breaking news
Tirupati
-
తల్లికి వందనం నగదు తీసుకున్నాడని..
అన్నమయ్య: తల్లికి వందనం నగదు కోసం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, భర్త తాగే మద్యంలో భార్య విషం కలిపి చంపేసిన ఘటన అన్నమయ్య జిల్లా కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డిగానిపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వంకొల్ల చంద్రశేఖర్(46), రమాదేవి దంపతులు. ఇటీవల తల్లికి వందనం నగదు రమాదేవి ఖాతాలో జమయింది. ఈ నగదును చంద్రశేఖర్ తీసుకోవడంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ నెల 2న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్, భార్యను తాను తెచ్చుకున్న మద్యాన్ని గ్లాసులో పోసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమాదేవి, మద్యం గ్లాసులో విషం కలిపి ఇచ్చింది. అనంతరం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన రమాదేవి భర్త గొంతుపట్టుకుని నొక్కడంతో ఆమె చేతిగోళ్లు గుచ్చుకుని, చంద్రశేఖర్ గొంతుకు గాయమైంది. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తమ్ముడు మహేష్.. వదినపై అనుమానంతో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రమాదేవి తన భర్తను హత్య చేసినట్లు తేలింది. -
తిరుపతి నగరంలో సైకో వీరంగం
తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్ఐ లోకేశ్ వివరాల మేరకు..తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై విరుచుకుపడ్డాడు. శేఖర్ (55) అనే యాచకుడిపై, కపిల తీర్థం సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వలలో బంధించి.. ఘటనకు మూలకారకుడైన సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు.రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట అతను కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వలవిసిరి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద ఓ కత్తి కూడా ఉంది. అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. View this post on Instagram A post shared by colours of Tirupati ™ (@coloursoftirupati) -
రాయితీ రుణాలకు ఎదురుచూపులు
● నాలుగు నెలలు దాటినా జాడ లేని రుణాలు ● తమ వారికే రుణాలు అందేలా కూటమి ఆదేశాలు ● సిబిల్ స్కోర్ లేదని తిరస్కరించిన బ్యాంకులు ● జిల్లాలో స్వయం ఉపాధి రుణాల ఊసే లేదు చిల్లకూరు: తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు ఉద్యోగాలు చూపక, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వక, కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు మంజూరు చేయక యువతకు మొండి చేయి చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోండి నెల రోజుల్లో రాయితీ రుణాలు అందిస్తామంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే ప్రతి పంచాయతీ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో మండల స్థాయి అధికారులు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేయాలని కూటమి నాయకులు ఆదేశాలు జారీ చేశారు. వారిని ఎంపిక చేసి దరఖాస్తులను ఆయా బ్యాంకులకు మండల అధికారులు పంపారు. అయితే బ్యాంకు అధికారులు కూడా తామేం తక్కువ కాదని పంపిన దరఖాస్తు దారుల సిబిల్ స్కోర్ లేదని ఆ దరఖాస్తులను తిరిగి పంపేశారు. దీంతో తమ వారికి రాయితీ రుణాలు ఇప్పించే పరిస్థితి కనిపించక పోవడంతో రుణాల మంజూరుకు అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. నాలుగు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే అర్హులైన వారు ఎంతో మంది ఉన్నప్పటికి తమకు అనుకూలంగా వ్యవహరించే వారికే రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపించారు. అయితే బ్యాంకు అధికారులు సిబిల్ స్కోర్ లేని వారు రాయితీ రుణాలకు అనర్హులంటూ ఆ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో తమకు అనుకూలమైన వారు అనర్హులు కావడంతో మరొకరికి ఆ రుణాలు ఇవ్వకూడదంటూ అధికారులపై ఒత్తిడి తేవడంతో వారు మిన్నకుండి పోయారు. చివరగా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ రాయితీ రుణాలపై మరోమారు మార్గదర్శకాలు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపి వేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతోనే నాలుగు నెలలవుతున్నా రాయితీ రుణాల ఊసే ఎత్తడం లేదు. –ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండు వర్గాల వారికే రుణాలు ఇస్తుండగా బీసీ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, కాపులకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తిరుపతి జిల్లాలో 1,267 , బీసీ కార్పొరేషన్ ద్వారా 2,082 యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఇప్పటికే బ్యాంకులకు పంపిన జాబితాలో ఎంపికై న వారు బ్యాంకు అధికారులను కలుసుకుని అవసరమైన గ్యారంటీలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే అందరికీ ఒకేసారి రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు మిన్నకుండిపోయారు.కార్పొరేషన్ యూనిట్లు దరఖాస్తులు కేటాయింపులు రాయితీ రుణం ఎస్సీ 1,267 6, 284 రూ 52.89 కోట్లు రూ 20.88 కోట్లు రూ 29.36 కోట్లు బీసీ 2,082 17,487 రూ 50.14 కోట్లు రూ 25.07 కోట్లు రూ 25.07 కోట్లు ఆదేశాలు రావాలి కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. ఇంటర్వ్యూలు నిర్వహించడం పూర్తి చేశాం. అయితే బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సి ఉంది. ఆదేశాలు అందిన వెంటనే ఆయా బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందిస్తాం. – చెన్నయ్య, ఇన్చార్జ్ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ నిరుద్యోగ భృతి ఇవ్వరు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాలు దక్కక పోవడంతో కనీసం వయస్సు మీరేలోగా ప్రభుత్వం ద్వారా ఉపాధి అయినా పొందుతామనుకుని దరఖాస్తులు చేశారు. అలాంటి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వక పోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారు. -
వాటర్ ప్లాంట్పై దాడి
పాకాల : స్థానిక శివశక్తి నగర్లోని హేమాద్రి మినరల్ వాటర్ ప్లాంట్పై దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు యోగిత కథనం మేరకు బ్యాంకు రుణం పొంది శివశక్తి నగర్లో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఇది గిట్టని పక్కింటి వారు రోజూ ఆమెతో గొడవ పడుతున్నారు. ఉదయం వాటర్ప్లాంట్పై రాళ్లతో దాడి చేశారు. ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టారు. కొళాయిలను విరగ్గొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యోగిత స్కూటీపై బయల్దేరింది. దీంతో ఆమెను పక్కను నెట్టేసి, స్కూటర్ని కింద పడేసి ధ్వంసం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల: తిరుమలలో సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణి, బంగారు డాలర్ల విక్రయ కౌంటర్, అగరబత్తి, కొబ్బరికాయలు విక్రయ కౌంటర్లు, పబ్లికేషన్ స్టాళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లడ్డూ కౌంటర్, పబ్లికేషన్ స్టాళ్లు, బంగారు డాలర్ల విక్రయ కేంద్రంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ను ఆయన పరిశీలించారు. కొబ్బరికాయల కౌంటర్ వద్ద డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అర్జీలకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు ఆయనతోపాటు కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 284 అర్జీలు వచ్చాయి. అందులో రెవన్యూ సమస్యలపై 149 అర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ● మదనపల్లిలో బుద్ద భగవాన్ విగ్రహ తలను నరికిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని భారతీయ అంబేడ్కర్ సేన రాష్ట్ర నేతలు పాలకుంట శ్రీనివాసులు, మల్లారపు వాసు డిమాండ్ చేశారు. ఆ మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్కు వినతిపత్రాన్ని అందించారు. ● వెంకటగిరి మండలం బుసపాళెం ఎస్టీకాలనీకి చెందిన పలువురు యానాదులు తమ శ్మశానాన్ని కబ్జా చేశారని, కాపాడాలని మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్లో అధికారులను కలసి వారికి వినతిపత్రాన్ని అందించారు. ఇప్పటికే పలు సార్లు స్థానిక అధికారులకు అర్జీలు ఇచ్చామని, ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్కు వచ్చామని తెలియజేశారు. -
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
నాయుడుపేటటౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్వర్ణముఖి సమీప గ్రామాలైన అయ్యప్పరెడ్డిపాళెం, మూర్తిరెడ్డిపాళెం, కల్లిపేడు, పండ్లూరు, అన్న మేడు, చిగురుపాడు, తిమ్మాజి కండ్రిగ, తుమ్మూరు , మర్లపల్లి, కాలవ గట్టు, వేమగుంటపాళెంలో ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. దీన్ని ఎక్కడికక్కడ అరికట్టలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. స్వర్ణముఖి నది కాజ్వే వద్ద గేట్లు తీసివేడయడంతో ఇసుక రాత్రి పగలు తేడాలేకుండా తరలిపోతోంది. అధికారులకు నెలవారీ ముడుపులు అందుతుండడంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
● త్వరలో పట్టాలపైకి తిరుపతి–చిక్మంగళూరు ఎక్స్ప్రెస్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని ప్రజల సౌకర్యార్థం కొత్తగా వీక్లి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనుంది. ప్రధానంగా బెంగళూరు, చిక్మంగళూరు, తుంకూరు ప్రాంతాల వారికి ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది. తాజాగా కేంద్ర రైల్వేశాఖ తిరుపతి– చిక్మంగళూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు గురువారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది. చిక్ మంగళూరు నుంచి శుక్రవారం బయలుదేరి తిరుపతి చేరుకుంటుంది. అధికారికంగా ఈ రైలు నెంబర్లు 17423–17424గా నిర్ణయించారు. రైలు ప్రారంభం, షెడ్యూల్, టైమింగ్స్ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు రైల్వేశాఖ అధికార వర్గాల సమాచారం. ఈ రైలు మొదటి విడతగా వారానికోసారి నడుపనుంది. తరువాత ప్రజల స్పందన మేరకు వారంలో మూడు సార్లు నడిపే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులకు అనుకూలం ఈ రైలు ప్రయాణించే మార్గంలో ముఖ్యమైన ప్రాంతా లు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, కుప్పం, బంగారుపేట, వైట్ఫీల్డ్, కృష్ణరాజపురం, బెంగళూరు ఎస్ఎంవీబీ, తుంకూరు, తిప్తూరు, అరిసికెరె, బిరూర్, కదూర్, బిసలె హళ్లి, శంకరాయ పట్న స్లేషన్లు ఉంటాయి. ఈ ప్రాంతాల ప్రజలకు ఈ రైలు సౌకర్యవంతంగా మారనుంది. ఈ రైలుకు పాకాల స్టేషన్ స్టాపింగ్ ఇవ్వడం మరో విశేషం. చిత్తూరు, కుప్పం, బంగారుపేట ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
లారీని ఢీకొన్న కారు
పెళ్లకూరు:లారీని కారు ఢీ కొనడంతో దంపతులకు స్వల్ప గాయాలైన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు చైన్నె నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న కారు టెంకాయతోపు గ్రామం ప్లై ఓవర్ మీద ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటన లో కారులో ప్రయాణిస్తున్న అక్కగారిపేటకు చెందిన రవినాయుడు దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ కానిస్టేబుల్ మైఖేల్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. రైలు కింద పడి ఎస్ఐ దుర్మరణం సైదాపురం: రైలు కింద పడి మండలానికి చెందిన ఎస్ఐ దుర్మరణం పాలు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనంతమడుగు గ్రామానికి చెందిన పడ్డాల పోలయ్య సీఐఎస్ఎఫ్ చైన్నె విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలయ్యకు భార్య రమాదేవితో పాటు ఇద్దరు పిల్లలున్నారు. చదువుల నిమిత్తం ఆయన గూడూరులోనే కాపురం ఉంటున్నారు. సీఐఎఫ్ఎస్లో కానిస్టేబుల్గా చేరిన పోలయ్య ఇటీవలనే ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. ఆదివారం డ్యూటీ నిమిత్తం చైన్నెకు చేరుకున్నారు. ఎగ్మూర్ రైల్వేస్టేషన్లో దిగి లోకల్ ట్రైన్లో సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడ రైలు దిగే సమయంలో రైలు కింద పడి దుర్మరణం చెందారు. దీంతో అక్కడే కేసును నమోదు చేసి సోమవారం సాయంత్రం చైన్నెకు చెందిన సీఐఎస్ఎఫ్ అధికారులు పోలయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్
తిరుమల: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ చైర్మన్ లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అంతకు ముందు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో సైకో వీరంగం ● కర్రతో ముగ్గురిపై దాడి ● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్ఐ లోకేశ్ వివరాల మేరకు.. కపిలతీర్థం రోడ్డులో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై దాడి చేశారు. అక్కడున్న యాచకుడు శేఖర్ (55), వాహనాల పార్కింగ్లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వల వేసి.. బంధించి అంతటితో ఆగని సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు. రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వల వేసి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద కత్తి కూడా ఉందని, అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
స్కూల్ నుంచి పారిపోయిన పిల్లలు
రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ముగ్గురు పిల్లలు తిరుగుతుండగా వారిని రేణిగుంట పోలీసులు వారు విచారించి వారిని మాతృశ్రీ చైల్డ్ హోమ్కు అప్పగించారు. తిరుపతి బైరాగి పట్టెడలో ఉన్న మాతృశ్రీ చైల్డ్ హోమ్లో ఉంటూ ప్రయివేటు స్కూల్లో చదువుతున్న లంకేష్ (9), సహదేవ (11), ముఖేష్ (12) ఇంగ్లీష్ మీడియం చదవడం కష్టంగా ఉందంటూ పాఠశాల నుంచి పారిపోయారు. వారిని పోలీసులు సోమవారం పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి విచారించారు. అనంతరం మాతృశ్రీ చైల్డ్ హోమ్ వారిని పిలిపించి వారికి అప్పగించారు. -
శ్రీకాళహస్తి పెద్దాస్పత్రిలో రక్తపాతం
సాక్షి టాస్క్ ఫోర్స్: అర్ధరాత్రి వేళ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వర్గానికి చెందిన వారిపై, మరో వర్గం యువకులు దాడి చేయడంతో క్యాజువాలిటీ విభాగం రక్తంతో తడిచింది. ఏం జరుగుతోందో అర్థం కాక వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భయానక ఘటన ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఏరియా ఆసుపత్రి సీసీ కెమెరాలో నమోదైన దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని మంచినీళ్లగుంట, వీఎం పల్లికి చెందిన యువకుల మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. అగ్నిగుండ ప్రవేశం ముగిసిన అనంతరం అర్ధరాత్రి వేళ, తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో మంచినీళ్ళగుంట, వీఎంపల్లికి చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మంచినీళ్లగుంటకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంత మందిని వెంట తీసుకొచ్చిన వీఎం పల్లి యువకులు ఏరియా ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలోకి చొరబడి చికిత్స పొందుతున్న యువకులు, వారి బంధువులపై కర్రలు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంచినీళ్ల గుంటకు చెందిన వారు కూడా తిరగబడి రాళ్లు రువ్వడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమయంలో వీఎంపల్లికి చెందిన యువకుల ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నంలో ఉండగా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే దాడులకు పాల్పడింది టీడీపీకి చెందిన యువకులు కావడంతో ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ స్పందించడం లేదు. ఏం జరిగింది అనేది చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల దాడులు ఐదుగురికి తీవ్ర గాయాలు భయభ్రాంతులకు గురైన సిబ్బంది ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ ప్రకటన శాంతిభద్రతల వైఫల్యం ఆస్పత్రిలో రెండు వర్గాలు దాడులు చేసుకుంటుంటే ఆ సమయంలో పోలీసు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసినా స్పందన లేదని ఆసుపత్రి ఉద్యోగి ఒకరు చెప్పారు. రెండు దశాబ్దాల్లో ఈ తరహా ఘటనలు ఎన్నడూ చూడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య దాడి జరిగితే, ఈ సంఘటన ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ నరసింహమూర్తి ప్రకటించడం గమనార్హం. వారి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ వివరించారు. -
విద్యా ప్రదాత వైఎస్సార్
తిరుపతి సిటీ: ప్రతి పేదవాడి ఇంటిలో డాక్టర్, ఇంజినీర్ ఉండాలని కలలు కన్న పేదల పక్షపాతి వైఎస్సార్. బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సకాలంలో అందించి ప్రోత్సహించారు. దీంతో పేదింటి పిల్లలు కూడా ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి రైతు బాంధవుడిగా తెలుగు ప్రజల గుండెలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ వర్సిటీలను వైఎస్సార్ మానసపుత్రికలుగా నేటికీ ప్రజలు కొనియాడుతున్నారంటే ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పవచ్చు.నేడు వైఎస్సార్ జయంతిదివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిలేని లోటు రైతులకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన చలవతో పశువైద్య విద్యను అభ్యసించిన పేద విద్యార్థులు సైతం నేడు ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారు. నేడు వారంతా వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ 76వ జయంతిని ఘనంగా జరపుకోనున్నారు.మా ఆరాధ్య దైవంరెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో హోటళ్లలో భార్యాభర్తలు పనిచేస్తుండేవాళ్లం. వైఎస్సార్ హయాంలో మా అమ్మాయికి ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభించింది. ఆ తరువాత లండన్లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడింది. మేము ఆర్థికంగా బలపడ్డాం. మాకు వైఎస్సార్ ఆరాధ్యదైవం. మేము బతికున్నంత కాలం ఆయన సేవలను మరచిపోలేం. – సరస్వతి, గృహిణి, తిరుపతి రూరల్ఆయన పేదల పక్షపాతిపేదల పక్షపాతిగా, రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్సార్ మా గుండెల్లో నిలిచిపోయారు. ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీతో జిల్లాలో లక్షలాదిమంది లబ్ధి పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారంటే ఇది వైఎస్సార్ చలువే. విద్యారంగంలో మహిళలకు పెద్ద పీట వేశారు. ఆయన తీసుకొచిచన సంస్కరణలు ఎంతో మంది మహిళలను ఉన్నత స్థానానికి చేర్చాయి. – పద్మావతమ్మ, తిరుపతిఆయనలేని లేటు స్పష్టంగా కనిపిస్తోందిడాక్టర్ వైఎస్సార్ పేదల పక్షపాతిగా ప్రజలు ఇప్పటికీ కొనియాడుతున్నారు. ఆయన విద్యా రంగంలో చేసిన సంస్కరణలతో ఎంతో మంది పేదల పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశ, విదేశాలలో రాణిస్తున్నారు. తిరుపతి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా రూపొందించడంలో ఆయన కృషి ఎనలేనిది. ఆయన లేనిలోటు ప్రస్తుతం తెలుగు ప్రజలకు స్పష్టంగా కనబడుతోంది.– రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతివైఎస్సార్ మా ఇంటిదేవుడుమాలాంటి పేదలు అందుకోలేని వైద్య విద్యను మాకు దగ్గర చేశారు. వైఎస్సార్ చేపట్టిన సంస్కరణలతో నాకు ఎంబీబీఎస్ లో సీటు వచ్చింది. తల్లి దండ్రులు కూలికి వెళ్లితేగాని కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితి నుంచి అమెరికాలో పేరొందిన ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇదంతా డాక్ట ర్ వైఎస్సార్ చలవే. ఆయన్ను మా ఇంటిదేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నాం. – డాక్టర్ కేశవులు, తిరుపతి -
వందశాతం హాజరు
తిరుపతి అర్బన్: పాఠశాలలు పునఃప్రారంభం నుంచి అంటే జూన్ 12 నుంచి జూలై 7 వరకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జిల్లాలోని విద్యార్థులు వందశాతం హాజరు సాధించడంతో తిరుపతి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. దీంతో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్తోపాటు పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్తోపాటు తిరుపతి జిల్లా విద్యాశాఖను సోమవారం అభినందించారని డీఈవో ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్ ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్వీయూ లా కళాశాల భవనంలోనూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్లను ప్రారంభించారు. విద్యార్థులు ఈ నెల 16వరకు రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13 నుంచి 18వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 19వ తేదీ ఆప్షన్స్ మార్పులకు అవకాశం ఇస్తూ ఈనెల 22న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మామిడి రైతులకు అండగా ఉంటాంతిరుపతి అర్బన్: మామిడి రైతులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 76,700 మంది రైతులు 80వేల హెక్టార్లలో తోతాపురి మామిడి పంట సాగు చేశారని చెప్పారు. అందులో తిరుపతి జిల్లాలో 14,582 హెక్టార్లలో సాగుచేస్తే 1.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. జిల్లాలో 8 గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్లు, 39 ర్యాంప్లు, 3 మండీలు ఉన్నాయని వివరించారు. 8 యూనిట్ల సామర్థ్యం 1.21 లక్షల మెట్రిక్ టన్నులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో టన్ను రూ.12కి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఫ్యాక్టరీ వారు రూ.8కి కొనుగోలు చేస్తే, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని చెప్పారు. అందరికీ న్యాయం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,938 మంది స్వామివారిని దర్శించుకోగా 28,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమల భక్తులకు శుభవార్త..
తిరుమల: అన్నప్రసాద కేంద్రాల్లో ఇకపై రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలు వడ్డించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదివారం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి, అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పూజ నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులకు వడ్డించారు. ఆదివారం నుంచి రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.రెండ్రోజులు గరుడ సేవజూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది. శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది.గోవిందరాజస్వామి వారికి జ్యేష్టాభిషేకంగోవిందరాజస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు తలపెట్టిన జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఆదివారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాడ మాసంలో శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కోలిపి కైంకర్యాలు, శతకలశ స్నపన తిరుమంజనం, మహా శాంతి హోమం చేపట్టారు.అనంతరం ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అక్కడ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారం కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై కొలువై ఆలయ మాడవీధుల్లో విహరించారు. చదవండి: సత్యదేవుని దేవేరికి 174 వజ్రాలతో హారం -
అసలు సిసలైన నాయకుడు జగనే
● హామీలిచ్చి విస్మరించిన చంద్రబాబు ఎప్పటికీ మోసగాడే ● ఇది ప్రజలకు చెప్పడానికే రీకాలింగ్ మేనిఫెస్టో ఉద్దేశం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన, మాజీ మంత్రి రోజా నగరి : అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అసలు సిసలైన ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. నగరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. భూమన మాట్లాడుతూ మోసపూరిత మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టించారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేరిస్తే అంతకన్నా ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పింఛన్ తప్ప ఏమీ అందిచలేదన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి 30 లక్షల మందికి కోతలు పెట్టి తల్లికి వందనం అమలుచేశారని దుయ్యబట్టారు. 3 అంకణాలకు మించి ఉన్నా, రూ.300 విద్యుత్ బిల్లు ఉన్నా రూ.8,020 మాత్రమే వేశారని చమత్కరించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంతకాలు చేసిన బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. గెలిచాక ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఏ హామీలు ఇచ్చారు ఏవి అమలు చేయలేదు అని క్షేత్రస్థాయి వరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమ ఉద్దేశమన్నారు. జగనన్న చేసిన మంచిని చంద్రబాబు చేసిన మోసం ప్రజలకు తెలియజెప్పడం ప్రతి కార్యకర్త బాధ్యతన్నారు. సనాతన యోధుడు ఏమయ్యాడు తిరుమలలో దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, శ్రీ కూర్మంలో తాబేళ్లు చనిపోతున్నాయని వీటిపై సనాతన యోధుడు పిఠాపురం పీఠాధిపతి పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆయన తమిళనాడుకెళితే తాను అక్కడే పుట్టానంటాడు.. గుంటూరుకు వెళితే అక్కడా పుట్టానంటాడు.. పిఠాపురం వెళితే అక్కడే పుట్టానంటున్నాడు.. అసలు ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అందరూ వీకెండ్కు వెకేషన్కు వెళితే, పవన్ వీకెండ్కు మాత్రమే రాష్ట్రానికి వస్తారన్నారు. ఎవరు రాష్ట్రానికి మంచిచేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, విజయలక్ష్మి, దీప, వైస్చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పవన్ తిక్కకు బాబు లెక్కలు పవన్ తిక్కకు చంద్రబాబు వద్దే లెక్కుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ హామీలు నెరవేర్చేశానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎంతమంది ఉంటే అంత మందికి జగన్ చేసిన సంక్షేమం కన్నా ఎక్కువ చేస్తాం అంటూ ఎన్నికల బీరాలు పలికిన బాబు నేడు దీన స్వరంతో పథకాలు తలచుకుంటే భయమేస్తోందంటున్నారని ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని పేర్కొన్నారు. ఆయనకు అబద్ధాలు చెప్పే కళ ఉందని, నిజం చెబితే తల పగిలే శాపం కూడా ఉందేమో అన్నారు. అందుకే ఆయన అబద్ధాలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఆయన చంకలో కూర్చున్న పవన్ తానే టీడీపీని అధికారంలోకి తెచ్చానంటుంటే, తాము లేకుంటే పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవరని టీడీపీ చెబుతోందని, ఇలాంటి నాయకులందరూ కూటమిగా కొనసాగుతుండడం దౌర్భాగమ్యమన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే వారికి కఠినంగా శిక్షించే చట్టాలు తెస్తానన్నారు. ఇంత మంది ఆడపిల్లలు అఘాయిత్యాలకు బలవుతున్నా నోరుమెదపడం లేదేమిటని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు చూపే గ్రాఫిక్స్ తప్ప మిగతా విషయాలు ఏవీ కనబడవన్నారు. -
అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి చర్యలు
రాపూరు : అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేట్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్కుమార్ నాయక్ వివరించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాపూరు వెలుగొండ అడవుల్లోన్ని కూటలమర్ని పోయే ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి ఆదివారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల్లో నిత్యం అటవీశాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. మూడు జిల్లా సరిహద్దు ప్రాంతంలో సహజ సిద్ధంగా ఎర్రచందనం ఉందని వాటిని రక్షించాలని సూచించారు.అలాగే పెనుశిల అభయార్యణంలో అనేక రకాలైన వన్యప్రాణులు జీవిస్తున్నాయన్నారు. వన్యప్రాణులకు రక్షణ కల్పించాలన్నారు. ముఖ్యంగా మంచినీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఎర్ర చందనం అంధ్రప్రదేశ్లో మాత్రమే ఉందని దానిని కాపాడుకోవాల్సి బాధ్యత ఉందన్నారు. అటవీ సిబ్బంది పరస్పర సహకారంతో అడవుల్లో తిరగాలన్నారు. అడవి లోపలకు వెళ్లకపోతే విషయాలు తెలియవని అధికారులు తిరుగుతుంటే బయట వ్యక్తులు అడవిలోకి రాలేరన్నారు. ఆయన వెంట నెల్లూరు డీఎఫ్ఓ మహబూబ్బాషా, రేంజర్ రవీంద్రబాబు , నెల్లూరు, అన్నమయ్య జిల్లా అటవీశాఖ అధికారులు ఉన్నారు. -
అనుమతి గోరంత.. తవ్వేది కొండంత
చిట్టమూరు : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మట్టి, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. చిట్టమూరు మండలం యాకసిరి పంచాయతీలో సాగరమాల పేరుతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వి తరలించి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. 20 సెంట్ల ప్రభుత్వ భూమిలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతి గనుల శాఖ నుంచి కాకుండా స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద తీసుకుని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రంలో ఎంత మేర తవ్వకాలు చేపట్టాలనే విషయాన్ని నమోదు చేయకుండా అనుమతి ఇవ్వడం చూస్తుంటే ఈ అక్రమ బాగోతం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు. లేఅవుట్లకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ.. యాకసిరి గ్రామ సర్వే నంబర్ 425లో 20 సెంట్లలో సాగరమాల రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అయితే పెత్తనం కూటమి నాయకులదే కావడంతో వారు అనుమతి లేని మరో 3 ఎకరాలలో గ్రావెల్ తవ్వకాలు చేపట్టి నాయుడుపేట, కోట, చిల్లకూరు ప్రాంతాలలో వేస్తున్న లే అవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలుమార్లు అధికారులకు అక్రమ తవ్వకాలపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ భారీ స్థాయిలో ముడుపులు ముట్టడంతో కనీసం అటు వైపుగా అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు సైన్యం పహారా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టే ప్రాంతంలో యువకులు ఒక ప్రైవేటు సైన్యంలా ఉంటూ పహారా కాస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలు భారీగా చేపడుతున్నారని గ్రామస్తులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకునే సరికే ప్రవేటు సైన్యంలా వ్యవహరించే సుమారు 15 మంది యువకులు క్రికెట్ బ్యాట్లు, స్టంప్లతో అక్కడికి చేరుకుని ఈ ప్రాంతంలోకి ఎవ్వరూ రాకూడదని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సాగరమాల పేరుతో గ్రావెల్ తరలింపు పట్టించుకోని అధికారులు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ భూమిలో ఎంత మేర తవ్వకాలు చేపడుతున్నారు. వారికి ఎంత అవసరం ఉంది అనే విషయాలను ఒక్కసారైనా పరిశీలించాల్సిన అధికారులు అనుమతి ఇచ్చాం, మీకు ఎంత వీలుంటే అంత తవ్వుకోపోండని అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి రోజు రెండు హిటాచీలు, పది టిప్పర్లు నిరంతరాయంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు తవ్వకాలపై పర్యవేక్షణ ఉంచి అనుమతికి మించి తవ్వకాలు చేయకుండా అధికారులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. -
● ప్రశ్నార్థకంగా కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ● ఉద్యోగ భద్రత కరువు..బతుకు భారం ● ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు అందని రెన్యూవల్ ఉత్తర్వులు ● తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ● మూడు నెలలుగా అందని వేతనాలు ● దయనీ
తిరుపతి సిటీ : ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల భద్రత కరువై బతుకు భారంగా మారింది. కళాశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు తప్ప మిగిలిన డిగ్రీ, టీటీడీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ రెన్యూవల్ ఆర్డర్స్ ఇచ్చిన పాపాన పోలేదు. 2025–26 అకడమిక్ ఇయర్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో అధ్యాపకులు మే నుంచి జులై వరకు మూడు నెలల జీతాలకు నోచుకోలేదు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో 2002 నుంచి పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 800 మందికి పైగా అధ్యాపకులు ఉద్యోగ భద్రత కరువై చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వం పర్మినెంట్కు ఆదేశాలిచ్చినా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు 2024లో జీఓ 114 విడుదల చేసి ప్రక్రియ శర వేగంగా కొనసాగుతున్న తరుణంలో సాధారణ ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పక్కన పెట్టి డిగ్రీ అధ్యాపకుల నియామకాల కోసం ఏపీపీఎస్సీ ద్వారా నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అయోమయంలో పడింది. రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికై న అధ్యాపకులతో తాత్కాలిక అధ్యాపకుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. కొంత మంది అధ్యాపకులు గత 22 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ రెగ్యులర్ చెయ్యకపోవడం కనీసం టైం స్కేల్ కూడా ఇవ్వకపోవడం దారుణం.రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వంజిల్లాలో ప్రభుత్వ, టీటీడీ కళాశాలలో 22 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతకు నోచుకోలేక సతమతమతం అవుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 75 మంది తాత్కాలిక అధ్యాపకులు రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అటు పర్మినెంట్ చేయకపోగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించకపోవడంతో వారికి ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా 12 నెలల పాటు అధ్యాపకుల చేత సేవ చేయించుకుని కేవలం 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికి తోడు వేతనాలు సరైన సమయానికి అందించకుండా మూడు, నాలుగు నెలలకు ఒకసారి అందిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రక్రియ పూర్తయే వరకు నూతన రిక్రూట్మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలి. ప్రస్తుతం 2025–26 సంత్సరానికి సంబంధించి తాత్కాలిక అధ్యాపకులను కొనసాగిస్తూ ఉత్తర్వులు తక్షణం జారీ చేయాలి. దీంతో పాటు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్న సబ్జెక్ట్లకు వదిలేసి ఖాళీగా ఉన్న సబ్జెక్ట్లకు మాత్రమే నూతన రిక్రూట్మెంట్ ద్వారా అధ్యాపకుల ఎంపిక చేయాలి. – డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులు, తిరుపతి జిల్లా ఏటా నాలుగు నెలల నిరీక్షణ గతంలో డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులకు అకడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి రెన్యూవల్ ఆర్డర్స్ వచ్చేవి. గత ఏడాది నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ కళాశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి కాకుండా మూడు నెలలు ఆలస్యంగా కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం నాలుగు నెలలు జీతభత్యాలు ఆలస్యమవడంతో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్నారు. -
● అగ్నిగుండం .. పాపహరణం
అగ్నిగుండం మహోత్సవానికి తరలివచ్చిన భక్తజనంకణకణ మండుతున్న నిప్పు కణికలు , భక్తి పారవశ్యంతో ఆదివారం కంకణదారులైన భక్తులు నిప్పుల గుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ధర్మరాజులస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో చివరిగా అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి సింహ వాహనంపై అధిష్టించారు. అగ్ని గుండంలో నిప్పులను తీసుకుని మల్లెపూలలో పెట్టి అమ్మవారి ఒడిలో పోసి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆలయ అనువంశిక పూజారులు అగ్నిగుండ ప్రవేశం అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో నిప్పుల గుండం తొక్కారు. పోలీసులు, ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. – శ్రీకాళహస్తి అగ్నిగుండం ప్రవేశం చేస్తున్న భక్తులు -
అస్తవ్యస్తంగా సచివాలయాలు
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో సచివాలయాలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జోరుగా చర్చసాగుతుంది. అందులో భాగంగా జిల్లాలో చూస్తే 691 సచివాలయాల్లో 5625 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే....వాటిని 353 సచివాలయాలుగా కుదింపు చేశారు. దీంతో ఉద్యోగుల మిగులు తప్పలేదు. తాజాగా నిర్వహించిన బదిలీల్లో 1975 మంది ఉద్యోగులకు పోస్టింగ్లు లేవంటూ రిజర్వులో పెట్టేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్పష్టతలేని బదిలీలు బదిలీల్లో స్పష్టత లేకుండా పోయింది....ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో పనిచేస్తున్న 60 శాతం ఉద్యోగులకు చిత్తూరులో, 30 శాతం ఉద్యోగులకు నెల్లూరులోను, 10శాతం ఉద్యోగులకు తిరుపతి కలెక్టరేట్లోను బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కార్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా బదిలీలు నిర్వహించాలని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. దీంతో జూన్ 30తో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ...బదిలీల్లో పారదర్శకత కొరవడడంతో పలువురు ఉద్యోగులు నాయ్యం కోసం రోడ్డెక్కారు. మరికొందరు కోర్టుమెట్లు ఎక్కడానికి సిద్ధం అవుతున్న క్రమంలో వాటిని సరిచేయాలనే ఉద్దేశంతో జులై 5 వరకు కౌన్సెలింగ్ గడువు పెంచారు. మేజర్గా జరిగిన తప్పులను సవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కౌన్సెలింగ్ పూర్తి అయినప్పటికీ బదిలీల జాబితాను మాత్రం గోప్యంగా ఉంచారు. వెల్లడించడానికి మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని చర్చ సాగుతోంది. కుంటుపడుతున్న పాలన రేషన్కార్డుల సవరణ కేంద్రాల్లో ఇక్కట్లు సచివాలయాలు 691 నుంచి 353కు కుదింపు స్తంభించిన పాలన జిల్లాలో సచివాలయ పాలన నెల రోజులుగా స్తంభించిపోయింది. సచివాలయంలో అందిస్తున్న పలు సేవలు కుంటుపడ్డాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా రేషన్ కార్డుల సవరణ కోసం ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 8 సచివాలయాల్లో చేసుకోవడానికి వీలుగా నెల రోజుల క్రితం కేంద్రాలను కేటాయింపు చేశారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 55 వేల దరఖాస్తులను అందుకున్నారు. ప్రధానంగా చిరునామా మార్పుల కోసం 2490, ఆధార్ సవరణ 660, కార్డులో సభ్యుల చేరిక కోసం 39,050, సభ్యుల తొలగింపునకు 1360, కొత్త కార్డుల కోసం 7262, కార్డుల విభజన కోసం 4581, ప్రభుత్వానికి సరెండర్ చేసిన కార్డులు 34 ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే ఈ కేంద్రాలు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నేపథ్యంలో వేగవంతంగా ముందుకు సాగడం లేదని పలువురు వాపోతున్నారు. బదిలీలు పూర్తి చేస్తే...కొత్త ఉద్యోగులైన వచ్చి వారి పనులు వారు చేసుకుంటారని అంతా చర్చించుకుంటున్నారు. -
జిల్లా సమాచారం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 18 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 78 టీటీడీ డిగ్రీ కళాశాలలు 5 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 132 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 66 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 521 టీటీడీ జూనియర్ కళాశాలలు 3 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 52 డిగ్రీ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్న తాత్కాలిక అధ్యాపకులు 75 జూనియర్ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్నవారు 37 -
సార్వత్రిక సమ్మెకు టీటీడీ ఉద్యోగుల మద్దతు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మికుల ప్రయోజనాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు తమ మద్దతు ఉంటుందని టీటీడీ ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు ప్రకటించారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి లక్షల మంది ఉద్యోగులకు పెన్షన్ లేకుండా చేసి వారి హక్కులను హరింపజేశారన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని 12 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ ఎస్డబ్లుఎఫ్ నాయకులు గోల్కొండ వెంకటేశం, కాటా గుణశేఖర్, పట్నం దయాకర్, నైనార్ పద్మనాభం, వేణుగోపాల్, రవికుమార్ , ఆదిలక్ష్మి, మునికిరణ్ కుమార్, ధనంజేయులు, శ్రీనివాసులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
యోగ నిద్రలో నరసింహుడు
– పెంచలకోనలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు రాపూరు : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశినాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉప క్రమిస్తారని తెలిపారు. తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్నట్లుగా శ్రీవారి కల్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలు ,ఆభరణాలతో అలంకరించారు. శ్రీవారికి 15 రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు. శేషవాహనం స్వామి అమ్మవార్లు తొలిఏకాదశి సందర్భంగా శేష వాహనంపై లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. -
లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి ..
