breaking news
Tirupati
-
ఆడబిడ్డకు అన్యాయంపై ఏకమయ్యారు!
● అదనపు కట్నం వేధింపులు ● పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మహిళ తిరుపతి రూరల్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ తన తల్లితో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలోని మహిళలు అందరూ ఆమెకు అండగా నిలబడ్డారు. బాధితురాలి సమాచారం మేరకు వివరాలు ... తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం హరిజన వాడకు చెందిన రవి, వనజాక్షి కుమారుడు వెంకటేష్కు పెనుమూరుకు చెందిన శారద కుమార్తె త్రిషతో 2021లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే మూడు, నాలుగు నెలలుగా వెంకటేష్ రెండో పెళ్లి చేసుకుంటానని, అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. వివాహ సమయంలో 25 సవర్ల బంగారం, డబ్బుతో పాటు ద్వి చక్రవాహనాన్ని కట్నం కింద ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట కూడా తన పుట్టింటి నుంచి లక్ష రూపాయలు తెచ్చి ఇచ్చినప్పటికీ తనను ఇంటిలోకి రానీయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు త్రిష కన్నీటి పర్యంతమయింది. తాళం వేసి వెళ్లిపోయారు.. ఇటీవల త్రిష తన తండ్రికి ఆరోగ్యం సరిలేదని పుట్టింటికి వెళ్లి వారం రోజుల తరువాత అత్తింటికి తిరిగి రావడంతో అత్తింటి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని మరో చోటుకి వెళ్లిపోయారు. దీంతో తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దుర్గసముద్రంలోని భర్త వెంకటేష్ ఇంటికి వచ్చి తాళం పగులగొట్టి అందులోనే నివాసం ఉండాలని సూచించి వెళ్లారు. అయితే అప్పటి నుంచి అత్తింటి వారు మరింత ఎక్కువగా వేధింపులకు గురి చేస్తూ భర్త వెంకటేష్ చేరదీయకుండా వదిలేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలంటూ బాధితురాలు త్రిష, తన తల్లి శారదతో కలసి పోలీసు వాహనం ముందు బైఠాయించారు. గ్రామస్తులు ఆమెకు మద్దతుగా నిలబడటంతో పోలీసులు బాధితురాలు త్రిషకు నచ్చజెప్పి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకొని వారించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించడంతో గ్రామంలో పరిస్థితి సద్దుమణిగింది. -
ఎందుకంత భయం?
సాక్షి టాస్క్ఫోర్స్ : శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ఈసారి వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలపై తన ప్రతాపం చూపించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లకు అనుమతి లేవంటూ మున్సిపల్ అధికారుల చేత తొలగించారు. అవే ఫ్లెక్సీల పక్కనే ఉన్న కూటమి నేతల కటౌట్లు, ఫ్లెక్సీల జోలికి మాత్రం వెళ్లలేదు. కూటమి ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం శుక్రవారం శ్రీకాళహస్తిలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో కూటమి పార్టీపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే భయపెట్టే ప్రయత్నం చేశారు. మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి పట్టణంలో ఉన్న వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. అయితే పక్కనే కూటమి ఫ్లెక్సీలు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీకి చెందిన వాటినే తొలగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తొలగించటాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. శ్రీకాళహస్తిలో కూటమి కుట్రలు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తొలగించిన వైనం మున్సిపల్ అధికారులను ఉసిగొల్పిన ఎమ్మెల్యే కూటమి ఫ్లెక్సీలు, కటౌట్లను ముట్టుకోని అధికారులు -
బాబు గారూ.. ఇదీ చంద్రగిరీ.. !
● బడగనపల్లెలో దారికి అడ్డంగా కూటమి నేతల ఇనుప కంచె ● మూడు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేని కుటుంబం ● అటవీ సమీప గ్రామంలో రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ జీవనం సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు గారూ.. మీ స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతలు రాజకీయ ప్రతీకారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశాంతమైన పల్లెలకు రక్తపు మరకలు అంటిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో వేసిన దారులను మూసివేస్తున్నారు. గృహ నిర్భందాలకు పాల్పడుతున్నారు. అప్పటికీ మాట వినకుంటే భౌతికంగా దాడులు చేస్తున్నారు.. కూటమి నేతల దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనమే గత మూడు రోజుల క్రితం జరిగిన బడగనపల్లి ఘటన. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారి పల్లె పంచాయతీ పరిధిలోని బడగనపల్లెకు చెందిన వెంకటరమణ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన జనసేన సానుభూతిపరులు కక్షగట్టారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా ఉన్న వెంకటరమణ ఇంటికి వెళ్లే దారిని ఇనుప కంచెతో మూసివేశారు. అది కూడా పంచాయతీ నిధులతో నిర్మించిన సిమెంటు దారి. మూడు రోజులుగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేక నరకం చూస్తున్న వెంకటరమణ కుటుంబీకుల గోడు స్థానిక అధికారులు ఎవరికీ పట్టడం లేదు. బడగనపల్లె అసలే అటవీ ప్రాంతానికి సమీపాన ఉన్న గ్రామం.. అందులో వెంకటరమణ నివసించే ఇల్లు పొలాల్లో ఉంది. ఆ పల్లెకు సమీప ప్రాంతంలోని పొలాల్లోనే ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల చిట్టేచెర్లలో ఓ రైతును తొక్కి చంపేశాయి. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబం ఇంటి నుంచి వెలుపలకు రాలేక నరకం అనుభవిస్తోంది. ఇదేనా కూటమి ప్రభుత్వం మంచి పాలన? ఇదేనా మీరు చేస్తున్న మంచి? అంటూ ఆ కుటుంబం ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి వస్తున్న మీరైనా ఆ కుటుంబం గోడు పట్టించుకుని న్యాయం చేస్తారని ఆకాంక్షిస్తోంది. -
ముగిసిన ఉపగ్రహ తయారీ వర్క్షాప్
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో రెండు రోజులుగా నిర్వహించిన ఉపగ్రహ తయారీ వర్క్షాప్ శుక్రవారం ముగిసింది. అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా చైన్నెకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా సహకారంతో విద్యార్థులకు ఈ వర్క్షాపును నిర్వహించారు. దీనికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ వర్క్షాప్ను ఉద్దేశించి రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి వారిని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వివిధ సంస్థల భాగస్వామ్యం, సహకారంతో సైన్స్ సెంటర్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయి, వాటిలోని రకాలు, వాటి పనితీరు, కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించడంతో పాటు వారితో ఉపగ్రహాల తయారీపై వర్క్షాపును నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం ఈ వర్క్షాపులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో సైన్స్ సెంటర్ సిబ్బంది, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రేపు ఐఐటీ 7వ స్నాతకోత్సవం
ఏర్పేడు : ‘వారంతా ఏళ్ల తరబడి జాతీయ విద్యాసంస్థ ఐఐటీ ఒడిలో సాంకేతిక విద్యను అభ్యసించారు. తమ భావి జీవితానికి గట్టి పునాదిని ఇక్కడే నిర్మించుకున్నారు. అత్యుత్తమ మార్కులతో తాము ఎంచుకున్న కోర్సులో ఉత్తీర్ణులైన వారికి జరగబోయే ‘పట్టా’భిషేక వేడుకలో డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. ఈ వేడుక 418 భావి ఇంజినీర్లలో కొత్త కాంతులను తీసుకురానుంది. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ (భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ) ప్రాంగణంలో ఆదివారం 7వ స్నాతకోత్సవ వేడుక జరగనుంది.వేడుక వివరాలు ముఖ్య అతిథులు : వేడుకలో పట్టాలు పొందనున్న విద్యార్థులు 418 అవార్డులు అందుకోన్న విద్యార్థులు 18 ప్రెసిడెంట్ మెడల్ విజేత – అరవింద్ శ్రీనివాసన్ (సీఎస్ఈ) గవర్నర్ మెడల్ విజేత – ఎం.మేఘవర్షిణి (కెమికల్ ఇంజినీరింగ్)క్రియా యూనివర్సిటీ ఛాన్సలర్, కాగ్నిజెంట్ కో ఫౌండర్ లక్ష్మీనారాయణన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ సభాధ్యక్షులు – డాక్టర్ కలిదిండి సత్యనారాయణ, డైరెక్టర్, ఐఐటీ, తిరుపతి -
మైనింగ్ లీజు వ్యవహారంపై సర్వే
సైదాపురం : మండల కేంద్రమైన సైదాపురంలోని మైనింగ్ లీజు భూముల వ్యవహారంపై శుక్రవారం తహసీల్దార్ సుభద్ర, ఉద్యానశాఖాధికారి ఆనంద్, అటవీ అధికారి శ్రీనివాసులు సంయుక్తంగా సర్వే చేశారు. సైదాపురంలోని 793 సర్వే నంబర్లో సుమారు 114 ఎకరాల 71 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి కొండ పొరంబోకుగా రెవెన్యూ రికార్డులో ఉంది. గతంలో ఆ భూమిలో మైనింగ్ లీజు ఉండేది. కాలక్రమేణా ఆ లీజు గడువు ముగిసింది. దీంతో సుమారు 21 మందికి పైగా పేదలు ఆ ప్రాంతంలో నిమ్మ, మామిడి చెట్లు వేసుకుని పంటలను సాగు చేస్తున్నారు. సుమారుగా 40 ఎకరాల భూమిని వారు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఆ గనికి లీజు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆ రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసులు అందించారు. దీంతో ఆ భూములను సమగ్ర సర్వే చేసేందుకు ప్రభుత్వం జాయింట్ సర్వే బృందంను ఏర్పాటు చేసింది. సర్వేలో భాగంగా సాగులో ఉన్న నిమ్మ, మామిడి చెట్లను అధికారులు పరిశీలించారు. ఈ విషయమై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు తెలిపారు. -
కొడుకు చేతిలో తల్లి హతం
తిరుపతి క్రైం : తల్లి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ యువకుడు తల్లిని హతమార్చిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రొంపిచర్ల మండలానికి చెందిన ఓ మహిళ (37)కు చిన్నగొట్టిగల్లుకు చెందిన వ్యక్తితో వివాహం అయింది. ఆమె భర్త ప్రస్తుతం ఉపాధి కోసం కువైట్లో ఉంటున్నాడు. భార్య తన ఇద్దరు కుమారులతో కలిసి తిరుపతి ఆటోనగర్లోని పూలవానిగుంటలో నివాసం ఉంటోంది. ఓ షోరూంలో సేల్స్ ఉమన్గా ఆమె పనిచేస్తోంది. పెద్ద కుమారుడు పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం చదువు నిలిపేసి ఇంటి వద్దనే ఉన్నాడు. రెండో కుమారుడు ఇటీవల ఇంటర్ పూర్తిచేసుకుని ప్రస్తుతం డిగ్రీలో చేరాడు. అయితే ఆ మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని పెద్ద కుమారుడు గమనించాడు. దీంతో కోపం ఆపుకోలేక గురువారం అర్ధరాత్రి అనంతరం తల్లిపై దాడిచేసి గొంతు నులిమి హత్య చేశాడు. తల్లి మృతి చెందిన అనంతరం శుక్రవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో వారి తాతకు, అమ్మమ్మకు ఫోన్చేసి విషయం తెలియజేశాడు. హుటాహుటిన వారు తిరుపతికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాల తరలించారు. -
అదృశ్యమైన విద్యార్థులు క్షేమం
చంద్రగిరి : చెప్పా పెట్టకుండా హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులను 24 గంటల్లో చంద్రగిరి పోలీసులు గుర్తించారు. వారిని క్షేమంగా తీసుకొచ్చి శుక్రవారం చంద్రగిరిలో తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రభుత్వ బీసీ హాస్టల్ నుంచి తిరుపతికి చెందిన శ్యామ్ నాగరాజ్, పీలేరుకు చెందిన గోపిచంద్ 9వ తరగతి చదువుతున్నారు. గురువారం తెల్లవారుజామున వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. దీంతో వార్డెన్ వనజ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ అనిత విద్యార్థుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం చిత్తూరు జిల్లా సదుంలో విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదుంకు చేరుకున్న చంద్రగిరి పోలీసులు శ్యామ్ నాగరాజ్తో పాటు గోపిచంద్ను క్షేమంగా చంద్రగిరికి తీసుకొచ్చారు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో మందలించారని, హాస్టల్ నుంచి ఇంటికి పంపిచేస్తామని బెదిరించడంతో పారిపోయినట్లు విద్యార్థులు తెలిపారు. అనంతరం ఎస్ఐ అనిత.. విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
కూటమి మోసాలను నిలదీద్దాం
శ్రీకాళహస్తి : చంద్రబాబు, పవన్ ప్రమాణం చేసిన మోసపూరిత వాగ్దానాలను అందరం సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మోసాలను ఎండగట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మధు కన్వెన్షన్ హాల్లో శ్రీబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి అధ్యక్షతన నియోజవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూమన కరుణాకరరెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ముందు టీడీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి హామీలతో ప్రమాణ పత్రాలను ఇచ్చి ప్రజలను వంచించారన్నారు. గెలిచి ఏడాదవుతున్నా 90 వేల కోట్లకుపైగా అప్పులు చేశారనీ, ప్రజలకు ఇస్తానన్న హామీలు మాత్రం నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కనీసం తల్లికి వందనం 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా 50 లక్షల మందికి ఇచ్చి 30 లక్షల మందికి ద్రోహం చేశారన్నారు. ప్రతి ఆడబిడ్డకు రూ.1,500 ఇస్తానని బాండు ఇచ్చి నేడు వారిని వంచించారన్నారు. కూటమి మోసాలను వైఎస్సార్సీపీ శ్రేణులు కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే వారు ఇచ్చిన మామీలు, చేస్తున్న మోసాలకు సంబంధించి వీడియోలు ఉన్నాయని, వారు ఇచ్చిన సూపర్సిక్స్ 143 హామీలు ఏమయ్యాయో ప్రజలు వారిని నిలదీయాలన్నారు. శ్రీకాళహస్తిలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. జగన్మోహన్రెడ్డిని ప్లెక్సీలో కూడా చూడడానికి ఇక్కడి నాయకుకు భయమేస్తోందంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. ఫ్లెక్సీలను తొలగించడం సరైన సంప్రదాయంకాదన్నారు. మోసాలను ఇంటింటికీ తీసుకెళ్దాం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇచ్చిన హామీలను నిలబట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. వారు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గతంలో జగన్ సంక్షేమ పాలనను ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గిరిధర్రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, ఉన్నం వాసుదేవనాయుడు, కోగిలి సుబ్రహ్మణ్యం, మధుసూదన్రెడ్డి, రమణయ్యయాదవ్, సుధాకర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సుధాకర్రెడ్డి, చంద్రయ్యనాయుడు, హరిప్రసాద్రెడ్డి, సిరాజ్బాషా, పఠాన్ ఫరీద్, శ్రీవారిసురేష్, కంఠా ఉదయ్ పాల్గొన్నారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగింది.. ఎక్కడ పవన్? వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైనికునిల్లా పనిచేయాలి బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ క్యూఆర్కోడ్ ఆవిష్కరణ ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన శ్రీకాళహస్తిలో అరాచక పాలన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపేడులో 40 మంది ఎస్టీలు, తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామంలో 20 ఇళ్లు ఊర్లు వదలి వలసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచక పాలన తాము చేయలేదన్నారు. వెయ్యికి పైగా ఇల్లు పునాదులు ధ్వంసం చేశారని, గతంలో శ్రీకాళహస్తిలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మా ఆడబిడ్డ వినుతపై దాడి చేస్తారా నా కొ.. ల్లారా’ అని ఆ నాడు గొంతెత్తిన పవన్ కల్యాణ్ నేడు జన సైనికుడిని చంపిన కేసులో ఆమె ముద్దాయిగా జైలులో ఉంది.. దారుణంగా హత్యకు గురై రాయుడు చెల్లి శ్ఙ్రీఎక్కడున్నావ్ పవన్... ఇదంతా నీకు కనపడలేదా.. రాయుడు కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదు’ అని ప్రశ్నిస్తుంటే ఎందుకు స్పంచదలేదని భూమన నిలదీశారు. తిరుపతిలో మీ నాయకుడు ఓ మహిళను ఇబ్బందులకు గురిచేస్తే దానిపై మాట్లాడవు.. మీ పార్టీకి చెందిన ఓ డ్యాన్సర్ ఓ మైనర్కు అన్యాయం చేస్తే మాట్లాడలేదేమని ప్రశ్నించారు. తిరుపతికి వచ్చి నేను సనాతవాదిని అని గద్దించి ఇంటికి వెళ్లి పడుకున్నావా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కష్టం వస్తే ఎగసేకుని వచ్చి మాట్లాడుతావు గానీ.. నీ కార్యకర్తలకు కష్టం వస్తే మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. -
రాక్షస పాలన నుంచి మహిళలను కాపాడు తల్లీ !
తిరుపతి మంగళం : కూటమి రాక్షస పాలన నుంచి మహిళలకు రక్షణ కల్పించి కాపాడు గంగమ్మ తల్లీ అంటూ తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషతో పాటు వైఎస్సార్సీపీ మహిళా నేతలు వేడుకున్నారు. మాజీ మంత్రి ఆర్కె.రోజాపై నగిరి ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ నాయుడు మహిళలను కించ పరుస్తూ చేస్తూ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఎర్ర దుస్తులు ధరించి చేతుల్లో హారతులు పట్టుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పిస్తాం, మహిళల జోలికి ఎవ్వరైనా వస్తే తాట తీస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు, పవన్కల్యాణ్కు కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు కీచకుల్లా మహిళలను కించపరిచి మాట్లాడడం, హేళన చేయడం, దాడులు చేయడం వంటివి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఆర్కె. రోజాపై గాలి మాటలు మాట్లాడడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి మహిళలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాళ్లు మునీశ్వరి, మునిరత్నమ్మ, పార్టీ నగర బూత్కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయికుమారి, గోలి విజయలక్ష్మి, పద్మజ, రాజేశ్వరి, లక్ష్మీరాజ్యం, శాంతారెడ్డి, అనిత, ఉష, కుమారి, మంజుల, ఆదిలక్ష్మి, పుణీత, పుష్పలత, అరుణ, లక్ష్మికాంతమ్మ, కస్తూరి, సుశీల పాల్గొన్నారు. -
నేడు బీఎన్ఐ కాన్క్లెవ్.. 2.0
తిరుపతి కల్చరల్ : వ్యాపార రంగంలో వ్యాపార సంబంధాల అభివృద్ధిపై వ్యాపారవేత్తలకు కరకంబాడి రోడ్డులోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీఎన్ఐ కాన్క్లెవ్..2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఎన్ఐ సంస్థ చైర్మన్ మణి సందీప్ తెలిపారు. శుక్రవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 1500 మందికిపైగా ప్రముఖ వ్యాపార వేత్తలు , పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలచే బిజినెస్ స్పీచ్, నెట్వర్కింగ్, ప్రొడక్ట్ షోకేస్లు, స్పెషల్ ఇంటరాక్టీవ్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలందరూ పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో బీఎన్ఐ ఈడీ సంతోష్, ప్రతినిధులు దుర్గా ప్రసాద్, వంశీకృష్ణ, స్వాతి పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో రాణించాలి
తిరుపతి ఎడ్యుకేషన్ : చాంపియన్స్గా నిలిచిన చిత్తూరు జిల్లా సీనియర్స్ క్రికెట్ జట్టు ఇదే స్పూర్తితో జాతీయ స్థాయిలో రాణించాలని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ జట్టు సభ్యులను విజయ్కుమార్ అభినందించారు. జూన్ 28 నుంచి ఈనెల 12వ తేదీ వరకు అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జోన్ డే మ్యాచ్లను నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్స్ క్రికెట్ జట్టు కడప, కర్నూలు, అనంతపురం జట్లపై విజయం సాధించి చాంపియన్స్గా నిలవడం గర్వంగా ఉందన్నారు. ఇదే స్పూర్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు క్రికెటర్లు కృషి చేయాలని కోరారు. -
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ : హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంపాళెం గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాంపాళెం గ్రామ దళితవాడకు చెందిన గంధం మల్లెమ్మ కుమారుడు గంధం నరసింహులు (28) ఏడాది కాలంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బస్సు ఢీకొంది. దీంతో నరసింహులుకు తీవ్ర గా యాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పో లీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసింహులు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి లేని నరసింహులుపై ఆధారపడి తల్లి, సోదరి జీవనం సాగిస్తున్నారు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. తప్పిపోయిన బాలికను అప్పగింత కలువాయి(సైదాపురం) : మతిస్థిమితం లేక తప్పిపోయిన ఓ బాలికను కలువాయి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన మోడిబోయిన చంద్రకు పెళ్లి అయి ఒక పాప ఉంది. మతిస్థిమితం సరిగ్గాలేని పాప ఈనెల 16వ తేదీన రైలు ఎక్కి తిరుపతికి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు పట్టుకొని విచారించి కలువాయి ఎస్ఐ కోటయ్యకు సమాచారం అందించారు. స్పందించి ఎస్ఐ వారి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఆ బాలికను ఆమె తండ్రికి అప్పగించారు. బడికి పంపకుండా నిరసన తడ : మా బడి.. మాకే కావాలంటూ తడ హరిజనవాడకు చెందిన తల్లిదండ్రులు చేస్తున్న నిరసన అయిదు రోజులుగా సాగుతోంది. ఈనెల 14వ తేదీ నుంచి తమ పిల్లలను బడికి మాన్పించి ఇళ్లకే పరిమితం చేసి 5 రోజులు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడుల విలీన ప్రక్రియలో భాగంగా తడ హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 46 మంది విద్యార్థుల్లో 28 మందిని తడకండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి పలుసార్లు అధికారులకు గ్రామస్తులు వివతి పత్రాలు అందించారు. సరైన స్పందన లేకపోవడంతో నిరసనలకు దిగారు. -
హాస్టళ్లలో అడ్మిషన్లకు అవకాశం
● మరో 1616 సీట్లు ఖాళీలు ● ఆగస్టు 5వ తేదీ వరకు గడువు తిరుపతి అర్బన్ : జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ (ఎస్సీ హాస్టల్స్)లో విద్యార్థులను చేర్చుకోవడానికి వచ్చేనెల 5 వరకు అవకాశం ఉందని ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమ్కుమార్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తమ కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. జిల్లాలో 60 ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయని చెప్పారు. వీటిలో 5 నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే 6600 మందిని చేర్చుకోవడానికి వీలుందని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు పాత విద్యార్థులు 3640 మంది, కొత్త విద్యార్థులు 1344 మంది చేరారని చెప్పారు. మొత్తంగా 4984 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వివరించారు. మరో 1616 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్థులకు అనుకూలంగా ఉన్న హాస్టల్స్లో చేరడానికి వీలుందని స్పష్టం చేశారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు హాస్టల్స్ మరమ్మతులు, అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం జిల్లాలోని ఎస్సీ హాస్టల్స్కు రూ.8 కోట్లు, జిల్లా కలెక్టర్ నిధి నుంచి మంజూరు చేశారని చెప్పారు. -
మౌలిక వసతుల కల్పనకు నిధులు లేక
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించాలనే ఆశయం ఆదిలోనే నీరుగారిపోతోంది. కూటమి ప్రభుత్వం కేవలం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించడం మినహా ఇప్పటి వరకు స్థల సేకరణలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఎంపిక చేసిన ఆరుచోట్ల పారిశ్రామిక పార్కుల ప్రగతి ముందుకు సాగడం లేదు. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. కేటాయించిన స్థలాలు అభివృద్ధి చేయకుండానే పరిశ్రమలు వస్తాయని ఊరించడం యువతను మభ్యపెట్టేందుకేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చిల్లకూరు : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో ఆరుచోట్ల ఎంఎస్ఎంఈ(మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజస్) కింద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను (పార్కులు) ఇస్తామని ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేయడమే కానీ వాటికి పూర్తి స్థాయి మార్గ దర్శకాలు లేకుండా చేయడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ మార్కు రాజకీయంతో యువతను తమ వైపు తిప్పుకునేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. అందుకు సంబంధించి పార్కులు ఏర్పాటు చేసి అక్కడ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేసుకొని తమతో పాటుగా మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చని ఊరించడం, అటు తరువాత మిన్న కుండి పోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు. దీంతో ఆయా ప్రాంతాలలోని రెవెన్యూ అధికారులను ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని ఏపీ ఐఐసీకి అప్పగించేలా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పారిశ్రామికంగా జిల్లా ముందడుగు వేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రకటనలు గుప్పించేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో మరోలా ... ఏపీఐసీసీ భూ సేకరణ చేపట్టినప్పటికీ ఇక్కడ రెండు (తిరుపతి, నెల్లూరు) జిల్లాలకు చెందిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో మూడు నియోజకవర్గాలకు ఒక అధికారి, మరో మూడు నియోజకవర్గాలు మరో అధికారి పర్యవేక్షణలో ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్న సమయంలో చిల్లకూరు మండలం నక్కల కాలువ కండ్రిగలో సుమారు 85 ఎకరాల భూములను ఏపీ ఐఐసీ స్వాధీనం చేసుకుంది. అయితే ఇక్కడ భూముల్లో ఏటా వర్షాలు కురిసిన సమయంలో నెలబల్లిరెట్టపల్లికి చెందిన దళితులు ఆ భూముల్లో వరి సాగు చేసుకుంటూ ఈ భూములను ఎన్నో ఏళ్లుగా తమ అధీనంలో ఉండగా పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారని అడ్డుపడుతున్నారు. దీంతో అక్కడ భూములపై వివాదం నెలకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కేటాయించిన భూముల్లో కూడా బాలాయపల్లి మండలంలోని మన్నూరులో ఎక్కడా ప్రభుత్వ భూముల లేక అటవీ భూములను పరిశీలించి అధికారులు నివేదికలను పంపారు. అటవీ భూములను పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. భూ కేటాంపులు ఇలా .. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాచగున్నేరిలో 14 ఎకరాలు, వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం మన్నూరులో 60 ఎకరాలు, గూడూరు నియోజకవర్గం గూడూరు మండలం కొమ్మనేటూరులో 40 ఎకరాలు, సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం శిరసనంబేడు వద్ద 100 ఎకరాలు, చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో 65.29 ఎకరాల భూములను కేటాయించారు.గూడూరు : కొమ్మనేటూరు ప్రాంతంలో ఎంఎస్ఎంఈ కోసం సేకరించిన భూమిలో పెరిగిన చెట్లు, పుట్టలు వెంకటగిరి: మన్నూరులో ప్రభుత్వ భూములు లేకపోవడంతో అటవీ భూములను పరిశీలిస్తున్న తహసీల్దార్ ఆడబిడ్డకు అన్యాయంపై ఏకమయ్యారు! 00000– 8లో– 8లో– 8లోజిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులకు స్థలాలు కేటాయించిన ప్రాంతాలునియోజకవర్గం మండలం ప్రాంతం గూడూరు గూడూరు కొమ్మనేటూరు వెంకటగిరి బాలాయపల్లి మన్నూరు సూళ్లూరుపేట పెళ్ళకూరు, శిరసనంబేడు సత్యవేడు వరదయ్యపాళెం చినపాండూరు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి రాచగున్నేరి చంద్రగిరి చంద్రగిరి చంద్రగిరిన్యూస్రీల్ స్థల సేకరణే తప్ప నిధుల కేటాయింపు శూన్యం కొన్నిచోట్ల ఆక్రమణలలో ప్రభుత్వ స్థలాలు పరిశ్రమలకు చెందిన పార్కులు వస్తున్నాయని ప్రకటనలు మౌలిక వసతులు కల్పించకుండానే అధికారుల హడావుడి ఎంఎస్ఎంఈ (మైక్రోస్మాల్ మీడియం ఎంటర్ ప్రైజస్) కింద భూములను యువ పారిశ్రామిక వేత్తలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ భూ సేకరణను రెవెన్యూ అధికారులకు అప్పగించి వారి నుంచి ఏపీ ఐఐసీ స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు భూ సేకరణ చేపట్టారు. అయితే పలు చోట్ల భూములను అప్పగించినప్పటికీ ఒక్క మన్నూరు గ్రామంలో మాత్రం ప్రభుత్వ భూమి లేక అటవీ భూమిని గుర్తించి జిల్లా అధికారులకు స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి నివేదికలను పంపారు. మిగిలిన ఐదు చోట్లలో ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం నిధుల కేటాయింపు జరిగి మౌలిక వసతులు చేపడుతున్నారు. మిగిలిన నాలుగు ప్రాంతాలలో భూ కేటాయింపులను చేపట్టినప్పటికీ ఆయా ప్రాంతాలలో ఎక్కువగా చెట్లు, పుట్టలు పెరిగిపోయి ఉన్నాయి. వీటిని చదును చేసి అక్కడ రోడ్లు, నీటి వసతి కల్పిస్తే పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారు. కానీ అక్కడ కనీస మౌలిక వసతులకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయకనే పారిశ్రామిక వాడలకు భూములు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు.శ్రీకాళహస్తిలో పనులు మొదలు పెట్టాం ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి భూ సేకరణ పూర్తి కావస్తోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రాచగున్నేరి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం మౌలిక వసతుల పనులను వేగంగా చేసేలా చర్యలు చేపడుతున్నాం. పనులు పూర్తి చేసిన తరువాత పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి స్థలాలు కేటాయించడం జరుగుతుంది. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన పార్కులను నెల్లూరు జోనల్ మేనేజర్ పర్యవేక్షిస్తారు. – విజయభరత్రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, తిరుపతి -
శ్రీకాళహస్తిలో కూటమి నేతలు కుట్రలు
తిరుపతి జిల్లా: జిల్లాలోని శ్రీకాళహస్తిలో కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. వైఎస్సార్సీపీ నిర్వహించ తలపెట్టిన బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెక్సీలను మున్సిపల్ అధికారులు బలవంతంగాఇ తొలగించారు. అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేని కూటమి నేతల ఫ్లెక్సీలకు ఒక న్యాయం.. వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీలకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో మున్సిపల అధికారులు ఎమ్మెల్యే తొత్తులుగా పని చేయవద్దని, తర్వాతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈరోజు చేసిన పనికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. -
భానూ నోరు అదుపులో పెట్టుకో!
● నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్కు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ● వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై తప్పుడు కేసుల బనాయింపుపై మండిపాటు పుత్తూరు: ‘భాను నోరు అదుపులో పెట్టుకో.. తప్పుడు కూతలు కూస్తే తోలు తీస్తా’ అంటూ మాజీ మంత్రి ఆర్కేరోజా నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక కేసులో నగరిలో పట్టుబడిన టీడీపీకి చెందిన వారిని వదిలి రాత్రికి రాత్రి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై అక్రమ కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. నగరి కౌన్సిలర్లు బీడీభాస్కర్, బిలాల్ను బుధవారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన నగరి పోలీసులు, గురువారం పుత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించడంతో సత్యవేడు సబ్జైలుకు తరలించారు. విషయం తెలుసుకొని పుత్తూరు కోర్టు వద్దకు వచ్చిన మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. నగరిలో ఇసుక అక్రమ రవాణా కేసులో పట్టుబడిన వారందరూ టీడీపీకి చెందిన వారని తెలిపారు. నగరి ఎమ్మెల్యే భానుకు ముఖ్య అనుచరుడైన భరత్ సైతం అరెస్టయిన వారిలో ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. అది సాధ్యపడేనా? రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికి వచ్చిన టిప్పర్లు ఇక్కడ ఇసుకను డంపింగ్ చేసుకొని తమిళనాడుకు తరలించాలంటే అది వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ల వల్ల జరిగే పనేనా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాజంపేట, తిరుపతి, నగరిలో కూటమి ఎమ్మెల్యేలు ఉండగా మూడు జిల్లాలకు చెందిన ఎస్పీలు, కలెక్టర్లను, మైనింగ్ ఆఫీసర్లను మేనేజ్ చేయడం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు సాధ్యపడే పనేనా అంటూ ప్రశ్నించారు. ఎక్కడో లెక్కల్లో తేడా వచ్చి టిప్పర్లు పట్టుబడడం జరిగిందన్నారు. లెక్కలు సరిచేసుకొని మళ్లీ ఇప్పుడు వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇది ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. వారు మాఫియాకు అధిపతులు ఇసుక, గ్రానైట్, బియ్యం మాఫియాకు నగరి, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యేలు అధిపతులుగా వ్యవహరిస్తున్నారని పత్రికలు, సోషల్ మీడియా కోడై కూస్తోందని మాజీ మంత్రి ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నగరిలో గాలివాటంతో గెలిచిన గాలి భానుప్రకాష్ ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని చేయలేదని దుయ్యబట్టారు. ఇటీవల నగరిలోనే తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 13 టన్నుల రేషన్ బియ్యాన్ని ఇక్కడి అధికారులే పట్టుకొన్నారని గుర్తుచేశారు. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి అమృతరాజ్ నాడార్ ఎమ్మెల్యే భానుకు ప్రధాన అనుచరుడని తెలిపారు. భాను నుంచి ఫోన్ రావడంతో చిన్నపాటి కేసుతో వెంటనే విడుదల చేసేశారన్నారు. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల అమృతరాజ్ నాడార్ ఎమ్మెల్యే భాను బర్త్డేకి ఓ పత్రికలో ఇచ్చిన ప్రధాన అడ్వర్టైజ్మెంట్ను చూపించారు. ఇకపై ఉపేక్షించేది లేదు! ఎమ్మెల్యే భానుకు రోజురోజుకు నోరు పెరిగిపోతోందని, ఇటీవల తనపట్ల తప్పుగా మాట్లాడిన విషయాలపై కేసు పెట్టడంతో పాటు డిఫరమేషన్ సూట్ వేస్తున్నట్లు చెప్పారు. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన గురించి మాట్లాడడానికి భానుకు అర్హతే లేదన్నారు. రానున్నది జగనన్న ప్రభుత్వమేనని, భాను తినే ప్రతి అవినీతి పైసా కక్కిస్తానని హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందని తెలిపారు. నేటి కూటమి ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పుతీసుకొచ్చి చెత్త రికార్డు నెలకొల్పిన ఘనత చంద్రబాబునాయుడుకు దక్కిందన్నారు. నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
టిప్పర్ బోల్తా
డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు నాయుడుపేటటౌన్: పట్టణ సమీపంలోని జాతీయ రహదారిలో ఉన్న రింగ్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి టిప్పర్ గురువారం తెల్లవారు జామున అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న గూడూరు ప్రాంతానికి చెందిన డ్రైవర్ , క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. గూడూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న ఖాళీ టిప్పర్ నాయుడుపేట సమీపంలో 71 నంబర్ జాతీయ రహదారి రింగ్ రోడ్డు బ్రిడ్జిపైకి వచ్చేసరికి అదుపు తప్పి సుమారు 30 అడుగులకు పైనుంచి కింద పడిపోయింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కొన్న డ్రైవర్ ఎం హరి, క్లీనర్ ఎస్ వెంకటేశ్వర్లు బయటకు తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తన మనవడిని చంపేస్తారని భయంతో కాళ్లుపట్టుకున్నా కనికరించలేదని శ్రీనివాసులు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్ని పిచ్చిగా అభిమానించిన తన సోదరుడిని హత్యచేశారని తెలిసినా జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడి హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితోపాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జనసేన మాజీ ఇన్చార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడి హత్య కేసును ఏపీకి బదిలీచేస్తే కేసు నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయుడు హత్య కేసును ఏపీకి బదిలీ చేయాలని కుట్రలు చేస్తున్నారని, తమిళనాడు పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలంటే తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. రాయుడిని చంపిన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన అభిమాని, జనసేన కార్యకర్త హత్యకు గురైతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పరామర్శ లేదని, ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బొజ్జల అనుచరుడు మోసం చేశాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు పేట చంద్రతో తన మనవడు ఫోన్ టచ్లో ఉన్నాడని రాజేశ్వరమ్మ వెల్లడించారు. వినుత సమాచారం, వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారని విమర్శించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ మెసేజ్లు ఉన్నాయని, తాను దొరికిపోయాను అని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకు రాయుడు మెసేజ్ చేస్తే ‘‘నీ చావు నువ్వు చావు, మా పేర్లు చెప్పొద్దు’’ అని మెసేజ్ పెట్టినట్లు కన్నీరుపెట్టుకున్నారు. రాయుడిని చంపక ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగిందని, మనవడిని చంపొద్దు అని వినుత దంపతుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడానని, అయినా కనికరం చూపలేదని రాజేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తారని తెలిసి వినుత ఇంటి నుంచి దూకి పారిపోయేందుకు రాయుడు యత్నించడం వల్ల అతడి కాళ్లు విరిగాయని, అది సీసీ ఫుటేజీలో రికార్డు అయిందని, ఆ తరువాత రాయుడిని పక్కనే కూర్చొని పెట్టుకుని వినుత దంపతులు తనతో మాట్లాడారని రాజేశ్వరమ్మ చెప్పారు. ఎక్కడికి పారిపోకుండా ఇద్దరితో కలిసి వినుత దంపతులు రాయుడిని నిర్బంధించి కాళ్లు, చేతులు కట్టి కూర్చోబెట్టారని విమర్శించారు. రాయుడికి డబ్బులు ఇచ్చారని చెబుతున్నారని, ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలని డిమాండ్ చేశారు.పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలితనకు అన్న లేకుండా చేశారని సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ కళ్యాణ్ ఇంత జరిగినా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్కల్యాణ్ రావాలి, తమకు న్యాయం చేయాలని కీర్తి డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. రాయుడి హత్య తరువాత తమకు రూ.30 లక్షలు ఆఫర్ ఇచ్చారని, తాము డబ్బుకు లొంగేవాళ్లం కాదని, తమకు న్యాయం జరగాలని డిమాండ్చేశారు. సోషల్ మీడియాలో రాయుడిపై ఏవో విష ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులో చాలామంది ఉన్నారని, వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.రాయుడు హత్యలో నా ప్రమేయం లేదుశ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితిరుమల: రాయుడి హత్య వెనుక తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కోణంలో తనపై అబాంఢాలు వేస్తున్నారన్నారు. -
బది‘లీలలు’.. సర్వేయర్లకు కష్టాలు
● జిల్లాలోని 34 మంది సర్వేయర్లు చిత్తూరు జిల్లాకు బదిలీ ● జిల్లాలో ఖాళీ లేకపోవడంతోనే చిత్తూరుకు పంపినట్లు వెల్లడి ● జిల్లాలో 117 సర్వేయర్ పోస్టులు ఖాళీ ● ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న సర్వేయర్లు తిరుపతి అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా అధికారులు వ్యవహరించారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ సచివాలయంలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు నెల రోజులుగా గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని పలువురు మండిపడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కూటమి నేతల సిఫార్సు మేరకు బదిలీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బదిలీల్లో చోటుచేసుకున్న అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా.. వారు సీరియస్గా తీసుకోకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 34 మంది సర్వేయర్లు చిత్తూరు జిల్లాకు బదిలీ సర్వేయర్ల బదిలీలకు సంబంధించి 34 మంది సచివాలయ సర్వేయర్లను చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు. దీంతో ఆ సర్వేయర్లు గురువారం కలెక్టరేట్లోని సర్వే విభాగం జిల్లా అధికారి అరుణ్కుమార్ను ఒక్కొక్కరుగా కలిసి.. వారి ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర సమస్యలను వెల్లడించారు. తమకు జిల్లాలోనే అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఆయన మీచ్చువల్ బదిలీలు ఉంటే చూడండి చేద్దామని చెప్పడంతో వారంతా ఆ దిశగా ఆన్వేషణ చేస్తున్నారు. ఎవరైనా తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్ చిత్తూరు జిల్లాకు వెళ్లడానికి సుముఖంగా ఉంటే.. చిత్తూరు జిల్లాలోని మీ స్థానంలోకి వారిని పంపించి.. వారి స్థానంలోకి అవకాశం కల్పిస్తామని చెప్పడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 117 మంది సర్వేయర్లు కొరత జిల్లాలోని సచివాలయాల్లో 491 మంది సచివాలయ సర్వేయర్ల ఉద్యోగాలు గతంలో మంజూరు చేశారు. అయితే 386 మంది పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. అందులోను 12 మంది సర్వేయర్లుకు మరో విభాగంలో కొత్తగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. దీంతో మొత్తంగా 374 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో జిల్లాలో 117 మంది సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా ఖాళీలు లేవంటూ చిత్తూరు జిల్లాకు 34 మందిని బదిలీ చేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.మ్యూచువల్ ఉంటే మార్పు చేస్తాం సర్వేయర్ల బదిలీలకు సంబంధించి తిరుపతి జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు మ్యూచ్చువల్ ఉంటే తప్పకుండా బదిలీ చేస్తాం.. లేదంటే స్పష్టమైన ఆధారాలతో ఆనారోగ్య సమస్యలు ఉంటే మార్పు చేస్తాం. జిల్లాలో గతంలో 491 సచివాలయ సర్వేయర్ పోస్టులు మంజూరు చేశారు. అయితే 391 మంది మాత్రమే గతం నుంచి పనిచేస్తున్నారు. ఆ తర్వాత మరో 12 మంది నుంచి 14 మంది ఇతర ఉద్యోగాలు రావడంతోనే వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా కన్నా చిత్తూరు జిల్లాలోనే అధికంగా సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో చిత్తూరుకు కొందర్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్విహంచిన సర్వేయర్ల కౌన్సెలింగ్లో పోస్టింగ్ ఇచ్చారు. –అరుణ్కుమార్, జిల్లా సర్వే విభాగం అధికారి -
ప్రధానోపాధ్యాయులకు ముగిసిన శిక్షణ
తిరుపతి రూరల్ : మండలంలోని కేసీపేట పరిధిలోని మెడ్జీ స్కూల్ ఆవరణలో లీడర్షిప్పై ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ గురువారంతో ముగిసింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న 916 మంది ప్రధానోపాధ్యాయులను మూడు బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. మొదటి విడత ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకరరావు, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శివశంకరయ్య, ఎంఈఓ భాస్కర్బాబు, ఏఎస్ఓ సారథి, ఏపీఓ సుధాకర్, మాస్టర్ ఫెసిలిటేటర్లు పాల్గొన్నారు. చైర్పర్సన్ల నియామకం చిత్తూరు అర్బన్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు– వయ్యాసి ఝాన్సీరాణి, గూడూరు – చిల్లకూరు నీరజ, పెనుమూరు– ఎర్రగుంట్ల కృష్ణమనాయుడు, రొంపిచెర్ల – కొండా సుజాత,సూళ్లూరుపేట – ఆకుతోట రమేష్, తిరుచానూరు – ఊరుబిండి మౌనిక, వాకాడు – మర్రి ప్రమీల, వెంకటగిరి – పునుగోటి విశ్వనాథ్, నాయుడుపేట – ఉయ్యాల ప్రవీణ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
కుటుంబ కలహాలకు అ‘బలి’
● భార్యాబిడ్డలను బావిలో తోసి చంపేశాడు! ● కుటుంబ కలహాలే కారణం అంటున్న స్థానికులు పాకాల: భార్యపై అనుమానం.. కుటుంబ కలహా లు.. హతుడికి మానసికరోగం.. వెరసి అబలతోపాటు ఇద్దరు చిన్నారులు బలైపోయారు. మద్దినాయనపల్లి పంచాయతీ పెద్దహరిజనవాడ గ్రామానికి చెందిన గిరి తన అక్క ఇంటి వద్ద ఉన్న భార్యాపిల్లలను తీసుకుని వస్తూ మార్గం మధ్యలోని తన తండ్రి వర్ధంతి సందర్భంగా సమాది వద్ద పూజలు చేశాడు. అనంతరం అదే దారిలోని బావిలో భార్యా బిడ్డలను తోసి హతమార్చాడు. గిరి తిరుపతిలో ఎలక్ట్రీషియన్ పని చేస్తుండగా అతడి భార్య హేమంతకుమారి(33) లీలామహ ల్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తోంది. వీరికి పెద్ద కుమార్తె తనుశ్రీ(10), రెండవ కుమార్తె తేజశ్రీ(6) పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గిరి కుటుంబంతో తిరుపతిలోనే జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల కిందట గిరి పులిచెర్ల మండలం ఈ–రామిరెడ్డిగారిపల్లిలోని తన అక్క గారి ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడే మూడు రోజులు గడిపాడు. గురువారం తన తండ్రి వర్దంతి సందర్భంగా తిరిగి తన స్వగ్రామమైన పెద్దహరిజనవాడకు బయలుదేరాడు. మార్గం మధ్య లోని తన తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో క లిసి పూజలు చేశాడు. ఆ తరువాత బయలు దేరి అదే మార్గంలోని కొత్త ఒడ్డిపల్లి గంగనబోయని బావి వద్ద కు వారిని తీసుకెళ్లి, భార్యాబిడ్డలను బావిలోకి తోసేశాడు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువా త తాను బావిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని నిందితుడు ఆత్మహత్యకు యత్నించే ముందు తన సోదరుడికి ఫోన్లో చెప్పడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే తల్లీబిడ్డలు మరణించారు. గిరిని వారు కాపాడి ఆస్ప త్రికి తరలించారు. కాగా రెండు మూడు రోజులుగా గిరి మానసిక పరిస్థితి బాగా లేదని అతడి సమీప బంధువులు చెబుతున్నారు. అలాగే కుటుంబ కలహాల కా రణంగానే వారిని హత్య చేశారని మృతుల బంధువు లు చెబుతున్నారు. బొమ్మల్లాంటి బిడ్డలను హతమార్చడానికి నీకు చేతులు ఎలా ఆడాయిరా నాయనా అని మృతుల బంధులు రోదనలు చూసిన వారి కంటతడి పెట్టిస్తున్నాయి. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం రేపు
● ఐఐటీలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ఏర్పేడు: మండలకేంద్రం సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో శనివారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్థన్రాజు ఐఐటీ ప్రాంగణంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ భవనాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన ముందస్తు భద్రతా చర్యలను గురించి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా జేసీ శుభం బన్సల్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
రేణిగుంట: సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీన తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోపా లు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పి శ్రీనివాసరావు, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, సీఐలు జయచంద్ర, మంజునాథరెడ్డి, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు. ఎన్ఎస్యూను సందర్శించిన మాడభూషి తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీని మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ప్రస్తుతం మహేంద్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా డీన్ మాడ భూషి శ్రీధర్ గురువారం సందర్శించారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, పలు విభాగాల అధ్యాపకులతో సమావేశమ య్యారు. సంస్కృత అధ్యయనం, బోధన, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూజీ, పీజీ కోర్సుల నిర్వహణపై ఆరా తీశారు. యోగా విభాగంలో విద్య నభ్యసిస్తున్న విద్యార్థుల ప్రతిభను ప్రత్యక్షంగా చూసి, అభినందించారు. సెంట్రల్ లైబ్రరీ, ల్యాబ్లను సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృత జ్ఞానాన్ని, ఆధునిక పరిజ్ఞానం, టెక్నాలజీతో సమన్వయం చేసి ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. ఆయనతో పాటు వర్సిటీ పీఆర్ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు, ఏపీఆర్ఓ డాక్టర్ కనకాల కుమార్, డాక్టర్ మాధవరావు, డాక్టర్ శేఖర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రపంచ మామిడి దినోత్సవానికి తరలిరండి తిరుపతి కల్చరల్: మామిడి రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రపంచ మామిడి దినోత్సవం కార్యక్రమానికి జిల్లాలోని రైతులందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని మామిడి రైతు సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ టి.జనార్దన్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రామానాయుడు పిలుపునిచ్చారు. గురువారం గంధమనేని శివయ్య భవన్లో వారు ప్రపంచ మామిడి దినోత్సవం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సీజన్లో మామిడి రైతుల చేతికి అందిన పంట అమ్ముకోవడానికి పడిన కష్టాలు అలివకానివన్నారు. -
బడగనపల్లిలో కూటమి నేతల దాష్టీకం..!
● వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులనిర్భంధం ● ప్రభుత్వ నిధులతో వేసిన దారి అడ్డగింత ● రాకపోకలు లేకుండా ఇనుప కంచె ఏర్పాటు సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో రాజకీయ కక్షలు అంతకంతకు పెరుగుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు భౌతిక దాడులకు తెగబడిన పచ్చమూకలు నేడు గృహ నిర్భందాలకు పాల్పడుతున్నాయి. కూటమి పార్టీలకు చెందిన వారు వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గృహ నిర్బంధం చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పంచాయతీ నిధులతో గ్రామంలో వేసిన దారికి అడ్డుగా ఇనుప కంచెలను ఏర్పాటుచేసి రాకపోకలు లేకుండా చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో గత రెండు రోజులుగా ఓ కుటుంబం ఇంటి నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతోంది. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లి పంచాయతీ బడగనపల్లి గ్రామంలో నివాసముంటున్న వెంకటరమణ, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు భువనసాయి, కుమార్తె మనీషాతో కలసి అదే గ్రామంలో నివాసముంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉంటున్న వెంకటరమణ కుటుంబంపై వారికి సమీప బంధువులైన చరణ్కుమార్, మంజుల, రాజేశ్వరమ్మ (జనసేన పార్టీకి చెందిన వారు) కక్ష కట్టారు. వెంకటరమణ పట్టా భూముల్లో చరణ్కుమార్ భూములకు వెళ్లడానికి దారి ఏర్పాటుకు ప్రయత్నించారు. తన పట్టా భూముల్లో దారి వేయడానికి వెంకటరమణ అంగీకరించలేదు. దీంతో గ్రామంలోని అతని ఇంటికి రాకపోకలు లేకుండా పంచాయతీ నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్డుపై ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అంతేకాక వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులైన వెంకటరమణ కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికి ఇదే అదనుగా భావించిన గ్రామంలోని కొంతమంది టీడీపీ వర్గీయులు సైతం చరణ్కుమార్ కుటుంబీకులకు అండగా నిలిచారు. దీంతో వెంకటరమణ కుటుంబీకులు గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా, కనీసం పశువులకు వైద్యం చేయించుకోవాలన్నా దారి లేకపోవడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని మండలస్థాయి అధికారులకు తెలియపరచినప్పటికీ వారు స్పందించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి ఆ కుటుంబానికి బయటకు వచ్చే అవకాశం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
● బాలింతలకు కరువైన కేంద్ర ఆర్థికసాయం ● లెక్కలోకి రాని వేలాది మంది తల్లులు ● ప్రైవేటు ఆస్పత్రుల్లో కనిపించని దరఖాస్తులు ● సిబ్బంది కొరత, ప్రచార లోపమే కారణమా?
అమ్మతనం ఓ వరం.. ప్రసవం మహిళకు పునర్జన్మతో సమానం.. అయితే కూటమి సర్కారుకు పచ్చిబాలింతలన్న మానవత్వం, దయ, జాలి, కనికరం లేకపోయింది. తల్లీబిడ్డకు కేంద్రం అమలు చేసిన జననీ సురక్ష యోజన కింద ఇచ్చే ప్రోత్సాహకానికి తూట్లు పొడుస్తోంది. కేంద్రం వరమిచ్చినా.. రాష్ట్రానికి చేతులు రావడం లేదు. నిబంధనలు మార్చి..నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శించి..కనికరం లేకుండా ప్రవరిస్తోంది. జననీ సురక్ష యోజన పథకాన్ని జననీ నిర్ధయ యోజనగా మార్చింది. జననీ సురక్ష యోజన పల్లెల్లో పడకేసింది.. అమ్మలకు రక్షణ లేకుండా పోయింది. ఇందులో సాయం పేద కుటుంబాలకు మహిళలకు అందడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకున్న వారు లెక్కల్లోకి రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం అక్కడకు వెళ్లే వారి వివరాలును యాప్లోకి నమోదు చేయడానికి ప్రత్యేకించి సిబ్బంది లేకపోవడమేనని తెలుస్తోంది. ఈ పథకం అమలు తీరులో అస్పష్టతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు పలుమార్లు ఆస్పత్రులకు తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించడంలో అంగన్వాడీ కార్యకర్తలు, పారా మెడికల్ సిబ్బందిదే కీలక పాత్ర ఉంటుంది. జననీ సురక్ష యోజన నిధులకు సంబంధించి గర్భిణులు, బాలింతల వివరాలను నమోదు చేయడంలో అవాంతరాలు చోటు చేసుకోవడం, పలు చోట్ల లబ్ధిదారు వివరాలు నమోదు చేసినా నగదు జమ కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదు. తిరుపతి రూరల్: కూటమి ప్రభుత్వం బాలింతలపై అలసత్వం ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే జననీ సురక్ష యోజన సాయాన్ని కూడా లబ్ధిదారులకు చేర్చడంలో విఫలమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలింతలకు అందించాల్సిన చేయూత గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో బాలింతల వివరాలు నమోదు చేయడానికి తగినంత సిబ్బంది లేకపోవడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవించిన వారి వివరాలు యాప్లో నమోదు కాకపోవడంతోనే బాలింతలకు కేంద్రం అందించే సాయం అందకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మూడు విడతలుగా రూ.6 వేలు ఒక మహిళకు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కొంత కాలం వరకు మూడు పర్యాయాలుగా రూ.6 వేలు అందుతుండేది. గర్భ నిర్ధారణ అనంతరం తొలిగా రూ.వెయ్యి, ప్రసవ సమయంలో రూ.2,500, అనంతరం టీకాలు వేసే సమయంలో మిగిలిన రూ.2,500 ఇచ్చేవారు. తొలి, మలి ప్రసవాలకు ఈ ప్రోత్సాహక మొత్తాలను అందించేవారు. తెల్లరేషన్ కార్డు దారులైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పు చేసుకున్నా సరే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునే వారికి పథకాన్ని వర్తింప చేయడం లేదన్న వాదనలు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరత.. ప్రచారలోపం బాలింతలకు అందాల్సిన కేంద్ర సాయం అందకపోవడానికి సిబ్బంది కొరత, ప్రచార లోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని కేంద్ర సాయాన్ని పేదలకు అందేలా చూడాల్సినప్పటికీ ఆ దిశగా దృష్టి పెట్టకపోవడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకున్న రేషన్ కార్డుదారులకు వర్తింపజేయకపోవడంతో వేలాది మంది బాలింతలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన తల్లుల వివరాలు మాత్రమే ప్రభుత్వ యాప్లో నమోదు చేయడం, వారికి మాత్రమే బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా డబ్బులు జమ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాణభయంతో ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే తెల్లరేషన్ కార్డుదారులకు కూడా ఈ పథకం వర్తింప చేయాలని పలువురు కోరుతున్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాలే లక్ష్యం మాతా శిశు మరణాలను తగ్గించాలనే సదుద్దేశంతో కేంద్రం అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన పథకాన్ని ప్రధానమంత్రి మాతృ వందన యోజనతో జత కలిపారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలో రూ.5 వేలు, జననీ సురక్ష యోజనలో మరో రూ.వెయ్యితో కలిపి మొత్తం రూ.6 వేలు లబ్ధిదారుకు అందజేస్తున్నారు. ఈ పథకంతో నివాసాల్లో జరిగే కాన్పులను పూర్తిగా నిర్మూలించి, ఆస్పత్రుల్లో మాత్రమే ప్రసవాలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అలా చేయడంతో వైద్యుల పర్యవేక్షణతో తల్లీబిడ్డ, క్షేమంగా ఉంటారనే సంకల్పంతో ఈ పథకాన్ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వంలో జననీ సురక్ష యోజన పథకం ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారు. గర్భిణులకు ఆస్పత్రుల్లో ఉచితంగా రక్త పరీక్షలు చేయడం, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వీరికి చికిత్సలు అందించారు. గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవించే వరకు ఎప్పుడు రక్తం అవసరమైనా ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఎక్కించేవారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలోనే సాధారణ ప్రసవం, లేదా సిజేరియన్ చేసి, ఉచితంగా మందులు కూడా అందించేవారు. ఆస్పత్రి నుంచి బాలింత డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమెను ఇంటికి 108 వాహనంలో తీసుకువెళ్లి వదిలిపెట్టేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపకరిస్తుంది. అయితే కూటమి సర్కారు దీనికి పూర్తి భిన్నంగా అమలు చేయడంతోపాటు కేంద్రం అందించే సాయాన్ని కూడా అందించలేని పరిస్థితికి తీసుకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది గడిచినా డబ్బులు రాలేదునేను ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం చేసుకున్నాను. నాకు తెల్లరేషన్ కార్డు కూడా ఉంది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు నా దగ్గర వివరాలన్నీ తీసుకుని ప్రభుత్వానికి పంపించామన్నారు. నా ప్రసవం జరిగి ఏడాదికిపైగా గడుస్తోంది. ఇప్పటివరకు జననీ సురక్ష యోజన పథకం కింద డబ్బులు రాలేదు. అదేమని అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే నేరుగా బ్యాంకు అకౌంట్కే పడుతుందంటున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. –శాంతి, అనుప్పల్లి, రామచంద్రాపురం మండలంగత ప్రభుత్వంలో ఎలా అమలు చేశారంటే.. -
అయ్యో.. అన్నంత పనీ చేసేశారు..!
● ఏఎన్ఎం అన్నపూర్ణ రామకుప్పంకు బదిలీ ● ఆ ఏఎన్ఎంపై ఎమ్మెల్యే నానికి ఎందుకంత కక్ష ? ● నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన డీఎంహెచ్ఓ సాక్షి, టాస్క్ఫోర్స్: అయ్యో.. అన్నంత పనీ చేసేశారు.. అందరికీ ఆరోగ్య సేవలు అందించే ఆ ఏఎన్ఎంపై ఎందుకు పగబట్టారు..? ఆమె చేసిన తప్పు ఏమిటో చెప్పలేదు..? ఆ విషయంలో జిల్లా అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేదు.. ఏదైతేనేం.. వారు అనుకున్నట్టుగానే ఆ ఏఎన్ఎంను కుప్పం నియోజకవర్గంలోని రా మకుప్పంకు బదిలీ చేసేశారు. చంద్రగిరి మండలం మిట్టపాళెం గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా విధు లు నిర్వహిస్తున్న గట్టు అన్నపూర్ణ పదిమందికీ వైద్య సేవలు అందిచడంలో చాలా చురుగ్గా పనిచేస్తుంటా రు. ఆమె భర్త మైకేల్ ఆర్టీసీలో ఉద్యోగి. వీరిద్దరూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడంతో స్థానిక ఎ మ్మెల్యే పులివర్తి నాని పగబట్టారు. ఇటీవల జరిగిన ఏఎన్ఎంల బదిలీల్లో అన్నపూర్ణను చంద్రగిరి మండ లం నుంచి కుప్పం నియోజకవర్గానికి బదిలీ చేయా లని డీఎంహెచ్ఓ సుధారాణిపై ఒత్తిడి తెచ్చారు. అయి తే ఏఎన్ఎంల బదిలీ ఉత్తర్వులు ప్రకారం ఆమెను అంత దూరం బదిలీ చేయడానికి అవకాశం లేదన్న విషయాన్ని ఎమ్మెల్యే నానికి డీఎంహెచ్ఓ సుధారాణి తెలియపరిచినప్పటికీ పరిపాలనా సౌలభ్యం కింద ఆమె ను కుప్పంకు బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. అదే విషయాన్ని డీఎంహెచ్ఓ ఏఎన్ఎం అన్నపూర్ణను పిలిచి చెప్పడంతో పాటు ఎమ్మెల్యే నానిని కలసి ఆయన వద్దనుంచి వద్దని చెప్పిస్తే తప్ప తాను ఏమీ చేయలేనని కూడా వివరించారు. ఎమ్మెల్యే నాని ఏఎన్ఎం బదిలీకి లక్ష రూపాయలు అడిగితే ఇవ్వనందుకు తనపై కక్ష కట్టి కుప్పానికి బదిలీ చేయమన్నారని ఏఎన్ఎం అన్నపూర్ణ గత నాలుగు రోజుల క్రితం మీడియాకు వివరించారు. దీంతో ఆమైపె మరింత కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే నాని జనసంచారం తక్కువగా ఉండే అటవీ ప్రాంతానికి బదిలీ చేయాలని డీఎంహెచ్ఓకు మరోసారి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. చివరకు జిల్లా అధికారులు ఏఎన్ఎం అన్నపూర్ణను తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నుంచి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరు (అటవీ ప్రాంతం)కు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏఎన్ఎం అన్నపూర్ణపై కక్ష కట్టిన ఎమ్మెల్యే నాని తన పంతం నెగ్గించుకోవడం పట్ల ఉద్యోగసంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహిళా ఉద్యోగిపై అంత కక్ష ఎందుకో..? ఒక మహిళా ఉద్యోగిని పట్ల ఎమ్మెల్యే నాని కక్ష కట్టడంపై స్థానికంగా మహిళా ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న అన్నపూర్ణ పట్ల ఎమ్మెల్యే నాని, జిల్లా అధికారులు అనుసరించిన తీరు సరిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఎంల బదిలీల్లో అడ్డగోలుగా వ్యవహరించారనడానికి చంద్రగిరి మండలంలో పనిచేసే పలువురు ఏఎన్ఎంలకు అదే మండలంలో పోస్టింగ్లు ఇవ్వడమే నిదర్శనమని అన్నపూర్ణ భర్త మైఖేల్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో మెరిసిన తిరునగరి
● రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్ తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికైంది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్తో కలసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య అవార్డును అందుకున్నారు. మూడు లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగర నగరపా లక సంస్థ సూపర్ స్వచ్ఛలీగ్ను కై వశం చేసుకుంది. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛభారత్ విప్లవం కొనసాగుతోంది. ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సి పాలిటీలు, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడంపై మేయర్, కమిషనర్తోపాటు పలువురు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సి బ్బంది హర్షం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది, నగర ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామన్నారు. -
సంజాయిషీ ఇవ్వకపోతే విధుల నుంచి తొలగిస్తాం
తిరుపతిసిటీ: శ్రీకాళహస్తి మండలంలో వ్యా యామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ బాలకృష్ణ 2023 జనవరి 24వ తేదీ నుంచి నేటి వరకు విధులకు హాజరు కాకుండా అనుమతి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని డీఈఓ కేవీఎస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విధుల గైర్హాజరుపై ఎంఈఓ ద్వారా తాఖీదు నోటీసు లు పోస్ట్ ద్వారా పంపామని తెలిపారు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ నోటీసులను స్వీకరించకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల్లోపు నోటీసులు స్వీకరించి, ఎంఈఓ కార్యాలయంలో హాజరై సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో విధుల నుంచి శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో ఇద్దరికి డెంగీ సత్యవేడు: మండలంలోని ఏఎంపురంలో డెంగీ జ్వర పీడితుల సంఖ్య నాలుగుకు చేరడంతో రెండో రోజు దాసుకుప్పం వైద్యశాల సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. బుధవారం ఇద్దరికి డెంగీ సోకిన విషయం తెలిసిందే. కాగా గురువారం మరో రెండు కేసులు వెలుగు చూ శాయి. దీంతో సర్పంచ్ శిరీష ఆధ్వర్యంలో మలేరియా ఆఫీసర్ రూప్కుమార్, సబ్ యూ నిట్ అధికారి మోహన్, డాక్టర్ క్రిస్టల్దాస్, ఎంపీహెచ్ఈఓ గ్రామంలో పర్యటించి డెంగీ వ్యా ధిపై అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మలాఽథిన్ పిచికారీ చేశారు. డెంగీ జ్వర పీడితులు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తె లిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ దా మోదర్ రెడ్డి, మునస్వామ యాదవ్, సాయికుమార్, ఢిల్లీబాబుయాదవ్ పాల్గొన్నారు. 19 నుంచి మూడు రోజులు తపాలా సేవలు నిలిపివేత తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి డివిజన్ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాల్లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ప్రజలకు సంబంధించిన అన్ని లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ మేనేజర్ సయ్యద్ తన్వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతిక ను జోడించి పోస్టల్ సేవా కార్యాకలాపాలను మరింత మెరుగైన, వేగవంతమైన, సురక్షితంగా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏపీటీ అప్లికేషన్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. డేటా మైగ్రేషన్, వ్యవస్థ ధ్రువీకరణలు, కాన్ఫిగరేషన్ ప్రక్రియలను సజావుగా నిర్వహించేందుకు తాత్కాలికంగా సేవలను రద్దు చేస్తున్నామని, తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి మెరుగుపరిచిన వ్యవస్థతో సేవా కార్యక్రమాలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు దీనిని గుర్తించి తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 31 వరకే హాస్టల్ అడ్మిషన్లు తిరుపతి అర్బన్: జిల్లాలోని బీసీ హా స్టల్స్లో ఈ నెల 31 వరకు మాత్రమే అ డ్మిషన్లు ఉంటాయని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నుంచి మాట్లాడుతూ హాస్టళ్లలో చేరడానికి ఆసక్తి ఉన్నవారు మీ పరిధిలోని బీసీ హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 65 బీసీ హాస్టళ్లు ఉన్నా యని చెప్పారు. కొత్తగా చేర్చుకున్న విద్యార్థులతో కలిపి, ఇప్పటివరకు పాఠశాల, కళాశాల పరిధిలో 5,060 మంది విద్యార్థులున్నారని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. నిత్యం హాస్టళ్లపై నిఘా పెట్టా మని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన జిల్లాలోని అన్ని హాస్టళ్లలో విద్యార్థులతో వార్డె న్లు సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో విద్యార్థులు తాము ఉన్న హాస్టల్లో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకుపోతే వాటికి పరిష్కారం చూపించే దిశగా చర్యలు ఉంటాయని చెప్పారు. సర్వ దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 75,104 మంది స్వామివారిని దర్శించుకోగా 31,896 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
అడ్మిషన్ల లెక్క తప్పింది!
పాఠశాల విద్యపై కూటమి సర్కారు శీతకన్ను.. విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం.. పాఠ్యాంశ నిపుణుల కొరత.. ప్రత్యేక తరగతుల లేమి.. అందని స్టడీ మెటీరియల్.. వెరసి ఊహించని రీతిలో తల్లకిందులైన పది ఫలితాలు.. తారుమారైన ఇంటర్ అడ్మిషన్లు.. ఫలితం అడ్మిషన్ల లెక్క తప్పి.. ఇంటర్ విద్యాశాఖారులు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ప్రత్యేక కథనం. ● ఇంటర్ అడ్మిషన్లపై పది ఫలితాల దెబ్బ ● పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన కూటమి సర్కారు ● పదిపై దృష్టి సారించక 8 శాతం తగ్గిన ఫలితాలు ● జిల్లాలో పడిపోయిన ఇంటర్ అడ్మిషన్లు తిరుపతి సిటీ: ఏడాదిగా ప్రాథమిక, ఉన్నతవిద్యపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుతం ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై పడింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తిరుపతి జిల్లాలో పదో తరగతి ఫలితాలు 8 శాతం పడిపోయాయి. గత ఏడాది 75 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది కేవలం 67.06 శాతానికి పరిమితమయ్యాయి. దీంతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు దారుణంగా పడిపోవడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఇంటర్ విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ కళాశాలలో కనీసం సింగిల్ డిజిట్ అడ్మిషన్లు సైతం లేని కళాశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అడ్మిషన్ల ప్రక్రియ గడువును పలుసార్లు పెంచుతున్నా మండల స్థాయిలోని హైస్కూల్ ప్లస్, మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు ఒక్కటంటే ఒకటి కూడా జరగకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం 2024–25 పదో తరగతి ఫలితాల దెబ్బేనని, ఇక ప్రవేశాలపై ఏమీ చేయలేమని అధికారులు నిర్మొహమాటంగా ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్టు సమాచారం. పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన కూటమి సర్కార్ తిరుపతి జిల్లాలోని 33 మండలాల్లో 323 ఉన్నత పాఠశాలలు ఉండగా 2024–25 సంవత్సరంలో పదో తగరతి పరీక్షలకు 26,875 మంది విద్యార్థులు హాజరు కాగా, ఉత్తీర్ణులైన వారి సంఖ్య 20 వేలకు మించకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలోని సుమారు 75 శాతం పాఠశాలల్లో గత ఏడాది పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపకుండా తూతూ మంత్రంగా పాఠ్యాంశాలు బోధించి వదిలేశారు. దీనికితోడు ఆశించిన రీతిలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించలేకపోయారు. అలాగే ప్రధాన సబ్జెక్టులకు నిపుణులైన ఉపాధ్యాయుల కొరత సైతం ఫలితాలపై ప్రభావం చూపింది. విద్యాశాఖకాధికారులు పది విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రభావం ఫలితాలపై చూపినట్లు విద్యావంతులు, నిపుణులు చర్చించుకుంటున్నారు. 4 వేల ప్రవేశాలపై ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలో నేటికీ సుమారు 4 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు విడతలోనూ 20 శాతం అడ్మిషన్లకు నోచుకోలేదు. అలాగే హైస్కూల్ ప్లస్, మోడల్, ఏపీఆర్జేసీ, ట్రైబల్, ఏపీఎస్డబ్ల్యూఆర్ కళాశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం 25 శాతం అడ్మిషన్లు జరగకపోవడంతో విద్యాశాఖాధికారులు మరోసారి ఈనెలాఖరు వరకు అడ్మిషన్ల గడువును పెంచాల్సి వచ్చింది. అయినా ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ కళాశాలలో సింగిల్ డిజిట్కు మించకపోవడం ఆశ్చర్యకరం. జిల్లాలో 109 ప్రైవేటు జూనియర్ కళాశాలు ఉండగా అందులో కేవలం 11 కళాశాలలో మాత్రమే ప్రవేశాలు 65 శాతం మేర జరిగాయి. మిగిలిన సాధారణ ప్రైవేటు కళాశాలలు మూత పడే పరిస్థితికి చేరుకుంటున్నాయి.ఇంటర్మీడియట్ కళాశాలల్లో గత ఏడాది కంటే తగ్గిన అడ్మిషన్లు 4వేలు 15 మంది కంటే తక్కువ అడ్మిషన్లు కలిగిన కళాశాలలు18సింగిల్ డిజిట్ అడ్మిషన్ల కళాశాలలు5జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలల వివరాలు 50 శాతం అడ్మిషన్లు పొందిన ప్రైవేటు కళాశాలలుప్రభుత్వ జూనియర్ కళాశాలలు 21 ప్రైవేటు కళాశాలలు 109 హైస్కూల్ ప్లస్ 29 మోడల్ స్కూళ్లు 5 ఏపీఆర్జేసీ 1 ఎయిడెడ్ 1 ఏపీఎస్డబ్ల్యూఆర్ 10 ట్రైబల్ వెల్ఫేర్ 3 ఎంజేపీఏఆర్బీసీడబ్ల్యూఆర్ 21525 శాతం కంటే తక్కువ ప్రవేశాలు పొందిన ప్రైవేటు కళాశాలలు79జిల్లా వివరాలు 2024–25లో పదోతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు – 26,875 ఉత్తీర్ణులై విద్యార్థులు – 20,597 ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం – 79 శాతం గత ఏడాది ఉత్తీర్ణత శాతం – 90.71 గత ఏడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం – 10 గత ఏడాదితో పోలిస్తే తగ్గిన ఉత్తీర్ణత శాతం – 10.88శాతం ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో పది ఫలితాల్లో జిల్లా స్థానం – 19 ఉత్తమ ఫలితాలు సాధిస్తాం గత ఏడాది కంటే 2025–26 సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. పదో తరగతిపై ప్రత్యే క శ్రద్ధ చూపుతున్నాం. ఉపాధ్యాయుల కొరతను నివారించి అన్ని పాఠ్యాంశాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. –కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి జిల్లానెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువు జిల్లాలోని జూనియర్ కళాశాలలో ప్రవేశాలు కాస్త మందకొడిగా ఉన్నాయి. దీంతో ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ల గడువును ప్రభుత్వం పెంచింది. విద్యార్థులు ప్రభుత్వం ఎంసెట్ వంటి పోటీపరీక్షల మెటీరియల్స్ను, పుస్తకాలను, నోట్బుక్స్ను అందిస్తోంది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరడం ఉత్తమం. తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి జిల్లా -
కాగితాలకే పరిమితం
జిల్లా సమాచారం సంక్షేమ పథకమేదైనా పటిష్టంగా లబ్ధిదారులకు చేర్చినపుడే ఆ పథకం లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. అది కాగితాలకే పరిమితమైతే ఆ తప్పు అధికారులదే అవుతుంది. జననీ సురక్ష పథకం స్థితి అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేయడంలో కూటమి పాలనలోని ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. పేద మహిళలకు ప్రసవాల సమయంలో ఊరటనివ్వలేకపోగా వారిని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేలా చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. 2024–2025 హెచ్ఎంఐఎస్ (హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లో నమోదైన ప్రసవాల సంఖ్య 13,655 లబ్ధి పొందిన బాలింతల సంఖ్య 13,069 -
‘మా అన్న చనిపోతే పవన్ కనీసం పలకరించలేదు’
తిరుపతి జిల్లా: తన అన్న హత్య చేసిన కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్ రాయుడు సోదరి కీర్తి. ఈరోజు(గురువారం జూలై 17) శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి.. తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు రక్షణ కల్పించాలి కోరాం. చిన్న చిన్న విషయాలకు పవన్ కల్యాణ్ స్పందిస్తారు, మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయినా మమ్మల్ని తీసుకువెళ్ళండి. హత్య జరిగిన తర్వాత మాకు రూ. 30 లక్షలు ఆఫర్ చేశారు. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలి. సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు..వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేసింది. కాగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు’ అని రాజేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది.‘అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ’ -
‘గాలిలో గెలిచిన గాలిగాడు.. కౌన్సిలర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడతున్నారని మండిపడ్డారు.గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికు వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారుసుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారింది. నువ్వు చేసిన అక్రమాలు బయటకు తీస్తా.. నీ అవినీతి బయటకు కక్కిస్తా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకున్నారు. తప్పుడు కేసులు కు భయపడం. మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. లక్ష 86 వేల కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేశారు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. -
'సీఎస్ఈ'కి.. సై
ఇంజినీరింగ్ అంటేనే సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ) అనేలా విద్యార్థులు ఎక్కువ మంది ఈ బ్రాంచ్పైనే మక్కువ చూపుతున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు డోకా ఉండదని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పేరు పొందిన కంపెనీల్లో జాబ్ కొడితే రూ.లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయనే ఆశతో సీఎస్ఈ బ్రాంచ్పై అందరి చూపు అటు వైపే నిలుస్తోంది. ఇదే అదునుగా ప్రైవేటు కళాశాలల్లో సీఎస్ఈ కోర్సు డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ సీట్ల పరిమితి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పెంచుకొని రూ.లక్షల్లో దండుకుంటున్నారు. ఇప్పటికే పేరుపొందిన కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయనే ప్రచారం విద్యార్థుల్లో నడుస్తోంది. తిరుపతి సిటీ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల హడావుడి ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడినా వెబ్ ఆప్షన్ల ఎంపికపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ ఈఏఎమ్సెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రెండు రోజుల నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో నెట్ సెంటర్లుకళకళలాడుతున్నాయి. సెట్లో మంచి ర్యాకులు సాధించిన 90 శాతం మంది విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్నే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ కోర్సును ఎంచుకుంటున్నారు. అయితే ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులపై కనీసం 10 శాతం మంది కూడా తొలి ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కా వచ్చేందుకు వీలుంటుందని విద్యా శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలు సొమ్ము చేసుకుంటూ.. సీఎస్ఈ కోర్సుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ను ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇదే అదునుగా రెచ్చిపోతూ ఫీజుల పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. అన్ని ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ విద్యా సంస్థలలో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లును పూర్తి స్థాయిలో ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఏఐసీటీఈ గత ఏడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ను ఎత్తి వేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి.కళాశాల స్థాయి, పేరు ప్రతిష్టల ఆధారంగా యాజమాన్యాలు ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసి కేవలం రూ.70 వేలకు రసీదులు ఇచ్చి పంపుతున్నారు. తిరిగి మాట్లాడితే విద్యార్థికి సీటు లేదంటూ వెనక్కి పంపుతారనే భయంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలో వారు అడిగినంతా ఫీజు చెల్లించి వెనుదిరుగుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏమీ చేయలేమని చేతులెత్తి కూర్చోవడం గమనార్హం. 20 వేల మందికి ఇదే కోర్సుకు ..ఇప్పుడంతా సీఎస్ఈ బ్రాంచ్ చుట్టూ తిరుగుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారంతో పాటు పేరొందిన కంపెనీలలో లక్షల ప్యాకేజీలతో మెట్రోపాలిటన్ సిటీలలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో ఆ గ్రూప్నకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. తిరుపతి జిల్లాలో సుమారు 25 వేల మంది వరకు ఏపీఈఏమ్సెట్ పరీక్షకు హాజరు కాగా ఇందులో 22,500 మంది అర్హత సాధించారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు సీఎస్ఈ బ్రాంచ్లోని పలు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారంటే డిమాండ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ కోర్సు చేయాలని.. ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లలో సీఎస్ఈ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్కు ప్రథ మ ప్రాధాన్యం ఇచ్చాను. ఏఐకి క్రేజ్తో పాటు భవిష్యత్తు ఉంది. కష్టపడి చదివితే మంచి ప్యాకేజ్తో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. ఏఐ కోర్సుకు ఎస్వీయూ పరిధిలో పేరొందిన కళాశాలలకు తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్నా. –ప్రవల్లిక, విద్యార్థిని, తిరుపతి డేటా సైన్స్, ఏఐ ఆప్షన్లు పెట్టాను ఏపీఈఏఎమ్సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. డేటా సైన్స్ లేదా ఏఐ చేయాలని ఉంది. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యం డేటా సైన్స్, రెండో ప్రాధాన్యం ఏఐకి ఇచ్చాను. కచ్చితంగా నేను అనుకున్న కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఫారిన్లో ఎమ్ఎస్ చేయాలని ఉంది. – పృధ్వి, విద్యార్థి, తిరుపతి పేదలకు దూరంగా అధునాతన కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులుగా వెలుగొందుతున్న సీఎస్ఈ బ్రాంచ్లోని ఏఐ, డేటా సైన్స్, ఎమ్ఎల్, ఎస్ఎస్ కోర్సులు పేద విద్యార్థులకు అందనంత దూరంలో నిలిచాయి. ఏపీఈఏమ్సెట్లో సీటు సాధించినా ప్రైవేటు కళాశాలలో సీటు దొరకడం కష్ట తరమవుతోంది. లక్షలలో ఫీజుల చెల్లించలేని పేద విద్యార్థులు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. సీఎస్ఈ కోర్సు కేవలం ధనవంతుల కోర్సుగా మిగిలిపోయిందని మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భద్రత ప్రశ్నార్థకం!
