breaking news
Tirupati
-
20 శివాలయాలకు భారీ సారె
తిరుపతి రూరల్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రగిరి నియోజక వర్గంలోని మూడు మండలాల పరిధిలోని పురాతన 20 శివాలయాలకు తుమ్మలగుంట శ్రీకల్యాణ వెంకన్న ఆలయం నుంచి భారీగా సారె అందజేశారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి సారె సమర్పణ చేశారు. ఆనవాయితీ మేరకు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 20 శివాలయాలను దర్శించి, సారె సమర్పించారు. మొదట తలకోన శ్రీసిద్ధేశ్వర స్వామిని దర్శించి ఆ తరువాత చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి సారె సమర్పణ కార్యక్రమం మొదలు పెట్టారు. చంద్రగిరి మండలం నారావారిపల్లి శ్రీశేషాచల లింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ పుట్టాలమ్మ ఆలయం, శ్రీ నాగాలమ్మ ఆలయం, శ్రీమల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాలకు పట్టువస్త్రాలు అందజేసి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లి శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సి.గొలపల్లి వద్దనున్న నీలకంఠేశ్వర ఆలయం, చిగురువాడ స్వర్ణముఖి ఒడ్డునున్న పార్వతీ పరమేశ్వర ఆలయం, దుర్గసముద్రం వల్మీకేశ్వర ఆలయం, అడపారెడ్డిపల్లి వద్దనున్న శివగిరి క్షేత్రంలోని నాగేశ్వరస్వామి ఆలయం, అవిలాల కపిలేశ్వరస్వామి ఆలయం, మంగళంలోని పరమేశ్వరస్వామి ఆలయాలకు పట్టువస్త్రాలను అందజేశారు. తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరం వద్దనున్న ప్రాచీన శ్రీపరాశరేశ్వర స్వామి ఆలయంకు పట్టువస్త్రాలు సమర్పించి స్వామి దర్శనం చేసుకున్నారు. చివరగా రామచంద్రాపురం మండలంలోని రేకలచేను వద్దనున్న జన్మస్థల పరమేశ్వరస్వామి ఆలయం, బొప్పరాజుపల్లి బుగ్గ మల్లేశ్వరస్వామి ఆలయం, రాయల చెరువు వద్దనున్న శ్రీభవానీ జలకంఠేశ్వరస్వామి ఆలయం, గంగిరెడ్డిపల్లి వద్దనున్న వీరబ్రహ్మంగారి ఆలయాలకు సారెను అందజేశారు. సాదర స్వాగతం శివాలయాలకు సారెను తెచ్చిన చెవిరెడ్డి మోహిత్రెడ్డిని ఆయా గ్రామాల్లోని పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆయన వెంట రాగా అందరికీ దర్శన ఏర్పాట్లు చేయించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శైవాలయాలకు సారెను అందజేసే బృహత్తర కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేతుల మీదుగా 14 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. -
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
నాగలాపురం: గడ్డిని తరలిస్తుండగా కరెంటు తీగ తగిలి ట్రాక్టర్కు అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మండలంలోని వినోభానగర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగలాపురం పంచాయతీ, వినోభానగర్ గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి పొలంలో ఉన్న 125 గడ్డి చుట్టలను అదే గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి తన సొంత ట్రాక్టర్లో లోడ్ చేసుకుని బయలుదేరాడు. ఆ సమయంలో అనుకోకుండా కరెంటు తీగ తగిలి నిప్పు రవ్వలు పడి గడ్డి చుట్టలు మండుకోవడం మొదలైంది. ఇది గమనించిన ట్రాక్టర్ యజమాని ట్రాలీని అలాగే వదిలేసి, ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గ్రామస్తులంతా వచ్చేలోపు గడ్డి చుట్టలు పూర్తిగా కాలిపోయాయి. నేడు డయల్ యువర్ సీఎండీ తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 89777 16661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావాలనుకున్న వినియోగదారులు తమ వద్ద విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు. చెరువులో మునిగి బీటెక్ విద్యార్థి మృతి పెళ్లకూరు: మహాశివరాత్రి పర్వదినాన బోటు షికారుకు వెళ్లిన తొమ్మిది మంది యువకుల్లో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందగా తక్కిన 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం పునబాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు శ్రీకాళహస్తి పట్టణం, కై లాసగిరి కాలనీకి చెందిన సింగపాటి శశిధర్(19) చైన్నెలోని వేల్టెక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఇంటికి చేరుకున్న శశిధర్ స్నేహితులతో కలిసి పునబాక చెరువు వద్దకు చేరుకున్నాడు. చెరువు వద్ద ఉన్న చిన్నపాటి బోటులో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి షికారుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బోటు తిరగబడింది. దీంతో యువకులంతా ఆర్తనాదాలు చేశారు. అరుపులు, కేకలు విని అక్కడ ఉన్న స్థానికులు 8 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ శశిధర్ మాత్రం నీట మునిగి మృతి చెందాడు.మృతుని కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని నిర్జీవంగా పడివున్న శశిధర్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రుల విన్నపం మేరకు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
బలవంతం చేయలేదు
చదువుల్లో వెనుకబడిన పిల్లలను, హాజరు తక్కువ శాతం ఉన్న పిల్లలను బలవంతంగా పాఠశాలల నుంచి హాస్టల్స్కు తరలించలేదు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు సబ్జెక్ట్ వారీగా ఉపాధ్యాయులకు హాస్టల్స్లో డ్యూటీలు వేశాం. ప్రత్యేక చదువులతోపాటు, వసతులు కల్పిస్తాం. ఉత్తమ ఫలితాల కోసమే వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి, తిరుపతి -
తిరుపతిపై ‘పచ్చ’పాతం
తిరుపతి తుడా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజన తర్వాత దాదాపు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తిరుపతికి చేసింది ఏమీ లేదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని, జీవనం సాగించారు చంద్రబాబు. రాష్ట్రంలో అత్యున్నత పదవైన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినా తనకు ఇంటి హోదాను, గుర్తింపునిచ్చిన తిరుపతి రుణం కాసింతైనా తీర్చుకోలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. పుట్టిన ఊరు నారావారిపల్లిని సైతం పట్టించుకోలేదన్న అపకీర్తి గడించారని జిల్లా ప్రజలు నిత్యం వాపోతుంటారు. ఆంధ్ర ప్రదేశ్కు రెండోసారి సీఎంగా, మూడో బడ్జెట్లోనూ తిరుపతికి తీరని అన్యాయం చేశారు. నగర అభివృద్ధికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర చిత్తు కాగితాల్లానే మిగిలిపోయాయి. ఈసారి బడ్జెట్లో నైనా వాటిని జులిపించి ఎంతోకొంత నిధులు కేటా ఇస్తారని అందరూ భావించారు. అందరు ఆశలను ఆడి ఆశలు చేశారు. స్మార్ట్ సిటీకి చెక్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీలో తిరుపతి 2017లో ఎంపిక కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలలు ముందు పట్టాలెక్కింది. రూ.1610 కోట్ల ప్రణాళికలతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభం కాగా ఇందులో కేంద్రం రూ. 500 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 500 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా రూ.316 కోట్లు చొప్పున పలు విడతల్లో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.184 కోట్లు విడుదల చేస్తే కేంద్రం కూడా మిగిలిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల స్మార్ట్ సిటీ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికై నా స్మార్ట్ నిధులను విడుదల చేయాల్సి ఉంది. రూ.90 కోట్ల వ్యయంతో సిటీ ఆపరేషన్ బిల్డింగ్ సెంటర్(కార్పొరేషన్ కొత్త భవనం) పనులను 2022లో ప్రారంభించారు. ఎన్నికలు పూర్తి చేసుకునే నాటికి పనుల్లో 50 శాతం పూర్తయ్యాయి. 2023లో రూ.18 కోట్లు విడుదల చేయగా ఏడాది క్రితం వరకు ఆ నిధులతో పనులు చేశారు. బాబు సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు చిల్లి గవ్వ విధిలించలేదు. అలాగే సుమారు రూ.40 కోట్ల వ్యయంతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, తదితర అనేక ప్రాజెక్టులు నిధులు లేక అర్థాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం బడ్జెట్లో స్మార్ట్ సిటీకి నిధులు కేటాయిస్తే మొండి గోడలు కాస్తయినా ముందడుగు వేస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైంది. ఇక అభివృద్ధి లేనట్టే.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తిరుపతికి సవాల్ విసురుతోంది. ప్రతిరోజు అనేక ప్రాంతాల్లో యూడీఎస్ ఓవర్ ఫ్లో సమస్యాత్మకంగా మారింది. నగరం విస్తరించినా యూడీఎస్ ఓల్డ్ సిటీకే పరిమితమై ఉంది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన లైన్పై అధిక భారం పడుతోంది. కొత్త యూడీఎస్ వేయాలంటే రూ.450 కోట్లు అవసరమని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాబు ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో పక్షపాతం చూపడంతో తిరుపతి అభివృద్ధి అధోగతేనని ప్రజలు వాపోతున్నారు. -
అందరికీ వాటాలిస్తున్నాం..
● మట్టిమాఫియాకు అడ్డాగా ఇందిరమ్మ కాలనీ ● జేసీబీలు ట్రాక్టర్లతో విచ్చలవిడిగా గ్రావెల్ తరలింపు ● అడ్డుకున్న స్థానికులతో మాఫియా ముఠా వాగ్వాదం ● రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేత ప్రజాప్రతినిధిగా ఎన్నికై న నాటి నుంచి ప్రకృతి వనరులను ఆ పార్టీ నేతలు కొల్లగొడుతూనే ఉన్నారు. తాము చెప్పినట్లు తలలు ఊపే అధికారులకు పోస్టింగ్లు ఇప్పించుకుని, అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ప్రజాప్రతినిధి చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన అధికారులు సైతం వారి బాటలోనే పయనమవుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. మట్టి మాఫియాకు అడ్డా స్థానిక చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ మట్టి మాఫియాకు అడ్డాగా నిలిచింది. కాలనీలోని చివరి ప్రాంతంలో ఉన్న కొండగుట్టను ధ్వంసం చేస్తూ విలువైన ఎర్రమట్టిని దోచుకుపోతున్నారు. గత కొద్ది రోజులుగా గుట్టు చేస్తున్న ఈ దందాపై స్థానిక ప్రజలు తిరగబడటంతో బయటకు పొక్కింది. అయితే మట్టి మాఫియా ముఠా మాత్రం తాము అధికార పార్టీ నేతలకు, అధికారులకు వాటాలు ఇస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ రూ.800 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు వందకు పైగా ట్రిప్పులు వెళ్తున్నాయంటే మాఫియా అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రెవెన్యూలోని కీలక అధికారికి ముడుపులు మట్టి, ఇసుక అక్రమ రవాణాపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా రెవెన్యూ అధికారులు మాత్రం ఏడాదిన్నరగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫిర్యాదు చేసిన వెంటనే అనుమతులు ఇవ్వలేదని ఆయన స్పష్టంగా వివరణ ఇస్తాడు. అయితే అక్రమాలపై ఘటన స్థలానికి వెళ్లి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేదు. రేపటి నుంచి ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు తిరుపతి సిటీ: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు ఈనెల 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ వర్సి టీ అధ్యయన కేంద్రం రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్ట ర్ మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఇప్పటికే అభ్యర్థులకు హాల్టికెట్లు అందించామని తెలిపారు. నిర్ణీత గడవుకు 30 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. డిగ్రీ థర్డ్ ఇయర్ 5వ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు, సెకండియర్ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు, ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ, యూజీ, పలు డిప్లొమా కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోపు ఇగ్నో వెబ్సైట్ నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య రాపూరు: కృష్ణపట్నం–ఓబులవారి పల్లి రైల్వే మార్గంలోని రాపూరు–వెలికల్లు రైల్వే స్టేషన్ మధ్యలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు నెల్లూరు రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. అతని వయస్సు సుమారు 60–65 మధ్యలో ఉంటుందని, మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆమె చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతనికి సంబంఽధించిన వారు ఎవరైనా ఉంటే నెల్లూరు రైల్వేస్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
నమ్మక ద్రోహం
మూడోసారి విడుదల చేసిన బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మేము గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల భృతి ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం ఒక్కమాట కూడా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదు. ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన నిరుద్యోగులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల గోష్ట తగలకతప్పదు. – శోభన్యాదవ్, వరదయ్యపాళెం మండలం ఊసెత్తని సున్నా వడ్డీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ గురించి కనీసం మాట్లాడడం లేదు. మహిళలు ఎంతో ఆశతో ఎదురుచూసిన సున్నా వడ్డీ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీనిపై డ్వాక్రా మహిళలకు సంతృప్తిని మిగిల్చింది. ఎన్నికల సమయంలో మహిళలను ఊరడించే విధంగా ఉచిత హామీలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నమ్మబలికారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా సున్నా వడ్డీ గురించి కనీసం నోరు మెదపడంలేదు. మహిళల పట్ల వారి నిర్లక్ష్య వైఖరి బయటపడింది. గత ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరుతో చెప్పిన సమయానికి వారి ఖాతాల్లో జమ అయ్యాయి. – శ్యామలమ్మ, వైస్ ఎంపపీ, వరదయ్యపాళెం మండలం ఎంతో ఆశతో ఎదురు చూశాం.. ఆడ్డబిడ్డ నిధికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశాం. కానీ బడ్జెట్ నిరాశపరచింది. కనీసం మహాశక్తి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే మాట కూడా ఎత్తలేదు. దీంతో ఇక మహిళా శక్తికి మంగళం పాడేసినట్టే తెలుస్తోంది. జిల్లాలో మహిళలు చంద్రబాబు హామిని నమ్మి ఓట్లు వేశారు. నెలకు రూ.1500 చొప్పున ప్రతి మహిళకు అందుతుందని ఆశపడ్డారు. ఇంత దారుణంగా మోసం చేస్తారని అనుకోలేదు. మా ఇంటిలో నాతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండేళ్లకు ముగ్గురికి ఇప్పటి వరకు లక్షా ఎనిమిది వేలు రావాల్సి ఉంది. అంతా మాయగా అనిపిస్తోంది. – రాజేశ్వరి, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి -
ప్రజలను మోసం చేసే బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వరుసగా మూడోసారి అన్నివర్గాలను మోసం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అమలు చేసిన బడ్జెట్కు, చంద్రబాబు బడ్జెట్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సూపర్సిక్స్ పథకాలు అమ లు చేసేందుకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్లో లేవు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావస్తున్నా నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి, నూతన పింఛన్ల మంజూరు, సున్నా వడ్డీ పథకాలు ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. బడ్జెట్తో మరోసారి మోసం చేశారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అలాగే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం వంటి పథకాలపై బడ్జెట్లో కోతలు విధించి సామాన్యుల ఆశ లపై నీళ్లు చల్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. పీఆర్సీ, ఐఆర్ ఊసే లేదన్నారు. సీపీఎస్ రద్దుపైన బడ్జెట్లో ప్రస్తావన లేదు. – నూకతోటి రాజేష్, వైఎస్ఆర్ సీపీ సత్యవేడు సమన్వయకర్త నిరుద్యోగులను నట్టేట ముంచారు చంద్రబాబు సర్కారు ఎన్నికల హామీలలో ప్రధానంగా యువతను ఆకట్టుకునేందుకు కుటుంబంలోని నిరుద్యోగులందరికీ ఒక్కక్కొరికి నెలకు రూ.3 వేలు అందిస్తామన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. యువగళం పాదయాత్రలోనూ నారా లోకేష్ యువత ఓట్ల కోసం ప్రగల్భాలు పలికారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారని విశ్వసించాం. కానీ నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని సుమారు ఏడు లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచేశారు. – శివశంకర్ నాయక్, జీఎన్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి -
చరమగీతం
హామీలకుజిల్లా సమాచారం అమలు చేయని ఎదురు చూస్తున్న పథకాలు లబ్ధిదారులు(లక్షల్లో) ఆడబిడ్డనిధి 5.02 50ఏళ్లకే పింఛన్ 2.32 నిరుద్యోగ భృతి 7.16 సున్నా వడ్డీ 6,03తిరుపతి సిటీ: ఎన్నికల సమయం ఆసన్నమైతే చాలు చంద్రబాబు టార్గెట్ మహిళలు, సామాన్య పేదలు. వారిని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టుకుని అధికారం చేపట్టేందుకు అమలుకు సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టడం ఆయన నైజం. ఇదే నేడు రిపీట్ అవుతోంది. 2024 ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ పథకాలంటూ ఊరువాడా తిరిగి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకుని అధికారం చేపట్టారు. సూపర్సిక్స్ హామీల ఇప్పటివరకు అమలు చేసిన వాటిలోనూ కనీసం జిల్లాలో అర్హులైన 30 శాతం మంది కూడా లబ్ధి పొందలేదు. ప్రధానంగా మహాశక్తి ఆడబిడ్డనిధి పథకం కింద మహిళలకు నెలకు రూ.1500, జిల్లాలో ని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, మహిళా సంఘాలకు సున్నా వడ్డీ, 50 ఏళ్లకే పింఛన్లు వంటి హామీలకు చరమగీతం పాడేశారు. వీటిపై కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మంగళం పాడేశామని సంకేతాలు ఇచ్చేశారు. బాబు బడ్జెట్ తీరుపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. -
శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను గాలికొదిలేసిన బాబు సర్కారు
శ్రీకాళహస్తి/శ్రీశైలం టెంపుల్/నరసరావుపేట/టెక్కలి రూరల్/మహానంది: ముక్కంటి దర్శనం కోసం శైవక్షేత్రాలకు వెళ్లిన భక్తులకు బాబు సర్కారు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపించింది. భక్తుల భద్రతను గాలికొదిలేసి.. టీడీపీ నేతలు, వీఐపీల సేవలో ప్రభుత్వ యంత్రాంగం తరించడంతో రాష్ట్రంలో అనేకచోట్ల మహాశివరాత్రి రోజున అపశృతులు చోటుచేసుకున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వెళ్లిన భక్తురాలు మృతి చెందింది. కోటప్పకొండలో పదేళ్ల బాలికకు ఊపిరాడకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. శ్రీశైలం పాతాళ గంగ రోడ్డులో భక్తులు ఇరుక్కుపోవడంతో తోపులాట జరిగింది. ఇదే క్షేత్రంలో మల్లన్న లడ్డూ ప్రసాదం నేలపాలవడం భక్తులను కలచివేసింది. శ్రీకాకుళం జిల్లా రావివలసలో తోపులాట జరగ్గా.. పలువురికి గాయాలయ్యాయి. అనేకచోట్ల సామాన్య భక్తులు క్యూలైన్లలో అల్లాడిపోయారు. అస్వస్థతకు గురై.. భక్తురాలి దుర్మరణం శ్రీకాళహస్తీశ్వరాలయంలో మొదటి గేటు వద్ద సర్వదర్శనం క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షించడంతో తోపులాట జరిగి భక్తులు కిందపడిపోయారు. అదే క్యూలైన్లో తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఓగిలి గొల్లపల్లి చెందిన మణెమ్మ (45) తన కుమార్తెతో కలసి ముక్కంటి దర్శనానికి మొదటి గేటులోకి వెళ్లింది. కుమార్తె తప్పిపోవడంతో ఊపిరాడక క్యూలైన్లో నుంచి బయటకు వచ్చేసింది.ఆ తరువాత ఆందోళనకు గురైన ఆమెకు అకస్మాత్తుగా మూర్ఛ రావటంతో నోటినుంచి నురగలు కక్కుతూ అక్కడే కిందపడిపోయింది. అపస్మాకర స్థితికి చేరుకున్న ఆమెకు వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసినా.. కళ్లు తెరవకపోవటంతో 108వాహనంలో హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మణెమ్మ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నేతల అడ్డగోలుతనమే ఘటనకు కారణం శ్రీకాళహస్తి క్షేత్రంలో టీడీపీ కూటమి నేతలు తమ అనుయాయులను అడ్డగోలుగా వీవీఐపీ మార్గంలో తీసుకెళ్లి అడ్డొచి్చన పోలీసులపైనే తిరగబడ్డారు. ప్రోటోకాల్ విధుల్లో నిమగ్నమైన పోలీసు అధికారులపై టీడీపీ నాయకుడొకరు వీరంగం సృష్టించారు. ‘మేం కష్టపడి పనిచేసి గెలిపించిన ప్రభుత్వమిది. మమ్మల్నే ఆపేస్తారా?’ అంటూ ఆ నాయకుడు పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. స్థానిక పోలీసు అధికారి జోక్యం చేసుకుని ఆ నాయకుడికి ప్రోటోకాల్ మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.ఇదిలావుండగా నాలుగో గేటు ద్వారా లోపలికి వచ్చే వీఐపీ లైన్లో ఉన్న పలువురు ప్రోటోకాల్ లైన్లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పలువురు నాయకులు ప్రోటోకాల్ లైన్లోకి రావడానికి పదేపదే ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న వేళ రాజకీయ నేతల ఒత్తిళ్లు పెరగడంతో పరిస్థితిని అదుపులోకి తేవడం పోలీసులకు కష్టమైంది. ‘డౌన్.. డౌన్’ అంటూ నినదించిన భక్తులు శ్రీకాళహస్తి క్షేత్రంలో వీవీఐపీ, ప్రొటోకాల్ దర్శనాల లైన్లో టీడీపీ నాయకులు తమ అనుయాయులను ఎలాంటి పాస్లు లేకుండా నేరుగా తీసుకెళ్లి దర్శనం చేయించారు. సామాన్య భక్తులకు కేటాయించిన సర్వదర్శనం క్యూలైన్లు గంటల తరబడి ముందుకు కదలకుండా ఎక్కడి భక్తులు అక్కడే నిలబడిపోవాల్సి వచి్చంది. ఓ దశలో సహనం కోల్పోయిన భక్తులు ‘ఆలయ చైర్మన్ డౌన్.. డౌన్’, ‘ఈవో డౌన్.. డౌన్..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. క్యూలైన్లో ఊపిరాడక బాలికకు అస్వస్థత కోటప్పకొండ మెట్ల మార్గంలో భక్తుల రద్దీ పెరగడంతో ఊపిరాడక కృష్ణా జిల్లా గూడవల్లికి చెందిన పదేళ్ల పాప నందిని అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ బాలిక మెట్ల మార్గానికి మధ్యలో ఉండిపోవడంతో కొండపైకి గాని, కొండ దిగువకు గాని తీసుకురాలేని పరిస్థితి ఎదురైంది. బాలికను చికిత్స నిమిత్తం 108 వాహనం వద్దకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాతాళగంగ రోడ్డులో ఇరుక్కుపోయిన భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పాతాళగంగ రోడ్డులో గంటల తరబడి ఇరుక్కుపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ప్రమాదకరమైనప్పటికీ రోప్వే దారిలోనే భక్తులు నడుచుకుంటూ వెళ్లాల్సివచి్చంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులకు సరిపడినన్ని దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. ఆలయంలో సిద్ధం చేసిన మల్లన్న లడ్డూ ప్రసాదాలను కౌంటర్లకు తరలించే క్రమంలో ట్రేలు కిందపడి లడ్డూ ప్రసాదం నేలపాలైంది. ఈ ఘటనను భక్తులు మహా అపచారంగా భావిస్తున్నారు. మరోవైపు పాగాలంకరణ దర్శనం సామాన్య భక్తులకు అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం వీఐపీలకే ప్రాధాన్యత ఇవ్వగా.. భక్తులను ప్రతిచోటా పోలీసులు అడ్డుకున్నారు. భక్తులు ఒక దశలో ‘ఈఓ డౌన్ డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎండల మల్లికార్జునస్వామి క్షేత్రంలో.. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలో మెట్లపై ఆదివారం తోపులాట జరిగింది. నిర్మాణంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయం వద్ద స్థానికులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో తోపులాట జరిగి బారికేడ్లకు ఉన్న రేకులు భక్తుల కాళ్లకు తగిలి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నందిగాం మండలం మర్లపాడుకు చెందిన డి.శ్రీనివాసరావు, సంతబొమ్మాళి మండలం రెయ్యిపేట గ్రామానికి చెందిన ఆర్.అనసూయమ్మ, ఆమె భర్త సింహాచలం తదితరులు ఉన్నారు. వీరిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహానందిలో దర్శనం కరువు నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దర్శనంకోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచి్చంది. మరోవైపు ఇదే క్షేత్రంలోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల దర్శనాలను ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఏకపక్షంగా నిలిపివేశారు. ఇదేమని అడిగిన భక్తులపై ‘నాకు నచి్చందే చేస్తా. అంతా నా ఇష్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రభ ఎదుట ప్రమాదకర విన్యాసాలు⇒ శృతి మించిన పచ్చమూకల ఆగడాలు ⇒ ఆందోళన చెందిన భక్తులునరసరావుపేట టౌన్: కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రభ వద్ద ఏర్పాటు చేసిన ప్రమాదకర విన్యాసాలు భక్తుల్లో ఆందోళన కలిగించాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకాని గ్రామంలో ప్రభను ఏర్పాటు చేశారు. ఆదివారం కోటప్పకొండకు తరలించుకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రభ వద్ద నిర్వహించిన విన్యాసాలు శృతి మించాయి. ప్రభను కనకతప్పెట్లు, డీజే ఏర్పాట్ల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లారు.మార్గమధ్యంలో అక్కడక్కడా జేసీబీ యంత్రాన్ని నడిరోడ్డుపై వేగంగా తిప్పుతూ విన్యాసాలు చేశారు. డీజే పాటల శబ్దానికి దీటుగా జేసీబీని రోడ్డుకు మధ్యలో తిప్పుతూ రోడ్డును ధ్వంసం చేశారు. దీంతో అటుగా వెళ్లే భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల రోడ్డు పాక్షికంగా దెబ్బతింది. జేసీబీ పొరపాటున అదుపుతప్పి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరునాళ్ల వేళ ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు కట్టడి చేయాలని భక్తులు కోరుతున్నారు. -
చెవిరెడ్డిపై ఉప్పొంగిన అభిమానం
తిరుపతి రూరల్: తమ అభిమాన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూసేందుకు భాకరాపేట, ఎర్రావారిపాళెం, నెరబైలు ప్రాంతాల్లో శనివారం వందలాది మంది జనం తరలి వచ్చారు. మహిళలు అభిమానంతో హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. గజమాలలు, మంగళవాయిద్యాలు.. పెద్ద ఎత్తున బాణా సంచా పేలుళ్ల మధ్య జనం నీరాజనాలు పలికారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి తలకోన శ్రీసిద్ధేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తలకోన సిద్ధేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి దంపతులకు భాకరాపేట, ఎర్రావారిపాళెం, నెరబైలు ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. చెవిరెడ్డిని చూడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో జేజేలు పలికారు. భారీ ఎత్తున బాణా సంచా పేల్చుతూ చెవిరెడ్డిపై పూలవర్షం కురిపించారు. నెరబైలు గ్రామంలో సుమారు ఒక కిలోమీటరు మేరకు ఒక గంట పాటు నడుచుకుంటూ వచ్చిన చెవిరెడ్డికి మహిళలు హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ జన సందోహం నుంచి కొంత దూరం నడిచిన చెవిరెడ్డి ఆ తరువాత కారులో తలకోన చేరుకున్నారు. ఆలయం వద్ద అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి కుటుంబసభ్యులకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెండు నెలల తర్వాత స్వగ్రామానికి శంకరమ్మ మృతదేహం
పుల్లంపేట: మలేషియాలో మరణించిన కోనయ్యగారిపల్లెకు చెందిన బొమ్మవరం శంకరమ్మ మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. శంకరమ్మ బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల కిందట మలేషియా వెళ్లింది. ఈ క్రమంలో కరోనరీ ఆర్టరీ వ్యాధితో కలిగే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్తో ఆమె గతేడాది డిసెంబర్ నెల 21వ తేదీన మరణించినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఇండియన్ ఎంబసీ ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్కు సమాచారం అందించారు. దీంతో ఎన్నారై అసోసియేషన్కు చెందిన ఉపాధ్యక్షుడు కృష్ణకు, ముత్తినేని శంకరమ్మ వివరాలను ఆమె కుటుంబసభ్యులు సమర్పించడంతో మృతదేహాన్ని ఫిబ్రవరి 13వ తేదీన మలేషియా ఎయిర్లైన్స్ ఎం 180 ద్వారా చైన్నెకి చేరేలా ఏర్పాట్లు చేశారు. అంతేగాక ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈఓ డాక్టర్ కృష్ణమోహన్ చైన్నె విమానాశ్రయం నుంచి కోనయ్యగారిపల్లెకు ఉచిత అంబులెన్స్ సదుపాయం కల్పించారు. శంకరమ్మ పార్థివదేహాన్ని స్వదేశానికి పంపడానికి ఇండియన్ ఎంబసీ పూర్తిగా ఖర్చు భరించిందని మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్రెడ్డి తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి సహకరించిన ఇండియన్ హై కమిషనర్ బీఎన్రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు కృష్ణమోహన్, మోహన్రెడ్డికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. -
బంగారం స్వాధీనం
రైల్వేకోడూరు: చోరీ కేసులో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీకి చెందిన దాసరి దేవిక అనే మహిళ మెడలోని బంగారు సరుడును తిరుపతి జిల్లా సంజయ్ గాంధీనగర్కు చెందిన గుంజు ప్రకాష్ (30) అనే వ్యక్తి 2024, జూలై 11వ తేదీన అపహరించి పారిపోయాడు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో రైల్వేకోడూరు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సహకారంతో ఎట్టకేలకు శనివారం 29 గ్రాముల బంగారు సరుడు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. యువతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరం: ఏఐపీఎస్ఎన్ తిరుపతి కల్చరల్: యువతకు శాసీ్త్రయ ఆలోచన, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరమని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్(ఏఐపీఎస్ఎన్) ప్రధాన కార్యదర్శి ఆశామిశ్రా తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన రెండు రోజుల ఏఐపీఎస్ఎన్ దక్షిణాది రాష్ట్రాల యూత్ వర్క్షాప్ తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆశామిశ్రా ప్రసంగించారు. ఈ రెండు రోజుల వర్క్షాప్లో జరిగే క్రైసిస్ ఆన్ యూత్ ప్లీనరీలో యూత్ ట్రెండ్స్ అండ్ యాక్టివిజం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఆన్ ఎంప్లాయిమెంట్ యంగ్ వర్కర్స్ సమస్యలు, ఎటాక్ ఆన్ సైన్స్ అండ్ రేషనల్ థింకింగ్పై సెక్షన్ల వారీకి సమావేశాలు ఉంటాయని ఏఐపీఎస్ఎన్ సదరన్ రీజియన్ కన్వీనర్ వి.గోపినాథ్ పేర్కొన్నారు. -
ఇద్దరిపై పీడీ యాక్ట్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎర్రచందనం అ క్రమ రవాణా కేసుల్లో నిందితులైన కర్ణాటక వాసి సయ్యద్ ఫైరోజ్ అ లియాస్ ఫెరోజ్ ఎలియాస్ సయ్యద్ ఎలియాస్ ఫైరు (38), చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ అలియాస్ రాజాబాబు ఎలియాస్ బూసి (33)పై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ ఎర్రచందనం అక్రమ రవా ణా నిరోధించడమే కాకుండా, ఎక్కువ కేసుల్లో అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని, ముఠాగా ఏ ర్పడి స్మగ్లింగ్కు పాల్పడుతున్న వారిపై పీడీ యా క్ట్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరిపై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు సిఫారసు చేశారు. ఆ మేరకు తిరుపతి కలెక్టర్, వెంకటేశ్వర్ వీరిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి అటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. పీడీ యాక్ట్ అమలులో భాగంగా వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. దాడి కేసులో ఆరుగురిపై కేసు నారాయణవనం: దారికి అడ్డుగా ఆపిన బైక్ను తీ యమన్నందుకు దాడి చేసిన కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. కడపకు చెందిన అంకిరెడ్డి మండలంలోని పాలమంగళం దక్షిణపు కండ్రిగలో తన అత్తగారి ఇంటికి వచ్చాడు. శనివా రం ఉదయం తన కుమారునితో కలిసి కారులో ఇంటి నుంచి హైవే రోడ్డుపైకి వచ్చాడు. నైనారుకండ్రిగ దళితవాడకు చెందిన మహేష్ దారికి అ డ్డుగా బైక్ పెట్టుకుని, వాహనంపై కుర్చొని ఫోన్ లో మాట్లాడుతున్నాడు. దారి కోసం అంకిరెడ్డి హా రన్ కొట్టాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఒకరినొకరు చేయి చేసుకున్నారు. దీంతో మహేష్ ఫోన్ చేసి తన అనుచరు లను పిలిపించి అంకిరెడ్డిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహేష్తో అతని అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. -
ఆవును ఢీకొని బోల్తా పడిన లారీ
నాగలాపురం: ఆవును లారీ ఢీకొన్న ఘటన మండలంలోని చిన్నాపట్టులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుత్తూరు నుంచి ఓ లారీ ఊత్తుకోటై వైపుగా తమిళనాడుకు బయలుదేరింది. మార్గ మధ్యంలో నాగలాపురం మండలంలోని చిన్నాపట్టు గ్రామం మలుపు వద్ద రోడ్డుపై వెళుతున్న ఆవును ఢీకొనడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. చూడి ఆవు కావడంతో లారీ ఢీకొన్న వెంటనే కడుపులో ఉన్న దూడ వెలుపలకి వచ్చి, పడి అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ మధ్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం గాయపడిన లారీ డ్రైవర్ను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి, అతడిపై డ్రంక్అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల తెలిపారు. -
అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి అన్నమయ్య సర్కిల్: అప్రమత్తంగా విధులు నిర్వర్తించడంతోపాటు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే ఐజీ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్ సూచించారు. శనివారం ఆయన తిరుపతిలోని ఆర్పీఎఫ్ బ్యారక్ను సందర్శించారు. ఆర్పీఎఫ్ ఆమృత్ గీత్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందితో సురక్షా సమ్మేళనం నిర్వహించారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని, రైల్వే సంక్షేమ పథకాల గురించి తెలిపారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని సూచించారు. చైల్డ్లైన్–1098, వన్ స్టాప్ సఖి సెంటర్, బచ్పన్ బచావో ఆందోళన్ ప్రతినిధులతో సమావేశమై, రన్ అవే, మిస్సింగ్ పిల్లల రక్షణలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆర్పీఎఫ్ డ్రై కాంటీన్, డాగ్ స్క్వాడ్ను పరిశీలించి, వాయు, ప్రిన్స్ సేవలను ప్రశంసించి, వాటి సంరక్షణపై సూచనలు ఇచ్చారు. ఆర్పీఎఫ్ పోస్ట్ తిరుపతిలో రికార్డులు పరిశీలించి సమయానుకనుణంగా నవీకరించాలని, నేర నియంత్రణ కోసం జాతీయ డిజిటల్ పోర్టల్స్ వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ముందుగా ఐజీ అరోమాసింగ్ ఆర్పీఎఫ్ బ్యారక్ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం అదికార సిబ్బంది ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్–2026 ను అందుకున్న అరోమా సింగ్ను సత్కరించారు. -
అనుమానాస్పదస్థితిలో మృతి
నారాయణవనం: అనుమానస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం శనివారం ఉదయం జాతీయ రహదారి పక్కన లభించింది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని జాతీయ రహదారిపై గోవిందప్పనాయుడుకండ్రిగ వద్ద అరుణానది బ్రిడ్జి సమీపంలో శనివారం వేకువ జామున గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు సమాచారం అందించారు. మృతుని వయసు 60–65 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. పచ్చని, తెలుగు గీతల చొక్కా, నీలి, కాపీ కలర్ గీతల లుంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతుడు 6 అడుగుల ఎత్తు ఉన్నాడని, పోస్ట్మార్టమ్ నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించమన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మృతుని గురించిన వారు 9440900693 నంబర్కు సమాచారం తెలపాలని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
విద్యను దూరం చేశారు
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి, నాడు–నేడు పనులకు బడ్జెట్లో మొండి చెయ్యి చూపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు సీబీఎస్ఈ, టో ఫెల్, ఐబీ వంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యను తొలగిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం బాధాకరం. ఫీజురీయింబర్స్మెంట్కు నిధులు పూర్తి స్తాయిలో కేటాయించలేదు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారు. ప్రాజెక్టులకు అరకొర కేటాయించారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. –యండపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ, తిరుపతి -
రైతుకు రిక్తహస్తం
బడ్జెట్పై ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతాంగానికి నిరాశ మిగిలింది. గిట్టుబాటు ధరలేక ఎదురుచూస్తున్న రైతును బడ్జెట్ నిండా ముంచింది. కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మిగిలిపోయింది. జిల్లాలో వరి, వేరుశనగ, నిమ్మ, మామిడి రైతు పరిస్థితి దయనీయం. వారిని బడ్జెట్ ఆదుకుంటుందనే నమ్మకం పోయింది. పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణం. – దాసరి జనార్దన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, సత్యవేడు జాబ్ క్యాలెండర్ ఊసేలేదు బాబు సర్కార్ ప్రగల్భాలు పలికిన నిరుద్యోగ భృతి మాటే బడ్జెట్లో ప్రస్తావించలేదు. కనీసం జాబ్క్యాలెండర్పైనా ప్రకటన చేయలేదు. నెలకు ప్రతి నిరుద్యోగికి రూ.3వేలు కేటాయిస్తామని మోస పూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న యువగళం పాదయాత్ర హామీ ఏమైంది. బడ్జెట్లో కనీసం జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు, ఉన్న సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం దారుణం. –ప్రసాద్రెడ్డి, ఏమ్ఏ పీహెచ్డీ, నిరుద్యోగి, తిరుపతి రూరల్ ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది. ప్రధానంగా 12వ పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం బాధాకరం, అలాగే మంత్రి ఉద్యోగుల సంక్షేమంపై మాట్లాడిన సందర్భంలో డీఏ, ఐఆర్ అంశాలను ఎత్తకపోవడం సరికాదని భావిస్తున్నాం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలపై మాట్లాడుతారని ఆశగా ఉన్నాం. అయితే ఆ ఊసే ఎత్తలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. –కే. ముత్యాలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మహిళలకు శఠగోపం జిల్లాలో సుమారు 2 లక్షల మంది తల్లికి వందనం పథకానికి అర్హులు ఉన్నారు. అలానే ఉచిత బస్సుకు అర్హులు 13 లక్షల వరకు ఉన్నారు. కుటుంబంలోని ప్రతి మహిళకు మహాశక్తి పథకానికి సుమారు 9 లక్షల మంది అర్హులు ఉన్నా రు. వారి అందరికీ బాబు సర్కార్ శఠగోపం పెట్టేసింది. తల్లికి వందనానికి కోత విధిస్తూ నిధులు కేటాయించారు. మహిళా శక్తి, ఆడ్డబిడ్డనిధి పథకం మాటవరసకై నా బడ్జెట్లో ప్రస్థావించలేకపోవడంతో కూటమి కుట్ర బయటపడింది. – సంధ్యారాణి, ప్రైవేటు ఉద్యోగి, తిరుపతి ● -
సర్వేజన..