చంద్రగిరి : లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి–పీలేరు జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. సీఐ సుబ్బరామిరెడ్డి వివరాల మేరకు.. ఆదివారం సాయంత్రం సుమారు 38 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి భాకరాపేట ఘాట్లోని పెద్ద మలుపు లోయలో పడి మృతి చెందినట్లు అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుబ్బరామిరెడ్డి తన సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకుని, లోయలో పడి ఉన్న మృతదేహాన్ని పైకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించగా, ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం లోయలో పడి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడు ఆచూకీ తెలిసిన వారు చంద్రగిరి పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు. -
చోరీపై క్లూస్టీం విచారణ
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలోని ముకాంభిక గుడి వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేందర్ ఇంటిలో ఆదివారం చోరీ జరిగిన ప్రాంతాన్ని క్లూస్ టీంతో పోలీసులు విచారణ చేశారు. దుండగులు బీరువాలో దాచి ఉంచిన 55 సవర్లు బంగారు నగలు చోరీ అయ్యాయి. కాగా బీరువా లోపలి అరలో దాచి ఉంచిన రూ.3 లక్షల నగదును అలానే ఉండడడాన్ని సీఐ బాబి గుర్తించారు. అయితే దుండగులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటిలో చొరబడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుమలలో కార్డన్ సెర్చ్ తిరుపతి క్రైమ్ : తిరుమలలోని పాప వినాశనంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాప వినాశనంలోని 140 షాపులను తనిఖీ చేసి 40 అనధికారికంగా ఉన్న లైసెన్సులను గుర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమరం
కూటమి మోసాలపై చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్దాం ● వంచించడంలో బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి ● ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి ● నాగలాపురం సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి దిశా నిర్దేశం వరదయ్యపాళెం : చంద్రబాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల కేంద్రంలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే అంశంపై నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను ఏడాది పూర్తయినా అమలు చేయకపోగా ప్రజలను మోసం చేసే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ పథకాలను గాలికొదిలేసి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ రాజకీయాలకు కూటమి నాంది పలుకుతోందని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రతి గడపకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఒక్క చక్కటి అవకాశమని , ఆ దశగా ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు నడుం బిగించి ప్రజలకు తెలియజేయడంలో ముందుండాలని భూమన పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకూ దగా సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సంపద సృష్టిస్తా నని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. కూటమి ఏడాది పాలనలో ఎక్కడా లేనంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నారని, దాని ఫలితమే జగనన్న ఎక్కడికి వెళ్లినా జనం జేజేలు కొడుతున్నారన్నారు. ఆ ఆదరణను చూసి ఓర్వలేక జగనన్న పర్యటనలకు కుట్రలు పన్నుతున్నారన్నారు. పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, పార్టీ శ్రేణులతో కలసి ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సెల్ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయించి అందులో చంద్రబాబు మోసాలను ప్రజలకు వారి ఫోన్ల ద్వారానే వివరించాలని సూచించారు. జగన్ 2.0 లో కార్యకర్తలకే ప్రాధాన్యం నాగలాపురంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆ దిశగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అడగులు వేస్తున్నారన్నారు. కూటమి పాలనలో ప్రతి అంశాన్ని జగన్ మోహన్రెడ్డి నిశ్చితంగా పరిశీలిస్తున్నారని, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ అందిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సారథ్యంలో సత్యవేడు గెలుపునకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధవి రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వేలూరు రాకేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, పళ్లికొండేశ్వరాలయ మాజీ చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అపరంజిరాజు (నాగలాపురం), సుశీల్కుమార్ రెడ్డి (సత్యవేడు), నాయుడు దయాకర్ రెడ్డి (వరదయ్యపాళెం), గవర్ల కృష్ణయ్య (కేవీబీపురం), మణి నాయుడు (బీఎన్కండ్రిగ), చలపతిరాజు (పిచ్చాటూరు), సొరకాయలు (నారాయణవనం), మండల రైతు విభాగం అధ్యక్షులు చిన్నదొరై, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.9న వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయండి ఆపదలో ఉన్న మామిడి రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈనెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డ్కు వస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని సత్యవేడు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలో సైతం పెద్దఎత్తున రైతులు మామిడి పంటను సాగు చేశారని, అయితే ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా మామిడి రైతులు నష్టపోయారని, అందుకు కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. -
కలెక్టరేట్లో నేడు గ్రీవెన్స్
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులతో పాటు పలు విభాగాలకు చెందిన జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారులకు తెలియజేయడానికి అవకాశం కల్పించారు. విద్యుత్ సర్వీసులపై ఆకస్మిక తనిఖీలు తిరుపతి రూరల్ : తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలోని కోట సబ్ డివిజన్ వాకాడు, చిట్టమూరు సెక్షన్లలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత విద్యుత్తు శాఖ డీపీఈ విభాగపు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా చేపల పెంపకం చేపడుతున్న అక్వా రైతుల పొలాల వద్దకు వెళ్లి చేపల చెరువులకు వినియోగించే విద్యుత్తు సర్వీసులను తనిఖీ చేశారు. వాకాడు, చిట్టమూరు సెక్షన్ల పరిధిలో అనధికారిక విద్యుత్తు కనెక్షన్లు తీసుకుని విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్టు డీపీఈ విభాగపు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు గంగాధర్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 87,536 మంది స్వామి వారిని దర్శించుకోగా 35,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
సర్కారు.. కంగారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోగా, ఆ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వారికి అండగా నిలవడం కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగటంతో కూటమి ప్రభుత్వానికి కునుకు కరువైంది. దీంతో వైఎస్ జగన్ బంగారుపాళెం పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి, మామిడి దిగుబడులను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ.. వైఎస్ జగన్ పర్యటనలో రైతులెవ్వరూ పాల్గొనకుండా చూడటానికి నానా తంటాలు పడుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొద్ది రోజులుగా ఓ వైపు మామిడి దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక, మరో వైపు ఫ్యాక్టరీ యాజమాన్యాలు సమయానికి కొనుగోలు చేయక పోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల కష్టాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్లు, లారీల్లోనే మామిడి కుళ్లిపోతుండటంతో రైతులు వాటిని రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. మరికొందరు రైతులు ఏకంగా మామిడి చెట్లను కొట్టేసి, వేరే పంటలు సాగు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇది కూడా తప్పే అన్నట్లు ఆ రైతులపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోంది. వారిపై కేసులు పెట్టి, అపరాధ రుసుం అంటూ వసూళ్లకు బరితెగించింది. ఈ నేపథ్యంలో రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రైతుల వద్దకు అధికారులు పరుగులుకొద్ది రోజులుగా రైతులు గంగాధర నెల్లూరు, గుడిపాల, బంగారుపాళెం, తవణంపల్లి వద్ద ఉన్న ఫ్యాక్టరీల వద్ద మామిడి దిగుబడులతో రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నారు. మొన్నటి వరకు ఫ్యాక్టరీలో మామిడి అన్లోడింగ్ కోసం రోజుకు కేవలం 60 నుంచి 70 ట్రాక్టర్లకు మాత్రమే టోకెన్లు ఇచ్చేవారు. అది కూడా రైతులు వెళ్లి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బతిమలాడాలి. ఈ పరిస్థితిలో మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో అధికారుల జోక్యంతో రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ వారు 300 టోకెన్లు ఇవ్వటం ప్రారంభించారు. టోకెన్లు పొందిన వారి ట్రాక్టర్లను నేరుగా ఫ్యాక్టరీలోనికి పంపిస్తున్నారు. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాల్లో వేచి ఉండటం కంటే.. ఫ్యాక్టరీ లోపల ఉంటే పరిస్థితి తీవ్రత తెలియదనే ఉద్దేశంతో అధికారులు ఇలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయినా కి.మీ దూరం మామిడి దిగుబడులతో ట్రాక్టర్లు, లారీలు వేచి ఉండటం గమనార్హం.పర్యటన ఖరారవ్వగానే అంతా హడావుడిమామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఈనెల 2న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ విషయం తెలుసుకుని మరుసటి రోజే టీడీపీకి చెందిన కొందరు మామిడి రైతులను పిలిపించుకుని మాట్లాడారు. రైతులను ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమే అని ప్రకటించారు. ఆపై కిలో మామిడిని ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.8 చొప్పున కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ మరుసటి రోజు అధికారులు సమావేశమై కిలో మామిడి రూ.8తో కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు.అయితే వారు దాన్ని పట్టించుకోలేదు. ధర ఎంత అనేది చెప్పకుండానే రైతుల వద్ద అంగీకార పత్రంలో సంతకం తీసుకుని మామిడిని కొనుగోలు చేయటం చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు మరోసారి ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కిలో రూ.8 చొప్పున కాకుండా రూ.6తో కొనుగోలు చేస్తున్నట్లు అంగీకార పత్రంపై రైతుల నుంచి సంతకాలు తీసుకోవటం ప్రారంభించారు. వైఎస్ జగన్ పర్యటన ఖరారు కానంత వరకు కూటమి నేతలకు మామిడి రైతుల ఘోషే వినిపించలేదు.వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలియటంతో సీఎం సూచన మేరకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వెంటనే ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేయటం, ఫ్యాక్టరీల వద్దకు వెళ్లటం, రైతులతో మాట్లాడటం వంటి కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నారు. మరో వైపు చెట్లను కొట్టేసుకున్న రైతులు వైఎస్సార్సీపీ శ్రేణులంటూ వారిపై కేసులు పెట్టించటం ప్రారంభించారు. -
‘అప్పుడు ఊగిపోయారు.. మరి ఇప్పుడేమైంది చంద్రబాబూ?’
తిరుపతి: ఎన్నికలకు ముందు 143 అబద్ధపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, పవన్లు కలిసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 06) నగరిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడారు.అమరావతిని దోచుకోవడానికి మాత్రమే అధికారాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఊగిపోతూ చంద్రబాబు మాట్లాడారని,, నేడు మహిళల పై అగాయుత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రోజా. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రశ్నించేందుకకే ఉన్నానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతుంటే.. అది ఆయనకు తెలియదా? అని నిలదీశారు రోజా. ఒకవేళ రైతుల సమస్యలు తెలియకుంటే సీఎం పదవికి రాజీనామా చేయడం మంచిదన్నారు. చిత్తూరు జిల్లాలో కిలోమీటర్ల మేర మామిడి రైతు రాత్రి, పగలు అనేది తేడా లేకుండా ఎదురుచూస్తున్నాడని, వారికి మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. -
9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్.. కూటమి సర్కార్లో అలజడి
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైఎస్ జగన్ ఈ నెల 9న బంగారుపాళెం మామిడి రైతులను పరామర్శించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలజడి రేగుతోంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కష్టాలు పడుతున్నారు. రైతులను జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. కిలో 3 నుంచి 4 రూపాయలకు కొనుగోలు చేస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నాయి.ఈ నెల 9న వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిలో ఆరు రూపాయలకు కొనేందుకు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. వైఎస్సార్సీపీ హయాంలో కిలో 26 రూపాయలకు మామిడి అమ్మకాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామిడి ధర తగ్గిపోయింది. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద క్యూలైన్లో టోకెన్లు ఇచ్చి తక్కువ ధరకే దోచుకుంటున్నాయి. చాలా చోట్ల 3 నుంచి 4 రూపాయలకే జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. వైఎస్ జగన్ పర్యటన ఇలా..ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 87,536 మంది స్వామిని దర్శించుకున్నారు. 35,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.33 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
హాస్టల్స్లో ప్రవేశాలు
తిరుపతి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బీసీ హాస్టల్స్లో అడ్మిషన్లు చేసుకుంటున్నామని, ప్రస్తుతం జిల్లాలోని 62 హాస్టల్స్లో 5060 మంది వరకు విద్యార్థులు ఉన్నారని బీసీ హాస్టల్స్ జిల్లా అధికారి భరత్కుమార్ తెలిపారు. 2025–26కి సంబంధించి విద్యార్థులకు అందించాల్సిన అన్ని వస్తువులను అందిస్తున్నామన్నారు. ప్రధానంగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్స్కు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి హాస్టల్లోను నాణ్యమైన ఆహారం అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లో ఏదైన ఫంక్షన్లు జరిగితే మిగిలిన భోజనం హాస్టల్స్కు ఇస్తే తీసుకోరాదని స్పష్టం చేశామన్నారు. జిల్లాలోని ప్రతి హాస్టల్ను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. ఇసుక తవ్వకాలకు కొత్త నిబంధనలు ● అరణియార్,స్వర్ణముఽఖిలో తవ్వకాలు నిషేధం తిరుపతి అర్బన్ : ఇసుక తవ్వకాలకు కొత్త నిబంధనలు వచ్చాయని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియా కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పర్యావరణం, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారు నదులలో ఇసుక తవ్వకం , రవాణాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో స్వర్ణముఖినది, ఆరణియార్ నుంచి అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలు నిషేధించాలని స్పష్టం చేశారు. అయితే పంచాయితీ పరిధిలోని వాగులు, వంకల నుంచి సచివాలయం అనుమతులతో రసీదు తీసుకుని ఉచితంగా పొందవచ్చునని చెప్పారు. మిగిలిన వారు గూడలి (స్వర్ణముఖి బేరేజీ) డీ–సిల్టేషన్ యార్డు–ఆవిలాల (తిరుపతి) యార్డు, కాటన్ మిల్ (తిరుపతి) యార్డు, గాజులమాండ్యం (రేణిగుంట) యార్డు, శ్రీకాళహస్తి యార్డు, వెంకటగిరి యార్డుల్లో ఇసుకను తీసుకుపోవచ్చునని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు నిఘా ఉంటుందని వివరించారు. -
ట్రబుల్ మేజర్
● డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్నే కొనసాగించాలి ● డబుల్ మేజర్ వద్దే వద్దు అంటున్న కళాశాలలు ● ప్రైవేటు కళాశాలల పట్టు.. మెట్టు దిగిన ఉన్నత విద్యామండలి ● సింగిల్ మేజర్ విధానం వైపే ప్రభుత్వం మొగ్గు ● త్వరలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్తిరుపతి సిటీ : ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై తిరగబడ్డారు. దీంతో ఉన్నత విద్యామండలి కాస్త వెనుకడుగు వేసింది. డిగ్రీ కోర్సులలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని, డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానంతో తమకు తలనొప్పి తప్పదని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యా మండలికి తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో ఉన్నత విద్యామండలి సందిగ్ధంలో పడింది. గత నాలుగు మాసాలుగా డబుల్ మేజర్ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించి సుదీర్ఘంగా చర్చించి నివేదిక తెప్పించుకుంది. దీంతో పాటు డబుల్ మేజర్ సబ్జెక్ట్లకు సంబంధించి కరిక్యులమ్ సైతం కమిటీ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. పేరొందిన కార్పొరేట్, ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ మేజర్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. డబుల్ మేజర్తో సమస్యలు డిగ్రీ కోర్సులలో డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానానికి, మల్టీ డిసెప్లేనరీ విధానానికి పెద్ద తేడా లేదని ప్రైవేటు కళాశాలలు, మేథావులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానానంతోనే విద్యార్థులకు, అటు కళాశాలలకు ఎంతో ఉపయోగకరమని వారు వాదిస్తున్నారు. డబుల్ మేజర్ విధానంతో అధ్యాపకుల కొరత, నూతన అధ్యాపకుల నియామకం, కళాశాలలలో ల్యాబ్ సౌకర్యాలు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాదని ఈ విధానం తలనొప్పితో పాటు భారీ ఖర్చుతో కూడుకున్నదని ప్రభుత్వానికి విన్నవించారు. ఇటు ప్రభుత్వ కళాశాలలు మాత్రం డబుల్ మేజర్ విధానం ప్రవేశపెడితే అడ్మిషన్లు పెరుగుతాయని అభిప్రాయాన్ని వెళ్లడిస్తున్నారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని కొనసాగించేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువడాల్సి ఉంది. జిల్లా సమాచారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 18 టీటీడీ కళాశాలలు 5 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104 సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలంటున్న కళాశాలలు 106 డబుల్ మేజర్ కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని కోరిన కళాశాలలు 15 ఏదైనా సరే అంటూ సిద్ధపడ్డ కళాశాలలు 6 సింగిల్ మేజర్ సబ్జెక్ట్తో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సుమారు 25 మంది డిగ్రీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు 32,600సింగిల్ మేజర్తో విద్యార్థులకు ప్రయోజనం డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్లో డిగ్రీ పొందిన విద్యార్థికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా పోటీ పరీక్షలలో ఆప్షనల్ సబ్జెక్ట్గా యూజీలో తీసుకున్న మేజర్ సబ్జెక్ట్ను ఎంపిక చేసుకొని మంచి మార్కులు స్కోర్ చేసుకునేందుకు వీలుంటుంది. – ప్రభాకర్రెడ్డి, ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు, తిరుపతి డబుల్ మేజర్ను ఎవరూ కోరడం లేదు డబుల్ మేజర్ను ఏ విద్యార్థి కోరుకోవడం లేదు. మూడు, రెండు సబ్జెక్టులను మేజర్గా చదువుకునే విద్యార్థికి శ్రమ తప్ప ఉపయోగం ఉండదు. అధ్యాపకులు, మౌలిక సదుపాయా ల కల్పనలో విద్యా సంస్థలు వెనుకబడతా యి. – రాజేశ్వరి, కార్పొరేట్ కళాశాల అధ్యాపకురాలు, తిరుపతి పోటీ పరీక్షలకు ఉపయోగకరం డిగ్రీలో సింగిల్ మేజర్ విధానం చదివిన వారికి సివిల్స్, గ్రూప్స్, రీసెట్, పీజీసెట్, ఐసెట్, వంటి పోటీ పరీక్షలలో నెగ్గేందుకు సులువుగా ఉంటుంది. డబుల్ మేజర్తో రెండు ప్రధాన సబ్జెక్ట్లపై దృష్టి సారించాల్సి ఉంటుంది. – శిరీషా, డిగ్రీ విద్యార్థిని, తిరుపతి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ తర్వాతే నోటిఫికేషన్ డిగ్రీ నోటిఫికేషన్ కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు మూడు మాసాలుగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఇంటర్ ఫలితాలు విడుదలైనా ఇంత వరకు డిగ్రీ ప్రవేశాలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోకపోవడంతో దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. కాగా ఈనెల 6వ తేదీ నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.నోటిఫికేషన్ రాకపోవడం బాధాకరం ఇంటర్ ఫలితాలు ఏఫ్రిల్ నెలలో వచ్చాయి. కానీ ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం ఆశ్చర్యం. విద్యావ్యవస్థలో ఏ విధానాన్ని కొనసాగించాలో తెలియక ఉన్నత విద్యామండలి తికమక పడుతూ అడ్మిషన్లు జరపకుండా ఆల స్యం చేయడం బాధాకరం. – ప్రసన్న, డిగ్రీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని, తిరుపతి రూరల్ ఫీజురీయింబర్స్మెంట్ ఊసేలేదు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. మళ్లీ నూతన విధానం అంటూ డిగ్రీలో డబుల్ మేజర్ సబ్జెక్ట్ను ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాలతో అడుకుంటోంది. తల్లిదండ్రులు గత ఏడాది అప్పులు చేసి ఫీజు చెల్లించిన పరిస్థితి చూశాం. – లక్ష్మీనరసింహులు, విద్యార్థి, రేణిగుంట -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో ప్రకటించిన పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన పుష్పావతి, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీగా తిరుపతికి చెందిన కేతంరెడ్డి మురళీరెడ్డి, రాష్ట్ర సెక్రటరీలుగా గంగాధర్ నెల్లూరుకు చెందిన వి.సుందర్ రాజు, సత్యవేడుకు చెందిన జేబీ.మునిరత్నం (జేబీఆర్), తిరుపతికి చెందిన తిరుమల రెడ్డి, భరత్ రెడ్డిను నియమించారు. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి పలమనేరుకు చెందిన జి.ప్రహ్లాద, ఆర్.చెంగారెడ్డి, ఎస్డీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తికి చెందిన షేక్ సిరాజ్బాషా ఉన్నారు. రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్: అండర్–15 రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు తిరుపతికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. జూన్ 29 నుంచి జూలై 1వ తేదీ వరకు మదనపల్లిలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు 2వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన తిరుపతికి చెందిన ఆదిత్య, హిమకేష్లను రాష్ట్ర జట్టుకు రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ఎంపిక చేసినట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డెప్ప తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో నిర్వహించనున్న క్యాంపులో పాల్గొననున్నారని, ఆ తరువాత పంజాబ్లో జరిగే జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున వీరిద్దరు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న వీరిని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. తాళం పగులగొట్టి చోరీ ● 55 సవర్ల బంగారు నగలు, 3 లక్షల నగదు అపహరణ నాయుడుపేటటౌన్ : నాయుడుపేట పట్టణంలోని మూకాంబిక గుడి వీధిలోని ఓ ఇంటిలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనను బాధిత కుటుంబ సభ్యులు శనివారం రాత్రి గుర్తించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముకాంబిక గుడి వీధిలో నివాసం ఉంటున్న హరేంద్ర, అతడి భార్య సునీత శనివారం ఉదయం 10.30 గంటలకు గూడూరులో జరిగే జగన్నాథ యాత్రలో పాలు పంచుకునేందుకు వెళ్లారు. తిరిగీ రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి అవాక్కాయ్యారు. ఇంటిలోకి వెళ్లి చూడగా 30 సవర్ల బంగారు, నగదు రూ.50 వేలు, వెండి వస్తువులు, సునీత స్నేహితురాలిగా ఉన్న మరో మహిళకు సంబంధించిన 25 సవర్ల బంగారు నగలు, రూ.2.50 లక్షల నగదును చోరీ చేసుకుని వెళ్లి ఉండటాన్ని బాధితులు గుర్తించారు. అయితే ఈ దొంగతనం మధ్యాహ్న సమయంలో జరిగి ఉండవచ్చునని బాధితులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దాడి చేసిన వారెవ్వరినీ వదలం
చంద్రగిరి: చంద్రగిరిలో అరాచక పాలన సాగుతోందనడానికి వరుసగా జరుగుతున్న దాడులే నిదర్శనం.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి లేరని క్యాడర్పై దాడులు చేయడం అమానుషమని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదాడులు చేస్తే భయపడి లొంగిపోతారని ఎలా అనుకుంటున్నారు... ఇక్కడ వున్నది పిరికిపందలు కాదు.. జగన్మోహన్రెడ్డి సైనికులు.. మా క్యాడర్ను కాపాడుకోవడానికి మేమంతా ఉన్నాం.. అవసరమైతే జగన్మోహన్రెడ్డి చంద్రగిరికి వస్తారు.. అంటూ వైఎస్ఆర్ సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని నరశింగాపురం పంచాయతీ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్పై టీడీపీ గూండాలు దాడి చేసి తల పగలగొట్టడాన్ని ఆయన ఖండించారు. శనివారం ప్రవీణ్కుమార్ ఇంటికి చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో కలసి వచ్చిన ఆయన టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్కు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన మాట్లాడుతూ.. చెవిరెడ్డిని, ఆయన బిడ్డను అక్రమ కేసుల్లో ఇరికించి ఆయన వెంట నడిచే క్యాడర్ను భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చెవిరెడ్డి చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరని, దాడులకు పాల్పడిన వారెవ్వరినీ వదిలే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. పల్లెల్లో ప్రశాంతమైన రాజకీయాలు చేసుకోవాలే తప్ప దాడులు చేసుకునే పరిస్థితి రాకూడదన్నారు. చంద్రగిరి చరిత్రలో ఇప్పటి వరకు అలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడే వస్తోందన్నారు. దీనిని ఆరంభంలోనే అడ్డుకోవాలని, దానికి పోలీసులు సహకరించకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని సూచించారు. ఆ తరువాత చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ప్రవీణ్కుమార్తో పాటు వారి కుటుంబీకులకు అండగా నిలబడతామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు లేరని క్యాడర్పై దాడులు అమానుషం క్యాడర్ను కాపాడుకోవడానికి మేమున్నాం.. అవసరమైతే జగన్మోహన్రెడ్డి చంద్రగిరికి వస్తారు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి -
వణుకెందుకు బాబు?
● ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం రావడం ఖాయం ● మామిడి రైతులకు అండగా నిలవడం తప్పా? ● హెలీప్యాడ్కు కూడా అనుమతివ్వకుండా ఆంక్షలా? ● మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఇలా.. ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారని తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మొగసాల రెడ్డెప్ప, హేమంత్కుమార్ రెడ్డి, ఎస్డీ మురళీకృష్ణ, చెంగారెడ్డి, దయానంద్గౌడ, కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పలమనేరు: ‘ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దేనికని?. అంత బెదురెందుకని..’ అంటూ రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మామిడికి గట్టుబాటు ధర కోసం ఈనెల 9న బంగారుపాళెంకు వస్తున్న సందర్భంగా పలమనేరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా నేతలతో ఆయన శనివారం సన్నాహక సమావేశాన్ని నేర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు.ఇప్పటికే పొగాకు, మిరప, టమాట రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వాపోయారు. ఇప్పుడు మామిడి రైతులు కూడా ఆ కోవలో చేరారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడిని అమ్ముకోలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో రైతులకు అక్కడి ఎంపీ కేంద్రానికి లేఖ రాసి వారిని ఆదుకున్న విషయం తెలిసిందేనన్నారు. కానీ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు ఇక్కడి మామిడి రైతుల కష్టాన్ని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. హెలీప్యాడ్కు అనుమతులివ్వడం లేదు ప్రతిపక్ష నేతగా మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటకు హెలీప్యాడ్కు సైతం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. అసలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికై నా వస్తున్నారంటే కూటమి ఎందుకు అంతలా వణికిపోతోందే అర్థం కావడం లేదన్నారు. మొన్నటి దాకా తోతాపురికి ధరలేక కాయలు అమ్ముకోలేక తోటల్లో వదిలేస్తున్నా పట్టించుకోని సీఎం ఇప్పుడు జగన్మోహన్రెడ్డి వస్తున్నాడని తెలిసి మామిడిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే జగన్ వస్తేగానీ రైతుల కష్టం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. -
నిరసనలు
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై భాకరాపేట: కూటమి ప్రభుత్వం కుట్రలో భాగమే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఎర్రావారిపాళెం మండల కేంద్రంలో శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చెవిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే తప్పుడు కేసులు నమోదు చేయించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. చెవిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోహిత్రెడ్డిపై పెట్టిన కేసును కూడా ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్, రామచంద్రాపురం ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
● మహిళా ఉద్యోగి మృతి, 15 మందికి గాయాలు రేణిగుంట : టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు వెనుక వైపు వేగంగా వచ్చి ఢీకొనడంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మహిళా ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందింది. 15 మందికి గాయాలు కాగా ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు నారాయణవనం నుంచి తమ కంపెనీ ఉద్యోగులను ఎక్కించుకొని వస్తున్న సమయంలో శనివారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు రేణిగుంట సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాల ఎదురుగా టైర్ పంచర్ అవడంతో రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక వైపున ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న నారాయణవనానికి చెందిన ఊహ మహాలక్ష్మి (25) మృతి చెందగా మరో మహిళకు కాలు విరిగింది. మొత్తం 15 మందికి గాయాలు కాగా పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి పరామర్శించారు. -
లోక్ అదాలత్లో 2352 కేసుల పరిష్కారం
తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 2352 కేసులు పరిష్కారం అయినట్లు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ గురునాథ్ తెలిపారు. పరిష్కారమైన కేసులలో 371 కోర్టుల్లో పెండింగ్ ఉన్న సివిల్ , క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద కేసులు, వివాహ సంబంధాల కేసులు, తదితర కేసులు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే 1981 జరిమానాలు చెల్లించే క్రిమినల్ కేసులను పరిష్కరించి నిందితులకు 60 లక్షలా 25 వేల వంద రూపాయలు జరిమానా విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం ఉదయం 10:30 గంటలకు తిరుపతి మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. కేసుల పరిష్కారం కోసం ఈ జాతీయ లోక్ అదాలత్లో 8 బెంచ్లను ఏర్పాటు చేశారు. జడ్జి గురునాథ్తో పాటు ఐదవ అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి విజయసారధిరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ, ఇతర జూనియర్ సివిల్ జడ్జిలు గ్రంధి శ్రీనివాస్ ,శ్రీకాంత్ , సత్యకాంత్ కుమార్, సంధ్యారాణి, కోటేశ్వరరావు ఈ లోక్ అదాలత్ బెంచ్లకు అధ్యక్షులుగా వ్యవహరించి కేసులను పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్లో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, బ్యాంకు, బీమా, ఆర్టీసీ ఇతర వివిధ సంస్థల అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదం.. పట్టుబడ్డ ఎర్రచందనం నాయుడుపేటటౌన్: పట్టణ పరిధిలోని అగ్నిమాపకశాఖ కార్యాలయం సమీపంలో రహదారిపై బైక్ను ఢీకొని ఎర్రచందనం తరలిస్తున్న వాహనం శనివారం పోలీసులకు పట్టుబడింది. ఫారెస్ట్ డీఆర్వో కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. వెంకటగిరి వైపు నుంచి వస్తున్న కారు పట్టణ పరిధిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదుట రహదారిపై వెళుతున్న బైక్ను ఢీకొంది. అక్కడ యూనిఫామ్లో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేటప్పటికే కారులో ఉన్న డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. కారు వెనుక డోర్లో తెరిచి చూడగా ఎర్ర చందనం దుంగలు ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి వాహనం అప్పగించినట్లు డీఆర్వో తెలిపారు. 237 కేజీలకు పైగా ఉన్న 46 ఎర్ర చందనం దుంగలతో పాటు వాహనం విలువ రూ. 3 లక్షలు వరకు ఉంటుందన్నారు.అటవీశాఖ రేంజ్ అధికారి రమణయ్య పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్వో వెల్లడించారు. -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
● రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా తిరుపతి అర్బన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మస్తాన్ పేర్కొన్నారు. తిరుపతి డిపోలో రెండో రోజు ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాల ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఉద్యోగో న్నతులు వెంటనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాత బస్సులను తొలగించి, కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. డీఏ బకాయిలను చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టా రు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జునయ్య, కార్యదర్శి రమేష్కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి సతీష్నాయుడు పాల్గొన్నారు. -
చంద్రగిరిలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు
● ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలనే కుట్ర ● తలలు పగలగొడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర ● బాధితులపైనే కేసుల నమోదు ఏం సాధిస్తారో..? వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు వరుసగా దాడులు చేయడం వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారో చెప్పాలని చంద్రగిరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శరీరంపై కారం చల్లడం, కర్రలతో తల పగలగొట్టడం, చేతులు విరిచేయడం వంటి చర్యలతో ప్రత్యర్థి పార్టీ నేతల రక్తం కళ్ల చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి టీడీపీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఎంతో మంచిగా చూసుకున్నారు కాబట్టే ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సమయానికి టీడీపీ క్యాడర్ గట్టిగా నిలబడిందన్న విషయం గుర్తు చేసుకోవాలని వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు సూచిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నేతలను చెవిరెడ్డి ఎక్కడా ఇబ్బంది పెట్టలేదన్న విషయం ఆ పార్టీలోని సీనియర్లు అందరికీ తెలుసని, అయినా వారు ఈ సమయంలో మౌనం వహించి భౌతిక దాడులను ప్రోత్సహించడం భవిష్యత్తు తరాలకు మంచిది కాదంటున్నారు. కరోనా సమయంలో చెవిరెడ్డి చేసిన సాయం వల్ల ఎంత మంది టీడీపీ నేతలు ప్రాణాలతో బయటపడ్డారో ఒక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలంటున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అదును చూసి.. అరాచకాలకు తెర లేపింది. తమ క్యాడర్కు అండగా నిలబడతాడనుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించారు.. ఆ నాయకుడి కుమారుడు పైనా తప్పుడు కేసులు పెట్టి క్యాడర్కు దూరమయ్యేలా చేశారు. ఎవ్వరి అండా లేదని తెలుసుకుని పార్టీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు. అందరూ చూస్తుండగానే ఒంటిపై కారం చల్లడం.. కర్రలతో తలలు పగలగొట్టడం.. మహిళ మెడలో మంగళ సూత్రాలు తెంచడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలకు పోలీసులు అండగా నిలబడటంతో మరింతగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చంద్రగిరిలో ఎన్నడూలేని విధంగా పల్లెల్లో రాజకీయ వైషమ్యాలను కలిగిస్తున్నారు. ఎన్నికల్లో ఎవరికి వారు నచ్చిన పార్టీకి పనిచేయడం, ఆ తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్నదమ్ముల్లా కలిసి మెలసి ప్రశాంతమైన రాజకీయాలు చేసుకునే చంద్రగిరిలో ప్రస్తుతం అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. కుట్రలో భాగంగానే దాడులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ కేసులో అరెస్టు జరిగిన తరువాత చంద్రగిరిలో ఏం జరుగుతోంది..? ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్పై అధికార టీడీపీ నేతలు చేస్తున్న వరుస దాడులకు కారణం ఏమిటి ? ప్రశాంతమైన పల్లెల్లో రాజకీయ చిచ్చు పెడుతున్నది ఎవ్వరు? బాబు స్వగ్రామం చంద్రగిరిలో ప్రత్యర్థి పార్టీని లేకుండా చేయాలనేనా..? అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించారా..? చంద్రగిరి ప్రజలకు పదేళ్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన చెవిరెడ్డిని జైలుకు పంపింది ఆ వ్యూహంలో భాగమేనా..? అన్న ప్రశ్నలకు అందరి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉంది. రాజకీయ విధ్వేషాలను మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను పది మందిలోకి పిలిపించడం, ఆ తరువాత అవమాన పరిచి దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని అన్నివర్గాల ప్రజలు తప్పు బడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈనెల 9వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చంద్రగిరి పార్టీ నేతలు వివరించనున్నట్లు సమాచారం. బరితెగింపు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ క్యాడర్ను టార్గెట్ చేసుకుని వరుసగా దాడులు చేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల రక్తం కళ్ల చూడాలనుకునే టీడీపీ గూండాలు బరితెగించి దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంపై బాధిత కుటుంబీకులు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రగిరిలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యం, పోలీసుల సహకారంపై ఈనెల 7వ తేదీన తిరుపతి జిల్లా ఎస్పీని కలసి వినతిపత్రం అందించాలని, అప్పటికీ న్యాయం జరగకుంటే బాధితులతో కలసి ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గోదాముల నుంచే 50కి బదులు 46 కేజీలే వస్తున్నాయంటున్న డీలర్లు ● రేషన్ బండ్లలో ఇచ్చేటప్పుడే బాగుండేదంటున్న జనం ● రేషన్ బియ్యం తూకాలపై భూమన అభినయ్రెడ్డి తనిఖీలు
తిరుపతి మంగళం : ప్రతి నెలా పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అటు ప్రభుత్వం, ఇటు డీలర్లు బొక్కేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందక.. కూలీనాలి చేసుకుని వచ్చిన చిల్లర డబ్బుతో మసూరా బియ్యం కొనుక్కుని తినలేక.. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యంతో కడుపు నింపుకుంటున్న పేదల నోటి కాడ అన్నాన్ని కొంత మంది కూటమి నేతలు , రేషన్ డీలర్లు లాగేసుకుంటున్నారు. పేదలకు ఇచ్చే 10, 20 కిలోల రేషన్ బియ్యం తూకాల్లో కక్కుర్తి పడి కోతలు కోస్తున్నారు. ఇది తిరుపతి నగరంలోని రేషన్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలను వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి వెలికితీశారు. రేషన్ అక్రమాలు భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరంలోని రేషన్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై ఏకతాటిగా 12 రేషన్ షాపులలో బియ్యం తూకాలను పరిశీలించామన్నారు. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించే ఇటువంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందించేందుకు వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి లబ్ధిదారుడికి అందాల్సిన రేషన్ను అందే విధంగా రసీదు వచ్చేలా ఏర్పాటు చేశారన్నారు. దాంతో రేషన్ సరుకుల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా ఒక వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఎండీయూ వాహనాలను రద్దు చేసి తనకు అనుకూలంగా ఉన్న కూటమి నాయకులకు రేషన్ దుకాణాలను కేటాయించి పేదల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల అక్రమాలతో సుమారు 35 నుంచి 40 కోట్ల కేజీల రేషన్ బియ్యాన్ని పక్కదారి మళ్లిస్తూ తద్వారా రూ. 900 కోట్లపై పైగా స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. సీజ్ చేసేదెప్పుడు ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రేషన్ బియ్యం మామమైపోతోంది, పెద్ద ఓడల్లో పక్క దేశాలకు వెళ్లిపోతున్నాయని పవన్ కల్యాణ్, నాదేండ్ల హడావుడి చేసి సీజ్ ద షిప్ అని డైలాగులు కొట్టారన్నారు. ఇప్పుడు ఎవ్వరిని సీజ్ చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని సీజ్ చేస్తారా? ఈ రేషన్ వ్యవస్థను సీజ్ చేస్తారా అని భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పవన్కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ను దూషించడానికి తప్ప ప్రజలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కేవలం రాజకీయ కక్షతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను, ఇంటి వద్దే ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తున్న ఎండీయూ వాహనాలను రద్దు చేశారే తప్ప మరొకటి కాదన్నారు. రేషన్షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతోనే రేషన్షాపుల తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి గతంలో వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన వ్యవస్థనే కొనసాగించాలని భూమన అభినయ్రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అయితే రేషన్ దుకాణాల వద్ద ఇలా చేయడం సరికాదని, ఏదైనా ఉంటే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలంటూ అలిపిరి పోలీసులు రేషన్షాపు వద్దకు వచ్చి భూమన అభినయ్రెడ్డితో వాదించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీగా మాకు ఉందని అభినయ్ అన్నారు. లబ్ధిదారుడికి ఇనుప డబ్బాతో తూకం వేసిన 35 కిలోల రేషన్ బియ్యాన్ని సంచితో తూకం వేయగా 31.640 కేజీలుగా తూకం చూపెడుతున్న దృశ్యంమోసాలు బట్టబయలు తిరుపతి నగరంలోని రేషన్ షాపుల్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంలో జరుగుతున్న అక్రమాలను శుక్రవారం వెఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి బయటపెట్టారు. తిరుపతి జీవకోనతో పాటు పలు ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో పేదలకు వేస్తున్న బియ్యం తూకాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు తీసుకెళుతున్న రేషన్ బియ్యాన్ని పార్టీ నాయకులు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెయిట్ మిషన్ (త్రాసు)పై పెట్టించారు. దాంతో 10 కేజీలు బియ్యం తీసుకున్న వారి తూకాల్లో రెండు కేజీలు, 20 కేజీలు బియ్యం తీసుకున్న వారి తూకాల్లో నాలుగు కేజీలు తక్కువ కనిపించాయి. ఏమక్కా మీరు తీసుకున్న బియ్యం ఎంత? మీకు రేషన్ షాపు వాళ్లు ఇస్తున్న బియ్యం తూకం ఎంత చూశారా ? అంటూ వారికి రేషన్ షాపుల్లో జరుగుతున్న తూకల్లో అక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఇదేమిటని ఆ రేషన్షాపు నిర్వాహకురాలిని అడిగితే ఇదేమీ కొత్త కాదు..ఎప్పటి నుంచి జరుగుతున్నదేనంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ రేషన్ గోదాముల నుంచే వచ్చే 50 కేజీల బియ్యానికి గానూ 46 కేజీలే వస్తున్నాయని రేషన్ డీలర్లే చెబుతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు రేషన్ డీలర్లు కలిసి పేదల నోటికాడ కూడు లాగేసుకుంటున్నారు. -
బాల్యం నుంచే అల్లూరికి దేశభక్తి
● మన్యం వీరుడికి కలెక్టర్, ఎస్పీ నివాళులుతిరుపతి అర్బన్ : చిన్నతనం నుంచే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు దేశభక్తి ఉండేదని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం అల్లూరి 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. 1897 జులై 4న సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దంపతులకు జన్మించారని, అల్లూరి సీతారామరాజుకు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నిత్యం ధ్యానం, దైవపూజతో జీవనశైలి కొనసాగించిన ఆయన, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తుచేశారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను తెలుసుకున్న ఆయన తెల్లదొరల రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజల్లో చైతన్యం నింపి, వారికి ధైర్యసాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారని చెప్పారు. ఆయన త్యాగం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాండ్, సుధారాణి పాల్గొన్నారు. తిరుపతి క్రైమ్ : స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. -
ఆటో బోల్తా
సైదాపురం : ఆటోలో బతుకు దెరువు కోసం 10 మంది గని కార్మికులు కూలీ పనులకు వెళుతూ ప్రమాదశాత్తు పొలంలో బోల్తా పడటంతో అందులో ఉన్న ఇద్దరు గని కార్మికులు గాయాలపాలయ్యారు. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోని పల్లెమిట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు ఇలా.. మండల కేంద్రమైన సైదాపురానికి చెందిన శ్రీనివాసులు ఆటో ద్వారా మండలంలోని తురిమెర్ల గ్రామ సమీపంలోని ఓగని పనులకు ప్రతి రోజు సైదాపురం నుంచి కూలీలను తీసుకుని పనులు ముగిసిన వెంటనే మళ్లీ స్వగ్రామానికి వస్తుండేవారు.ఈక్రమంలో శుక్రవారం ఉదయాన్నే 10 మంది గని కార్మికులతో సైదాపురం నుంచి గని పనులు జరిగే తురిమెర్లకు ఆటోలో బయలుదేరారు.సైదాపురం సమీపంలోని పల్లెమిట్ట దగ్గరకు వచ్చే సరికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న రాధమ్మ, వెంకటమ్మ గాయాలపాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం 108లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ పలువురు కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది -
ఏడాది పాలనపై కలెక్టర్ సంతృప్తి
తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం వైఎస్సార్సీపీ సర్కార్ 2022 ఏప్రిల్ 4న జిల్లాల పునర్విభజన చేపట్టి తిరుపతి జిల్లా ఏర్పాటు చేశారు. మొదటి కలెక్టర్గా వెంకట రమణారెడ్డి రెండేళ్లపాటు పనిచేశారు.ఆ తర్వాత లక్షీశ నెల రోజులు, అనంతరం ప్రవీణ్కుమార్ మూడు నెలలు, అనంతరం వెంకటేశ్వర్ ఏడాది పాటు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టరేట్లోని ఉద్యోగులు విభాగాల వారీగా శుక్రవారం కలెక్టరేట్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టరేట్లోని ఉద్యోగులే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఏడాది పాలనపై శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా ఏడాదిపాటు తిరుపతి జిల్లా కలెక్టర్గా పాలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీని సందర్శించిన సిక్కీ బృందం శ్రీసిటీ (వరదయ్యపాళెం) : చైన్నెలోని దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఎస్ఐసీసీఐ)కి చెందిన 22 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ పారిశ్రామిక కార్యకలాపాలు, ఇక్కడ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతుల అధ్యయనం, పెట్టుబడి అవకాశాల పరిశీలన దిశగా వీరి పర్యటన సాగింది. శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) బోడ్గన్ జార్జ్ బృంద సభ్యులకు స్వాగతం పలికారు. చర్చల సందర్భంగా శ్రీసిటీ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక స్థానం, వ్యాపారానుకూల పర్యావరణ వ్యవస్థకు సంబంధించి వారికి ప్రదర్శన ఇచ్చారు. శ్రీసిటీలో విస్తృత వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. ఈ పర్యటనపై స్పందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, దక్షిణ భారతదేశ వ్యాపార స్వరూపాన్ని రూపొందించడంలో సిక్కీ పాత్ర ఎంతో కీలకం, విలువైనదని వ్యాఖ్యానించారు. వివిధ రంగాలలోని ప్రముఖ వ్యాపార సంస్థలు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులతో కూడిన ఈ బృందం పరిశ్రమలను సందర్శించింది. సిక్కీ ప్రాజెక్ట్స్ హెడ్ ఆర్.శరణ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పర్యటన కొనసాగింది. ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన వళ్లియన్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. టాస్క్ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది 2019లో శేషాచలం అటవీ ప్రాంతం, నాగపట్ల బీట్, చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. నిందితుడు వళ్లియన్ ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నించాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్తో కీలక ప్రతిపాదనలు
● టాటా కంపెనీ చైర్మన్ చంద్రశేఖరన్ కలిసిన ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : తిరుపతి అభివృద్ధికి సహాయపడాలంటూ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్తో ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ముంబయిలో టాటా సనన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్న్ను ఎంపీ కలిశారు. తిరుపతి జాతీయ స్థాయి విద్యా కేంద్రం, ఐజర్, ఐఐటీ, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ వివరించారు. ఈ ప్రాంత యువతకు డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, సేవా రంగాలలో శిక్షణ కల్పించే టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమని తెలిపారు. అదే విధంగా బీపీఓ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. కలంకారి ప్రాచీన కళకు ప్రోత్సాహం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాచీన కళ అయిన కలంకారీ నేటి ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తగిన గుర్తింపు పొందడం లేదని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కళను పునరుజ్జీవానికి టాటా క్లిక్, వైస్ట్సెడ్ వంటి టాటా ఫ్యాషన్ సంస్థల ద్వారా కలంకారీ ఉత్పత్తులను ఆధునిక డిజైన్లతో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించండి రాయలసీమకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, అయినా తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవని ఎంపీ గుర్తు చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా తిరుపతి నుంచి కువైట్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఈ మూడు ప్రతిపాదనలు తిరుపతి ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ఎంపీ వివరించారు. స్పందించిన చంద్రశేఖరన్ అందుకు అవసరమైన చర్యలు చేపడుతామని స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. -
వైద్యాధికారుల విచారణ
సత్యవేడు : పంచాయతీ పరిధిలోని పల్లాపు వీధిలోని క్లినిక్, మెడికల్ స్టోర్ను దాసుకుప్పం పీహెచ్సీ డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీహెచ్ఓ సుబ్రమణ్యం కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. గురువారం సాక్షి దినపత్రికలో శ్రీకాలం చెల్లిన ఔషధాల పంపిణీశ్రీ వార్తకు మెడికల్ అధికారులు స్పందించారు. కాలం చెల్లిన మందుల విక్రయంపై విచారణ చేపట్టారు. డేట్ పరిశీలించకుండా పొరబాటున మందులు ఇచ్చానని, ఇకపై పొరబాట్లు చేయమని ఆర్ఎంపీ సమాధానం ఇచ్చారు. బాధితురాలు శోభారాణిని విచారించి వివరాలు సేకరించారు. తనిఖీ నివేదిక వివరాలను డీఎంహెచ్ఓకు పంపుతామని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 640,15 మంది స్వామి వారిని దర్శించుకోగా 26,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. పీహెచ్సీలో ప్రసవాలు పెరగాలి బుచ్చినాయుడుకండ్రిగ : పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెరగాలని రాష్ట్ర వైటల్ స్టాటస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్రావు తెలిపారు. శుక్రవారం బుచ్చినాయుడుకండ్రిగలోని పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్ఓ మృదులరాణి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్తో కలసి ఆయన తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్స్ రికార్డులను, లేబొరేటరీలోని సౌకర్యాలను, పరికరాలను, ఫార్మసీ విభాగంలోని మందులను, పరిశీలించారు. ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామ సచివాలయాల వద్దనున్న క్లినిక్లలో వైద్యసేవలను సక్రమంగా అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మురళీధర్రెడ్డి, ఉదయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ఏపీపీఎస్సీ పరీక్ష
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. ఆయన శుక్రవారం పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం రోడ్డు సత్య ఎన్క్లేవ్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 472 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష మూడు సెషన్స్లో జరుగుతుందన్నారు. శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు రెండో సెషన్, అదేవిధంగా సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రికల్ వస్తువులకు అనుమతి లేదని వివరించారు. కార్యక్రమంలో ఏపీపీఎస్సీ పరీక్షల అసిస్టెంట్ సెక్రటరీ రాజ్గోపాల్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేవీఎస్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఠాణాలోనే దళిత నేతపై దాడి పెళ్లకూరు : మండలంలోని పునబాక గిరిజన కాలనీకి చెందిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న దళిత నేత యాగాని బెన్నీపై అదే గ్రామానికి చెందిన కొందరు పోలీస్ స్టేషన్లోనే దాడికి పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అమాస సాయి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న బెన్నీపై స్టేషన్లోనే నీలం నరసింహులు, రెడ్డి శ్రీనివాస్, సుమన్రెడ్డి, తాళ్ల నితిన్, నీలం రాజేష్ తదితరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలను మోసగించే అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు ● 114 గ్రాముల బంగారం స్వాధీనం శ్రీకాళహస్తి : మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి బంగారు నగలు దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11 లక్షలు విలువ గల 114 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ఇలా.. శ్రీకాళహస్తిలో గత ఏడాదిలో ఓ మహిళను బురిడీ కొట్టించి 58 గ్రాముల బంగారు కొట్టేసిన కేసులో నెల్లూరుకు చెందిన సునీత స్థానిక సచివాలయ ఉద్యోగి ఫిర్యాదు చేయగా వీరిని పట్టుకున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ ఒక బాలున్ని అడ్డం పెట్టుకుని మోసం చేసి డబ్బులు దోచుకోవడం, బంగారు నగలు ఇస్తే డబ్బులు ఇస్తామని తమ వద్ద బంగారు నగలు ఉన్నాయని మీ వద్ద బంగారు ఇస్తే కొత్త బంగారు ఎక్కువ ఇస్తామని మాయమాటలు చెప్పి నగలు, డబ్బులు అపహరిసున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండులో అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడు చోరీల్లో దోచుకున్న నగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజక వర్గానికి చెందిన దుమ్మగూడ ప్రాంతంలో నివాసం ఉండే గుజరాతి కిషన్(24), న్యూఢిల్లీ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో ఉంటున్న ప్లాస్టిక్ పవ్వుల వ్యాపారం చేస్తున్న శ్యామ్లా(30)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వీరిద్దరిపై తెలంగాణలో 7 కేసులు నమోదు అవ్వడంతో పాటు జైలుశిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి, కడప, చిత్తూరులో మూడు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. -
మహిళపై లైన్మెన్ దురుసు ప్రవర్తన
రేణిగుంట : తన కూతురు గర్భిణిగా ఉండడంతో హాస్పటల్లో చూపించుకునే క్రమంలో విద్యుత్ బిల్లు చెల్లింపులో జాప్యం అయిందని లైన్మన్కు చెబుతుండగా వినకుండా విద్యుత్ స్తంభం ఎక్కి సరఫరాను నిలుపుదల చేశారు. మీరు ఇప్పుడు డబ్బులు చెల్లించినా రెండు రోజుల వరకు సరఫరా చెయ్యము మీకు దిక్కున చోట చెప్పుకోండి శ్రీఅంటూ దురుసుగా ప్రవర్తించిన సంఘటన రేణిగుంట మండలంలో చోటుచేసుకుంది. రేణిగుంట మండలం గురవరాజుపల్లి పంచాయతీ, అంబేడ్కర్ కాలనీలో కనపర్తి సౌజన్య కొడుకు ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక లైన్మెన్ గోవిందరాజులు విద్యుత్ బిల్లు చెల్లించలేదని సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో నిండు గర్భిణి అయిన కూతురు, కొడుకుతో చిమ్మ చీకటిలో ప్రస్తుతం కాలం వెల్లదీస్తున్నారు. ఆన్లైన్లో 7 గంటలకు కరెంట్ బిల్లు చెల్లించామని, జేఎల్ఎంకు ఫోన్ చేయగా లైన్మన్ రెండు రోజుల వరకు కరెంటు ఇవ్వద్దని చెప్పాడని అన్నారు. ఉన్నతాధికారులు దయ ఉంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ వైపు అడుగులు పడాలి
తిరుపతి అర్బన్ : ఫుడ్ ప్రాసెసింగ్ వైపు రైతు సంఘాల ప్రతినిధులు, చిరు వ్యాపారులు అడుగులు వేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ ఈడీ సతీష్ నేతృత్వంలో వారాహి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్క రోజు వర్క్ షాపు నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు, పలువురు చిరు వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికనుగుణంగా రైతు సంఘాల ప్రతినిధులు, చిరువ్యాపారులు మారాల్సి ఉందని పేర్కొన్నారు. అనంతరం బిహార్ నుంచి విచ్చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ చైర్మన్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. కేంద్ర సర్కార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అందిస్తున్న రాయితీలను వివరించారు. ఆహారంగా తీసుకునే అన్ని వస్తువులకు చెందిన చిన్నపాటి యంత్రాలను కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రాయితీలు ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీహెచ్ఆర్వో దశరథరామిరెడ్డి, రాస్ ప్రతినిధి ప్రభాకర్, డీపీఎం షణ్ముగం,వారాహి ఫౌండేషన్ డైరెక్టర్లు హరికుమార్రెడ్డి, ఎల్డీఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దర్జాగా రేషన్ దందా
● ఆగని అక్రమ రవాణా ● మిల్లర్ల లైసెన్స్ పేరుతో టోకరా ● నకిలీ బిల్లులతో అక్రమ వ్యాపారం ● తమిళనాడు, ఏపీ రేషన్ బియ్యం తరలింపుసాక్షి టాస్క్ఫోర్స్ : పేదల నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతోంది. సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో తమిళనాడు, ఆంధ్రా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలు తమిళనాడుకు దగ్గరగా ఉండడంతో ఇక్కడ పలు ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని ఆంధ్రా, తమిళనాడు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసుకుని వాటిని గోతాలు మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ఈ వ్యాపారాన్ని స్థానికంగా ఉన్న కొన్ని రైస్ మిల్లులను కేంద్రంగా చేసుకుని అక్రమ రవాణా సాగించేవారు. దీనివల్ల కలిగిన ఇబ్బందులతో ఈ వ్యాపారాన్ని మిల్లర్లు మానేయడంతో పట్టణంలో లైసెన్స్ల పేరుతో అక్రమంగా రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారు. తమిళనాడు రేషన్ దుకాణాల్లో ఇచ్చే ఉప్పుడు బియ్యం, ఏపీలోని రేషన్ దుకాణాల్లో ఇచ్చే ఆంధ్రా బియ్యంను బ్లాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి పట్టణంలోని పలు ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేసి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ రేషన్ బియ్యానికి గోతాలు మార్చి మామూలు బియ్యం లాగానే బస్తాలను తయారు చేసుకుని ప్రతి రోజు ఇతర ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు రవాణా చేస్తున్నారు. దీనికి నకిలీ బిల్లులు తయారు చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి రోజూ చైన్నె నుంచి సూళ్లూరుపేటకు వస్తున్న సబర్బన్ రైళ్లో చిన్న చిన్న బస్తాలుగా తయారు చేసి తమిళనాడుకు చెందిన కొంత మంది సూళ్లూరుపేటకు తెస్తున్నారు. ఇక్కడ కొంత మంది చిల్లర వ్యాపారాలు కొనుగోలు చేసి గోదాములో నిల్వ చేసుకుంటున్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్న డీలర్లును కూడా మేనేజ్ చేసి రేషన్ బియ్యం బస్తాలను కొనుగోలు చేసి గోతాలు మార్చేసి అక్రమ రవాణా చేసేస్తున్నారు. కొనుగోళ్లు ఇలా.. తమిళనాడు ప్రాంతం నుంచి చిల్లరగా తెచ్చే రేషన్ బియ్యంను సూళ్లూరుపేటలో కొంత మంది కిలో రూ. 5 నుంచి 9 దాకా కొనుగోలు చేస్తారు. ఇలా రోజుకు సుమారు టన్నుకు పైగా కొనుగోలు చేసి గోతాలు మార్చి కొత్త బస్తాల్లాగా తయారు చేస్తారు. వీటితో పాటు తమిళనాడు పార్శిల్ ఆటోల ద్వారా అక్రమ రేషన్ బియ్యం తెస్తున్నారు. వీరి వద్ద నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి మిల్లర్లకు 15 నుంచి 20 రూపాయలు దాకా అమ్మేస్తారు. మిల్లర్లు ఆ బియ్యానికి పాలిష్ పట్టి మార్కెట్లోకి పంపించి కిలో 50 రూపాయల లెక్కన అమ్ముతారు.అదే విధంగానే ఏపీ రేషన్ బియ్యం కూడా ఇదే తరహాలోనే కొనుగోలు చేసి పాలిష్ పట్టి 25 కేజీల బస్తాలో సుమారు 8 కేజీలు దాకా పాలిష్ పట్టిన రేషన్ బియ్యం కలుపుతారు. ఇలా నెల్లూరు, విజయవాడ, మండపేట ప్రాంతాల్లో రైస్ మిల్లులకు తరలించి కోట్ల రూపాయలను ఆర్జిస్తుండడంతో అందరి చూపు ఈ అక్రమ రేషన్ వ్యాపారంపై పడింది. ఈ వ్యాపారంలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉండడంతో ఈ వ్యాపారాన్ని లక్షలాది రూపాయలు ముడుపులు పోలీసులు, విజిలెన్స్ వారికిచ్చి సజావుగా నడిపిస్తున్నారు. లెసెన్స్ బియ్యం వ్యాపారం దుకాణం పేరుతో ఈ అక్రమ వ్యాపారం చేస్తుండడం, అందరికీ నెల మామూళ్లు ఇస్తుండడంతో ఈ అక్రమ రవాణా గురించి తెలిసినా అధికారులు, పోలీసులు ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు.ఒకవేళ లారీని పట్టుకున్నా 6ఏ కేసు నమోదు బియ్యం అక్రమ రవాణాలో పట్టుకున్నా ఆదాయమే. ఎందుకంటే కేసుల కోసం పోలీసులు ఒకటి రెండు లారీలను పట్టుకుంటారు. వాటిపై 6ఏ కేసు నమోదు చేసి నెమ్మదిగా బియ్యం లారీలను రిలీజ్ చేస్తారు. నామమాత్రంగా ఒకరిద్దరు మీద కేసులు పెడతారు. ఈ తంతు బియ్యం అక్రమ వ్యాపారాలు చేసే వారికి అలవాటుగా మారిపోయింది. అందుకే పోలీసులు దాడులు చేసి ఎన్ని లారీల బియ్యం పట్టుకున్నా సరే అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఆపడం లేదు. ఇందులో ఉన్న లొసుగులను ఔపోసన పట్టేయడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక వారి ఇచ్చిన నెల మామూళ్లు తీసుకుని కేసుల కోసం మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకటి రెండు లారీలను పట్టుకుని కేసులు పెడుతున్నట్టుగా చేతులు దులుపేసుకుంటున్నారు. వాటాల కోసం కూటమి నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యాపారంలో వాటాలు కావాలని కూటమి నేతలు పట్టుబట్టడంతో కొద్దిరోజులు వ్యాపారాన్ని అపేశారు. ఇందులో ఒక బ్యాచ్ ఆపకపోవడంతో వారి లారీలను కూటమి నేతలు పట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత దీనిపై పెద్ద ఎత్తున రాజీ చర్చలు జరిగాయి. ఒక దశలో టీడీపీ అగ్ర నాయకులు దాకా కూడా ఈ వ్యవహారం వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బ్యాచ్ల మధ్య రాజీ కుదుర్చుకుని కూటమి నేతలకు నెల మామూళ్ల కింద వాటాలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకుని అక్రమ వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నారు. -
విలీనం.. ఆగని పోరాటం
కేవీబీపురం : ప్రభుత్వ బడుల విలీనానికి వ్యతిరేకంగా పాతపాళెం,ఏపీపురం, గురుకులకండ్రిగ తదితర గ్రామాల ప్రజలు శుక్రవారం ఆయా పాఠశాలల వద్ద ఆందోళనకు దిగారు. ఇరవై రోజులుగా మూతవేసిన పాఠశాలలను అధికారులు తెరిపించడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. బడులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విలీన ప్రక్రియ చేపట్టడం దారుణమని మండిపడ్డారు. రీమ్యాపింగ్ ద్వారా సమస్యను పరిష్కరిస్తేనే తమ పిల్లలను బడికి పంపుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు గురుకులకండ్రిగ వాసులు ఈఓపీఆర్డీకి వినతిపత్రం అందించారు. -
17 నుంచి ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు
తిరుపతి సిటీ : ఎస్వీయూ గంథ్రాలయం, యూజీసీ ఇన్ ప్లిబ్నెట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు క్యాలిబర్–2025 అనే అంశంపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ను శుక్రవారం వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏడు దేశాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని ఆర్గనైజర్ ప్రొఫెసర్ సురేంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య సుధారాణి, ఆచార్య చండ్రాయుడు, సైంటిస్ట్లు డాక్టర్ వల్లభ్ ప్రధాన్, శేఖర్, రాజన్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఎస్వీయూలో ఉద్యోగమేళా తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టూడెంట్స్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వర్సిటీలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య మురళీధర్, కో ఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ ఒక ప్రకటనలో తెలిపారు. పురుష అభ్యర్థులకు మాత్రమే జరిగే ఈ మేళాకు ప్రముఖ ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్వీయూలోని అన్నమయ్య భవన్కు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని సూచించారు. మా బడిని తరలించొద్దు రేణిగుంట : పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ మండలంలోని కుమ్మరపల్లెలోని బేసిక్ ప్రైమరీ స్కూల్ వద్ద శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. తమ పిల్లలు అంగన్వాడీ నుంచి ఐదో తరగతి వరకు మా ఊరిలోని బడిలోనే 40 మంది చదువుతున్నారని, వీరిలో ఎక్కువ మంది తుమ్మలగుంట గిరిజన పిల్లలు ఉన్నారన్నారు. విలీనం చేయడంతో 3 కిలో మీటర్ల దూరంలోని ఎల్ఎం కండ్రిగ స్కూల్కు 3,4,5 తరగతి పిల్లలు వెళ్లలేక పాఠశాల మాని ఇంటి వద్ద ఉన్నారని ఆవేదన చెందారు. ఆటో వాళ్లు ఒక రోజు వస్తే మరొక రోజు రారని అందువల్ల పిల్లలను బడికి పంపించేందుకు వీలు పడటం లేదని వాపోయారు. తూపిలిపాళెం భూముల పరిశీలన వాకాడు : మండలంలోని తూపిలిపాళెం సముద్ర తీరంలో శుక్రవారం ప్రభుత్వ భూములను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు తన బృందంతో కలసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ , గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్తో కలిసి నిలిచిపోయిన దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ నిర్మాణం చేపడతారనేది ఇంకా స్పష్టత రాలేదని, 2500 ఎకరాల భూములు సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని తహసీల్దార్ రామయ్య తెలిపారు. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ పనులు పూర్తి చేయండి చిల్లకూరు : చిల్లకూరు, కోట మండలాలలోని తీర ప్రాంత గ్రామాలైన తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో వందల ఎకరాలలో ఏర్పాటు చేయనున్న క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ కారిడార్ను శుక్రవారం ఏపీ ఇండ్రస్టియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్తో పాటుగా జిల్లా , డివిజన్ అధికారులు పరిశీలించారు. -
