breaking news
Tirupati
-
ప్రాణం తీసిన గుంత
వరదయ్యపాళెం: మండలంలోని శ్రీకాళహస్తి–తడ మార్గంలో ఆర్ అండ్ బీ రహదారిపై పడిన గుంత నిండు ప్రాణాన్ని బలిగొంది. సత్యవేడు మండలం, జడేరి పంచాయతీ, కేవీకండ్రిగకు చెందిన ఎం.వెంకటేశులు (35) శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ తడలో నివాసముంటున్నారు. ఈ నెల 6న రాత్రి 10 గంటల సమయంలో వరదయ్యపాళెంలో తన స్నేహితుడిని కలుసుకుని తిరిగి తడలోని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బత్తలవల్లం సమీపంలో ఇనమాలగుంట వద్ద ఆర్ అండ్ బీ రోడ్డుపై ఉన్న గుంతలో దిగి అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్ల దుస్థితి కారణంగా నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఈ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
24న చైన్నెలో కార్గో వస్తువుల వేలం
తిరుపతి అర్బన్ : చైన్నెలోని మాధవరం బస్టాండ్లో ఉన్న తిరుపతి కార్గో పాయింట్ వద్ద డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను ఈ నెల 24వ తేదీన వేలం వేయనున్నట్లు ఆర్టీసీ కార్గో ఇన్చార్జి నిర్మల తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు వేలం ఉంటుందని, పాట దక్కించుకున్నవారు వెంటనే మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే వస్తువులను సైతం తక్షణమే తీసుకువెళ్లాల్సి ఉంటుందని వివరించారు. పారా మెడికల్ కోర్సులకు ఫైనల్ కౌన్సెలింగ్ రేపు తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్ కౌన్సిల్ డిప్లొమా, పారామెడికల్ కోర్సుల్లో మిగులు సీట్లకు మంగళవారం తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిప్లొమా, పారామెడికల్ కోర్స్లలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికే ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు 9440879943 నంబర్లో సంప్రదించాలని సూచించారు. అంధకారంపై విజయమే దీపావళి తిరుపతి అర్బన్ : అంధకారంపై వెలుగు సాధించిన విజయమే దీపావళి పండుగని కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈఓ అనిల్కుమార్ సంఘాల్ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ జిల్లావాసులందరూ సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని కోరారు. ఏపీ లాసెట్, పీజీఎల్సెట్ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి రూరల్ : ఏపీ లాసెట్– పీజీఎల్సెట్–2025 అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల ప్రకారం ప్రక్రియను పూర్తిచేసి క్లాసులకు హాజరు కావలసిందిగా కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. 23న వెబ్ ఆప్షన్లు మార్పు, 25న సీటు అలాట్మెంట్, 27 నుంచి 29 వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు httpr://cetr.aprche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. రేపు తుమ్మలగుంటలో నరకాసుర వధ తిరుపతి రూరల్ : దీపావళి వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం సోమవారం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద నరకాసుర వధ నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.2లక్షల వ్యయంతో 20 అడుగుల నరకాసుర ప్రతిమను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
అధ్యాపకుల కొరత
శాశ్వత అధ్యాపకుల కొరత వర్సిటీని తీవ్రంగా వేధిస్తోంది. సుమారు 400 మందికి పైగా శాశ్వత అధ్యాపకులు అవసరం ఉండగా కేవలం 130మంది మాత్రమే ప్రస్తు తం ఉన్నారు. తాత్కాలిక అధ్యాపకులను సైతం ఇటీవల తొలగించడంతో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారు. భాషా ప్రాతిపదిక కోర్సులైన సంస్కృతం, తెలుగుపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో పాటు హిస్టరీ, పొలిటికల్ సైనం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, హోంసైన్స్ వంటి కోర్సులలో ఈ ఏడాది కనీసం 15శాతం సైతం అడ్మిషన్లు కూడా లేకపోవడం దారుణం. ఎస్వీయూ పరిపాలనా భవనం -
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్లో మొదలై ఏప్రిల్లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు. పక్షుల కేంద్రంలో ఈపాటికే... వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు.ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్ జామ్
సాక్షి, తిరుమల: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. బండ రాళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తిరుమలలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులో తొమ్మిదో కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు రోడ్డు మీద పడిపోవడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు విరిగిపడిన కొండ చరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్కి అంతరాయం లేకుండా జేసీబీలతో బండరాలను తొలగిస్తున్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 82,136 మంది స్వామివారిని దర్శించుకోగా 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుపతి చేరుకున్న కల్వకుంట్ల కవిత...తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(mlc-kalvakuntla-kavitha) తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు. తన భర్త అనిల్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారితో కలిసి శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి(tirupati) కి ప్రయాణమయ్యారు. కవితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. శనివారం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత. -
కూటమి అరాచకాలపై సమరం
శ్రీకాళహస్తి : కూటమి అరాచకాలపై ఉద్యమించాలని, రెడ్బుక్ ఆగడాలను డిజిటల్ బుక్లో నమోదు చేద్దామని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో శనివారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్ని మండలాలు, పట్టణం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా గ్రామ, వార్డు, మండల కమిటీల నియామకాలపై వైఎస్సార్సీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. అక్రమ కేసుల అరెస్టుపై పోరాటం చేసేందుకు జగనన్న సైన్యం సిద్ధంగా ఉండాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని నిరంకుశ పాలనకు మంగళం పాడే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. జగనన్న చేసే యజ్ఞంలో మనం క్రియాశీల పాత్రదారులం కావాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని బూతు స్థాయిలో నిత్యం పరిశీలిస్తూ ఉండాలన్నారు. టీడీపీ ఎల్లో మీడియా, సోషల్ మీడియా చేస్తున్న గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యమని జగనన్న మాటగా గ్రామస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ముక్కంటి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎంపీ గురుమూర్తి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం -
వైద్య విద్యను కాపాడుకుందాం
పుత్తూరు: కోటి సంతకాల ప్రజాఉద్యమంతో వైద్య విద్యను కాపాడుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏడీకే కల్యాణ మండపంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన పాలనలో మొత్తం 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో ఐదింటిని పూర్తిచేసి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెల్టుషాపులపై ఉన్న శ్రద్ధ.. మెడికల్ కాలేజీలపై లేదా? గల్లీగల్లీలో బెల్ట్ షాపులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, మెడికల్ కాలేజీలపై ఎందుకు లేదని చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. వైద్య విద్య ప్రైవేటీకరణను ప్రజాఉద్యంతోనే అడ్డుకోవాలని, దీనికి ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకుడు కంకణధారుడు కావాలని పిలుపునిచ్చారు. జగనన్న సీఎంగా తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలను సైతం తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘సూపర్గా’ మోసం! సూపర్ సిక్స్ పేరిట ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, చేయూత, ఆసరా వంటి పథకాలను అటకెక్కించారన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చి మోసం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కోటి సంతకాలతో అడ్డుకుందాం మెడికల్ కళాశాలల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించి సంతకాలు చేయించాలని మాజీ మంత్రి రోజా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయించే కోటి సంతకాల పేపర్లతో జగనన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలసి వెళ్లి గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. తద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎ.హరి, వైస్ చైర్మన్లు డి.జయప్రకాష్, డీ.శంకర్, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, రూరల్ పార్టీ ఆధ్యక్షుడు అన్నా లోకనాథం, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన యువ తరంగ్
తిరుపతి సిటీ : ఎస్వీయూలో మూడు రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువ తరంగ్ కార్యక్రమం శనివారం ముగిసింది. శ్రీనివాసా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ భాస్కరరావు మాట్లాడుతూ.. మనిషి జీవన వికాసానికి కళలు మూలాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ.. ఎన్నో గొప్ప చారిత్రక సాంస్కతిక కార్యక్రమాలను యూనివర్సిటీ చేపట్టిందని గుర్తు చేశారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం, అన్నమయ్య భవనం, సేనెట్ హాల్ వంటి కేంద్రాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ బీవీ మురళీధర్, కల్చర్ అఫైర్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, న్యాయ నిర్ణేతలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
30న ముగియనున్న సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు
తిరుపతి సిటీ: 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ చివరి గడువుని విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడే డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష విధానం, నమూనా ప్రశ్నలు, మాక్ టెస్టులు, కోచింగ్ వంటి మరిన్ని వివరాలకు వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించాలని, లేదా 8688888802 /9399976999 నంబరులో సైతం సంప్రదించవచ్చని తెలిపారు. సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల శిక్షణలో విశ్వం విద్యార్థులు గత కొన్నేళ్ల నుంచి అగ్రగామి సీట్లు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మద్యం మత్తులో మీడియా ప్రతినిధిపై దాడి చిల్లకూరు : తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద ముగ్గురు యువకులు స్థానికంగా ఉండే ఓ టీవీ రిపోర్టర్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గూడూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే ముగ్గురు విద్యార్థులు మద్యం తాగి గురువారం రాత్రి బైక్ నడుపుతుండగా బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద అదుపు తప్పి కింద పడిపోయారు. తాగి అంత వేగంగా వెళ్లడం ఎందుకని అక్కడే ఉన్న ఓ టీవీ రిపోర్టర్ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధి తన సెల్ఫోన్తో వారిని వీడియో తీసేందుకు ప్రయత్నించగా అతడి సెల్ఫోన్ లాక్కుని ముగ్గురు యువకులు మూకుమ్మడిగా మీడియా ప్రతినిధిపై దాడికి తెగబడ్డారు. దీంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేయడంతో మద్యం మత్తులో ఉన్న యువకులు అక్కడ నుంచి పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు రోజుల తరువాత స్పందించి యువకులను స్టేషన్కు పిలిచి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తాగి వాహనం నడిపిన 26 మందిపై కేసు నాయుడుపేటటౌన్ : నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 26 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దీనిపై న్యాయమూర్తి విచారించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం 26 మందికి రూ.2.60 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బాబి తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి చంద్రగిరి : రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి మామండూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఒడిస్సాకు చెందిర రుద్రప్రసాద్(33) ముంగళిపట్టు సమీపంలోని జగనన్న కాలనీలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి రుద్ర ప్రసాద్ మామండూరు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తిరుపతి సిటీ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని యువజన, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. శనివారం వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గంధమనేని శివయ్య భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కాసులకు కక్కుర్తి పడి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కళాశాలలో 7 కళాశాలలు నిర్మాణం పూర్తి చేసుకొని, 5 కళాశాలలో అడ్మిషన్లు పూర్తయ్యి, మిగిలిన కళాశాలల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరే వేసలుబాటు ఉన్నా చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామని, ఇందులో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యంకావాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల కార్యక్రమానికి మద్దుతు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తన బినామీల కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో తీసుకొస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు రామకృష్ణ, ప్రవీణ్. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు జ్ఞానేంద్ర, నరేష్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు చెంగల్ రెడ్డి, వినోద్, యశ్వంత్, ఏఐవైఎఫ్ నాయకులు రామకృష్ణ, విక్రమ్, నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ రాజు, జై భారత్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు భార్గవ్, పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
జేసీగా మౌర్యకు బాధ్యతలు
తిరుపతి అర్బన్:తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యకు జాయింట్ కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించా రు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె ఇప్పటికే తుడా వీసీగా, తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. టీటీడీలో కొరవడిన పారదర్శకత తిరుపతి కల్చరల్: టీటీడీలో జవాబుదారీతనం, పారదర్శకత కొరవడిందని శివరామేశ్వరి శక్తి పీఠాధిపతి శివానందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ భక్తులు కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పినప్పుడు కలవాలని నిర్ణయం చేయడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తిరుమల స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొంది వాటిని డబ్బులకు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈవోను కలిసేందుకు తాము శుక్రవారం వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఈవోను కలవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలని చెప్పడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈవో వ్యవహార తీరుతో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అనిల్కుమార్, జయరామిరెడ్డి, డిల్లీ, దీపక్, యజ్ఞేష్ పాల్గొన్నారు. -
ఏర్పేడు ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
● పనులు పరిశీలించిన ఎంపీ గురుమూర్తి ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి జాతీయ రహదారి బైపాస్ మార్గం ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి సూచించారు. శనివారం ఆయన ఏర్పేడు సమీంలోని రోడ్డు పనులను పరిశీలించారు. ఏర్పేడు ఎల్.సి 36 రైల్వే క్రాసింగ్ కారణంగా ఏర్పేడు–వెంకటగిరి మార్గం వాహనాల రాకపోకలకు రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 2023లో రూ. 98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలైనా కాంట్రాక్టర్లు ఇంకా పూర్తి చేయకుండా నత్తనడకన సాగిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ ఐఐటీ, ఐసర్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, అలాగే వెంకటగిరి, రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఏర్పేడు సమీపంలో రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతోనే తాను ఆగిపోయిన వంతెన పనులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడిన ఎంపీ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పత్రికలపై కక్ష సాధింపు చిల్లకూరు : ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం సమంజసం కాదని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టడం తగదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక వార్త ప్రచురించారని కక్ష కట్టి సాక్షి ఎడిటర్పై కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ శిరీషాను కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్లో మొదలై ఏప్రిల్లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు. పక్షుల కేంద్రంలో ఈపాటికే... వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి. పక్షుల కేంద్రంలో గూడబాతులు తెల్లకంకణాయిలునత్తగుళ్లకొంగలు -
రేపు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతు తుడా: దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం స్విమ్స్ ఆస్పత్రి ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,675 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,681 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. అట్టహాసంగా ‘దీక్షారంభం’ చంద్రగిరి : శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని డైరీ టెక్నాలజీ కళాశాలలో శనివారం సాయంత్రం నిర్వహించిన దీక్షారంభం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీక్షారంభం కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు నూతన విద్యార్థులను డైరీ టెక్నాలజీపై క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పాటు బీటెక్ (డైరీ టెక్నాలజీ) 43వ బ్యాచ్ ఫ్రెషర్స్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ జేవీ రమణ, ప్రత్యేక అతిథిగా డైరీ సైన్స్ డీన్ డాక్టర్ నాగేశ్వరరావు, అధ్యక్షుడు డాక్టర్ వైకుంఠరావు, అసోసియేట్ డీన్ డాక్టర్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. దీక్షారంభం కార్యక్రమం ద్వారా వ్యక్తిత్వ వికాసం, విద్యా అవకాశాలపై అవగాహన పొందారని పేర్కొన్నారు. 15 రోజుల కార్యక్రమానికి సంబంధించిన నివేదికను విద్యార్థులు వీసీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ వెటర్నరీ ఆడిటోరియంలో ఫ్రెషర్డే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వెటర్నరీ సైన్స్ డీన్ డాక్టర్ ఆర్వి. సురేష్ కుమార్, డాక్టర్ శోభారాణి, కళాశాల అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా
– నవంబర్ 5వ తేదీకి మార్పు సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 5న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. అయితే ఈ ప్రయోగాన్ని ఈనెల 16న చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక పరమైన కారణాలతో 25వ తేదీకి వాయిదా పడింది. మళ్లీ 25 నుంచి నవంబర్ 5కి వాయిదా వేశారు. దీనికి తోడు ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో జీశాట్–7ఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. ఇందులో కూడా కొన్ని సాంకేతిక కారణాలతో 25న అనుకున్న జీశాట్–7ఆర్ ప్రయోగాన్ని నవంబర్ నెల 5న ప్రయోగించనున్నారని తెలుస్తోంది. 2013 ఆగస్టు 30న ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో ఉపగ్రహాన్ని పంపనున్నారు. రేపు విద్యాసంస్థలకు సెలవు తిరుపతి సిటీ:జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లకు సోమవారం మాత్రమే దీపావళి పర్వదినానికి సంబంధించి ప్రభుత్వ సెలవు ప్రకటించిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోములు ఉన్న ఉపాధ్యాయులు స్థానిక అధికారు ల అనుమతితో అదనంగా లోకల్ హాలీడేకి అను మతి పొందాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. -
టీటీడీ ఉద్యోగిని... హోం మంత్రికి చాలా క్లోజ్
తిరుమల: ‘నేను టీటీడీలో ఉద్యోగిని. రాష్ట్ర హోం మంత్రి అనితకు బాగా క్లోజ్. ఆమె తరఫున వచ్చే వీఐపీలకు నేనే ప్రొటోకాల్ దర్శనం చేయిస్తా’ అంటూ భక్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన టీడీపీ నాయకుడి గుట్టు రట్టయ్యింది. తిరుపతి జిల్లా, చంద్రగిరి రెడ్డివీధికి చెందిన బురిగాల అశోక్ రెడ్డి గత టీడీపీ హయాం నుంచి తిరుమలలో దళారీగా చలామణి అవుతున్నాడు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు, హోం మంత్రి వంగల పూడి అనితతోపాటు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ భక్తులను మోసగిస్తుంటాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. తెలంగాణకు చెందిన భజరంగ్ అమన గోయల్, పది మంది కుటుంబ సభ్యులకు సుప్రభాతం, తోమాల, అభిõÙకం సేవలతో పాటుగా బ్రేక్ దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ దర్శనాలకు చాలా ఖర్చవుతుందని నమ్మించాడు. తిరుమలకు రాకముందే బేరసారాలు సాగించాడు. ఫైనల్గా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల భక్త బృందం తిరుమలకు రాగానే అదనంగా రూ.10 వేలు తీసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బయటకు వెళ్లిన వెంటనే మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్ని సార్లు చేసినా ఫోన్ తీయకపోవడంతో మోసపోయామని గ్రహించి భక్తులు శుక్రవారం ఈ–మెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓ ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదు చేశారు. -
వసూళ్ల పండగ!
చిత్తూరులో తాత్కాలిక టపాసుల షాపులు ఏర్పాటు చేస్తున్న వ్యవసాయమార్కెట్ స్థలం చిత్తూరు కలెక్టరేట్ : దీపావళిని కూటమి నేతలు, అధికారులు కాసుల వసూళ్ల పండుగా మార్చేశారు. టపాసుల దుకాణాలకు నిబంధనలను పక్కాగా పాటించినా తమ చేతులు తపడకుంటే అనుమతులు జారీచేసేది లేదని అగ్నిమాపకశాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీపావళి సందర్భంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక దుకాణాల ఏర్పాటులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే.. దుకాణాల యజమానులు మాత్రం అడిగినంత లంచం ఇచ్చి అందినకాడికి దోచుకుందామనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ లంచాల పర్వం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దాదాపు 283 వరకు తాత్కాలిక టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. టపాసుల విక్రయాల్లో మార్జిన్ 50 శాతం కంటే ఎక్కువగా ఉండడంతో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటుకు పోటీ పెరిగింది. నిబంధనలు పాటించకున్నా మామూళ్లు ఇస్తే ఏమైనా చేసుకోవచ్చని, ఏ రేట్లకై నా అమ్ముకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో ఇద్దరు అధికారులకు రెగ్యులర్ దుకాణాలకు ఒక్కొక్క ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లకు రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. తాత్కాలిక దుకాణాలకు ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో తాత్కాలిక టపాసుల దుకాణాలకు అనుమతులు కావాలంటే ప్రతి షాపునకు రూ.25 వేల చొప్పున స్థానిక కూటమి ప్రజాప్రతినిధికి ముట్టుజెప్పుకోవాల్సిందే. దీంతో పాటు అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులకు సైతం అదనంగా లంచం ఇచ్చుకుంటేనే అనుమతులు దక్కే పరిస్థితి నెలకొంది. తనిఖీలు తూచ్ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగుతున్న అక్రమ టపాసుల వ్యాపారాలను అరికట్టడంతో పాటు అనుమతులు జారీచేస్తున్న ఆయా శాఖల్లో జరుగుతున్న లంచగొండుతనాన్ని అరికట్టడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాల్సిన అవసరం ఉంది. సేల్స్ ట్యాక్స్ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టపాసుల గోడౌన్లలో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి.. ఎంత మొత్తానికి ట్యాక్స్లు చెల్లించారు..? అన్న విషయాలను అధికారులు పట్టించుకోవడం లేదు. టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకునే వారు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్, అగ్నిమాపక, శానిటేషన్, మున్సిపాలిటీ, నగరపాలక శాఖల నుంచి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేప్టీ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అనుమతులను జారీచేస్తారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు, పుంగనూరుతో పాటు తిరుపతి జిల్లాలోని తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చంద్రగిరి, నాయుడుపేట, సత్యవేడు, వెంకటగిరిలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 40 వరకు తాత్కాలిక షాపులను పెడుతున్నారు. వీటన్నింటికీ అధికారుల నుంచి తాత్కాలిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తాత్కాలిక టపాసుల దుకాణాల ఏర్పాటుకు అందిన కాడికి దోచుకుంటున్నారు. లంచం ఇవ్వకపోతే ఏదో ఒక కారణంతో కొర్రీలు వేసి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అనుమతి పేరుతో భారీగా వసూళ్లు -
రైతు సభను అపహాస్యం చేయడం విడ్డూరం
తిరుపతి కల్చరల్ : రైతుల గోడుపై పూతలపట్టులో ఆక్రందన సభ పెట్టుకుంటే దానిని పూతలపట్టు ఎమ్మెల్యే ఆపహాస్యం చేయడం దుర్మార్గమని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ జాగీరు కాదని రైతు సంఘాల నేతలు పి.హేమలత, టి.జనార్దన్, సీపీఐ రాష్ట్ర నేత రామానాయుడు ఎమ్మెల్యేకు ఘాటైన సమాధానం చెప్పారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నీ ప్రతాపం మామిడి రైతులపై కాదు, ఫ్యాక్టరీలపై చూపించాలని హితవు పలికారు. మామిడి రైతుకు రూ.8 , సబ్సిడీ రూ.4 కలిపి మొత్తం సొమ్ములు రైతులకు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.4 సబ్సిడీ మాత్రమే చెల్లించిందన్నారు. అది కూడా ఆక్రందన సభకు ముందు రోజు విడుదల చేయడం అంటే అది రైతు సంఘం విజయమని తెలిపారు. బంగారు పాళ్యంలో రైతు సభను జరగనీయకుండా ఎమ్మెల్యే అధికారులతో, ప్రవేటు వ్యక్తులతో భయపెట్టి సభ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.40 ఫ్యాక్టరీలను నియంత్రించలేక 40 వేల మంది రైతులకు అన్యాయం చేయడం మీకు తగదన్నారు. మామిడి రైతులకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి పూనుకోవడం బాధాకరమన్నారు. బెదిరింపులతో మామిడి రైతుల ఉద్యమాన్ని అడ్డుకోలేరని హితవు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ.370 కోట్ల బకాయిలను తక్షణం ఇప్పించకపోతే జరగబోయే ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
మార్కెట్లోకి న్యూ విక్టరీస్ కారు
తిరుపతి కల్చరల్ : మారుతీ సుజికీ సరికొత్త ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన న్యూ విక్టరీస్ కారును శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేశారు. రేణిగుంట రోడ్డులోని భార్గవి ఆటో మొబైల్స్ షోరూంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి కె.మురళీమోహన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ శ్రీనివాస కుమార్ హాజరై నూతన విక్టరీస్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సరికొత్త కారు అత్యధిక సేప్టీతో అత్యాధునిక టెక్నాలజీతో చాలా బాగుందని తెలిపారు. మొదటి సారిగా భారత్ ఎన్సీఏపీ గ్లోబల్ ఎన్సీఏపీ, 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. భార్గవి ఆటో మొబైల్స్ చైర్మన్ బలరామిరెడ్డి మాట్లాడుతూ.. ఎంఐడీఎస్యూవీ రేంజ్ కారులో ఏడీఏఎస్ లెవల్–2 ప్రవేశపెట్టారని తెలిపారు. షోరూం ఎండీ కె.నిరంజన్ మాట్లాడుతూ.. ఈ కారు డైనామిక్ ఇన్ మోషన్ డిజైన్తో ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఇందులో 4 ఇంజన్ ఆప్షన్స్తో స్మార్ట్ లైబ్రడ్, స్ట్రాంగ్ బైబ్రో, 5 సీఎన్జీ ఆల్ గ్రిప్తో మార్కెట్లో అందుబాటులో ఉందన్నారు. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.19,93,900 వరకు లభిస్తుందన్నారు. అంతేకాక ఈ కారు ఆకర్షణీయమైన పది రంగులలో అందుబాటులో ఉందని తెలిపారు. భార్గవి ఆటో మొబైల్స్ ఈడీ కొండా ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ కొత్త కారులో యువత మెచ్చే ఎంతో ఇష్టమైన మ్యూజిక్, డాల్బీ ఆటోమొడ్స్ హార్మన్ ఆలాంగ్ విత్ అండ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్ సౌలభ్యం ఉందన్నారు. యువతను ఆకర్షించేలా 360 డిగ్రీ కెమెరా సదుపాయంతో పాటు అత్యధిక మైలేజీ వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భార్గవి సీజీఎం రమేష్ బాబు, డీజీఎం మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
బినామీల కోసమే ప్రైవేటీకరణ
వెంకటగిరి (సైదాపురం) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ఆంధ్ర రాష్ట్ర పేద బతుకులకు తలరాతలని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందేలా గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకు కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలో ఇంకెవరూ లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో అరాచకాలు పెరిగిపోతున్నాయని వాటికి పదింతలు బుద్ధి చెప్పే విధంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ 2.0 డిజిటల్ బుక్ను ప్రవేశ పెట్టారన్నారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదలిపెట్టే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను కూటమి సర్కార్ మోసం చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా పీ–4 అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పార్టీతో సంబంధం లేకుండా కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పే రోజులు తగ్గరలోనే ఉందన్నారు. తాజాగా జనసేన నేత గూడూరు వెంకటేశ్వర్లు తప్పును ఎత్తిచూపించినందుకు ఆయనపై కూడా కేసు నమోదు చేశారన్నారు. అనంతరం కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మొదటి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ బొలిగర్ల మస్తాన్యాదవ్, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, మండల కన్వీనర్లు, రాష్ట్ర విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను రాజకీయ కక్షతో ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని కూటమి ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం మొదలైందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి 26వ డివిజన్లోని బండ్లవీధిలో శుక్రవారం కార్పొరేటర్ తాజిన్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూమన అభినయ్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి పేదలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలను పక్కన పెట్టి కేవలం రూ. 6 వేల కోట్లను ఖర్చుపెట్టి మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కోటూరు ఆంజినేయులు, బోకం అనిల్కుమార్, ఆదిలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని కందాడ దళితవాడకు చెందిన సచివాలయ ఉద్యోగి కుటుంబ కలహాలతో గురువారం రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు. ఏర్పేడు మండలం కందాడ దళితవాడకు చెందిన బొంద మునెయ్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండవ కుమారుడు బొంద నిరంజన్(27) శ్రీకాళహస్తి మండలం బీవీపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కందాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యం, చంద్రికల కుమార్తె విద్యప్రియను నిరంజన్ ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ భార్య విద్యప్రియ గర్భిణి. పెళ్లైన తర్వాత కొంత కాలం సజావుగా జరిగిన వీరి కాపురం అత్తమామలు, భార్య వేధింపులకు తోడు అప్పులు ఎక్కువ కావడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిరంజన్ గురువారం రాత్రి గ్రామ శివారున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అమ్మా.. నాన్నా ఇక సెలవు.. మృతుడు నిరంజన్ వద్ద లభించిన సూసైడ్ నోట్ను బట్టి అత్తమామలు, భార్య వేధింపులు, అప్పులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేఖలో.. ‘పోలీసు వారికి మనవి.. నాకు పెళ్లైనప్పటి నుంచి మా భార్య, వాళ్ల అమ్మ, హేమలత(పెద్దమ్మ) నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాభార్య కూడా నన్ను చంపేదాక తీసుకొచ్చారు. దానికి రిలేటెడ్గా కాల్డేటా తీయండి సార్.. దయచేసి నాకు న్యాయం చేయండి సార్.. వీళ్లు నన్ను టార్చర్ పెట్టి చంపేసి నా భార్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. మా అమ్మా,నాన్న, అన్న, వదిన, తమ్ముడును కాపాడండి సార్.. ‘అమ్మా.. నాన్నా సారీ నాన్నా.. ఇక సెలవు.. ఇంకో జన్మలో మిమ్మల్ని బాగా చూసుకుంటా..’ వాళ్లు నా దగ్గర చాలా అప్పులు చేయంచారు. నేను కట్టలేని అప్పులు చేపించారు. దయచేసి వీళ్లను వదలొద్దు అంటూ సూసైడ్నోట్లో నిరంజన్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో మృతుని భార్య, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భూరికార్డుల మార్పుపై ఒంటిపై డీజిల్ పోసుకుని నిరసన
బుచ్చినాయుడుకండ్రిగ : ఆన్లైన్లో భూ రికార్డులు మార్పు చేయడంపై తహసీల్దారు కార్యాలయంలోని చాంబర్ వద్ద బాధితుడు పాండురంగయ్య శుక్రవారం డీజిల్ పోసుకుని నిరసన తెలపడంతో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. మండలంలోని పల్లమాల గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 79–3లో తన తల్లి అనసూయమ్మ పేరున ఆన్లైన్లో 5 ఎకరాల భూమి ఉందన్నారు. దీన్ని తహసీల్దారు పల్లమాల గ్రామానికి చెందిన రవీంద్రబాబు పేరుతో ఈనెల 8వ తేదీన మార్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే అనుసూయమ్మ పేరున ఉన్న భూమిని రవీంద్రబాబు పేరుతో మార్చారని ఆరోపించారు. ఈ ఘటనపై తహసీల్దారు శ్రీదేవి స్పందిస్తూ పల్లమాల గ్రామానికి చెందిన గోవిందమ్మ పేరుతో 5 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే శ్రీకాళహస్తి రాజీవ్నగర్కు చెందిన పాండురంగయ్య గోవిందమ్మ పేరుతో ఉన్న భూమిని తన తల్లి అనసూయమ్మ పేరుతో ఆన్లైన్లో 2020లో మార్చుకున్నారని తెలిపారు. దీనిపై గోవిందమ్మ కొడుకు రవీంద్ర తనవద్ద ఉన్న రికార్డులతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు భూ రికార్డులను మార్చామని తెలిపారు. -
కలెక్టరేట్కు మళ్లీ బాంబు బెదిరింపు
తిరుపతి అర్బన్ : తిరుపతి కలెక్టరేట్ కార్యాలయానికి మళ్లీ బాంబు బెదిరింపులు తప్పలేదు. శుక్రవారం ఏకంగా కలెక్టరేట్ భవనాన్ని పేల్చి వేస్తామంటూ సంక్షిప్త సందేశాలు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో బెదిరింపులు వచ్చిన సందర్భంగా బాంబు పెట్టామని సమాచారం ఇచ్చారు. ఈ సారి పేల్చి వేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో పాటు ఉదయం 10 గంటల సమయంలో మెసేజ్ పెట్టారు. దీంతో ఉద్యోగులు భయం భయంగా డ్యూటీలు చేశారు. కొందరు అయితే డ్యూటీకి వచ్చి చిన్న పని ఉందంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిర్వీర్య దళం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణం అంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది తప్పుడు సమాచారంగా నిర్ధారించారు. ఈ సంఘటనతో కొంతసేపు కలెక్టరేట్ ప్రాంగణంలో మొత్తం హడావుడి పరిస్థితి నెలకొంది. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. మెసేజ్ చేసిన వ్యక్తి వివరాలు కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ వెల్లడించారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,675 మంది స్వామివారిని దర్శించుకోగా 24,681 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.32 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 4 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
చిత్తూరులో కదం తొక్కిన పాత్రికేయులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తున్న పత్రికలపై కేసులు నమోదు చేయడం.. వేధింపులకు గురిచేయడం.. ప్రశ్నించే కలానికి సంకెళ్లు వేయడం ఏమిటని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వేధింపులు మానుకోవాలని డీఆర్ఓ మోహన్కుమార్కు వినతి పత్రం అందజేశారు. -
‘శ్రీనివాసా’ ఇదేంది స్వామీ?
● ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిపై ఆరోపణలు ● వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు దుర్వినియోగం చేశారని లేఖలు సాక్షి టాస్క్ఫోర్స్: ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శివకామేశ్వరి శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివానందస్వామి టీటీడీ ఈఓ, టీటీడీ సీవీ అండ్ ఎస్ఓకు లేఖ రాశారు. టీటీడీ కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయంపై విచారణ చేయాలని ఆలేఖ ద్వారా కోరారు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే.. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను దుర్వినియోగం చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. టీటీడీ నుంచి పొందిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఆయన వనం శ్రీనివాస్ అనే దళారీ ద్వారా భక్తులకు ఒక్కో లెటర్ను రూ.20వేల చొప్పున విక్రయించినట్లు తనకు సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండడంతో పాటు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయన్నారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామికి టీటీడీ ద్వారా ఎన్ని వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు జారీచేశారో, ఆ టికెట్లు ఎవరెవరికి ఇచ్చారో, వాటి వినియోగం ఎలా జరిగిందో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. భక్తుల వద్దకు టికెట్లు విక్రయించినట్లు నిరూపణ అయితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్వామీజీ ముసుగులో దళారీతో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారని శ్రీశ్రీశ్రీ శివానందం స్వామి వివరించడం గమనార్హం. ఈమేరకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. -
కొల్లగొట్టు.. అడిగేదెవరు!
గూడూరు నియోజకవర్గంలో ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొడుతున్నారు. గనుల లీజుల కాల పరిమితి దాటిపోయినా తవ్వకాలు ఆగడంలేదు. లీజు కాలం ముగిసిందని అడిగే అధికారి లేరు. ప్రభుత్వ సంపదను అక్రమంగా దోచేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులకు చెవికెక్కడంలేదు. స్థానికంగా ఉన్న ఓ కూటమి నేత అండ దండలతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ఖనిజ సందను కొల్లగొడుతున్నారు. అధికారుల నుంచి నేతల వరకు ముడుపులు ముట్టుజెబుతుండడంతో తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఉన్నతాధికారులైనా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.! సాక్షి టాస్క్ఫోర్సు : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఖనిజ సంపదపై కన్నెసి అక్రమ మార్గంలో తవ్వి పచ్చనేతలు జేబులు నింపుకుంటున్నారు. అక్రమంగా ఖనిజ సంపదను తరలించడంలో స్థానిక నేత అండ దండలు ఉండడంతో గూడూరులో దొరికే ఖనిజ సంపద అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 2024లో కాలం ముగిసినా.. 50 ఏళ్లకు గూడూరు మండలం కందలిలోని మైన్స్కు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం 2024 నవంబర్ నాటికి కాల పరిమితి పూర్తి అయ్యింది. అయితే మైనింగ్ యజమానులు రెండవ సారి దరఖాస్తు చేసుకున్న 20 ఏళ్ల కాల పరిమితిని బూచిగా చూపుతూ స్థానిక కూటమి నేతల అండ దండలతో గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయితో పాటుగా ఇతర ఖనిజాలను తరలించేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే గనుల్లో గతంలో తవ్విన గుంతల్లో మట్టి నింపేందుకు పనులు చేస్తున్నామని చెబుతున్నారు. రాత్రి పూట తవ్వకాలను చేపట్టి మెటీరియల్ను మరోచోట డంప్ చేసి తరలించేస్తున్నారు. చెక్ పోస్టులు పెట్టినా .. మైనింగ్కు సంబంధించిన ప్రతి ఖనిజానికి లీజుదారులు ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించాల్సి ఉంది. ఈ రాయిల్టీ ప్రభుత్వానికి అందడం లేదని ఇటీవల ఓ ప్రవేటు ఏజెన్సీకి రాయిల్టీ వసూళ్లకు అనుమతి ఇచ్చింది. వారు పలు ప్రాంతాలలో చెక్ పోస్టులు పెట్టారు. అయితే కందలిలోని మైనింగ్ యజమానులు గతంలో తవ్వి నిల్వ ఉంచిన తెల్లరాయిని తరలించుకునేందుకు అనుమతులు లేకపోయినా ఉన్నట్లు చెబుతూ అక్రమంగా తెల్లరాయిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఉన్నట్లా..లేనట్లా..! గూడూరు మండలం కందలి గ్రామ సమీపంలో కాలం చెల్లిన మైన్లో ప్రతి రోజు అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపడుతున్నారని రెవెన్యూ, గనులశాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ఏ ఒక్క అధికారి అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో కూటమి నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారులు పట్టించుకోకపోవడపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.నిబంధనలకు తూట్లు మైనింగ్ లీజు పొందిన వారు కాల పరిమితి తీరి పోయిన తరువాత తవ్వకాలు చేపట్టిన భూమికే కాకుండా అదనంగా ఉండే ప్రాంతానికి కూడా డెడ్ రెంట్ చెల్లించాల్సి ఉంది. అయితే అలాంటివి ఏమి చెల్లించకుండా ఖాళీగా ఉండే భూమిలో తవ్వకాలు చేసి గతంలో తవ్విన గుంతలను నింపి వేస్తున్నారు. ఇలాంటి వాటిపై గనుల శాఖాధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చినా స్థానిక నేత అండ దండలు మెండుగా ఉండడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. స్థానిక నేతల అండదండలు గూడూరు నియోజకవర్గంలో దొరికే తెల్లరాయి, సిలికా, ఇసుక, లాంటి ఖనిజాలు అక్రమ తవ్వకాలు ఆగకుండానే కొనసాగుతున్నాయి. తెల్లరాయిని రాత్రి సమయంలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెల్లరాయి తవ్వకాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసినట్లు కనికట్టు చేసినా లోపల జరిగే తంతు మాత్రం అడ్డుకోలేకపోతోంది. గూడూరు మండలం కందలి గ్రామంలో ఉన్న ఓ మైన్కు లీజుల కాల పరిమితి అయిపోయినా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయిని దర్జాగా తరలించేసి సొమ్ము చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. -
19 నుంచి జనవరి శ్రీవారి దర్శన కోటా విడుదల
తిరుమల: కొత్త ఏడాది జనవరికి సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్ల జనవరి కోటాను 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. 24న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తుంది. ఇక 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనున్నది. https:// ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. -
టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!
సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. -
బొజ్జల సుధీర్ను ప్రశ్నిస్తూ పోస్టు.. జనసేన నేత అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని(Tirupati) వెంకటగిరిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై(Bojjala Sudhir Reddy) పోస్ట్ పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, టీడీపీ, జనసేన మధ్య రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు అరెస్ట్ను అతడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.తిరుపతిలో కూటమి రాజకీయం మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి మాజీ జనసేన(janasena) ఇన్చార్జ్ కోటా వినుతకు(Kota Vinutha) న్యాయం చేయాలి అని సోషల్ మీడియా వేదికగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పోస్ట్ పెట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో, ఆ పోస్టు వైరల్గా మారింది. సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. అనంతరం, కూటమి ఎమ్మెల్యేపైనే పోస్టు చేశారన్న కారణంగా జనసేన నేత వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇలా పోస్టు పెట్టినందుకే అరెస్ట్ చేస్తారా?.. ఏంటి ఈ అన్యాయం అని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారి తీసింది.ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు. మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. .. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. -
శాస్త్రోక్తం..అంకురార్పణం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు గురువారం అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఉదయం ఆచార్య రిత్వికరణం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం జరిపారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో నేడు పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుంచి 6 గంటలకు గ్రామోత్సవం, 7 నుంచి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించి, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. -
భూ చోళ్లు
ప్రభుత్వాలు అడవుల పెంపకానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే కూటమి నేతలు ఉన్న అడవులు నరికివేసి, కొండలను చదును చేసి, మామిడి తోటల పెంపకం పేరుతో కబ్జా చేస్తున్నారు. కొంత కాలం తరువాత గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అటవీ, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. కూటమి నేతలకు వంతపాడుతున్నారు. ఫలితంగా పచ్చదనం కరిగిపోతోంది. కొండను చదును చేస్తూ, వాహనాల్లో మట్టిని లోడ్ు చేస్తున్న హిటాచీరామచంద్రాపురం: రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే అటవీభూములు కనుమరుగైపోతాయి. 2014–19 నాటి ఆక్రమణలు ఏడాదిన్నర కాలంగా మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి నేతలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది.. అవకాశం ఉన్న మేర అటవీ భూములను ఆక్రమించేద్దాం.. దొంగ పట్టాలు సృష్టించుకుని ఇనుప కంచెలతో హద్దులు ఏర్పాటు చేసుకుని, కేంద్ర పథకం ఎన్ఆర్జీఎస్ నిధులతో మామిడి తోటలు పెంపకం, ఆపై రూ.కోట్లకు ఎన్నారైలకు భూములను విక్రయించేస్తున్నారు. అనుపల్లి, సి.రామాపురం, గుండోడు కనం, చిట్టత్తూరు, రాయలచెరువు, పిల్లారి కొండలు కబ్జా కోరల్లో చిక్కి భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని మండల ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రజల ఆస్తులను ప్రకృతి సంపద కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు విధులను విస్మరించి, పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. విద్యుత్ శాఖ సహకారం రైతులు, సామాన్య ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు కావాలంటే నెలలు తరబడి కార్యాలయల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అధికారుల చేయి తడపనిదే సామాన్యుల పనులు ముందుకు సాగవు. అయితే అటవీ భూముల అక్రమణదారులకు, కూటమినేతల నివాసాల వద్ద అధికారులే పడిగాపులు కాసి, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్న సందర్భాలను చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. రెవెన్యూ మౌనమెందుకు? రామచంద్రాపురంలో జరుగుతున్న అటవీ భూములను, ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటూ.. ప్రజా సంపదను లూటీ చేస్తున్న రూ.కోట్ల విలువచేసే మట్టిని, భూములను కొల్లగొడుతున్న పట్టీపట్టనట్టు చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బందిపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. చట్టాలు, శిక్షలు సామాన్యులకేనా? కూటమి నాయకులకు వర్తించవా? అంటూ బహిరంగంగా నే ప్రజలు విమర్శిస్తున్నారు. సామాన్య రైతులు పట్టా భూములను ఆన్లైన్, పాస్ బుక్ చేసుకోవాలన్న ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ ఫైళ్లు ముందుకు కదలవని, అక్రమణ దారులకు, కూటమి నేతలకు మాత్రం అన్నీతామై కబ్జాదారుల పనులు సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అటవీ భూముల్లో మట్టి చదును చేస్తున్న జేసీబీరెవెన్యూ వ్యవస్థపై మండిపాటు మండలంలో రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటవీ భూములు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేక భూ బకాసురుల చేతులో బందీలుగా మారారు. అనుపల్లి సర్వే లెక్కల దాఖలాలో 411, 480లో గతంలో ఎన్నడూ లేని పట్టాలను సృష్టించుకుని అటవీ భూములను అదును చూసి చదును చేస్తున్నారు. గతంలో అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వ అనుకూల పత్రికలో ప్రచురితమైన కథనాల మేరకు అప్పటి జిల్లా అధికారులు స్పందించి బోగస్ పట్టాలను రద్దు చేసి, ఆక్రమణలను అడ్డుకున్నారు. మండల కేంద్రానికి 15 మైళ్ల దూరంలో అనుపల్లి అటవీ భూములున్నాయి. భారీ యంత్రాలతో రేయింబవళ్లు చదును చేస్తున్నారని, జిల్లా అధికారులకు సమాచారం తెలిసి వారువచ్చే సమయానికి మండల అధికారులు కూటమి నేతలకు సమాచారం చేరవేయడంతో అక్రమణదారులు అప్రమత్తమై యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రాత్రి సమయంలో పనులను సజావుగా సాగిస్తున్నారని అనుపల్లి, కూనేపల్లి ప్రజలు మండిపడుతున్నారు. నిరసన చేపడతాం తమ పశువులు, జీవాలు మేతకు అటవీ భూములు ఆశ్రయంగా ఉండేవని ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకొని ఇనుప కంచెలు నిర్మించేశారని, భారీ యంత్రాల శబ్దాలకు జంతువులు అడవులు విడిచి జనావాసాలకు వస్తున్నాయని, ఈ ఆక్రమ ణలు ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు కనుమరుగుతుందని, ఒకప్పుడు అడవులు ఉండేవని చెప్పుకొనే పరిస్థితి వస్తుందని, వర్షాలు పడక రైతులు వలసి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వారిపై జి ల్లాస్థాయి అధికారులు, కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున అనుపల్లి కునేపల్లి ప్రజలు నిరసన చేపడతామని తెలియజేశారు. -
కేసులతో మీడియాను భయపెట్టలేరు
వార్తల్లో ఏవైనా అభ్యంతరం ఉంటే సరైన ఖండన ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా కేసులు పెట్టి మీడియాను భయపెట్టాలని చూడడం సరైనది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సాక్షి ఎడిటర్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. పోలీసుల ద్వారా మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదు. మీడియా పైన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి. – కె. గిరిబాబు, రాష్ట ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ -
ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యం
● సౌత్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు తిరుపతి కల్చరల్: ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సౌత్ ఇండియా ఓబీసీ వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగిన సౌత్ ఇండి యా ఓబీసీ సెమినార్లో దక్షిణాదితోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఓబీసీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతోపాటు సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన శాసీ్త్రయ పద్ధతిగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన తమ వాటా హక్కు లను తమకు కేటాయించాలన్నారు. తెలంగాణ తరహాలో 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు -
పత్రికా స్వేచ్ఛపై దాడి హేయమైన చర్య
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపితే పత్రికలపై ప్రభుత్వం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య. సాక్షి దినపత్రిక ఎడిటర్పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి. విచారణ పేరుతో హైదరాబాద్లోని కార్యాలయంలో గంటల తరబడి పోలీసులు హల్చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే ఖండిచాలి తప్ప ఇలాి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే. – కల్లుపల్లి సురేందర్రెడ్డి, ఏపీ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి -
బాలుడి ఆత్మహత్యపై విచారణ
చంద్రగిరి: బాలుడి ఆత్మహత్యపై గురువారం పోలీసు, ఎకై ్సజ్ అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన బాలుడిని మందలించడంతోపాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పారిపోయిన బాలుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణాధికారులు బాలుడు పాఠశాలకు ఎన్ని గంటలకు వచ్చాడు. మద్యం సేవించి ఎందుకు వచ్చాడు. మద్యం బాటిల్ బ్యాగులో పెట్టుకుని ఎందుకు వచ్చాడన్న కోణంలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉదయం 8.30 గంటలకు పాఠశాల వచ్చిన బాలుడు మద్యం సేవించడంతోపాటు బ్యాగులో మద్యం బాటిల్ను పెట్టుకుని వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆపై బాలుడిని హెచ్ఎం వద్దకు తీసుకెళ్లామని, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో బాలుడు పరుగులు తీస్తూ పాఠశాలలో గోడ దూకి పారిపోయినట్లుగా అధికారులకు తెలిపారు. మా బిడ్డను మాకు ఎందుకు అప్పగించలేకపోయారు మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు పాఠశాల నుంచి హెచ్ఎం ఫోన్ ద్వారా సమాచారం అందించాడని బాలుడు బంధువులు తెలిపారు. తాము వస్తున్నామని చెప్పిన 10 నిమిషాలకు పాఠశాలకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే తమ బాలుడు పాఠశాల నుంచి పారిపోయినట్లుగా ఉపాధ్యాయులు చెప్పడం వారి విధులు నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. తమ బిడ్డకు ఎలాంటి దుర అలవాట్లు లేవని, బాలుడిపై అసత్యప్రచారం చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు ఇలాగే ప్రవర్తిసారా? అంటూ మండిపడ్డారు. తమ బిడ్డను తమకు అప్పగించలేకపోవడంలో ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. బాలుడు తప్పు చేస్తే, వారికి తెలియకుండా సమాచారం ఇవ్వాలే తప్ప, ఇలా బాలుడి ముందే ఎలా ఫోన్ చేస్తారంటూ మండిపడ్డారు. కేవలం 20 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు దృష్టి సారించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డ మద్యం సేవించి ఉంటే పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడవుతుందని, ఇలా ఉపాధ్యాయులు మద్యం సేవించాడని చెప్పడం దారుణమన్నారు. బెల్టు దుకాణం ద్వారా మద్యం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు సీఎం చంద్రబాబు సొంత మండలంలో విచ్చల వి డిగా బెల్టు దుకాణాలు వెలిశాయి. 24 గంటలూ మద్యం లభిస్తుండడంతో ఇప్పటికే పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన బాలుడు బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పనపాకం నుంచి చంద్రగిరి వరకు 12 కిలోమీటర్ల దూరంలో సుమారు 15కు పైగా బెల్టు దుకాణాలను నడుపుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకోకుండా, అధికారులు మామూళ్లకు అలవా టు పడి వారికి సహకరిస్తున్నారంటూ మండిపడ్డా రు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి బెల్టు దుకాణాలపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
2026 డిసెంబర్కు పనులు పూర్తి
చిల్లకూరు: గ్రీన్ఫీల్డ్ రహదారుల పనులు నాలుగు ప్యాకేజీల్లో మూడు ప్యాకేజీలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకునివచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చిల్లకూరు మండలంలో శరవేగంగా జరుగుతున్న సాగరమాల,(గ్రీన్ఫీల్డ్)రహదారి పనులను ఆయన 35 కి.మీ. మేర పరిశీలించారు. అలాగే చిల్లకూరు, కోట మండలాల పరిధిలో ఏర్పాటు కానున్న క్రిస్ సిటీలో అభివృద్ధి పనులను పరిశీలించి, తీర ప్రాంతంలోనే ఏర్పాటు కానున్న సోలార్ ప్లాంట్ వివరాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగరమాల నిర్మాణ సంస్థ ప్రతినిధులు, క్రిస్ సిటీ ప్రతినిధులతో వేర్వేరు సమీక్ష నిర్వహించి, వారికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తరువాత కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే పను లు నాలుగు ప్యాకేజీలుగా అమలు అవుతున్నాయన్నా రు. ఇందులో ఒకటి నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు, ఒకటి అంతర్గత రహదారి ప్రాజెక్టు, మరొకటి వరగలి క్రాస్ రోడ్డు నుంచి కృష్ణపట్నం వర కు, నాలుగోది నెల్లూరు జిల్లా ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వరకు మొత్తంగా 125 కి.మీ. మేర రహదారు ల నిర్మాణం జరుగుతుందన్నారు. వీటిలో మూడు ప్రా జెక్టు పనులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నాయుడుపేట నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న రహదారి పనులు 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సుమారు రూ.3 వేల కోట్లతో చేపడుతున్న ర హదారుల నిర్మాణ పనులు పూర్తయితే, తీర ప్రాంతం సుందరంగా ఉంటుందని తెలిపారు. చిల్లకూరు, కోట మండలాల మధ్యలో ఏర్పాటు అవుతున్న క్రిస్ సిటీకి సంబంధించి తొలివిడతగా 2,500 ఎకరాల్లో ప నులు చేపడుతున్నామన్నారు. ఇందుకుగాను రూ.1200 కో ట్లు వెచ్చించనుండగా ప్రస్తుతం రూ.200తో పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఆయన వెంట గూడూరు ఎఫ్ఏసీ ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, నేషనల్ హైవే పీడీ నెల్లూరు చౌదరి, జిల్లా మైనింగ్ అదికారి బాలాజీ నాయక్, చిల్లకూరు, కోట తహసీల్దార్లు శ్రీనివాసులు, జేజే రావు ఉన్నారు. -
బైకును ఢీకొన్న టిప్పర్
● నాగలాపురం మండల సర్వేయర్ సునీత మృతి ● గ్రామ సర్వేయర్ దినేష్కు స్వల్పగాయాలు నాగలాపురం: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ డీకొన్న ఘటనలో మండల సర్వేయర్ సునీత మృతి చెందగా గ్రామ సర్వేయర్ స్వల్పంగా గాయపడ్డారు. మండలంలోని బైటకొడియంబేడులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. నాగలాపురం మండలంలో సర్వేయర్గా పనిచేస్తున్న సునీత, గ్రామ సర్వేయర్ దినేష్తో కలిసి సురుటుపల్లిలో సర్వే పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో బైటకొడియంబేడు హైవేపై తిరుపతి వైపు వెళుతున్న ఓ టిప్పర్ బైకును ఓవర్టైక్ చేసే ప్రయత్నంలో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెనుక కూర్చొని ఉన్న మండల సర్వేయర్ సునీత టిప్పర్ చక్రాల కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న దినేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రైవేటు అంబులెన్స్లో మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన దినేష్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనింగ్ ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ షణ్ముగం తెలిపారు. -
సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపును సద్వినియోగం చేసుకోండి
తిరుపతి మంగళం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, జిల్లా రవాణాశాఖాఽధికారి కొర్రపాటి మురళీమోహన్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ అధికారులు రాజ్యలక్ష్మి, నవీన్కుమార్రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, రమణా నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత, పరిపాలన అధికారులు విజయ ప్రశాంతి, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
యువతే దేశ సంపద
తిరుపతి సిటీ: యువతే మన దేశానికి నిజమైన సంపదని ఎస్వీయూ వీసీ తాతా నరసింగరావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో శ్రీనివాస ఆడిటోరియం వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న యువతరంగ్ – 2025 కార్యక్రమంలో గురువారం వీసీ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితానికి కళలు, సాహిత్యం వంటివి అవసరమని అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి సంప్రదాయాలకు కళలు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా కళలు, సంగీతంపై ఆసక్తి ఉన్నా, సాధన చేయడం సాధ్యం కాలేదని తెలిపారు. క్రీడా, సాంస్కృతిక రంగాల్లో యూనివర్సిటీ మంచి గుర్తింపును సంతరించుకోవడం శుభపరిణామన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సాంస్కృతిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. ర్యాలీలో అలరించిన వేషధారణ యువతరంగ్–2025లో భాగంగా వర్సిటీలోని అన్నమయ్య భవన్ నుంచి శ్రీనివాస ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆకట్టుకునే వేషధారణలో ర్యాలీలో పాల్గొన్నారు. కోలాటాలతో భక్తిరస గీతాలతో ఆలపిస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన శ్రీవారి, అమ్మవారి వేషధారణలో వీక్షకులను అలరించాయి. ర్యాలీలో కోలాట ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థినులు హల్చల్ చేసిన సినీనటుడు కిరణ్ అబ్బవరం ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం సందడి చేశారు. యువతరంగ్– 2025 ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, హల్చల్ చేశారు. విద్యార్థుల కేరింతల నడుమ ఆయన మాట్లడుతూ తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎంతో ఉత్తేజం పొందానని తెలిపారు. తనకు వచ్చిన గుర్తింపునకు యువ త ముఖ్యకారణం అన్నారు. భవిష్యత్తులోనూ తనను ఇలాగే ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. తొలినాళ్లలో తనకు లక్ష్యం ఏమిటో అర్థం కాలేదని తెలిపారు. పాతికేళ్ల వయసులో జీవిత లక్ష్యం అర్థమైందని, కళాకారుడిగా రాణిస్తానని నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్, డీన్ ఆచార్య చెండ్రాయుడు, ఆర్ట్స్, కామర్స్, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు సుధారాణి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆచార్య బీవీ మురళీధర్, కల్చరల్ అఫైర్స్ కో– ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ ఉదయ్, రాజశేఖర్, ప్రసన్న, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లు!