తిరుపతి సిటీ: షరామమూలే..భారీ అప్పుల అంచనాతో బాబు సర్కార్ బడ్జెట్ తృతీయ పర్వం కొనసాగింది. అభివృద్ధికి ఆమడ దూరంగా.. సంక్షేమానికి టోకరా పెడుతూ అంకెల గారిడీతో ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ను శనివారం ఆర్థికమంత్రి పయ్యావుల కే శవ్ అసెంబ్లీలో చదివి వినిపించారు. తిరుపతి జిల్లాకు తిరునామం పెడుతూ ఏ రంగంలోనూ బడ్జెట్ గణాంకాల్లో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చిన పాపాన పోలేదు. దీనిపై మేధావులు, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కోతలేనా.. కేశవా..! -
ఆ పాపం.. ఇంటి దొంగలదేనా?
డీఎంఏలోని డీఈఓ సహకారంతోనే... డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ లాగిన్ వ్యవహారాలను ఆపరేట్ చేస్తున్న ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారానే మ్యుటేషన్ను గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఒకరి ఇద్దరు వ్యక్తులు డీఎంఈలోని డీఈఓల ద్వారా కార్పొరేషన్ రెవెన్యూ విభాగానికి సంబంధం లేకుండానే అసెస్మెంట్లో మార్పు చేర్పులు చేయిస్తున్నట్లు సమాచారం. కూటమి పంచన చేరిన ఓ కార్పొరేటర్ భర్త సైతం ఓ నెట్ సెంటర్ ద్వారా మ్యుటేషన్ను చేయిస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులకు తెలిసినా తమకేమి సంబంధం లేదన్నట్టు సైలెంట్ అయిపోయారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంతిరుపతి తుడా: మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో మ్యుటేషన్ (అసెస్మెంట్లో యజమాని పేరు మార్పులు) వ్యవహా రం ఇంటి దొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాగిన్పై పూర్తి అవగాహన ఉన్న ఒకరిద్దరూ బయట ఇంటర్నెట్ సెంటర్ లేదా ఇంటి వద్ద కంప్యూటర్ని ఏర్పాటు చేసుకుని అసెస్మెంట్లో మార్పు చేర్పులు వ్యవహారాన్ని గుట్టుగా చేస్తున్నారన్న ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంటి దొంగల ప్రమేయం లేకుండా సీడీఎంఏ లాగిన్లో పేర్లు మార్చడం అసాధ్యమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్ తిరుపతి ఎస్పీకి ప్రాథమికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై లోతైన విచారణ జరిపి మ్యుటేషన్ దొంగలను పట్టుకోవాలని ఆమె కోరారు. ఈ క్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య శనివారం రాత్రి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. డీఎంఏకు ఫిర్యాదు డిప్యూటీ కమిషనర్ అమరయ్య శుక్రవారం అమరావతికి వెళ్లి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్కు లాగిన్ దొంగల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అధికారులకు ఏమాత్రం సంబంధం లేకుండా మ్యుటేషన్ జరుగుతోందని ఆయన ఆధారాలను కమిషనర్కు అందజేశారు. డీఎంఏలో ఒకరిద్దరికి తెలిసే ఈ అక్రమ వ్యవహారం సాగుతోందన్న సమాచారం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ విభాగానికి సంబంధించిన లాగిన్ను మరింత పటిష్టం చేయాలని ఆయన కమిషనర్ను కోరారు.ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ తన ఇంటి పన్నులో పేరు మారడాన్ని గుర్తించి ఇటీవల కమిషనర్ మౌర్యకు ఫిర్యాదు చేశారు. తన సొంత తమ్ముడే ఈ పని చేసినట్లు ఆమె ఆధారాలతో సహా స్పందనలో ఫిర్యాదు చేశారు. పన్నులు యజమాని పేరు మారడంపై కమిషనర్ లోతుగా ఆరా తీశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ఎక్కడ సంబంధిత ఫైల్ లేకుండానే పేరు మారిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇలా అసెస్మెంట్లో యజమాని పేరు ఎలా మారిందని, రెవెన్యూ సెక్షన్కు సంబంధం లేకుండా ఎలా సాధ్యమైంది అన్నదానిపై కూపీలాగారు. ఎంతకీ ఆ మ్యుటేషన్ దొంగ దొరక్క పోవడంతో కమిషనర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతోనే మ్యుటేషన్ గుట్టు రట్టు అయింది.లాగిన్పై అవగాహన ఉన్న వ్యక్తులే.. కార్పొరేషన్ రెవెన్యూ విభాగం లాగిన్పై అవగాహన ఉన్న వారే దొ డ్డిదారిలో మ్యుటేషన్ను పెంచిపోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి.యజమాని పేరు మార్చేస్తే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంతమంది సిబ్బందికి ఈ వ్యవహారం పెద్ద ఆదాయపు వనరుగా మారింది. అక్రమ సంపాదనకు అ లవాటు పడిన లాగిన్ దొంగలతోపాటు ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో కమిషనర్ లాగిన్ల ను దుర్వినియోగం చేసిన చరిత్ర కార్పొరేషన్ కంప్యూటర్ ఆపరేటర్లదే. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు ఇప్పుడు బయట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇంటా బయటా ఉన్న సాఫ్ట్వేర్, ప్రభుత్వ లాగిన్పై పట్టు ఉన్న వారే అసెస్మెంట్లో యజమాని పేర్లు మార్చేస్తున్నారన్న సమాచారం కమిషనర్ వద్ద ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు. -
హామీల ప్రస్తావనేది..!
కూటమి నేతలు ఇచ్చిన హా మీల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం దారుణం. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదు. బడ్జెట్ పూర్తిగా రాజకీయ తంత్రంగా ఉంది. మహిళలు, మైనారిటీలు, బడుగుబలహీన వర్గాల సంక్షేమం బడ్జెట్లో కేటాయింపులు లేవు. విద్యా, ఆర్యోగంపై తూతూమంత్రంగా అంకెల గారడిని చూపించారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులపై స్పష్టత లేదు. ప్రపంచబ్యాంక్ అప్పుల కోసం తయారు చేసిన బడ్జెట్గా పరిగణించవచ్చు. –వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
బడ్జెట్ అంతా అంకెల గారడీనే
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీనే. ప్రజలను మభ్యపెట్టేందుకు త యారు చేసిన బడ్జెట్. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల ఊసే లేదు. మరో సారి వాటికే కేటాయించారు. దారుణమైన బడ్జెట్గా చరిత్రలో నిలచిపోతుంది. నెలవిడిచి సాగుచేసేలా ఈ బడ్జెట్ ఉంది. గత సంవత్సరం గత వార్షిక బడ్జెట్ రూ.2.92 లక్షల కోట్ల రూపాయలకు ప్రవేశపెడితే ఈసారి రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పాఠశాల విద్య, వైద్య ఆరోగ్యశాఖకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని పేర్కొంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. – డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ, తిరుపతి గొప్పల కోసం తిప్పలు కూటమి ప్రభుత్వ బడ్జెట్ ఎవరీకి ఉపయోగలేదు. వేతన జీవులకు మొండి చేయి చూపించారు. బడాయి మాటలు, అప్పులు తెచ్చుకునేందుకు స్థూల ఉత్పత్తిని పెంచి చూపడం తప్ప బడ్జెట్లో ఏమీ లేదు. నిత్యావసరాల పెరుగుదల, పీఆర్సీ ప్రస్తావన, ఉద్యోగులకు 12వ పే రివిజన్ కమిషన్, కార్మికులు ప్రస్తావన, వేతనాల పెరుగుదల ఊసేలేదు. కాంట్రాక్ట్ కార్మికులకు భరోసా కల్పించలేదు. నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించారు. బడ్జెట్ ఏ వర్గానికి మేలు చేసేలా లేదు. – కందారపు మురళి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి -
ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు
శేషవాహనంపై సోమస్కందుడు, యాళి వాహనంపై జ్ఞానప్రసూనాంబశ్రీకాళహస్తి: నాగేంద్రాహారాయ..త్రిలోచనాయ.. అన్న ట్లు నాగేంద్రుని హారంగా చేసుకున్న సర్వేశ్వరుడు నా గరాత్రి పురస్కరించుకుని ఆదిశేషుని పడగల నీడన కొ లువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజున నాగరాత్రిగా పిలుస్తారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి సోమస్కందమూర్తి శేషవాహనంపై, జ్ఞానప్రసూనాంబ యాళివాహనంపై పురవీధుల్లో ఊరేగారు. వాహన సేవల్లో కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం స్వామి అమ్మవార్లు హంస, శుక వాహనాలపై ఊరేగారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి, పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు మహాశివరాత్రి (మాఘ బహుళ త్రయోదశి) వాహన సేవలు ఉదయం 10.30గంటలకు:ఇంద్ర విమానం–చప్పర సేవ ఉభయదాతలు:సి.సత్యనారాయణ, అడ్వకెట్, శ్రీకాళహస్తి రాత్రి 9.30గంటలకు నంది – సింహ వాహనసేవ ఉభయధాతలు:దక్షిణ భారతదేవాంగ సంఘం వారిచే పట్టు వస్త్రాలు సమర్పనణ వెంకటగిరి రాజావారు. వెంకటగిరి, తిరుపతి జిల్లా కీ.శే.యద్దనపూడి వెంకటసుబ్రహ్మణ్యశర్మ – శ్రీమతి స్వరాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం కె.దయానందగుప్త, బజారువీధి, శ్రీకాళహస్తి టి.ఎస్.రామగుప్త, అరుణా మెడికల్స్, శ్రీకాళహస్తి ఆశల పద్దు నిరాశపరిచింది.. కలల బడ్జెట్ కన్నీళ్లు మిగిల్చింది.. అన్నిరంగాల వారికి మొండి చేయి మిగిలింది.. నిరుద్యోగులకు నిరాశ మిగిల్చింది..సంక్షేమానికి తూట్లు పొడిచింది.. రైతులకు రిక్తహస్తం చూపింది.. పేదల పిల్లలకు విద్యను దూరం చేసింది..రోగ నివారణకు వైద్యం పారనంది.. మొత్తంగా అభివృద్ధికి ఆమడదూరంగా బాబు గొప్పలకు తిప్పలు పడుతూ అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. సర్వజనులు సంక్షేమానికి దూరం అయ్యారని మండిపడుతున్నారు. -
బాబు అసత్య ఆరోపణలకు హద్దుండదు
పెళ్లకూరు: చంద్రబాబు చేసే అసత్య ఆరోపణలకు హద్దుండదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూరులో జరిగిన ప్రత్యేక సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లో సూపర్సిక్స్ పథకాలను ఒక్కటి కూడా అమలు చేయలేని నిస్సాహాయ స్థితిలో రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై లేనిపోని రాద్దాంతం చేశాడని విమర్శించారు. అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టుకతో కలిసొచ్చిన వరం అన్నారు. ఆయనకు తోడు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సనాతనధర్మం అంటూ వింత వింతగా ప్రవర్తించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సిట్ ఇచ్చిన నివేదికను కూడా లెక్కచేయకుండా చట్టానికి వ్యతిరేకంగా ప్లెక్సీలు కట్టడం, దానిపై స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా పార్టీ కార్యాలయాన్ని, ఆయన నివాసంపై దాడులు చేయించడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
రాపూరు: మండలంలోని బొజ్జనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం ఎస్ఐ వెంకట్రాజేష్ తెలిపారు. ఇతని వయస్సు 45 –50 సంవత్సరాలు ఉంటుందని, మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదని, మృతుని వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. తండ్రి మరణాన్ని జీర్ణించు కోలేక కుమారుడి మృతి వెంకటగిరి రూరల్: తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుమారుడు తనువు చాలించాడు. తండ్రి మృతి చెందిన 20 రోజుల వ్యవధిలో కుమరుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. పట్టణంలోని రాణిపేటకు చెందిన మోపాటి విజయ భాస్కర్రెడ్డి కుమారులతో కలసి సీఎస్సీ సెంటర్ నిర్వహించుకుంటున్నారు. జనవరి 24వ తేదీన భాస్కర్రెడ్డి ఆకస్మికంగా మరణించారు. తండ్రి మరణంతో శోకంతో ఉన్న ఆయన పెద్ద కుమారుడు మోపాటి బాబు మదన్మోహన్రెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. బాబు మదన్మోహన్రెడ్డి శుక్రవారం మృతి చెందారు. 20 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో ఆ ఇంట్లో తీరని విషాదం నిండింది. హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాలి శ్రీనివాసులు కథనం మేరకు.. 2021 డిసెంబర్ 6 తేదీ చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగకు చెందిన వై.దొరస్వామి పశువుల పాక వద్ద ఉండగా వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగ హరిజనవాడకు చెందిన ఎం సూర్య అలియాస్ సూర్య గోపాల్, ఎం.చిన్నబ్బ ఇతర కుటుంబ సభ్యులు వచ్చి వీధిలైట్లు విషయంపై గొడవ పడి అతనిపై మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో దొరస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతను వెదురుకుప్పం పోలీసులకు ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. దాడిలో వృద్ధుడికి గాయాలు చంద్రగిరి: రోడ్డులో రాకపోకలకు ఇబ్బందిగా పాత సామాన్లు పెట్టడంపై ప్రశ్నించిన వృద్ధుడిపై దుకాణాదారులు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తొండవాడ కూడలి సమీపంలో కొంత కాలంగా భార్యభర్తలు పాత సామాన్ల దుకాణం(స్క్రాప్) నిర్వహిస్తున్నారు. దుకాణానికి వచ్చే పాత సామాన్లను రోడ్డుకు అనుకుని ఉంచడంతో వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో తొండవాడకు చెందిన నాధముని నాయుడు శుక్రవారం సాయంత్రం వారిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర కోపోద్రుక్తులైన దుకాణాదారుడి భార్య నాధముని నాయుడుపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నాధముని నాయుడు కాలు జారీ రాయిపై పడడంతో తలకు గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని తిరుపతి రుయాకు తరలించారు. అయితే నాధముని నాయుడిపై తాము దాడి చేయలేదని, తమతో గొడవపడుతూ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడని దుకాణాదారులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ముగిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు తిరుపతి లీగల్: స్థానిక కోర్టు ఆవరణలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం1,288 మంది న్యాయవా దులు ఓటుహక్కు కలిగి ఉండగా1,079 మంది న్యాయవాదులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తిరుపతి న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి విద్యానాథరెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. స్థానిక కోర్టు ఆవరణలోని గ్రంథాలయముతోపాటు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో 17 బూత్లను ఏర్పాటు చేశారు. తిరుపతి న్యాయవాదులు నలుగురు ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో కోర్టు ఆవరణలో కోలాహాలంగా ప్రచారం జరిగింది. తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గజేంద్ర, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు. -
అసెంబ్లీలో ఆడబిడ్డ నిధి స్వరం వినిపించాలి
సార్వత్రిక ఎన్నికల్లో అధికార వాంఛతో కూటమి నేతలు మహిళలను మభ్యపెట్టి పథకాలను ప్రకటించి, అమలు చేసి తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా పథకాల ప్రస్తావనే రావడంలేదు. ఆడబిడ్డ నిధిని నిర్వీర్యం చేశారు. లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా ఆడబిడ్డకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించేలా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్వరం వినిపించాలి. –హెప్సీ, ప్రైవేటు ఉద్యోగిని, వరదయ్యపాళెం మండలం, సత్యవేడు● -
స్విమ్స్లో మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలు
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పేషంట్ల సౌకర్యార్థం పలు రకాలైన మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ క్లినిక్కు నేరుగా నమోదు చేసుకోవడానికి పేషంట్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్విమ్స్ క్లినిక్లో సంప్రదించాలని సూచించారు. మరి న్ని వివరాలకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు 83339 97968 నంబర్లో సంప్రదించాలని కోరారు. పన్ను ఎగవేత నియంత్రణకు చర్యలు తిరుపతి అర్బన్: పన్ను ఎగవేత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, పన్ను ఎగవేత కేసుల్లో పోలీసులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులు, జాయింట్ కమిషనర్ కమర్షియల్ టాక్స్ రవీంద్రనాథ్ రెడ్డితో కలసి జీఎస్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ నుంచి ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా రిజిస్ట్రార్ శ్రీరాంకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పన్ను ఎగవేత నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే పన్ను ఎగవేతకు చెందిన ఆస్తులను గుర్తించినప్పుడు వాటిని 22ఏ కింద పెట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వరలక్ష్మి, రేణుక, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపండి తిరుపతి అర్బన్: ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహురెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్ వద్ద ఎస్టీయూకి చెందిన ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థికపరమైన అంశాలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ప్రధానంగా డీఏ బకాయిలు, మెడికల్ రియింబర్స్మెంట్, సంపాదిత సెలవుల బకాయిలు, పెండింగ్లోని ఏపీజీఎల్, పీఎఫ్ లోన్స్, 12వ పీఆర్సీ, ఐఆర్ 30శాతం తదితర సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సుధాకర్యాదవ్, ప్రధాన కార్యదర్శి మునికృష్ణమనాయుడు తాజా బడ్జెట్లో తమ సమస్యలకు అవసరం అయిన నిధుల కేటాయించాలని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ చైర్మన్ నారాయణ వారికి మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు ఆదినారాయణరెడ్డి, అశోక్, గురుప్రసాద్, రవిశంకర్, రామకృష్ణ, దేవేంద్ర, వాసు, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీతో పన్ను వ్యవస్థ సరళీకృతం
తిరుపతి రూరల్: జీఎస్టీతో పన్ను వ్యవస్థ సరళీకృతమైందని తిరుపతి సీజీఎస్టీ కస్టమ్స్ కమిషనర్ డాక్టర్ సతీష్ ధవలే పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన విభాగం, న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ వుమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ సహకారంతో ఐసీఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ‘‘జీఎస్టీ రేఫామ్స్ ఆన్ ది కన్ఫర్మేషన్ పాటర్న్ అఫ్ ది మిడిల్ అండ్ నియో మిడిల్ క్లాసెస్ విత్ ది జెండర్ ప్రాస్పెక్టీవ్ ’’ అనే అంశంపై శుక్రవారం సావేరి సెమినార్ హాల్లో రీజినల్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ పన్ను విధానాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని, జీఎస్టీ 2.0లోని మార్పులతో కొనుగోలు శక్తి మరింతగా పెరుగుతుందన్నారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష మాట్లాడుతూ విధానపరమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, ఆర్థిక పురోభివృద్ధికి అమలు చేసే విధానాలను తెలియపరచడం విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. అసిస్టెంట్ కమిషనర్ జి. రమామణి, ఐసీఎంఏఐ చైర్మన్ ఎ.పార్థసారథి, ఆర్థిక నిపుణులు డాక్టర్ డి.కృష్ణమూర్తి, ఎంసీ వెంకటనాథ్, జి. ఇందిరా ప్రియదర్శిని, భాగ్యతేజ పాల్గొన్నారు. -
నర్సింగ్హోమ్పై చర్యలు తీసుకోండి
తిరుపతి అర్బన్: నగరంలోని బాలాజీ నర్సింగ్హోమ్పై చర్యలు తీసుకోవాలని సీపీఎం, సీపీఐ, ఆర్పీఐ, ప్రజా సంఘాలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. ఇటీవల నర్సింగ్ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటమపై సమగ్రవిచారణ చేపట్టాలని కోరారు. ఓ వైపు ఫీజుల దోపిడీ, మరోవైపు విద్యార్థు లపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఆరోపించారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోలేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న ప్రవీణ్కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతలు చిన్నం పెంచలయ్య, నదియా, మంజూల,నమతా తదితరులు పేర్కొన్నారు. -
ఏం చేద్దాం..!