భరోసా..● నైపుణ్యం లేని కార్మికులతో భారీ యంత్రాల వద్ద పనులు ● రియాక్టర్లు, బాయిలర్ల వద్ద తరచూ ప్రమాదాలు ● అమలు కానీ కార్మిక చట్టాలు ● పట్టించుకోని అధికారులు, పాలకులు తమ కుటుంబ పోషణకు..సంస్థ పురోభివృద్ధికి కార్మికులు నిరంతరం పని చేస్తూ, స్వేదం చిందిస్తున్నారు. అయితే వారికి కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా.. అనారోగ్యం బారిన పడినా.. ప్రాణం పోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. వారి కుటుంబానికి అండగా నిలిచేవారు లేకుండా పోయారు. కార్మికులకు చేయూతనిచ్చే చట్టాలు అమలుకు నోచు కోకుండా పోయాయి. ఫలితంగా వారికి భరోసా.. భద్రత ప్రశ్నార్థకంగా మారింది.స్టీల్ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న పొగ పెళ్లకూరు : పొట్టకూటి కోసం రాష్ట్రాలను దాటి వలస వచ్చిన కార్మికులు పలు పరిశ్రమల్లో ప్రమాదకరమైన యంత్రాల వద్ద పనులు చేస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు, పాలకులు మాత్రం తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని పెన్నేపల్లి, శిరసనంబేడు గ్రామాల్లో పలు స్టీల్ పరిశ్రమలున్నాయి. ఆయా పరిశ్రమల్లో ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల కార్మికులతో భారీ యంత్రాల వద్ద పనులు చేయిస్తున్నారు. పెన్నేపల్లిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో జనవరి ఒకటో తేదీన జరిగిన భారీ విస్పోటనంలో ముగ్గురు వలస కార్మికులు మృత్యువాత పడగా మరో నలుగురికి గాయాలయ్యాయి. జూన్ 26న జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి మాటున కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కంపెనీ యాజామాన్యానికి కల్పిస్తున్న అవకాశాలు, ప్రమాదాలు పెరగడానికి ఒక కారణంగా మారింది. మండలంలోని స్టీల్ పరిశ్రమల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ప్రమాదకరమైన, భారీ యంత్రాల వద్ద పనులు చేస్తున్నారు. వాటి వద్ద పని చేసే వలస కార్మికులకు కనీస అవగాహన, నైపుణ్యం లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. నిరంతరం నడుస్తున్న భారీ యంత్రాలు అధిక రాపిడికి గురై విస్పోటనం చెందే పరిస్థితిని ముందుగానే పసిగట్టే టెక్నాలజీ లేకపోవడంతో ఇక్కడ కార్మికులు ప్రమాదాల బారిన పడడానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రాణాలు పోతున్నా పట్టించుకొనేవారు లేరు వలస వచ్చిన కార్మికులు ప్రమాదకరమైన యంత్రాల వద్ద పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నా స్థానికంగా పట్టించుకునేవారు కరువయ్యారు. పరిశ్రమల్లో జరుగుతున్న అనేక ప్రమాదాల్లో సమాచారం బయటకు పొక్కకుండా దాచేసే ఘటనలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నా రు. ఈ క్రమంలోనే పరిశ్రమను తనిఖీ చేసేందుకు వచ్చే అధికారులతో లోపాయికారి ఒప్పందాలు, రహస్య మంతనాలు చేసుకుంటూ మీడియా ప్రతినిధులను పరిశ్రమ గేటు దాటనీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపయడం విశేషం. జనవరి ఒకటో తేదీన భారీ విస్పోటనం జరిగిన పెన్నేపల్లి స్టీల్ పరిశ్రమ వద్దకు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకుని పరిశీలించారు. అయితే కంపెనీ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో జూన్ మాసంలో మరో ప్రమాదం జరిగి మరొకరు మృత్యువాత పడ్డారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలు ఎవరికీ పట్టడం లేదు. కార్మికుల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలు పరిశ్రమ శాఖలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పరిశ్రమలను క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ, ప్రమాదాల జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కార్మిక చట్టాలను ఉల్లంఘించే కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు యాజమాన్యంతో కుమ్మకై ్క మాముళ్లకు అలవాటు పడినట్లు తెలుస్తుంది. కార్మిక చట్టాల ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వైకుంఠం క్యూకాంప్లెక్స్లో జారిపడిన భక్తుడు
తిరుమల : శ్రీవారి సర్వదర్శనానికి వెళుతున్న మానసిక స్థితి సరిగా లేని ఓ భక్తుడు బుధవారం తెల్లవారుజామున వైకుంఠం క్యూకాంప్లెక్స్ –1లో గేటు ఎక్కి దూకే క్రమంలో జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. తిరుమల వన్ టౌన్ ఏఎస్ఐ మోహన్ నాయుడు కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రం బడాంపూర్కు చెందిన ఎల్లయ్య రెడ్డి(50) నలుగురు స్నేహితులతో కలిసి ఈనెల 15వ తేదీ తిరుమలకు చేరుకుని, సుదర్శన్లో గదిని పొందిన అనంతరం సర్వదర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్–1 సమీపంలో క్యూలో స్నేహితుల నుంచి విడిపోయిన ఎల్లయ్యరెడ్డి వారి వద్దకు చేరుకునే క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ రెండో అంతస్తుకు చేరుకునే క్రమంలో గేటు ఎక్కి దూకడానికి ప్రయత్నించి, జారి కిందపడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోగా ఎవరూ గుర్తించలేదు. బుధవారం ఉదయం గుర్తించిన తితిదే భద్రతా సిబ్బంది, పోలీసుల ద్వారా తీవ్రంగా గాయపడిన అతడిని తిరుపతిలోని స్విమ్స్ అస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అతని చేతులు, కాళ్లు విరిగిపోయి, తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే అతడితోపాటు వచ్చిన స్నేహితులను పోలీసులు విచారించగా అతడు మానసికంగా కొంత ఇబ్బందిపడుతున్నాడని ఈ క్రమంలో ఆందోళనకు గురై ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. దీనిపై తిరునుల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పంటలపై గజ దాడులు చంద్రగిరి: మండలంలోని చిన్నరామాపురం, భీమవరం గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలపై మంగళవారం అర్థరాత్రి సుమయంలో సుమారు 7 ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేశాయి. వరి పంటను తొక్కి వేశాయి. ఫెన్సింగ్ను ధ్వంసం చేశాయి. పశువులకు రైతులు వేసిన పశుగ్రాసాన్ని కూడా తొక్కేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాట్టిల్లింది. -
అధైర్యపడకండి.. ఆక్రమ కేసులను ఎదుర్కొందాం
● భాస్కర్ నా సొంత మనిషి ● చెవిరెడ్డి బిడ్డలకు జగనన్న భరోసా తిరుపతి రూరల్: ‘అక్రమ కేసులు పెట్టారు, జైలుకు పంపారని అధైర్య పడకండి.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం.. మీకు అండగా నేనున్నాను, భాస్కర్ నా సొంత మనిషి, ఈ దొంగ కేసులు ఏమీ చేయలేవు.’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చెవిరెడ్డి కుమారులకు భరోసా ఇచ్చారు. విజయవాడలోని తాడేపల్లి నివాసంలో చెవిరెడ్డి మో హిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు బుధవారం జగనన్నను కలిశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం, అదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిందితునిగా చేర్చడం వంటి అంశాలపై వైఎస్.జగన్మోహన్రెడ్డితో చర్చించారు. దీనిపై స్పందించిన జగనన్న మాట్లాడుతూ ధైర్యంగా ఉండండి, మనం న్యాయపరంగా పోరాడుదాం.. దేవుడు మనకు మంచే చేస్తాడు, మీకు నేను అండగా నిలబడతానని మనోధైర్యం కల్పించారు. జగనన్న మాటకు స్పందించిన చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డిలు మీరే మా ధైర్యం, మీ మాటే మాకు బలం, మీ పోరాటమే మాకు స్ఫూర్తి జగనన్న..అంటూ బదులివ్వడంతో జగనన్న వారి భుజం తట్టి చిరునవ్వులు చిందించారు. -
లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు
తిరుపతి మంగళం : లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి–కరకంబాడి మార్గంలో బుధవారం రవాణాశాఖ అధికారులు ద్విచక్రవాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు కోరిన బైక్లు కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ వారికి లైసెన్స్లు తీసి ఇవ్వడంలోనూ, రోడ్లపై ఎంత స్పీడు వెళుతున్నాడో, ఎంతమందిని ఎక్కించుకుని బైక్ నడుపుతున్నాడన్న అంశాలపై కూడా చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే ద్విచక్రవాహన తనిఖీల్లో లైసెన్స్లు లేకుండా, త్రిబుల్రైడ్ చేస్తూ, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హమన్నారు. విద్యార్థులు మొదటి సారి ఇలా పట్టుబడితే జరిమానా రసీదుతో అపరాధ రుసుము వసూలు చేస్తామని, రెండోసారి వాహన నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే న్యాయస్థానం ముందు హాజ రుపరచాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం 40 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేసి, వాహనచోదకుల నుంచి రూ.50 వేలు జరిమానా రూపంలో వసూలు చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, అధికానాజ్, సిబ్బంది పాల్గొన్నారు. -
● కబ్జాదారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి ● నారాయణవనం మండల బాధితులు వేడుకోలు
ఎమ్మెల్యే కొడుకు చెప్పాడంటూ భూ కబ్జా తిరుపతి కల్చరల్: ఎమ్మెల్యే ఆదిమూలం కొడుకు సుమన్ చెప్పాడంటూ కొందరు తమ భూమిని కబ్జా చేయడమేకాక ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నారాయణవనం మండలం, ఎరుకంబట్టు గ్రామానికి చెందిన బాధితులు పన్నీరు సెల్వం, వెంకటేషన్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణవనం మండలం, ఎరుకంబట్టు గ్రామ రెవెన్యూ లెక్కదాఖలా సర్వేనంబర్ 86/1లో 77 సెంట్లు, 88/2(86/2సి)లో ఎకరా 92సెంట్లు, 86/3లో 14 సెంట్లు మొత్తం 2.83 సెంట్లు భూమి తమ తాత చంద్రప్ప కృష్ణప్ప మొదలి పేరిట ఉందని, ఈ భూమి వారి వారసులమైన తాము ఐదుగురం అనుభవిస్తున్నామని తెలిపారు. సదరు భూమిని తాము భాగపరిష్కారం కోసం తిరుపతి 3వ అదనపు జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయడంతో కేసు నడుస్తోందన్నారు. అయితే ఈనెల 10వ తేదీన ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ చెప్పారంటూ మాజీ ఎంపీపీ గోవిందస్వామి, ఆయన కుమారుడు ముఖేష్ మరి కొందురు జేసీబీతో తమ భూమిలోకి ప్రవేశించి చెట్లు తొలగించి వ్యవసాయ బావిని కూడా పూడ్చి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తాము భూమి దగ్గరకు వెళ్లి వారిని అడ్డుకుని ప్రశ్నిస్తే వారు తమపై దౌర్జన్యం చేయడమేకాక భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. భూమికి సంబంధించిన పక్కా రికార్డులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పలుకుబడితో తమపై దౌర్జన్యానికి దిగుతూ తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రత్నిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పిలిచి భూమి పత్రాలు అడిగితే ఇప్పటి వరకు వారికి చూపలేదని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి రాజకీయ పలుకుబడితో తమ భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సి.రమేష్, సీపీ.దొరైరాజ్ పాల్గొన్నారు. -
19న పీ4 సర్వేపై సీఎం ముఖాముఖి
తిరుపతి రూరల్ : సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీన తిరుపతిలో పీ4 సర్వేపై ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం తన చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదల(బంగారు కుటుంబాలు)ను గుర్తించి ఆర్థికంగా వృద్ధి చెందిన (మార్గదర్శకులు) వారి ద్వారా సాయం చేయించడమే పీ4 సర్వే విధానమన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఇప్పటికే పీ4 సర్వే చాలా వరకు పూర్తయినందున పది శాతం మార్గదర్శకులు, 20 శాతం బంగారు కుటుంబాల వివరాలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. పీ4 సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీపీఓ సుశీలాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య మార్గదర్శకుల స్థానంలో వచ్చిన తాజ్ హోటల్, రాస్, అమరరాజా, రోటరీ క్లబ్, పాయ్ వైస్రాయ్ హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు ఐఐటీలో కామన్ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం
ఏర్పేడు: మండల కేంద్రంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో గురువారం రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటైన కామన్ ఇంకుబేషన్ సెంటర్ను కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రమంత్రి టీజీ భరత్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తొలుత వీరు పర్యటన ఖరారైనప్పటికీ అనివార్య కారణాలతో ఢిల్లీ నుంచే కేంద్రమంత్రి వర్చువల్ విధానంలో ఈ యూనిట్ను ప్రారంభించనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.2,059 కోట్ల వ్యయంతో 76 కేంద్రాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ఈ యూనిట్ను ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభించనున్నారు. ఇక్కడ పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ద్వారా రోజుకు 20 టన్నుల మేరకు మామిడి, టమాట, అంజీర్, జామ తదితర పండ్లను ప్రాసెసింగ్ చేసి జ్యూస్, జామ్, పికిల్స్ వంటి ఉత్పత్తులు స్వస్త్ర బ్రాండ్తో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. -
ఘాట్రోడ్డులో రోడ్డు ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరుకు చెందిన భక్తులు కారులో అధికవేగంగా వెళుతుండగా వినాయక స్వామి ఆలయం వద్ద కారు అదుపుతప్పి చెట్టు ఢీకొంది. ఈ ప్రమా దంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా.. అందులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న ఘాట్ రోడ్డు సిబ్బంది వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. -
నిమ్మ ధరలు పతనం
● చెట్లు నరికివేస్తున్న రైతులు ● ధరలు తగ్గడంతో సాగు కష్టంగా మారిందంటున్న రైతులుధరలు తగ్గుముఖం పట్టాయి నిమ్మ కాయలకు ఢిల్లీ మార్కెట్లో ధరలు లేకపోవడంతో ఇక్కడ కూడా ధరలు తగ్గించేస్తున్నారు. మూడు డిక్కీలు(150 కిలోలు) నిమ్మ కాయలు కోసుకుని మార్కెట్కు వస్తే ఖర్చు రూ.700 అయ్యింది. మార్కెట్లో నిమ్మ కా యలు విక్రయిస్తే రూ.1,600 వచ్చింది. ఖ ర్చులు పోనూ ఇక మిగిలేది ఏముంది? ఇలా అయితే నిమ్మ సాగుకు అవసరమైన పురుగు మందులు కొనుగోలు ఎలా చేయగలం.. కు టుంబాలను ఎలా పోషించుకోగలం? – చిల్లకూరు వేమయ్య, చిల్లకూరు, తిరుపతి జిల్లా కాయలు తోటలోనే వదిలేస్తున్నా పది ఎకరాల్లో నిమ్మ సాగుచేస్తున్నాను. ప్రస్తు తం కాపు బాగానే ఉన్నా మార్కెట్లో ధరలు లేకుండా పోయాయి. దీంతో అటు గూడూరుకు గానీ, ఇటు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మార్కెట్కు గానీ కాయలు కోసి లోడ్ ఎత్తుకుని పోతే అక్కడ ధరలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలికింది. ఇప్పడు కిలో రూ.5 నుంచి రూ.20 పలుకుతోంది. దీంతో ఖర్చులు కూడా రావని కాయలు తోటలోనే అలాగే వదిలేస్తున్నా. – దామోదరరాజు, రాజుల ఎరుగుంటపాళెం, సైదాపురం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాచిల్లకూరు: మొన్న వరి, పొగాకు, పసుపు, రొయ్యలు, మామిడి, ఇప్పడు నిమ్మ ఇలా రైతులు ఏ పంట పండించినా వాటికి గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అవుతోంది. దీంతో రైతుల పంట సాగు చేసేందుకు సతమతమవుతున్నారు. కూటమి ప్ర భుత్వం రైతులకు అండగా ఉంటామని చెబుతూ కాలయాపన చేస్తోంది. దీంతో దిగుబడులకు మద్దతు ధర లు లేక రైతులు డీలా పడుతున్నారు. మొన్నటికి మొన్న తోతాపురి మామిడి కాయలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో చిత్తూరు జిల్లాలో రైతులు రోడ్డుపై కాయలను పారబోసి, ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చే శారు. అలాంటి స్థితి నేడు తిరుపతి జిల్లాలోని నిమ్మ రైతుల్లో నెలకొంది. నెల రోజులుగా దిగుబడులు బాగా నే వస్తున్నప్పటికీ ఎగుమతులు లేకపోవడంతో ధరలు అమాంతం పడి పోయాయి. గత ఏడాది ఇదే సీజన్లో కిలో నిమ్మ కాయలు రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. నేడు ఆ ధర పదింతలు దిగజారి పోయి రూ.5 నుంచి రూ.25 పలుకుతోంది. దీంతో రైతులు తమ తోటల్లో కాసిన నిమ్మ కాయలను కోసి మార్కెట్కు తరలించలేకపోతున్నారు. అలాగే మార్కెట్ నుంచి కూడా ఢిల్లీ ప్రాంతంలోకి ఎగుమతులు నిలిచిపోయాయి. వాతావరణంలో మార్పులు ఎండలు విపరీతంగా ఉండాల్సిన సమయంలో అప్పుడప్పుడు వర్షాలు పడడంతో నిమ్మ చెట్టుకు బలం వ చ్చింది. దీంతో పూత పూసి కాపునకు వచ్చింది. అయితే వర్షాలు పూర్తిగా నిలిచిపోయి ఎండలు ముదిరి పోవడంతో పూత రాలిపోవడం మొదలు పెట్టింది. దీనిని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తీరా పూత నిలిచి కాయలు కాసే స మయానికి నాణ్యత దెబ్బతినింది. ఈ కారణంతో ఢిల్లీ కి ఎగుమతులు ఇటీవల కాలంలో పూర్తిగా నిలిచిపోయింది. ఎగుమతులు లేక పోవడంతో మార్కెట్ లోని వ్యాపారులు ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎగుమతులు జరిగే ప్రాంతాలివే.. నిమ్మ మార్కెట్ బాగా ఉండే సమయంలో గుజరా త్, పూణే, ముంబయి, బెంగళూరు, చైన్నె, కోల్క తా, సూరత్, ఢిల్లీ మార్కెట్లకు ప్రతిరోజూ కనీసం రెండు లారీలు(ఒక లారీ 22 టన్నులు) ఎగుమతులు జరిగేవి. నేడు ధరలు లేక రైతులు మార్కెట్కు కాయలు తీసుకుని వచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు. ధరలు లేక నరికేస్తున్న నిమ్మ చెట్లు తిరుపతి జిల్లాలో నిమ్మ పరిశోధన స్థానం ఉన్నప్పటికీ వారు చేసే పరిశోధనలతో కొత్త వంగడా లను సృష్టించి రైతులకు అందిస్తున్నారు. ఇవి దిగుబడి బాగా ఇస్తున్నప్పటికీ వాటికి మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అవుతోంది. దీంతో తిరుపతి జిల్లాలో నిమ్మ సాగు చే పట్టే గూడూరు, ఓజిలి, చిల్లకూరు మండలాలతో పాటు సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లా సైదాపు రం మండలంలోనూ సాగు చేపట్టిన నిమ్మ చెట్లను కొంతమంది రైతులు నరికివేసి భూములు చదు ను చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో నిమ్మ సాగు విస్తీర్ణం 15 వేల హెక్టార్లు ప్రతిరోజూ దిగుబడి సుమారు 400 టన్నులు ప్రతిరోజూ గూడూరు మార్కెట్ నుంచి ఎగుమతి 308 టన్నులుకొనుగోలు చేయని సిట్రస్ పరిశ్రమలు తిరుపతి జిల్లాలో నిమ్మరసం తీసి విక్రయించుకు నే సిట్రస్ పరిశ్రమలు పెద్దగా లేవు. ఉన్న రెండు, మూడు పరిశ్రమల కూడా తగిన మద్దతు ధర ఇ చ్చి కాయలు కొనుగోలు చేయక పోవడంతో రైతులకు అటు వైపు నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు లేకుండా పోతోంది. స్థానికంగా పండించే పంటకు అనువుగా ఉండే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆయా పంటలు సాగు చేసే రైతులకు కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు ఉంటుంది. -
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కడం శుభపరిణామం
తిరుపతి తుడా: తిరు నగరి వరుసగా నాలుగోసారి స్వచ్ఛసర్వేక్షన్ అవార్డు కైవసం చేసు కోవడం శుభపరిణా మమని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆనందం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విప్లవాత్మక సంస్కరణల ఫలితమే ఈ అవార్డు దక్కడానికి ప్ర ధాన కారణమన్నారు. స్వచ్ఛసర్వేక్షన్ లీగ్ సిటీస్ విభాగంలో తిరుపతికి ఈ అవార్డు దక్కిందన్నా రు. ఇందుకోసం బుధవారం ఢిల్లీకి పయనమవుతున్నట్లు చెప్పారు. గురువారం ఢిల్లీ విద్యాభవన్ వేదికగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును అందుకోనున్నామని తెలిపారు. ఈ అవార్డుతో న గరపాలక సంస్థ యంత్రాంగం మరింత బాధ్యత గా పనిచేసి దేశంలోనే నంబర్ వన్ సిటీగా తి రుపతి నిలిచేలా కృషి చేయాలన్నారు. రేపటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు తిరుపతి సిటీ: ఏపీఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ వెబ్ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఈనెల 13వ తేదీ నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి కే జిల్లాలో సుమారు 19 వేల మందికిపైగా వెబ్ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మరో రోజు మాత్రమే వెబ్ఆప్షన్లకు అవకాశం ఉండడంతో విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 19వ తేదీన ఒక రోజు మాత్రమే వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉండనుంది. 22 వతేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే ఐసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రి య గురువారం ప్రారంభమైంది. ఈనెల 21వ తేదీవరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇచ్చిన అధికారులు, 22న వెబ్ ఆప్షన్ల మార్పు, 25న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. గ్రామస్థాయిలో క్షయ నివారణకు కృషి తిరుపతి రూరల్ : గ్రామ స్థాయిలో క్షయ (టీబీ) నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీ య క్షయ నివారణ విభాగం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ భవానీసింగ్ కుష్వా సూచించారు. తిరు పతి రూరల్ మండలం వెంకటపతినగర్ పంచాయతీలో బుధవారం జాతీయ క్షయ నివారణ కేంద్రం తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడుతున్న వారు సకాలంలో వైద్య సేవలు తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చన్నారు. ముఖ్యంగా క్షయ కారణాలు, లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సర్పంచ్ బాధ్యతగా తీసుకుని తరచూ అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నారని, సర్పంచ్ చిన్నియాదవ్, ధర్మారావు, గంగాధర్దాస్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఉదయశ్రీ, ధనలక్ష్మి, అంజనాబాయి పాల్గొన్నారు. -
సారూ..నాణ్యత చూస్తే నవ్వుతారు
నాగరికతకు చిహ్నంగా నిలిచే రహదారులు నాలుగు కాలాల పాటు నిలిచేలా నిర్మిస్తే నలుగురికి ఉపయోగం. కానీ హడావుడిగా చేసిన పనుల్లో నాణ్యత నలిగిపోగా.. నిర్లక్ష్యం తాండవిస్తోంది. రోడ్డు నిర్మాణానికి వాడిన తారు నాణ్యత లేకపోవడంతోపాటు నిబంధనల మేరకు వేయడం లేదు. దీంతో అవి ఎంతకాలం మనుగడలోకి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరంలో హడావుడిగా జరుగుతున్న రహదారి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. నిబంధనలేవీ పాటించుకుండా ఇష్టారాజ్యంగా చేపట్టారు. రహదారి పనుల్లో నాణ్యత లేదని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలో అక్కడక్కడా రహదారి పనులు చేపడుతున్నారు. రూ.కోట్ల పనులన్నీ అధికార పార్టీకి చెందిన నాయకుడే చేస్తున్నారు. కూటమి పార్టీలోని మరి కొందరు కావాలని అడిగినా.. లేదని తేల్చిచెప్పేశారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలని సమాధానం ఇచ్చినట్లు కూటమి నేతలు గుసగుసలాడుతున్నారు. తిరుపతి నగరం పరిధిలో చెర్లోపల్లి నుంచి యూనివర్సిటీ వరకు, రామానుజ కూడలి నుంచి రేణిగుంట వరకు ఆర్అండ్బీ ద్వారా రోడ్డు వేయించేందుకు చక్రం తిప్పారు. ఆ పనులను దక్కించుకుని తారురోడ్డును చక చకా వేస్తున్నారు. ప్యాచ్ వర్క్లతో సరి పెట్టుకోవాల్సిన రోడ్డు పైన కొత్తగా రోడ్డు వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం అంతా కాంట్రాక్ట్ పనుల ద్వారా రూ.కోట్లు దక్కించుకునేందుకేనని తెలుస్తోంది. అవసరం ఉన్నా.. లేకున్నా కొన్ని పనులకు పచ్చ జెండా ఊపించి, పనులను తన కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతో దక్కించుకుని దోచుకుంటున్నారని కూటమి నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పనులను నాసిరకంగా చేపట్టి కాంట్రాక్టు పనుల్లో ఆయన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న తారు నాణ్యత లేదని, రోడ్డుపై వేయాల్సిన లేయర్ (మందం) ఎక్కడ అమలు కావడం లేదని అమరావతిలోని ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు. వేయాల్సిన చోట వేయకుండా.. బాగా ఉన్న రోడ్లపై తూతూ మంత్రంగా రోడ్ వేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సాధారణంగా టెండర్లో 20నుంచి 40 శాతం వరకు తక్కువ ఖర్చుతో కాంట్రాక్టర్లు పోటీపడి పనులు దక్కించుకుంటారు, అయితే కూటమి పార్టీకి చెందిన ఆ నేత మాత్రం రూ.20 కోట్ల కాంట్రాక్టు రూ.20 కోట్లకు (వందశాతం) టెండర్ ఎలా సంపాదించుకున్నారని చర్చించుకుంటున్నారు. జేసీబీలు, టిప్పర్లు, ప్రొక్లైయిన్లు రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే ఇతరత్రా యంత్రాలు అన్ని కూడా తన సంస్థకు చెందినవేనని వీడియోలు, ఫొటోలతో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తిరుపతిలో ఎప్పుడూ కనిపించని ఆ వాహనాలు కొత్తగా దర్శనమిస్తుండడంతో కాంట్రాక్టర్లతోపాటు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ నగర శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. తిరుపతి నగరంలో నాసిరకంగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు రహదారుల పనుల్లో అవినీతి తిరుపతి నగరంలో హడావుడిగా రహదారి పనులు నాణ్యతకు తిలోదకాలు.. పట్టించుకోని అధికారులు కాంట్రాక్టు పనులన్నీ ఆ నేతకే.. కూటమిలో మరొకరికి నో ఛాన్స్ ఎన్నికల్లో ఖర్చు పెట్టాను.. రాబట్టుకోవాలి కదా అంటున్న ఆ నేత -
కానిస్టేబుల్ కొడుక్కి కానిస్టేబుళ్ల సమస్యలు పట్టవా..?
తిరుపతి మంగళం: ‘మానాన్న ఒక కానిస్టేబుల్.. నేను కానిస్టేబుల్ కొడుకుని.. మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినవాడిని.. పేదల కష్టాలు పూర్తిగా తెలిసినవాడిని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ పేదవాడికి, ఉద్యోగికి, మహిళకు ఏ కష్టం రానివ్వకుండా వెన్నంటి ఉండి కాపుగాస్తా’.. అంటూ పదే పదే ఊదరగొట్టిన పవన్కళ్యాణ్కు కానిస్టేబుళ్ల సమస్యలు పట్టవా? అని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో మోసాలపై బుధవారం ఆయన ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ ఎండనక, వాననక, ధుమ్ముధూళిని లెక్కచేయకుండా నిత్యం రోడ్లపై పహారా కాస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న కానిస్టేబుళ్లు(పీసీ)లకు ఏడాదిన్నర కాలంగా టీఏ, డీఏలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నిత్యం కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే పవన్కళ్యాణ్కు వారి సమస్యలు చెవున పడడంలేదా? పడినా.. పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా? అని అన్నారు. ఎన్నికలకు ముందు ఎవరికీ ఏ కష్టం రానివ్వనంటూ రోడ్లపై పడుకుని అరిచి చెప్పిన పవన్కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక దిష్టిబొమ్మలా మారారని విమర్శించారు. పొగాకు, మిర్చి, మామిడి రైతుల సమస్యలు పట్టించుకోరు, ప్రజల సమస్యలు పట్టించుకోరు, ఆఖరికి కానిస్టేబుల్ కొడుకుగా కానిస్టేబుళ్ల సమస్యలను పట్టించుకోకపోవడంలో నిర్లక్ష్యమేమిటో చెప్పాలన్నారు. ఇప్పటికై నా స్పందించి కానిస్టేబుళ్లకు టీఏ, డీఏలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. భూమన అభినయ్రెడ్డి -
‘ప్రేమించి పెళ్లి చేసున్నాం.. మాకు రక్షణ కల్పించండి’
చిత్తూరు: ‘ప్రేమించి పెళ్లి చేసున్నాం.. మాకు మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి’ అని నూతన వధువు మానస పోలీసులను వేడుకుంది. వివరాలు .. రొంపిచెర్ల మండలం, చెంచెంరెడ్డిగారిపల్లె పంచాయతీ, శ్రీరాముల వడ్డిపల్లెకు చెందిన చెంగల్రాయులు కుమార్తె మానస (22) తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం, వెత్తలతడుకు గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు(27)తో రెండేళ్లుగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. కలికిరి రాముడు గుడిలో ఈనెల 12వ తేదీ వివాహం చేసుకున్నారు. అయితే తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కల్లూరు సీఐ సూర్యనారాయణను వేడుకున్నారు. మానస తల్లిదండ్రులను సీఐ విచారించి వారికి నచ్చజెప్పి ప్రేమికులను కలిపారు. -
రిజర్వు ఫారెస్టులో రోడ్డు వేసి అక్రమ రవాణా
చిట్టమూరు : మండలానికి తాగు, సాగునీరు సరఫరా అయ్యే తెలుగు గంగ 7వ బ్రాంచి కాలువ కరకట్టను కూటమి నేతలు తమ ధనార్జన కోసం తొలిచి రోడ్డు నిర్మించి టిప్పర్లతో గ్రావెల్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. యాకసిరి పంచాయతీ పరిధలోని రావిగుంట చెరువులో కూటమి నేతలు హిటాచీతో టిప్పర్లకు గ్రావెల్ నింపి తరలిస్తున్నారు. దీంతో తెలుగు గంగ కాలువలు ధ్వంసం అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నేతలు బరితెగించి రిజర్వు ఫారెస్ట్లో గ్రావెల్ రోడ్డు వేసి అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించక పోవడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ
చంద్రగిరి: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నమోదును పెంచాలని, విద్యార్థుల ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారి విద్యా సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో తోడ్పాటు అందించాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచి, పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. మునుపటి విద్యా సంవత్సరంలోని పదో తరగతి ఫలితాలను ప్రధానోపాధ్యాయులతో చర్చించి, ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లలిత కుమారి, హెచ్ఎం శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఆర్ఎఫ్ రోడ్డులోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాలోనూ ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థులు హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో, చక్కటి విద్యను అందించడంపై ఆయన సంతృప్తి చెందడంతో పాటు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. 17న ఐఐటీ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కామన్ ఇంకుబేషన్ సెంటర్ ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న భవనం -
జేసీ లాగిన్.. ఆశలు ఆగెన్!
కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం అర్హులందరికీ అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వివిధ సాకులతో నిరుపేదలపై అనర్హత వేటు వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్లో వినతులు సమర్పించినప్పటికీ సకాలంలో పరిష్కరించడం లేదని మండిపడుతున్నారు. ప్రధానంగా జాయింట్ కలెక్టర్ లాగిన్కు వెళ్లిన అర్జీలకు అతీగతీ లేకుండా పోతోందని వాపోతున్నారు. తిరుపతి అర్బన్ : తల్లికి వందనం పథకం కింద నగదు జమ కాకపోవడానికి రేషన్కార్డు, ఆధార్కార్డు, ఆదాయపు పన్ను, కరెంట్ బిల్లు అధికంగా రావడం వంటి కారణాలను అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా చిన్న చిన్న పొరబాట్లు ఉంటే వాటిని సులభంగా పరిష్కరించి అర్హులకు పథకం ఫలాలు అందించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో సచివాలయ పరిధిలోనే పరిష్కరించాల్సిన అంశాన్ని జేసీ లాగిన్ వరకు పంపుతున్నారు. ముందుగా తహసీల్దార్ ఆఫీస్, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఆ తర్వాత జేసీ ఆఫీస్ అంటున్నారు. ఈ క్రమంలో జేసీ లాగిన్ అంటేనే ప్రజలు వామ్మో ఇక అయినట్లే అంటూ హడలిపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా పొరబాటున అర్హులకు అమ్మఒడి అందకుండా ఉంటే క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపించేవారు. అయితే కూటమి సర్కార్లో చిన్న సమస్య పరిష్కారం కోసం జేసీ లాగిన్ అంటూ చేతులుదులిపేసుకుంటున్నారు. దీంతో పెద్దసంఖ్యలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అర్హులకు సైతం అందని తల్లికి వందనం వివిధ కారణాలతో మొండిచేయి చూపుతున్న ప్రభుత్వం గ్రీవెన్స్లో అర్జీలు పెట్టుకుని ఎదురు చూస్తున్న అమ్మలు అన్ని అడ్డంకులు దాటినా.. జేసీ కార్యాలయం వద్ద బ్రేకులు తిరుగుతూనే ఉన్నాం మా కుమార్తె కీర్తి 7వ తరగతి చదువుతోంది. తల్లికి వందనం నగదు మా బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు చూపడంతో జమ కాలేదని చెప్పారు. దాంతో 20 రోజుల క్రితం సచివాలయంలో అన్ని డాక్యుమెంట్స్తో దరఖాస్తు చేసుకున్నాం. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని చెప్పారు. అక్కడ క్లియర్ చేశాక, ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లాలని చెప్పారు. అక్కడ కూడా అన్నీ క్లియర్ చేశాం. ఆ తర్వాత జేసీ లాగిన్లో క్లియరెన్స్ రావాలని చెప్పారు. 15 రోజులుగా జేసీ లాగిన్లోనే పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో జేసీ కార్యాలయ సిబ్బందిని కలిశాం. వారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ను తీసుకురావాలని, అందులో డీఆర్ఓ ఇన్షియల్ వేసుకువస్తే...ఫైల్ను జేసీకి పెడతామని చెబుతున్నారు. ఇలా నెల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పని మాత్రం కాలేదు. – ఎం.మంజుల, విద్యార్థిని తల్లి, శ్రీకాళహస్తి -
గంగ కాలువలో మృతదేహం గుర్తింపు
సత్యవేడు : కొత్తమారి కుప్పం సమీపంలోని గంగ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ రామస్వామి తెలిపారు. మంగళవారం ఉదయం కొత్తమారి కుప్పం పంచాయతీ ఇంద్రపురం సమీపంలోని గంగ కాలువలో మృతదేహం తేలుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని కాలువ గట్టుకు చేర్చారు. మృతుడి భార్య, కుమారుడు వచ్చి తొట్టంబేడు మండలం, చిన్న సింగమాలకు చెందిన మునస్వామి(58)గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. గురుకులంలో మిగులు సీట్లకు కౌన్సెలింగ్ రేపు తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ జిల్లా సమన్వయకర్త టి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న ఆసక్తి గల విద్యార్థులు గురువారం ఉదయం 10 గంటలకు చిత్తూరులోని ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ (పుత్తూరు రోడ్డులోని ఎంప్లాయీమెంట్ ఆఫీసు దగ్గర) కార్యాలయంలో జరగనున్న కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఆటో బోల్తా : ఒకరి మృతి రాపూరు : రాపూరు–పెంచలకోన జాతీయ రహదారిలో మంగళవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రాపూరు మండలం పెనుబర్తి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా.. గోనుపల్లి నుంచి రాపూరునకు ఆటోలో ఏడుగురితో వస్తుండగా ఆటో పెనుబర్తి సమీపంలోకి రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న గోనుపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి మస్తాన్(47) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి స్వల్ప గాయాలులైనట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్లస్టూ పల్టీ!