ప్రశ్నిస్తే కేసులు.. వేధింపులు చిత్తూరు అర్బన్ : ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను పాత్రికేయులు ఎత్తిచూపితే అధికారులు, పాలకులు పొరపాట్లను సరిచేసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రశ్నించే పత్రికలపై కేసులు పెడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ హక్కుకు సంకెళ్లు వేస్తున్నారు. మద్యంపై వార్తలు రాస్తున్నందుకు ‘సాక్షి’ పత్రికపై కక్షగట్టి కేసులు పెడుతున్నారు. జిల్లాలో కేసులు ఇలా.. పత్రికలో ఏదైనా కథనం ప్రచురితమైతే అందులో ఉన్న విషయాన్ని గుర్తించి, లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. తప్పుచేసిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోచ్చు. కథనంలో ఏదైనా తప్పుగా ఉందనిపి స్తే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు. న్యాయపరంగా ముందుకు వెళ్లొచ్చు. ఇవన్నీ వదిలేసి వార్తలు రాసిన పాత్రికేయులే లక్ష్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జర్నలిస్టులపై కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనూ దారుణ పరిస్థితి.. ములకలచెరువులో కల్తీ మద్యం తయారుచేయడం పై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్కు నోటీసులు ఇవ్వాలని బుధవారం ఏకంగా హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రశ్నల పేరిట ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డికు సైతం నోటీసులు ఇచ్చి, విచారణ పేరిట స్టేషన్కు పిలిపించారు. -
మద్యం తాగిన మైనర్.. రైలుకింద పడి ఆత్మహత్య
చంద్రగిరి: కూటమి నాయకుల ‘బెల్టు’ దాహం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు... మైనర్లనూ బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన బాలుడు జస్వంత్ (15) ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జశ్వంత్ బ్యాగ్ను తనిఖీ చేయగా, మద్యం బాటిల్ లభ్యమైంది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్ఎం భాస్కర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన జశ్వంత్ను మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో జశ్వంత్ పాఠశాల గోడ దూకి పారిపోయాడు.అనంతరం అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.బెల్టు దుకాణమే కారణమా? చంద్రగిరి మండలంలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జస్వంత్ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు జస్వంత్కు మద్యం ఎక్కడ నుంచి వచి్చంది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. వాస్తవంగా 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. జస్వంత్ వద్ద దొరికిన బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా? లేక బెల్టు దుకాణాలకు అండగా కేసును నీరుగారుస్తారా? అనేది తేలాల్సి ఉంది. -
జమేదారు బదిలీ
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తురాలిపై ఆలయంలో దాడికి పాల్పడిన జమేదారు అలివేలుపై టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలకు పూనుకున్నారు. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం వచ్చిన చైన్నెకు చెందిన ఆండాళ్ అనే హిజ్రా భక్తురాలిపై కుటుంబ సభ్యుల సమక్షంలో జమేదారు అలివేలు దాడికి పాల్పడింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆమెను ఆలయం నుంచి విధులను తప్పించి, అలిపిరికి బదిలీ చేశారు. గతంలోనూ ఇదే రీతిలో ఓ భక్తుడిపై దాడికి పాల్పడడంతో అప్పట్లో ఆమెను ఆలయం నుంచి బదిలీ చేశారు. కొద్ది రోజులకే కూటమి నేతల అండదండలతో ఆమె తిరిగి అమ్మవారి ఆలయానికి తిరిగి రావడం గమనార్హం. కాగా వివాదస్పద జమే దారు అలివేలును సున్నితమైన అలిపిరి సెక్టార్–5కు బదిలీ చేయడం విమర్శలకు తావ్విస్తోంది. -
పాఠశాలలో మందుబాబుల వికృత చేష్టలు
కేవీబీపురం: తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని కళత్తూరులోని ప్రాథమిక పాఠశాలలో మద్యం బాబులు వికృత చేష్టలకు దిగారు. రాత్రిళ్లు మద్యం సేవించి, పేకాట ఆడేందుకు, వ్యక్తిగత, అసాంఘిక కార్యకలాపాల కోసం పాఠశాలను వినియోగించుకోవడం అలవాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి బడికి వేసిన తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అర్ధ రాత్రిలో బడిలోని పలు రికార్డులను చించేశారు. అక్కడే చిందరవందరగా పడేశారు. మద్యం సేవించిన వారు ఆ వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లారు. సాపా, దిండు అక్కడే పడేశారు. దీనిపై స్థానిక నేత ద్వారా పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఎస్ఐ నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో కూడా ఇదే విధంగా తాళాలు పగలగొట్టి ,పాఠశాలలోకి చొరబడి నానా హంగామా చేశారని వాపోయారు. ఇప్పటికై నా స్పందించి పోలీసులు నిఘా పెట్టాలని కోరారు. ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ పూర్తిగా నిఘా ఉంచుతామని, దొరికిన రోజు మందు బాబుల మత్తు దించడమే కాకుండా, కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు. -
ఫీజు చెల్లింపులు.. తప్పని పడిగాపులు
తిరుపతి సిటీ : ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ రాజ్యమేలుతోంది. చివరకు తోపుడు బండ్ల వ్యాపారులు సైతం ఆన్లైన్ చెల్లింపులను అందిపుచ్చుకున్నారు. అయితే డిజిటల్ టెక్నాలజీ, ఏఐ, డేటా సైన్స్, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ అంటూ ఆధునిక కోర్సులను బోధించే ఎస్వీయూనివర్సిటీలో మాత్రం ఫీజుల చెల్లింపులకు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఫీజు కట్టాలంటే వర్సిటీలోని యూనియన్ బ్యాంకులో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. గంటల తరబడి నిరీక్షణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల క్రితమే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఎస్వీయూలో మాత్రం కళాశాల, హాస్టల్ ఫీజులు చెల్లించాలంటే విద్యార్థులు బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. వర్సిటీలోని యూనియన్ బ్యాంక్లో ఒకే క్యాషియర్ ఉండటంతో సాధారణ కస్టమర్లతో పాటు విద్యార్థులు వందల సంఖ్యలో సేవల కోసం ఎదురు చూస్తుంటారు.దీంతో ఫీజులు చెల్లించాలంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఫీజు చెల్లింపులకు ఒక రోజు కళాశాలకు సెలవు పెట్టాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ చొరవ చూపాలి ఎస్వీయూలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను తక్షణం అమలులోకి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులో సిబ్బంది కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. వీసీ నర్సింగరావు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. -
పేటశ్రీకి సాహితీ పురస్కారం
తిరుపతి సిటీ : ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి (పేటశ్రీ) రచించిన తిరుపతి కథలు పుస్తకానికి సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పుర స్కారం ప్రకటించింది. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని నందమూరి తారకరామారావు కళామందిరంలో ఆయనకు అవార్డుతోపాటు రూ.2,116 నగదు బహుమతి అందించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న శ్రీరంగం మఠం పీఠాధిపతి తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం ఉడిపిలోని కానీయూరు మఠం పీఠాధిపతి విద్య వల్లభ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత తిరుపతి అర్బన్ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి కమిషనర్ మౌర్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణపై అవగాహన అవసరమని, రీసైక్లింగ్ చేయడం మంచిదని వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్క్యులర్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నాగేశ్వర రాజు, డీపీఓ సుశీలాదేవి, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు. ఎర్రచందనం పట్టివేత భాకరాపేట:అటవీ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో బుధవారం సుమారు రూ.25లక్షల విలువైన 15 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. అటవీ శాఖ అధికారి ఎన్.వెంకటరమణ, ఎఫ్బీఓలు వై.రాజేష్ కుమార్, ఎం.సదాశివయ్య, జి.ప్రదీప్ చంద్, సి.రవి, జేబీ నిఖిల్, డ్రైవర్లు హెచ్.శంకర్, ఎన్.రోహిత్ పాల్గొన్నారు. -
బ్యాంక్లో చోరీకి యత్నం
నాగలాపురం: నాగలాపురంలోని యూనియన్ బ్యాంకులో మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. బుధవారం ఉదయం బ్యాంకు అధికారులు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పుత్తూరు రోడ్డులోని బ్యాంకు పక్కనే సిమెంట్ గోడౌన్ షట్టర్ను పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. తర్వాత గోడౌన్ నుంచి బ్యాంకు గోడకు కన్నం వేసి చొరబడ్డారు. ముందుగా అలారం, సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారు. అనంతరం లాకర్ గదిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో బ్యాంకులోని సీసీటీవీ డీవీఆర్ బాక్సులు, హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారు. డీఎస్పీ రవికుమార్, ఎస్ఐ రామస్వామి, ట్రైనింగ్ ఎస్ఐ ప్రసాద్ ఘటనాస్థలం పరిశీలించారు. క్లూస్టీం ఆధారాలు సేకరించింది. సీసీ ఫుటేజీ ద్వారా ఇద్దరు వ్యక్తులు చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,473 మంది స్వామివారిని దర్శించుకోగా 23,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పేదల ఆస్పత్రిపై
చక్రం తిప్పుతున్న సీఎం సమీప బంధువు ●పేద రోగుల ప్రాణాలకు భరోసా కల్పించాలి.. నాణ్యమైన చికిత్సలందించాలి.. నిపుణులైన వైద్యులతో సేవలందించాలి.. ఇదే లక్ష్యంతో స్విమ్స్ ఆస్పత్రిని టీటీడీ నెలకొల్పింది. ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన వైద్యాలయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలకు వేదికగా మారిపోయింది. అందులో భాగంగానే నైపుణ్యంతో పనిలేకుండా తమ అనుచరులకు కొలువులు ఇప్పించే దిశగా పచ్చగద్దలు పథకం రూపొందించారు. టీటీడీపై ఒత్తిడి తీసుకువచ్చి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేయించారు. ప్రజారోగ్యంతో యథేచ్ఛగా ఆడుకునేందుకు తెగబడ్డారు.సాక్షి టాస్క్ఫోర్స్ : ేపదల వైద్యాలయంగా ప్రసిద్ధి చెందిన స్విమ్స్ ఆస్పత్రి నేడు రాజకీయాలకు వేదికగా మారుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇద్దరు టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదని కొందరు అధికార పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. స్విమ్స్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ, తాజాగా వైద్యుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే అదునుగా టీడీపీ నేతలు తమ అనుచరులకు అవకాశం కల్పించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. తమ వర్గీయులకే పెద్దపీట స్విమ్స్ ఆస్పత్రిలో నియామకాల నుంచి బదిలీలు, ప్రమోషన్ల విషయంలో టీడీపీ నేతలు తమ వర్గీయులకే పెద్ద పీట వేస్తున్నా రు. సదరు ఇద్దరు నేతల ఆదేశాల మేరకు స్విమ్స్లో ప్రతి ఒక్కటీ నడుస్తోందని పలువురు కూటమి నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అనుచరు లను వైద్యులుగా నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేయించారని చెబుతున్నారు. చివరకు బుధవారంనుంచి ఇంటర్వ్యూలు సైతం మొదలుపెట్టించారని స్విమ్స్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆస్పత్రిలో రాజకీయ జోక్యం మంచి పద్ధతి కాదని వాపోతున్నారు. మభ్య పెట్టి మంత్రాంగం స్విమ్స్ ఆస్పత్రిలో అక్రమాలపై కొందరు కూటమి నేతలు సైతం మండిపడుతున్నారు. పేదలకు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన స్విమ్స్ అధికారులు ఇద్దరు టీడీపీ నేతలకు తలొగ్గి అర్హత లేని వైద్యులను, సిబ్బంది నియమిస్తే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నియామకాలకు పక్కా స్కెచ్ వేసిన సదరు టీడీపీ నేతలు మంత్రాంగం నడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని మభ్యపెట్టి తమ అనుచరులకు అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేను డమ్మీని చేసి చక్రం తిప్పినట్లు సమాచారం. నీరుగారిన వైద్య సేవలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో పేదలకు వైద్యసేవలు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చే విరాళాలను సైతం కొందరు టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పచ్చమూక అక్రమాలకు మంగళం పాడి, పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు స్విమ్స్ ఆస్పత్రిపై పెత్తనం వదిలిపెట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ నియామకాలకు విడుదల చేసిన నోటిఫికేషన్ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం పరిణామాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సూచిస్తున్నారు. పునః పరిశీలించాలి స్విమ్స్లో వైద్యుల పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ను టీటీడీ అధికారులు పున:పరిశీలించాలి. కొత్త నియామకాల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అర్హతలు, నైపుణ్యం ప్రామాణికంగా పోస్టులను భర్తీ చేయాలి. వివక్ష, రాజకీయ జోక్య లేకుండా పేద రోగుల సేవే లక్ష్యంగా భావించే వారికే అవకాశం కల్పించాలి. ప్రస్తుత నోటిఫికేషన్లో కొన్ని అనవసరమైన పోస్టులను చేర్చారు. వాస్తవంగా అవసరమైన వాటిని తొలగించారు. దీనిపై విమర్శలు వస్తున్నప్పటికీ ఇంటర్వ్యూలను చేపట్టడం సరికాదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, మళ్లీ కొత్తగా విడుదల చేయాలి. – నవీన్కుమార్రెడ్డి, బీజేపీ నేత, తిరుపతి స్విమ్స్లో తిష్ట వేసేందుకు టీడీపీ నేతల యత్నం సీఎం సమీప బంధువు స్విమ్స్ ఆస్పత్రిని శాసిస్తున్నారు. వైద్యుల నియామకాల్లో ఆయన చక్రం తిప్పుతున్నట్లు స్విమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కొన్ని వైద్యుల పోస్టుల విక్రయాలపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపిక కోసం విభాగాలుగా వేసిన అన్ని కమిటీల్లోనూ సీఎం సమీప బంధువు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
టీటీడీ చొరవ చూపాలి
టీటీడీ విద్యా సంస్థలలో చదువుకోవడం అదృష్టంగా విద్యార్థులు బావిస్తారు. అయితే హాస్టల్ సీట్లు దక్కకపోవడంతో చాలా మంది టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈ విషయంలో టీటీడీ చొరవ చూపాలి. ఇంటర్లో 950 మార్కులు సాధించిన విద్యార్థినికి పద్మావతి కళాశాలలో హాస్టల్ సీటు దక్కకపోవడం విచారకరం. తక్షణం హాస్టల్ సీట్లు పెంచాల్సిన అవసరముంది. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, తిరుపతి ఉద్యమం తప్పదు టీటీడీ విద్యా సంస్థలలో డిగ్రీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతి కల్పించాలి. దూరాభారం నుంచి పేద విద్యార్థులు డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందుతున్నారు. కానీ ఇంటర్లో 95శాతం మార్కులు పొందిన విద్యార్థులకు కేవలం కాలేజ్లో సీటు ఇచ్చి హాస్టల్ వసతి కల్పించకపోవడం దారుణం. టీటీడీ అధికారులు పట్టించుకోకుంటే ఉద్యమం తప్పదు. – రవి, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి విద్యార్థుల జీవితాలతో ఆటలా.. పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో వందలాది మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హాస్టల్ సీట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అలాగే ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. కళాశాలల్లో సీటు పొందిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పించాలి. కానీ టీటీడీ అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. తీరు మారకుంటే పోరుబాట పడతాం. – ప్రేమ్ కుమార్, వైఎస్సార్సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, తిరుపతి దారుణంగా ఉంది టీటీడీ విద్యా సంస్థలలో డిగ్రీ ప్రవేశాలు ఆలస్యంగా చేపట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నా రు. రెండు విడతలుగా అడ్మిషన్లు చేపట్టినా హాస్ట ల్ సీట్లు కేటాయించడంతో ఇటు కళాశాల అధికారు లు, అటు టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు. కళాశాలలో సీటు పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి. ప్రధానం పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థినుల పరిస్థితి దారుణంగా ఉంది. – శివశంకర్ నాయక్, జీఎస్ఎన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి -
కారుపై బాబు బొమ్మ అడ్డుకునేది ఎవరమ్మా!
తిరుపతి జిల్లా: తిరుమలలో సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన ఓ కారు మంగళవారం హల్చల్ చేసింది. తిరుమలకు పార్టీ రంగులు, నాయకుల ఫొటోలతో కూడిన వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే. మంగళవారం ఏపీ 39 ఆర్ఎం 3999 నంబర్గల కారు..వెనుక వైపు సీఎం చంద్రబాబు ఫొటో కనిపించింది. దీంతో పలువురు భక్తులు అధికార పార్టీ నాయకుల బొమ్మలు వాహనాలపై ఉంటే తిరుమలకు అనుమతిస్తారా? అంటూప్రశ్నించారు. ఇప్పటికైనా అలిపిరి చెక్పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీలను క్షుణ్ణంగా నిర్వహించాలని భక్తులు కోరారు. -
న్యాయం గెలిచింది!
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్ని టెర్రరిస్ట్లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది. అణగదొక్కడం సరికాదు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే! తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్కు తరలించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.రెడ్బుక్ రాజ్యాంగం అమలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు. -
ఐజర్కు ఎస్బీఐ భారీ విరాళం
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్)కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.23.60లక్షల విరాళం అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఐజర్లో మౌలిక వసతుల కల్పన ఈ మొత్తం అందజేసింది. ఇందులో అత్యవసర వైద్య సేవల నిమిత్తం రూ.15.38లక్షల విలువైన అంబులెన్స్, క్యాంటీన్ సేవల మెరుగుపరిచేందుకు రూ.8.22లక్షల విలువైన ఆటోమెటిక్ కియోస్క్ వ్యవస్థను వితరణ చేసింది. మంగళవారం ఈ మేరకు ఎస్బీఐ ఉన్నతాధికారులు రాజేష్కుమార్ పటేల్, అమరేంద్రకుమార్ సుమన్, దినేష్ గులాటీ చేతుల మీదుగా ఐజర్ ప్రతినిధులకు అందజేశారు. ‘సంతకాల’తో ప్రజా ఉద్యమం నాగలాపురం : మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం చేపట్టామని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్పష్టం చేశారు. మంగళవారం నాగలాపురంలో కోతి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. రాజేష్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 వైధ్య కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి సర్కారు నిర్ణయం సరికాదన్నారు. గత ప్రభుత్వం 6 కళాశాల నిర్మాణం పూర్తి చేసిందని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. దీనిపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి, సంతకాల సేకరిస్తున్నామని వెల్లడించారు. పేద విధ్యార్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని మండి పడ్డారు. దుర్మార్గపు ఆలోచనలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, నేతలు అపరంజిరాజు, చిన్నదొరై, శ్యామ్, జగదీష్ రెడ్డి, మహేష్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, మోహన్ మొదలియార్, కులశేఖర్ రెడ్డి, వజ్రవేలు, షాబుద్దీన్,ఈశ్వర్, దానివేలు, ఏలుమలై, బాబు, చిరంజీవి, ఉదయ్ కుమార్, హరిబాబు పాల్గొన్నారు. నేటి నుంచి టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం ఆనవాయితీగా టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. మంగళవారం ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద జాబిలి భవనంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ స్మార్ట్ ఐడీ కార్డు చూపించి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ తీసుకోవాలని సూచించింది. పీపీఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుందని వెల్లడించింది. 15, 16 తేదీలలో 164 నుంచి 5,500 పీపీఓ నంబర్ వరకు, 17న 5,501 నుంచి 7,000, 18న 7,001 నుంచి 8,500, 22న 8,501 నుంచి 10,000 వరకు, 23న 10,001 నుంచి 12,500 వరకు, 24వ తేదీన 12,501 నుంచి మిగిలిన వారికి ప్రసాదాలు అందించనున్నట్లు పేర్కొంది. బుద్ధుని విగ్రహావిష్కరణ డక్కిలి : మండలంలోని వెంబులూరు పంచాయతీ అంబేడ్కర్ నగర్లో మంగళవారం గౌతమ బుద్ధుని విగ్రహం ఆవిష్కరించారు. అంబేడ్కర్ ధర్మ పోరాట సమితి అధ్యక్షుడు గండోలు గోపాల్ ఆధ్వర్యంలో బంతేజి దమ్మానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమితి వ్యవస్థాపకుడు ఇంగిలాల రామచంద్రరావు, నేతలు ఎరబోతు సుబ్రమణ్యం, నిజమాల ప్రసాద్, చిట్టేటి రమణయ్య, జంగిటి వెంకటయ్య, నావూరు శంకర్ పాల్గొన్నారు. -
మంచి విధానం కాదు
ఎక్కడో నిర్వహించే సభలకు ఇక్కడి నుంచి బస్సులను పంపించడం మంచి విధానం కాదు. జన సమీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. అంతగా అవసరమైతే ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకోవాలి. అంతే కానీ ఆర్టీసీ సర్వీసులను తీసుకెళితే ప్రయాణికులు ఎంతగా అవస్థలు పడతారో పాలకులు గుర్తించాలి. ఇందులో కూటమి ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. – వేణుగోపాల్, తిరుపతి వ్యతిరేకత తప్పదు ప్రతి దానికీ అనవసరంగా ఆర్టీసీ బస్సులను వాడేస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పకుండా పెరుగుతుంది. ప్రయాణికులను ఈ విధంగా అవస్థలకు గురిచేయడం దారుణం. బస్టాండుల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వచ్చే అరకొర బస్సుల్లో ఎక్కేందుకు యుద్ధమే చేయాల్సి వస్తుంది. జిల్లాలో ఆర్టీసీ తీరు కూడా అధ్వాన్నంగా ఉంది. – జనార్ధన్రెడ్డి, రేణిగుంట -
నిబంధనల మేరకే బాణసంచా విక్రయం
తిరుపతి రూరల్ : నిబంధనల మేరకే బాణసంచా విక్రయాలు సాగించాలని, అనుమతి లేకుండా అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తహసీల్దార్లు, బాణసంచా వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ భారీ శబ్దాలు వచ్చే టపాకాయలపై నిషేధం ఉందని వెల్లడించారు. ఇళ్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు. పన్నులను సక్రమంగా చెల్లించాలని కోరారు. ఈ క్రమంలోనే బాణసంచా దుకాణాలను తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయా షాపుల వద్ద అగ్నిప్రమాద నివారణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో.. తిరుపతి నగరంలో తుడా కార్యాలయం వద్ద ఇందిరామైదానం, ఇస్కాన్ ఆలయం సమీపంలోని మైదానం, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, తారకరామా స్టేడియంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆదేశించారు. -
జాతీయ సెమినార్ బ్రోచర్ విడుదల
తిరుపతి సిటీ: స్థానిక అంబేడ్కర్ గ్లోబల్ న్యాయ కళాశాల వేదికగా డిసెంబర్ 13, 14న నిర్వహించనున్న జాతీయ సదస్సుకు సంబంధించి బ్రోచర్లను కళాశాల చైర్మన్ డాక్టర్ తిప్పారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి ఎంతో మంది లా విద్యార్థులు, పరిశోధకులు ఈ సదస్సుకు హాజరుకానున్నారని, నాలెడ్జ్ షేరింగ్, నూతన అంశాలపై విద్యార్థులకు సదస్సులు మరింత జ్ఞానాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిజయ కుమార్ బెహెరా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఉపాధ్యాక్షులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నెత్తకుప్పంలో రోడ్డుకడ్డంగా గోడ
రామచంద్రాపురం: మండలంలోని నెత్తకుప్పం గ్రామంలో ఓ కూటమి నాయకుడు అధికార అహంకారంతో ఊరిని అక్రమ నిర్బంధంలోకి నెట్టేశాడు. రాజకీయ కక్షలతో గ్రామంలోకి ఓ కుటుంబం రాకపోకలను పూర్తిగా నిలిపివేశాడు. గ్రామ ప్రధాన రోడ్డుకే గోడ కట్టి మూసేశాడు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల కథనం.. స్థానికంగా జరిగిన చిన్న పంచాయితీ వివాదానికి దారితీసింది. దీంతో స్థానిక కూటమి నాయకుడు రెచ్చిపోయాడు. ఓ విలేకరి (సాక్షి కాదు) ఇంటి వద్ద ఏకంగా గోడను నిర్మించాడు. ఆ కుటుంబాన్ని గ్రామంలోకి రానీయకుండా అడ్డుకట్టవేశాడు. రోడ్డుకు అడ్డుగా గోడ కట్టేశాడు. గ్రామస్తులను కూడా నిర్బంధించాడు. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతల రక్షణకు చర్యలు చేపట్టారు. వివాదం పరిష్కారం కోసం రెండు వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. -
పౌష్టికాహారంతో ఆరోగ్యం
తిరుపతి అర్బన్ : పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంతో ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ పోషకాహార మాసోత్సవాలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ప్రజలతోనే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లీబిడ్డలకు పోషకాహారం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు పీఎం పోషణ్ అభియాన్ను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. బాలామృతం. బాలామృతం ప్లస్ కార్యక్రమాలను కచ్చితంగా చేపట్టాలని కోరారు. అనంతరం ఐసీడీఎస్ వారు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ను పరిశీలించారు. బెస్ట్బేబీస్గా ఎంపికై న పిల్లల తల్లులు, ప్రభుత్వ బాలికల వసతి గృహంలోని పిల్లలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డీఈఓ కేవీఎన్ కుమార్, డీఐఓ డాక్టర్ శాంతాకుమారి, టాటా ట్రస్ట్ మేనేజర్ సుబ్రమణ్యం, విజయవాహిని ట్రస్ట్ వీరబాబు, స్కిల్ డెవల్మెంట్ అధికారి లోకనాథం పాల్గొన్నారు. -
తట్టోడు గుంట దర్జాగా కబ్జా
రామచంద్రాపురం: తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న సి.రామాపురం మండలం తట్టోడుగుంట ప్రస్తుతం కూటమి నాయకుల అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారింది. గతంలో రైతుల సాగుకు ఆధారమైన ప్రభుత్వ కుంటభూమి కొంతమంది కూటమి నాయకుల కబ్జాలోకి వెళ్లిపోయింది. తిరుపతికి కూత వేటుదూరంలో సి.రామాపురం ఉంది, పట్టణాభివృద్ధి సంస్థలో భాగమై ఉండడం వలన మండల వ్యాప్తంగా భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కూటమి నాయకుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. సర్వే నంబర్ 34/3లో తట్టోడు కుంట సుమారు ఐదు ఎకరాల్లో ఉంది. ఈ తట్టోడుగుంట గతంలో రామాపురం రైతులకు సాగు తాగునీరు అందించేది. కొంతమంది నాయకుల స్వార్థంతో తట్టోడుగుంటకు వచ్చే కాలువలను పూడ్చి, అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తట్టోడుగుంటలో ముళ్ల పొదలు బలంగా ఉన్నాయి. రహదారికి సమీపంలో గదులు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ భారీ ముళ్లపొదలు అడ్డుగా ఉండడం వల్ల కనిపించడం లేదు. ఇదే అదునుగా భావించిన కూటమి నాయకులు దర్జాగా గదుల నిర్మించేసి, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులకు, ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే ఈ ప్లాట్లను అమాయకులు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
కమిషనర్తో ఎస్పీఏ బృందం
తిరుపతి తుడా: తిరుపతిలో జోనింగ్ నిబంధనలు – శక్తి సామర్థ్య అధ్యయనంపై ఈ నెల 28న స్థానిక కచ్చపి ఆడిటోరియంలో వర్క్షాపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ పథకం కింద పైలట్ ప్రాజెక్ట్ సర్వే వివరాలను విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం (ఎస్పీఏ) కమిషనర్ను కలిసి మంగళవారం వివరించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖా ఆధ్వర్యంలో ‘‘ఎనర్జీ ఎఫిషెన్సీ కన్సిడరేషన్స్ ఇన్ జోనింగ్ రెగ్యులేషన్స్ – ఎ స్టడీ ఆఫ్ తిరుపతి’’ అనే ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా ఎస్పీఏ బృందం ప్రధానంగా భూ సర్వేలు, గణాంకపరమైన విశ్లేషణలు, సాఫ్ట్వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనలను సిద్ధం చేసి కమిషనర్కు వివరించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అడిషనల్ ప్రొఫెసర్ జనమేజయ్, డిప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి పాల్గొన్నారు. -
తుడా వీసీకిఘనంగా వీడ్కోలు
తిరుపతి తుడా:తుడా వీసీ శుభం బన్సల్కు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం ఈ మేరకు తుడా కార్యాలయంలో కార్యదర్శి శ్రీకాంత్, ఇతర అధికారులు పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపికతో సత్కరించారు. తుడా అభివృద్ధికి శుభం బన్సల్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. అధికారులు సుజన, దేవకికుమారి, శైలజ పాల్గొన్నారు. గజదాడులపై ఆందోళన భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ తుమ్మచేనుపల్లెలో ఏనుగుల దాడు లు పెరిగిపోతున్నాయని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పంట పొలాలు, కొబ్బరి చెట్లను ఏనుగుల నాశనం చేస్తున్నాయన్నారు. దీనిపై గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. -
17 నుంచి పవిత్రోత్సవాలు
– అంకురార్పణ రేపు చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 17వ తేది నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలిరోజు సాయంత్రం 6.30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం తిరుప్పావడ సేవ, అక్టోబర్ 17 నుంచి 19 వరకు నిత్య కళ్యాణోత్సవం సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లెలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన శాఖను సోమవారం ఆ బ్యాంకు సీజీఎం రాజేష్కుమార్ పటేల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ స్థానిక ప్రజలకు మెరుగైన, విస్తృత సేవలందించేందుకు నూతన శాఖను ఏర్పాటు చేశామన్నారు. తమ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలందించడం, ప్రాంతీయ ఆర్థిక సమ్మిళత లక్ష్యాలను అధిగమించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ జీఎం అమరేంద్రకుమార్ సుమన్, డీజీఎం దినేష్ గులాటి, ఆర్ఎం ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెల్ఫోన్ లాక్కున్నారని ఆత్మహత్యాయత్నం పాకాల : సెల్ఫోన్ లాక్కున్నారని మనస్తాపంతో ఓ బాలుడు (15) ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం రాత్రి పాకాల భారతంమిట్టలో జరిగింది. ఇన్స్ట్రాలో చాటింగ్ చేస్తుండగా కుటుంబసభ్యులు సెల్ఫోన్ లాక్కోవడంతో బాలుడు వెంటనే గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి బాలుడిని బయటకు తీసుకువచ్చారు. చేయి కోసుకుని అపస్మారకస్థితి చేరుకుని ఉండడంతో 108లో కొత్తకోట సీహెచ్సీకి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో.. అధికారి బరితెగింపు చంద్రగిరి : భక్తుల సేవే..భగవంతుని సేవ అనే సూత్రానికి టీటీడీ అధికారులు నీళ్లొదిలేశారు. భక్తులు ఎదురు మాట్లాడితే దాడులు చేస్తాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమలంఓనే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ అధికారి తీరు దారుణంగా తయారైంది. భక్తులపైనే దాడులకు పాల్పడుతున్నారు. వివరాలు.. అమ్మవారి దర్శనానికి చైన్నెకు చెందిన ఆండాళ్ అనే హిజ్రా తన కుటుంబంతో మంగళవారం వచ్చింది. గర్భాలయంలో పద్మావతీదేవిని ఆండాళ్ దర్శించుకునే సమయంలో అలివేలు అనే జమేదారు దురుసుగా ప్రవర్తించింది. ఆవేశంతో హిజ్రాపై చేయి చేసుకుంది. దీంతో ఇరువురూ దూషణ పర్వానికి దిగడంతో భక్తులు దిగ్భాంత్రి చెందారు. గతంలో అనేక సార్లు అలివేలు ఇదే తరహాలో భక్తులపై దాడి చేసిన ఘటనలు ఉన్నట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు. -
బస్సులు.. తప్పవు పడిగాపులు
తిరుపతి బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు(ఫైల్) తిరుపతి అర్బన్ : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ సభలు నిర్వహించినా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత 5 నెలల వ్యవధిలో 6 సమావేశాలకు మొత్తం 1,170 బస్సులను తిరుపతి నుంచి తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఈక్రమంలోనే గురువారం కర్నూలులో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సైతం జన సమీకరణ నిమిత్తం బుధవారమే జిల్లా నుంచి 325 బస్సులను తీసుకెళుతున్నారు. తిరిగి శుక్రవారం ఆ సర్వీసులు జిల్లాకు రానున్నాయి. దీంతో మూడు రోజుల పాటు ప్రయాణికులకు బస్టాండ్లలో బస్సుల కోసం పడిగాపులు తప్పని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా అన్ని డిపోల్లో మొత్తం 774 బస్సులు ఉన్నాయి. అందులో 70 బస్సులు మరమ్మతుల్లోనే ఉంటున్నాయి. మిగిలిన 700 బస్సుల్లో 325 సర్వీసులను తరలిస్తే కేవలం 375 బస్సులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 50శాతం బస్సులను ఒక్క సభ కోసం పంపిస్తే ప్రజలు ఎంత ఇబ్బందిపడతారో కూడా ప్రభుత్వం గుర్తించడం లేదని పలువురు మండిపడుతున్నారు.జిల్లా నుంచి తరలిన బస్సుల వివరాలు మే 2న : అమరావతి సభకు – 156 మే 18న : యోగా దినోత్సవానికి వైజాగ్కు – 35 మే 29న : టీడీపీ మహానాడుకు – 154 సెప్టెంబర్ 10న : అనంతపురంలో సూపర్ సిక్స్ సభకు – 335 సెప్టెంబర్ 19న: విజయవాడలో డీఎస్సీ ఉపాధ్యాయుల సభకు – 165 అక్టోబర్ 15న : కర్నూలు సభకు 325 -
ఇద్దరు చిన్నారులను రక్షించిన పోలీసులు
పాకాల : ఇద్దరు చిన్నారులను పాకాల పోలీసులు రక్షించారు. వివరాలు.. రైల్వే స్టేషన్లో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని రైల్వే పోలీసులు పాకాల పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు చిన్నారులను పట్టుకుని రక్షించారు. వారు సత్యసాయి జిల్లా, చెన్నెకొత్తపల్లి మండలానికి చెందిన మోహన్రాజ్ కుమారుడు కుమ్మరవరుణ్(12), సురేంద్ర(సూరి) కుమారుడు సి.తరుణ్(11)గా గుర్తించారు. ఈ నెల 11న ఇంటి నుంచి తప్పిపోయినట్టు తల్లిదండ్రులు చెన్నె కోత్తపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాకాల పోలీసులు చెన్నె కొత్తపల్లి పోలీసులకు వివరాలు అందించారు. అనంతరం పాకాల పోలీస్ స్టేషన్కు చేరుకున్న చెన్నేకొత్తపల్లి పోలీసులకు చిన్నారులను అప్పగించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాకాల పోలీసులను అభినందించారు. -
ఇవేం గొడవలు బాబోయ్!