●ఇంటర్ పరీక్షలు ముంచుకొస్తున్నాయ్..ఉత్తీర్ణత సాధిస్తే తొలి అడుగు ముందుకు పడుతుంది.. అయితే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఫీజు బకాయి ఉన్న విద్యార్థులకు హాల్టికెట్ ఇవ్వబోమని బెదిరిస్తున్నాయి.. ఈ పరీక్షలు దాటితే.. విద్యార్థి జీవితం కీలక మలుపు తిరుగుతుంది.. అయితే ఫీజు బకాయి అడ్డంకిగా మారుతుందేమోనని విద్యార్థుల్లో ఆందోళన.. అలజడి మొదలైంది. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచనలో పడ్డారు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు. తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు స మయం ఆసన్నమైంది. ఈనెల 23వ తేదీ నుంచి పరీక్ష లు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేటు, కార్పొ రేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు బకా యి ఉన్న వారికి హాల్టికెట్లు ఇవ్వరేమో? అంటూ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. దీనికితోడు కొన్ని కార్పొరేట్ కళాశాలల్లో ఫీజు బకాయిలున్న విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యా లు పెండింగ్ ఫీజులు వెంటనే చెల్లించాలని. లేనిపక్షంలో హాల్టికెట్ రాదనే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసైనా ఫీజు చె ల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా జిల్లాలో ఏ ర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు సరిపడా ఇన్విజిలేటర్ల కొరతను అధికమించేందుకు కసరత్తు చేస్తున్నారు. వేధిస్తున్న ఇన్విజిలేటర్ల కొరత జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల కోసం 84 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి సుమారు 12 నుంచి 14 మంది ఇన్విజిలేటర్లు అవసరం ఉంది. వీరితో పాటు పరీక్ష కేంద్రాలపై పూర్తిస్థాయి నిఘా ఉంచేందుకు ఆర్ఐఓతోపాటు హైపవర్ కమిటీ, ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్లు నిరంతర పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో అందుకు సరిపడా ఇన్విజిలేటర్లు లేకపోవడంతో అధికారులు మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్కు సమస్యను విన్నవించడంతో హైస్కూల్ ప్లస్ టీచర్లును ఇన్విజిలేటర్లుగా నియమించుకోవాలన్నా రు. దీంతో ఇంటర్ పరీక్షలకు ఇక హైస్కూల్ టీచర్లు ఇన్విజిలేటర్లుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన టీచర్లుకు సమాచారం అందించారు. జిల్లా సమాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 72 ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 109 జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు 84 జూనియర్ ఇంటర్ పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు 30,319 సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న వారు 30,272 పరీక్ష కేంద్రాలకు అవసరమైన ఇన్విజిలేటర్లు 1,176 ఇన్విజిలేటర్ల కొరత సుమారు 350 మంది వరకు హాల్టికెట్లు అందరికీ అందేనా? 23 నుంచి పరీక్షలు జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈనెల 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 60 వేల మందికి పైగా ఇంటర్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు 13 తేదీ నుంచి హాల్టికెట్లను ఇంటర్మీడియట్ విద్యామండలి వెబ్సైట్లో విడుదల చే శారు. దీంతో విద్యార్థులు హాల్టికెట్లను నేరుగా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, కళాశాల యా జమాన్యాలతో ఎటువంటి అవసరం ఉండ దని అధికారులు చెబుతున్నారు. ఫీజు బకాయిలున్న విద్యార్థుల విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఫీజు కోసం విద్యార్థులను పీడిస్తూ హాల్టికెట్లను నిలపుదల చేస్తే కళాశాల గుర్తింపును రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. హాల్టికెట్లపై ఆందోళన అనవసరం ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్టికెట్ల విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కళాశాలలతో సంబంధం లేకుండా నేరుగా వెబ్సైట్ నుంచి విద్యార్థి తన వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీజులకు హాల్టికెట్కు లింక్పెట్టి వేధించే కళాశాలలపై కఠిన చర్యలు తప్పవు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పకడ్బందీగా నిర్విహిస్తున్నాం. ఇన్విజిలేటర్ల కొరతను అధికమించేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు హైస్కూల్ ప్లస్ టీచర్లు నియమించేందుకు కసరత్తు చేస్తున్నాం. – జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి జిల్లా -
మహిళా ఎమ్మెల్యేలు గళమెత్తాలి
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేలా గళమెత్తాలి. అధికార దాహంతో అలివికాని హామీలను గుప్పించి మహిళలను మభ్యపెట్టి అధికారం చేపట్టారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి తీరుతా..ఆడబిడ్డలకు అండగా ఉంటా అని చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు చేతులెత్తేసి మా వల్లకాదనడం మోసం. ఈ అసెంబ్లీలో ఆడబిడ్డ నిధిపై ప్రకటన చేసి తీరాల్సిందే. –డాక్టర్ సాయిలక్ష్మి, ఐద్వా, జిల్లా కార్యదర్శి, తిరుపతి ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించాలి బాబు సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించాల్సిందే. అధికారం కోసం మహిళలను మభ్యపెట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని షరతులు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. జిల్లాలో లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణం పథకాన్ని అమలు చేయాలి. లేదంటే మహిళలోకం తిరగబడే పరిస్థితి ఉంది. – ఆర్ ఆషా, పీడీఎస్ఓ, జిల్లా కార్యదర్శి, తిరుపతి -
ఆడబిడ్డ నిధి ప్రకటించాల్సిందే
ఆడబిడ్డ నిధిపై తక్షణం చంద్రబాబు సర్కార్ ఈ అసెంబ్లీలో ప్రకటించాల్సిందే. రెండేళ్లు గడుస్తున్నా పథకాన్ని అమలు చేయకుండా పేద మహిళలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి ఇంట్లో మహిళ ఈ పథకం అమలు చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ కూటమి ప్రభుత్వం మహిళల ఆశలపై నీళ్లు చల్లేసినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఏ ప్రభుత్వమైన మనుగడ సాగించడం కష్టమే. – పవిత్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి ● -
నా ఇంటిని నాకు ఇప్పించండి
నాయుడుపేట టౌన్: ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని సొంత తమ్ముడే తనకు ఇవ్వకుండా మోసం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, నా ఇంటిని నాకు ఇప్పించండని బాధిత మహిళ రామిశెట్టి వెంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి తన గోడును విలేకరులకు విన్నవించింది. పెళ్లకూరు మండలం కానూరు రాజుపాళెం గ్రామానికి చెందిన రామిశెట్టి వెంగమ్మ 2022లో కొండూరు వరప్రసాద్రాజు అనే వ్యక్తి వద్ద నుంచి 20 అంకణాల స్థలం కొనుగోలు చేసి రేకుల ఇళ్లు నిర్మించుకుంది. ఆమె ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని సొంత తమ్ముడే మోసం చేసి వేరే వారికి విక్రయించేశాడు. దీంతో తన ఇంటిని ఇప్పించాలని ఆమె పోలీసులు, అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో సంక్రాంతికి నారావారిపల్లికి వచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వినతిపత్రం ద్వారా వివరించింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యేను కలిసి తనకు జరిగిన అన్యాయం వివరించినా తనకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా అధికారపార్టీ నాయకులు అధికారులకు చెప్పి తనకు ఇళ్లు దక్కనివ్వకుండా చేస్తున్నారని ఆమె వాపోయింది. సీఎంను కలిసి అందించిన వినతిపత్రం తిరుపతి జిల్లా ఎస్పీకి చేరడంతో ఆయన అక్కడి నుంచి నాయుడుపేట డీఎస్పీకు వినతిపత్రం చేరింది. దీంతో రెండు రోజుల క్రితం డీఎస్పీ కానూరు రాజుపాళేనికి వచ్చి విచారించి వెళ్లారని తెలిపింది. జిల్లా ఎస్పీ నుంచి వచ్చిన వినతి మేరకు వెంగమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఆమెకు సంబంధించిన ఇంటిని పరిశీలించామని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. అయితే ఆ ఇంటిని వెంగమ్మ అనుమతితోనే విక్రయించేసినట్లుగా చెబుతున్నారని పూర్తి స్థాయిలో విచారించి న్యాయం జరిగేలా చేస్తామని డీఎస్పీ వివరణ ఇచ్చారు. -
లంకేశ్వరుడిపై లయకారుడు
స్వామి,అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణశ్రీకాళహస్తి: అసుర జాతిలో పుట్టిన రావణుడు బ్రహ్మణోత్తముడు..అత్యంత శివభక్తి పారాయణుడు. కైలాసాన్ని తన శిరస్సుకెక్కించుకుని.. రు ద్రవీణాగానంతో పరమేశ్వరుడిని మెప్పించిన భక్తాగ్రేసరుడు. అందుకే మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ముక్కంటీశ్వరుడు ధశకంఠుడిపై అధిరోహించాడు. స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబ మయూర వాహనాన్ని అధిరోహించి, భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. వినాయకుడు మూషిక వాహనంపై, శ్రీవల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండీకేశ్వరస్వామి, భక్త కన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బంగారు యాళి వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప కొలువుదీరారు. కళాకారుల కోలాటాలు, నందుల వాయిద్యాలు, శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిసరాలు మార్మోగాయి.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా జ్ఞానప్రసూన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. మేళ,తాళాల మధ్య పట్టువస్త్రాలు, సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ఆలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయిలకు అందజేశారు. -
ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి, డీఈఓ కేవీఎన్ కుమార్తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జిల్లాలోని 84 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నుంచి గూడూరుతోపాటు కోట మండలాలు నెల్లూరుకు వెళ్లిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరీక్షల నిర్వహణ బాధ్యత నెల్లూరు అధికారులు చూస్తారని స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాకు రావడంతో ఆ నియోజకవర్గంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటి నిర్వహణ బాధ్యత తిరుపతి అధికారులదేనని వెల్లడించారు. మొదటి సంవత్సర పరీక్షలు 30,319 మంది, రెండో సంవత్సర పరీక్షలు 30,696 మంది రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తంగా 61,015 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని ఆదేశించారు. 4 ప్లయింగ్ స్క్వాడ్లు, 10 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలను పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. ప్రశ్నాపత్రాలను నిల్వచేయడానికి 28 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యాశాఖ నుంచి ఏర్పాటు చేసిన 302 మంది ఇన్విజిలేటర్లు క్రమం తప్పకుండా వారికి కేటాయించిన కేంద్రాల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్, మాస్కాఫీయింగ్కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు ల కోసం ఆర్ఐవో ఆఫీస్లో కంట్రోల్ రూమ్ 0877 237200 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈసీ నుంచి జీవీ ప్రభాకర్రెడ్డి, రెడ్డిరామరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని భర్త మృతి
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో గుర్రప్పతోట గ్రామం వద్ద శుక్రవారం మోటారుబైక్లో వెళుతున్న భార్యభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో గోపి(32) అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్య శైలజకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందిజ స్థానికులు కథనం మేరకు పెళ్లకూరు మండలంలోని యడపూడి గ్రామానికి చెందిన గోపి కొంత కాలంగా మేనకూరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి కొత్తూరు గిరిజన కాలనీలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైన దంపతులు శుక్రవారం మోటారుబైక్లో తిరిగి మేనకూరుకు బయలుదేరారు. మార్గం మధ్యలో గుర్రప్పతోట గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం మోటారుబైక్ను ఢీకొంది. ఈ ఘటనలో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. శైలజకి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితికి వెళ్లింది. స్థానికులు గుర్తించి 1033 వాహనంలో క్షతగాత్రురాలిని శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఎంతో నమ్మకంతో ఓటు వేశాం
మా ఇంట్లో 18 ఏళ్లు నిండిన మహిళలం ముగ్గురు ఉన్నాం. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన నాయకులు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు సీఎం అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. దీంతో నమ్మి ఓటు వేశాం. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. రెండేళ్లు గడిచింది. మా కుటుంబంలో ముగ్గురికి కలిపి రెండేళ్లకు రూ.1.08లక్షలు రావాల్సిఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా? అని ఎదురు చూస్తున్నాం. – సావిత్రి, దినసరి కూలీ, తిరుపతి రూరల్ ● -
బాబు పాపాలు బట్టబయలు
రైల్వేకోడూరు అర్బన్ : వేంకటేశ్వరసామి కళ్లు తెరిచాడని, సీఎం చంద్రబాబు పాపాలు బట్ట బయలయ్యాయని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో పవిత్రమైన సనాతన ధర్మం పేరు చెపుకుంటూ రాజకీయాలు చేస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఈ భూ మండలంలోనే లేడన్నారు. 2014 నుంచి, 2019 వరకు తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థలు చంద్రబాబువేనని తెలిపారు. హెరిటేజ్ విషయం బటపడకుండా మరో పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి టెండర్ దక్కించుకుని నెయ్యి సరఫరా చేశారని తెలిపారు. హెరిటజ్ సంస్థల్లో రూ.600కు అమ్ముతూ తిరుమల మహా ప్రసాదానికి ఎలా సరఫరా చేసారో చంద్రబాబే చెప్పాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం హిదువుల మనోభావాలను రాజకీయాలకు వాడుకోవడం మానేయాలన్నారు. అడవి పంది దాడిలో ఒకరికి గాయాలు చిట్వేలి: మైలపల్లి రాచపల్లిలో శుక్రవారం ఉదయం చొక్కారాజు రవీంద్రరాజు తన పొలంలో బొప్పాయి చెట్లు తవ్వుతుండగా అకస్మాత్తుగా అడవిపంది అతనిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు గాయపడిన రవీంద్రరాజును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం రాజంపేటకు తరలించారు. -
శ్రీసిటీలో స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్
శ్రీసిటీ(వరదయ్యపాళెం): ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణులు, స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ ఆర్.సుందరం శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. భారతదేశ ఆర్థిక భవిష్యత్తు దేశీయ సామరా్థ్య్ల బలోపేతం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, విధాన స్థిరత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణులు, స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ ఆర్.సుందరం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన శ్రీసిటీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పరిశ్రమల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. అతిథికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ మారుతున్న విధానాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమ వర్గాలను చైతన్యవంతులను చేయడానికి సంబంధిత నిపుణులతో తరచూ ఈ తరహా కార్యక్రమాల నిర్వహణ అవసరం అన్నారు. ‘మారుతున్న గ్లోబల్ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై ప్రసంగించిన సుందరం, ప్రధానంగా ప్రపంచ ఆర్థిక పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక బలాలను ప్రస్తావించారు. -
TTD: శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా రు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.28 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం . దర్శన టిక్కె ట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
జర్నలిస్టుపై పార్కింగ్ సిబ్బంది దాడి
చంద్రగిరి: తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన సీనియర్ జర్నలిస్టు, అమ్మవారి భక్తుడు మునిరామిరెడ్డిపై గురువారం పోలీసులు, పంచాయతీ అధికారుల ఎదుటనే దాడి జరిగింది. వివరాల్లోకెళితే.. తిరుచానూరు పార్కింగ్ సిబ్బంది గత కొంత కాలంగా కూటమి నేతల అండతో విచ్చలవిడిగా భక్తులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వాహనాల పార్కింగ్కు అధిక రుసుము వసూలు చేస్తున్న విషయంపై ప్రశ్నించి భక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే జర్నలిస్టు మునిరామిరెడ్డి గురువారం అధిక రుసుము వసూలును ప్రశ్నించిన భక్తులపై పార్కింగ్ సిబ్బంది దౌర్జన్యం చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని పార్కింగ్ సిబ్బంది ఆగడాలను చిత్రీకరించాడు. ఈ క్రమంలో ప్రైవేటు పార్కింగ్కు చెందిన సిబ్బందితోపాటు టీడీపీ గుండాలు మునిరామిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శి, పోలీసుల సమక్షంలో దాడి జరిగిన వారు చోద్యం చూస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా బాధితుడు మునిరామిరెడ్డి, బీజేపీ మహిళా మోర్చా మండల నాయకురాలు పుష్పారెడ్డితో కలసి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి
రైల్వేకోడూరు అర్బన్: కడప–రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన రైల్వేకోడూరులో ఆకస్మికంగా పర్యటించారు. కడప–రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులు, రైతులు పండించే పంటలను పరిశీలించారు. అలాగే శెట్టిగుంట ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి రోగులను సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణ పనుల పూర్తి చేసి, రవాణా సౌకర్యం మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడుతూ వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుని పంట సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంఆలలో ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ అమర్నాథ్ పాల్గొన్నారు. ఎస్వీయూలో నూతన కలెక్టర్ బంగ్లా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంబీఏ కళాశాల సమీపంలో కలెక్టర్ బంగ్లా కోసం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భవననిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిర్మాణ పనులను ఇప్పటికే కలెక్టర్ సైతం పరిశీలించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నిర్మిస్తున్న భవనం గత ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థ మేయర్ బంగ్లా కోసం కేటాయించారు. కానీ నగరపాలక సంస్థ అధికారులు కలెక్టర్ బంగ్లా కోసం భవనాన్ని అప్పగించినట్లు తెలిసింది. వర్సిటీలో మళ్లీ మాస్టర్ ప్లాన్ రోడ్డుల వ్యవహరం తెరపైకి రావడం, గత ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదననే ప్రస్తుతం అమలు చేయాలనే దిశగా నగరపాలక సంస్థ అడుగులు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు వర్సిటీ అధికారులతో చర్చించి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ ప్రదేశాలను పరిశీలించారు. -
నారాయణ కాలేజ్ తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులను దారుణంగా కొట్టిన ఘటనపై విద్యార్థి సంఘాలు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చదువు పేరుతో విద్యార్థులను వేధిస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, స్టడీ అవర్స్లో కొట్టారని బాధిత విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులకు తెలిపారు. దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాల నేతలు ఈ చర్యలను నిరసిస్తూ ధర్నా చేశాయి. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు మన్నం ప్రేమ్కుమార్, ఏఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్, రాయలసీమ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జ్యోతి ప్రకాష్, ఓబీసీ విద్యార్థి సంఘం రాయలసీమ అధ్యక్షుడు ఉత్తరాది విజయ్, విద్యార్థి నాయకులు దినేష్, సునీల్, హరి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బుచ్చినాయుడుకండ్రిగ:మద్యం మత్తు లో ద్విచక్రవాహనంపై వెళుతూ వరత్తూరు కాలువపై ఉన్న వంతెనకు ఓ వైపు దిమ్మెను ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వెస్టువరత్తూర వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రామ్మూర్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మూడు నెలల గర్భిణి కావడంతో పుట్టిల్లు అయిన శ్రీకాళహస్తి మండలం కనపర్తి గ్రామంలో ఇద్దరు కుమార్తెలతో కలసి ఉంటుంది. రామ్మూర్తి కూలీ పనులు ముగించుకుని, భార్య వద్దకు వెళ్లడానికి బుధవా రం రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం సేవించి, ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గం మధ్యలోని వెస్టువరత్తూరు గ్రామం వద్ద కాలువపై ఉన్న దిమ్మెను ఢీ కొన్నాడు. దీంతో రామ్మూరి తీవ్రగాయాలతో కాలువలోని నీటిలో పడి మునిగి చనిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయ గా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
అపూర్వ ఆదరణ
ఆధ్యాత్మిక మహాపాదయాత్రకుతిరుపతి రూరల్: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం పాతికేళ్లుగా వస్తు న్న ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వందలాది మంది భక్తుల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. తుమ్మలగుంటలోని కల్యాణ వెంకన్న ఆలయం నుంచి గురువారం ఉద యం 6 గంటలకు బయలుదేరిన ఆధ్యాత్మిక మహాపాదయాత్ర పేరూరు, తాటితోపు, చెర్లోపల్లి, పుదిపట్ల, గాంధీపురం, పెరుమాళ్లపల్లి, సి.మల్లవరం, కాలూరు క్రాస్ మీదుగా శ్రీనివాసమంగాపురం వరకు మధ్యా హ్నం 1.30 గంటలకు చేరుకుంది. చెవిరెడ్డి చేపట్టిన ఆధ్యాత్మిక మహాపాదయాత్రలో స్వామివారికి మేల్చా ట్ వస్త్రంతోపాటు, శేషమాలలను పల్లెల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ప్రతి పల్లెలో శ్రీవారికి సమర్పించే సారెను గ్రామస్తులతో మోయిస్తూ వారిలో భక్తిత త్వాన్ని పెంచుతూ ముందుకు సాగారు. భక్తుల గోవింద నామస్మరణలు, చెక్కభజనలు, కోలాటాలు, భజన బృందాలు, మహిళల మంగళ హారతుల నడుమ ఆధ్యాత్మిక మహా పాదయాత్ర కనులపండువగా సాగింది. చెవిరెడ్డితోపాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మహాపాదయాత్రకు వచ్చిన భక్తులు అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు కదిలారు. ఆలయాధికారులకు అందజేత తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి చెవిరెడ్డి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను శ్రీనివాసమంగాపురంలోని ఆలయాధికారులు స్వీకరించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆయనకు సాదర స్వాగతం పలికిన అధికారులు ఆలయ ముఖమండపంలో పట్టువస్త్రాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు, వేద మంత్రాల నడుమ అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. అనంతరం చెవిరెడ్డి నుంచి స్వీకరించిన పట్టువస్త్రాలను స్వామివారికి వినియోగించే వస్త్రాల దాతల రిజిస్టర్లో వారి పేరును నమోదు చేశారు. -
పాస్పుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం
తిరుపతి అర్బన్: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 20 నెలలపాటు మౌనంగా ఉన్న చంద్రబాబు సర్కార్ ఎట్టకేలకు పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఎన్ని పాస్ పుస్తకాలు కరెక్టగా ఉంటే అన్నింటిని పంపిణీ చేస్తే సరిపోతుంది. అయితే తప్పులు లేకుండా ఒక గ్రామంలో 70 శాతం పాస్పుస్తకాలు ఉంటే ఆ గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. మరోవైపు ఒక్కో మండలం నుంచి ఒక్కో నెలలో(ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు) 70 శాతానికి పైగా తప్పులు లేని ఒక్క గ్రామంలో పాస్పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేస్తే శ్రీకాళహస్తి, ఏర్పేడు, ఆర్సీపురం, తొట్టంబేడు, వరదయ్యపాళెం తదితర పెద్ద మండలాల్లో 50 గ్రామాలకు పైగా ఉంటే 50 నెలలు పంపిణీ చేస్తే...రైతుల పరిస్థితులు ఏమిటో అర్థం కావడం లేదు. ముందే సర్వే పూర్తి అయిన గ్రామాల్లోని రైతులు పాస్పుస్తకాలు లేకపోవడంతో పంట రుణాలు తీసుకోవడానికి వీలులేకుండా ఇబ్బందులు పడుతున్నారు. 70శాతం పైన పాస్పుస్తకాలు తప్పులు లేకుండా ఉంటేనే ఆ గ్రామానికి ఇస్తామనే నిబంధనలు పక్కనపెట్టి ఏ గ్రామంలో ఎన్ని పాస్ పుస్తకాలు కరెక్ట్గా ఉంటే అన్నింటినీ రైతులకు ఇస్తామనే రూల్స్ను పాటించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉదాహణకు ఒక గ్రామంలో 600 మందికి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటే..అందులో 150 పాస్పుస్తకాలు తప్పులు లేకుండా ఉన్నా వాటిని పంపిణీ చేయడం లేదు. 70శాతం పైనా అంటే 420 పాస్పుస్తకాలు కరెక్టర్గా ఉంటే ఆ తర్వాత ఇస్తామని చెప్పడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక గ్రామంలో ఎన్ని పాస్పుస్తకాలు కరెక్ట్గా ఉంటే వాటిని ఇవ్వడం...ఆ తర్వాత తప్పులను సవరిస్తున్న దశల వారీగా ఆయా గ్రామాల్లో ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి
చంద్రగిరి:ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని, సమష్టి వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలో నిర్వహించిన కిసాన్ మేళా–సమగ్ర వ్యవసాయం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వ్య వసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కిసాన్ మేళా – సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో రైతులు విత్తనం వేయడం నుంచి కోత వరకు సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), రైతు సంఘాలు ద్వారా సమష్టిగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. ఎన్టీ రంగ వర్సిటీ వీసీ శార దాజయలక్ష్మి, శాస్త్రవేత్తలు సి.రమణ, గిరిజారాణి, కే. జాన్, విజయ శంకర్ బాబు, యూనివర్సిటీ హెడ్ ము రళీకృష్ణ, మంజుల, కదిరి మోహన్ పాల్గొన్నారు. -
నిబంధనలకు మట్టి
●కోడూరు నియోజకవర్గంలో మట్టి బంగారమైంది. అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో నిబంధనలకు మట్టిగొట్టి, యథేచ్ఛగా తరలిస్తున్నారు. పచ్చనేతల సిఫార్సులున్నవారు.. అడిగినంత రొక్కం చెల్లించిన వారికి నిబంధనలు అతిక్రమించి అనుమతులిచ్చేస్తున్నారు.. అడిగేవారులేరని వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పుల్లంపేట: మండలంలోని చెరువుల్లో మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టి తరలింపునకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సివుంది. రైతులు తమ పొలాల్లో పంటలు పండించేందుకు మట్టి మార్పిడి చర్యలు చేపడుతుంటారు. ఇందుకు చెరువు మట్టి శ్రేష్టమని దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇరిగేషన్ అధికారులు రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పైగా మట్టి తరలింపు కోసం లంచం పుచ్చుకుని అనుమతులు మంజూరు చేసిన అధికారికి రైతులు తీసుకెళుతున్న మట్టిపై నిఘా లేకపోవడంతో మంజూరు చేసిన క్యూబిక్ మీటర్ల కంటే అధికంగా మట్టిని తరలించి, చెరువులను చెరిపేస్తున్నారు. దేవసముద్రం చెరువులో మట్టి తోలకానికి అనుమతులు మంజూరు చేయకూడదని రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులకు నివేదికలు ఇచ్చినా తహసీల్దార్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇరిగేషన్ అధికారులు ఆదాయమే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మండలంలోని దేవసముద్రం చెరువులో గతేడాది ఆగస్టు 4వ తేదీన నిహాన్రెడ్డి, ఈశ్వర్రెడ్డి అనే రైతులు తమ పొలానికి మట్టి తోలుకోవడానికి మండల ఇరిగేషన్ ఏఈకి దరఖాస్తు చేసుకోగా అనుమతుల కోసం ఆ శాఖ ఈఈకి నివేదించారు. కాగా సంబంధిత రైతులు కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులు కావడంతో అనుమతులు తిరస్కరించారు. వీరు దరఖాస్తులు చేసుకోవడానికి పదిరోజుల ముందు.. జూలై 19వ తేదీన పుల్లారెడ్డిపల్లెకు చెందిన రైతు రమాదేవికి అనుమతులు మంజూరు చేయడం విశేషం. పొలాలకు మట్టి తరలింపులో సైతం అధికారులు రాజకీయాలు చేయడం విచిత్రంగా ఉంది. దీనికితోడు దేవసముద్రం గ్రామానికి చెందిన సుధీర్రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి అనే రైతులు మట్టి కోసం అనుమతులు కోరగా రూ.50వేలు డిమాండ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. రెండు విడతలుగా రూ.5 వేలు చొప్పున ఫోన్పే ద్వారా ఇరిగేషన్ ఏఈ నాగేంద్రకు డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు. కాగా రైతుల ఫిర్యాదు మేరకు చాలాకాలం తర్వాత ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఏఈని వివరణ కోరగా ‘మీరెవరండి.. నేను మీకు సమాధానం చెప్పాలా, మీరేమి నా పైఅధికారులా..’ అని బెదిరింపులకు దిగారు. మీకేమైనా సమాధానం కావాలంటే రాతపూర్వకంగా వినతిపత్రం అందిస్తే మీరు కోరిన సమాచారం ఇస్తానని చెప్పారు. తాను డబ్బులు డిమాండ్ చేయలేదని, చెరువు గండ్లు పడతాయనే ఉద్దేశంతో అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమని.. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమనే ఏకై క కారణంతో మట్టి తోలకానికి ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. జూలై, సెప్టెంబర్ నెలల్లో అనుమతులు మంజూరు చేసిన అధికారులు ఆగస్టులో అనుమతులు మంజూరు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. – సుధీర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, వైఎస్సార్ సీపీ యథేచ్ఛగా చెరువు మట్టి తరలింపు అడిగినంత డబ్బులివ్వలేదని.. ఇరిగేషన్ ఏఈ నాగేంద్రనాయక్ అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కారణంగా మట్టి తోలకానికి అనుమతులు తిరష్కరించారు. అప్పటికీ నా శక్తి కొలది రెండు సార్లు రూ.5 వేలు చొప్పున ఫోన్పే చేశాను. – వెంకటసుబ్బారెడ్డి, దేవసముద్రం -
దోపిడీ నిజం
ఇసుక ఉచితం..ట్రాక్టర్కు ఇసుక లోడ్ చేస్తున్న హిటాచీనాగలాపురం: మండలంలోని అరుణానదిలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నారు. అక్కడ అధికారిక ఇసుక రీచ్ లేనప్పటికీ ఉచితం ముసుగులో తెలుగు తమ్ముళ్లు అనధికారిక దోపిడీకి తెగబడుతున్నారు. బయటకొడియంబేడు సమీపంలోని అయ్యప్పనాయుడు కండ్రిగ వద్ద నుంచి రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అది కుడా కూతవేటు దూరంలోని సరిహద్దు దాటిస్తేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నాగలాపురం మండలానికి తమిళనాడు సరిహద్దు ప్రాంతం అతి తక్కువ దూరంలో ఉండడంతో ఇదే అదునుగా భావించిన అధికార పార్టీ నాయకులు కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మండలాన్ని ఎంచుకుని ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తమిళనాడులో ఇసుకకు గిరాకీ ఉండడంతో భారీగా తరలిస్తుస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక తోడుతున్న జేసీబీలుఇసుక తవ్వడంతో ఏర్పడిన గోతులుఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లుతిరుపతి జిల్లాలో ఉచిత ఇసుక వ్యాపారుల దోపిడీకి వారధిగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక రీచ్లు లేనప్పటికీ ఇక్కడి పచ్చ నేతలు ఇసుకను కూతవేటు దూరంలోని తమిళనాడుకు తరలించి కాసుల పంట పండిస్తున్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఇసుక రీచ్లు మూతపడడం, అక్రమ తరలింపుతో సామాన్యుడికి ఇసుక కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం ఖజనాకు వచ్చే ఆదాయాన్ని వదులకుని పేదలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యాన్ని టీడీపీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం
తిరుపతి కల్చరల్: దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం తిరుపతిలో కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. సమ్మె సందర్భంగా ఉదయం సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు వేలాది మంది కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నగర వీధుల్లో ఎర్రజెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసి బహిరంగ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రకాష్బాబు, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడారు. నేతలు కందారపు మురళి, ఆర్.హరికృష్ణ, కె.రాధాకృష్ణ, కత్తి నరసింహారెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర
చంద్రగిరి: కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్ర హ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించి న గరుడ వాహన సేవకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుంచి ఆలయ పేష్కర్ రామకృష్ణ, లక్ష్మీహారాన్ని తిరుపతి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీహారానికి ప్రత్యేక పూజలు చేశారు. అ క్కడి నుంచి ఊరేగింపుగా లక్ష్మీహారం శోభాయాత్ర గు రువారం సాయంత్రం ఆలయం వద్దకు చేరుకుంది. అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ కల్యా ణ వేంకటేశ్వర స్వామివారి గరుడసేవ రోజున లక్ష్మీహారాన్ని ఆలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఇందులో భాగంగా గరుడసేవ సందర్భంగా కల్యా ణ వేంకటేశ్వరస్వామి వారికి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. రాత్రి హారాన్ని స్వామివారికి అలంకరించారు. -
జేఈఈ ఫలితాలు 16కు వాయిదా
తిరుపతి సిటీ: ఎన్టీఏ ఆధ్వర్యంలో గత నెల 21 నుంచి 29వ తేదీవరకు జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్–1 ఫలితాలు ఈనెల 16వ తేదీ వెలువడనున్నట్లు ఎన్టీఏ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ సెషన్–1 ఫలితాలను గురువారం విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా వేసింది. ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించండి తిరుపతి అర్బన్: ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో క్రమశిక్షణ కమిటీ నిర్వహణ నేపథ్యంలో వైద్యబృందంతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పారు. అలాగే పీఎంజేవై ద్వారా అర్హత ఉన్నవారితోపాటు హెల్త్కార్డులు లేని వారికి ఉచితంగా వైద్యం అందించాలని తెలిపారు. మరోవైపు రోగులకు నాణ్యమైన భోజన వసతి కల్పించడంతోపాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్రెడ్డి, జిల్లా మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ శాల ట్రస్టుకు గురువారం రూ.10,00,116 విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు కుప్పాల నిలేష్ కుమార్ ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుపతిలోని ఆయన నివాసంలో అందజేశారు. గోసంరక్షణ సేవా కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. -
నమో..భూతనాథ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భూతవాహనంపై ముక్కంటీశుడు, శుకవాహనం జ్ఞానప్రసూనాంబ ఊరేగారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై పరమశివుడు సర్వాలంకార శోభితుడై విహరిస్తుండగా మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తన్నప్ప చప్పరాలపై స్వామి అమ్మవార్ల వెంట అనుసరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాలు, భజన బృందాలు, భక్తులు శంఖం ఊదుతూ వెళుతుండా స్వామిఅమ్మవార్ల పురవిహారం చేశారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్, కొట్టేసాయి, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు. నోటీసులు ఇస్తున్నారు వలంటీర్లు చేస్తున్న పనులతోపాటు పదుల సంఖ్య లో సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల అంశంలో పదే పదే టార్గెట్లు ఇస్తున్నారు. ప్రతి స ర్వేకు ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. అయితే పలు కుటుంబాలకు చెందిన వారు ఓటీపీలు చెప్పడానికి ఇష్టపడడం లేదు. దీంతో టార్గెట్ లు పూర్తి చేయలేకపోతు న్నాం. ఈ క్రమంలో నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఆందోళన తప్పడం లేదు. – శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగి, శ్రీకాళహస్తి సర్వేలతో సతమతం ఉదయం 7.30 నుంచే సర్వేలతో ఆందోళన తప్పడం లేదు. రాత్రి 10 గంటల వరకు సర్వేలతోనే సతమ తం అవుతున్నాం. మాకు పండుగలు లేవు.. కుటుంబం లేదు.. ఇదే పనిలో ఉంటున్నాం. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. మండలస్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు సమస్యలపై మొరపెట్టుకున్నాం. అయినా ఒత్తిడిని ఎవరూ తగ్గించడం లేదు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. – వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగి, తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు(ఫైల్) తిరుపతి అర్బన్: బాబు సర్కారులో సచివాలయాలు సర్వే కేంద్రాలుగా మారాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయికే పరిమితం అవుతున్నారు. ఫలితంగా కార్యాలయాల్లో సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి రోజు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 691 గ్రామ, వార్డు సచివాలయాల్లో 5,625 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు 2,450 మందికి చిన్నపాటి కారణాలతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఓ వైపు సచివాలయాల కుదించారు. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గించారు. ఇంకోవైపు పదుల సంఖ్యలో సర్వే బాధ్యతలు అప్పగించారు. గతంలో వలంటీర్లు చేస్తున్న అన్ని పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. పనిభారం తగ్గించాలని 20 నెలలుగా మొత్తకుంటున్నా చంద్రబాబు సర్కార్ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో పని ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారకమునుపే నిరసనలు చేపట్టాలని ఉద్యోగులు భావిస్తున్నారు. మృతి చెందినవారికి శాంతి కలగాలంటూ నేడు, రేపో కొవ్వుత్తుల ర్యాలీని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధం అవుతున్నారు. చీటికిమాటికి నోటీసులు చిన్న చిన్న విషయాలకు సైతం సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చేస్తున్నారు. దీంతో వారందరికీ ఆందోళన తప్పడం లేదు. గత ఏడాది ఆగస్టులో హర్ఘర్ తిరంగా ర్యాలీకి రాలేదంటూ ఏకంగా 281 మందికి మెమోలు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారంతా వలంటీర్ల చేస్తున్న అన్ని పనులు తమ చేత చేయించడం సరికాదంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. న్యాయమైన కోర్కెలను నెరవేర్చకపోగా తమను చిన్నచూపు చూస్తూ ఎగతాళి చేస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమైన తాము ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేయాల్సి రావడంతో పలువురు ఓటీపీలు చెప్పడానికి ఇష్టపడడం లేదంటున్నారు. పదే పదే సర్వేల టార్గెట్తో మానసికంగా బాధపెడుతున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేపట్టినా ప్రయోజనం ఉండకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో తిరునాళ్లు: గాంధర్వ రాత్రి (మాఘ బహుళ ఏకాదశి) వాహన సేవలు ఉదయం 9గంటలకు: హంస–యాళి వాహనసేవ ఉభయదాతలు: కీ.శే. చిట్టాప్రగడ సీతారామంజనేయుడు, గుడివాడ, కృష్ణాజిల్లా రాత్రి 8గంటలకు రావణుడు – మయూర వాహనసేవ ఉభయదాతలు : జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి శ్రీకాళహస్తి సచివాలయ ఉద్యోగుల జిల్లా సమాచారంగత ప్రభుత్వంలో సచివాలయాలు 691 గతంలో ఉద్యోగులు 5,625 మంది కూటమి సర్కారులో సచివాలయాలు 353కి కుదింపు నేడు ఉద్యోగులు 3,650 మిగిలిన 1,975 మందిని వివిధ విభాగాల్లో కేటాయింపు సర్వేలతో క్షేత్రస్థాయికే పరిమితం బాబు సర్కారు సచివాలయాలను సర్వేలాలయాలుగా మార్చేసింది. పండుగలు.. పబ్బాలు.. సెలవులు లేకుండా నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు సర్వేలపై సర్వేలు చేయిస్తుండడంతో సచివాలయ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. పనిఒత్తిడిని తట్టుకోలేక కొంత మంది ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా సచివాలయ ఉద్యోగులు సర్వేలతో క్షేత్రస్థాయికే పరిమితమై కార్యాలయాల్లో కనిపించడం లేదు. -