● జిల్లాలోని 17 కళాశాలల్లో అడ్మిషన్లు శూన్యం ● మిగిలిన వాటిలోనూ అరకొరగానే ప్రవేశాలు ● వసతులు లేక విద్యార్థుల వెనకడుగు హైస్కూల్ ప్లస్ కళాశాలల్లో ప్రవేశాలు లేక వెలవెలబోతున్నాయి. కూటమి ప్రభుత్వంపై వీటిపై పెద్దగా పట్టించుకోకపోవడంతో వసతులు, అధ్యాపకుల కొరతతో విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా పలు కళాశాలల్లో అరకొర ప్రవేశాలతోనే కాలం వెల్లదీయాల్సిన అగత్యం ఏర్పడింది. తిరుపతి ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని బాల, బాలికలకు కళాశాల విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ విద్యా విధానంలో భాగంగా 2022లో అప్పటి ప్రభుత్వం హైస్కూల్ ప్లస్లను ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని బాలికలు, పేద విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్లుగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన అందించేందుకు అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు డిప్లాయ్మెంట్ ద్వారా హైస్కూల్ ప్లస్లలో నియమించుకుని విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్లస్టూ కళాశాలల్లో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. సరైన వసతులు కల్పించక, అధ్యాపకులను నియమించకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నట్లు విమర్శలు వస్తున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో 40 హైస్కూల్ ప్లస్లు ఉన్నాయి. వీటిలో 25 బాలికలకు కాగా, మిగిలిన 15 కో–ఎడ్యుకేషన్. అయితే వీటిలో సరైన వసతులు, అధ్యాపకులు లేకపోవడంతో వీటిలో ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటిలో 17 హైస్కూల్ ప్లస్లలో కనీసం ఒక్క అడ్మిషన్ కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఒక్క అడ్మిషన్ కూడా పొందని కళాశాలలు జెడ్పీహెచ్ఎస్ పద్మావతీపురం, జీహెచ్ఎస్ పెల్లకూరు, జెడ్పీహెచ్ఎస్ బాలాయపల్లి, జెడ్పీహెచ్ఎస్ ప్లస్ (బాలికలు) చిల్లకూరు, జెడ్పీహెచ్ఎస్ దగ్గవోలు, ఎస్ఏఎల్సీఈఎఫ్ హెచ్ఎస్ వాకాడు, జెడ్పీహెచ్ఎస్ పల్లమాల, జెడ్పీహెచ్ఎస్ డక్కిలి, జెడ్పీహెచ్ఎస్ చిట్టేడు, జెడ్పీహెచ్ఎస్ పాలమంగళం, జెడ్పీహెచ్ఎస్ అరిమేనుపాడు, జెడ్పీహెచ్ఎస్ చెంబేడు, జెడ్పీహెచ్ఎస్ కుప్పంబాదూరు, జెడ్పీహెచ్ఎస్ (బాలుర) రేణిగుంట, జెడ్పీహెచ్ఎస్ పెద్దకన్నలి, జెడ్పీహెచ్ఎస్ సత్యనారాయణపురం, జెడ్పీహెచ్ఎస్ బాలిరెడ్డి పాళెంలలో ఒక్క అడ్మిషన్ నమోదు కాలేదు. జెడ్పీహెచ్ఎస్ పద్మావతీపురంలో గత ఏడాది 37 మంది అడ్మిషన్లు పొందగా ఈ ఏడాది ఒక్కరూ చేరలేదు. జెడ్పీహెచ్ఎస్ తిరుచానూరులో గత ఏడాది 63 విద్యార్థులు ప్రవేశం పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 12కే పరిమితమయ్యింది. వసతులు, అధ్యాపకులు లేక.. ఒక్కో హైస్కూల్ ప్లస్లో అందుబాటులో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపునకు 53 మంది చొప్పున 159 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన 40 హైస్కూల్ ప్లస్లలో కలిపి మొత్తం 6,360 సీట్లు ఉన్నాయి. అయితే గత ఏడాది 40 హైస్కూల్ ప్లస్లలో బాల బాలికలు 836 మంది అడ్మిషన్లు తీసుకోగా ఈ ఏడాది 586కు దిగజారింది. దీనికి వసతుల లేమి, అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యలుగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ హైస్కూల్ ప్లస్లలో ఒక్కో స్కూల్కు సుమారుగా 7 మంది వరకు టీచర్లు ఉండాలి. అయితే కొన్నింట్లో టీచర్లు ఉంటే విద్యార్థులు లేకపోవడం, విద్యార్థులుంటే టీచర్లు లేకపోవడం వంటి సమస్యను విద్యాశాఖ పరిష్కరించకపోవడంతో ఆ ప్రభావం అడ్మిషన్లపై పడుతోందని చెబుతున్నారు. ప్రవేశాలు ఇలా.. 2024–25 విద్యాసంవత్సరం 2025–26 విద్యాసంవత్సరం బాలురు బాలికలు మొత్తం బాలురు బాలికలు మొత్తం 161 675 836 21 565 586 హైస్కూల్ ప్లస్లను పటిష్టం చేయాలి సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్ విద్య అభ్యసించలేని పేద విద్యార్థులకు ఇంటర్ విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్లు విద్యార్థులకు గొప్ప వరం. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్న హైస్కూల్ ప్లస్ వ్యవస్థను ఇప్పటి ప్రభుత్వం పటిష్టం చేసి కొనసాగించాలి. 100 మందికిపైగా పదో తరగతి విద్యార్థులున్న హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేయాలి. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ హోదాకు సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)గా రెగ్యులర్ ప్రాతిపదికన పదోన్నతి కల్పించి హైస్కూల్ ప్లస్లలో నియమించి ప్లస్టూ వ్యవస్థను బలోపేతం చేయాలి. –ఎస్.బాలాజీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), తిరుపతి త్వరలోనే నియామకాలు హైస్కూల్ ప్లస్లలో త్వరలోనే అధ్యాపకుల నియామకం జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖకు కావాల్సిన అధ్యాపకుల పోస్టులు, ఇతర వసతుల కల్పనపై ఇదివరకే జిల్లా విద్యాశాఖ నుంచి వివరాలు అందించాం. ఆయా హైస్కూల్ ప్లస్ పరిధిలో ఉపాధ్యాయులు అడ్మిషన్ డ్రైవ్ను నిర్వహించి విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. హైస్కూల్ ప్లస్ ఆవశ్యకతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఎక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునేలా చర్యలు చేపట్టాం. – కేవీఎన్.కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ), తిరుపతి -
మాకు అందలేదు
నా కుమార్తె నజీరా 5వ తరగతి చదువుతోంది. మాకు తల్లికి వందనం నగదు అందలేదు. దీంతో విద్యాశాఖాధికారులను సంప్రందించాం. సచివాలయానికి వెళ్లాలని చెప్పారు. అక్కడికెళితే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. రెక్కాడితేకానీ డొక్కనిండని బతుకులు మావి. ఇలా కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. – ధనమ్మ, విద్యార్థిని తల్లి, కేవీబీపురం మండలం ఇద్దరికి రూ.17వేలు వేశారు నాకు కవలపిల్లలు. జోషిత్తు, జీవన్ 8వ తరగతి చదువుతున్నారు. అయితే తల్లికి వందనం పథకం కింద ఇద్దరు బిడ్డలకు రూ.30 వేలు రావాల్సి ఉంది. అయితే ఒక్కొక్కరికి రూ.8,500 చొప్పున 17వేలు మాత్రమే వేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులకు తెలియజేశాం. 20 రోజులుగా మండల ఆఫీస్కి తిరుగుతున్నాం. అయినా ప్రయోజనం లేదు. – మోరా ప్రసూన, కమ్మవారి పాళెం, చిల్లకూరు మండలం సమాధానం లేదు పేద కుటుంబానికి చెందిన వాళ్లం. అయితే మాకు తల్లికి వందనం రాలేదు. మా కుమార్తె కుందన ఒకటో తరగతి చదువుతోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ఇవ్వాలని కోరుతున్నాం. అసలు మాకు ఎందుకు ఇవ్వలేదో ఎవరికీ తెలియదట. అసలు సమాధానం చెప్పేవారే లేరు. – బోడిరెడ్డి నాగవేణి, నెమళ్లగుంటపల్లె, రామచంద్రాపురం మండలం -
ఆలయం తమదేనంటూ ఇరువర్గాల ఆందోళన
● కనకదుర్గమ్మ ఆలయంపై స్థానికులు, సింగు మహిళల మధ్య వివాదం ● భారీగా మోహరించిన పోలీసులు ● శ్రీనివాసమంగాపురంలో ఉద్రిక్తత చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ఆరు నెలలుగా గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం తమదేనంటూ స్థానికులు, సింగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని డీఎస్పీ కార్యాలయానికి రావాలని సూచించారు. గ్రామ పెద్దలతో పాటు సింగు కుల పెద్దలు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే సింగు మహిళలు పెద్ద సంఖ్యలో మంగళవారం ఆలయం వద్దకు చేరుకున్నారు. వారు వచ్చారని తెలుసుకున్న స్థానిక మహిళలు సైతం పెద్ద ఎత్తున గుమికూడారు. ఇరు వర్గాల మహిళలు ఒకరికొకరు ఎదురు పడటంతో వాగ్వాదానికి దిగారు. తరతరాలుగా మా గ్రామ దేవతగా ఉన్న ఆలయాన్ని సింగులు కాజేయాలని చూస్తున్నారంటూ స్థానిక మహిళలు ఆరోపించారు. ఏడాదిలో రెండుసార్లు వచ్చి పూజలు చేసుకునే వారని, ఇప్పుడు ఆలయమే తమదంటూ తప్పుడు పత్రాలను సృష్టించి, తమపై అక్రమంగా కోర్టులో కేసులు వేసినట్లు ఆరోపించారు. కొన్నేళ్లుగా సింగు కులస్థుల కులదైవమైన శ్రీకనకదుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, అమ్మవారు ఇక్కడ వెలిశారే తప్ప, ఆలయ నిర్వహణ పూర్తిగా మా పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిందంటూ సింగు కులస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సింగు మహిళలు పెట్రోల్ బాటిల్తో తెచ్చుకుని, ఆలయాన్ని తమకు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళ వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇరు వర్గాలు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని, డీఎస్పీతో చర్చించిన తర్వాత ఆలయం ఎవరికి చెందుతుందో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంత వరకు ఆలయంలోకి ఇరు వర్గాలు వెళ్లకూడదంటూ ఇరువర్గాల వారిని హెచ్చరించారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,020 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.19 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటాను ఈనెల 19 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం జూలై 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఇక జూలై 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, అనంతరం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
పాఠశాల చదువులకు అంగన్వాడీ పునాదులు
పెళ్లకూరు : ప్రాథమిక పాఠశాల చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు పిల్లలకు అంగన్వాడీ పునాదులని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ వసంతబాయి పేర్కొన్నారు. మంగళవారం తాళ్వాయిపాడు, చిల్లకూరు అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. చిల్లకూరులో నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తాళ్వాయిపాడు అంగన్వాడీలో చిన్నారులకు అమలు చేస్తున్న మెనూ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ ఉమామహేశ్వరి, వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 17 నుంచి పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్ తిరుపతి సిటీ: ఏపీ పాలిసెట్–2025కు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియకు కౌన్సెలింగ్ చివరి దశ ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ కోఆర్డినేటర్, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వై ద్వారకనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించని అభ్యర్థులు 19వ తేదీలోపు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే లేటరల్ ఎంట్రీ, బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన ఐటీఐ అభ్యర్థులు డిప్లొమో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని కోరారు. సీటు సాధించిన అభ్యర్థులు రూ.6 వేలు ఫీజు చెల్లించి అడ్మిషన్లు పొందాలని సూచించారు. -
వెబ్ ఆప్షన్లలో ఆ కోర్సుపై విద్యార్థుల మక్కువ
● సీఎస్ఈ తరువాత ఏఐ, డేటాసైన్స్, ఎమ్ఎల్, ఎస్ఎస్ కోర్సులకు డిమాండ్ ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న ప్రైవేటు కళాశాలలు ● ఏడాదికి రూ.3 నుంచి రూ.4 లక్షలు వసూలు చేస్తున్న వైనం ● పేద విద్యార్థులకు దూరంగా సీఎస్ఈలోని అధునాత కోర్సులు ● మిగిలిన కోర్సులకు వెబ్ ఆప్షన్ పెడితే చాలు సీటు పక్కా తిరుపతి సిటీ : జిల్లాలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల హడావుడి ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడినా వెబ్ ఆప్షన్ల ఎంపికపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ ఈఏఎమ్సెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రెండు రోజుల నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో నెట్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. సెట్లో మంచి ర్యాకులు సాధించిన 90 శాతం మంది విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్నే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ కోర్సును ఎంచుకుంటున్నారు. అయితే ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులపై కనీసం 10 శాతం మంది కూడా తొలి ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది జిల్లాలో అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కా వచ్చేందుకు వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలు సొమ్ము చేసుకుంటూ.. సీఎస్ఈ కోర్సుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ను ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇదే అదునుగా రెచ్చిపోతూ ఫీజుల పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. అన్ని ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ విద్యా సంస్థలలో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లును పూర్తి స్థాయిలో ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఏఐసీటీఈ గత ఏడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ను ఎత్తి వేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ప్రతిష్టల ఆధారంగా యాజమాన్యాలు ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసి కేవలం రూ.70 వేలకు రసీదులు ఇచ్చి పంపుతున్నారు. తిరిగి మాట్లాడితే విద్యార్థికి సీటు లేదంటూ వెనక్కి పంపుతారనే భయంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలో వారు అడిగినంతా ఫీజు చెల్లించి వెనుదిరుగుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏమీ చేయలేమని చేతులెత్తి కూర్చోవడం గమనార్హం. 20 వేల మందికి ఇదే కోర్సుకు .. ఇప్పుడంతా సీఎస్ఈ బ్రాంచ్ చుట్టూ తిరుగుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారంతో పాటు పేరొందిన కంపెనీలలో లక్షల ప్యాకేజీలతో మెట్రోపాలిటన్ సిటీలలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో ఆ గ్రూప్నకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 25 వేల మంది వరకు ఏపీఈఏమ్సెట్ పరీక్షకు హాజరు కాగా ఇందులో 22,500 మంది అర్హత సాధించారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు సీఎస్ఈ బ్రాంచ్లోని పలు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారంటే డిమాండ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డేటా సైన్స్, ఏఐ ఆప్షన్లు పెట్టాను ఏపీఈఏఎమ్సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. డేటా సైన్స్ లేదా ఏఐ చేయాలని ఉంది. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యం డేటా సైన్స్, రెండో ప్రాధాన్యం ఏఐకి ఇచ్చాను. కచ్చితంగా నేను అనుకున్న కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఫారిన్లో ఎమ్ఎస్ చేయాలని ఉంది. – పృధ్వి, విద్యార్థి, తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని.. సాఫ్ట్ వేర్ రంగంలో రాణించాలనేది నా చిన్ననాటి కోరిక. ఏపీఈఏఎమ్సెట్లో 3 వేల లోపు ర్యాంక్ సాధించా. కచ్చితంగా పేరొందిన కళాశాలలో సీఎస్ఈ జనరల్ సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే వెబ్ ఆప్షన్ తొలి ప్రాధాన్యతగా సీఎస్ఈ జనరల్, రెండో ప్రాధాన్యతగా ఈఎస్ఈకి ఇచ్చా. – రజిని, విద్యార్థిని, తిరుపతిఏఐ కోర్సు చేయాలని.. ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లలో సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రథ మ ప్రాధాన్యం ఇచ్చాను. ఏఐకి క్రేజ్తో పాటు భవిష్యత్తు ఉంది. కష్టపడి చదివితే మంచి ప్యాకేజ్తో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. ఏఐ కోర్సుకు ఎస్వీయూ పరిధిలో పేరొందిన కళాశాలలకు తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్నా. –ప్రవల్లిక, విద్యార్థిని, తిరుపతి -
ఎన్ఎస్యూలో ముగిసిన బ్రిడ్జి కోర్సు
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులకు వారం రోజులుగా నిర్వహించిన బ్రిడ్జి కోర్సు మంగళవారం ముగిసింది. వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ మాట్లాడుతూ.. సంస్కృతంలోని 14 శాసీ్త్రయ అంశాలపై విద్యార్థులకు వారం రోజుల పాటు పరిచయాత్మక బోధన చేశామన్నారు. విద్యార్థులు వర్సిటీలోని సదుపాయాలను వినియోగించుకుని ఉన్నత స్థాయి చేరుకుని వర్సిటీకి పేరు ప్రతిష్ట తీసుకురావాలని సూచించారు. అనంతరం బ్రిడ్జి కోర్సుకు హాజరైన విద్యార్థులకు ప్రమాణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాకరణ విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, డాక్టర్ యశస్వీ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
బీసీ మహిళలకు రక్షణ కరువు
● కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్పై దాడి హేయం ● వైఎస్సార్సీపీ నేతల నిరసన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైయిందని, అడుగడుగునా బీసీ మహిళలకు అవమానాలు చోటు చేసుకుంటున్నాయని తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ , జనసేన గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులకు అంతులేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పోలీసులు కూటమి నేతల కీలుబొమ్మలా మారిపోయిందన్నారు. ఒక జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూడటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా న్యాయం చేయడంలేదని మండిపడ్డారు. బీసీలంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని మేయర్ ప్రశ్నించారు. గత జగనన్న పాలనలో బీసీ మహిళలకు ఉన్నత పదవులను కల్పించి ఉన్నత స్థాయిని కల్పించారని గుర్తు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాదవిరెడ్డి మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై కూటమి గూండాలు దాడు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడడం దుర్మార్గమన్నారు. మహిళలపై దాడులు చేస్తే తాటతీస్తానన్న పవన్కళ్యాణ్కు ఇలాంటివి కనబడవా? అని ప్రశ్నించారు. కూటమి గూండాలకు ప్రజలే బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆరణి సంద్య, కోటమ్మ, ఆదిలక్ష్మి, పుణీత, కోటూరు ఆంజినేయులు, బోకం అనీల్కుమార్, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, బీసీ నాయ కులు పుల్లయ్య, చిన్నియాదవ్, మల్లెమొగ్గల ఉమాపతి, పార్టీ నాయకులు తలారి రాజేంద్ర, ఉదయ్వంశీ, వాసుయాదవ్, మల్లం రవికుమార్రెడ్డి, దినేష్రాయల్, మద్దాలి శేఖర్, కడపగుంట అమరనాధరెడ్డి, పడమటికుమార్, పెరుగు బాబూయాదవ్ తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులు -
పంటల బీమాపై అవగాహన కల్పించాలి
చంద్రగిరి : జిల్లాలోని రైతులందరూ 2025–26 గాను రైతులు స్వచ్ఛందంగా పంటల బీమాకు నమోదు చేసుకోవచ్చునని, ఇందుకోసం జిల్లా అధికారులు రైతులందరికీ అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో వ్యవసాయ , ఉద్యాన శాఖల అధికారులతో పంటల బీమా పథకంపై డీఎల్ఎంసీ కమిటీ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి రైతు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. బీమా ప్రీమియం వివరాలను వెల్లడించిన జేసీ వరి పంటకు గ్రామాన్ని యూనిట్గా, సజ్జ పంటకు జిల్లాను బీమా యూనిట్గా పరిగణిస్తారని జేసీ తెలిపారు. వరి పంటకు ఒక హెక్టారుకు రూ.420 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా సజ్జ పంటకు హెక్టారుకు రూ.160 చెల్లించాలన్నారు. వేరుశనగకు హెక్టారుకు రైతు రూ.1400 , నిమ్మ పంటకు హెక్టారుకు రూ.6,250 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వరి పంట ప్రీమియం కోసం ఆగస్టు 15వ తేదీలోపు, సజ్జకు జులై 31వ తేది, వేరుశనగ, నిమ్మ పంటలకు జులై 15లోపు ఇన్సూరెన్స్ చేయించుకునేందుకు చివరి తేదీ ఆయన తెలిపారు. అనంతరం ఆయన వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ అధికారులతో కలిసి పంటల బీమా వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ గుంటూరు రవికుమార్, ఇన్సూరెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ -
‘మధ్యవర్తిత్వం’పై అవగాహన
దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై మంగళవారం జిల్లా అదనపు న్యాయమూర్తి అవగాహన కల్పించారు.పేదలకు దూరంగా అధునాతన కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులుగా వెలుగొందుతున్న సీఎస్ఈ బ్రాంచ్లోని ఏఐ, డేటా సైన్స్, ఎమ్ఎల్, ఎస్ఎస్ కోర్సులు పేద విద్యార్థులకు అందనంత దూరంలో నిలిచాయి. ఏపీఈఏమ్సెట్లో సీటు సాధించినా ప్రైవేటు కళాశాలలో సీటు దొరకడం కష్ట తరమవుతోంది. లక్షలలో ఫీజుల చెల్లించలేని పేద విద్యార్థులు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. సీఎస్ఈ కోర్సు కేవలం ధనవంతుల కోర్సుగా మిగిలిపోయిందని మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – 8లో -
‘నేను సత్యవేడు ఎమ్మెల్యేను.. ఇదిగో నా రాజముద్ర.’
సత్యవేడు: ‘నేను సత్యవేడు ఎమ్మెల్యేను .. ఇదిగో నా రాజముద్ర.’ అంటూ కోనేటి ఆదిమూలం తన ఎమ్మెల్యే ఐడెంటీ కార్డును పార్టీ నాయకులు, అధికారులు, విలేకరులకు చూపారు. సత్యవేడులో సోమవారం అన్నా క్యాంటిన్ భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తనని ఓడించాలని కుట్రలు, కుతంత్రాలు చేసిన మాజీ ఎమ్మెల్యే హేమలత, ప్రత్యర్థి పార్టీకి పనిచేసిన వారు నేడు టీడీపీ కార్యక్రమాల్లో స్టేజీలపై ముందు వరుసలో కూర్చొంటున్నారన్నారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు సమావేశాల్లో కింద వరుసలో ఉన్నారని, తగుదునమ్మా అంటూ హేమలత, సతీష్ నాయుడు పలు మండలాల్లో పార్టీ కార్యక్రమాల్లో తిరగడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. తన పదవి తన దగ్గర ఉంటుందని, ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పంపిణీ తన ద్వారానే జరుగుతుందన్నారు. అలాగే పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా కూరపాటి శంకర్ రెడ్డి ఉంటారన్నారు. స్నేహితుడా న్యాయమేనా..? సీఎం చంద్రబాబు నాయుడు ‘నీన్ను టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ గా నియమించారు. స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న నన్ను వదిలేసి.. ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్రలు పన్నిన హెచ్.హేమలత, చెరుకు పార్టీ వాళ్లని వెంట పెట్టుకుని తిరుగుతున్నావు. మండలాల్లో మీరు చేపట్టే కార్యక్రమాలకు నాకు ఆహా్వనం లేదు. అందరం పార్టీ కోసం పనిచేస్తున్నాం. సీఎం చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలు వద్దు.. అందరం కలసి సత్యవేడులో పార్టీ అభివృద్ధికి చేయి కలుపుదాం స్నేహితుడా.. శంకర్ రెడ్డి.’ అంటూ హితబోధ చేశారు. -
జాతీయస్థాయి చెస్ పోటీలకు శ్రీగురువర్షిణి
తిరుపతి ఎడ్యుకేషన్ : నగరానికి చెందిన చెస్ క్రీడాకారిణి ఒంటి శ్రీగురువర్షిణి జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికై ంది. విశాఖపట్నంలో ఈ నెల 12, 13వ తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్–15 ఓపెన్ అండ్ గరల్స్ చెస్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతికి చెందిన చెస్ క్రీడాకారిణి ఒంటి శ్రీగురువర్షిణి పాల్గొంది. మొత్తం 7 రౌండ్లకు 6 పాయింట్లతో 4వ స్థానం సాధించి రూ.5 వేలు నగదు బహుమతి, ట్రోఫీని అందుకుంది. అలాగే ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీగురువర్షిణిని కోచ్ కాకినాడ ప్రసాద్ అభినందించారు. అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి చిల్లకూరు: మండలంలోని కాకువారిపాళెం సమీపంలో ఉన్న సొనకాలువ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన గారా అవినాష్ (25) తన అమ్మమ్మ గ్రామమైన కాకువారిపాళేనికి ఆదివారం రాత్రి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిని తరువాత అతను ఇంట్లో లేక పోవడంతో బయటకు వెళ్లి ఉంటాడని అతడి అమ్మమ్మ కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఉదయం సొన కాలువ వైపు బహిర్బూమికి వెళ్లిన వారు గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు.వారు ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి గ్రామంలో కొంత మంది మధ్య వివాదం నెలకొనడం మృతుడు వారి అమ్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి, అక్కడ మృతి చెందడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించినట్లు తెలిసింది. -
జాతీయ చేనేత, హస్తకళ విభాగంలో జిల్లాకు మొదటి బహుమతి
– వెంకటగిరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ గుర్తింపు తిరుపతి అర్బన్: ఢిల్లీ ప్రగతి భవన్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒన్ డిస్ట్రిక్ ఒన్ ప్రాడక్ట్ కార్యక్రమంలో చేనేత హస్త కళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని కై వసం చేసుకుంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేనేత, హస్తకళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని పొందడం చాలా గర్వకారణమని తెలిపారు. వెంకటగరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. జాతీయస్థాయిలో తిరుపతి జిల్లా హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ కేటగిరీలో మొదటి బహుమతి (బంగారు కేటగిరి)ని గెలుచుకోవడం చేనేత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒకరి కృషి ఫలితమేనన్నారు. జిల్లాలో ఓడీఓపీ కింద ప్రోత్సహిస్తున్న వెంకటగిరి పట్టు చీరలు, స్థానికంగా తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తుల వైశిష్ట్యం, నాణ్యత ఈ గౌరవానికి కారణమని తెలిపారు. ఇలాంటి పురస్కారాలు స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్ని కలిగించడంతోపాటు, వారి జీవనోపాధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జితిన్ ప్రసాద్, ఢిల్లీ సీఎం రేఖ గుప్త, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ మినిస్టర్ సవిత, జిల్లా చేనేత అధికారి రాచపూడి రమేష్ పాల్గొన్నారు. ఘరానా దొంగ అరెస్ట్ తిరుపతి క్రైమ్: జిల్లాలోని నాయుడుపేట, సత్యవేడు ప్రాంతాల్లోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సూళ్లూరుపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు, ఈ నెల 5న గుర్తు తెలియని వ్యక్తి నాయుడుపేటలోని మూగాంబికా దేవాలయం వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేంద్ర ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 416 గ్రాముల బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూళ్లూరుపేట డీఎస్పీ చెంచు బాబు, సీఐ బాబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పార్వతీపురం జిల్లాకు చెందిన చందాక మణికంఠ(28) అనుమానాస్పదంగా తిరుగుతుంటే నాయుడుపేటలో అరెస్ట్ చేశారు. ఎవరిరీ అనుమానం రాకూడదని ఉద్దేశంతో పార్వతీపురం నుంచి ఇక్కడికి వచ్చి దొంగతనాలు పాల్పడేవారు. ఇతనిపై సూళ్లూరుపేట పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తడ, శ్రీ సిటీ, వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని మొవ్వలవారి పాళెం పోలీస్ స్టేషన్లో మూడు కేసులు, ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉన్నాయి. సుమారు ఇప్పటివరకు 14 కేసులకు పైగా ఉన్నట్లుగా గుర్తించారు. నాలుగు కేసులకు సంబంధించి 416 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇతన్ని రిమాండ్కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. -
తీవ్రవాదిలా తీసుకుని వస్తారా?
చిల్లకూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని నె ల్లూరు నుంచి గూడూరు కోర్టులో హాజరుపరిచే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కూట మి ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఆయన్ని తీవ్రవాదిని తీసుకుని వచ్చినట్లు తీసుకుని వస్తారా? అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ప్రశ్నించారు. గూడూ రు రెండో పట్టణంలోని వైఎస్సార్సీపీ రూరల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. నిరాధారమైన కేసు ల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి, పలు కోర్టులకు తిప్పుతున్నా రని విమర్శించారు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసులు పీటీ వారెంట్ వేసి, గూడూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకుని వచ్చే క్రమంలో అప్పటికప్పుడు 144వ సెక్షన్ను అమలులోకి తీసుకుని రావడం, రెండో పట్టణంలోని కోర్టుకు మూడు వైపులా ఉన్న దుకాణా లు మూసి వేయడం, పోలీసుల మోహరింపు చూస్తుంటే ఎందుకంత భయమో అర్థం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్సీపీ నాయకులను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే కాకాణి గోవర్ధనరెడ్డిపై అక్రమ కేసులు బనాయించా రన్నారు. చట్ట సభలో చట్టాలను చేసే తమ లాంటి ప్ర తినిధులకు కూడా గూడూరు పోలీసులు అనుమతి ఇ వ్వకుండా కోర్టు ఆవరణలోకి వెళ్లనీయకుండా ఎండ లోనే గేటు బయట గంటల పాటు ఆపడం మంచి సంస్కృతి కాదని హితవు పలికారు. గతంలో బ్రిటీష్ పోలీసులు భారతీయులపై చేసిన తప్పిదాలను నేడు రాష్ట్ర పోలీసులు గుర్తు చేస్తున్నారని, దీంతోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో పలు రకాల ఆంక్షలు విధించడం దారుణమైన విషయమని అన్నారు. తనతో పాటుగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ మండల కార్యాలయంలో ఉంటే అ క్కడకు వచ్చి బయటకు వస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, కోట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉప్పల ప్రసాద్గౌడ్, యూత్ రాష్ట్ర కార్యదర్శి కొండూరు సునీల్రెడ్డి, గూడూ రు ఎంపీపీ బూదూరు గురవయ్య, నాయకులు గొట్టి పాటి రవీంద్రరెడ్డి, కామిరెడి కస్తూర్రెడ్డి, ఓడూరు బా లక్రిష్టారెడ్డి, బాబురెడ్డి, అట్ల శ్రీనివాసులరెడ్డి, యల్లా శ్రీనివాసులరెడ్డి, సాయిరెడ్డి, దీప్తి పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణిని కోర్టు హాజరులో పోలీసుల అత్యుత్సాహం శాసన మండలిలో ఫిర్యాదు చేస్తా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ -
ఒకే ఆటోలో 25 మంది విద్యార్థుల ప్రయాణం
– పాఠశాల విలీన ఫలితం బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం రద్దు చేయడంతో మరో పాఠశాలకు వెళ్లటానికి విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొంతమంది ఆటోవాలాలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించటానికి వెనుకాడడం లేదు. మండలంలోని మొక్కలచేను గిరిజన కాలనీ లోని ప్రాథమిక పాఠశాలను రద్దు చేసి కల్లివెట్టులోని ప్రైమరీ పాఠశాలలో విలీనం చేశారు. మొక్కలచేను గిరిజన కాలనీలో 25 మంది పిల్లలు చదువుకుంటు న్నారు. మొక్కలచేను గిరిజన కాలనీ నుంచి కల్లివెట్టు పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. కల్లివెట్టు పాఠశాలకు వెళ్లటానికి 25 మంది విద్యార్థులు ఒకే ఆటోలో వెళుతున్నారు. పాఠశాల విలీన ఫలితంగానే విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. -
అగ్నిప్రమాదంపై అనుమానాలెన్నో
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వేస్టేషన్ లో సోమవారం మధ్యాహ్నం లూప్లైన్లో ఆగి ఉన్న ఇసాక్ ఎక్స్ప్రెస్ రైలు బోగిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల నగరంలో ఆకతాయిల తాకిడి అధికమైంది. వారికి హోటల్ భీమాస్ వెనుక ప్రాంతంలోని రైల్వేట్రాక్ (లూప్లైన్) పరిసరాలు అడ్డాగా మారాయి. కూతవేటు దూరంలో మద్యం దుకాణాలు, బార్లు ఉండడంతో ఆకతాయిలకు మరింత అనుకూల వాతావరణంగా మారింది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఉదయం వేళల్లో సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకునే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగు ప్రయాణం రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకునే క్రమంలో లూప్లైన్ ట్రాక్లోకి తరలిస్తున్నారు. వాటిలో రాయలసీమ ఎక్స్ప్రెస్తోపాటు వారాంతపు రైళ్లను నిలుపుతున్నారు. ఇలా ఆగి ఉన్న రైలు బోగిలను ఆకతాయిలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం గంజాయి, మద్యం మత్తులోని ఆకతాయిలు బీడీ, సిగరెట్టు వంటివి కాల్చి ఆగి ఉన్న ఇసాక్ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ బోగిలో వేసి ఉంటారనే అనుమానాలకు తావిస్తొంది. ఈ విషయం అగ్ని ప్రమాద సంఘటనా ప్రాంతానికి చేరుకున్న స్థానికులతో పాటు పోలీసు వర్గాల్లో సైతం చర్చకు దారి తీసింది. ఆకతాయిలకు అడ్డగా లూప్లైన్ పరిసరాలు వారిపైనే అనుమానాలు విచారణలో వెలుగుచూసేనా..? భిన్నంగా స్పందనలు కాగా రైలు బోగిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదపై రైల్వేస్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి, జిల్లా అగ్నిమాపకాధికారి రమణయ్య స్పందించిన తీరు భిన్నంగా ఉంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితి, నష్టం వంటి వాటిపై విచారణ కమిటీ నివేదిక ఇస్తుందని స్టేషన్ మేనేజర్ చెప్పడం, మరోవైపు తిరుపతిలోని అధిక ఉష్ణోగ్రత కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాఽపకాధికారి వెల్లడించడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వారు చెబుతున్న సమాధానాలకు పొంతన లేదు. ఆకాయిల కట్టడి సాధ్యమేనా..? ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైన్షాపుల నుంచి బ్రాందీ, విస్కీ, బీరు తెచ్చుకుని దర్జాగా సేవిస్తున్నారంటూ సమీపం నివాస గృహాల ప్రజలు బాహటంగా చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం, గంజాయి మత్తులో వీరంగం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి మార్పులు లేవనే తెలుస్తోంది. కూత వేటు దూరంలో రైల్వేస్టేషన్లోని ఆర్పీఎఫ్, జీఆర్పీపీ విభాగాలు, మరోవైపు వెలుపలి ప్రాంతంలో ఈస్ట్ పోలీసుస్టేషన్ ఉన్నాయి. అయినప్పటికీ ఆకతాయిల్లో భయమనేది లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడడంతో రైల్వేట్రాక్లపై ఆకతాయిల ఆగడాలు మితీమీరుతున్నాయనే విమర్శలున్నాయి. కాగా సోమవారం మధ్యాహ్నం రైలు బోగిలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో చెప్పుకోదగిన సంఖ్యలో పోలీసుల మొహరింపు కనిపించింది. ఏదేని భారీ సంఘటన జరిగితే తప్ప మిగిలిన సమయాల్లో పర్యవేక్షణ అంతంత మాత్రమేనా? అనే సందేహాలకు తావిస్తోంది. -
వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపిక పోటీలకు 16 మంది హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : కడపలోని డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 11, 14వ తేదీల్లో తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో ఎంపిక పోటీలను నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల నుంచి హాజరైన 16 మంది చిన్నారులకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, డీఎస్ఏ కోచ్ల ఆధ్వర్యంలో ఆరు రకాల ఈవెంట్లలో పరీక్షలు నిర్వహించారు. అలాగే వీ రందరికి వైద్య బృందం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను శాప్కు పంపించినట్లు డీఎస్డీఓ తెలిపారు. ఈ జాబితాను పరిశీలించి ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను త్వరలో ఆన్లైన్లో శాప్ ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో లెక్చరర్ పోస్టుల భర్తీకి మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ తిరుపతి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న లెక్చరర్ పో స్టుల పరీక్షలకు 6,412 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయని, పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్, ఎల క్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదన్నారు. జిల్లాలో పుత్తూరు సి ద్ధార్థ, రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణ మ్మ ఇంజినీరింగ్ కళాశాల, తిరుపతి జూపార్క్ వద్ద ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్, గూ డూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఎన్బీకేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే హాజరు కావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు. -
ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం
తిరుపతి సాక్షిటాస్క్ఫోర్స్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 746 మంది గ్రేడ్–3 ఏఎన్ఎంలున్నారు. వీరిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 693 మందికి సాధారణ బదిలీలు చేయగా.. మిగిలిన వారిని మెడికల్ గ్రౌండ్స్ కింద చూపించారు. తొలుత మాన్యువల్ ప్రకారం బదిలీలు చేయాలని నిర్ణయించారు. కూటమి నాయకులు, పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. సిఫార్సుల వెల్లువ బదిలీల ప్రకటనతో ఏఎన్ఎంలు వారికి అనుకూలమైన ప్రాంతాలు వరించేలా ఎవరికి వారు పోటీలు పడ్డారు. కూటమి బడా నేతలు, ఎమ్మెల్యేల వద్దకు క్యూకట్టారు. వారి సిఫార్సు లేఖలను బదిలీలకు జత చేశారు. ఈ సిఫార్సులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని చోటామోటా నాయకులు కూడా సొంత లెటర్లతో సిఫార్సులు పంపారు. ఎవరికి వారు సత్తా చాటుకోవాలని శాఖపై పట్టుబట్టారు. సిఫార్సులతో పాటు ఫోన్లు చేసి అధికారులను విసిగించారు. వారి హోదాను గుర్తు చేస్తూ.. భయభ్రాంతులకు గురిచేశారు. ఈకారణంగా ఎవరి సిఫార్సుకు తలొగ్గాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. బదిలీల ప్రక్రియను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖపై బురద కూటమి నేతల జోక్యం, ఒత్తిడి, సిఫార్సులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు శాఖ అధికారులు బదిలీల్లో జూమ్ కౌన్సెలింగ్ను తీసుకొచ్చారు. ఈనెల 8వ తేదీ నుంచి జూమ్ ద్వారా కౌన్సెలింగ్ను ప్రారంభించారు. 11వ తేదీ రాత్రితో ఈ ప్రక్రియను ముగించారు. అయితే చాలా మందికి అశించిన ప్రాంతాలు రాక అయోమయానికి గురవుతున్నారు. మరికొందర్ని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ ముగిసిన ఇప్పటికీ సిఫార్సుల గోల తగ్గడం లేదు. అధికారులపై కొందరు ఏఎన్ఎంలు ప్రజాప్రతినిధులు, కూటమి నేతల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆర్డర్ పత్రాలు ఇచ్చేందుకు కూడా అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ కారణంగా శాఖపై బురద పడుతోంది. కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ముడుపులు తీసుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూటమి నేతల జోక్యంతో వచ్చిన యవ్వారమని ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు.గందరగోళం ఏమీ లేదు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించాం. జూమ్ పద్ధతిలో ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలో ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నాం. మాకై తే ఎవరినీ ఇబ్బంది పెట్టించాల్సిన అవసరం లేదు. శాఖలో పనిచేసేవారు మా కుటుంబ సభ్యులే. వాళ్లను ఇబ్బంది పెట్టించాలని మేము ఏరోజూ కోరుకోం. ఇప్పటి వరకు వారికి ఇబ్బంది లేకుండా చూడాలని మా ప్రయత్నం చేస్తున్నాం. గందరగోళం ఏమీ లేదు. తప్పులుంటే కచ్చితంగా సరిదిద్దేలా చూస్తాం. సమస్యలుంటే నేరుగా తీసుకురావొచ్చు. –సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, చిత్తూరు ముందస్తు బుకింగ్లు ఏఎన్ఎంల బదిలీల విషయంలో డిమాండ్ పెరిగే కొద్దీ పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమ ప్రాంతంలో తమకు తెలియకుండా బదిలీలు చేయకూడదని హుక్కుం జారీ చేశారు. తమకు అనుకూలమైన వారినే వేయించుకుంటామని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ముందస్తుగానే 80శాతం ప్రాంతాలను వారి గుప్పట్లోకి తీసుకున్నారు. అక్కడికి రావాల్సిన వారిని వారే ఎంపిక చేసి అధికారులకు జాబితా పంపారు. కాగా వారి ఒత్తిడికి అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ఇక్కడి నుంచి శాఖలో పనిచేసే అధికారులను బదిలీ చేయిస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో వారు చేసేది లేక వారు చెప్పినట్లు బదిలీలను ముగించారు. కొందరు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఉన్న ఏఎన్ఎంలు, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఏఎన్ఎంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయించాలని ప్రయత్నాలు చేశారు. సహాయకులతో వసూళ్లు? కొందరు ఏఎన్ఎంలే వారి సహాయకులకు కాసులతో ఆశ చూపించారు. తాను అనుకున్న స్థానానికి బదిలీ చేయిస్తే అడిగింత ఇచ్చుకుంటానని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఏఎన్ఎంల బదిలీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు రెచ్చిపోయారు. వారు ఒక్కో బదిలీకి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు పలువురు ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు బెదిరింపులు 80 శాతం ముందస్తు బుకింగ్లు ఆపై కొందరు ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరుల దందాలు కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తామంటూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు మండిపడుతున్న ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం జోరందుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యంతో గందరగోళమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి 80 శాతం ముందస్తు బుకింగ్ చేసుకుంది. ఆపై పలువురు ప్రజాప్రతినిధుల అనుచరులు తెరపైకి తళుక్కుమన్నారు. కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యేందుకు రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ దందాతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. కూటమి పెత్తనంపై ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు. -
వెలుగులో చీడపై మహిళల కన్నెర్ర
● బ్యాంకు వద్ద ఆందోళనకు దిగిన డ్వాక్రా మహిళలు ● వైఎస్సార్ సీపీ నేత భూమన అభినయ్రెడ్డి మద్దతుతిరుపతి తుడా:వెలుగులో చీడ పురుగులుగా మారిన సిబ్బందిపై డ్వాక్రా సంఘాల మహిళలు కన్నెర్ర చేశారు. తమ నగదుకు భద్రత కరువడంతో సభ్యులు రోడ్డెక్కారు. ఆర్పీ హే మలత రూ.70 లక్షలు స్వాహా చేయడం వె నుక దాగి ఉన్న మెప్మా అధికారులు, బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గళమెత్తారు. ఆర్పీ ద్వారా మోసపోయిన పలు డ్వాక్రా సంఘాల మహిళలు లింగేశ్వరనగర్ లోని ఇండియన్ బ్యాంకు వద్దకు చేరుకుని సోమవారం ఆందోళనకు దిగారు. మహిళ లు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అధికారు లు బ్యాంకు గేటుకు తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు గేటు విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. రిసోర్స్ పర్సన్ హేమలత అవినీతి అక్రమాల్లో బ్యాంక్ సిబ్బంది ప్రమే యం ఉందని నిలదీశారు. బ్యాంకు మేనేజర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళ సంఘాల సభ్యులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డితోపాటు, ఆ పార్టీ నాయకులు, సీపీఐ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. విషయం పెద్దది కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బ్యాంకు నుంచి బయటికి వెళ్లాలని కోరారు. దీంతో మహిళలు బ్యాంకు నుంచి బయటకు వచ్చారు. సంబంధిత బ్యాంకు మేనేజర్ మహిళలకు వివరణ ఇచ్చారు. అప్పటికీ మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు మహిళలను కోరారు. దీంతో ఆర్పీ హేమలతతోపాటు బ్యాంక్ సిబ్బందిపై డ్వాక్రా సంఘాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు స్వాహా విధానం ఆశ్చర్యం డ్వాక్రా సంఘాల నగదును కాజేసిన విధా నం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి అన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలకు భూమన అభి నయ్ మద్దతుగా నిలిచి ఆందోళనలో పా ల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో 44 వేల మందికి పైగా డ్వాక్రా సంఘాల సభ్యులు ఉన్నారన్నారు. వారి డబ్బులు ఏమాత్రం భద్రమో తేల్చా లన్నారు. డ్వాక్రా సంఘాల నగదుపై ఆడి ట్ నిర్వహించి మహిళల్లో నెలకొన్న ఆందోళను తొలగించాల్సిన బాధ్యత మెప్మా అధికారులదేనన్నారు. ఎస్ఎల్ఎఫ్ పరిధి లో సభ్యులందరి సమక్షంలో ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆర్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్లపై లోతైన విచారణ జరిపితేనే నిజాలు వెలుగు చూస్తాయన్నారు.డ్వాక్రా సంఘాల పొదుపు ఇతర రుణాలను కాజేసిన ఆర్పి హేమలతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు పెంచల య్య, విశ్వనాథ్, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
Tirupati: తిరుపతిలో రైలు ప్రమాదం
సాక్షి,తిరుపతి: తిరుపతిలో రైలు ప్రమాదం జరిగింది. హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్లో మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతతో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. మంటలు మరో ట్రైన్ భోగీకి వ్యాపించాయి. రైలు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాపక సిబ్బంది ఎగిసి పడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఆగి ఉన్న ట్రైన్లో జరిగిన అగ్నిప్రమాదంలో హిస్సార్ టు తిరుపతి జనరల్ కోచ్ పూర్తిగా దగ్ధం కాగా.. ట్రాక్ మీద ఉన్న ఉన్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ పవర్ కార్ కోచ్కు కూడా అగ్నికీలలు వ్యాపించాయి. ఆ ట్రైన్ భోగి సైతం స్వల్పంగా కాలింది. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ట్రైన్లో అగ్నిప్రమాదానికి గల కారణాల్ని రైల్వే అధికారులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే తిరుపతి టూ హిస్సార్ రైలు ప్రమాదంపై తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నప్పరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘జనరల్ కోచ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి హిస్సార్ మధ్య నడిచే హిస్సార్ ఎక్స్ ప్రెస్లో మంటలు చెలరేగాయి. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు.ప్రమాద నష్టం అంచనా వేస్తున్నాం.రాయలసీమ ఎక్స్ ప్రెస్ పవర్ కోచ్కు మంటలు వ్యాపించాయి, వాటిని అదుపు చేశాం’అని తెలిపారు. -
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
‘అన్నా.. మనకు రెక్కలు రాకముందే అమ్మానాన్నను ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాము. అమ్మమ్మ అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసింది. నా మనవడు ఉన్నాడన్న ధైర్యంతో బతికేస్తోంది. నేను కూడా తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ మా అన్న చూసుకుంటాడనే ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు మా అందర్నీ దూరం చేసి వెళ్లిపోయావు. మేమెలా బతికేదన్నా’ అంటూ ఆ సోదరి తన అన్న మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరుల గుండెల్ని మెలిపెట్టింది. శ్రీనివాసులు అంత్యక్రియల సందర్భంగా ఈ దృశ్యం ఆదివారం శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.శ్రీకాళహస్తి: మండలంలోని బొక్కసంపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. జనసేన మాజీ నాయకురాలు వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, మరో ముగ్గురు కలిసి మా అన్నను చంపేశారంటూ మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం వద్ద అతడి సోదరి కీర్తి బోరున విలపించడం అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించింది. ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాం. ఇపుడు నా రక్తసంబంధమైన అన్నను కూడా కోల్పోయాను’ అని విలపించడం చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. ఏడేళ్ల వయసులో వెంకటగిరి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్ద పెరిగాము. ఇప్పుడు అన్నని పోగొట్టుకున్నానని మృతుని సోదరి, వారిని పెంచిన అమ్మమ్మ రాజేశ్వరి ఆవేదనను చూసి గ్రామస్తులు చలించిపోయారు.మా అన్నని మాట్లాడనివ్వలేదుఅనంతరం మృతుడు శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాట్లాడుతూ ‘మా అన్న వారి(జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి) ఇంటికి పరిమితమయ్యాడు. చాలాకాలంగా చూడడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు కాలు విరిగిందని చెబితే చూడడానికి వెళ్లా. ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ రోజు మా అన్నను వారు మాట్లాడనివ్వకుండా చేశారు’ అని వెల్లడించింది. మా అన్నను పంపించేస్తామని చెప్పారే గానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని కన్నీటి పర్యంతమైంది. తన అన్న చావుకు కారణమైన వారిని ఎవర్నీ వదలిపెట్టనని, వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని తెలిపింది. తనకు అండగా ఉండాలని స్థానికులను కోరింది.‘నాకున్న ఒకే ఒక బంధాన్ని దూరం చేశారు. నా అన్నను అతి కిరాతకంగా చంపేశారు. చిన్నప్పుడే అమ్మానాన్న దూరమయ్యారు. అన్నున్నాడనే ధైర్యంతో బతికేస్తున్నా. ఇప్పుడు ఆ ఒక్క ఆశను కూడా తుంచేశారు. నా అన్నను నాకు లేకుండా చేశారు. పవన్కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి. న్యాయం కోసం ఎందాకై నా వెళ్తాం..’ అంటూ మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి మాట్లాడడం అక్కడి వారిని ఆలోచనలో పడేసింది. -
తిరుమల లడ్డూ కేసు: సిట్ దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట లిస్టు చేయాలని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో సిట్ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించేందుకు.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నేరుగా నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం(జులై 14) ఈ పిటిషన్పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. సిట్ పని విధానంపై స్టేటస్ కో కొనసాగించాలి. సిట్ సేకరించిన రికార్డులన్నీ పరిశీలించాలి. సిట్కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నిర్దేశించాలి. సిట్ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. దర్యాప్తు సమయంలో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తోపాటు అడ్వకేటును అనుమతించాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి అని కోర్టును కోరారు.పిటిషన్లో ఏముందంటే.. తిరుమల లడ్డు కేసులో సిట్ రాజకీయ కక్షతో, దురుద్దేశంతో దర్యాప్తు జరుపుతోంది. కదురు చిన్నప్పన్న నుంచి బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ కు అనుగుణంగా స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. నన్ను, మాజీ ఈవోను ఈ కేసులో ఇరికించి.. అరెస్టు చేసే విధంగా బలవంతంగా సాక్షాలను చెప్పిస్తున్నారు. సిట్ పారదర్శకంగా పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ కేసులో కదురు చిన్నప్పన్నను భయపెట్టి బలవంతపు స్టేట్మెంట్లు తీసుకుంటున్నది. ఆయన ఆస్తులను జప్తు చేస్తామని భయపెడుతోంది. రాజకీయ జోక్యంతో సిట్ దర్యాప్తు గాడి తప్పింది. రాజకీయాల కతీతంగా దర్యాప్తు జరపాల్సిన సిట్ వాటికి తిలోదకాలు ఇచ్చిందిరాష్ట్ర ప్రభుత్వ అధికారుల మితిమీరిన జోక్యంతో సిట్ దర్యాప్తుపై ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. సిట్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. సిట్ కాంపోజిషన్ లో బ్యాలెన్స్ తప్పింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుండడంతో సెలెక్టివ్ గా విచారణ చేసి, అనేక అంశాలను తొక్కి పెడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిట్ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలి. -
డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్చుప్!