రేణిగుంట: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి, అటెండర్ తిరుమలేష్ మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం సదరు అటెండర్తో డాక్యుమెంట్ రైటర్లు, అటెండర్ ఘర్షణ పడ్డారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జిల్లా డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ నేతలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ తిరుమలేష్తో వాగ్వాదానికి దిగారు. తిరగబడిన క్రయవిక్రయ దారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తిరగబడ్డారు. డాక్యుమెంట్ రైటర్లు, అటెండర్ మధ్య రోజూ గొడవలు జరుగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. పనులు మానుకొని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇలా ఘర్షణ పడటం తగదని మండిపడ్డారు. ఏదైనా ఉంటే బయట చూసుకోండని తెగేసి చెప్పారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ జోక్యం చేసుకుని డాక్యుమెంట్ రైటర్లను వెలుపలకు వెళ్లాలని ఆదేశించారు. రైటర్ల నిరసన జిల్లా డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిరసన తెలిపారు. అటెండర్ తిరుమలేష్పై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందించారు. -
పత్తి గుట్టలో మట్టి దోపిడీ
సాక్షి, టాస్క్ఫోర్స్ : చంద్రగిరి సమీపంలోని పత్తి గుట్ట పచ్చనేతలకు ఆదాయ వనరుగా మారింది. ఏడాదిగా యథేచ్ఛగా మట్టిని తవ్వుకుంటూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ రెవెన్యూ అధికారులు దాడులు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం లెక్కచేయడం లేదు. వారం రోజులుగా రాత్రివేళల్లో అక్రమంగా పత్తిగుట్ట నుంచి వందలాది ట్రిప్పుల గ్రావెల్లో దోచేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. చంద్రగిరి బీసీ హాస్టల్ సమీపంలోని సర్వే నంబరు 1479లో సుమారు 5 ఎకరాలకుపైగా పత్తిగుట్ట ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పచ్చనేతలు ఈ గుట్టను చెరబట్టారు. జేసీబీల సాయంతో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల మట్టిని తరలించేస్తున్నారు. నెల క్రితం వరకు పగటి పూట అక్రమ దందా సాగిస్తున్న క్రమంలో రెవెన్యూ అధికారులు దాడులు చేయడంతో కాస్త తగ్గారు. అయితే వారం రోజులుగా గ్రావెల్ మాఫియా పడగవిప్పినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు సుమారు 10 ట్రాక్టర్లు, రెండు టిప్పర్లతో మట్టి తోలేస్తున్నారు. మంగళవారం రాత్రి ఒకేసారి 10 ట్రాక్టర్లు వరుస క్రమంలో మట్టిని తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టవర్క్లాక్ సర్కిల్ నుంచే 10 ట్రాక్టర్లు ఏకకాలంలో వెళుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ గస్తీ చేస్తున్న పోలీసులు సహకారం అందించడంతోనే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపిస్తున్నారు. -
తిరుమలలో తనిఖీలు
తిరుమల : తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 187 మంది యాచకులు, అనధికార హాకర్లను గుర్తించి తిరుపతికి తరలించారు. అలాగే 73 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించి రికార్డులను పరిశీలించారు. తిరుమలలో పనిచేసే కార్మికులను సంబంధిత యజమానులు పనులు పూర్తి కాగానే తిరుపతికి పంపివేయాలని సూచించారు అనధికార వ్యక్తులను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. పిడుగుపాటుకు 30 మేకలు మృతి ఓజిలి: పిడుగుపాటుకు 30 మేకలు మృతి చెందిన ఘటన ఓజిలి మండలం, భువనగిరిపాళెం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన తురక గురవమ్మ 60 మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు మేత కోసం మేకలు తోలుకుని అడవీ ప్రాంతానికి తరలించాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. గాలి విపరీతంగా వీయడంతో 28 మేకలు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాయి. మిగిలిన మేకలను తోలుకుని శ్రీనివాసులు ఇంటికి చేరుకున్నాడు. గాలీవాన నిలిచే సమయానికి రాత్రి కావడంతో మేకలు ఇంటికి రాలేదు. ఉదయం సమీపంలో బంధువులతో కలిసి వెదికాడు. పిడుగుపాటుకు గురై చెట్టు కిందనే 28 మేకలు మృత్యువాతపడ్డాయి. అలాగే గ్రామానికి చెందిన కొండూరు రవీంద్రరాజు, ముచ్చకాయల చంద్రమోహన్కు చెందిన మేకలు చెరొకటి మృతిచెందాయి. మృతి చెందిన మేకల విలువ సుమారుగా రూ.3.5 లక్షలు వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న వీఆర్ఏ ఘటనా స్థలిని పరిశీలించారు. తహసీల్దార్పద్మావతికి నివేదిక పద్మావతికి నివేదిక అందించారు. రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలు తిరుపతి క్రైమ్: తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ద్విచక్ర వాహనం కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రామకిషోర్ కథనం.. చౌడేపల్లి మండలం, శెట్టిపేటకు చెందిన శరత్బాబు జీవనోపాధి నిమిత్తం కారు డ్రైర్గా కుటుంబంతో కలిసి తిరుపతి క్రాంతినగర్లో నివాసముంటున్నాడు. అతని కుమారుడు కె.రిత్విక్ (9) ఓ ప్రయివేటు స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం 7.40 గంటలకు రిత్విక్ ఇంటి ముందర రోడ్డుపై సైకిల్ తొక్కుతున్నాడు. సదరు స్కూల్ నుంచి జీవకో న రోడ్డు వైపు అతివేగంగా వచ్చిన రాయల్ ఎన్ఫిల్డ్ బైక్ ( AP39 C9049) ఢీకొట్టింది. బాలుడి తలకు, ముఖానికి, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. విచారణలో బైక్ నడిపింది తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన కే.సంతోష్గా గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకిషోర్ తెలిపారు. -
బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోండి
తిరుపతి అర్బన్: బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఽఘం అధ్యక్షులు విజయభాస్కర్, కార్యదర్శి ధన్వంత్కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని కరూర్ వైశ్యాబ్యాంక్ వద్ద ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతూ ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణ చేపట్టాలని పేర్కొన్నారు. క్లరికల్, సబ్స్టాఫ్ ఉద్యోగాల నియామకం, సీఎస్బీ బ్యాంకుల్లో సత్వర వేతన సవరణ, ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగుల పెన్షనర్లకు ఎక్స్గ్రేషియా చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘం కమిటీ సభ్యులు జనార్దన్, యగ్నేష్బాబు, కేశవరెడ్డి, భాస్కర్, రేష్మ, సుమంత్, నిర్మలదేవి, పవన్కుమార్, వెంకటలక్ష్మి, లక్ష్మీపతి, మహేష్, శంకరరావు, నటరాజ్ పాల్గొన్నారు. -
కొత్త టీచర్లకు సర్వీసు రిజిస్టర్లు పంపిణీ
తిరుపతి సిటీ: డీఎస్సీ–2025లో టీచరు పోస్టులు సాధించిన వారు మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ, ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరారు. వారికి యూటీఎఫ్ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు స్వాగతం పలికి సర్వీసు రిజిస్టర్లు, సేవా పుస్తకాలను అందజేసి మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బండి మధుసూదన్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పరంజ్యోతి, నగరపాలక అధ్యక్షులు వై.హేమాద్రి, ప్రధాన కార్యదర్శి ఎస్.ఖాదర్బాషా, కోశాధికారి ప్రభుకుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎన్.మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు వరలక్ష్మి, సుధ, ఢిల్లీ ప్రసా ద్, మహాలక్ష్మి, పెద్ద రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే బొజ్జల చెప్పేవన్నీ అబద్ధాలే: వినుత కోటా
తిరుపతి జిల్లా: తనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా ఖండించారు. ఆ ప్రచారమంతా అబద్ధమేనని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో తాను రూ. 8 కోట్లు డబ్బులు అడిగానంటూ బొజ్జల చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. అదంతా అసత్య ప్రచారమేనన్నారు వినుత కోట. ఎన్నికల ప్రచారంలో తనను ఎన్నోసార్లు అవమానించిన పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానని ఆమె తెలిపారు. ఇదీ చదవండి:మరో ట్విస్ట్.. వినుత కోటా సెల్ఫీ వీడియో -
‘టీడీపీకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు’
చిత్తూరు జిల్లా: ‘నేను తెలుగుదేశం పార్టీకే ఓటువేశా. ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది. ఎవరూ తెలుగుదేశానికి ఓటు వేయకండి. నాశనమైపోతారు. నా.. పోతారు. వద్దు..’ అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పూతలపట్టు మండలం రామాపురానికి చెందిన దినేష్ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది.ఆ తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. తనను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది. కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోతో మరో సెల్పీ వీడియో పెట్టాడు.వివరాలు అతడి మాటల్లోనే.. ‘నా పేరు దినేష్, నా భార్య సుభద్ర, నా కూతురు సహస్ర. టీడీపీ నాయకులు యువరాజులునాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వల్లే మా ప్రాణాలు పోతాయి. వాళ్లు పోలీసు స్టేషన్లో చిత్రహింసలు పెట్టించారు. నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాను. నాకు న్యాయం జరగలేదు. కానీ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా.. ఎవ్వరూ కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దు. నాశనం అయిపోతారు. నా.. పోతారు. వద్దు..’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వరుస వీడియోలు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారాయి. -
టీటీడీకి రూ.1.05 కోట్ల విరాళం
తిరుమల:టీటీడీ ట్రస్టులకు సోమవారం రూ.1.5 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఏడీఓ ఫౌండేషన్ వారు ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించారు. ఈమేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు డీడీని అందజేశారు. బెంగుళూరుకు చెందిన ఎం.రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. డీడీని టీటీడీ చైర్మన్కు అందజేశారు. తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పల గిరిధర్ అనే భక్తుడు సైతం బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు అందించారు. ఈ మేరకు దాత టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు. గుంటూరుకు చెందిన సింహాద్రి వెంకట శివ ప్రసాద్ అనే భక్తుడు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళం అందించారు.తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,424 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,872 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారిరిక 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారికి క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ..!
రేణిగుంట : భూముల రిజిస్ట్రేషన్లతో కళకళలాడే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఒక్కోసారి సిబ్బంది.. మరోసారి డాక్యుమెంట్ రైటర్ల వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూనే ఉంటోంది. ఇదే క్రమంలో సోమవారం సైతం కార్యాలయంలోనే పరసర్పం దాడులు చేసుకునే దుస్థితి దాపురించింది. అటెండర్ తిరుమలేష్, డాక్యుమెంట్ రైటర్ల మధ్య వివాదం ముదిరి ఆఫీస్ రణరంగంగా మారిపోయింది. డాక్యుమెంట్ రైటర్ల పెత్తనం చేయడంపై అటెండర్ ప్రశ్నించడంతో గొడవ పెరిగింది. మమ్మల్ని అడ్డుకునేందుకు నువ్వెవరు అంటూ అటెండర్పై డాక్యుమెంట్ రైటర్లు దాడికి ప్రయత్నించారు. దీంతో సుమారు రెండు గంటలపాటు దూషణ పర్వం కొనసాగింది. ఇదే సమయంలో వివిధ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు నానా అవస్థలు పడ్డారు. డాక్యుమెంట్ రైటర్లదే హవా సబ్ రిజిస్ట్రార్తో సన్నిహితంగా నడిచే కొందరు డాక్యుమెంట్ రైటర్లు ప్రస్తుతం రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హవా సాగిస్తున్నారు. దాదాపు అన్ని రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయంతోనే జరుగుతున్నాయనే విమర్శలు వినపడుతున్నాయి. అందులోనూ ప్రస్తుత వివాదాల కారణంగా రిజిస్ట్రేషన్ త్వరితగతిన కావాలంటే డాక్యుమెంట్ రైటర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సి వస్తోందని క్రయవిక్రయదారులు వాపోతున్నారు. దీంతో అటు ప్రభుత్వం ఇటు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు భారీగా నష్టపోతున్నారు. అటెండర్పై ఫిర్యాదు అటెండర్ తిరుమలేష్పై సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డికి సోమవారం దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికి వచ్చే వారితో తిరుమలేష్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, దూషిస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెండర్ సైతం పలు ఆరోపణలు చేశారు. తన విధులను డాక్యుమెంట్ రైటర్లు, దళారులు అడ్డుకున్నారని చెప్పారు. దాడి చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. క్రయవిక్రయదారుల నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని ప్రశ్నించినందుకు దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 300 మీటర్ల దూరంలో ఉండాల్సిన డాక్యుమెంట్ రైటర్లు నిత్యం నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.తొలి నుంచి అటెండర్, సబ్ రిజిస్ట్రార్ మధ్య గొడవలు అటెండర్ తిరుమలేష్ నాలుగు నెలల క్రితం రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. అప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి జాయినింగ్ లెటర్ తీసుకోకుండా ఇబ్బంది పెట్టాడని అటెండర్ తన కుల సంఘం నేతలను తీసుకురావడంతో వివాదం తలెత్తి పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. ఉన్నతాధికారుల జోక్యంతో తిరుమలేష్ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే వారం క్రితం అటెండర్ తిరుమలేష్ విధులకు ఆలస్యంగా వస్తున్నారని సబ్రిజిస్ట్రార్ హెచ్చరించడంతో మళ్లీ గొడవ మొదలైంది. దీనికితోడు వాటాల పంపకంలో తేడా రావడం కూడా వివాదాలకు కారణంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా?: భూమన అభినయ్
సాక్షి, తిరుపతి: సోషల్ మీడియాలో చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ వైఎస్సార్సీపీ నార్త్ క్లస్టర్ విభాగం అధ్యక్షుడు నవీన్ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్రెడ్డి, ఆ పార్టీ నేతలు అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. భూమన అభినయ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యంపై తప్పులు ఎత్తి చూపిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులతో పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే నవీన్పై కేసు పెట్టారన్నారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుపై అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఒక తీవ్రవాదిని బంధించినట్టు పది మంది పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు భయపడే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని అభినయ్రెడ్డి పేర్కొన్నారు. -
టిప్పర్ ఢీకొని వైఎస్సార్సీపీ నేత మృతి
రామచంద్రాపురం : మండలంలోని సి.రామాపురం వద్ద సోమవారం టిప్పర్ ఢీకొని వైఎస్సార్సీపీ నేత సురేంద్రనాయుడు(63) మృతి చెందారు. వివరాలు.. కొత్తకండ్రిగకు చెందని సురేంద్రనాయుడు కూరగాయల సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంట ఉత్పత్తులను తిరుపతిలోని రైతుబజారులో విక్రయించి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా బండరాళ్ల లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేంద్రనాయుడి కాలు నుజ్జునుజ్జుగా మారింది. క్షతగాత్రుడు తీవ్రమైన రక్తస్రావంతో ఘటనాస్థలంలోనే కొంత సమయంపాటు నరకయాతన అనుభవించాడు. అదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారు ఆయనను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహిత్రెడ్డి పరామర్శ వైఎస్సార్సీపీ నేత సురేంద్ర నాయుడు మృతి విషయం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్ సోమవారం రాత్రి కొత్తకండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. సురేంద్ర నాయుడు భౌతికకాయా నికి నివాళులర్పించారు. కుటుంబీకులను పరామర్శించారు. -
వేర్వేరు చోట్ల బాణసంచా పట్టివేత
సూళ్లూరుపేట/చంద్రగిరి : జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణం, చంద్రగిరి నియోజకవర్గంలోని తనపల్లెలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.7.5లక్షల బాణసంచాను పోలీసులు సోమవారం సీజ్ చేశారు. వివరాలు.. సూళ్లూరుపేట పట్టణంలోని కోటపోలూరు రోడ్డులో ఉన్న గోడౌన్లో లైసెన్స్ లేకుండా నిల్వ చేసిన సుమారు ’ 2.5 లక్షలు విలువ చేసే 85 బాక్సులు బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. అలాగే తిరుచానూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తనపల్లెలో కొల్లు దామోదర్రెడ్డి అనే వ్యక్తి నిల్వ చేసిన రూ.5లక్షల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునీల్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్
తిరుపతి రూరల్ : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా లోతేటి శివశంకర్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయనను రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఐఏఎస్ క్యాడర్కు కేటాయించారు. దీనిపై ఆయన డీఓపీటీను ఆశ్రయించారు. ఎట్టకేలకు ఏపీ కేడర్కు పంపించారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్కు రిపోర్ట్ చేశారు. అనంతరం ఎస్పీడీసీఎల్ సీఎండీగా ప్రభుత్వం నియమించడంతో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కలసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాన శాఖల ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. సంతోష్రావుకు వీడ్కోలు ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన సంతోషరావు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తాం తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్క రైతుకు సోలార్ పవర్ను చేరువ చేస్తామని నూతన సీఎండీ లోతేటి శివశంకర్ తెలిపారు. ఆయన సోమవారం తిరుపతి నగరంలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
వినతుల పరిష్కారానికి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్:ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన వినతుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, అర్జీదారులకు సంతృప్తికరంగా సమాధానం చెప్పాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్జీదారులకు మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, సుధారాణితో కలసి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్ గ్రీవెన్స్కు మొత్తం 290 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కనీస వేతనం కోసం.. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి రూ.18,600 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.10వేలతో సరిపెట్టేస్తున్నారని మండిపడ్డారు. సూపర్వైజర్లకు రూ.21,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.11వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ గ్రీవెన్స్కు 175 అర్జీలు తిరుపతి క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 175 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించినట్లు వెల్లడించారు. దయచూపండి పొలం పనులు చేసే సమయంలో ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతింది. దీంతో రెండు కాళ్లు పనిచేయడం లేదు. మంచానికే పరిమితమయ్యా. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తే వైద్య ఖర్చులు పెట్టుకుంటా. దయచూపండి. ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లకు అనుమతి రాలేదని తిప్పి పంపేస్తున్నారు. – మునస్వామి, దివ్యాంగుడు, చంద్రగిరి -
ప్రజా ఉద్యమానికి దిశానిర్దేశం
చంద్రగిరి : గత ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కల్తీ మద్యంపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని, ఉద్యమానికి ప్రజలను సైతం సిద్ధం చేయాలని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం చంద్రగిరిలోని వైఎస్ఎంఆర్ కల్యాణ మండపంలో ప్రజా ఉద్యమ సన్నాహక సభ నిర్వహించారు. మోహిత్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, అన్యాయాలతో పాటు వైద్య విద్యను పేద ప్రజలకు దూరం చేసిన విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి కనీసం 60వేల సంతకాలను నిర్దేశిత గడువులోపు సేకరించాలని కోరారు. పేదలకు మెరుగైన వైద్యం, నిరుపేదద విద్యార్థులకు వైద్య విద్యను అందించే అవకాశం వున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. జగనన్న పాలనలో బడుగు, బలహీన వర్గాలతో పాటు ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్య అభ్యసించేందుకు వీలుగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. అందులో 5 కళాశాలలను ప్రారంభించి తరగతులు నిర్వహిస్తుండగా మరో 12 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఆయా నిర్మాణ పనులు పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తే పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు లభిస్తాయని చెప్పారు. పేదలకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై చేపట్టిన పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అందుకే కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి పంచాయతీలో 500 నుంచి 600మందిని కలసి మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తే తలెత్తే నష్టాలను వివరించి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. సభకు హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులుషెడ్యూల్ ఇదీ... మెడికల్ కాలేజీల అంశంపై ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేపడుతున్న ప్రజా ఉద్యమానికి పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసిందని మోహిత్రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 10 నుంచి నవంబరు 22 వరకు దశల వారీగా నిరసనలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. నవంబరు 23నజిల్లా కేంద్రాలకు సంతకాల సేకరణ పత్రాలు తరలించాలని వెల్లడించారు. నవంబరు 22న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు కోటి సంతకాల సేకరణ పత్రాలు పంపించాల్సి ఉంటుందని వివరించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఆరు గంటలు దాటితో బయటకు రావద్దు
తిరుపతి సిటీ: నగరంలోని వేదిక్ వర్సిటీ, ఎస్వీయూ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ, అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే వర్సిటీల్లో చిరుత సంచరించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేదిక్ వర్సిటీలోని శైక్షిక (అకాడమిక్)భవనాల వద్ద చిరుత సంచరించిందని వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై విద్యార్థులకు సమాచారం అందించారని తెలిపారు. ఎస్వీయూ, వేదిక్ వర్సిటీలలో అటవీశాఖ సుమారు నాలుగు బోన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటలు దాటితే బయటకు రాకూడదని నిషేధాజ్ఞలు విధించారు. -
శభాష్ పోలీసు.. !