తిరుమల నెయ్యిలో కొత్త కోణం.. ఇందాపూర్ సంగతేంటి?: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 300 రూపాయలకే స్వచ్చమైన నెయ్యి ఎవరు అందిస్తారు.. అది కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. గతంలో హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ నెయ్యి సంగతేంటి?. ఇందాపూర్లో కల్తీ జరిగిందా? అని ప్రశ్నించారు. అసలు నిజాలు బయటకు వస్తున్నాయి అని కామెంట్స్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ గురించి వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ఫ్రాంచైజీ సంస్థ. 2015లో రూ.278కే నెయ్యి సరఫరా చేసింది. 2016లో ఇందాపూర్ సంస్థ డిస్ క్వాలిఫై అయ్యింది. కానీ, 2025 డిసెంబర్ 16న కేజీ నెయ్యి రూ.658కి ఇందాపూర్ సంస్థ దక్కించుకుంది. గతంలో 2013-19వరకు ప్రీమియర్ అగ్రి డైరీ నుంచి 40 లక్షలు కేజీల నెయ్యి సరఫరా చేశారు. ఈ నెయ్యి ఖరీదు దాదాపు 300లుగానే ఉంది. ఈ రెండు సంస్థలు 50 కోట్ల 40 లక్షలు నెయ్యి సరఫరా చేశాయి.ఇందాపూర్లో సరఫరా చేసిన నెయ్యి కల్తీదా? అనే అనుమానాలు ఉన్నాయి. మీ హయంలో తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసింది కల్తీనా?. రూ.300లకు సరఫరా చేసే నెయ్యి.. 658కి ఒకేసారి రెట్టింపు ధరకు ఎలా సాధ్యమైంది?. దీనిపై చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ స్పందించాలి. స్వచ్చమైన నెయ్యి రెండు వేల అయితే కానీ రాదు అని చంద్రబాబు పదేపదే చెప్పారు కదా?. తక్కువ రేటుకు సరఫరా చేసిన నెయ్యి కల్తీదా అనిపిస్తోంది. హెరిటేజ్ సంస్థ అనే పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాచేసినా దాగని సత్యం.. ఇప్పుడు బయట పడింది అని వ్యాఖ్యలు చేశారు. -
లడ్డు వివాదం.. తిరుమలలో సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: తిరుమల లడ్డూపై కూటమి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వేళ ఈ వ్యవహారంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డు వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు.తిరుమలలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ..‘తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నాయి. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదు. మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేయొద్దు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సమయంలో రాజకీయ నేతలు లడ్డుపై మాట్లాడటం ఆపేయాలి. మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి.. కానీ దేవుడిని మాత్రం లాగొద్దు. లడ్డు వివాదంపై అనవసర చర్చలు ఆపి, భక్తుల మనోభావాలను కాపాడండి’ అని హితవు పలికారు. -
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: నగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం కలిగించింది. ఈ ఘటనపై భర్త వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, అలిపిరి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు తిరుపతి ఆటోనగర్, అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న సి. మౌలిక (26) ఈ నెల 10వ తేదీ ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే రుయాస్పత్రికి తరలించారు. ఉదయం 9.13 గంటలకు ఆమెను పరీక్షించగా వైద్యులు ‘బ్రైన్ డెడ్’గా ప్రకటించారు. మమృతురాలి తల్లి సి.లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2020లో సి. మౌలికను పి.ఉదయ్కి వివాహం జరిపించారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు ఆటోనగర్లో నివసిస్తున్నారు. అయితే వివాహానంతరం భర్త ఉపాధి లేకుండా తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి మౌలికను శారీరక, మానసిక వేధింపులకు పాల్పడేవాడని మృతురాలి పుట్టింటివారు ఆరోపించారు. సౌమ్య అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ‘మౌలిక చనిపోతే ఆమెను వివాహం చేసుకుంటాన’ని బెదిరించే వాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మౌలిక తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్కు రూ.6కోట్ల ఆస్తులు ● సస్పెన్షన్ చేసినా లెక్కలేదు ● కాసులు ఇస్తేనే..దస్త్రం కదిలేది
తిరుపతి అర్బన్: రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని అధికారులకు అడిగింది ఇస్తే చాలు అంతా వాళ్లే చూసుకుంటారు.. ఇవ్వకపోతే డాక్యుమెంట్స్లో అన్నీ త ప్పులున్నాయంటూ రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తారు. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రయవిక్రయదారులు మళ్లీ రాలేమంటూ వాళ్లు అడిగింది ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇలా చేసుకుంటున్న వారు 99 శాతం మంది ఉన్నారు. జిల్లాలోని 16 సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇదే తంతు కొనసాగుతుంది. ఏసీబీ దాడులు చేసినా లెక్కచేయడం లేదు. సస్పెన్షన్ చేసినా భయపడడం లేదు. 20 నెలల వ్యవధిలో జిల్లాలో 10 మందికిపైగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సస్పెన్షన్కు గురయ్యారు. అయితే దాదాపుగా అంతా మళ్లీ ఉద్యోగాల్లో చేరడం విశేషం. సస్పెన్షన్ అయితే ఏముంది.. ఏసీబీ వాళ్లు పట్టుకుంటే ఏమవుతుంది.. అని పలువురు అంటున్నారు. విజయవాడ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పి మళ్లీ ఉద్యోగంలో చేరామని చెబుతున్నారు. అన్ని తెలిసీ చేసేదేమీ లేక జిల్లాస్థాయి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు రావాల్సిన వాటా ఇస్తే సర్దుకుపోవడమే నేర్చుకున్నారు. ప్రైవేటు ఏజెన్సీ వాతావరణం కొత్త వాళు్ల్ సబ్రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే ప్రభుత్వ ఆఫీస్లా కాకుండా ఓ ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లిన వాతావరణం కనిపిస్తుంది. ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత కార్యాలయంలా వ్యవహరిస్తున్నారు. ప్రతి అఫీస్లో శాశ్వత ఉద్యోగు లు ఎంత మంది ఉన్నారో.. అందుకు రెట్టింపుగా ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రేణిగుంట సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన క్రమంలో ప్రైవేటు వ్యక్తులను పెట్టుకోకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆయన ఆదేశాలను అమలు చేయలేదు. జిల్లాలో రేణిగుంట, తిరుపతి, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కీలకం. అత్యధికంగా ఈ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ప్రతి కార్యాలయంలో రోజుకు 40 నుంచి 60 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యాలయాల్లోనే ప్రైవేటు సిబ్బంది ఎక్కువగా పనిచేస్తున్నారు. రూ.50 చలానా రూ.500 మార్కెట్ విలువకు సంబంధించి వాల్యువేషన్ సర్టిఫికెట్కు యాజర్ చలాన రూ.50 కట్టాలి. గంటలో అందించాలి. అయితే మూడు రోజుల తర్వాత రూ.200 తీసుకుని ఇస్తున్నారు. అదే రోజే కావాలంటే రూ.500 లాక్కుంటున్నారు. అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్కు రూ.500 చలానాను ఆన్లైన్లో చెల్లిస్తే అప్రూవల్ చేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఒక్కో సర్టిఫికెట్కు రూ.1500 నుంచి రూ.2వేలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతిమయం సమాజంలో అవినీతి పెచ్చుమీరుతోంది.. ప్రజలకు సేవలందించాల్సిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలను అవినీతి కాలుష్యం ఆవహించి, జనానికి హాని కరంగా మారింది. ప్రతి ఒక్కరికీ డబ్బులివ్వందే దస్త్రం కదలడం లేదు. అధికారాన్ని అవకాశంగా చేసుకుని ప్రతి పనికీ లంచం డిమాండ్ చేయడం తో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతి కి అడ్డాగా మారిపోయాయి. ఏసీబీ దూకుడు పెంచి దాడులు చేసినా, సస్పెన్షన్ గురైనా అక్రమార్కులు భయపడడం లేదు.. ఏది జరిగినా ఇటు వెళ్లి.. అటు వచ్చేస్తున్నారు. ఇదీ జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల అవినీతి భాగోతం. రేణిగుంటలో పనిచేస్తూ సస్పెన్షన్లో ఉన్న ఓ అటెండర్ ఇంట్లో ఇటీవల ఏసీబీ చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.6 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అటెండర్ ఇంట్లోనే ఆ స్థాయిలో ఆస్తులు కూడగట్టారంటే...ఇక పెద్ద ఆఫీసర్లు లెక్కలు ఎంత ఉంటుందో ఊహకు అందడం లేదు. దొంగ స్టాంపులు సృష్టిస్తున్నారనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ–స్టాంపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టాంపుల్లో తేదీ, టైమ్, ఏ పనికి అనే కారణం, పార్టీ పేరు తదితర పూర్తి వివరాలు వస్తాయి. దీంతో మోసాలకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో రూ.10 నుంచి రూ.10 వేల వరకు ఈ–స్టాంపులు తీసుకునే సౌలభ్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. అయితే చంద్రబాబు పాలనలో రూ.10, రూ.20 స్టాంపులు ఇవ్వడం లేదు. రూ.100 స్టాంపులను రూ.150కి విక్రయిస్తున్నారు. ఈ స్టాంపులను ఆఫీస్లో విక్రయించడానికి అనుమతులు లేవు. కేవలం వెండర్లు మాత్రమే అమ్మాల్సి ఉంది. ఇదే అదునుగా వారు చెప్పేందే వేదంగా మారింది. అలాగే నాన్ జుడీ షియల స్టాంపులను సబ్రిజిస్టార్ ఆఫీస్ల్లో విక్రయిస్తున్నారు. అయితే క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ సందర్భంగా వాటిని తమ వద్దే కొనుగోలు చేయాలనే వంక పెట్టడంతో అక్కడే తీసుకుంటున్నారు. అయితే వారు రూ.100 స్టాంపును రూ.200, రూ.50 స్టాంపులను రూ.100కు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలోనూ ఇష్టారాజ్యంగా దోచేసుకుంటున్నారు. డబ్బులివ్వకుంటే డాక్యుమెంట్లు కావాలి తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్కు వెళ్లిన వారు డబ్బులివ్వకుంటే అనవసరం డాక్యుమెంట్లు అడుగుతున్నారు. డబ్బులిస్తే అవసరం అయిన డాక్యుమెంట్లు లేకున్న రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు ముందే చెప్పేస్తున్నారు. పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో చెక్ స్లిప్, ఫొటోలు, తంబ్, ఐరీష్, డాక్యుమెంట్స్ స్కానింగ్ తదితర కీలకమైన పనులు ప్రైవేటుగా పెట్టుకున్న వ్యక్తులే చేసేస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మూలపత్రాలు(ఫస్ట్ డాక్యుమెంట్) తప్పనిసరి. ఒక వేళ మూలపత్రాలు లేకుంటే సర్వే రిపో ర్ట్, సైట్ లేదా ఇంటి ఫొటో, క్రమవిక్రయదారుల ఆధార్కార్డు, ఫాన్కార్డు(పాన్కార్డు లేకుంటే ఫామ్ 60, ఫామ్ 61 పూర్తి చేసి ఇవ్వాలి), రూట్ మ్యాప్, ఇంటిపన్ను(ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే) ప్లాట్ అయితే సమీపంలో నివాసం ఉంటున్న వారి డోర్ నంబర్ ఇవ్వాలనే రూల్స్ ఉన్నాయి. డబ్బులు ఇస్తే ఇవేమీ అవసరం లేదు. -
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
తిరుపతి క్రైం: ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.1.50 లక్షలు దోచుకున్న కేటుగాడిని తిరుపతి అలిపిరి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రామ్కిషోర్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. తిరుపతి ఆటోనగర్, విశాలాంధ్ర వీధికి చెందిన చింతా వెంకటేశ్వరరావు (30) ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయాల్లో రాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రాపిడో ద్వారా కే.సురేష్కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను ఢిల్లీలోని ఎన్ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అని, తాజాగా పదోన్నతి పొంది హైదరాబాద్కు బదిలీ అయ్యానని చెప్పి వెంకటేశ్వర్లును నమ్మించాడు. ప్రస్తుతం తిరుపతిలో సెలవులో తన పిన్ని ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు. తన పరిచయాలు, ప్రభావాన్ని ఉపయోగించి హైదరాబాద్ ఆదాయపన్ను కార్యాలయంలో డివిజనల్ అడ్వైజర్ పోస్టును ‘రీప్లేస్మెంట్ కోటా’లో ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఉద్యోగం ఆశతో అతడి మాటలను నమ్మిన వెంకటేశ్వరరావు, విడతల వారీగా పేటీఎం, ఫోన్ పే ద్వారా మొత్తం రూ.1.50 లక్షల నగదును బదిలీ చేశాడు. డబ్బులు అందుకున్న తర్వాత నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. గట్టిగా అడిగితే ‘‘చేయగలిగింది చేసుకో’’ అంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. -
నేడు కిసాన్ మేళా
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో గురువారం కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ శారద జయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ గురువారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే కిసాన్ మేళాకు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి రైతులు, వ్యవసాయ అనుబంధ సంఘాలు, అధికారులు రానున్నారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు వైద్య కళాశాల ఉద్యోగి తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కే శశిభూషణరావు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంప్లాయీస్ బ్యాడ్మింట్ టోర్నమెంట్లో ఆయన ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఈనెల 15వ తేదీన గోవాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, బోధన బోధనేతర సిబ్బంది, వైధ్యాధికారులు ఆయనను అభినందించారు. వ్యక్తి ఆత్మహత్య బుచ్చినాయుడుకండ్రిగ: మద్యానికి బానిస అయిన వ్యక్తిని కుటుంబ సభ్యులు మందలించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలవాయిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నెలవాయి గ్రామానికి చెందిన దొడ్డగ రాధయ్య (65) వ్యవసాయం కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాధయ్య కొంతకాలంగా మద్యానికి బానికావడంతో కుటుంబం సభ్యులతో తరచు గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మద్యం తాగవద్దని, మందలించడంతో మంగళవారం ఉదయం గడ్డి మందు తాగడంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఓవరాల్ చాంపియన్స్గా ఎన్ఎస్యూ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులగా జరిగిన నేషనల్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ కల్చరల్ ఫెస్ట్–2026 ఘనంగా ముగిసింది. బుధవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వీయూ రెక్టార్ ప్రొఫెసర్ అప్పారావు విచ్చేసి మాట్లాడుతూ కళలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసే సాధనాలని, ప్రతి విద్యార్థి తనలో టాలెంట్ గుర్తించి దాన్ని అనుసరించి ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అతిథులతో కలసి యూత్ ఫెస్ట్లో ఓవరాల్ చాంపియన్స్గా నిలిచిన తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులకు ట్రోఫీ, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లీనా చంద్ర, డాక్టర్ ధర్మదాసన్ సితార పాల్గొన్నారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి డక్కిలి: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తెలిపారు. డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. పీహెచ్సీకి రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు సిబ్బంది హాజరు ఎఫ్ఆర్ఎస్ యాప్లోనే మూడు సార్లు తప్పకుండా వేయాలన్నారు. రోగులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. వైద్యులు బిందు ప్రియాంక, శ్రీహరి పాల్గొన్నారు. ఎంబీయూలో ప్లేస్మెంట్స్లో విద్యార్థుల ప్రతిభ చంద్రగిరి: మోహన్బాబు విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్లేస్మెంట్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. బుధవారం ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్, ఎల్టీఐ–మైండ్ ట్రీ సంస్థలు ప్లేస్మెంట్ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన 415 మంది విద్యార్థులు గరిష్టంగా ఏడాదికి రూ.21లక్షల వేతనాలతో కొలువు సాధించినట్లు తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో క్యాంపస్ ప్లేస్మెంట్లో ముఖ్యమైన మైలురాయిని సాధించినట్లు ఎంబీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 415 మంది విద్యార్థులు బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్, ఎల్టీఐ–మైండ్ ట్రీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు రావడం ఆనందంగా ఉందని ఆ వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎంబీయూ చాన్సలర్ మోహన్బాబు, ప్రో చాన్సలర్ మంచు విష్ణు అభినందనలు తెలిపారు. -
డైకిన్–రెచీ ఇండియా నూతన పరిశ్రమకు భూమిపూజ
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో డైకిన్ –రెచీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. జపాన్కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తైవాన్కు చెందిన రెచీ ప్రెసిషన్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న డైకినీ–రెచీ కంపెనీలో ఏసీల విడిభాగాలు (రోటరీ కంప్రెసర్లు) ఉత్పత్తి చేస్తారు. నూతన ప్లాంట్ భూమిపూజ కార్యక్రమంలో డైకిన్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్ జీత్ జావా, డైకిన్–రెచీ ఇండియా డైరెక్టర్ సెకిదా నయోటో సహా పలువురు పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావా మాట్లాడుతూ ప్రధాని ‘మేక్ ఇచ్ ఇండియా ఫర్ వరల్డ్’ లక్ష్యానికి అనుగుణంగా డైకిన్లో కలైజేషన్ ప్రయాణంలో ఇదిఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ సదుపాయం హెచ్వీఏసీ తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, దేశీయ గ్లోబల్ మార్కెట్లకు సేవలందిస్తుందన్నారు. ప్లాంట్ ఏర్పాటును స్వాగతించిన డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో సులభతర, వేగవంతమైన వ్యాపార వ్యవస్థపై ప్రభుత్వం నిబద్ధతను చాటుతుందన్నారు. 33.10 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టు మూడు దశల్లో అభివృద్ధి చేస్తారన్నారు. -
ఎవరినైనా కొడితో నాకు కిక్కొస్తుంది!
చంద్రగిరి: ‘మత్తులో ఉన్నప్పుడు నాకు ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవరు కనిపించినా వారిని కొడతా..అలా కొడితే నాకు మంచి కిక్కు వస్తుంది. మత్తులో దాడులు, దౌర్జన్యాలు చేస్తాను’ ఇది పోలీసులకు పట్టుపడిన రౌడీ షీటర్ శ్రీవాత్సవ అలియాస్ సన్నీ పోలీసులకు చెప్పిన మాటలు. అతను మాటలు విన్న పోలీసులు సైతం ఇదెక్కడి పిచ్చిరా..బాబూ? అని నోరెళ్లబెట్టడం వారి వంతైంది. గత నెల 21వ తేదిన మండలంలోని ఎగువరెడ్డివారిపల్లిలో మౌనిక అనే వివాహిత ఇంటిపై సన్నీతో పాటు మరికొంత మంది అర్ధరాత్రి దాడులకు తెగబడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం చంద్రగిరిలో రౌడీషీటర్ శ్రీవాత్సవ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్టు చేశారు. -
లడ్డూకు మేకప్ ఘనత బాబుదే!
కార్వేటినగరం/శ్రీరంగరాజపురం: రాజకీయంగా మాజీ సీఎం జగన్ను ఎదుర్కోలేక తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. శ్రీరంగరాజపురం మండలం, 49 కొత్తపల్లె మిట్ట లోని ఓ కల్యాణ మండపంలో బుధవారం వైఎ స్సార్సీపీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీకి హిందువుల ఓట్లను దూరం చేయాలన్న దురాలోచనతో వ్యవహరిస్తోందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో చంద్రబాబు లడ్డూ లో ఆవు కొవ్వు కలిసిందని మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సనాతన ముసుగులో లడ్డూ ల్లో చేప నూనె, పంది, ఆవు కొవ్వు కలిసిందని ఒక డ్రామా ఆడడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు. బోలేబాబాకు బాబే అనుమతి కుల రాజకీయీలకు ఆజ్యం పోసిన చంద్రబాబు ఇ ప్పుడు కొత్తగా మత రాజకీయాలకు తెరలేపినట్లు చెప్పారు. బోలే బాబాకు అనుమతిచ్చింది చంద్రబా బే కదా..? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ చేసిన సిట్ వైఎస్సార్సీపీ నేతలకు సంబంధం లేదని తేల్చినా మళ్లీ కుతంత్రాలకు ప్రయ త్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ సౌరబ్బోరా, మై హోమ్ అధినేత రామేశ్వర్ ఇద్దరి చేతితో చిలికిన 4,060 కిలోల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసి, ఆ నెయ్యితోనే అయోధ్య రామ మందిరానికి లడ్డూలు తయారుచేసి పంపినట్టు తెలిపారు. అయితే ఆ నెయ్యిలో కల్తీ జరిగినట్లు పవన్కల్యాణ్ ఆరోపించారని చెప్పారు. సువాసన కోసం.. 28 ఫిబ్రవరి 2018లో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ పరాక్ ప్రోడక్ట్ నుంచి 87,500 కేజీల నెయ్యిని కేజీ రూ.300 చొప్పున కొనుగోలు చేసేందుకు టీటీడీ తీర్మానం చేసినట్లుఽ ఆధారాలు ఉ న్నాయన్నారు. అయితే లడ్డూ నాణ్యత లోపించడంతో సువాసన కోసం లడ్డూకు మేకప్ వేసినట్లు ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మా జీ సీఎం వైఎస్ జగన్ను ఎలాగైనా హిందువులకు దూరం చేయాలన్న కుతంత్రంతోనే దేవాలయాల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాల యాలను రాజకీయ వేదికగా మార్చుకుని అపచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, నేతలు పాల్గొన్నారు. మా -
నేడు తుమ్మలగుంట నుంచి ఆధ్యాత్మిక మహా పాదయాత్ర
తిరుపతి రూరల్: తుమ్మలగుంట నుంచి శ్రీనివాసమంగాపురం వరకు చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మహా పాదయాత్ర గురువారం ప్రారంభం కానుంది. శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడవాహన సేవను పురస్కరించుకుని పట్టువస్త్రాలు సమర్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఆధ్యాత్మిక మహా పాదయాత్రను నిర్వహించడం ఆనవాయితీ. ఈనెల 12వ తేదీన గురువారం తుమ్మలగుంట నుంచి శ్రీనివాసమంగాపురం వరకు సాగే ఈ ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు వందలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఆధ్యాత్మిక పాదయాత్రలో చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి పాల్గొంటారు. చదువుకోండి.. వ్యాపారజీవనం సాగించండి తిరుపతి అర్బన్: చదువుకునే వ యస్సు ఉన్నవా రు చదువుకోండి..ఉద్యోగాలు చేయండి.. అలా గే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవనం సాగించండని ట్రాన్స్జెండర్లకు కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. జిల్లాలోని ఏడుగురు ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులతోపాటు ధ్రువీకరణపత్రాల ను బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్ అందజేశారు. విభిన్న ప్రతిభావంతులు, హి జ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజా వినోద్ గుర్తింపు కార్డుల జారీకి దర ఖాస్తుల స్వీకరించారు. అనంతరం కలెక్టర్ దరఖాస్తులు చేసుకున్న అందరికీ గుర్తింపు కార్డులను జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. దీంతో దరఖాస్తులు చేసుకున్న జి.జాహ్న వి, వి.లక్ష్మి, ఎస్.ఆయేషా, కే.రోహిణి, పి.హర్షి, బి.ప్రణతి, బి.మన్వితకి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి ట్రాన్స్జెండర్లకు అందాల్సిన అన్నింటిని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తలకోనకు ప్రత్యేక బస్సు సర్వీసులు తిరుపతి అన్నమయ్యసర్కిల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తలకోనకు తి రుపతి, రైల్వేకోడూరు నుంచి ప్రత్యేక బస్సు స ర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ సురేంద్రకుమార్ తెలిపారు. బుధవారం డిపోలోని అ న్ని అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేక కో– ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. తలకోన శైవక్షేత్రానికి గత ఏడాది నడిపిన ప్రత్యేక సర్వీసులు, ఈ ఏడాది నడపాల్సిన ప్రత్యేక సర్వీసుల గురించి చర్చించారు. భక్తులు, ప్రయా ణికుల సౌకర్యార్థం నిరంతరాయంగా బస్సులు నడపడంపై కార్యాచరణ రూపొందించాలన్నా రు. కాగా గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి నుంచి తలకోనకు 70 సర్వీసులు, రైల్వే కోడూరు నుంచి 40 సర్వీసులు న డిపారు. అయితే ఈ సంవత్సరం సీ్త్రశక్తి పథకం అమల్లో ఉన్న విషయాన్ని గుర్తుంచుకుని, తి రుపతి నుంచి తలకోనకు 80 ప్రత్యేక సర్వీసులు, రైల్వేకోడూరు నుంచి తలకోనకు 50 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించారు. -
భాకరాపేట అడవుల్లో ఏం జరుగుతోంది..?
సాక్షి, టాస్క్ఫోర్స్: అడవి బిడ్డలపై అటవీ అధికారుల అక్కసు కొనసాగుతోంది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపై దాడులు తెగబడడం గిరిజన కాలనీ వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల పరిధిలోని భాకరాపేట అడవుల్లో అసలు ఏంజరుగుతోందన్న అనుమానాలు అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అటువైపుగా రాత్రి వేళ వెళ్లే వాహనచోదకులపై అటవీ అధికారులు చూపే ప్రతాపం, గిరిజన గ్రామాల్లో అటవీ అధికారుల ఆగడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం, అడవి జంతువులను కాపాడేందుకు ఏర్పాటైన ఫారెస్టు అధికారులు ఆ పనులను పక్కపెట్టి అక్రమ సంపాదనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఫారెస్టు బీట్ ఆఫీసర్లు సైతం అడవులకు ఆనుకుని ఉన్న గిరిజన కాలనీల్లో కొందరు యువకులను ఎంపిక చేసుకుని భయపెట్టి, ప్రలోభపెట్టి తమకు ఇన్ఫార్మర్లుగా పెట్టుకున్నట్టు సమాచారం. ఆ ఇన్ఫార్మర్లు ఇచ్చే సమాచారాన్ని తమ పైఅధికారులకు చేరవేసి, బీటు ఆఫీసర్లు చేతులు దులుపుకుంటుండగా ఒక్కోసారి ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు అడవుల్లో దాడులు నిర్వహించే అధికారులు అక్కడ ఏమీ లేకుండా పోతే వారిపై బూతు పురాణం చదువుతున్నట్టు గిరిజనులు మదన పడుతున్నారు. అంతేకాక ఇన్ఫార్మర్గా ఉన్న వారిపైనే ఒక్కోసారి కేసుపెట్టి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసినట్టు జైలుకు పంపించేస్తున్నారని, అదేమని అడిగితే అప్పటి వరకు తన వద్ద తీసుకున్న సమాచారం మొత్తం కోర్టుకు అందజేసి జీవితాంతం బయటకు రాకుండా చేస్తామని అటవీ అధికారులు బెదిరిస్తున్నట్టుగా బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు జరిమానాలతో సరి అటవీ పరిసరాల్లో జంతువులను వేటాడడం, కలపను దోచుకోవడం వంటి కేసుల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎవరైనా పట్టుబడితే వారికి జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అడవి జంతువుల మాంసంతో పట్టుబడిన అమాయక గిరిజనులను మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టులను తప్పుదోవ పట్టించేలా.. ఎర్రచందనం అక్రమ రవాణాపై కేసులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా అటవీ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బాధిత వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసిన వెంటనే కోర్టుకు అప్పగించకుండా అడవుల్లో తిప్పుతూ చితక్కొట్టడం, ఆపై గాయాలు కాస్త తగ్గిన తరువాత కోర్టుకు అప్పగించేలా చేస్తుండడం గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, సదుం మండలానికి చెందిన మరో ఇద్దరు గిరిజన యువకులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని ఆరు రోజులుగా ఆచూకీ చెప్పకుండా వారి కుటుంబసభ్యులకు నరకం చూపారు. తమ బిడ్డలు ఏమయ్యారోనని తిరుపతి స్పెషల్ కోర్టు పరిసరాల్లో రోడ్డు పక్కన కూర్చుని పడిగాపులు కాశారు. చివరకు ఆ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో అటవీ అధికారులు గుట్టుగా ఒక్క రోజు ముందు వారిని అరెస్టు చేసినట్టు ఎఫ్ఐఆర్ చూపించి, ఆ ఐదుగురుని కోర్టులో ప్రవేశపెట్టి తప్పుదోవ పట్టించారు. అయితే బాధితుల తరఫున న్యాయవాది అటవీ అధికారులు కొట్టారని నిందితుల శరీరంపై ఉన్న గాయాలు చూపడంతో అటవీ అధికారులు అక్కడ కూడా తమకు సంబంధం లేదన్నట్టు బుకాయించారు. దీంతో ఆ దెబ్బలు దేనివల్లా కలి గాయో చెప్పాలని న్యాయాధికారి వైద్య పరీక్షలకు ఆదేశించారు. ఇలా అటవీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అమాయకులైన అడవిబిడ్డలపై తమ ప్రతాపం చూపుతుండటంతో గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. దీనిపై చామల రేంజి అధికారి వెంకటరమణను వివరణ కోరగా తాము ఎవరినీ కొట్టలేదని, అరెస్టు చేసిన తరువాత ఆలస్యం చేయకుండా కోర్టుకు తీసుకువచ్చామని, అక్రమ కేసులు ఎవరిపైనా పెట్టలేదని, ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన వారిపై కేసులు పెడుతున్నట్టు చెప్పారు. -
భూ ఆక్రమణలకు తెరపడేదెప్పటికో?
పుల్లంపేట: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరినప్పటి నుంచి మండలంలో భూ ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మండలంలో ప్రధానంగా కొమ్మనవారిపల్లె, డొండ్లోపల్లె, తిప్పా యపల్లె, అనంతసముద్రం రెవెన్యూ గ్రామాల్లో కూటమి నాయకులు అత్యధికంగా భూఆక్రమణలకు తెరలేపారు. ఇప్పటి వరకూ రికార్డుల ప్రకారం మండలంలో దాదాపు 2 వేల ఎకరాలకు పైగా కబ్జారాయుళ్ల చెరలో ప్రభుత్వ భూములు ఉన్నా యని రెవెన్యూ వర్గాలే చర్చించుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖాళీ జాగాలనే కాకుండా గ్రామంలో లేని వ్యక్తుల భూములు సైతం ఆక్రమించేస్తున్నారు. యువనాయకులు కొందరు అత్యుత్సాహంగా ఆక్రమణలకు పాల్పడితే దొండ్లోపల్లెకు చెందిన ఓ సీనియర్ నాయకుడు సరికొత పద్ధతిలో కబ్జాకు నాంది పలికాడు. దొండ్లోపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వేనంబర్ 223లో వంక, కుంటను ఆనుకుని ఉన్న భూమిని తనదిగా పేర్కొంటూ నిరక్ష్యరాస్యులైన దళితులను నమ్మించి అమ్మకానికి పెట్టి అందినకాడికి దండుకున్నాడు. ఆ భూములకు సంబంధించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోగా తనదేనని నమ్మపలికి అమ్మేశాడు. అంతటితో ఆగక భూమి పక్కనే ఉన్న కుంటను, కాలువ పొరంబోకును సైతం జేసీబీలతో చదును చేయించి, అమ్మివేశాడు. అనంతరం కొనుగోలు చేసిన నిరుపేద దళిత రైతులు మంగళవారం సాయంత్రం సంబంధిత భూమిలోకి వెళ్లి భూమిని చదును చేసి హద్దుల కోసం బండలను నాటే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హెచ్చరికలు జారీ చేసి, ఇది ప్రభుత్వభూమి ఎవరికీ ఎలాంటి అధికారాలు లేవని సంబంధిత భూముల నుంచి వైదొలగాలని ఆదేశించారు. కానీ తెల్లారేసరికి కబ్జారాయుడు కబ్జాస్థలంలో దాదాపు రెండువందల స్తంభాలను నాటించి భద్రపరచాడు. ఉదయం రెవెన్యూ అధికారులు కూలీలను తీసుకెళ్లి తొలగించే ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో జేసీబీలను ఆశ్రయించాల్సివచ్చింది. అప్పటికే పక్క గ్రామం కొమ్మనవారిపల్లెకు చెందిన మరో కబ్జారాయుడు కూటమి చోటా నాయకుడితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జేసీబీలను ఆక్రమిత స్థలంలోకి వెళ్లనీయకుండా సర్దుబాటు చేసుకున్నారు. బుధవారం ఆక్రమితభూమిలోకి వెళ్లి పరిశీలించగా రెవెన్యూ అధికారులు నివ్వెరపోవడం వారివంతైంది. రాత్రికి రాత్రి రెండు వందల స్తంభాలను నాటడంపై ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఏఓలతో కలిసి తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో జేసీబీ యజమానులకు ఫోన్లు చేసి ఘటనాస్థలికి రమ్మని కోరగా ఎవరూ అందుబాటులో లేకపోవడం స్థానికులు సైతం స్థానిక కూటమి నాయకులకు బెదిరి, రెవెన్యూ అధికారులకు సహకరించలేకపోయారు. దీంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ రాజశేఖర్, వీఆర్ఓ రాఘవ, సర్వేయర్ శ్రీలేఖలు గురువారం జేసీబీలతో వచ్చి హద్దురాళ్లను తొలగించి, సూచికబోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
దుబాయ్ సదస్సుకు పేటశ్రీ
తిరుపతి కల్చరల్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఈనెల 15,16వ తేదీల్లో ఎస్పీజే స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ వారు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్ డిసిప్లైనరీ రీసెర్చ్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్(ఐసీఐఆర్జీడీ–2026) సదస్సు జరుగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సులో ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి పాల్గొని ‘ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ తిరుమల బ్రహ్మోత్సవమ్స్– ఏపీ, ఇండియా’ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తారు. పేటశ్రీ తిరుపతి గంగజాతర, తిరుమల, తిరుపతి కథలు, కోనేటి రాయని కథలు వంటి తిరుపతికి సంబంఽధించిన పుస్తకాలను ప్రచురించారు. ఈయన గతంలో ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, వియత్నం, శ్రీలంక, భూటాన్, థాయ్ల్యాండ్ వంటి దేశాల్లోని సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలను సమ ర్పించారు. సెక్టోరియల్ ఇంటర్వ్యూలు తిరుపతి అర్బన్: సమగ్రశిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న ఐదు సెక్టోరియల్ పోస్టులకు బుధవారం కలెక్టరేట్లో ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాకు సంబంధించి 39 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ 31 మంది మాత్రమే హాజరయ్యారు. డీఆర్వో నరసింహాలుతోపాటు డీఈఓ కేవీఎన్ కుమార్, సమగ్రశిక్ష అధికారి గౌరీశంకర్, డైట్ ప్రిన్సిపల్ శ్యామలాదేవి నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరిపారు. మెరిట్ ప్రకారం రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నామని సమగ్రశిక్ష జిల్లా అధికారి గౌరీశంకర్ స్పష్టం చేశారు. -
ఆదర్శ సౌమ్యం!
పుత్తూరు: సంప్రదాయల పేరుతో మహిళలకు పరిమితులు విధిస్తున్న సమాజంలో ఈ సంఘటన నూతన సందేశాన్ని ఇస్తోంది. పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే కాదు పుత్రిక సైతం ఆ బాధ్యతను నెరవేర్చగలదు అంటూ ఓ కుమార్తె తన తండ్రికి అంతిమ సంస్కరణలు నిర్వహించిన ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ ఘటన బుధవారం వడమాలపేటలో చోటుచేసుకొంది. వడమాలపేటకు చెందిన ఎస్.మునిశేఖర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య సంధ్యాలక్ష్మి, సౌమ్య, హిమజ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో మంగళవారం మునిశేఖర్ మృతి చెందాడు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రికి తలకొరివి పెట్టాల్సింది కుమారుడు. అయితే కుమారుడు లేని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో పెద్ద కుమార్తె సౌమ్య తన తండ్రికి తలకొరివి పెడతానంటూ ముందుకొచ్చింది. అంతిమ యాత్రలో అన్నీ తానై వ్యవహరిస్తూ తండ్రిని అశ్రునయనాలతో సాగనంపింది. సౌమ్య సాహసోపేత నిర్ణయానం బంధు మిత్రులకు సైతం కంటతడి పెట్టించింది. నేటి మహిళలు విద్య, ఉద్యోగం, నాయకత్వంలో మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలను సైతం ముందుండి నడిపించగలరని సౌమ్య నిరూపించింది. -
లారీ ఢీకొని విద్యార్థి మృతి
తడ: జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థి సెల్వం అలియాస్ లారెన్స్ (16) మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ కొండపనాయుడు కథనం మేరకు.. తమిళనాడు పరిధిలోని ఆరంబాకం పాఠశాలలో ప్లస్వన్ చదువుతున్న రామాపురం ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థులు కిషోర్, ఆరుస్వామి రోజులానే పాఠశాలకు వెళ్లి సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు పయనం అయ్యారు. వీరితోపాటు రామాపురం ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదో తరగతి చదివి ఫెయిల్ అయిన సెల్వం ట్యూషన్కి వెళ్లి వీరితోపాటు బైక్పై కూర్చున్నాడు. జాతీయరహదారిపై ఆరంబాకం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ లారీ వేగం వచ్చి ద్విచక్ర వాహనం వెనుక ఢీకొంది. ప్రమాదంలో సెల్వం అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చైన్నె స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ పాల తయారీ ఇలా..
సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పా‘పాల’ పుట్టకు ప్రతిరూపంగా మారింది. ఇక్కడి కూటమి నేతలు కెమికల్ డాన్లుగా మారిపోయారు. అధికార మదంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు తాగే పాలలో రసాయనాలు కలిపి ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారు. పాలకూట విషాన్ని అధికార పలుకుబడితో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది. కల్తీ రాయుళ్ల ఆటకట్టించడంలో ఇక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలం చెల్లిన పాల పౌడర్, పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలను కలిపి మిక్సీ పడతారు. తద్వారా చిక్కటి క్రీం తయారవుతున్నట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇలా తయారైన లీటరు క్రీంలో నాలుగు లీటర్ల పాలు, 20 లీటర్ల నీటిని కలిపి మొత్తంగా 25 లీటర్ల పాలను తయారుచేస్తున్నారు. ఈ పాలను వివిధ డెయిరీలకు విక్రయించి వినియోగదారులపైకి వదులుతున్నారు. తమ బండారం బయట పడకుండా ప్రైవేటు డెయిరీల్లోని ఉద్యోగులను కల్తీపాల మాఫియా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. తమ అక్రమార్జనలో వా టాలు ఇస్తూ, మాట వినని వారిని బెదిరింపులతో నె ట్టుకొస్తున్నారు. కృత్రిమంగా తయారు చేస్తున్న పాల లో ఏయే రసాయనాలను ఏ మోతాదులో కలిపారో నిర్ధారించేందుకు పొరుగు రాష్ట్ర పోలీసులు పాల నమూనాలను పరీక్షలకు పంపారు. ఇవేం పాపాలుకర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పాల తయారీకి కావాల్సిన రసాయనాలు, వస్తువులను సేకరించి తమకు అనుకూలంగా ఉన్న డెయిరీల ఏజెంట్లకు అందిస్తున్నారని తెలిసింది. ఓ మహిళా నాయకురాలి భర్త కనుసన్నల్లోనే కుప్పంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు పాల తయారీ రసాయనాలు రవాణా అవుతున్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్లోని ఫుడ్ సేప్టీ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలా గడంతో కుప్పంలో డొంక కదులుతోంది. సాక్షి, టాస్క్ఫోర్స్ : కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఊకదంచుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కానీ స్థానిక పరిస్థితులు మాత్రం నేతి బీరకాయను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తూ కుప్పం ప్రాంతానికి చెందిన కూటమి నాయకులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు కల్తీ పాల దందా కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అందరికీ అవసరమైన పాలను విషంగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పట్టని పాలకులు కల్తీ పాల తయారీకి కుప్పం అడ్డాగా మారిందని పొరుగు రాష్ట్రాల పోలీసులు చర్యలకు ఉపక్రమించినా స్థానిక అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడడం లేదు. నెలవారీగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా పట్టించుకోవడం మానేశారు. పైపెచ్చు పొరుగు రాష్ట్ర విచారణ సంస్థలకు కూడా సహకరించడం లేదనే అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. కల్తీ పాల ముడి సరుకులను అందిస్తున్న కీలకమైన వ్యక్తిని పట్టుకునేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన కర్ణాటక పోలీసులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకుని బలవంతంగా వెళ్లగొట్టినట్టు సమాచారం. కర్ణాటకలోని రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చి అక్కడి పోలీసులను కట్టడి చేసేందుకు అధికార పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కలెక్టర్, ఎస్పీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డొంక కదులుతోంది ఆమె భర్తే కల్తీ డాన్ రసాయనాలతో తయారు చేస్తున్న కల్తీ పాలు పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రంలోకి వస్తున్నట్టు గుర్తించిన అక్కడి పోలీసులు గత నెలలో కోలారు జిల్లా కేజీఎఫ్ ఎస్పీ పరిధిలోని ఆండర్సన్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కుప్పానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుప్పానికి చెందిన ఓ మహిళా నాయకురాలి భర్త కల్తీ పాల తయారీ రాకెట్కు సూత్రధారిగా ఉన్నాడని అక్కడి పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కుప్పం నుంచి పొరుగు రాష్ట్రాలకు కల్తీ పాలు -
ఉచితం ముసుగులో ఇసుక దోపిడీకి సిద్ధం
నాగలాపురం: మండలంలోని అరుణానదిలో ఇసుక దోపిడీకి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అక్కడ అధికారిక ఇసుక రీచ్ లేనప్పటికీ ఉచితం ముసుగులో అనధికారిక దోపిడీకి స్థానిక టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ దిశగా బయటకొడియంబేడు సమీపంలోని అయ్యప్పనాయుడు కండ్రిగ వద్ద మంగళవారం దాదా పు 30 ట్రాక్టర్లకు పైగా వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకోగా హిటాచ్చి యంత్రాలతో లోడింగ్ చేసుకుని అక్రమంగా బయటకు తరలించేందుకు సిద్ధమయ్యా రు. దీంతో మలిమేలకండ్రిగ వాసులు ట్రాక్టర్లను అడ్డగించారు. గ్రామస్తులతో ట్రాక్టర్లు డ్రైవర్లుకు వాగ్వాదానికి దిగారు. గొడవ జరగడంతో ట్రాక్టర్ యాజమానులు ఇసుకను నదిలోనే వదలి వెళ్లి పోయారు. అయితే ఈ విషయమై గ్రామస్తుల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యూఎఫ్ఎస్ సర్వే తప్పులు లేకుండా చేయండి
తిరుపతి అర్బన్: తప్పులు లేకుండా యూఎఫ్ఎస్(యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ యూఎఫ్ఎస్ సర్వేలు ఇచ్చిన అన్ని అంశాలను స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే పీ3 అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరోవైపు పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఓ నారాయణరెడ్డి, డీఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ జగదీష్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
యమలోకాలు
కలాశాలలు కాదు●యమలోకంలా ప్రైవేటు విద్యాసంస్థలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు విద్యార్థులకు యమలోకాన్ని తలపిస్తున్నాయి. నిత్యం విద్యార్థులకు ఏదో రకంగా వేధిస్తూ నరకం చూపించి ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. విద్యను వ్యాపారం చేసిన ప్రభుత్వాలు కార్పొరేటు సంస్థల పక్షానే నిలబడడంతో అమాయక తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. –అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వర్సిటీల కోర్డినేటర్, తిరుపతి ఆత్మహత్యలకు అడుకట్ట వేయరా? ప్రైవేటు విద్యాసంస్థల్లో వరుస ఆ త్మహత్యలు భయబ్రాంతులకు గు రిచేస్తున్నాయి. విద్యార్థులను ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న సంస్థలపై చర్యలు శూ న్యం. బేరసారాలతో తల్లిదండ్రులను మభ్యపెట్టి తమ పనికానిచేస్తున్నారు. ప్రశ్నించి విద్యార్థి సంఘాలపై దారుణంగా దాడులు చేయడం, బెదిరించడం, కేసులు బనాయించడం చేస్తున్నారు. – చిన్న, ఏఐఎస్ఎఫ్ ఎస్వీయూ ఇన్చార్జి, తిరుపతి నిద్రావస్థలో బాబు సర్కారు కళాశాలల్లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులతో, అధికారులతో బేరసారాలకు దిగి తప్పులను కప్పిపుచ్చుకుంటూ సర్దుబాటు చేసుకుని, యథావిధిగా కార్యక్రమాలను కొనసాగిస్తూ రెచ్చిపోతున్నారు. అధికారులను తమదైనశైలిలో లొంగదీసుకుంటూ తమ పనికానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న, ఆత్మహత్యలు జరిగిన కళాశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా బాబు ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యహరిస్తూ నిద్రావస్థలో మునిగిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సిటీ: తమ బిడ్డ తమలా కష్టపడకూడదు..డాక్టరో..ఇంజినీరో కావాలి..ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు ఆత్రుత పడుతుంటారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు తిరుపతిలో పుట్టగొడులుల్లా పుట్టుకొచ్చాయి. దీనికి తోడు ఒకే కళాశాల పేరుతో ఐదు నుంచి ఏడేనిమిది బ్రాంచ్లను నెలకొల్పి, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడంతోపాటు ఐఐటీ, మెడికల్ క్యాంపస్ల పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని, విద్యార్థులకు బట్టి చదువులను నేర్పుతూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక మానసిక రోగులుగా మారుతుండగా, మరికొందరు కళాశాలలో లైంగిక వేధింపులకు, ఫీజు చెల్లించాలనే ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీరు మారని ప్రైవేటు యాజమాన్యం ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలల తీరు మారలేదు. విద్యార్థులు కళాశాలల్లో చేరినంతవరకు తల్లిదండ్రుల కాళ్ల వేళ్లపడే యాజమాన్యాలు జుట్టు తమ చేతికి చిక్కిన తర్వాత తమ ప్రతాపం చూపుతున్నారు. తమ విద్యార్థిని చూసి పలుకరించేందుకు నెలకొకసారి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చినా తమ పిల్లలను కలవనీయకుండా వారిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బట్టి చదువులను విద్యార్థులపై రుద్దుతూ కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు వాపోతున్నారు. మా కళాశాలలో చేరితే ఫీజు రాయితీతో విద్యనందిస్తాం.. అన్ని సౌకర్యాలున్నాయి.. మంచి భవిష్యత్ ఉంటుంది.. రారారమ్మని పిలిచే కళాశాలలు విద్యార్థులు చేరిన తరువాత ఫీజు రాయితీలు ఎగ్గొట్టుతున్నాయి..జైళ్లను తలపించే హాస్టల్ గదుల్లో పడేస్తున్నాయి... మొత్తం ఫీజులు కట్టమని ఒత్తిడి తెస్తున్నాయి. దీనికితో లైంగిక వేధింపులు, ఒత్తిడితో కూడి బట్టీ చదువులు నెత్తిన మోపుతున్నాయి. ఫలితంగా పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలపర్వం -
కార్పొరేటర్లకు అడుగడుగునా అవమానం
తిరుపతి తుడా: గ్రేటర్ తిరుపతిగా తీర్మానిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపి ప్రకటన చేయాలని నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీష విజ్ఞప్తి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్, సాధారణ కౌన్సిల్ సమావేశం మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేషన్ 2026 –27 వార్షిక ఏడాది రూ. 350 కోట్లతో రూపొందించిన బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలానే 44 అంశాలతో కూడిన పరిపాలన, అభివృద్ధి అజెండాలకు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య హాజరయ్యారు. మేయర్ శిరీష మాట్లాడుతూ వరుసగా ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టే కౌన్సిల్కి మేయర్గా ఉండే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి తొలి మేయర్గా సేవలందించే అరుదైన గౌరవం లభించిందన్నారు. గత కౌన్సిల్లో తిరుపతిని మహానగరంగా విస్తరించాలని ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానాన్ని ప్రభుత్వం గౌరవించి, వెంటనే గ్రేటర్ తిరుపతిని ప్రకటించాలని ఆమె కోరారు. తిరుపతి ప్రజలు అభిప్రాయం, కౌన్సిల్ నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. తదుపరి ఎన్నికలు గ్రేటర్ తిరుపతికే జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ బడ్జెట్ను ఖర్చులను తగ్గించుకుని, పొదుపును పెంచుకునేలా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదాయ వ్యయాల సమతుల్యత అవసరమని సూచించారు. మనం ఆమోదించబోయే బడ్జెట్ తిరుపతి నగర భవిష్యత్తుకు దిక్సూచిగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తిరుపతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పెరిగిన రాబడికి అభివృద్ధే మూలం భవన అనుమతులు, పన్నులు వంటి రూపంలో కార్పొరేషన్కు రూ. 20 కోట్లకు మేర రాబడి పెరగడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి మూలమని కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. 22 మాస్టర్ ప్లాన్ అభివృద్ధితో నగర విస్తరణ శరవేగంగా జరుగుతోందన్నారు. తద్వారా కార్పొరేషన్కు భవన అనుమతులు ఆస్తి పన్నులు రూపంలో ఆదాయం విస్తారంగా పెరిగిందన్నారు. రాబోవు రోజుల్లో నగర తూర్పు ప్రాంతం ఆదాయ వనరుగా మారుతుందన్నారు. తిరుపతి అభివృద్ధిలో భూమన అభినయ్ చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ఈట్ స్ట్రీట్ ప్రతిపాదన తమ ప్రభుత్వానిదేనని, అయితే ఇందుకోసం మాస్టర్ పాన్ రోడ్లలో శాశ్వత నిర్మాణం చేపట్టడం సరైనది కాదన్నారు. గ్రేటర్ తిరుపతి తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ 44 అజెండాలకు ఆమోదం కౌన్సిల్ సాధారణ సమావేశంలో 44 అజెండాలకు ఆమోదం లభించింది. ఇందులో పరిపాలన అంశాలతోపాటు ఉద్యోగుల పదోన్నతులు, అభివృద్ధికి సంబంధించిన పలు అజెండాలు ఉన్నాయి. కౌన్సిల్ సమావేశానికి వచ్చే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు తనిఖీల పేరుతో అడుగడుగున అవమానం చేశారని కోఆప్షన్ సభ్యులు ఇమామ్ సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులను కాలా రాసేలా తనిఖీలు నిర్వహించారని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికి చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. కార్పొరేటర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరమని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తారని ఆయన గుర్తు చేశారు. అయితే కౌన్సిల్లోకి వెళ్లేందుకు కార్పొరేటర్లకు పోలీసులు తనిఖీల పేరుతో చుక్కలు చూపించడం సరైంది కాదన్నారు. అంతకుముందు కార్పొరేటర్లను మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు -
సెక్టోరియల్ పోస్టుల భర్తీకి నేడు ఇంటర్వ్యూలు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లోని సమగ్రశిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న ఐదు సెక్టోరియల్ పోస్టులను భర్తీ చేయడానికి బుధవారం ఇంటర్వ్యూలకు హజరుకావాలని దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఆరు నెలల క్రితం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి వాయిదాలు వేస్తున్న నేపథ్యంలో ఈనెల 4వ తేదీన ముడుపులకేనా మీనమేషాలు అనే శీర్షికతో సాక్షిదినపత్రికలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఇంటర్వ్యూలు నిర్వహించి..పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నారు. సెక్టోరియల్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో 8 చిత్తూరు జిల్లా ఉపాధ్యాయులవి ఉండడంతో స్థానిక జిల్లా రూల్స్ నేపథ్యంలో వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించలేదు. ఈ క్రమంలో ఐదు పోస్టులకు 39 మందిని ఇంటర్వ్యూలు జరిపి, మెరిట్ ప్రకారం భర్తీ చేయనున్నారు. -
ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘోరాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ పట్టించుకోకపోవడం దారుణం. అమాయక విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న యాజమాన్యాలపై చర్యలు శూన్యం. ఈ ఏడాది కేవలం రెండు నెలలు గడవ ముందే తిరుపతిలోని పలు విద్యాసంస్థల్లో సుమారు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం. బాధిత కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి. –ప్రేమ్ కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు, ఎస్వీయూ వేధింపులతోనే ఆత్మహత్యలు సంస్థ పేరుప్రతిష్టల కోసం ర్యాంకుల పేరుతో బట్టీ చదువులతో ఒత్తిడి చేయడం. విద్యార్థినులను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు మేలుకోవాలి. చదువుతో పాటు విద్యార్థి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత నిచ్చే సంస్థల్లోనే చేర్పించాలి. విద్యను వ్యాపారం చేసే విద్యాసంస్థలకు తల్లిదండ్రులు దూరంగా ఉండాలి. –శ్రవంతి, పీడీఎస్ఓ జిల్లా కమిటీ సభ్యులు, తిరుపతి కడుపుకోతకు కారకులెవరు? ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. విద్యార్థులకు సరైన భోజన వసతి సౌర్యాలను కల్పించకుండా మానసిక రోగులను చేస్తున్నాయి. మార్కులే ప్రామాణికంగా వేధిస్తూ తల్లిదండ్రులను సైతం కలవనీయకుండా, సెలవులు ఇవ్వకుండా, కనీసం తమ సమస్యలను కన్న తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు ఫోన్ సౌకర్యం కల్పించకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒంటరితనానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి -
భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు మంగళవారం కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. భక్తునికి కొండపై స్థానం కల్పించి, కింద కొలువైన పరమేశ్వరుడు తొలి పూజను భక్తునికే చెందేలా వరమిచ్చాడు. దీంతో శ్రీకాళహస్తిలో భక్తకన్నప్ప ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తికి పూజలు చేశారు. అనంతరం కన్నప్ప ఉత్సవమూర్తిని కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కొండపై వెలసిన కన్నప్ప ఆలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువుదీర్చి శాస్త్రోక్తంగా గణపతిపూజ, పుణ్యాహవచనం, మండప ఆరాధన, ధ్వజపూజ నిర్వహించారు. అనంతరం దర్బ, మామిడాకులతో కట్టిన దవళపతాకం, పూలహారాన్ని ధ్వజ స్థంభంపైకి ఎగురవేశారు. తరువాత శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. బో యలు అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ సందర్భంగా వస్త్రం, నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత గ్రామోత్సవం ప్రారంభంమైంది. రాజగోపురం నుంచి చతుర్మాడవీధీల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ధ్వజస్తంభానికి అభిషేకం చేస్తున్న వేదపండితులు తిరుపతి గ్రేటర్ కావాల్సిందే.. అందుకు మున్సిపల్ తీర్మానాన్ని సర్కారు ఆమోదించి తీరాల్సిందే.. వచ్చే ఎన్నికలు గ్రేటర్ తిరుపతిగానే జరుగుతాయని ఆశిస్తున్నాం.. మహానగర ప్రతిపాదనతోనే తిరుపతికి అరుదైన గౌరవం అని నగర కార్పొరేషన్ మేయర్ శిరీష, కార్పొరేటర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్మానాన్ని అమోదించారు. దీన్ని చంద్రబాబు సర్కారు ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. కౌన్సిల్ నిర్వహిస్తున్న మేయర్ డాక్టర్ శిరీష గ్రేటర్ తిరుపతి..శాస్త్రోక్తంగా వాస్తు శాంతిపూజలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాత్రి వాస్తు శాంతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామోత్సవం ముగిసిన తరువాత ఆలయంలో వేదపండితులు గణపతి హోమం, పూజ చేశారు. అలాగే ఆలయానికి వాస్తు శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, పాలకమండలి చైర్మన్కొట్టే సాయిప రసాద ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు బీజేపీ నాయకులు కోలా ఆనంద్ పాల్గొన్నారు. -
చంద్రబాబు నిర్లక్ష్యం రైతులకు శాపం
రైల్వేకోడూరు అర్బన్: నాడు, నేడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర రైతులపై అశ్రద్ధ చూపి, రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ఎత్తు పెంచుతూ ఇక్కడి ఆయకట్టు రైతులకు నీరు రాయనీకుండా ఆపుతోందని తెలిపారు. ప్రస్తుతం 129 టీఎంసీల నిల్వ సామర్థం ఉండగా రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని, కర్ణాటక ప్రతిపాదనల మేరకు 279 టీఎంసీల నీరు నిల్వ సామర్థానికి పెంచితే రాష్ట్రంలో లక్ష ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లినా ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదన్నారు. అల్మట్టి ఎత్తుపెంచుతున్నా చూస్తూ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. దీనికితోడు రాష్ట్ర ప్రజల జీవ నాడి పోలవరం పూర్తి చేయలేదన్నారు. మాజీ సతెం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా రైతల కోసం ముందుండి పోరాటాలు చేశారని తెలిపారు. 2009లో కర్ణాటక అల్మట్టి ఎత్తుపెంచుతుంటే పోరాడి, పనులు ఆగిపోయేలా చేశారని తెలిపారు. 2014లో తెలంగాణ ప్రాజెక్టులకు కర్నూలులో మహాధర్నా చేశారని గుర్తు చేశారు. అధికారం చేపట్టాక రైతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు కట్టి పూర్తి చేశారని పేర్కొన్నారు. అప్పుడు తమ ప్రభుత్వంలో చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప, రైతులకు చేసిందేమీలేదన్నారు. రూ.లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి పేరు చెప్పి దోచుకుంటూ రాష్ట్రాన్ని మరో సూడాన్, శ్రీలంక చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందా బాల, వెంకటరెడ్డి, నాయిని యానాదిరెడ్డి, దామర్ల గణేష్, డీవీ రమణ, రాజశేఖర్ పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో విస్తృత స్థాయి భద్రతా ఏర్పాట్లు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీవశ్వరాలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలో్ల్ భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, సౌకర్యాల నిర్వహణపై ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్ర త్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చే పట్టాలన్నారు. ఏఎస్పీలు రవిమనోహరఆచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
చంద్రగిరి: అక్రమంగా పాల వ్యానులో తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం జరిగింది. సీఐ సురేష్ కుమార్ కథనం మేరకు.. పలమనేరుకు చెందిన కిషోర్ నుంచి ముల్బాగిల్కు చెందిన లక్ష్మీపతి రేషన్ బియ్యం కొనుగోలు చేసి, ముల్బాగిల్కు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో మండలంలోని తొండవాడ సమీపంలో రెవెన్యూ అధికారులతో కలసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా వస్తున్న పాలవ్యానును తనిఖీ చేయగా వాహనంలో 6.5 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించామని సీఐ సురేష్ కుమార్ తెలిపారు. -
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
తిరుపతి అర్బన్: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని కడప ఆర్జేడీ శామ్యూల్ వెల్లడించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన ఆయన, డీఈఓ కేవీఎన్ కుమార్తో కలసి తిరుచానూరు హైస్కూలు, చెర్లోపల్లిలోని వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం వెనుకబడిన విద్యార్థులను హాస్టళ్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో హాజరు శాతం తక్కువగా ఉన్న పదోతరగతి విద్యార్థులు, అలాగే పాఠశాలల్లో జరుగుతున్న సాధారణ పరీక్షల్లో తక్కువ శాతం మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు 36 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఆయా పాఠశాలల సమీపంలోని హాస్టళ్లకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తిరుపతి రూరల్: తిరు పతి నుంచి ఉప్పరపల్లి మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణించే ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన చేసుకుంది. తిరుపతి రూరల్ పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన చంద్రబాబు కుమారుడు విక్రమ్ (19)కు చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో తన అక్క గీతాంజలితో కలసి తండ్రితో కలిసి ఉంటున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న విక్రమ్ ఆ తరువాత చదువు ఆపేసి బతుకు దెరువుకు కూరగాయల వ్యాపారం సాగిస్తున్నాడు. తన స్నేహితుడు రాజ్కుమార్తో కలసి సోమవారం రాత్రి ఉప్పరపల్లి నుంచి తిరుపతిలోకి తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా రామానుజపల్లి జంక్షన్ నుంచి తిరుపతి నగరంలోకి వెళ్లే మారుతీ కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్లే ఇద్దరికీ బలమైన గాయాలుకాగా అదే సమయంలో అటుగా వచ్చి న విక్రమ్ సమీప బంధువులు క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతున్న విక్రమ్ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని అక్క గీతాంజలి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అరెస్టు పుల్లంపేట: హెడ్కానిస్టేబుల్ను గాయపరిచిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా నిందితునికి నందలూరు జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని కోనయ్యగారిపల్లెకు చెందిన చలమల మల్లికార్జునరెడ్డి ఆదివారం రాత్రి పుల్లంపేటలోని తన మేనత్త భర్త నాగా తిమ్మారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల కోసం డిమాండ్ చేయగా లేదని తెలపడంతో గొడవపడ్డాడు. దీంతో తిమ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణకు వచ్చిన హెడ్కానిస్టేబుల్ సుబ్బరాజును ఉంగరపు వేలు, మధ్య వేలును కొరికి గాయపరచడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేశామన్నారు. కాగా మంగళవారం నందలూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునివ్వడంతో రాజంపేట జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి రేణిగుంట: పట్టణంలోని ఓల్డ్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మంగళవారం ఉదయం స్థానికులు రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. రైల్వేట్రాక్ పక్కన 50 నుంచి 55 ఏళ్ల గుర్తు తెలియని పురుషుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో అనారోగ్య కారణం గానీ, లేదా ఫిట్స్ రావడంతో గానీ మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతుడు పసుపు రంగు షర్టు, తెలుపు రంగు పంచె ధరించి ఉండగా, అతని చర్మ తెలుపు రంగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించి సమాచారం అందించాలని కోరారు. పక్కా గృహాల అప్పగింతకు చర్యలు నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లాలో 18,943 పైగా వివిధ దశలో నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలను లబ్ధిదారులకు ఉగాది నాటికి అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పట్టణంలోని బిరదవాడ సమీపంలో నిర్మిస్తున్న పక్కాగృహాలను మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ గృహాల నిర్మాణ పనులను గుర్తించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి అన్నం శ్రీనివాసరావు, సూళ్లూరుపేట డీఈ దశయ్య, ఏఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు’
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారన్నారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తిరుపతి నుంచి మీడియాతో మాట్లాడిన భూమన.. తిరుమల లడ్డూపై సిట్ ఇచ్చిన రిపోర్ట్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు, ముద్దాడ, రవిచంద్ర బలవంతంగా పెద్ద జీయర్ స్వామితో లేఖ రాయించారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రమేయంలేదని సిట్ స్పష్టంగా చెప్పింది. కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు. చంద్రబాబు క్షద్ర రాజకీయాల్లో ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోతున్నారు. స్వాములను భయపెట్టి చంద్రబాబ ఏం సాధించాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.‘కొంతమంది స్వాములకు భక్తి కంటే పైరవీలు ఎక్కువ అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులపైనే ఎల్లో మీడియా దాడులు చేస్తోంది. హైందవ సమాజానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు రెడ్బుక్ పాలన పెద్ద జీయర్స్వామిపైకి మళ్లింది. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
బాబువి దుర్మార్గపు ఆలోచనలు
నాయుడుపేట టౌన్: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దుష్ప్రాచారం చేస్తున్న చంద్రబాబు తన దుర్మార్గపు ఆలోచనలను ఇంకా విడిచి పెట్టలేదని, రాజకీయాలకు కలియుగ వేంకటేశ్వరస్వామిని వాడుకుంటూ నీచంగా వ్యవహరిస్తున్నారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. నాయుడుపేట ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో ఎలాంటి కొవ్వు లేదని అత్యున్నత న్యాయస్థానం క్లీన్చిట్ ఇచ్చిందన్నారు. దీంతో అసత్యప్రచారం చేస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, కోట్లాదిమంది భక్తులు ఛీదరించుకుంటున్నారన్నారు. చంద్రబాబు నిజాలు అంగీకరించి, వెంకన్న భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, దర్యాప్తు జరిపిన సంస్థలతోపాటు దీనిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేస్తూ ఇళ్లను తగులబెడుతూ గుండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్యాదవ్, పాదర్తి హరినాథ్రెడ్డి మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారంపై చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కటకం జయరామయ్య, బైనా మల్లిఖార్జునరెడ్డి, వేణుంబాక మునస్వామినాయుడు, రత్నశ్రీ, గంధవల్లి సిద్దయ్య, తేజారెడ్డి, షేక్ షబ్బీర్, మెస్ భాస్కర్రెడ్డి, ఆకుతోట సుబ్బారెడ్డి, నిడిగింటి చిట్టిబాబు, తన్నమాల రమణయ్య, కావేరిపాకం అశోక్కుమార్, కాలగంద సునీల్, పేట చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
రూ.50 వేలు చందాకు హిజ్రాల డిమాండ్
నాగలాపురం: మండలంలోని వజ్జావారి కండ్రిగ గ్రావెల్ క్వారీ వద్ద సోమవారం కొందరు హిజ్రాలు ఓం శక్తి మాల ధరించి మలయనూర్ అమ్మవారి గుడికి వెళుతున్నామని రూ.50 వేలు చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఆ గ్రావెల్ క్వారీ యజమాని రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. హిజ్రాలు తమకు రూ.5 వేలు వద్దు..రూ.50 వేలు కావాలని మొండి పడి డిమాండ్ చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు క్వారీ వద్దకు చేరుకుని హిజ్రాలను పోలీసు స్టేషన్కు తరలించారు. ఇంకెప్పుడు ఇలా డబ్బులు డిమాండ్ చేయమని హిజ్రాలు పోలీసులను బతిమలాడడంతో పోలీసులు వారి పేర్లు, వివరాలు తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. -
గుండె మంటలు.. ఆకలి కేకలు!
తిరుపతి జిల్లా, కపిలతీర్థం సమీపంలోని శివజ్యోతి నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంధుల శరణాయంలోని బధిరులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్కు విచ్చేసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీకి సమస్యలు మొరపెట్టుకున్నారు. చూపు లేదు.. కానీ గుండె నిండా ఆవేదన ఉందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ అంధుల శరణాలయంలో నిలువ నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ వేధింపులు భరించలేక పోతున్నామని వాపోయారు. అంధుల శరణాలయం నుంచి విచ్చేసిన మర్రిపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘అయ్యా మాకు చూపు లేదు.. ఏడీ వినోద్కుమార్కు మేమంటే ఇంత అలుసా..?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే దిక్కెవరు అని ప్రశ్నించారు. ఏడీ తమపై అమానవీయంగా వ్యవహరిస్తున్నారని, శరణాలయంలో సమయానికి భోజనం కూడా పెట్టడం లేదన్నారు. ఏమి అడిగినా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ప్రశ్నిస్తే మానసిక వేధింపులు, బెదిరింపులే సమాధానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే న్యాయం చేయాలంటూ కలెక్టర్ను ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు అందులు పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సమస్యను విన్నవించేందుకు వెళుతున్న అంధులు ఏడీ వేధింపుల నుంచి కాపాడాలని కన్నీరు మున్నీరవుతున్న అంధులు -
చూతము రారండి..