సాక్షి టాస్క్ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు. అతిసామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఆదివారం మృతుడి సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది. -
ముగిసిన గ్రాప్లింగ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని గిరిజన భవన్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ ఆదివారంతో ముగిసింది. సబ్ జూనియర్స్, క్యాడెట్ (బాయ్స్ అండ్ గర్ల్స్) విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్స్ విభాగంలో 20మంది బాలురు, 20మంది బాలికలు, అలాగే క్యాడెట్ విభాగంలో 10మంది బాలురు, 10మంది బాలికలు, మొత్తం 60మంది రెజ్లర్లను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ఘడ్ రాష్ట్రం బిలాస్పూర్లో నిర్వహించే జాతీయ స్థాయి గ్రాప్లింగ్ పోటీల్లో ఏపీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో ఒక్రీడా భారతి అధ్యక్షుడు ఎంవీ.మాణిక్యాలు, కార్యదర్శి పి.ధనంజయరెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేంద్రరెడ్డి, విశ్వం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఏజీ రేఖారాణి పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్ సర్కిల్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 92,221 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 42,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాయం కంటే ముందు వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్ తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కలెక్టర్, జేసీ, డీఆర్ఓతోపాటు వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరేట్ సిబ్బంది సూచిస్తున్నారు. రేపటి నుంచి పీ–4 రీసర్వే తిరుపతి అర్బన్ : ప్రభుత్వం చేపట్టిన పీ–4 పాలసీలో రెండో దశ కింద రీసర్వేను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి జీరో ప్రావర్టీ కింద జిల్లావ్యాప్తంగా 80,324 కుటుంబాలను గుర్తించారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఈ కుటుంబాలను దత్తతకు అప్పగించాలని లక్ష్యం నిర్దేశించారు. అయితే కుటుంబాల సంఖ్యలో ఎక్కువగా ఉండడంతో మరోసారి సర్వే చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. అనంతరం ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 కుటుంబాలను కలెక్టర్ దత్తత తీసుకున్నారు. మిగిలిన కుటుంబాలను జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సేవా సంస్థలకు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. 29 వరకు ‘నవోదయ’ దరఖాస్తుకు గడువు తిరుపతి ఎడ్యుకేషన్:జాతీయ స్థాయిలో 2026– 27విద్యాసంవత్సరానికి సంబంధించి నవోదయ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 29వ తేదీ ఆఖరు గడువని విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రవేశ పరీక్షను డిసెంబరు 13న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
తిరుపతికి మరో ‘వందే భారత్’
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతికి మరో వందేభారత్ రైలు రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఈ కొత్త రైలును విజయవాడ–బెంగళూరు వయా తిరుపతి మధ్య నడిపేందుకు రూట్ నిర్ణయించారు. కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు, నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఎప్పటి నుంచి పట్టాలపైకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సమయం ఆదా విజయవాడ నుంచి చైన్నెకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరుకు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే శాఖ మేలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోచ్లు సమస్య కారణంగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఇందులో బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల సమయం ఆదా కానుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. రూట్ షెడ్యూల్ ఇదీ.. కొత్త వందేభారత్కు రైలుకు 20711 నంబర్ కేటాయించారు. అలాగే రూట్ షెడ్యూల్ మేరకు ఈ రైలు విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45 గంటలకు చేరుకుంటుంది. అనంతరం చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం, 13.38, ఎస్ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు బయలుదేరి కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది.వందే భారత్ రైలు -
‘మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం’
తిరుపతి: తనకున్న ఒకే ఒక్క బంధం అన్న అని, అతన్ని పొట్టనపెట్టుకున్నారని హత్య గావించబడ్డ శ్రీనివాసులు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం జరగాల్సిందేనని, దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని ఆమె పేర్కొంది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘ మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. నాకున్న ఒక్క బంధం అన్నయ్య. నా అన్నను నాకు లేకుండా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ మాకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ రావాలి.. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి. మేము జనసేన పార్టీలోనే ఉన్నాం. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. అవసరమైతే వేరే పార్టీ సపోర్ట్ తీసుకునైనా మా పోరాటం కొనసాగిస్తాం’ అని మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి స్పష్టం చేసింది. ‘ మా అన్న ఎప్పుట్నించో జనసేన పార్టీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మా అన్న కాలుకు దెబ్బ తగిలిందని కబురు వచ్చింది. చూడటానికి వెళ్లాం. చుట్టూ నలుగురికి పైగా ఉన్నారు. మా అన్నను మాతో ఏమీ మాట్లాడనివ్వలేదు. ఆ తరువాత మా అన్నను లేకండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే. వారిని వదిలేస్తే మరొకటి చేస్తారు.’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల కోసం కింద లింక్ క్లిక్ చేయండి..వినుత పన్నాగం..! -
టీటీడీ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే తిట్ల పురాణం
సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ నిబంధనలను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తుంగలో తొక్కేశారు. తనతో పాటు ఉన్న అనుచరుల అందరిని ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలని హంగామా సృష్టించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ సిబ్బందిపై తిట్ల పురాణం లంకించుకున్నారు. ఆయనతో పాటు 12 మందికి ప్రోటోకాల్ను టీటీడీ కేటాయించింది.అదనంగా జనరల్ బ్రేక్ ఇచ్చిన వారిని కూడా ప్రోటోకాల్లో తనతో పాటు పంపాలంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టీటీడీ సిబ్బందిపై గొడవపడి మరి ప్రోటోకాల్ దర్శనానికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే థామస్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. -
ప్రాణాలతో చెలగాటమా?
తిరుపతి మంగళం : ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సెంటర్ లైట్లను వెలిగించకుండా వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతారా? అని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి కరకంబాడి మార్గంలో ప్రజలు, వాహనదారుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సెంటర్ లైట్లు ఏడాది కాలంగా వెలగడం లేదు. దీంతో వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి నల్ల దుస్తులు ధరించి తిరుపతి–కరకంబాడి మార్గంలో శనివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యుత్లైట్లు వీఐపీల కోసమా, ప్రజల కోసమా అంటూ నినదించారు. ప్రజలు, వాహనదారుల రక్షణ కోసం చేస్తున్న నిరసన కార్యక్రమంలో కొంతసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడినా సహకరించాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి వాహనదారులను అభ్యర్థించారు. అధికారుల నిర్లక్ష్యం ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు మంగళం పంచాయతీ, తిరుపతి నగర ప్రజలు నిత్యం ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారని తెలిపారు. దాంతో పాటు ఆ మార్గంలోని కళాశాలలకు వెళ్లి వచ్చే విద్యార్థులు నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అయితే విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి ఏడాది కాలం అవుతున్నా వాటిని వెలిగించడంలో టీటీడీ, తుడా, విద్యుత్శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు చిమ్మచీకటిలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు, పవన్కళ్యాణ్కు లెక్కలేదా? అని ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ దీపాలను వెలిగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అయితే నిరసన కార్యక్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపడుతున్న అభినయ్రెడ్డితో పాటు పార్టీ శ్రేణులను పోలీసులు లాగి పక్కకు నెట్టేశారు. దాంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డుపైన నిరసన తెలుపుతున్న పార్టీ శ్రేణులను నిలువరిస్తున్న పోలీసులు -
కుమార్తె పెళ్లికి తెచ్చిన బంగారు ఆభరణాలు చోరీ
● వరుసగా రెండిళ్లలో చోరీ చిల్లకూరు : పట్టణంలో శనివారం వేకువ జామున దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని గమ్మళ్లపాళెం, అశోక్నగర్ ప్రాంతాలలో రెండిళ్లలో చోరీకి పాల్పడి సుమారు 32 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గూడూరు పట్టణ నడి బొడ్డున ఉన్న గమ్మళ్లపాళెంకు చెందిన పరుచూరి శివయ్య తన కుమార్తె వివాహం ఆగష్టులో నిర్ణయించుకోవడంతో ఇంటిలో ఉన్న సొమ్ముతో పాటుగా అప్పు చేసి సుమారు 32 సవర్ల బంగారు ఆభరణాలు చేయించి ఇంటిలోని బీరువాలో ఉంచాడు. తన కుమారుడు చైతన్యను ఇంటిలోనే ఉంచి నెల్లూరులో ఓ పని మీద కుటుంబ సభ్యులు అందరూ వేకువజామున వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనక బాగం నుంచి లోనికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను చోరీ చేశారు. కుమార్తె పెళ్లికి తెచ్చి పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురి కావడంతో కుమార్తె పెళ్లి ఎలా చేయాలని శివయ్య కన్నీటి పర్యంతం కావడం అక్కడ ఉన్న వారిని కలచి వేసింది. అలాగే సమీపంలోనే ఉన్న అశోక్ నగర్లోని శేషయ్య ఇంటిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శేషయ్య ప్రస్తుతం తన కుమార్తె హైదరాబాద్లో ఉంటుండడంతో ఆమె వద్దకు వెళ్లడంతో ఇంటిలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంత మేర నగలు, డబ్బులు చోరీ జరిగిందనే విషయం ఆయన ఫిర్యాదు మేరకు పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు, వాకాడు సీఐ హుస్సేన్బాషా సంఘటనా స్థలంలో పరిశీలించిన అనంతరం క్లూస్ టీంకు సమాచారం ఇవ్వగా వారు వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేఖర్బాబు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రేణిగుంట : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఏర్పేడు మండలానికి చెందిన భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మర్రిగుంట సర్కిల్ నుంచి విమానాశ్రయ రహదారి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో ఏర్పేడు మండలం కాట్రకాయ గుంట గ్రామానికి చెందిన రత్నయ్య కుమారుడు భాస్కర్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి గాజుల మండ్యం పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైస్ ఎంపీపీ సరోజని మృతి సత్యవేడు: మండలంలోని మదనంబేడు పంచాయతీకి చెందిన వైస్ ఎంపీపీ(వైఎస్సార్సీపీ) డి.సరోజని శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మండలం, పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆమె మృతి పార్టీకి తీరనిలోటని జెడ్పీటీసీ పి.విజయలక్ష్మీ, సర్పంచ్ ఎస్.శివరంజని తదితరులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అర్చకులకు రూ.5 వేలు తిరుపతి అర్బన్: ధూపదీప నైవేద్యాల సమర్పణకు అర్చకులకు రూ.5 వేలు అందిస్తున్నట్లు జిల్లా దేవదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ఆలయాల నిర్మాణం కోసం రూ.10 లక్షలు అందిస్తున్న నేపథ్యంలో అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 130 ఆలయాలకు నిధులు ఇచ్చినట్లు చెప్పారు. గుర్తింపు పొందిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు రూ.15 వేలు ఇస్తున్నట్లు వివరించారు. రైల్వే స్టేషన్లో 12 కిలోల గంజాయి పట్టివేత గూడూరు రూరల్ : గూడూరు రైల్వే స్టేషన్లోని 4వ నంబర్ ప్లాట్ఫారం చివరన అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని గూడూరు రైల్వే పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి రూ.1.20 లక్షలు విలువ చేసే 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే సీఐ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు నెల్లూరులోని రైల్వే డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీధర్ వివరాలను వెల్లడించారు. నిషేధిత మాదక ద్రవ్య రవాణా నిరోధానికి ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్కు చెందిన హరిహరన్ అనే వ్యక్తి టాటానగర్– ఎర్నాకుళం జంక్షన్ ఎక్స్ప్రెస్లో గూడూరు రైల్వే స్టేషన్లో దిగి అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో నెల్లూరు రైల్వే ఎస్ఐ మాలకొండయ్య, రైల్వే పోలీసు సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, కిరణ్ పాల్గొన్నారు. -
‘సుపరిపాలన తొలి అడుగు’లో తమ్ముళ్ల తోపులాట..!
తిరుపతి జిల్లా: ‘సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏమో కానీ ‘తెలుగు తమ్ముళ్ల తోపులాట’ కార్యక్రమం మాత్రం సజావుగా సాగుతోంది. ఈరోజు(శనివారం, జూలై 12) తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలోని టీడీపీ ఆఫీస్ వద్ద సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించగా అది రసాభాసాగా మారింది. టీడీపీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శంకర్రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల తోపులాట చోటు చేసుకుంది. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ మాజీ ఎంపీపీ బట్ట రమేష్ ఆందోళనకు దిగారు. తనకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదని రమేష్ డిమాండ్ చేశారు. పార్టీలు మారే రమేష్ను గౌరవించేది లేదంటూ మరో వర్గం సైతం ఆందోళనకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యార్లగడ్డ వర్సెస్ పొట్లూరి కృష్ణాజిల్లాలోని గన్నవరం కేసరపల్లి వేదికగా తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ మాజీ ఏఎంసీ చైర్మన్ పొట్లూరి బసవరావు వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు విడిపోయారు. ఇది కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన అంశమే కావడం గమనార్హం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ. పర్యటిస్తున్న సమయంలో యార్లగడ్డ పర్యటనను బసవరావు వర్గం బాయ్కాట్ చేసింది. గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద బసవరావు వర్గం సమావేశమైంది. దాంతో పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ కోసం కష్టపడితే గెలిచాక ప్రక్కకి నెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం గ్రామ పార్టీ నాయకులు, ,కార్యకర్తలు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తే తమకు సమాచారవ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారని బసవరావు వర్గం నిలదీసింది.ఎమ్మెల్యే యార్లగడ్డ వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని అంటున్నారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తూ కనీస సమాచారం ఇవ్వరా?????గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారు. -
‘ప్రభుత్వం స్పందించకుంటే నిరసన ఉధృతం చేస్తాం’
తిరుపతి తిరుపతిలో అనేక నెలలుగా 8 కిలోమీటర్ల మేర వీధి దీపాలు వెలగకపోవడంతో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కిలో మీటర్ల మేర వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారడంతో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీది దీపాలు వెంటనే వెలిగించాలని వర్షంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు భూమన అభియన్రెడ్డి మాట్లాడుతూ.. ‘...తిరుపతి హైవేలో అనేక నెలులుగా 8 కిలోమీటర్ల మేర బీద దీపాలు వెలగడంలేదు. రూ. 12 లక్షల బకాయి కారణంగా స్ట్రీట్ లైట్స్ నిలిచిపోయాయి. ఈ ప్రాంతం కొంత తిరుపతి, మరికొంత చంద్రగిరి నియోజకవర్గాలకు వస్తుంది. దీనిపై వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్పందించాలి.వీది దీపాలు వెలిగెలా చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తున్నాము. వీధి లైట్లు వెలగని కారణంగా ఈ రహదారిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇకనైన ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉంది. ప్రభుత్వం స్పందించకుంటే నిరసన ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. -
తిరుమలపై ఇంత పెద్ద నింద వేస్తారా?
టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన. టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉందిటీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు. -
వినూతతో సన్నిహితంగా ఉంటున్నాడనే రాయుడి హత్య?
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అయి ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. తన దగ్గర పని చేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి(తాజా మాజీ) వినూత కోటా (Vinutha Kotaa) శనివారం అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వేకువజామున 3గం. టైంలో వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa)ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్ ఏ అరుణ్ మీడియాకు వెల్లడించారు. శ్రీనివాసులు(రాయుడు)ని ఆంధ్రాలో హత్య చేసి.. చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్ ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కోటా వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు చెప్పారాయన.ఏం జరిగిందంటే.. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కూవం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో.. పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్తో పాటు వినూత అనే పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. ముగ్గురు నిందితులు దస్త సాహెబ్(షేక్తసన్), శివకుమార్, గోపిలను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై మృతదేహం ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. చిత్రహింసలకు గురి చేసి..బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్లో.. అటు సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అయితే.. ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించామని తొలుత ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే లోతైన విచారణలో.. డ్రైవర్తో తన భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక చంద్రబాబు ఈ హత్య చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఆ భార్యభర్తలు ప్లాన్ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని ఓ గోడౌన్లో రాయుడిని టార్చర్ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని చెన్నైలో తమ వాహనంలో ఆ భార్యభర్తలు మృతదేహాన్ని మోసుకెళ్లి పడేశారు. ఇదిలా ఉంటే..శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ఆమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.చదవండి: పవన్ @ పెద్దమ్మ భాషా పితామహ.. -
పచ్చముఠా దోపిడీ
● ఇష్టారాజ్యంగా ఇసుక, గ్రావెల్, బండరాళ్ల తరలింపు ● రాజుపాళెంలో యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్ : వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లు అక్రమంగా తరలిస్తూ సహజ సంపద లూటీ చేస్తున్నారు. ఓ నేత కనుసన్నల్లో పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సహజ సంపద గుల్ల చేసి రూ.కోట్ల సొమ్ము వెనుకేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం సమీపంలోని పెన్నా నదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు. కానీ తమ్ముళ్లు ఇసుక రేవుల్లో పడి దొరికందంతా దోచేస్తున్నారు. దీనికి తోడు పెన్నాలో నీటి ప్రవాహంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అక్కడ లభించే పెద్ద పెద్దరాళ్లతో పాటు గ్రావెల్ను సైతం నిర్భయంగా తరలించుకుపోతున్నారు. రీచ్లకు పుల్ స్టాప్.. అయినా ఆగని అక్రమ రవాణా నెల్లూరు జిల్లాలోని ఇసుక రీచ్లను అక్టోబర్ 15 వరకు అనుమతులను అధికారులు రద్దు చేశారు. కానీ ఉన్నతాఽధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు రాజుపాళెం రీచ్లో ఇసుక అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు చేసి యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం సగటున వంద వాహనాల్లో ఇసుకను ఇతర రాష్ట్రాలకు పగలు, రాత్రి లేడా లేకుండా తరలిస్తూ దోపిడీ సాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమార్జనలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నదిలోకి రాచబాట పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నానదిలోకి ఇసుకాసురులు రాచబాట వేశారు. తెలుగురాయపురానికి ప్రధాన రహదారి నుంచి నది మధ్యలోకి రోడ్డు వేశారు. రాజుపాళెంలోకి ప్రధాన రహదారి నుంచి ప్రైవేటు వ్యక్తికి చెందిన మామిడి తోట నుంచి రోడ్డును నిర్మించారు. ఆ రహదారి వేసేందుకు ఆ ప్రైవేటు వ్యక్తికి నెలకు రూ. 50 వేలు ముట్టచెబుతున్నారు. నది గర్భంలోకి రోడ్డు వేసినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడంలేదు. అధికార పార్టీ నేతల సహకారంతో పచ్చ మాఫియా నదిలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లు దోపిడీ చేస్తుంటే అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రమణ్యంనాయుడు (పలమనేరు), రూపేష్రెడ్డి(చిత్తూరు), ప్రభురాజ్(నగరి), ఆఫ్రిడ్ మాలిక్(పుంగనూరు), ప్రధాన కార్యదర్శులుగా దిలీప్యాదవ్(శ్రీకాళహస్తి), మోహన్వంశీ(తిరుపతి), పి.శివ(పుంగనూరు), నవీన్కుమార్రెడ్డి(జీడీనెల్లూరు), శశింద్ర(తిరుపతి), మనోహర్రెడ్డి(చంద్రగిరి), మునివెంకటలోకేష్(తిరుపతి), షేక్బావాజీ(పుంగనూరు), వంశీకృష్ణ(పూతలపట్టు), కార్యదర్శులుగా శేషాద్రిరెడ్డి(జీడీనెల్లూరు), రమేష్(సత్యవేడు), రెడ్డిప్రసాద్(పలమనేరు), ధనుంజయరెడ్డి(చంద్రగిరి), సుధీర్(తిరుపతి), హేమంత్కుమార్రెడ్డి(కుప్పం), ఈసీ మెంబర్లుగా 16 మందని నియమించారు. చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ.అనిల్కుమార్రెడ్డి(తిరుపతి), ఎ.భానుప్రకాష్(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ది.షణ్ముగంరాయల్(తిరుపతి), ఈశ్వర్రెడ్డి(పుంగనూరు), ప్రదీప్రెడ్డి(చిత్తూరు), యోగానందరెడ్డి(చంద్రగిరి), శోభన్కుమార్(సత్యవేడు), కార్తీక్రెడ్డి(జీడీనెల్లూరు), ఎన్.మురుగేష్(తిరుపతి), కార్యదర్శులుగా జి.రమేష్(కుప్పం), అరుణ్కుమార్(చిత్తూరు), మహేష్రెడ్డి(పుంగనూరు), హరిప్రసాద్(తిరుపతి), ఈశ్వర్(పలమనేరు), మదన్(జీడీనెల్లూరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా శశిదీప్(చిత్తూరు), సోమశేఖర్(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా మహేష్చౌదరి(చిత్తూరు), మహేష్(జీడీనెల్లూరు), మధుసూదన్రెడ్డి(తిరుపతి), భానుప్రకాష్రెడ్డి(చంద్రగిరి), వీరమణి(కుప్పం), కార్యదర్శులుగా అజిత్కుమార్(చిత్తూరు), అశ్విత్(పలమనేరు), వేణురెడ్డి(జీడీనెల్లూరు), ప్రదీప్కుమార్(తిరుపతి), పృధ్వీరెడ్డి, సుధీర్రెడ్డి, దినేష్, నరేష్బాబు(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 11 మందిని నియమించారు. వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా రూపేష్కుమార్రెడ్డి(తిరుపతి), ప్రసాద్(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా రాధికరెడ్డి(జీడీనెల్లూరు), విజయరెడ్డి(తిరుపతి), రవి(కుప్పం), రమేష్(తిరుపతి), కార్యదర్శులుగా పెద్దన్న (కుప్పం), రోహిత్బుచ్చిరెడ్డి(చిత్తూరు), సుబ్రమణ్యంరెడ్డి(జీడీనెల్లూరు), అమర్నాథ్రెడ్డి(పలమనేరు), చలపతి, మంజూరు, కిషోర్(పుంగనూరు), జీవరత్నం (తిరుపతి), ఈసీ మెంబర్లుగా 19 మందిని నియమించారు. వలంటీర్ల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జయచంద్ర(తిరుపతి), అబ్దులజైలా(జీడీనెల్లూరు),బోస్రెడ్డ్డి(చంద్రగిరి),శివలింగం(కుప్పం),బాలసుబ్రమణ్యం(సత్యవేడు), కార్యదర్శులుగా పి.వరదరాజన్, పురుషోత్తం(తిరుపతి), రాము (జీడీనెల్లూరు), మనోహర్(శ్రీకాళహస్తి), ప్రభాకర్రెడ్డి(పలమనేరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. చేనేత విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏలుమలై(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా రవిరెడ్డి(జీడీనెల్లూరు), పి.చంద్రశేఖర్(తిరుపతి), సుధాకర్, మునిరాజా(శ్రీకాళహస్తి), విజయ్భాస్కర్(సత్యవేడు), కార్యదర్శులుగా రమేష్రెడ్డి(పలమనేరు), తిరుమల(జీడీనెల్లూరు), కన్నాయిరం(నగరి), వెంకటేష్(కుప్పం), అమరలింగయ్య(సత్యవేడు), నలుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు. వైఎస్సార్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిరుమలరెడ్డి(తిరుపతి), షేక్ ఫిరోజ్అహ్మద్(పూతలపట్టు), ప్రధాన కార్యదర్శులుగా వెంకటేష్(జీడీనెల్లూరు), ఎం.బాబు(నగరి), శ్రీమంతుల రామయ్య(తిరుపతి), సుబ్రమణ్యంరెడ్డి(చంద్రగిరి), వేణుగోపాల్(కుప్పం), కోటేశ్వరరావు(చంద్రగిరి), కార్యదర్శులుగా శ్రీనివాసులు(పలమనేరు), రఘు(పూతలపట్టు), మునికృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), మాంగండన్(నగరి), వెంకటముని(చిన్ని)(తిరుపతి), జి.కోటేశ్వరరావు(సత్యవేడు), సురేష్(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా 16 మందిని నియమించారు. -
ఐచర్ను ఢీకొన్న బైక్
● ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు చంద్రగిరి : ఎదురుగా టమాట లోడుతో వస్తున్న ఐచర్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన ఘటన తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పీటీసీ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భాకరాపేటకు చెందిన మహబూబ్ బాష(58) మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో పీటీసీ సమీపంలోని పెద్ద మలుపు వద్ద వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టమాట లోడుతో వస్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో బైక్తో పాటు ఐచర్ వాహనం అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న భారీ లోతు ప్రాంతంలో పడి బోల్తా పడగా, టమాటా బాక్స్లు , బైక్ మహబూబ్ బాషపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐచర్ వాహనంలోని డ్రైవరుతో పాటు క్లీనర్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలకు వెళ్లి వచ్చే సరికే ఇల్లు గుల్ల 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చిల్లకూరు : తిరుమలలో జరిగే గరుడ సేవకు కుటుంబ సభ్యులు వెళ్లి వచ్చేసరికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన నల్లయగారిపాళెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని నల్లాయగారిపాళెం గ్రామానికి చెందిన మస్తానయ్య గురువారం తిరుమలకు వెళ్లారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసిన పక్కనే ఉన్న బంధువులు గమనించి తిరుమలలోని మస్తానయ్యకు దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫోన్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ కిశోర్బాబు, ఎస్ఐ సురేష్బాబుతో పాటు క్లూస్ టీం చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కేసులతో భయపెడతారా?