చంద్రగిరి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని అతన్ని కాపాడి శభాష్ అనిపించున్నారు. తిరుపతికి చెందిన మురళీనాయక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. శ్రీనివాసమంగాపురం సమీపంలో రైల్వే ట్రాక్పైకి చేరుకున్నాడు. డయల్ 100కు ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపారు. అప్రమత్తమైన కమాండ్ కంట్రోల్ అధికారులు చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూకోట్స్లో విధుల్లో వున్న కానిస్టేబుల్ చిరంజీవి, కిరణ్, శ్రీను ఫోన్ నంబరు ఆధారంగా మురళీ నాయక్ వద్దకు చేరుకున్నారు. అతనికి నచ్చజెప్పి క్షేమంగా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం ఇంటికి పంపించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. -
మనమూ ‘స్పేస్’ తీసుకుందాం
● అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఎయిర్ కమాండర్ రాజేష్ సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ స్పేస్లో బలీయమైన శక్తిగా ఎదగాలంటే యువ శాస్త్రవేత్తలు తయారు కావాల్సిన అవసరం ఉందని ఇనిస్టిట్యూట్ ఆప్ ఏరోస్పేస్ మెడిసిన్ అండ్ కమాండర్ రాజేష్కుమార్ విద్యార్థులకు సూచించారు. షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన బ్రహ్మప్రకాష్ హాలులో సోమవారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఎండ్ కమాండర్ రాజేష్కుమార్ ముఖ్య అథితిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ యువతరం సాఫ్ట్వేర్వైపు చూస్తున్నారని, ఇస్రోలో చేరితే ఉద్యోగంతో పాటు దేశానికి సేవలు అందించే అవకాశం దక్కుతుందని వివరించారు. భారత అంతరిక్ష కార్యక్రమాలకు డాక్టర్ హోమీజే బాబా బీజం వేస్తే డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్, ఏపీజే అబ్దుల్కలాం, డాక్టర్ కస్తూరి రంగరాజన్ లాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమాలను ప్రపంచం అబ్బురపడేలా ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. సుమారు మూడు రాష్ట్రాల్లోని తొమ్మిదో ప్రాంతాల్లో అంతరిక్ష కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం శుభపరిణామమని కొనియాడారు. అనంతరం ఈఎస్ పద్మకుమార్ మాట్లాడుతూ 1999 నుంచి అంతరిక్ష వారోత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఏటా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గగన్యాన్–1 ప్రాజెక్ట్, చంద్రయాన్–4, వీనస్ (శుక్రయాన్) వంటి ప్రయోగాలతో అంతరిక్షంలో సత్తాచాటుతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతితోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో షార్ కంట్రోలర్ రమేష్ కుమార్, అసోసియేట్ డైరెక్టర్ ముత్తు చైళియన్, ఎంఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు చేయూత
తిరుపతి క్రైం: విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ సుబ్బరాయుడు బాసటగా నిలిచారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విదులు నిర్వహిస్తూ గత నెల 12న అనారోగ్యంతో మరణించిన టీఎల్. వెంకటరత్నం సతీమణి టీ.ఉషాదేవికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వాహణలో సేవలందించి ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీస్ శాఖ ఎప్పటికీ మరిచిపోదన్నారు. వీరి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంలో సంబంధిత శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందిని చెప్పారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వర పాల్గొన్నారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి స్పష్టం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మ్యాంగో మార్కెట్ యార్డు సమీపంలోని గరుడ వారధి వద్ద ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహన దారులకు ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు ఓ పుష్పాన్ని అందించారు. హెల్మెట్– ప్రాణ రక్షక కవచం అంటూ నినాదాలు చేశారు. గరుడ వారధిపై గరిష్ట వేగ పరిమితి 30 కి.మీ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు సంజీవ్కుమార్, సుబ్బరామిరెడ్డి, ఎస్ఐలు బాలాజీ, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మహిళా క్రికెట్ జట్టులో ఐదుగురికి చోటు
తిరుపతి ఎడ్యుకేషన్:ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇటీవల ప్రకటించిన ఆంధ్రా ఉమెన్స్ అండర్–19 క్రికెట్ జట్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు చోటు సాధించినట్లు ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్కుమార్ తెలిపారు. వీరిలో గిరిష్మా సైనిరెడ్డి (వైస్ కెప్టెన్), ఎ.విష్ణుప్రియ, ఎం.పర్ణిత యాదవ్, కె.శుభశ్రీ, ఎం.రుక్సార్ తబ్సమ్ వున్నారని తెలిపారు. వీరు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు బీసీసీఐ అండర్–19 ఉమెన్స్ టీ–20 చాంపియన్షిప్లో పాల్గొననున్నట్లు తెలిపా రు. ఎంపికై న మహిళా క్రికెటర్లు బాగా రాణించి రంజి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి భ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అవునా బొజ్జలా?
రాజకీయాల్లో కొందరు నేతలు నైతిక విలువలను వదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు వదిలేసి జిత్తులకు దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం దిగజారుతున్నారు. ఇదే కోవలో జనసేన మాజీ నేత కోట వినూతపై ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పలు కుట్రలకు తెగబడినట్లు సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ వీడియో వైరల్గా మారింది. వినూత డ్రైవర్గా పనిచేసి హత్యకు గురైన రాయుడు తీసుకున్నట్టుగా చెబుతున్న సెల్ఫీ వీడియో జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కోట దంపతులను టార్గెట్ చేసుకుని బొజ్జల తనకు డబ్బులు ఎరవేసినట్లు డ్రైవర్ స్పష్టంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల నడుమ పోరులో చివరకు సదరు దళితుడు బలి కావడం విషాదంగా మిగిలింది. సాక్షి టాస్్కఫోర్స్ : జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోట వినూత వద్ద డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన ఓ సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డిపై పలు ఆరోపణలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినూత రహస్య సమాచారం, కొన్ని వీడియోలు సేకరించి అధిష్టానానికి చేరవేసి సు«దీర్రెడ్డి టికెట్ సాధించినట్లు శ్రీకాళహస్తి వాసులు చర్చించుకుంటున్నారు. బొజ్జల సు«దీర్రెడ్డి కారణంగా కూటమిలోని అనేక మంది నేతలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు టికెట్లు దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు వెన్నుపోట్లు పొడుచుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శ్రీకాళహస్తి టికెట్ కోసం ఏకంగా హత్యా రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా గుప్పుమంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ కోసం కూటమి పారీ్టలోని బొజ్జల సు«దీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కుమారుడు, బీజేపీ నేత కోలా ఆనంద్, జనసేన నేత కోట వినూత పోటీ పడిన విషయం విధితమే. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు.. ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ముఖంగా వీధికెక్కారు. నాడు టీడీపీ, జనసేన నేతల మధ్యే పోటీసార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పారీ్టల సీట్ల కేటాయింపుకు సంబంధించి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ లేదా జనసేనలో ఒకరికి ఇస్తారని ముందుగానే తేలిపోయింది. దీంతో కోట వినూతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రైవర్ని కోవర్టుగా బొజ్జల సుధీర్రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు రాయుడి వీడియో ద్వారా బయటపడింది. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేందుకు కూటమి నేతలు కోవర్టులను నియమించుకున్నారు. అందులో భాగంగా కోట వినూత విషయంలో బొజ్జల చాలా దూరంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రైవర్ రాయుడుకి రూ.60 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వీడియో ద్వారా వెలుగు చూసింది. అలాగే అనేక మందిని పావుగా వాడుకున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. చివరకు కోట వినూత దంపతులను యాక్సిడెంట్ ద్వారా హత్య చేసేందుకు సైతం రెండు పర్యాయాలు యతి్నంచినట్లు రాయుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. రాజకీయ పోరులో దళితుడైన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురవడం అప్పట్లో సంచలనంగా మారింది. రాయుడు హత్యకు దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు నిజమేనా? డ్రైవర్ రాయడు హత్య తర్వాత అరెస్ట్ అయిన కోట వినూత దంపతులు మీడియా సాక్షిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పేరును ప్రస్తావించారు. రాయుడి హత్య వెను ఎవరి పాత్ర ఉందని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి పేరును వెల్లడించడం నాడు కలకలం రేపింది. అన్ని విషయాలను త్వరలోనే బయటపెడతామని చెప్పినట్టే.. నేడు రాయుడి వీడియో వైరల్ కావటం పెద్ద దుమారమే రేపుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవిని కొట్టే సాయికి కట్టబెట్టడం వెనుక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి హస్తం ఉందని కోట వినూత లేఖ ద్వారా ఆరోపించింది. బొజ్జల సుదీర్రెడ్డికి టికెట్ కేటాయించడం వెనుక జనసేనలోని మరో నాయకుడు కొట్టేసాయి ఉన్నారని రాయుడు వీడియో ద్వారా తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తిలో పలువురు ప్రధాన భూమిక పోషించారని డ్రైవర్ వీడియో ద్వారా వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వస్తాయోనని కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో అదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. అదివారం అర్ధరాత్రి వరకు 84,424 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,872 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 5లో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకె న్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
ఆదాయముంటే చాలు!
తిరుపతి అర్బన్: చెప్పేదొకటి చేసేది మరొకటి అన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం. 13 రకాల ఆర్టీసీ సర్వీసులు ఉన్నప్పటికీ సీ్త్రశక్తి పథకానికి జిల్లాలో పల్లెవెలుగు సర్వీసులను మాత్రమే వినియోగిస్తున్నారు. అరకొర ఎక్స్ప్రెస్లను అక్కడక్కడా తిప్పుతున్నారు. అయితే రద్దీగా ఉండే సమయంలో తిరుపతి బస్టాండ్లో పల్లెవెలుగు సర్వీసులు లేకుండా ఆల్ట్రాడీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్లను ప్లాట్ఫాంలపై పెట్టేస్తున్నారు. పల్లెవెలుగు సర్వీసులు రావడానికి గంటకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు పల్లెవెలుగు సర్వీసులు లేవంటూ మరికొందరు డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చేసేది లేక మహిళలు కూడా ఆల్ట్రాడీలక్స్లు, సప్తగిరి ఎక్స్ప్రెస్ల్లో టిక్కెట్ కొనుగోలు చేసి జర్నీ చేయాల్సి వస్తోంది. ఇది మరీ మోసం తిరుపతి నుంచి కాణిపాకంకు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు తిరుపతి నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సప్తగిరి, ఆల్ట్రాడీలక్స్లు మాత్రమే తిరుపతి బస్టాండ్లోని కాణిపాకం ప్లాట్ఫాంపై ఉంచుతున్నారు. అలాగే సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు ప్రయాణికుల రద్దీ కాణిపాకానికి ఎక్కువ. ఆ సమయంలోనూ అదే పరిస్థితి. మిగిలినప్పుడు గంటకో రెండు గంటలకో ఓ పల్లెవెలుగు సర్వీసు అటొచ్చి ఇటు తళుక్కుమని వెళ్తుంది. మహిళలు సైతం టిక్కెట్లు చెల్లించి సప్తగిరి బస్సుల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఒక్క కాణిపాకం మార్గంలోనే కాదు.. రద్దీగా ఉండే శ్రీకాళహస్తి, ఇతర మార్గాల్లోనూ అద్దే పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులు ప్రయాణం చేయాల్సిన మార్గాల్లో ఇలాంటి పద్ధతులను అధికంగా ప్రయోగిస్తున్నారు. -
ఎస్వీయూలో మందుబాబులు పడ్డారు!
తిరుపతి సిటీ :ఎస్వీయూ ప్రాంగణంలో నిత్యం మందుబాబులు హల్ చల్ చేస్తున్నారు. గతంలో పలు మార్లు వర్సిటీ అధికారుల దృష్టికి విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు తీసుకెళ్లిన పట్టించుకోలేదు. దీనిపై క్షేత్రస్థాయి లో సాక్షి పర్యటించి సాక్ష్యాధారాలతో ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే వర్సిటీని జల్లెడపట్టి సుమారు రెండు ట్రాక్టర్ల ఖాళీ మద్యం సీసాలు రావడంతో నివ్వెరపోయారు. పాత కథ పునరావృతం ఎస్వీయూలో మళ్లీ మందుబాబులు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో ప్రతి చెట్టు కిందా మద్యం తాగే వారే కనిపిస్తున్నారు. మహిళా హాస్టళ్లకు సమీపంలో కూడా మద్యం తాగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాగే ఎస్వీయూ ప్రకాశం భవనంలో ఎదుట ఓపెన్ ఆడిటోరియంలోకి సైతం ఇష్టారాజ్యంగా ప్రవేశించి మద్యం సేవిస్తున్నారు. ఆడిటోరియంలో ప్రాంతంలో వందలాది ఖాళీ మద్యం సీసాలు పడిఉండడం గమనార్హం. అన్నపూర్ణ క్యాంటిన్ సమీపంలో కూడా మందు బాబుల హల్ చల్ చేస్తున్నప్పటికీ వర్సిటీ సెక్యూరీటీ, పోలీసులు పట్టించుకోవడం లేదదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు వర్సిటీ ప్రాంగణంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని కోరుతున్నారు. -
దామినేడులో కార్డెన్ సెర్చ్
చంద్రగిరి : తిరుచానూరు సమీపంలోని దామినేడులో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ప్రధానంగా స్థానిక ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ సునీల్ కుమార్, నలుగురు ఎస్ఐలు, 9 మంది ట్రైనీ ఎస్ఐలు, సుమారు 60 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి అందులో నివసించేవారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. అద్దె గదులలో ఉన్న వారి వివరాలను సైతం సేకరించారు. వరుస చోరీల నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్ ఇటీవల తిరుపతి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్న క్రమంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వేకువజామున 4.30 నుంచి ఉదయం 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని వెల్లడించారు.. ఈ ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే చోరీ కేసులో పరారీలో ఉన్న జోసెఫ్ అనే నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. కొత్త వ్యక్తులు కదలికలపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. -
కోడి పందాల స్థావరంపై దాడి
వాకాడు: మండలంలోని కొండాపురంలో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఎస్ఐ నాగబాబు తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు పందెం రాయళ్లతోపాటు మూడు కోడి పుంజులు, వారి వద్ద ఉన్న రూ.1,200 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి సోమవారం కోర్డులో హాజరుపరచనున్నట్టు ఆయన వెల్లడించారు. నేడు పాఠశాలలకు కొత్త గురువులు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1394 మంది నూతన టీచర్లు సోమవారం నుంచి కేటాయించిన బడుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదట్లో ఉద్యోగంలో చేరేటప్పుడు ఉండే ఉత్తేజం రిటైర్ అయ్యే వరకు కొనసాగించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నూతన అయ్యోర్లకు సూచించారు. నేత్రదానం నాయుడుపేటటౌన్: పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో నివసిస్తున్న కావేరి పాకం పురుషోత్తం(46) బ్రెయిన్ స్ట్రోక్తో ఆదివారం కన్నుమూశారు. మృతుడి నేత్రాలను ఆయన భార్య సుమలత దానం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల వారు నాయుడుపేటకు వచ్చి నేత్రాలను సేకరించుకుని వెళ్లారు. ఈ సందర్భంగా పురుషోత్తం కుటుంబీకులను పలువురు ప్రశంసించారు. 25న జీశాట్–7ఆర్ ప్రయోగం సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈనెల 25వ తేదీన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 16న ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక పరమైన కారణాలతో వాయిదా పడింది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే వాణిజ్య ఉపగ్రహం సైతం ప్రయోగించాల్సి ఉంది. ఆ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతోనే జీశాట్–7ఆర్ ప్రయోగం వాయిదాపడినట్లు సమాచారం. 2013 ఆగస్టు 30న ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని తొలుత ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో రీప్లేస్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. షార్ కేంద్రంలోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో ఎల్వీఎం3–ఎం5 రాకెట్ అనుసంధానం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. -
ఇంజినీర్లపై కేసులు దారుణం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : రాష్ట్రాభివృద్ధి కోసం సైనికుల్లా పనిచేసిన పంచాయతీ ఇంజినీర్లపై కేసులు నమోదు చేయడం దారుణమని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ (ఏపీ పీఆర్ఏఈ) అధ్యక్షుడు కె.సంగీతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్లో ఏపీ పీఆర్ఏఈ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఇంజినీర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 619 సెక్షన్ ఆఫీసర్ల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. 3 వేల కోట్లు విలువైన ఉపాధి పనులు పూర్తి చేసినందుకు పంచాయతీ ఇంజినీరింగ్శాఖ అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద మూడుశాతం నగదు విడుదల చేయాలని కోరారు. డివిజనల్ డెవలప్మెట్ ఆఫీసర్స్ పోస్టులలో 30 శాతం పీఆర్ ఇంజినీర్లకు కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి పీఆర్ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. లేకుంటే డిసెంబర్ నుంచి దశలవారీగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సంఘం గౌరవాధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం జేఈలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పనిభారం తగ్గించేందుకు వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. పీఆర్ ఇంజినీర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారే కానీ, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. దీంతో అర్హులకు అవకాశాలు దక్కక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి బీడీ శ్రీనివాసరావు, జిల్లా జనరల్ సెక్రటరీ డి.చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ మహేష్, జనరల్ సెక్రటరీ అజయ్, యం.శంకరయ్య, టి.లీలాకృష్ణ, యం. లక్ష్మీపతి రెడ్డి, మధుసూదన్రావు పాల్గొన్నారు. -
కల్తీ మద్యంపై నిరసనలు
పుంగనూరు : కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం మాఫియా, వేల కోట్ల రూపాయలను చట్ట వ్యతిరేకంగా దోచుకోవడంపై సోమవారం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఆదివారం తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు , వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, వల్లివేడు పృధ్వీధర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీంబాషాలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం వ్యాపారంతో వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం నాయకుల వ్యాపారాల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేయాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పుంగనూరు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, నాయకులు గౌస్, అఖిల్, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తి: కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలా తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మదుసూదన్రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులకు సోమవారం వినతిపత్రం ఇవ్వనున్నట్లు వైఎస్ఆర్ సీపీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, నేతలు, మహిళలు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొనాలని కోరారు. -
రైల్వే డివిజన్ మన హక్కు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుకోవడం మనందరి హక్కు దీని కోసం ఉద్యమిద్దాం అంటూ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో బాలాజీ రైల్వే డివిజన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1990లో వచ్చిందన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాయ అసమానతలు తలెత్తకుండా రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. 35 ఏళ్ల కలను సాకారం చేసుకునే దిశగా పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు మాట్లాడుతూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రానికి పెద్దసంఖ్యలో తరలివచ్చే ప్రయాణికులకు రైల్వే డివిజన్ ఏర్పాటుతో వసతులు కల్పించవచ్చని తెలిపారు. మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైల్వే అనుసంధాన వ్యవస్థ, వాణిజ్యం, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు డివిజన్ దోహదం చేస్తుందన్నారు. డిప్యూటీ మేయర్ మునికృష్ణ మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ కోసం ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని వెల్లడించారు. నవీన్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే తిరుపతికి రైల్వే డివిజన్ పొందే అర్హతలు ఉన్నాయని వివరించారు. రాజకీయ ఒత్తిడితోనే బాలాజీ డివిజన్ ఆశలను తుంగలో తొక్కి గుంటూరు డివిజన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ మాజీ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, పీసీ రాయల్, బీమ్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్, చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ చౌదరి, న్యాయవాది దినకర్, నేతలు మహీధర రెడ్డి, శ్రీధర్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, కుప్పాల నీలిష్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న కుప్పాల గిరిధర్ కుమార్ -
300 ఎకరాలు హాంఫట్!
కంచే చేను మేసినట్టు సత్యవేడు మండలంలోని రెవెన్యూ అధికారులు వ్యవహరించారు. కాసులకు కక్కుర్తి పడి సుమారు 300 ఎకరాల అటవీ భూములను కబ్జాకోరులకు అప్పనంగా అప్పగించేశారు. తమిళనాడుకు చెందిన ఆరుగురి పేరిట వెబ్ల్యాండ్లోకి సైతం ఎక్కించేశారు. ఇందుకోసం కొత్తగా సర్వే నంబర్లను సృష్టించేశారు. ఇష్టారాజ్యంగా సబ్ డివిజన్లు నమోదు చేసి అక్రమార్కులకు హక్కులు కల్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద మొత్తంలో నగదు చేతులుమారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయా భూములను రీసర్వే చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని స్పష్టం చేస్తున్నారు. సత్యవేడు : సత్యవేడు మండలంలోని వానెల్లూరు గ్రామంలో సుమారు 3 వందల ఎకరాల అటవీ భూమిని తమిళనాడు చెందిన ఆరుగురు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు కట్టబెట్టేశారు. వెబ్ల్యాండ్లో సైతం అక్రమార్కుల పేర్లను నమోదు చేయడంపై పోలీసులకు తహసీల్దార్ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. వివరాలు.. గ్రామ సమీపంలోని 300 ఎకరాలు 2024 వరకు అటవీ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో ఉండేది. ఇందులో ఫారెస్ట్ అధికారులు జీడిమామిడి, నీలగిరి చెట్ల పెంపకం సైతం చేపట్టారు. నూతనంగా సబ్ డివిజన్లు వానెల్లూరులోని సర్వే నెంబరు 197/1లో 252 ఎకరాలు , 200/1లో 49–88 ఎకరాలు అటవీ భూమిగా ఉంది. దీనిపై చైన్నె వాసులు కొందరు కన్నేశారు. 2024 జూన్లో రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క రికార్డులను తారుమారు చేశారు. సర్వే నెంబరు 197/1లో శ్రీధరన్ పేరుతో 50.34 ఎకరాలు, 197/బీలో అమృతవర్షిణి పేరుతో 50.34 ఎకరాలు, 197/1సీలో నవీన్ రాజ్కన్న పేరుతో 50.34 ఎకరాలు, 197/డీలో అనూరాధ జైకుమార్ పేరుతో 50.34 ఎకరాలు, 197/ఈలో అతా జైకుమార్ పేరుతో 50.34 ఎకరాలు, 197/1ఎఫ్లో ఆశసురేష్ పేరుతో 34 సెంట్లను రెవెన్యూ అధికారులు ఆన్లైన్లోకి ఎక్కించేశారు. ఈ మేరకు వెబ్ల్యాండ్లో నమోదు చేసేశారు. ఇందుకోసం 197/1 సర్వే నంబరును తమిళనాడు వాసుల కోసం సబ్ డివిజన్లుగా మార్చేశారు. ఈ మేరకు అప్పట్లో తహసీల్దార్గా పనిచేసిన రామాంజులునాయుడు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులతో చేతులు కలిపి భూ ఆక్రమణకు సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు వానెల్లూరు అటవీ భూమిని నాలుగు సబ్ డివిజన్లు విభజించి తమిళనాడుకు చెందిన ఆరుగురి పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ రాజశేఖర్ తెలిపారు. వివాదాస్పద భూములపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామని, వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ మేరకు సత్యవేడు సీఐ మురళీనాయుడు కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆక్రమిత భూమిలో నీలగిరి చెట్లు ఆ భూములు మావే.. అటవీ భూముల విషయమై ఆక్రమణదారులకు సంబంధించి వారు వివరణ ఇచ్చారు. సర్వే నెంబరు 197/1లోని 300 ఎకరాల భూమిని ముత్తు కుమారస్వామి అయ్యర్ అనే వ్యక్తి చాలా ఏళ్ల క్రితం టీటీడీ నుంచి పొందారని చెప్పారు. అయన వారసుల నుంచి తాము కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఫారెస్టు రేంజర్ త్రినాథ్రెడ్డి దీనిపై స్పందిస్తూ.. అటవీ శాఖ చట్టం ప్రకారం 1972లో ఈ భూమి రక్షిత అటవీ భూమిగా గెజిట్ అయినట్లు వివరించారు. ఇటీవల రెవెన్యూ, అటవీశాఖ చేపట్టిన జాయింట్ సర్వేలో సైతం ఇది ఫారెస్ట్ ల్యాండ్గానే నమోదైనట్లు తెలిపారు. రీసర్వే చేయాలి వానెల్లూరు సమీపంలోని ఈ భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. చైన్నె వాసులు కట్టుకథలు అల్లుతున్నారని, విలువైన భూములను కాజేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయా భూములను రీసర్వే చేస్తే నిజాలు బయటపడతాయని వెల్లడిస్తున్నారు. -
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సమస్యలను అర్జీల రూపంలో అందించి పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసంపై అవగాహన తిరుపతి సిటీ : శ్రీచైతన్య విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఝాన్సీలక్ష్మీ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై అధ్యాపకులు, టెక్నో స్కూల్ టీచర్లు, బోధనేతర సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆదివారం ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారికి క్రమశిక్షణ అవసరమని వెల్లడించారు. శ్రీచైతన్య చిన్న సంస్థగా మొదలైందని, నేడు ఆసియాలోని అతిపెద్ద విద్యాసంస్థగా ఎదిగిందని వివరించారు. నేను అనే భావనతో కాకుండా, మేము అని పనిచేస్తే ప్రగతి పథంలో పయనించవచ్చని తెలిపారు. శ్రీచైతన్యలోని ప్రతి విద్యార్థి కలను సాకారం చేసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కాలేజీల ఏజీఎం బీవీ ప్రసాద్, పాఠశాలల ఏజీఎం సురేష్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,571 మంది స్వామివారిని దర్శించుకోగా 36, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేటి నుంచి రెండో విడత అడ్మిషన్లుతిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ విద్యాసంస్థలలో రెండో విడత అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఓఏమ్డీసీ నుంచి విద్యార్థుల మొబల్ ఫోన్లకు సమాచారం అందించారు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు రెండు రోజులోపు ఆయా కళాశాలలో తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం మరో రెండు రోజుల తర్వాత ఆయా కళాశాలలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. -
వరసిద్ధుని సేవలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి దర్శించుకున్నారు. ఆమెతో పాటు సినీ నటుడు నార్నె నితిన్, వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగ తం పలికి దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. ఒకే ఊరిలో 8మంది డీఎస్సీకి ఎంపిక చంద్రగిరి: మండలంలోని పనపాకం పంచాయతీ అరిగెలవారిపల్లెలో 2025 డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 8మందిని రిటైర్డ్ హెచ్ఎం అరిగిల రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఎంపికై న వారిలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్గా బి.లిషా నందిని, స్కూల్ అసిస్టెంట్గా దళవాయి సూర్య లోకనాధం, పీఈటీగా బొజ్జా సుమలత, ఎస్జీటీలుగా కె.దిలీప్ కుమార్, దళవాయి సురేంద్ర, ఆవుల కళ్యాణి, అరిగెల భానుప్రకాష్, డి.మహేష్ ఉన్నారు. ఒకే గ్రామంలో 8 మంది డీఎస్సీలో ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని పలువురు వారిని అభినందించారు. నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ ఇదే స్ఫూర్తితో మరెందరో విద్యార్థుల భవితకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆవుల క్రిష్ణయ్య(గార్డు), గేనే సుబ్బయ్య, జూ పార్క్ మాజీ డైరెక్టర్ మణి యాదవ్, అరిగిల కృష్ణ, భీమరాజు, స్థానిక ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని కార్మికుడు మృతి
సూళ్లూరుపేట: మండలంలోని బైపాస్రోడ్డు ఎన్హెచ్–16 డంపింగ్యార్డు వద్ద శనివారం రాత్రి టిప్పర్ ఢీకొని అపాచి కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వరదయ్యపాళెం రాచర్ల గ్రామానికి చెందిన కంరారపు ప్రసన్నకుమార్ (36) పాచిలో పని చేస్తూ తడ మండలం కాదలూరులో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి సూళ్లూరుపేటకు వచ్చి పనులన్నింటినీ చూసుకుని తిరిగి కాదలూరుకు మోటార్సైకిల్పై వెళుతుండగా హఠాత్తుగా టిప్పర్ దూసుకొచ్చి ఢీ కొంది. అతన్ని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు వారికి సమాచారం అందించి కేసు నమోదు చేశారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీగంధం చెట్లు నరికివేత: వ్యక్తి అరెస్టు తిరుమల : శేషాచలం అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లు నరికివేసిన వ్యక్తిని ఆటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బంది దాడిచేసి పట్టుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తిరుమల–పాపవినాశనం రోడ్డులోని జపాలీ తీర్థానికి సమీపంలో ఓ వ్యక్తి శ్రీగంధం చెట్టును నరికివేసి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అటవీశాఖ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడు శ్రీగంధం చెట్టు వేరు భాగాలు రంపాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని తిరుపతికి తరలించి అటవీశాఖ అధికారులు విచారిస్తున్నారు. అక్రమ వెంచర్కు నోటీసు తొట్టంబేడు: తొట్టంబేడు రెవెన్యూ పరిధిలోని బీడీ కాలనీ వద్ద సర్వే నంబర్ 269/4లో వేసిన అక్రమ వెంచర్ను వెంటనే తొలగించాలని పంచాయతీ సెక్రటరీ భార్గవ్ ఆదివారం నోటీసు జారీ చేశారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో సుచిత్ర గార్డెన్న్ పేరుతో వేసిన లేఅవుట్కు అనుమతులు లేవని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి సందిగ్ధంలో పడింది. -
పరిహారం ఎగ్గొట్టి.. పొలం గట్లు తెగ్గొట్టి!
