాతథంగా సోమవారం నుంచి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాల్లో సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు ఇన్స్టెంట్ పరీక్ష కోసం ఈనెల 5వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు గడువును పొడిగిస్తూ శుక్రవారం ఆ శాఖ ఉన్నతాదికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈనెల 17వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టవచ్చని తదుపరి గడువు పొడిగింపు ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మహా ధర్నా
తిరుపతి అర్బన్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వందల మంది కార్మికులు తరలివచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉంటే మరోమాట చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయమైన కోర్కెలు తీర్చకుంటే వచ్చే ఎన్నికల్లో కూటమికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనచేతన యాప్తో నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వందాసి నాగరాజు మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ అంటూ అంగన్వాడీలతోపాటు ఆశా కార్మికులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులు, ఏఓఏ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ తదితర అన్ని వర్గాలకు చెందిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు వాణిశ్రీ, కవిత, విజయమ్మ, సునీత, పద్మలీలా, స్వరూపరాణి, రాజేశ్వరి, ధనమ్మ, మునికుమారి, హైమావతి, నిర్మలమ్మ పాల్గొన్నారు. -
విద్యుత్ సేవలపై ఆకస్మిక తనిఖీ
తిరుపతి రూరల్ : అన్నమయ్య సర్కిల్, పీలేరు డివిజన్ పరిధిలో సీఎండీ శివశంకర్లోతేటి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రాణ స్నేహితులను విడదీసిన మృత్యువు నారాయణవనం: మృత్యువు వెంటాడింది. ఇద్దరు బాల్యమిత్రులను విడదీసింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి నారాయణవనంలో తీవ్ర విషాదం నింపింది. ఎస్ఐ గిరిబాబు కథనం.. నారాయణవనం పాత బజారు వీధికి చెందిన భరత్(28), బీసీ కాలనీకి చెందిన అన్నామలై(28) బాల్యం నుంచి స్నేహితులు. గురువారం రాత్రి మోటార్ సైకిల్పై ఇద్దరూ పుత్తూరుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో చైన్నె నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న కారును అదిగమించబోయి మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నామలైకి తీవ్ర గాయాలయ్యాయి. మొదట అతన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఆ తర్వాత స్విమ్స్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం గుండెల్ని పిండేసింది. -
ఎవరబ్బ సొమ్మని ధారాదత్తం చేశారు?
తిరుపతి మంగళం : తిరుపతి ఆధ్యాత్మిక నగరం, తిరుచానూరు అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోని టూరిజం స్థలాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ అప్పనంగా ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు పక్కనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న టూరిజం స్థలాన్ని శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తదితర నాయకులతో కలసి భూమన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో, జిల్లా కలెక్టరేట్కు ఎదురుగా ఉన్న 22ఎకరాల ప్రభుత్వ టూరిజం స్థలాన్ని బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్కు చెందిన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు మంత్రి లోకేష్ అప్పనంగా ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ఎవరబ్బ సొమ్మని రూ.600 కోట్ల విలువ చేసే 22 ఎకరాల టూరిజం స్థలాన్ని రూ.20 కోట్లకే కట్టబెట్టారని ప్రశ్నించారు. రూ.200 కోట్ల కమీషన్ కోసమే లోకేష్ టూరిజం స్థలాన్ని అప్పనంగా