శ్రీకాళహస్తి: పంచలింగాల్లో వాయులింగ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మూగజీవులు ముక్తి పొందిన దివ్యక్షేత్రంగా.. భక్తుల పాలిట భూకై లాసంగా.. శ్రీకాళహస్తి విరాజిల్లుతోంది. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ విశేషోత్సవాలు మంగళవారం భక్త కన్నప్ప ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం కానున్నాయి. ఈశ్వరునిపై అచంచల భక్తి,విశ్వాసాలు చాటిన భక్త కన్నప్పకు తొలి పూజ నిర్వహించిన తరువాతే ఈ దివ్యోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఒక్కొక్క రోజును ఒక్కొక్క రాత్రిగా పరిగణిస్తూ ఉత్సవాలను జరపడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. స్వర్ణముఖి నది వంతెనపై నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం రాత్రి శోభాయమానంగా దర్శనమిచ్చింది. నేటి నుంచి మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ, 11న శ్రీకాళహస్తిశ్వరస్వామి ధ్వజారోహణం, వెండి అంబారి వాహనసేవ, 12న ఉదయం స్వామివారు సూర్యప్రభ అమ్మవారికి చప్పర వాహనసేవ, 13న ఉదయం హంస, యాళి వాహనసేవ, రాత్రి రావణ మయూర వాహనసేవ 14న ఉదయం హంస, శుక వాహనసేవ, రాత్రి శేష, యాళి వాహనసేవ, 15న మహాశివరాత్రి, ఉదయం ఇంద్ర విమానం, చప్పర సేవ, రాత్రి నంది సేవ, సింహ వాహనసేవ, 16న రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరగనుంది. 17న ఉదయం అధికార నంది, కామధేనువు, రాత్రి గజ, సింహవాహనసేవ, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం, 18న ఉదయం రుద్రాక్ష , అంబారి సేవ, రాత్రి సభావతి కల్యాణం, 19న అంబారి వాహనసేవ, రాత్రి ఆశ్వం, సింహ వాహన సేవ, 20న ధ్వజావరోహణం, 21న వల్లకీ సేవ, 22న ఏకాంత సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో నేడు భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ (మాఘ బహుళ అష్టమి) మధ్యాహ్నం 2.55గంటల నుంచి ప్రారంభం ఉభయదాతలు శ్రీబోయ కులస్తుల వారి సంఘం, శ్రీకాళహస్తి. -
స్వామి అమ్మవార్లకు వస్త్రాల బహూకరణ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారికి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలంకరించేందుకు చైన్నెకు చెందిన దొరై నాగరాజన్ అనే వ్యాపారవేత్త సోమవారం పట్టువస్త్రాలను అందజేశారు. వీటిని ఆలయ ఈఓ బా పిరెడ్డి స్వీకరించారు. దాతకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చే శారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వా మి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీసిటీని సందర్శించిన ఎస్పీఎంజీ బృందం శ్రీసిటీ (వరదయ్యపాళెం): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (ఎస్పీఎంజీ) అధికారుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించి, కీలక పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించింది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య ప్రాజెక్టుల సమయానుకూల అమలును పర్యవేక్షించడం, వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ గ్రూప్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎస్పీఎంజీ బృంద సభ్యుడు హర్షద్ పోలాకి నేతృత్వంలో శ్రీసిటీలో పర్యటించి, ప్రధాన ప్రాజెక్టుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్రీసిటీలోని అక్సెలెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సమీపంలోని అపోలో టైర్స్ పరిశ్రమల నిర్మాణాల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఎస్పీఎంజీ చేపడుతున్న ఈ తరహా సమీక్షలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. -
ప్రైవేటు బస్సు డ్రైవర్కు గుండెపోటు
బుచ్చినాయుడుకండ్రిగ: శ్రీకాళహస్తి నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అరిగిలకండ్రిగ వద్ద వెళుతుండగా డ్రైవర్కు విధినిర్వహణలోనే ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. స్పందించిన ప్రయాణికులు, కండెక్టర్ బీఎన్ కండ్రిగ పీహెచ్సీకి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో తిరువళ్లూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని అరిగిలకండ్రిగ గ్రామం వద్ద కేటీరోడ్డుపై బస్సు నడుపుతుండగా డ్రైవర్ అమ్ముల్రాజ్ అకస్మాత్తుగా చాతినొప్పి రావడంతో అస్వస్తతతకు గురి అయ్యాడు. డ్రైవర్ గుండెనొప్పిగా ఉందని కండక్టర్కు చెప్పారు. దీంతో కండక్టర్ హూటహూటిన బస్సును నడుపుకుంటూ బుచ్చినాయుడుకండ్రిగ పీహెచ్సీకి తీసుకువచ్చారు. పీహెచ్సీలోని వైద్యులు మురళీరెడ్డి, ఉదయ్లు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ అమ్ముల్రాజ్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం చంద్రగిరి: ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన వేదాంతపురంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రేణిగుంట భగత్సింగ్ కాలనీకు చెందిన వీరేష్(35), వేదాతంపురంలోని ఓ భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న మట్టిగుట్ట ఒక్కసారిగా కుప్పకూలి వీరేష్పై పడింది. ఈ ప్రమాదంలో వీరేష్ మట్టిగుట్టలో కూరుకుపోయాడు. తోటి కార్మికులు కేకలు వేయడంతో, జేసీబీ సాయంతో వీరేష్ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న కార్మిక సంఘం నేతలు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి భవన నిర్మాణ కాంట్రాక్టర్ రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగిసిన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు తిరుపతి తుడా: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ –2026 పోలింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికలను ఉదయం 8 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత వైద్యుల సంఘం ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వైద్యులు (ప్రభుత్వ, ప్రైవేటు) మొత్తం సుమారు 85 వేల మంది ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో 4 ప్యానెళ్ల పోటీ చేశాయి. 84 మంది వైద్యులు ఎన్ని కల్లో పోటీకి దిగారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు వైద్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. గుండెపోటుతో ప్రయాణికుడి మృతి చంద్రగిరి:గుండె పోటుతో ప్రయాణికుడు మృతి చెందిన ఘటన సోమవారం ఐతేపల్లి సమీపంలో చో టు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూ రు సమీపంలోని హసన్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(48) విశాఖప ట్నంలోని ఓ హోటల్లో వంట కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయల్దేరాడు. ఐతేపల్లి వద్ద వెళుతున్న సమయంలో చంద్రశేఖర్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తోటి ప్రయాణికులు చంద్రశేఖర్ను వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసుల కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చే రుకున్న ఎస్ఐ ప్రవళిక మృతదేహాన్ని పరిశీలించి, చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మఠం భూముల్లో ఆక్రమణలపై సీఎంకు లేఖ
తిరుపతి రూరల్: గాంధీపురం పంచాయతీలోని మఠం భూముల్లో జరిగే భూ ఆక్రమణలను అరికట్టాలని, భూ ఆక్రమణ దారుడు రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబుకు సీపీఎం నేతలు లేఖలు రాశారు. సోమవారం సీపీఎం కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి రాసిన లేఖలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత జయచంద్ర మాట్లాడుతూ పేదల భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, మఠం భూములను కాపాడాలని కోరారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వేనంబర్ 13లో 1.09 ఎకరాల భూమిని 32 మంది రజకులు 2014లో కొనుగోలు చేశారని, ఆ భూమిని రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి దౌర్జన్యంగా ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. అడ్డుకునేందుకు వెళ్లిన పేదలపై రౌడీలతో పేదలపై దాడి చేయిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కార్యాలయం స్పందించి ఆ భూమిని కాపాడాలని, పేదలకు న్యాయం చేయాలని కోరుతూ లేఖలు రాసినట్టు తెలిపారు. లేఖల ప్రదర్శన కార్యక్రమంలో మహేష్, రమేష్, ఏలుమలై, పుష్ప, శంకర, చంద్ర, చంద్రారెడ్డి సతీష్, నరసింహ, శేఖర్, కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. -
చౌకదుకాణాల్లో నూనె ఊసేలేదు
పేదోడి సూపర్మార్కెట్గా పిలుస్తున్న చౌకదుకాణాల్లో నూనె విక్రయాల ఊసేలేకుండా పోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో ప్రతి నెలా క్రమం తప్పకుండా బియ్యంతోపాటు నూనె, కందిపప్పు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో 20 నెలలుగా కేవలం బియ్యంతో సరిపెట్టేస్తున్నారు. అరకొర చక్కర ఇస్తున్నారు. కందిపప్పు, నూనె ధరలు పెరుగుతున్నాయని, రాయితీతో ఇవ్వలేమంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో పేదలు నూనె, కందిపప్పును అధిక ధరలు చెల్లించి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి చోటుచేసుకుంది. – నీలా, గృహిణి, తిరుపతి నెలనెలా వేరుశనగ నూనె ధర పెరిగిపోతుంది వేరుశనగ నూనె దశాబద్దాలుగా వాడుతున్నాం. అయితే ప్రతి వారం వేరుశనగ పప్పులు, నూనె ధరలు పెంచేస్తున్నారు. ఎందుకంటూ ప్రశ్నిస్తే జిల్లాలో వేరుశనగ పంట సాగుచేయడం లేదని, దాంతో ఉత్పత్తులు లేవంటున్నారు. మరోవైపు వేరుశనగ దిగుమతులు తగ్గాయంటున్నారు. వాటితో పేదోడికి ఎమీటీ సంబంధం. మాకు రూపాయి తగ్గిస్తే సంతోషపడతాం. రూపాయి పెంచితే బాధపడుతాం. ఈ ప్రభుత్వంలో పేదోడి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. – మొగిలి ధనలక్ష్మి, గృహిణి చిట్టమూరు -
ప్రభుత్వ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ–పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సీఎండీ శివశంకర్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఆధునిక సాంకేతికతతో మరింత మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు స్మార్ట్ మీటర్లను ఆమర్చడం జరుగుతోందన్నారు. సంస్థ పరిధిలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో 16,802 తిరుపతి జిల్లాలో 19,460, చిత్తూరు జిల్లాలో 13,871, అన్నమయ్య జిల్లాలో 13,311, కడప జిల్లాలో 16,829, అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717, కర్నూలు జిల్లాలో 10,457, నంద్యాల జిల్లాలో 9,836 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు తెలిపారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, ప్రీ–పెయిడ్ మీటర్లకు రీచార్జ్ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, తదనుగుణంగా విద్యుత్ను ఆదా చేయడంతో బిల్లును కూడా తగ్గించుకోచ్చన్నారు. అలాగే విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. దశలవారీగా మిగిలిన కేటగిరీల వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు చేపడుతామన్నారు. డయల్ యువర్ సీఎండీకి 39 వినతులు ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ సీఎండీకి 39 వినతులు అందాయని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సంస్థ డైరెక్టర్లు గురవయ్య, పి.అయూబ్ ఖాన్, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, ఆర్ పద్మ, జే రమణాదేవి, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్, ఎం.కృష్ణారెడ్డి, కే సంపత్ కుమార్, సీహెచ్ రామచంద్ర రావు, జనరల్ మేనేజర్లు సురేంద్రరావు, జగదీష్, చక్రపాణి, లత తదితరులు పాల్గొన్నారు. -
రాగన రామాపురం వాసికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు
సైదాపురం: సామాజిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందించినందుకు సైదాపురం మండలం రాగన రామాపురం గ్రామానికి చెందిన కూరాకు గోపికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు దక్కింది. హైదరాబాద్లోని ఎీల్వీ ప్రసాద్ ల్యాబ్లో ఆదివారం సాయంత్రం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రత్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్–19, హుద్ హుద్ తుపాన్ వంటి విపత్కర పరిస్థిలోనే కాకుండా గత 8 సంవత్సరాల నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రక్తదాన శిబిరాలు, చెట్లు, నాటడం, చలివేంద్రాలు తదితర సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందించారు. ఈ సందర్భంగా కురాకు గోపి తనని అవార్డుకు ఎంపిక చేసిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నెల్లూరు తిరుపతి జిల్లాలో కో–ఆర్డినేటర్ మోపూరు భాస్కర్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. -
సోమవారం ప్రజా సేవలు బంద్
తిరుపతిఅర్బన్: సీఎం చంద్రబాబు 2047 విజన్ స మీక్ష అంటూ జిల్లాలోని ఉద్యోగులందరూ వర్చువల్ పద్ధతిలో హాజరుకావడంతో సోమవారం ప్రజా సేవ లు బంద్ అయ్యాయి. సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అన్ని విభాగాలకు చెందిన హెచ్ఓడీలు హాజరయ్యారు. అలాగే ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆ యా రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొ న్నారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు సమీక్షలో ఉన్నారు. గ్రామ సచివాలయ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమీక్షలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా సీఎం స మీక్షతోనే డ్యూటీలను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యత కీలకం
తిరుపతి అర్బన్: ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావుతో కలసి భారతీయ రిజర్వ్ బ్యాంక్కి చెందిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాట్లు పెంపొందించుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందడానికి ప్రజల్లో అవగాహన పెంచాల ని తెలిపారు. బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రవికుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు, మధుసూదన్ పాల్గొన్నారు. తిరుపతి ఐసర్తో మెల్బోర్న్ వర్సిటీ ఎంఓయూ ఏర్పేడు: ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ యూనివర్సిటీతో తిరుపతి ఐసర్ విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య, మెల్బోర్న్ గ్లోబల్ సెంటర్ ఢిల్లీ డైరెక్టర్, మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ డిప్యూటీ ప్రో వైస్చాన్సలర్ (ఇంటర్నేషనల్) ప్రొఫెసర్ ముత్తు పాండియన్ అశోక్కుమార్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో చురుకై న పరిశోధన, విద్యా సహకారానికి మద్దతు ఇవ్వడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మెల్బోర్న్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ అకాడమీ కింద తిరుపతి ఐసర్, మెల్బోర్న్ యూనివర్సిటీ జాయింట్ పీహెచ్డీ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నాయన్నారు. -
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్.. జనసేన హైడ్రామా
తిరుపతి: కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన హైడ్రామా కొనసాగుతోంది. రేపు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) మరోమారు రైల్వే కోడూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీధర్తో పాటు కార్యకర్తలను సదరు కమిటీ విచారించింది. అయినా ఇంతవరకూ పార్టీకి నివేదిక ఇవ్వలేదు త్రిసభ్య కమిటీ.ఇదిలా ఉంచితే,. నిన్నటి జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అంటూ లీకులిచ్చారు. అదే సమయంలో అరవ శ్రీధర్ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైప బాధిత మహిళపై పోలీసు కేసులతో పాటు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు వెలుగుచూస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం చేసినదంతా చేసి పార్టీకి సంబంధం లేదంటూ కొత్త డ్రామాకి తెరలేపాడు. -
చెరువును పంచేసుకుంటున్నారు
తిరుపతి నగరంలో అతి విలువైనది కొంకచెన్నాయిగుంట చెరువు. ఈ ప్రాంతంలో నివాసస్థలాలకు మంచి డిమాండ్ ఉండడంతో టీడీపీ, జనసేనకు చెందినవారు ఆక్రమించుకున్నారు. గతంలో మాజీ సైనికోద్యోగులకు పట్టాలు ఇచ్చినా... వారినీ ఆ స్థలంలోకి అడుగుపెట్టనివ్వలేదు. అంతటితో ఆగని పచ్చ బ్యాచ్ ఏకంగా మాజీ సైనికోద్యోగులు తమకు అమ్మినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారు. ప్లాట్లు వేసి అమ్మి సొమ్ము చేసుకున్నారు. చెరువు ఆక్రమణకు గురైందని పలుమార్లు మీడియా, పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతీసారి రెవెన్యూ అధికారులు వచ్చి తాత్కాలిక షెడ్లు తొలగించి చేతులు దులిపేసుకుని వెళ్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్కి కూతవేటు దూరంలో కొంకచెన్నాయిగుంట చెరువు పోరంబోకు ఉంది. వైఎస్ఆర్ సీపీ హయాంలో మాస్టర్ప్లాన్ రోడ్లు వేయడంతో నగరం అనూహ్యంగా విస్తరిస్తోంది. ఈ చెరువు పోరంబోకు ఇప్పుడు అత్యంత విలువైనదిగా మారింది. కోట్ల రూపాయలు విలువజేసే ఈ చెరువును ఆక్రమించుకుని అమ్మి సొమ్ము చేసుకునేందుకు టీడీపీ, జనసేన నేతలు పక్కా పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 1992లో 35 మంది స్వాతంత్య్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం ఆ చెరువు పోరంబోకు భూమిని నివాస స్థలాల కోసం పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన వారు పక్కాగృహాలు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే అంతకు ముందే మరో 13 మంది ఆ చెరువు పోరంబోకు భూమిని 1983లో తమకు విక్రయించారని మరో వర్గం వారు అడ్డుకున్నారు. మళ్లీ ఆక్రమణలు అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ, జనసేన నాయకులు కొందరు ఆ చెరువు పోరంబోకు భూమిపై కన్నుపడింది. కొంకచెన్నాయిగుంట చెరువు వివరాలన్నీ తెలిసిన కూటమి నాయకులు సీపీఐ, సీపీఎంకి చెందిన కొందరి సహకారంతో రంగంలోకి దిగారు. తమకు ఇచ్చిన నివాస స్థలాలను స్వాతంత్య్ర సమరయోధులే వచ్చి 35 మందికి విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చెరువు పోరంబోకు భూమిని ప్లాట్లుగా విక్రయించడం ప్రారంభించారు. అంకణం రూ.25 వేల నుంచి రూ.50 వేలతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రూ.లక్ష చొప్పున విక్రయిస్తున్నారు. అప్పట్లో దీనిపై సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించారు. ఈ చెరువు ఆక్రమణకు గురైనప్పుడు స్థానికులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తాము ఎవ్వరికీ పట్టాలివ్వలేదని స్పష్టం చేశారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని తీర్పు కూడా ఇచ్చారు. మేం చూసుకుంటాం.. కానిచ్చేయండి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నేతలు మరోసారి కొంకచెన్నాయిగుంట చెరువుపై దృష్టి పెట్టారు. నకిలీ పత్రాలతో నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. పత్రికలు, మీడియాలో వచ్చేలోపు నిర్మాణాలు పూర్తి చేసి విద్యుత్ మీటర్, ఇంటి పన్ను తీసుకోమని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. అక్రమార్కులు హడావిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధుల పీఏలు రంగంలోకి దిగడం గమనార్హం. -
కల్తీని కడిగేద్దాం!
కూటమి పాపాలపై ఆ దేవదేవుడే శిక్షిస్తాడు తిరుపతి మంగళం: శ్రీవారి లడ్డూ ప్రసాదం చేసే నెయ్యిలో కల్తీ జరగలేదని, చంద్రబాబు, పవన్కళ్యాణ్ మనసులే కల్తీ అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్కుమార్, ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్ ధ్వజమెత్తారు. తిరుపతిలో లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద నుంచి అలిపిరి వరకు కూటమి నాయకులు అపవిత్రం చేస్తూ నడిచిన రోడ్లను ఆదివారం వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, మహిళలు పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెట్టేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదంతో నీచ రాజకీయం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తూ, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్ మాట్లాడుతూ తిరుపతి పుణ్య క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో పాటు కూటమి నాయకులు పసుపు దుస్తులు ధరించి దొంగ దీక్షలతో తిరుపతిలో పాదయాత్ర చేపట్టి నెయ్యిలో కల్తీ చేశారంటూ నమ్మబలికించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లడ్డూ భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పుల్లయ్య, తలారి రాజేంద్ర, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, దినేష్రాయల్, పార్టీ సీనియర్ నాయకులు తుడా వెంకటరెడ్డి, నాయకులు రాజేష్, కడపగుంట అమరఽనాఽథ్రెడ్డి, చంద్రయ్య, వెంకటేష్రాయల్, కోటి, స్వరూప్, ఆటో ప్రసాద్, బాలాజీ, ధనశేఖర్, విజయలక్ష్మి, పద్మజ, శాంతారెడ్డి, పునీత, పుష్పాలత, యశోద, పావని తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్: ఈ నెల 4వ తేదీన విధులు నిర్వహిస్తున్న ఓబనపల్లి వీఆర్ఏ మణెయ్యపై ఇద్దరు కారంపొడి చల్లి కత్తితో పొడిచి పారిపోయారు. ఈ కేసులో నిందితులను ఆదివారం సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యలో అనంతరాజుపేట వద్ద అరెస్ట్ చేశారు. వారి నుండి ఆయుధాలు, మోటార్సైకిల్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన నిందితులు అనరాతి శ్రీనివాసులు, కులశేఖర్ పాత కక్షలు మనసులో పెట్టుకొని మణెయ్యపై దాడి చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న మణెయ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. -
భూమి.. అధికార పార్టీ పరం!
రేణిగుంట: పట్టణంలోని అధికార పార్టీలోని ఒక వర్గం వివేకానంద కాలనీ పక్కన గత ప్రభుత్వంలో నిర్మించుకున్న 22 ఇళ్లపై కన్నేసింది. ఆ ఇళ్లను ఎలాగైనా తొలగించి తాము సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తి తెస్తున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో 22 ఇళ్లను వాగు పోరంబోకులో నిర్మించుకున్నాని, గత వారంలో నోటీసులు అంటించారు. ఆదివారం తెల్లవారుజామున జేసీబీలు తీసుకొని వచ్చి అన్ని ఇళ్లను నేలమట్టం చేశారు. రెవెన్యూ వారు చెబుతున్నట్లు 769 సర్వేనెంబర్ లో వివేకానంద కాలనీ ఏర్పాటు దాదాపు 30 సంవత్సరాలైంది. కాలనీకి ఉత్తరాన కాలువ ఉండగా కాలనీకి దక్షిణాన ప్రైవేట్ భూమికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో గత ప్రభుత్వంలో పట్టణానికి చెందిన వారు అప్పటి రెవెన్యూ అధికారుల అనుమతితో రేకుల ఇళ్లను నిర్మించుకున్నారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నిర్మించుకున్నారనే కక్షతో పాటు ఆ భూమిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో పట్టణానికి చెందిన అధికార పార్టీలోని ఒక వర్గం నాయకులు పన్నాగం పన్ని అడుగులు వేస్తున్నారు. వాగు పొరంబోకుని అధికార పార్టీలోని ఒక వర్గం నాయకుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
సైదాపురం: చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ వెంకటగిరి నియోజవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా చంద్రబాబు, పవన్ కల్యాణ్లతోపాటు ఇప్పుడు పయ్యావుల కేశవులు కూడా తమ తీరును అస్సలు మార్చుకోవడం లేదన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంపై నిరాధారమైన ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎవరూ తప్పు చేయలేదని, జంతువుల కొవ్వు కలపలేదని క్లీన్ చిట్ కూడా ఇచ్చారన్నారు. హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి నేతలు బరి తెగించి మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నెయ్యి కల్తీ జరిగిందనే భ్రమలో ప్రజలను ఉంచేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడరాని పాట్లు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో చిట్టేటి హరికృష్ణ,ఽ బాలయ్య, ధనియాల రాధ, శ్రీనివాసులురెడ్డి, ఆరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహా శివరాత్రికి సర్వం సిద్ధం
శ్రీకాళహస్తి: మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తిలో సర్వం సిద్ధమైంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నుంచి 14రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం ముక్కంటికి ప్రియభక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆదివారం నాటికి మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ధూర్జటి కళాప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభంశ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు 10న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరగనుంది. 11న స్వామివారి ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 16న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 17న శివపార్వతుల కల్యాణం, 19నన గిరిప్రదక్షిణ, 21న పల్లకీసేవ, 22న ఏకాంతసేవ, 23న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
నేడు పీజీఆర్ఎస్ రద్దు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సి ఉన్న పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం(8వ తేదీ) ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, డివిజన్ స్థాయి అధికారులు, తహశీల్దార్లుతో సమీక్ష ఉందని తెలిపారు. ఈ క్రమంలో పీజీఆర్ఎస్ను సోమవారం రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని వివరించారు. ధ్వనులపై పరిశోధకుల అధ్యయనం ఏర్పేడు: మండలంలోని జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో వారం రోజులపాటు అడ్వాన్స్డ్ బయో అకౌస్టిక్స్ వర్క్షాపు ముగిసింది. న్యూయార్క్కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయం కెలిసా యాంగ్ సెంటర్ ఫర్ కన్జర్వేషన్ బయోఅకౌస్టిక్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జంతు, మానవుల ధ్వనుల అధ్యయనాలపై పరిశోదకులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. వర్క్షాప్లో భాగంగా ఆదివారం రేణిగుంట మండలం మామండూరు అటవీ క్షేత్రాన్ని పర్యటించి, అక్కడ వృక్షాలపై ఉన్న జంతుజాలాల ధ్వనులపై అధ్యయనం చేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,777 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఘనంగా స్పోర్ట్స్ డే తిరుపతి తుడా: స్విమ్స్ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూనిఫెస్ట్–2026 పేరుతో స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్విమ్స్ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్తోపాటు శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మట్లాడుతూ స్విమ్స్ 33వ వార్షికోత్సవం సందర్భంగా నెల రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందుతో భాగంగా స్పోర్ట్స్ డేని నిర్వహించామన్నారు. క్రీడాపోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన వైద్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ అలోక్ సచిన్, రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్లా, ప్రిన్సిపల్ డాక్టర్ ఉషాకలవత్, స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సుభాష్, వైద్యాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
పరశురామేశ్వరునికి మహత్కార్యం
●ఏర్పేడు: గుడిమల్లం పరశురామేశ్వరాలయం.. దేశంలోనే తొలి శైవక్షేత్రం. క్రీ.పూ.2వ శతాబ్ద కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన పరశురామేశ్వరుని విగ్రహం శోభాయమానం. ఈ ఆలయ మహా కుంబాభిషేక మహోత్సవం గతంలో ఎప్పుడు నిర్వహించారో తెలిపేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అలాంటి మహత్తర ఘట్టానికి శివాజ్ఞ లభించింది. ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు పరశురామేశ్వరుని మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఇదీ చరిత్ర పరశురామేశ్వర స్వామివారి విగ్రహం స్వయంభువుగా వెలసి 5 అడుగుల పురుషలింగాకృతిలో కనిపిస్తుంది. విగ్రహంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసావతారంలో బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవ పురుషలింగాకృతిలో ఈశ్వరుడితో విగ్రహం ఉంది. నవపాషాణ శివలింగం(9 రకాల విష పదార్థాలతో కూడిన లింగం) దేశంలో మరెక్కడా లేదు. గుడిమల్లం పరశురామేశ్వరుని ఆలయ నిర్వహణ ఎన్నో ఏళ్లుగా కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షిస్తోంది. చివరిసారిగా ఇక్కడ ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం ఎప్పుడు జరిగందనే ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలేమీ లేవు. అయితే మహాకుంబాభిషేక మహత్కార్యం నిర్వహించేందుకు శివాజ్ఞ లభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23వ తేదీన 60 మంది పూజారులతో ఆలయ మహాకుంభాభిషేకం చేయనున్నారు.ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వరాలయం (ఇన్సెట్) గర్భాలయంలోని పరశురామేశ్వరుని విగ్రహంశివయ్య అనుగ్రహం గతంలో ఎప్పుడు చేశారో కూడా తెలియని గొప్ప దైవకార్యం గుడిమల్లం ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవానికి శివయ్య అనుగ్రహంతో నభూతో.. నభవిష్యతి అన్న రీతిలో జరగనుంది. గుడిమల్లం క్షేత్రంలో పూర్వపు ఆలయ కళాసౌందర్యం ఏమాత్రం దెబ్బతినకుండా పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. – వంశీకృష్ణ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు జన్మ చరితార్థం గుడిమల్లం పరశురామేశ్వరాలయ మహాకుంభాభిషేక మహోత్సవం జరిపించే అవకాశం పరమశివుడు నాకు కల్పించడం పూర్వ జన్మసుకృతం. చారిత్రక ఘట్టానికి సంబంధించి ఆలయంలో పనులు జరుగుతున్నాయి. ఈ వేడుకను నిర్వహించడంతో నా జన్మ చరితార్థమవుతుంది. – రామచంద్రారెడ్డి, ఈఓ, గుడిమల్లం ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా మహా కుంబాభిషేకం గుడిమల్లం పరశురామేశ్వరాలయ కుంబాభిషేక మ హోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదాయశాఖ, పురావస్తు శాఖ సమన్వయంతో ఈ వేడుకలో పాల్గొనే సువర్ణావకాశం దక్కడం ఎన్నో జన్మల పుణ్యఫలం. – బత్తల గిరిబాబు, గుడిమల్లం ఆలయ చైర్మన్ -
కాసులు ఇస్తేనే.. అటెండెన్స్ మ్యాపింగ్!
తిరుపతి తుడా: తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. చేయితడిపితే చాలు ఏ పని కావాలన్నా క్షణాల్లో పని అయిపోతుంది. డిప్యూటేషన్పై పనిచేస్తున్న సీసీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని శాసిస్తున్నారు. సరెండర్ లీవ్ బిల్లు అనుమతి కావాలంటే ఒక్కొక్క ఉద్యోగి రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిందే. వైద్యులైనా, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులైనా సరే లంచం చెల్లిస్తేనే ఫైలు కదులుతుంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ, సూపరింటెండెంట్, యూడీసీలకు వేర్వేరు ఽమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏదో ఒక సాకుతో పెండింగ్లో పెట్టి కాళ్లు అరిగేలా తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. దీంతో ఉద్యోగులు ఎందుకు ఆ తలనొప్పిని వారు చెప్పిన డబ్బులు ముట్టజెప్పి పనులు చేసుకుని వెళ్తున్నారు. -
రీసర్వేలో న్యాయం జరగలేదు
ఈ రైతు పేరు ఫాల్గుణరెడ్డి. తిరుపతి రూరల్ మండలం కూపుచంద్రపేట గ్రామానికి చెందిన రైతుకు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆ భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం రావడం లేదు. దీనికి కారణం ఆ భూమి ఇనాం భూములుగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కింది. రీసర్వే పూర్తి చేసిన తరువాత పట్టాదారు పాసు పుస్తకం వస్తుందని ఆ రైతు ఎంతో ఆశపడ్డాడు. రీసర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంత వరకు పట్టాదారు పాసుపుస్తకం రాలేదు. పట్టాదారు పాసుపుస్తకం రాకపోవడానికి ప్రధాన కారణం రీసర్వే ప్రక్రియ ద్వారా ఆన్లైన్ కరెక్షన్ చేయడానికి వెబ్ ల్యాండ్లో అవకాశం లేకపోవడమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ రైతు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం కోసం ఎదురు చూస్తూనే ఉ న్నాడు. సమస్యలకు లేదు పరిష్కారం వరదయ్యపాళెం: ఇతని పేరు అత్తిపట్టు రాంబాబు. వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది. తొలివిడతలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తండ్రి పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమి పూర్తిస్థాయిలో ఇతని పేరిట ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు కాలేదు. ఆయన తల్లి పేరిట ఒకటిన్నర ఎకరానికి గత ఏడాది ఈ–పాస్బుక్ వచ్చింది. అయితే ప్రస్తుత నూతన పాసుపుస్తకాల్లో ఆమె పేరు లేదు. కేవలం అతని పేరిట 55 సెంట్లకు మాత్రమే పాసుపుస్తకం వచ్చింది. ప్రస్తుతం రీసర్వే కార్యక్రమంలో తన పేరిట మార్చుకునేందుకు ఆన్లైన్లో ఆప్షన్ విడుదల చేయలేదు. తప్పుల తడకగా రీ సర్వే ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు చంద్రశేఖర్. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట సమీపంలోని వడ్డిపల్లి. ఇతనికి భాకరాపేట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 180/బిలో 2.18సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. రీసర్వే ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఆ విస్తీర్ణం 2.05 ఎకరాలకు కుదించారు. తన భూమి ఎందుకు తగ్గిందని ఆ రైతు అడిగితే అదంతేనని చెప్పి సర్వేయర్లు వెళ్లిపోతున్నారు. దీనికి కారణం రీసర్వే ప్రక్రియలో యంత్రాలు పెట్టి డ్రోన్ల సాయంతో కొలతలు వేయడం, సరిహద్దులు సరిగా గుర్తించక పోవడంతోనే విస్తీర్ణం తగ్గిపోయిందని ఆ రైతు ఆరోపిస్తున్నారు. తహశీల్దార్కు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఆయనకు జవాబు చెప్పే వారు లేరు. -
లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరగలేదు: జనసేన ఎమ్మెల్యే
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ‘ఎన్డీడీబీ, సిట్ నివేదికలలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు’ అని ఆయన స్పష్టంచేశారు. జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్తూ ఆ స్వామివారే ఆయన నోట పలికించారని నెటిజన్లు, జనం అభిప్రాయపడుతున్నారు. -
తిరుమల ప్రసాదంపై బాబు, పవన్వి నీచ రాజకీయాలు
తిరుపతి మంగళం: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్ మండిపడ్డారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను నిరసిస్తూ ఆదివారం తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద రోడ్లను వైఎస్సార్సీపీ శ్రేణులు పసుపునీళ్లతో కడిగి శుభ్రం చేశాయి. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాలు చేస్తోన్న కూటమి నేతలను నీవే శిక్షించు వేంకటేశ్వరా అంటూ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. అజయ్కుమార్ మాట్లాడుతూ..సీబీఐ తన విచారణలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని, అయినా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు శ్రీవారి లడ్డూపై చేసిన తప్పుడు ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి జంతువుల కొవ్వు కాదు బాత్రూం శుభ్రపరచడానికి వాడే కెమికల్స్ ఉపయోగించారని మరో పచ్చి అబద్ధాన్ని చెప్పి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎన్డీడీబీ, సీబీఐ సిట్ నివేదికల్లో ఎక్కడా నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారని అజయ్కుమార్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే నోట శ్రీవేంకటేశ్వరస్వామే నిజాలను పలికించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భక్తుడిపై టీటీడీ సిబ్బంది దురుసు ప్రవర్తన
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ సిబ్బంది తీరు పలు వివాదాలకు దారితీస్తోంది. విజయవాడకు చెందిన పృథ్వీ ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చాడు. రూ.50 టికెట్ తీసుకుని క్యూలో దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన తన బ్యాగ్లో సెల్ఫోన్ ఉంచుకున్నాడు. లగేజీ స్కానింగ్ వద్ద ఆలయ సిబ్బంది పృథ్వీ బ్యాగ్లో సెల్ఫోన్ను గుర్తించి, అతడిని అడ్డుకుని, సెల్ఫోన్ను లాకర్లో ఉంచి రావాలని సూచించారు. క్యూలో ప్రవేశించే సమయంలో తనను ఎవరూ తనిఖీ చేయలేదని, సెల్ఫోన్ నిషేధం గురించి తనకు తెలియదని వారికి పృథ్వీ చెప్పాడు. ఆపై సిబ్బంది సూచనల మేరకు అత్యవసర గేటు నుంచి వెళ్లి సెల్ఫోన్ను లాకర్లో ఉంచాడు. అనంతరం అత్యవసర గేటు వద్దకు వచ్చి దర్శనానికి అనుమతించాలని సిబ్బందిని కోరాడు. అయితే ఇక్కడి నుంచి పంపించడం కుదరదని, తిరిగి క్యూలో రావాలని పృథ్వీకి సిబ్బంది చెప్పారు. గంటకు పైగా క్యూలైన్లో ఉండి తాను ఇక్కడ వరకు వచ్చానని, సెల్ఫోన్ ఉండడంతో మీ సూచనల మేరకు ఫోన్ను లాకర్లో ఉంచి వచ్చానని పృథ్వీ చెబుతున్నా అక్కడి సిబ్బంది వినలేదు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తనపై బూతులతో రెచ్చిపోయాడని బాధితుడు వాపోయాడు. పరుష పదజాలంతో దూషిస్తూ తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎందుకు బూతులు తిడుతున్నారని ప్రశ్నించగా.. అక్కడున్న సిబ్బంది అంతా తనను కొట్టి, బయటకు గెంటివేశారని వివరించాడు. తనపై దాడికి పాల్పడిన సిబ్బందిపై టీటీడీ చర్యలు తీసుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులపై ఇలా దాడులు చేసి, టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘ప్రభుత్వం కమ్మగానే ఉంది.. పాలన కూడా ఇంకా కమ్మగానే ఉంది’
తిరుపతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంలోని పదవుల కేటాయింపులపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. పాలన కమ్మగా ఉంది అంటే అందరికీ అర్థమై ఉంటుంది. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి పాలన కమ్మగానే ఉందని చెప్పారు. అదే విషయాన్ని మళ్లీ నేను చెబుతున్నా. ఎన్టీఆర్ పాలనపై గజ్జల మల్లారెడ్డి చెప్పిందే నేను చెబుతున్నా. కూటమి పాలన ఇంకా కమ్మగానే ఉంది. ఒక కులం కాకుండా.. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కమ్మతో పాటు అందరం ఉన్నాం. కులాలకు సంబంధంలేకుండా అందరినీ సమానంగా చూడాలి. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదు. కూటమిలో బీజేపీనే ప్రధానం..ఆ తర్వాతే టీడీపీ, జనసేన’ అంటూ వ్యాఖ్యానించారు. -
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య!
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో శనివారం రాత్రి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ జి.రవికుమార్ తెలిపిన వివరాలు.. కృష్ణానగర్లో నివసిస్తున్న శివశంకర్, పద్మజ (27) ఒకే కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజశ్రీ (7), లాస్య (4)ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో తేజశ్రీ 2వ తరగతి, లాస్య యూకేజీ చదువుతోంది. శివశంకర్ నిరుద్యోగి కావడంతో శనివారం ఉదయం శ్రీసిటీ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు.అయితే పిల్లలను విడిచిపెట్టామని మధ్యాహ్నం 2.30 గంటలకు పాఠశాల నుంచి శివశంకర్కు ఫోన్ వచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఉన్నానని తెలిసిన వారికి పిల్లలను తీసుకెళ్లాలని చెప్పాడు. వారు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన పద్మ జ పిల్లలను తీసుకెళ్లింది. అయితే సాయంత్రం ఇంటికి చేరుకున్న శివశంకర్ తలుపు కొట్టినా ఎంతకూ తీయకపోవడంతో కిటికిలోనుంచి చూడగా అమ్మా యి వేలాడుతూ కనిపించింది.దీంతో ఇరుగుపొరుగువారిని తీసుకువచ్చి తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లగా తల్లీ కుమార్తెలు విగత జీవులుగా వేలాడుతూ కనిపించారు. వారు అందించిన సమాచా రం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు.పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, శివశంకర్ను పెళ్లి చేసుకున్న పాపానికి తాను ఎన్నో కష్టాలపాలయ్యానని, ఊరంతా అప్పులే ఉన్నాయని.. పద్మజ సూసైడ్ లేఖలో పేర్కొంది. -
అర్హత ఉన్నా ఫలితం శూన్యం
మాది పెనుమూరు మండలం చెరువ ముందర ఊరు. నా భర్త పేరు జ్యోతిశ్వర్నాయు డు. మాకు పార్థీవ్ చౌదరి అనే కుమారుడు ఉన్నాడు. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి శరీరం మొత్తం సహకరించడం లేదు. చికిత్స కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేదు. పింఛన్ పొందేందుకు 90 శాతం అర్హత ఉన్నట్లు సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది. అయినా కొత్త పింఛన్ ఇవ్వడం లేదు. మండలం, జిల్లా అధికారుల చుట్టూ బిడ్డను ఎత్తుకుని ఎన్ని సార్లూ తిరిగినా న్యాయం జరగడం లేదు. కనీసం కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవరూ చెప్పడం లేదు. – కుమారుడు పార్థీవ్ చౌదరితో తల్లి ఎన్నిసార్లు తిరిగినా లాభం లేదు మాది తవణంపల్లి మండలం కృష్ణాపురం గ్రామం. పింఛన్ కోసం ఇప్పటికి వంద సార్లు అధికారులు అర్జీలు అందజేశాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ పొందలేని పరిస్థితిలో ఉన్నాను. కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. – దశరథ, కొత్త పింఛన్ బాధితుడు -
సెమీ కండక్టర్ల హబ్గా భారత్
నారాయణవనం: రాబోవు రోజుల్లో భారత దేశం సెమీ కండక్టర్లకు, క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సెమీ కండక్టర్ల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు జరిగిందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం రూ.9 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. డీఆర్డీఓ శాస్త్రవేత్త రామమూర్తి మాట్లాడుతూ ఆలోచనే ఇంజినీర్లకు గుర్తింపు తీసుకువస్తుందన్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సినీనటి నిథి అగర్వాల్ హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమాలలో కళాశాలల చైర్మన్ అశోకరాజు, వైఎస్ చైర్మన్ ఇందిరవాణి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. -
తిరుపతిలో తిరువళ్లూరు ముద్దాయిలు మకాం
తిరుపతి అర్బన్: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురు నాన్బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దాయిలు ఇటీవల తిరుపతిలో మాకాం వేసినట్లు సమాచారం ఉందని తిరువళ్లూరు కలెక్టర్ ఎం. ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తిరువళ్లూరు కలెక్టర్తోపాటు ప లువురు ఆ జిల్లా అధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పలు అంశాలపై సమీక్షించారు. తిరువళ్లూరు కలెక్టర్ మాట్లాడుతూ తమ జిల్లాలో పలు కేసులు ఉన్న పలువురు వ్యక్తులు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో వారికి అడ్డుకట్టవేయాల్సి ఉందని, మరోవైపు వారి సమాచారం లభించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూత వేయాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తప్పకుండా సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. నకిలీ ఓటర్లను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం దుకాణాలు తప్పకుండా మూత వేస్తామని చెప్పారు. అలాగే ఎస్సీ సుబ్బరాయుడు మాట్లాడు తూ నాన్బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దా యిలు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటే వారిని తప్పకుండా పట్టుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి, డీఆర్వో నరసింహులు, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి జిల్లా నుంచి పాల్గొన్నారు. -
ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి!
టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతూ.. చిత్తూరు అర్బన్ : ‘‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పింది. అదే సుప్రీం కోర్టు నేతృత్వంలో ఏర్పడిన సీబీఐ–సిట్ కమిటీ తొమ్మిది నెలలు విచారించి శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వు లేవని కోర్టుకు రాతపూర్వక నివేదిక ఇచ్చింది. ఇంకేం చెప్పాలి చంద్రబాబు నాయుడు..? మరేం రాయాలి..? మీ ప్రతి ఒక్క మా ట లో అసహనం, అభద్రత కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని హైందవ వ్యతిరేకిగా చూపిస్తూ, లడ్డూ అనే బాంబును ఆయుధంగా చేసుకుని వైఎస్సార్ సీపీపై బురద చల్లడానికి పవన్ కళ్యాణ్, పచ్చ పత్రికలతో కలిసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మీకు గుణపాఠం తప్పక చెబుతారు’’ అంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డితో కలిసి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సిట్–సీబీఐ కోర్టుకు ఇచ్చిన నివేదికలో 32 మందిని కల్తీ నెయ్యిలో బాధ్యులుగా చూపిందని, ఇందులో ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేసిందన్నారు. పైగా జంతుకొవ్వు లేదనే విషయాన్ని కూడా ప్రస్తావించిందన్నారు. ఈ నివేదికను జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు తన కుట్రలతో వైఎస్.జగన్మోహన్రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని.. ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త ఈ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019–24 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపై విచారించిన సిట్.. 2014–19 మధ్యలో సరఫరా చేసిన నెయ్యిపై సైతం దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటపడుతాయన్నారు. టీటీడీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డి, అటుపై వైఎస్ జగన్కే సాధ్యమయ్యిందన్నారు. చిత్తూరులో అమలు కావడం సంతోషం జిల్లా అనుబంధ కమిటీల టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను కాపాడుకోవాలని వైఎస్.జగన్ చెబుతున్న 2.0 కార్యక్రమం.. చిత్తూరులో అమలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యం వైఎస్.జగన్ హయంలోనే జరిగిందన్నారు. పార్లమెంటు పరిశీలకులు చవ్వా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న తప్పుల్లో సింహభాగం బాధ్యత పవన్ కళ్యాన్దేన్నారు. ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నారన్నారు. తన శిష్యుడు రేవంత్రెడ్డి కోసం రాయలసీమ ప్రాజెక్టులకు తాకట్టుపెట్టిన వ్యక్తిగా బాబు చరిత్రకెక్కారన్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ లడ్డూల విషయంలో బాబుకు తగిన శిక్ష శ్రీవారే విధిస్తారన్నారు. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారారని, వైఎస్సార్సీపీలో ఇక నుంచి కార్యకర్తలదే భవిష్యత్తన్నారు. గ్రామ కమిటీలు చెప్పిందే వైఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తారని, వాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు కెపి.శ్రీధర్, రూరల్ అధ్యక్షుడు జయపాల్, గుడిపాల అధ్యక్షులు ప్రకాష్, నాయకులు చంద్రశేఖర్, జ్ఞానజగదీష్, విజయసింహారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గాయత్రీదేవి, హరిణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభకు హాజరైన పార్టీ శ్రేణులవిజయానందరెడ్డితో కలసి ప్రసంగిస్తున్న భూమన కరుణాకర రెడ్డి కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతోందన్నారు. అమిత్ షా శిష్యుడు, ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి సభ్యుడు సౌరబ్ బోరా నాడు రూ.30 లక్షలు వెచ్చించి అయోధ్యకు లక్ష శ్రీవారి ల డ్డూలు తీసుకెళ్లాడని, అతను లడ్డూల తయా రీకి కల్తీ నెయ్యిను ఉపయోగించాడనే వి షయం పవన్ కళ్యాణ్కు సైతం తెలుసన్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వులు లేవని, వైఎస్.జగన్కు ఇందులో సంబంధంలేని మాట్లాడిన పవన్కళ్యాణ్.. రెండు రోజుల్లో మళ్లీ కొవ్వు కలిపారని, జగన్కు సంబంధం ఉందని చెప్పడం అబద్దాలతో రాజకీయం చేయడమేనని భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. -
22 కిలోల గంజాయి స్వాధీనం
– ముగ్గురి అరెస్టు వెంకటగిరి రూరల్: ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. పట్టణంలోని వెంకటగిరి పోలీసుస్టేషన్లో శనివారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి పెనుబర్తి గణేష్తోపాటు మరో ఐదుగురు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు రహస్య సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు తనిఖీ చేశారు. వారి వద్ద 22 కిలోల గంజాయిని ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఇద్దరు యువకులు పరారయ్యారు. ఇద్ద రు మైనర్ బాలురతోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశా రు. వారి వద్ద నుంచి 3 సెల్ఫోన్లు, 22 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్టు తిరుపతి రూరల్: మండలంలోని ఉప్పరపల్లి సమీపంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథ నం మేరకు.. ఉప్పరపల్లి వాటర్ ట్యాంకు వద్ద శనివారం రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తమ సిబ్బందితో అక్కడ కు చేరుకుని గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చే శారు. అతని వద్ద నుంచి 3.5 కేజీల గంజాయితో పా టు ఓ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిని విచారించగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కె. దుర్యోధన్రెడ్డిగా గుర్తించిన పోలీసులు తిరుపతిలో ఓ ఇంటి వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
10న వెటర్నరీ వర్సిటీలో కిసాన్ మేళా
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన ఐసీఏఆర్, ఎన్ఎంఆర్ఐ సౌజన్యంతో కిసాన్ మేళాను నిర్వహించనున్నట్లు పశు వైద్యకళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిసాన్ మేళాలో పశుసంవర్థక, వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖల వారీగా వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కిసాన్ మేళాలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రుణ సదుపాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు తిరుపతి అర్బన్: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని డీఆర్వో నరసింహులు, న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన అబ్జర్వర్ అజయ్జోషి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలోని రెండు సెంటర్లలో రెండు సెషన్స్ల్లో ఆదివారం పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఉదయం పేపర్–1 పరీక్ష 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–ఏ), శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–బీ) సెంటర్లలో 641 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లును లైజన్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రానికి గుర్తింపు కార్డుతో వస్తేనే అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే విద్యుత్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. -
సంస్కృతికి ప్రతీక సంస్కృత భాష
తిరుపతి సిటీ: భారతీయ సంస్కృతి, దేశ వికాసానికి సంస్కృత భాష ప్రతీకని టీటీడీ అడిషన్ ఈఓ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో నాలుగు రోజులుగా జరిగిన నేషనల్ టాలెంట్ ఫెస్ట్–2026 కార్యక్రమం ఘనంగా ముగిసింది. శనివారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆధ్యాత్మికత మానవుని సన్మార్గంలో నడిపించే ఒక శక్తి అని చెప్పారు. అనంతరం పలు శాస్త్ర విభాగా ల్లో జరిగిన ప్రతిభా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా టోఫ్రీలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, పూరిలోని జగన్నాథ సంస్కృత వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ కిషోర్ చంద్ర పాడి, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ దక్షణమూర్తి శర్మ, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వర్క్షాప్ విజయవంతం తిరుపతి రూరల్: పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో ‘‘నేషన్ వైడ్ రూల్ అవుట్ ఆఫ్ ఎన్పీఎస్టీ అండ్ ఎన్ఎంఎం’’ అన్న అంశంపై శనివారం రాష్ట్రస్థాయి వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అకాడమిక్ అడ్వైజర్ డీకే చతుర్వేది మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి అందరికీ నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వైస్ ఛాన్సలర్ వి.ఉమ మాట్లాడుతూ సమాజంలోని ఉన్నతస్థాయి వ్యక్తులందరూ తమ గురువుల చేతిలో రూపుదిద్దుకున్నవారే అన్నారు. ఎన్సీటీఈ ఎన్ఎంఎం ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యుడు జ్ఞానేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించడమే ఉపాధ్యాయుని ముఖ్యవిధి అన్నారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో సామర్థ్యాలు పెంపొందించుకొని నాణ్యమైన విద్య అందించాలన్నారు. వర్క్ షాప్లో ఎన్సీటీఈ సభ్యులు డాక్టర్ చంచల్ మల్హోత్రా, ప్రొఫెసర్ టి.జి అముదవల్లిలతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. న్యాయం కోసం పోలీస్స్టేషన్ ఎదుట కామిరెడ్డి బైఠాయింపు పెళ్లకూరు: స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి న్యాయం కోసం బైఠాయించారు. చిల్లకూరులోని మన్నేమత్తేరి చెరువుకట్టపై చాలా కాలంగా వేపచెట్లు ఉన్నాయి. గ్రామానికి చెందిన మహేష్, మరి కొందరు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా వేప చెట్లను నరికివేశారు. స్థానిక సర్పంచ్ పగడాల హరిబాబురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులు, వారు ఉపయోగించిన ఆటో, పనిముట్లను అప్పగించి, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చేలోపు పోలీసులు నిందితులను వదిలేశారు. దీంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి పోలీస్స్టేషన్కు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, ఇచ్చిన ఫిర్యాదుపై రసీదు ఇచ్చే వరకు పోలీస్స్టేషన్ నుంచి కదిలేదిలేదని బైఠాయించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు వచ్చి ‘పోలీస్స్టేషన్ వద్ద ఎందుకు కూర్చున్నావు? రసీదు ఇవ్వడానికి నువ్వు ఫిర్యాదు ఇచ్చావా?.. ముందు స్టేషన్ దాటి అవతలకు వెళ్లు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకట్టపై ఉన్న వేప చెట్లు నరికిన నిందులను పోలీసులకు పట్టించినప్పటికి కేసు నమోదు చేయకుండా వదిలేసిన పోలీసులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సత్యనారాయణరెడ్డి కోరారు. ఈవిషయమై సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. -
పింఛనే శ్వాస..
జాడ లేని ఎన్టీఆర్ భరోసా ●చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు సర్కారు ప్రజలు, నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క కొత్త పింఛన్ కూడ మంజూరు చేయకపోగా కుప్పం నియోజకవర్గానికి మాత్రం పెద్దపీట వేసుకుంది. కుప్పం నియోజకవర్గానికే ప్రత్యేక రూల్ అనే ధోరణిలో బాబు సర్కారు వ్యవహరిస్తోంది. రెండేళ్లు ఒక కొత్త పింఛన్ కూడ ఇవ్వకపోగా ఉన్న పింఛన్లను రాజకీయ రంగును పులిమి తొలగించింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో మూడు రెవెన్యూ డివిజన్లు 36 మండలాల పరిధిలో 22,99,699 మంది జనాభా ఉన్నారు. పింఛన్ల పంపిణీ అధిక ప్రాధాన్యతనిస్తున్నామని డప్పులు కొట్టుకుని ప్రచారం చేస్తున్న చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్ల మంజూరుపై అలసత్వం వహిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం తప్ప ఇతర నియోజకవర్గాల్లో ఒక్క కొత్త పింఛన్ సైతం మంజూరు చేయలేయని దుస్థితి. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే వంద లాది మంది అర్హులు పింఛన్లు మంజూరు చేయండి సారూ అంటూ మొరపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పింఛన్ అర్జీదారులకు న్యాయం చేయలేక ఉన్నతాధికారులు మిన్నకుండిపోతున్నారు. ప్రతి వారం పీజీఆర్ఎస్లో అర్జీలే కొత్త పింఛన్లు మంజూరు కోసం అర్హులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ ఇవ్వాలంటూ అధికారుల ఎదుట తమ గోడును విన్నవించుకుంటున్నారు. ప్రస్తుత సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల మంజూరుకు పీజీఆర్ఎస్లో 20,452 అర్జీలు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ అర్జీల్లో ఒక్కరికి కూడా న్యాయం చేయలేని నిస్సహయతలో అధికారులు మిన్నకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లే చంద్రబాబు సర్కారు ఎమ్మెల్యేలకు సైతం చేదు అనుభవం ఎదురవుతోంది. ఒక్క పింఛన్ ఇప్పించలేని ఎమ్మెల్యేతో లాభమేమి అంటూ అర్హులు విమర్శలు గుప్పిస్తున్నారు.కుప్పానికి ప్రత్యేక రూల్ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు తావు లేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను అందజేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుని నియోజకవర్గం అయినప్పటికీ గత సర్కారులో 35,637 మందికి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుత సర్కారులో ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే కొత్త పింఛన్లను పంపిణీ చేస్తూ మిగిలిన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారు. నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కుప్పానికి మాత్రం ప్రత్యేక రూల్ అనే ధోరణిలో 3,895 కొత్త పింఛన్లను మంజూరు చేశారు. మిగిలిన నియోజకవర్గాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా మోసం చేస్తున్నారు. పింఛన్ల కోతకే ప్రాధాన్యం చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్ల మంజూరు కంటే ఉన్న పింఛన్లలో కోత విధించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,183 మందికి పింఛన్లు అందజేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జిల్లాలో 2,64,902 పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 19,500 మంది పింఛన్లను తొలగించి అర్హుల పొట్ట కొట్టారు. వేల సంఖ్యలో పింఛన్లను తొలగించడంతో బాధితులు చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.పింఛన్ కోసం ఎదురు చూపులు మాది తవణంపల్లి మండలం చింతమాకులపల్లి గ్రామం. నా కుమార్తె నివేదిత దీర్ఘకాల వ్యాధితో చాలా రోజులుగా ఇబ్బంది పడుతోంది. దినచర్యలో సొంతంగా ఏ పనిచేసుకోలేక కండరాల బలహీనతతో అవస్థలు పడుతోంది. ఇప్పటికే వైద్యం కోసం స్థోమత ఉన్నంత వరకు ఖర్చు చేశాం. ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందించే రూ.15 వేల పింఛన్ కోసం అధికారులకు అర్జీలు అందజేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తే మాకు న్యాయం చేసినట్టవుతారు. – కుమార్తె నివేదితతోఈశ్వర్ మంచం పట్టినా మంజూరు కాలేదు మాది తవణంపల్లి మండలం ఏ గొల్లపల్లి పంచాయతీ వడ్డిఇళ్లు గ్రామం. మేసీ్త్ర పనిచేస్తేనే మా కుటుంబం ముందుకుసాగుతుంది. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. నా భర్త మేసీ్త్ర పని చేస్తుండగా కిందపడి కాళ్లు, చేయి, తలకు పెద్ద గాయాలు అయ్యాయి. పనికి వెళ్లలేని దుస్థితి. మంచానికే పరిమితమయ్యాడు. వికలాంగ పింఛన్ కోసం చాలా సార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. నెలలు గడుస్తున్నా మాకు కొత్త పింఛన్ ఇవ్వడం లేదు. ఇంకెప్పుడు కొత్త పింఛన్ల ఇస్తారో అర్థమే కావడం లేదు. – బాధితుడు సుబ్రహ్మణ్యం, పిల్లలతో భార్య లోకేశ్వరి -
పుత్తూరు విషాదం.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరుపతి జిల్లా: పుత్తూరులోని కృష్ణా నగర్లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు.. మృతురాలిని పద్మజగా గుర్తించారు పోలిసులు. 8 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తిని పద్మజ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి
నారాయణవనం: సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి సినీ నటి మీనాక్షి చౌదరి విద్యార్థులతో కలిసి సందడి చేశారు. కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్పోర్డ్స్డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సినీ నటి మీనాక్షిచౌదరి హాజరయ్యారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో గెలుపొందిన వారికి కృష్ణయ్య, మీనాక్షిచౌదరి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను, ట్రోపీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు శారీరకంగానూ, మానసికంగానూ ధృఢంగా ఉంటేనే చదువుపై దృష్టిని సారించే అవకాశం ఉంటుందన్నారు. సినీ నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. దేహ ధారుడ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ శనివారం పూర్వ విద్యార్థుల అలుమిని డే, ఆదివారం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సినీ హీరోయిన్స్ నిధి అగర్వాల్, శ్రీలీల, హీరో తేజా సజ్జా, తమన్ సంగీత విభావరి, నటరాజ్ ట్రూప్ నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. -
పట్టపగలే నగల చోరీ
పాకాల: పట్టపగలే రోడ్డు పక్కన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నేండ్రగుంటలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. నేండ్రగుంటకు చెందిన రవి ఇంటికి తాళం వేసుకుని మధ్యాహ్నం సుమారు 12.30 నుంచి 1.30 గంటల ప్రాంతంలో తన కుమారుడి షాపు వద్దకు వెళ్లాడు. అలాగే ఆ ఇంటిపైన అద్దెకు ఉన్న వాసు ఇంటికి తాళం వేసుకుని దైవదర్శనం కోసం కాణిపాకం వెళ్లాడు. వాసు వినాయకస్వామి దర్శనం ముగించుకుని స్కూటర్లో ఇంటి వద్దకు రావడంతో దుండగులు మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడం గమనించాడు. వాసు ఇంటిపైకి వెళ్లి చూడగా ఇంటి తాళాలు పగల గొట్టి ఉండడం గుర్తించారు. రవి ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు నెక్లెస్, కమ్మలను చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ ఇళ్లను పరిశీలించారు. ఈ మేరకు ఎస్ఐ తరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన జాతీయ గోల్ఘాట్ బాల్ పోటీలు
తిరుపతి అర్బన్: నగరంలో నాలుగురోజులుగా జరుగుతున్న 3వ సబ్ జూనియర్ బాల, బాలికల జాతీయ గోల్ఘాట్ బాల్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీలు గేమ్స్ వ్యవస్థాపకుడు నోట్ల రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో జీవకోనలోని విశ్వం స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్లు, రిఫరీలు, వలంటీర్లు, విశ్వం పాఠశాల యాజమాన్యంతోపాటు పలువురు పిల్లల తల్లిదండ్రుల సహకారం అమూల్యమైనదని కొనియాడారు. 23 రాష్ట్రాల నుంచి 500 మందికి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, పుద్దిచ్చేరి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, అసోం, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ నుంచి క్రీడాకారులు విచ్చేశారని వెల్లడించారు. అనంతరం విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్ విశ్వచందన్రెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు, మెడళ్లు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోల్ షూట్ బాల్ ఇండియన్ కోశాధికారి రామ్ ప్రవేశ్ కుమార్ వీరూ, సౌత్ ఇండియా ఇన్చార్జి కరుణాకరన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దేవి ప్రియా, సంయుక్త కార్యదర్శి ప్రసన్న కుమార్, కోశాధికారి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సులో పక్షులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓను అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ ఆదేశించారు. పులికాట్ సరస్సును అడిషనల్ పీసీపీఎఫ్ శాంతిప్రియ శుక్రవారం సందర్శించారు. అనంతరం అటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బడ్డెట్లో సుమారు రూ.100 కోట్లు సముద్ర ముఖద్వారాల పూడికకు కేటాయించినట్టుగా కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె శుక్రవారం పులికాట్ సరస్సు పరిశీలనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అటకానితిప్ప పర్యావరణ కేంద్రం పక్కనే చిన్నపాటి చెరువు ఉండడాన్ని చూసిన ఆమె ఇక్కడ పెడల్బోట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులు బాగా ఆనందించే అవకాశం ఉంది కదా.. మరి ఎందుకు ఇక్కడ ఆ ఏర్పాట్లు చేయలేదని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు సీఎఫ్ సెల్వం, డీఎఫ్ఓ హారిక ఉన్నారు. -
పీఎస్హెచ్ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక
పుత్తూరు : మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ (పీఎస్హెచ్ఎం) ఫోరం తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పుత్తూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఫోరం కార్యదర్శి శ్రీనివాసులు, అసోసియేట్ ఉపాధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమగ్ర ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్లో చేపట్టనున్న బదిలీల్లో పీఎస్హెచ్ఎంలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి స్కూల్ అసిస్టెంట్స్గా నియమించాలని డిమాండ్ చేశారు. జనవరి 13న ప్రభుత్వం ఇచ్చిన మెమోను అందరికీ ఆమోదయోగ్యంగా సవరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.గోపి (ఏర్పేడు), అధ్యక్షుడిగా వి.వెంకటరమణ (నాగలాపురం), ప్రధాన కార్యదర్శిగా ఎస్.మధుసూదన్రాజు (తిరుపతి రూరల్), కోశాధికారిగా కె.నరేష్ (వడమాలపేట), మహిళా అధ్యక్షురాలుగా డి.గీర్వాణి (తిరుపతి రూరల్), అసోసియేట్ అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా మరి కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,655 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,003 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. తిరుపతిలో రోడ్డు ప్రమాదం ఇంటర్ విద్యార్థి మృతి తిరుపతి క్రైం: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మూల వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య కుమారుడు బాబు (17) ఉద్యోగం కోసం తిరుపతికి వచ్చి పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో స్నేహితుడు హరికృష్ణతో కలిసి స్కూటీపై ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ పక్కన ఉన్న సందు దారి నుంచి ప్రధాన రోడ్డులోకి వస్తుండగా, టీవీఎస్ సర్కిల్ వైపు నుంచి అన్నమయ్య సర్కిల్ దిశగా అతివేగంగా వచ్చిన బైక్ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2.12 గంటలకు మృతి చెందాడు. మృతుడి అన్న పల్లపు రమణ కుమారుడు పల్లపు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరెంట్ షాక్తో వ్యక్తి మృతి వెంకటగిరి రూరల్: కరెంట్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని కాంపాళెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కాంపాళేనికి చెందిన ఈగ రమణయ్య (52) గురువారం గొడ్డేరువాగు సమీపంలో కట్టెలు కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు రమణయ్యకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమణయ్య మృతి చెందడంతో కాంపాళెం ప్రాంతంలోవిషాదఛాయలు అలుముకున్నాయి. -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట: భాకరాపేట అటవీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.35 లక్షల విలువైన 763 కిలోల ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. అధికారుల కథనం మేరకు.. చిన్నగొట్టిగల్లు మండలంలోని శేషాచల అడవుల్లో భాకరాపేట అటవీశాఖాధికారులు శుక్ర వారం ఉదయం కూంబింగ్ చేశారు. ఆ సమయంలో అనుమానాస్పద వాహనం వస్తుండగా ఆపారు. అయితే డ్రైవర్ తప్పించుకునేందుకు యత్నించగా సిబ్బంది వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా సుమారు 763 కిలోల ఎరచ్రందనం దుంగలు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్తోపాటు మరో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. భక్తుల సేవే మహద్భాగ్యం తిరుమల: శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆయన శుక్రవారం ఉదయం టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందుగా ఆయన క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈఓకు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ తిరుపతి అర్బన్: నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను పిల్లలకు ఇవ్వాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వర్చువల్ పద్ధతిలో అన్ని విభాగాలకు చెందిన అధికారులతో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ నెల 17న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వెల్లడించారు. డీఎంఅండ్ హెచ్వో బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత తగ్గడమే కాకుండా, వారి శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,97,311 మందికి అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్లు చొప్పున జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతం, కరకంబాడి బీట్ ప్రాంతం 2016లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తనిఖీలు చేసింది. తమిళనాడు, తిరువణ్నామలై జిల్లాకు చెందిన శివమూర్తి సేతు, తిరుపతి శివమణి అటవీ ప్రాంతంలో అక్రమంగా సంచరించడాన్ని గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆర్టీసీ అధికారుల పరిశీలన నాయుడుపేటటౌన్: మండలంలోని విన్నమాల సమీపంలో ఆర్టీసీ బస్సులో వెనుక నుంచి మంటలు చేలరేగిన సంఘటనకు సంబంధించి శుక్రవారం ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 29 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి వినుకొండకు వెళుతుండగా విన్నమాల వద్దకు వచ్చే సరికే బస్సు వెనుక వైపు ఒక్కసారిగా మంటలు చేలరేగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా ఆర్టీసీ ఆర్ఎం జగదీష్తోపాటు సూళ్లూరుపేట డిపో మేనేజర్ కళ తదతరులు, మెకానిక్ బృందంతో బస్సును పరిశీలించారు. రక్షణ విజ్ఞాన సదస్సులో ఎస్వీయూ వీసీకి గౌరవ ఫెలోషిప్ తిరుపతి సిటీ: విజయవాడ వేదికగా జరిగిన రక్షణ విజ్ఞాన సదుస్సులో ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావుకు అరుదైన గౌరవం లభించింది. అకాడమి ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్టీసీ) ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ సదస్సులో ఆయనకు ఏఎస్టీసీ గౌరవ ఫెలోషిప్ను ప్రకటించింది. -
ఎమ్మెల్యే గారూ..అసెంబ్లీలో మాట్లాడండి
తిరుపతి అర్బన్: ‘ఎమ్మెల్యే గారూ.. అసెంబ్లీ సమావేశాల్లో...ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడండి సార్..ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో అయ్యోర్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఒక్క సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.’ అంటూ శనివారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు యూటీఎఫ్ జిల్లా కమిటీకి చెందిన ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నారు. పీఆర్సీ కమిషన్ నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగుల పెన్షన్ బకాయిలు చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎల్ రద్దు చేయాలని, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, హెల్త్కార్డుల మెడికల్ బిల్లుల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్యాలరెడ్డి, గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, జిల్లా కార్యదర్శులు పద్మజ, సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మోహన్, డివిజనల్ కోఆర్డినేటర్ మురళి, కృష్ణంరాజు, నేతలు ఖాదర్ బాషా, హేమాద్రి బాబు, ప్రభుకుమార్, వరలక్ష్మి, మురళి, గోపాల్ పాల్గొన్నారు. -
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీకాళహస్తి : ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందుల్లేకుండా దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉచిత దర్శనానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ బలోపేతం, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. ప్రతి శివరాత్రిని కొత్త శివరాత్రిలా భావించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాచుర్యం ఉందని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బాల్యవివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తునికి స్వామి, అమ్మవార్ల పసుపు,కుంకుమ పాకెట్ క్యాలెండర్ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపడతామని ఆలయ ఈఓ బాపిరెడ్డి చెప్పారు. -
మహిళా వర్సిటీలో ‘వికాస్–2026’ జోనల్ సదస్సు
తిరుపతి రూరల్: పద్మావతి మహిళావర్సిటీలో ‘‘వికాస్–2026 పరిశ్రమజ్ఞానం, అప్రెంటీస్షిప్, స్కిల్లింగ్ వైపు అడుగులు’’ అనే అంశంపై సౌత్జోన్ సదస్సును యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్జోషీ ప్రారంభించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం, వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు యువతను నడిపించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నత విద్యాసంస్థలు పనిచేయాలన్నారు. అందులో భాగంగానే యూజీసీ 2025లో తీసుకువచ్చిన ఎంబడెడ్ డిగ్రీ ప్రోగ్రాంను తప్పక అమలు చేయాల్సి ఉందన్నారు. ఎంబెడెడ్ డిగ్రీ కోర్సుల గైడ్లైన్స్ను తప్పక అమలు చేసిన విద్యాసంస్థల విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కొత్త ప్రణాళికలు, ఎంటర్ప్రెన్యూర్స్లను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోందని వెల్లడించారు. మహిళా వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ వికాస్ 2026 సౌత్ జోన్ సదస్సులో ఇండస్ట్రీ అకాడమీ అనుసంధానం, స్వయంప్లస్ మాడ్యూల్స్ రూపకల్పన, కోక్రియేషన్ ఆఫ్ కరికులం తదితర ముఖ్య అంశాలపై అర్థవంతమైన చర్చలు జరపడం ఆనందంగా ఉందన్నారు. రిజిస్ట్రార్ ఆర్ ఉష, యూజీసీ సంయుక్త కార్యదర్శి అవిచల్ కపూర్, సదస్సు కో ఆర్డినేటర్లు విద్యావతి, శోభారాణి పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట అడవిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖాధికారులు అరెస్టు చేసి, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.డాక్టర్ చీటి విలువ జీరో డాక్టర్ ప్రిస్క్రిప్షన్కు వి లువ లేకుండా పోయింది. ‘‘ఏ మందైనా ఇ స్తాం’’ అన్న ధోరణితో మెడికల్ షాపులు వ్యవహరిస్తున్నాయి. ఇది వై ద్యవృత్తికే మచ్చగా మారుతోంది. రోగులు అ డగ్గానే మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రా ణాంతకమైన నిద్రమాత్రలు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అది కూడా డాక్టర్ చీటీ లేకుండానే. డా క్టర్ ఒక మాత్ర రాస్తే మెడికల్ షాపుల్లో మరొకటి ఇచ్చి, అదే కాంబినేషన్ అని చెబుతారు. కాంబినేషన్ ఒకటే అయినా.. అది తక్కువ ధ ర, ఎక్కువ కమీషన్ ఇచ్చే మాత్ర అయి ఉంటుంది. ఇలా చాలా మందుల దుకాణాల్లో మో సాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతు న్నా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వ్యాపారులకు ఇదే బలంగా మా రింది. మొత్తంగా చూస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజారోగ్యం గాల్లో దీపంలా మారింది. ఔషధ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మాఫియా ముసుగులో పడి..తనిఖీలకు అంటిముట్టనట్టు తిరుగుతున్నారు. -
స్పెల్–2 ప్రాక్టికల్స్కు 143 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ స్పె ల్–2 ప్రాక్టికల్స్లో భాగంగా తొలిరోజు శుక్రవారం జరిగిన పరీక్షలకు 143 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టి కల్స్ పరీక్షకు 3,785 మందికి గాను 3,697 మంది విద్యార్థులు హాజరుకాగా మధ్యాహ్నం జరిగిన ప్రయోగ పరీక్షకు 3,080 మందికి గాను 3,025మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 10వ తేదీవరకు జరగనున్నాయన్నారు. హోమ్ లోన్ మేళా నేడు, రేపు తిరుపతిఎడ్యుకేషన్ : కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో 7, 8వ తేదీల్లో హోమ్ లోన్ మేళా నిర్వహించనున్నట్లు ఆ బ్యాంకు జీఎం పాండురంగ మితాయ ఓ ప్రకటనలో తెలిపారు. కరకంబాడీ రోడ్డులోని గెస్ట్లైన్ డేస్ హోటల్ సమీపంలోని ఏబీ ఆవాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫొనెక్స్ టవర్ ప్రాంగణంలో రెండు రోజుల పాటు హోమ్ లో న్ మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాలో వినియోగదారులకు తక్షణమే లోన్ అప్రూవల్, తక్కువ వడ్డీ రేటు, ప్రత్యేక ఆఫర్లను అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 70134 10562 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.10లక్షల విరాళం తిరుపతితుడా: స్వి మ్స్ బాలాజీ ఆరో గ్య వరప్రసాదిని ప థకానికి బెంగళూరు కు చెందిన నారాయ ణ సిల్క్స్ అధినేత నమ్రత ఆర్ దేవత తండ్రి డీఎస్ రాఘవేంద్ర కోరిక మేరకు రూ. 10,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కు మార్ను ఆయన చాంబర్లో దాత తరఫున తి రుపతికి చెందిన వై రాఘవేంద్ర శుక్రవారం క లసి అందుకు సంబంధించి పత్రాలను, చెక్కు ను అందజేశారు. పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిగణలోనికి తీసుకుని విరాళం అందజేసినట్టు దాతలు తెలిపారు. -
శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి
తిరుమల: శ్రీవారిని శుక్రవా రం సినీ నటి మీ నాక్షి చౌదరి ద ర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. 32 మంది విద్యార్థుల డిబార్ తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శుక్రవారం జరిగిన పలు కోర్సులకు సంబంధించిన యూజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన 32 మంది విద్యార్థులను స్క్వాడ్ అధికారులు డి బార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధి కారి రాజామాణిక్యం తెలిపారు. -
● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మాత్రల విక్రయం ● చిత్తూరు, తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా మెడికల్షాపులు ● రిజిస్ట్రేషన్ లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో షాపులు ● ఆర్ఎంపీలు సైతం మాత్రల విక్రయాలు ● కాలం చెల్లి
ఆస్పత్రులే అక్రమాల అడ్డా.. ప్రైవేటు ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. చాలా వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఆవరణలోనే మెడికల్ షాపులను సైతం ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు నగరం, జీడీనెల్లూరు, పలమనేరు, కుప్పం, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి, సత్యవేడు, పుత్తూరు తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా మెడికల్ షాపులు టేర్పాటు చేసుకున్నారు. రోగి బ యటకు అడుగు పెట్టకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. ఒకే ఆస్పత్రిలో పరీక్షలు, ప్రిస్క్రిప్షన్, మందుల అమ్మకం మూడు ఒకే చోట జరుగుతున్నా, నియంత్రణ మాత్రం శూన్యం. -
నారాసుర ఆధరహో!