●వరదయ్యపాళెం : దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఏపీఐఐసీ అధికారులు వేధిస్తున్నారు. భూసేకరణ కింద తీసుకున్న భూములకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పొలాలు సాగుకు పనికిరాకుండా గట్లు తెగ్గొట్టేశారు. వివరాలు.. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు రైవెన్యూలోని సర్వే నెంబర్ 83/2లో 1.48 ఎకరాలు డి.శకుంతలమ్మ పేరిట, 83/3లో 1.73 ఎకరాలు డి. రత్నం పేరిట 45ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం డీకేటీ పట్టాలను అందజేసింది. అప్పటి నుంచి ఆ భూముల్లో వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. 2016లో చిన్న పాండూరు సమీపంలో ఏపీఐఐసీ సెజ్ రావడంతో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఎకరాకు రూ. 6.5లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అయితే వారికి బీ కేటగిరీలో ఎకరాకు రూ. 3.25లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన పరిహారం కోసం గత 9ఏళ్లుగా ఈ ఇద్దరు రైతులు అటు కలెక్టర్, ఆర్డీఓతోపాటు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ పరిహారం మాత్రం అందలేదు. అయితే గత ఏడాది వరకు భూమిని వారే సాగు చేసుకుంటూ ఉండేవారు. బెదిరించి.. తొలగించి అయితే రెండు రోజుల క్రితం రైతులు డి. రత్నయ్య, శకుంతలమ్మకు చెందిన భూముల్లోకి ఏపీఐఐసీ సిబ్బంది ప్రవేశించారు. హిటాచీతో పొలంగట్లను పూర్తిగా తొలగించి భూముల రూపురేఖలను మార్చేశారు. సాగు చేసుకునేందుకు వీలు లేకుండా పొలం ఆనవాళ్లను చెరిపేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. న్యాయం చేయండి సుమారు 45 ఏళ్ల నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గత ఏడాది కూడా సాగు చేశాం. అయితే బుధవారం సాయంత్రం ఏపీఐఐసీ అధికారులు మా పొలం గట్లు తొలగించేశారు. వరినాట్లకు సిద్ధం చేసుకున్న భూమిని నాశనం చేసేశారు. పైగా మాపైనే కేసులు పెడతామని బెదిరించారు. అప్పట్లో ఆ భూమిని రూ.లక్షలు వెచ్చించి సాగుకు సన్నద్ధం చేసుకున్నాం. భూమినే నమ్ముకున్న మమ్మల్ని ఇలా ఇబ్బందిపెట్టడం దారుణం. పూర్తిస్థాయి పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. – రత్నయ్య, బాధిత రైతు, చిన్న పాండూరు -
కల్వర్టు కింద ఖరీదైన మాత్రలు
తిరుపతి రూరల్: ప్రభుత్వాస్పత్రుల్లో ఉండాల్సిన మాత్రలు కల్వర్టు కింద కనిపించాయి. ఖరీదైన ఈ మాత్రలను సర్కారు సైతం అంతంత మాత్రంగానే సరఫరా చేస్తుంది. అయితే ఫిజీషియన్ శాంపుల్స్ కింద సంబంధిత మందుల కంపెనీ వారు ఉచితంగా వైద్యులకు పంపుతుంటారు. వీటిని అవసరమైన రోగులకు వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది. వాటిని వెసుకున్న వారు కాసేపటికే మత్తులోకి వెళ్లక తప్పదు. ఒకటి, రెండు మాత్రలు తీసుకుంటే చాలు శరీరంలోని అలెర్జీ మొత్తం ఇట్టే తగ్గిపోతుంది. ‘మత్తు’ను కలిగించే ఆ మాత్రలు గుట్టలు, గుట్టలుగా ఓ కల్వర్టు కింద బయట పడడంతో స్థానికులు నివ్వెరపోయారు. పరిశీలనకు వెళితే.. తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు నుంచి పాతకాల్వ కుంటలోనికి నీరు చేరే కాలువ (కల్వర్టు కింద)లో ఖరీదైన మందుల డబ్బాలు బయటపడ్డాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టు వద్ద మట్టి తవ్వకాలు లోతుగా చేయడం, చెరువు స్థలాన్ని కప్పేయడంతో స్థానికంగా నివాసముంటున్న ఎంపీపీ మూలం చంద్ర మోహన్రెడ్డి ఆ మట్టి పనులను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఆయన వెంట వెళ్లిన మీడియా ప్రతినిధులకు అక్కడి కల్వర్టు కింద అలెర్జీకి ఉపయోగించే మాన్టెక్–ఎల్సీ అనే మాత్రల డబ్బాలు కనిపించాయి. మొదట ఎక్స్పైర్ అయిన మందులు అక్కడ పడేశారని తేలిగ్గా తీసుకున్నారు. ఒక సారి చూద్దామని పరిశీలిస్తే తయారీ తేదీ 09/2024, ఎక్స్పైర్ తేదీ 02/2027గా నమోదై ఉంది. అవి ఒక్కో స్ట్రిప్ రూ.330లుగా బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంత ఖరీదైన మాత్రలను కల్వర్టు కింద ఎందుకు పడేశారని ఆరా తీయగా, ఎవరైనా మత్తుకు బానిసలుగా మారి వారు అక్కడ దాచిపెట్టారనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తవయ్యాయి. అయితే ఆ మాత్రల డబ్బాలపై ఫిజీషియన్ శాంపిల్స్.. నాట్ ఫర్ సేల్ అని రాసి ఉండడం గమనార్హం. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కల్వర్టులు కింద కొందరు యువకులు చేరుతున్నారని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
పీఆర్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శశిధర్
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శశిధర్ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా శశిధర్, ప్రధాన కార్యదర్శిగా చెంచురత్నం యాదవ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లుగా లక్ష్మీపతి యాదవ్, గిరిధర్రెడ్డి, చక్రపాణి, త్రివిక్రమరావు, ఉపాధ్యక్షులుగా మూర్తి, వాణి, లోకేష్, కుమార్, సంయుక్త కార్యదర్శులుగా అలీ, లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువ గా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తులు వేచి ఉన్న క్యూ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 74,468 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,878 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకె న్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
యల్లంపల్లిలో గజరాజులు
చంద్రగిరి:అటవీ సమీప ప్రాంతాల్లోని పంట పొలా లపై గజరాజుల దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో గజ దాడులతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నా రు. గ్రామస్తుల వివరాల మేరకు.. మండల పరిధిలోని యల్లంపల్లిలోని పంట పొలాలపై శుక్రవారం రాత్రి సుమారు 11 ఏనుగుల గుంపు చేరుకున్నాయి. రాత్రి 7 గంటలకు ఏనుగులను గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రెండు గంటల పాటు అటవీ అధికారులు రాకపోవడంతో పంట పొలాలను తొక్కి నాశనం చేసినట్లుగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందించిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఉంటే నష్ట తీవ్రత తగ్గేదని, అయితే అటవీ అధికారులు నిర్లక్ష్యంగా కారణంగా తమ పంటలు ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు. కష్టపడి పండించిన పంట చేతికి రాకపోవడంతో తీవ్ర అప్పులపాలవుతున్నామంటూ వాపోతున్నారు. చివరకు అర్ధరాత్రి తర్వాత గ్రామస్తులు, అటవీ అధికారులు సంయుక్తంగా బాణాసంచా పేల్చూతూ, కేకలు వేయడంతో ఏనుగులు అడవుల్లోకి వెళ్లిపోయాయి. అయితే శనివా రం రాత్రి కూడా ఏనుగులు వచ్చే అవకాశం ఉండటంతో యల్లంపల్లితో పాటు పరిసర అటవీ సమీప గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వానెల్లూరు అక్రమాల గుట్టురట్టు
సత్యవేడు : సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామంలో 300 ఎకరాల అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ వెబ్ ల్యాండ్లో అక్రమ నమోదుకు సంబంధించి 16 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీ నాయుడు తెలిపారు. శనివారం సత్యవేడు తహసీల్దారు రాజశేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వానెల్లూరులో సర్వే నంబరు 197లో 287.64 ఎకరాలు తంబి అలియాస్ రాజ ిపిళ్లై పేరుపై ఉన్నట్లు రెవెన్యూ ఎస్ఎల్ఆర్ రికార్డుల్లో ఉందన్నారు. అనంతరం ఆ భూమి నాలుగు సబ్ డివిజన్లుగా విభజించి ఇందులో 197/1లో 252.16 ఎకరాలు 1972లో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అటవీ భూములుగా ప్రకటించారు. అయితే ఇదే సర్వే నంబరు భూములను 197/1 ఏ నుంచి ఎఫ్ వరకు చైన్నెకి చెందిన ఆరుగురి పేర్లుపై 2024 జూన్ 12వ తేదీన రెవెన్యూ వెబ్ ల్యాండ్లో నమోదు చేశారన్నారు. ఈ భూముల నమోదులో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి సాదాబైనామా ద్వారా అప్పటికే మల్లీశ్వరీ పేరుతో ఉన్న సర్వే నంబరు 186–2ఏ2 , హనుమంతు బాతమ్మ పేరుతో సర్వే నంబరు 138/2కు సంబంధించి వెబ్ ల్యాండ్ తెరిచి నమోదు చేశారు. అయితే ఈ ప్రక్రియలో అప్పటి తహసీల్దారు రామాంజనేయులు వేలి ముద్ర వేస్తేనే వెబ్ల్యాండ్లో నమోదు అవుతుందన్నారు. ఎన్నికల విధులకు వచ్చిన రామాంజనేయులు 2024 ఫిబ్రవరి 7 నుంచి జూలై 27 వరకు సత్యవేడులో తహసీల్దారుగా పనిచేశారు. అప్పటి కన్నావరం సచివాలయం వీఆర్ఓ భార్గవ్ ఆయన సతీమణి తేజస్వీ, అప్పటి సచివాలయ సిబ్బంది పూర్ణచందునాయుడు, ఆధార్ కార్డులతో పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు లేని భూములను తప్పుడు రికార్డులతో విక్రయించడానికి చైన్నెకి చెందిన ఆరుగురు స్కెచ్ వేశారన్నారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు అందడంతో ప్రస్తుత తహసీల్దారు రాజశేఖర్ దీనిపై దృష్టి సారించి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారన్నారు. అటవీ భూములు వెబ్ల్యాండ్లో నమోదైన వారిలో తమిళనాడుకు చెందిన శ్రీధరన్, అమృతవర్షిని, నవీనరాజ్కన్న, అనూరాధ, జైరేమార్, లతజయ్కుమార్, ఆశాసురేష్ ఉన్నట్లు తెలిపారు. ఆశా సురేష్ పేరుతో సర్వే నంబరు 200/1లో 49.88 ఎకరాలు వెబ్ల్యాండ్లో నమోదైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి ఆధార్ కార్డులు, రికార్డులు ఏవీ లేకుండా వెబ్ల్యాండ్ల్లో అటవీ భూములను నయోదు చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారానికి సంబందించి ఆరుగురు అధికారులపైన మిగిలిన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీ అధికారులు ఉమ్మడి సర్వే చేయిస్తామన్నారు. సర్వే నంబరు 197/1లో అటవీ భూములు యథాస్థితిలో ఉండగా ఇదే సరే నంబర్ ఆరు సబ్ డివిజన్లుగా ఇతరుల భూ ఖాతాల్లోకి వెళ్లి నమోదు చేశారన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి అసలైన సూత్రదారులు ఎవరో నిగ్గు తేల్చడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ రామస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ‘ప్రేమిస్తున్నా’
తిరుపతి కల్చరల్ : ఐబీఎం ప్రొడెక్షన్ ద్వారా చక్కటి ప్రేమ కథతో పాటు మదర్ సెంటిమెంట్ మిళతంతో యూత్ ఎంటర్టైన్మెంట్తో రూపొందించిన ‘ప్రేమిస్తున్నా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని ఈ చిత్రం దర్శకుడు భాను తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్రం యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూనిట్ సభ్యులు శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల పొందిన అనంతరం ఈ చిత్రం ట్రైలర్తో పాటు రెండు పాటలను యూటూబ్ ద్వారా విడుదల చేశామని, దీనికి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను రూపొందించిన ఫ్యామిలీ చిత్రాలు రూపొందించి విజయం సాధించడం జరిగిందని, ప్రస్తుతం ఈ చిత్రాన్ని పూర్తి లవ్ స్టోరీతో చిత్రీకరించామన్నారు. ఈ చిత్రంలో 19 సినిమాల్లో చైల్డ్ అర్టిస్టుగా నటించి మెప్పించిన సాత్విక్ వర్మ తొలి సారి హీరోగా నటించారని తెలిపారు. ఈ సినిమాలో తిరుపతికి చెందిన ప్రీతి నేహా హీరోయిన్గా నటించిందన్నారు. అంతేకాక ఈ సినిమాకు టాప్ టెక్నీషన్స్ పనిచేయడంతో పాటు సిద్దార్థ సాల్వా సంగీత దర్శకుడిగా పరిచయం చేయడం జరిగిందన్నారు. చిత్రం హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. తన ప్రతిభను గుర్తించి తొలిసారిగా ఈ చిత్రంలో హీరో అవకాశాన్ని దర్శకుడు భాను కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా నటించి మెప్పించానని తెలిపారు. నవంబర్ 7వ తేదీన విడుదలవుతున్న ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఐబీఎం ప్రొడెక్షన్ అధినేత కనక దుర్గారావు, రవికుమార్ పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
చంద్రగిరి : శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్తున్న కుటుంబం నుంచి బాలుడు తప్పిపోయిన ఘటన శనివారం చోటు చేసుకుంది. విజిలెన్స్ అధికారుల వివరాల మేరకు... రాజంపేటకు చెందిన వెంకటేష్ కువైట్లో పనిచేస్తున్నాడు. శ్రీవారి దర్శనార్థం వెంకటేష్ భార్యతో పాటు తమ్ముడు రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో శ్రీవారిమెట్టు వద్ద వెంకటేష్ కుమారుడు పార్థీవ్ తప్పిపోయి ఏడుస్తూ ఉండడాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న జమేదారు చిరంజీవి గుర్తించాడు. అనంతరం బాలుడిని విచారించగా వివరాలను తెలిపాడు. ఈ మేరకు వెంకటేష్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం వెంకటేష్, తన తమ్ముడు రమేష్కు సమాచారాన్ని చేరవేశాడు. అనంతరం రమేష్తో పాటు బాలుడు తల్లి శ్రీవారిమెట్టు వద్దకు చేరుకుని తమ బాలుడిని గుర్తించారు. జమేదారు తప్పిపోయిన బాలుడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో, భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
ఉగ్రరూపం దాల్చిన బహుదానది
●తవణంపల్లె: మండలంలోని బహుదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పాటు అరగొండ వద్ద బహుదానది ఉగ్రరూపం దాల్చింది. పడమటి మండలాల్లోని అడవుల్లో నుంచి భారీగా వర్షపు నీరు చేరుతోంది. మాధవరం వంక, బోయపల్లె వంక, మత్యం వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇవి బహుదానదిలో కలవడంతో నదికి వరద నీరు పోటెత్తింది. శనివారం సాయంత్రానికి నదిలో నీటి శాతం కొంతమేర తగ్గింది. తెగిన కల్వర్టులు ప్రతి ఏటా భారీ వర్షాలప్పుడు కల్వర్టులు తెగిపోవడం రివాజుగా మారుతోంది. అరగొండ– గాజులపల్లె మధ్యలో ఉన్న కల్వర్టు, గాజులపల్లె–సరకల్లు రోడ్డు మధ్యలో తొడతర దగ్గర ఉన్న కల్వర్టు, అరగొండ– ఎ.గొల్లపల్లెకు వెళ్లే దారిలోని కల్వర్టు, మత్యం క్రాస్– ఎగువ మత్యం వెళ్లే దారిలోని కలర్టులు వరద ఉధృతికి కోతకు గురయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కనీసం పాల వ్యాన్లు, స్కూల్ బస్సులు కూడా తిరగడం లేదు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. కొట్టుకుపోయిన నాలుగు కల్వర్టులు అప్రమత్తంగా ఉండాలి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 35 గంటల పాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు తగ్గుముఖం పట్టి వాగుల్లో ప్రవాహం ఉధృతి తగ్గే వరకు జనాలు తెగిన కల్వర్టులపై వెళ్లరాదు. వరద ఉధృతికి దెబ్బతిన్న కల్వర్టు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాహనాలు, ప్రజలు వెళ్లకుండా అడ్డుకట్టలు వేయించారు. – సుధాకర్, తహసీల్దార్ -
10 టన్నుల ఎర్ర చందనం స్వాధీనం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో పది టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తిరుపతి ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ఫోర్స్ వెల్లడించింది. తిరుపతిలోని కార్యాలయంలో టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు, ఎస్పీ శ్రీనివాస్ శనివారం వారు మీడియాతో మాట్లాడారు. టాస్క్ఫోర్స్ బృందం వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలంలోని పత్తూరులో తమిళనాడుకు చెందిన రాజ్కుమార్ ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఆగస్టు 2న పట్టుబడ్డాడన్నారు. విచారణలో మరికొంతమంది నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు తేలడంతో దీనిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపామన్నారు. ఈ నెల 6న ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఇర్ఫాన్, మరో నిందితుడు అమిత్సంపత్ పవార్ను అరెస్టు చేశామన్నారు. మొత్తం 356 ఎర్రచందనం దుంగలను (9,576 కిలోలు) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.8 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. -
చిరుత సంచారంపై అధికారుల అప్రమత్తం
తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టాఫ్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచారంపై వీసీ ఆచార్య నర్సింగరావు విశ్వవిద్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ పరిసరాల్లో ఆయన పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు, ఆ ప్రాంతంలో తిరిగే వారికి తెలిసేలా బారికేడ్లను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో వెంకన్న శ్లోకం – ఓం నమో వెంకటేశాయ తిరుపతి అర్బన్ : ఓం నమో వెంకటేశాయ శ్లోకాన్ని కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన ద్వారం వద్ద స్వామి, అమ్మవార్ల చిత్రపటం వద్ద శనివారం ఏర్పాటు చేశారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం టీటీడీకి చెందిన భవనం నేపథ్యంలో ప్రధాన ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లకు చెందిన పెద్ద చిత్రపటాలను ఎప్పటి నుంచో ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే భక్తి భావాన్ని మరింత పెంచేలా ఓం నమో వెంకటేశాయ శ్లోకాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఈ శ్లోకాన్ని ఉంచుతారా? ప్రతి శనివారం ఉంచుతారో చూడాల్సిందే. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ : జాతీయ స్థాయి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్న్స్ ఎగ్జామినేషన్ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ, 9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎన్.విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1, 2014 నుంచి 2016 మధ్య జన్మించిన విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశాలకు, 9వ తరగతిలో ప్రవేశాల కోసం 2011 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2013 మార్చి 1వ తారీఖు మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష విధానం, నమూనా ప్రశ్నలు, మాక్ టెస్టులు, కోచింగ్తో పాటు మరిన్ని వివరాలకు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రం నందు లేదా 8688888802 / 9399976999 నంబర్ల నందు సంప్రదించాలని ఆయన తెలిపారు. ‘నేలపట్టు’లో జర్మనీ దేశస్తులు దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని శనివారం తడ ప్రాంతంలోని శ్రీసిటి నుంచి జర్మనీ దేశానికి చెందిన విదేశీయులు యాసుకోచిఎసి, మసాటోనిషియారా సందర్శించారు. కేంద్రంలోని చెరువుల్లో ఆశించిన స్థాయిలో వలస పక్షులు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. అక్కడే ఉన్న ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ విదేశీయులను పలకరించి జామ మొక్కలను అందజేశారు. తాళపత్రాల భద్రత అభినందనీయంతిరుపతి సిటీ : ఎస్వీయూలో ప్రతిష్టాత్మకమైన ప్రాచీన తాళపత్ర గ్రంథాలయాన్ని ( ఓఆర్ ఐ)ని శనివారం నూతన వీసీ తాతా నర్సింగరావు సందర్శించారు. గతంలో వెబ్సైట్లో చూసిన తాళపత్ర గ్రంథాలను నేరుగా ఆయన చూసి ఆశ్చర్యపోయారు. సంస్థ సంచాలకులు ఆచార్య పీసీ వెంకటేశ్వర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిరక్షణకు తీసుకుంటున్న శాసీ్త్రయ విధానాలను చూసి అభినందించారు. ఇంత పెద్ద స్థాయిలో ప్రాచీన సాహిత్యం భద్రంగా సంరక్షించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, చంద్రశేఖర్, డాక్టర్ వెంకటేష్, సిద్దయ్య, బాషా, నాగరాజు,శోభన్ బాబు,విశ్వనాథ్ రెడ్డి, పరిశోధకులు సంతోష్,స ోమలింగడు, శోభన్ పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జలాశయం గేట్ల ఎత్తివేత
పెనుమూరు(కార్వేటినగరం): జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కలవకుంట వద్ద ఉన్న ఎన్టీర్ జలాశయం గేట్లను శనివారం ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. మొత్తం 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి ఎగువ ప్రాంతాలైన పూతలపట్టు, పాకాల, దామలచెరువు, ఐరాల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పది వేల క్యూసెక్కుల నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ ఏఈ భరత్ తెలిపారు. చిత్తూరు– పెనుమూరు జాతీయ రహదారిపై జలాశయం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జలాశయానికి దిగువన ఉన్న జీడీనెల్లూరు ప్రజలు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎలాంటి పరిస్థితుల్లోనూ నదిని దాటేందుకు సాహసించొద్దని సూచించారు. -
ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం రేపింది(Leopard Spotted SV University). శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించడంతో విద్యార్థులు, సిబ్బంది హడలిపోయారు. సీసీ కెమెరాలో దాని సంచారం రికార్డైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దానిని బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఆగస్టులోనూ క్యాంపస్ పరిధిలో చిరుత సంచరించడంతో అంతా వణికిపోయారు. అయితే ఏడీ బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన బోనులో అది చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరుత కలకలం రేగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేశారు. ఇదీ చదవండి: మందుపాతరలతో సహజీవనం! -
ఆకట్టుకున్న ‘మంత్ర’
చంద్రగిరి : ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోహన మంత్ర–2025 మహోత్సవం మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబియు)లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, వారి మేధస్సును, వెలికితతీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చిన ప్రతి విద్యార్థిని అతిథులుగా భావించి వారికి తగిన సౌకర్యాలు కల్పించామన్నారు. సందడి చేసిన మోహన్ బాబు మోహన మంత్ర–2025 కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్బాబు సందడి చేశారు. యూనివర్శిటీలో నిర్వహిస్తున్న వివిధ ఈవెంట్లను ఆయన స్వయంగా వెళ్లి తిలకించారు. అనంతరం కొన్ని చోట్ల ఆయన విద్యార్థులతో పాటు ఆయన ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. అదే విధంగా ప్రో ఛాన్సలర్ విష్ణు విద్యార్థులతో డ్యాన్సులతో జత కలసి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఉత్సాహంగా ఈవెంట్స్ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు టెక్నోహాలిక్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఎంబెడెడ్ వర్క్షాప్, కోడ్ స్రింట్, లైఫ్ సేవర్ వర్క్షాప్, ఈవీ వర్క్షాప్, టెక్ ఎక్స్–ప్రోటోటైప్, ఈవీ ఈక్స్పో, క్యూజోనోమిక్స్లు ఆకట్టుకున్నాయి. కళాక్షేత్ర, స్పోర్ట్స్ ఈవెంట్లో భాగంగా లెట్స్ నాచో, చికెన్ డిన్నర్(పబ్జీ), కరోకే కెచప్, పుష్ ఆప్ ఛాలెంజ్– ఎం ప్రాజా ఈవెంట్లు విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్రీ ఫైర్, గల్లీ క్రికెట్, మిక్స్డ్ బాస్కెట్ బాల్, ట్రెజర్ హంట్, లక్కీ డ్రా, ఫన్ గేమ్స్, ఫుడ్ ఛాలెంజ్, జార్బింగి బాల్స్ వంటి ఈవెంట్లు ఆకట్టుకున్నాయి. అదరగొట్టిన డ్రమ్స్ శివమణి డీజే మోహన మంత్ర–2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ విద్యానికేతన్లో మైదానంలో నిర్వహించి డీజే కార్యక్రమం అదరగొట్టింది. ఈ సందర్భంగా ప్రముఖ వాయిద్యకారుడు డ్రమ్స్ శివమణి తన సంగీతంతో విద్యార్థులను అలరించారు. -
రోగి సహాయకురాలిపై ఆస్పత్రి సిబ్బంది దాడి
తిరుపతి తుడా : రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సహాయకురాలిపై రుయా సిబ్బంది దాడికి తెగబడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం రుయాలో చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన సాయిరాం చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను రుయాకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రుయాకు చేరుకున్నారు. ఉన్న ఎంఎన్ఓ సహాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బాధితుడి అక్కపై వెనుక నుంచి చేయి చేసుకోవడంతో మహిళలు ఆగ్రహించారు. అత్యవసర విభాగం నుంచి బంధువులను బయటకు గెంటేశారు. దీంతో గాయపడ్డ సాయిరాం బంధువులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల సిబ్బంది ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు. రుయాలో వైద్య సేవలు క్షీణించాయని, ప్రవర్తన కూడా మర్యాదపూర్వకంగా లేదని బాధితురాలు పద్మజ మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ ఎంఎన్ఓ పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
గంజాయి కేసులో మరో నిందితుడు అరెస్టు
సత్యవేడు : గంజాయి కేసుకు సంబంధించి నిందితుడు విజయ్(30)ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీఐ మురళీనాయుడు ఆధ్వర్యంలో మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టారు. సీఐ మాట్లాడుతూ.. గత నెల 19న ఒకటిన్నర కిలో గంజాయిని , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడు శ్రీధర్ను అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు విజయ్ పరారీలో ఉండగా శుక్రవారం గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచి రిమాండుకు పంపామన్నారు. సమావేశంలో ఎస్ఐ రామస్వామి, పోలీసులు ఉన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల స్ఫూర్తితో పనిచేద్దాం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయ స్ఫూర్తితో పనిచేసి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను జయప్రదం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిలుపు నిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం శుక్రవారం తిరుపతి మహాతి ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాలక మండలి సభ్యులు, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ విభాగం, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం, శ్రీవారి సేవకుల సేవలు, భక్తులు, మీడియా సమష్టి సహకారంతో విజయవంతం చేయగలిగామన్నారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు కల్పించేలా మూడు నెలల ముందు నుంచే మార్గదర్శిని రూపొందించామన్నారు. జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. ప్రతి రోజూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ ఒక టీం వర్క్ గా పని చేశారన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు ఏర్పాటు, టీటీడీ, విజిలెనన్స్ , పోలీసులు సమన్వయంతో పనిచేశారన్నారు. ిసీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది అదనంగా 40 వేల మంది భక్తులు వచ్చినా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మైండ్ ‘బ్లాంక్’!