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా తిరుపతి అర్బన్ : కొత్తగా రానున్న విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు అర్జున్, రమేష్కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. అలిపిరి, తిరుపతి, మంగళం డిపోల్లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లోని పదోన్నతులు వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే డబుల్ డ్యూటీలు చేస్తున్న వారికి డీడీ అమౌంట్ పెంచాలన్నారు. విజయవాడలోని సీసీఎస్ ఆఫీస్ను బస్టాండ్కు 8 కిలోమీటర్ల దూరానికి మార్పు చేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండు చేశారు. ప్రధానంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. డీఏ బకాయిలను చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టారు. ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మస్తాన్, ప్రచార కార్యదర్శి సతీష్నాయుడు, సత్యనారాయణ, ఆయా డిపోలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రవేశం.. ఆక్రోశం
ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూజీ.. పీజీ సెట్ ఫలితాలు విడుదలైనప్పటికీ అడ్మిషన్లు చేపట్టకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. విద్యా సంవత్సంర ఆరంభమైనా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ కళాశాలల యాజమానులు ప్రవేశాల కోసం కాసుక్కూర్చున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేరి్పంచాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆలస్యం చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మిగలాల్సి వస్తుందేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్కు కొమ్ముకాసేలా ఉన్నత విద్యామండలి వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తిరుపతి సిటీ: విద్యా సంవత్సరం ప్రారంభమై మాసం గడిచింది. డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ, యూజీ కోర్సులలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి పీజీ, యూజీ సెట్ను మే, జూన్లో నిర్వహించింది. దాదాపు అన్ని పీజీ, యూజీ సెట్ల ఫలితాలు సైతం విడుదలయ్యాయి. కానీ, ఇప్పటి వరకు ఒక్క పీజీ, యూజీ కోర్సులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించిన పాపాన పోలేదు. కొన్ని పీజీసెట్లకు కౌన్సెలింగ్ అధికారులను సైతం ఇప్పటివరకు నియమించిన దాఖలాలు లేవు. జూలై ప్రారంభమైనా కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సందిగ్ధంలో తల్లిదండ్రులు పీజీ, యూజీ సెట్ల ఫలితాలు విడుదలైనా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కౌన్సెలింగ్లో పిల్లలకు సీటు దక్కకపోతే ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలలో ముందస్తు పీజీ, యూజీ, ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ పిల్లల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఇటు ప్రభుత్వ సంస్థలలో సీటు దక్కక అటు ప్రైవేటు కళాశాలల్లో సీటు దొరకని పరిస్థితిలో ఏంచేయాలనే అయోమయంతో ఉన్నారు. దీంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలలో టోకెన్ అమౌంట్ చెల్లించి సీటు రిజర్వ్ చేసుకుంటున్నారు. తప్పని ఎదురుచూపులు జిల్లాలో పలు పీజీ, యూజీ కోర్సులో చేరేందుకు సుమారు 80వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీ ఐసెట్, ఏపీ లాసెట్, ఏపీ పీజీఈ సెట్, ఏపీ ఈఏపీ సెట్, ఏపీ ఈసెట్, ఏపీ పీజీసెట్, ఏపీ ఎడ్సెట్ ఫలితాలు ఇప్పటికే విడుదలై కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో పాలిసెట్కు మాత్రం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ను ఈనెల 17వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నట్లు సమాచారం. మిగిలిన పీజీ సెట్లపై ఉన్నత విద్యామండలి ఇప్పటి వరకు కౌన్సెలింగ్ అధికారులను సైతం నియమించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. మరో పక్క ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాలు విడుదలై నెలకు పైగా గడుస్తున్నా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం సైతం కౌన్సెలింగ్ ప్రారంభించకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.అగమ్యగోచరం ఎంబీఏ, ఎంసీఏ, ఏంఏ, ఎమ్కామ్, ఎమ్మెస్సీ కోర్సులలో అడ్మిషన్లు వర్సిటీలలో దారుణంగా పడిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉన్నత విద్యామండలి అలసత్వమే. ప్రవేశ పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా కౌన్సెలింగ్ చేపట్టకపోవడంతో విద్యార్థులు తమకు సీటు రాదనే అనుమానంతో ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. – డాక్టర్ బి.ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడుసీటు వస్తుందో రాదో అని.. మా అబ్బాయి ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్లో అర్హత సాధించాడు. కానీ, ఇప్పటి వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ముందస్తుగా ఫీజు చెల్లించి సీఎస్ఈ కోర్సులో అడ్మిషన్ చేయించాం. సకాలంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వ విద్యాసంస్థలోనే చేర్పించేవాళ్లం. – ప్రమీలమ్మ, విద్యార్థి తల్లి, తిరుపతి -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం
సాక్షి, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద గురువారం రాత్రి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సుమారు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి ఏడవ మైలు వద్ద రహదారిపైకి వచ్చేందుకు ప్రయతి్నంచాయి.దీంతో అటు వెళుతున్న వాహనాలన్నీ నిచిపోయాయి. వెంటనే వాహనచోదకులు టీటీడీ అటవీశాఖకు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపారు. ఈ సందర్భంగా ఏనుగులు అటవీశాఖ సిబ్బంది పైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వారు చాకచక్యంగా ఏనుగులను అడవిలోకి తరిమేశారు. -
యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నం
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహరపేట అరుంధతీయ కాలనీకి చెందిన ఓ యువతిపై అదే ప్రాంతానికి చెందిన మొండెం ఉదయ్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్రహరపేటకు చెందిన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉదయ్ ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు చేరుకునేసరికి ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులకు విషపు అన్నమా! ఉప్మాలో జెర్రి... భోజనంలో బొద్దింక
నాడు జగన్ పాలనలో బడి పిల్లలకు ‘గోరు ముద్ద’లతో పౌష్టికాహారం అందించారు. నేడు కూటమి పాలనలో ‘పురుగుల’ అన్నం పెడుతున్నారు. ఒకటో తారీకున పాయకారావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల వసతి గృహంలో బొద్దింక భోజనాన్ని సాక్షాత్తు హోం మంత్రి అనితే రుచి చూశారు. మూడో తేదీన ఇలాంటిదే మరో సంఘటన. తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులకు పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. 64 మంది తినగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో తీసుకొస్తానంటున్న విప్లవాత్మక మార్పులు ఇవేనా? అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులు తినే ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. ఈ రెండు ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న భోజన వసతి ఏమేర ఉందో తేటతెల్లమవుతోంది. అసలేం జరిగిందంటే... తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో గురువారం ఉదయం ప్రార్థన జరుగుతుండగా ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారికి సపర్యలు చేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం తిన్న ఉప్మాలో జెర్రి వచ్చిందని విద్యార్థినులు వైద్యులకు తెలియజేశారు.విద్యార్థుల కథనం మేరకు.. తెలుగుగంగ కాలనీలోని బీసీ కళాశాల వసతి గృహంలో 84 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం ఉదయం 64 మంది విద్యార్థులకు ఉప్మాను అల్పాహారంగా అందించారు. యోష్ణ అనే విద్యార్థిని తనకు పెట్టిన ఉప్మాలో జెర్రి వచ్చిందని తోటి విద్యార్థులకు చూపించింది. దాంతో విద్యార్థులు ఎవరు ఉప్మా తినకుండా అక్కడ పడేసి కళాశాలకు బయలు దేరి వెళ్లిపోయారు.అయితే ప్రార్థన సమయంలో ఎం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యోష్ణ కళ్లు తిరిగి కిందపడిపోయింది. కడుపు నొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మునికుమారి, ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న అధ్యాపకులకు చెప్పారు. అధ్యాపకులు వెంటనే వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
– భర్త, కుటుంబ సభ్యులే చంపారంటూ ఆందోళన తడ : మండలంలోని అక్కంపేటలో గురువారం చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వివాహిత శిల్ప(26) అనుమానాస్పదంగా ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది. తమ బిడ్డ మృతికి భర్త, అతని కుటుంబ సభ్యులే చంపి ఉరి వేసినట్టు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తొలుత అక్కంపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చెయ్యడంతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం తడ పోలీస్ స్టేషన్కు చేరుకుని శిల్ప ఫొటోలతో ఆందోళన చేశారు. ఎస్ఐ కొండపనాయుడు ఆందోళన చేస్తున్న వారిని సర్దుబాటు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కాలం చెల్లిన ఔషధాల పంపిణీపై ఫిర్యాదు సత్యవేడు : సత్యవేడుకు చెందిన శోభారాణి బుధవారం రాత్రి ఓ క్లినిక్కు వెళ్లగా కాలం చెల్లిన మాత్రలు అంటగట్టారని డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. సత్యవేడులోని ఓ క్లినిక్కు వెళ్లి మెడికల్ షాపులో ఐదు రకాల మాత్రలు ఇచ్చారని, అందులో రెండు మాత్రలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. దీనిపై శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
ఏటీఎం కార్డు దొంగ అరెస్ట్
రేణిగుంట : ఏటీఎం సెంటర్ల వద్ద కార్డులు దొంగిలించి డబ్బులను విత్ డ్రా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో గురువారం సీఐ మంజునాథరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి జిల్లాలో పలు ఏటీఎంల వద్ద కార్డులను దొంగలించి, వారికి తెలియకుండా డబ్బులు విత్ డ్రా చేసేవాడని తెలిపారు. మే నెల 16వ తేదీ శెట్టిపల్లి ఎస్బీఐ వద్ద ఇదే తరహాలో దొంగతనం చేశాడని అన్నారు. ఎల్లమండ్యం ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చేసిన నేరాలను ఒప్పుకున్నాడని తెలిపారు. అతడి వద్ద వివిధ రకాల ఏటీఎం కార్డులు ఒక స్వైపింగ్ మిషన్, మొబైల్ ఫోన్, రూ.6000 డబ్బులు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ నిమిత్తం తిరుపతి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. సిబ్బంది మహేంద్ర, మణి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
● సుపరిపాలన కార్యక్రమంలో ప్రమాదం నాయుడుపేట టౌన్ : కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి షామియాన వేస్తున్న వ్యక్తి కందుకూరి మునీశ్వర్(45) విద్యుదాఘాతానికి గురై గురువారం మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని మహాలక్ష్మమ్మ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. తుమ్మూరుకు చెందిన మునీశ్వరయ్య అక్కడ హైరర్స్కు చెందిన యజమానికి స్నేహితుడు కావడంతో మహాలక్ష్మమ్మ నగర్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి షామియానా వేసేందుకు కార్మికులతో కలిసి వెళ్లాడు. లేదోటమ్మ ఆలయ సమీపంలో ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమానికి షామియానా వేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అప్పటికీ స్థానికులు అతడిని ప్రైవేట్ అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మునీశ్వరయ్య మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని మహాలక్ష్మమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మహా లక్ష్మమ్మ కాలనీలో విద్యుత్ వైర్లు ఇళ్లపైనే వేళాడుతూ.. చేతికందే ఎత్తులో ఉన్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు పేద కుటుంబానికి చెందిన మునీశ్వర్కు భార్య లలిత, రోహిణి, బిందు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునీశ్వర్ ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో వారి బోరున విలపించారు. సంఘటన స్థలంతో పాటు వైద్యశాల వద్ద లే.. డాడి అంటూ కుమార్తెలు రోదించిన తీరును చూసి చలించిపోయారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మునీశ్వర్ మృతి చెందడం బాధాకరమని, ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని అంత్యక్రియల కోసం రూ 50 వేల నగదును కుటుంబ సభ్యులకు అందించారు. అదే విధంగా మృతుడి ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నెలవల రాజేష్ తదితరులు ఉన్నారు. -
బాలిక మృతితో అప్రమత్తం
చంద్రగిరి : ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాలిక (16) విష జ్వరంతో బుధవారం మృతి చెందడంపై గురువారం వైద్యాధికారులు స్పందించారు. ఇందిరమ్మ కాలనీలో గురువారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపట్టారు. అదే విధంగా ప్రతి ఇంటి వద్ద యాంటి లార్వా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇందిరమ్మ కాలనీలో ఎవరికి ఎలాంటి జ్వరాలు లేవని వైద్యాధికారులు నిర్ధారించారన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాచి, చలార్చి తాగాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమ తెరలను వినియోగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వేడి ఆహారం, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సెల్వి యా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప కుమార్, పీహెచ్సీ వైద్యాధికారిణి ప్రియాంక, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం
తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద గురువారం రాత్రి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సుమారు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి ఏడవ మైలు వద్ద రహదారిపైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. దీంతో అటు వెళుతున్న వాహనాలన్నీ నిచిపోయాయి. వెంటనే వాహనచోదకులు టీటీడీ అటవీశాఖకు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపారు. ఈ సందర్భంగా ఏనుగులు అటవీశాఖ సిబ్బంది పైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వారు చాకచక్యంగా ఏనుగులను అడవిలోకి తరిమేశారు. -
అందని పాఠ్య పుస్తకాలు
● టీటీడీ పాఠశాలల్లోనూ విద్యార్థుల అవస్థలు ● పుస్తకాలు లేక నామమాత్రంగా విద్యా బోధన తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని టీటీడీ పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభమయ్యాయి. అయితే ఎయిడెడ్ మినహాయించి అన్ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నేటి వరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. దీంతో విద్యార్థులకు నామమాత్రంగా విద్యాబోధన అందుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ టీటీడీ విద్యాశాఖ స్పందించకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి సన్నిధిలో ఉన్నట్టుగా భావిస్తుంటారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకోవడం పూర్వజన్మ సుకృతమని సంతోష పడుతుంటారు. ఈ భావనతోనే తమ పిల్లలను టీటీడీ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతుంటారు. దీంతో టీటీడీ పాఠశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ నెలకొంది. తిరుపతిలో టీటీడీకి సంబంధించి 7 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మూడు పాఠశాలలు (హైస్కూల్) మాత్రమే ప్రభుత్వ గుర్తింపు (ఎయిడెడ్) కలిగి ఉన్నాయి. ఈ హైస్కూళ్లకు ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్లు అందాయి. మిగిలిన నాలుగు ఉన్నత పాఠశాలలు, వాటిలోనే ఉన్న 7ప్రాథమిక పాఠశాలలకు పుస్తకాలు నేటికీ అందలేదు. దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం టీటీడీ పాఠశాలలన్నింటికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా సరఫరా చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎయిడెడ్కు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించి చేతులు దులుపుకుంది. ఇటు కూటమి ప్రభుత్వం, అటు టీటీడీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ఏమిటో అర్థం కాలేదని తల్లిదండ్రులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే టీటీడీ యాజమాన్యం స్పందించి పాఠ్యపుస్తకాలను అందించాలని కోరుతున్నారు. ఎయిడెడ్కు అందించాం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన టీటీడీ ఉన్నత పాఠశాలలకు పాఠశాల తెరిచే నాటికే పాఠ్యపుస్తకాలను అందించాం. అన్ఎయిడెడ్ పాఠశాలలకు టీటీడీ యాజమాన్యమే పాఠ్యపుస్తకాలను అందించాల్సి ఉంది. –కేవీఎన్.కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ), తిరుపతి త్వరలోనే అందిస్తాం టీటీడీ పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని అనుకున్నాం. అయితే పాఠ్యపుస్తకాలను టీటీడీ కొనుగోలు చేసి పిల్లలకు అందించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ కారణంతోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే పాఠ్యపుస్తకాలను అందిస్తాం. –వెంకట సునీల్, టీటీడీ విద్యాశాఖాధికారి, తిరుపతి -
మద్యం మత్తులో కత్తితో దాడి
ఏర్పేడు : మండలంలోని గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీలో గురువారం ఓ వ్యక్తిపై మరొకరు కత్తితో నరికి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రుడు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు.. గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన సీతారాముడు మద్యం తాగి వీధిలో వెళుతూ, పక్కన కూర్చుని ఉన్న కేశవులు(45)ను మద్యం మత్తులో కత్తితో తలపై నరికాడు. తలపై బలమైన రక్తగాయం కావడంతో కేశవులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పాత కక్షలేవైనా.. ఉన్నాయా.. మద్యం మత్తులో నరికాడా.. అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నేడు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ తిరుపతి సిటీ : ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం సుదీర్ఘకాలం వేచి చూసిన విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం ఇస్తూ 18 వరకు వెబ్ ఆప్షన్లకు ఎంట్రీకి అవకాశం కల్పించనున్నారు. 22న సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేయనున్నారు. 23 నుంచి 26వ తేదీ వరకు సీట్లు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగష్టు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మే 21 నుంచి 27 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్షలు నిర్వహించగా జూన్ 8న ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై సుమారు నెల రోజుల తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుండటం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు పొందిన విషయం తెలిసిందే. -
సర్వ దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధ రాత్రి వరకు 74,510 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో భక్తులు హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై దాడి
చంద్రగిరి:వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా చంద్రగిరి మండలంలో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. మహిళా సర్పంచ్ కుటుంబంపైన, ఆతర్వాత దళిత మహిళపై దాడి ఘటనలు మరువక ముందే దళిత నాయకుడు, వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురానికి వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన భార్య ఎంపీటీసీ సభ్యురాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రవీణ్కుమార్పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలో జాతర నిర్వహణపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రవీణ్, గ్రామంలోని వెంకటరమణకు ఫోన్చేసి జాతర వివరాలను అడిగారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త అమ్మగుంట శీను, వెంకటరమణ వద్ద నుంచి ఫోన్ లాక్కుని ప్రవీణ్ను నానా దుర్భాషలాడాడు. ‘‘నువ్వు ఇక్కడు రారా.. ఇప్పుడున్నది మా ప్రభుత్వం. నిన్ను ఇక్కడ చంపకపోతే చూడు రా.. నా...’’ అంటూ దుర్భాషలాడాడు. కాసేపటికి ప్రవీణ్ గ్రామ పెద్దల వద్దకు వెళ్లాడు. వెంటనే అక్కడే ఉన్న కర్రలతో అమ్మగుంట శీను ఒక్కసారిగా ప్రవీణ్పై దాడికి తెగబడ్డాడు. దీంతో ప్రవీణ్ తల పగిలి, తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే స్థానికులు శీనును నిలువరించి, ప్రవీణ్ను హుటాహుటిన చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసిన టీడీపీ కార్యకర్త చంద్రగిరిలో క్షీణిస్తున్న శాంతి భద్రతలువైఎస్సార్సీపీలో ఉన్నాననే నాపై దాడి వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తుడడంతోనే తన పై టీడీపీ కార్యకర్త దాడికి తెగబడ్డాడని బాధితుడు ప్రవీణ్ వాపోయారు. టీడీపీ నేతలు తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకే రక్షణ కరువైతే సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో మార్పు
ఏర్పేడు : మెటీరియల్ సైన్స్ అను సంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చరర్ హాల్లో గురువారం ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ సామగ్రి– నిర్మాణ రంగం–2025పై 3వ అంతర్జాతీయ సమావేశం ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని నిర్మాణ రంగంలో సాంకేతిక మేళ వింపుపై ప్రసంగించారు. వర్జీనియా టెక్ (యుఎస్ఎ), క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ (యుకె), మోనాష్ యూనివర్సిటీ మలేషియా, ఐఐటీ బాంబే, ఎన్ఐటీ కాలికట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయ మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించడంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్రను పోషిస్తోందన్నారు. డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, డాక్టర్ అలెగ్జాండర్ బ్రాండ్, డాక్టర్ నారాయణన్ నీతలత్, డాక్టర్ వెంకటేష్ కోడూర్, డాక్టర్ మైక్ ష్లైచ్, డాక్టర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణుల ప్రసంగిస్తూ నిర్మాణ శాస్త్రం పురోగతిని గురించి వివరించారు. సమావేశంలో ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సురేష్జైన్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి ఐఐటీలో ప్రారంభమైన 3వ అంతర్జాతీయ సమావేశం -
సమ్మెకు తాత్కాలిక బ్రేక్
● రిలే దీక్షలు కొనసాగించనున్న స్విమ్స్ కార్మికులు తిరుపతి తుడా : విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన స్విమ్స్ కార్మికుల దెబ్బకు అధికారులు దిగొచ్చారు. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి గురువారం స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, ఏఎస్పీ మనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్ చేరుకుని కార్మికుల డిమాండ్లు న్యాయ పరమైనవేనని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక సమ్మెను కార్మికులు తాత్కాలికంగా విరమించుకుని రిలే నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. అత్తపై అల్లుడు దాడి ● అత్తకు తీవ్ర గాయాలు నాయుడుపేటటౌన్ : అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి అత్త ప్రశ్నించిదనే కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. అగ్రహారపేటకు చెందిన మహేశ్వరి, ఆమె కుమార్తె మునికుమారిని తాళ్లురు రవీంద్రనాథ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే రవీంద్రనాథ్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అల్లుడిని అత్త నిలదీసింది. దీంతో అత్తపై కోపంతో బుధవారం రాత్రి అగ్రహారపేటలో అత్త మహేశ్వరి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి వైద్యశాలకు తరలించారు. బాధితురాలి భర్త మునీంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబి తెలిపారు. ఆటో బోల్తా..: వృద్ధుడి మృతి గూడూరు రూరల్ : ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని విందూ రు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు విందూరు ఎస్టీ కాలనీకి చెందిన చిల్లకూరు చెంచయ్య(69) సైదాపురం మండలం జోగిపల్లిలో పీర్ల ఉత్సవానికి మేళం వాయించేందుకు మరో నలుగురితో కలసి ఆటోలో బయలుదేరాడు. గ్రామ సమీపంలోని చర్చి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెంచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గూడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
● సంక్షేమ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ● నాసిరకం వంటకాలే కారణమా? ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ప్రభుత్వ వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైన వంటలు, అపరిశుభ్రమైన పరిసరాలు, పర్యవేక్షణ లేని అధికారుల తీరుతో వసతి గృహాల నిర్వహణ గాడితప్పింది. ప్రశ్నించే వారు లేరనే నిర్లక్ష్యంతో కొంత మంది నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థులను అర్ధాకలికి గురిచేస్తూ క్షోభ పెడుతున్నారు. వండిపెట్టే ఆహారం కూడా తరచూ కలుషితం కావడంతో విద్యార్థులు ఆస్పతుల పాలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. వసతిగృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జగనన్న పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి కరికులం అందించి వారి ఉన్నతికి బాటలు వేసేలా విప్లవాత్మకమైన పథకాలను విద్యారంగంలో అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది. హాస్టళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకమైన భోజనం అందిస్తున్నారు. సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. దీంతోనే మొన్న సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి అనిత బీసీ హాస్టల్లో విద్యార్థులతోపాటు తినేందుకు కూర్చుంటే ఆమెకు పెట్టిన ఆహారంలోనే బొద్దింక కనిపించడం రాష్ట్రమంతా చూశారు. ఇక్కడ వరుసగా హాస్టళ్లలో విద్యార్థులు విషాహారం తిని ఆస్పత్రులపాలవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా పరిస్థితిని చక్కదిద్దాలి. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యమే హాస్టళ్లలో తరచూ విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతుండడం దురదృష్టకరం. చాలా హాస్టళ్లలో వంట సిబ్బంది కొరత ఉంది. ఉన్నచోట వారు రాకుండా సహాయకులను పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారు. దీంతోనే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. శ్రీకాళహస్తిలో హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు సరైన మౌలిక వసతులను కల్పించాలి. – చంద్రశేఖర్, ప్రగతి సంస్థ మండల కోఆర్డినేటర్, శ్రీకాళహస్తి రేణిగుంట బీసీ హాస్టల్లో శిథిలావస్థలో విద్యార్థుల మరుగుదొడ్లు (ఇన్సెట్) దెబ్బతిన్న బాత్రూమ్ తలుపులు ఏర్పేడు :‘‘ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. విద్యార్థులు తినే ఆహారంలో నాసిరకమైన వంట సరుకులు వాడుతుండ టంతో పాటు అపరిశుభ్రమైన పరిసరాలతో తరచూ విద్యార్థు లు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సంక్షేమ వసతి గృహాధికారులు పేద పిల్లలపై సవతి తల్లి ప్రేమ చూపు తూ వారికి ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగుతున్నారన్న విమర్శలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.’’ శ్రీకాళహస్తి పట్టణంలో గతనెల 24వ తేదీన బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పులిసిన ఇడ్లీ పెట్టడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా గురువారం శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఉదయం పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షం కావడంతో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో 8 హాస్టళ్లు ఉన్నాయి. రెండు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 2 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పలు హాస్టళ్లకు వెళ్లి దత్తత తీసుకుని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తామని, హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు అధునాతన హంగులతో కూడిన వసతులను అందించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ ఉంటుందని డబ్బాలు కొట్టుకున్నారు. అయితే ఒకటి, రెండు హాస్టళ్ల గోడలకు సున్నం కొట్టించి అభివృద్ధి ప్రారంభమైందని సోషల్ మీడియాలో ఆర్బాటంగా ప్రచారం చేశారు. పర్యవేక్షణ లోపించి.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసుకునే వార్డెన్ల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదు. హాస్టల్ , వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. మెనూ ప్రకారం సక్రమంగా అమలు చేయకుండా కొందరు వార్డెన్లు కక్కుర్తి చూపుతూ విద్యార్థులను అర్దాకలికి గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏడాది కిందట రేణిగుంట బీసీ హాస్టల్లో విద్యార్థులకు ప్రైవేటు ఫంక్షన్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పెట్టడంతో వాంతులు, విరేచనాలతో ఆప్పట్లో 20 మంది ఆస్పత్రికి చేరారు. తాగే నీటి తొట్లు పాచిపట్టి ఉన్నట్లు గుర్తించి అప్పట్లో ఉన్నతాధికారులు వార్డెన్ నిర్లక్ష్యంపై తీవ్రంగా మందలించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు చేయకపోవడం గమనార్హం. వార్డెన్ సస్పెన్షన్ – ఇన్చార్జిగా విజయ శ్రీకాళహస్తి : బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో ఇన్చార్జిగా విజయను నియమించారు. వంట మనిషి అంకమ్మను విధులు నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. -
బీఎస్ఎన్ఎల్ అవగాహన సదస్సు రేపు
తిరుపతి సిటీ: తిరుపతి బిజినెస్ ఏరియా, భారత్ టెలికాం నియంత్ర సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు తమ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ వెంకోబరావు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ హైజన్, సైబర్ మోసాల నివారణ అనే అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పలు అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వినండహో.. ఇది గ్రామస్తుల హెచ్చరిక – ఇసుక ట్రాక్టర్ వస్తే..రూ.1000 జరిమానా తిరుపతి రూరల్ : ఆ దారిలో ఇసుక ట్రాక్టర్లకు అనుమతి లేదు.. అలా కాదని వస్తే.. రూ.1000 జరిమానా విధించబడును.. అంటూ గ్రామ పంచాయతీ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.. బోర్డు పెట్టడమే కాదు.. ఆ గ్రామస్తులు ఇసుక ట్రాక్టర్లు వస్తే అందరూ ఏకమై అడ్డుకుంటున్నారు. తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ పంచాయతీలో ఇరుకు రోడ్లు ఉన్నప్పటికీ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి పిల్లలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు రోడ్డు దాటాలన్నా ఇబ్బంది పడేవారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులతో కలసి తమ గ్రామంలోకి ఇసుక ట్రాక్టర్ వస్తే రూ.1000 లు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఆ మేరకు గ్రామంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా సరే రాత్రివేళ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులను గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇసుక ట్రాక్టర్లు వస్తే రూ.1000 కచ్చితంగా వసూలు చేస్తుండటంతో చాలా మంది ఇసుక అక్రమార్కులు ఆ గ్రామం మీదుగా ట్రాక్టర్లు తీసుకురావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
మామిడి..
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో..మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని ఐఐటీ డెరెక్టర్ అన్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి వైఎస్సార్సీపీ నరసింగాపురం పంచాయతీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్పై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడిచేశాడు. ఘనంగా ఐసీఎస్ఐ స్నాతకోత్సవంశుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025– 8లోతిరుపతి మంగళం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్లోని పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయకుండా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్న జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మారానని చెప్పి .. ధర పెంచకుండా మారాం చేస్తున్నారు! ఆర్కే.రోజా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకై క నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పొగాకు, మిర్చి, మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు తాను మారానని చెప్పి అధికారంలోకి వచ్చాక కుక్కతోకర వంకర లాగా బుద్ధి చూపుతారన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులకు అండగా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నప్పుడే చంద్రబాబుకు రైతుల కష్టాలు గుర్తొస్తాయా? అని ప్రశ్నించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏడాదిలో ఏదో పొడిచేసినట్లు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం మాయాజాలంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందే తప్ప ప్రజల మద్దతుతో కాదన్నారు. ఈనెల 9వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే.రోజా, ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్రెడ్డి, వెంకటేగౌడ్, సునీల్కుమార్, లలితకుమారి, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నూకతోట రాజేష్, కృపాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ను పరిశీలిస్తున్న వైఎస్సార్సీపీ నేతలుతపాలా బీమా ఏజెంట్ల ఉద్యోగాలకు అవకాశం తిరుపతి సిటీ : తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సంస్థలో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ఎంపికై న ఏజెంట్లకు ఆకర్షణీయమైన ఆర్థిక భరోసాతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డెవలప్మెంట్ ఆఫీసర్ రంజిత్ కుమార్ను 93907 36277 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు తిరుపతి ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2,323 మంది, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 364 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఇది వరకు జూన్ 30వ తేదీ వరకున్న అడ్మిషన్ల గడువును పొడిగించారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐఓ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు భద్రతా చర్యలు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ హర్షవర్దన్రాజు తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం తిరుమల పోలీసు సిబ్బందితో కలిసి ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ లేపాక్షి ఏరియా బాలాజీనగర్, కల్యాణకట్ట, అఖిలాండం, పీఏస్–1, సీఆర్వో కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్లో బాంబ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ డీఎస్పీ విజయ్ శేఖర్, సీఐలు విజయ్ కుమార్, శ్రీరాముడు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఐఐహెచ్టీ స్పాట్ అడ్మిషన్లు వెంకటగిరి రూరల్:పట్టణంలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమో కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఓఎస్డీ గిరిధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదో తరగతిలో మార్కుల ప్రాతిపదికన సీట్లు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించాలని కోరారు. తిరుపతి సిటీ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కంపెనీ కార్యదర్శులుగా బహుముఖ పాత్రలు పోషించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆర్థిక స్థితిని మదింపు చేసే కీలక బాధ్యతలు చేపట్టే ప్రధానమైన కోర్సును పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ఉపాధ్యక్షులు పవన్ జి చందక్, కౌన్సిల్ సభ్యుడు సీఎస్ మోహన్ కుమార్, సీఎస్ వెంకటరమణ, ఐసీఎస్ఐ ఎస్ఐఆర్సి చైర్మన్ సీఎస్ మధుసూధనన్, ప్రీతి కౌశిక్ బెనర్జీ పాల్గొన్నారు. – 8లో– 8లోన్యూస్రీల్నష్టాల్లో మామిడి రైతు మద్దతు ధర లేక రోడ్డు పాలుచేస్తున్న అన్నదాతలు వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్ 9న బంగారుపాళ్యానికి రాక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి, భూమన పిలుపు ఏ ప్రాంతానికెళ్లినా జన సునామీనే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన జన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగనన్న వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో మామిడి రైతులు మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడు తూ చంద్రబాబు సొంత జిల్లాలో మామిడిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మామి డి పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్నారని చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎల్లో మీడి యాకు కనిపించవా? అని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే రైతు సంక్షేమమని గుర్తుచేశారు. ‘చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటికందకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. ఇల్లూవాకిలి వదిలి పంటనెత్తుకుని జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద.. ర్యాంప్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతును ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగుతున్నారు. చెట్లు నరికివేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. మామిడి రైతుకు అండగా నిలిచేందుకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముందుకొస్తున్నారు. ఈనెల 9న బంగారుపాళ్యానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనను కలసి కట్టుగా విజయవంతం చేయాలి’ అని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
వీసీ కోసం వెతుకులాట!