చిత్తూరు అర్బన్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మ ద్యం ధరల నియంత్రణ గాలికొదిలేశారు. అమ్ము కున్నోడికి అమ్ముకున్నంతగా పట్టించుకోవడం మానేశారు. ఇదే అదునుగా వ్యాపారులు మద్యం ధరలను పెంచేశారు. ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. కోట్లు లూఠీ ‘వడ్డించేవాడు మనోడైతే చాలు..’ అన్నట్లు మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు ఏడాదిన్నరగా పెద్దగా లాభాలు రావడంలేదని భావించిన ప్రభుత్వం.. క్వార్టర్ బాటిల్పై రూ.10 పెంచుకో వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చెప్పిందో లే దో.. జీవో రాకపోయినా పర్లేదు అన్నట్లు, వ్యాపారులు జిల్లాలో ధరలు పెంచేశారు. జీవో ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం పట్టగా.. అప్పటికే దాదాపు రూ.5 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక అప్పటి నుంచి రెండు జిల్లా ల్లో మద్యం ధరలపై నియంత్రణ పట్టుతప్పింది. ఒక దుకాణంలో దొరికే ధర, మరో దుకాణంలో ఇవ్వడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అమ్ముకుంటున్నారు. ఫలితంగా రెండు జిల్లాల్లో మద్యం ప్రియుల నుంచి రోజుకు దాదాపు రూ.40 లక్షల వరకు దోచు కుంటున్నారు. ఇందులో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వాటాల్లేవంటే నమ్మశక్యం కావడం లేదు. తిమ్మిని బమ్మి చేస్తూ.. పెంచిన మద్యం ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులు ఇచ్చే సమాధానంతోనే మద్యం ప్రియులకు సగం కిక్కు దిగిపోయేలా ఉంటుంది. తొలుత ధరల పెంపు జీవో రాకమునుపే.. ప్రభుత్వం ధరలు పెంచింది అని బోర్డు పెట్టి అదనంగా దండుకున్నారు. ఆపై జీఓ అమల్లోకి వచ్చాక.. తీరా బాటిళ్లపై పాత ధరలు ఉన్న వాటిని కొట్టేసి, కొత్త ధరలు ప్రింట్ చేసి పాత ధరను చెరిపేసి.. పెరిగిన ధరను ముద్రించారు. పె రిగిన ధర ముద్రించిన తర్వాత కూడా బాటిళ్లపై ఉన్న ధర కాదని అదనపు నగదు వసూలు చే శారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ధరలు పెంచింనే బోర్డు చూపిస్తున్నారు. ధరలు పెరిగాయంటూ అదనపు నగదు వసూలు చేస్తూ రోజుకు రూ.లక్షలు దోచుకుంటున్నారు. విచ్చలవిడిగా ‘బెల్టు’ రెండు జిల్లాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిగా వెలుస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 4 వేలకు పైగా బెల్టు దుకాణాలున్నట్టు సమాచారం. చిల్లర కొ ట్టు నుంచి కిరాణా దుకాణం వరకు ప్రతి చోటా మ ద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రూ.20–రూ.50 అధిక ధరలకు బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేస్తున్నారు. వీటిల్లో లభిస్తున్న మద్యం ఏ బ్రాండు..? ఏ దుకాణం నుంచి వచ్చింది..? అసలు కల్తీనా..? అనే ప్రశ్నలకు ఎవ్వరి వద్దా సమాధానాలు దొరకడం లేదు. మద్యం కల్తీ కాకపోతే వాటిపై ఉన్న క్యూఆర్ ఆధారంగా అవి ఏ దుకాణానికి చెందినవో ఎక్సైజ్ అధికారులు గుర్తించి, రూ.లక్షల్లో జరిమానాలు విధించాలి. కానీ జిల్లాల్లో అలా జరగడం లేదు. తిరుపతి జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు మద్యం దుకాణాలు – 225 మద్యం బార్లు – 27 రోజుకు వ్యాపారం (సగటు) – రూ. 2 కోట్లు పెరిగిన ధరలతో భారం – రూ.32 లక్షలు -
ఉపాధి, వ్యవస్థాపకతే ఉన్నత విద్య లక్ష్యం
తిరుపతి సిటీ: ఉన్నత విద్య పూర్తిగా డిగ్రీతో కేంద్రీకృతం కాకుండా ఉపాధి, వ్యవస్థాపకత లక్ష్యంగా అనుసంధానించాలని యూజీసీ జాయింట్ సెక్రటెరీ డాక్టర్ అవిచల్ రాజ్కపూర్ సూచించారు. ఎస్వీయూలోని సెనేట్ హాల్లో గురువారం ఎన్ఈపీ–2020తో దేశంలో ఉన్నత విద్య.. మారుతున్న దృశ్యం అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపన్యసించారు. నూతన జాతీయ విద్యావిధానం–2020 దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. 2023లో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సులో డిజిటల్ పరివర్తన, పరిశ్రమ సహకారం, జీవితాంతం అభ్యసించడం వంటి చర్యలతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న విద్యా వ్యవస్థల అవసరాన్ని ప్రపంచ మేధావులు, నాయకులు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. సమగ్ర డిజిటల్ వ్యూహాలను విశ్వ విద్యాలయాలను అవలంభించాలని ఆయన కోరారు. వీసీ టాటా నర్సింగరావు మాట్లాడుతూ ఎస్వీయూలో ఎన్ఈపీ అమలు స్థితి గురించి, విద్య, డిజిటల్ అభ్యాసం, పాఠ్యాంశాల పునర్నిర్మాణం, పరిశోధన ప్రమోషన్, పరిశ్రమల అనుసంధానం వంటి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం సంస్కరణలను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పలు కళాశాలల నుంచి ప్రిన్సిపాళ్లు, డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఏనుగు దంతాలపై స్మగ్లర్ల కన్ను
పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ా ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకికర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపుసాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు.విదేశాల్లో భలే డిమాండ్చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది. -
వీరప్పన్లు!
కౌండిన్య, మోర్థానలో..మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. రాష్ట్ర సరిహద్దులో పేట్రేగుతున్న ఏనుగు దంతాల స్మగ్లర్లు -
ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా?
ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మహిళా వర్సిటీలో వికాస్–2026
తిరుపతి రూరల్: తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వేదికగా వికాస్– 2026ను ఘనంగా నిర్వహించనున్నట్టు సదస్సు కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ విద్యావతి, ప్రొఫెసర్ శోభారాణి తెలిపారు. గురువారం వర్శిటీలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వికాస్– 2026 సదస్సులో ‘‘పరిశ్రమ జ్ఞానం, అప్రెంటీస్ షిప్, స్కిల్లింగ్ వైపు అడుగులు’’ అనే అంశంపై ఒక్క రోజు సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి, సంయుక్త కార్యదర్శి డా. అవిచల్ కపూర్ , ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ప్రొ ఎస్.విజయభాస్కర్ రావు, వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ హాజరై ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలను జాతీయ అభివృద్ధి, సామాజిక పరివర్తనకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కళాశాలల నుంచి నిపుణులు, పరిపాలనా అధికారులు హాజరవుతారని చెప్పారు.లారీ ఢీకొని ఒకరి మృతికలువాయి(సైదాపురం): కలువాయి మండలంలోని గురువారం లారీ ఢీకొనడంతో జాతీయ దాటుతున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసారగం మండలం ఉప్పలపాడు గ్రామనికి చెందిన భాగాది నరసింహులు(38)గా పది రోజుల క్రితం మాదన్నగారిపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మాదన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని సంఘటన స్థలంలో వదిలి పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 68,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,764 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు
మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభకు హాజరైన పార్టీ శ్రేణులుచలో పోతిరెడ్డిపాడుకు పార్టీ శ్రేణులతో కలిసి వెళుతున్న భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని పార్టీ నేతలు, శ్రేణులు నిర్వహించారు. చంద్రబాబు నీచ రాజకీయాలతో రాయలసీమకు చేస్తున్న తీవ్ర నష్టం, రాయలసీమ హక్కుల కోసం పోరాడేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కొరముట్ల శ్రీనివాసులు, వెంకటేగౌడ్, సునీల్కుమార్, ఎమ్మెల్సీ భరత్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, విజయానందరెడ్డి వందల వాహనాల్లో వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. – తిరుపతి మంగళం -
రెండిళ్లలో చోరీ
నాయుడుపేట టౌన్: పట్టణంలోని రాజగోపాలపురం ఆరో వీధిలో ఉన్న రెండు ఇళ్లలో సుమారు రూ.4 లక్షలకు పైగా నగదు, 10 సవర్ల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి అభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. రాజగోపాలపురంలో నివాసం ఉంటున్న గుండుబోయిన నరేష్ ఇంటికి తాళం వేసి, పెళ్లకూరు మండలం బంగారంపేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అలాగే అదే ఇంటి మిద్దైపె నివాసం ఉంటున్న కారిపాక చిట్టిబాబు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. రెండు ఇళ్లకు తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దుండగులు తలుపులు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన బంగారు నగలు, నగదు, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు. నరేష్ గురువారం ఇంటి వద్దకు వచ్చి చూసే సరికి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో దాచి ఉంచిన రూ. 2లక్షలకు పైగా నగదు, 4.50 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు దోచుకువెళ్లినట్లు గుర్తించారు. చిట్టిబాబు కూడా గురువారం సాయంత్రం ఇంటి వద్దకు చేరుకుని, పరిశీలించగా బీరువాలో దాచి ఉన్న 5 సవర్ల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు, 1.50 కిలోలకు పైగా వెండి వస్తువలు అపహరించుకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాటరీ పద్ధతిలో 4 బార్లు తిరుపతి క్రైమ్: జిల్లాలో మిగిలి ఉన్న నాలుగు బార్లకు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో కేటాయించారు. శ్రీకాళహస్తి బార్కు–4, సూళ్లూరుపేట బార్కు–10, గూడూరులోని రెండు బార్లకు–8 దరఖాస్తులు వచ్చా యి. దరఖాస్తుల ద్వారా రూ.1.10 కోట్లు, ప్రాసెసింగ్ ద్వారా రూ.1.12 కోట్లు, మొదటి కంతు ద్వారా రూ.36.25లక్షలు, మొత్తంగా రూ.1.57 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. 2028 ఆగస్టు 31 వరకు వీరికి బార్ ను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారు. -
వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి
తిరుపతి అర్బన్: ఘన, ద్రవ వ్యవర్థాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలసి మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్, కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద సంస్థల నుంచి నివేదికలు కోరారు. అనంతరం జిల్లాస్థాయిలో ఓ నివేదికను తయారుచేసి న్యూఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్కి అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో వందశాతం వాస్తవ పరిస్థితులను పొందుపరుస్తూ నివేదికను ఇవ్వాలని ఆయన స్పష్టంచేశారు. -
టాలెంట్ ఫెస్ట్కు విశేష స్పందన
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న నేషనల్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ ఫెస్ట్–2026కు విశేష స్పందన లభించింది. వర్సిటీలో రెండో రోజు గురువారం దేశంలోని 24 యూనివర్సిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారి శాస్త్ర ప్రతిభను చాటుకున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన ప్రతిభా పోటీల్లో వేద భాష్య భాషణ, వ్యాకరణ శాస్త్ర భాషణ, సాహిత్య శాస్త్ర భాషణ, వేదాంత శాస్త్ర భాషణ, జ్యోతి ష్య శాస్త్ర భాషణ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శనివారం జరిగే ముగింపు కార్యక్రమంలో అవార్డులు, బహుమతులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా సాహిత్య విభాగ సహాచార్యులు డాక్టర్ భరత్ భూషణ్ రత్, డాక్టర్ ప్రదీప్ కుమార్ భాగ్, అడిషనల్ కోఆర్డినేటర్గా వ్యాకరణ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఉదయన హెగ్డే వ్యవహరించారు. 6 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం తిరుపతి అన్నమయయసర్కిల్:శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో కారులో ఎరచ్రందనం దుంగలు తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన కారును సీజ్చేసి ఆరు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఏఆర్ఎస్ఐ ఈశ్వర్రెడ్డి బృందం, ఎఫ్ఆర్ఓ పి.సుభాష్ గురువారం కేవీబీపురం మండలం వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎఫ్బీఓ సురేష్ కుమార్తో కలసి మారప్పరెడ్డి కండ్రిగ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. అటువైపు వేగంగా వచ్చిన ఒక కారు టాస్క్ఫోర్సు పోలీసులను చూసి కొద్ది దూరం ముందుగా ఆపేశారు. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. టాస్క్ఫోర్సు పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. కారులో ఆరు ఎరచ్రందనం దుంగలు లభించాయి. అదుపులోకి తీసుకున్న వారిని అరెస్టు చేసి విచారించగా, తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కారు సహా వారిని తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. వీరిని డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ ఖాదర్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి రోగికీ నాణ్యమైన వైద్య సేవలు తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రికి అత్యవసర వైద్య సేవల కోసం విచ్చేస్తున్న ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్స్ ఎమెర్జెన్సీ విభాగంలో రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, స్విమ్స్ వైద్యం రావద్దంటోందని ప్రచురించిన కథనం అవాస్తమని తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు బెడ్, వెంటిలేటర్ వంటి సౌకర్యాలు అందకపోయినా, అడ్మిషన్ నిరాకరించినా వెంటనే మెడికల్ సూపరింటెండెంట్ 94935 47803, ఆర్ఎంఓ 9866356239 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. -
సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన ఒప్పందం
తిరుపతి రూరల్: శ్రీలంక దేశంలో స్థిరపడిన తెలుగు వారికి తెలుగు భాష, సంస్కృతిని నేర్పడానికి శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీలోని తెలుగు అధ్యయన శాఖ ముందుకు వచ్చింది. బోధన, అభ్యసన, అకడమిక్ సాంస్కృతికతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు నెరవు శ్రీకాళహస్తి మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు సంయుక్తంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు, సాంస్కృతిక, సాహిత్య, విద్యా కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించటానికి పరస్పర సహకారం అందించుకోనున్నారు. ఈ అవగాహన ఒప్పందంతో శ్రీలంకలోని తెలుగు విద్యార్థులకు తెలుగు భాషను నేర్పడమే కాకుండావారి మూలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్. ఉష, డీన్ ఆచార్య సి.వాణి, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధు జ్యోతిపాల్గొన్నారు. -
ఉగాదికి టిడ్కో ఇళ్ల అప్పగింత
నాయుడుపేట టౌన్: రాష్ట్రంలో ఉగాది నాటికి లక్షకు పైగా టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు టిడ్కో గృహాల శాఖ ఎండీ సునీల్కుమార్రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో గృహాల సముదాయాలను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి టిడ్కో గృహాల వద్ద అభివృద్ధి పనులు పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీడ్కీ గృహాల శాఖ ఎస్ఈ మహేష్, సీఈ మరియన్, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా, మెప్మా సీఎంఎం సురేంద్ర, డీసీఓ ముషీర్ అహ్మద్, సీఎల్టీసీ మునీర్ తదితరులు ఉన్నారు. -
శ్రీవారి పేరుతో జగన్పై కుట్ర
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామినే రాజకీయ ఆయుధంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దైవ ద్రోహం పేరుతో వైఎస్ జగన్పై కుట్రకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తాము తప్ప మరెవ్వరూ భక్తులు కారన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమల శ్రీవారినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో గురువారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ సిట్ తేల్చిచెప్పినా చంద్రబాబు అబద్ధాలు, దుష్ప్రచారం ఆగడంలేదని మండిపడ్డారు. భూమన ఇంకా ఏమన్నారంటే..అడ్డంగా దొరికి చంద్రబాబు నంగి మాటలు..గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ ప్రజలకు దొరికిపోయామన్న భావన వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. సీబీఐ సిట్ నివేదికతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ఇప్పుడు కూటమి పార్టీలనూ తన తప్పులో భాగస్వామ్యులను చేస్తున్నాడు. గత పదేళ్లలో పవన్కళ్యాణ్ అనేకసార్లు ‘నేను బాప్టిజమ్ తీసుకున్నాను. మా నాన్న దేవుడి దీపంతోనే సిగరెట్ ముట్టించేవాడు. మా ఇంట్లో ఏ రకమైన దైవ పూజలు జరగవు.. అవసరమైతే నేను గొడ్డు మాంసం తింటాను’.. అంటూ చెప్పాడు. ఆయన ఇవాళ సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు ఆలోచనలకు అమ్ముడుపోయాడు. ఆలయాలపై మీ అరాచకాలు మర్చిపోయావా బాబూ.. తన హయాంలో పదుల సంఖ్యలో దేవుడి ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ దేవాలయాలన్నీ నాశనం చేశాడంటున్నారు. నిజానికి.. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాకే తిరుమల కొండ మీద మద్యం, మాంసాలు దొరికాయి. బిర్యానీలు తింటూ, తాగి గొడవలు చేస్తూ పట్టుబడ్డారు. కొద్దిరోజుల కిందటే మద్యం బాటిళ్లు విచ్ఛలవిడిగా పడి ఉంటే.. దాన్ని ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్త మీదే కేసు బనాయించారు. బాబు హయాంలోనే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అయోధ్య లడ్డూల పైనా అబద్ధాలు..పవన్కళ్యాణ్ అయితే మరింత దారుణంగా.. అయోధ్యకి పంపించిన లడ్డూలు కల్తీ అన్న విషయాన్ని ఆ రోజు ఎవరో చెబితే మాట్లాడానని చెప్పిన వ్యక్తి.. ఇవాళ మళ్లీ అయోధ్యకి పంపిన లడ్డూలు జంతుకొవ్వుతో తయారుచేసినవే అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూలు.. మీ ప్రభుత్వ హయాంలోనే పాలక మండలి సభ్యుడైన సౌరబ్ బోరా రూ.30 లక్షల విలువైన నెయ్యి డొనేషన్తో తయారుచేసి అయోధ్యకి పంపించారు. పవన్కళ్యాణ్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. వైవీ సుబ్బారెడ్డే సీఎఫ్టీఆర్ఐ రిపోర్టు కోసం పంపిస్తే.. ఆయనే తొక్కి పెట్టారని చెప్పడం అసమంజసం. అసలు విచారణకు పంపించిందే మేమైతే తిరిగి మాపైనే లాజిక్ లేకుండా అపవాదులు వేస్తున్నారు. అడ్డంగా దొరికిపోవడంతో ఏకసభ్య కమిషన్తో కుట్ర..ఇక సీబీఐ సిట్ మమ్నల్ని దోషులుగా ప్రకటించలేదు. దీంతో వారు అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. ఇది మమ్మల్ని ఎలాగైనా నేరస్తుల్ని చేయాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ నేరస్తుడిగా ఉన్న ప్రీమియర్ డెయిరీ 2014–19 వరకు 80 శాతం మేర మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసింది. క్షమాపణ చెప్పాల్సిందే..మేం తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ సిట్ మమ్మల్ని దోషులుగా నివేదికలో పేర్కొనలేదు. అయినా మాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్న మీరు క్షమాపణ చెప్పాల్సిందే. వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండు కొండలే చేశాడని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం కూడా చెబుతున్నాడు. అయితే, 2007 మే 12న వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో చాలా స్పష్టంగా మొత్తం 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు కొండలు శ్రీ వేంకటేశ్వరస్వామివే అని జీఓ ఇచ్చారు. ఈ నిజాలన్నింటినీ దాచి చంద్రబాబు మమ్నల్ని దైవ ద్రోహులుగా చిత్రీకరించే అతిపెద్ద కుట్రకు తెగబడుతున్నాడు. మీలాంటి వాళ్లను మాత్రం దేవదేవుడు క్షమించడు.శ్రీవారి విశేష సేవలో వైఎస్సార్, జగన్..వాస్తవానికి.. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన దైవసేవ ఎవ్వరూ చేయలేదు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ మీకు రాలేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో మా హయాంలోనే పాదరక్షలు ధరించకూడదని నిబంధన విధించాం. శ్రీ వేంకటేశ్వరస్వామి అఖండ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ కూడా మా హయాంలోనే తీసుకొచ్చాం.కొండమీద హరినామ సంకీర్తన ఏర్పాటుచేసింది, నాద నీరాజనాన్ని తీసుకొచ్చింది కూడా మేమే. తిరుమలలో నిరంతరాయంగా భాగవతం, భారతంతో పాటు వేదఘోష నిర్వహించాలని నిర్ణయం కూడా మేమే తీసుకున్నాం. వందకు పైగా పీఠాధిపతులతో సదస్సులు కూడా నిర్వహించాం. అన్యమతాల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలతో దాదాపు 46 వేల పెళ్లిళ్లు కూడా మా హయాంలోనే నిర్వహించాం. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ, గ్రామానికి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని కూడా మేమే తీసుకెళ్లాం. వైఎస్ జగన్ హయంలో దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాలు.. అంతేకాదు.. ఇవాళ మేం కొత్తగా ఐదు వేల ఆలయాలను కట్టబోతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి.. వైఎస్ జగన్ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3,500 ఆలయాలు కట్టారు. వాటి నిర్మాణ భాగస్వామ్యం ఆరెస్సెస్కు సంబంధించిన సంస్థకు అప్పగించాం. మా హయాంలో శ్రీవాణి పథకంపై విమర్శలు చేసిన మీరు ఇవాళ అదే శ్రీవాణి డబ్బుతో అమరావతిలో గుడి కడుతున్నారు. అదే డబ్బుతో గట్టు ఆంజనేయస్వామికి పవన్కళ్యాణ్ డబ్బులిప్పించారు. జమ్మూకశ్మీర్లోనూ, నవీ ముంబై, విశాఖలో శ్రీవారి ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారు. చెన్నైలో పద్మావతి ఆలయాన్ని నిర్మించారు. కానీ, మీరు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.3 వేల కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు హోటల్కి కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ఎందుకని ప్రశ్నించారు. మీరెన్ని అభాండాలు వేసినా వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి తప్పులూ జరగలేదు.కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలకు నెయ్యి అద్దింది మీరే..భోలేబాబాను చంద్రబాబు 2018లోనే రప్పించారు. అలాగే, గత ప్రభుత్వ పాలనలో లడ్డూ నాణ్యత బాగోలేదు.. అందుకే భక్తుల సంఖ్య తగ్గిపోయిందని దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. దీనిపై మీరు విచారణకు సిద్ధమా? ఇక 2018 ఫిబ్రవరిలో లడ్డూలకు వాసన రావడానికి మీరు రోజుకు 975 కేజీల నెయ్యిని రూ.3.87 కోట్లకు కొన్నారు. (ఆధారాలు చూపించారు). అంటే.. మీరు ఆ రోజు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేయడంవల్ల అవి వాసన రాకుండా వాటిపై మళ్లీ నెయ్యి అద్దడం కోసమే రూ.3.87 కోట్లతో నెయ్యి కొన్నారు. ఇది మీ హయాంలోనే జరిగిన విషయం. కొద్దిమంది అవినీతి అధికారులు, మీ హయాంలో మీరు ఏర్పాటుచేసిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, డెయిరీ సంస్థలు కుమ్మక్కై చేసిన నేరాన్ని సిట్ బయటపెట్టింది. -
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు
తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల క్రాస్ రోడ్ వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి వినుకొండకు వెళుతున్న ఈ బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తప్పు చేసి దొరికిపోయి.. డిఫెన్స్లో చంద్రబాబు, పవన్: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు.. వైఎస్ జగన్పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి. పవన్ కల్యాణ్ పదే పదే చెప్పిన అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భోలే బాబాను తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల ముందు నటిస్తున్నారు. కెబినెట్ సమావేశంలోనే మంత్రి పార్థసారథి పచ్చి అబద్దాలు చెప్పారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తప్పు చేసి, తప్పుగా మాట్లాడి దొరికిపోయి.. మళ్లీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. 2014-2019 మధ్య అధిక శాతం నెయ్యి సరఫరా ప్రిమియర్ డెయిరీనే. 2018లోనే భోలే బాబాను చంద్రబాబు తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇప్పుడు ఉన్న అధికారులే చంద్రబాబు హయాంలో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో పవన్ చెప్పినవి ఇవే.. జగన్ రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మీడియా సమావేశంలో నంగిలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం భయంతో చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికి నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల కాలంలో పవన్.. అనేక మార్లు బాప్టజం తీసుకున్న, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించేవారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్న వ్యక్తి. కానీ, నేడు సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు తనంత భక్తుడే లేడని అంటారు. భగవంతునికి చంద్రబాబు ఒక్కడే భక్తుడు కాదు, రోజుకు లక్షమంది వస్తారు. చంద్రబాబు హయాంలో కొండపై మద్య మాంసాలు అనేమార్లు దొరికాయి. మత్తులో ఘర్షణలకు పాల్పడ్డారు. తొక్కిసలాటలో భక్తులు మరణించారు.చంద్రబాబుది దైవ ద్రోహం.. చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడికి మొదట బాధపడిన వ్యక్తి వైఎస్సార్, నేను. వైఎస్సార్ అలిపిరి వద్ద నిరసన కూడా చేశారు. దేవుడి దయవల్ల చంద్రబాబు బతికారు. ఆయన ఏం చెప్పినా నమ్మించడానికి పచ్చ పత్రికలు ఉన్నాయి. నెయ్యిలో నెయ్యే లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చీవాట్లు పెట్టి సిట్ వేసింది. సిట్ రిపోర్టులో క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు కాలేదని రిపోర్ట్ చెప్పారు. దైవ ద్రోహానికి పాల్పడే పరిస్థితిలో ఈ ఘటన ఉంది. అయోధ్య పంపిన లడ్డులో నెయ్యి కలిసిందని అంటున్నారు పవన్. ప్రస్తుతం పాలకమండలి సభ్యులుగా ఉన్న వారు విరాళంగా ఇచ్చిన నెయ్యితో అయోధ్య లడ్డు తయారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి హయాంతో నెయ్యి టెస్ట్ రిపోర్ట్ దాచేసారని మరో అబద్దం ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే, నాకు ఎటువంటి హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిబంధనలు మార్పు చేసాము, అందులో మా దురుద్దేశం ఏమీ లేదు. మమ్మల్ని ఇరికించడానికే ఏకసభ్య కమిషన్ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, కూటమి నేతలకు ఉంది. చంద్రబాబు పచ్చ అబద్దం చెప్తారు. వేంకటేశ్వరస్వామిని మీ రాజకీయాలకు వాడుకుంటారా?. పచ్చ పత్రికలలో ఎన్ని తూటాలు ఎక్కుపెట్టినా మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు లాంటి వాళ్లను దేవుడు క్షమించరు’ అని అన్నారు. -
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ రీడర్ల భవితవ్యం ● ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వేడుకోలు
●విద్యుత్ మీటర్ రీడర్ల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపే కారణమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టండి.. విద్యుత్ బిల్లులు చెల్లించకండి’ అంటూ టీడీపీ అగ్ర నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, ప్రస్తుతం గృహ వినియోగదారులకు సైతం చకచకా బిగించేస్తున్నారు. ఈ క్రమంలో మీటర్ రీడర్లు ఉపాధి లేక రోడ్డున పడే దుస్థితి నెలకొంటోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందికిపైగా మీటర్ రీడర్స్ పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు అందిస్తారు. ఇందుకు రీడర్లకు ఒక్కో బిల్లుకు పట్టణాల్లో రూ.3.6 పైసలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3.73 పైసలను విద్యుత్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. ఈ విద్యుత్ బిల్లుల రీడింగ్ నిర్వహణ కోసం టెండర్ ఎత్తుకొన్న కాంట్రాక్టర్కు మిషన్, పేపర్ కాస్టుకు సంబంధించి అదనంగా మరో రూ.4 చెల్లిస్తుంది. ఇలా జిల్లాల వారిగా కాంట్రాక్టర్లు ఉంటారు. గతం ప్రభుత్వంలో కొండంత భరోసా సంబంధిత కాంట్రాక్టర్లు తమకు రూ.3.3 పైసలు చెల్లిస్తున్నారంటూ రీడర్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేయాలని విద్యుత్ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేశారు. రీడర్లకు కొండంత అండగా నిలిచారు. బొక్కేస్తున్న ‘యువగళం’ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీటర్ రీడర్స్కు కష్టాలెక్కువయ్యాయి. నాటి కాంట్రాక్టర్లను తొలగించి యువగళం కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. ప్రస్తుత కాంట్రాక్టర్లు రీడర్లకు రూ.2.8 పైసలు, కొన్నిచోట్ల రూ.3 వంతున ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకో.. లేకుంటే వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్గా రోడ్డుపైకి! శ్రమ దోపిడీ ఓ పక్క జరుగుతుండగా ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ మీటర్ల కారణంగా తమ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడిందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే రీడర్లు బిల్లులు తీసి ఇచ్చే పరిస్థితి ఉండదు. అందులోని చిప్ ద్వారా రీడింగ్ను విద్యుత్ కార్యాలయం నుంచే సేకరించి, మొబైల్ రీచార్జ్ తరహాలో ముందస్తు చెల్లింపులతో విద్యుత్ వినియోగం రానుంది. దీంతో విద్యుత్ రీడర్లు కనుమరుగుకానున్నారు.15 ఏళ్లుగా పనిచేస్తున్నా.. గత 15 ఏళ్లుగా మీటర్ రీడర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం వస్తున్న వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉద్యోగ భద్రత ఆందోళనకరంగా ఉంది. భవితవ్యం అర్థం కావడం లేదు. – సుబ్రమణ్యం, మీటర్ రీడర్, పుత్తూరు ఉద్యోగ భద్రత కల్పించాలి మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే పని కల్పించండి. షి ప్టు ఆపరేటర్లుగా, వాచ్ టు వార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, బ్రేక్ డౌన్ గ్యాంగ్, వాచ్మెన్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ వంటి విధుల్లో చేర్పించండి. మా కుటుంబాలకు అండగా నిలవండి. –సి.రమేష్, ఉపాధ్యక్షుడు,ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ కమిటీ విజ్ఞప్తి చేశాం ప్రభుత్వానికి, విద్యుత్ ఉన్నతాధికారులకు పలుమార్లు మా ఉద్యోగ భద్రతపై విజ్ఙాపనలు అందజేశాం. ప్రభుత్వం నుంచి సానుకూల సందేశాలు రాలేదు. ఉపాధి చూపమని వేడుకొంటున్నాం. ప్రభుత్వం కనికరం చూసుతుందని ఆశిస్తున్నాం – యువరాజ్, మీటర్ రీడర్, పుత్తూరు -
కనికరించలేరా?
కాళ్లావేళ్లాపడినా ఆర్డీఓ కోర్టు తీర్పుకు విలువలేదా! ●ఆక్రమణకు గురైన భూమి సాక్షి ప్రతినిధి తిరుపతి: ‘పండు ముసలి 90 ఏళ్లు.. ఈయన ఓ నిరుపేద రైతు.. బస్టాండ్లలో నిద్రిస్తూ న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అయ్యా నా భూమి ఆక్రమణకు గురైంది.. న్యాయం చేయండి.’ అంటూ అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నాడు. అయినా న్యాయం జరగలేదు. వివరాలలోకి వెళ్లితే... తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం, బోడేవాండ్లపల్లి గ్రామం, పి వడ్డిపల్లెకు చెందిన కే సిద్ధయ్యకు 50 ఏళ్ల క్రితం అప్పటి సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది యల్లమంద గ్రామం సర్వే నంబర్ 1489లో 5 ఎకరాల భూమిని కేటాయించారు. అదే మండలం వీఆర్ ఆగ్రహారం గ్రామానికి చెందిన భూస్వామి శిరివేలు రమేష్ 2019లో నిరుపేద రైతు అనుభవిస్తున్న 3.65 సెంట్లు భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. ఈ విషయంపై పలుసార్లు పంచాయతీలు నిర్వహించి బతిమలాడుకున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు దిగసాగాడు. ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు ఆ భూస్వామి కుమ్మక్కు కావడంతో వారు అతనికి సపోర్టుగా మాట్లాడే వారు. దీంతో ఏమీ చేయలేని దుస్థితిలో బాధితుడు సిద్ధయ్య అప్పటి ఆర్డీఓ కార్యాలయం మదనపల్లెలో ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోకుండా ఆక్రమించిన పొలంలో మామిడి మొక్కలు నాటి సాగు చేశాడు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తిరుపతి ఆర్డీఓ కార్యాలయ కోర్టుకు కేసు బదిలీ కావడంతో వాస్తవాలను ఆరా తీసిన కోర్టు 2022 ఆగస్టులో సిద్ధయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆర్డీఓ కోర్టు ఆదేశాలూ బేఖాతరు రైతు సిద్ధయ్యకు చెందిన 3.65సెంట్ల భూమిని తక్షణం తిరిగి అప్పగించాలని ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఆర్డీఓ కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ అధికారులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలుసార్లు ఆర్డీఓ కార్యాలయంలోనూ, కలెక్టర్ కార్యాలయంలోనూ సిద్ధయ్య ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వృద్ధ రైతు తమని ఏమి చేసుకోలేడనే నమ్మకంతో ఆక్రమణ దారుడు మరో అడుగు ముందుకేసి మిగిలిన 1.38 సెంట్ల భూమిని సైతం తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆర్డీఓ కోర్టు ఆదేశాలిచ్చినా తమ భూమిని ఆక్రమణదారుడు వదలకపోవడంతో తిరుపతి ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ వృద్ధ రైతు ప్రదక్షణలు చేస్తూ కనిపించిన వారిని న్యాయం చేయండని బతిమలాడుతున్నాడు. అయ్యా.. న్యాయం చేయండి మహా ప్రభూ! వయస్సు మీద పడింది. నడవలేని స్థితి. నాకు ఉన్న 5ఎకరాల భూమిని ఆక్రమించారు. ఆర్డీఓ కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ ఆక్రమణ దారుడు శిరివేలు రమేష్ నా భూమిలోకి నన్ను అడుగు పెట్టనీయడం లేదు. 2022లో ఆర్డీఓ కోర్టు ఆదేశించినా కనీసం పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్ను అమలు చేయాలని ఏళ్ల తరపడి మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఇక మండల రెవెన్యూ కార్యాలయానికి రావద్దంటూ అధికారులు గర్జిస్తున్నారు. ఈ వయస్సులో ఇంత దారుణంగా ఇటు అధికారులు, అటు ఆక్రమణ దారుడు నన్ను వేధించడం తట్టుకోలేక పోతున్నాను. ఇప్పటికై నా అధికారులు నాకు న్యాయం చేయాలి. – కే సిద్ధయ్య, రైతు, ఎర్రావారిపాళెం మండలం