చిత్తూరు కలెక్టరేట్ : కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన డీఎస్సీ నూతన టీచర్లకు కూటమి ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పోస్టింగ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోంది. తమకు నచ్చిన విధంగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టింది. పోస్టింగ్ల కౌన్సెలింగ్లో నిబంధనలను అమలు చేయకుండా సూచించిన చోటే కోరుకోవాలని నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. ఏకంగా 500 పోస్టులకు పైగా బ్లాక్ చేయడం దుమారం రేపుతోంది. ఎప్పుడూ ఇలా లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హెచ్ఆర్ఏ పేరుతో (కేటగిరీ 1, 2) పోస్టులను 500కు పైగా బ్లాక్ చేశారు. కొత్త టీచర్లకు హెచ్ఆర్ఏ పోస్టులు ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడా లేదు. ఇలా బ్లాక్ చేసిన పోస్టులన్నీ ప్రధాన ప్రాంతాల్లో ఉండడంతో వాటిని డిప్యూటేషన్స్ (ప్రభుత్వ ఆర్డర్) పేరుతో దోచుకునేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో డీఎస్సీ పోస్టింగ్లు ఇచ్చే సమయంలో పోస్టులను బ్లాక్ చేసిన సందర్భాలు లేవని యూనియన్ నాయకులు వాదిస్తున్నారు. లోగుట్టుగా కౌన్సెలింగ్ ప్రక్రియ తిరుపతి జిల్లా కేంద్రంలో ఎస్జీటీలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ లోగుట్టుగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. కౌన్సెలింగ్ నిర్వహించకముందే నూతన టీచర్లకు ముందస్తుగా ఖాళీలను చూపించాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా మోసం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తారని ఉపాధ్యాయ సంఘ నాయకులను లోనికి అనుమంతించ లేదు. కౌన్సెలింగ్ ప్రక్రియను అర్ధరాత్రిలో ప్రారంభించి వేకువ జాము వరకు నిర్వహించారు. ఒకే ప్రాంతంలో నూతన టీచర్లందరికీ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా, అలా చేయకుండా కొందరికి ఒక కేంద్రంలో, మరికొందరికీ మరొక కేంద్రంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా కేంద్రంలో విశ్వం పాఠశాల శిక్షణా కేంద్రంలో ఈ నెల 9న ఉదయం 4.30 గంటల వరకు 1 నుంచి 250 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 10న మెడ్జీ స్కూల్లో వరుస సంఖ్య 250 కు పైన ఉన్న వారిని ఉదయం 7 గంటలకు కౌన్సెలింగ్కు పిలిపించి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరీక్షింపజేశారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. దివ్యాంగ ఉపాధ్యాయులకు అన్యాయం డీఎస్సీలో ఎంపికై న దివ్యాంగ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో అన్యాయం చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో వారికున్న రిజర్వేషన్, రోస్టర్ల ప్రకారం ముందస్తుగా పిలువాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా చివర్లో కౌన్సెలింగ్ నిర్వహించి దివ్యాంగ టీచర్లకు అన్యాయం చేశారు.అవకతవకలు ఇలా... -
సీఎంఆర్ కర్మాగారంలో అగ్నిప్రమాదం
ఏర్పేడు : మండలంలోని చింతలపాళెం టోల్గేట్ సమీపంలోని సీఎంఆర్ ఎకో అలైవీల్ తయారీ పరిశ్రమలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు దట్టమైన పొగతో వ్యాపించటంతో ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు 200 మంది కార్మికులు, సిబ్బంది భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. 8 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు. చింతలపాళెం టోల్గేట్ సమీపంలోని ద్విచక్ర వాహనాలు, 4 వీలర్స్ వాహనాల అలై వీల్స్ను తయారు చేస్తారు. శుక్రవారం సాయంత్రం కర్మాగారం పై భాగంలో ఓ పైపు గుండా వెళ్లే ఆయిల్ లీక్ కావడంతో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగతో కూడిన మంటలు ఎగసిపడటంతో ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది భయాందోళనతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. మంటలు ఫ్యాక్టరీ లోపలకు వ్యాపించకుండా పైకి ఎగసిపడటంతో కర్మాగారం లోపల ఉన్న కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు లోపలకు వ్యాపించి ఉంటే ఊహకందని విపత్తు జరిగి ఉండేది. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య ప్రమాద స్థలానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి, వెంకటగిరి, తిరుపతి నుంచి మూడు అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఎనిమిది మందికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తి అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో శాంతి, మధుప్రియ, గురవమ్మ, వెంకటమ్మ, ప్రియ తదితరులు ఉన్నారు. వారిలో ఆరుగురిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక యువతిని మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని రేణిగుంట సమీపంలోని బాలాజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ ఎం.భార్గవి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. -
‘కోటి సంతకాల’తో నిలదీస్తాం
తిరుపతి మంగళం : పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఉన్నత ఆశయానికి గండి కొడుతున్న కూటమి సర్కారు వైఖరికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి నిలదీస్తామని మేయర్ శిరీష స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మేరకు పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరించారు. మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి రూ. వేల కోట్లు దండుకోవడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దీనికి నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. చంద్రబాబుకు అమరావతిలో రాజధాని నిర్మాణంపై ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీలపై లేదన్నారు. అమరావతిలోని టీడీపీ నేతల భూములకు ధరలు పెంచుకునేందుకే రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలో తెచ్చిన రూ. లక్షల కోట్లు అప్పులు ఏంచేశారని ప్రశ్నించారు. జగనన్నకు మంచి పేరు వస్తుందనే కక్షతోనే చంద్రబాబు, పవన్కల్యాణ్ కుట్రపూరితంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్ ఆరణి సంధ్య, నేతలు ఉదయ్వంశీ, కట్టా గోపీయాదవ్, వాసుయాదవ్, గీతాయాదవ్, మల్లం రవికుమార్, దినేష్రాయల్, మద్దాలి శేఖర్, మురళి, గోపాల్రెడ్డి, లవ్లీ వెంకటేష్, వెంకటేష్రాయల్, రమణారెడ్డి, ధనశేఖర్, పద్మజ, శారద, విజయలక్ష్మి, శాంతారెడ్డి పాల్గొన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం చిల్లకూరు : మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అప్పగించే నిర్ణయాన్ని అడ్డుకుంటామని ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడు తూ.. పేద విద్యార్థులు మెడిసన్ విద్యను పూర్తి చేసి ఉన్నత స్థాయికి చేరుతారనే అక్కసుతో కూటమిలోని పెద్దలు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్య బట్టారు. పట్టణంలోని ప్రతి వార్డులో సంతకాల సేకరణ ఉద్యమంలా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న ఆటో: వ్యక్తి మృతి
తిరుపతి రూరల్ : పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లి క్రాస్ వద్ద బైక్ను ఆటో ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరంలోని ఉప్పంగి హరిజన వాడకు చెందిన దివాకర్ చంద్రగిరిలో తన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుపతికి వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న దివాకర్ (19) కింద పడటంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బాధితుడి సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ షావల్లీ కేసు నమోదు చేశారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రగడ
● అటెండర్, సబ్ రిజిస్ట్రార్ మధ్య వివాదం ● సబ్ రిజిస్ట్రార్పై అటెండర్ దూషణల పర్వం రేణిగుంట : నిత్యం అనేక ఆర్థిక లావాదేవీలు జరుగుతూ రద్దీగా ఉండే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఉదయం అటెండర్, సబ్ రిజిస్ట్రార్ మధ్య రగడ నెలకొనడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం సమయానికి డ్యూటీకి రాలేదని అందరి ముందు అటెండర్ తిరుమలేష్ను సబ్ రిజిస్ట్రార్ ప్రశ్నించడంతో అవమానంగా భావించిన అటెండర్ సబ్ రిజిస్ట్రార్పై తిరగబడి ఇష్టానుసారంగా దూషించడంతో పాటు, కార్యాలయంలో లంచాలు ఎక్కువవుతున్నాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం అధికంగా ఉందని పెద్దగా కేకలు వేస్తూ హల్చల్ చేశారు. అక్కడికి వచ్చిన విలేకరులను సైతం సబ్ రిజిస్ట్రార్కు వత్తాసు పలుకుతున్నారంటూ వారిపైన అటెండర్ దురుసుగా ప్రవర్తించారు. కొంతకాలం క్రితం వీరి మధ్య వివాదం నెలకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ప్రస్తుతం మళ్లీ వారి మధ్య వివాదం రాజుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ ఆనంద రెడ్డి వివరణ ఇస్తూ నిత్యం అటెండర్ విధులకు ఆలస్యంగా వస్తున్నారని ఆ విషయం అడిగినందుకు తనపై దుర్భాషలాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. -
అసలు నిందితులను అరెస్టు చేయాలి
దేవళంపేటలో అసలు నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి మంగళం : గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని తగలపెట్టిన అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి జీవకోనలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాజకీయ కక్షలతో టీడీపీకి చెందిన సతీష్నాయుడు తగల పెట్టించారని ఆరోపించారు. గతంలో అక్కడ స్థానిక సర్పంచ్ గోవిందయ్య అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే సతీష్నాయుడు అడ్డుకున్నాడని, అయినప్పటికీ అక్కడి దళితులంతా ఒక్కటై ఏర్పాటు చేశారన్నారు. ఆ విషయాలను మనసులో పెట్టుకుని సతీష్నాయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తగల పెట్టించాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్య పైనే తిరిగి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం కూటమి నాయకుల అరాచకాలు, దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. పోలీసులు సైతం కూటమి నాయకులకు కొమ్ముకాస్తూ అంబేడ్కర్ విగ్రహ దహనాన్ని చాలా చులకనగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా అసలైన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్కుమార్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బత్తల గీతాయాదవ్, టౌన్బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్, పార్టీ నాయకులు శ్రీనివాసులు, చేజర్ల మురళి, మద్దాలి శేఖర్, ఆటో ప్రసాద్, కుప్పయ్య, రమణ, శారద, కవితమ్మ, శాంతారెడ్డి, సరస్వతమ్మ, దుర్గ, కుమారమ్మ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గూడూరు రూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని కాండ్ర–వెందోడు మార్గంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలాయపల్లి మండలం గొట్టికాడు గ్రామానికి చెందిన జశ్వంత్(23) దుర్మరణం చెందాడు. గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు గొట్టికాడు గ్రామానికి చెందిన ప్రభాకర్, జ్యోత్స్న కుమారుడు జశ్వంత్ గూడూరు పట్టణంలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే కుటుంబానికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి బైక్పై గూడూరుకు బయలుదేరగా కాండ్ర గామానికి చెందిన శీనయ్య మోటార్ సైకిల్పై వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న జశ్వంత్ బైక్ను ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శీనయ్యకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. మనోజ్కుమార్ తెలిపారు. -
ఆంధ్రాలో స్టాక్..
మత్తు పదార్థాలను తమిళనాడు ప్రభుత్వం విక్రయించకుండా బ్యాన్ విధించింది. ఆ వ్యాపారంలో రాటుదేలిన అక్రమ వ్యాపారులు ఏకంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలో మకాం పెట్టారు. దీంతో బత్తలవల్లం కేంద్రంగా మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏకంగా బత్తలవల్లంలోని ఓ ఆలయ సమీపంలో గోడౌన్లో పెద్దఎత్తున గుట్కా, హాన్స్, ఇతర మత్తు పదార్థాలను భారీగా నిల్వలు చేసి అటు తమిళనాడు, ఇటు ఆంధ్రాలో విక్రయించి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేపడుతున్నారు. బత్తలవల్లంలోని ఓ గోదాంలో నిల్వ చేసేందుకు లారీ నుంచి అన్లోడ్ చేస్తున్న మత్తు పదార్థాలు -
రైలు నుంచి జారిపడి విద్యార్థి మృతి
నాయుడుపేటటౌన్ : నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో మెము రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సంతోష్ (17) అనే విద్యార్థి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. వరదయ్యపాళెంకు చెందిన సంతోష్ నెల్లూరు జిల్లాలోని వఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతి రోజు మాదిరిగా కళాశాలకు వెళ్లేందుకు స్నేహితులతో కలిసి తడలో మెము రైలు ఎక్కి బయలు దేరగా నాయుడుపేటకు రాగానే ఫుట్పాత్ సమీపంలో నిల్చున్న సంతోష్ కాలుజారి రైలు కింద పడిపోయాడు. గమనించిన స్నేహితులు చైన్ లాగి రైలు నిలుపుదల చేశారు. రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన సంతోష్ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వ్యక్తి అరెస్టు తిరుపతి క్రైమ్ : ప్రభుత్వ పనితీరు, నాయకులపై అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెస్ట్ సీఐ మురళీమోహన్ పేర్కొన్నారు. కదిరికి చెందిన అంజద్ ఖాన్(43) కొంత కాలంగా నకిలీ ప్రొఫైల్ సృష్టించి పార్టీల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా, ప్రముఖ నాయకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేస్తున్నారని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. -
మళ్లీ మోదీ వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం
– సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వరదయ్యపాళెం : నరేంద్ర మోదీని మరోసారి అధికారంలోకి రానిస్తే రాజ్యాంగం కనుమరుగై ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. వరదయ్యపాళెం మండల కేంద్రంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులకు ఐదు రోజులుగా రాజకీయ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు గురువారం ఉదయం దేశ , అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను కె.నారాయణ వివరించారు. ప్రపంచ దేశాల మధ్య భయంకర వాతావరణం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని అమెరికా ప్రయత్నం చేస్తోందన్నారు. అనంతరం పార్టీ కార్యక్రమం, బలమైన పార్టీ నిర్మాణం ఆవశ్యకత అనే అంశంపై జేవీఎస్ మూర్తి, భారత దేశ చరిత్ర సంస్కృతి, వక్రీకరణ అనే అంశంపై కొప్పర్తి వెంకటరమణ మూర్తి వివరించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు , శిక్షణ తరగతుల ప్రిన్సిపల్గా పి.మురళి, కార్యదర్శిగా చిన్నిరాజ్ వ్యవహరించారు. -
పిడుగుపాటుకు ఆవుల మృతి
చిట్టమూరు: మండలంలో గురువారం పిడుగుపడి మూడు ఆవులు మృతి చెందాయి. మండల పరిధిలోని మల్లాం గ్రామానికి చెందిన చెన్నారెడ్డి బాబురెడ్డికి చెందిన ఆవులు గ్రామానికి సమీపంలోని పొలాల్లో మేతకు వెళ్లాయి. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులతో పొలాల్లో పిడుగు లు పడ్డాయి. దీంతో పొలాల్లో మేత మేస్తున్న బాబురెడ్డికి చెందిన మూడు ఆవులు అక్కడిక్కడే మృతి చెందా యి. అదృష్టవశాత్తు ఆవులు మేపుతున్న కాపరికి ఎటువంటి ప్రమాదం జరుగలేదని స్థానికులు తెలిపారు. -
నేటి నుంచి బోధనేతర పనులు బంద్
తిరుపతి సిటీ : ప్రభుత్వం నిర్ణయించిన మితిమీరిన బోధనేతర పనులతో సమయం హరించుకుపోతోందని, శుక్రవారం నుంచి ఆ పనులను నిలిపివేస్తున్నట్లు ఏపీ ఫ్యాప్టో, ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఎస్టీయూ) ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం తిరుపతి అర్బన్ మండల విద్యాశాఖాధికారికి ఎస్టీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బోధన సమయం కంటే బోధనేతర వ్యవహారాలు పెరిగిపోయాయని, ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నివించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు, బోధనేతర పనులతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురై పలు వ్యాధులకు లోనవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాలు తప్ప ఏ ఇతర బోధనేతర పనులు చేయబోమని తేల్చి చెప్పారు. అనవసరమైన గూగుల్ ఫీట్స్, విద్యాశక్తి, జీఎస్టీ వంటి ప్రభుత్వ సీజనల్ ప్రచారాలను ఉపాధ్యాయులు ఇక నుంచి చేయరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం చైర్మన్ సాయి శ్రీనివాస్, కార్యదర్శి చిరంజీవి, నరహరి, ప్రకాష్రావు, వెంకటేశ్వర్లు, మనోజ్ కుమార్, సభ్యులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీటీడీ డిప్యూటీ ఈఓల బదిలీ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : టీటీడీలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న డిప్యూటీ ఈఓలను బదిలీ చేశారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథంను తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ చేశారు. అలాగే శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓగా హరీంద్రనాథ్ను నియమించారు. హెచ్ఆర్ డిప్యూటీ ఈఓగా భాస్కర్, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి డిప్యూటీ ఈఓగా శాంతిని బదిలీ చేశారు. కాగా ఆర్–1 డిప్యూటీ ఈఓగా నియమితులైన రాజేంద్రకు ఆర్–2 ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుమల అన్నదానం డిప్యూటీ ఈఓగా సెల్వం, తిరుపతి అన్నదానం డిప్యూటీ ఈఓగా వెంకటయ్య, కల్యాణకట్ట డిప్యూటీ ఈఓగా గోవిందరాజన్కు డోనర్ సెల్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
మిగిలిపోయిన భోజనం పెట్టొద్దు
తిరుపతి అర్బన్:వసతిగృహాల్లోని పిల్లలకు పెళ్లితో పాటు ఇతర కార్యక్రమాల్లో మిగిలిపోయిన భోజనాన్ని పెట్టొద్దని కలెక్టర్ వెంకటేశ్వర్ వార్డన్లను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడాది కాలంలో పలుచోట్ల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకోవడంతో ఆరోగ్య ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారం, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే దెబ్బతిన్న భవనాలు ఉంటే పిల్లలను సురక్షితమైన మరో ప్రాంతానికి బదిలీ చేయాలని కోరారు. వర్షాల నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నా రు. పిల్లల ఆరోగ్య రక్షణకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్కూల్ జోన్ పరిధిలో క్లోరినేషన్ చేపట్టాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదే శించారు. కార్యక్రమంలో డీపీవో సుశీలాదేవి, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమ్కుమార్రెడ్డి, డీఈవో కేవీఎన్ కుమార్, గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పద్మజ, డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు. -
అడ్డు తొలగించారు!
తిరుపతి జేసీ బదిలీ వెనుక రాజకీయం సాక్షి టాస్క్ఫోర్స్ : ఆక్రమణలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ను కూటమి నేతలు పట్టుబట్టి బదిలీ చేయించారు. జేసీగా శుభం బన్సల్ ఉన్నన్ని రోజులు స్వేచ్ఛగా ఆక్రమణలు చేయలేమని ‘ముఖ్య’ నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేశారు. మెజారిటీ కూటమి నేతలు కలిసి మూకుమ్మడిగా ఒత్తిడి చేసి జేసీ శుభం బన్సల్ని బదిలీ చేసి పంతం నెగ్గించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ఏడాది జూలై 24న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా శుభం బన్సల్ బాధ్యతలు చేపట్టారు. అధికారం వచ్చిన వెంటనే జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలు భూ ఆక్రమణలకు తెరతీశారు. ఒకటి కాదు రెండు కాదు.. యథేచ్ఛగా ఆక్రమణలకు బరితెగించటం ప్రాంభించారు. అందులో ముఖ్యంగా గూడూరు నియోజక వర్గం చిల్లకూరు మండల పరిధిలో క్రిస్ సిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో ఎక్కువగా ప్రభు త్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల పేరు తో కూటమి నేతలు బినామీ పేర్లు చేర్చి పరిహారం కింద వచ్చే కోట్ల రూపాయలను జేబులు నింపుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ఇదే చిల్లకూరు మండలం కడివేడు పరిధిలో కూటమి నేతల ఆక్రమణలో ఉన్న సీలింగ్ భూములకు రికార్డులు చేసుకునేందుకు యత్నించగా జేసీ అడ్డుపడుతూ వచ్చారు. ఇంకా వెంకటగిరి పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా జేసీ అడ్డుగా నిలిచారు. అడ్డుపడుతుండడంతో మింగుడుపడక శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో కూటమి నేతల భూ ఆక్రమణలకు అడ్డుపడుతూ వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని వికృతమాల పరిధిలో కూటమి నేతల అధీనంలో ఉన్న ఉన్న అక్రమ నిర్మాణాలకు అడ్డుచెప్పినట్లు తెలిసింది. శ్రీకాళహస్తి రూరల్ పరిధిలో ఏర్పేడు– వెంకటగిరి మార్గంలోని విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా జేసీ అడ్డుకున్నారు.తిరుపతి నగర పరిధిలోని ఎర్రమిట్ట వద్ద సర్వే నంబర్ 101లో కోట్ల రూపాయలు విలువైన భూమిని స్థానిక కూటమి నేతలు ప్లాట్లు వేసి పంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలంటూ 28 పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితా ఫైల్ను జేసీ వద్దకు తీసుకెళ్లగా సంతకం చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. అలాగే తిరుపతి నగరంలోనే మరికొన్ని ఆక్రమణలకు జేసీ అడ్డుపడుతూ వచ్చారు. చంద్రగిరి పరిధిలో ఇటీవల కాలంలో కూటమి నేతలు ఓ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వారి నివాసానికి వెళ్లకుండా ఇనుప కంచెవేశారు. ఈ విషయాన్ని బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించకపోవడంతో బాధితులు నేరుగా జేసీ శుభం బన్సల్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్థానిక అధికారులకు ఫోన్చేసి సీరియస్ అయినట్లు సమాచారం. స్థానిక అధికారులు జేసీపై కూటమి నేతలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తిరుపతి రూరల్, మంగళం పరిధిలోని విలువైన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా అడ్డుపడ్డారు. ఇంకా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పరిధిలో విలువైన భూమిని ఆక్రమణకు గురికాకుండా అడ్డు కున్నారు. ఇదిలా ఉంటే.. తుడా వైస్ చైర్మన్గా జేసీని నియమించడంపై కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు. వైస్ చైర్మన్గా ఆర్డీఓ స్థాయి అధికారి అయితే చెప్పినట్లు వింటారని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. నిజాయతీగా అధికారిగా పేరున్న శుభం బన్సల్ కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో అంతా ఏకమయ్యారు. కూటమి నేతలకు ఓ బడా పారిశ్రామిక వేత్త తోడయ్యారు. రెండు రోజుల క్రితం వీరంతా కలిసి ‘ముఖ్య’ నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో బదిలీ చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. -
తల్లుల వేదన.. బిడ్డల రోదన
రుయా చిన్నపిల్లల ఆసుపత్రి వరండాలో మంచాలపై బాలింతలను ఉంచిన దృశ్యంలగేజీలతో నేలపై సేద తీరుతున్న బాలింతల సహాయకులు రాయలసీమకే తలమాణికమైన శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ సర్వజన చిన్నపిల్లల ఆసుపత్రిలో బాలింతల వేదన.. బిడ్డల రోదనతో ఆసుపత్రి దద్దరిల్లింది. బాలింతలకు వసతుల కల్పనలో ఆసుపత్రి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. వార్డులు ఉన్నప్పటికీ వార్డు బయట మెట్ల పక్కన ఉన్న సన్సైడ్ గోడల కింద బెడ్లను వేసి బాలింతలు, పురిటి బిడ్డలకు నరకం చూపెట్టారు. ఓ వైపు దోమల విజృంభన, భరించలేని దుర్వాసనకు తోడు చలిగాలులతో బాలింతలు, బిడ్డల అవస్థలు అన్నీ ఇన్ని కావు. మరోవైపు సహాయకులు సైతం నేలపై పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫ్రిజ్జులు, కొళాయిలు సైతం పనిచేయకపోవడంతో బాలింతలు, సహాయకులు అగచాట్లు పడ్డారు. లిఫ్టు పనిచేయకపోవడం, నిరుపయోగంగా ఉన్న బెడ్లు, మంచాలు, వీల్చైర్లు, పనికిరాని వస్తువులను అక్కడే నిర్లక్ష్యంగా పడేశారు. వాటి పక్కనే బాలింతలు, చంటి బిడ్డలను ఉంచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
రూ.5 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్
దొరవారిసత్రం: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార టీడీపీ నేతలు చెరబట్టారు. ఎకరం రూ.50 లక్షలు విలువచేసే సుమారు పదెకరాల భూముని చదునుచేసి సాగుకు అనువుగా మార్చుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ..నెలబల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 7లో 71 ఎకరాల భూమిలో బీసీ, ఎస్సీ కాలనీలు, వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠశాల నిర్మాణాలకు పోనూ రహదారి వెంబడే 20 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డుపక్క భూములు ఎకరా రూ.50 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. గతంలో ఈ భూముల దురాక్రమణను అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించి పీఓబీ (ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్)లో నమోదు చేశారు. అయినా ఐదెకరాలు వరకు ఆక్రమణకు గురైంది. నాలుగు నెలలు కిందట సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు సుమారు పదెకరాల భూమిని ఆక్ర మించేందుకు ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు ఇది గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. మళ్లీ అదే మాజీ ప్రజాప్రతినిధి సహకారం, సూచనలతో మూడ్రోజుల నుంచి పట్టపగలే పీఓబీ కింద ఉన్న పదెకరాల ప్రభుత్వ భూమిని యంత్రాలతో హద్దులు నిర్ణయించి ట్రాక్టర్లతో దున్ని సాగుకు అనువుగా మార్చుకుంటున్నారు. ఈ దందాలో సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధికి కూడా వాటా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులు తెలిసినా చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎస్వీ వెటర్నరీలో జాతీయ సదస్సు ప్రారంభం
చంద్రగిరి: పశుపక్ష్యాదులకు అందించాల్సి మెరుగైన వైద్య సేవలు, శస్త్రచికిత్సల కోసం తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ తిలగర్ హాజరవ్వగా, ప్రత్యేక అతిథిగా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జేవీ రమణ, ప్రొఫెసర్ ప్రతాబన్ పాల్గొన్నారు. ఎస్వీ వెటర్నరీ చికిత్స, టీచింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి 14 రాష్ట్రాల నుంచి 25 పశువైద్య కళాశాలలకు చెందిన 250 పశువైద్య విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ తిలగర్ మాట్లాడుతూ.. పశువైద్యంలో స్పెషలిలైజేషన్ చాలా అవసరమన్నారు. పశువైద్య విద్యార్థులు స్కిల్తో పాటు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ పాత్ర చాలా ఉందని తెలిపారు. ప్రొఫెసర్ ప్రతాబన్ మాట్లాడుతూ.. శస్త్ర చికిత్స విభాగం, డయాగ్నోసిస్ విభాగం ప్రాముఖ్యత, వ్యాధి నిర్ధారణ విభాగాల పాత్ర చాలా అవసరమన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ వి. వైకుంఠరావు, పశు వైద్య కళాశాల, తిరుపతి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ పి.జగపతి రామయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రొఫెసర్ వీరబ్రహ్మయ్య వ్యవహరించారు. అనంతరం పశువైద్య, శస్త్రచికిత్సలకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. -
వాణిజ్యాభివృద్ధి దిశగా తిరుపతి రైల్వేస్టేషన్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి రైల్వేస్టేషన్ ఇకపై వాణిజ్య అభివృద్ధి దిశగా రూపాంతరం చెందుతుందని రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుచానూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే స్టేషనన్లో కొత్తగా ఆధునీకరించనున్న భవనంపై దక్షిణ వైపున 36,640 చ.మీ స్థలాన్ని వాణిజ్య అభివృద్ధి కోసం 60 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా సరికొత్త విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్న్లో కొత్తగా వాణిజ్య అభివృద్ధిని సులభతరం చేయడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఇది బ్రాండెడ్ అవుట్లెట్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలు, షోరూమ్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని వివరించారు. రైల్వే భూమిని ఎలా లీజుకు ఇస్తున్నారో, రైల్వే స్టేషన్న్పై వాణిజ్య ప్రభావం, ఈ టెండర్ విధానం వంటి అంశాలపై ఉదహరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. సమావేశంలో ఆర్ఎల్డీఏ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ విష్ణువర్ధన్రావు, జేజీఎం శ్రీనివాసరావు, ప్రాజెక్టు మేనేజరు షకీల్ అహ్మద్ పాల్గొన్నారు. -
జనసేన కార్యకర్త ఆత్మహత్య