● ఎస్వీయూ వైస్ చాన్సలర్ నియామకానికి సెర్చ్ కమిటీలు తిరుపతి సిటీ : ఎస్వీయూ వీసీ నియామకంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడాదిగా పూర్తి స్థాయి వైస్ చాన్సలర్ను నియమించేందుకు ఇప్పటికే రెండు సార్లు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల సమావేశమైన రెండో సెర్చ్ కమిటీ ఓ మంత్రి తోడల్లుడు సిఫార్సు చేసిన రెండు పేర్లతో పాటు ప్రస్తుత ఇన్చార్జి వీసీ పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై తమ వారిని పక్కన పెట్టారని కూటమిలో భాగమైన ఓ ప్రధాన పార్టీ నేత మండిపడ్డట్టు సమాచారం. ఈక్రమంలో వీసీ నియామక ప్రక్రియ సందిగ్ధంలో పడింది. మొదటి, రెండో సెర్చ్ కమిటీ సమర్పించిన నివేదికలను రద్దు చేసి ప్రస్తుతం మరోసారి మూడో సెర్చ్ కమిటీని నియమించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రాంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒత్తిడిలో కమిటీలు ప్రధానంగా ఎస్వీయూ వీసీ నియామకంపై ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలపై రాజకీయ ఒత్తిడి అధికంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే సెర్చ్ కమిటీలో సభ్యులుగా తమను ఎంపిక చేయవద్దని పలువురు ఉన్నత విద్యామండలి అధికారులకు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. ప్రతిభ, అనుభవం, సామాజిక వర్గ సమీకరణల ప్రాతిపదికన వీసీ నియామకానికి సమర్థులైన ముగ్గురు వ్యక్తులను సెర్చ్ కమిటీ ప్రతిపాదిస్తే వాటిని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పట్లో ఎస్వీయూకు పూర్తి స్థాయి వీసీ నియామకం జరిగేలా లేదని పలువురు చర్చించుకుంటున్నారు. -
బడి కోసం..ఆగని పోరాటం
నాయుడుపేటటౌన్ : పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలు విద్యాభ్యాసం చేసే ప్రాథమిక పాఠశాలలను మోడల్ బడుల్లో విలీనం చేసేందుకు తెగబడుతోందని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు నాయుడుపేట చంద్రబాబు నాయుడు కాలనీలోని బడిలో ఉన్న 3,4,5 తరగతులను చదివే విద్యార్ధులను తుమ్మూరు మోడల్ పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నిరసన తెలిపారు. బడికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ప్రధానోపాధ్యాయిని ప్రేమలీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మునిరత్నం హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. నచ్చజెప్పి పాఠశాలకు తాళం తీయించారు. ఈ సందర్భంగా స్కూల్కమిటీ చైర్పర్సన్ నిర్మల మాట్లాడుతూ 25 మంది విద్యార్థులను తుమ్మూరులోని పాఠశాలకు పంపడం దారుణమన్నారు. రైలు పట్టాలు దాటుకుని పిల్లలు అంత దూరం వెళ్లలేరని స్పష్టం చేశారు. హైవేపై ధర్నా నారాయణవనం: మా పిల్లలు మా ఊరి బడిలోనే చదవాలంటూ బుధవారం మండలంలోని ఇప్పన్తాంగాళ్ దళితవాడ పాఠశాల పిల్లలు, తల్లులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. 14 మంది విద్యార్థులను 3 కిలోమీటర్ల దూరంలోని డీకే పాళ్యం మోడల్ స్కూల్కు పంపడానికి ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. బీఎస్పీ సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి ధనుంజయ మాట్లాడుతూ బడుల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు. -
కొలువుల కోత
● రేషనలైజేషన్ పేరుతో సచివాలయాల కుదింపు ● ప్రశ్నార్థకంగా ఉద్యోగుల భవిత ● ప్రభుత్వ వైఖరిపై సిబ్బంది ఆగ్రహం తిరుపతి అర్బన్ : క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, సత్వరమే సేవలు అందించే సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కక్షగట్టింది. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టింది. ఈ మేరకు జిల్లాలోని 691 సచివాలయాలను 353కి తగ్గించింది. అదే క్రమంలో 5,625 మంది సిబ్బందికి గాను 3,650 మందికి మాత్రమే ప్రస్తుత బదిలీల్లో పోస్టింగ్ ఇచ్చింది. మిగిలిన 1,975 మంది సచివాలయ సిబ్బంది భవితను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఉద్యోగుల తగ్గింపు! సచివాలయాల్లోని ఒక్కో విభాగంలో 30 నుంచి 80 మంది ఉద్యోగులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఒక్కో సచివాలయంలో 30 విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిలో భారీగా కోత విధించినట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన బదిలీల్లో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే రేషనలైజేషన్ నేపథ్యంలో ఖాళీలు లేవని...ఏదో ఒకచోట సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. అప్పటి వరకు వారంతా రిజర్వులోనే ఉండాల్సిన దుస్థితి దాపురించింది. నిబంధనలకు నీళ్లు ఇటీవల చేపట్టిన బదిలీల్లో నిబంధనలకు నీళ్లు వదిలేశారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పోటీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు పొందామని గుర్తు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కూటమి నేతల సిఫార్సు ఉన్నవారికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అలాగే లంచాలు ముట్టజెప్పిన వారికి సైతం ప్రాధాన్యమిచ్చారని మండిపడుతున్నారు. మిగిలిన వారిని పట్టించుకోకుండా రిజర్వులో పెట్టేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేతనం కూడా నిలిపేసే ప్రమాదముందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.డివిజన్ గతంలో ప్రస్తుతం సచివాలయాల సంఖ్య తిరుపతి 245 125 శ్రీకాళహస్తి 154 82 సూళ్లూరుపేట 137 68 గూడూరు 155 78 మొత్తం 691 353జిల్లా సమాచారం -
స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధికి ప్రణాళికలు
అధికారులతో సమీక్షించిన కలెక్టర్ తిరుపతి అర్బన్: స్వర్ణ నారావారిపల్లి–2029 అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధికి ఇప్పటి వరకు చేపట్టిన అంశాలు, చేయాల్సిన పనులపై ప్రత్యేక అధికారి, డీపీఓ సుశీలాదేవిని ప్రశ్నించారు. ఆమె చేపడుతున్న పనులను వివరించారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయ సంఘాలకు రుణాల మంజూరు, వ్యవసాయ రంగానికి సంబంధించి కిచెన్ గార్డెనింగ్, టెరరస్ గార్డెనింగ్పై గుర్తించిన కుటుంబాలకు శిక్షణ ఇవ్వడం, రైతుల పొలాల్లో కిట్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వివరించారు. డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్, సీపీఓ వెంకటేశ్వర్లు, పశుసంవర్థకశాఖ ఏడీ ప్రసాద్, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్, మార్కెటింగ్ ఏడీ సురేంద్రబాబు, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్రనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నరేంద్రబాబు, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి శేషాచలం రాజు పాల్గొన్నారు. -
నగదు చెల్లించలేదని నిరసన
వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం సమీపంలోని రెడ్డిగుంట వద్ద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన దళితుల భూములను తమిళనాడుకు చెందిన కొందరు భూస్వాములు కొనుగోలు చేశారు. సుమారు 60 మంది రైతులు 60 ఎకరాలను ఏడాది క్రితం విక్రయించారు. ఎకరా రూ.17 లక్షల చొప్పున కొనుగోలు చేసిన భూస్వాములు, ఒక్కో రైతుకు రూ.15 లక్షలు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మిగిలిన రూ.2 లక్షల సొమ్మును చెల్లిస్తామని నమ్మబలికారు. అయితే ఈ ఏడాది గడిచిపోయినా పెండింగ్ నగదు చెల్లించకనే కొనుగోలు చేసిన భూముల్లో ప్రహరీగోడ పనులను చేపట్టారు. బుధవారం ఈమేరకు బాధిత రైతులు అక్కడకు వెళ్లి నిర్మాణ పనులు చేపట్టుకోవాలని పనులు అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయి నగదు చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు అక్కడే నిరసన తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
శ్రీకాళహస్తి : మండలంలోని తొండమనాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. ఏర్పేడు మండలం బండారుపల్లెకు చెందిన పూజారి శోభన్బాబు లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి తిరుపతి వైపు చేపల లోడ్తో వెళుతుండగా తిరుపతి నుంచి విజయవాడకు వెళుతున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శోభన్బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పచ్చనేతను వదిలేసి.. పక్కనోళ్లపై కేసు చంద్రగిరి : మండలంలోని జరిగిన ఓ దాడి కేసులో అసలు సూత్రధారి అయిన పచ్చనేతను పోలీసులు వదిలేసి, ఆయనతో కలిసి వెళ్లిన వారిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. వివరాలు.. సోమవారం ఏ.రంగంపేటలో మద్యం దుకాణం వద్ద స్థానిక టీడీపీ నేతకు, నారావారిపల్లెలోని మరో నేతకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఏ.రంగంపేటకు చెందిన టీడీపీ నేతను ఆయన ఇంటికే వెళ్లి, నారావారిపల్లెకు చెందిన నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పగ పెంచుకున్న రంగంపేట టీడీపీ నేత, కొంత మంది యువకులతో కలసి నారావారిపల్లెలోని టీడీపీ నేత ఇంటికి వెళ్లి దాడికి దిగారు. దీంతో ఆ నేత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గొడవకు ప్రధాన కారణమైన ఏ.రంగంపేట టీడీపీ నేతను ఫిర్యాదులో తప్పించి, ఆయన వెనుక వెళ్లిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారిని వదిలేసి, అమాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై మండిపడుతున్నారు. నేటి నుంచి తిరుపతి ఐఐటీలో అంతర్జాతీయ సదస్సు ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్స్పై గురువారం నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఐఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. నిర్మాణ రంగం మెటీరియల్, టెక్నాలజీ, హెల్త్ మానిటరింగ్, రెట్రోఫిట్టింగ్, స్మార్ట్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చించనున్నారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా
ఓజిలి: నెల్లూరు– చైన్నె జాతీయ రహదారిపై పెదపరియ క్రాస్ సమీపంలో బుధవారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్ నుంచి చైన్నెకు గ్యాస్లోడ్తో లారీ వెళుతోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగింది. అయితే గ్యాస్ లీక్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాలువ కట్ట కింద మృతదేహం డక్కిలి : మండల కేంద్రానికి సమీపంలో తెలుగు గంగ కాలువ కట్ట కింద ఓ వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం ఆలస్యంగా గుర్తించారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో కట్టపై వాకింగ్ చేస్తున్న వారు అక్కడి ముళ్లపొదల్లో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివ శంకర్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అన్నంరాజుపల్లెకు చెందిన కోండూరు రవీంద్రరాజు (60)గా గుర్తించారు. మృతుడు రెండు రోజులు కిందట దేవునివెల్లంపల్లి స్తంభాలగిరీశ్వరయ్యస్వామి ఆలయంలో అవధూత గురుకల పోలయ్యస్వామి ఆరాధన మహోత్సవానికి వచ్చాడని, అతిగా మద్యం తాగడంతో మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
అక్రమ అరెస్ట్ పై ఆగ్రహం
తిరుపతి రూరల్ : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని, ఆయన కుమారుడు మోహిత్రెడ్డిపై సైతం కక్షగట్టిందని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామాన్ని కాపాడు మహాత్మా అంటూ.. బుధవారం భాకరాపేటలోని పార్టీ కార్యాలయం నుంచి గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి అరెస్ట్కు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి సీడీసీఎంస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డి, ఎంపీపీ యుగంధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. సహదేవరెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, జగనన్న సైనికులను జైలుకు పంపి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సిట్ అధికారులు లిక్కర్ కేసులో తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, దీనికి భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఎంపీపీ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను బిడ్డల్లా చూసుకున్న చెవిరెడ్డికి కష్టం వస్తే ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యుడికే వచ్చినట్టు బాధపడుతున్నారని తెలిపారు. సింహాల మోహన్ మాట్లాడుతూ చెవిరెడ్డిపై ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టినా, కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ యశోద, రామచంద్రాపురం జెడ్పీటీసీ సభ్యులు ఢిల్లీరాణి మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, భాకరాపేట సర్పంచ్ భూపాల్, యూత్ అధ్యక్షుడు మునిరెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు. ● భాకరాపేటలో భారీ ర్యాలీ.. నిరసన -
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగు తీసిన భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుపతిలో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగుచూసింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో భక్తులు పరుగు తీశారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో, ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా షాపులో ఉన్న ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్దమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
యూరియా.. ఏదయా..?
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రైతులను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడి సాయంగా అందించాల్సిన అన్నదాతా సుఖీభవ నిధుల సంగతి దేముడెరుగు, కనీసం సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు సంగతి నామమాత్రమేనని చర్చ సాగుతోంది. ముఖ్యంగా రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులు 80వేల ఎకరాల్లో వరి పంట సాగు చేపట్టారు. ఇందుకోసం 35వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. అయితే వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 7,500 మెట్రిక్ టన్నుల యూరియాను అందించినట్లు చెబుతున్నారు. రైతులకు 27,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా కావాల్సి ఉంది. ఈక్రమంలో ప్రైవేటు వ్యాపారులు 17,500 మెట్రిక్ టన్నులు విక్రయించినట్లు తెలుస్తుంది. అయినప్పటికి మరో 10వేల మెట్రిక్ టన్నులు యూరియా అన్నదాతలకు అవసరమవుతోంది. ఈ సీజన్లో పంట చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో పంటకు వేయాల్సిన యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. సాధారణంగా యూరియా బస్తా రూ. 266.50కి విక్రయించాల్సి ఉంది. అయితే కొందరు ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి, బస్తా యూరియాను రూ. 285 నుంచి రూ.300లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
అరణియార్లో చేపల వేటపై నిషేధం
నాగలాపురం : పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టులో ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం విధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, ఎఫ్డీఓ మధుసూదన్రావు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో రెండు నెలల పాటు వేటను నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఆదేశాలను అతిక్రమిస్తే మత్స్యకారుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సహకరించాలని కోరారు. దివ్యాంగులకు ఉచిత శిక్షణ తిరుపతి అర్బన్ : జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నట్లు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు మీరా షైనీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చేసిన 19–34 ఏళ్ల వారు మాత్రమే అర్హులని వెల్లడించారు.ఆసక్తిగలవారు సదరన్ సర్టిఫికెట్తోపాటు ఆధార్కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో తిరుపతిలోని భవానీ నగర్ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో యూత్ ఫర్ జాబ్స్ కార్యాలయానికి రావాలని కోరారు. ఇతర వివరాలకు 9347411952 నంబర్లో సంప్రదించాలని సూచించారు. హస్త కళాకారులకు అండగా ఉంటాం తిరుపతి అర్బన్ : జిల్లాలోని హస్త కళాకారులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసువులేటి హరిప్రసాద్తో కలిసి డీఆర్డీఏ, డీఐసీ, లేపాక్షి, శిల్పారామం, టూరిజం, నాబార్డ్ , హ్యాండ్ లూమ్స్, ఖాదీ బోర్డ్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హస్త కళంకారీకి మార్కెట్ కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఉత్పత్తి, లాభం, ప్రచారం నినాదంతో కళాకారులకు చేయూతనందిస్తామన్నారు. అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల ఏడీ సత్యమూర్తి, చేనేత వస్త్రాల ఏడీలు రమేష్, వెంకట రావు,ి మూర్తి, ఎల్డీఎం రవికుమార్, పర్యాటకశాఖ ఆర్డీ రమణ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఏపీడీ ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్, సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు తిరుపతి అర్బన్ : జిల్లాలో డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జూన్ 6 నుంచి మొత్తం 8 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 33,181 మంది అభ్యర్థులకు గాను 30,952 మంది హాజరైనట్లు వెల్లడించారు. 2,229 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేసేందుకు సహకరించివన అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల హోటళ్లలో ధరలపై అసత్య ప్రచారం తిరుమల : తిరుమలలోని హోటళ్లలో ఆహార పదార్థాల ధరలపై సోషల్ మీడియాల్లో సాగుతోందని అసత్య ప్రచారమని టీటీడీ స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తప్పుడు వార్తలను వైరల్ చేసి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించింది. భక్తులకు ఎలాంటి సమాచారం కావల్సి వచిన్నా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, కాల్ సెంటర్ 180042 54141కు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించింది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
రెచ్చిపోతే సహించం
తిరుపతి మంగళం/ చంద్రగిరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడుల్లో గాయపడిన పనపాకం, ముంగిలిపట్టు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలను బుధవారం ఆయన పరామర్శించారు. భూమన మాట్లాడుతూ పనపాకంలో దళిత కుటుంబానికి చెందిన వైఎస్సార్సీపీ నేత అజయ్ ఆయన భార్య రోజాతో పాటు వారి సోదరిపై టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేశారన్నారు. బాధితుల దుస్తులు చించివేసి, చెప్పు కాళ్లతో తన్ని విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లేడని, ఇక జైలు నుంచి రాడని, చెవిరెడ్డి మోహిత్రెడ్డి నియోజకవర్గంలో లేడనే ధైర్యంతో పచ్చమూక రెచ్చిపోతోందని, ఇకపై వారిని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ నేత సుబ్రమణ్యం నాయకుడు కక్షగట్టి, కళ్లలో కారం కొట్టి అజయ్, ఆయన సతీమణి రోజాపై దుర్మార్గంగా దాడి చేశాడన్నారు. అలాగే ముంగిలిపట్టు సర్పంచ్ భారతి, ఆమె భర్త దామోదర్నాయుడు, కుమారుడు భార్గవ్పై టీడీపీ నాయకులు దాడులకు తెగబడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ తాళిబొట్టు కూడ తెంచేసి కుమారుడు భార్గవ్ చెయ్యి విరిచేశారన్నారు. ఈ క్రమంలో మాకు అధికారం వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చూపే తీవ్రత ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమచంద్రకుమార్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, నేతలు పొర్లపల్లె చంద్రశేఖర్రెడ్డి, అగరాల భాస్కర్రెడ్డి, మస్తాన్, దేవారెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్రెడ్డి, ఒంటి శివ, కొత్తపాటి కోటి, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, ప్రవీణ్, సూరి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటాం టీడీపీ గూండాల దౌర్జన్యాలను అడ్డుకుంటాం దళితులు, మహిళలపై దాడి అమానుషం బాధితులను పరామర్శించిన భూమన -
రసాభాసగా తడుకు ప్రజాభిప్రాయ సేకరణ
పుత్తూరు : మండల పరిధిలోని తడుకు సచివాలయం వద్ద బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. సర్పంచ్ వెంకటేశు అధ్యక్షతన సభ నిర్వహించారు. పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. తడుకు రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 182/పి లోని 6 హెక్టార్లు ఆర్.మధుసూదన్రావు రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ వారికి, సర్వే నంబర్ 507/2 లోని 2.520 హెక్టార్లు శ్రీకనకదుర్గ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు ఇ–వేలం ద్వారా బిల్డర్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందుకు గాను లీజు జారీ చేయడానికి గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి స్థితిగతులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తడుకు పంచాయతీ ఎంపీటీసీ సుబ్బరత్నమ్మ భర్త గంగాధరం మాట్లాడడానికి ప్రయత్నించగా క్వారీ సిబ్బంది అడ్డుకున్నారు. బలవంతంగా సచివాలయం గదిలోకి తీసుకెళ్లి తాము పరిష్కరిస్తామంటూ గంటకు పైగా నిర్భందించారు. అనంతరం పట్టుబట్టి బయటకు వచ్చిన గంగాధరం ఆర్డీఓ రామ్మోహన్కు వినతిపత్రం అందజేసి, క్వారీలకు అనుమతి ఇవ్వరాదంటూ కోరారు. అలాగే గుంతకల్లు, తాడిపత్రి నుంచి వచ్చిన పర్యావరణ వేత్తల బృందాన్ని సైతం మాట్లాడడానికి సాక్ష్యాత్తు పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ అనుమతించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పర్యావరణవేత్తల బృందానికి, క్వారీ యజమానుల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ గందరగోళం మధ్యనే సభను ముగించారు. కార్యక్రమంలో పొల్యూషన్ ఏడీ మధన్మోహన్రెడ్డి, ఏఈ శశికళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
● అక్రమ అరెస్ట్పై ఆగ్రహం
8లో..చెవిరెడ్డి అరెస్ట్కు నిరసనగా బుధవారం భాకరాపేటలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయిఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూజీ.. పీజీ సెట్ ఫలితాలు విడుదలైనప్పటికీ అడ్మిషన్లు చేపట్టకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. విద్యా సంవత్సంర ఆరంభమైనా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ కళాశాలల యాజమానులు ప్రవేశాల కోసం కాసుక్కూర్చున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేర్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆలస్యం చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మిగలాల్సి వస్తుందేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్కు కొమ్ముకాసేలా ఉన్నత విద్యామండలి వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
వీణ్ని అంతం చేస్తే వైఎస్సార్సీపీలోకి ఇంకెవ్వరూ వెళ్లరు!
సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుండగా.. వారికి వంత పాడుతున్న పోలీసుల అచేతనానికి రాష్ట్రం సిగ్గుపడాల్సి వస్తోంది. మహిళా సర్పంచ్ కుటుంబంపై మంగళవారం టీడీపీ మూకలు దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే మరో ఘోరం జరిగింది. 11నెలల పసికందును చంకలో పెట్టుకుని తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న దళిత మహిళ బట్టలు చించి, పసికందుతో పాటు ఆ మహిళ గుండెలపై కాళ్లతో తొక్కి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన అమానుష ఘటన సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత మండలం తిరుపతి జిల్లా చంద్రగిరిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనపాకం దళితవాడకు చెందిన అజయ్ పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీకి చెందిన జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడి అనుచరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అజయ్ ఇంట్లో ఉండగా.. సుబ్రహ్మణ్యం అనుచరులు లోకేశ్, వామనమూర్తి, గురవయ్య, కిషోర్, చక్రవర్తి, నాగేష్, బుజ్జమ్మ, పద్మ, చంద్రకళ, మునిరాజమ్మలతో కలిసి ఇంటిపై గొడవకు వెళ్లారు. ‘వీడు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అజయ్ తల్లిదండ్రులు, చెల్లెలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి కళ్లలో కారం కొట్టి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మహిళ బట్టలు చించి.. గుండెలపై తొక్కి.! తన భర్త అజయ్పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడడంతో అతని భార్య 11 నెలల పసికందును చంకలో పెట్టుకుని పరుగున బయటకు వచ్చారు. దాడిని అడ్డుకొని వారిని ప్రశ్నించగా.. టీడీపీ గూండాలు దళిత మహిళ అని కూడా చూడకుండా ఆమె బట్టలు చించేసి దారుణంగా కొట్టారు. చంటి బిడ్డతో సహా ఆమెను కింద పడేసి, గుండెలపై కాళ్లతో తొక్కుతూ రాక్షసానందం పొందారు. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకున్నారని, లేకుంటే తమను చంపేసి ఉండేవారంటూ ఆ దళిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పథకం ప్రకారమే దాడి.. డీఎసీఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆదేశాలతో పక్కా పథకం ప్రకారమే తమపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అజయ్ వాపోయారు. ఏడాదిన్నరగా విడతల వారీగా వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి చొరవతో మాతమ్మ ఆలయాన్ని నిర్మించామని, ఏడాదిన్నరగా ఆలయంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. దాడిపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధితులు కన్నీటిపర్యంతం అయ్యారు. అనంతరం టవర్క్లాక్ సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఘటనపై బాధితుడితో పాటు అతని భార్యను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. కాగా, ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళితులపై దాష్టికాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. -
అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష
తిరుపతి సిటీ: ఎస్వీయూ అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష పేరుతో చేపట్టిన ఇంటర్వ్యూలు అగ్ని పరీక్షలుగా మారాయి. గత విద్యా సంవత్సరంలో అకడమిక్ కన్సల్టెంట్లు, కో–ఆర్డినేటర్ల పనితీరుపై వీసీ చాంబర్లో మంగళవారం నుంచి ప్రారంభమైన ఇంటర్వ్యూలకు వీసీ, రిజిస్ట్రార్తో పాటు పలు విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. సంబంధిత సబ్జెక్ట్లో కమిటీ సంధించిన ప్రశ్నలకు అకడమిక్ కన్సల్టెంట్లు వైట్బోర్డ్పై డెమో ఇచ్చారు. తొలిరోజు పలు విభాగాల్లో పనిచేస్తున్న 43మంది తాత్కాలిక అధ్యాపకులు ఇంటర్వ్యూలకు హాజరై పనితీరు పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే ఎస్వీయూలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తాత్కాలిక అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం బాధాకరమని వారు వాపోతున్నారు. ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో పెద్ద సంఖ్యలో అకడమిక్ కన్సల్టెంట్లను తొలగించే వ్యూహంలో భాగంగానే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఇంటర్వ్యూలకు పలు విభాగాల నుంచి మరో 200మంది అకడమిక్ కన్సల్టెంట్లు హాజరుకానున్నారు. -
రీ కౌన్సెలింగ్ కోసం ఉద్యోగుల ధర్నా
తిరుపతి అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేనందున రీ కౌన్సెలింగ్ చేయాలంటూ మహిళా పోలీసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా సంరక్షణ కార్యదర్శులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్, ఉద్యోగ సంఘం మహిళా నేతలు విజయలక్ష్మి, నజ్మా, జ్ఞానాంబిక, శాంత కుమారి తదితరులు మాట్లాడారు. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో రెండు రోజుల క్రితం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల్లో పారదర్శకత లేదని చెప్పారు. రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని వారంతా డిమాండ్ చేశారు. వార్డు పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క వార్డుకు, మండల పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. ప్రధానంగా పంచాయితీల్లో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి కాకుండా 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలానికి బదిలీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల్లో పూర్తిగా సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రాన్ని అందించారు. దీంతో ఆయన చిత్తూరు ఎస్పీ మణికంఠకు ఫోన్ చేసి మాట్లాడి, సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ ఉద్యోగులు దివ్యభారతి, కుమారి, నిహారిక, యోగప్రియ, లక్ష్మీప్రసన్న, లావణ్య, కళ్యాణి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్
తిరుపతి క్రైం: శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఆరుసార్లు చోరీలకు పాల్పడిన ముగ్గురిని సోమవారం సాయంత్రం శ్రీకాళహస్తి మిట్ట కండ్రిగ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు తమిళనాడు రాష్ట్రం, వందలూరు కండ్రిగకు చెందిన మూతం మని మారన్ అలియాస్ మనీ(27), వెంకటగిరి చెందిన మారి మాణిక్యం(25), శ్రీకాళహస్తికి చెందిన కొట్టం బేటి రాజా(20)గా తేలిందన్నారు. వీరి నుంచి రూ.13 లక్షలు విలువ చేసే 139 గ్రాముల బంగారు, హీరో స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేస్తున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు, క్రైమ్ పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు. 55 మందిపై నిఘా జిల్లా వ్యాప్తంగా 55 మంది చెయిన్ స్నాచర్లపై నిఘా పెట్టమని ఎస్పీ పేర్కొన్నారు. వారిలో ఇప్పటికే 40 మందిని పూర్తిస్థాయిలో గుర్తించామన్నారు. వీరందరిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నామని తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాడుబడ్డ గృహాల వద్ద ఐదుగురు యువకులు గంజాయి తాగుతూ డ్రోన్ కెమెరాలకు దొరికారన్నారు. వీరందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి, కేసులు నమోదు చేశామన్నారు. -
ఘనంగా సీజీఎస్టీ వార్షికోత్సవం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): తిరుపతిలోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) కమిషనరేట్ పరిధిలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 8వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కార్యాలయ ఆవరణలో శ్రీసరళీకృత పన్నులు, పౌరుల సాధికారత్ఙ అనే థీమ్పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో పన్నుల చెల్లింపులలో అగ్రశ్రేణి సంస్థలుగా గుర్తించిన ఏడింటిలో శ్రీసిటీలోని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు అవార్డు దక్కింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, తిరుపతి సీజీఎస్టీ కమిషనరేట్ అదనపు కమిషనర్ ఆర్.దినకరన్ సమక్షంలో గుంటూరు సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి.ఆనంద్ కుమార్ ఎంపిక చేసిన సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. 30 వరకు జన సురక్ష తిరుపతి అర్బన్: జన సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 774 పంచాయతీల్లోనూ ఈ నెల1 నుంచి 30 వరకు జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరో సమావేశంలో జేసీ శుభం బన్సల్తో కలిసి మాట్లాడుతూ, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణపనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా డిసిప్లినరీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
తిరుపతి క్రైమ్: అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీటీడీ విజిలెన్స్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన సతీమణి అమ్ములుకు రూ.5 లక్షల డీడీని ఎస్పీ అందజేశారు. విరమణ పొందిన హోంగార్డుకు సత్కారం జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకటరమణ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు వేతనం రావలసిన రూ.5 లక్షలు అందజేశారు. -
తరిగిపోతున్న పింఛన్లు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లు కూడా కరిగిపోతున్నాయి. గత ఏడాది జూన్లో జిల్లాలో 2,71,183 మందికి సామాజిక పింఛన్లు అందించారు. ఈ ఏడాది జూలైలో 2,59,732 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. కూటమి పాలనలో జిల్లాలో 11,451 పింఛన్లు తగ్గించారు. ప్రతి నెలా సుమారుగా వెయ్యి పింఛన్లు తగ్గిస్తున్నారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నిస్తే, పింఛన్లు తగ్గించలేదని వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. తొలగించిన వారి జాబితా ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు. మరోవైపు జిల్లాలో గత ఏడు నెలలుగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.6వేలు పింఛన్లు తీసుకుంటున్న వారిని తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. వీరి జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితా వస్తే అందులో ఎంత మందిని తొలగించేస్తారోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు రూ.4వేలు పింఛన్ తీసుకుంటున్న వారిని జూలైలో తనిఖీలు చేస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా జిల్లాలో పింఛన్ల ఏరివేత కొనసాగుతోందన్న విషయం మాత్రం తేలిపోయింది. వితంతు పింఛన్లకు కొత్త మెలిక వితంతు పింఛన్లలో జాప్యం లేకుండా గత ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటూ భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు 7వేల మంది ఉన్నట్లు ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. వీరికి పింఛన్లు వస్తాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. -
కాళంగినదిలో మునిగి వ్యక్తి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: కాళంగి నదిలో నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు, గ్రామానికి చెందిన బాబురెడ్డి (54) గేదెలను పోషణతో జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కాళంగి నది సమీపంలోని పొలాల వద్దకు గేదెలను తోలుకుని వెళ్లారు. గెదేలు నదిలోకి దిగి రాకపోవటంతో వాటిని బయటకు తీసురావటానికి నీటిలో దిగాడు. అయితే ఈతరాని బాబురెడ్డి నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన అక్కడి రైతులు బాబురెడ్డిని నీళ్ల నుంచి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందడంతో వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బాబురెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ విశ్వనాథనాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనల హోరు
చంద్రగిరి: ప్రజానేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడంపై నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ అధినేత వైఎస్ జగన్కు వివరించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు, అక్రమాలపై అధినేతకు వివరించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ సూచించినట్లు కొటాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విధుల నుంచి ఉపాధ్యాయుడి తొలగింపు బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్ల ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్న హరిబాబును విధుల నుంచి తొలగిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు రమణయ్య మంగళవారం తెలిపారు. హరిబాబు 02.08.2017 నుంచి 26.08.2024 వరకు 7 సంవత్సరాల 25 రోజులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై విచారణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏడాది కంటే ఎక్కువ కాలం విధులకు హాజరు కాకుంటే ఆయన్ను ప్రభుత్వ సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. 30.06.2025 నుంచి హరిబాబును ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. రేపు అన్ఎయిడెడ్ బంద్ తిరుపతి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు గురువారం బంద్ చేపడుతున్నట్లు అపుస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలలపై అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలను నిరసిస్తూ బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నియమాలు సరిగ్గా పరిశీలించకుండా ఎటువంటి నోటీసులు, చర్యలకు ఉపక్రమించకూడదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
భార్య పుట్టింటికి.. భర్త ఆత్మహత్మ
చిల్లకూరు : భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు తిప్పగుంటపాళెంలో మిక్సెడ్ కాలనీకి చెందిన తాటిపర్తి ఏడుకొండలు(25)కు ఉషాతో వివాహమైంది. కొంత కాలంగా సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు చోటు చోసుకోవడంతో 8 నెలల క్రితం ఆమె పుట్టింటికెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం రోజున స్థానికులకు కనిపించిన ఏడుకొండలు తరువాత కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పరిశీలించగా, ఇంటిలోపలి నుంచి గడియ వేసి ఉంది. దీంతో తహసీల్దార్ శ్రీనివాసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపులు తీసి లోపలకు వెళ్లిన పోలీసులు కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 95.89 శాతం పంపిణీ తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ మంగళవారం తొలి రోజు 95.89 శాతం మందికి అందించినట్లు డీఆర్డీఏ పీడీ శోభనబాబు తెలిపారు. జూలై నెలకు 2,59,732 మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా, 2,49,054 మందికి అందించామని వెల్లడించారు. మిగిలిన వారికి బుధవారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
మేయర్కు దక్కని గౌరవం
● పార్లమెంటు జాతీయ స్థాయి సదస్సుకు మేయర్లు, చైర్ పర్సన్లకు ఆహ్వానం ● తిరుపతిలో మేయర్ పేరును విస్మరించిన కూటమి ప్రభుత్వం ● ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ పేరు ప్రతిపాదన ● కూటమి నేతల తీరుపై విమర్శల వెల్లువ తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాక తొలిసారి మేయర్ ఎన్నికలను 2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించింది. మేయర్ స్థానం ఓసీ మహిళ రిజర్వుడ్ కాగా బీసీ మహిళకు కేటాయించేలా నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, యువ నేత భూమన అభినయ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వీరి విజ్ఞప్తి మేరకు పార్టీ అధిష్టానం తిరుపతి మేయర్ స్థానాన్ని బీసీ మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వైఎస్సార్సీ పీ తరఫున మేయర్గా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీపడ్డారు. విద్యావంతురాలిని బరిలోకి దింపాలని భూమన తిరుపతిలో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్గా విశేష సేవలు అందిస్తూ, వివాదరహితురాలుగా గుర్తింపు పొందిన డాక్టర్ ఆర్ శిరీషను ఎంపిక చేశారు. ఈమె ఎంపికపై నగరవాసులు, మేధావులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేయర్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా 49 స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించడం విశేషం. నగర ప్రథమ పౌరురాలికి దక్కని గౌరవం నాడు బీసీ మహిళకు అగ్రతాంబూలం ఓసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించి వైఎస్సార్ సీపీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, తమ పార్టీకి బీసీలు అంటే బ్యాక్ బోన్ అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేకమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ శిరీషను ఏరికోరి మేయర్ ను చేసి బీసీలకు పట్టం కట్టారు. నేడు కూటమి ప్రభుత్వం అదే మహిళను అవమానించేలా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. బీసీలు సైతం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా యాదవులు తమ వర్గానికి చెందిన మహిళకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందు బీసీల పాట పాడే చంద్రబాబు ఎన్నికలయ్యాక బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తుంటారని ఓ వర్గం మండపడుతోంది. రెండో డిప్యూటీ మేయర్ పేరు హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా నిర్వహించే జాతీయ సెమినార్కు తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీషను వెళ్లనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ జాతీయ సెమినార్కు గుంటూరు కార్పొరేషన్ నుంచి మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ని, మరో మున్సిపాలిటీ నుంచి చైర్ పర్సన్తో పాటు వైస్ చైర్మన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం తిరుపతిలో మాత్రం మేయర్ను పూర్తిగా పక్కన పెట్టి రెండవ డిప్యూటీ మేయర్ను మాత్రమే పంపించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నగర ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన కనీస మర్యాదను కూడా ఇవ్వకుండా వ్యవహరించడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. వివాదరహితురాలైన మేయర్ను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ముఖ్యంగా బీసీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఇలా బీసీ మహిళా మేయర్ పట్ల అవమానించేలా వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. మేయర్ స్థానంలో రెండవ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణను పంపించడం ఏంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను మాత్రమే పంపించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు కారణమైంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా భారత పార్లమెంటు నిర్వహిస్తున్న ‘ది రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రంత్నింగ్ కాంట్రట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై జాతీయ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తోంది. జూలై 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ జాతీయ కాన్ఫరెన్స్కు ఆయా రాష్ట్రాల నుంచి మేయర్లు, చైర్ పర్సన్లను పంపించాలని పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థల నుంచి మేయర్లు, మున్సిపాలిటీల నుంచి చైర్ పర్సన్లను పంపించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం జాతీయ సదస్సుకు ఎవరెవరిని పంపించాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు కక్ష సాధింపుగా, ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత లేకుండా చేసేలా ఉండడంపై రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చిన్న పదవుల్లో ఉన్నా ఎంపిక చేసి ఉన్నత పదవుల్లో ఉన్న మేయర్లకు మొండి చేయి చూపించి, ఆ పదవులకు అవమానం తెచ్చేలా వ్యవహరించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్లమెంటు నిర్వహించే ఈ అత్యున్నత జాతీయ సదస్సుకు వైఎస్సాఆర్సీపీకి చెందిన మేయర్లు, చైర్ పర్సన్లను పంపించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. -
పట్టుబడిన చైన్స్నాచర్
సత్యవేడు: వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకుని పారిపోతున్న దుండగుడిని స్థానిక యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు పంచాయతీ పరిధిలోని పాపానాయుడు పేట వీధిలో కే.నాగమ్మ(85) మంగళవారం ఉదయం మార్కెట్కు వెళ్లింది. తిరిగి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఈమె పరిస్థితి గమనించిన తమిళనాడులోని నేమళ్లూరుకు చెందిన ఈ.ప్రదీప్ వెంబడించాడు. పాపానాయుడు వీధి సమీపంలో జనసంచారం తక్కువ ఉండడంతో ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని పరుగు తీశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంబడింయి చాముండేశ్వరి థియేటర్ సమీపంలో పట్టుకొని, ఎస్ఐ రామస్వామికి అప్పగించారు. బాధితురాలికి బంగారు గొలుసును అప్పగించారు. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న యువకుడు జగన్ను పోలీసులు అభినందించారు. -
ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎమ్మార్పల్లిలోని మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కేవీఎన్.కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన మంగళవారం ఆ పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని, పాఠశాల రికార్డులను పరిశీలించారు. హెచ్ఎం, ఇతర ఉపాధ్యాయులు గత ఏడాది కంటే తక్కువగా అడ్మిషన్లు చేయడం, ఒకటో తరగతి విద్యార్థుల వివరాలను యూడైస్లో నమోదు చేయడంలో హెచ్ఎం అలసత్వం వహించడం, తరగతుల వారీగా బోధనకు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడం వంటి అంశాలను గుర్తించారు. దీంతో వివరణ కోరుతూ ఆ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు. -
తొలిరోజే తాళాలు
తిరుపతి అర్బన్: కూటమి సర్కార్ మళ్లీ మొదటికే వచ్చింది.. తొలి రోజు తిరుపతి నగరంలో చాలా వరకు రేషన్ షాపులు తెరుచుకోలేదు. కొందరు తెరిచినా సర్కర్ పనిచేయకపోవడంతో తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దీంతో సంచులు, కార్డులు క్యూలో పెట్టిన లబ్ధిదారులు ఏం చేయాలో తెలియక కాసేపు ఎదురుచూసి వెళ్లిపోయారు. అతికష్టం మీద నడుచుకుంటూ వచ్చిన వృద్ధులు, సరుకులు ఇవ్వకపోవడంతో ఊత కర్ర పొడుచుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ వెళ్లిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల పాటు రేషన్ దుకాణాల్లో కందిపప్పు ఎగనామం పెట్టారు. కేవలం బియ్యంతోనే సరిపెట్టారు. ఆ తర్వాత మూడు నెలలు బియ్యం, చక్కెర మాత్ర మే అందించారు. ఆ తర్వాత నాలుగు నెలలు కందిపప్పు అరకొరగా అందించారు. రెండు నెలల నుంచి మళ్లీ కందిపప్పు కొందరికే ఇస్తూ వచ్చారు. తాజాగా జూలైలో కందిపప్పు ఇవ్వకుండా కేవలం బియ్యం, చక్కెరతోనే సరిపెట్టేశారు. జిల్లాలో 1457 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 6 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. అయితే తొలి రోజు సర్వర్ సమస్యలతో పలు దుకాణాల్లో సరుకులు ఇవ్వడం మానేశారు. కొన్ని దుకాణాల్లో గంటల కొద్ది పడిగాపులు కాయాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు క్యూలో ఉండలేక, ఇంటిదారి పట్టారు. మరోవైపు జిల్లాలో 345 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జిలకు అప్పగించారు. వారంతా కాసేపు చూసి.. సర్వర్ పనిచేయకపోవడంతో దుకాణాలు మూసివేశారు. దీంతో కార్డుదారులు బిక్కముఖంతో ఇంటిదారి పట్టారు. -
టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!