రైతులతో ఆటలొద్దు. మేము రోడ్డు మీదకు వస్తే మళ్లీ మా మూళ్లగా ఉండదు. రైతు పండించే పంటకు గిట్టుబా టు ధర కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది చేయలేకపోతే..ఇలా ప్రతిపక్షాలు రోడ్డుపైకి వస్తాయి. ఇదీ ఆయన సొంత కార్యక్రమం కాదు కదా. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి సమస్యలను వినేందుకు వచ్చారు. అందులో తప్పేంముంది. అడ్డకుంలు సృష్టించడంతో పాటు గొంతు కూడా నొక్కేస్తున్నారు. కేసుల పేరుతో భయపెట్టడం న్యాయం కాదు. – ఉమాచంద్ర, రైతు నాయకులు -
విధుల్లో నిర్లక్ష్యంపై ఏఈ సరెండర్
బుచ్చినాయుడు కండ్రిగ : మండలంలోని ట్రాన్స్కో ఏఈ చలపతి విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో ఎస్ఈ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు ఏడీఈ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈ చలపతి 33 కేవీ బీఎన్కండ్రిగ ఫీడర్లో మరమ్మతుల్లో నిర్లక్ష్యం వహించి, రైతుల వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా ఇవ్వలేదని తెలిపారు. వినియోగదారుల సమస్యలపై స్పందించకపోవడం, విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం చోటు చేసుకున్నా పట్టించుకోకపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయన్నారు. ఎస్ఈ సురేంద్రనాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మండల ఏఈగా విధుల నుంచి తప్పించి ఎస్ఈ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి బైరాగిపట్టెడలోని గిరిజన భవన్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గ్రాప్లింగ్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అండర్–11, 13, 15, 17 కేటగిరిలో బాల బాలికలకు నిర్వహించనున్న ఈ పోటీలను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏజి.రేఖారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ఆయా విభాగాల్లో గెలుపొందిన బాల బాలికలు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ఘడ్ రాష్ట్రం, బిలాస్పూర్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు. ఎన్ఐఏబీతో వెటర్నరీ వర్సిటీ ఒప్పందం తిరుపతి సిటీ : హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)తో ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం వర్సిటీలో జరిగిన ఒప్పందంపై వీసీ ప్రొఫెసర్ రమణ, ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారు శర్మ సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జంతు సంరక్షణ, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్ఐఏబీ సంస్థతో వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రధానంగా నాణ్యమైన విద్య, నూతన పరిశోధనలు, విద్యా మార్పిడి వంటి విషయాలపై సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడమే ఎంఓయూ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డీన్, అధికారులు పాల్గొన్నారువైద్య అధ్యాపకులకు ముగిసిన శిక్షణ తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో నిరంతర వైద్య విద్యలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అంశంపై వైద్య అధ్యాపకులకు మూడు రోజులగా నిర్వహించిన శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో వైద్య విద్య సంచాలకులు, ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మాట్లాడుతూ.. మూడు రోజులుగా వైద్య నిపుణులతో వైద్య విద్య బోధనా పద్ధతులు, వైద్య విద్యార్థులకు ఉన్నత విద్యలో తీసుకోవాల్సిన ప్రధాన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాధ, వేలూరు సీఎంసీ వైద్య కళాశాల అబ్జర్వర్స్ డాక్టర్ మినురేఖ, డాక్టర్ భోఢన రాజన్, అకడమిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరీటి, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డీఎస్ఎన్ మూర్తి, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ సత్యనారాయణ మూర్తి, వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు -
ఆదరణ చూసి ఓర్వలేక
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇచ్చిన హామీల విషయంలో మాట దాట వేసింది. రైతులకు చేసేందేమీ లేదు. వేరుశనగ పంట పూర్తిగా నేటమట్టమైంది. మామిడి రైతులు మద్దతు ధర లేక రోడ్డుపై అల్లాడుతున్నాము. అయితే ఈ రోదనను వినేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనను అడ్డుకోవడం సరికాదు. కూటమి ప్రభుత్వం ఆయన ఆదరణ చూసి ఓర్వలేకపోతోంది. అందుకే ఈ రకంగా రైతులను, జనాన్ని రాకుండా తొక్కిపడేస్తోంది. వాళ్లు ఎంత తొక్కితే అంతా పైకి లేస్తాం. – రవీంద్రనాథ్, రైతు నాయకులు -
జగన్ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు
● పోలీసుల అణచివేతతోనే భారీగా జనం ● రక్షకభటులే ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఎలా? ● ఖాకీల తీరును తప్పుబడుతున్న రైతన్నలు పలమనేరు/కాణిపాకం: ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ బుధవారం బంగారుపాళెంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఎందుకు వారిపై ఇంత కఠినంగా వ్యవహరించారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారుపాళెంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు ఎందుకిలా అడ్డుకున్నారనే మాట రైతుల్లో అయోమయాన్ని కల్గిస్తోంది. ఏ మార్గంలోనూ జనం వెళ్లకుండా ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. ఎటుచూసినా కర్ఫూ వాతావరణాన్ని సృష్టించారు. కనీసం నడిచి వెళుతున్న వారితోనూ దురుసుగా మాట్లాడారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోలు బంకుల్లో పెట్రోలు పట్టనీయకుండా చేశారు. జగన్ పర్యనటలో భాగంగా కొన్ని చోట్ల గుమిగూడిన రైతులపై లాఠీతో విరుచుకుపడ్డారు. బంగారుపాళెం మార్కెట్లోని మామిడి రైతులను బయటకు పంపేశారు. వ్యాపారులు లేకుండా చేశారు. అసలు జనాన్ని చూస్తేనే పోలీసులు కోపంతో ఊగిపోయారు. మొత్తం మీద పోలీసులు చేసిన అణచివేత చర్యల కారణంగానే రైతులు వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసిందనే మాట జనంలో వినిపిస్తోంది. పోలీసులు ఇన్ని రకాలుగా ఆంక్షలు పెట్టి ఉండకపోతే కార్యక్రమం ప్రశాంతంగానే జరిగిపోయేదని అంటున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరి రైతుల మాటల్లోనే.. -
ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే
ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటి ని అధిగమించి మా కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్తో పంచుకోవాలని పర్యటనకు వెళ్లాం. కనీసం ద్విచక్ర వాహనం కూడా వదల్లేదు. ఎ క్కడికక్కడ కట్టడి చేసి విఘాతం కలిగించారు. ఆయనకు వస్తున్న ప్రజాధరణను ఓర్వలేక కూటమి ప్రభు త్వం ఈ రకంగా హింసించింది. రైతులను అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. వాళ్లు ఏం చేసి నా జనబలాన్ని ఆపలేకపోయారు. ఇలా చేస్తే ప్రజా లే భవిష్యత్లో తీర్పునిస్తారు. ఏ అధికారమైనా జనబలం ముందు తలవంచాల్సిందే..అనడానికి ఇదీ ఒక నిదర్శనం. – వెంకటేష్, రైతు, జీడీనెల్లూరు -
‘రూసా’ పనులు వేగవంతం చేయాలి
తిరుపతి సిటీ : రుసా ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రుసా) పథకం కింద జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేయడానికి ఎస్వీయూలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం వర్సిటీ వీసీ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీలో మౌలిక సదుపాయాలు, విద్యా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు వర్సిటీలో రూసా పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. అనంతరం రూసా కోర్డినేటర్ ప్రొఫెసర్ రమశ్రీ వర్సిటీలో జరిగే పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు, రుసా సీఈఓ, ఆర్థిక, అభివృద్ధి విభాగాల కీలక అధికారులు పాల్గొన్నారు. -
మేమూ రైతులమే
మా కష్టాలు మాకు తెలుసు. మా కష్టాలు ఎవరికో ఒకరికి చెప్పుకుంటే తప్ప తీరదు. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులను ఆదుకోవాలి. మా కష్టసుఖాలను వినాలి. అలా ఎవరు వచ్చినా కష్టాలను చెప్పుకోవడానికి రైతులు ముందు పడతాం. వస్తే అందుకు ఈ రకంగా చేస్తారా..? దారుణమండి. ఇలా చేయడం కరెక్టు కాదు. పోలీసులు మారాలి. కక్షపూరితమైన రాజకీయాలు వద్దు. మనుషులని చూడండి. రైతు కష్టాలను అన్ని శాఖల అధికారులకంటే.. పోలీసులే దగ్గరుండి చూశారు. మీలో కూడా రైతు కుటుంబాలు ఉన్నాయి..కదా. టోకన్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు కదా.. మళ్లెందుకు ఇలా చేశారు. – పెద్దిరెడ్డి, రైతు, వేపంజేరి -
కర్షకులపై కర్కశమా?
కూటమి ప్రభుత్వం రైతులను కట్టడి చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసింది. పోలీసులతో నిలువరించింది. తెల్లచొక్కా, రైతు కండువ కనిపిస్తే చాలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తమ సమస్యను మాజీ ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని వెళితే తప్పా..? సమస్యలు చెప్పుకుందామని నడుచుకుని వచ్చాం. అడ్డదారులో చేరాం. రాళ్లురప్పలను లెక్క చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి చెంత మామిడి కష్టాలను కన్నీళ్లతో వెలిబుచ్చాం. కర్షకులపై ఇంత కర్కశం పనికిరాదు. – వెంకటరెడ్డి, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు శత్రువులా చూశారు జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి. ఆయనొస్తే..వీళ్లకెందుకు నొప్పి. కూటమి ప్రభుత్వం ప్రజాధరణతోనే గెలిచింది కదా. అలాంటప్పుడు జగన్మోహన్రెడ్డి వచ్చి వెళితే మీకేంటి?.. దానికి ఇంత రాద్ధాంతం చేయలా..?. ఇంతటి దౌర్జన్యం చేసినా రైతులు గుండెనిండా అభిమానంతో జగన్మోహన్రెడ్డిని కలవాలని వచ్చారు. ఆ అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతులను శత్రువులను చూసినట్లు చూశారు. – పద్మనాభరెడ్డి, రైతు నాయకులు ● -
మేత పొరంబోకు భూములను పరిశ్రమలకు ఇవ్వొద్దు
చిల్లకూరు : మేత పొరంబోకు భూములను పరిశ్రమలకు ఇవ్వొద్దని గూడూరు మండలం మేకనూరు గ్రామస్తులు శుక్రవారం సర్వే చేపట్టేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మేకనూరు గ్రామానికి సమీపంలో సర్వే నంబర్ 1లో సుమారు 240 ఎకరాల మేత పొరంబోకు భూములు ఉన్నాయి. వీటిని పరిశ్రమల కోసం కేటాయించేందుకు అధికారులు ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐ చైతన్యతో పాటుగా సిబ్బంది భూముల వద్దకు చేరుకోవడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని అధికారులు తెలిపారు. దీనిపై గ్రామస్తులు కూడా సోమవారం కలెక్టర్ను కలిసి వినతులు అందజేస్తామని గ్రామస్తులు తెలిపారు. -
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 48 మంది న్యాయవాదులు, సంఘ సేవకులకు మధ్యవర్తిత్వం, ఇతర అంశాలపై గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భారతి ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ అనూజ సక్సేన, మధ్యప్రదేశ్కు చెందిన న్యాయవాది, సంఘ సేవకురాలు నీనా కరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి భారతి ఇద్దరు న్యాయవాదులను సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయవాదులు, సంఘ సేవకులు పాల్గొన్నారు. 20న ఐఐటీ 7వ స్నాతకోత్సవం ఏర్పేడు:ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ లో ఈనెల 20వ తేదీన 7వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన 417 మంది విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందించనున్నారు. ముఖ్య అతిథిగా కాగ్నిజెంట్ కో ఫౌండర్ లక్ష్మీనారాయణన్, జేఎస్డబ్ల్యూ ఎండీ సజ్జన్ జింధాల్ హాజరై విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిషేధిత వస్తువులపై 191 కేసులు తిరుపతి క్రైమ్ : జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్వహించిన నిషేధిత వస్తువుల స్పెషల్ డ్రైవ్లో గురువారం రాత్రి వరకు 191 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొ న్నారు. స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాలలో నిషేధిత వస్తువులైన గుట్కాలు, సిగరెట్లు విక్రయించిన వారిపై 200 రూపాయల చొప్పున జరి మానాలు విధిస్తున్నామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇకపై నిరంతరం జరుగుతుందని పేర్కొన్నారు. -
పారిశుద్ధ్యలోపంపై డీపీఓ ఆగ్రహం
రేణిగుంట : పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపంపై గురువారం సాక్షిలో ‘చెత్తగించకంటే చిక్కులే’ కథనం రావడంతో డీపీఓ సుశీలాదేవి స్పందించారు. గురువారం ఉదయం రేణిగుంట పంచాయతీలోని వీధులను పరిశీలించారు. వార్డులలోని ప్రజలను తడి, పొడి చెత్త సేకరణకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.రావడం లేదని స్థానికులు తెలపడంతో పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పారిశుద్ధ్య లోపం రేణిగుంటలో కనబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ ఎంపీడీవో ప్రభురావు, ఈవో మాధవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సర్పంచ్ నగేషంతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇద్దరికీ కలిపి 250 కుటుంబాలను కేటాయించాలని,ఆ ఇళ్లలో చెత్త సేకరణ వీధుల శుభ్రం వంటి బాధ్యతలు వారికి అప్పగించాలని ఆదేశించారు. మరోసారి పరిశీలనకు వచ్చినప్పుడు ఎక్కడైనా పారిశుద్ధ్య లోపం ఉంటే సంబంధిత పారిశుద్ధ్య కార్మికులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థలాలలో చెత్త లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్ తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి 22 ఎర్ర చందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను గురువారం తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ జి.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ మురళీధరరెడ్డి టీమ్ బుధవారం రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మూడు మోటారు సైకిళ్లు , సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి కనిపించారని వారిని చుట్టు ముట్టే క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించగా నలుగురిని పట్టుకున్నారు. వీరిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. పట్టుబడిన వారిని 22 దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించగా డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్స్ నిర్వహణపై ఆరా తిరుపతి అర్బన్ : ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆరా తీశారు. ఇటీవల నాణ్యతలేని ఆహారం తీసుకోవడంతో శ్రీకాళహస్తిలోని ఓ హాస్టల్ విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, పలువురు అధికారులు కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ హాస్టల్పై తీసుకుంటున్న చర్యలను సీఎస్కు వివరించారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా పూతలపట్టు నుంచి జయశంకర్, నగరి నుంచి ఆనంద్, కుప్పం నుంచి సుగుణప్ప, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి జస్టిన్ అజయ్ రాజ్, బీ.శ్రీనివాసులు, జీడీనెల్లూరు నుంచి శేషాద్రి, చిత్తూరు నుంచి లక్ష్మణస్వామి, నగరి నుంచి ఎస్.సుబ్రమణ్యం, పూతలపట్టు నుంచి దేవరాజులు, చంద్రగిరి నుంచి ఎం.వాసు, పుంగనూరు నుంచి మునిరత్నం, కార్యదర్శులుగా జీడీనెల్లూరు నుంచి మణివణ్ణన్, చిత్తూరు నుంచి రాజేంద్రన్, పలమనేరు నుంచి ఆంజనేయులు, నగరి నుంచి అరుణచలం, పుంగనూరు నుంచి రవికుమార్, కుప్పం నుంచి వెంకటప్ప, సత్యవేడు నుంచి శేఖర్, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి టీ.శివకుమార్, టీ.వంశీ, జీడీనెల్లూరు నుంచి మణి, చిత్తూరు నంంచి సురేష్, పలమనేరు నుంచి నాగరాజు, పుంగనూరు నుంచి జయరామ్, సీతాపతి, కుప్పం నుంచి చిన్నతంబి, సత్యవేడు నుంచి రమణయ్య, చంద్రగిరి నుంచి మహదేవ్, సత్యవేడు నుంచి గోవిందం, దేశప్ప, ఈశ్వరయ్య, శ్రీకాళహస్తి నుంచి మహదేవ్, పీ.ఆనందరావు, పూతలపట్టు నుంచి టీ.పరదేశి, చంద్రగిరి నుంచి ఏకాంబరం, సురేష్బాబు, రంగయ్య, రామకృష్ణయ్య, దేవేంద్ర, నాగరాజు, సత్యవేడు నుంచి ప్రతాప్ ఉన్నారు. చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. మహిళ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలుగా చిత్తూరుకు చెందిన హరీషారెడ్డి, జీడీనెల్లూరు నుంచి జ్ఞానమ్మ, పూతలపట్టు నుంచి భారతిమధుకుమార్, తిరుపతి నుంచి నైనూరు మధుబాల, చంద్రగిరి నుంచి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా పుంగనూరు నుంచి జయసుధ, తిరుపతి నుంచి మునీశ్వరి, కుప్పం నుంచి కాంతమ్మ, కార్యదర్శులుగా పుంగనూరు నుంచి ప్రతిభ భారతి, శ్రీలత, జీడీనెల్లూరు నుంచి అనితరెడ్డి, చిత్తూరు నుంచి భాగ్యలక్ష్మి, తిరుపతి నుంచి షర్మిల, రెడ్డిరాణి, ఈసీ మెంబర్లుగా పలమనేరు నుంచి గౌరమ్మ, జమీలా, చిత్తూరు నుంచి కవిత, సత్యవేడు నుంచి కవిత, వెంకటమ్మ, శ్రీకాళహస్తి నుంచి వేలూరు జయశ్రీ,, నగరి నుంచి మంజులరెడ్డి, సత్యవేడు నుంచి దీప, చంద్రగిరి నుంచి గౌతమి, దీపశ్రీ, తిరుపతి నుంచి కవితమ్మ, పుంగనూరు నుంచి ఉష, జీడీనెల్లూరు నుంచి నీలమ్మ, కుప్పం నుంచి అశ్వినీ, పూతలపట్టు నుంచి లీలజ, దీప్తిరెడ్డి, లతను నియమించారు. అంగన్వాడీ అంగన్వాడీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా చంద్రగిరి నుంచి హసీన, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి చిత్తూరు పుష్పలతయాదవ్, జీడీనెల్లూరు నుంచి రమాదేవి, మీనాకుమారి, శ్రీకాళహస్తి నుంచి దేవిక, కార్యదర్శులుగా తిరుపతి నుంచి మునిలక్ష్మి, పద్మ, జీడీనెల్లూరు నుంచి అరుణ, శ్రీకాళహస్తి నుంచి వనజ, రమా, పూతలపట్టు నుంచి భారతి, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి మస్తానమ్మ, రాణెమ్మ, చిత్తూరు నుంచి శాంతి, భారతి, షకీరా, చంద్రగిరి నుంచి బాలసర్వసతి, లక్ష్మి, ఇంద్ర, జీడీనెల్లూరు నుంచి సుమతి, కుప్పం నుంచి నాగమ్మ, మాధవి, వరలక్ష్మి, సత్యవేడు నుంచి స్వప్న నియమితులయ్యారు. బీసీసెల్ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నగరి నుంచి పరంధామయాదవ్, తిరుపతి నుంచి బీ.అరుణ్యాదవ్, పుంగనూరు నుంచి వెంకటరమణ, కుప్పం నుంచి రాజా, ప్రధాన కార్యదర్శులుగా చిత్తూరు నుంచి నవీన్యాదవ్, నగరి నుంచి భాస్కర్యాదవ్, పుంగనూరు నుంచి ఎన్.నరసింహులు, జీడీనెల్లూరు నుంచి వేణుబోయడు, తిరుపతి నుంచి దామోదారం, పూతలపట్టు నుంచి యోగమూర్తి, కుప్పం నుంచి రమేష్, చంద్రగిరి నుంచి రాజేష్, తిరుపతి నుంచి టీ.మహేష్, కార్యదర్శులుగా చిత్తూరు నుంచి చంద్ర, నగరి నుంచి కార్తీకేయన్, పలమనేరు నుంచి ప్రకాష్, పుంగనూరు నుంచి వెంకట్రెడ్డి, వెంకటేష్, జయచంద్ర, జీడీనెల్లూరు నుంచి విజ్వేల్రెడ్డి, మునిరాజా, వై.మురళీయాదవ్ ఉన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జీడీనెల్లూరుకు చెందిన యేసురత్నం, తిరుపతి నుంచి రాజేశ్వరి, చంద్రగిరి నుంచి ఉమాపతి, కార్యదర్శులగా జీడీనెల్లూరు నుంచి ఆశ్వీరాదం, నగరి నుంచి రవి, తిరుపతి నుంచి ఎన్.మురళీ, సత్యవేడు నుంచి మాణిక్యం, జేమ్స్, పుంగనూరు నుంచి శ్రీరాములు, చిత్తూరు నుంచి దీనదయాలన్, కుప్పం నుంచి శ్రీరాములు, చంద్రగిరి నుంచి ఎస్.జి.జాన్ను నియమించారు. కల్చరల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడుగా తిరుపతి నుంచి కే.కేశవులు, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి ఎ.రాఘవనాయుడు, జీడీనెల్లూరు నుంచి దామోదర్, చిత్తూరు నుంచి బిందు, నగరి నుంచి మురళీరెడ్డి, చంద్రగిరి నుంచి గురుశంకర్, కార్యదర్శులుగా తిరుపతి నుంచి కృపావతి, జీడీనెల్లూరు నుంచి మోహన్, చిత్తూరు నుంచి సల్మా, పలమనేరు నుంచి శ్రీనివాసులు, నగరి నుంచి నారాయణరెడ్డి, కుప్పం నుంచి జయప్రకాష్, ఈసీ మెంబర్లుగా నగరి నుంచి షణ్ముగం, సుబ్రమణ్యం, జీడీనెల్లూరు నుంచి శేషాద్రి, పలమనేరు నుంచి మునిరాజు, చంద్రగిరి నుంచి ఓ.బాలరామ్రెడ్డి, వీరనారాయణరెడ్డి, ఈశ్వరయ్య, కుప్పం నుంచి రామ్మూర్తిజోని, వెంకటేష్, సత్యవేడు నుంచి సూరిబాబురెడ్డి, పళనిలు ఉన్నారు. బూత్కమిటీ ఉపాధ్యక్షులుగా రాంగణేష్(చిత్తూరు)ఎన్.యోగంజనేయరెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా శివాజీ (జీడీనెల్లూరు), యువన్(చిత్తూరు), ఎస్.హరిప్రసాద్రెడ్డి(తిరుపతి). రామకృష్ణంరాజు(నగరి), ప్రకాష్(శ్రీకాళహస్తి), కార్యదర్శులుగా మణి(పలమనేరు), లోకేష్రెడ్డి(జీడీనెల్లూరు), మురళీకృష్ణనాయుడు (నగరి), కే.ధనంజయులు(తిరుపతి), రామకృష్ణ(కుప్పం) గుణశేఖర్రెడ్డి(చంద్రగిరి), మధుమోహన్రెడ్డి (శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా రెడ్డప్ప, సాయికుమార్, నీల, సుబ్రమణ్యం, రామచంద్రారెడ్డి, రవి, ప్రకాష్, అజయ్కుమార్, షేక్గఫూర్, దయాకర్, భూపతిలు ఉన్నారు. ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం ప్రధాన కార్యదర్శులుగా డీ.నారాయణరెడ్డి (తిరుపతి), దొరస్వామి (జీడీనెల్లూరు), కార్యదర్శులుగా కనికిరెడ్డి (తిరుపతి), సింగరం (నగరి), అపంరాజు (జీడీనెల్లూరు), బాలరామిరెడ్డి (తిరుపతి), ఈసీ మెంబర్గడా నీలకంఠం (తిరుపతి)లు ఉన్నారు. గ్రీవెన్స్ విభాగం కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా గంగప్ప(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా గిరిధర్రెడ్డి (జీడీనెల్లూరు), దశరాథరెడ్డి(నగరి), విజయ్భాస్కర్రెడ్డి(పుంగనూరు), ఎం.నాగేశ్వరరావు(తిరుపతి),కార్యదర్శులుగా దేవరాజులు(పలమనేరు), జగదీష్రెడ్డి(జీడీనెల్లూరు), కుమార్రెడ్డి, గురువయ్య (నగరి), కుమార్నాయుడు(పుంగనూరు), పీ.దుర్గా, మనోహర్రెడ్డి(తిరుపతి), మణి(కుప్పం)ఈసీ 19 మందిని ఎంపిక చేశారు. ఇంటలెక్చువల్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మోహన్(జీడీనెల్లూరు), చెంగాల్రాజు(తిరుపతి), వెంకట్రెడ్డి(చంద్రగిరి), కార్యదర్శులుగా అరవింద్(చిత్తూరు), పెరిస్వామిరెడ్డి(జీడీనెల్లూరు), వీరభద్ర(పలమనేరు), రామకృష్ణ(పుంగనూరు), ఫరీడ్సాహెబ్(తిరుపతి), మనోహర్రెడ్డి(కుప్పం), వజ్రవేలు(సత్యవేడు), ఈసీ మెంబర్లుగా 12 మందిని ఎంపిక చేశారు. ఐటీవిభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రవీన్కుమార్రెడ్డి(చిత్తూరు), లతీష్రెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా లక్ష్మిదీపక్వేమూరి, నిశాంత్ కసిరెడ్డి(తిరుపతి), శంకర్రెడ్డి(పుంగనూరు), శివకుమార్రెడ్డి(శ్రీకాళహస్తి), ప్రకాష్రెడ్డి(నగరి), కార్యదర్శులుగా రెడ్డిసాయి(చిత్తూరు), వెంకనసాయిచంద్(తిరుపతి), లోకేష్రెడ్డి వేపంజేరి(జీడీనెల్లూరు), పవన్కుమార్(శ్రీకాళహస్తి), ఇంద్రేష్(పలమనేరు), హేమంత్(చంద్రగిరి), పెనుమూరు అమర్నాథ్రెడ్డి(పుంగనూరు), ఈసీ మెంబర్లుగా 23 మందిని ఎంపిక చేశారు. లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా రవీంద్రనాధ్రెడ్డి(తిరుపతి), పీ.సుధాకర్రెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా మహదేవ్(తిరుపతి), హరిబాబు(జీడీనెల్లూరు), ఉదయభాను(నగరి), కార్యదర్శులుగా బాలాజీ(తిరుపతి), జయచంద్రరెడ్డి(జీడీనెల్లూరు), భాస్కర్రెడ్డి(పలమనేరు), సతీష్, సుజాత(సత్యవేడు), తులసీరామ్ (శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా ఏడుగురిని నియమించారు. మున్సిపల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ.రాధరెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా కే.ఆంజనేయులు(తిరుపతి), వెంకటేష్(నగరి), కార్యదర్శులుగా పీ.సునీత(తిరుపతి), గిరిబాబు(చిత్తూరు), లోకేష్(పలమనేరు), బుబాలన్(నగరి), ఈసీ మెంబర్లుగా నలుగురిని నియమించారు. ఆర్టీఐ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ప్రభాకర్రెడ్డి(తిరుపతి), కృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), ట.గంగధర్(నగరి), బీ.సుధాకర్, శ్రీరాములు(చంద్రగిరి), కార్యదర్శులుగా మురళి(తిరుపతి), లోకనాథరెడ్డి, హరిప్రసాద్రెడ్డి(జీడీనెల్లూరు), దినేష్(చిత్తూరు), వెంకటరత్నం(పలమనేరు), రాగేష్(నగరి), మురళీకృష్ణ(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 17 మందిని నియమించారు. మైనారిటీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన మస్తాన్సయ్యద్, నగరి నుంచి జలభాయ్, తిరుపతి నుంచి చాన్బాషా, శ్రీకాళహస్తి నుంచి జి.షేక్జుమ్లాషా, ప్రధాన కార్యదర్శులుగా చిత్తూరు నుంచి మహమ్మద్ యాయాజ్ హుస్సేన్, జీడీనెల్లూరు నుంచి తౌకిరీఖాన్, చిత్తూరు నుంచి జైనులాబిద్దిన్, తిరుపతి నుంచి గఫూర్, కార్యదర్శులుగా పుంగనూరు నుంచి మునీర్ఖాన్, చిత్తూరు నుంచి సుల్తానాబేగం, పలమనేరు నుంచి షమీర్, జీడీనెల్లూరు నుంచి గాఫోర్, కుప్పం నుంచి ఖలీల్, అబ్దుల్లతీష్, చంద్రగిరి నుంచి ఇర్షాద్, తిరుపతి నుంచి సలీంబాషా, ఈసీ మెంబర్లుగా పుంగనూరు నుంచి షేర్ఖాన్, మస్తాన్వాలి, డీకేం జియా, షేక్ఇమ్రాన్, అస్లాంబాషా, ఖలీల్, చిత్తూరు నుంచి ఆరీఫ్, పలమనేరు నుంచి థబ్రేజ్, జీడీనెల్లూరు నుంచి అమీన్, సత్యవేడు నుంచి ఎసక్, ఇస్మాయిల్, శ్రీకాళహస్తి నుంచి షేక్బాబు, సయ్యద్కరీముల్లా, షేక్ అజీబాషా, తిరుపతి నుంచి మహబూబ్బాషా, కుప్పం నుంచి గౌస్బేగ్, చంద్రగిరి నుంచి ఖాజాపీర్, రషీద్, వై.రఫిక్బాషా, నాగూర్బాషాలు ఉన్నారు. ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా చంద్రగి నుంచి రత్నమ్మ, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి వై.వెంకటరమణ, జీడీనెల్లూరు నుంచి మార్కొండేయులు, కార్యదర్శులుగా తిరుపతి నుంచి ఎం.నవీన్కుమార్, జీడీనెల్లూరు నుంచి చిరంజీవి, పలమనేరు నుంచి చంద్రయ్య, కుప్పం నుంచి చంద్రశేఖర్నాయక్, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి జయమ్మ, చిత్తూరు నుంచి రాము, పలమనేరు నుంచి గోవిందు, పుంగనూరు నుంచి బసవరాజు,లోకనాథ్, చంద్రగిరి నుంచి వెంకటరమణనాయక్, చెంచయ్య, సత్యవేడు నుంచి కలివెలయ్య, యెల్లయ్య, వెంకటేశులు, శ్రీకాళహస్తి నుంచి భారతి, మనోహర్, చంద్రను నియమించారు. డాక్టర్ల విభాగం ఉపాధ్యక్షులుగా డాక్టర్ జనార్దన్రాజు(తిరుపతి), డాక్టర్ శివకుమార్రెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చందన(తిరుపతి), డాక్టర్ పృథ్వీరాజు(జీడీనెల్లూరు), డాక్టర్ రాజేష్ (చంద్రగిరి), డాక్టర్ ప్రదీప్కుమార్(తిరుపతి), డాక్టర్ ఢిల్లీప్రసాద్(చిత్తూరు), చంద్రశేఖర్రెడ్డి(పలమనేరు), డాక్టర్ రాజేష్రెడ్డి(శ్రీకాళహస్తి), డాక్టర్ రాజేష్(సత్యవేడు), డాక్టర్ సురేష్రెడ్డి(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా డాక్టర్ లియఖత్, డాక్టర్ జనార్దన్రాజు, డాక్టర్ ధనంజయ్రెడ్డి ఉన్నారు. పంచాయతీరాజ్ జిల్లా ఉపాధ్యక్షులుగా కమలాకర్రెడ్డి(పుంగనూరు), రమేష్బాబు(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ప్రసాద్బాబు(చిత్తూరు), ధనంజయ్వర్మ(జీడీనెల్లూరు), సుధాకర్రెడ్డి(నగరి), దామోదార్(పుంగనూరు), దుర్వాసులురెడ్డి(పూతలపట్టు), శ్రీరాములుగౌడ్, రంగప్పగౌడ్(కుప్పం), యతీశ్వర్రెడ్డి, మహేంద్రరెడ్డి(చంద్రగిరి), కార్యదర్శులుగా పరంధామరెడ్డి(చంద్రగిరి), సురేంద్రబాబు(చిత్తూరు), మల్లీశ్వరరెడ్డి(పలమనేరు), గోవిందయ్య(జీడీనెల్లూరు), సి.ప్రసాద్రాజు(నగరి), నిరంజన్కుమార్రెడ్డి, రవిచంద్రరెడ్డి(పుంగనూరు), శంకర్రెడ్డి (చంద్రగిరి), 17 మందిని ఈసీ మెంబర్లను నియమించారు. ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా ఎ.సూరి(పుంగనూరు), ఎస్.నాగేంద్ర(తిరుపతి), సుధాకర్, యోగానందరెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా యశోదమ్మ(జీడీనెల్లూరు), నరసింహమూర్తి(పుంగనూరు), రామచంద్రరెడడ్డి(నగరి), మధుసూదన్నాయుడు(తిరుపతి), కార్యదర్శులుగా శరన్కుమార్(చిత్తూరు), మాకయ్య(పలమనేరు), భువనేశ్వరి(జీడీనెల్లూరు), బాబురెడ్డి(నగరి), కృష్ణవంశీ(తిరుపతి), ఈసీ మెంబర్లు 17 మందిని నియమించారు. -
సంతకబీర్ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన
వెంకటగిరి(సైదాపురం) : చేనేత కళల్లో నైపుణ్యం జోడించి మగ్గంపై ఆసక్తికరమైన డిజైన్లను నేసిన వెంకటగిరి వాసి లక్కా శ్రీనివాసులు సంతకబీర్ అవార్డు కై వసం చేసుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగు గంగ అతిథి గృహంలో చేనేత కళాకారుడు లక్కా శ్రీనివాసులను కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శాలువకప్పి అభినందించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోనే వెంకటగిరికి చెందిన శ్రీనివాసులు ఎంపిక కావడం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉందని తెలిపారు. వస్త్రంపై రెండు వైపులా ఒకే డిజైనింగ్ ఉండేలా తయారు చేసి అవార్డు సాధించడం గొప్పవిషయమన్నారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య తిరుపతి క్రైమ్ : తిరుపతి–రేణిగుంట రైల్వేస్టేషన్ మధ్య శెట్టిపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా, వడ్డేపల్లికి చెందిన సాకలి వీరేష్( 27) ఆటోనగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. యువకుడు కోరమీనుగుంటలో నివాసం ఉంటున్న లోకేష్ బాబు జేసీబీకి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సొంతూరికి వెళ్తున్నానని స్నేహితులకు చెప్పి బుధవారం రాత్రి రూమ్ నుంచి వెళ్లిపోయాడు. అయితే రూమ్ నుంచి వచ్చిన వీరేష్ రైలు కింద పడి మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
వ్యర్థాల నిర్వహణ పరిశీలన
తిరుపతి తుడా : తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ ప్లాంట్లను కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం, కమిషనర్ మౌర్యతో కలిసి గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా తూకివాకం, రామాపురం చెత్త నిర్వహణ ప్లాంట్లతో పాటు తిరుపతి నుంచి తూకివాకం వరకు మురుగు నీటి సరఫరా అయ్యే భూగర్భ డ్రైనేజీ పైపులైన్ రేణిగుంట మార్గంలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తూకివాకం వద్ద గల మురుగు నీటిశుద్ధి కేంద్రం, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. మురుగు నీరు శుద్ధి చేసి ఫ్యాక్టరీలు, పంటలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్ వివరించారు. అనంతరం రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్ను పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమంలో అమృత్ పథకం సంయుక్త కార్యదర్శి ఇషా కాలియా, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్, రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి , మున్సిపల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ఛానల్ ద్వారా గుండె మార్పిడి
● గుంటూరు నుంచి తిరుపతికి తరలించిన వైద్యులుతిరుపతి తుడా : గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న గోదావరి జిల్లాకు చెందిన నారాయణరావు( 34)కు గుంటూరుకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి గుండెను విజయవంతంగా అమర్చిన ఘటన తిరుపతిలోని టీటీడీ పరిధిలో నడుస్తున్న శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన జ్యోత్రిభాను(55) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్కు గురైనట్లు రమేశ్ హాస్పటల్ వైద్యులు నిర్ధారించారు. ఆ విషయాన్ని వైద్యులు బాధితుడి కుటుంబ సభ్యులకు వివరించడంతో అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. వెంటనే ఆస్పత్రి నిర్వాహకులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో జ్యోత్రిభాను అవయవాలను తరలించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే నారాయణరావు(34) కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతి శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం జీవన్ధాన్ పోర్టల్లో నమోదు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి చేరుకొని అక్కడి వైద్యులు, కుటుంబ సభ్యులతో సంప్రదించి జ్యోత్రిభాను నుంచి గుండె సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి గురువారం రేణిగుంట విమానాశ్రయానికి అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి తీసుకొచ్చి నారాయణరావుకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. -
విద్యార్థుల ఆస్తకిని ప్రోత్సహించాలి
వెంకటగిరి రూరల్: విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వెంకటగిరి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు జిల్లా అఽధికారులు టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో తల్లిదండ్రులు భాగస్వామ్యులు కావాలన్నారు. ఐసర్లో కేవలం 3 శాతం మంది మాత్రమే తెలుగువారు ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచే దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే రామకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ సురేష్, ఏపీసీ గౌరిశంకర్, ఎంపీపీ తనుజారెడ్డి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధర్, ఎంఈఓ బాబయ్య, పాఠశాల ప్రిన్సిపల్ తులసిజ్యోతి, తహశీల్దార్ వెంకట నరసింహారావు, ఎంపీడీఓ గుణశేఖర్రెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ గిరిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
TTD: అన్యమతస్తులను కొనసాగిస్తూనే ఉంటారా?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. అసలు అలాంటి వాళ్లు విధుల్లో ఎందుకని.. వాళ్లను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని టీటీడీని నిలదీశారాయన. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంపై కరీంనగర్(తెలంగాణ) బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. అలాంటి వాళ్లను కొనసాగిస్తుండడం ఏంటి?. చర్చి, మసీదుల్లో హిందువులకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తున్నారా?.. .. అన్యమతస్తులైన ఉద్యోగుల వల్ల హిందూ ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?. అలాంటి వాళ్లు ఉన్నారని బయటకు వస్తేనే సస్పెండ్ చేస్తారా?. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండి. టీటీడీలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు… ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలి’’ అని బండి సంజయ్ టీటీడీని డిమాండ్ చేశారు. అదే సమయంలో.. తెలుగు రాష్ట్రాల్లో దూపదీప నైవేద్య నోచుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందని స్పష్టం చేశారాయన. అనేక చారిత్రక పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటు అందించాలి. కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ నిర్మాణంతో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట రామాలయం అభివృద్ధికి టీటీడీ సహకరించాలని కోరుతున్నా అని బండి సంజయ్ అన్నారు. -
సర్కార్కు రైతులంటే చులకన
కూటమి సర్కార్కు రైతు లంటే చులకనగా ఉంది. దాంతోనే వారి సమస్యలను అసలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగా అన్న మహానుభావుడు. ఈ నేపథ్యంలోనే గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నా, వారిని పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నేత కర్షకులను పరామర్శించడం ఎంతో నేరంగా భావిస్తున్నారు. దానికితోడు చంద్రబాబు కు అనుకూలంగా ఉన్న మీడియా రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరిస్తూ కథనాలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం. పత్రికలు ప్రజల పక్షాన పనిచేయాల్సి ఉందే తప్ప.. కూటమి సర్కార్ వైపు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. – బాలయ్య, రైతు, వాకాడు మండలం ● -
నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్
నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి దుంగలు, మూడు బైక్లను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది మంచి పద్ధతి కాదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలో దండుపాళ్యెం బ్యాచ్ దాడులంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు రాయడాన్ని తప్పుపడుతున్నాం. పత్రికలంటే ఎంతో గౌరవం ఉంది. ఒక వేళ రాజకీయంగా మీకు అనుకూలంగా ఉన్న నాయకుడిపై మంచి కథనాలు రాసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే రైతులకు వ్యతిరేకంగా దండుపాళ్యెం బ్యాచ్ అంటూ కథనం ఇవ్వడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. – సుబ్రమణ్యం, రైతు, జంగాలపల్లి, వెంకటగిరి రూరల్ మండలం మంచి చెడులతో సంబంధం లేదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలకు మంచి చెడులతో సంబంధం లేదు. రైతులు, పేదోడు అనే భావన లేదు. ఒకటే మార్గం చంద్రబాబు ఏమీ చేసినా అదే కరెక్ట్గా భావిస్తున్నారు. ఆయనపై ఒక కథనం చెడుగా ఇప్పటి వరకు ఆ పత్రికల్లో రాలేదు. అంటే సీఎం చంద్రబాబు వందశాతం మంచే చేస్తున్నారా? ప్రతి పక్షనేతపై ఒక్క మంచి కథనం ఇప్పటివరకు ఇవ్వలేదు. చివరికి దండుపాళ్యెం బ్యాచ్ అంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయమో తెలియడం లేదు. – గుర్రం నాగిరెడ్డి, రైతు, ఆర్సీ పురం దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఎంటీ ? రైతులను ఎల్లో మీడియా దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఏమిటో తెలియడం లేదు. ఎంతో దారుణంగా కథనాలు రాస్తున్నా రు. చంద్రబాబును బతికించడానికే ఆ పత్రికలు పనిచేస్తున్నాయి. మామిడి రైతులు కష్టాల్లో ఉంటే వారిని పరామర్శించడానికి వచ్చిన వారిపై విషాన్ని చిమ్మడం ఎందుకో అర్ధం కావడం లేదు. పత్రిక విలువలు పూర్తిగా దిగజార్చి కథనాలు రాస్తున్నా యి. రైతులకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం. – తిరుమల రెడ్డి, రైతు, కారూరు, సూళ్లూరుపేట నియోజకవర్గం – 8లో -
ప్రతి పక్షనేత వచ్చాక కేంద్రానికి లేఖ ఏమిటో?