అప్పగించేశారని ఆరోపించారు. మూడేళ్లలో ఈ భూమి రూ.2వేల కోట్లు విలువ చేస్తుందన్నారు. దామినేడు ప్రాంతాల్లో నివసించే పేదవాళ్లకు సెంటు భూమి ఇవ్వడానికి లేదు కానీ ఫైవ్స్టార్ హోటళ్లకు, స్పాసెంటర్లకు, మసాజ్ సెంటర్లకు ఎకరాలు ఎకరాలు కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబెరాయ్ అలిపిరి వద్ద రూ.3వేల కోట్ల టీటీడీ స్థలం తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత రూ.3 వేల కోట్ల విలువ చేసే టీటీడీ స్థలాన్ని గోవు మాంసం అమ్మకాలు చేసే ఓబెరాయ్ హోటల్కు చంద్రబాబు కట్టబెట్టారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి స్థలానికి విలువ కట్టలేమని, అలాంటి స్థలాన్ని టూరిజానికి అప్పగించి వారి నుంచి ఓబెరాయ్ హోటల్కు కేటాయించడం అంతకన్నా దుర్మార్గం మరొకటి లేదన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్కు ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే కమీషన్లే తప్ప దైవక్షేత్రాలు అపవిత్రమవుతాయన్న ఆలోచన కొంచమైనా లేదన్నారు. దైవ క్షేత్రాలను అపవిత్రం చేయాలని చూస్తే ఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.ఆ హక్కు చంద్రబాబుకు ఎక్కడిది? తిరుచానూరు పంచాయతీ దామినేడు ప్రాంతంలోని దళితుల ఆధీనంలో ఉండి సాగు చేసుకుంటున్న భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ప్రశ్నించారు. -
పరిశోధనా ఫలితాలు సమాజానికి ఉపయోగపడాలి
తిరుపతి సిటీ: పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో జరిగే సాంకేతిక పరిశోధన ఫలితాలు సమాజానికి ఉపయోగపడాలని ఎస్వీయూ రెక్టార్ ప్రొఫెసర్ సీహెచ్ అప్పారావు పిలుపునిచ్చారు. ఎస్వీయూ జీవరసాయన శాస్త్ర విభాగం, రూసా ఫేజ్ 2 సహకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెర్బల్ అండ్ సింథటిక్ డ్రగ్ డెవలప్మెంట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతపై జరిగే జాతీయ సదస్సు గురువారం సెనేట్ హాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, స్టార్టప్ల అభివృద్ధి, పరిశ్రమ, విశ్వవిద్యాలయ భాగస్వామ్యంపై నిపుణుల ప్రసంగాలు పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన యాస్పైర్ బైయోనెస్ట్ సీనియర్ అడ్వైజర్ అండ్ డైరెక్టర్ ఆచార్య యోగేశ్వరరావు జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో స్టార్టప్ల పాత్ర అనే అంశంపై ప్రధాన ఉపన్యాసం చేశారు. ఈ సదస్సులో రిజిస్ట్రార్ భూపతినాయుడు, జీవరసాయన శాస్త్ర విభాగాధిపతి సదస్సు అధ్యక్షుడు ఆచార్య ఓవీఎస్ రెడ్డి, కన్వీనర్ ఆచార్య బాలాజీ, బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ నాయర్, డాక్టర్ బీవీ రవికుమార్, ఆచార్య రాజగోపాల్, ప్రిన్సిపల్ పద్మావతమ్మ, రూసా కో–ఆర్డినేటర్ డాక్టర్ కెవీ సుచరిత, సీఈఓ వంశీకృష్ణరాయల్, ఆచార్య హేమ, ఆచార్య రంజని, ఆచార్య రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు
తిరుపతి సిటీ: ఏపీ ఈఏపీసెట్ వెబ్ఆప్షన్ల ప్రక్రియను ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒకటో తారీఖు వరకు కొనసాగుతుందని, గురువారంతో ముగియనున్న వెబ్అప్షన్ల ఎంపిక ప్రక్రియను విద్యార్థుల అభ్యర్థన మేరకు సోమవారం వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. సీట్ల కేటాయింపు యథావిధిగా 6వ తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన ఎంతో మంది విద్యార్థులకు సంబంధించి ఇంటర్ మార్కులు శాతం ఈఏపీసెట్ ర్యాంక్ ప్రకటనలో పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ పాయిజన్పై విచారణకు కమిటీ తిరుపతి తుడా: స్విమ్స్లో ఫుడ్ పాయిజన్న్ పై వస్తున్న వార్తలను నిర్ధారించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఈ మేరకు గురువారం ఆరుగురు నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించి 48 గంటల్లో విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. కమిటీ చైర్మన్గా మంగళగిరి ఎయిమ్స్ అకడమిక్ డీన్ డాక్టర్ రామ్మోహన్, కన్వీనర్గా ఆర్ఎంఓ డాక్టర్ కే.