కోట : విచారణ పేరుతో పోలీసులు వేధించారని బంధువులకు చెప్పి కోట మండలంలో ఓ జనసేన కార్యకర్త మంగళవారం ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని చిట్టేడుకు చెందిన జనసేన కార్యకర్త అనిల్ (35) కొంత కాలంగా స్కీమ్ల పేరుతో పలువురు నుంచి సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. కాలపరిమితి దాటినా తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళ తాను చెల్లించిన రూ.10 వేలు తిరిగి ఇవ్వాలని కోరింది. దిక్కున్న చోట చెప్పుకోమని అనిల్ బెదిరించడంతో ఆమె నిద్ర మాత్రలు మింగి ఆస్పత్రి పాలైంది. అనంతరం కోట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పవన్కుమార్కు ఫిర్యాదు చేసింది. దీంతో అనిల్ను ఎస్ఐ పిలిపించి మంగళవారం విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఆమె వద్ద తాను నగదు తీసుకున్న మాట వాస్తవమేనని అనిల్ ఒప్పుకున్నాడు. దీంతో ఎవరి దగ్గర ఎంత మొత్తంలో నగదు వసూలు చేశావు అనే పూర్తి వివరాలు తీసుకుని రావాలని చెప్పి అనిల్ను ఇంటికి పంపి వేశారు. ఇంటికి వచ్చిన అనిల్ తన స్నేహితులు, బంధువుల వద్ద కోట ఎస్ఐ తనను వేధించాడని వాపోయాడు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు తిరుపతిలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందాడు. అయితే మృతుడికి గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి ఆమెను వదలి వేసి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని , జీవనం కోసం ఇలాంటి స్కీమ్లతో నగదు వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనిల్ కుటుంబ సభ్యులు కోట ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయమై వాకాడు సీఐ హుసేన్ బాషాను వివరణ కోరగా ఈ కేసును తాను విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులు అందిస్తామని వెల్లడించారు. -
పెయిన్ కిల్లర్స్తో కిడ్నీలకు ముప్పు
దొరవారిసత్రం: మండలంలోని పాళెంపాడులో బుధవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు పర్యటించారు. నెఫ్రాలజిస్ట్ రవికుమార్, పాథాలజిస్ట్ మల్లికార్జున్, జనరల్ మెడిసిన్ రమేష్ క్షేత్రస్థాయిలో బాధితులతో మాట్లాడారు. వారి మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో పలువురు కొన్నేళ్ల నుంచి అధిక మోతాదులో పెయిన్ కిల్లర్స్ వాడినట్లు గుర్తించారు. అందుకే క్రియాటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీలు దెబ్బతిన్నట్లు బృందం సభ్యులు వెల్లడించారు. మరి కొందరికి 60 ఏళ్లు దాటడంతో వయసు రీత్యా కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చినట్లు వివరించారు. పాళెంపాడు గ్రామంలో ఇప్పటి వరకు 25 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వీరిలో వైద్య బృందం 16మందిని కలిసి మాట్లాడింది. ఆరుగురికి మరో సారి కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలను స్విమ్స్లో చేయించాలని నిర్ణయించింది. గ్రామంలో ఓవర్హెడ్ ట్యాంకు నీళ్లు, చేతి బోర్లు నీటిని తాగడం వల్ల ఎముల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్లేదని నీటి పరీక్షల్లో తేలినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలోని సిబ్బందితో మాట్లాడి రోగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైద్యం అందించే విధివిధానాలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ వీరకుమార్, పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, అరుణరుత్విక్, సూర్యకిరణ్ పాల్గొన్నారు. -
వంచనకు కేరాఫ్ చంద్రబాబు
వెంకటగిరి రూరల్ : వంచనకు కేరాఫ్ చంద్రబాబు అని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం ఆయన నైజమని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు సీ్త్రనిధి కింద ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జమ చేయలేదని విమర్శించారు. అలాగే నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యావ్యవస్థనుమంత్రి లోకేష్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు. జగన్ 2.0 ఓ వరం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన జగన్ 2.0 ఒక వరమని నేదురుమల్లి తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీలో కార్యకర్తలకు పదవులు కేటాయించారని వెల్లడించారు. వెంకటగిరి నియోజకవర్గానికి ఎస్ఈసీ (స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా ముగ్గురికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్ఈసీ మెంబర్ బొలిగర్ల మస్తాన్యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశౠరు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నక్కా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు ధనియాల రాధ, కందాటి కల్యాణి, ఎంఏ నారాయణ, ఆరి శంకరయ్య, నేతలు ఎం.వెంకటేశ్వర్లు, మస్తాన్రెడ్డి, కందాటి రాజారెడ్డి, పూజారి శ్రీనివాసులు, కల్లు సతీష్, మల్లిరెడ్డి, రొంటాల చిన్నా, కూనా మల్లికార్జున్, సీహెచ్ మురళి పాల్గొన్నారు. -
కుంటుపడిన సేవలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య సేవలు కుంటుపడ్డాయి. పల్లె వైద్యం పూర్తిగా పడకేసింది. పీహెచ్సీల్లో వైద్యం ఆమడదూరంలో నిలిచిపోయింది. మందులు, మాత్రలు కరువయ్యాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం పీహెచ్సీ వైద్యులు సమ్మె బాట పట్టారు. దీంతో పీహెచ్సీల్లో వైద్యం చేసేవారు లేక వెలవెలబోతున్నాయి. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంఓనే ఆర్ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించేవారు పెరిగిపోయారు. ఇదే అదునుగా పీహెచ్సీ సిబ్బంది సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూమంత్రంగా వచ్చి వెళ్లిపోతున్నారు. సమ్మె ప్రభావంతో 104 సేవలు సైతం స్తంభించాయి. -
ఎస్వీయూలో కాగ్ నివేదికపై సమీక్ష
తిరుపతి సిటీ : ఎస్వీయూలో కాగ్ నివేదికపై ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్షించింది. బుధవారం వర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో ఎస్వీయూ అధికారులతో అకౌంట్స్ కమిటీ సమావేశమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో వర్సిటీలోని పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించింది. ప్రధానంగా మొత్తం 24 అంశాలతో కూడిన నివేదికను విశ్లేషించింది. ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని మెరుగు పరిచే ఉద్యోగ మేళాలు, నూతన విద్యా విధానం–2020 అమలు, కొత్త యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశాలు కల్పించడం, విద్యార్థుల ఫీల్డ్ ప్రాజెక్టులపై దృష్టి, నాణ్యమైన బోధనా సిబ్బంది నియామకంపై ఆరా తీసింది. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో మౌలిక సదుపాయాల, పరీక్ష ఫలితాల జాప్యం, అనుబంధ కళాశాలల్లో ఐక్యూఏసీ , ఆట స్థలాలు, ప్రయోగశాలల ఏర్పాటు, వర్సిటీకి వచ్చిన నిధుల వినియోగం, రూసా 2.0 ప్రకారం మౌలిక వసతుల కల్పనలో ప్రగతి వంటి విషయాలను సుదీర్ఘంగా చర్చించింది. ఈసందర్భంగా వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆనందబాబు, రాధాకృష్ణ, అశోక్ కుమార్ రెడ్డి, జయనాగేశ్వర రెడ్డి, లలిత కుమారి, శ్రీరామ్ రాజగోపాల్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. -
ఎస్వీయూ వీసీగా నర్సింగరావు
తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ నర్సింగరావు బెనారస్ వర్సిటీలో పీజీ పూర్తి చేసి పలు ఐఐటీ కళాశాలల్లో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించారు. మంత్రి లోకేష్ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఎస్వీయూ వీసీగా నియమితులయ్యే అవకాశముందని రెండు నెలల ముందే సాక్షి పత్రిక పసిగట్టంది. ఈ మేరకు కథనాలు ప్రచురించడం గమనార్హం. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీని తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసమే మంత్రి లోకేష్ తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి వైస్ చాన్సలర్ పదవిని కట్టబెట్టినట్లు జిల్లాలో విస్తృతంగా చర్చసాగుతోంది. -
షాక్ తప్పదు
సర్కారుకుతిరుపతి రూరల్ : విద్యుత్ శాఖలో సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు రోడ్డెక్కారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. తిరుపతి డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు కూటమి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయాస్ సంఘాల సమాఖ్య (జేఏసీ) తిరుపతి డిస్కమ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం గ్రేడ్–2 కింద నియమితులైన కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. డిస్కమ్ కో–చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ యాజమాన్యం అనుసరించే అశాసీ్త్రయ విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు నష్టం వస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి యాజమాన్యాలు తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. డిస్కమ్ కన్వీనర్ మురళీధర్ మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తూ దూర విద్య కళాశాలల్లో ఉన్నత చదువులు చదివి అర్హత సాధించిన వారికి ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లడించారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయరాం మాట్లాడుతూ ఉద్యోగులపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయమణి మాట్లాడుతూ జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు వారికి విధించిన కొత్త సర్వీసు రెగ్యులేషన్స్ను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశార9ఉ. తిరుపతి సర్కిల్ జేఏసీ చైర్మన్ వెలకటూరి గోపి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్ ఉప కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.తిరుపతిలో రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు మోసానికి నిరసనగానే.. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఉద్యోగులను మోసం చేసినందుకు నిరసనగానే ఈనెల 13న చలో విజయవాడ చేపడుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి కూడా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పందించకుంటే ఈనెల 15 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు ఎల్.చలపతి, వై.వెంకట సునీల్, వి.సతీష్, టి.రవికుమార్, సురేష్,రియాజ్ అహ్మద్, రామలింగారెడ్డి, సంజీవరావు, కృష్ణయ్య , తిరుపాల్ రెడ్డి ,రంగయ్య ,హుస్సేనయ్య , శంకర్, బాలకాశి, నాగార్జున, సుధాకర్, ఏలుమలై పాల్గొన్నారు. -
● రాష్ట్రంలో విచ్చలవిడిగా లిక్కర్ దందా ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ మహిళల ఆగ్రహం ● ఎకై ్సజ్శాఖ కార్యాలయం వద్ద ధర్నా
తిరుపతి మంగళం : రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కాసుల కక్కుర్తితో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీతాయాదవ్, తిరుపతి నగర బూత్కమిటీ ఇన్చార్జి ఉప్పాల సాయికుమారి మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు తిరుపతిలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయం వద్ద మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. కల్తీ మద్యం అరికట్టాలి, బెల్ట్ షాపులను తొలగించాలి, నకిలీ లిక్కర్ తయారుచేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. టీడీపీ నేతలే విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప నకిలీ లిక్కర్ కారణంగా మహిళల పుస్తెలు తెగిపోతున్నా పట్టదని ఆరోపించారు. ఈ ఏడాదిన్నరలోనే కల్తీ మద్యం తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా లిక్కర్ దందాను నిలిపివేయకుంటే ఇదే మద్యం ఒంటిపై పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మద్యం విక్రయాలను అరికడతాం, మహిళల మానప్రాణాలకు అండగా ఉంటామని ఊదరగొట్టిన పవన్కల్యాణ్కు ఇప్పడు కల్తీ లిక్కర్ కనిపించం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుణీత, పార్టీ నేతలు నైనారు మధుబాల, విజయలక్ష్మీ రాయల్, పద్మజ, పుష్పలత, మహిత, రాజేశ్వరి, రాధ, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏంటి?.. మంచు విష్ణు ఆగ్రహం
సాక్షి,తిరుపతి: మోహన్బాబు వర్సిటీపై వస్తున్న వార్తలను హీరో, మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం (అక్టోబర్8న) ఓ నోట్ను విడుదల చేశారు.అందులో.. యూనిర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉండగా.. వాటిని ధిక్కరించి ఉన్నత విద్యామండలి పోర్టల్లో పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి సిఫార్సులు సరికాదు. మా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు సోషల్ దుష్ప్రచారం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. -
తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన పవిత్రక్షేత్రం తిరుమలలో(tirumala) రీల్స్ తీసి వాటికి పాటలు జోడించి వెకిలి చేష్టలతో సోషల్ మీడియాలో(Social Media Reels) హల్చల్ చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్ పేరుతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మాడవీధుల్లో, ఆలయ గోపురాలు కనిపించే విధంగా కొన్ని అసభ్యకరమైన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.తాజాగా శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి రీల్స్ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్ చేయడం కూడా వైరల్గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించారని, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్ మీడియా వారితో కలిసి రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్లో చెప్పుకొచ్చారు.చూశారా తమ్ముళ్లు మన మంచి ప్రభుత్వంలో తిరుమలలో కూడ రీల్స్ చేసుకునే సదుపాయం కల్పించాం pic.twitter.com/ZHj0oJyGq8— Ꮩᴀʀsʜᴀ Ꭱᴇᴅᴅʏ 🐬 (@YSvarshareddy) October 6, 2025గతంలో తిరుపతిలోని అలిపిరిలో డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కొండపైనే సోషల్ మీడియా వ్యక్తులు వెర్రిపోకడలు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమలలో అసభ్యకరమైన రీల్స్ తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుడిముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దునిద్ర పోతోందా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో సోషల్ మీడియా రీల్స్ చేయించడం పై శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/8bUxzZ8W62— TOVINO𓃵 (@Vamos_Rafa23) October 7, 2025 -
ఎర్రచందనం పట్టివేత
భాకరాపేట : తలకోన మార్గంలోని పూలకుంటపల్లె వద్ద కారులో తరలిస్తున్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట అటవీ క్షేత్రాధికారి ఎన్ వెంకటరమణ తెలిపారు. ఆదివా రం అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం పట్టుబడినట్టు వెల్లడించారు. పరారవుతున్న నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితులను తమిళనాడుకు చెందిన చందిరాజన్ ఇజ్మలై, తరుమన్ సామికన్నుగా గుర్తించామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 11 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వరదయ్యపాళెం : తడ–శ్రీకాళహస్తి రహదారిపై బత్తలవల్లం సమీపంలోని ఇనమాలగుంట అటవీప్రాంతం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. సత్యవేడు మండలం జడేరి పంచాయతీ కేవీకండ్రిగ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశులు (35) శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ తడలో నివాసమున్నాడు.ఈ క్రమంలో పరిశ్రమలో తనతో పనిచేస్తున్న మిత్రుడిని కలిసేందుకు వరదయ్యపాళెం వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశులును సూళ్లూరుపేటలోని ఓ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. అక్కడి చికిత్స అందిస్తుండగా మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ సాయిబాబా తెలిపారు. -
ఆక్రమించి.. బోరు వేసి..!
తొట్టంబేడు : స్థానిక ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో రిలయన్స్ పెట్రోల్బంకు వెనుక వైపు సర్వే నంబరు 152లో 1.22ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆ భూమిని జేసీబీతో చదును చేయడం, అందులో బోరు వేయిస్తున్న దృశ్యాలు మంగళవారం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై తొట్టంబేడు తహసీల్దారు భారతి మాట్లాడుతూ ఆక్రమిత భూమిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అత్యంత ఖరీదైన ఈ భూమిని కబ్జాకోరల్లో నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 10న రెండో విడత సీట్ల కేటాయింపు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో రెండవ విడత అడ్మిషన్ల వెబ్ ఆప్షన్ల మార్పులకు సంబంధించిన ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. దీంతో ఉన్నత విద్యామండలి ఓఏఎండీసీ ద్వారా రెండవ విడతలో సీట్లు సాధించిన విద్యార్థులకు 10వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులకు వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపనున్నారు. ఆయా కళాశాలల్లో ఈ నెల 11 నుంచి 13వ తేదీలోపు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి జాతీయ స్థాయి వర్క్షాప్ తిరుపతి అర్బన్ : తిరుపతిలోని తాజ్హోటల్లో బుధవారం నుంచి రెండు రోజులపాటు జాతీయ సహకార మంత్రిత్వశాఖ వర్క్షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సహకారం రంగం బలోపేతం, వివిధ పథకాల అమలుపై సమీక్షించేందుకు త్రైమాసిక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జాతీయ సహకార మంత్రిత్వశాఖ సెక్రటరీ ఆశిష్ కుమార్ భుటానీ, ఏపీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్ పాల్గొననున్నట్లు వివరించారు. -
ఏఐ టెక్నాలజీతో బోధన
తిరుపతి సిటీ: ఏఐ టెక్నాలజీతో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలని డీఎస్సీలో ఇటీవల ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ సూచించారు. తిరుపతిలోని విశ్వం స్కూల్లో ఐదు రోజులుగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలని, డ్రాపవుట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, వర్క్షీట్లు, స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్స్ అనుసంధానంగా బోధించాలన్నారు. పాఠశాలలో నిర్వహించాల్సిన రిజిస్టర్లపై సమగ్ర అవగాహనతో శిక్షణ పొందాలని స్పష్టం చేశారు. జిల్లా నోడల్ అధికారి నరసింహులు, స్టేట్ అబ్జర్వర్తో పాటు డీవైఇఓ మహేశ్వర రావు, ఎంఈఓలు బాలాజీ, జనార్ధన్ రాజు, ప్రేమలత, అసిస్టెంట్ అలెస్కో మీనాక్షి, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి కేడీ సారథి పాల్గొన్నారు. -
ముక్కంటీ.. కనవేంటి!
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల వైఖరి సరికాదని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన శ్రీకాళహస్తీశ్వరాలయ కమిటీ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులుతో కలిసి ఆలయ సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముక్కంటీశుని సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా నాలుగో గేట్ నుంచి వచ్చే భక్తులు ఎండలో ఇబ్బంది పడుతున్నారని కార్పెట్ వేశారని, తర్వాత రోడ్డుపై కూల్ పెయింట్ వేయించారని, అనంతరం కొబ్బరి మట్టలతో పందిరి వేశారని చివరకు రేకుల షెడ్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ పని ముందుగానే చేసి ఉండవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్లకు నగదు దోచిపెట్టేందుకే మొత్తం వ్యవహారం నడిపించారని విమర్శించారు. అయితే భక్తుల కోసం వేసిన షెడ్లలో వాహనాలు పార్క్ చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన షెడ్లు కేవలం వాహనాల పార్కింగ్కే ఉపయోగపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికై నా ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ఎండలో భక్తులు పడుతున్న ఇక్కట్లను గమనించాలని సూచించారు. షెడ్లలో ఎవరూ వాహనాలు పార్క్ చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు. -
పూడిక తీత..
● కట్టమంచి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా పూడికతీత పనులు ● అడ్డగోలుగా చెరువు మట్టిని అమ్ముకున్న టీడీపీ నాయకులు ● చెరువు అక్రమాలపై ఆర్టీఐకి ఫిర్యాదు చేసిన స్థానికులు ● అనుమతులతోనే పనులు చేశామంటున్న కూటమి నేతలు ● తమ వద్ద అనుమతులే పొందలేదని తేల్చేసిన ఇరిగేషన్ అధికారులు ● బయటపడ్డ కూటమి నేతల బాగోతం నిజాలు ఇవే కూటమి నేతలు అంతా మాయ చేశారు. చిత్తూరు నగరానికే తలమానికమైన కట్టమంచి చెరువును కుళ్లబొచేశారు. పూడిక తీత పేరుతో నాలుగు నెలలపాటు ఇష్టారాజ్యంగా తవ్వేశారు. వందల ట్రిప్పుల మట్టిని ఇష్టారాజ్యంగా విక్రయించి జేబులు నింపుకున్నారు. అధికార మదంతో ఏ ఒక్కర్నీ అటువైపు రానీయకుండా అడ్డుకట్ట వేశారు. తీరా స్థానికులు ఆర్టీఐకి విన్నవించడంతో టీడీపీ నాయకుల బాగోతం బయటపడింది. అసలు ఇరిగేషన్ అనుమతులే లేవని.. నిబంధనలు అస్సలే పాటించలేదని సంబంధిత అధికారులు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఔరా..! అంటూ పలువురు కూటమి నేతల తీరును ఎండగడుతున్నారు. కట్టమంచి చెరువులో అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్న దృశ్యం (ఫైల్). సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఎంతో చరిత్ర కలిగిన కట్టమంచి చెరువును టీడీపీ నాయకులు గుల్లచేశారు. అధికారుల అనుమతులతో పూడికతీత పనులు చేపడుతున్నామంటూ యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పూనుకున్నారు. భారీ ప్రొక్లైనర్లు, జేసీబీలు పెట్టి కొన్ని నెలలపాటు కట్టమంచి చెరువులోని మట్టిని తవ్వి తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అలాగే టీడీపీ ప్రజాప్రతినిధి, ఓ కార్పొరేటర్ వేసిన వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలించారు. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకుండా జాగ్రత్తపడ్డారు. అధికారులు, స్థానికులు కొందరిని లంచాలతో మేనేజ్ చేసి తమ పనికానిచ్చేశారు. ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్నారా? కట్టమంచి చెరువులో కొన్ని నెలలపాటు జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. చిత్తూరు నడిబొడ్డున ఉన్న చెరువులో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతుంటే అధికారులకు చీమకుట్టినట్టూ లేదు. కళ్లెదుటే మట్టి తరలిపోతున్నా పట్టించుకోలేదు. ఇటీవల వరుసగా ‘సాక్షి’లో కథనాలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. అంటే అధికార పార్టీకి అమ్ముడుపోయారా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లేదా లంచాల మత్తులో కళ్లుమూసుకుని కూర్చున్నారా..? అని నిలదీస్తున్నారు. ఇప్పుడు సాఫీగా మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడంపై రగిలిపోతున్నారు. అత్యవసరమయ్యి.. ఎవరైనా ఒక లోడ్డు మట్టి ఎత్తితే ఆగమేఘాల మీదొచ్చి అరెస్టులు చేయించే అధికారులు నెలల తరబడి కళ్లెదుటే మట్టి తరలుతున్నా ఎందుకు పట్టించుకోలేదని గళం ఇప్పుతున్నారు. మరి వీటికి సమాధానం ఎవరు చెబుతారో వేచి చూడాలి మరి..! కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన లిఖిత పూర్వకమైన సమాధానం కట్టమంచి చెరువులో మట్టితవ్వకాలకు సంబంధించి చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టారు. అందులో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఇరిగేషన్శాఖ చిత్తూరు సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జయచంద్రబాబు లిఖిత పూర్వకంగా కొన్ని విషయాలు వెల్లడించారు. అందులో కొన్ని..! కట్టమంచి చెరువు పై గత ఐదేళ్లుగా తమ శాఖ తరఫున ఎలాంటి తనిఖీల నివేదికలు లేవు. గత రెండేళ్లుగా కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్ట లేదు. కట్టమంచి చెరువుకు సంబంధించి ఇరిగేషన్శాఖ తరఫున మట్టి తవ్వకాలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఆక్రమణలను తొలగించే అధికారం రెవెన్యూ శాఖకు మాత్రమే ఉంది. కట్టమంచి చెరువులో గత రెండేళ్లుగా ఎలాంటి ఆదాయం రాలేదు. నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ ఎవ్వరికీ ఎలాంటి అనుమతులు, ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలపై ఎలాంటి ఫిర్యాదులు అంద లేదు. -
అది న్యాయవ్యవస్థపై దాడి
● సీజేఐపై దాడికి యత్నం దుర్మార్గం ● దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ● ఎంపీ గురుమూర్తి తిరుపతి కల్చరల్: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడికి యత్నించడాన్ని భారత న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా చూడాలని ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఒక ప్రక టనలో తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తు న్నాని పేర్కొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిందని, న్యాయం, రాజ్యాంగ విలువలను గౌరవించే ప్రతి భారతీయుడి మనస్సాక్షిని కదిలించిందని అన్నారు. భారత న్యాయవ్యవస్థ మన రాజ్యాంగాన్ని ప్రజలకు హక్కులను కాపాడాడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ క్లిష్ట సమయంలో తాను ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయితో పాటు మొత్తం న్యాయవ్యవస్థకు మద్దతు ప్రకటిస్తున్నాని తెలిపారు. బీఆర్ గవాయి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటూ న్యాయస్ఫూర్తిని నిలబెట్టేందుకు దేవుడు ఆయనకు మరింత శక్తి, ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. -
చంద్రబాబుకు దశితులంటే చిన్నచూపు
తిరుపతి మంగళం : ‘చంద్రబాబుకు దళితుంటే చిన్నచూపు, అందుకే దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని వ్యాఖ్యానించారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టినా పట్టించుకోరు.. దళితులపై దాడులు జరిగినా స్పందించరు’’ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంల దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహ దహనంపై కక్షపూరిత రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. విగ్రహం కాల్చిన దుండగులను వదిలేసి, ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం రెడ్బుక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ విషయంలో చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ అది స్వల్ప విషయమంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలీసులు కేవలం పచ్చనేతల మెప్పుకోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ బుక్లో దళితులకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేస్తామని, చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన నారాయణస్వామిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని అనేక కుట్రలు చేశారన్నారు. ఇప్పుడు దేవళంపేటలో సర్పంచ్ గోవిందయ్యపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత సతీష్నాయుడే అంబేడ్కర్ విగ్రహాన్ని తగులబెట్టించాడని తెలిసినా పచ్చనేతల మెప్పు కోసం చిత్తూరు ఎస్పీ కుట్రపూరితంగా గోవిందయ్యపై కేసులు పెట్టారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టనీయకుండా టీడీపీ నేత సతీష్నాయుడు అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే థామస్ ఏనాడైనా దళితుల కోసం పోరాటాలు చేశారా? ఎక్కడైనా ఒక్క అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు కోసం దళితుడని అని చెప్పుకునే థామస్ తిరుమలకు వెళ్లినప్పుడు క్రిస్టియన్గా డిక్లరేషన్ ఇవ్వడంలోనే నిజ స్వరూపం తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తాను రూ. వేల కోట్లు అవినీతి చేశానంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులను చంద్రబాబు, పవన్కల్యాణ్ అంటరానివారిగానే చూస్తున్నారన్నారు. ఈ మేరకు దళితులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, నల్లాని బాబు, రామయ్య, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, ఎస్పీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి పాల్గొన్నారు. -
కలెక్టర్కు అభినందన
చంద్రగిరి: స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు విజయవంతం చేసినందుకు మంగళవారం నారావారిపలెల్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా కలెక్టర్ వెంకటేశ్వర్ స్కోచ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.నేడు పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటన దొరవారిసత్రం : మండలంలోని పాళెంపాడు గ్రామంలో బుధవారం రాష్ట్ర బృందం పర్యటించనుంది. సాక్షి పత్రికలో ‘ప్రాణాపాయంలో పాళెంపాడు’ అనే శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మంగళవారం ఈ మేరకు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటించనున్నట్లు వెల్లడించారు. కిడ్నీ వ్యాధి బారిన ప్రజలు ఎందుకు పడుతున్నారో క్షేత్రస్థాయిలో కారణాలను పరిశీలించనున్నట్లు వివరించారు.నవోదయలో ప్రవేశ దరఖాస్తుకు గడువు పెంపుతిరుపతి సిటీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో పాటు ఇతర వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్స్టిట్యూ ట్, లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.ఎస్వీయూలో 10న జాబ్ మేళాతిరుపతి సిటీ : ఎస్వీయూలోని ఎంప్లాయిమెంట్ ఆఫీస్లో ఈనెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పలు కంపెనీలు ఇంటర్వ్యూలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఉపాధిలో అవినీతిపై పునర్విచారణకలువాయి(సైదాపురం) : కలువాయి మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతిపై పునర్విచారణకు ఆదేశిస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్హుశుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. ఉపాధి పనుల్లో అవినీతిపై ఇటీవల చిన్నగోపవరం పంచాయతీలో చీఫ్ విజిలెన్స్ అధికారి సమగ్ర విచారణ చేశారు. 8 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే డ్వామా అధికారులు మాత్రం ఆరుగురు సిబ్బందిపై కేసులు పెట్టి ఇద్దరు ఏపీఓలను తప్పించారు. ఈ వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు కొప్పాల రఘు నేరుగా నేషనల్ ఎస్సీ కమిషనకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన అవినీతిపై పునర్విచారణ చేపట్టాలని ఎస్సీ కమిషనర్ ఆదేశించారు. దీంతో కలెక్టర్ సైతం పూర్తిస్థాయిలో పునర్విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డ్వామా అధికారులు, ఉపాధి సిబ్బందిలో గుబులు మొదలైంది.