● ఇంటింటికీ వెళ్లాలంటే భయం ● మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేదు ● కనీసం కాయలను కొనుగోలు చేయని వైనం ● పింఛన్లు, తల్లికి వందనంలో కోతపై లబ్ధిదారుల ఆగ్రహం అడుగడుగునా అక్రమాలే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు జేసీబీల, ఇటాచీలు, లారీలు, టిప్పర్లతో ప్రకృతి సంపదను తరలించి సొమ్ముచేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అక్రమార్కులకు అధికారులు తోడయ్యారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకటం లేదు. ఉచిత ఇసుక గురించి పట్టించుకునే ఎమ్మెల్యేలు, అధికారులు కరువయ్యారు. కూటమి నేతలు ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి సొంతం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. వేరొకరి అనుభవంలో ఉన్నా.. దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇలా ఏడాది పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలను నిలదీసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లటానికి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సుపరిపా లన పేరుతో ఇంటింటికీ వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఏడాది పాలనలో పథకాలు అమలు చేయకపోవటం, ఉమ్మడి జిల్లాలో మామిడి రైతులు ఆగ్రహంగా ఉండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు స్థానికులు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? అనేదానిపై ఎమ్మెల్యేలు అధికారులు, స్థానిక టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై శ్రీచంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూశ్రీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపట్టనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ముందే సుపరిపాలన పేరుతో ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి, ప్రారంభించేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ వెళ్లనున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. పథకాలు అడగరా? ఏడాది కూటమి పాలనలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పింఛన్లు తొలగించిన వారే సుమారు 32 వేల మంది ఉన్నారు. వాటి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతి లేదు. పింఛను కోల్పోయిన వారు, కొత్తగా ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేలను నిలదీస్తారని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డులు లేవు, ఉన్న కార్డులకు పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వటం లేదు. కేవలం బియ్యం మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. మరో వైపు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది ప్రారంభమై ఖరీఫ్ సీజన్ మొదలైనా పైసా విదల్చలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఇతరత్రా హామీలు అమలు చేయకపోవటంపై లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారు. భయపెడుతున్న మామిడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో గత కొంత కాలంగా రైతులు మామిడి దిగుబడులను అమ్ముకోలేక వారి అవస్థలు వర్ణనాతీతం. మామిడి దిగుబడులతో రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు వేచి ఉన్నా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా ఫలితం కనిపించలేదు. అధికారులు ఆదేశించినా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రావడం లేదు. దీంతో మామిడి రైతులు కడుపు మండి చెట్లను నరికేసుకుంటున్నారు. మరి కొందరు కాయలను రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే రైతులు విరుచుకుపడుతారన్న భయం టీడీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. -
ఎస్వీ యూ అధికారుల ‘స్టంట్లు’
తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారులు డిగ్రీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ స్టంట్లు చేస్తున్నారు. ఇన్స్టంట్ పరీక్షలకు ఫీజులు కట్టుకున్నారు కానీ వర్సిటీ నిబంధనల ప్రకారం హాల్ టికెట్లు పొందడానికి మాత్రం వారికి అర్హత లేదంటూ ప్రకటించారు. దీంతో మంగళవారం ఎస్వీయూ పరీక్షల విభాగం వద్ద సుమారు వంద మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ 2022–25 బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు సంబంధించి 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్షలకు ఫీజులు కట్టించుకుని హాల్టికెట్లు జారీ చేయలేదన్నారు. అడిగితే వర్సిటీ నూతన నిబంధనల ప్రకారం మీరు అర్హులు కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సెక్షన్ అధికారులు రిజిస్ట్రార్, వీసీలను సంప్రదించి చర్చలు జరిపారు. ఫలితంగా 2022–25 బ్యాచ్ విద్యార్థులకు ఐదవ సెమిస్టర్ పరీక్షకు సంబంధించి హాల్టికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకోసం బుధవారం నుంచి జరగనున్న ఇన్స్టంట్ పరీక్షలను వచ్చే జూలై 7 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు వెనుదిరిగారు. ఏడు పాఠశాలల్లో ఆధార్ నమోదు తిరుపతి ఎడ్యుకేషన్ : ఆధారు కార్డు లేని 1నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల సౌకర్యార్థం తిరుపతి జిల్లాలో 7 పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) డాక్టర్ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా గూడూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, నాయుడుపేట జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, తిరుచానూరు జెడ్పీహెచ్ఎస్, తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం నగరపాలక హైస్కూల్, శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు జెడ్పీహెచ్ఎస్, పుత్తూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. యూడైస్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో వారికి అందేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో డీవైఈఓలు, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు తమ పరిధిలో ఆధార్ లేని విద్యార్థులను గుర్తించి సమీప పాఠశాలల్లో ఆధార్ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు. ఏపీపీఈసెట్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఆచార్య నాగార్జున వర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 25, 26వ తేదీల్లో నిర్వహించిన ఏపీపీఈసెట్–2025 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. వర్సిటీలోని బీపీఈడీ, డీపీఈడీ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు ఎస్వీయూ పరిధిలో 492 మంది పరీక్షకు హాజరుకాగా 463మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 344మంది, మహిళలు 119మంది ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 11మంది విద్యార్థులు టాప్ 50ర్యాంకులల్లో చోటు సంపాదించారు. -
మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
● తొలుత కిలోకు రూ.12, ఆపై రూ.6 ప్రకటించిన వైనం ● క్షేత్ర స్థాయిలో కిలో రూ.3 కూడా దక్కక రైతుల ఆవేదన ● అయినా సరే కాయ కొనడానికి ముందుకురాని ఫ్యాక్టరీలు ● అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పంట అమ్మడానికి అగచాట్లు ● నిద్రాహారాల్లేక ఫ్యాక్టరీల ఎదుట ఎదురుచూపులు ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దయనీయ పరిస్థి ఇంటికి పోయే పరిస్థితి లేదు కాణిపాకం నుంచి గుడిపాల సరిహద్దులో ఉన్న ఫ్యాక్టరీకి కాయలు తెస్తే రూ.5వేలు బాడుగ. ఒక్కరోజు అయినా..రెండు రోజులు..మూడు రోజులు అయినా ఇదే రేటు. ఇక్కడకు కాయలు తెస్తే.. అన్లోడింగ్ అయ్యేందుకు ఐదు రోజులు పడుతోంది. అంతవరకు ఓపికతో ఉండాల్సిందే. ఇంటికి పోను.. రాను అంటే కుదరదు. – రవి, బొమ్మసముద్రం, ఐరాల మండలం టోకెన్లు అమ్ముకుంటున్నారు వారం పది రోజులుగా తిండీనీళ్లు లేకుండా రోడ్లపై అవస్థలు పడుతున్నాం. రాత్రి సమయాల్లో అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్మకై ్క దొడ్డి దారిన టోకెన్లు అమ్ముకుని డైరెక్టుగా 10, 20 వాహనాలు లోపలకు పంపించేస్తున్నారు. ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దోమల బెడదతో నిద్రాహారాలు లేకుండా మేము అవస్థలు పడుతుంటే కొందరు మాత్రం దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. – బాబునాయుడు, జీడీనెల్లూరు కన్న బిడ్డల్లా సాకినాం సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడు కున్నాం. కన్నబిడ్డల్లా గా పండించాం. ఇప్పు డు మామిడి పంట మొత్తం కిలోమీటర్ల మేర రోడ్లపై పడి ఉంది. నాలుగైదు రోజుల నిరీక్షణలతో టార్ఫాలిన్పట్ట వేడికి లోలోపలే కుళ్లిపోయి, జ్యూసులా రోడ్లపై కారిపోతోంది. అధికారులు ఫ్యాక్టరీలు ప్రత్యేక చొరవ చూపించాలి. – శ్రీనివాసరెడ్డి, పెనుమూరు మండలం చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడినిచ్చింది. ఇందులో తోతాపురి రకం నుంచి గుజ్జు (పల్ఫ్)ను తయారుచేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఫలితంగా ప్రతీ ఏటా దాదాపు 40 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి రకాన్ని రైతాంగం సాగుచేస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మొదలయ్యింది. కానీ మామిడిని కొనడానికి ఏ ఒక్క ఫ్యాక్టరీ ముందుకు రావడం లేదు. ఒకవేళ కొన్నా కిలోకు సగటున రూ.4 –5 చెల్లిస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూ.3 మాత్రమే పలుకుతోంది. చేతికొచ్చిన పంట అమ్ముకోలేక, ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర లభించక అన్నదాతకు గుండెకోత మిగులుతోంది. చేజేతులా కోల్పోతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఫ్యాక్టరీలు మామిడిని కొనకపోవడంతో రైతు కంట కన్నీళ్లు ఆగడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం కిలోకు రూ.6 చెల్లించాలని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకునే దిక్కులేదు. ముందుగా ఫ్యాక్టరీ వద్దకు రైతు వచ్చి టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ నెంబర్ వస్తే తప్ప మామిడిని లోపలకు తీసుకెళ్లడానికి వీల్లేదు. రెండు రోజులు అలాగే ఉంచేస్తే 40 శాతం పంట పనికిరాదు. చిన్నపాటి వర్షం పడితే వంద శాతం పంట రోడ్డుపై పడేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిల్చోవడం, తోపులాటలు, పోలీసులు–ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదాలు.. ఇవన్నీ ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలు ఉంటే ఇప్పటి వరకు 30 వరకు ఫ్యాక్టరీలు మాత్రమే తెరుచుకున్నాయి. 80 శాతం వరకు ఫ్యాక్టరీలు, కూటమి ప్రభుత్వ అనుకూలురు చేతుల్లో ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గరిష్టంగా కిలో మామిడి రూ.23కు అమ్ముడం కొసమెరుపు. ‘మద్దతు’లేక..అగచాట్లు పడలేక చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. మామిడి పంటను ఫ్యాక్టరీలకు అమ్ముదామని పంటను తీసుకొచ్చిన రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కిలో మామిడికి రూ.12 గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఫ్యాక్టరీలు చెప్పడంతో, కిలోకు రూ.8 ఫ్యాక్టరీలు చెల్లించాలని, మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందని.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్నెన్నాయుడు ప్రకటించారు. కానీ ఫ్యాక్టరీలు కూడా ఈ ధరలు పాటించలేదు. కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.3 సైతం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ హామీలన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయాయి. సీజన్ ముగుస్తున్నా ఇప్పటి వరకు రైతుకు మద్దతు ధర అంద లేదు. -
మోసం.. బాబు నైజం!
తిరుపతి మంగళం : ‘‘చంద్రబాబు అధికారం కోసం ఎంతకై నా దిగజారుతారు..ఎన్ని అబద్ధపు హామీలైనా గుప్పిస్తారు.. నమ్మిన వాళ్లను మోసం చేయడానికి వెనకాడరు.. మోసం, వంచన, ద్రోహం, వెన్నుపోటు అనే పాఠాలను చిన్నప్పటి నుంచి బాగా వంటపట్టించుకున్నారు. ఆయన షూరిటీ ఇచ్చాడంటే అంది గ్యారంటీగా మోసమే’’ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పద్మావతిపురంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే హామీలు నెరవేర్చేటివి కాదు కాబట్టే నోటికి వచ్చిన అబద్ధాలు గుప్పిస్తారని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇద్దామని తామంతా వైఎస్.జగన్మోహన్రెడ్డికి చెబితే అది సాధ్యంకాదని, అలాంటి అబద్ధాలు చెప్పలేనంటూ ఖరాకండిగా చెప్పారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం రూ.7వేల కోట్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల కంటే మించి రూ.3 లక్షల కోట్లు విలువ చేసే సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. గత ఎన్నికల్లో జగనన్న కంటే రెండింతలు సంక్షేమ పథకాలు అందిస్తానంటూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న దుర్మార్గుడు అన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తిరుపతి నగర మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పి వంచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లోఏ ఒక్కటైనా నెరవేర్చావా బాబూ? రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళదాం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి -
ఇష్టారాజ్యంగా ఎంఎస్కే బదిలీల కౌన్సెలింగ్
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల (ఎంఎస్కే) బదిలీ కౌన్సెలింగ్లో అదే గందరగోళం నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు సోమవారం కూడా చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 600 మందికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. సాయంత్రం 6 గంటలకు సగం మందికి మాత్రమే పూర్తయ్యింది. అయితే కౌన్సెలింగ్ సక్రమంగా నిర్వహించడంలేదని, సిఫార్సులు ఉన్న వాళ్లకు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగులు ఇస్తున్నారంటూ పలువురు ఎంఎస్కేలు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకటాద్రి, ఇతర అధికారులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు మెజారిటీ ఉద్యోగులు తిరుపతి అర్బన్, చిత్తూరు అర్బన్ ప్రాంతాలనే కోరుకోవడం.. అక్కడ ఖాళీలు లేకపోవడం, కుప్పంలో 50కు పైగా పోస్టులు ఖాళీ ఏర్పడడంతో ఎవర్ని నియమించాలో తెలియక అధికారులు సైతం ఒకింత గందరగోళానికి గురయ్యారు. జీవన నైపుణ్యం అవసరం తిరుపతి సిటీ: జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని మహిళా వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ రజిని తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి గెస్ట్ హౌస్లో పీఎం ఉష సహకారంతో ‘జీవన నైపుణ్యాలపై’ మూడు రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. రజిని మాట్లాడుతూ విద్యార్థినులు, ఉపాధ్యాయులు జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నైపుణ్యాలు అవసరమని చెప్పారు. మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె శేఖర్, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి వాణి ప్రసంగించారు. అనంతరం అతిథులను సన్మానించారు. శిక్షకులు డాక్టర్ సంజీవ్ కుమార్, ప్రొఫె సర్ ఉష, డాక్టర్ జి శిరీష, డాక్టర్ వజిహాబానుతోపాటు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి నుంచి గంటపాటు విధుల బహిష్కరణ తిరుపతి సిటీ: స్విమ్స్ కార్మికులు చేపట్టిన ఆందోళన రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాలుగు రోజులుగా రిలేనిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులు మంగళవారం నుంచి ప్రతిరోజు గంటపాటు విధులను బహిష్కరించి నిరసన తెలపనున్నారు. ఈ మేరకు స్విమ్స్ ఉద్యోగ కార్మిక సంఘాల యూనియన్, సీఐటీయూ సంయుక్తంగా అధికారులను హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ స్విమ్స్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తి మేరకు తమ యూనియన్ నేటి నుంచి తలపెట్టిన సమ్మె కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని చెప్పారు. అయితే మంగళవారం నుంచి సమస్యల పరిష్కారానికి కార్మికులు గంట పాటు విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం, కే వేణుగోపాల్, జిల్లా నేతలు టి సుబ్రహ్మణ్యం, మాధవ్, వేణుగోపాల్, బుజ్జితోపాటు యూనియన్ నేతలు పాల్గొన్నారు. తిరుపతి మేయర్కు దక్కని గౌరవం తిరుపతి తుడా: తిరుపతి నగర ప్రథమ పౌరురాలైన మేయర్ను కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోంది. మేయర్ హోదాకు ఉన్న ప్రాముఖ్యతను విస్మరిస్తోంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా భారత పార్లమెంటు ‘ది రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రంత్నింగ్ కాంట్రట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. జూలై 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు ఆయా రాష్ట్రాల నుంచి మేయర్లు, చైర్ పర్సన్లను పంపించాలని పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చిన్న పదవుల్లో ఉన్నా వారిని ఎంపిక చేసి, ప్రతిపక్షానికి చెందిన వారు ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ వారిని దూరం బెట్టింది. తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీషను కాకుండా రెండవ డిప్యూటీ మేయర్ను మాత్రమే పంపించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నగర ప్రధమ పౌరురాలికి కనీస మర్యాదను ఇవ్వకపోవడం గమనార్హం. -
కార్మికుల సమస్యలపై కలిసి పోరాడదాం
● సీపీఎం నేతలకు ఎంపీ డాక్టర్ గురుమూర్తి హామీతిరుపతి కల్చరల్: కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ నాయకులతో కలిసి పోరాడతామని సీపీఎం నేతలకు తిరుపతి ఎంపీ గురుమూర్తి హామీ ఇచ్చారు. గంధమనేని శివయ్య భవన్లో సోమవారం జరిగిన ఓ ప్రవేటు కార్యక్రమానికి హాజరైన ఎంపీ డాక్టర్ గురుమూర్తి సీపీఐ జిల్లా కార్యాలయానికి చేరుకుని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, నాయకులతో కలిసి ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అంగన్వాడీ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు, స్కీం వర్కర్లకు, వర్తించడం లేదని సీపీఎం నేతలు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పాటు పలు అంశాలపై చర్చించారు. మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నేతలు రాధాకృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, రామచంద్రయ్య, అల్లాబాషా పాల్గొన్నారు. -
మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర
● ఫ్యాక్టరీ యజమానులతో కూటమి నేతల కుమ్మక్కు ● కడుపు మండి.. రైతుల ఆందోళన ● రైతుల దృష్టిని మరల్చేందుకు పెద్దిరెడ్డిపై నిందలు కూటమి సర్కారు దొంగాట ఆడుతూ మామిడి రైతులను నిండా ముంచేసింది. దొంగచాటుగా అధికార పార్టీ నేతల సిఫార్సులకు టోకెన్లు ఇచ్చి సామాన్య రైతులను పక్కన పెట్టేసింది. దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై మామిడి రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న మామిడి చెట్లను నిలువునా నరికేసుకుంటున్నారు. ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో మామిడి కాయలను రోడ్లపై పారబోస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నా, కనికరించే నాథుడు కరువయ్యారు. కాయలు అమ్ముకోవడానికి రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా నిరీక్షించిన రైతులు కడుపు మండి ధర్నాకు దిగుతున్నారు. ఈ పరిణామాల నుంచి రైతులు, ప్రజల దృష్టిని మరల్చడానికి కూటమి నేతలు, ఎల్లో మీడియాతో కలిసి వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. రెండు రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం ప్రారంభించారు. గుడిపాల మండలం గొల్ల మడుగు వద్ద.. క్యూ కట్టిన మామిడి కాయల వాహనాలుసాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొద్ది రోజులుగా మామిడి రైతుల అవస్థలు వర్ణనా తీతంగా ఉన్నాయి. ప్రభుత్వం మొదట్లో మామిడి కిలో రూ.12గా ప్రకటించింది. ఆ తరువాత రూ.8 అని చెప్పింది. ఇంకో రోజు రూ.6 అని, ఆ తరువాత రూ.5 అని ఇష్టానుసారంగా రోజుకొక ధర చెబుతూ రైతులను మభ్యపెడుతూ వస్తోంది. ధర లేకపోతే పోనీ ఏదో ఒక రేటుకు కాయలు విక్రయించేస్తామన్న రైతులకు టోకెన్లు ఇవ్వడం లేదు. దానికి టీడీపీ నేతల సిఫార్సులు కావాలి. దీంతో పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. మరి కొందరు రైతులు మామిడి కాయల లోడ్లను తీసుకొచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా వరకు కాయలన్నీ ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. తెల్ల కాగితాలపై సంతకాలు రైతులు పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని కాయలు దించుకుని పంపేస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులు ధర్నాలకు దిగుతున్నారు. గంగాధరనెల్లూరు వద్ద ఓ ఫ్యాక్టరీ యజమాని, అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క దొంగచాటుగా వారికి అనుకూలంగా ఉన్న వారి కాయలను మాత్రం దించుకోవడాన్ని మామిడి రైతులు గమనించారు. వారి తీరుని నిరసిస్తూ ఆదివారం రోడ్డుపై వాహనాలతో మెరుపు ధర్నా చేపట్టారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ కూటమి నేతలు వారి దృష్టిని మరల్చేందుకు వైఎస్సార్సీపీపై బురద జల్లడం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నేతలే కొందరిని రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇంత దిగజారుడుతనమా? రైతులను ఆదుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా దిగుజారుడు రాజకీయాలకు దిగడం దారుణం. మామిడి దిగుబడులకు మద్దతు ధర కల్పించలేక, రోజుల తరబడి క్యూలో ఉన్న మామిడిని కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ యజమానులు, కూటమి నేతలు కుమ్మకై ్క మామిడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వ తీరుని గమనిస్తున్న మామిడి రైతులు తిరగబడుతున్నారు. దీని నుంచి రైతుల దృష్టిని మరల్చటానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్న దిగజారుడు తనం మరొకటి లేదు, ఉండబోదు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు అడుగడుగునా దగా.. ● ఒక ట్రాక్టర్ కాయలు ఫ్యాక్టరీల వద్ద అన్లోడ్ చేయడానికి 3 రోజుల నుంచి వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. అదే కూటమి నేతలు, అధికారులకు తెలిసిన వారి ట్రాక్టర్లు దొంగ చాటుగా ఒక్క రోజులోనే అన్లోడింగ్ చేసి పంపేస్తున్నారు. ● ప్రస్తుతం ఒక్కో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సుమారు 3 కిలోమీటర్ల దూరం మేర మామిడి కాయల ట్రాక్టర్లు క్యూ కట్టి ఉన్నాయి. ● దీని వల్ల ఒక ట్రాక్టర్లో 5 టన్నుల కాయలతో వస్తే అన్లోడ్ చేసే నాటికి దాదాపు 1.5 టన్ను కాయలు పాడైపోతున్నాయి. ● ఫ్యాక్టరీ యాజమాన్యాలు ట్రాక్టర్ల అన్లోడింగ్ కోసం రోజుకు 100 టోకెన్లు ఇస్తామని చెబుతున్నా కేవలం 50 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. ● అన్లోడింగ్ చేసుకుని ఎన్ని టన్నులు దించుకున్నామంటూ రైతులకు బిల్లులు ఇస్తున్నారు. అయితే ఆ బిల్లులో కిలో మామిడి ధర ఎంతో స్పష్టం చేయలేదు. ● దీనిపై రైతుల నుంచి తిరుగుబాటు రాకుండా అంగీకార పత్రంపై రైతు వద్ద నుంచి సంతకం తీసుకుని పంపుతున్నారు. ● దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తర్వాత ఎంత ధర చెల్లించినా రైతులు ప్రశ్నించే అవకాశం లేదు. ● ఒక ట్రాక్టర్కు లోడ్ చేసే మామిడి కాయలు కోయడానికి రైతుకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. బాడుగ (ఐదు రోజులకు) రూ.7 వేలు. ● ఒకవేళ ఐదు రోజుల్లోపు ఫ్యాక్టరీ యాజమాన్యం కాయాలను దించుకోకుంటే, ఐదో రోజు తర్వాత మళ్లీ అదనంగా రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు రైతు అదనంగా బాడుగ చెల్లించాలి. ● టీడీపీ కూటమి నాయకులు సిఫారసు చేసిన రైతుకు చెందిన మామిడి కాయల ట్రాక్టర్లను రాత్రి వేళ ఫ్యాక్టరీలోకి పంపి అన్లోడ్ చేసుకుంటున్నారు. సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి రోడ్లపైన వేచి ఉండలేక కొందరు రోడ్డుపైనే కింద పారబోసి వెళ్లిపోతున్నారు. ● ప్రభుత్వం మామిడి కాయలను రైతు నుంచి ఒక కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు 8 రూపాయల లెక్కన ఎక్కడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం ● ర్యాంపుల వద్ద కిలో మామిడి కేవలం రెండు రూపాయలుగా మాత్రమే నిర్ణయించారు. చేసేది లేక రైతులు రూ.2కే అమ్ముకోవాల్సిన దుస్థితి కలిగింది. -
కలెక్టర్కు వినతుల వెల్లువ
తిరుపతి అర్బన్: గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం పలుప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా అర్జీలు ఇవ్వడానికి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. మొత్తం 296 అర్జీలు రాగా, అందులో 145 అర్జీలు రెవెన్యూ సమస్యలపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, పలువురు జిల్లా అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. ఈ క్రమంలో రశీదుల కోసం అర్జీదారులకు పడిగాపులు తప్పలేదు. అయితే వీఆర్ఏలు, అటెండర్లు అర్జీలను రాసి అందించారు. గ్రీవెన్స్లో ఉన్న కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు పలువురు జిల్లా అధికారులను సోమవారం కుంభమేళాకు వెళ్లి విచ్చేసిన నాగసాధువులు ఆశీర్వదించారు. రజకుల స్థలానికి రక్షణ కల్పించండి తిరుపతి రూరల్ మండలం పేరూర్ పంచాయతీ యాదవ్కాలనీలో నివాసం ఉంటున్న రజకులకు 2014లో 30 సెంట్లు, ఆ తర్వాత అదే ఏడాది మరో 20 సెంట్లు భూమి కేటాయించాని రజకులు వెల్లడించారు. అయితే ఆ స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ పంచాయతీ కార్యదర్శి తమదీ అంటూ కంచె ఏర్పాటు చేశారని చెప్పారు. దీన్ని పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. నాయుడుపేటలో మినా ట్రక్స్, వ్యాన్ డ్రైవర్లకు అంబేడ్కర్ భవనం సమీపంలోని ఆర్అండ్బీ స్థలంలో పార్కింగ్ చేసుకోవడానికి స్థలాన్ని గతంలో కేటాయించారని చెప్పారు. అయితే ఆస్థలాన్ని ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు, వ్యాన్ డ్రైవర్లు ఓ.గిరి, మస్తాన్ రెడ్డి. సిహెచ్.హేమంత్, వి.రమణయ్య, అమీర్, చెంచు కృష్ణయ్య, జిలాని, సతీష్, మాధవ్, చంద్ర పాల్గొన్నారు. గ్రీవెన్స్కు 296 అర్జీలు రెవెన్యూ సమస్యలపై 145 అర్జీలు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు గత ఏడాది డిసెంబర్ వరకు 15,264 అర్జీలు గ్రీవెన్స్లో వస్తే అందులో 15,103 అర్జీలు పరిష్కారం అయినట్లు కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. ఆయన కలెక్టరేట్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అర్జీల్లో 98.94శాతం పరిష్కారం చేసినట్లు లెక్కలు చూపడం దారుణంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి మండలం అమ్మ చెరువులో చెరువు ఆక్రమణలు తొలగించాలని గతంలో అర్జీ ఇచ్చినా ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా ఆన్లైన్లో సమస్య పరిష్కారమైనట్లు చూపడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని, వాటన్నింటిపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. టూరిజంలో పనిచేస్తున్న లోకల్ గైడ్స్ సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నేతలు జయచంద్ర, కరిముల్లా, బాలాజీ తదితరులు అధికారులకు ఓ వినతిపత్రాన్ని అందించారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 88 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 88 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. యువకుడి ఆత్మహత్య సైదాపురం: కువైట్కు వెళ్లి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుని తల్లి కాకాణి లక్ష్మమ్మ అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఐ క్రాంతి కుమార్ కథనం మేరకు మండకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కాకాణి వెంకటరమణయ్య (35)కు అదేకాలనీకి చెందిన భాగ్యమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి ఇద్దరు కుమారుల్లో ఒకరు గతంలో మృతి చెందారు. బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లి వారం క్రితమే వచ్చాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యా యి. ఈ క్రమంలో వెంకటరమణయ్య ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యభిచారం కేసులో ఇద్దరి అరెస్ట్ తిరుపతి క్రైమ్: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం చేస్తూ ఇద్దరు పట్టుబడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అలిపిరి సీఐ రామ కిషోర్ కథనం మేరకు, ఉపాధ్యాయ నగర్లోని మహేందర్ నివాస్ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిర్వాహకురాలితోపాటు జైచంద్ర అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2000 నగదు, కండోమ్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఓవర్ లోడ్.. ఐదు ఆటోలు సీజ్
తిరుపతి మంగళం : అద్దెలకు కక్కుర్తి పడి ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న 5 ఆటోలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. జిల్లా రవాణా శాఖాధికారి ఆదేశాల మేరకు సోమవారం మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అథికానాజ్, మోహన్కుమార్ అలిపిరి భారతీయ విద్యాభవన్, ఎమ్మార్ పల్లి కూడలి ప్రాంతాల్లో విద్యార్థులను తరలించే ఆటోలను తనిఖీలు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న ఐదు ఆటోలను సీజ్ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా రవాణాశాఖాధికారి మురళీమోహన్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి కళాశాలలు, పాఠశాలల బస్సులతో పాటు విద్యార్థులను తరలించే ఆటోలను నిత్యం తనిఖీలు చేస్తున్నామన్నారు. అందుకోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను తరలించే వాహనాలకు ఎఫ్సీలు లేకపోయినా, ఆర్టీఏ నిబంధనలు పాటించకపోయినా, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా, అధిక వేగంతో వెళ్లినా, మద్యం తాగి వాహనాలను నడిపినా వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహన డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. -
11 మంది ఉద్యోగ విరమణ