మామిడికి నెలరోజులుగా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వారిని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పరామర్శించిన తరువాత వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు కేంద్రానికి లేఖ రాయడం ఏమిటో తెలియడం లేదు. ఓ పత్రికలో రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరించడం సరికాదు. వారి కష్టాలను ఆ పత్రికలు గుర్తించాల్సి ఉంది. వారికి అండగా ఉండాలే తప్ప, వారికి వ్యతిరేకంగా కథనాలు రాయడం మంచిది కాదు. – అత్తిరాల సురేష్, రైతు, అంజూరు, కేవీబీపురం మండలం -
మొక్కుబడిగా సమావేశాలు
● పీటీఎంపై ఆసక్తి చూపని తల్లిదండ్రులు ● విలీనమైన పాఠశాలల్లో సమావేశాలు రద్దు తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం తలపెట్టిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు మొక్కుబడిగా సాగాయి. ఈ సమావేశానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. అనుకున్న షెడ్యూలు ప్రకారం సాయంత్రం వరకు నిర్వహించాల్సిన వీటికి తల్లిదండ్రులు అధిక శాతం హాజరుకాక పోవడంతో చాలా వాటిలో మధ్యాహ్నానికే సమావేశాలను ముగించేశారు. ప్రభుత్వం సూచించిన షెడ్యూలు మేర ఈ సమావేశాలను నిర్వహించలేకపోయారు. ఈ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను లీప్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని చెప్పినా యాప్ సర్వర్ పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. తల్లిదండ్రుల పెద్ద సంఖ్యలో గైర్హాజరవ్వడంతో ప్రోగ్రెస్ కార్డులు, మొక్కలను పంపిణీ చేసి మమ అనిపించేశారు. హాజరైన తల్లిదండ్రులతో ఆటలపోటీలు నిర్వహించి మధ్యాహ్నానికే సమావేశాలను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా కేవీబీ పురం మండలంలోని బంగారమ్మ కండ్రిగ, గురుకులకండ్రిగ, అనంతపద్మనాభపురం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మరో పాఠశాలలకు విలీనం చేయడంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో సమావేశాలను వాయిదా వేశారు. -
పీజీ ఆన్లైన్ కోర్సులను రద్దు చేయాలి
తిరుపతి సిటీ : పీజీ విద్యలో ఆన్లైన్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం ఎస్వీయూ వీసీ అప్పారావును కలసి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆష మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఫీజులు పెంచడం, ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉన్నత విద్యాధికారులు పీజీ విద్యార్థులను తాము చదివే చదువుతో సంబంధం లేని నాలుగు రకాల ఆన్లైన్ కోర్సులు స్వయం యాప్లో ఎంపిక చేసుకుని, ఒక్కొక్క కోర్సుకు రూ.1000 చొప్పున నాలుగు సబ్జెక్టులకు రూ.4000 ఫీజు చెల్లించాలంటూ చెప్పడం దారుణమన్నారు. ఆన్లైన్ కోర్సులో మార్కులు తక్కువ వచ్చి సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే యథావిధిగా ఫీజు చెల్లించి పరీక్షలు రాయాలని, అటెండెన్స్ తప్పనిసరి అని, ఈ కోర్సులు పూర్తి చేయకపోతే మొత్తంగా పీజీ కోర్సు ఫెయిల్ అయినట్టేనని విద్యార్థులను ఉన్నత విద్యామండలి వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3220 అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా, ల్యాబ్లు, నాణ్యమైన విద్య అందించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించకుండా ఆన్లైన్ కోర్సులలో ప్రతిపాదించడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐ నాయకులు నరసయ్య, గీత, పీడీఎస్ఓ నాయకులు స్రవంతి, దేవేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయ్యప్ప మాలధారణ
తిరుపతి కల్చరల్:శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అయ్యప్ప మాల ధారణ చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన పెద్దిరెడ్డి పుష్కరిణిలో స్నానం అనంతరం ఆలయంలో అర్చకుల చేత అయ్యప్ప మాల ధారణ స్వీకరించారు. అనంతరం ఆలయంలో శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ : స్థానిక అలిపిరి, జూపార్క్ రోడ్డులోని ఉదయమానిక్యం మహాత్మా జ్యోతి బాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రేష్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈనెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 90007 83185 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు. మహిళల అభివృద్ధికి ప్రోత్సాహకం తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో పీఎం ఉషా స్కీంలో భాగంగా గురువా రం జెండర్ ఇంక్లూజీవ్ ఎంపవర్మెంట్ ఇనిషియేటీవ్ అనే అంశంపై కళాశాలల ప్రిన్సిపల్స్కు వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు, రుసా కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భరత్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మహిళా సాధికారత, జీవనోపాధి పెంపొందించడమే రుసా లక్ష్యమని, అందుకోసం మహిళలను ప్రోత్సహించేందుకు అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నా రు. వీసీ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ.. పీఎం ఉష ద్వారా రూ.100 కోట్లు మహిళా యూనివర్సిటీకి రావడం చాలా సంతోషమని, ఇన్స్టిట్యూషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా పరిసర ప్రాంత మహిళల అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇచ్చి సాధికారిత వైపు ప్రోత్సహించడం అవసరమన్నారు. కార్యక్రమంలో కేరళ ఏఎస్ఏపీ సీఎండీ డాక్టర్ ఉష, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ తులసి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజిని పలు కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. పీటీఎంలో ప్రొటోకాల్ రగడ చిట్టమూరు : ప్రభుత్వ పాఠశాల్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో మండలంలోని ఆరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. సమావేశంలో పనిచేసే ఉపాధ్యాయుడు ముందుగా స్కూల్ కమిటీ చైర్మన్ను స్టేజీ మీదకు పిలవకుండా టీడీపీ నేతలను పిలిచారని ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పాఠశాలకు రంగుల వేసేందుకు ఉపాధ్యాయులు గ్రామంలో కూటమి నాయకుల వద్ద చందాలు వసూలు చేసి రంగులు వేయించారు. దాతలను ముందుగా స్టేజ్ పైకి పిలిచారని, ప్రొటోకాల్ పాటించలేదని మరో వర్గానికి చెందిన కూటమి నేతలు ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉపాధ్యాయులు కూటమి నేతలకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో మండల విద్యాశాఖ అధికారి బీవీ కృష్ణయ్య ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్డే నిర్వహించారు. -
పాఠశాల విలీనంపై నిరసన
● పేరెంట్స్– టీచర్స్ సమావేశంలోనే తల్లిదండ్రుల ఆవేదన నాయుడుపేట టౌన్ : చంద్రబాబు నాయుడు కాలనీ పాఠశాల విలీనం రద్దు చేస్తామని ఎంఈవో చెబితేనే తిరిగీ 1, 2 తరగతుల పిల్లలను పాఠశాలకు పంపుతున్నామని ఇప్పటి వరకు సమస్యను పట్టించుకోలేదని కాలనీ వాసులు పాఠశాల వద్ద గురువారం జరిగిన తల్లిదండ్రుల సమావేశం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు స్పందించకపోతే మళ్లీ 1, 2 తరగతుల విద్యార్థులను పాఠశాలకు పంపకుండా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇక్కడి పాఠశాలకు చెందిన 3,4,5 తరగతులకు చెందిన 30 మందికి పైగా విద్యార్థులను తుమ్మూరు పాఠశాలలో విలీనం చేసినా అక్కడికి వెళ్లడం లేదు. పాఠశాలను చంద్రబాబు కాలనీలోనే యథావిధిగా ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల విలీనం రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు కాలనీలో 3,4,5 తరగతులకు చదివే విద్యార్థులు సుమారు 30 మందికి పైగా విలీనం అయిన పాఠశాలకు వెళ్లడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. చంద్రబాబు కాలనీ నుంచి ప్రమాదకరంగా ఉండే రైలు పట్టాలు, జాతీయ రహదారి దాటుకుని తుమ్మూరు పాఠశాలకు ఎట్టి పరిస్ధితిలో విద్యార్థులను పంపలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టి చంద్రబాబు కాలనీ పాఠశాల విలీనం రద్దు చేయాలి. – నిర్మల, స్కూల్ కమిటీ చైర్పర్సన్, చంద్రబాబు నాయుడు కాలనీ -
రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరణపై ఆగ్రహం
● విలువలు పాటించకుండా కర్షకులపై వ్యతిరేక కథనాలు ● కూటమి సర్కార్కు తొత్తుగా మారిన పచ్చమీడియా ● మండిపడుతున్న అన్నదాతలు రైతులను అవమానించడం దారుణం బంగారుపాళెం సమావేశానికి వెళ్లిన వారు రైతు లు కాదు.. దండుపాళెం బ్యాచ్ అంటూ ఓ పత్రిక లో వార్త చూశా. ఓ రైతు గా మనసులో చాలా బాధేసింది. పదిమందికి అన్నం పెట్టే రైతులంటే అందరికీ చులకన అయినట్టుంది. అన్నీ తెలిసి, బాగా చదువుకున్న వారే ఇలాంటి రాతలు రాయడం మంచిది కాదు. ఆ స్థానంలో మామిడి రైతే కాదు ఏ రైతున్నా ఒక్కటే కదా? ఎవరిపైనో కోపాన్ని రైతులపై చూపడం భావ్యం కాదు. – గోవిందురెడ్డి, రైతు, బేరుపల్లి -
లాఠీ కాఠిన్యం.. రక్తమోడినా తరగని అభిమానం
చిత్తూరు: తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్రెడ్డికి వైఎస్ఆర్ అన్నా.. ఆ కుటుంబమన్నా అతనికి ప్రాణం.. మహానేత రాజశేఖరరెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా.. పది మందికీ అన్నం పెడతాడు; రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకుంటాడు.. జననేత జగనన్న అంటే అతనికి మహాఇష్టం.. రాజన్న బిడ్డగానే కాదు.. తన అభిమాన నాయకునిగా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతడు అభిమాననేత పర్యటనకు ఉత్సాహంగా వెళ్లాడు. అయితే అడుగడుగునా పోలీసుల అవరోధాలు, ఆంక్షలు అధిగమించి వెళ్లిన అతడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. లాఠీచార్జ్ చేసి తల పగగొట్టారు.వివరాలు..మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వాన్ని నిలదీయడానికి బంగారుపాళెంకు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకుని శశిధర్రెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం 5 గంటలకే తిరుపతి నుంచి బయలుదేరి పోలీసుల ఆంక్షలన్నీ అధిగమించి బంగారుపాళెం వెళ్లిన శశిధర్రెడ్డి అక్కడకు వచ్చిన వేలాది మంది జనంలో ఒక్కడిగా జగనన్న రాక కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో జగనన్న కాన్వాయ్ వస్తుండగా జనం తోపులాటలో తాను దగ్గరకు వెళ్లి కళ్లారా జగనన్నను చూడాలని తపించాడు.దీంతో అక్కడే ఉన్న పోలీసులు తమ చేతిలోని లాఠీలకు పనిచెప్పారు. రాక్షసత్వంగా వ్యవహరించి తలపై లాఠీలతో బలంగా కొట్టారు. ఆ లాఠీ దెబ్బకు తలపగిలిన శశిధర్రెడ్డి ముఖంపై రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అలాగే ముందుకొచ్చాడు.. ఇది చూసి జగనన్న చలించిపోయారు. కాన్వాయ్ దిగి అతని వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గాయపడ్డ శశిధర్రెడ్డిని దగ్గరకు తీసుకుని తలకు తగిలిన గాయం చూసి మరింత ఆవేదనతో పోలీసుల తీరుపై అక్కడే ఉన్న ఎస్పీ మణికంఠ చందోలుపై మండిపడ్డాడు. తన కోసం వచ్చిన కార్యకర్తల తలలు పగలగొట్టడమేమిటని ప్రశ్నించారు. అనంతరం శశిధర్రెడ్డిని ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. శశిధర్రెడ్డి కూడా తన అభిమాన నాయకున్ని చూశానన్న ఆనందంలో తలకు తగిలిన గాయా న్ని లెక్క చేయకపోవడం విశేషం! ఆ తరువాత కొంతసేపటికి అక్కడే ఉన్న అంబులెన్స్లో ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి తిరుపతికి చేరుకున్నాడు. -
అనుమతి లేదంటూ అరెస్టు
పెళ్లకూరు : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మామిడి సాగు రైతుల పరామర్శకు జిల్లాకు వచ్చిన సందర్భంగా హాజరయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చిందేపల్లి మధుసూదన్రెడ్డి పుల్లూరు నుంచి వెళుతుండగా మార్గమధ్యలో రెడ్డిగుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిడి రైతుల పరామర్శ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొనేందుకు అనుమతి లేదంటూ చిందేపల్లిని అరెస్టు చేసి ఆయన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిగరపల్లి బడిని కొనసాగించాలి పాకాల : మండలంలోని చిగరపల్లి ఎంపీపీ పాఠశాలను గతంలో మాదిరిగానే కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో పాఠశాలను 5వ తరగతి వరకు కొనసాగించాలని, పాఠశాలను విలీనం చేయడంతో సుమారు 4 కిలో మీటర్లు నడిచి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి వరకు, గతంలో నిర్వంహించిన మాదిరిగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు మమత, ఝాన్సీ, గౌరి, మీన, జ్యోతి, పుష్ప, సుబ్రమణ్యం, శిరీష, శ్రీనివాసులు, గోపి, కుమార్, మంజునా థ్, విశ్వనాథ్, హేమలత, ధనమ్మ, ధనలక్ష్మి, చిట్టి పాల్గొన్నారు. -
సహకార సంఘాల సేవలు వినియోగించుకోండి
తిరుపతి అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సింగిల్ విండో సొసైటీలు)సేవలను రైతులతోపాటు అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆ విభాగానికి చెందిన జిల్లా అధికారిణి నాగవర్ధిని పేర్కొన్నారు. ఇటీవల చిత్తూరు నుంచి బదిలీపై తిరుపతి జిల్లాకు విచ్చేసిన ఆమె బుధవారం కలెక్టరేట్లోని తమ చాంబర్ నుంచి మాట్లాడారు. సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా సొసైటీల ఆధ్వర్యంలో జిల్లాలో 8 పెట్రోల్ బంకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో తంగేళ్లపాళెం, కాయంపేట, సత్యవేడు, ఎర్రావారిపాళెం, వెంకటగిరి, చిట్టమూరు, చిల్లకూరు, నాయుడుపేట సింగల్ విండో సొసైటీల ఆర్థిక బలోపేతం కోసం రెండేళ్ల క్రితం పెట్రోల్ బంకులు మంజూరు చేశారని వాటిని వాడుకలోకి తీసుకురానున్నామని చెప్పారు. సొసైటీల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు నాణ్యమైన ఎరువులను రైతులకు తక్కువ ధరలకే అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు పంట రుణాలతోపాటు తక్కువ వడ్డీలతో బంగారు రుణాలు ఇస్తున్నామని వివరించారు. ఆయా మండల పరిధిలోని రైతులు సింగిల్ విండో సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మల్టీపర్పస్ గోదాములను రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. -
తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందాలి
తిరుపతి అర్బన్ : దేశంలోనే కీలకమైన ప్రదేశాల్లో తిరుపతి ఒకటని, అయితే ఆ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితల అభిప్రాయపడ్డారు. తిరుపతి పట్టణ సమగ్రాభివృద్ధిపై స్టేక్ హోల్డర్లతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఇషా కాలియా, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్ , తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలసి బుధవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి శర వేగంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లడంతోనే సరిపెట్టేస్తున్నారని పేర్కొన్నారు. అలా కాకుండా రెండు మూడు రోజులు ఈ ప్రాంతంలో యాత్రికులు ఉండేలా వసతులు కల్పిస్తే వారు ఉంటారని చెప్పారు. దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ ఏటా రూ.లక్ష కోట్లతో జరుగుతోందని పేర్కొన్నారు. అయితే తిరుమలలో పెళ్లిళ్లు జరుగుతున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు ఉండడం లేదని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీనివాస్ -
నల్లపరెడ్డి ఇంటిపై దాడి హేయం
చిట్టమూరు : మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దుండగులు చేసిన దాడి హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ షేక్ జిలానీబాషా పేర్కొన్నారు. చిట్టమూరులో ఆయన బుధవారం మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలో ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, పలువురికి ఆశ్రయమిచ్చిన జమీందారి కుటుంబమన్నారు. అలాంటి కుటుంబంపై రాజకీయ ముసుగులో గుండాల చేత ఇంటిపై దాడి చేయించడం తగదన్నారు. ఎన్నికల ముందు తర్వాత అధికార, ప్రతిపక్షంలో ఉన్న విమర్శలు, ఆరోపణలు సహజమన్నారు. అంతేకాని వ్యక్తిగతంగా తీసుకుని ఆస్తి, ప్రాణనష్టం కలిగే విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 13న ఐఐటీలో కామన్ ఇంకుబేషన్ సెంటర్ ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఈ నెల 13న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా కామన్ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. -
జగన్ జనాదరణను అడ్డుకోలేరు
● పర్యటనలో అడుగడుగునా రెడ్బుక్ రాజ్యాంగం ● వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి తిరుపతి కల్చరల్ : పంటకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతూ తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనలో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే చర్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపోతున్న మామిడి రైతుల పరామర్శకు మాజీ సీఎం మార్కెట్ యార్డుకు రావడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. పర్యటనలో ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడమే కాక వారిని దూర ప్రాంతాలకు తరలించి నిర్భంధించడం దుర్మార్గ చర్య అన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ నిర్భంధాలకు పూనుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ రైతు సంఘం నేతగా తనతో మరో 30 మందిని జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకొని నిర్భంధించడమే కాక కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వ్యవహరించడం చూస్తే పోలీసులు కూటమి ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే కేసులు పెడతామని, రౌడీషీట్ పెడతామని స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి ఒక అవివేకని విమర్శించారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి కేంద్ర సహకారంతో మామిడి కిలో రూ.16 కల్పిస్తే ఆంధ్రాలోని మామిడి రైతులు నష్టపోతున్నా నోరు మెదపక, శ్రీవారి దర్శనాలే ప్రరమావధిగా వ్యవహరించే బీజేపీ నేత పసలేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు వెంకటేష్రెడ్డి, కె,వెంకటాచలం పాల్గొన్నారు. -
విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రిడ్జ్ కోర్సును బుధవారం ప్రారంభించారు. వర్సిటీలోని చెలికాని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, స్కూల్ ఆఫ్ దర్శన్ డీన్ ప్రొఫెసర్ విష్ణుభట్టాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్కృత భాషతోపాటు అందులో శాసీ్త్రయ అంశాలు, శాస్త్రాల సమగ్ర జ్ఞానాన్ని బ్రిడ్జ్ కోర్సులో అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, సహాయక ఆచార్యులు డాక్టర్ యశస్వి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి తుడా:ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు తిరు పతి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద పలు పీహెచ్సీ, యూపీహెచ్సీ పరిధిలో 27 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు జిల్లా వైద్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వయస్సు 25 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న మహిళా అభ్యర్థులు ఈనెల 16లోపు తమ పరిధిలోని పీహెచ్సీ, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లకు దరఖాస్తులను అందజేయాలని కోరారు.ఆల్ ఇండియా వీసీ కాన్ఫరెన్స్లో ఎన్ఎస్యూ వీసీ తిరుపతి సిటీ : కర్ణాటకలోని ముద్దెనహలి, సత్యగ్రామ, సత్యసాయి ప్రేమామృతం వేదికగా జరిగిన ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారత్ విశ్వగురువుగా వెలుగొందేందుకు తీసుకోవాల్సిన నూతన సంస్కరణలు, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ప్రోత్సహించడం, వర్సిటీల బలోపేతం తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో విస్తృతంగా చర్చించారు. అత్తపై హత్యాయత్నం కేసులో అల్లుడి అరెస్టు నాయుడుపేటటౌన్ : అత్తపై హత్యాయత్నం చేసిన కేసులో అల్లుడు రవీంద్రనాథ్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఆదిలక్ష్మి తెలిపారు. పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో నివాసం ఉంటున్న అత్త మహేశ్వరి ఇంటి వద్దకు బాలయపల్లి మండలం హస్తకావేరి గ్రామానికి చెందిన అల్లుడైన రవీంద్రనాథ్ వచ్చి ఈనెల 2వ తేదీ రాత్రి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లుడు రవీంద్రనాథ్ వివాహేతర సంబంధం పెట్టుకుని ఉన్నాడని అత్త నిలదీయడంతో కోపంతో అత్తపై దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకుని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రెండిళ్లల్లో చోరీ – 17 సవర్ల బంగారం అపహరణ శ్రీకాళహస్తి : రెండు పక్క పక్క ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడిన ఘటన రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని సాలిపేటలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని సాలిపేటలో మంగళవారం అర్ధరాత్రి ఎవరూ లేనిది గుర్తించి మునిరాజ ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రెండు సవర్ల బంగారు, ఇంటి పత్రాలు, పిల్లలు చదువుకునే సర్టిఫికెట్లను దోచుకెళ్లారు. అదే విధంగా పక్కనే ఉన్న వీరస్వామి ఇంట్లో బీరువాలో ఉన్న 15 సవర్ల బంగారు, రూ.70 వేల నగదు, 150 గ్రాముల వెండి, విలువైన డాక్యుమెంట్లు చోరీకి గురైనట్లు తెలిపారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి క్లూస్టీంతో పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ, వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు చోరీకి గురి కావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. -
రక్తమోడినా తరగని అభిమానం
లాఠీ కాఠిన్యం..● అభిమాననేత కోసం వెళ్లిన అతడిపై లాఠీ చార్జ్ ● తలపగిలి రక్తం కారుతున్నా లెక్క చేయని వైనం ● పోలీసుల దుశ్చర్యపై అధినేత ఆగ్రహం సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్రెడ్డికి వైఎస్ఆర్ అన్నా.. ఆ కుటుంబమన్నా అతనికి ప్రాణం.. మహానేత రాజశేఖరరెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా.. పది మందికీ అన్నం పెడతాడు; రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకుంటాడు.. జననేత జగనన్న అంటే అతనికి మహాఇష్టం.. రాజన్న బిడ్డగానే కాదు.. తన అభిమాన నాయకునిగా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతడు అభిమాననేత పర్యటనకు ఉత్సాహంగా వెళ్లాడు. అయితే అడుగడుగునా పోలీసుల అవరోధాలు, ఆంక్షలు అధిగమించి వెళ్లిన అతడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. లాఠీచార్జ్ చేసి తల పగగొట్టారు. వివరాలు..మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వాన్ని నిలదీయడానికి బంగారుపాళెంకు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకుని శశిధర్రెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం 5 గంటలకే తిరుపతి నుంచి బయలుదేరి పోలీసుల ఆంక్షలన్నీ అధిగమించి బంగారుపాళెం వెళ్లిన శశిధర్రెడ్డి అక్కడకు వచ్చిన వేలాది మంది జనంలో ఒక్కడిగా జగనన్న రాక కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో జగనన్న కాన్వాయ్ వస్తుండగా జనం తోపులాటలో తాను దగ్గరకు వెళ్లి కళ్లారా జగనన్నను చూడాలని తపించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు తమ చేతిలోని లాఠీలకు పనిచెప్పారు. రాక్షసత్వంగా వ్యవహరించి తలపై లాఠీలతో బలంగా కొట్టారు. ఆ లాఠీ దెబ్బకు తలపగిలిన శశిధర్రెడ్డి ముఖంపై రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అలాగే ముందుకొచ్చాడు.. ఇది చూసి జగనన్న చలించిపోయారు. కాన్వాయ్ దిగి అతని వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గాయపడ్డ శశిధర్రెడ్డిని దగ్గరకు తీసుకుని తలకు తగిలిన గాయం చూసి మరింత ఆవేదనతో పోలీసుల తీరుపై అక్కడే ఉన్న ఎస్పీ మణికంఠ చందోలుపై మండిపడ్డాడు. తన కోసం వచ్చిన కార్యకర్తల తలలు పగలగొట్టడమేమిటని ప్రశ్నించారు. అనంతరం శశిధర్రెడ్డిని ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. శశిధర్రెడ్డి కూడా తన అభిమాన నాయకున్ని చూశానన్న ఆనందంలో తలకు తగిలిన గాయా న్ని లెక్క చేయకపోవడం విశేషం! ఆ తరువాత కొంతసేపటికి అక్కడే ఉన్న అంబులెన్స్లో ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి తిరుపతికి చేరుకున్నాడు. -
పోలీసుల ఓవర్యాక్షన్!
పలమనేరు: పోలీసులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎక్కడాలేని ఆంక్షలు పెట్టి ఓవర్యాక్షన్ చేశారు. పలమనేరు వైపు నుంచి ద్విచక్ర వాహనాలను సైతం పంపకుండా పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద అడ్డుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వాహనాన్ని ఆపారు. ఆపై మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆపై అక్కడున్న వారిని పోలీసులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటకు పంపారు. పోలీసుల జులుం పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు బంగారుపాళెం ఫ్లైవర్ నుంచి కాలినడకన వెళ్తుండగా అక్కడున్న పోలీసులు జనంపై లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు సర్దిచెబుతున్నా లెక్కచేయలేదు. ఒకానొక సందర్భంలో పోలీసులపై ప్రజలు తిరగబడాల్సి వచ్చింది. ఎటూ చూసి నా జనాన్ని చూసిన పోలీసులు శత్రువులును చూసినట్టుగా అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పోలీసుల కవ్వింపుల కారణంగానే ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. బైక్ల తాళాలు లాక్కునీ.. రోడ్డుపై బైకులో వస్తున్న వందలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. తాము స్థానికులమని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. వారి బైక్ కీలను లాక్కొన్నారు. దీంతో జనం ఆగ్రహానికి గురయ్యారు. వైఎస్ జగన్ పర్యటక ముగిశాక సైతం మార్కెట్ నుంచి జనం బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లను వేసేశారు. దీంతో భయపడిన జనం గోడలు, గేట్లు దూకి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం.. డౌన్డౌన్ కాణిపాకం: బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్ గేటు ఎదుట బుధవారం ఉదయం 10.30గంటల ప్రాంతంలో రైతులు, జగనన్న అభిమానులు రెండో గేటు ఎదుట ఆగ్రమానికి గురయ్యారు. లోపాలికి పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పట్టించుకోని పోలీసులతో విసిగిపోయిన వారు సీఎం డౌన్..సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు మిన్నంటించారు. ఆపై ఒక్కసారిగా వారంతా మొదటి గేటులో నుంచి మార్కెట్ లోపలకి దూసుకొచ్చారు. కొందరు మార్కెట్ ప్రహారీ గోడను ఎక్కి లోపలికి తరలివచ్చారు. చిన్నారి పులకింత కాణిపాకం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, స్థానికులతో పాటు వృద్ధులు, చిన్నారులు కూడా వైఎస్ జగన్ను చూసేందుకు తరలివచ్చారు. అందులో భాగంగా ఓ (చిత్తూరుకు చెందిన హోమ శైలుషా 7వ తరగతి) చిన్నారి తన భామతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు రోడ్డుపై వేచి ఉంది. వీరిని గమనించిన జగన్మోహన్రెడ్డి తన కాన్వాయ్ని ఆపి వారిని దగ్గరకు పిలిచారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారిద్దరూ ఆనందంలో మునిగితేలారు. -
బంగారుపాళెంలో జన సునామీ
● కూటమి కుయుక్తులు.. ఆంక్షల కంచె పటాపంచలు ● అభిమాన నేతను చూసి మురిసిపోయిన అక్కచెల్లెమ్మలు ● మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చిత్తూరు అర్బన్/ కాణిపాకం/ పలమనేరు/ బంగారుపాళెం: ఒకే ఒక వ్యక్తిని అడ్డుకోవడానికి వందలాది మంది ఖాకీలు. కానీ వేలాది మంది అభిమానం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. చివరకు ఏ సంబంధం లేని సామాన్యులను సైతం అడ్డుకున్నారు. అడగుడగునా ఆంక్షల చట్రం విధించినా ఏ మాత్రం అవి పనిచేయ లేదు. మామిడి రైతులను పరామర్శించడానికి బుధవారం బంగారుపాళెంకు వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన దిగ్విజయంగా ముగిసింది. రెడ్జోన్గా బంగారుపాళెం వాహనాల్లో బంగారుపాళెంకు వెళుతున్న పలువురు నాయకులను మహాసముద్రం టోల్గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలందర్నీ అదుపులోకి తీసుకుని చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. అసలు ఏ బస్సు కూడా బంగారుపాళెం లోపలకు వెళ్లకూడదని, జాతీయ రహదారి మీదుగా కూడా వెళ్లకూడదని హుకూం జారీ చేశారు. బంగారుపాళెం బస్సు టికెట్లే ఇవ్వలేదు. పలమనేరు టికెట్టు కొనుక్కున్న ప్రయాణికులు హైవేల వైపు దిగి కిలో మీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహాసముద్రం టోల్ గేటు వద్ద బస్సుల్లోకి ఎక్కిన పోలీసులు ఎవరైనా బంగారుపాళెంకు వెళుతున్నారా..? అని అడుగుతూ.. వెళుతున్నామంటే ప్రయాణికులను సైతం అదుపులోకి తీసుకున్నారు. టోల్ గేటు వద్ద దించేశారు. పలుచోట్ల లాఠీ చార్జ్ వైఎస్.జగన్ను చూడడానికి పలుచోట్ల ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడ్డారు. వీళ్లను తరమివేయడానికి పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. చాలా చోట్ల ప్రజలు పోలీసుల మాటల్ని లెక్కచేయకపోవడంతో లాఠీలతో చావ బాదారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్యులు సైతం గాయపడ్డారు. మరికొన్ని చోట్ల ప్రజల్ని నెట్టేయడంతో తోపులాటకు కింద పడిపోయారు. నాయకులపై జులుం వైఎస్సార్సీపీ నాయకులపై చాలా చోట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు డా.సునీల్, వెంకటేగౌడ, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తమ కార్యకర్తలతో హెలిప్యాడ్ వద్దకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. తాను మాజీ ఎంపీ అని రెడ్డెప్ప చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమార్, వెంకటగౌడ్, బియ్యపు మధుసూదన్రెడ్డి, నియోజవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, భూమన అభినయరెడ్డి, కృపాలక్ష్మి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారుపాళెంలో జగన్ జాతర మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన జన జాతరను తలపించింది. బంగారుపాళెం చుట్టూ పోలీసులు విధించిన ఆంక్షలు పటాపంచలయ్యాయి. పోలీసుల అడ్డగింతలు, నోటీసులతో జనం ఉలిక్కిపడ్డారని అధికార పక్షం, అధికారులు అనుకున్నారు. మార్కెట్ ప్రాంగంణం, రోడ్డు మార్గంలో జనం పలుచగా ఉన్నారని తెగ సంబరపడ్డారు. ఆ తర్వాత ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. వీరి రాకతో మార్కెట్ ప్రాంతమంతా నిండిపోయింది. కర్ణాటక సరిహద్దు నుంచి ఆంక్షలు బంగారుపాళెంకు జనం వెళ్లకుండా పోలీసులు కర్ణాటక సరిహద్దుల్లోని గంగవరం మండలం, కుప్పం ప్రాంతంలో వీకోట, బైరెడ్డిపల్లి, జాతీయ రహదారిలో గాంధీనగర్ వద్ద భారీగా మోహరించారు. బంగారుపాళెంకు వెళ్లే గ్రామీణ రహదారులను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు. -
ఆంక్షల గట్టు దాటి.. తండోపతండాలు
ఎస్పీలు.. డీఎస్పీలు.. ఏఎస్పీలు.. 2 వేల మందికిపైగా పోలీసుల కవాతు..! అదేమీ ఉగ్రవాద కల్లోలిత ప్రాంతం కాదు..! తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ బందోబస్తు అంతకంటే కాదు..! ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనలో ఐదు వందల మందికి మించి పాల్గొనకూడదంటూ ఆంక్షలు విధించింది. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు అణచివేతలకు పాల్పడింది. బంగారుపాళ్యంలో వేల సంఖ్యలో ఖాకీలను మోహరించింది. రైతుల కోసం తలపెట్టిన కార్యక్రమానికి రైతులెవరూ రాకూడదంటూ.. రౌడీషీట్లు తెరుస్తామంటూ నిర్భందాలకు తెగబడింది! ఈ సర్కారు ఎన్ని చేసినా.. ఎన్ని కుట్రలకు తెగించినా.. ఎటుచూసినా విరగకాసిన మామిడిలా జనమే.. జనం!! సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్ని పాట్లు పడినా, పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా.. తుదకు వైఎస్ జగన్పై ఉన్న జనాభిమానాన్ని అడ్డుకోలేకపోయింది. ఊరికొక చెక్ పోస్ట్.. బంగారుపాళ్యం చుట్టూ బారికేడ్లు.. వాటి వద్ద వందల మంది పోలీసుల మోహరింపు.. జగన్ పర్యటనకు రావొద్దని రైతులకు బెదిరింపులు.. రౌడీషీట్ తెరుస్తామని నాయకులకు నోటీసులు.. రోడ్డుపై ఆటో.. ట్రాక్టర్ కనిపిస్తే సీజ్ చేస్తామనే హెచ్చరికలు.. ఇలా అడుగడుగునా ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించారు. అయినా వైఎస్ జగన్ చిత్తూరు గడ్డపై కాలు మోపగానే జనసంద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. వేలాది మంది రైతులు బంగారుపాళ్యం వైపు పరుగులు తీశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను, పోలీసుల లాఠీ దెబ్బలను దాటుకుని అభిమాన నేత చెంతకు చేరారు. తమ కష్టాలను వివరించారు. నేనున్నాను.. అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో గుండెల్లో భారం దిగిందని ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. డీఐజీ, ముగ్గురు ఎస్పీల పర్యవేక్షణలో సుమారు 2000 మందికిపైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపింది. రెండు రోజులుగా పోలీసులు నిద్రాహారాలు మాని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయడంలో నిమగ్నమయ్యారు. జన సంద్రమైన మార్కెట్ యార్డుప్రభుత్వ అధికార యంత్రాంగం జనాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినా.. జనం మాత్రం ఆగలేదు. ఎక్కడైతే వాహనాలను ఆపి వెనక్కు పంపేశారో.. అక్కడి నుంచి కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టల మీదుగా వైఎస్ జగన్ పర్యటించే రహదారి సమీపంలోని మామిడి తోటల్లో వేచి ఉన్నారు. వైఎస్ జగన్ అక్కడికి రాగానే ఒక్కసారిగా రహదారిపైకి దూసుకురావటం కనిపించింది. కొత్తపల్లి హెలిప్యాడ్ నుంచి కొత్తపల్లి బ్రిడ్జి వరకు, తుమ్మేజిపల్లి, నలగాంపల్లి క్రాస్, దండువారిపల్లి, మాధవనగర్, ముంగరమడుగు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్డుపైకి చేరుకుని వైఎస్ జగన్కు జైకొట్టారు. వారిని గమనించిన వైఎస్ జగన్ కాన్వాయ్ని ఆపి వారితో ఆప్యాయంగా మాట్లాడి ముందుకు కదిలారు. కొత్తపల్లి నుంచి బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వరకు 5 కి.మీ దూరం ప్రయాణానికి 3 గంటల సమయం పట్టిందంటే ఎంతగా జనప్రవాహం పోటెత్తిందో ఇట్టే తెలుస్తోంది. ఏకంగా 25 చెక్పోస్టులువైఎస్ జగన్ పర్యటనకు వచ్చే వారిని నిలువరించేందుకు తిరుపతి– చిత్తూరు, పలమనేరు మార్గంలో బంగారుపాళ్యం చుట్టుపక్కల ఉన్న అన్ని మార్గాల్లో ఏకంగా 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాలను గాదంకి టోల్ప్లాజా వద్ద పోలీసులు చెక్ చేసి పంపటం ప్రారంభించారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు, పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు చెక్ చేయటం కనిపించింది. రైతులను నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపేశారు. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారెవరైనా బంగారుపాళ్యం టికెట్ తీసుకుని ఉంటే.. అటువంటి వారు అక్కడ దిగకుండా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నిజంగా బంగారుపాళ్యం వాసులైనా వారిని అక్కడ దిగనివ్వలేదు. అటు చిత్తూరు, ఇటు పలమనేరుకు పంపించేశారని పలువురు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు స్థానికులు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా కూడా వారిని కూడా ఆపి చెక్చేసి వెనక్కు పంపే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్కు వచ్చే సమయానికి యార్డులో రైతులు, మామిడి కాయలు లేకుండా బలవంతంగా తరలించేశారు. పోలీసులే వాహనాలను ఏర్పాటు చేసి మామిడి కాయలను తరలించటం కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ యార్డు మెయిన్ గేటుకు తాళం వేశారు. చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే ఆటోలు, ట్రాక్టర్లను సైతం సీజ్ చేశారు. -
ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్ జగన్
కేవలం 500 మంది మాత్రమే రావాలట! అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది? జగన్ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు.ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయొద్దంటూ బంక్ల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా?మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్సార్సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రాష్ట్రంలో ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్నారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా దారుణం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? కిలో మామిడికి కనీసం రెండున్నర రూపాయలు కూడా రావడం లేదని మామిడి రైతులు చెబుతున్నారు. ఇంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నేను మామిడి రైతుల సమస్యలను ఆరా తీసేందుకు ఇక్కడికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టింది. నా పర్యటనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ రైతులను సైతం అడ్డుకుంది. రైతులకు మంచి జరగకూడదని కోరుకుంటోంది. ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపోతున్నా కూడా ఎవరూ స్పందించ కూడదని ఉద్దేశంగా పెట్టుకుంది. అసలు జగన్ రైతుల్ని కలిస్తే తప్పేమిటి? రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యే లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి.. జగన్ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలో మామిడికి కనీసం రూ.12 (టన్నుకు రూ.12 వేలు) వచ్చేలా చూడాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇన్నాళ్లూ గాడిదలు కాశారా?⇒ చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.. ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు?⇒ జూన్ 3వ వారం వరకు కొనుగోళ్లు ఎందుకు మొదలు కాలేదు?⇒ ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగేలా ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల జూన్ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్ను ముంచెత్తడం నిజం కాదా?⇒ రైతులంతా మామిడి పల్ప్ కంపెనీల వద్ద బారులు తీరడం మీకు కనిపించ లేదా? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడింది?⇒ పల్ప్ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోవడం మీకు కనిపించ లేదా? కేజీ మామిడి రూ. 2తో కొంటుండటం వాస్తవం కాదా? మీ పుణ్యాన ఈ పంటకు ఇక ధర రాదనే బాధతో చెట్లను కొట్టేసుకున్న రైతులను బెదిరిస్తారా?అశేష జనసందోహం నడుమ మార్కెట్ యార్డు లోపలికి వెళుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒ చిత్తూరు జిల్లాలో 52 మామిడి పల్ప్ కంపెనీలు ఉన్నాయి. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?⇒ ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8 చొప్పున కొన్నాయి?⇒ మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఈ రోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి ఉందంటే అది మీ నిర్వాకం కాదా?⇒ పక్కన కర్ణాటకలో జనతాదళ్కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు.. కనీస రేటు అని చెప్పి, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారు? ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది?⇒ చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు కేవలం రూ.2 కే కిలో అమ్ముకుంటున్నారు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టడం భావ్యమా? ⇒ ఇక్కడికి జగన్ వస్తున్నాడని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు వాస్తవంగా కనీసం కిలో మామిడికి రూ.2 కూడా రావడం లేదంటే.. మీరు నిద్రపోతున్నారా?రైతన్నలకు అండగా గత ప్రభుత్వంమా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడుగునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ నోటిఫై చేసే వారు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్ఫెడ్ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి.. ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు.ఇప్పుడవన్నీ కనుమరుగుఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తలకిందులయ్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు. ఈ రోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్ కూడా అయిపోయింది. జూలైలో ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబునాయుడు గారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఆర్బీకేలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఈ – క్రాప్ లేకుండా పోయింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, యూరియా, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విభాగాలు ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణంశశిధర్రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబానికి చెందిన వారు కాదా? పోలీసుల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది అని అడుగుతున్నా.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది ఆ రంగం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్బంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్ చేశారు. ఇది అత్యంత దారుణం. -
అచ్చెన్నా.. జగన్కు జనామోదం, మీకు జనాగ్రహమే
జగన్ బంగారుపాళ్యం పర్యటన ఒక సినిమా సెట్టింగ్లా ఉందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి స్పందించారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించినా.. జనం తండోపతండాలుగా తరలి వచ్చారని, ఇది ప్రభుత్వంపైన జనాలకు ఉన్న ఆగ్రహమేనని భూమన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన విజయవంతం కావడం పట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి.. కార్యకర్తలకు, మామిడి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపైనా భూమన మండిపడ్డారు. ‘‘మద్దతు ధర పేరిట మీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జగన్ పర్యటన ఖరారు కావడంతో.. కిలో రూ.6 ఇచ్చిన అగ్రిమెంట్లు ఉన్నాయి. మంత్రిగారూ(అచ్చెన్నను ఉద్దేశించి..) ఒక్కసారి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు దగ్గరికి రండి. యాభై శాతం మామిడి తోటల్లో మామిడి పంట కోయలేదు. లక్ష యాభై వేల టన్నుల మామిడి ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయి. లక్ష డెబ్భై వేల టన్నులు తోటల్లో ఉందని స్వయానా ఫుడ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి చెప్పారు. మామిడి రైతులు కడుపు మండి రోడ్డు పక్కనే మామిడి కాయలు పారాబోశారు.. అది గమనించండి ముందు.. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి వైఎస్ జగన్ వచ్చారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. మా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. చాలామందిని గృహ నిర్బంధం చేశారు. సుమారు 1,600 మంది పోలీసులను మోహరించారు. ఎస్పీ స్థాయి అధికారి రౌడీ షీట్ తెరుస్తామని బెదిరించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఇంకోపక్క.. జగన్ పర్యటనలో పాల్గొనవద్దని రైతులను అడ్డుకున్నారు. బంగారుపాళ్యంలో ఇవాళ హిట్లర్ పాలన తరహా ఛాయలు కనిపించాయి. జిల్లా ఎస్పీ అనుమతి మేరకే హెలిప్యాడ్, రూట్ మ్యాప్ ఇచ్చి మీరు అడ్డుకున్నారు. పోలీసు వ్యవస్థను ప్రయోగించినా.. జగన్ కోసం జనం ప్రాణాలను పణంగా పెట్టి మరీ భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా భయపెట్టిన గుట్టలు, కొండలు, తుప్పలు దాటుకుని వచ్చారు. వీళ్లంతా దగా పడ్డ వారే. మా కార్యకర్తలు, మామిడి రైతులను పోలీసులు అడ్డుకుని లాఠీ చార్జి చేశారు. ‘నా కళ్ల ముందే కొడుతున్నారు..’ అని జగన్ కూడా అన్నారు. ఇది చూసి.. స్వాతంత్ర్య పోరాట స్పూర్తితో వీళ్లంతా ముందుకు కదిలారా? అని నాకనిపించింది. పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నా.. మీ నిర్బంధాలనే కోట గోడల్ని పగలగొట్టి రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలి వచ్చారుజగన్ ఇవాళ రోడ్ షో చేయలేదు. జగన్ వెంట వచ్చింది అభిమాన గణం. ఆ అభిమానంతో బంగారుపాళ్యం వెళ్లే దారులు అన్ని కిక్కిరిసి పోయాయి. అంచనాలకు మించి రైతులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ పర్యటనతో దేశంలోనే మా నాయకుడు(వైఎస్ జగన్).. అత్యంత ప్రజాదరణ నాయకుడు అని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం అణచివేత చర్యతో జనాగ్రహం.. జగన్కు జనామోదం అని స్పష్టమైంది. కూటమి ప్రభుత్వ నియంతృత్వ చర్యల్ని ప్రజలు చూస్తున్నారు. మీ రాజకీయ గోతి మీరే త్రవ్వుకుంటున్నారు అనేది గ్రహించక పోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు కూటమిని కూకటి వేళ్ళతో పీకేస్తారని జగన్ బంగారుపాళ్యం పర్యటన నిరూపించింది. ఇవాళ్టి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసేసింది అని భూమన అన్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 78,320 మంది స్వామిని దర్శించుకున్నారు. 24,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.66 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
మామిడి గోడు వినరే!