సతీష్, సభ్యులుగా డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్.జగదీష్, పద్మావతి మహిళా వైద్యకళాశాలా ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, స్విమ్స్ కమ్యూనిటీ మెడిసన్ ప్రొఫెసర్ రవిశంకర్ను నియమించారు. కొత్త గ్యాస్ కనెక్షన్లకు నో చాన్స్ తిరుపతి అర్బన్: వంద రోజులుగా కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం లేదు. జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉండగా.. 6.03 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్లు 4.92 లక్షల మందికి మాత్రమే ఉన్నాయి. పెద్ద కుటుంబాలు విభజన నేపథ్యంలో కొత్త కాపురాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజం లేకుండా పోతోంది. కొత్త కనెక్షన్లు ఇప్పట్లో ఇవ్వలేమంటూ ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. వంద రోజులుగా గ్యాస్ సిలిండర్ల డిమాండ్ నేపథ్యంలో ఉన్న కనెక్షన్లకే సిలిండర్లు అందించలేకపోతున్నామంటూ సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే ఒక సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుకింగ్ చేయడానికి 45 రోజుల గడువు విధించారు. అప్పటి వరకు ఆన్లైన్ బుకింగ్ పనిచేయడం లేదు. ఈ క్రమంలో కొత్త కనెక్షన్లు ఇస్తే అందరికీ సిలిండర్లు సరఫరా చేయలేమని పేర్కొంటున్నారు. ముగిసిన జాతీయ సదస్సు తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా సస్టైయినబుల్ కెమికల్ కాంపౌండ్ సింథసీస్ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్ట్ అనే అంశంపై గత రెండు రోజులుగా జరిగిన జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఐఐటీ ఖారగ్పూర్ ప్రొఫెసర్ ఏ.రాజ్కుమార్ హాజరై పర్యావరణహిత రసాయన పరిశోధనలు, సుస్థిర సాంకేతికతల అభివృద్ధి, భవిష్యత్ పరిశోధనా అవకాశాలపై ప్రసంగించారు. న్యూఢిల్లీకి చెందిన ఆర్అండ్డీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ సీనియర్ డైరెక్టర్ హరీష్కుమార్ దేశంలో పరిశోధనలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, నిధులు, ఆవిష్కరణల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వేణుగోపాల్రెడ్డి సదస్సు విజయవతంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలను, అతిథులను సత్కరించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,471 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,361 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో కారులో తరలిస్తున్న ఏడు ఎరచ్రందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును, పైలట్గా వ్యవహరించిన మోటారు సైకిల్ను సీజ్ చేశారు. ఆర్ఎస్ఐ సి.వినోద్కుమార్ టీమ్ కడప జిల్లా బసాపురం వద్ద లోడింగ్ పాయింట్లను తనిఖీ చేపట్టారు. గురువారం తెల్లవారు జామున ఖాజీపేట సెక్షన్ పత్తూరు అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో నాగపట్నం వైపు నుంచి ఒక మోటారు సైకిల్, మరో కారు వేగంగా వస్తూ కనిపించాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వాహనాలు అపి దిగి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్నారు. కారులోని ఏడు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబట్టిన వారిని కడప, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. కారు, మోటారు సైకిల్ తో సహా ముగ్గురు స్మగ్లర్లును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. డీఎస్పీ వీ.శ్రీనివాసులురెడ్డి, ఏసీఎఫ్ జె.శ్రీనివాస్ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