తిరుపతి క్రైమ్: జిల్లాలో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు అందించిన 11 మంది పోలీసులు సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. అందులో పీసీల నుంచి ఎస్ఐల వరకు అన్ని స్థాయిల వారూ ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ఘనంగా సత్కరించారు. షార్ట్ సర్క్యూట్తో వాహనాలు దగ్ధంతిరుపతి క్రైం: రేణిగుంట రోడ్లోని ఓ బైక్ షోరూమ్లో షార్ట్ సర్క్యూట్తో వాహనాలు దగ్ధమైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తిరుపతి అగ్నిమాపక శాఖ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి కథనం మేరకు, రేణిగుంట – తిరుపతి మార్గంలో ఉన్న జాయ్ ఈ బైక్స్లో ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక బైక్ నుంచి మంటలు వచ్చి, మరో 10 వాహనాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో 11 బైకులు, ఒక ల్యాప్టాప్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. రూ.20 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక విచారణలో తేలింది అన్నారు. అయితే ఈ షో రూమ్ లో మొత్తం వాహనాలు కాలిపోవడంతో యాజమాని రాజశేఖర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపు చేయగలిగారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట చిల్లకూరు: గూడూరులో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ ప్రేమ జంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గూడూరు రూరల్ పోలీసులను సోమవారం ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు గూడూరు మండలం చెన్నూరుకు చెందిన రామతేజ, శ్రీకాళహస్తికి చెందిన సాయి దీపిక ఒకే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరు కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాలుు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఈ జంట పోలీసులను ఆశ్రయించడంతో వారు రెండు కుటుంబాల వారిని పిలిపించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పి పంపించేశారు. మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలి తిరుపతి సిటీ: తెలుగు విద్యార్థులకున్న విభిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలని రచయిత ఆర్సి.కృష్ణస్వామి రాజు సూచించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలుగు సాహితీ సమితి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. తెలుగు కథా సాహిత్యం గ్రామీణ జీవితం అనే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలుగు విద్యను అభ్యసించడానికి ప్రస్తుత తరం వెనకడుగు వేస్తున్నారని, తెలుగు సాహిత్యం చదవాలంటే ఎంతో అదృష్టం ఉండాలని తెలిపారు. తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ కృష్ణస్వామి రాజు తన చుట్టూ ఉన్న పల్లె జీవితాలను, తాను చూసిన విషయాలను రచనల రూపంలో ప్రజలకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై సుభాషిణి, సాహితీ సమితి అధ్యక్షులు ఎ ప్రనూష, ఉపాధ్యక్షులు జి వాణి, కార్యదర్శి బి. శిరీష, కోశాధికారి ఎ మోహిత డాక్టర్ లక్ష్మిప్రియ, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
మా పిల్లలను బడికి రావద్దన్నారు
తిరుపతి అర్బన్: మూడు దశాబ్దాల క్రితం 6 లేదా 7 పంచాయతీలకు ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది. ఆ తర్వాత మారుతున్న కాలానుగుణంగా విద్యను అందరికీ అందించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో ప్రతి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసేలా కృషి చేశారు. దీంతో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గడంతోపాటు అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం మళ్లీ క్లస్టర్ల (విలీనం) పేరుతో 6 లేదా 7 గ్రామాలకు ఒక పాఠశాలను ఏర్పాటు చేయడంపై రగిలిపోతున్నారు. రాజుగుంట ఎస్సీకాలనీ వాసుల నిరసన శ్రీకాళహస్తి మండలం యార్లపూడి పంచాయతీలో ఉన్న రాజుగుంట ఎస్సీకాలనీలో మూడు దశాబ్దాలుగా ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే క్లస్టర్ పేరుతో మోడల్ స్కూల్ అంటూ మన్నవరంలో ఉన్న పాఠశాలలో విలీనం చేసేశారు. ఇక నుంచి విద్యార్థులు అక్కడికి వెళ్లాలని ఉపాధ్యాయులు తేల్చి చెప్పేశారు. 3, 4, 5 తరగతుల పిల్లలు ఈ పాఠశాలకు రావద్దని స్పష్టం చేశారు. అటవీ సమీపంలో ఉన్న మన్నవరం పాఠశాలకు చిన్నపిల్లలను ఎలా పంపుతారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలను తమ కాలనీలోనే కొనసాగించాలని సోమవారం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. మా పాఠశాలను మూసివేయొద్దు ఏర్పేడు: మండలంలోని ఎండీ పుత్తూరు పాఠశాలను మూసివేయొద్దని సర్పంచ్ మోహన ప్రియ డీఈవోకు విన్నవించారు. ఆమె గ్రామస్తులతో కలిసి సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఎండీ పుత్తూరు నుంచి పక్క గ్రామ పాఠశాలకు చిన్న పిల్లలు వెళ్లి రావడం కష్టంతో కూడుకున్నదని, మూడు కిలోమీటర్ల మేర పిల్లలు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. పాఠశాల విలీన ప్రక్రియను నిలుపుదల చేసి ఇక్కడి పాఠశాలను ఇక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జలజ, గ్రామస్తులు పాల్గొన్నారు. మా పాఠశాలలను కొనసాగించాలి సత్యవేడు: మండలంలోని పేరడం ప్రాథమిక పాఠశాలను యధావిధిగా ఉంచాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ పాఠశాలను మదనం బేడు పాఠశాలలో విలీనం చేయవద్దని కోరారు. సుమారు రెండు కిలోమీటర్లు దూరం పిల్లలు వెళ్లలేరని విన్నవించారు. అముడూరు గ్రామస్తుల ఆందోళన ఏర్పేడు : మండలంలోని అముడూరు గ్రామంలో 1960 నుంచి ఉన్న పాఠశాలను మూసివేయడంతో వారు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. మండలంలోని పాగాలి గ్రామంలోనూ పాఠశాల విలీనం ప్రక్రియపై పిల్లలు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చదువులకు దూరం చేయొద్దని కోరారు. -
సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వరకు ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం హనుమంత, బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జూలై 3న పార్వేట ఉత్సవం జరగనుంది. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో వీసీలు
తిరుపతి సిటీ: విజయవాడ హోటల్ నోవోటెల్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ అప్పారావు, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ పాల్గొన్నారు. అమరావతిని భారతదేశ క్వాంటమ్ వ్యాలీగా – తదుపరి తరం క్వాంటమ్ టెక్నాలజీలకు కేంద్రంగా ఉంచాలనిన్న లక్ష్యంగా క్వాంటం కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్న్స్, గణితం, భౌతిక శాస్త్రం వంటి కీలక డొమైన్లపై సోమవారం జరిగిన వర్క్షాప్లో వీసీలు పాల్గొన్నారు. వీసీలు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్తో సహా ఎంపిక చేసిన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల లో క్వాంటం కంప్యూటింగ్ను మైనర్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాపులో ఎస్వీయూ నుంచి ఆచార్య సుబ్బారావు, డాక్టర్ ఉషా రాణి, ఆచార్య జయ సుబ్బారెడ్డి, డాక్టర్ హేమలత, రుద్రమదేవి, ఆచార్య అంజన్ బాబు పాల్గొన్నారు. మూడు టిప్పర్లు సీజ్ సత్యవేడు: మండల కేంద్రంలోని సమీపంలో మూడు టిప్పర్లను మైన్స్ అధికారులు సీజ్ చేశారు. అధికారులు సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా చమర్తికండ్రిగలోని సెవన్ హిల్స్ క్వారీ నుంచి తమిళనాడుకు కంకరు తరలిస్తున్న మూడు టిప్పర్లకు బిల్లులు సక్రమంగా లేకపోవడంతో తిరుపతి మైన్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. అక్కడి నుంచి సత్యవేడు ఆర్టీసీ గ్యారేజ్కు తరలించారు. -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీలు
● ముడుపులు తీసుకుని బదిలీలు చేశారనే ఆరోపణలు ● తప్పిదాల కారణంగా రెండు గంటల పాటు ఆగిన కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ సచివాలయ సర్వేయర్ అసిస్టెంట్ల బదిలీలు గందరగోళంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సర్వే అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించారు. చిత్తూరు సర్వే శాఖ ఏడీ జయరాజ్ ఆధ్వర్యంలో సర్వే అసిస్టెంట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి సర్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళంగానే సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 398 సర్వేయర్ అసిస్టెంట్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. చాలా మందికి అన్యాయం జరగడంతో కలెక్టరేట్ భవనంలో అరుపులు.. కేకలు వినిపించాయి. న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. వెల్లువెత్తిన ముడుపుల ఆరోపణలు సర్వే అసిస్టెంట్ల బదిలీల్లో పలువురికి అనుకూలమైన స్థానాలను కేటాయించేందుకు సర్వేశాఖ అధికారులు ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో పోస్టింగ్ నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు స్వీకరించారని కౌన్సెలింగ్కు విచ్చేసిన సర్వే అసిస్టెంట్లు ఆరోపించారు. జిల్లాల పునర్విభజన కారణంగా ఆయా జిల్లాల సర్వే అసిస్టెంట్లకు ప్రత్యేకంగా బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే సర్వే శాఖ అధికారులు అలా చేయకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వే అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 120 మంది తిరుపతి జిల్లాకు బదిలీ అయినట్టు సమాచారం. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వే అసిస్టెంట్లు చిత్తూరు జిల్లాకు బదిలీ కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. సీనియారిటీలో అవకతవకలు సీనియారిటీ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాల్సిన సర్వే శాఖ అలసత్వం వహించింది. ఆ జాబితా రూపకల్పనలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒకే ర్యాంక్ను ఇద్దరు సర్వేయర్లకు కేటాయించారు. అలా ఎలా కేటాయిస్తారని సర్వే అసిస్టెంట్లు అధికారులను ప్రశ్నించారు. కనీసం జాబితా ప్రచురించకుండా కౌన్సెలింగ్ నిర్వహించారని ఆరోపించారు. ఈ తప్పిదాల కారణంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏడీ ప్రకటించారు. సీనియారిటీ జాబితాలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని స్వయంగా ఏడీనే ప్రకటించారు. దీంతో రెండు గంటల పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేటప్పుడు సీనియారిటీ, ఖాళీల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని సర్వే అసిస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
రేణిగుంట : తిరుపతి– రేణిగుంట రహదారిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఉన్న వైన్ షాప్లో వాచ్మన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి లీలా మహల్ సర్కిల్ వద్ద ఓ అపార్ట్మెంట్కు కాపలాగా ఉంటున్న కృష్ణారెడ్డి(65) రాత్రి వేళ రేణిగుంట సమీపంలోని వైన్ షాపులో వాచ్మన్గా పనిచేసేవాడు. ఆదివారం ఉదయం డ్యూటీ దిగిన తర్వాత గాయాలతో మృతి చెందడంపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ అరెస్ట్ తిరుపతి క్రైమ్ : కర్ణాటకలోని చిక్బళ్లాపూర్కు చెందిన కృష్ణప్ప రాజేష్ (23) అనే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసినట్లు తిరుపతి క్రైమ్ పోలీసులు ఆదివారం తెలిపారు. వివరాలు.. ఈనెల 9వ తేదీన కాటన్ మిల్ సమీపంలో నివసిస్తున్న ఫరూక్ సొంత పనులు నిమిత్తం నెల్లూరుకి వెళ్లడంతో ఆయన ఇంట్లో చోరీ జరిగింది. పలు వస్తువులతోపాటు ద్విచక్రవాహనం అపహరణకు గురైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని హరేరామ హరే కృష్ణ మందిరంలో సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కృష్ణప్ప రాజేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు నేరాలు బయపడ్డాయి. నిందితుడిపై ఇదివరకే తిరుపతిలో మూడు కేసులు నమోదయ్యాయని, పలు జిల్లాల్లో దోపిడీలకు సంబంధించి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుడి నుంచి ద్విచక్రవాహనంతోపాటు 11 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంటర్వ్యూకు రాకుంటే తొలగిస్తాం
తిరుపతి సిటీ : ఎస్వీయూ అకడమిక్ కన్సల్టెంట్లకు ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో మంగళవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆదివారం ఈ సందర్బంగా రిజిస్ట్రార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కన్సల్టెంట్లు ఇంటర్వ్యూకు రాకుంటే వెంటనే విధుల నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు తాత్కాలిక అధ్యాపకులకు సమాచారం అందించారు. మంగళవారం 43మందికి, 2వతేదీ 51మందికి, 3న 47మందికి, 4న 51మందికి, 5వ తేదీన 51మంది తాత్కాలిక అధ్యాపకులకు వీసీ ఛాంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిదొరవారిసత్రం : స్థానిక రైల్వే స్టేషన్కు సమీపంలో 30ఏళ్ల నుంచి 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి చైన్నెకి వెళుతున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. స్థానిక రైల్వే సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూళ్లూరుపేట జీఆర్పీ ఎస్ఐ చెన్నకేశవ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుల తరబడి పడిగాపులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లల్లో మామిడి పంట వ్యాపించి ఉంది. ప్రధానంగా తోతాపురి 39,895 హెక్టార్లల్లో సాగవుతోంది. తద్వారా 4,9,274 మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అయిందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ దిగుబడులను విక్రయించడానికి ఈ సారి రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. కాయ కోతకోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే పడిగావులు కాస్తున్నారు. వందలాది ట్రాక్టర్లు మామిడి కాయలతో క్యూ కడుతున్నాయి. ఈ గందరగోళంలో కాయలను అన్లోడింగ్ చేసేందుకు రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి అన్లోడ్ చేసే సరికే కాయలు కుళ్లిపోతున్నాయి. -
మహిళా క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం
తిరుపతి ఎడ్యుకేషన్ : క్రికెట్లో పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు రాణిస్తున్నారని, వారిని మరింతగా ప్రోత్సహిస్తామని, తద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు ఏసీఏ సౌత్ జోన్ అండర్–15 ఉమెన్స్ వన్డే రాష్ట్ర స్థాయి పోటీలను నెల్లూరులో నిర్వహించారు. ఈ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు వరుసగా నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడపపై జట్లపై విజయం సాధించి ఫైనల్ విజేతగా నిలిచింది. ఆదివారం ఈ మేరకు జట్టు సభ్యులను సీడీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా క్రీడాకారులకు మరింత సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉమెన్స్ క్రికెట్ అకాడమీ నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళా క్రికెటర్లు ఈ విజయ స్పూర్తితో అన్ని ఫార్మాట్లలో రాణించాలని ఆకాంక్షించారు. -
త్వరలోనే జూనియర్స్ సీపీఎల్–1
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వేదికగా త్వరలోనే జూనియర్స్ చిత్తూరు ప్రీమియర్ లీగ్ (సీపీఎల్–1) పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ హోటల్లో సీపీఎల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో సీపీఎల్–1 విజయవంతంగా నిర్వహించామన్నారు. దీంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏసీఏ)కు తొలిసారిగా 60మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకోవడం గర్వకారణమని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఏపీఎల్, ఐపీఎల్లో ఎక్కువ మంది ఆడాలనే లక్ష్యంతోనే సీపీఎల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇదే స్పూర్తితో చిన్న వయసు నుంచే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 12 ఏళ్ల నుంచి 16ఏళ్లలోపు క్రికెటర్లతో జూనియర్స్ సీపీఎల్–1 పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మ్యాచ్లు సైతం టీ–20 ఫార్మాట్లోనే ఉంటాయని, ప్రత్యక్ష ప్రసారం సైతం చేయనున్నట్లు తెలిపారు. 8 టీమ్లను ప్రాంచైజీ ద్వారా దక్కించుకోవడానికి ఆసక్తి గలవారు ముందుకు రావాలని కోరారు. పూర్తి వివరాలకు 88861 85559, 90002 14966నంబర్లలో సీడీసీఏ జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్, సునీల్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వూకా విజయ్కుమార్, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, సీడీసీఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరిప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, శ్రీధర్ పాల్గొన్నారు. -
‘కౌటిల్య’ విద్యార్థులకు ఐఐఎం అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎమ్మార్పల్లె సర్కిల్లోని కౌటిల్య విద్యాసంస్థ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ అడ్మిషన్లు పొందారు. గత ఏడాది నవంబరులో జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యాట్ పరీక్ష తుది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఐఐఎంలలో అడ్మిషన్లు సాధించినట్లు కౌటిల్య విద్యాసంస్థ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. జి.వెంకట నితీష్ ఐఐఎం రాంచి, కె.హారికారాజు ఐఐఎం సిరమౌర్, భవ్యశ్రీ నిశిత, కె.కార్తీక్ ఐఐఎం నాగపూర్, ఐఐఎం సిర్మార్, పూణెలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్కు జి.అభినయ్ సుప్రీత పీఎన్.సుదర్శన్ అడ్మిషన్లు సాధించినట్లు వివరించారు. క్యాట్ పరీక్ష, ఐఐఎంలలో అడ్మిషన్లకు సంబంధించి ఉచిత గైడెన్స్కు 96981 23456 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఐఐఎంలలో సీట్లు సాధించిన విద్యార్థులను బోధనా సిబ్బంది ఎన్.హరి, ఎన్ఎస్.రెడ్డి అభినందించారు. -
కాయలు కోతకోస్తే కన్నీళ్లే
● అమ్మకానికి రోడ్డున్నపడ్డ రైతులు ● రోజుల తరబడి రోడ్డుపైనే తిండీ తిప్పలు ● వెంటాడుతున్న దొంగల భయం ● కునుకు తీయని అన్నదాతలు నిద్రపోయి మూడు రోజులైంది.. నేను 1.50 టన్ను కాయలే తెచ్చాను. దానికి కోసం నాలుగు రోజులుగా ఈడే ఉన్నా. నిద్రపోయి మూడు రోజులు అయింది. తిండి తినాలంటే కి.మీ నడవాలి. హోటల్కు వెళ్లి తింటున్నా. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. దీనికి ప్రతి రోజు రూ.700 వరకు ఖర్చు అవుతోంది. ఈ అడవిలో ఉండలేకపోతున్నాం. గాలి ఒక్క పక్క. మరో పక్క ఎండలు. రాత్రుల్లో దొంగలు వస్తారని భయం. ఏం చేయాలి..అవస్థలు పడుతున్నాం. – గోవిందస్వామినాయుడు, ఏఎల్పురం, గుడిపాల రోడ్డు మీదే అన్నీ నాకు 7 ఎకరాల మామి డి తోట ఉంది. ఇప్పటికి ఒక లోడ్ కాయలను తో లాను. ఇప్పుడు మరో లోడ్ కాయలు తెచ్చాను. మూడు రోజులు అయింది. ఈ రోజుతో నాలుగో రోజు. కాయలు అన్లోడింగ్ అయ్యేందుకు మరో రెండు రోజులు పడొచ్చు. అంతా వరకు ఈ కష్టాలు తప్పవు. నీళ్లు పోసుకుని మూడు రోజులు అయింది. ఏదైనా తినాలన్న తమిళనాడు బార్డర్ నుంచి కి.మీన్నర వెళ్లాలి. – లక్ష్మణన్, మాపాక్షి, చిత్తూరు ఫ్యాక్టరీల వద్ద వరుస కట్టి.. ఉమ్మడి జిల్లాలో 43 ఫ్యాక్టరీలుంటే..ఇందులో 31 ఫ్యాక్టరీలు మాత్రమే తోతాపురిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల ఎదుట రైతుల బాధలు వర్ణాతీతంగా మారాయి. గుడిపాల మండలం గొల్లమడుగు ప్రాంతంలోని ఓఫ్యాక్టరీ వద్ద రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు 700కు పైగా ట్రాక్టర్లు రోడ్డుకు ఇరువైపులా ఫ్యాక్టరీ గేటు నుంచి తమిళనాడు సరిహద్దును తాకాయి. జీడీ నెల్లూరులోని ఎట్టేరి వద్ద పరిస్థితి తీవ్రతరమవుతోంది. ట్రాక్టర్లు బారులు తీరడంతో తోతాపురి ట్రాక్టర్లోనే పండవుతోంది. పూతలపట్టు, చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, పెనుమూరు, కార్వేటినగరం వద్ద ఉన్న ఫ్యాక్టరీల వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్లను ఆక్రమించాయి. ఈ రకంగా క్యూ కట్టడంతో రైతులు రోజులు తరబడి రోడ్డుకే పరిమితమయ్యారు. కాయలు అన్లోడింగ్ అయ్యేందుకు 5,6 రోజుల సమయం కావడంతో రైతులు రోడ్డుపైనే బస చేస్తున్నారు. కాణిపాకం : ఉమ్మడి జిల్లాలో మామిడి రైతు సుడిగుండంలో చిక్కుకున్నారు. వీరి సమస్యలు తీరని వెతలుగా మారాయి. కాయలు కోతకొస్తే రైతులకు కన్నీళ్లు ముంచుకొస్తున్నాయి. ఫలం విక్రయానికి రోడ్డున పడుతున్నారు. రోజుల తరబడి రోడ్డుపైనే కునుకు తీస్తున్నారు. గొంతు తడుపుకోవడానికి, తిండికి తిప్పలు పడుతున్నారు. దీనికి తోడు దొంగల భయం వెంటాడుతోంది. కునుకు వేసేందుకు వణుకుతున్నారు. మామిడి విక్రయాలకు అన్నదాత అగచాట్లు పడుతున్నారు. మామిడి పంటను సాగులోకి తెచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఆస్వాదించ లేకపోతున్నారు. పంట కోతకొచ్చే సరికి పడరానిపాట్లు పడుతున్నారు. నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. కొన్నిరోజులుగా జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి ఇలా తయారైంది. ఇల్లు..వాకిలి వదిలి రోడ్డుపైనే కునుకుతీస్తూ...మామిడి పంటను అమ్ముకోవడానికి వారు అవస్థలు పడుతున్నారు. గుక్కెడు నీటికి గగనమే జిల్లా నలుమూలల నుంచి రైతులు వారు పండించిన పంటను కోత కోసి ఫ్యాక్టరీలకు అమ్మకానికి పెడుతున్నారు. ఈ తరుణంలో ఫ్యాక్టరీల వద్ద రైతులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తాగునీటికి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. గొంతు తడుపుకోవడానికి కి.మీ మేర వెళ్లి తాగునీటిని కొని తెచ్చుకుంటున్నారు. చుట్టూ పక్కల, రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి దుకాణాల్లో లేకపోవడంతో రోడ్లమీద వచ్చే వాహనాలను ఆశ్రయించి నీళ్ల బాటిళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ కాలకృత్యాలకు కూడా వాటర్ బాటిళ్లే దిక్కుగా మారాయి. అలాగే ఆకలితో అలమటిస్తున్నారు. కడుపు నింపుకోవడానికి కూడా చాలా మంది హోటల్ వైపు చూస్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్లు పంచి పెడుతున్న భోజనం పట్టక పలువురు హోటల్కు వెళ్తున్నారు. ఇలా రోజూ వారీగా రూ.700 వరకు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. రెప్పవేస్తే ఒట్టు.. బండి క్యూలో పెట్టిన రోజు నుంచి అన్లోడింగ్ అయ్యే వరకు రైతు కంటిపై రెప్పవేయడం లేదు. పగలు అలా కొద్ది సేపు బండి కిందే నిద్రోతున్నారు. రాత్రుల్లో నిద్ర పట్టక అల్లాడిపోతున్నారు. కంటిపై రెప్పవేస్తే ఆ మార్గాల్లో రయ్..రయ్ మంటూ వెళ్లే వాహనాల శబ్ధాలకు ఉలిక్కిపడుతున్నారు. బలమైన గాలులు, వర్షాలకు అవస్థలు పడుతున్నారు. ఎండకు విలవిలలాడిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో కనీస నీడలు లేక ట్రాక్టర్ కింద భాగంలో తలదాచుకుంటున్నారు. -
ముగియనున్న బదిలీల ప్రక్రియ
ఉమ్మడి జిల్లా పరిధిలో సాగుతున్న సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. కాళ్లరిగేలా తిరుగుతున్నాం మాది అనంతపురం. 15ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నాం. భవన నిర్మాణ కూలీలుగా పనిచేసుకుంటూ బతుకీడుస్తున్నాం. ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయికి మా దగ్గర ఉన్న సొమ్ముతో ఇటీవలే పెళ్లి చేశాం. మూడో అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో పది చదువుతోంది. రెండో అమ్మాయి మంచి మార్కులతో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసింది. కానీ, పైచదువులకు పంపాలంటే భయమేస్తోంది. అయితే మాలాగా కష్టం చేయకూడదని బాగా చదివించాలనే కోరిక ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలో రూ.లక్షలు అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై నమ్మకం పెట్టుకోవదని చెబుతున్నారు. దీంతో అప్పు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. – శారద, భవన నిర్మాణ కూలీ, తిరుపతి వడ్డీకి తెచ్చాం పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థి తి ఏర్పడింది. మా అమ్మా యి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివింది. పదో తరగతి కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించాం. ఏడాదికి హాస్టల్తో పాటు మొత్తం ఫీజు రూ.1.80వేలు కట్టాల్సి వచ్చింది. దాచుకున్న రూ.50వేలకుతోడు మరో రూ.1.30వేలను వడ్డీవ్యాపారుల వద్ద రూ.5లకు వడ్డీకి తెచ్చి కట్టా. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ స్థాయిని అందుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. నేను చిన్న ఉద్యోగిని. నా భార్య దివ్యాంగురాలు. మా కష్టం పిల్లలకు రాకూడదని అప్పు చేసి చదివిస్తున్నాం. – రామకృష్ణ, ప్రైవేటు ఉద్యోగి, గూడూరు – 8లో -
● అలరించిన బకాసుర వధ
శ్రీకాళహస్తీశ్వర అనుబంధ ద్రౌపదీ సమేత ధర్మరాజ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న తిరునాళ్లలో భాగంగా మూడో రోజు ఆదివారం బకాసుర వధ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. భీముడి వేషధారి ఎద్దుల బండిలో వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేసి అన్నం సేకరించి ధర్మరాజ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నాడు. అనంతరం బకాసుర వధ ఘట్టం ప్రదర్శించారు. ఈ క్రమంలో పట్టణంలో సేకరించిన అన్న ప్రసాదం పంచిపెట్టారు. ఈ సందర్భంగా ధర్మరాజు, భీముడు, అర్జున వేషధారులు ఆలయం వద్ద కనువిందు చేశారు. అనంతరం అర్జునుడు మత్స్య యంత్ర ఛేదన ఘట్టం ప్రదర్శించారు. – శ్రీకాళహస్తి -
బాసరకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు
● జూలై 4 నుంచి తిరుపతి–నాందేడ్కు రాకపోకలు ● నూతన మార్గంలో మొదటి ప్రయాణం ● షిరిడీ సాయి భక్తులకు అనుకూలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తెలంగాణా రాష్ట్రం బాసర క్షేత్రంలోని సరస్వతి దేవి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. తిరుపతి నుంచి బాసరకు జూలై 4వ తేదీ నుంచి ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి –నాందేడ్ ఽమధ్యలో ప్రత్యేక రైలు నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ రైలును పిడుగురాళ్ల–శావల్యపురం మధ్య నూతనంగా నిర్మించిన మార్గం ద్వారా మార్కాపురం, నంద్యాల, కడప, రేణిగుంట నుంచి మొదటిసారిగా తిరుపతికి నడపనున్నారు. జూలై 11, 18, 25 తేదీలలో తిరుపతికి, అదే నెల 6, 19, 20, 27 తేదీలలో నాందేడ్కు ప్రయాణిస్తుంది. షిర్డి వెళ్లాలనుకునే భక్తులు నాందేడ్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి తక్కువ సమయంలో షిర్డి సాయిబాబాను దర్శించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. రైలు రాకపోకల సమయం ఇలా... నాందేడ్లో సాయంత్రం 4.30కి బయలు దేరి బాసర 6 గంటలకు, నిజామాబాద్ 6.25 గంటలకు చేరుకుంటుంది. కామారెడ్డి మీదుగా మేడ్చల్ రాత్రి 8 గంటలకు, చెర్లపల్లి 9.30 గంటలకు, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా పిడుగురాళ్లకు అర్ధరాత్రి 12.30 గంటలకు చేరుకుంటుంది. దొనకొండ, మార్కాపురం రోడు, కంభం, గిద్దలూరు నుంచి నంద్యాలకు వేకువజాము 5.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా కడపకు 8.30 గంటలకు వస్తుంది. రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రైలు మళ్లీ తిరుగు ప్రయాణం తిరుపతిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి కడపకు 4.15కు చేరుకుని మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి తిరుపతి వరకు ప్రయాణిస్తుంది. -
హామీల అమలులో విఫలం
● వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరి(సైదాపురం) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఎన్జేఆర్ భవన్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నేదురుమల్లి మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో సాగిస్తున్న అరాచకపాలనకు ప్రజలే చరమగీతం పాడుతారని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే జగనన్న ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. జూలై 8వ తేదీన వెంకటగిరిలో రీకాల్ మేనిఫెస్టో చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకడ్బందీగా నవరత్న పథకాలను అర్హులందరికీ అందించారని కొనియాడారు. ప్రస్తుత ంసీఎం చంద్రబాబు సంపద సృష్టిస్తానని, సూపర్సిక్స్ హామీలను నెరవేరుస్తాని బూటకపు హామీలు గుప్పించి, ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మినహా సర్కారు చేసింది శూన్యమని వెల్లడించారు. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన కాకాణి గోవర్ధన్రెడ్డి పరామర్శించేందుకు నెల్లూరు వస్తున్న జగనన్నను అడ్డుకునేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. హెలీప్యాడ్ కోసం స్థలం ఇచ్చిన ఓ విద్యాసంస్థ యాజమాన్యంపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు.భవిష్యత్ వైఎస్సార్సీపీదే.. రాష్ట్రంలో 2027లోనే జమిలి ఎన్నికలు జరగనున్నట్లు నేదురుమల్లి రామ్కుమారెడ్డి స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం వరిస్తుందని వెల్లడించారు. భవిష్యత్ వైఎస్సార్సీపీదే అని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ ప్రసాద్రెడ్డి , వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య, పూజారి లక్ష్మి, రాపూరు, సైదాపురం,బాలాయపల్లి, డక్కిలి మండల కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, మన్నారపు రవికుమార్యాదవ్, వెందోటి కార్తీక్రెడ్డి, చింతల శ్రీనివాసులురెడ్డి, నేతలు సదారెడ్డి,చిట్టేటి హరికృష్ణ, కౌన్సిలర్లు ఆవిశంకరయ్య, దనియాల రాధ, సుబ్బారావు, సుకన్య, సుభావలీ,అటంబాక శ్రీనివాసులు, నారాయణరెడ్డి, శ్రీనివాసులురాజు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
పరిశోధనకు గణాంక శాస్త్రమే కీలకం
తిరుపతి సిటీ : పరిశోధన రంగంలో గణాంకశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నేషనల్ స్టాటిస్టిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత గణాంకశాస్త్ర పితామహుడు ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చిత్రపటానికి నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ తిరుపతి ఐఎస్పీఎస్లో డేటా సైన్స్ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సెంటర్ వర్తమాన గణాంకవేత్తలకు నాలెడ్జ్ హబ్గా మారాలని ఆకాంక్షించారు. ఐఎస్పీఎస్ గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్ సెంటర్ అనువర్తిత పరిశోధకులకు కన్సల్టెన్సీ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గణాంకవేత్త ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి, ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణ, యూబీఐ రీజనల్ హెడ్ ఎల్ఎస్వీఆర్ శర్మ, యూనియన్ బ్యాంక్ తిరుపతి జోనల్ హెడ్ శ్రీనివాస కుమార్, ఎస్వీయూ మాజీ రెక్టార్ సాంబశివారెడ్డి, ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, డాక్టర్ చంద్రమౌళి, ప్రొఫెసర్ విశ్వనాథన్, ప్రొఫెసర్ పార్థసారధి, డాక్టర్ శివపార్వతి పాల్గొన్నారు. శ్రీశక్తి పీఠంలో టీటీడీ చైర్మన్ రామచంద్రాపురం : రాయలచెరువు సమీపంలో వెలసిన శ్రీశక్తిపీఠాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు ఆదివారం సందర్శించారు. వారాహీ నవరాత్రులను పురస్కరించుకుని పాతాళ శ్వేత వారాహి క్షేత్రంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే మరకత శక్తి కాళీదేవి, మరకత సిద్ధేశ్వరస్వామివారిని సేవించుకున్నారు. అనంతరం శ్రీశక్తి పీఠాదేశ్వరీ మాతాజీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ మాతాజీని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శక్తిపీఠం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వైదేహీమాలను బహూకరించారు. సిరులతల్లికి వెండి తుంగవాలికలు చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీదేవికి భక్తులు రెండు వెండి తుంగవాలికలను (గొలుసు దీపా లు) విరాళంగా అందజేశారు. ఆదివారం హైదరాబాదుకు చెందిన శ్రీవారి భక్తుడు వీరాంజనేయులు రూ.3.27లక్షల విలువైన సుమారు 3 కిలోల బరువు గల వెండి తుంగవాలికలను కుటుంబ సభ్యులతో కలసి ఆలయ ఏఈఓ దేవరాజులుకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
శ్రీసిటీకి పోలీస్ బాస్ ఎవరు?