● గిట్టుబాటు కాని మామిడి ● మాయమైన ప్రభుత్వ మద్దతు ధర ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ● ఆదుకోవాలంటూ విన్నపాలు ● పట్టించుకోని కూటమి నేతలు ఒక్క పంటకూ దిక్కులేదు చక్కెర ఫ్యాక్టరీ మూయించిన ఘనత చంద్రబాబుదే. దీనికి ముందు పాల ఫ్యాక్టరీని మూయించారు. ఇదే మాదిరిగానే మామిడి రైతులను ముంచేయాలని చూస్తున్నట్లు ఉంది. ఈ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి. చెరుకు పండించి బెల్లం తయారీ చేస్తే ఆంక్షలు పెడుతున్నారు. వేరుశనగ పండిస్తే చేతికి అందే పరిస్థితి లేదు. ఇప్పుడు పంట మామిడి ఒక్కటే. –రాము, చిత్తూరు మండలం ఈ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు 2018లో ఇలానే అల్లాడిపోయాం. అప్పు డు కాయలు కొనే వారు లేక చెట్లల్లోనే వదిలేశాను. ఈ సారి కాయలు అడిగే వారు లేరు. బలవంతంగా ప్యాక్టరీలకు తోలుకుంటున్నాం. ప్యాక్టరీ రేటు తొతాపురి రూ.8 అని ప్రకటించాయి. ఎక్కడ ఆ రేటుకు కొనుగోలు చేస్తున్నారు..?. కానీ ప్యాక్టరీలను ఏం చేయలేక పోతోంది. సీఎం, మంత్రులు అలా వచ్చి...ఇలా వెళ్లిపోయారు. –సాము, చిత్తూరు మండలం -
తిరిగి రాని లోకాలకు!
తిరువణ్ణామలై వెళ్లి వస్తూ.. ● ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ప్రమాదం ● పాల ట్యాంకర్ను ఢీకొన్న కారు ● ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి ● మరో మహిళ పరిస్థితి విషమం చంద్రగిరి : తిరువణ్ణామలైలోని అరుణాచల శివయ్యను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా.. మరో మహిళ తీవ్ర గాయాలపాలైన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి తొండవాడ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడ అర్బన్, చిట్టినగర్కు చెందిన కోటేశ్వరరావు, భార్య పద్మావతి, కుమారుడు జశ్వంత్ సాయి, చెల్లెలు హేమలతతో కలసి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కారులో వెళ్లారు. స్వామి దర్శనం ముగించుకుని మంగళవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తొండవాడ సమీపంలో వెళ్తున్న క్రమంలో ముందు కారు నడుపుతున్న కోటేశ్వరరావు ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జనుజ్జు అయింది. అనంతరం కారులో ప్రయాణిస్తున్న పద్మావతి (38) అక్కడికక్కడే మృతి చెందగా.. కోటేశ్వర రావు, కుమారుడు జశ్వంత్ సాయి (21), చెల్లెలు హేమలత తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు మృతి ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సను అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఆసుపత్రికి చేరుకోగానే వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అప్పటికే కోటేశ్వరరావు కుమారుడు జశ్వంత్ సాయి మృతి చెందినట్లు తెలిపారు. హేమలత పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా డ్రైవింగ్ చేస్తున్న తండ్రి కోటేశ్వర రావుకు ప్రమాద సమయంలో కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిల్లకూరులో రొట్టెల పండుగ
చిల్లకూరు : నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు అనుబంధంగా చిల్లకూరులో ఒక్క రోజు నిర్వహించే రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. నెల్లూరుకు వెళ్లలేని భక్తులు చిల్లకూరులోని దోషాహీద్ దర్గా వద్దకు వచ్చి తమ మొక్కబడులును తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చిల్లకూరులోని సయ్యద్ అహ్మద్షా, సయ్యద్ మహ్మద్షాలకు చెందిన దో షాహీద్ దర్గాలో రొట్టెలు వదలడం, తిరిగి పట్టుకోవడం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. గూడూరు డివిజన్లోని పలు గ్రామాలకు చెందిన ముస్లింలు, హిందువులు ఇక్కడ రొట్టెలు మార్చుకోవడం విశేషం. దీంతో ఆరోగ్య ,కళ్యాణ రొట్టెను పట్టుకునేందుకు డిమాండ్ ఏర్పడింది. -
నకిలీ పట్టాలతో భూ ఆక్రమణలు
వెంకటగిరి (సైదాపురం) : అక్రమాలు..అరాచకాలు..దౌర్జన్యాలు.. భూ కబ్జాలకు వెంకటగిరి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి విమర్శించారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంపై దుండగలు విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు. వసూళ్ల సంస్కృతికి శ్రీకారం అక్రమాలు, దౌర్జన్యాలు, వసూళ్లు వెంకటగిరిలో శ్రీకారం చుట్టాయన్నారు. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి మెనూ కార్డు ప్రకారం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రామ్కుమార్ విమర్శించారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఖాళీగా జాగా కనిపిస్తే యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని విమర్శించారు. స్థానికంగా ఉండి విశ్రాంతి పొందిన తహసీల్దార్ రాత్రి.. పగలు తేడా లేకుండా నిరంతరం కూటమి నేతల కన్నుసన్నల్లో సేవలు అందించారని ఆరోపించారు. దొంగ పట్టాలను సృష్టించి అమాయకులకు విక్రయాలు చేసిన దళారులతో పాటు విశ్రాంతి పొంది ఇంట్లో ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారుల మాటలు విని దొంగ పట్టాల భూములను ఎవ్వరూ కొని మోసపోవద్దని వెంకటగిరి ప్రజలకు ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ బీసీ నేత డాక్టర్ బొలిగర్ల మస్తాన్యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనప్పటి నుంచి వెంకటగిరిలో భూ ఆక్రమణలు పెట్రేగిపోతున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ కూడా కూటమి నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, పద్మశాలీ కార్పొరేష్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, మహిళా విభాగం కార్యదర్శి కాటూరు రామతులసి, పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్లు రవికుమార్యాదవ్, వెందోటి కార్తీక్రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, మధుసూదన్రెడ్డి, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి సదానందరెడ్డి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఇంటిపై దాడి హేయం నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి -
‘శతాధిక’ సంబరం
చిట్టమూరు : మండల పరిధిలోని మొలకలపూడి గ్రామానికి చెందిన సంక్రాంతి రమణయ్య అనే వృద్ధుడు మంగళవారంతో వందేళ్లు పూర్తి చేసుకున్నాడు. రమణయ్యకు నేటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100లో అడుగు పెట్టడంతో కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. తాను నెహ్రూ కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నానన్నాడు. అయితే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. కుక్ కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి అర్బన్: వన్ స్టాప్ సెంటర్కు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన మల్లీపర్పస్ స్టాఫ్ కుక్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా పీడీ వసంత బాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 14వ తేది లోపు దరఖాస్తులు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఇవ్వాలని లేదా పోస్టులో పంపవచ్చన్నారు. నెలకు వేతనం రూ.13 వేలు ఉంటుందని చెప్పారు. 18–42 ఏళ్లలోపు మహిళలు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీలు అయితే రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.200 డీడీ లేదా చెక్కు రూపంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి పేరిట చెల్లించాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం ఐసీడీఎస్ వెబ్సైట్ చూడాలని సూచించారు. ఉపాధి సిబ్బందిపై కేసు – విధుల నుంచి తొలగింపు కలువాయి(సైదాపురం) : ఉపాధి ఉద్యోగులపై సస్పెన్షన్, కేసు నమోదు అయిన ఘటన కలువాయిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కలువాయి మండలంలో గతంలో పనిచేసిన ఈసీ శ్రీనివాసులు, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ప్రసన్న, ప్రసాద్ అనే ఉద్యోగులు రూ. 56 లక్షల అవినీతికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్ ద్వారా నిర్ధారణ చేశారు. నెల్లూరు డ్వామా అధికారులు ఈ నలుగురు ఉద్యోగులను పూర్తిగా విధుల నుంచి తొలగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయమై నెల్లూరు డ్వామా కార్యాలయం నుంచి కలువాయి మండల పరిషత్ కార్యాలయానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. -
జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు కేంద్రం సంసిద్ధం
● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖకు స్పందన తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది. ప్రతి జిల్లాలో ఒక్కో జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన రెండు జిల్లాలలో ఒకటైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1986–87 నుంచే జవహర్ నవోదయ విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అయితే 2022 ఏప్రిల్ 3న కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో ఇప్పటికీ నవోదయ విద్యాలయం లేదని, దీని స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని, అలాగే నూతన పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కూడా ఆయా ప్రమాణాలకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. మరోవైపు– రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాలలో జవహర్ నవోదయ విద్యాలయల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి దీనికి అవసరమైన భూ కేటాయింపులు చేయాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
మరుపురాని మహానేత
తిరుపతి అర్బన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని జిల్లాలో ఊరూరా జరుపుకున్నారు. ప్రమాదంతో ఆయన ప్రజలకు దూరం అయినప్పటికీ ఆయన పాలనలో చేసిన మంచిని గుర్తుచేసుకుంటూ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ప్రధానంగా వైఎస్సార్ పాలనలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయంబర్స్మెంట్, వ్యవసాయ రుణాలమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను గుర్తుచేసుకున్నారు.వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పలుచోట్ల అన్నదానం , తిరుపతిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఊరువాడ తేడా లేకుండా ఆయన అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అయితే ఓ మాజీ ముఖ్యమంత్రి మహానేత, పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు జయంతి ఉత్సవాల్లో కేక్ కటింగ్, అన్నదానం చేస్తుంటే నాయుడుపేట, గూడూరులో పోలీసులు అడ్డుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అన్నదానం చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు చెప్పడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.నియోజకవర్గాల్లో ఇలా..● వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయనతో పాటు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, పార్టీ నేతలు రవికుమార్, కార్తీక్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మధుసూదన్రెడ్డి, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేదురుమల్లి బంగ్లాలో చేపట్టిన వైఎస్సార్ జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ అనంతరం అన్నదానం నిర్వహించారు.● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో.. పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని సినిమా వీధిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేపట్టారు. తర్వాత అన్నదానం చేశారు. రేణిగుంట మండలంలో హరిప్రసాద్రెడ్డి, తిరుమల రెడ్డి నేతృత్వంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఏర్పేడు మండలంలో రమణయ్య యాదవ్, తొట్టంబేడు మండలంలో సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు.● సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని జరుపుకున్నారు. ప్రధానంగా నారాయణవనం, నాగలాపురం, సత్యవేడు మండల కేంద్రాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. వారితోపాటు కార్మిక విభాగం మాజీ చైర్మన్ బీరేంద్ర వర్మతో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేపట్టారు. మరో వైపు ఆయా మండల కేంద్రాల్లో మండల నేతలు పాల్గొన్నారు.సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. అయితే ఈ సందర్భంగా అన్నదానం చేయడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ నేతలు సర్ధి చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు. మరోవైపు ఆయా మండల కేంద్రాల్లో మండల నేతల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ంగా చంద్రగిరి టౌన్ క్లాక్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. అలాగే పాకాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేక్ కటింగ్ చేపట్టారు. ౖలింగేశ్వర్నగర్లోను కేక్ కటింగ్తో పాటు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు, నిమ్మలగుంటపల్లి, ఎర్రావారిపాళెం మండలంలోని నెరబైలు, చిన్నగొట్టిగల్లు మండల కేంద్రాల్లోనూ కేక్ కటింగ్ చేపట్టారు.గూడూరు నియోజకవర్గం సనత్నగర్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరుగు మురళీధర్ నేతృత్వంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా చేపట్టారు. ముందుగా గూడూరులోని బనిగేసాహెబ్పేటలో కేక్ కటింగ్ చేయాలని భావించారు. అయితే పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో సనత్నగర్లో నిర్వహించారు. అనంతరం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు అందించారు. ఈ సందర్భంగా గూడూరు అభివృద్ధికి వైఎస్సార్ పరిపాలనలో చేపట్టిన పలు అంశాలను గుర్తుచేసుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేపట్టారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.తిరుపతిలో వేడుకగా వైఎస్సార్ 76వ జయంతి వేడుకలు● పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరం ఏర్పాటు● చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమనతిరుపతి మంగళం : ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఊరంతా నీ జ్ఞాపకాలే రాజన్నా.. పొలానికెళ్లినా..పట్టణానికి వచ్చినా నీ ప్రతిరూపాలే.. నీ పథకాలు పదిలం.. నిన్ను మేము మరువలేం! జోహార్ వైఎస్సార్.. జోహార్ వైఎస్సార్ అంటూ అభిమానులు చెమర్చిన కళ్లతో తమ అభిమాన నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నీవు మా మధ్య లేకపోయినా మా గుండె చప్పుడు నీవ్వే రాజన్నా అంటూ స్మరించుకున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డిలతో పాటు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ఫ్లకార్డులను చేతపట్టుకుని జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు.అనంతరం 76 కిలోల భారీ కేక్ను కట్చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం వెయ్యి మందికి పైగా పేదలకు భూమన కరుణాకరరెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆశాజ్యోతి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని, తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి కూడ వెరవకుండా ప్రజలకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అందించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించే ఉన్నారన్నారు.వైఎస్సార్ 76వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు వైఎస్సార్సీపీ ఓడిపోయిందని కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, విధ్వంశాల ను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేయించినా తమ పార్టీ నాయ కులు, కార్యకర్తలకు అండగా నిలబడుతామన్నా రు. ఇప్పటికై నా తమ పార్టీ నాయకులు, కార్యకర్త లు, సానుభూతిపరులపైన దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
తల్లికి వందనం నగదు తీసుకున్నాడని..
అన్నమయ్య: తల్లికి వందనం నగదు కోసం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, భర్త తాగే మద్యంలో భార్య విషం కలిపి చంపేసిన ఘటన అన్నమయ్య జిల్లా కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డిగానిపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వంకొల్ల చంద్రశేఖర్(46), రమాదేవి దంపతులు. ఇటీవల తల్లికి వందనం నగదు రమాదేవి ఖాతాలో జమయింది. ఈ నగదును చంద్రశేఖర్ తీసుకోవడంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ నెల 2న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్, భార్యను తాను తెచ్చుకున్న మద్యాన్ని గ్లాసులో పోసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమాదేవి, మద్యం గ్లాసులో విషం కలిపి ఇచ్చింది. అనంతరం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన రమాదేవి భర్త గొంతుపట్టుకుని నొక్కడంతో ఆమె చేతిగోళ్లు గుచ్చుకుని, చంద్రశేఖర్ గొంతుకు గాయమైంది. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తమ్ముడు మహేష్.. వదినపై అనుమానంతో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రమాదేవి తన భర్తను హత్య చేసినట్లు తేలింది. -
తిరుపతి నగరంలో సైకో వీరంగం
తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్ఐ లోకేశ్ వివరాల మేరకు..తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై విరుచుకుపడ్డాడు. శేఖర్ (55) అనే యాచకుడిపై, కపిల తీర్థం సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వలలో బంధించి.. ఘటనకు మూలకారకుడైన సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు.రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట అతను కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వలవిసిరి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద ఓ కత్తి కూడా ఉంది. అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. View this post on Instagram A post shared by colours of Tirupati ™ (@coloursoftirupati) -
రాయితీ రుణాలకు ఎదురుచూపులు
● నాలుగు నెలలు దాటినా జాడ లేని రుణాలు ● తమ వారికే రుణాలు అందేలా కూటమి ఆదేశాలు ● సిబిల్ స్కోర్ లేదని తిరస్కరించిన బ్యాంకులు ● జిల్లాలో స్వయం ఉపాధి రుణాల ఊసే లేదు చిల్లకూరు: తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు ఉద్యోగాలు చూపక, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వక, కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు మంజూరు చేయక యువతకు మొండి చేయి చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోండి నెల రోజుల్లో రాయితీ రుణాలు అందిస్తామంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే ప్రతి పంచాయతీ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో మండల స్థాయి అధికారులు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేయాలని కూటమి నాయకులు ఆదేశాలు జారీ చేశారు. వారిని ఎంపిక చేసి దరఖాస్తులను ఆయా బ్యాంకులకు మండల అధికారులు పంపారు. అయితే బ్యాంకు అధికారులు కూడా తామేం తక్కువ కాదని పంపిన దరఖాస్తు దారుల సిబిల్ స్కోర్ లేదని ఆ దరఖాస్తులను తిరిగి పంపేశారు. దీంతో తమ వారికి రాయితీ రుణాలు ఇప్పించే పరిస్థితి కనిపించక పోవడంతో రుణాల మంజూరుకు అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. నాలుగు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే అర్హులైన వారు ఎంతో మంది ఉన్నప్పటికి తమకు అనుకూలంగా వ్యవహరించే వారికే రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపించారు. అయితే బ్యాంకు అధికారులు సిబిల్ స్కోర్ లేని వారు రాయితీ రుణాలకు అనర్హులంటూ ఆ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో తమకు అనుకూలమైన వారు అనర్హులు కావడంతో మరొకరికి ఆ రుణాలు ఇవ్వకూడదంటూ అధికారులపై ఒత్తిడి తేవడంతో వారు మిన్నకుండి పోయారు. చివరగా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ రాయితీ రుణాలపై మరోమారు మార్గదర్శకాలు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపి వేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతోనే నాలుగు నెలలవుతున్నా రాయితీ రుణాల ఊసే ఎత్తడం లేదు. –ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండు వర్గాల వారికే రుణాలు ఇస్తుండగా బీసీ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, కాపులకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తిరుపతి జిల్లాలో 1,267 , బీసీ కార్పొరేషన్ ద్వారా 2,082 యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఇప్పటికే బ్యాంకులకు పంపిన జాబితాలో ఎంపికై న వారు బ్యాంకు అధికారులను కలుసుకుని అవసరమైన గ్యారంటీలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే అందరికీ ఒకేసారి రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు మిన్నకుండిపోయారు.కార్పొరేషన్ యూనిట్లు దరఖాస్తులు కేటాయింపులు రాయితీ రుణం ఎస్సీ 1,267 6, 284 రూ 52.89 కోట్లు రూ 20.88 కోట్లు రూ 29.36 కోట్లు బీసీ 2,082 17,487 రూ 50.14 కోట్లు రూ 25.07 కోట్లు రూ 25.07 కోట్లు ఆదేశాలు రావాలి కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. ఇంటర్వ్యూలు నిర్వహించడం పూర్తి చేశాం. అయితే బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సి ఉంది. ఆదేశాలు అందిన వెంటనే ఆయా బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందిస్తాం. – చెన్నయ్య, ఇన్చార్జ్ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ నిరుద్యోగ భృతి ఇవ్వరు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాలు దక్కక పోవడంతో కనీసం వయస్సు మీరేలోగా ప్రభుత్వం ద్వారా ఉపాధి అయినా పొందుతామనుకుని దరఖాస్తులు చేశారు. అలాంటి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వక పోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారు. -
వాటర్ ప్లాంట్పై దాడి
పాకాల : స్థానిక శివశక్తి నగర్లోని హేమాద్రి మినరల్ వాటర్ ప్లాంట్పై దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు యోగిత కథనం మేరకు బ్యాంకు రుణం పొంది శివశక్తి నగర్లో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఇది గిట్టని పక్కింటి వారు రోజూ ఆమెతో గొడవ పడుతున్నారు. ఉదయం వాటర్ప్లాంట్పై రాళ్లతో దాడి చేశారు. ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టారు. కొళాయిలను విరగ్గొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యోగిత స్కూటీపై బయల్దేరింది. దీంతో ఆమెను పక్కను నెట్టేసి, స్కూటర్ని కింద పడేసి ధ్వంసం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల: తిరుమలలో సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణి, బంగారు డాలర్ల విక్రయ కౌంటర్, అగరబత్తి, కొబ్బరికాయలు విక్రయ కౌంటర్లు, పబ్లికేషన్ స్టాళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లడ్డూ కౌంటర్, పబ్లికేషన్ స్టాళ్లు, బంగారు డాలర్ల విక్రయ కేంద్రంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ను ఆయన పరిశీలించారు. కొబ్బరికాయల కౌంటర్ వద్ద డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అర్జీలకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు ఆయనతోపాటు కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 284 అర్జీలు వచ్చాయి. అందులో రెవన్యూ సమస్యలపై 149 అర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ● మదనపల్లిలో బుద్ద భగవాన్ విగ్రహ తలను నరికిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని భారతీయ అంబేడ్కర్ సేన రాష్ట్ర నేతలు పాలకుంట శ్రీనివాసులు, మల్లారపు వాసు డిమాండ్ చేశారు. ఆ మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్కు వినతిపత్రాన్ని అందించారు. ● వెంకటగిరి మండలం బుసపాళెం ఎస్టీకాలనీకి చెందిన పలువురు యానాదులు తమ శ్మశానాన్ని కబ్జా చేశారని, కాపాడాలని మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్లో అధికారులను కలసి వారికి వినతిపత్రాన్ని అందించారు. ఇప్పటికే పలు సార్లు స్థానిక అధికారులకు అర్జీలు ఇచ్చామని, ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్కు వచ్చామని తెలియజేశారు. -
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
నాయుడుపేటటౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్వర్ణముఖి సమీప గ్రామాలైన అయ్యప్పరెడ్డిపాళెం, మూర్తిరెడ్డిపాళెం, కల్లిపేడు, పండ్లూరు, అన్న మేడు, చిగురుపాడు, తిమ్మాజి కండ్రిగ, తుమ్మూరు , మర్లపల్లి, కాలవ గట్టు, వేమగుంటపాళెంలో ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. దీన్ని ఎక్కడికక్కడ అరికట్టలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. స్వర్ణముఖి నది కాజ్వే వద్ద గేట్లు తీసివేడయడంతో ఇసుక రాత్రి పగలు తేడాలేకుండా తరలిపోతోంది. అధికారులకు నెలవారీ ముడుపులు అందుతుండడంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
● త్వరలో పట్టాలపైకి తిరుపతి–చిక్మంగళూరు ఎక్స్ప్రెస్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని ప్రజల సౌకర్యార్థం కొత్తగా వీక్లి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనుంది. ప్రధానంగా బెంగళూరు, చిక్మంగళూరు, తుంకూరు ప్రాంతాల వారికి ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది. తాజాగా కేంద్ర రైల్వేశాఖ తిరుపతి– చిక్మంగళూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు గురువారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది. చిక్ మంగళూరు నుంచి శుక్రవారం బయలుదేరి తిరుపతి చేరుకుంటుంది. అధికారికంగా ఈ రైలు నెంబర్లు 17423–17424గా నిర్ణయించారు. రైలు ప్రారంభం, షెడ్యూల్, టైమింగ్స్ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు రైల్వేశాఖ అధికార వర్గాల సమాచారం. ఈ రైలు మొదటి విడతగా వారానికోసారి నడుపనుంది. తరువాత ప్రజల స్పందన మేరకు వారంలో మూడు సార్లు నడిపే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులకు అనుకూలం ఈ రైలు ప్రయాణించే మార్గంలో ముఖ్యమైన ప్రాంతా లు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, కుప్పం, బంగారుపేట, వైట్ఫీల్డ్, కృష్ణరాజపురం, బెంగళూరు ఎస్ఎంవీబీ, తుంకూరు, తిప్తూరు, అరిసికెరె, బిరూర్, కదూర్, బిసలె హళ్లి, శంకరాయ పట్న స్లేషన్లు ఉంటాయి. ఈ ప్రాంతాల ప్రజలకు ఈ రైలు సౌకర్యవంతంగా మారనుంది. ఈ రైలుకు పాకాల స్టేషన్ స్టాపింగ్ ఇవ్వడం మరో విశేషం. చిత్తూరు, కుప్పం, బంగారుపేట ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
లారీని ఢీకొన్న కారు
పెళ్లకూరు:లారీని కారు ఢీ కొనడంతో దంపతులకు స్వల్ప గాయాలైన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు చైన్నె నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న కారు టెంకాయతోపు గ్రామం ప్లై ఓవర్ మీద ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటన లో కారులో ప్రయాణిస్తున్న అక్కగారిపేటకు చెందిన రవినాయుడు దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ కానిస్టేబుల్ మైఖేల్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. రైలు కింద పడి ఎస్ఐ దుర్మరణం సైదాపురం: రైలు కింద పడి మండలానికి చెందిన ఎస్ఐ దుర్మరణం పాలు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనంతమడుగు గ్రామానికి చెందిన పడ్డాల పోలయ్య సీఐఎస్ఎఫ్ చైన్నె విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలయ్యకు భార్య రమాదేవితో పాటు ఇద్దరు పిల్లలున్నారు. చదువుల నిమిత్తం ఆయన గూడూరులోనే కాపురం ఉంటున్నారు. సీఐఎఫ్ఎస్లో కానిస్టేబుల్గా చేరిన పోలయ్య ఇటీవలనే ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. ఆదివారం డ్యూటీ నిమిత్తం చైన్నెకు చేరుకున్నారు. ఎగ్మూర్ రైల్వేస్టేషన్లో దిగి లోకల్ ట్రైన్లో సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడ రైలు దిగే సమయంలో రైలు కింద పడి దుర్మరణం చెందారు. దీంతో అక్కడే కేసును నమోదు చేసి సోమవారం సాయంత్రం చైన్నెకు చెందిన సీఐఎస్ఎఫ్ అధికారులు పోలయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్
తిరుమల: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ చైర్మన్ లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అంతకు ముందు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో సైకో వీరంగం ● కర్రతో ముగ్గురిపై దాడి ● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్ఐ లోకేశ్ వివరాల మేరకు.. కపిలతీర్థం రోడ్డులో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై దాడి చేశారు. అక్కడున్న యాచకుడు శేఖర్ (55), వాహనాల పార్కింగ్లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వల వేసి.. బంధించి అంతటితో ఆగని సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు. రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వల వేసి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద కత్తి కూడా ఉందని, అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
స్కూల్ నుంచి పారిపోయిన పిల్లలు
రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ముగ్గురు పిల్లలు తిరుగుతుండగా వారిని రేణిగుంట పోలీసులు వారు విచారించి వారిని మాతృశ్రీ చైల్డ్ హోమ్కు అప్పగించారు. తిరుపతి బైరాగి పట్టెడలో ఉన్న మాతృశ్రీ చైల్డ్ హోమ్లో ఉంటూ ప్రయివేటు స్కూల్లో చదువుతున్న లంకేష్ (9), సహదేవ (11), ముఖేష్ (12) ఇంగ్లీష్ మీడియం చదవడం కష్టంగా ఉందంటూ పాఠశాల నుంచి పారిపోయారు. వారిని పోలీసులు సోమవారం పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి విచారించారు. అనంతరం మాతృశ్రీ చైల్డ్ హోమ్ వారిని పిలిపించి వారికి అప్పగించారు. -
శ్రీకాళహస్తి పెద్దాస్పత్రిలో రక్తపాతం
సాక్షి టాస్క్ ఫోర్స్: అర్ధరాత్రి వేళ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వర్గానికి చెందిన వారిపై, మరో వర్గం యువకులు దాడి చేయడంతో క్యాజువాలిటీ విభాగం రక్తంతో తడిచింది. ఏం జరుగుతోందో అర్థం కాక వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భయానక ఘటన ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఏరియా ఆసుపత్రి సీసీ కెమెరాలో నమోదైన దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని మంచినీళ్లగుంట, వీఎం పల్లికి చెందిన యువకుల మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. అగ్నిగుండ ప్రవేశం ముగిసిన అనంతరం అర్ధరాత్రి వేళ, తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో మంచినీళ్ళగుంట, వీఎంపల్లికి చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మంచినీళ్లగుంటకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంత మందిని వెంట తీసుకొచ్చిన వీఎం పల్లి యువకులు ఏరియా ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలోకి చొరబడి చికిత్స పొందుతున్న యువకులు, వారి బంధువులపై కర్రలు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంచినీళ్ల గుంటకు చెందిన వారు కూడా తిరగబడి రాళ్లు రువ్వడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమయంలో వీఎంపల్లికి చెందిన యువకుల ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నంలో ఉండగా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే దాడులకు పాల్పడింది టీడీపీకి చెందిన యువకులు కావడంతో ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ స్పందించడం లేదు. ఏం జరిగింది అనేది చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల దాడులు ఐదుగురికి తీవ్ర గాయాలు భయభ్రాంతులకు గురైన సిబ్బంది ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ ప్రకటన శాంతిభద్రతల వైఫల్యం ఆస్పత్రిలో రెండు వర్గాలు దాడులు చేసుకుంటుంటే ఆ సమయంలో పోలీసు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసినా స్పందన లేదని ఆసుపత్రి ఉద్యోగి ఒకరు చెప్పారు. రెండు దశాబ్దాల్లో ఈ తరహా ఘటనలు ఎన్నడూ చూడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య దాడి జరిగితే, ఈ సంఘటన ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ నరసింహమూర్తి ప్రకటించడం గమనార్హం. వారి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ వివరించారు. -
విద్యా ప్రదాత వైఎస్సార్
తిరుపతి సిటీ: ప్రతి పేదవాడి ఇంటిలో డాక్టర్, ఇంజినీర్ ఉండాలని కలలు కన్న పేదల పక్షపాతి వైఎస్సార్. బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సకాలంలో అందించి ప్రోత్సహించారు. దీంతో పేదింటి పిల్లలు కూడా ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి రైతు బాంధవుడిగా తెలుగు ప్రజల గుండెలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ వర్సిటీలను వైఎస్సార్ మానసపుత్రికలుగా నేటికీ ప్రజలు కొనియాడుతున్నారంటే ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పవచ్చు.నేడు వైఎస్సార్ జయంతిదివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిలేని లోటు రైతులకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన చలవతో పశువైద్య విద్యను అభ్యసించిన పేద విద్యార్థులు సైతం నేడు ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారు. నేడు వారంతా వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ 76వ జయంతిని ఘనంగా జరపుకోనున్నారు.మా ఆరాధ్య దైవంరెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో హోటళ్లలో భార్యాభర్తలు పనిచేస్తుండేవాళ్లం. వైఎస్సార్ హయాంలో మా అమ్మాయికి ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభించింది. ఆ తరువాత లండన్లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడింది. మేము ఆర్థికంగా బలపడ్డాం. మాకు వైఎస్సార్ ఆరాధ్యదైవం. మేము బతికున్నంత కాలం ఆయన సేవలను మరచిపోలేం. – సరస్వతి, గృహిణి, తిరుపతి రూరల్ఆయన పేదల పక్షపాతిపేదల పక్షపాతిగా, రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్సార్ మా గుండెల్లో నిలిచిపోయారు. ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీతో జిల్లాలో లక్షలాదిమంది లబ్ధి పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారంటే ఇది వైఎస్సార్ చలువే. విద్యారంగంలో మహిళలకు పెద్ద పీట వేశారు. ఆయన తీసుకొచిచన సంస్కరణలు ఎంతో మంది మహిళలను ఉన్నత స్థానానికి చేర్చాయి. – పద్మావతమ్మ, తిరుపతిఆయనలేని లేటు స్పష్టంగా కనిపిస్తోందిడాక్టర్ వైఎస్సార్ పేదల పక్షపాతిగా ప్రజలు ఇప్పటికీ కొనియాడుతున్నారు. ఆయన విద్యా రంగంలో చేసిన సంస్కరణలతో ఎంతో మంది పేదల పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశ, విదేశాలలో రాణిస్తున్నారు. తిరుపతి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా రూపొందించడంలో ఆయన కృషి ఎనలేనిది. ఆయన లేనిలోటు ప్రస్తుతం తెలుగు ప్రజలకు స్పష్టంగా కనబడుతోంది.– రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతివైఎస్సార్ మా ఇంటిదేవుడుమాలాంటి పేదలు అందుకోలేని వైద్య విద్యను మాకు దగ్గర చేశారు. వైఎస్సార్ చేపట్టిన సంస్కరణలతో నాకు ఎంబీబీఎస్ లో సీటు వచ్చింది. తల్లి దండ్రులు కూలికి వెళ్లితేగాని కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితి నుంచి అమెరికాలో పేరొందిన ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇదంతా డాక్ట ర్ వైఎస్సార్ చలవే. ఆయన్ను మా ఇంటిదేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నాం. – డాక్టర్ కేశవులు, తిరుపతి -
వందశాతం హాజరు
తిరుపతి అర్బన్: పాఠశాలలు పునఃప్రారంభం నుంచి అంటే జూన్ 12 నుంచి జూలై 7 వరకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జిల్లాలోని విద్యార్థులు వందశాతం హాజరు సాధించడంతో తిరుపతి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. దీంతో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్తోపాటు పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్తోపాటు తిరుపతి జిల్లా విద్యాశాఖను సోమవారం అభినందించారని డీఈవో ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్ ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్వీయూ లా కళాశాల భవనంలోనూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్లను ప్రారంభించారు. విద్యార్థులు ఈ నెల 16వరకు రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13 నుంచి 18వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 19వ తేదీ ఆప్షన్స్ మార్పులకు అవకాశం ఇస్తూ ఈనెల 22న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మామిడి రైతులకు అండగా ఉంటాంతిరుపతి అర్బన్: మామిడి రైతులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 76,700 మంది రైతులు 80వేల హెక్టార్లలో తోతాపురి మామిడి పంట సాగు చేశారని చెప్పారు. అందులో తిరుపతి జిల్లాలో 14,582 హెక్టార్లలో సాగుచేస్తే 1.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. జిల్లాలో 8 గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్లు, 39 ర్యాంప్లు, 3 మండీలు ఉన్నాయని వివరించారు. 8 యూనిట్ల సామర్థ్యం 1.21 లక్షల మెట్రిక్ టన్నులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో టన్ను రూ.12కి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఫ్యాక్టరీ వారు రూ.8కి కొనుగోలు చేస్తే, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని చెప్పారు. అందరికీ న్యాయం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,938 మంది స్వామివారిని దర్శించుకోగా 28,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.