● ఉద్యోగ విరమణ పొందిన హైటెక్ స్టేషన్ డీఎస్పీ ● నెల నుంచి ఖాళీగా పోస్టు శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారు. అయితే శ్రీసిటీలోని హైటెక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ పోస్టు నెల నుంచి ఖాళీగానే ఉంది. మే నెలాఖరున డీఎస్పీ పైడేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు భర్తీ చేయలేదు. నాయుడుపేట డీఎస్పీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఎందుకీ నిర్లక్ష్యం శ్రీసిటీలో ఇప్పటికే పలు దేశాలకు చెందిన 250 పరిశ్రమలు ఉన్నాయి. 70వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. పలు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు రోజువారీ పారిశ్రామికవేత్తలు ఇతర ముఖ్యులు పర్యటిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీసిటీ పారిశ్రామికవాడలోని హైటెక్ పోలీస్ స్టేషన్కు నెల నుంచి డీఎస్పీని నియమించకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అలాగే ఈ పోలీస్ స్టేషన్కు ఇప్పటి వరకు పూర్తిస్థాయి సిబ్బందిని కూడా భర్తీ చేయలేదు. ఇప్పటికై నా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి పారిశ్రామికపరంగా ఎంతో ప్రాధాన్యత గల శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్కు డీఎస్పీని నియమించాలని పలు పరిశ్రమల ప్రతినిధులు, ఉద్యోగులు కోరుతున్నారు. -
పిల్లలకు చదువు తప్ప ఇంకేం ఇవ్వగలం.. ఆస్తిపాస్తులు సమకూర్చలేని పరిస్థితుల్లో ఉన్నత విద్యను తప్ప ఇంకేం అందించగలం.. ఇదీ సగటు మధ్యతరగతి మనిషి ఆలోచనా విధానం. ఇదే అలుసుగా పలు విద్యాసంస్థలు కాసులు పోగేసుకుంటున్నాయి. అప్లికేషన్.. అడ్మిషన్.. టర్మ్ ఫీజుల రూపంలో
● పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల ఇక్కట్లు ● ఫీజుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న స్కూళ్లు.. కాలేజీ యాజమాన్యాలు ● విద్యాసంస్థల్లో చేర్పించేందుకు తప్పని అప్పులు ● అధిక వడ్డీలతో ఎడతెగని పాట్లు ● పుస్తెలు సైతం తాకట్టు పెడుతున్న మాతృమూర్తులు తిరుపతి సిటీ : జిల్లాలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పాఠశాలల్లో దాదాపు పూర్తికాగా, ఇంటర్, ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, పీజీ కళాశాలలో ఇప్పుడిప్పుడే ప్రవేశాలు ఊపందుకుంటన్నా యి. తమ పిల్లలు ఇంజినీర్, డాక్టర్ కావాలనే కోరికలతో తల్లిదండ్రులు జిల్లాలోని పేరొందిన కార్పొరేట్ విద్యాసంస్థల వెంటపడుతున్నారు. దీంతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు ఫీజులను ఆమాంతం పెంచి దండుకుంటున్నాయి. విద్యాసంస్థలు చెప్పింనంత ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారులు, కుదువ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారలు రూ.5 నుంచి రూ.10ల వరకు డిమాండ్ చేస్తూ ప్రామిసరీ నోట్లు రాయించుకుని, ఖాళీచెక్కులను తీసుకుని నగదు ఇస్తున్నారు. అలాగే ఫీజుల చెల్లింపులకు పలువురు ఇంటిలోని బంగారం తాకట్టు పెట్టేందుకు కుదువ వ్యాపారులను సంప్రదిస్తున్నారు. దీంతో జిల్లాలోని పాన్ బ్రోకర్ షాపులు సైతం ఈ నెల కళకళలాడుతున్నాయి. వారు కూడా బంగారును తాకట్టు పెట్టుకుని రూ.3లు నుంచి రూ.5 వడ్డీతో నగదు అందిస్తున్నారు. వడ్డీకి సైతం చక్రవడ్డీ వర్తిస్తుందని సంతకాలు తీసుకుంటున్నారు. చదివించాలనే తపన పిల్లలు మాలా కష్టాలు పడకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే తపనతో అప్పులు చేసి ఉన్నతంగా చదివించేందుకు సిద్ధపడ్డాం. నా భర్త, నేను ఇద్దరం సొంతంగా తిరుపతిలో కిరాణా దుకాణం నడుపుతున్నాం. మాకు అబ్బాయి, అమ్మాయి కవల పిల్లలు. ఇద్దరూ ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేశారు. ఒకరి డాక్టర్ చేయాలనే ఆశతో ఇంటర్ ప్రైవేటు కళాశాలలో బైపీసీ చేర్పించాం. ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టాం. అమ్మాయిని తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ చేర్పించాం. ఫీజు ఏడాదికి రూ. 1.50లక్షలు చెప్పారు. ఇందులో రూ. 2లక్షలకు బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టాం. – ద్రాక్షాయిణి, కిరాణా దుకాణం నిర్వాహకులు, రేణిగుంట చదువు కొనాల్సి వస్తోంది విద్య వ్యాపారంగా మారిపోయింది. జూన్ వచ్చిందంటే మాలాంటి మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దారుణం. పిల్లల చదువులకు అప్పులకోసం వెతుకులాట తప్పడం లేదు. నేను తిరుపతిలో ఓ విద్యాసంస్థలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. నా భర్త దివ్యాంగుడు. వచ్చే జీతం ఇంటి ఖర్చులు, బాడుగకు సరిపోతుంది. ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో పనిచేస్తున్నాడు. మరో కుమారుడు ఇంటర్ పూర్తి చేసి నీట్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చినా కనీసం రూ. 5లక్షలు కావాల్సిన పరిస్థితి. అందుకోసం ఇంట్లో బంగారం తాకట్టు పెట్డడంతో పాటు మరో రూ.2లక్షలు అప్పు చేయాల్సిందే. ఈ కాలంలో చదువును కొనాల్సి వస్తోంది. – శ్రావణ భార్గవి, అధ్యాపకులు, తిరుపతితిప్పలు తప్పడం లేదు నేను తిరుపతిలోని ఓ ప్రముఖ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నా. నా భార్య సైతం ఓ ప్రైవేటు షాపులో పనిచేస్తోంది. ఇద్దరి జీతం నెలకు రూ.26వేలు వస్తాయి. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఓ అమ్మాయి పదో తరగతిని ఈ ఏడాది పూర్తి చేసింది. ప్రైవేటు కళాశాలలో ఎంపీసీలో చేర్పించాం. జేఈఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తామని ఏడాదికి రూ.1.50లక్షలు చెప్పారు. ప్రస్తుతం అప్పు చేసి రూ.లక్ష కట్టాం. మరో అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది. ఇటీవల విడుదల చేసి నీట్ ఫలితాలలో 480మార్కులు సాధించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నాం. ఆ అమ్మాయి చదువుకోసం విలేజ్లో ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టాం. – శివశంకర్, డెలివరీ బాయ్, తిరుపతి రూరల్ -
దుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి నిరాకరణ
చంద్రగిరి: రాష్ట్రంలో కులవివక్ష కోరలు చాస్తోంది. దళితులపై «అరాచకాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈసారి ఏకంగా సీఎం చంద్రబాబు సొంత మండలమైన తిరుపతి జిల్లా చంద్రగిరిలో దళితులు తీవ్ర అవమానానికి గురయ్యారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి లేదంటూ కొందరు అడ్డుకోవడం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బాధితులు తెలిపిన వివరాలు.. తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలో శ్రీకనకదుర్గమ్మకు తరతరాలుగా గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సింగు అనే సామాజికవర్గానికి చెందిన వారు శ్రీనివాసమంగాపురానికి వచ్చి అమ్మవారు తమ కులదైవమని.. ఇక్కడ పూజలు చేసుకుంటామని గ్రామ పెద్దల అనుమతి పొందారు. ఆ తర్వాత ఏడాదికోసారి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసి.. మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ పేరుతో ఓ ట్రస్ట్ను సైతం రిజిస్టర్ చేయించుకున్నారు. దీంతో మూడు నెలల క్రితం గ్రామస్తులకు, సింగులకు మధ్య వివాదం తలెత్తింది. ఆలయం తమదంటే.. తమదంటూ గొడవలు పడ్డారు. ఈనేపథ్యంలో గురువారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు దళిత మహిళలు కనకదుర్గమ్మ దర్శనం కోసమని ఆలయానికి వెళ్లారు. వారిని ఆలయంలోని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. మీరు ఆలయంలోకి రావడానికి వీల్లేదని అవమానించి వెనక్కి పంపించేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం దళితులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. తమకు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. వారంలో మూడు రోజులు వచ్చి పూజలు చేసుకునే సింగులు ఆలయం తమదనడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత మండలంలోనే దళితులకు ఇంతటి అవమానం జరిగినా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
● జగన్నాథుడి రథయాత్ర
ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర శనివారం సూళ్లూరుపేట పట్టణానికి చేరుకుంది. నెల్లూరు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2.30 గంటలకు పట్టణంలోని పురవీధుల గుండా రథయాత్ర భక్తజన సందోహం మధ్య నిర్వహించారు. హరేరామ, హరేకృష్ణ నామస్మరణలతో పట్టణం మారుమోగిపోయింది. చెక్క భజనలు, కోలాటాలతో రథయాత్ర ముందు నిర్వహించారు. రథయాత్ర ముగింపు అనంతరం శ్రీనగర్ కాలనీలో స్వామి వారికి నేతి దీపారాధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నెల్లూరు, సూళ్లూరుపేట ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. – సూళ్లూరుపేట -
జులై 10న మెగా పేరెంట్–టీచర్ సమావేశం
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,289 అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో జులై 10న మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. సమగ్ర శిక్ష సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. దీనికోసం పాఠశాలలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ గ్రాంట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న పాఠశాలలకు రూ.లక్ష , 251 నుంచి వెయ్యి మందికి లోపల విద్యార్థులున్న పాఠశాలలకు రూ.75 వేలు, 100 నుంచి 250 మధ్య విద్యార్థులున్న పాఠశాలలకు రూ.50 వేలు, 31 నుంచి వంద మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.25 వేలు, 30 మందికి లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేలు గ్రాంటును మంజూరు చేయనున్నామని, ఇప్పటికే 50 శాతం గ్రాంటును విడుదల చేయగా అందులో 20శాతం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశ నిర్వహణకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో విద్యార్థుల మార్కులు, హాజరు, ఆరోగ్యం, సహ పాఠ్య కార్యకలాపాల్లో చూపిన ప్రతిభ వంటి అంశాలతో కూడిన విద్యార్థుల ప్రగతిని తెలిపేలా ప్రోగ్రెస్ కార్డులు అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివిధ ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోనూ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
తిరుపతిలోనే డాక్టర్ల రిజిస్ట్రేషన్ సేవలు
తిరుపతి తుడా: డాక్టర్ల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియను జిల్లా స్థాయిలో తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ప్రారంభించినట్టు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీ హరిరావుతో కలిసి స్థానిక ఎస్వీ వైద్య కళాశాల సామాజిక విభాగంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శాశ్వత రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన అన్ని సేవల కోసం డాక్టర్లు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటిసారి జిల్లాలోనే అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతి శనివారం, ఆదివారం పాత జిల్లాల ఆధారంగా సేవలు అందించడం కోసం తీసుకున్న నిర్ణయం అభినదనీయమన్నారు. తిరుపతిలో మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం శుభ పరిణామని, సేవలను జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రీ రెన్యువల్ తదితర సేవలు అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫీజు తగ్గించామని చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ టాపర్స్కు ప్రతి సంవత్సరం గోల్డ్ మెడల్స్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, డాక్టర్ ప్రమీల, డాక్టర్ జనార్థన్, డాక్టర్ వాసుదేవనాయుడు, డాక్టర్ యుగంధర్, వైద్య మండలి సిబ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిలో ఒక మహిళ మృతి చెందగా రామచంద్రాపురం మండలంలోని పరమాల గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా.. పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సరస్వతి(50) అనే మహిళ మృతి చెందగా, మరో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు విజయనగరం ప్రాంతానికి చెందిన లహరి తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దైవ దర్శనానికి కారులో వెళుతున్నారు. మార్గం మధ్యలో ఎగువచావలి గ్రామం వద్ద ముందు వెళుతున్న గుర్తు తెలియని లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వెళుతున్న కారు ముందు లారీని ఢీకొంది.ఈ ఘటనలో కారులో వెళుతున్న సరస్వతి, లహరి, మీనా, నవ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. అదే విధంగా నెల్లూరు నుంచి బెంగుళూరు వెళుతున్న కారు మార్గం మధ్యలో తాళ్వాయిపాడు గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దువ్వూరు శ్రావణ్కుమారెడ్డి, రవీంద్రారెడ్డిలకు గాయాలయ్యాయి. స్థానికులు చికిత్సల నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పరపల్లి వద్ద యువకుడు.. రామచంద్రాపురం : మండల పరిధిలోని పరమాల గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తగీరు చిట్టిబాబు(38) మూడు రోజుల కిందట వ్యక్తిగత పనులపై తన స్నేహితుడితో కలసి తిరుపతి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఉప్పరపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడగా వాహనం వెనుక వైపు కూర్చున్న చిట్టిబాబు తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే రుయా హాస్పిటల్కు తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం స్విమ్స్కు తరలించగా శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడు చిట్టిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
జర్నలిస్టులపై కేసులు.. స్వేచ్ఛను హరించడమే
చిత్తూరు అర్బన్: పత్రికల్లో వార్తలు రాసినందుకు గాను జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షులు ఎం.లోకనాథన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కేఎం.అశోక్కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్టులపై ఏదైనా ఫిర్యాదుల వస్తే వాటిలో వాస్తవాలు విచారించి ఆపై పోలీసులు నిర్ణయం తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠను కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఓ వార్త రాసినందుకు గాను స్థానిక సాక్షి రిపోర్టర్ నాగరాజు పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం .. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసిన విషయంపై ఏపీయూడబ్ల్యూజే నాయకులు చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మణికంఠ చందోలుతో చర్చించారు. జర్నలిస్టులను యాజమాన్యాలతో ముడి పెట్టొద్దని.. తమను పాత్రికేయులు గానే గుర్తించి.., హక్కులను రక్షించడానికి పోలీసు శాఖ చొరవ చూపాలని కోరారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో పాత్రికేయులు పనిచేస్తున్నారని తెలిపారు. పాత్రికేయుల హక్కులు, కలం గౌరవాన్ని కాపాడాలని కోరారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీని సైతం రూపొందిస్తామని ఇటీవల కలెక్టర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడూ ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎస్పీ స్పష్టం చేశారు. పత్రికల్లో వార్త రాయడంతో పాటు వాటిని ఉదేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగారు అనే ఫిర్యాదు పైనే కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నారు. విచారణలో సంబంధిత రిపోర్టర్ ప్రమేయం లేదని తేలితే తదుపరి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. పాత్రికేయుల రక్షణ కోసం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని తాము కచ్చితంగా పాటిస్తామన్నారు. కలెక్టర్తో మాట్లాడి పాత్రికేయులపై దాడుల నివారణ కమిటీని సైతం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఎస్పీతో ఏపీయూడబ్ల్యూజే నేతల భేటీ పత్రికా స్వేచ్ఛకు కట్టుబడే ఉంటామని ఎస్పీ -
జగన్నాథుడి రథయాత్ర
జగన్నాథ రథయాత్ర శనివారం సూళ్లూరుపేటకు చేరుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోఇళ్లు, విల్లాలపై పడి దోచుకుంటున్న దొంగలు ఇప్పుడు కొత్త రూటును ఎంచుకుంటున్నారు. ఇటీవల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా రైలు ప్రయాణికులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్లీపర్ క్లాసుల్లోని ప్రయాణికులనే ఎంచుకుని చెలరేగిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞాన్ని చాకచక్యంగా సిగ్నల్ వ్యవస్థను వినియోగించుకొని ట్యాంపరింగ్ చేసి అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులను సైతం భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరిని కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు.. వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. రైళ్లలో రాత్రివేళ చెలరేగిపోతున్న దొంగలు ● బంగారు నగలే లక్ష్యంగా దోపిడీ ● సిగ్నల్ ట్యాంపరింగ్తో చోరీలు ● రెండు నెలల్లో మూడు ఘటనలు ● దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు ● ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు సిగ్నల్ ట్యాంపరింగ్తో దోపిడీఏసీల కంటే స్లీపర్ క్లాస్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా రైల్వేస్టేషన్లో సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగుల లైట్స్కు సంబంధించి బాక్స్లో మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. స్టేషన్ టు స్టేషన్ (మిడ్ స్టేషన్) మధ్యలో ఉండే సిగ్నల్ మానిటరింగ్ వ్యవస్థలో రెడ్, గ్రీన్ లైట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో గ్రీన్ లైట్ వైర్ను దొంగలు తీసివేస్తున్నారు. ఆ సమయంలో సిగ్నల్ చూపితే రెడ్లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ సిస్టమ్ను కనుక్కొని దొంగల ముఠా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు ● మే 2న రాత్రి 10.30 గంటలకు ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైంది. రెడ్లైట్ వెలుగుతుండడంతో రైలు ఆగిన తర్వాత కొందరు దుండగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇద్దరి ప్రయాణికుల మెడలో బంగారు గొలుసులు తీసుకొని పారిపోయారు. ● మే 14న వేకువజామున 2.30 గంటలకు అదే ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో మళ్లీ హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేశారు. కొందరు రైలు బయట నుంచే బంగారు గొలుసులు దొంగలించారు. ● జూన్ 26 వేకువజామున 2.30 గంటలకు సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్ సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ గురవ్వడంతో రైలును ఆపేశారు. కొంతమంది ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంచుకొని వెళ్లారు. ఈ మూడు దొంగతనాల్లో 10 మంది మహిళల మెడల్లోని దాదాపు 120 గ్రాముల పైగా బంగారాన్ని కాజేశారు. చిత్తూరు కార్పొరేషన్: రైలు ప్రయాణమంటేనే ఉమ్మడి జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలు తలుచుకుని భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం.. కిక్కిరిసిన జనాల మధ్యన ప్రయాణం చేయాల్సి రావడంతో దొంగలకు వరంగా మారింది. ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చోరీల నివారణ కష్టతరమవుతోంది. ఎక్కువగా రాత్రి 10.30 నుంచి వేకువజామున 3 గంటల లోపు దొంగతనాలు జరగుతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. కిటీకీల వద్ద నగలు చోరీ చేసి పరారవుతున్నారు. బంగారు నగలే లక్ష్యం రైళ్లలో చిల్లర దొంగతనాలు పాత పద్ధతి. ఇప్పుడు దొంగలు రూట్ మార్చారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారాన్ని చాకచక్యంగా కొట్టేసేందుకు పూనుకుంటున్నారు. ఊర్లకు వెళ్లేటప్పుడు మహిళలు ఆభరణాలు ధరించుకువెళ్లడం అలవాటుగా మారిన నేపథ్యంలో దొంగలు వారినే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా రైలు కిటికీల నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దోచుకెళ్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, రోడ్డుకు దగ్గర్లో ఉండే స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిమిషాల్లో తమ పనికానిచ్చేస్తున్నారు. మహారాష్ట్ర ముఠాగా అనుమానం వరుస దొంగతనాల వెనుక మహారాష్ట్ర (పార్థీ గ్యాంగ్) ముఠాకు చెందిన వారు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్లలో నేరాలకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. వీరు 4–8 మంది దొంగతనానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. చిత్తూరు రూరల్ మండలం, సిద్ధంపల్లె స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనలో వేకువజామున 2.30 గంటలకు రైలు ఆగింది. దుండగలు రైలు వెలుపల ఒకరు వెనుక ఒకరు ఉన్నారు. ఒకరి భుజం పై మరొకరు కూర్చొని తెరిచిన కిటికీల్లో టార్చ్ వేస్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసు తెంపారు. ఇలా ఎస్–7, 10 బోగిల్లో నలుగురి వద్ద 60 గ్రాముల వరకు బంగారం దోచుకున్నారు. రైలులో ఉండే బీట్ పోలీసులు విజిల్స్ వేసే లోపల దొంగలు తప్పించుకున్నారు. ఘటన జరిగిన అర గంటలో రైల్వే పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అరకొరగా ఎస్కార్ట్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరకొరగా ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క స్టేషన్ నుంచి ఇద్దరు బీట్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక బీట్లో 3 నుంచి 4 రైళ్లను కవర్చేసే విధంగా డ్యూటీలు అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఆర్ఫీఎఫ్ విభాగం నుంచి ఇద్దరు ఉంటారు. కనీసం ఒక బీట్కు నలుగురు జీఆర్పీ పోలీసులు, నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లను కవర్చేసే విధంగా ఉంటే భద్రత పటిష్టపరిచే విధంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్పీఎఫ్ విభాగానికి చెందిన వారి విధులు బలోపేతంగా లేవన్న విమర్శలున్నాయి. రైళ్లలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నా జీఆర్పీ పోలీసులకు కాల్చివేత ఉత్తర్వులు అమలు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత స్లీపర్క్లాస్లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకుని నిద్రలోకి జారుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలులో కడప రైల్వేస్టేషన్ వరకు ఇద్దరు ఎస్కార్ట్గా వచ్చి కడపలో దిగుతున్నారు. – 8లోగస్తీ ముమ్మరం రైళ్లలో దొంగతనాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వివిధ బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. త్వరలో నిందితులను పట్టుకుంటాం. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమ్తతంగా ఉండాలి. వేసవి దృష్ట్యా రైళ్లలో గస్తీని ముమ్మరం చేశాం. నేరాలు జరగకుండా ప్రతి రైల్వే స్టేషన్లో పికెట్లు ఏర్పాటు చేశాం. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులు సహకరించాలి. – హర్షిత, రైల్వే డీఎస్పీ, గుంతకల్లురేంజ్ రెండు నెలల్లో మూడు రాబరీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో మూడు రాబరీలు జరిగాయి. ఇందులో రెండు తిరుపతి జిల్లాలోని ముంగలిపట్టు వద్ద కాగా మరొకటి చిత్తూరు జిల్లా సిద్ధంపల్లె సమీపంలో చోటు చేసుకుంది. చిత్తూరులో ఇటువంటి దోపిడీ జరగడం ఇదే మొదటి సారి. కానీ ఈ దొంగతనాల్లో దాదాపు రూ.15 లక్షల విలువైన 120 గ్రాముల బంగారం దొంగతనం జరిగినట్లు సమాచారం. ఇటీవల చిత్తూరు రూరల్ పరిధిలో జరిగిన రాబరిపై పోలీసులు ప్రత్యేక బృందంగా విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్లను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్, యాక్టివ్ క్రిమినల్స్ గురించి ఆరా తీస్తున్నారు. -
శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు
శ్రీసిటీ (సత్యవేడు):శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ‘అన్నమయ్య పదామత వర్షణి’ కార్యక్రమం శనివారం సంగీత ప్రియులను అలరించింది. హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవ శంకరరావు వ్యాఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు, రచనల గొప్పతనాన్ని వివరించారు. ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనూష కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. కళాకారులను ఇతర బృంద సభ్యులను ఆయన అభినందించారు. నిర్వాహకుల తరపున తిరుపతి శ్వేతా మాజీ డైరెక్టర్ భూమన్, ఎస్కే యూనివర్సిటీ మాజీ ఉప కులపతి కుసుమకుమారి కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి పళ్లేటి బాలాజీ సమన్వయ కర్తగా వ్యవహరించారు. -
బాబు బూటకపు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ మేనిఫెస్టో బాండ్లను ఇచ్చి మోసగించిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు,తిరుపతి జిల్లాల అధ్య క్షులు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి మారుతీనగర్లోని పెద్దిరెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మెయిళ్ల గౌరీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు బొర్ర మాదవిరెడ్డి తదితరులు శనివారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి దుస్సాలువలు కప్పి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించడంలో మహిళా విభాగం కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అన్నీ చేసేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా, మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందన్న విషయాన్ని మహిళలకు తెలియజేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి సూచించిన పెద్దిరెడ్డి, భూమన -
మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి
తిరుపతి మంగళం : తిరుపతిలో ‘నేషనల్ మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని, ఇది ధరల స్థిరీకరణ, మార్కెట్ అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం,కార్యకలాపాలు నిర్వహించగలదని, అలాగే చిత్తూరు జిల్లాలో శ్రీజాతీయ మామిడి పరిశోధనా కేంద్రం’ చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తోతాపురి మామిడి ధరలు భారీగా క్షీణించడంతో రైతులు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మామిడి మద్దతు ధర కిలోకు రూ.12 ఉన్నప్పటికీ రైతులు కిలో కేవలం రూపాయి నుంచి నాలుగు రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇది పంట పెట్టుబడులను పొందలేని దుస్థితి అని వివరించారు. కూలీల ఖర్చులు కూడా అందకుండా పోవడంతో చెట్లపైనే మామిడిని వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి ధర పతనంతో ఉత్పన్నమైన పలు కారణాలతో చిత్తూరు–తిరుపతి ప్రాంతంలో ఉన్న 52 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లలో 28 యూనిట్లు మూత పడినట్లు లేఖలో వివరించారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని రైతు ఆదాయం రెట్టింపు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పచ్చనేతల దౌర్జన్యం
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు తిరుపతి మంగళం /తిరుపతి అర్బన్ : తిరుపతి నగర, శివారు ప్రాంతాల్లో భూములు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, పరంబోకు స్థలాలు కనిపిస్తే పచ్చనేతలు పాగవేసేస్తున్నారు.అందులో భాగంగానే మంగళం తిరుమలనగర్ పంచాయతీ పరిధిలోని తుడా క్వార్టర్స్, బొమ్మల క్వార్టర్స్లోని చెన్నాయగుంట లెక్క దాఖలాలు 195, 226 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కొందరు శుక్రవారం ప్రయత్నించారు. ఏకంగా జేసీబీలతో గాడులు తీసి అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. అర్బన్ తహశీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో ప్రసాద్ అక్రమ నిర్మాణాలను అడ్డుకుని జేసీబీలను అక్కడ నుంచి పంపివేశారు. 195, 226 సర్వే నంబర్లలోని స్థలం ప్రభుత్వానికి చెందిందని, అందులో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో టీడీపీ నాయకులు తమకు చంద్రగిరి ఎమ్మెల్యే నాని చెప్పారని, తమ వద్ద పట్టాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే మీ వద్ద ఉన్న పత్రాలను తహశీల్దార్కు చూపించి అనుమతి తీసుకుని నిర్మాణాలు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. అంత వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించి అక్కడ నుంచి పంపించి వేశారు. -
కార్యదర్శుల పనితీరుపై ఆగ్రహం
బుచ్చినాయుడుకండ్రిగ : గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్యదర్శులు పనితీరు మార్చుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారిణి సుశీలాదేవి హెచ్చరించారు. శుక్రవారం కారణి గ్రామంలో పర్యటించి, ఎంపీడీఓ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో దోమల నివారణకు మురుగు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయించి, వీధుల్లో బ్లీచింగ్ చేయించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలను అరికట్టాలని, తాగునీటి సమస్యలు లేకుండా, వీధులలో గుంతలు ఉంటే పూడ్చాలని తెలిపారు. అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టకపోతే ఉపేక్షించేదేలేదన్నారు. ఈక్రమంలో ఈఓపీఆర్డీ రాజశేఖర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నమ్మ, సర్పంచ్ పద్మమ్మ పాల్గొన్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
● భక్తులకు స్వల్పగాయాలు తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళుతున్న మరో కారును ఢీకొనడంతో భక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. తమిళనాడుకు చెందిన భక్తులు ఓ కారులో, తెలంగాణకు చెందిన భక్తులు మరో కారులో తిరుమల నుంచి తిరుపతికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు వద్ద తమిళనాడు కారు అదుపు తప్పి ముందు వెళుతున్న తెలంగాణ కారును ఢీకొంది. దీంతో కారు ముందు ఉన్న రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలలోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. తమిళనాడుకు చెందిన భక్తుల కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదంపై తిరుమల ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు. -
వడ్డీ వ్యాపారి నుంచి ఆటో ఇప్పించండి
చంద్రగిరి : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తమకు అందించిన ఆటోను వడ్డీ వ్యాపారీ బలవంతంగా తీసుకున్నాడని, ఆయన ఆగడాల నుంచి రక్షించి, కుటుంబానికి జీవనాధారమైన ఆటోను తమకు ఇప్పించాలంటూ బాధితులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల వివరాల మేరకు.. మండల పరిధిలోని శేషాపురానికి చెందిన శివ భార్య నందినికి ఎస్సీ కార్పొరేషన్తో పాటు మహిళా సంఘాల ద్వారా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ–ఆటోను పొందారు. అప్పటి నుంచి నందిని భర్త శివ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏ.రంగంపేటకు చెందిన పచ్చిపాల చైతన్య గతేడాది రూ.60 వేలను అప్పుగా తీసుకున్నాడు. ఆపై వడ్డీల రూపంలో సుమారు రూ.1.60 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే కొంత వడ్డీతో పాటు అసలు చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు జీవనాధారమైన ఆటోను బలవంతంగా తీసుకున్నట్లుగా బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ వారు శుక్రవారం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. -
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా పట్టణంలోని చైన్నె రోడ్డులో వెలసిన ద్రౌపతీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణతో పూజలు ప్రారంభం అయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. హోమ పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజలు చేశారు. కాగా ఉదయం ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి పుర ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, శ్రీకాళహస్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగాల కల్పనకు కృషి
తిరుపతి అర్బన్ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సాంకేతిక అంశాలను జోడించాలని రాష్ట్ర ఎంఎస్ఎం, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో శుక్రవారం ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎస్పీ సోమనాథ్, రాష్ట్ర ఎంఎస్ఎం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ సీఈఓ విశ్వ, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1.80 లక్షల మంది ఎంఎస్ఎంఈల రంగంపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. -
ప్రాణహానీ ఉంది.. రక్షణ కల్పించండి.
రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ సైదాపురం : అక్రమ మైనింగ్దారులతో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ శిరీష యాదవ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు తాము ఫిర్యాదు చేశామన్నారు. దీని దృష్టిలో ఉంచుకోని జిల్లా మైనింగ్ అధికారులతో పాటు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న కొందరు తమపై తప్పుడు కేసులతో పాటు ప్రాణహాని కలిగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ చేసే వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ఆమె కోరారు. జిల్లా ఎస్పీకి పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఏపీ టూరిజానికి భూ కేటాయింపు ● ఎస్వీపురం పరిధిలో 12.70 ఎకరాలకు ఆమోదం తిరుపతి అన్నమయ్య సర్కిల్ : టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలో ఏపీ టూరిజం ఆథారిటీకి ఉచితంగా భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. వడమాలపేట మండలం ఎస్వీపురం పంచాయతీ పరిధిలో 12.70 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఆమోద ముద్ర వేసింది. ఉచితంగా భూ కేటాయింపు ప్రతిపాదనపై మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్వీపురం సర్వే నంబరు 428–2లో 30 సెంట్లు అలాగే సర్వే నంబరు 428–3లో 12.40 ఎకరాల చొప్పున ఏపీ టూరిజం అథారిటీకి భూమిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ముందుకొచ్చిన మెస్సర్స్ పావని హోటల్స్ సంస్థకు అవసరమైన రాయితీ ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 5 స్టార్ హోటల్ ఏర్పాటుతో సుమారు 250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పర్యాటక రంగ శాఖ అధికార యంత్రాంగం భావిస్తోంది. అదే విధంగా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
యువకుడి అదృశ్యం
కోట : కోటకు చెందిన ముకేష్ కుమార్ అనే యువకుడు మూడు రోజులుగా కనిపించడం లేదని అతని తండ్రి గీసూలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్కు చెందిన గీసూలాల్ కోటలో టీ దుకాణం నడుతున్నాడు. తండ్రి మందలించడంతో 18 ఏళ్ల ముకేష్కుమార్ కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా కనిపించకుండా పోయిన ముకేష్ కుమార్ ముంబయిలో ఉన్నట్లు ఆచూకీ లభించిందని రాజస్థాన్ వాసులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐకు సమాచారం ఇచ్చామన్నారు. ఆవుల దాడి ఘటనపై ఆందోళన వద్దు తిరుపతి తుడా : తిరుపతిలో ఆవులు దాడి చేసినట్లు అందులో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని, ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకున్నది కాదని నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియోను తిరుపతికి చెందిన కొందరు ముందు జాగ్రత్త కోసం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆందోళన కలిగించే ప్రచారం మంచిది కాదని హితువు పలికారు. నగరంలో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆమె సూచించినట్లు తెలిపారు. తిరుపతికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న తరుణంలో వ్యక్తిగతంగా పశువులు పెంచుకునే వారు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై వదిలి వేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవీఎం గోదాములపై నిఘా రేణిగుంట : జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్ర పరిచిన గోడౌన్ వద్ద నిరంతర నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్ర పరిచిన ఈవీఎంలను శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో ఈవీఎం గోడౌన్ ఇన్చార్జి, ఎస్డీసీ సుధారాణి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, రేణిగుంట తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడులకు శ్రీసిటీ చేయూత
● రూ.18 లక్షలతో వసతుల కల్పన శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో (సీఎస్ఆర్) భాగంగా శ్రీసిటీలోని జపాన్ పరిశ్రమ ఐసాన్ ఆటో పార్ట్స్ ఇండియా సుమారు రూ.18.80 లక్షలతో వివిధ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన వసతులను ఐసాన్ మేనేజింగ్ డైరెక్టర్ యసనోరి సకావే, శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్ఆర్) నిరీషా సన్నారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ విద్యా వసతుల్లో సూళ్లూరుపేట ప్రభుత్వ బాలికల హైస్కూల్లో రూ. 6.50 లక్షల ఖర్చుతో అదనపు మరుగుదొడ్లు, వంట గది నిర్మాణం, సత్యవేడు మండలం రామచంద్రపురంలో రూ.12.30 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ భవనం నిర్మించారు. ఈ సందర్భంగా ఐసాన్ మేనేజింగ్ డైరెక్టర్ యసనోరి సకాయి మాట్లాడుతూ.. విద్యా వసతుల కోసం సీఎస్ఆర్ కార్యక్రమాలు చేపట్టడం ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసాన్ పరిశ్రమ ప్లాంట్ హెడ్ యూచి టొమిట, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ గోపాల్, ప్రొడక్షన్ కోఆర్డినేటర్ తోషిహిరో సనా, మ్యానుఫ్యాక్చరింగ్ డీజీఎం దేవనాథన్, శ్రీసిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై ఆందోళన
● నల్ల జెండాలతో నిరసన ..రోడ్డుపై బైఠాయింపు రామచంద్రాపురం : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం రోడ్డెక్కారు. చెవిరెడ్డి కుటుంబంపై రాజకీయ కక్ష తగదు అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రామచంద్రాపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పచ్చికాపల్లం, తిరుపతి రహదారిపై కొంత సేపు బైఠాయించి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు. ఈ సందర్భంగా అర్సీపురం మండలం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందారెడ్డి, జడ్పీటీసీ రాణితో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నులిమేస్తూ అక్రమ కేసులు పెడుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతూ ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చెవిరెడ్డిని అక్రమ కేసుల నుంచి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడుతాం చెవిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ నేతలు ముందుకు వచ్చారు. చెవిరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే వరకు తమ పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.